Human Rights Commission
-
అరెస్ట్ చేసిన బాలుడు ఎక్కడ?
హైదరాబాద్: ఎలాంటి తప్పు చేయని తన కుమారుడిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ రాష్ట్ర వినియోగదారుల కమిషన్కు బుధవారం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్..పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ మే 5వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏప్రిల్ 28న మహబూబ్నగర్ జిల్లా కడ్తాల్ పోలీస్స్టేషన్కు చెందిన పోలీసులు తన కమారుడు మేకల కళ్యాణ్పై ఎలాంటి కేసు నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ అలివేలు అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు దాఖలు చేసింది. పోలీసులు అక్రమ కస్టడీకి తీసుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లి చూడగా అక్కడ తన కుమారుడు కనిపించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.తర్వాత మూడు గంటల సమయంలో తన కుమారుడి ఫోన్ నుంచి కాల్ రాగా అతన్ని కోర్టులో హాజరు పరుస్తున్నామని చెప్పిన పోలీసులు కోర్టు ఎదుట కూడా హాజరు పర్చకుండా ఎక్కడికి తీసుకెళ్లారో కూడా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో న్యాయవాది అమర్నాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేస్తూ తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసుపై విచారణ జరిపించి మే 5వ తేదీలోపు పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. -
అమరావతికి తరలించడం సమంజసమేనా?
ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వ చర్యలూ, దాని ప్రాధాన్యతలపై సహజంగానే ప్రజలకు ఆసక్తి ఉంటుంది. కర్నూలు నుంచి న్యాయ సంస్థలు– ‘లోకాయుక్త’ మానవ హక్కుల కమిషన్, సీబీఐ కోర్టు, ఉన్నత ‘లా’ విద్యాసంస్థలు వంటి వాటిని అక్కడ నుంచి ‘అమరావతి’కి తరలిస్తున్నట్టు, స్థానికులు ఆందోళన చేస్తున్నట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో... గత పదేళ్ల పరిణామాల సమీక్ష తప్పడం లేదు.ఈ విషయంలో మొదట ఒకమాట అనుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం బాగుంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఎందుకు రెండుగా విభజించబడింది అనే విషయంలో పదేళ్ళ తర్వాత అయినా మనకు స్పష్టత అవసరం. ఇక్కడ రాష్ట్రాల్లో అయినా అక్కడ ఢిల్లీలో అయినా ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వంలోకి ప్రవేశించే ‘లెజిస్లేచర్’ కాకుండా, శాశ్వతమైన ‘ఎగ్జిక్యూటివ్’ అనే శక్తిమంతమైన వ్యవస్థ మరొకటి ఉంది. ఈ రెండింటిపై ‘జ్యుడిషియరీ’ ఉంది. ప్రభుత్వాలు ఉనికిలో లేని విరామాల మధ్య కూడా వాళ్ళు అధికారంలో ఉంటారు. అప్పటి ముఖ్యమంత్రి కె. కిరణ్కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే, 2014 ఫిబ్రవరి 20 నుంచి జూన్ 8 వరకు రాష్ట్రం ‘గవర్నర్ పాలన’లో ఉంది. దేశ ప్రాదేశిక భద్రత విషయమై గురుతరమైన బాధ్యత ఈ వ్యవస్థలకు ఉంటుంది. పరిపాలనలో కేంద్ర– రాష్ట్ర సంబంధాలు ఢిల్లీలో ‘హోమ్’శాఖ వద్ద ఎందుకు ఉంటాయో మనకు అర్థం కావాలి. అలాగే, 2014 మొదట్లో ‘యూపీఏ–2’ ప్రభుత్వంలో ఢిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలయినప్పుడు; అధికారుల కమిటీ కాకుండా, ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎందుకు అధ్యక్షుడుగా ఉన్నారో మనకు అర్థం కావాలి. అటువంటి గ్రహింపుతో మొత్తంగా భారత ప్రభుత్వం సమగ్రమైన తూర్పు దృష్టి (లుక్ ఈస్ట్) ‘డ్రైవ్’ అంతా కేవలం ఆగ్నేయ ఆసియా వైపు ఎందుకు ఉందో కూడా మనకు తెలియాలి. కీలకమైన కేంద్ర మంత్రిత్వశాఖలు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఎందుకు తమ కార్యకలాపాల వేగాన్ని పెంచుతున్నాయో మనకు తెలియాలి. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణం రాష్ట్ర రాజధాని ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. అది రాష్ట్ర పరిధిలోని అంశం. దానితో పనిలేకుండా కేంద్రం 2022 అక్టోబర్ నాటికి కాకినాడ వద్ద ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్’ సౌత్ ఇండియా కేంపస్ తెచ్చింది. మార్చి 2024 నాటికి బాపట్ల సమీపాన ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ దళాల కోసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పడింది. ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గ నైజేషన్’ (డీఆర్డీఓ) రూ. 100 కోట్లతో ‘మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్’ మచిలీ పట్టణం సమీపాన నాగాయలంక దగ్గరలోని గుల్లలమోద వద్ద నిర్మి స్తున్నది. గత ప్రభుత్వంలో జరిగిన పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా బాపట్ల–బందరు రెండూ కూడా విజయవాడ, గుంటూరు నగరాలతో సంబంధం లేని సొంత కలెక్టరేట్లతో జిల్లా కేంద్రాలుగా మారాయి.చదవండి: శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!కేంద్ర ఆర్థికశాఖ అనంతపురం జిల్లాలో ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్’ వంటి దేశంలోనే అత్యున్నత స్థాయి శిక్షణా సంస్థను 2022 నాటికి బెంగళూరు సమీపాన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించింది. అదే కాలానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అనంతపురం జిల్లా నుంచి పుట్టపర్తి ప్రాంతాన్ని వేరుచేసి; సత్యసాయి జిల్లా పేరుతో కొత్తగా మరో జిల్లా ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఈ సంస్థ ఆ కొత్త జిల్లాలో ఉంది. మరి వీటిలో దేన్నైనా ఇది ఇక్కడ కాదు, అని మరొకచోటికి తరలించే ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ; లేదా ‘కూటమి’లో భాగస్వామి అయిన బీజేపీ నడుపుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎందుకు అనడం లేదనే సందేహం మనకు రావాలి. అప్పుడు ఐదేళ్ళ ప్రభుత్వాల అవసరాల కంటే, విస్తృతమైన దేశప్రయోజనాల కోసం కేంద్రంలో – రక్షణ, వాణిజ్యం, ఉపరితల రవాణా, రైల్వే, స్పేస్ సైన్స్, వంటి కొన్ని మంత్రిత్వశాఖల్లో– ‘ఏపీ’ కోసం ఒక ప్రత్యేకమైన ‘ప్లానింగ్’ ఎందుకు జరుగుతున్నది? అనే ప్రశ్న వైపుకు అవి మనల్ని మన రాష్ట్రం ‘జాగ్రఫీ’ వైపుకు తీసుకువెళతాయి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?అయితే, జరిగినవి ఏవీ గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం మనపట్ల ప్రేమతో చేయలేదు. ‘మెతుకు ముట్టుకుంటే అన్నం సోకు తెలుస్తుంది’ అన్నట్టుగా, రాష్ట్ర విభజన జరిగి ఆ ‘షాక్’ నుంచి ఇంకా మనం కోలుకోక ముందే 2014 మధ్యలోనే బందరు వద్ద భూమి కూడా ఎంపిక చేసిన ‘మెరైన్ పోలీస్ అకాడమీ’ని ఇక్కణ్ణించి ఉత్తరాదికి వారు తరలించారు. అదే ఏడాది డిసెంబరులో ‘ఏపీ’కి కూడా మరొక ‘అకాడమీ’ ఇస్తున్నాం అన్నారు. ఇప్పటికి అటువంటిది ఏమీ లేదు. జరుగుతున్నవి అన్నీ ఇటీవల కొత్తగా వాడుకలోకి వచ్చిన ‘జియో – పాలి టిక్స్’లో భాగంగా దేశ ప్రాదేశిక అవసరాల మేరకు ‘బ్యురోక్రసీ’ స్థాయిలో జరుగుతున్న విధాన నిర్ణయాలు. ఇంతటి సమగ్రమైన వైశాల్యంతో మారిన కొత్త ‘మ్యాప్’లోని రాష్ట్రాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వం చూడగలిగినప్పుడే, ఇక్కడ అది అమలు చేయాల్సిన స్వల్పకాలిక – దీర్ఘకాలిక ‘ప్లానింగ్’ ఎలా ఉండాల్సిందీ దానికి అర్థమవుతుంది. అప్పుడు ఈ మొత్తంలో – ‘రాజధాని’ అనే అంశానికి ఉన్న జాగా ఎంతో కూడా మనకు అర్థమవుతుంది.- జాన్సన్ చోరగుడి అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అంతులేని.. అన్యాయం..!
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు కేంద్రంగా పని చేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ను అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. చట్టసవరణ చేసి కర్నూలు నుంచి తరలించనున్నట్లు హైకోర్టుకు నివేదించి రాయలసీమకు మరోసారి అన్యాయం తలపెట్టింది. ఏడు దశాబ్దాల నాటి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు పెద్దమనుషులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని దశాబ్దాలుగా అమలు చేయకుండా ప్రభుత్వాలు తాత్సారం చేశాయి. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేశారు.అందులో భాగంగానే లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేశారు. ఆపై ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును కర్నూలులో ఏర్పాటు చేశారు. ఏపీఈఆర్సీకి శాశ్వత భవనాలు నిర్మించారు. ఈ క్రమంలో ‘న్యాయ రాజధాని’ కల సాకారం అవుతోందని అంతా భావించారు. అయితే ఇప్పటికే ఏర్పాటు చేసిన న్యాయ సంస్థలను సైతం అమరావతికి తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. శ్రీబాగ్ ఒప్పందం బుట్టదాఖలు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ‘ఆంధ్ర రాష్ట్రం’ ఏర్పాటైంది. ఆపై హైదరాబాద్ విలీనం తర్వాత ‘ఆంధ్రప్రదేశ్’ ఆవిర్భావం సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో ‘శ్రీబాగ్ ఒడంబడిక’ కుదిరింది. దీని ప్రకారం పరిపాలన రాజధాని, హైకోర్టు ఏర్పాటులో ‘సీమ’కే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పరిపాలన రాజధాని హైదరాబాద్లో నెలకొల్పేలా నిర్ణయించారు. ఈ క్రమంలో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు కావాల్సి ఉండగా ఒప్పందాన్ని వీడి అది కూడా హైదరాబాద్లోనే ఏర్పాటు చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు ప్రతిపాదనను న్యాయవాదులు తిరస్కరించారు. లా వర్సిటీపై సందిగ్ధం.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రెండు లా యూనివర్సిటీలు లేవు. వైజాగ్లో ఇప్పటికే నేషనల్ లా యూనివర్సిటీ ఉండగా గత ప్రభుత్వ కృషితో కర్నూలుకు మరో యూనివర్సిటీ మంజూరైంది. ఈ ఏడాది ఆగస్టులో బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులతో సమావేశం సందర్భంగా అమరావతిలో ‘నేషనల్ లా యూనివర్సిటీ’ ఏర్పాటు కానున్నట్లు సీఎం తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు. మరి కర్నూలులో ఇప్పటికే యూనివర్సిటీని నిలిపివేస్తారా? లేదా రెండు చోట్లా నిరి్మస్తారా? అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అమరావతి తెరపైకి వచి్చనందువల్ల కర్నూలులో యూనివర్సిటీ ఏర్పాటుకు శుభం కార్డు పడినట్లేనని న్యాయవాదులు చర్చించుకుంటున్నారు. సీమ టీడీపీ నేతల మౌనవ్రతం.. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన కూటమి పారీ్టలకు చెందిన ప్రజాప్రతినిధులు సీమకు పదేపదే జరుగుతున్న అన్యాయంపై గళం విప్పకపోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కర్నూలులో ఇప్పటికే ఏర్పాటైన సంస్థలను తరలిస్తున్నట్లు హైకోర్టుకు సర్కారు తేల్చి చెప్పినా ఏ ఒక్క టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు స్పందించకపోవడంపై మండిపడుతున్నారు. అందరూ హైకోర్టు కావాలన్నవారేకర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ, జనసేన సైతం గతంలో మద్దతు పలికాయి. మంత్రి టీజీ భరత్ తండ్రి, బీజేపీ నేత, రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేశ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘సీమ’లో హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు వంద రోజులకుపైగా రిలే దీక్షలు, ఆందోళనలు నిర్వహించారు. ‘సీమ’ జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ‘రాయలసీమ గర్జన’ పేరుతో కర్నూలులో పెద్ద ఎత్తున ఉద్యమించారు.కొప్పర్తి కడుపుకొట్టి..వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని సైతం అమరావతికి తరలిస్తున్నట్లు కూటమి సర్కారు ఇప్పటికే ఉత్తర్వులిచి్చంది. ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన రాయలసీమలోని కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కొప్పర్తిలోని మెగా ఇండ్రస్టియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో ఈ సెంటర్ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ హయాంలో కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే దీన్ని అమరావతికి తరలిస్తున్నట్లు సెపె్టంబర్లో కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో మరో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరటానికి బదులుగా ఇప్పటికే మంజూరైన దాన్ని తరలించడం సమంజసం కాదన్న పారిశ్రామిక, అధికార వర్గాల సూచనను పెడచెవిన పెట్టింది.న్యాయ రాజధాని దిశగా వైఎస్ జగన్ అడుగులు2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘సీమ’కు న్యాయం చేయాలని సంకల్పించారు. అనివార్య కారణాలతో ఇందులో జాప్యం జరగడంతో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును ఏర్పాటు చేశారు. హైకోర్టు ఏర్పాటైతే అనుబంధంగా ఏపీ అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, డెట్స్ రికవరీ ట్రిబ్యునల్, క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్), రైల్వే అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, ఏసీబీ కోర్టు, కో ఆపరేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్, ఎండోమెంట్ ట్రిబ్యునల్తో పాటు 43 అనుబంధ కోర్టులు ఏర్పాటయ్యేవి. ఇందుకోసం కర్నూలులోజగన్నాథగట్టుపై జ్యుడీషియల్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 273 ఎకరాలను సైతం కేటాయించింది. ఇందులో 100 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణానికి వైఎస్ జగన్ శంకుస్థాపన కూడా చేశారు. అయితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం న్యాయ సంస్థలను అమరావతికి తరలిస్తుండటంతో ‘సీమ’ వాసుల ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. -
మానవ హక్కులకు దిక్కేది?
మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్, సభ్యులు పదవీ విరమణ పొందిన 3 నెలల్లోగా మళ్లీ కొత్త కమిషన్ నియామకం చేపట్టాలని సుప్రీంకోర్టు చెబుతోంది. కానీ రాష్ట్రంలో రెండేళ్లుగా ఆ ఊసే లేదు. కొత్త కమిషన్ను నియమించాలని రెండేళ్లుగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుగుతున్నా, ఇంతవరకు నియామకం చేపట్టలేదు. రేపు, ఎల్లుండి అంటూ కాలయాపనతోనే ప్రభుత్వం నెట్టుకొస్తోంది. రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక హక్కులు కాపాడే కమిషన్ నియామకంలో అలసత్వం సరికాదని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. కొత్త కమిషన్ నియామక ప్రక్రియ కొనసాగుతోందని, రెండు నెలల్లో పూర్తి చేస్తామని హైకోర్టుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. –సాక్షి, హైదరాబాద్ చైర్మన్, సభ్యుల ఎంపిక కమిటీలో ఎవరు ఉంటారంటే.. చైర్పర్సన్: ముఖ్యమంత్రి సభ్యులు: శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, హోంమంత్రి, రెండు సభల ప్రతిపక్ష నేతలు అర్హతలు చైర్మన్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా జడ్జిగా పనిచేసినవారు అర్హులు. జ్యుడీషియల్ సభ్యుడు: హైకోర్టులో జడ్జిగా లేదా జిల్లాజడ్జిగా ఏడేళ్లు పనిచేసి ఉండాలి. నాన్–జ్యుడీషియల్ సభ్యుడు: మానవ హక్కులపై విశేష అనుభవం, పరిజ్ఞానం ఉండాలి. కాలపరిమితి: చైర్మన్, సభ్యుల కాలపరిమితి మూడేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏది ముందైతే అదే వర్తిస్తుంది. ఒకవేళ ఎవరైనా రాజీనామా చేస్తే గవర్నర్కు అందజేయాలి. వీరిని తొలగించే అధికారం కూడా గవర్నర్కే ఉంటుంది. చైర్మన్, సభ్యుల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రజల హక్కులను గౌరవించాలి 1993 మానవహక్కుల చట్టం ద్వారా ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర కమిషన్ ఉండాలనేది రాష్ట్ర ప్రజల చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ హక్కు. దీనిని గౌరవించి ప్రజల హక్కులకు కొంతైనా గ్యారంటీ ఇవ్వగలిగే కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం వెంటనే పూర్తి చేయాలి. – చిక్కుడు ప్రభాకర్, హైకోర్టు న్యాయవాది హెచ్ఆర్సీ ఏర్పాటు ఇలా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల కమిషన్ 1993లో ఏర్పాటైంది. చైర్మన్, జ్యుడీషియల్, నాన్–జ్యుడిషీయల్ సభ్యులిద్దరూ ఉంటారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కమిషన్ ఏర్పాటు చేస్తూ 2019, నవంబర్లో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. తెలంగాణ కమిషన్ తొలి చైర్మన్గా జస్టిస్ చంద్రయ్య, సభ్యులుగా ఆనందరావు నడిపల్లి(జ్యుడీషియల్), ఇర్ఫాన్ మొహినుద్దీన్(నాన్ జ్యుడీషియల్)ను ప్రభుత్వం నియమించింది. 2022తో వీరు పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి మానవ హక్కుల కమిషన్కు చైర్మన్, సభ్యుల నియామకం జరగలేదు. దీంతో గత రెండేళ్లలో ఒక్క కేసు కూడా విచారణకు నోచుకోలేదు. విధులు » మానవ హక్కులతోపాటు రాజ్యాంగ, ప్రాథమిక హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధానవిధి. » పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులు లేదా వారి హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఫిర్యాదు ఆధారంగా లేదా సుమోటోగా విచారణ చేపట్టొచ్చు. » రాష్ట్రంలోని ఏ అంశంలోనైనా హక్కులపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి సూచనలు చేయవచ్చు. » కమిషన్ విచారణ జరిపాక, ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. నష్టపరిహారం, ఇతర చర్యలపై సూచనలు కూడా చేయవచ్చు. కమిషన్కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి. ముఖ్యమైన వివరాలు.. » కోర్టులతో పోలిస్తే కేసుల పరిష్కారం వేగవంతంగా ఉంటుంది. బాధితులకయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. » చాలా దేశాల్లో హక్కుల కమిషన్లు అత్యంత కీలకంగా పనిచేస్తున్నాయి. » రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి కంటే తక్కువ లేని అధికారిని రాష్ట్ర కమిషన్ కార్యదర్శిగా నియమిస్తారు. » ఫిర్యాదుదారు, బాధితులు, ఘటన వివరాలు, పరిహారం తదితర వివరాలతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. బాధితులే కాదు.. వారి తరఫున ఇతరులు కూడా ఫిర్యాదు చేయవచ్చు. » సెక్షన్ 30 ప్రకారం జిల్లా కోర్టులోని రెండవ అదనపు జిల్లాజడ్జి హెచ్ఆర్సీ కేసులు విచారించాలి. ప్రత్యేకంగా పీపీ కూడా ఉండాలి. అయితే, ఈ కేసులను ఏ చట్టం ప్రకారం విచారణ చేయాలనేదానిపై స్పష్టత లేదు. ఇలా సంప్రదించవచ్చు ఫోన్ నంబర్: 040–24601572అడ్రస్: బ్లాక్–7, గృహకల్ప కాంప్లెక్స్, ఎంజే రోడ్, గాం«దీభవన్, నాంపల్లి, హైదరాబాద్ -
చినబాబు బ్యాచ్ చిత్రహింసలు!
సాక్షి, అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేశ్ అనుచరులు ఈ నెల 9వ తేదీన తనను కిడ్నాప్ చేసి రాత్రంతా చిత్ర హింసలకు గురి చేసినట్లు పెదవడ్లపూడికి చెందిన బాధితుడు పాలేటి రాజ్కుమార్ సుప్రీం కోర్టు, హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. లోకేశ్ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టి బెదిరించి క్షమాపణ చెప్పించి చిత్రీకరించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నాడు.వీటి ప్రభావంతో పాఠశాలలో చదువుతున్న తన పిల్లలు అవమానభారంతో ఇంటికొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేతలు పదే పదే బెదిరింపులకు దిగుతున్నారని, తక్షణమే జోక్యం చేసుకుని అరికట్టకుంటే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని విన్నవించుకున్నాడు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై చట్టప్రకారం పోలీసులతో విచారణ జరిపి వ్యక్తిగత, భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులను పరిరక్షించాలని కోరాడు. ఫిర్యాదులో ముఖ్యాంశాలు ఇవీ.. ⇒ మంగళగిరి నియోజకవర్గంలో 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను మా కుటుంబంతో కలసి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశా. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. నారా లోకేశ్ అండదండలతో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. ⇒ ఈ నెల 9వతేదీన సాయంత్రం 4.30 గంటల సమయంలో నారా లోకేశ్కు సన్నిహితుడైన జవ్వాడి కిరణ్చంద్ అనుచరులు నరేంద్ర, షేక్ బాజీ, జానీ తదితరులు నేను మా అత్త ఇంట్లో ఉన్న సమయంలో మారణాయుధాలతో దాడి చేశారు. ఫరీ్నచర్ను ధ్వంసం చేశారు. ఏపీ 39 జీబీ 3333 వాహనంలో నన్ను కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించి రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారు. నా చొక్కా విప్పించి నారా లోకేశ్ ప్లెక్సీ ఎదుట మోకాళ్లపై మోకరిల్లి ముకుళిత హస్తాలతో క్షమాపణ చెప్పాలని బెదిరించి వీడియో చిత్రీకరించారు. ఈనెల 10వతేదీ తెల్లవారు జాము 4 గంటలకు బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై వదిలేసి వైఎస్సార్ సీపీకి మద్దతు పలికితే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ⇒ నాపై దాడి చేసిన వారిపై అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు (ఎఫ్ఐఆర్ నెంబరు 78/2024) చేశా. ఫిర్యాదు వాపసు తీసుకోవాలంటూ టీడీపీ మద్దతుదారులు పదే పదే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు నా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ⇒ మానవ హక్కులను కాలరాయడంపై తక్షణమే జోక్యం చేసుకుని టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి నాకు, నా కుటుంబానికి రక్షణ కలి్పంచాలి. నా ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నా. -
ప్రవల్లిక కేసు: హెచ్ఆర్సీని ఆశ్రయించిన శివరాం కుటుంబం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్ అభ్యర్థి ప్రవల్లిక ఆత్మహత్య తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ప్రవల్లిక లేఖలో పేర్కొనగా.. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రవల్లిక ఆత్మహత్యకు శివరాం రాథోడ్ను పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, శివరాం ఆచూకీ తెలపాలని అతడి కుటుంబ సభ్యులు తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. తమను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. శివరాం ఆచూకీ గురించి వివరాలు తెలపాలని పోలీసు స్టేషన్కు పిలిపించి మానసికంగా మనోవేదనకు గురిచేస్తున్నారని అతడి కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శివరాం ఆచూకీ తెలపకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించినట్టు తెలిపారు. శివరాం ఆచూకీ తెలుసుకోవాల్సిన పోలీసులు.. తమను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడున్నాడని అడగడం దారుణమన్నారు. అతడి గురించి ఏ విషయం తెలిసినా పోలీసులు వెంటనే చెబుతామన్ని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చిక్కడపల్లి పోలీసుల నుంచి ప్రాణభయం ఉందని, వారికి రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని శివరాం బంధువు సంతోష్ రాథోడ్ వేడుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసు.. శివరామ్ అరెస్ట్? -
ప్రీతి మృతి కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి(26) మృతి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ఓయూ జేఏసీ మానవ హక్కుల కమిషన్ను (హెచ్ఆర్సీ) ఆశ్రయించింది. ప్రీతిది ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలపై విచారణ చేయాలని జేఏసీ కోరింది. ప్రీతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని హెచ్ఆరీసీలో పిటిషన్ దాఖలు చేసింది. ప్రీతి మృతదేహానికి జూనియర్ డాక్టర్లతో పోస్టుమార్టం చేయించారని ఫిర్యాదు చేసింది. నిమ్స్, గాంధీ ఆసుపత్రిలో పోలీసుల వ్యవహర తీరుపై విచారణ చేపట్టాలని తెలిపింది. మరోవైపు తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె తండ్రి నరేందర్ ఆరోపించారు. తన కూతురు ఎలా చనిపోయిందో సమగ్ర నివేదిక కావాలని కోరారు. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్తో పాటు అనస్థీషియా హెచ్ఓడీని సస్పెండ్ చేసిన తర్వాతే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిందితుడు సైఫ్ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. కన్నీటి వీడ్కోలు కాగా సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయిదు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన ప్రీతి అంత్యక్రియలు ఆమె స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాలో సోమవారం ముగిశాయి. ప్రీతికి బంధువులు, స్థానికులు కన్నీటీ వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సందర్భంగా ప్రీతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఖమ్మం జైలులో సైఫ్.. ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రీతి ఘటనపై ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇప్పటికే విచారణ నివేదికను డీఎంఈకి పంపింది. చదవండి: ప్రీతి విషయంలో అసలేం జరిగింది.. గదిలో దొరికిన ఇంజెక్షన్స్ ఇవే.. -
స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందాలి
కర్నూలు(సెంట్రల్): స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందినప్పుడే నిజమైన సంతృప్తి అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్ జస్టిస్ మంథాత సీతారామమూర్తి చెప్పారు. కర్నూలులోని హెచ్ఆర్సీ కార్యాలయంలో గురువారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి దిక్సూచిగా, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలకు నిలయంగా మారుతోందని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన వారందరిని స్మరించుకోవడం పౌరుల బాధ్యత అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు సమన్వయంతో వ్యవహరించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హెచ్ఆర్సీ జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, సిబ్బంది పాల్గొన్నారు. అసమానతలు బాధాకరం లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి దేశంలో నేటికీ ధనిక, పేదవర్గాలు, కులమతాలు, ప్రాంతీయ వ్యత్యాసాలు ఉండటం బాధాకరమని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి చెప్పారు. కర్నూలులోని లోకాయుక్త కార్యాలయం ఆవరణలో గురువారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రఫలాలు పౌరులందరికీ సమానంగా అందించేందుకు పాలకులు, అధికారులు కృషిచేయాలని కోరారు. చెస్, క్యారమ్స్, ముగ్గులు, క్రికెట్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. లోకాయుక్త ఇన్స్పెక్టర జనరల్ నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
భార్య నుంచి కాపాడాలని మొర
సాక్షి, బనశంకరి: భార్య వేధింపులు భరించలేక భర్త బెంగళూరు డీజీపీ, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశాడు. రామనగర తాలూకాకు చెందిన రామచంద్ర రూ. 5 లక్షల కోసం తనపై భార్య, కుమారుడితో కలిసి దాడికి చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు డీజీపీకి ఫిర్యాదు చేసిన రామచంద్ర న్యాయం లభించకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం పెట్టరు నేను కట్టిన ఇంట్లో ఉండనివ్వరని వాపోయాడు. (చదవండి: పథకం ప్రకారమే లయస్మిత హత్య ?) -
పవన్ కల్యాణ్పై మానవహక్కుల కమిషన్లో కేసు
గుంతకల్లు రూరల్: వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నంలో చేపట్టిన గర్జన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్పై జాతీయ మానవహక్కుల కమిషన్లో కేసు నమోదు అయినట్లు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ తెలిపారు. మంగళవారం ఆయన అనంతపురం జిల్లా గుంతకల్లులో వివరాలు వెల్లడించారు. విశాఖ ఘటన ద్వారా రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు ప్రయత్నించిన పవన్ కల్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్పై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు. కమిషన్ స్పందించి తమ ఫిర్యాదును విచారణకు స్వీకరించిందని తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఇప్పుడు కర్నూలులోనే...
