-
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి అత్యంత విశిష్టత ఉంది. ఈ పండుగను ఇవాళే జరుపుకుంటాం. వైశాఖంలో వచ్చే ఈ శుక్ల పక్ష తదియకు ఎందుకంత ప్రాముఖ్యం. పైగా ఈ రోజు బంగారం కొంటే అక్షయం అవుతుందని నమ్ముతారు. అసలు బంగారానికి ఈ అక్షయ తృతియకు సంబంధం ఏంటీ?. ఈ రోజున ఏం చేస్తారు..?ఆ పేరు ఎలా వచ్చిందంటే..మత్స్య పురాణం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే ఇంత విశిష్టత ఈ తిథికి. ఈరోజు ఉపవాస దీక్ష చేసి.. ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి "అక్షయ తృతీయ" అని పేరు.ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును బ్రాహ్మణులకు దానమిచవ్వగా.. మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందుతారని పురాణోక్తి. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుంచి కావచ్చు, యవల నుంచి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.విశిష్టత..కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు. అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే. అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే..ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజిది.బంగారం కొనాల్సిందేనా..?అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. పురాణాల ప్రకారం, కలి పురుషుడు ఐదు స్థానాల్లో ఉంటాడు. అందులో ఒకడి పసిడి. బంగారాన్ని అహంకరానికి హేతువుగా పరిగణిస్తారు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమే అర్థమని కొందరి వాదన. అయితే ఈరోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకొచ్చిందంటే.. ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు.. దానం చేయాలన్నది అసలు విషయం. అయితే బంగారం కొనుగోలు చేసే శక్తి, సామర్థ్యాలు చాలా మందికి ఉండవు. అందుకే ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పెద్దలు చెబుతారు. అంతేగాదు ఈ రోజున ఏ కార్యాన్ని తల పెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయతృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.ఈ రోజునే పురాణల్లో జరిగిన సంఘటనలు..కృతయుగం ఆరంభం అయిన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునే అని విష్ణుపురాణంలో ఉంది.నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే ..ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడుశ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు..వైశాఖ శుద్ద తదియ రోజు రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయతృతీయే వ్యాస మహర్షి "మహా భారతం" వినాయకుడి సహాయంతో రాయడం మొదలెట్టిన రోజు అక్షయ తృతీయ అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజేకుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజేకటిక దారిద్రం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి బిక్షకు వెళ్లిన జగద్గురు ఆదిశంకరాచార్యులు "కనకధారాస్త్రోత్రం" పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదేఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు..బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది. సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం , చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయఅన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం. -
గంగాస్నానం ఎంత గొప్పదంటే...
గంగేమాం పాహి... అంటూ ముత్తుస్వామి దీక్షితార్ వారు చేసిన కీర్తన చివరి చరణాల్లో. ‘‘..సకల తీర్థమూలే సద్గురు గుహలీలే/వరజహ్నుబాలే వ్యాసాది కృపాలే’’ అంటారు. దీక్షితార్ వారి కీర్తికి ప్రధాన కారణం గంగమ్మ ప్రసాదంగా లభించిన వీణకాగా మరొకటి తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం. సద్గురువు అయిన గుహుడు.. సుబ్రహ్మణ్యుడు గంగానది ఒడ్డున ఆడుకునేవాడని అన్నారు. అక్కడ ఆడుకునేవాడని చెప్పడం వెనుక సుబ్రహ్మణ్య జననం గురించి గుర్తు చేస్తున్నాడు. శివవీర్యం తేజస్సు భరించలేని దేవతలు దానిని అగ్నిహోత్రునివద్ద ఉంచారు. ఆయన ఒకనాడు గంగమ్మ దగ్గరకు వెళ్ళి...‘‘ఇది దేవతాకార్యం. దీనిని నీవు ఉంచుకుని గర్భం ధరించు’’ అన్నాడు. గంగ అంగీకరించింది. అయితే శివ తేజస్సు శరీరం అంతటా ప్రవహించేసరికి తట్టుకోలేక..‘నేను వదిలిపెట్టేస్తాను.. ఎక్కడ వదిలిపెట్టేయను’ అనడిగింది. ‘‘రెల్లుగడ్డి పొదలో వదిలి పెట్టు’’ అని అగ్నిహోత్రుడు సలహా ఇచ్చాడు. అదే శరవణ భవ.. మంత్రం. అక్కడ సుబ్రహ్మణ్య జననం జరిగింది. అందువల్ల బాల సుబ్రహ్మణ్యుడు గంగానదీ ప్రవాహ తీరంలో ఆడుకునేవాడు. అదే సద్గురు గుహలీలే... అన్న చరణం. బ్రహ్మ, విష్ణు స్పర్శ పొందిన గంగ... సగరుల భస్మరాశిమీదుగా ప్రవహించడానికి పాతాళానికి భాగీరథుడి రథం వెంట పరుగెడుతూన్నది. మార్గమధ్యంలో జహ్నుమహర్షి యజ్ఞవాటికను ముంచెత్తడంతో ఆయన ఆగ్రహించి మొత్తం గంగను తపశ్శక్తితో లోపలకు పుచ్చేసుకున్నాడు. భగీరథుడి అభ్యర్థన మేరకు మళ్ళీ విడిచిపెట్టాడు. అలా గంగ రుషి పుత్రిక జాహ్నవి అయింది. వ్యాసాది కృపాలే... అని కూడా అన్నాడు.. వ్యాసమహర్షికి గంగానది అంటే ఎంత వ్యామోహమో! పరమశివుడు శపిస్తే... గంగను, కాశీని వదిలిపెట్టి పోవడానికి వ్యాసుడు క్షోభిల్లాడు. గంగకు ఒకగొప్పదనం ఉంది. గంగావతరణమ్ గురించిగానీ, గంగను గురించిగానీ వింటే చాలు... అంటారు భీష్ముడు అనుశాసనిక పర్వంలో అంపశయ్య మీద పడుకుని ధర్మరాజుతో మాట్లాడుతూ –‘‘గంగానది పేరు తలచుకోవడం గానీ, గంగలో స్నానం చేయడం గానీ, ఒక చుక్క గంగనీటిని నాలుకమీద వేసుకోవడం గానీ చేయాలి. ఆచరించవలసినవే అయినప్పటికీ యజ్ఞయాగాదులకన్నా, బ్రహ్మచర్యం కన్నా, తపస్సుకన్నా, దానం కన్నా, గంగాస్నానం గొప్పది’’ అంటాడు. కాశీఖండంలో శ్రీనాథుడు...‘‘గౌరియొక్కతె యాకాశగంగ యొకతె/కాశియొక్కతె దక్షిణకాశి యొకతె/నలుగురును శంభునకు లోకనాయకునకు/రాణ్ వాసంబులనురాగ రసమ పేర్మి?’’ అని అంటాడు భీమేశ్వర పురాణంలో. అంటే గౌరిని ఎంతగా ప్రేమిస్తాడో శంకరుడికి గంగ, కాశి, దక్షిణ కాశి అన్నా కూడా అంతే అనురాగమట. ఎవరయితే భక్తితో గంగానది పేరు తలచుకుని ఒక్క గంగనీటి చుక్కను నాలుకమీద వేసుకుంటారో వారికి యమధర్మరాజుతో సంవాదం లేదన్నారు. అంటే వారికి యమదూతల దర్శనం ఉండే అవకాశం లేదు. అంతగొప్పగా గంగానదీ వైభవాన్ని కీర్తించిన ముత్తుస్వామి దీక్షితార్ వారి నోట కీర్తనల రూపంలో ప్రవహించిన శాబ్దికగంగను కూడా మనం నిత్యం వింటూ ఉండాలి. (చదవండి: అక్కా తమ్ముడు-అన్నా చెల్లెళ్లకు ఆ ఆలయంలోకి నో ఎంట్రీ!) -
'శ్రీ పంచమి'కి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజే అక్షరాభ్యాసాలు ఎందుకు?
ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనగా మనకు కొన్ని పండుగలు ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో శ్రీపంచమి ఒకటి. మాఘ శుద్ధ పంచమినాడు ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని సరస్వతీ జయంతి, మదన పంచమి అని కూడా అంటారు. ఇది రుతు సంబంధమైన పర్వం. వసంత రుతువుకు స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది. వసంత రుతువు రాకను భారతదేశమంతటా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది కనుక ఈ మాఘ శుద్ధ పంచమిని ‘వసంత పంచమి’గా వ్యవహరిస్తారు. అయితే ఈ పంచమినే రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎందుకని? ఈ తిథికి ఎందుకంత ప్రాముఖ్యత? రుతు సంబంధమైన పండుగ కావడంతో, దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పర్వదినాన్ని 'శ్రీపంచమి', 'మదన పంచమి', 'సరస్వతీ జయంతి' అనే పేర్లతోనూ పిలుస్తారు. మకర సంక్రాంతి తరవాత వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. చెట్లు చిగురించడం, పూలు పూయడం వంటి శుభ సంకేతాలు ఇదే రుతువులో ఆరంభమవుతాయి. వసంతుడికి ఆహ్వానం పలుకుతూ ప్రకృతి కాంత శోభాయమానంగా విరాజిల్లుతుంది. జ్ఞానానికి అధిదేవత సరస్వతీ దేవి. ఆమె జ్ఞాన స్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైనవాటిని చదువుల తల్లి సరస్వతీదేవి అంశలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెబుతారు మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి. వసంతం అందరికీ ఎనలేని ఆనందం కలిగిస్తుంది. హరి పూజ, నూతన వస్త్రధారణను విధులుగా భావిస్తారు. రంగులు చల్లుకుంటారు. కొత్త ధాన్యం వచ్చే రోజులు కాబట్టి, బియ్యంతో పాయసం వండి నైవేద్యం పెడతారు. ఈ వసంత పంచమిని రాజస్థాన్లో విశేషంగా ఆచరిస్తారు. వంగ దేశంలో 'శ్రీ పంచమి' పేరుతో నిర్వర్తిస్తారు. సరస్వతి జన్మించిన రోజుగా భావించి, ఆ దేవిని భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. గ్రంథాలను ఆ ప్రతిమ దగ్గర ఉంచి, పూజించి, సాయంకాలం వూరేగింపుగా వెళ్లి జలాశయంలో నిమజ్జనం చేస్తారు. రోమనులు సైతం పూజించేవారు.. ప్రాచీన కాలంలో రోమనులు సైతం ఈ ఉత్సవం జరిపేవారని చరిత్ర చెబుతోంది. ‘బ్రహ్మ వైవర్త పురాణం’ వసంత పంచమినాడే సరస్వతిని పూజించాలంటుంది. రతీదేవికి, కామదేవుడికి, వసంతుడికి పూజలు చేస్తారు. ముగ్గురూ ఒక్కరోజునే పూజలందుకుంటారు. వసంతోత్సవాల్ని వేర్వేరు పేర్లతో, పలు విధాలుగా ఆచరిస్తుంటారు. ఇది శీతకాలానికి, వేసవి కాలానికి సంధికాలం కావడంతో ప్రజలకు ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త పంటలు వచ్చే కాలం ఇది. పైగా పశువులకు గ్రాసం పుష్కలంగా లభించేది కూడా ఈ కాంలోనే. ఇక వసంత పంచమినాడే సరస్వతీ జయంతి కావడంతో, ఈ పర్వదినం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అక్షరానికి ఆమె అధిదేవత. ప్రణవ స్వరూపిణి, జ్ఞానానంద శక్తి, లౌకిక-అలౌకిక విజ్ఞాన ప్రదాయిని ఆమె. శ్రీవాణి కృప లేకుంటే, లోకానికి మనుగడే లేదు. వాగ్దేవి ఉపాసన వల్ల వాల్మీకి రామాయణ రచన చేశాడంటారు. శారద దీక్ష స్వీకరించి, వ్యాసుడు వేదవిభజన చేయగలిగాడంటారు. ఆదిశేషువు, బృహస్పతి, ఆదిశంకరులు, యాజ్ఞవల్క్యుడు వంటి ఎందరో శారదానుగ్రహం కారణంగా జ్ఞాన సంపన్నులయ్యారు. నాటి వ్యాసపురే నేటి బాసరగా.. వ్యాసుడు గోదావరీ తీరాన సైకతమూర్తి రూపంలో వాణిని ప్రతిష్ఠించాడని పురాణ కథనం. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, బాసరగా ప్రసిద్ధి చెందింది. సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. వసంత రుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి, శ్వేత వస్త్రాలంకృతగా హంస వాహినిగా తామర పుష్పం మీద కొలువుతీరి జ్ఞాన క్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధాశక్తి, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. అంత మహిమాన్వితమైన ఈ రోజునే చిన్నారులకు అక్షరాభ్యసం చేయిస్తే చక్కగా చదువుకుని వృద్ధిలోకి వస్తారని భక్తుల నమ్మకం. వేదాలు సరస్వతీ మాత నుంచే వెలువడ్డాయని ‘గాయత్రీ హృదయం’ గ్రంథం అభివర్ణించింది. సరస్వతీనది అంతర్ముఖీనమై గంగ యమునలతో కలిసి ‘త్రివేణి’ గా విరాజిల్లింది. దేశ విదేశాల్లో గీర్వాణి ఆరాధనలందుకుంటోంది. సరస్వతీదేవి వద్ద ఆయుధాలుండవు. అలాగే గ్రీకులు, రోమనులు ఆమెను జ్ఞానదేవతగా పూజించేవారు. వసంత పంచమిని విద్యారంభ దినంగా పరిగణిస్తారు. జ్ఞానశక్తికి అధిష్టాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలత్వాదుల్ని అనుగ్రహిస్తుందంటారు. సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసాదేవి. అమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీ దేవిని అహింసకు అధినాయికగా పేర్కొంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రితవరదాయినిగా దర్శనమిస్తుంది. సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి, శ్వేత వస్త్రాలంకృతగా హంస వాహినిగా తామర పుష్పం మీద కొలువుతీరి జ్ఞాన క్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంతరుతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త బ్రహ్మకు శారదే శక్తిదాయిని. అందువల్లే ఈ వసంత పంచమిని విద్యారంభ దినంగా పరిగణించారు మన పెద్దలు. (చదవండి: భవ్య రామమందిరంలోని బాలరాముడి కళ్లను వేటితో చెక్కారో తెలుసా!) -
‘ప్రామిస్ డే’ అంటే ఏమిటి? వాలంటైన్ వీక్లో దీని ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న ‘ప్రామిస్ డే’గా జరుపుకుంటారు. ఇది ప్రేమికుల వారంలో ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతి సంబంధానికి ఈ రోజు ప్రత్యేకమైనదే అయినప్పటికీ, ప్రేమికులకు ‘ప్రామిస్ డే’ ఎంతో ప్రాధాన్యత కలిగినది. ‘ప్రామిస్ డే’నాడు ప్రేమికులు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. బలహీనపడ్డ బంధాలకు తిరిగి ప్రాణం పోయవచ్చు. అయితే మీరు మీ భాగస్వామికి ఎలాంటి ప్రామిస్ చేయలి? ఈ విషయంలో ఎంత నిజాయితీగా వ్యవహరించాలి? అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన అనుబంధాల విషయంలో మీ ఇష్టాలు, అయిష్టాలను అవతలి వ్యక్తిపై ఎట్టిపరిస్థితుల్లోనూ రుద్దకూడదు. అలా కాదని మీకు నచ్చినట్లు వ్యవహరిస్తే క్రమంగా సంబంధం బలహీనపడుతుందని గుర్తించండి. మీరు నిజాయితీగా భాగస్వామిని ప్రేమిస్తే వారు ఎలా ఉన్నారో అలానే అంగీకరించండి. ఈ ప్రామిస్ డే నాడు హృదయ పూర్వకంగా భాగస్వామికి ఇటువంటి వాగ్దానం చేయండి. నాకోసం నువ్వు మారాలని ఏనాడూ కోరనని వాగ్దానం చేయండి. గతంలో ఏమి జరిగినా, వాటిని హృదయపూర్వకంగా అంగీకరించండి. మధురంగా మాట్లాడటం, బహుమతులు ఇవ్వడం ద్వారా ప్రేమికులు పరస్పరం ప్రపోజ్ చేసుకుంటారు. ప్రతి కష్టమైన మలుపులో తోడుగా ఉంటానని చెప్పుకుంటారు. ఈ హామీని ప్రతీ ఒక్కరూ నిలబెట్టుకోలేరు. అయితే దీనిని నిలబెట్టుకోవడంలోనే అసలైన ప్రామిస్కు అర్థం ఉంటుంది. అబద్ధం చెప్పే అలవాటు ఉంటే ఎలాంటి సంబంధమైనా కొద్దికాలానికే తెగిపోతుంది. అబద్ధాలు వినడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే వాటిని చాలామంది అలవోకగా మాట్లాడేస్తుంటారు. ప్రామిస్ డే నాడు మీ భాగస్వామితో జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని వాగ్దానం చేయండి. -
సంక్రాంతికి ముగ్గులు వేయడంలో దాగున్న ప్రాశస్త్యం ఏంటీ?