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కార్యాలయాన్ని తెలంగాణ నుంచి కర్నూలు నగరానికి మార్చారు. ఏడాది క్రితం ఏపీ మానవహక్కుల కమిషన్, లోకాయుక్తలను ఏర్పాటు చేశారు. మానవహక్కుల కమిషన్ ప్రారంభం నుంచీ కర్నూలులో కార్యకలాపాలు చేపట్టింది. అయితే లోకాయుక్తను మాత్రం భవనం, ఇతర సౌకర్యాల కొరత వల్ల... ఏడాదిపాటు తెలంగాణ లోకాయుక్త కార్యాలయంలోనే కొనసాగించి... చివరికి మార్చి 18న కర్నూలుకు మార్చారు. లోకాయుక్త చట్టం ప్రకారం... ప్రభుత్వంలోని కిందిస్థాయి అటెండర్ నుంచి అత్యున్నత స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకూ అన్ని స్థాయిల్లో జరిగే అవినీతిని ప్రశ్నిస్తూ పిటిషన్ వేయడానికి అవకాశం ఉంది. ఇలాగే... గ్రామస్థాయి ఎంపీటీసీలు, సర్పంచ్ల నుంచి ఇతర మండలస్థాయి ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి ప్రజాప్రతి నిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమాల వరకూ ఆధారాలతో లోకాయుక్తలో పిటిషన్లు వేయ వచ్చు. అయితే ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తూ పిటిషన్లు వేయడానికి లోకాయుక్త చట్టం ఒప్పుకోదు. ఇది రాష్ట్ర స్థాయి చట్టం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985–1986ల మధ్య మొదటి సారి లోకాయుక్తను ఏర్పాటు చేశారు. ఆనాటి లోకాయుక్త చట్టమే నేటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. లోకాయుక్త కార్యాలయంలో లభించే సంబంధిత ఫార్మాట్లో వివరాలు భర్తీ చేసి, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు జతచేసి, విజ్ఞాపన పత్రాన్ని కూడా చేర్చి కేవలం రూ. 150 ఫీజు చెల్లించి అప్లికేషన్ సమర్పించాలి. ఈ అప్లికేషన్ను ఒక అడ్వకేట్తో సర్టిఫై చేయించాలి. లోకాయుక్తకు ఛైర్మన్గా పదవీ విరమణ పొందిన హైకోర్ట్ జడ్జీలను నియమిస్తున్నారు. రిజిస్ట్రార్లుగా జిల్లా జడ్జీలు పనిచేస్తు న్నారు. సివిల్, క్రిమినల్ కోర్టులకున్న అధికారాలన్నీ లోకాయుక్తకు ఉన్నాయి. లోకాయుక్తకు పిటీషన్లు పోస్టు ద్వారా కూడా పంపవచ్చు. ప్రస్తుత లోకాయుక్త చిరునామా: ఏపీ లోకాయుక్త, 96/3/721241, సంతోష్ నగర్, మెయిన్రోడ్, మహేంద్ర షోరూమ్ పక్కన, కర్నూలు–518006. – కె. ధనలక్ష్మి, సెక్రెటరీ, లీగల్ సర్వీసెస్ రైట్స్ ప్రొటెక్షన్ -
ఇల్లులాంటిదే ఆస్పత్రి
మంచిర్యాల టౌన్: మన ఇల్లు లాంటిదే ఆసుపత్రి అని, ఇక్కడికి వచ్చిన వారు ఆరోగ్యంతో వెళ్లాలి తప్ప.. అశ్రద్ధతో కొత్తగా వ్యాధులను తెచ్చుకోవద్దని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జి.చంద్రయ్య హితవు పలికారు. శనివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఐసీయూ వార్డును ఆనుకుని ఉన్న బాత్రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నీరు సక్రమంగా రావడం లేదని ఓ రోగి సహాయకుడు ఫిర్యాదు చేయగా స్పందించిన చైర్మన్ వెంటనే వెళ్లి పరిశీలించారు. బాత్రూంల బయట నీరు నిలిచి ఉండటాన్ని గమనించారు. దీంతో పక్కనే ఉన్న స్వైపర్తో ఫ్లోర్పై నిలిచిన నీరు మొత్తాన్ని స్వయంగా తొలగించారు. కొన్ని పనులను స్వయంగా చేసుకోవాలని రోగి సహాయకులకు సూచించారు. ఒక్కొక్క రోగికి సహాయంగా ముగ్గురు, నలుగురు రావడం వల్ల నీరు, పరిశుభ్రత సమస్యలు ఏర్పడతాయని వివరించారు. -
తూ.గో. ఎస్పీకి హెచ్ఆర్సీ నోటీసులు
కర్నూలు(సెంట్రల్): తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన కాళీకృష్ణ భగవాన్(20) అనే యువకుడి ఆత్మహత్యపై పూర్తి విచారణ జరిపించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బుధవారం ఆదేశించింది. అడిషనల్ జిల్లా ఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ తూర్పు గోదావరి ఎస్పీ, రామచంద్రాపురం డీఎస్పీ, మండపేట సీఐ (ప్రస్తుతం వీఆర్), మండపేట స్టేషన్ ఆఫీసర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఏప్రిల్ 11వ తేదీలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రేమ వ్యవహారంలో ప్రియురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండపేట టౌన్ సీఐ దుర్గప్రసాద్ కాళీకృష్ణ భగవాన్ను స్టేషన్కు పిలిచి మర్మావయం దగ్గర గాయపడేలా కొట్టారని, అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడనేది ప్రధాన ఆరోపణ. పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన వార్తను హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ మంధాత సీతారామమూర్తి, జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు నోటీసులు జారీ చేసినట్లు సెక్షన్ ఆఫీసర్ బి.తారక నరసింహకుమార్ తెలిపారు. -
తల్లిదండ్రుల రక్షణ బాధ్యత బిడ్డలదే
కర్నూలు (సెంట్రల్)/ఆళ్లగడ్డ: సంతానం ఉండి కూడా తల్లిని అనాథగా వదిలేయడం సరైన విధానం కాదని, తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే అని హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్ఆర్సీ) వ్యాఖ్యానించింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని దేవరాయపురం కాలనీకి చెందిన పి.ఓలమ్మ (75) ను కుమార్తెలు, కుమారులు అనాథగా వదిలేయడంపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనంపై హెచ్ఆర్సీ స్పందించింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఓలమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓలమ్మ భర్త 25 ఏళ్ల క్రితమే చనిపోయినా పిల్లలను పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. ఇటీవల ఆమె పక్షవాతానికి గురి కావడంతో కుమారులు, కోడళ్లు, కుమార్తెలు పట్టించుకోవడం లేదు. దీంతో తన బిడ్డలకు ఇచ్చిన మూడెకరాలను తిరిగి ఇప్పించాలని పెద్దలను కోరినా..వారెవరూ వినిపించుకోలేదు. దీంతో రోడ్డున పడిన ఆమె భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. సాక్షి వార్తపై హెచ్ఆర్సీ చైర్మన్ ఎం.సీతారామమూర్తి, జ్యూడిషియల్, నాన్ జ్యూడిషియల్ సభ్యులు దండే సుబ్రమణ్యం, డాక్టర్ జి.శ్రీనివాసరావులు స్పందించారు. తల్లిదండ్రుల సంరక్షణ చట్టం ప్రకారం ఓలమ్మకు న్యాయం చేయాలని నంద్యాల సబ్ కలెక్టర్, ఆళ్లగడ్డ తహసీల్దార్, ఓలమ్మ సంతానానికి నోటీసులిస్తూ కేసు డిసెంబర్ 13కి వాయిదా వేశారు. కాగా, హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించారు. ఓలమ్మ ఉంటున్న ప్రదేశానికి చేరుకుని విచారించారు. తక్షణం ఆశ్రయం కల్పించేందుకు ఆమెను ఆళ్లగడ్డలోని పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రానికి తరలించారు. -
హక్కుల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తాం
కర్నూలు (సెంట్రల్): మానవ హక్కుల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని, చట్టం నుంచి ఎంతటి వారైనా తప్పించుకోలేరని, తప్పుచేస్తే శిక్ష తప్పదని ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి స్పష్టంచేశారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల హక్కులను హరించే ఎంతటి వారైనా అభియోగాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సామాన్యుడి హక్కులను హరిస్తే వారి తరఫున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగుతుందని చెప్పారు. ఎక్కువగా పోలీసుస్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల్లో ఈ ఉల్లంఘనలు జరుగుతున్నాయని వివరించారు. కర్నూలులో కమిషన్ కార్యాలయం ప్రారంభమై నెలరోజులవుతోందని, ఇప్పుడిప్పుడే ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇక్కడ సదుపాయాలు బాగున్నాయని ఆయన చెప్పారు. కమిషన్ సేవలను రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకునేందుకు త్వరలోనే వెబ్సైట్, ఈ–మెయిల్, వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జస్టిస్ సీతారామమూర్తి చెప్పారు. కమిషన్ సేవలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఆరు నెలల్లో 135 సమస్యలు.. 72 కేసులు 2021 మార్చి 23 నుంచి ఇప్పటివరకు మొత్తం 135 సమస్యలు వచ్చాయి. అందులో 72 అర్జీలపై హెచ్ఆర్సీ కేసులు నమోదు చేశాం. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి. అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల వారు నేరుగా ఫిర్యాదులు అందిస్తున్నారు. భూ సమస్యలకు సంబంధించి తహసీల్దార్లు, వీఆర్వోలపైనే ఎక్కువగా ఫిర్యాదులు ఉంటున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేయకపోవడంపై కూడా కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఫిర్యాదులను పోస్టు, కొరియర్, ఫ్యాక్స్, ఈ–మెయిల్ ద్వారా ఏపీ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం, 1, 2, 4 గదులు, ధర్మపేట, కర్నూలు–518004 చిరునామాకు పంపొచ్చు. ఫిర్యాదును పోలీసులు నమోదు చేయాల్సిందే ఎలాంటి సందర్భంలోనైనా పోలీసులకు ఫిర్యాదు ఇస్తే సెక్షన్–173 ప్రకారం కేసు నమోదు చేయాలి. చేయకపోతే పోలీసులే బాధ్యులవుతారు. తరువాత సెక్షన్–153 ప్రకారం ఆ కేసులో మెరిట్స్ లేకపోతే అదే విషయాన్ని పోలీసులు కోర్టుకు తెలపాలి. అంతేకానీ.. కేసు నమోదు చేయకుండా ఉండకూడదు. అలా చేస్తే మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. అలాగే, కమిషన్ రూపొందించుకున్న 14 అంశాలు ఫిర్యాదులో కచ్చితంగా ఉండాలి. లేదంటే ఆ ఫిర్యాదు డిస్మిస్ అవుతుంది. అవి.. ► ఫిర్యాదులో వాది, ప్రతివాది అడ్రస్సులు పిన్కోడ్తో సహా ఉండాలి. వీలైతే ఫోన్ నంబర్లనూ రాయాలి. ► ఫిర్యాదుదారుడు కచ్చితంగా అర్జీలో సంతకం చేయాలి. ► ఏడాదిలోపే ఆ అంశంపై ఫిర్యాదు చేయాలి. అదే సమయంలో ఆ ఫిర్యాదు అంశంపై ఏ కోర్టుల్లో కేసులు ఉండడం కానీ, నడుస్తుండడం కానీ జరగరాదు. ► ఏ రాష్ట్రానికి సంబంధించి ఫిర్యాదు అదే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయాలి. ► ఏదైనా సంఘటనను ప్రోత్సహించిన అధికారి, అమలుచేసిన అధికారులు ఉంటే వారి పేర్లను నేరుగా చేరిస్తే వారిని విచారణకు పిలవడానికి వీలుంటుంది. ► ఆఫీసర్పై వ్యక్తిగత ఫిర్యాదు చేస్తే వారి ఇంటి అడ్రస్సు.. వృత్తిపరంగా చేస్తే హోదా, కార్యాలయం, ఇతర వివరాలు ఇవ్వాలి. ► ఫిర్యాదు కాపీలు నాలుగు ఉండాలి. ఒకే సమస్యపై ఐదారుగురు ఫిర్యాదు చేయదలుచుకుంటే మొదటి వ్యక్తి పేరుతో ఫిర్యాదు చేయాలి. -
విద్యార్థినికి సీటు నిరాకరణపై హెచ్ఆర్సీ సీరియస్
కర్నూలు (సెంట్రల్): కరోనా నేపథ్యంలో ఏడాదిపాటు చదువుకు దూరమైన విద్యార్థినిని ఇంటర్మీడియెట్లో ప్రవేశానికి నిరాకరించడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) సీరియస్ అయింది. దీనిపై కంబాలపాడు గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్తో పాటు ఇంటర్ బోర్డు కమిషనర్, రీజినల్ జాయింట్ డైరెక్టర్లకు హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. కర్నూలు జిల్లా సి.బెళగళ్ మండలం పోలకల్కు చెందిన ఎం.శ్రావణి 2020లో పదో తరగతి పాసైంది. అదే ఏడాది కరోనా విజృంభిస్తుండటంతో ఆమె కాలేజీలో చేరలేదు. ఈ సంవత్సరం కర్నూలు జిల్లా కంబాలపాడు గురుకుల కాలేజీలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంది. ఆమె మార్కుల ఆధారంగా బైపీసీలో సీటు వచ్చింది. అయితే గతేడాది ఆమె ఇంటర్లో చేరకపోవడంతో వివరాలు ఆన్లైన్లో నమోదు కావడం లేదంటూ ఆమెకు సీటును నిరాకరించారు. ఈ విషయం మీడియాలో రావడంతో హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఆమెకు సీటు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కాలేజీ ప్రిన్సిపాల్తోపాటు ఇంటర్ బోర్డు కమిషనర్, బోర్డు రీజినల్ డైరెక్టర్లకు నోటీసులు పంపింది. నెల రోజుల్లో ఏమి చర్యలు తీసుకున్నది వివరించాల్సిందిగా కమిషన్ చైర్మన్ ఎం.సీతారామమూర్తి, జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు ఎం.శ్రీనివాసరావులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. -
కర్నూలులో హెచ్ఆర్సీ కార్యాలయం ప్రారంభం
సాక్షి, కర్నూలు: కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హ్యూమన్ రైట్స్ కమిషన్ – హెచ్ఆర్సీ) కార్యాలయాన్ని ఆ సంస్థ ఛైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులకు సీతారామ్మూర్తి ధన్యవాదాలు తెలిపారు. సమయం తక్కువగా వుండటం వల్ల కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్లో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ఇవీ చదవండి: కామారెడ్డి జిల్లా కలెక్టర్ను కదిలించిన ‘సాక్షి’ కథనాలు కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్.. -
నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు: ఏపీ హైకోర్టు
అమరావతి: కర్నూలులో మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. క్యాబినెట్ మంత్రులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని.. పార్టీలుగా చేసి అందరికీ నోటీసులు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. కాగా పిటిషనర్ వాదనను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. చదవండి: కూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం క్యాబినెట్ మంత్రులకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లు అన్ని కలిపి వింటామన్న హైకోర్టు.. కోర్టు ఇచ్చే తుది తీర్పునకు అనుగుణంగానే కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది. కాగా తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది. చదవండి: ఏపీలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ -
కర్నూలులో ఏపీ మానవహక్కుల కమిషన్
సాక్షి, విజయవాడ: కర్నూల్లో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్(ఏపీ హెచ్ఆర్సీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హెచ్ఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూల్ని మానవ హక్కుల కమిషన్కి హెడ్ క్వార్టర్గా స్పెసిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో ఇక మీదట కర్నూల్ కేంద్రంగా ఏపీ మానవ హక్కుల కమిషన్ పని చేయనుంది. చదవండి: (ఇంటి ముందే సమాధులు.. ‘ఆత్మల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష’) -
ఏపీ హెచ్ఆర్సీ హైదరాబాద్లో ఎందుకుంది?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ (ఏపీ హెచ్ఆర్సీ) రాష్ట్రంలో కాకుండా హైదరాబాద్లో ఎందుకు ఉందని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మన రాష్ట్రంలోనే ఉండి తీరాలంది. ఆంధ్రప్రదేశ్లోనే హక్కుల కమిషన్ను ఏర్పాటు చేయాలని ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. హక్కుల కమిషన్తోపాటు లోకాయుక్త వంటి సంస్థలు రాష్ట్రంలోనే ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనిపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ గడువు కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
సాక్షి ఎఫెక్ట్: కరోనా చీకట్లో మానవత్వపు చిరు దీపం
సత్తెనపల్లి: అన్నీ ఉన్నా అనాథగా మారిన సత్తెనపల్లి వాసి గోపవరపు సత్యనారాయణ దుస్థితిపై శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆ వృద్ధుడి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించి అవసరమైతే మెరుగైన వైద్యం అందించాలని నాన్ జ్యుడీయల్ ఏపీ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు సూచించారు. ఆ పెద్దాయన సంతానంతో మాట్లాడాలని గుంటూరు ఆర్డీవో ఎస్.భాస్కర్రెడ్డిని ఆదేశించారు. తనకు ఎక్కడ ఇష్టముంటే అక్కడ చేర్చాలని పేర్కొన్నారు. సత్యనారాయణకు కల్పించిన సౌకర్యాలపై ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కథనాన్ని ప్రచురించిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. మేమున్నామంటూ.. గుంటూరు, నరసరావుపేటకు చెందిన అనాథాశ్రమ నిర్వాహకులు సత్యనారాయణను తాము చేర్చుకుంటామంటూ ముందుకొచ్చారు. చివరి మజిలీ వేళ తాము అండగా ఉంటామని, ఆయనకు ఊతకర్రగా మారుతామని హామీ ఇచ్చారు. కరోనా చీకట్లు అలుముకున్న వేళ మానవత్వపు దీపాన్ని వెలిగించి ఆ వృద్ధుడి మోములో బోసి నవ్వులు చూస్తామని ప్రకటించారు. చదవండి: సీనియర్ జర్నలిస్టు గోపి హఠాన్మరణం భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని.. -
భూపాలపల్లి ఎమ్మెల్యేపై హెచ్చార్సిలో ఫిర్యాదు
నాంపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వల్ల తమ ప్రాణాలకు హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండారి కవిత, భర్త దేవేందర్తో కలిసి సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామాభివృద్ధి విషయమై ఎమ్మెల్యేతో పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన పట్టించుకోకుండా తమను టార్గెట్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 2న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల అభివృద్ధి గురించి పలువురు సర్పంచ్లు, ఇతర నాయకులు కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన భర్త దేవేందర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే నువ్వు బీసీ సంఘంలో పని చేసినంత కాలం మీ గ్రామానికి నిధులు ఇవ్వనని హెచ్చరించినట్లు తెలిపారు. అనంతరం అతని అనుచరులతో బెదిరిస్తున్నారని, ఎమ్మెల్యేతో తమకు ప్రాణహాని ఉందని కవిత వాపోయారు. ఈ విషయంలో విచారణ నిర్వహించి తమకు రక్షణ కల్పించాలని ఆమె హక్కుల కమిషన్ను కోరారు. -
పెద్దపల్లి: వివాహితపై సామూహిక అత్యాచారం?
సాక్షి, పెద్దపల్లి: ఇటుక బట్టీలో పనిచేసే ఓ వివాహితపై యజమానులే అఘాయిత్యానికి ఒడిగట్టారు. గత నెల 24న పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల సంఘానికి (హెచ్ఆర్సీ) లేఖ రాయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెచ్ఆర్సీ నుంచి అధికారులకు అందిన లేఖ ప్రకారం.. గౌరెడ్డిపేటలోని ఎల్ఎన్సీ ఇటుక బట్టీలో పనిచేసే ఒడిశాకు చెందిన వివాహిత (22)పై ఐదుగురు యజమానులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దంపతులపై దాడి చేశారు. తమకు ప్రాణహాని ఉందని భావించిన సదరు దంపతులు.. అక్కడి నుంచి తప్పించుకుని స్వగ్రామం వెళ్లేందుకు రామగుండం రైల్వేస్టేషన్కు వెళ్లారు. వారిని పట్టుకున్న యజమానులు మళ్లీ ఇటుక బట్టీల వద్దకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. సాక్ష్యం చెబుతారనే ఉద్దేశంతో మరో 14 మంది కూలీలను నిర్బంధించి దాడి చేశారు. అయితే.. ఈ విషయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల సంఘానికి లేఖ రాశారు. స్పందించిన హెచ్ఆర్సీ.. విచారణ చేపట్టాలని పెద్దపల్లి ఆర్డీవో శంకర్కుమార్, ఎస్సై రాజేశ్, తహసీల్దార్ శ్రీనివాస్, సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ స్వప్నను సోమవారం ఆదేశించింది. వీరంతా ఇటుక బట్టీల వద్ద కూలీలతో మాట్లాడారు. పదిమంది కూలీలు, వారి పిల్లలకు కేంద్రంలో ఆశ్రయం కల్పించామని కేంద్రం అడ్మినిస్ట్రేటర్ స్వప్న తెలిపారు. బాధితులను దాచారా? అధికారులు విచారణకు వెళ్లిన సమయంలో బాధితురాలు, ఆమె భర్త ఇటుక బట్టీల వద్ద కనిపించలేదు. దీంతో యజమానులే వారిని దాచిపెట్టి ఉంటారని కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణకు యజమానులు సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, అత్యాచారం, కూలీల నిర్బంధంపై విచారణ జరుపుతున్నామని, త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆర్డీఓ తెలిపారు. కాగా, గతంలో సైతం ఇదే ఇటుక బట్టీలో ఓ కూలీ మృతి చెందగా తోటి కూలీలకు తెలియకుండా యాజమాన్యం దాచి పెట్టిందని పలువురు కూలీలు గుర్తు చేస్తున్నారు. -
‘అత్యాచారం, గర్భస్రావం ఇక్కడ నిత్యకృత్యం’
ప్యోంగ్యాంగ్: నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పాలన గురించి ప్రపంచం అంతా కథలు కథలుగా చెప్పుకుంటుంది. కఠినమైన ఆంక్షల మధ్య జీవనం సాగిస్తున్న అక్కడి ప్రజల గురించి తల్చుకుంటే.. భయం వేస్తోంది. ఇక అక్కడి డిటెన్షన్ సెంటర్ల గురించి.. వాటిలో మగ్గుతున్న ఖైదీలు.. ప్రత్యేకించి మహిళల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిటీ ‘ఐ స్టిల్ ఫీల్ ది పెయిన్’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. డిటెన్షన్ కేంద్రాల్లో మహిళలు అనుభవించిన నరకం గురించి ఈ నివేదిక ప్రపంచానికి వెల్లడించింది. 2009 నుంచి 2019 వరకు దాదాపు 100 మంది మహిళలను ఈ డిటెన్షన్ కేంద్రాల్లో బంధించినట్లు నివేదిక తెలిపింది. వీరంతా ఉత్తర కొరియా నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డ మహిళలు. విడుదలైన తర్వాత ఐక్యరాజ్యసమితి పరిశోధకులు వీరిని సియోల్లో అత్యంత రహస్యంగా ఇంటర్వ్యూ చేశారు. (నార్త్ కొరియాకు అమెరికా, ద. కొరియా విజ్ఞప్తి!) దీనిలో బాధితులు నిర్భంద కేంద్రాల్లో తాము స్వచ్ఛమైన గాలి, నిద్ర, పగటి పూట ఎండ, మంచి ఆహారానికి కూడా నోచుకోలేదని వెల్లడించారు. దెబ్బల నుంచి తప్పించుకోవడం కోసం నిద్రాహారాలు మాని పని చేస్తూనే ఉన్నామన్నారు. వీరంతా అధికారుల చేతుల్లో తీవ్ర హింసలకు గురి కావడమే కాక అత్యాచారానికి కూడా గురయ్యారని నివేదిక తెలిపింది. పోలీసు అధికారులు తమను అంగట్లో ఆటబొమ్మల మాదిరి చూసేవారని బాధితులు వెల్లడించారు. హింస, దురాక్రమణ, అత్యాచారం, బలవంతపు గర్భస్రావం వంటి దారుణాలు ఈ కేంద్రాల్లో నిత్యకృత్యమని బాధితులు వెల్లడించారు. ఓ మహిళ యూఎన్ అధికారులతో మాట్లాడుతూ.. ‘డిటెన్షన్ కేంద్రంలో ఓ అధికారి నన్ను బెదిరించాడు. నువ్వు నన్ను తిరస్కరిస్తే.. నిన్ను హింసిస్తాను.. అవమానాలకు గురి చేస్తాను.. ఒప్పుకుంటే నిన్ను ఇక్కడ నుంచి త్వరగా విడుదల చేయడానికి సాయం చేస్తానని చెప్పాడు’ అని నివేదిక వెల్లడించింది.(నియంత రాజ్యంలో తొలి కరోనా కేసు) ఉత్తర కొరియా ఈ నివేదికపై వెంటనే స్పందిచలేదు.. కానీ గతంలో మాత్రం ఈ మానవహక్కుల నివేదిక తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన కుట్ర అని విమర్శించింది. ఈ నివేదికలో పాలు పంచుకున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల అధికారి డేనియల్ కొల్లింగే మాట్లాడుతూ.. ‘పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్యోంగ్యాంగ్పై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాం. స్వేచ్ఛ, శ్రేయస్సు సాధించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన దేశం దాటుతున్న వారిని బహిష్కరించవద్దని ఇతర దేశాలను కోరుతున్నాను’ అన్నారు. -
అయ్యో... బిడ్డ
సాక్షి, నల్లగొండ : శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ, ఆక్సిజన్ సరఫరా లేక కొడుకు నరకయాతన పడుతుండగా... ఏం చేయాలో దిక్కుతోచక కన్నతల్లి తల్లడిల్లింది. బిడ్డను పిలుస్తూ, సపర్యలు చేస్తూ రోదించింది. ఆమె అలా చూస్తుం డగానే కుమారుడి ప్రాణం గాల్లో కలిసి పోయింది. ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి ఎందరి హృదయాలనో బరువెక్కించింది. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఈ ఘటన జరిగింది. దీన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం సల్కునూరు గ్రామానికి చెందిన బొప్పని యాదయ్య (40) ఆరోగ్యం బాగోలేక శుక్రవారం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేరగా, శనివారం సాయంత్రం శ్వాస ఆడకపోవడంతో ఆక్సిజన్ అందించారు. కొద్దిసేపటి తర్వాత ఆక్సిజన్ అయిపోయింది. తల్లి లక్ష్మమ్మ కుమారుడి అవస్థను చూసి ఎంతగా రోదించినా ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించలేదు. గిలగిలలాడిన యాదయ్య తుదిశ్వాస విడిచాడు. యాదయ్య లారీడ్రైవర్గా పనిచేసేవాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొంతకాలంగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. అతని భార్య కూడా ఐదేళ్ల క్రితం చనిపోయింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి లక్ష్మమ్మ తన పెన్షన్ డబ్బులతోనే యాదయ్య, అతని పిల్లలను సాకుతోంది. ఈ క్రమంలో యాదయ్యకు ఆయాసం ఎక్కువ కావడంతో శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చింది. పరీక్షించిన వైద్యులు శ్వాససంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించినా.. కరోనా లక్షణాలు ఉండడంతో అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో చేర్చారు. అతను శ్వాస ఆడక శనివారం సాయంత్రం మరణించాడు. సకాలంలో వైద్యం అందితే బతికేవాడు నా కుమారుడికి సరైన సమయంలో వైద్యం, ఆక్సిజన్ అందితే బతికేవాడని తల్లి లక్ష్మమ్మ తెలిపింది. డాక్టర్లు ఎవరూ పట్టించుకోలేదని, ఆక్సిజన్ పెట్టినా అది అయిపోవడంతో ఊపిరి పీల్చుకోలేక చనిపోయినట్లు ఆరోపించింది. యాదయ్యకు కరోనా లక్షణాలు ఉండడంతో అతని నుంచి నమూనాలు తీసుకుని పరీక్ష నిమిత్తం హైదరాబాద్కు పంపినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇంకా రిజల్ట్ రాలేదని పేర్కొన్నాయి. సుమోటోగా కేసు నమోదు ఆస్పత్రి బెడ్పై కుమారుడు యాదయ్యకు తల్లి సేవలు చేస్తూ రోదిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ ఆగస్టు 21లోగా అన్ని ఆధారాలతో పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఎంహెచ్ఓ కొండల్రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహకు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. నివేదిక కోరిన కలెక్టర్ యువకుడి మృతిపై పూర్తిస్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహను ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం యాదయ్య తీవ్ర శ్వాస ఇబ్బంది, దగ్గు, జ్వరంతో చికిత్స కోసం 17న ఆస్పత్రిలో చేరాడని, అతను అప్పటికే అలర్జి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరి వ్యాధి (సీఓపీడీ)తో బాధపడుతున్నాడని కలెక్టర్ వివరించారు. వచ్చిన వెంటనే కరోనా అనుమానిత వార్డులో చేర్చుకుని సంబంధిత డాక్టర్, సిబ్బంది శక్తివంచన లేకుండా వైద్యసేవలు అందించినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయాడన్నారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే సంబంధీకులపై చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్ఆర్సీ నుంచి ఇంకా నోటీసులు రాలేదని, వచ్చాక స్పందిస్తామని తెలిపారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదని పేర్కొన్నారు. -
తండ్రిని మోసిన కుమారుడు.. విచారణకు ఆదేశం
కొల్లాం(కేరళ) : ఆరోగ్యం బాగాలేని తండ్రిని, కుమారుడు ఎత్తుకుని కిలోమీటరు మేర నడిచిన ఘటనపై కేరళ మానవహక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. కొల్లాం జిల్లాలోని పునలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తన తండ్రి జార్జ్(89)ని తీసుకురావడానికి వెళుతుండగా లాక్డౌన్ కారణంగా పునలూర్లో పోలీసులు రోయ్మన్(30) ఆటోను అడ్డుకున్నారు. ఆసుపత్రికి వెళ్లి తన తండ్రిని తీసుకురావాలని మొరపెట్టుకున్నా వినిపించుకోకపోవడంతో చేసేదేమీ లేక ఒక కిలోమీటరు నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లాడు. తిరిగి తన తండ్రిని తీసుకురావడానికి వేరే అవకాశం లేకపోవడంతో ఎత్తుకుని ఆటో వరకు తీసుకువచ్చాడు. తండ్రిని ఎత్తుకుని తిరిగి వస్తున్న రోయ్మన్ని చూసి కనీసం అక్కడున్నపోలీసులు స్పందించలేదు. పులనూరు సీఐ ముందుగా తనను ఆటో డాక్యుమెంట్లు అడగ్గా అన్ని చూపించానని రోయ్మన్ తెలిపారు. అయినా ఆటోను ఆసుపత్రి వరకు అనుమతించలేదన్నారు. అయితే పోలీసులు మాత్రం ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో అనుమతి నిరాకరించామని చెబుతున్నారు. ఇక జిల్లా ఎస్పీ నుంచి ఈ ఘటనపై రిపోర్టు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని కేరళ మానవ హక్కుల సంఘం తెలిపింది. -
తండ్రిని మోసిన కుమారుడు..
-
అక్రమ బంధాన్ని ప్రశ్నిస్తే దాడి చేశాడు
నాంపల్లి: భర్త వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన ఓ మహిళపై ఆమె భర్త అమానుషంగా దాడి చేశాడు. ఈ సంఘటన బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వద్ద జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. మౌలాలీలోని ఆర్టీసీ కాలనీ శివానందనగర్లో నివాసం ఉండే మహేష్ భార్య కళావతితో మౌనేష్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య కళావతి పథకాన్ని రచించింది. భర్త ఇంట్లో నిద్రించే సమయంలో యాసిడ్ దాడి చేసింది. ఈ దాడిలో మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి కళావతి తన ఇద్దరు ఆడ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేర ప్రవృత్తి కలిగిన తన భార్య వద్ద పిల్లలు ఉంటే జీవితం నాశనం అవుతుందని, తన ఇద్దరు కుమార్తెలను తనకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని, లేనిపక్షంలో స్టేట్ హోంకు తరలించి చదివించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మహేష్ ఇటీవల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు కమీషన్ ఎదుట బుధవారం విచారణ జరగాల్సి ఉండేది. విచారణకు మహేష్తో పాటు భార్య కళావతి హాజరైంది. మౌనేష్ కూడా అక్కడకు వస్తాడనే విషయం ముందుగా తెలిసింది. అయితే కళావతి పరిచయం అనంతరం తన భర్త మౌనేష్ ఇంటికి రావడం లేదని శాంతి అనే మహిళ బుధవారం మానవహక్కుల కమిషన్కు వచ్చింది. అక్కడ మౌనేష్ను భార్య శాంతి మౌనేష్ను నిలదీసింది. భార్య ప్రశ్నించడాన్ని భరించలేని మౌనేష్ ఆమెపై దాడిచేశాడు. దాడిలో శాంతి మూతి పండ్లు రాలిపోయాయి. తీవ్ర రక్తస్రావం అయ్యింది. బాధితురాలిని కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య తన చాంబరులోనికి ఆహ్వానించి సమస్యను తెలుసుకున్నారు. కమిషన్ ఎదుట భార్యపై భర్త దాడి చేయడంపై కమీషన్ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
సర్కారుకు జరిమానా..!
భువనేశ్వర్: రక్త మార్పిడి తప్పిదం పట్ల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. బాధిత వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారం చెల్లించేందుకు కమిషన్ 2 నెలల గడువు మంజూరు చేసింది. శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కెంజొహార్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఈ ఘోర తప్పిదం 2016 వ సంవత్సరం డిసెంబరులో జరిగింది. ఈ తప్పిదంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారం వ్యక్తం చేసింది. రక్త మార్పిడిని పురస్కరించుకుని కెంజొహార్ జిల్లా ప్రధాన ఆస్పత్రి వర్గాల తప్పిదంతో సుఖాంతి నాయక్ (45) అనే మహిళ అకాల మరణానికి గురైంది. కెంజొహార్ పాత బస్తీ హడొబొంధొ సాహిలో ఉంటున్న సుఖాంతి నాయక్ ఉన్నత చికిత్స కోసం ఈ ఆస్పత్రి మెడిసిన్ వార్డులో 2016వ సంవత్సరం డిసెంబరు 13వ తేదీన భర్తీ అయింది. ఆమెకు ఒక యూనిట్ రక్త మార్పిడి చేపట్టాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ సలహా మేరకు ఆమె భర్త వీరేంద్ర నాయక్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న రక్త నిధి నుంచి లేబొరేటరీ వర్గాలు ఇచ్చిన 1 యూనిట్ రక్తం తీసుకుని సంబంధిత నర్సుకు అందజేశాడు. ఈ రక్తం మార్చిన కాసేపటికే ఆయన భార్య సుఖాంతి నాయక్ ఆకస్మికంగా కన్నుమూసింది. ఈ సంఘటనపై ఆరా తీయగా తప్పుడు గ్రూపు రక్తం మార్చడంతో ఈ ముప్పు సంభవించినట్లు తేలింది. కావలసిన గ్రూపు రక్తం బదులుగా వేరే గ్రూపు రక్తం ఎక్కించడంతో ప్రాణాలు కోల్పోయినట్లు ఖరారైంది. విధుల నుంచి ఇద్దరు సిబ్బంది తొలగింపు ఈ విషాద సంఘటనపై జిల్లా ప్రధాన వైద్య అధికారి నిర్వహించిన విచారణలో ఇద్దరు సిబ్బంది బాధ్యులుగా తేలింది. ఈ సిబ్బందిని విధుల నుంచి బహిష్కరించారు. రక్త నిధి లేబొరేటరీ టెక్నిషియన్ భారతి మహంత తప్పిదం, విధి నిర్వహణలో స్టాఫ్ నర్సు హేమాంగిని మహంత నిర్లక్ష్యంతో చికిత్స కోసం విచ్చేసిన మహిళ మృతి చెందినట్లు నివేదిక వెల్లడించింది. కెంజొహార్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఒకే పేరుతో (సుఖాంతి నాయక్) ఇద్దరు వేర్వేరు మహిళా రోగులకు ఒకేసారి రక్త మార్పిడి చేయాల్సి వచ్చింది. ఆస్పత్రి మెడిసిన్, గైనకాలజీ వార్డుల నుంచి రక్త నిధికి రెండు యూనిట్ల రక్తం ఏర్పాటుకు అభ్యర్థనలు జారీ చేశారు. గైనకాలజీ వార్డు రోగికి అ గ్రూపు రక్తం, మెడిసిన్ వార్డు రోగికి వేరే గ్రూపు రక్తం అవసరాల కోసం అభ్యర్థించగా పంపిణీ దశలో ఈ రెండు గ్రూపుల రక్తం తారుమారైంది. ఈ తప్పిదాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా స్టాఫ్ నర్సు హుటాహుటిన మెడిసిన్ వార్డులో ఉన్న రోగికి మార్చడంతో అకస్మాత్తుగా మరణించినట్లు జిల్లా ప్రధాన వైద్యాధికారి స్పష్టం చేశారు. ఈ తప్పిదం పట్ల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్వచ్ఛందంగా స్పందించి చొరవ తీసుకుంది. -
మృతదేహంతో 3 కి.మీ. నడక..!
కొచ్చి : కేరళ పోలీసుల తీరుపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం (కేఎస్హెచ్చార్సీ) మండిపడింది. ఇద్దరు ఆదివాసీల భుజాలపై దాదాపు మూడు కిలోమీటర్లు మృత దేహాన్ని తరలించిన ఘటనపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ చీఫ్ సెక్రటరీ, ఎర్ణాకులం జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. వివరాలు.. ఎర్ణాకులం జిల్లాలోని కుత్తంపుజా పరిధిలోని కుగ్రామం కాంజీపురలో సోమన్ (37) అనే వ్యక్తి వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించాల్సి ఉంది. అయితే, మృతదేహాన్ని వాహనంలో కాకుండా ఇద్దరు ఆదివాసీలు భుజాన మోసుకెళ్లారు. కాలినడకన 3 కి.మీ ప్రయాణించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తల్ని సుమోటోగా తీసుకున్న కేఎస్హెచ్చార్సీ పోలీసుల తీరును తప్పుబట్టింది. మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్, సీఎస్కు ఆదేశాలిచ్చింది. కాగా, సరైన రోడ్డు వసతి లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని జిల్లా ఎస్పీ కె.కార్తీక్ తెలిపారు. రోడ్డు సరిగా లేకపోవడంతో పోలీసులు అక్కడికి కాలి నడకన చేరుకుని మృతదేహాన్ని తెచ్చేందుకు ఆ గ్రామస్తుల సాయం తీసుకున్నారని చెప్పారు. కాంజీపురకు ఇప్పటివరకు విద్యుత్, రోడ్డు రవాణా సదుపాయాలు లేవని వెల్లడించారు. -
హక్కులంటే వ్యక్తిగత తగాదాలు కాదు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక హక్కులే మానవ హక్కులని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరదృష్టితో రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోనే ప్రాథమిక హక్కుల రూపంలో మానవ హక్కులను పొందుపర్చారని ఆయన చెప్పారు. చాలామందికి మానవ హక్కులంటే ఏమిటో అవగాహన తక్కువగా ఉందని, వ్యక్తిగత తగాదాలు, అధికారులు పనులు చేయకపోవడం, ఇతరత్రా సమస్యలతో కమిషన్కు పలువురు అర్జీలతో రావడం సబబుకాదని చెప్పారు. మానవ హక్కులపై అన్ని స్థాయిల్లోనూ అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణమూర్తి అధ్యక్షతన శనివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లాలోని కుగ్రామంలో జన్మించిన తాను గ్రామపెద్దకు భయపడేవాడినని, అయితే తాను పదోతరగతి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ గ్రామపెద్ద వచ్చి భుజం తట్టి తనను ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. అందరూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకోవాలని జస్టిస్ చంద్రయ్య హితవు చెప్పారు. రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త 2 పదవులూ బీసీలకు ఇవ్వడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సీఎం కేసీఆర్కు అభినందనలు తెలిపారు. జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయమూర్తుల పోస్టులు భర్తీ చేసేలా స్వతంత్ర జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హక్కుల ఉల్లంఘనల కేసుల్లో కమిషన్ సత్వర న్యాయం అందించాలని తెలంగాణ జనస మితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. మానవహక్కుల రక్షణకు కమిషన్ సుమో టోగా కేసుల్ని స్వీకరించి న్యాయం చేయాలని సభాధ్యక్షు డు సత్యనారాయణమూర్తి కోరారు. హక్కుల రక్ష ణకు కృషి చేస్తానని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ నాన్ జ్యుడీషియల్ మెంబర్ మహ్మద్ ఇర్ఫాన్ మెయినుద్దీన్ చెప్పారు. అనంతరం జస్టిస్ చంద్రయ్యను కృష్ణయ్య, కోదండరాం సన్మానించారు. -
పోలీసులు వేధిస్తున్నారు.. చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్ : భూవివాదానికి సంబంధించి సంస్థాన్ నారాయణ్పూర్ పోలీసులు తమను వేధిస్తున్నారంటూ యాదాద్రి జిల్లా భువనగిరి మండలం జనగామకు చెందిన 15 మంది రైతులు శుక్రవారం మానవ హక్కుల కమీషన్ను ఆశ్రయించారు. అదే గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి అనే వ్యక్తితో కుమ్మక్కైన చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, ఎస్సై నాగరాజు, ఏఎస్సై శ్యామ్సుందర్రెడ్డిలు తమపై అక్రమ కేసులు బనాయించారని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. భూమి సమస్యకు సంబంధించి అడ్డువస్తున్నామని తమపై 3 అక్రమ కేసులు బనాయించడమే కాకుండా విచక్షణారహితంగా కొట్టారని పేర్కొన్నారు. తమను వేధింపులకు గురి చేస్తున్న ఏసీపీతో పాటు ఇతర పోలీసులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని హెచ్ఆర్సీనీ రైతులు కోరారు. -
అసలు ఇదంతా ఎలా జరిగింది?