'సంక్రాంతి వచ్చింది తుమ్మెద' 'సరదాలు తెచ్చింది తుమ్మెదా'.. అన్న పాటలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడ ఉన్నవాళ్లు కష్టపడి మరి తమ సొంతూళ్లకి వచ్చేస్తారు. ఎంత ఖర్చు పెట్టి అయినా పండుగకి ఊరు వెళ్లి పోవాల్సిందే. అక్కడ ఉండే సందడే వేరు. ముఖ్యంగా కోడిపందాలు, పిండి వంటలతో ఊరు ఊరంతా సందడి సందిడిగా ఉంటుంది. ఈ పండుగల్లో మంచి ఆకర్షణగా కనిపించేవి ముగ్గులు. వచ్చిరాని పడుచులు సైతం ఏదో రకంగా ముగ్గు వేసి శభాష్ అనిపించుకోవాలని తెగ ఆరాట పడిపోతుంటారు. అసలు ఈ నాలుగు రోజుల పండుగల్లో కచ్చితంగా రకరకాల రంగవల్లులతో ముగ్గులు పెడతారు ఎందుకని? దీని వెనుక దాగున్న రహస్యం ఏంటీ? వాస్తవానికి సాధారణ రోజుల్లో కూడా ఇంటి ముందు ముగ్గులు వేస్తాం. ఇలా ముగ్గులతో వాకిళ్లను అందంగా అలంకరిస్తే ఇంటికి శ్రేయస్సును తెస్తాయని పెద్దల నమ్మకం. పైగా లక్ష్మీ దేవిని ముచ్చటపడి ఇంట్లోకి వస్తుందని, ఆమె అనుగ్రహం లభిస్తుందని పురాణ వచనం. ముగ్గు ప్రాముఖ్యత.. హిందూసంప్రదాయంలో ముగ్గులకు అధిక ప్రాధాన్యం ఉంది. ముగ్గులు వేయడానికి ఎంతో చారిత్రక సంబంధం కూడా ఉంది. ముగ్గుల్లో తామర పువ్వు, పూల ఆకారాలు, నెమళ్లు, మామిడి పండ్లు, చేపల చిహ్నాలు ఎక్కువగా ఉంటాయి. రంగురంగుల ముగ్గులను చూసినప్పుడు ప్రశాంతత, దైవిక శక్తుల ఉనికిని అనుభవిస్తారు. ఇంట్లోకి దేవతలను స్వాగతించడానికి, ప్రజలను ఆశీర్వదించడానికి దేవతల చిత్రాలను, లక్ష్మీ దేవి పాద చిహ్నాలను గీస్తారు. అలాగే అతిథులను స్వాగతించడానికి కూడా ఇలా ముగ్గులు వేస్తారు. అయితే చరిత్ర మాత్రం చెడున అరికట్టి మంచి చేకూరాలనే ఉద్దేశ్యంతో తెల్లటి బియ్యపిండితో ముగ్గు వేస్తారని చెబుతోంది. ఇది శరీరానికి మంచి ఫిట్నెస్ లాంటిది కూడా.. ఓర్పును నేర్పే కళ… ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్ల ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి. భోగి నాడు వేసే ముగ్గు ఇష్టంతో కూడిన కష్టం! పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు. శాస్త్రీయ కారణాలు.. చుక్కలను కలిపే వక్ర నమూనాలు విశ్వంలోని అనంతమైన స్వభావాన్ని సూచిస్తాయి. ఇటువంటి నమూనాలు ధ్వని వేవ్ హార్మోనిక్స్ను పోలి ఉంటాయి. వీటిని చూస్తే డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో సహా అనేక రుగ్మతలు దరిచేరకుండా మనసు ఆహ్లాదభరితంగా ప్రశాంతంగా ఉంటుంది. తెలియకుండానే మనసులో ఓ ఆధ్యాత్మకి భావన వస్తుంది. విశ్వకవి రవీంద్రుడు సైతం ముగ్గు గురించి ప్రస్తావించారు! అంతేకాదండోయ్ రవీంద్రనాథ్ ఠాగోర్ 1919 లో రాసిన 'బంగ్లర్ బ్రత' అనే పుస్తకంలో వ్రతం, పూజ విధానాలలో 'అల్పన' (ముగ్గు) గురించి ప్రస్తావించారు. లక్ష్మీకాంత్ ఝా అరిపన్' మిథిల జానపద సంస్కృతి గురించి రాసిన రచనలలో రంగోలి ప్రస్తావన తెచ్చారు. ఇక ఈ ముగ్గులు వేయడం అనేది కేవలం దక్షిణాదికే పరిమితం కాదని భారతదేశం అంతటా ఈ ముగ్గులు వేయడం అనేది వారి సంస్కృతిలో భాగం అని పరిశోధకులు కూడా పేర్కొన్నారు. అంతేగాదు కామశాస్త్రంలో ప్రస్తావించిన 64 కళల్లో నృత్యం, సంగీతం, తలపాగాలు చుట్టడం, పూల మాలలు అల్లడం, వంటలు, అల్లికలతో పాటు ముగ్గులు వేయడాన్ని కూడా ఒక కళగా పేర్కొన్నారని చెప్పారు. అంతటి ప్రాశస్యం గల ఈ ముగ్గులను రకరకాల రంగవల్లులతో తీర్చిదిద్ది కలర్ఫుల్గా జోయ్ఫుల్ చేసుకోండి ఈ సంక్రాంతి పండుగని. (చదవండి: భోగి రోజే గోదా కళ్యాణం.. చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు?) . -
సంక్రాంతిని 'పెద్ద పండుగ' అని ఎందుకు పిలుస్తారు?
భోగభాగ్యల భోగి పండుగను చిన్నా పెద్ద అంతా ఆనందంగా జరుపుకున్నారు. ఇక తరువాత రోజే అసలైన పండుగ 'సంక్రాంతి'. ఈ పండుగ రోజు ఉండే హడావిడి అంతా ఇంత కాదు. పైగా ఈ పండుగను పెద్దల పండుగ లేదా పెద్ద పంగ అని అంటారు. ఈ రోజు నవ్వులతో చేసిన వంటకాలను తప్పకుండా తింటారు. నాలుగు రోజులు పండుగల్లో ఈ సంక్రాంతి మాత్రమే ఎలా పెద్ద పండుగ అయ్యింది?. ఇన్ని సంక్రమణాలు ఉండగా ఈ సంక్రమణానికి ఎందుకంత విశిష్టత? నెలకు ఒక రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం కలిపి 12 రాశుల్లో సంచరిస్తాడు. రాశిమారిన ప్రతిసారీ సంక్రమణం అంటారు. కానీ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు. అదే సంక్రాంతి పండుగ. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన అధ్యాయం మొదలు కాబోతుందనే దానికి సంకేతం. అలాగే దక్షిణదిక్కువైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తరదిక్కులో సంచరిస్తుంటాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. ఈ సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. సంక్రాంతి ఎలా పెద్ద పండుగంటే.. సంక్రాంతి పండుగ సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు. ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకుని తినరు. ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు. అందుకే ఆ బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు తయారు చేస్తారు. ఇలా చేస్తే పిండివంటలు చేసుకున్నట్లు కూడా ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ పొంగల్ అని పిలుస్తారు. పంట చేతికందించిన దేవుడికి ధన్యవాదాలు తెలిపేందుకు ఇలా నైవేద్యం సమర్పిస్తారు. ఈ పండుగలో ముఖ్యంగా ప్రకృతిని పూజించడంతోపాటు పశువులను కూడా పూజిస్తుంటారు. అలాగే సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా ప్రతి పదార్థంలో నువ్వులు ఉంటాయి. సూర్య భగవానుడికి సమర్పించే నీటిలోనూ నువ్వులు వేస్తారు. సంక్రాంతి సమయంలో నువ్వుల వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు అప్పటి వరకు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. దీని వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటి నుంచి తట్టుకునేలా శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు నువ్వులను కచ్చితంగా తీసుకోవాలని మన పెద్దలు నియమం ఏర్పాటు చేశారు. ఈ రోజునే పెద్దలకు తర్పణాలు.. సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణాలు వదలడం తప్పనిసరిగా చేస్తారు. ఉత్తరాయణ కాలం మొదలైన ఆరోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని పితృదేవతలకి స్వర్గ ప్రాప్తి లభించడం కోసం ఇలా చేస్తారు. ఈరోజు పెద్దలని స్మరించుకుంటూ వారిని సంతోష పెట్టే విధంగా వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఇది పెద్దల పండుగ లేదా పెద్దల పండుగ అయ్యింది. కొత్త అల్లుళ్ల సందడి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకం. కొత్తగా పెళ్ళైన కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచి తమ ఆతిధ్యంతో ఔరా! అనిపిస్తారు. కొత్త అల్లుళ్ల రాకతో ఇల్లు కళకళాడిపోతాయి. మరదళ్ళు బావలని సరదాగా ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక మహిళలు ఇళ్ల ముందు పెద్ద పెద్ద రంగవల్లులు వేసి మురిసిపోతారు. గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ పాటలు పాడుకుంటూ డాన్స్ వేస్తారు. పల్లెటూరులో అయితే ఏ వీధిలో చూసినా కన్నె పిల్లలు పరికిణీలు కట్టి పూల జడలు వేసుకుని అందంగా ముస్తాబై తిరుగుతూ సందడి చేస్తారు. కోడి పందేలు, ఎడ్ల పోటీలు.. గోదావరి జిల్లాల్లో కోడిపందేలతో ఫుల్ జోష్తో పండుగ జరుగుతుంది. వీటిని చూసేందుకు దూరప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తారు. పూర్వకాలంలో దీన్ని యుద్ధనీతిని గెలిపించే పందెంగా భావించేవారు. అంతేగాదు ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారట. ఆ తర్వాత అదే కాలక్రమేణ ఓ సరదా జూదంలా మారింది. ఈ పండుగ రోజు కొన్ని ప్రాంతాల్లో ఈ కోడిపందేలు కచ్చితంగా జరుగుతాయి. మరికొన్ని చోట్ల ఈ రోజు ఎండ్ల పోటీలు నిర్వహిస్తారు. గాలిపటాలు ఎగరువేసేది కూడా. కొన్ని చోట్ల ఈ సంక్రాంతి పండుగను పతంగులు పండుగగా జరుపుకుంటారు. ఆ రోజు చిన్నా పెద్దా అని తేడా లేకుండా గాలి పటాలు ఎగరేస్తూ ఆనందిస్తారు. దీంతో ఆకాశంలో రంగు రంగుల గాలి పటాలు ఎగురుతూ కనువిందు చేస్తాయి. మరీ ఇన్ని విశేషాలు ఉన్న సంక్రాంతి పెద్ద పండగే కదా! -
ప్రపంచ చీరల దినోత్సవం! 'చీర' అందమే అందం!