సాక్షి, శంషాబాద్ : ‘దిశ’అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) విచారణ మొదలైంది. కమిషన్ ప్రతినిధులు శనివారం మహబూబ్నగర్ లో విచారణ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు సోమవారం వరకు రాష్ట్రంలోనే ఉండి ఎన్కౌంటర్ జరిగిన తీరుపై సమగ్ర విచారణ జరపనున్నారు. తొలిరోజు ఎన్కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నివేదికను అధ్యయనం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఎన్కౌంటర్ జరిగిన చటాన్పల్లి సంఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. ఆదివారం మృతుల తల్లిదండ్రులతో సమావేశం కానున్నారు. అయితే వారి తల్లిదండ్రులను హైదరాబాద్కు పిలిపించుకుంటారా? లేక మృతుల స్వస్థలమైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్ గ్రామాలకు వెళ్తారా అనే దానిపై శనివారం రాత్రి వరకు స్పష్టత రాలేదు. సోమవారం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, ఎన్కౌంటర్ చేసిన పోలీసులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని పోలీసువర్గాలు తెలిపాయి. విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడున్నర గంటల పాటు భేటీ... శనివారం మధ్యాహ్నం 1.20 గంటలకు మహబూబ్నగర్ వచ్చిన ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు స్థానిక పోలీసు అధికారులు, పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్య బృందం, స్థానిక జనరల్ ఆస్పత్రి వైద్యులతో సుమారు మూడున్నర గంటల పాటు భేటీ అయ్యారు. ‘దిశ’అత్యాచారం, హత్య మొదలు.. ఎన్కౌంటర్, శవపరీక్ష వరకు అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. దిశ హత్య తర్వాత, ఎన్కౌంటర్ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదికను పరిశీలిస్తున్న సమయంలో ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులకు పలు అనుమానాలు రావడంతో పోస్టుమార్టం చేసిన వైద్యులను పిలిపించాలని కోరారు. దీంతో గాంధీ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ కృపాల్సింగ్, అసోసియేట్ ప్రొఫెసర్ లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేందర్, మరో వైద్యుడు హుటాహుటిన మహబూబ్నగర్ వచ్చి, వారి సందేహాలను నివృత్తి చేశారు. రెండుసార్లు మృతదేహాలు పరిశీలన.. ఆస్పత్రికి చేరుకున్న వెంటనే నేరుగా మార్చురీకి వెళ్లిన ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు.. అక్కడ మృతదేహాలను వారి పేర్లతో సహా వివరాలన్నీ నిర్ధారించుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ చాంబర్కు వెళ్లి పోస్టుమార్టం నివేదికను క్షుణ్ణంగా చదివారు. ముఖ్యంగా ఎంత దూరం నుంచి కాల్చి ఉండొచ్చు? తూటాలు మృతుల శరీరాల్లో చొచ్చుకుని పోవడంతో ఏ మేరకు రంధ్రం ఏర్పడింది? మృతులు పారిపోతున్నట్టు ధ్రువీకరించే ఆధారాలు ఏవైనా ఉన్నాయా అనే కోణాల్లో ఆరా తీశారు. అనంతరం మరోసారి మార్చురీకి వెళ్లి.. మృతదేహాలను పరిశీలించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అక్కడ నుంచి చటాన్పల్లి శివారులో దిశను కాల్చివేసిన స్థలానికి చేరుకున్నారు. నిందితులు దిశను శంషాబాద్ నుంచి అక్కడకు ఎలా తీసుకొచ్చారు..? ఆమె మృతదేహాన్ని ఎక్కడ దహనం చేశారు..? అనే విషయాలను శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి వారికి వివరించారు. తర్వాత ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి చేరుకుని.. మృతదేహాలు ఎక్కడ పడి ఉన్నాయి.. ఎన్కౌంటర్ ఎలా జరిగిందనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దిశను కాల్చేసిన స్థలానికి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం ఎంత దూరంలో ఉందనే వివరాలను కూడా సేకరించారు. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఎంతమంది పోలీసులు ఉన్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆ ప్రదేశాన్ని క్షుణ్నంగా పరిశీలించాక, అక్కడి నుంచి నిందితులు దిశపై హత్యాచారం చేసిన తొండుపల్లిలోని టోల్ప్లాజా వద్దకు వెళ్లారు. దిశపై అత్యాచారం, హత్య జరిగిన ప్రహరీ లోపలి ప్రదేశాన్ని నిశితంగా గమనించారు. నిందితులు ఆమెపై ఘాతుకానికి ఎలా పాల్పడ్డారో డీసీపీ ప్రకాష్రెడ్డి వారికి వివరించారు. నేడు మృతుల తల్లిదండ్రులతో భేటీ... జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రతినిధులు ‘దిశ’ఎన్కౌంటర్ మృతుల తల్లిదండ్రులతో ఆదివారం సమావేశం కానున్నారు. మృతుల వ్యక్తిత్వం.. అలవాట్ల వివరాలతో పాటు ఎన్కౌంటర్పై వారి అభిప్రాయాలు సేకరించనున్నారు. నిందితులను పోలీసులు ఎప్పుడు తీసుకెళ్లారు? ఎలా తీసుకెళ్లారు? ఏం చెప్పి తీసుకెళ్లారు? ఎన్కౌంటర్ చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారా? చేసిన తర్వాత వారి స్పందన ఏమిటి? అనే విషయాలపై ఆరా తీస్తారని ఓ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. రహస్యంగా విచారణ.. ఎన్కౌంటర్ నిజానిజాలను నిర్ధారించేందుకు వచ్చిన ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు తమ విచారణను రహస్యంగా నిర్వహించారు. ఎన్కౌంటర్, పోస్టుమార్టంపై తమ అనుమానాలను నివృత్తి చేసుకునే క్రమంలో వైద్యులు, పోలీసు ఉన్నతాధికారులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. మీడియాతో మాట్లాడతారని భావించినా మాట్లాడలేదు. మూడు రోజుల విచారణ పూర్తయిన తర్వాతే వారు మీడియాతో మాట్లాడతారని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఈ క్రమంలో విచారణకు అంతరాయం కలగకుండా పోలీసులు ఆస్పత్రి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులెవరినీ లోపలికి అనుమతించలేదు. రోగులను క్షుణ్ణంగా పరిశీలించి.. నిర్ధారించుకున్న తర్వాతే వదిలిపెట్టారు. మీడియాను సైతం గేటు బయటకు పంపేశారు. మరోవైపు దిశ తల్లిదండ్రులను కమిషన్ ప్రతినిధులు కలుస్తారని భావించినా.. వారు ఆమె ఇంటికి వెళ్లలేదు. మూడురోజుల్లో ఫోరెన్సిక్ నివేదిక ‘‘ఎన్కౌంటర్లో చనిపోయిన దిశ నిందితుల పోస్టుమార్టం నివేదికను మరో మూడు రోజుల్లో జిల్లా జడ్జి ద్వారా హైకోర్టుకు సమర్పిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదుగురితో కూడిన వైద్య బృందం నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసింది. ఈ వ్యవహారంలో అన్ని నిబంధనలూ అనుసరించాం. పోస్టుమార్టానికి సంబంధించి ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు అడిగిన సందేహాలను నివృత్తి చేశాం’’ – డాక్టర్ కృపాల్సింగ్, గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుడు ఘటన తీరును తెలుసుకునేందుకే వచ్చారు ‘‘దిశ హత్యోదంతం, నిందితుల ఎన్కౌంటర్ జరిగిన తీరును పరిశీలించేందుకే జాతీయ మానవ హక్కుల సంఘం బృందం వచ్చింది. ఏడుగురు సభ్యులతో కూడిన బృందం మధ్యాహ్నం మహబూబ్నగర్ వెళ్లి తిరుగు ప్రయాణంలో చటాన్పల్లి వద్ద దిశను కాల్చిన స్థలాన్ని, ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించింది. విచారణ కమిటీలో ఓ ఫోరెన్సిక్ నిపుణుడితోపాటు ఏడుగురు సభ్యులున్నారు. విచారణ ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం’’ – ప్రకాష్రెడ్డి, డీసీపీ -
జనాన్ని కొడతారా? రూ.50 వేలు కట్టండి
సాక్షి, బనశంకరి: తండ్రి, కుమారుడిని చితకబాదిన బెంగళూరు పోలీసులకు మానవహక్కుల కమిషన్ రూ.50 వేల జరిమానా విధించింది. వివరాలు.. ఇటీవల బాణసవాడిలో గ్యాస్ స్టౌ మరమ్మత్తులు చేస్తూ జీవనం సాగిస్తున్న తండ్రీ, కుమారున్ని బాణసవాడి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదారు. తనిఖీలు చేస్తున్న సమయంలో వారి వద్దనున్న ద్విచక్ర వాహనాల రికార్డులు అందించాలని ఎస్ఐ మురళి, హెడ్కానిస్టేబుల్ లోకేశ్ అడిగారు. ఒక వాహనం పత్రాలు అందించి, మరో వాహనం పత్రాలు అందించడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు తండ్రీ, కుమారుడిని పోలీస్స్టేషన్లోకి తీసుకెళ్లి ఇష్టానుసారం చితకబాదారు. దీంతో బాధితులు మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు మానవహక్కుల కమిషన్ ముందు వివరణ ఇస్తూ తండ్రీ, కుమారుడు తమ విధులకు అడ్డుపడటంతో చర్యలు తీసుకున్నామని తెలిపారు. కానీ పోలీసుల వాదనను తోసిపుచ్చిన మానవహక్కుల కమిషన్ చట్టప్రకారం చర్యలు తీసుకోవడం వదిలిపెట్టి ఇలా ఇష్టానుసారం కొడతారా? అని ఆగ్రహం వ్యక్తంచేసింది. శిక్షగా పోలీసులకు రూ.50 వేల జరిమానా విధించింది. -
షైన్ ఆస్పత్రి ఘటనపై విచారణ వేగవంతం
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్లోని షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిలో సోమవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో.. మంటల్లో చిక్కుకుని గాయపడ్డ ఇద్దరు చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ రవిందర్ నాయక్, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తనిఖీలు చేపట్టి.. ఆస్పత్రి సెల్లార్తో సహా నాలుగు అంతస్థులని క్షుణ్ణంగా పరిశీలించారు. షైన్ హాస్పిటల్లో జరిగిన ప్రమాదంపై విచారణను వేగవంతం చేసేందుకు ఇప్పటికే క్లూస్ టీంను రంగంలోకి దించారు. ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులు ఇప్పటికే హాస్పిటల్కు నోటీసులు జారీ చేశారు. షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిని నిర్వహిస్తున్న డాక్టర్ సునీల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి ప్రమాదంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ.. ప్రభుత్వ నిబంధనలకు ప్రకారం సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా అనే అంశాలను నివేదిక రూపంలో పొందుపర్చనుంది. అనంతరం ప్రభుత్వానికి తన రిపోర్ట్ను ఇవ్వనుంది. ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. జంటనగరాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రమాద ఘటన తరువాత గతేడాదితో ఆస్పత్రి పర్మిషన్ ముగిసిందని, ఆస్పత్రిలో ప్రమాదం జరిగినపుడు తక్షణమే పాటించాల్సిన నియంత్రణ వ్యవస్థే లేదని మానవ హక్కుల కమిషన్కు బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. భవనం అక్రమ కట్టడమని, అధికారుల నిర్లక్షం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పిటిషన్ దాఖలు చేశారు. ఒక చిన్నారి మృతికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని బాధితులకు వెంటనే న్యాయం చెయ్యాలనివారు కోరారు. -
ఈ మాస్టారు అలా వచ్చి.. ఇలా వెళ్తాడు
సాక్షి, పెనగలూరు(కడప) : రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్లతో నడుస్తుందన్న సామెతను పెనగలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నిజం చేస్తున్నారు. కళాశాలను నడిపించే వ్యక్తిగా ఉంటూ ప్రతి రోజూ 12గంటలకు రావడం 3 గంటలకు వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ప్రిన్సిపల్ నిర్వాహకం వల్ల కళాశాలలో క్రమశిక్షణారాహిత్యం లోపిం చే అవకాశాలు కూడా ఉన్నాయి.ఆలస్యంగా వస్తున్న ప్రిన్సిపల్ను సోమవారం ప్రపంచ మానవహక్కుల సంఘం పెనగలూరు మండల అధ్యక్షుడు ఎం. విశ్వనాథరెడ్డి ప్రశ్నిం చారు. రైలుకు వస్తాను... రైలుకే వెళ్తాను. నేనొచ్చేది అంతే... అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆయన సమాధానం చూస్తే కళాశాలలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రిజిష్టర్లో సంతకం చేసేందుకు మాత్రమే ఏదో ఒక సమయంలో వస్తున్నట్లు అర్థమైపోతోంది. ప్రిన్సిపల్ వ్యవహారశైలిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు విశ్వనాథరెడ్డి తెలిపారు. -
ఎన్హెచ్చార్సీ బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో మానవ హక్కులను అనుక్షణం పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రభుత్వం శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన మానవ హక్కుల పరిరక్షణ(సవరణ)బిల్లు –2019 బిల్లుకు సభ ఆమోదం లభించింది. ఈ సందర్భంగా హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ.. మానవ హక్కులను అనునిత్యం కాపాడేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామన్నారు. జాతీయ, రాష్ట్రాల మానవ హక్కుల సంఘాలకు మరిన్ని పరిపాలన, ఆర్థిక అధికారాలను కల్పించినట్లు తెలిపారు. ఈ బిల్లులో ప్రభుత్వం కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. ఎన్హెచ్చార్సీ తోపాటు రాష్ట్ర మానవ హక్కుల సంఘాల చైర్పర్సన్, సభ్యుల పదవీ కాలం ప్రస్తుతమున్న ఐదేళ్లకు బదులు ఇకపై మూడేళ్లకే పరిమితం కానుంది. ఎన్హెచ్చార్సీ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు రిటైర్డు ప్రధాన న్యాయమూర్తినే నియమించాలనే నిబంధనను ప్రభుత్వం సడలించింది. ఇకపై సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జినీ నియమించవచ్చని ప్రతిపాదించింది. జాతీయ మైనారిటీల కమిషన్ నుంచి ఎన్హెచ్చార్సీ చైర్పర్సన్ను నియమించాలన్న ఏఐఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్కు మంత్రి స్పందిస్తూ.. ఓబీసీ జాబితాలో మైనారిటీలను చేర్చే నిబంధన ఈ బిల్లులో ఉందన్నారు. అధికార పార్టీ ఎంపీలను ఎన్హెచ్చార్సీలో ఎందుకు నియమించాలని అనుకుంటున్నారని ఒవైసీ ప్రశ్నించారు. ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఒక వైపు శాంతి కావాలంటూనే ఎన్హెచ్చార్సీ ఆదేశాలను సవాల్ చేసే పరిస్థితులున్నాయని, ఈ బిల్లుపై సభలో మరోసారి మరింత చర్చ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం ఖూనీ కర్ణాటకలో చట్టసభ స్వతంత్రత ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని కాంగ్రెస్ శుక్రవారం లోక్సభలో ఆందోళనకు దిగింది. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం, అక్కడి పరిణామాలపై చర్చ జరగాలంటూ కాంగ్రెస్, డీఎంకే సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, న్యాయాన్ని కాపాడాలంటూ వారు నినాదాలు చేశారు. వారి డిమాండ్పై స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించారు. -
ఢిల్లీకి చేరిన ‘బిగ్బాస్’ వివాదం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రియాల్టీ షో ‘బిగ్బాస్-3’ వివాదం ఢిల్లీకి చేరింది. ఈ షో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ.. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించారు. రియాలిటీ షో పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. వెంటనే ఈ షో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దానికి సంబందించిన వీడియోను కూడా విడుదల చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదును కమిషన్ స్వీకరించిందని శ్వేతారెడ్డి పేర్కొన్నారు. హెచ్చార్సీకి ఫిర్యాదు చేసిన ఓయూ జేఏసీ బిగ్బాస్ షో ప్రసారాన్ని నిలివేయాలని కోరుతూ ఓయూ జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేసింది. రియాలిటీ షో పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో షోను రద్దు చేయాలని కోరారు. ఒకవేళ షో నిర్వహించాల్సి వస్తే.. మహిళలపై వేధింపులు, అసభ్యకరమైన సన్నివేశాలు లేవని నిరూపించిన తర్వాతే షో వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో షో నిర్వాహకుల కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా ఇప్పటికే ఈ షోపై శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ రియాలిటీ షోను నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ఇప్పటికే ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. బిగ్ బాస్ షో ప్రదర్శన వల్ల యువత చెడిపోతుందంటూ సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి తెలంగాణ హై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
హక్కుల పెద్దదిక్కు ఇకలేరు
-
హక్కుల పెద్దదిక్కు ఇకలేరు
సాక్షి, హైదరాబాద్: కేరళ, మద్రాసు హైకోర్టుల విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్, మాజీ లోకాయుక్త జస్టిస్ బొల్లంపల్లి సుభాషణ్రెడ్డి(76) కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన కేన్సర్తో బాధపడుతున్నారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఐసీయూలో ఉన్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. వీరిలో చంద్రసేన్రెడ్డి, విజయసేన్రెడ్డి హైకోర్టు న్యాయవాదులుగా పని చేస్తున్నారు. మరో కుమారుడు ఇంద్రసేన్రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్. బుధవారం మధ్యాహ్నానికి ఖైరతాబాద్ అవంతినగర్లోని స్వగృహానికి జస్టిస్ సుభాషణ్రెడ్డి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, తెలంగాణ మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు అధికారులు సుభాషణ్రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు చంద్రసేన్రెడ్డి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్తో పాటు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు చవాన్, రాజశేఖర్రెడ్డి, సంజయ్కుమార్, ప్రవీణ్కుమార్, ప్రత్యేక జీపీ రాంచందర్రావు, మాజీ న్యాయయూర్తి జస్టిస్ చంద్రయ్య, నర్సింహ్మారెడ్డి, జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాశ్రెడ్డి, మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మర్రి శశిధర్రెడ్డి, సమరసింహారెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, గుత్తా సుఖేందర్రెడ్డి, జంగారెడ్డి, మాజీ డీజీపీ అనురాగ్శర్మ, నిథమ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ చిన్నంరెడ్డి, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, ప్రొటోకాల్ అధికారి చంద్రకళతో పాటు పెద్ద సంఖ్యలో విశ్రాంత న్యాయమూర్తులు, అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సుభాషణ్రెడ్డి బావమరిది జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు. జస్టిస్ సుభాషణ్రెడ్డి ప్రస్థానం... 1943, మార్చి 2న హైదరాబాద్ బాగ్ అంబర్పేట్లో జస్టిస్ సుభాషణ్రెడ్డి జన్మించారు. సుల్తాన్బజార్, చాదర్ఘాట్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. 1966లో హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అనతి కాలంలోనే రాజ్యాంగం, సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్ వ్యవహారాల్లో పట్టు సాధించారు. కొంత కాలం సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేశారు. 1991, నవంబర్ 25న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2001, సెప్టెంబర్ 21న మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2004లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2005, మార్చి 2న పదవీ విరమణ చేశారు. న్యాయమూర్తిగా ఆయన ఎన్నో గొప్ప తీర్పులిచ్చారు. చట్టం కోణంలో కన్నా మానవీయ కోణంలో ఆలోచించి తీర్పులిచ్చే వారని పేరు పొందారు. తల్లడిల్లిన 104 సంవత్సరాల ఆగారెడ్డి కుమారుడు జస్టిస్ సుభాషణ్రెడ్డి మృతదేహాన్ని చూడగానే, ఆయన తండ్రి ఆగారెడ్డి బోరున విలపించారు. దీంతో అక్కడున్న వారికి కన్నీరు ఆగలేదు. ఆగారెడ్డి వయస్సు 104 సంవత్సరాలు. ఈయన కుటుంబంలో పూర్వీకులు చాలా మంది 100 సంవత్సరాలకు పైగా బతికిన వారే. 2016లో జస్టిస్ సుభాషణ్రెడ్డి దగ్గరుండి తన తండ్రి ఆగారెడ్డి 100వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళకళలాడిన హక్కుల కమిషన్... దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జస్టిస్ సుభాషణ్రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్పర్సన్గా వ్యవహరించారు. 2005 నుంచి 2010 వరకు ఈ పదవిలో ఆయన కొనసాగారు. ఈ పోస్టులో ఉన్నంత వరకు ఆయన హెచ్ఆర్సీకి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. హక్కులకు పెద్ద దిక్కయ్యారు. జస్టిస్ సుభాషణ్రెడ్డి చైర్పర్సన్గా ఉన్నంత వరకు హెచ్ఆర్సీ కళకళలాడింది. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు దాఖలయ్యేవి. పోలీసులకు ఆదేశాలు జారీ చేసి కమిషన్ ఆదేశాలు అమలు చేసేలా చూసేవారు. కమిషన్ను ఆయన ఎంత క్రియాశీలకంగా చేశారంటే, మానవ హక్కుల కమిషన్ వద్దని పోలీసులు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేంతగా. జస్టిస్ సుభాషణ్ రెడ్డి చైర్మన్గా పనిచేసిన సమయంలో అధికంగా సుమోటో కేసులే ఎక్కువగా ఉండేవి. పలువురి సంతాపం... జస్టిస్ సుభాషణ్రెడ్డి ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేతలు సురవరం సుధాకర్రెడ్డి, కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, తెలంగాణ రైతు సంఘం (సీపీఐ) ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, రైతు సంఘం నాయకురాలు లతా జైన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఉద్యోగులు జస్టిస్ సుభాషణ్ రెడ్డికి నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఉనికి కోల్పోయిన కమిషన్... జస్టిస్ సుభాషణ్రెడ్డి పదవీ కాలం ముగిసిన తరువాత మానవ హక్కుల కమిషన్ దాదాపుగా ఉనికిని కోల్పోయింది. తర్వాత వచ్చిన చైర్పర్సన్ సుభాషణ్రెడ్డి స్థాయిలో పనిచేయలేకపోయారు. 2012లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులయ్యారు. రాష్ట్ర విభజన తరువాత కూడా ఆయన ఆ పోస్టులోనే కొనసాగారు. అక్కడ కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. లోకాయుక్తకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చేయడంలో విజయం సాధించారు. అనేక కేసుల్లో కీలక ఆదేశాలు జారీ చేశారు. తన ఆదేశాలతో అధికారులను ఉరుకులు పెట్టించేవారు. పేదల కోసం ఎంత దూరమైనా వెళ్లి ఉత్తర్వులు ఇచ్చేవారు. ఫిరంగినాలా ఆక్రమణల తొలగింపునకు ఆదేశాలిచ్చారు. బాల్య వివాహాల నిరోధానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వివాహ రిజిస్ట్రేషన్ అమలుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ట్యాంక్బండ్పై ఓ యువతి మృతి చెందిన ఘటనపై తీవ్రంగా స్పందించి, పరిహారం దక్కేలా చేశారు. ఆయన జోక్యంతోనే ట్యాంక్బండ్ వాహనాల వేగానికి కళ్లెం వేస్తూ పోలీసులు చర్యలు తీసుకున్నారు. జస్టిస్ సుభాషణ్రెడ్డి హయాం ఓ స్వర్ణయుగం... హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభాషణ్రెడ్డి ఉన్న కాలం యువ న్యాయవాదులకు స్వర్ణయుగంగా చెబుతారు. అంతలా ఆయన యువ న్యాయవాదులను ప్రోత్సహించేవారు. సీనియర్ న్యాయవాదులకన్నా యువ న్యాయవాదులకే ఆయన ఎక్కువ ఆర్డర్లు ఇచ్చేశారు. వారు వాదనలు చెబుతున్నంత సేపు ఓపిగ్గా వినేవారు. తప్పు చెబితే వాటిని సరిదిద్దే వారే తప్ప, ఎన్నడూ వారిపై కోపం ప్రదర్శించే వారు కాదంటూ హైకోర్టు సీనియర్ న్యాయవాదులు పలువురు జస్టిస్ సుభాషణ్రెడ్డిని గుర్తు చేసుకున్నారు. అటు సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులతో ఎప్పుడూ మంచి సంబంధాలు కొనసాగించారు. ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించారు. అలాగే సాయం కోసం వచ్చిన వారికి ఏదో ఒక రీతిలో సాయం చేసి పంపేవారు. మానవ హక్కుల చైర్మన్గా ఉన్నా, లోకాయుక్తగా వ్యవహరించినా.. ఆయన తనకే సొంతమైన ఈ పంథాను విడిచిపెట్టలేదు. -
భూములివ్వలేదని పంటలు తగలెట్టేశారయ్యా!
సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాలను రాజధానిగా మారుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించగానే.. ఈ ప్రాంతంలో అలజడి రేగింది. మూడు పంటలు పండే భూములను రాజధానికి ఇచ్చేది లేదని ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. భూములను ఎలాగైనా లాక్కునేందుకు అధికార పార్టీకి చెందిన కొందరి సూచనలతో దుండగులు రంగంలోకి దిగారు. 2014 డిసెంబర్ 29న అర్ధరాత్రి వేళ ఐదు గ్రామాల్లోని పచ్చని పంట పొలాల ను అగ్నికి ఆహుతి చేశారు. అరటి గెలలు, చెరకు గడలు కాలి బూడిదయ్యాయి. గడ్డి వాములు, పందిళ్లు, బొంగులు భస్మీపటలమయ్యాయి. ఘటన జరిగిన వెంటనే మంత్రులు రంగంలోకి దిగారు. దీనికి కారకులు వైఎస్సార్ సీపీ నేతలే అంటూ విమర్శలు చేశారు. అనుమానితుల పేరుతో ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో సుమారు వంద మంది, తుళ్లూరు మండల పరిధిలోని మందడం, వెంకటపాలెం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం గ్రామాల్లోని 70 మంది రైతులు, యువకులు, కూలీలను విచారించారు. కొంతమంది యువకులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసకు గురి చేశారు. ఘటనకు బాధ్యులు తామేనని ఒప్పుకోవాలని, లేకుంటే వైఎస్సార్ సీపీ నేతల సూచనతోనే పంటలు తగలబెట్టినట్టు చెప్పాలని ఒత్తిడి చేశారు. బాధితులు మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించడంతో 15 రోజుల చిత్రహింసల తర్వాత పోలీసులు వారిని విడిచిపెట్టారు. పంటలు తగలబెట్టించుకుంది రైతులేనని వితండ వాదానికి అధికార పార్టీ నేతలు దిగడం గమనార్హం. బాధిత రైతుల్లో కొందరిని ‘సాక్షి’ రచ్చబండ వేదిక పలకరించగా.. ‘ఆ రోజు అర్ధరాత్రి దుండగులు చెలరేగిపోయారయ్యా. పంటల్ని తగలెట్టేశారు. గడ్డివాములు, పందిళ్లు, బొంగులను కూడా మిగల్చలేదు. మమ్మల్ని వేధించారు. మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకోవడంతో మేం బతికి బట్టకట్టాం’ అంటూ ఆనాటి విషాదాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నాలుగేళ్ల పాటు విచారణ జరిపిన పోలీసులు తాడేపల్లి పరిధిలో ఆధారాలేవీ తాము సేకరించలేకపోయామని చేతులెత్తేశారు. కేసు మూసేస్తున్నట్టు మాకు నోటీసులు అందజేశారు. నాలుగేళ్లపాటు వందల మంది అమాయకులను విచారణ పేరుతో ఉక్కిరిబిక్కిరి చేసిన పోలీసులు నిందితులను పట్టుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి. దీని వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారనే కదా’ అంటూ పలువురు ప్రశ్నించారు. 15 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పారు నా అరటి తోటలోని వెదురు బొంగులకు అర్ధరాత్రి వేళ నిప్పుపెట్టారు. విచారణ పేరుతో నన్ను 15 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పారు. ప్రశాంతంగా ఉన్న మా గ్రామంలో 144 సెక్షన్, పోలీస్ ఔట్ పోస్టులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేశారు. నాలుగేళ్ల పాటు విచారణ చేసిన పోలీసులు ఇప్పుడు నిందితులను కనిపెట్టలేకపోయామంటున్నారు. అందుకే కేసు మూసేస్తున్నామని నోటీసులు ఇచ్చారు. ఇన్నేళ్లపాటు విచారణ సాగించి ఇప్పుడు నిందితులను పట్టుకోలేకపోయామని చెప్పటం సిగ్గుచేటు కాదా. – మల్లికార్జునరెడ్డి, బాధిత రైతు, ఉండవల్లి కాల్ డేటా అన్నారు భూములు తగులబెట్టిన సమయంలో ఈ ప్రాం తంలో ఉపయోగించిన సెల్ఫోన్ కాల్ డేటా ఆధారంగా రైతులను పోలీస్ స్టేషన్కు తీసుకె ళ్లారు. రైతుల కాలిముద్రలు సేకరించారు. కేసును నాలుగేళ్ల పాటు విచారించి తీరిగ్గా నిందితులను పట్టుకోలేకపోయామనే కారణంతో కేసు క్లోజ్ చేశారు. ఈ ఘటన తర్వాత రైతులంతా భయంతో భూములిచ్చారు. పోలవరం, రాజధాని యాత్రల పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్న సీఎం చంద్రబాబు... రైతులకు ఇచ్చిన ప్లాట్లకు మాత్రం టెండర్లు పిలవలేదు. పూలింగ్ తీసుకున్న రైతులంతా నష్టపోయారే తప్ప ఎవరూ బాగుపడలేదు. – మేకా కోటిరెడ్డి, రైతు, పెనుమాక -
హెచ్ఆర్సీకి నటి శ్రీరెడ్డి ఫిర్యాదు
పెరంబూరు: నటి శ్రీరెడ్డి, నిర్మాత రవిదేవన్తో కలిసి మంగళవారం చెన్నైలోని మానవ హక్కుల సంఘంలో ఒక ఫిర్యాదు చేసింది. తెలుగు నటి శ్రీరెడ్డి ఆ మధ్య టాలీవుడ్లో ప్రకంపనలు పుట్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇటీవల చెన్నైలో మకాం పెట్టింది. అంతే కాదు రెడ్డి డైరీ పేరుతో ఆమె బయోపిక్గా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో తనే ప్రధాన పాత్రను పోషిస్తోంది. కాగా కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర ఫైనాన్సియర్ సుబ్రమణి, మరో వ్యక్తి తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక కోయంబేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఆ తరువాత ఆ కేసును తను వెనక్కి తీసుకోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తానా కేసును వెనక్కి తీసుకోవడానికి కారణాన్ని శ్రీరెడ్డి ఇటీవల మీడియా ముందుకు వచ్చి వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంచలన నటి మంగళవారం చెన్నైలోని మానవహక్కుల సంఘంలో తనకు జరిగిన మానవహక్కుల అతిక్రమణ గురించి ఫిర్యాదు చేసింది. అనంతరం శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను రెడ్డి డైరీ చిత్ర షూటింగ్ కోసం చెన్నైకి వచ్చానని చెప్పింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రెడ్డి డైరీ చిత్రాన్ని అనుకున్న టైమ్లో పూర్తి చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పింది. దీంతో వారం రోజులుగా చిత్ర షూటింగ్ నిలిచిపోయ్యిందని తెలిపింది. దీంతో చిత్ర నిర్మాత, ఇతర యూనిట్ వర్గాలకు తీవ్ర నష్టం కలిగిందని చెప్పింది. అందువల్లే తాను ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేసినట్లు శ్రీరెడ్డి పేర్కొంది. -
వైఎస్సార్సీపీలో చేరినందుకు బహిష్కరణ
తిరుపతి రూరల్/చంద్రగిరి: దళితులను ఉద్దేశించి పిచ్చముం..కొడకల్లారా, మీకు ఎందుకురా రాజకీయాలు అంటూ ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే చేసిన వాఖ్యలు, వాడిన అసభ్యకర పదజాలం, కించపరిచిన విధానం చూశాం. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యాలను మనం విన్నాం. దళితులకు పరిశుభ్రతే తెలియదంటూ అగౌరవపరిచిన మంత్రి మాటాలనూ విన్నాం. అన్ని పోస్టుల్లోనూ తన సామాజికవర్గం మనుషులే ఉండాలనుకుంటున్న ముఖ్యమంత్రి పరిపాలనను చూస్తున్నాం. నేడు మన కులంవాళ్లు వేరే పార్టీలో ఉంటారా? అది మన కులం కట్టుబాట్లకు వ్యతిరేకం అంటూ కుల దురహంకారులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగళిపట్టు గ్రామానికి చెందిన జాగర్లమూడి దామోదర్ నాయుడు, ఆయన భార్య భారతి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దామోదర్ నాయుడు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో గ్రామంలో అదే సామాజికవర్గానికి చెందిన కొందరు వ్యక్తులు రచ్చబండ వద్ద పంచాయితీ పెట్టారు. ‘‘మన కులపోళ్లు వేరే పార్టీలోకి వెళ్తారా? మన కులానికి చెందిన పార్టీలో తప్ప ఇంకో పార్టీలోకి వెళ్తే గ్రామ బహిష్కరణ తప్పదు’’ అంటూ హెచ్చరించారు. ‘‘నేను, నాతోపాటు మీరు ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో రుణమాఫీతో ప్రయోజనం పొందాం. తుడా చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మన ఊరంతా సిమెంట్ రోడ్లు వేయించినప్పుడు కులం గుర్తుకురాలేదా? రుణమాఫీ చేసుకున్నప్పుడు కులం గుర్తుకు రాలేదా? మంచి పనులు చేయించుకున్నప్పుడు రాని కులం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇదేక్కడి న్యాయం? ఇవేం కట్టుబాట్లు’’ అని దామోదర్నాయుడు ప్రశ్నించారు. దాంతో మరింత కోపోద్రిక్తులైన కుల దురంహకారులు దాడికి తెగబడ్డారు. దామోదర్నాయుడు, ఆయన భార్య, పిల్లలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇంట్లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. తర్వాత వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తూ కులపెద్దలు హుకుం జారీ చేశారు. రేషన్ సరుకులు కట్ చేయాలని, తాగునీరు సైతం సరఫరా చేయకూడదని, మన కులపోళ్లు ఎవరూ వారితో మాట్లాడకూడదని, ఎవరైనా మాట్లాడితే ఇదే శిక్ష తప్పదని హెచ్చరించారు. మేలు చేసిన వారికి కృతజ్ఞతగా ఉంటే తప్పేంటి అన్నందుకు దామోదర్ నాయుడు కుటుంబానికి రూ.4,000 అపరాధం విధించారు. బాధితులపై పోలీసుల తిట్ల పురాణం తమపై దాడి చేసి, గ్రామం నుంచి బహిష్కరించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దామోదర్నాయుడు కుటుంబ సభ్యులు బుధవారం చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని ప్రాధేయపడ్డారు. పోలీసులను తీసుకుని గ్రామానికి వెళ్లారు. మార్గమధ్యంలో పోలీసులకు అధికార పార్టీ నేతల నుంచి ఫోన్కాల్స్ రావడంతో వారు యూటర్న్ తీసుకున్నారు. ‘‘రెండు నెలలపాటు గ్రామం వదిలిపోతే తప్పేంట్రా నా కొ....ల్లారా’’ అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. ఒకవైపు కులదురంహకారుల దాడి, గ్రామ బహిష్కరణ, మరోవైపు పోలీసుల తిట్లతో భయకంపితులైన దామోదర్నాయుడు కుటుంబం తమను ఆదుకోవాలంటూ చంద్రబాబు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఆశ్రయించింది. వెంటనే కేంద్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిద్దామని, మీకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పార్టీల పేరుతో కుల బహిష్కరణలు, గ్రామ బహిష్కరణలు, జరిమానా విధించడం వంటి ఘటనలపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు రక్షణ కల్పించిన పోలీసులు వారినే బెదిరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పిల్లలు పుట్టడం లేదని భార్యను..
సాక్షి, వైఎస్సార్: కడపలో అమానుషం చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని గౌసియా అనే మహిళను ఆమె భర్త ఇంట్లో బంధించాడు. గౌసియాకు ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు పిల్లలు పట్టకపోవడంతో భర్త మరో వివాహం కూడా చేసుకున్నాడు. తన మొదటి భార్య గురించి ఎవ్వరికీ తెలియకూడదని బూత్ బంగ్లా లాంటి ఇంట్లో ఒంటరిగా బంధించాడు. భర్త బంధించడంతో గతకొద్ది రోజులుగా ఆమె చీకటి జీవితం అనుభవిస్తోంది. విషయం తెలుసుకున్న గౌసియా కుటుంబ సభ్యులు మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. రంగ ప్రవేశం చేసిన అధికారులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
సోషల్ మీడియా బాధితులకోసం ప్రత్యేక వెబ్సైట్
హిమాయత్నగర్: సోషల్ మీడియాలో ప్రముఖులు, సామాన్యులపై వస్తున్న దుష్ప్రచారంపై ‘హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సౌత్ రీజన్ తీవ్రంగా స్పందించింది. ఇటీవల ప్రముఖలను టార్గెట్ చేస్తూ వారిపై ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరగడం, బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం బాధగా ఉందని సౌత్రీజన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జి.అనూహ్యరెడ్డి అన్నారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారాలతో ప్రముఖులు వార్తల్లోకి ఎక్కడంతో పాటు వారి వ్యక్తిగత జీవితం సర్వనాశనం అవుతుందన్నారు. బాధితులను సంఘటితం చేస్తూ ఇలాంటి దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా సౌత్ఇండియాలో ఓ వైబ్సైట్ను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ సమస్యను అప్లోడ్ చేస్తే తమకు నేరుగా మెసేజ్ అందుతుందన్నారు. బాధితులతో అప్పటికప్పుడు మాట్లాడి, వివరాలు తెలుసుకుని సమీపంలోని పోలీసు స్టేషన్కు అనుసంధానం చేస్తామన్నారు. ప్రతి గ్రామంలోనూ తమ వాలంటీర్లు ఉన్నారని వారు బాధితుల సమస్యలపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అన్యాయం జరుగుతున్న చోట ‘హూమన్ రైట్స్’ నుంచి భరోసా కల్పిస్తారన్నారు. -
హక్కులపై సర్కారు సవారీ!
సాక్షి, అమరావతి: - అనంతపురం జిల్లా వన్నంపల్లిలో గుడి ప్రవేశం కోరిన దళితులపై దాడి చేసి సాంఘిక బహిష్కరణ చేశారు. - కర్నూలు జిల్లాలోని నక్కలదిండిలో కొందరు పెద్దలు చెప్పిన పని చేయలేదనే ఉక్రోషంతో దళితులపై దుర్భాషలాడి దౌర్జన్యం చేశారు. - నిక్కచ్ఛిగా విధుల నిర్వహణ చేయాలనుకునే అధికారులపైనా అధికారపార్టీ నేతలు దాడులకు వెనుకాడటంలేదు. - సమస్యలపై ప్రజలు శాంతియుతంగా ఉద్యమిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. ఆపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. - రాజధానిలో తమ భూములను ప్రభుత్వం లాక్కునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేసినా, గిట్టుబాటు ధరల కోసం విజ్ఞప్తులు చేసినా, ఉద్యోగాల కోసం, భృతి కోసం నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. ఇలా చెప్పుకుంటే పోతే రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ప్రభుత్వమే మానవ హక్కులపై ఉక్కుపాదం మోపేలా సవారీ చేస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన మానవ హక్కుల పరిరక్షణకు కనీసం రాష్ట్రస్థాయిలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలనే ధ్యాస కూడా చంద్రబాబు సర్కారుకు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, బాధితులు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజాసంఘాలు, దళితులు ఇలా ఎవరైనా సరే హక్కుల కోసం గళమెత్తితే తీవ్ర నిర్భందం అమలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా ఉద్యమించే ప్రతిపక్షాల గొంతు నొక్కేలా గృహనిర్భందాలు, ముందస్తు అరెస్టులతో ప్రభుత్వం హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. రాష్ట్రంలో పెరుగుతున్న హక్కుల ఉల్లంఘనలు హక్కుల ఉల్లంఘన కేసులు దేశ వాప్తంగా తగ్గుతుంటే ఏపీలో మాత్రం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 2016లో 96,627 కేసులు, 2017లో 82,006, 2018(ఇప్పటి వరకు) 72,482 కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2016లో 1,335 కేసులు, 2017లో 2,635, 2018(ఇప్పటి వరకు) దాదాపు మూడు వేలకుపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘనలో 2016లో దేశంలో రాష్ట్రం 13వ స్థానంలో ఉంటే ఈ ఏడాది అది మరింత దిగజారి తొలి ఐదు స్థానాల్లో ఉన్నా ఆశ్చర్యం లేదని మావన హక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ గడిచిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుపై చంద్రబాబు ప్రభుత్వం కనీస చొరవ చూపడంలేదని విమర్శిన్నారు. హక్కులకు భంగం కలిగించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయలేకపోతోందని మానవ హక్కుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మౌలాలీ ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో కమిషన్ ఏర్పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2006 ఆగస్టు 2న ఏపీ హక్కుల కమిషన్ ఏర్పాటు చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కమిషన్ జోక్యంతో ప్రజల హక్కులకు రక్షణ కలుగుతోంది. అందుకే ఈ హక్కుల కమిషన్ ప్రజల నుంచి సత్వర న్యాయసేవా కేంద్రం, సామాన్యుడి న్యాయ కేంద్రంగా మన్ననలు అందుకుంది. అలాంటి కీలకమైన కమిషన్ నియామక విషయమై ముఖ్యమంత్రి చైర్మన్గా, అసెంబ్లీ ప్రతిపక్ష నేత, మండలి ప్రతిపక్ష నేత, సీనియర్ మంత్రి, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ సభ్యులుగా ఉండే హైపవర్ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ను చైర్మన్గాను, మరో ఇద్దరు సభ్యులతో కలిపి హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 పదో షెడ్యూల్లో మానవ హక్కుల కమిషన్ను 2015 మే నెలలో చేర్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరుగా వాటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అయితే ఏపీలో ఆ దిశగా ప్రయత్నాలు పూర్తికాకపోవడంతో హైదరాబాద్లోని కమిషన్నే ఏపీ వాసులు వినియోగించుకోవాల్సి వస్తోంది. 2017 మే నెలలో సమావేశం నిర్వహించిన ప్రభుత్వం అమరావతి వేదికగా మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు గెజిట్ ప్రకటించింది. అయితే ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో రాష్ట్రంలో పేరుకుపోతున్న వేల ఫిర్యాదుల్లో బాధితులు న్యాయం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది. సోమవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో రాష్ట్రంలో మానవ హక్కులపై జరుగుతున్న దాడిని ప్రభుత్వం ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. -
గుంటూరు ఘటనపై నివేదిక కోరిన హెచ్చార్సీ
హైదరాబాద్: గుంటూరు బి.ఆర్.స్టేడియంలో ఆగస్టు 28న ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ప్లకార్డులు ప్రదర్శించిన తొమ్మిది మంది యువకులపై జరిగిన హింసాత్మక సంఘటనలపై సమగ్ర నివేదికను అందజేయాలంటూ గుంటూరు అర్బన్ ఎస్పీకి మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదస్సులో తమ నిరసనను శాంతియుతంగా తెలియజేసిన వారిపై కక్ష సాధింపు పద్ధతిలో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆ యువకులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్.ఎ.రెహమాన్ గత నెల 31వ తేదీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ కేసును మంగళవారం హెచ్చార్సీ విచారణకు స్వీకరించింది. కేసు విచారణను అక్టోబరు 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం హెచ్.ఎ.రెహమాన్ మాట్లాడుతూ సదస్సులో మైనార్టీల కోసం సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపిస్తారని తొలుత అంతా ఆశించారన్నారు. అయితే ఆయన ప్రసంగంలో కొత్తదనం లేకపోవడంతో మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సభలో ప్లకార్డులు ప్రదర్శించారన్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన సీఎం అందుకు విరుద్ధంగా పోలీసులను ప్రయోగించి వారిని సభ నుంచి తీసుకెళ్లి చిత్ర హింసలకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముస్లింల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని, ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని రెహమాన్ హెచ్చరించారు. సభలో నిరసన చేస్తే తప్పా సభలో హక్కులను కాలరాస్తున్నారని ప్లకార్డులతో నిరసన తెలియజేస్తే తప్పా.? అని ఏపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా ప్రశ్నించారు. పార్లమెంటులో మీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలపలేదా.? మరి వారిని అరెస్టు చేసి కేసులు పెట్టలేదే అన్నారు. విజయవాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ ఎస్కె.మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను టీడీపీ చిన్నచూపు చూస్తోందన్నారు. బాధిత యువకులను పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. హెచ్.ఎ.రెహమాన్ తో పాటు విజయవాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ ఎస్కె.మహ్మద్ ఇక్బాల్, రాష్ట్ర నేతలు మహ్మద్ ఇసాక్, విజయవాడ అధ్యయన కమిటీ నిర్వాహకులు ఎం.ఎస్.బేగ్, కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి హఫీజ్ ఖాన్, నంద్యాల నియోజకవర్గం ఇన్ఛార్జి రవి శిల్పా ఉన్నారు. -
చంద్రబాబుపై మనవ హక్కుల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు
-
శభాష్..రాజేష్
హిమాయత్నగర్: రాత్రి పది గంటల సమయంలో రోడ్డుపై ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటుంటే కానిస్టేబుల్ ఓ వ్యక్తిని చితకబాదాడు. దీనిపై మానవహక్కుల పరిశీలకుల సంఘం(హ్యూమన్ రైట్స్) డైరెక్టర్ కటికాల రాజేష్ స్పందించి కానిస్టేబుల్ సస్పైండ్ అయ్యేలా కృషి చేశాడు. పసిబిడ్డ ఊపిరాడక చనిపోయే స్థితిలో ఉందని రక్షించాలని ఓ కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించిన ఆ తల్లిదండ్రులకు చిక్కులు ఎదురయ్యాయి. మిషన్ వాడకుండానే పసిబిడ్డ కన్నుమూసింది.అయితే మీ పాప కోసమే మిషన్ తెచ్చామంటూ రూ.5లక్షలు బలవంతంగా దోచుకుని బిడ్డ శవాన్ని ఇచ్చారు. ఈ విషయంలో రాజేష్ చొరవ చూపి కన్నీటి పర్యంతంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు అండగా నిలిచి హాస్పిటల్ యాజమాన్యం దోచుకున్న ఆ రూ.5లక్షలు తిరిగి ఇప్పించాడు. కంటికి కనిపించే ఈ రెండు ఘటనలు ఉదాహరణలు మాత్రమే. ఇటువంటి పదుల సంఖ్యలో తనవంత బాధ్యతగా పరిష్కరిస్తూ అమాయక ప్రజలు, బాధితులకు అండగా నిలుస్తున్నాడు రాజేష్. ఖమ్మంలోని శ్రీనగర్కు కాలనీకి చెందిన కృష్టఫర్బాబు, జ్యోతిల కుమారుడు రాజేష్. తండ్రి ఖమ్మంలోని ఓ కాలేజ్లో ఫిజికల్ డైరెక్టర్గా చేస్తుండగా, తల్లి జ్యోతి గృహిణి. వీరు 30 ఏళ్ల క్రితం మాదాపూర్లో స్థిరపడ్డారు. రాజేష్ సాగర్రోడ్డులోని రాజమహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ను పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి సేవ చేయాలనే ఆలోచనతో ఉన్న రాజేష్ ఏడేళ్ల క్రితం మానవహక్కుల పరిశీలకుల సంఘం డైరెక్టర్గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని వద్దకు వస్తున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఓ వైపు ట్రాన్స్పోర్ట్ బిజినెస్గా చేస్తూ హ్యూమన్రైట్స్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. సొంతడబ్బులతో సమస్యలు పరిష్కరిస్తూ, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. వందల కొద్దీ సమస్యలు రోజుకు పదుల సంఖ్యలో సమస్యలు. ఆ సమస్యలు పరిష్కరించాలి అంటే చాలా ఓపిక కావాలి. పోలీస్ శాఖకు చెందిన సమస్యలపై ఉన్నత అధికారులతో ఒకటికి రెండు సార్లు సంప్రదించి వారి సూచనలతో సమస్యలను పరిష్కరిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం యూసఫ్గూడ చెక్పోస్ట్ వద్ద రాత్రి 10గంటల సమయంలో ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. ‘ఏంట్రా ఇక్కడ మీరు ఈ టైంలో ఉన్నారంటూ ప్రశ్నించాడో కానిస్టేబుల్. ఏమీ లేదు సర్, ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నానంటూ రవి అనే వ్యక్తి బదులిచ్చారు. నాకే ఎదురు సమాధానం చెబుతావా అంటూ అందరూ చూస్తుండగానే రవిని కానిస్టేబుల్ కొట్టాడు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతూ హ్యూమన్ రైట్స్ రాజేష్ను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి న్యాయం చేసేవరకు రాజేష్ నిద్రపోలేదు. ఇలా అనేక సమస్యలను పరిష్కరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు రాజేష్. ఇంకా అనేక సేవలు... నగరంలోని దేవాలయల వద్ద ఆకలితో అలమటిస్తున్న వారిని చేరదీస్తాడు రాజేష్. సమీపంలోని హోటల్కు తీసికెళ్లి వారికి కడుపునిండా అన్నం పెట్టిస్తాడు. మంచి బట్టలు కొనుక్కోమని డబ్బులు కూడా ఇస్తాడు. ఇటువంటి వారికి ఓ ఆదరణ, గూడు కల్పించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నట్లు రాజేష్ వివరించారు. నగరంలోని పలు కూడళ్ల వద్ద బిచ్చమెత్తుకునే వారికి, రోడ్లపై రాత్రి సమయంలో నిద్రపోయే వారికి దుప్పట్లు, ఆహార పొట్లాలు పంచడం రాజేష్ ఆనవాయితీగా మలుచుకున్నాడు. పరిష్కరించే వరకు నిద్రపట్టదు మానవహక్కుల పరిశీలకుల సంఘం డైరెక్టర్గా నా వద్దకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నాను. బాధితులు మా వద్దకు ఎంతో ఆశతో వస్తారు. వారితో మాట్లాడి వారికి ఏ ఇబ్బంది కలగకుండా సమస్య పరిష్కానికి కష్టపడుతున్నాను. ఎవ్వరి ఏ ఇబ్బంది ఉన్నా..కార్యాలయానికి వచ్చి నేరుగా సంప్రదించవచ్చు.– కటికాల రాజేష్, మానవహక్కులపరిశీలకుల సంఘం డైరెక్టర్ -
హెచ్చార్సీల ఏర్పాటుపై మీ వైఖరేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీలో మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటు చేయకపోవడంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మానవ హక్కుల కమిషన్ల ఏర్పాటు పై వైఖరి తెలియజేయలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం కేంద్రం, ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలకు నోటీసులిచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హెచ్చార్సీ ఏర్పాటు చేయకపోవడంతో పౌరుల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు బాధితులు న్యాయం పొందలేకపోతున్నారని జమ్ముల చౌదరయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. 2 రాష్ట్రాల్లో యాథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీలోని పురుషోత్తపట్నం ప్రాజెక్టు నిర్వాసితుల హక్కులకు భంగం వాటిల్లుతోందని, రైతులపై పోలీసులు దాడులకు పాల్పడిన ఘటనలను ఈ సందర్భంగా పిటిషనర్ కోర్టుకు వివరించారు. -
పసిడి పురి...ఊపిరి పీల్చుకో
గ్యాంగ్స్టర్ సునీల్ పేరు చెబితే.. ప్రొద్దుటూరు వాసులు గడగడలాడే వారు... ఇక ఆయన నుంచి ఫోన్ వచ్చిందంటే వణికిపోయే వారు... ఎందుకంటే అతడి అరాచకాలు అలా ఉండేవి... డబ్బు కోసం శ్రీమంతుల్ని బెదిరించేవాడు... ఇవ్వకపోతే వారి కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసే వాడు... అప్పటికీ ఇవ్వని పక్షంలో చంపేసే వాడు... దీంతో చాలా మందికి కంటి మీద కునుకు ఉండేది కాదు... ఈ క్రమంలో సునీల్ చనిపోవడంతో వారంతా ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రొద్దుటూరు క్రైం : రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో సునీల్.. పేరు మోసిన నేరస్తుడు. అతను ఇంటర్మీడియట్ను మధ్యలో వదిలేశాడు. జులాయిగా తిరిగే యువకులతో బ్యాచ్ ఏర్పాటు చేసుకుని.. పెద్ద నెట్వర్క్ నడిపాడు. మారుమూల గ్రామం నుంచి జిల్లా కేంద్రం వరకు ప్రతి చోట తన అనుచరులను ఏర్పాటు చేసుకున్నాడు. మధ్యలో చదువు మానేసిన వారే ఎక్కువగా ఉండే వారు. మందు, బిరియాని, ఖరీదైన వస్తువులను కొనిస్తూ వారిని ఆకర్షించాడు. ముఖ్య అనుచరులైన వారిని హైదరాబాద్కు తీసుకెళ్లి సినీ రంగుల ప్రంపంచాన్ని కూడా చూపించాడు. ఇలా యువకులను ఆయుధంగా చేసుకొని సునీల్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. యువకులే ఆయుధంగా.. ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన మండ్ల వెంకట సునీల్కుమార్ తల్లి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. తండ్రి, చెల్లెలు ఉన్నారు. సునీల్ కొన్ని నెలలు ఆటో డ్రైవర్గా పని చేశాడు. ఆటో నడుపుకునే సమయంలోనే ఎర్రచందనం స్మగ్లర్లతో పరిచయం ఏర్పడింది. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కొన్ని సార్లు పోలీసులకు దొరికాడు. స్టేషన్కు వెళ్లడం.. బయటికి రావడం షరామామూలే అయింది. కొందరు పోలీసు అధికారులు, సిబ్బందికి లంచాలు ఇచ్చి.. వారి నుంచి సహకారం పొందే వాడు. క్రమేణ కిడ్నాప్లకు శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలోనే ఇంజినీరింగ్, డిగ్రీ చదువుతున్న, మానేసిన యువకులను చేరదీశాడు. వీరి ద్వారా కిడ్నాప్లు చేయడం ప్రారంభించాడు. ప్రొద్దుటూరులోనే 50 మంది దాకా అనుచరులను ఏర్పరుచుకున్నాడు. సీమ వ్యాప్తంగా స్థానికంగా ఉన్న బ్యాచ్లతో పరిచయాలు పెంచుకుని.. వారిని తన గ్యాంగ్లో కలుపుకొన్నాడు. ఇలా దాదాపు 400 మందితో తన గ్యాంగ్ను విస్తరింప చేశాడు. శ్రీమంతులపై కన్ను సునీల్ టార్గెట్ అంతా డబ్బున్న వారే. వారిని బెదిరించి, వేధింపులకు గురి చేసే వాడు. సీమ వ్యాప్తంగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వాడు. అతడిది ప్రొద్దుటూరే కావడం.. ఈ ప్రాంతంలో శ్రీమంతులు అధికంగా ఉండటంతో ఎక్కువగా దృష్టి సారించాడు. సునీల్ దందాలను కర్నూలు జిల్లా జలదుర్గానికి చెందిన అప్పటి ఎస్ఐ జయన్న బయట పెట్టగలిగారు. ఆయన విచారణలోనే ప్రొద్దుటూరులోని పలువురు వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలను కిడ్నాప్ చేయాలని సునీల్ వ్యూహ రచన చేసినట్లు తెలిసింది. ఆ ఎస్ఐ ఇచ్చిన సమాచారంతో ప్రొద్దుటూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రొద్దుటూరులోని ప్రముఖ బంగారు వ్యాపారితోపాటు ఆయన కుమారుడ్ని కిడ్నాప్ చేయడానికి స్కెచ్ వేశాడు. హైదరాబాద్తోపాటు ప్రొద్దుటూరులోని ఆయన ఇంటి వద్ద పలుమార్లు ప్రయత్నించి, విఫలమయ్యాడు. ఈ విషయం పోలీసుల విచారణలో తేలింది. ప్రొద్దుటూరుతోపాటు జిల్లాలో సునీల్ బాధితులు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణ భయంతో వీరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సునీల్ ఆత్మహత్య వార్త తెలియడంతో వీరంతా ఊపిరి పీ ల్చుకున్నారు. ప్రొద్దుటూరులోని వన్టౌన్లో మూడు కేసులు, త్రీటౌన్లో మూడు, రూరల్ పోలీస్స్టేషన్లో రెండు కేసులు సునీల్పై నమోదయ్యాయి. సీమ వ్యాప్తంగా 19 కేసులు నమోదయ్యాయి. సునీల్ దందాలు బయట పడిందిలా.. ప్రొద్దుటూరుకు చెందిన వాసురాంప్రసాద్ తాడిపత్రిలోని వంశీ మెడికల్ స్టోర్ నిర్వహిస్తుండే వాడు. వాసురాంప్రసాద్ తండ్రికి సునీల్ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆయన పట్టించుకోక పోవడంతో 2013 ఫిబ్రవరిలో జలదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో వాసురాంప్రసాద్ను హత్య చేశారు. ఈ కేసును ఎస్ఐ జయన్న చాలెంజ్గా తీసుకున్నారు. అప్పటికే ప్రొద్దుటూరులో డాబాపై దాడి చేసిన కేసు సునీల్పై నమోదైంది. వాటి ఆధారంగా ఎస్ఐ జయన్న.. సునీల్ ముఠా సభ్యులపై ఆరా తీశారు. డాబా కేసులో ఇద్దరు యువకులు ప్రొద్దుటూరు సబ్జైల్లో ఉంటూ బెయిల్పై బయటికి రావడంతో ఎస్ఐ వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వాసూరాం ప్రసాద్ను హత్య చేసినట్లు వారు అంగీకరించారు. ఈ కేసులో మరో 10 మంది ముఠా సభ్యులు ఉన్నట్లు పోలీసులు గ్రహించారు. వారంతా హైదరాబాద్లో ఉన్నట్లు టవర్ లొకేషన్న్ద్వారా తెలుసుకొని పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ సునీల్తోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని కర్నూలుకు తరలించారు. 10 కిడ్నాప్లు చేసినట్లు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చేలోపే సునీల్ ఎస్ఐకి వివరించాడు. జలదుర్గం ఎస్ఐ దర్యాప్తు ఫలితంగా గ్యాంగ్లీడర్, కిడ్నాపర్ సునీల్ దందాలు బయట పడ్డాయి. వాసురాంప్రసాద్ను హత్య చేసిన కేసులో సునీల్కు జీవిత ఖైదు పడింది. ఈ శిక్షను కడప సెంట్రల్ జైలులో అనుభవిస్తున్న సునీల్ శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రొద్దుటూరులోని శ్రీమంతుల్లో భయం వీడింది. మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు రాయచోటి అర్బన్: కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ సునీల్కుమార్ను అధికారులే పథకం ప్రకారం అంతమొందించారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఓపీడీఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.ఈశ్వర్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఆదివారం ఫిర్యాదు చేశారు. నేరాలకు పాల్పడుతున్న సునీల్కు.. చాలా మంది పోలీస్ అధికారులు సహకరించి అతడి ద్వారా లబ్ధి పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిగితే తమ పాత్ర వెలుగులోకి వస్తుందని భావించి.. వారే తుదముట్టించినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. -
హక్కులు కాపాడి ప్రాణాలు నిలపండి
గుంటూరు వెస్ట్: డయేరియాతో అమాయక ప్రజలు మరణిస్తున్నా చర్యలు తీసుకోవడం చేతగాని ప్రభుత్వం, అధికారులు ప్రజలపై, పార్టీలపై నిందలు మోపి వేసి చేతులు దులుపుకోవడం హేయమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. నగరంలో రెండు వారాలుగా డయేరియాతో మృత్యువాత పడుతున్న అమాయకుల తరఫున అప్పిరెడ్డి శనివారం జిల్లా కోర్డు ప్రాంగణంలోని మానవ హక్కుల చైర్మన్, మొదటి అడిషనల్ జిల్లా జడ్జి నంది కొండ నరసింగారావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికి 24 మంది చనిపోయారని, వేల మంది ఆసుపత్రిపాలై, అవయవాలు పనిచేయక నరకయాతన అనుభవిస్తున్నారని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం తప్పించుకునే దారులు వెదుకుతోందన్నారు. గుంటూరంటే కల్తీకి ప్రధాన కేంద్రమనే అపకీర్తి మూటగట్టుకున్నా అధికారుల్లో స్పందన కరువైందన్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ప్రజలు మరణించాల్సిన పరిస్థితి నెలకొనడం విచారకరమని అప్పిరెడ్డి పేర్కొన్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాటాల లెక్కల్లో బిజీగా ఉన్నారని,ప్రజల కష్టాలు వినే తీరిక లేవని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రజల తరఫున రాజీలేని పోరాటం చేస్తూ, వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు న్యాయం చేసేందుకే మానవ హక్కుల చైర్మన్ను ఆశ్రయించామని తెలిపారు.న్యాయవాదులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, శిఖా బెనర్జీ, పోకల వెంకటేశ్వర్లు, శశి, కేశవ పాల్గొన్నారు. -
బిగుసుకుంటున్న ఉచ్చు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినందుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నెన్నెలకు చెందిన గీత కార్మికుడు రామాగౌడ్ ఉదంతంలో బాధ్యులపై ఉచ్చు బిగుసుకుంటోంది. రాష్ట్రంలోనే చర్చనీయాంశమైన ఈ కేసును బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్రాజ్ విచారణ చేస్తున్నారు. బుధవారం ఆయన నెన్నెలకు వెళ్లి స్వయంగా రామాగౌడ్ కుటుంబసభ్యులతో మాట్లాడడంతోపాటు రామాగౌడ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన పల్ల మహేష్ అనే వ్యక్తికి సంబంధించి కూడా వివరాలు సేకరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసిన అంశమే ఈ ఘటనలో ప్రధానమైనదిగా మారింది. సబ్ కలెక్టర్ విచారణ కూడా అట్రాసిటీ కింద ఫిర్యాదు చేసిన మహేష్ ఎస్టీనా లేక బీసీనా అనే కోణంతో పాటు ఎస్టీ ధ్రువీకరణ పత్రం జారీ చేసే విషయంలో నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే మహేష్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగానే, సంబంధిత ఎస్ఐ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు తీసుకోగా, విచారణాధికారిగా వ్యవహరించిన ఏసీపీ దానిని సమర్థించి, రామాగౌడ్ ఎస్టీ గౌరవానికి భంగం కలిగించినట్లుగా నిర్ధారించారు. ఈ వ్యవహారంలో ఎస్ఐ, ఏసీపీ ఎంతమేర నిజాయితీగా వ్యహరించారనే అంశాన్ని కూడా సబ్ కలెక్టర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. భూపాలపల్లి ఇన్చార్జి కలెక్టర్గా ఆర్వీ.కర్ణన్ మేడారం జాతరను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో జాతర ప్రారంభమయ్యే 31వ తేదీ లోపే ఆయనకు నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. తహసీల్దార్పై తొలివేటు? పల్ల మహేష్ అనే వ్యక్తి రామాగౌడ్పై ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు సబ్ కలెక్టర్ రాహుల్రాజ్ ప్రాథమిక విచారణలోనే తేలిపోయింది. అయితే మహేష్ ఎస్టీ కాదని, పితృస్వామ్య దేశంలో తండ్రి కులమే సంతానానికి సంక్రమిస్తుందనే వాదన తెరపైకి వచ్చింది. గతంలో హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన ఓ విద్యార్థి ఆత్మహత్య విషయంలో కూడా ఇదే వివాదం రేగింది. ఈ నేపథ్యంలో నెన్నెల తహసీల్దార్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని మహేష్కు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చారనే అంశాన్ని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా 2017 సెప్టెంబర్ 18న జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా ఎస్టీగా సర్టిఫై చేయకుండా ఏకంగా తహసీల్దార్ సంతకం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. కొలావర్ కులానికి చెందిన వ్యక్తిగా మహేష్ను తహసీల్దార్ నేరుగా సర్టిఫై చేయడం గమనార్హం. ఈ కుల ధ్రువీకరణ పత్రం కారణంగానే అట్రాసిటీ కేసు మొదలు, ఆత్మహత్య వరకు చోటు చేసుకోవడంతో విచారణాధికారి కూడా దీనిపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. రాజకీయంగా బెల్లంపల్లిలో హైటెన్షన్ రామాగౌడ్ ఆత్మహత్య ఉదంతం బెల్లంపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా టెన్షన్ వాతావరణానికి కారణమైంది. ఈ ఆత్మహత్యకు అధికార పార్టీ నాయకులే కారణమనే విషయాన్ని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించాయి. నెన్నెల గ్రామ సర్పంచ్, మండల కో అప్షన్ సభ్యుడు, ఎంపీటీసీతో పాటు ఎమ్మెల్యేను కూడా ఇందులోకి లాగాయి. అఖిలపక్షం పేరుతో అన్ని పార్టీలు ఆందోళనలు జరుపుతుండడంతో స్వయంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీడియా సమావేశం పెట్టి తనకే సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. రామాగౌడ్ తన కుటుంబంలో సభ్యుడి వంటి వాడని ఆయన చెప్పినప్పటికీ, రామాగౌడ్ మృతి తరువాత ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకులెవరూ బాధితుని కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని ప్రతిపక్షాలు అవకాశంగా మార్చుకున్నాయి. ప్రత్యక్షంగా టీఆర్ఎస్ నేతలకు ఈ అంశంతో సంబంధం లేకపోయినా... వారి ప్రోద్బలంతోనే ఎస్టీ ధ్రువీకరణ పత్రం, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు వంటివి జరిగాయనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు జనంలోకి తీసుకెళ్లడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ నివేదికపైనే కేసు ఆధారపడి ఉంది. ఎస్ఐ, ఏసీపీల విచారణ ఏమైంది..? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని రూఢి చేసుకున్న తరువాతే కేసు నమోదు చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని కూడా ఈ కేసులో పాటించలేదని సబ్ కలెక్టర్ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం. ఎస్ఐ కేసు నమోదు చేయగానే విచారణాధికారిగా ఏసీపీ వాస్తవాలను విచారించకుండానే రామాగౌడ్పై కేసును నిర్ధారించడం, దానికి తహసీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవడం కూడా కీలకంగా మారింది. కేసు నమోదు చేసిన తరువాత గౌడ కుల సంఘాలు, రామాగౌడ్ కుటుంబసభ్యులు ఏసీపీ, కలెక్టర్లను కలిసి వాస్తవాలు తెలియజేసినా, ఎందుకు స్పందించి అట్రాసిటీ కేసు నుంచి సాధారణ కేసుగా మార్చలేదనేది ప్రశ్న. ఈ విషయాలపై విచారణ జరుపుతున్న సబ్ కలెక్టర్ ఇచ్చే నివేదిక పైనే బాధ్యులపై తీసుకునే చర్యలు ఏంటనేది తేలనుంది. -
మమ్మల్ని చావనివ్వండి..