'చీర' అంటే అందం, ఆనందం. అలాంటి 'చీర' కేవలం సౌందర్యాన్ని పెంచే ఓ వస్త్రమే కాదు...భారతీయ సంస్కృతికి చిహ్నం కూడా. అందుకే అతివల దుస్తుల వరుసలో చీర ఎప్పుడూ ముందుంటుంది. ‘నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా...ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ’ అన్నాడో కవి. పట్టు చీరే కాదు...పట్టుమని వంద రూపాయలు చేయని చీరలో కూడా మగువ అందం మూడింతలవుతుంది. దక్షిణాది కంజీవరం నుంచి బెంగాల్ వారి బలుచరి వరకు... సెలెబ్రిటీలు కట్టే ఫ్యాన్సీ చీరల నుంచి పల్లె పడుచులు కట్టే నేత చీర వరకూ...చీర చీరకూ అందమే.కట్టిన ప్రతి పడతిలోనూ సౌందర్యమే. అందుకే కాబోలు సినీతారలు సైతం చీరను చిన్నచూపు చూడరు. అలాంటి గొప్ప ప్రత్యేకతను దక్కించుకున్న చీర కోసం ఓ రోజుని ప్రత్యేకంగా కేటాయించి మరీ చీర అందాన్ని తెలియజేసేలా ప్రపంచ చీర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది దీన్ని డిసెంబర్ 21న ఘనంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఎలా వచ్చింది? ఎందుకు జరుపుకుంటున్నాం తదితరాల గురించే ఈ కథనం!. 'చీర' అనే పదం ఎలా వచ్చిందంటే.. సంస్కృతంలో "చీర" అనే పదానికి "వస్తానికి సంబంధించిన స్ట్రిప్(చిన్న ముక్క)" అని అర్ధం. కానీ సహస్రాబ్దాలుగా పట్టు, దూది లేదా నారతో ధరించే భారతీయ స్త్రీలకు, పురుషులకు ఈ వస్త్రాలు కేవలం సాధారణ వస్త్రాలు మాత్రం కాదు. వాటిని వారు ఎంతో విలువైన వాటిగా చూస్తుంటారు. ఆ చీరతో ముడిపడి ఉన్న బంధాలు, జ్ఞాపకాలు వారి కళ్ల ముందు కదలాడుతుంటాయి. ఈ దినోత్సవం ఎలా ఏర్పడింది..? 2020లో ఫ్యాషన్ ప్రియులు సింధూర కవిటి, నిస్తుల హెబ్బార్ అధికారిక 'వరల్డ్ చీర దినోత్సవం' ఉద్యమాన్ని ప్రారంభించారు. వారు దీని గురించి ఒక ప్రత్యేక తేదీని (డిసెంబర్ 21వ తేదీ)ని సూచించారు. మన దేశ సరిహద్దులు దాటి చీరకు సంబంధించిన సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు. ఇక ఈ చీరలు లేకుంటే ప్రపంచం రంగుల మయం కాదు. చాలా ఏళ్ల నుంచి భారతీయ సంస్కృతిలో ఈ చీరలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అలాగే ఫ్యాషన్ పరంగా కూడా ఈ చీరలే అగ్రస్థానంలో ఉన్నాయి. సౌలభ్య పరంగానే కాకుండా ఆకట్టుకునే స్థాయిలో చీరదే తొలిస్థానం. ఏ పండుగైన ఒక్క చీరతో సంప్రదాయం ఉట్టిపడి నిండుదనం తీసుకురావడమే గాక అలనాటి రోజుల్లోకి తీసుకుపోతుంది. ఎందుకు జరుపుకుంటున్నాం అంటే.. ఈ పండుగ ప్రధానా ఉద్దేశ్యం వీటిని ఎంతోకష్టపడి తయారు చేసే కార్మికుల నైపుణ్యాన్ని గుర్తించడమే గాక ఎప్పటికప్పుడూ వైవిద్యాన్ని ప్రదర్శిస్తూ సరికొత్తచీరలను మన ముందుకు తీసుకొస్తున్న వారి కళ నైపుణ్యతను కొనియాడాల్సిందే. కనీసం ఈ సందర్భంగానైనా..ఒక చీర కోసం కార్మికులు పడే శ్రమ, ఎంతలా ఓపికతో చేస్తే ఓ చీర మన ముందుకొస్తుందో కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దాని గొప్పదనాన్ని గుర్తించాలి. వేల ఏళ్ల నాటి నుంచి ఉన్న మహిళల అవసరాలకు తగ్గట్టుగా ఆ చీరలో మార్పులు సంతరించుకుంటూ తన క్రేజ్ని చాటుకుంటూనే వచ్చింది. ఎన్ని రకాల ఫ్యాషన్ డ్రస్లు వచ్చినా చీర అందం ముందు బలదూర్ అని ఫ్రూవ్ చేసుకుంది. ఆధునికంగా 'చీర కట్టు' విధానం.. నిజానికి భారతదేశంలో చీర బ్లౌజ్ లేకుండా ధరించేవారు. కనీసం శారీ పెట్టికోట్లు ఉండేవి కావు. అయితే చీర మాత్రం ఓ మోస్తారు మందంతో ఉండి, మోకాలి వరకు ధరించేవారు. అయితే ఆ చీరతో బయటకు రావడం కాస్త ఇబ్బందిగా ఉండేది కూడా. అయితే ఆ రోజుల్లో మహిళలు రావడం కూడా అరుదు కావడంతో అలానే చీరలు ధరించేవారు. ఆ తర్వాత నెమ్మదిగా మార్పులు రావడం, మహిళలకు కూడా బటయకు రావడం జరిగింది. వారు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేయడంతో చీర ఆహార్యంలో మార్పులు వచ్చాయి. సౌలభ్యంగా ధరించేలా చీరలో కాలనుగుణంగా పలుమార్పులు వచ్చాయి. అయితే ఆధునికంగా చీర కట్టుకునే విధానం మాత్రం ఠాగూర్ కుటుంబం నుంచే వచ్చిందిన చెబుతున్నారు ప్రొఫెసర్-రచయిత జస్వీందర్ కౌర్. ఆయన భారతీయ వస్త్రధారణలో ఎలా కాలనుగుణంగా మార్పులు వస్తూ అభివృద్ధి సాధించిందే పంచుకుంటూ ఆదునిక చీర కట్లు విధానం గురించి మాట్లాడారు. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబసభ్యలచే ప్రాచుర్యం పొందిందని చెప్పారు. అందుకు సంబంధించిన ఓ ఆసక్తికర కథనాన్ని కూడా పంచుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కోడలు జ్ఞానదానందిని దేవి ద్వారా ఆధునిక చీర కట్టు విధానం ప్రాచుర్యం పొందిందని చెప్పుకొచ్చారు. ఠాగూర్ సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్ భాతర సివిల్ సర్వీస్ చేరిన తొలి భారతీయుడు. ఆ టైంలో భారతీయ స్త్రీలు ధరించే చీర విధానంతో బయటకు రావడం కాస్త ఇబ్బందిగా ఉండేది. దీన్ని ఆమె ఠాగూర్ విశ్వభారతి పత్రికలో కూడా ప్రస్తావించారు. అయితే కోల్కతాలో వైస్రాయి రిసెప్షన్లో సత్యేంద్రనాథ్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమె తక్షణమే వెళ్లాల్సిన పరిస్థితి అయితే అప్పుడే ఆమె హుందాగా ఆధునికంగా కొత్త పద్ధతిలో(బ్లౌజ్తో తలపై ముసుగు వేసుకుని) ధరించి వెళ్లారు. అప్పటి నుంచే అందరూ దీన్ని అనుసరించనట్లుగా ఓ ఆసక్తికర కథనాన్ని జస్వీందర్ వెల్లడించారు. అందుకే కోసం ఎన్ని రకాల విచిత్ర వస్త్రధారణ వచ్చిన చీర ధరించడం కనుమరుగవ్వలేదు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా తన క్రేజ్ని చాటుకుంటునే ఉంది. (చదవండి: డయానా ధరించిన డ్రెస్ ధర ఏకంగా రూ. 9 కోట్లు! మరోసారి రికార్డు స్థాయిలో..) -
ధనుర్మాసంలో ఇలా చేస్తే నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుందట!
సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని ‘పండుగ నెలపట్టడం’ అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు. భోగితో ముగుస్తుంది: సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్) మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి , స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు , పూజలు , జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు , వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం. శ్రీకృష్ణుడికి తులసిమాల ప్రతి రోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు , నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా: ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు , పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చనీ , నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి , తిరుప్పావై గాన , శ్రవణం చేసిన వారికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ , ఆశిద్దాం. ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ? ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం , దద్దోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం , జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి. కోరికలు నెరవేరుతాయి వివాహం కాని , మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాధుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది. గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ , పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్ర్తీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది. పాశురములు చదివేటప్పుడు.. మొదటి పాశురము రెండు సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి. అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడి గా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను , చివరపాశురంలో ఒక లైను చదవాలి. చివరగా గోదా హారతి చదవాలి. మంత్ర పుష్పం కూడా చదవాలి. మళ్ళి ఏ రోజు పాశురం ఆ రోజు రెండు సార్లు చదివి హారతి ఇవ్వాలి. నైవేద్యం సమర్పంచాలి (రోజు పొంగలి , దద్ధోజనం , పరవాన్నం) ఉండి తీరాలి. టైమ్ ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే నియమం కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి , పొంగలి ముఖ్య నైవేద్యం కుదిరితే అది పెట్టండి కుదరని వాళ్ళు పండ్లు , పాలు పెట్టి చేసుకోండి , భక్తి ముఖ్యం* -