సాక్షి, నాంపల్లి: తమ భూములను, ప్రాణాలను కాపాడాలని, లేని పక్షంలో సామూహిక ఆత్మహత్యలకు అనుమతించాలని కోరుతూ సిద్ధిపేట జిల్లా కొండ పోచమ్మ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)ను ఆశ్రయించారు. తమ భూములను రక్షించాలని కోరుతూ కమిషన్కు ఫిర్యాదు చేసినందున పోలీసుల నుండి బెదిరింపులు వస్తున్నాయన్నారు. భూములు, ప్రాణాలకు రక్షణ కల్పించలేనప్పుడు సామూహిక ఆత్మహత్యలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. వివరాల్లోకి వెళితే.. నగర శివార్లలోని సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం, నాగపూర్ గ్రామంలో సర్వే నంబరు 832, 835లలో బి.కొండమ్మ, ఇ.గురువయ్య, పి.మల్లయ్య అనే వ్యక్తులకు భూములు ఉన్నాయి. ఈ భూమి సమీపంలో ఊషదీశ్వర్రెడ్డికి చెందిన భూములు ఉండటంతో ఆయన పేదల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడికి సిద్ధిపేట డీసీపీ, చేర్యాల సీఐ సహకరిస్తున్నారని, డీసీపీ ప్రోద్బలంతో గుండాలతో తమపై దాడులకు పాల్పడ్డారన్నారు. పట్టా భూమిలో ఉన్న షెడ్లను కూల్చివేయడంతో బాధితులు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు, గూండాల దౌర్జాన్యాలు మరింత పెరిగాయని, ఊషదీశ్వర్ రెడ్డి, అతని అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. రక్షణ కల్పించలేని పక్షంలో సామూహికంగా ఆత్మహత్యలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ జనవరి 17లోగా నివేదికను అందజేయాలని కోరుతూ సిద్ధిపేట ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. వీరికి యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు రాగం సతీష్ యాదవ్ తదితరులు బాధితులను పరామర్శించారు. -
సరోగసీ మహిళ అదృశ్యం
హైదరాబాద్: అద్దె గర్భాన్ని ధరించేందుకు సంతాన సాఫల్యతా కేంద్రానికి వచ్చిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. ఈ ఘటనపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.14లోని సాయికిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో సరోగసీ పద్ధతిలో అద్దె గర్భం దాల్చేందుకు మహిళలు కావాలంటూ ఆసుపత్రి సంచాలకుడు డాక్టర్ సమిత్ శేఖర్ అలియాస్ డాక్టర్ సాయి కిరణ్ నుంచి నరేశ్కుమార్కు మెసేజ్ వచ్చింది. దీంతో తమ బంధువైన విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతానికి చెందిన లక్ష్మి(31)ని ఈ ఏడాది సెప్టెంబర్లో తీసుకొచ్చి ఒప్పందం మేరకు ఇక్కడ ఉంచి సంబంధిత ధ్రువపత్రాలపై సంతకాలు కూడా చేశారు. అద్దె గర్భం ధరిస్తే రూ. 2.50 లక్షలు ఇస్తారంటూ చెప్పడంతో పేదరికంలో ఉన్న లక్ష్మి ఇందుకు అంగీకరించింది. అప్పటి నుంచి వారి సంరక్షణలో ఉన్న లక్ష్మి వారం రోజుల నుంచి కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు దాచిపెట్టాయి. ఆమెను చూడటానికి వచ్చిన నరేశ్ రెండుసార్లు కలవడానికి యత్నించగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. లక్ష్మి కనిపించడం లేదంటూ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. కమిషన్ ఆదేశాలతో వైద్యాధికారులు సాయికిరణ్ ఫెర్టిలిటీ సెంటర్లో తనిఖీలు చేపట్టడంతోపాటు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులకు కేసు నమోదు చేయాల్సిందిగా ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి బుధవారం ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. -
నిజాలు నిగ్గుతేలేనా..?
వనపర్తి విద్యావిభాగం: జిల్లా కేంద్రంలోని జాగృతి కళాశాలలో గతనెల 13వ తేదీన అనుమానాస్పదంగా మృతిచెందిన శివశాంతి మృతిపై దర్యాప్తు ముందుకుసాగడం లేదు. సంఘటన జరిగి ఇరవై రోజులు గడుస్తున్నా.. పోలీసుల దర్యాప్తులో పురోగతి కనిపించడంలేదు. ఓ వైపు పోలీసులు విచారణ పేరుతో సమయాన్ని సాగదీస్తుండగా మరోవైపు కళాశాల యాజమాన్యం కేసును నీరుగార్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తాజాగా బుధవారం శివశాంతి అనుమానాస్పద మృతి సంఘటన వివరాలను తెలుసుకునేందుకు వెళ్లిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులకు యాజమాన్యాలు పొంతనలేని సమాధానాలు చెప్పి అనేక అనుమానాలకు తెరలేపారు. పైగా ఈ సంఘటనపై విచారణ జరుగుతోందని, పూర్తి వివరాలు పోలీసుల వద్ద తెలుసుకోవాలని ఉచిత సలహా ఇవ్వడంపై కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంతనలేని సమాధానాలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం నిజనిర్ధారణ చేసుకునేందుకు బుధవారం కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా యాజమాన్యాన్ని విద్యార్థిని మృతిపై ప్రశ్నించారు. శివశాంతి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మొదట ఎవరు చూశారు..? ఏ సమయంలో చూశారు..? ఎవరికి సమాచారం ఇచ్చారు. ఫ్యాన్కు ఉరేసుకుందనుకుంటే చున్నీని ఎవరు విప్పారు..? ఆ సమయంలో కేవలం మెడ భాగాన్ని మాత్రమే విప్పారా..? లేక ఫ్యాన్ పైభాగంలోని ముడిని కూడా విప్పారా..? పోలీసులకు ఏ సమయంలో సమాచారం ఇచ్చారు..? ఏరీయా ఆస్పత్రికి తరలించిన సమయానికి మృతిచెంది ఉందా..? వంటి ప్రశ్నలను అడిగారు. యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెప్పకపోవడాన్ని కమిటీ సభ్యులు గుర్తించారు. కనిపించని పురోగతి శివశాంతి మృతి కేసును నీరుగార్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కళాశాల తరగతి గదిలో ఉరివేసుకుని మృతిచెందిందని యాజమాన్యం చెబుతున్నా.. ఏ కారణంతో ఉరి వేసుకుందనే విషయాన్ని నేటికి బహిర్గతం చేయడం లేదంటున్నారు. పోలీసులు సైతం కేవలం అనుమానాస్పద మృతిగా 174 సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం (ఎఫ్ఐఆర్ నెం.255/2017) కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. విచారణ పేరుతో కాలాన్ని సాగదీస్తున్నారేగాని ఇంతవరకు ఈ కేసు విషయంలో ఎలాంటి పురోగతిలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని.. హత్యేనని ఈ కేసు విషయంలో న్యాయం చేయాలని ప్రజావాణిలో కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు మృతి సంఘటన జరిగినప్పటి నుంచి కేసును నీరుగార్చేందుకు కళాశాల యాజమాన్యం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్న విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లాకేంద్రానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి యాజమాన్యం తరఫున పోలీసులతో చర్చించి మా సామాజిక వర్గానికి చెందినవారే కాబట్టి సెటిల్మెంట్ చేయిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం రూ.4లక్షలు పరిహారంగా చెల్లిస్తారని రూ.లక్ష అడ్వాన్స్గా చెల్లిస్తామని, మిగిలిన రూ.3లక్షలకు చెక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అగ్రిమెంట్పై సం తకాలు చేయాలని కుటుంబీకులతపై ఒత్తిడి తీసుకువచ్చా రు. కాని తమ కూతురు మృతికి కారకులైన వారికి ఖచ్చితం గా శిక్షపడాలని తేల్చి చెప్పడంతో సెటిల్మెంట్ కుదరలేదు. -
మంత్రి చందూలాల్ నుంచి ప్రాణ హాని
హెచ్చార్సీలో ములుగు వాసి భిక్షపతి ఫిర్యాదు హైదరాబాద్: మంత్రి అజ్మీరా చందూలాల్, అతని అనుచరుడు గట్టు మహేందర్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో జయశంకర్ జిల్లా ములుగు ప్రాంతానికి చెందిన ముంజాల భిక్షపతి ఫిర్యాదు చేశారు. ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడిగా తాను కొనసాగుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండేళ్లుగా జిల్లా సాధన కోసం చేస్తున్న ఉద్యమాన్ని విరమించుకో వాలని ములుగు ఎమ్మెల్యే చందూలాల్ హెచ్చరిస్తూ వస్తున్నారని ఆరోపించారు. తాను ససేమిరా అనడంతో ఫోన్లో ఇష్టం వచ్చినట్లు దుర్భాషలా డారని పేర్కొన్నారు. అతని అనుచరుడు గట్టు మహేందర్ సైతం ‘రోడ్డు మీదకు రాకుండా చేస్తాం బిడ్డా... బతకాలని ఉందా?’ అంటూ బెదిరించినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెప్టెంబరు 14లోగా ఈ కేసుకు సంబంధించి సమగ్రమైన నివేదిక అందజేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. -
డిశ్చార్జ్ కార్డు మారింది..పసిప్రాణం పోయింది
–పెద్దాసుపత్రిలో దారుణం –జాతీయ మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించిన పాప తల్లిదండ్రులు కర్నూలు(హాస్పిటల్): ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇచ్చే డిశ్చార్జ్ కార్డు మారిపోయింది. ఒకరికి ఇవ్వాల్సిన చికిత్సను మరొకరికి రాసివ్వడంతో ఆ మందులు వాడి ఓ పసిపాప ప్రాణం కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని, బాధ్యులపై చర్యలు తీసుకుని, తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ తల్లిదండ్రులు.. జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఈ విషయమై ఆరు వారాల్లోపు నివేదిక అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరికీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కర్నూలు మండలం జి.సింగవరం గ్రామానికి చెందిన రామమద్ది, లక్ష్మిదేవికి రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక్కతే కూతురు బి.అనూష(8నెలలు). ఈ పాపకు గత ఫిబ్రవరి 20వ తేదిన దగ్గు, ఆయాసం రావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకెళ్లారు. చిన్నపిల్లల విభాగంలో వైద్యులు పరిశీలించి అడ్మిషన్ చేసుకుని చికిత్స అందించారు. అనంతరం పాపకు ఆరోగ్యం కుదుట పడటంతో మార్చి ఒకటో తేదిన డిశ్చార్జ్ చేశారు. అయితే ఆ సమయంలో అనూష పేరుతో ఇవ్వాల్సిన డిశ్చార్జ్ కార్డును ఎండి ఇబ్రహీం(18 నెలలు) అనే చిన్నారిది ఇచ్చారు. ఈ బాలుడు ఇదే చిన్నపిల్లల విభాగంలో వాంతులు, విరేచనాలతో ఫిబ్రవరి 27వ తేదిన అడ్మిషన్(ఐపీ నెం.11490) పొంది మార్చి ఒకటో తేదిన డిశ్చార్జ్ అయ్యాడు. ఇద్దరూ ఒకేరోజు డిశ్చార్జ్ కావడంతో ఒకరి డిశ్చార్జ్ కార్డు మరొకరికి ఇచ్చారు. అనూషకు ఇచ్చిన డిశ్చార్జ్ కార్డులో దగ్గు, ఆయాసం తగ్గే మందులు కాకుండా వాంతులు, విరేచనాలు తగ్గే మందులు ఇచ్చారు. అనూష తండ్రి రామమద్ది ఈ విషయం తెలియక మందులు తీసుకుని ఇంటికి వెళ్లి పాపకు వాడుతూ వచ్చాడు. నాలుగు రోజుల తర్వాత పాపకు తిరిగి ఆయాసం పెరిగి.. మార్చి 7వ తేదిన రాత్రి గళ్ల ఎక్కువగా పడటం, విరేచనాలు అధికంగా కావడంతో భయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ పాప అదే నెల 11వ తేదీన మృతిచెందింది. డిశ్చార్జ్ సమయంలో ఇతర బాలుని మందులు తమ పాపకు రాయడం, వాటిని వాడటం వల్లే మృతిచెందిందని ఆరోపించారు. ఈ మేరకు వారు ఇటీవల జాతీయ మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు. స్పందించిన హక్కుల కమిషన్ ఆరు వారాల్లో తమకు నివేదిక అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరికి నోటీసులు జారీ చేసింది. -
ప్రసూతి మరణాలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
మానవహక్కుల కమిషన్కు టీపీసీసీ మహిళా నేతల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాలింతల వరుస మరణాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, సరైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్కు టీపీసీసీ మహిళా నేతలు గురువారం విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద, ఇందిరాశోభన్ తదితరులు మానవహక్కుల కమిషన్ను కలిశారు. అనంతరం అరుణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే బాలింతలు వరుసగా మృత్యువాత పడటం ఆందోళ నకరమన్నారు. ఆస్పత్రుల్లో సదుపాయాలు లేకపోవడం, సరైన వైద్యం అందకపోవడం వల్లనే బాలింతలు చనిపోయారని అన్నారు. ఆస్పత్రులను సందర్శించడానికి ప్రత్యేక కమిటీని వేయాలని మానవహక్కుల కమిషన్ను కోరినట్లుగా వెల్లడిం చారు. చనిపోయిన బాలింతల కుటుంబా లకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టుగా డీకే వెల్లడించారు. ఆస్పత్రులపై ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలకోసం ప్రభుత్వం టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేయాలని కోరారు. గాంధీభవన్ నుంచి మానవ హక్కుల కమిషన్ కార్యాల యం దాకా మహిళానేతలు ర్యాలీగా వెళ్లారు. కేసీఆర్ జిందాబాద్ నినాదాలు అయితే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సందర్భంగా మహిళా కార్యకర్తలు తడబడి, సీఎం కేసీఆర్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. దీనిని గుర్తించిన మహిళానేతలు వెంటనే సవరించి, కార్యకర్తలకు సూచనలు చేశారు. -
భారత ప్రభుత్వం ఏం చేస్తోంది?
న్యూఢిల్లీ: భారత్లో ఇటీవల ఆఫ్రికన్ జాతీయులపై జరుగుతున్న దాడులను వర్ణవివక్షగా, విదేశీయులంటే భయంగా భావిస్తున్నామని భారత్లో ఆఫ్రికన్ మిషన్ చెప్పింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని తీవ్రంగా విమర్శించింది. భారత ప్రభుత్వం తీరును ఘాటుగా విమర్శిస్తూ రాసిన లేఖను మిషన్ అధికారులు సోమవారం విడుదల చేశారు. వరుస ఘటనలపై మానవ హక్కుల కమిషన్ స్వతంత్ర విచారణ చేపట్టాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఈ విచారణ లేఖను ఆఫ్రికన్ యూనియన్ కమిషన్కు అందజేయాలని కోరారు. -
వారిపై చర్యలు తీసుకోండి
అమరావతి బ్యూరో: రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను నిర్బంధించి దూషించిన టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే బొండా ఉమాపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది. నిబంధనలను ఉల్లంఘించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్పై కఠిన చర్యలకు ఆదేశించాలని కూడా ఆ ఫిర్యాదులో కోరారు. కృష్ణా జిల్లా హనుమాన్జంక్షన్కు చెందిన సామాజిక కార్యకర్త ఎం.సుబ్రమణ్యం రాష్ట్ర మానవహక్కుల కమిషన్కు సోమవారం ఫిర్యాదు చేశారు. తాము చెప్పినట్లుగా తప్పుడు నివేదికలు ఇవ్వనందునే రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ వల్ల ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని కూడా ఫిర్యాదు చేశారు. రవాణా శాఖ అధికారుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని, వారికి తగిన రక్షణ కల్పించి ప్రైవేటు ట్రావెల్స్పై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఆయన కోరారు. -
ఆస్తి కోసం పిన్ని చిత్రహింసలు పెడుతోంది..
హైదరాబాద్: తనకు పిన్ని నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ బాలిక మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ముంబైకి చెందిన తాను తల్లిదండ్రులు చనిపోవటంతో పిన్ని వద్ద ఉంటున్నట్లు ఆమె తెలిపింది. తన తల్లిదండ్రుల పేరిట ఉన్న కోట్లాది రూపాయల ఆస్తిని కాజేయటానికి బెంగళూరు తీసుకెళ్లి.. రెండేళ్లుగా చిత్రహింసలు పెడుతోందని ఫిర్యాదులో ఆమె ఆరోపించింది. చిన్నమ్మ నుంచి ప్రాణహాని ఉందని, రక్షించాలని మానవ హక్కుల సంఘానికి వినతి అందజేసింది. వివరాలు.. ముంబాయి జోగేశ్వరి ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక అలీనా ఖాన్ తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలీనా ఖాన్ తండ్రి సలీంఖాన్ మార్బుల్ వ్యాపారం చేసేవాడు. తను కూడపెట్టిన కోట్ల రూపాయల ఆస్తిని కూతురు పేరు మీద రాశారు. ఇది గమనించిన తన చిన్నమ్మ అర్షియా బాలికను చేరదీసింది. ముంబాయి లో ఉన్న బాలికను రెండేళ్ల క్రితం బెంగుళూరుకు తీసుకువచ్చింది. బాలిక పేరు మీద ఉన్న కోట్ల రూపాయాల ఆస్తిని కాజేయడానికి పన్నాగం పన్నింది. ఇందులో భాగంగానే రెండేళ్ల నుంచి చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా.. అనేక సార్లు హత్యాప్రయత్నం కూడా చేసింది. ఇది భరించలేక ఆ బాలిక ఫేస్ బుక్ ద్వారా తన స్నేహితుడు సహాయంతో హైదరాబాద్ నగరానికి వచ్చింది. న్యాయం కోసం పౌర హక్కుల ప్రజా సంఘం అధ్యక్షురాలు, ప్రముఖ న్యాయవాది జయ వింధ్యాలను కలిసి జరిగిన విషయం తెలిపింది. ఆగష్టు నెల నిండితే బాలిక మేజర్ అవుతుందని..అప్పటి వరకు ఆమెకు రక్షణ కల్పించాలని జయ వింధ్యాల.. బాలికతో వచ్చి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. తన ఆస్తి కోసం చిత్ర హింసలకు గురి చేసిన చిన్నమ్మ అర్షియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ బాలికకు రక్షణ కల్పించాలని నగర పోలీసులను ఆదేశించింది. -
ఇంకెంత దూరం?
విచారణ చేపట్టి చేతులు దులుపుకున్న అధికారులు రెండు వారాలుగా ఉన్నతాధికారులకు అందని నివేదిక దీంతో మరింత రెచ్చిపోతున్న క్రషర్లు, తారు ప్లాంట్ల యాజమాన్యాలు భయం గుప్పిట్లో గ్రామాల ప్రజలు మానవహక్కుల కమిషన్ను ఆశ్రయిస్తాం : ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ హన్మకొండ: అ«ధికారుల చర్యలు సైతం రాజకీయ నాయకుల మాటల్లాగే మారిపోయాయా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామపంచాయతీ తీర్మానాలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్న వారి హామీలు బుట్టదాఖలు కావడం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈ మేరకు క్రషర్లు, తారు ప్లాంట్ల నిర్వాహకుల కారణంగా తమకు నష్టం జరుగుతుండగా.. అధికారులు చేపట్టిన విచారణ తోనైనా న్యాయం జరుగుతుందని ఆశ పడిన శాయంపేట మండలంలోని మాందారిపేట, మాందారిపేట, గోవిందాపూర్, ప్రగతిసింగారం, పత్తిపాక, పెద్దకోడెపాక తదితర గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రెండు వారాల క్రితం అధికారులు చేపట్టిన విచారణ నివేదిక కలెక్టర్కు ఇప్పటికీ అందకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ పేలుళ్లు.. తీవ్రమైన కాలుష్యం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామం సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్లలో భారీ పేలుళ్లు, తారు ప్లాంట్ల నుంచి తీవ్ర కాలుష్యం విడుదలవుతోందని మాందారిపేట, గోవిందాపూర్, ప్రగతిసింగారం, పత్తిపాక, పెద్దకోడెపాక గ్రామాల ప్రజలు కొన్ని నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిలెటిన్ స్టిక్స్ ద్వారా రాతిగుట్టలను పేల్చేందుకు ఉన్న అనుమతులు అతిక్రమించి మరింత తీవ్రతతో పేలుళ్లు చేస్తుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సాధారణంగా కంప్రెషర్ వాడేందుకే అనేక రకాల అనుమతులు అనేక షరతులతో ఇస్తారు. అయితే క్రషర్ల నిర్వాహకులు మరింత ముందుకు వెళ్లి బోరు రిగ్గుల్లాంటి భారీ యంత్రాలతో డ్రిల్లింగ్ చేసి భారీ తీవ్రతతో పేలుళ్లు చేపడుతుండడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పేలుళ్ల తీవ్రత కారణంగా ఆయా గ్రామాల్లో ఇళ్లు బీటలు వారుతుండగా, మండల కేంద్రం శాయంపేట సైతం దుమ్ము, ధూళి బారిన పడుతోంది. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజలు అనేక ఆందోళనలు చేయడంతో పాటు జిల్లా కలెక్టరు, స్పీకర్కు సైతం ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు రావడంతో ఈనెల 2వ తేదీన ఆర్డీఓ, మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి జిల్లా అధికారులు, తహసీల్దార్ విచారణ చేపట్టారు. గ్రామాల ప్రజలు, పాఠశాలల విద్యార్థులతో పాటు మాట్లాడి ప్రమాదకర స్థాయిలో కాలుష్యం వెలువడుతోందని తెలుసుకున్నారు. అదేవిధంగా బీటలు వారిన ఇళ్లను సైతం పరిశీలించి, గ్రామపంచాయతీ తీర్మానాలను సైతం ధిక్కరించారని తేల్చారు. ఇంకా ప్లాంట్ల అనుమతి పత్రాలను కూడా పరిశీలించారు. ఈ క్రమంలో క్రషర్లు, డాంబర్ ప్లాంట్ల నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. రెండు వారాలు గడిచినా.. అధికారులు విచారణ నిర్వహించి రెండు వారాలు దాటినప్పటికీ ఏమాత్రం ఫలితం లేదు. దీంతో క్రషర్లలో పేలుళ్లు మరింత తీవ్రమయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పలుకుబడితో క్రషర్లు, డాంబర్ ప్లాంట్ల వారు మరింతగా ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారని వాపోతున్నారు. దీంతో తమ పరిస్థితి దారుణంగా తయారైందని గగ్గోలు పెడుతున్నారు. రాజకీయ అండతోనే ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. -
పాములేటికి రూ.2లక్షల పరిహారం
మానవ హక్కుల సంఘం ఆదేశం నంద్యాల: ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయవాది పాములేటి కాళ్లకు సంకెళ్లు వేసినందుకు ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని మానవహక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిహారాన్ని బాధ్యులైన పోలీసు అధికారుల నుంచి రికవరీ చేయాలని సూచించింది. ఈ మేరకు హెచ్ఆర్సీ జారీ చేసిన ఆదేశాలు బార్ అసోసియేషన్ ప్రతినిధి, రావినూతన దుర్గాప్రసాద్కు అందాయి. చాగలమర్రికి చెందిన విమలమ్మ ఆస్తి వివాదంలో న్యాయం చేయాలని జూన్ 13 నంద్యాల ఆర్డీఓ సుధాకర్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమెకు మద్దతుగా నిలిచిన న్యాయవాది పాములేటి, మరి కొందరికి, ఆర్డీఓ సుధాకర్రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్డీఓ ఫిర్యాదు మేరకు త్రీటౌన్ సీఐ వెంకటరమణ వీరిని అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో ఉన్న పాములేటిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.అయితే పారిపోకుండా పోలీసులు కాళ్లకు సంకెళ్లు వేశారు. దీనిపై ‘సాక్షి’లో న్యాయానికి సంకెళ్లు అనే వార్త జూన్ 14న ప్రచురితమైంది. ఈ వార్తను మానవ హక్కుల సంఘం సుమోటగా తీసుకొని కేసు నమోదు చేసింది. బార్ అసోసియేషన్ తరపున ప్రముఖ న్యాయవాది రావినూతన దుర్గాప్రసాద్ కూడా పాములేటికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ సంఘటనలో ఎస్ఐ అశోక్, నలుగురు కానిస్టేబుళ్ల పోలీసు అధికారులు సస్పెండ్ చేసి, సీఐ అశోక్ను వేకన్సీ, రిజర్వ్కు పిలిపించింది. ఈ కేసు విచారణ తర్వాత పాములేటికి ప్రభుత్వం రూ.2లక్షల పరిహారాన్ని మూడు నెలల్లో ఇవ్వాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని సీఐ వెంకటరమణ, ఎస్ఐ అశోక్ల నుంచి రూ.50వేలు చొప్పున, కానిస్టేబుళ్లు మహేంద్ర, లక్ష్మణరావు, శోభన్బాబు, బాల మౌలాలి నుంచి రూ.25వేల చొప్పున రికవరీ చేయాలని ఆదేశించింది. -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన కోదండరాం
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల ప్రజలు విషజ్వరాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాలోని బోనకల్ మండలం రావినూతల గ్రామంలో విష జ్వరాల బారిన పడి కొందరు వ్యక్తులు మృతిచెందారు. మృతిచెందిన వారి కుంటుంబాలను ఆదుకోవాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం శుక్రవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. విషజ్వరాల బారినపడి మరణించిన వారి కుటుంబాలను ఆదుకొని తక్షణమే అక్కడ నివారణ చర్యలు తీసుకోవాలంటూ ఆయన కమిషన్కు ఫిర్యాదు చేశారు. -
గ్లోబల్ ఆసుపత్రి లెసైన్స్ రద్దు చేయాలి
హెచ్చార్సీలో నిఖిల్రెడ్డి తండ్రి ఫిర్యాదు హైదరాబాద్: గ్లోబల్ ఆసుపత్రి యాజమా న్యం తక్షణమే నిఖిల్ రెడ్డికి పూర్తిస్థాయి ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన తండ్రి ఎస్.గోవర్ధన్రెడ్డి బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను కోరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, బీజేపీ నేత డాక్టర్ కె.రాజా గౌడ్తో కలసి బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు వెళ్లిన గోవర్ధన్ గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నిఖిల్ రెడ్డికి రూ.కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. మెడికల్ కౌన్సిల్ నిబంధనలు ఉల్లంఘించిన గ్లోబల్ ఆసుపత్రి లెసైన్స్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిఖిల్రెడ్డికి సర్జరీ చేసిన డాక్టర్ చంద్రభూషణ్ వైద్యవృత్తిలో కొనసాగకుండా నిషేధించాలని కోరారు. నిఖిల్ రెడ్డిని మోసం చేసిన ఆసుపత్రి సీఈవో శివాజీ ఛటోపాధ్యాయ, డాక్టర్ చంద్రభూషణ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై నిపుణులైన డాక్టర్లతో విచారణ జరిపించాలని అన్నారు. -
నా కొడుకును జీవన్రెడ్డి చంపించారు
హెచ్చార్సీకి సత్యం తండ్రి ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో దుబాయ్లో తనపై నమోదైన కేసుల గురించి ప్రస్తావించలేదని చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కక్షగట్టి తన కొడుకు తలారి సత్యం ను హత్య చేయించారని సత్యం తండ్రి తలారి గంగాధర్ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన తెలుగుదేశం నాయకుడు రాజారాం యాదవ్తో కలసి హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూకు ఫిర్యాదును అందజేశారు. జనవరి 9న ఆర్మూర్ పట్టణంలోని అంబేడ్కర్ ఎక్స్రోడ్డు వద్ద బైక్పై వెళుతున్న తలారి సత్యం, చేపూరి రవిలు టిప్పర్ ఢీకొనడంతో చనిపోయారని.. అయితే ఇది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, పథకం ప్రకారమే ఈ హత్య చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేసిన తలారి సత్యం.. తన ప్రత్యర్థి జీవన్రెడ్డి అఫిడవిట్లో యునెటైడ్ అరబ్ బ్యాంకులో రుణాన్ని ఎగవేసినందుకు అల్గర్బా స్టేషన్లో నమోదైన కేసు గురించి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై తన కుమారుడిపై వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. చివరికి జనవరిలో టిప్పర్తో ప్రమాదం జరిగినట్లు హత్య చేయించారని ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదైంది. -
కిర్లంపూడికి అనుమతించండి
మానవహక్కుల కమిషన్ను కోరిన రఘువీరా, పీసీసీ నేతలు సాక్షి, హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల సాధనకు నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంను కలుసుకునేందుకు తాము కిర్లంపూడికి వెళ్లడానికి అడ్డంకులు సృష్టించవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కాంగ్రెస్ నేతలు మానవహక్కుల కమిషన్ను కోరారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, మాజీ మంత్రి సాకె శైలజానాథ్, న్యాయ విభాగం చైర్మన్ సి.సుందరరామశర్మ ఆదివారం రాత్రి హక్కుల కమిషన్ చైర్మన్ నిసార్ అహ్మద్ కక్రూను ఆయన నివాసంలో కలుసుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఒక నిర్మాణాత్మకమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు తాను, ఎంపీ చిరంజీవి కిర్లంపూడికి వెళుతున్నట్లు కక్రూకు రఘువీరా వివరించారు. కిర్లంపూడికి వెళ్లేందుకు ప్రయత్నించిన తమ పార్టీ నేతలు సి.రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్, పళ్లంరాజులను నిరోధించిన విషయాన్ని ఆయన తెలిపారు. చైర్మన్ను కలసి బయటకు వచ్చిన తరువాత రఘువీరా మీడియాతో మాట్లాడుతూ కిర్లంపూడి వెళ్లడానికి తమకు కమిషన్ చైర్మన్ అనుమతించారని వివరించారు. ముఖ్యమంత్రే రెచ్చగొడుతున్నారు: కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పరిష్కరించాల్సింది పోయి రెచ్చగొట్టే విధంగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాభవన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి రెండు నెలల కంటే ఎక్కువ సమయం పట్టదనేది తమ పార్టీ అభిప్రాయమని ఆయన అన్నారు. తునిలో రైలు తగలబడగానే ఆ నెపాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా, కాంగ్రెస్పైనా వేస్తూ రాయలసీమ వాళ్లే ఈ దురాగతానికి పాల్పడ్డారని చెప్పిన చంద్రబాబునాయుడు.. ఇపుడు కేసులు వేరే వాళ్ల మీద ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలియకుండానే టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తాను భావించడం లేదని రఘువీరా మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
రోహిత్ మృతిపై నివేదిక కోరుతూ హెచ్ఆర్సీ ఆదేశాలు
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హెచ్సీయూ విద్యార్థి వేముల రోహిత్ మృతిపై విచారణ జరిపించాలని మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి హెచ్ఆర్సీలో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హెచ్ఆర్సీ స్పందించింది. వచ్చే నెల ఒకటవ తేదీ లోగా విద్యార్థి రోహిత్ మృతిపై నివేదిక సమర్పించాలని హెచ్సీయూ వైస్ చాన్సలర్ అప్పారావు, సైబరాబాద్ సీపీని హెచ్ఆర్సీ ఆదేశించింది. -
రోహిత్ మృతిపై నివేదిక కోరుతూ హెచ్ఆర్సీ ఆదేశాలు
-
బిల్లు కట్టలేదని... మార్చురీలోనే మృతదేహం
భర్త శవం కోసం భార్య పడిగాపులు ♦ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన బాధితురాలు ♦ హెచ్ఆర్సీ ఆదేశాలతో శవాన్ని అప్పగించిన ఆస్పత్రి వర్గాలు ♦ ఘటనపై వెంటనే నివేదిక అందజేయాలని ఆదేశం ♦ ఆరోపణలను ఖండించిన ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి సాక్షి. హైదరాబాద్: కార్పొరేట్ ఆస్పత్రుల అమానవీయ చర్యలకు ఇదో నిదర్శనం. వైద్య ఖర్చులు చెల్లించలేదనే సాకుతో చనిపోయిన వ్యక్తి శవాన్ని అప్పగించకుండా గత నాలుగు రోజుల నుంచి ఆస్పత్రి అధీనంలోనే పెట్టుకున్న వైనం ఇది. బాధితుని భార్య రాష్ట్ర మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించడంతో చివరకు ఆమె భర్త మృత దేహాన్ని అప్పగించారు. చికిత్స పొందుతూ నెల రోజుల తర్వాత మృతి పశ్చిమబెంగాల్కు చెందిన జ్యోతిప్రకాష్ దూబే గత కొంత కాలంగా ప్రాంక్రియాస్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం నవంబర్ 11న ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ప్రాంకీయాస్ పూర్తిగా పాడైనట్లు గుర్తించిన వైద్యులు బాధితునికి ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేశారు. నెల రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్న దూబే డిసెంబర్ 18న రాత్రి చనిపోయారు. ఆస్పత్రిలో మార్చురీ లేక పోవడంతో అదే రోజు రాత్రి శవాన్ని నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. కాగాఇప్పటి వరకు అతని చికిత్స కోసం ఆస్పత్రి వైద్య ఖర్చులు రూ.7.50 లక్షల బిల్లు కాగా, అందులో రూ.5 లక్షలు చెల్లించినట్లు, మిగిలిన మొత్తం రూ.2.50 లక్షలు చెల్లించలేని స్థితిలో ఉన్నానని, తన భర్త శవాన్ని అప్పగించాలని మృతుని భార్య మౌమిత దూబే ఆస్పత్రి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం కనికరం చూపలేదు. బిల్లు మొత్తం చెల్లిస్తేనే భర్త శవాన్ని, పోస్టుమార్టం రిపోర్టును అప్పగిస్తామని స్పష్టం చేసింది. దీంతో బాధితురాలు సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. వెంటనే శవాన్ని ఆమెకు అప్పగించాలని ఆస్పత్రి యాజమాన్యానికి సూచించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు ఆదేశించింది. చనిపోయిన వెంటనే శవాన్ని అప్పగించాం.. ‘ఆస్పత్రికి వచ్చే సమయానికే జ్యోతిప్రకాష్ దూబే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స చేసినా బతకడం కష్టమని అప్పుడే చెప్పాం. మానవతా దృష్టితో ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స కూడా చేశాం. నెల రోజుల నుంచి ఆస్పత్రిలోనే ఉండి, అతను శుక్రవారం రాత్రి చనిపోయాడు. అప్పటికే రూ.7.50 లక్షలు బిల్లు అయింది. అందులో రూ.5 లక్షలు చెల్లించి, మిగిలిన మొత్తం తెల్లవారాక చెల్లిస్తానని మౌమిత స్వయంగా చెప్పారు. ఆమె కోరిక మేరకు అదే రోజు రాత్రి నిమ్స్ మార్చురికి శవాన్ని తరలించి అక్కడ భద్రపరిచాం. ఆ తర్వాత ఆమెను బిల్లు కూడా అడగలేదు. శవాన్ని అప్పగించలేదనే ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు’ అని ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి ప్రజా సంబంధాల విభాగం ఇన్చార్జి సత్యనారాయణ వెల్లడించారు. -
ఏపీపీఎస్సీ ఉద్యోగులపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోనికి అక్రమంగా చొరబడిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ సిబ్బందిపై తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ కో కన్వీనర్ కొంతం గోవర్దన్రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలోకి చొరబడి కీలకమైన రికార్డులను ఏపీపీఎస్సీ ఉద్యోగులు చిందర వందర చేసి, తారుమారు చేశారని, ఈ సంఘటనపై న్యాయ విచారణ జరపాలని హెచ్చార్సీని కోరారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్చార్సీ సెప్టెంబరు 21 లోగా సంఘటనకు సంబంధించి సమగ్రమైన నివేదికను అందజేయాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. -
తుపాకులున్నాయిగా.. ఒకేసారి కాల్చేయండి
పెదారికట్లకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త నిమ్మారెడ్డిది ఆత్మహత్య కాదని..అది కొనకనమిట్ల ఎస్సై చేసిన హత్య అని..ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాకులున్నాయిగా..వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఒకేసారి కాల్చేయండి అంటూ పోలీసులనుద్దేశించి ఘాటుగా స్పందించారు. నిమ్మారెడ్డి మృతదేహానికి ఆదివారం ఎంపీ నివాళులర్పించారు. - పోలీసులనుద్దేశించి ఘాటుగా స్పందించిన ఒంగోలు ఎంపీ వైవీ - వైఎస్సార్ సీపీ కార్యకర్త నిమ్మారెడ్డి మృతదేహానికి నివాళి - నిమ్మారెడ్డిది ఆత్మహత్య కాదు.. అది ఎస్సై చేసిన హత్య - కొనకనమిట్ల ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలన్న ఎంపీ పొదిలి : ‘పెదారికట్లకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త నిమ్మారెడ్డిది ఆత్మహత్య కాదు. అది కొనకనమిట్ల ఎస్సై చేసిన హత్య. ఈ విషయమై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. అసలు ఇవన్నీ ఎందుకు మీ చేతుల్లో తుపాకులున్నాయిగా.. మా కార్యకర్తలను ఒకేసారి కాల్చేయండి’ అంటూ పోలీసులను ఉద్దేశించి ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. కొనకనమిట్ల ఎస్సై మస్తాన్ షరీఫ్ వేధింపులకు తాళలేక పెదారికట్లకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిమ్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న నిమ్మారెడ్డి మృతదేహానికి ఎంపీ వైవీ ఆదివారం నివాళులర్పించారు. మృతుని తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చారు. సంఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చచొక్కాలు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. నిమ్మారెడ్డి మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళలని కూడా చూడకుండా నిమ్మారెడ్డి బంధువులను పోలీసుస్టేషన్లో మూడు రోజులు ఎలా నిర్బంధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు 24 గంటల్లో న్యాయం జరగాలని, లేదంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యలో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఆరు నెలల పసికందు తల్లిని కూడా కేసులో ఇరికించి రిమాండ్కు పంపించారంటే ఎస్సై ఎంత ఏకపక్షంగా వ్యవహరించారో అర్థమవుతోందన్నారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని సీఐ రవిచంద్రను కోరారు. కొడుకును పొగొట్టుకున్న తల్లిదండ్రులను ఎంపీ ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆరు నెలల బిడ్డతో రిమాండ్లో ఉన్న తల్లికి న్యాయం జరిగేలా చూడాలని ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డికి ఎంపీ వైవీ సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులురెడ్డి, పార్టీ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి, ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డి, కె.నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యుడు మెట్టు వెంకటరెడ్డి, సాయిరాజేశ్వరరావు, జవ్వాజి రంగారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, పార్టీ స్థానిక నాయకులు గొలమారి చెన్నారెడ్డి, ఆవుల చంద్రశేఖరరెడ్డి, రాచమల్లు వెంకటరామిరెడ్డి, కామసాని శేషిరెడ్డి, డి.శ్రీనివాసరెడ్డి, జి.ఓబులరెడ్డి, వీవీ రమణారెడ్డితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
కుమారుడిని రక్షించాలంటూ తల్లి ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ: మీర్పేట ఎస్ఐ తన కుమారుడిని తీసుకెళ్లి ఆసుపత్రి పాలు చేశాడని ఓ తల్లి మానవహక్కుల కమిషన్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. వివరాలు.. మీర్పేట్లోని లెనిన్నగర్కు చెందిన శివకుమార్ పెయింటింగ్ పనిచేస్తుంటాడు. సరూర్నగర్, మీర్పేట్ పోలీస్స్టేషన్లలో పలుదొంగతనాల కేసుల్లో గతంలో అరెస్టయ్యాడు. వెహికల్ చెకింగ్లో భాగంగా మీర్పేట్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా దొంగిలించిన బైక్తో వారం రోజుల కింద పట్టుబడ్డాడు. అతడిని విచారించగా మరో రెండు బైకులు, ఒక ల్యాప్టాప్లు దొంగిలించినట్లు తెలిసిందని, చోరీ కాబడిన మరో బైక్ వివరాలు చెప్పమని విచారిస్తుండగా బాత్రూంకు వెళ్లి యాసిడ్ తాగాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు చికిత్స నిమిత్తం ఆ యువకుడిని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుడు నెలన్నర నుంచి తమ ఇంట్లోనే ఉంటున్నాడని, నెల రోజుల కిందట ఇంట్లో గ్యాస్ స్టౌ పేలడంతో గాయాలయ్యాయని, స్తోమత లేక ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడని కుటుంబసభ్యులు అంటున్నారు. చావుబతుకుల మధ్య తమ కుమారుడు కొట్టుమిట్టాడుతున్నాడని ఈ విషయంలో ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కమిషన్ను కోరారు. -
అన్ని జైళ్లలో సీసీ కెమెరాలు: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కారాగారాల్లో క్లోజ్డ్ సర్క్యూట్ (సీసీ) టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. చిత్రహింసలను నిరోధించడానికి పోలీసుస్టేషన్లలో, లాకప్లలో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు పరిశీలించాలని సూచించింది. అన్ని జైళ్లలో ఏడాదిలోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలంది. అలాగే ప్రతి పోలీసుస్టేషన్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండేలా చూడాలని, రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్లలో ఖాళీలను మూడునెలల్లోగా భర్తీ చేయాలని ఆదేశించింది. -
ఈఎస్ఐ రోగులపై కనికరం
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే రోగులకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు విడుదల చేసింది. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయం లేకపోతే సంబంధిత రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు పంపిస్తారు. ఈ బిల్లులను ఈఎస్ఐ రీయింబర్స్మెంట్ చేస్తుంది. అయితే, ఏడాది కాలంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఈ బిల్లులు చెల్లించకపోవడంతో రూ. కోట్లు బకాయిలుగా ఉండిపోయాయి. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై గత జూన్ 22న ‘ఈఎస్ఐ రోగుల నరకయాతన’ అన్న శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి మానవహక్కుల కమిషన్ సైతం స్పందించి సుమోటోగా స్వీకరించింది. సాక్షి కథనంతో తెలంగాణ ప్రభుత్వం గత 15 రోజుల్లో 5 వేల మందికి పైగా రోగులకు సుమారు రూ.12 కోట్లు చెల్లించినట్లు ఈఎస్ఐ డెరైక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వైద్య ఖర్చుల బిల్లుల ఆధారంగా రోగులకు చెక్కులు పంపించినట్టు పేర్కొన్నాయి. అయితే, ఏపీ మాత్రం ఈఎస్ఐ రోగులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. కాగా, ఈఎస్ఐ డిస్పెన్సరీలు, పెద్దాసుపత్రుల్లో సాధారణ రక్తపరీక్షలు కూడా చేయడం లేదని రోగులు వాపోతున్నారు. గడిచిన మూడేళ్లలో రూ.150 కోట్ల విలువైన రక్తపరీక్షలకు సంబంధించిన పరికరాలు లేదా రీజెంట్స్ (స్ట్రిప్స్) కొనుగోలు చేసినట్టు మాత్రం చూపించారు. ఇవన్నీ ఎక్కడకు సరఫరా అయ్యాయనేది ప్రశ్నార్థకం. -
ఎమ్మార్వోపై దాడి: సుమోటోగా కేసు స్వీకరించిన హెచ్చార్సీ
కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి కేసును మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఇసుక క్వారీలోకి అక్రమంగా ప్రవేశించడమే కాక.. అక్కడి అక్రమాలను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసి ఆమెను ఇసుకలో ఈడ్చేసిన విషయాన్ని మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు ఇచ్చింది. జూలై 13 లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఎమ్మెల్యే దాడి విషయంలో ఎలాంటి సెక్షన్ల కింద కేసులు పెట్టారు, ఏ చర్యలు తీసుకున్నారనే అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదే ఘటనలో సాక్షి విలేకరి నవీన్పై కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. దీన్ని హెచ్చార్సీ సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనను రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా పరిగణించారు. రేపటినుంచి అన్ని రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేస్తామని హెచ్చరించారు. దీన్ని కూడా హెచ్చార్సీ గమనించింది. ఈ నేపథ్యంలోనే సీఎస్, కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీచేసింది. -
నలుగురూ ఆడ పిల్లలే పుట్టారని...ఓ కానిస్టేబుల్..