దిలీపుడికి మాఘ మహిమ తెలిపిన విప్రుడు
ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడికి పూర్వీకుడైన దిలీప మహారాజు ఒకసారి మృగయా వినోదం కోసం సపరివారంగా అడవికి వెళ్లాడు. క్రూరమృగాలను వేటాడుతూ కొన్ని రోజులు అడవిలోనే గడిపాడు. దిలీపుడు, ఆయన పరివారం అడవిలోని క్రూరమృగాలను వేటాడుతూ ముందుకు సాగుతున్నారు. నట్టడవిలో నీరు లేక మహారాజు దిలీపుడు సహా ఆయన పరివారానికి గొంతెండిపోయే పరిస్థితి ఏర్పడింది. వేటకు కొద్దిసేపు విరామమిచ్చి, పరివారమంతా జలాన్వేషణలో పడ్డారు. కొద్ది దూరం ముందుకు వెళ్లి చూడగా, అక్కడ ఒక సరోవరం కనిపించింది. భటులు తామరాకులను దొన్నెలుగా చేసి, వాటిలో నీరు సేకరించి దిలీప మహారాజుకు అందించారు. పరివారంలోని భటులు కూడా సరోవరంలోని నీరు తాగి సేదదీరారు. తర్వాత మరికాసేపు వేట కొనసాగించారు.అడవిలో క్రూరమృగాల సంచారం దాదాపుగా కనుమరుగైపోవడంతో దిలీపుడు ఇక వేట చాలించి, రాజధానికి వెళదామన్నాడు. పరివారానికి పురమాయించి, అప్పటి వరకు వేటాడిన మృగాల చర్మాలను ఒలిపించి, వాటిని రథాల మీదకు చేర్పించాడు. అందరూ తిరుగు ప్రయాణం ప్రారంభించారు. దిలీపుడు, ఆయన పరివారం అడవిలో తిరుగు ప్రయాణం సాగిస్తుండగా, తోవలో బ్రహ్మతేజస్సుతో వెలుగొందుతున్న ఒక విప్రుడు ఎదురయ్యాడు. ఆయనను చూడగానే, దిలీపుడు తన భద్రగజం పైనుంచి కిందకు దిగి, ఆ విప్రుడికి నమస్కరించాడు. విప్రుడు ఆశీర్వచనం పలికాడు. ఆయన దిలీప మహారాజు ముఖాన్ని పరికించి, ‘ఈ మహారాజు గుణవంతుడిలా ఉన్నాడు. ఇతనికి ఏదైనా మేలు చేయాలి’ అని తలచాడు. ‘మహారాజా! శుభప్రదమైన ఈ మాఘమాసంలో సరోవరం వరకు వెళ్లి కూడా నువ్వు, నీ పరివారం స్నానం చేయకుండా తిరుగుముఖం పడుతున్నారేం? మాఘ మహాత్మ్యం నీకు తెలియదా?’ అని ప్రశ్నించాడు.‘విప్రోత్తమా! కొద్దిరోజులుగా వేట సాగిస్తూ అడవిలోనే ఉండిపోయాం. మాఘమాస ఆగమనం గురించి బహుశా పురోహితులు చెప్పే ఉంటారు. నేను మరచి ఉంటాను. మన్నించండి. దయచేసి, నాకు మాఘ మహాత్మ్యాన్ని వివరించండి’ అని వినయంగా అడిగాడు దిలీపుడు. ‘మహారాజా! మీ కులగురువైన వశిష్ఠులవారు తరచు నీ వద్దకు వస్తూనే ఉంటారు కదా, ఆయన వద్ద మాఘ మహాత్మ్యం గురించి తెలుసుకో. ఇప్పుడు నేను సంధ్యవార్చుకోవడానికి పోతున్నాను’ అని చెప్పాడు విప్రుడు.రాజధానికి చేరుకున్న దిలీపుడు మర్నాడు వేకువనే నిద్రలేచి, స్నానాదికాలు కావించుకుని, కొద్దిమంది పరివారంతో వశిష్ఠాశ్రమానికి చేరుకున్నాడు. కుశల ప్రశ్నలయ్యాక, ‘మహర్షీ! ఒక విప్రుని ద్వారా మాఘ మహాత్మ్యాన్ని గురించి విన్నాను. మీ వద్ద ఎన్నో పురాణేతిహాసాలు తెలుసుకున్నాను. ఇప్పుడు మాఘ మహాత్మ్యాన్ని తెలుసుకోవాలని వచ్చాను. దయచేసి ఎరుకపరచగలరు’ అని కోరాడు. ‘దిలీపా! మాఘ మహాత్మ్యాన్ని వర్ణించడం నిజానికి నాకు కూడా సాధ్యం కాదు. నీకు సులభగ్రాహ్యంగా ఉండేలా మాఘ మహాత్మ్యాన్ని చెబుతాను. ముందుగా వ్యాఘ్రముఖుడైన గంధర్వుని కథ చెబుతాను విను’ అంటూ ఇలా చెప్పాడు: వింధ్యపర్వత ప్రాంతంలోను, రేవా నదీ పరివాహక పరిసరాల్లోను ఒకసారి తీవ్రమైన కరవు ఏర్పడింది. భృగు మహర్షి అంతటి వాడు కూడా ఆ కరవును తట్టుకోలేక అక్కడి నుంచి హిమాలయాలకు చేరుకున్నాడు. కైలాస పర్వతానికి సమీపంలోని ఒక కొండ మీద ఆయన తపస్సు చేసుకోసాగాడు.ఒకనాడు భృగు మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటుండగా, ఒక గంధర్వుడు భార్యాసమేతుడై వచ్చాడు. అతడు వ్యాఘ్రముఖుడు. భృగుమహర్షికి నమస్కరించి, అతడు తన దీనగాథను వినిపించాడు.‘మహర్షీ! నాకు ఈ పులిముఖం ఎందుకు కలిగిందో తెలియడం లేదు. నా భార్య రూపవతి, గుణవతి, మహాసాధ్వి. నా వికృతరూపం కారణంగా నాతో పాటు ఆమె కూడా అంతులేని మనోవ్యధ అనుభవిస్తోంది. తపస్సంపన్నులైన మీరే నా కష్టాన్ని తీర్చగలరు’ అని ప్రాధేయపడ్డాడు.‘నాయనా! పాపం, దారిద్య్రం, దురదృష్టం మనుషులను పీడిస్తాయి. వీటిని నివృత్తి చేసుకోవాలంటే, అందుకు మాఘస్నానమే తగిన తరుణోపాయం. అదృష్టవశాత్తు ఇది మాఘమాసం. వెంటనే నువ్వు భార్యా సమేతంగా నిష్ఠగా భక్తిశ్రద్ధలతో మాఘస్నానం ఆచరించు. నీ మనోవాంఛ తప్పక నెరవేరుతుంది’ అని ధైర్యం చెప్పాడు భృగు మహర్షి. మహర్షి వాక్కుపై నమ్మకంతో ఆ గంధర్వుడు సమీపంలోనే పర్వతం నుంచి ప్రవహిస్తున్న నదిలో భార్యా సమేతంగా స్నానమాచరించాడు. స్నానం ముగించి ఒడ్డుకు రాగానే, గంధర్వుడికి వికృతమైన పులిముఖం మాయమై, అందమైన మానవ యువకుడి ముఖం వచ్చింది. ఆశ్చర్యకరమైన ఈ మార్పుతో గంధర్వ దంపతుల ఆనందానికి అవధులు లేకపోయాయి. వారిద్దరూ హుటాహుటిన భృగు మహర్షి చెంతకు చేరుకుని, ఆయన పాదాల మీద పడ్డారు. ‘మహర్షీ! ఎంతో దుష్కరమైన బాధ నుంచి మమ్మల్ని సునాయాసంగా గట్టెక్కించారు. మీ మేలు జన్మజన్మలకు మరువలేము’ అంటూ ఆయనను వేనోళ్ల స్తుతించారు. భృగు మహర్షి వారిని ఆశీర్వదించి సాగనంపాడు. -సాంఖ్యాయన -
సందేశాత్మకం నవరాత్రి అలంకరణం
త్రేతాయుగం, ద్వాపరయుగం...ఇలా ఏ కాలంలోనైనా, ఏ అంశంలోనైనా స్త్రీని అత్యున్నత స్థానంలో ఉంచి గౌరవించారు. ఆమెను తొలిగురువుగా, ఆది శక్తిగా భావించి ఆరాధించారు. మన పురాణాలను కూలంకషంగా పరిశీలించినట్లైతే ఈ విషయం మనకు అవగతమౌతుంది. భారతావని అంతటా వైభవోపేతంగా జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల్లోనూ అమ్మవారిదే వైభోగమంతా. ఆ జగన్మాతని ఆరాధించేందుకే ఈ మహా శరన్నవరాత్రి సంరంభమంతా... విజయదశమి....పదిరోజుల పండుగ...మనిషిలో దాగిన లోభం, అలసత్వం, జడత్వం, దురాశ, పాప–చింతనలాంటి వికారాలను నశింపచేసి, సాత్వికప్రవృత్తి వైపు నడిపిస్తుంది. మనలోని శక్తిని జాగృతం చేసి శుభసంకల్పాలకు నాంది పలికి చైతన్యం వైపుగా నడిపిస్తుంది. విజయదశమి–నవరాత్రి–దుర్గాపూజ...అన్ని శబ్దాలకూ ఒకటే అర్థం....తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాలుగా భావిస్తూ ఆ జగన్మాతని పూజించుకోవటం. అసలు దసరా పండుగను తొమ్మిది రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు, అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఎందుకు కొలుస్తారు, దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి తెలుసుకుందాం. త్రిపురసుందరి, త్రిపురేశ్వరి, పరమేశ్వరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి వంటి అనేక నామాలతో పూజలందుకుంటున్న లలితాదేవి అఖిలాండకోటి బ్రహ్మాండాలకు జనని. పిపీలికాది బ్రహ్మపర్యంతమూ సకల జీవకోటికీ మాతృదేవత. తన బిడ్డలుగా భావించిన ప్రజలను పట్టి పీడిస్తున్న భండాసురుడనే రాక్షసుడినీ, వాడి ముప్ఫైమంది సంతతినీ, వారి సైన్యాన్నీ ఆదిశక్తి అవలీలగా వధించింది. అలాగే చండాసురుడు, ముండాసురుడు, మహిషాసురుడు అనే లోకకంటకులైన రాక్షసులను సంహరించి, చతుర్దశ భువనాలకూ శాంతిని ప్రసాదించింది. అందుకు ప్రతీకగా జరుపుకుంటున్నవే దసరా ఉత్సవాలు. దశహరా అంటే పది రకాల పాపాలను నశింపజేసేవని అర్థం. అదే క్రమేణా దసరాగా మారింది. విజయదశమి – వివిధ కారణాలు ఆయా రాక్షసులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు జరుపుకునే పండుగే విజయదశమి. ఇవి గాక విజయదశమి జరుపుకోవడానికి మరికొన్ని కారణాలున్నాయి. మహర్నవమినాడు శ్రీరామచంద్రుడు దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దుర్గాదేవి మహిషారుని సంహరించిన రోజని, అజ్ఞాతవాస పరిసమాప్తి కాగానే విజయుడు (అర్జునుడు) ఉత్తర గోగ్రహణం చేసి విజయం సాధించిన రోజని మరో గా«థ ఉంది. ఐకమత్యమే ఆయుధ బలం ఎంతటి దైవమైనా రాక్షసులను సంహరించాలంటే ఒక్కరి వల్లే కాదు. ఎందుకంటే రాక్షసులు కూడ తపశ్శక్తి సంపన్నులే! కాని వారి లక్షణాలు మాత్రం సరైనవి కావు. అందుకే ఆ తల్లి ఈశ్వరుడి నుంచి త్రిశూలాన్ని, కుమారస్వామినుంచి శక్తి ఆయుధాన్ని, వినాయకుడి నుంచి విఘ్న నివారణ ఆయుధాన్ని, విష్ణువు నుంచి చక్రాయుధాన్ని, ఇంద్రుని నుంచి వజ్రాయుధాన్ని, విశ్వకర్మనుంచి డాలుని, అగ్నిదేవుని నుంచి ఆగ్నేయాస్త్రాన్ని, యుముని నుండి పాశాన్ని, వరుణుని నుంచి వారుణాస్త్రాన్ని, వీటన్నింటినీ కూడగట్టుకోవడానికి కుబేరుని నుంచి ధనరాశులతో నిండిన కుండను, దానితోబాటు వారందరి బలాన్ని కూడగట్టుకుని యుద్ధంచేసి విజయం సాధించింది. సమష్టి బలం దీనిని బట్టి మనం తెలుసుకోవలసినదేమంటే ఏ ఒక్కరూ విడిగా చేయలేని పనిని ఐకమత్యంగా ఉండి, అందరి శక్తినీ ఒక్కచోట చేర్చితే ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించగలం. విజయదశమి పండుగ మనకు సమైక్యతతో ఉండవలసిన ఆవశ్యకతను, స్త్రీ శక్తి ప్రాధాన్యతనూ చాటి చెబుతోందన్నమాట. అందరి మొరలూ ఆలకించే అసలైన అమ్మ మన మనస్సులోని తలంపులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు అమ్మ ప్రసన్నవదనంతోనూ, కలుషితంగా ఉన్నప్పుడు అమ్మ భయంకరాకారంలోనూ కనిపిస్తుంది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మను పూజిస్తే ఐహిక, ఆముష్మిక ఫలితాలు కలుగుతాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. లౌకిక బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాధి పీడితులకు ఆరోగ్యం చేకూరుతుంది. చిత్తస్థై్థర్యం, శత్రు విజయం చేకూరతాయి. ఒక్కరోజు పూజతో సంవత్సర ఫలం దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు మూడు రోజులు, మూడురోజులు కూడా కుదరని వారు కనీసం చివరి రోజయిన విజయ దశమినాడు ఒక్కరోజయినా సరే ఆ దివ్యమంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా అమ్మను దర్శించుకుని పూజ చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఇక విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. జమ్మిని పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులను అందుకోవాలి. శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్షం కనక ధారలు కురిపిస్తుందనే విశ్వాసం, శమీవృక్ష నీడ, శమీవృక్షపు గాలులు అన్నీ విజయ సోపానాలకు దారితీస్తాయనే నమ్మకం అనాదిగా ఉంది. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాయడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్త్రాలను జమ్మిచెట్టుపైనే దాచారు. మహిషాసురమర్దిని: సర్వదేవతల తేజస్సుల కలయిక అయిన ఆదిశక్తి మహిషాసుర మర్దిని. ఆశ్వయుజ శుద్ధ నవమిరోజున మహిషాసురుడిని సంహరించింది కనుక మహర్నవమినాడు అమ్మకు ఆ అలంకరణ చేస్తారు. సింహవాహన అయిన మహిషాసురమర్దిని నేటి పర్వదినాన ఉగ్రరూపంలోగాక శాంతమూర్తిగా దర్శనమివ్వడం విశేషం. మహిషాసురమర్దిని అలంకార ంలో అమ్మను దర్శించుకోవడం వల్ల సకల శుభాలూ చేకూరడమేగాక పిశాచబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీరాజరాజేశ్వరి: లోకశుభంకరి, అపరాజితాదేవి అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి దసరా ఉత్సవాల ముగింపు రోజయిన విజయదశమినాడు భక్తులకు చెరకుగడతో, అభయముద్రతో, ఆర్తితో పిలవగానే వచ్చే పాపగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ అవతారాన్ని దర్శించడం వల్ల సర్వకార్యానుకూలత, దిగ్విజయ ప్రాప్తి కలుగుతాయి. దుష్టరాక్షసులయిన రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను తయారు చేసి టపాసులతో పేల్చేయడమో లేదా దహనం చేయడమో ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు. దీనికే రామలీల అని పేరు. తెలంగాణ ప్రాంతం నవరాత్రులలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యమిస్తే, విజయనగరంలో పైడితల్లి వేడుకలు జరుపుతారు. ఆంధ్రప్రాంతంలోని పల్లెలలో ‘శమీశమయితే పాపం శమీ శత్రువినాశనం, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’ అంటూ శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. తెలంగాణలో జమ్మి ఆకును తీసుకు వచ్చి, జమ్మి బంగారాన్ని అందరికీ పంచి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, పెద్దలకు జమ్మిని ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం ఒక వేడుకగా జరుగుతుంది. పెద్ద పెద్ద సంస్థలలోనూ, కర్మాగారాలలోనూ యంత్రాలను పూజిస్తారు. బాక్స్ దుర్గానవరాత్రులో ఆఖరి అవతారం శ్రీరాజరాజేశ్వరి. భక్తులకు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఙ్ఞానశక్తిని ప్రసాదించే అవతారం శ్రీరాజరాజేశ్వరి. ఏ దేవి రూపమైనా, ఏ శక్తి రూపమైనా అన్నిటికి మూలమైన శక్తి పరమేశ్వరి. ఈరోజు లలితా సహస్రనామ పారాయణతో పూజించాలి. చేమంతులతో ఆరాధన చేయాలి. భక్ష్య, భోజ్యాలతో మహానివేదన చేయాలి. ఈ రోజున అశ్వపూజ, ఆయుధపూజ, ఉఛ్చైశ్రవ పూజ, వాహన పూజ నిర్వహిస్తారు. శ్రీరాముడు విజయదశమి రోజున ‘అపరాజితాదేవిని’ పూజించి రావణునిపై విజయాన్ని సాధించాడు. నవరాత్రుల అనంతరం దశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయంలో శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని స్మరిస్తారు. ‘‘శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శినీ’’ ఈ మంత్రంతో తమ తమ గోత్రనామాలు చెప్పుకుని జమ్మి వృక్షాన్ని పూజ చేసి మూడు ప్రదక్షిణలు చేస్తారు. శ్రీరాముడు దశకంఠుని సంహరించిన రోజు గనుక ‘దశహర’ అని కూడా పిలువబడుతోంది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని సంపాదించినది కూడా దశమి రోజునే. తిథి, వార, నక్షత్ర గణన లేకుండా విజయదశమి రోజున చేపట్టిన సకల కార్యాలు విజయం పొందుతాయని నమ్మిక. ఇదే విషయం ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రంథం విపులీకరించింది. దేవీ ఉపాసకులు అంతవరకు తాము చేసిన జప సంఖ్యననుసరించి హోమాలు చేస్తారు. నవరాత్రి వ్రత సమాప్తి గావించిన వారు సర్వ సిద్ధులు పొందుతారు, సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. చెడుపై మంచి సాధించిన విజయం దానవత్వంపై దైవం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాటం చేయడానికి దానవులు లేరు –మానవులు తప్ప. కానీ మనం పోరాడి తీరవలసిన శత్రువులున్నారు. వారే అందరిలోనూ ఉండే అరిషడ్వర్గాలనే శత్రువులు. వారితోనే మనం పోరాడి విజయం సాధించాలి. జీవితాలను ఆనందమయం చేసుకోవాలి. విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి. ఆ రోజున ఆరంభించే ఏ శుభకార్యమైనా, మంచి పని అయినా, రకరకాల వృత్తులు, వ్యాపారాలు అయినా అఖండ విజయం సాధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభిద్దాం. ఈ విజయ దశమి అందరికీ సుఖ సంతోషాలను, విజయాలను ప్రసాదించాలని అమ్మను కోరుకుందాం. –డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: సింహం వద్ద సలహదారు ఉద్యోగం! ) -
కొత్త జిల్లా ఎలా ఏర్పాటవుతుంది? గవర్నర్ పాత్ర ఏమిటి?