నాంపల్లి (హైదరాబాద్): నలుగురు ఆడ పిల్లలు పుట్టారని మరో పెళ్లికి సిద్ధమైన కానిస్టేబుల్పై అతని భార్యాపిల్లలు శుక్రవారం మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. అతడి నుంచి తమకు ప్రాణహాని ఉందని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బేగంపేట్కు చెందిన కానిస్టేబుల్ నర్సింహులు, బాలలక్ష్మీ భార్యాభర్తలు. వీరికి నలుగురు ఆడ పిల్లలు ఉన్నారు. తమకు నలుగురూ ఆడ పిల్లలే పుట్టారని ఈ మధ్య కాలంలో భర్త నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. సంతానంగా మగ పిల్లలు కావాలని మరో పెళ్లికి నర్సింహులు సిద్ధమయ్యాడు. భర్త మరో పెళ్లి చేసుకుంటే తాను, పిల్లలు రోడ్డున పడే ప్రమాదం ఉందని బాలలక్ష్మీ తెలిపింది. కాబట్టి భర్త నుంచి ప్రాణహాని లేకుండా తగిన రక్షణ కల్పించాలని కోరారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన హెచ్ఆర్సీ ఆగస్టు 26వ తేదీలోగా సమగ్ర నివేదికను అందజేయాలని మెదక్ జిల్లా ఎస్పీని ఆదేశించింది. -
ఎన్ఆర్ఐపై పోలీసుల దాష్టీకం
- ప్రవాస భారతీయుడిపై దాడి - డబ్బుల కోసం డిమాండ్ - హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితుడు - విచారణకు ఆదేశం - పోలీసులపై వేటుపడే అవకాశం నాంపల్లి/ముషీరాబాద్: ప్రవాస భారతీయుడిపై ముషీరాబాద్ పోలీసులు దాష్టీకం చేశారు. విచక్షణారహితంగా కొట్టి గాయపరచడంతో బాధితుడు వాసు మల్లాపురం సోమవారం మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపించి జులై 16లోగా నివేదికను అందజేయాలని హక్కుల కమిషన్.. నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. బాధితుడి కథనం ప్రకారం...మహేంద్ర హిల్స్ కు చెందిన వాసు మల్లాపురం 14 ఏళ్లుగా ఐర్లాండ్లో ఉంటున్నారు. వేసవి సెలవులకు నగరానికి వచ్చిన ఆయన ఈనెల 25న ముషీరాబాద్కు చెందిన తన స్నేహితులు ప్రీతమ్, నిఖిల్లతో కలిసి కోఠిలో ఓ హోటల్లో మద్యం తాగాడు. ఆ తర్వాత వారిని వదిలేందుకు ముషీరాబాద్ అనూషా అపార్ట్మెంట్కు వెళ్లిన అతను కారును పక్కన ఆపి స్నేహితులతో మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది అర్ధరాత్రి రోడ్డుపై ఏమి చేస్తున్నారంటూ తమపై దాడి చేసినట్లు తెలిపాడు. దీనిపై ప్రశ్నించడంతో పోలీసులకే ఎదురు చెప్తారా తమను స్టేషన్కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టినట్లు తెలిపా రు. అన ంతరం సీఐ దగ్గరకు తీసుకెళ్లగా అతను తమను దారుణంగా అవమానించడమేగాక, తమ ఫోన్లు లాక్కున్నారని, రూ. రూ.5 లక్షలు ఇస్తే వదిలి వేస్తానని, లేనిచో పాస్పోర్టులు సీజ్ చేస్తానని చెప్పాడన్నారు. లేని పక్షంలో పరారీలో ఉన్నాడంటూ మళ్లీ లోపల వేసి బొక్కలు ఇరగ్గొడతానని హెచ్చరించాడన్నారు. అంతేగాకుంగా తన స్నేహితుడిపై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారని వాపోయారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆతను కోరాడు. ఘటనపై డీసీపీ విచారణ కాగా ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఉన్నతాధికారుల ఆదేశంతో సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్రెడ్డి ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ బిట్టు మోహన్కుమార్, సెక్టార్ ఎస్సైలు సంపత్, భాస్కర్రావులను డీసీపీ కార్యాలయాలని పిలిపించారు. సమస్య హెచ్ఆర్సీ వరకు వెళ్లినా ఉన్నతాధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిందితుల్లో ఒక్కరిపై మాత్రమే కేసు నమోదు చేసి మిగతా ముగ్గుర్నీ ఎందుకు వదిలి పెట్టారని ప్రశ్నించిన ట్లు తెలిసింది. ఈ ఘటనకు బాధ్యులైన కానిస్టేబుళ్లు, ఎస్సైపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదేనా భద్రత హైదరాబాద్లో సీమాంధ్రుల భద్రతకు సెక్షన్-8 అమలు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నా వద్దనుకున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్నా సిబ్బందిలో మార్పురావడం లేదు. తప్పు చేయని వ్యక్తులపై పోలీసులు దాడి చేయడం దారుణం. వాసు మల్లాపురంపై జరిగిన దాడి హైదరాబాదులో శాంతిభద్రతల పరిస్థితికి అద్దంపడుతోంది. - ఎస్.చంద్రశే ఖర్ ( గ్రీన్ ఫీల్డ్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు) -
కేసీఆర్పై హెచ్ఆర్సీలో టీడీపీ నేతల ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హక్కులకు భంగం కలిగిందంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో వారి ఫిర్యాదును స్వీకరించిన హెచ్ఆర్సీ ఈ నెల 18 లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. -
‘ఆత్మహత్య చేసుకుంటా... అనుమతించండి’
పాయకరావుపేట (విశాఖపట్నం): నీటిపారుదల శాఖ అధికారుల నిర్వాకం వల్ల 25 ఏళ్లుగా పంట నష్టపోయానని, ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఓ రైతు మానవ హక్కుల కమిషన్కు దరఖాస్తు చేసుకున్నాడు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం మంగవరానికి చెందిన దేవవరపు వాసుదేవరావు తన గాధను విలేకరులకు వివరించారు. 1990 నుంచి గోపాలపట్నం కాలువ నీటివల్ల పంటలు మునిగిపోతున్నాయి. ఫలితంగా పంటనష్టం జరుగుతోంది. ఇదే ప్రాంతంలో వాసుదేవరావుకు ఐదెకరాల భూమి ఉంది. ఏటా పంట నష్టపోతున్నా ప్రభుత్వ పరంగా ఒక్కసారి కూడా నష్టపరిహారం మంజూరు కాలేదని ఆయన తెలిపారు. కాలువలో పూడిక తొలగించాలని, రక్షణ గోడ నిర్మించాలని.. 2006 నుంచి కలెక్టర్కు, ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రాలు పంపుతున్నా పట్టించుకోలేదన్నారు. ఆఖరికి తన భూమి పరిధిలో సొంత నిధులతో కాలువ రక్షణ గోడ నిర్మాణం చేపట్టేందుకు అనుమతి కోరగా రూ.30 వేలు లంచం ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేశారని వాసుదేవరావు ఆరోపించారు. పంటనష్టంతో అప్పులపాలైన తనకు ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆదివారం మానవహక్కుల కమిషన్కు దరఖాస్తు చేసినట్టు వాసుదేవరావు తెలిపారు. సోమవారం ఆన్లైన్లో లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేశానని వెల్లడించారు. కాగా రైతు ఆరోపణలపై ఇరిగేషన్ ఏఈ సత్యనారాయణదొరను వివరణ కోరగా నిబంధనల ప్రకారం శాఖ అనుమతితో రాతి గోడ నిర్మించుకోవాలని సూచించామని చెప్పారు. -
ధనికుడికో న్యాయం..పేదవాడికో న్యాయం
-
'ఎక్కడి నుంచో తెచ్చి కాల్చిచంపారు'
తిరుపతి : చిత్తూరు జిల్లాలోని తిరుపతి శ్రీవారి మెట్ల వద్ద మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్లో మరణించిన ఎర్రచందనం కూలీలను వేరొక ప్రాంతం నుంచి తీసుకొచ్చి కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం నేత క్రాంతి చైతన్య ఆరోపించారు. మృతదేహాల మీద బుల్లెట్ గాయాలను చూస్తే.. ఇది పక్కా బూటకపు ఎన్కౌంటరేనని తేలుతోందని గురువారం ఆయన చెప్పారు. మృతదేహాలలో ఎక్కడా బుల్లెట్లు లేవు, కేవలం అవి వారి శరీరాల నుంచి దూసుకెళ్లాయని చెప్పారు. కేవలం 5 నుంచి 10 మీటర్ల దూరం నుంచే కాల్పులు జరిగాయని అందువల్లే బుల్లెట్లు ఎర్రచందనం కూలీల శరీరాల నుంచి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. కూలీల శవాల పక్కన పిడిలేని గొడ్డళ్లను పోలీసులు పడేయటాన్ని గమనించినట్లయితే వాటిని అప్పుడే కొనుక్కొచ్చిన విషయం తెలుస్తోందన్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో రాళ్లు కూడాలేవని, మరి రాళ్లతో ఎర్రచందనం కూలీలు ఎలా దాడి చేశారో పోలీసులే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు పిట్టకథ అల్లుతున్నారనడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదని పౌర హక్కుల సంఘం నేత క్రాంతి చైతన్య వెల్లడించారు. -
అవినాష్ కు 14 రోజుల రిమాండ్
-
అవినాష్ కు 14 రోజుల రిమాండ్
కాకినాడ: ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నపేరాబత్తుల అవినాష్ దేవ్చంద్రకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం అవినాష్ ను పోలీసులు కోర్టుకు ముందు హాజరు పరిచారు. గురువారం డీజీపీ జేవీ రాముడు ముందు అవినాష్ లొంగిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం అతణ్ని నార్త్ కోస్టల్ ఐజీ అతుల్ సింగ్ ప్రత్యేక ఎస్కార్ట్తో తూర్పు గోదావరి జిల్లాకు పంపించారు. చినరాజప్ప బంధువునంటూ పలువురికి టోకరా వేయడమే కాకుండా, అతనిని నిలదీసిన బాధితులపై దాడికి పాల్పడినట్లు అవినాష్ పై పలు ఆరోపణలు వెలుగుచూశాయి. -
అవినాష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సుమోటోగా కేసు నమోదు చేసిన మానవ హక్కుల కమిషన్ కాకినాడ: ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ పలువురికి టోకరా వేయడమే కాకుండా, అతనిని నిలదీసిన బాధితులపై దాడికి పాల్పడి, చిత్రహింసలకు గురి చేసిన పేరాబత్తుల అవినాష్ దేవ్చంద్ర చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇతని వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు. గతంలో అవినాష్ను పట్టుకుని వదిలేసిన వ్యవహారంలో పెద్దాపురం సీఐ శ్రీధర్బాబు, ఎస్సై శివకృష్ణలకు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మంగళవారం చార్జి మెమోలు ఇచ్చారు. విచారణ అనంతరం వీరి పాత్ర ఉన్నట్టు తేలితే సస్పెండ్ చేస్తామని చెప్పారు. ఈ వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులను ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. అవినాష్ దురాగతాలపై ఏప్రిల్ 6 నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్లో అవినాష్?:ఇతడిని పట్టుకునేందుకు ఎస్పీ రవిప్రకాష్ ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని అవినాష్ నివాసానికి ఓ బృందం వెళ్లింది. పెద్దాపురానికి చెందిన లూథరన్ హైస్కూల్ కరస్పాండెంట్ ఇజ్రాయిల్ ఫిర్యాదు మేరకు అవినాష్పై కేసు నమోదు చేశారు. మరోపక్క బాధితులను చిత్రహింసలు గురి చేసిన వీడియో దృశ్యాల అధారంగా సుమోటోగా మరో కేసు నమోదైంది. కాకినాడకు చెందిన ఒక మహిళకు మానవ హక్కుల కమిషన్ రాష్ర్ట మహిళా విభాగం చైర్పర్సన్ పదవి ఇప్పిస్తానంటూ అవినాష్ రూ. 14 లక్షలు కాజేశాడన్న ఆరోపణలున్నాయి. దీనిపై కాకినాడ టూ టౌన్ పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. మరోవైపు మంగళవారం ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇటువంటి వ్యక్తికి గతంలో గన్మెన్ను ఎందుకు కేటాయించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నాడు స్మగ్లర్...నేడు చీటర్: అవినాష్ స్మగ్లింగ్కు కూడా పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నాలుగేళ్ల కిందట భద్రాచలం సమీపాన కారులో పులి చర్మాలను తరలిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో అవినాష్పై కేసు కూడా నమోదైంది. -
‘కఠిన చర్యలు తీసుకోండి’
హైదరాబాద్ సిటి: తల్లిపాల కోసం గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి ప్రాణాలోదిలిన బాబు హృదయవిదారక సంఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. మెదక్ జిల్లా హత్నూర్ మండలం కానాపూర్లో కూలికి వచ్చిన మహిళ తన బాలుడికి పాలివ్వడానికి కాంట్రాక్టర్ నిరాకరించడంతో ఈ ఘోరం సంభవించింది. ఈ విషయంపై సోమవారం తెలంగాణ తెలుగు మహిళా కన్వినర్ శోభారాణి మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. -
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోండి: హెచ్ఆర్సీ ఆదేశం
హైదరాబాద్: నిబంధనలకు వ్యతిరేకంగా తరగతులు నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుని మార్చి17లోపు నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్లకు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్న నగరంలోని పలు కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది సోమరాజు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఫంక్షన్హల్, షాపింగ్మాల్స్లో తరగతులు నిర్వహిస్తూ, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సహాయంతో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఫిర్యాదులో తెలిపారు. నిబంధనలు వ్యతిరేకంగా కోచింగ్ సెంటర్లు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకునేలా జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ పోలీసు కమిషనర్ ఆదేశించాలని ఆయన హెచ్ఆర్సీని కోరారు. దీంతో హెచ్ఆర్సీ స్పందించి ఈ ఆదేశాలు జారీచేసింది. -
జస్టిస్ కక్రూను వెంటనే తొలగించాలి
తెలంగాణ న్యాయవాదుల సంఘం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: విధులకు హాజరు కాకుండానే జీత భత్యాలు, ఇతర సౌకర్యాలను అనుభవిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూను వెంటనే తొలగించాలని తెలంగాణ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. ఉన్నత పదవిలో ఉన్నా అనైతికంగా ప్రవర్తిస్తున్నారని, చైర్మన్గా ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత ఆయనకు లేదని మండిపడింది. సంఘం అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ నేతృత్వంలో న్యాయవాదులు గురువారం కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. -
యూపీ సర్కార్కు మానవ హక్కుల కమిషన్ నోటీసు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో చలి బారీన పడి బాలురు మరణాలు సంభవించడంపై జాతీయ మానవహక్కుల కమిషన్ యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ముజాఫర్నగర్, షామ్లీలలో ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో 40 మంది బాలలు చలిబారీన పడి మరణించారన్న మీడియా వార్తలపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. ఈ శిబిరాల్లో బాధితుల మరణాల మీద వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, జిల్లా మేజిస్ట్రేట్కు నోటీసులిచ్చింది. -
హక్కులతో పాటు బాధ్యతలూ ముఖ్యమే
కలెక్టరేట్, న్యూస్లైన్: మానవ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమేనని మానవ హక్కుల కమిషన్ సభ్యులు పెదపేరిరెడ్డి అన్నారు. హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడే వ్యక్తులు తమ బాధ్యతలను గుర్తిస్తే హక్కులను రక్షించినట్లే అన్నారు. మంగళవారం మానవ హక్కుల దినోత్సవం బషీర్బాగ్లోని నిజాం పీజీ న్యాయ కళాశాల (ఉస్మానియా విశ్వవిద్యాలయం)లో నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపేరిరెడ్డి మాట్లాడుతూ 70 శాతం కేసులు మానవ హక్కుల చట్టపరిధిలో లేనివేనన్నారు. అయినప్పటికీ ఆ సమస్యల పరిష్కార దిశగా తాము కృషి చేస్తున్నామన్నారు. నేటి యువత ప్రేమంటూ జీవితాలను నాశనం చేసుకోకుండా తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. పీయూసీఎల్, న్యాయవాది జయవింధ్యాల, నిజాం న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గాలి వినోద్కుమార్ పాల్గొన్నారు. మానవహక్కుల పరిరక్షణ బాధ్యత అందరిదీ ఉస్మానియా యూనివర్సిటీ: మానవ హక్కుల పరిరక్షణ బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు అన్నారు. ఓయూ క్యాం పస్లోని కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్ర మహిళా సభలో మానవ హక్కుల దినోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా, బ్లూక్రాస్ అధినేత అక్కినేని అమల, జస్టిస్ లక్ష్మణ్రావు, కల్నల్ నరేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
మరిది వేధింపులపై హెచ్ఆర్సీని ఆశ్రయించిన వివాహిత
భర్త మద్యం మత్తులో కుటుంబాన్ని పట్టించుకోకపోవడాన్ని అలుసుగా తీసుకున్న మరిది, ఆడపడుచు కుమారుడు తనను లైంగికంగా వేధిస్తున్నారని రంగారెడ్డి జిల్లా పరిగి పట్టణానికి చెందిన వివాహిత అస్రా బేగం గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. వేధింపులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తక్షణమే తనను వేధిస్తున్న వారిపై చర్యలకు అదేశించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. పదేళ్ల్ల క్రితం అస్రాబేగంను గాజుల బస్తీ నివాసి మహ్మద్ ఖదీర్ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల వరకు కాపురం సజావుగానే సాగింది. ఎనిమిదేళ్ల క్రితం మద్యానికి బానిసైన భర్త అస్రాను వేధించసాగాడు. అయినా ఓర్చుకుంది. స్థానికంగా గాజుల షాపు నిర్వహిస్తూ పిల్లలను సాకుతోంది. అస్రాను భర్త పట్టించుకోకపోవడాన్ని అలుసుగా తీసుకుని, మరిది అసద్, ఆడపడుచు కుమారుడు అబ్బు అసభ్యంగా ప్రవర్తించసాగారు. తమతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నారు. ఇటీవల వాళ్లిద్దరు తన ఇంటికి వచ్చి లైంగిక దాడికి యత్నించినట్లు తెలిపింది. ఈవిషయమై అసద్, అబ్బును తన తమ్ముళ్లు నిలదీయగా వారిపై దాడి చేసినట్లు తెలిపింది. భర్త కూడా లైగింక వేధింపులను తప్పుపట్టకుండా తనపైనే అసత్య ప్రచారం చేస్తూ ఇంటికి రాకుండా తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడని వాపోయింది. అత్త రాజకీయ నాయకురాలవడంతో ఆమె పలుకుబడితో పోలీసులు కేసును పట్టించుకోవడం లేదని కన్నీటిపర్యంతమైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్త, అత్త, కుటుంబీకులు ఏ క్షణమైనా పిల్లలతో ఒంటరిగా ఉంటున్న తనపై దాడి చేసే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తనను వేధిస్తున్న మరిది, ఆడపడుచు కుమారుడిపై చర్య తీసుకొని తనకు రక్షణ కల్పించాలని వివాహిత మానవ హ క్కుల కమిషన్ను వేడుకుంది. నివేదిక అందించాలని ఎస్పీకి ఆదేశం అస్రాబేగంను వేధిస్తున్న విషయమై సమగ్ర విచారణ జరిపి జనవరి 20 తేదిలోపు నివేదిక సమర్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రంగారెడ్డి జిల్లా ఎస్పీని అదేశించారు. బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
‘పాలెం’ దుర్ఘటనపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
ఏలూరు: మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనలో మృతి చెందిన 45 మంది ప్రయాణికుల కుటుంబాలకు న్యాయం చేసి, దేశ రహదారులకు అనువుగా లేని వోల్వో బస్సులను రద్దు చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన న్యాయ విద్యార్థి జి.అరిస్టాటిల్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాన్ని విచారణకు స్వీకరించిన హెచ్ఆర్సీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, రవాణాశాఖ, ఆర్టీసీ, పోలీసు శాఖలు పనితీరు మెరుగుపరుచుకునేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవిద్యార్థి నవంబర్ 16న హెచ్ఆర్సీని కోరారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన మానవ హక్కుల సంఘం విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఆర్టీసీ మేనేజింగ్ డెరైక్టర్, డీజీపీలకు నోటీసులు జారీచేసింది. -
‘సమాచారచట్టం’తోనే పారదర్శకత : పీకే మహంతి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తోందని, అటువంటి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు, అధికారులందరూ ప్రజలకు జవాబుదారీలేనని, ప్రజలకు సమాచారం ఇవ్వడం వారి బాధ్యతని గుర్తుచేశారు. గురువారం జూబ్లీహాల్లో నిర్వహించిన సమాచారహక్కు చట్టం సెమినార్లో మహంతి పాల్గొన్నారు. సమాచార కమిషనర్లు, ప్రజా సమాచార అధికారులు, అప్పీలేట్ అథారిటీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ఎస్.కే సిన్హా మాట్లాడుతూ... పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి నిర్మూలనకే ప్రభుత్వం సమాచార చట్టాన్ని తెచ్చిందని, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరేందుకు ప్రభుత్వం, సమాచార కమిషన్ మరింత శ్రమపడాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలకు సమాచారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని ప్రధాన సమాచార కమిషనర్ జన్నత్ హుస్సేన్ హెచ్చరించారు. కార్యక్రమంలో సమాచార కమిషనర్లు సి. మధుకర్రాజ్, ఎస్. ప్రభాకర్ రెడ్డి, పి. విజయబాబు, ఎం. రతన్, వర్రె వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, ఇంతి యాజ్ అహ్మద్, విజయ నిర్మల సమాచారహక్కుచట్టం ఆవశ్యకతను వివరించారు. -
చిన్నారుల హక్కులు హరిస్తున్న ప్రభుత్వాలు
సాక్షి, బెంగళూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా లక్ష్య సాధనలో అంగన్వాడీ కేంద్రాలు విఫలమవుతున్నాయంటూ రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల సంఘం అధ్యక్షుడు జీఆర్ శివశంకర్ విమర్శించారు. గురువారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని పెంచేవిగా అంగన్వాడీ కేంద్రాలు తయారవుతున్నాయని, తద్వారా చిన్నారుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయంటూ మానవహక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా 64,518 అంగన్వాడీ కేంద్రాల్లో 25 లక్షల మంది చిన్నారులు ఉన్నారని వివరించారు. ఒక్కొక్క చిన్నారికి పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కేటాయించిన ఆరు రూపాయల నుంచి 25 శాతం వాటా అక్రమార్కుల జేబుల్లోకి చేరిపోతుండడంతో లక్ష్య సాధన ఎంత వరకు సాధ్యమని ప్రశ్నించారు. చాలా అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కరువయ్యాయని అన్నారు. అంగన్వాడీల పని వేళలను సాయంత్రం నాలుగు గంటల వరకు పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ కారణంగా మధ్యాహ్న సమయంలో చిన్నారులు నిద్రకు దూరమవుతున్నారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులే ఉంటారని, వారికి సరైన నిద్రను దూరం చేయడం ద్వారా చిన్నారుల హక్కులకు భంగం కలుగుతోందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం న్యాయమూర్తి ఎస్కే పాటిల్ కమిటీ సిఫారసులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఏడాదికి రెండు సార్లు యూనిఫామ్లు అందజేయాలని కోరారు. ప్రతిమూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. మధ్యాహ్న సమయం చిన్నారులు నిద్రించేందుకు వీలుగా చాప, బెడ్షీట్లను అందజేయాలని, కేంద్రాల పని వేళలను మధ్యాహ్నం 1.30 గంటలకు పరిమితం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే అక్టోబర్ రెండవ వారం నుంచి అంగన్వాడీ కేంద్రాలకు తాళం వేసి సమ్మెకుదిగుతామని హెచ్చరించారు. -
పోలీసులా.. రౌడీలా?
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంకోసం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన సందర్భంగా అక్కడకు వెళ్లిన తమ పట్ల కాచిగూడ ఎస్సై సైదులు, సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, అకారణంగా కొట్టారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్రెడ్డి, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు శివకుమార్, హైకోర్టు న్యాయవాది నాగిరెడ్డి తదితరులు కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. ‘‘నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం విషమించడంతో గత నెల 29న జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో మా పార్టీకి చెందిన ప్రతినిధులం ఆస్పత్రికి చేరుకున్నాం. ఆస్పత్రి గేటువద్ద శాంతియుతంగా ఉన్న మాపై సివిల్ దుస్తుల్లోని పోలీసులు విరుచుకుపడ్డారు. మర్మాయవాలపై లాఠీలు, బూటు కాళ్లతో తంతూ విచక్షణారహితంగా చితకబాదారు’’ అని వివరించారు. దాడిలో ప్రతాప్రెడ్డితోపాటు బండారు సుధాకర్, ఎం.సరోజ్రెడ్డి, మాజిద్తోపాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అనంతరం తమను కాచిగూడ పోలీస్స్టేషన్కు తరలించారని, అక్కడ ఎస్సై సైదులు పత్రికల్లో రాయలేనివిధంగా దుర్భాషలాడుతూ మళ్లీ తమపై దాడి చేశారని వివరించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే వీధిరౌడీల్లా దాడి చేశారని, జగన్కు మద్దతుగా ఎవరూ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ తరహా దాడికి పాల్పడ్డారని తెలిపారు. జగన్ దీక్షకు మద్దతు తెలిపే తమ హక్కుకు పోలీసులు విఘాతం కలిగించారని, అకారణంగా దాడి చేసి తమ జీవించే హక్కును కాలరాశారని పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద విధుల్లో ఉన్న పోలీసుల ఫొటోలను చూపిస్తే తమపై దాడి చేసినవారిని గుర్తించగలమన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించి తమపై దాడికి పాల్పడిన పోలీసులు, ఎస్సై సైదులుపై క్రిమినల్ చర్యలతోపాటు శాఖాపరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కమిషన్.. ఈ వ్యవహారంపై ప్రత్యక్షంగా విచారణ జరిపి ఈనెల 19లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని తూర్పు మండల డీసీపీని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.