భారతదేశ పరిపాలనా వ్యవస్థలో పంచాయతీ, తహసీల్, జిల్లా, రాష్ట్రం, దేశం అనే విభాగాలు ఉన్నాయి. ఇందులో జిల్లాను అత్యంత కీలకంగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశంలో మొత్తం జిల్లాల సంఖ్య 800 దాటింది. తాజాగా మధ్యప్రదేశ్లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త జిల్లాలను మైహార్, పంధుర్ణగా పిలవనున్నారు. అయితే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఎలా ఏర్పాటు చేస్తుంది? ఎటువంటి విధానాన్ని అనుసరిస్తుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన స్థానిక పరిపాలన, ఎన్నికైన ప్రతినిధులు, ఇతర సంస్థల నుంచి వస్తుంది. తరువాత దానిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను నిశితంగా పరిశీలిస్తుంది. అనంతరం కొత్త జిల్లా ఆవశ్యకతపై సాధ్యాసాధ్యాలను అధికారులు అధ్యయనం చేస్తారు. ఈ దశలో ఆ ప్రాంత జనాభా, భౌగోళిక పరిసరాలు, పరిపాలనా సౌకర్యాలు, వనరుల లభ్యతతో పాటు, ఆ ప్రాంత సామాజిక పరిస్థితులు మొదలైనవాటిని పరిగణలోకి తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన సరైనదని భావించినప్పుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధులతో చర్చిస్తుంది. ఈ సమయంలో అందరి అంగీకారం మేరకు కొత్త జిల్లాను రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనంతరం అధికారిక గెజిట్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందులో కొత్త జిల్లా ఏర్పాటు ప్రకటనతో పాటు జిల్లా సరిహద్దులను తెలియజేస్తారు. జిల్లా సరిహద్దులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత కొత్త జిల్లాకు గవర్నర్ ఆమోదం తెలిపిన అనంతరం కొత్త జిల్లాకు అధికారిక రూపం వస్తుంది. కొత్త జిల్లా ప్రకటన వెలువడిన తరువాత ప్రభుత్వం ముందుగా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(డీఎం) ఎస్పీలను నియమిస్తుంది. తరువాత క్రమంగా ఇతర అధికారులను నియమిస్తారు. జిల్లా ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పరిపాలనా కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర అవసరమైన సేవలు, ప్రజా సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. దీనితో పాటు, పాత, కొత్త జిల్లాల మధ్య వనరులు, ఆస్తుల పంపిణీ జరుగుతుంది. ఇది కూడా చదవండి: క్షిపణి దాడుల మధ్య వార్ జోన్కు బైడెన్ ఎలా చేరారు? -
ఆ ఘనత ముహమ్మద్ ప్రవక్తకే దక్కింది, మానవాళికి ఆదర్శమయ్యారు
మానవుల మార్గదర్శనం కోసం అల్లాహ్ అన్ని కాలాల్లో, అన్నిజాతుల్లో తన ప్రవక్తలను ప్రభవింప జేశాడు. గ్రంథాలనూ అవతరింప జేశాడు. హజ్రత్ ఆదం (అ) మొదలు, ముహమ్మద్ ప్రవక్త (స) వరకు అనేక మంది సందేశహరులు భూమండలంపై జన్మించారు. వారిలో చిట్టచివరి దైవప్రవక్త ముహమ్మద్ (స). ఆయనపై అవతరించిన చివరి గ్రంథం పవిత్ర ఖురాన్ . ఇక ప్రళయకాలం వరకూ ప్రవక్తలూ రారు, గ్రంథాలూ అవతరించవు. కనుక మానవులు ప్రళయకాలం వరకు ఆయనను అనుసరించవలసిందే. ముహమ్మద్ ప్రవక్త తనంత తాను ఏమీ బోధించలేదు. మానవుల సంక్షేమం కోసం, సాఫల్యం కోసం దైవం అవతరింపజేసిన హితోపదేశాలనే ఆయన మానవాళికి అందజేశారు. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశల్లో, వివిధ రంగాల్లో ఎలా నడుచుకోవాలో, ఏది హితమో, ఏది హితం కాదో ఆచరణాత్మకంగా ఆయన విశద పరిచారు. అందుకే ఆయన ప్రపంచ మానవాళికి సంపూర్ణ మార్గదర్శిగా పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ మహనీయుని పవిత్ర జీవనానికి సంబంధించిన కొంత సమాచారాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. దాదాపు 1450 సంవత్సరాల క్రితం అరేబియా దేశంలోని మక్కానగరంలో ముహమ్మద్ ప్రవక్త (స) జన్మించారు. ఆమినా, అబ్దుల్లాహ్ తల్లిదండ్రులు. పుట్టకముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. తాతయ్య ఆయన్ని పెంచారు. చిన్నతనం నుంచే అనేక సుగుణాలను పుణికి పుచ్చుకున్న ముహమ్మద్ ప్రవక్త, ‘అమీన్’గా, ‘సాదిఖ్’గా వినుతికెక్కారు. ఆయన గొప్ప మానవతావాది. సంస్కరణాశీలి. ఉద్యమనేత. అతి సాధారణ జీవితం గడిపిన సామ్రాజ్యాధినేత. జ్ఞానకిరణాలు ప్రసరింపజేసిన విప్లవజ్యోతి. ప్రాణశత్రువును సైతం క్షమించిన కారుణ్య కెరటం. సుమారు వెయ్యిన్నర సంవత్సరాలంటే.. ఆ సమాజం ఎంత అనాగరికంగా ఉండేదో నేటి ఆధునికులకు తెలియనిదేం కాదు. ప్రవక్త జననానికి ముందు నాటి సమాజంలో ‘కర్రగలవాడిదే బర్రె’ అన్నట్లుగా బలవంతుడు బలహీనుణ్ణి పీక్కుతినేవాడు. స్త్రీల హక్కుల విషయం కాదుగదా అసలు వారికంటూ ఓ వ్యక్తిత్వం ఉన్న విషయాన్నే వారు అంగీకరించే వారు కాదు. స్త్రీని విలాస వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు. అలాంటి జాతిని అన్ని విధాలా సంస్కరించి, వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దిన ఘనత ముహమ్మద్ ప్రవక్తకే దక్కింది. నాటి సమాజంలో లేని దుర్మార్గమంటూ లేదు. అలాంటి ఆటవిక సమాజాన్ని నిరక్షరాస్యులు అయిన ముహమ్మద్ ప్రవక్త సమూలంగా సంస్కరించి, ఒక సత్సమాజంగా ఆవిష్కరించారు. ప్రవక్త బోధనల ప్రకారం... మానవులు తమ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. ఆయనకు మాత్రమే భయపడాలి. తోటిమానవుల్ని, సమాజాన్ని ప్రేమించాలి. స్త్రీలను గౌరవించాలి. ఎలాంటి స్థితిలోనూ నీతినీ, న్యాయాన్ని విస్మరించకూడదు. అనాథలను, వృద్ధులను ఆదరించాలి. తల్లిదండ్రులను సేవించాలి. వారిపట్ల విధేయత కలిగి ఉండాలి. బంధువులు, బాటసారులు, వితంతువులు, నిస్సహాయుల పట్ల తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. సంఘంలో ఒక మనిషికి మరో మనిషిపై పడే విధ్యుక్త ధర్మాల పట్ల ఉపేక్ష వహించకూడదు. అన్యాయం, అధర్మ సంపాదనకు ఒడికట్టవద్దు. ధనాన్ని దుబారా చేయవద్దు. వ్యభిచారం దరిదాపులకు పోవద్దు. దానికై పురిగొలిపే అన్నిరకాల ప్రసార ప్రచార సాధనాలను రూపుమాపాలి. నిష్కారణంగా ఏ ప్రాణినీ చంపవద్దు. ప్రజల ధన, మాన, ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతిని సాధించలేదు. సదా సత్యమే మాట్లాడాలి. చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి. వాగ్దాన భంగానికి పాల్పడకూడదు. పలికే ప్రతి మాటకూ, చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. వ్యాపార లావాదేవీల్లో, ఇచ్చి పుచ్చుకోవడాల్లో లెక్కాపత్రాలు, కొలతలు, తూనికలు చాలా ఖచ్చితంగా, నికార్సుగా ఉండాలి. స్వార్థాన్ని, అహాన్ని త్యజించాలి. తోటి మానవ సోదరులను తమకన్నా తక్కువగా చూడకూడదు. స్త్రీ జాతిని గౌరవించాలి. ఆమె మీకు జన్మనిచ్చిన తల్లి. ఆత్మీయత కురిపించే చెల్లి. ప్రేమించే ఇల్లాలు. అమ్మ పాదాల చెంత స్వర్గం ఉంది. వితంతువుల్ని చిన్నచూపు చూడకూడదు. సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలి. శుభకార్యాల్లో వారినీ ఆహ్వానించాలి. వితంతువుల పునర్వివాహం వారి హక్కు. అజ్ఞానకాలపు దురాచారాలు, దుర్మార్గాలన్నింటినీ నేను అంతం చేస్తున్నాను. ఒక మనిషికి మరో మనిషిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మానవులంతా ఒక్కటే. విద్యార్జన స్త్రీలు, పురుషులు అందరి విధి. జ్ఞానం జీవితం.. అజ్ఞానం మరణం. కళ్ళున్న వాళ్ళు, గుడ్డివాళ్ళు సమానం కానట్లే, జ్ఞాన సంపన్నులు, జ్ఞాన విహీనులు సమానం కాలేరు. ప్రతి తల్లీదండ్రీ తమ సంతానానికి విద్య నేర్పాలి. భావితరాల సంక్షేమానికి ఇది చాలా అవసరం. అధికార దుర్వినియోగం చేయకూడదు. పరిపాలన అంటే కేవలం ప్రజాసేవ మాత్రమే... పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని భావించాలి. ప్రతినిత్యం ప్రజలకు జవాబుదారుగా దైవానికి భయపడుతూ జీవించాలి. ఇక్కడ మనం పలికే ప్రతి మాటకు, చేసే ప్రతిపనికీ రేపు దైవం ముందు సమాధానం చెప్పుకోవాలన్న భావన కలిగి ఉండాలి. ఇలాంటి భావనలే మానవులను మంచివారుగా, నిజాయితీ పరులుగా, సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. ఇటువంటి బాధ్యతాభావాన్ని, జవాబుదారీ తనాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ప్రజల మనసుల్లో నూరిపోసి, మానవీయ విలువలతో తులతూగే ఓ చక్కని సత్సమాజాన్ని ఆవిష్కరించారు. అందుకే ఆయన మానవాళికి ఆదర్శమయ్యారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
చాందినీ చౌక్ చరిత్ర ఏమిటి? ఈ మార్కెట్ ఎలా ఏర్పాటయ్యింది?
ఎవరిమధ్యనైనా ఢిల్లీకి సంబంధించిన ప్రస్తావన వచ్చిప్పుడు చాందినీ చౌక్ను తప్పక తలచుకుంటారు. చాందినీ చౌక్ పలు సినిమాల్లో కూడా కనిపించింది. చాందినీ చౌక్ పేరుతో ఒక చిత్రం కూడా విడుదలయ్యింది. చాందినీ చౌక్ ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. సరసమైన ధరలకు దుస్తులు, ఆభరణాలు.. ఇలా ఒకటేమిటి ఏ వస్తువైనా ఇక్కడ చిటికెలో దొరుకుతుంది. షాపింగ్తో పాటు రుచికరమైన తినుబండారాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. చాందినీ చౌక్ ఎంతో పురాతనమైన మార్కెట్. దీనికి 370 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మార్కెట్లోని ఇరుకైన వీధులను కత్రా అని పిలుస్తారు. మార్కెట్ నిత్యం కొనుగోలుదారులతో రద్దీగా ఉంటుంది. పాత ఢిల్లీలో ఉన్న ఈ చాందినీ చౌక్ మార్కెట్ ఢిల్లీకి గర్వకారణంగా నిలుస్తుంది. ఇక్కడ అన్ని వయసుల వారికి వారు కోరుకున్న వస్తువులు లభ్యమవుతాయి. షాజహాన్ తన కూతురి కోసం.. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని షాజహానాబాద్ అని పిలిచేవారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమార్తెకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె అభిరుచిని నెరవేర్చేందుకు చక్రవర్తి తన ఎర్రకోట ముందు మార్కెట్ను ఏర్పాటు చేశాడు. దీంతో షాజహాన్ కుమార్తె ఇక్కడ షాపింగ్ చేసేది. 1650లో షాజహాన్ ఈ మార్కెట్ను నిర్మించాడు. క్రమంగా ఈ మార్కెట్ చాలా ప్రసిద్ధి చెందింది. ఢిల్లీలోని ప్రత్యేక మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. మత సామరస్యానికి ఉదాహరణ చాందినీ చౌక్ను షాజహాన్ స్థాపించినప్పటికీ, ఇక్కడ అందరికీ షాపింగ్ చేసే అవకాశం ఉంది. చాందినీ చౌక్ ఏరియా అన్ని మతాలకు చెందిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రముఖ గౌరీ శంకర్ ఆలయం, ఫతేపురి మసీదు ఉన్నాయి. అంతే కాదు ప్రసిద్ధ సిక్కు గురుద్వారా శిష్గంజ్ కూడా చాందినీ చౌక్లో ఉంది. సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి కూడా ఇక్కడ ఉంది. చాందినీ చౌక్ మార్కెట్ వెండి, బంగారు ఆభరణాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వివాహ షాపింగ్ చాలా చౌకగా చేయవచ్చని పలువురు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికించిన 8 ఉగ్రదాడులు -
సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? ఎందుకు ధరిస్తారు?
తలపాగా ధరించే సంప్రదాయం ఈ నాటిది కాదు. చాలా చోట్ల పెళ్లిళ్లలో తలపాగాలు ధరిస్తారు. చరిత్రలో తలపాగా ప్రస్తావన ఉంది. పూర్వం రాజులు, చక్రవర్తులు మాత్రమే తలపాగా ధరించేవారు. యోధులు తలపాగాను తమ శక్తికి చిహ్నంగా భావించేవారు. చాలా సినిమాల్లో ఓడిపోయినవారు లేదా బలహీనులు తమ తలపాగాను తీసి కాళ్ల దగ్గర పెట్టడాన్ని చూసేవుంటాం. తలపాగా చూసినప్పుడు మనకు చాలా విషయాలు గుర్తుకు వస్తాయి. సిక్కు మతానికి చెందినవారు తప్పని సరిగా తలపాగా ధరిస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే సిక్కుమతంలో తలపాగాకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు? ప్రభువుల హోదాకు చిహ్నం సిక్కులు తలపాగాను తమ గురువు ఇచ్చిన బహుమతిగా భావిస్తారు. 1699లో బైసాఖీ రోజున సిక్కుల పదవ గురువు గురు గురు గోవింద్ సింగ్ తన ఐదుగురు సన్నిహితులకు తలపాగాలను బహుమతిగా ఇచ్చారు. గురుగోవింద్ సింగ్ కాలంలో తలపాగాను గౌరవ సూచకంగా చూసేవారు. తలపాగా అనేది ప్రభువుల హోదాకు చిహ్నం. ఆ సమయంలో మొఘల్ నవాబులు, హిందూ రాజ్పుత్లు వారి ప్రత్యేక తలపాగాలతో గుర్తింపు పొందారు. హిందూ రాజ్పుత్ల తలపాగా భిన్నంగా ఉంటుంది. వారి తలపాగాలో ఆభరణాలు పొదిగేవారు. హిందూ రాజ్పుత్లు తలపాగాలు ధరించడంతోపాటు ఆయుధాలను కూడా ధరించేవారు. దీనితో పాటు గడ్డం, మీసాలు పెంచేవారు. గురు గోవింద్ సింగ్ అనుమతితో.. ఒకప్పుడు ప్రతి సిక్కు తలపాగా ధరించడం, కత్తిని ఉపయోగించడం, అతని పేరులో సింగ్ లేదా కౌర్ అని రాసేందుకు అనుమతిలేదు. అయితే గురు గోవింద్ సింగ్ సిక్కులందరికీ కత్తి పట్టుకోవడానికి, వారి పేర్లకు సింగ్, కౌర్ అని రాయడానికి, జుట్టును పెంచుకోవడానికి అనుమతినిచ్చారు. ఫలితంగా సిక్కు సమాజంలో పెద్ద, చిన్న అనే అంతరం ముగిసింది. పంజాబీ సమాజంలో బలహీన వర్గాలను రక్షించే బాధ్యత ఖల్సా సిక్కుల చేతుల్లో ఉంది. సిక్కు యోధులను ఖల్సా అని అంటారు. వారు తలపాగా ధరిస్తారు. సిక్కు చివరి గురువు గురుగోవింద్ సింగ్ చివరి కోరిక మేరకు వారు తమ జుట్టును ఎప్పుడూ కత్తిరించుకోరు. తలపాగాను మార్చుకునే ఆచారం గురుగోవింద్ సింగ్ తన ఇద్దరు కుమారులైన అజిత్ సింగ్, జుజార్ సింగ్ తలలకు తలపాగాలు కట్టి, వారికి ఆయుధాలు ఇచ్చారని సిక్కు చరిత్ర చెబుతోంది. గురుగోవింద్ సింగ్ తన పిల్లలిద్దరినీ పెళ్లికొడుకుగా అలంకరించి యుద్ధభూమికి పంపారు. వీరిద్దరూ యుద్ధరంగంలో వీరమరణం పొందారు. తలపై తలపాగా ధరించడం సిక్కు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైనది. అది వారి సాంస్కృతిక వారసత్వం మాత్రమే కాదు. ఆత్మగౌరవం, ధైర్యం, ఆధ్యాత్మికతకు చిహ్నం. సిక్కు సంప్రదాయంలో స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేయడాన్ని ఘనమైన కార్యంగా గుర్తిస్తారు. తలపాగా మార్చుకునే ఆచారం సిక్కు సంస్కృతిలో కనిపిస్తుంది. తలపాగాను అత్యంత సన్నిహిత మిత్రులు మార్చుకుంటారు. తలపాగా మార్చుకున్న వారు జీవితాంతం స్నేహ సంబంధాన్ని కొనసాగించాలి. తలపాగా బాధ్యతకు చిహ్నంగా కూడా సిక్కులు పరిగణిస్తారు. ఇది కూడా చదవండి: నరహంతకుడు జనరల్ డయ్యర్ను మహాత్మాగాంధీ ఎందుకు క్షమించారు? -
ఇది ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవమో తెలుసా!ఏంటీ డౌంట్? అంటే..
ఆగస్టు 15 భారతదేశం తెల్లవాళ్ల పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న చారిత్రక ఘట్టాన్ని స్మరించుకునే రోజు ఇది. 1947లో బ్రిటీష్ వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొందిన తర్వాత నుంచే ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సంపాదించిపెట్టిన ఎందరో త్యాగధనులు, సమర యోధుల అలుపెరగని పోరాటాలను స్ఫురణకు తెచ్చకుని వారికి నివాళులర్పిస్తూ పండుగలా చేసుకుంటాం. అయితే అందరిలోనూ ఎదురయ్యే సందేహం ఇప్పుడూ మనం ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం? అని. ఇది 76వ? లేక 77వ దినోత్సవమా! అని మదిలో ఒకటే డౌట్. అందరూ చెప్పేది మాత్రం మనం 77వ స్వాతంత్య్ర దినోత్సవం అని కరాఖండీగా చెబుతున్నారు. అసలు ఈ సందేహం ఎందుకు వస్తోంది అంటే.. నిజానికి మనం బ్రిటీష్ పాలన నుంచి మన దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత తొలిసారిగా 1948 ఆగస్టు 15న ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఆ లెక్కన గణిస్తే ఇది 76వ స్వాతంత్య్ర దినోత్సవంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇక 77వ స్వాతంత్య్ర దినోత్సవం అని చాలా మంది కాన్ఫిడెంట్గా అనడానికి గల కారణం ఏంటంటే..భారతదేశం ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం లభించిందినే ఆధారంగా లెక్కిస్తే 2023 అనేది 77వ స్వాతంత్య్ర దినోత్సవం అవుతుంది. అయితే ఎక్కువగా 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అంతేకాదు దాదాపు 200 సంవత్సారాల బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశం స్వాతంత్య్రం పొందింది. ఈ దినోత్సవం థీమ్: "నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్" ఈ థీమ్ ముఖ్యోద్దేశం "కష్ట సమయాల్లో కూడా దేశ ప్రయోజనాలకే తొలి స్థానం" ఇవ్వాలనే ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక దినోత్సవాన్ని ఊరు, వాడతో సంబంధం లేకుండా అంతా ఒక్కటిగా ఆనందంగా జరుపుకునే గొప్ప సంబరం. త్రివర్ణ పతాకం ఎగరువేయడంతో ప్రారంభమైన ఈ దినోత్సవం..దేశం సాధించిన విజయాలను పరంపర నుంచి సాధించాల్సిన నిరంతర ప్రగతి ఆవశక్యతను గూర్చి తెలియజేసే సుదినం. ఇది గతానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు..ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూసే అవకాశం. ఇది భారతదేశానికి ఆధారమైన భిన్నత్వంలోని ఏకత్వం ప్రాముఖ్యత తోపాటు ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద ప్రధాని జెండా ఎగరువేసి.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ రోజంతా భారతదేశ గొప్ప సాంస్కృతికి వారసత్వం, వైవిధ్యాన్ని ప్రదర్శించేలా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు కవాతులు జరుగుతాయి. అంతేగాదు రాబోయే తరాలకు బలమైన, సమగ్రమైన, సంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే నిబద్ధతను పునరుద్దరించేందుకు ఈ దినోత్సవం ఓ మంచిరోజు. (చదవండి: స్త్రీ పోరాటాన్ని ఆవిష్కరించిన ఉద్యమం! బ్రిటిషర్లకే చుక్కలు చూపించారు!) -
నేటి నుంచి అధిక శ్రావణమాసం? అంటే ఇది డూప్లికేటా?
ఈనెల జూలై 18వ తారీకు నుంచి అధిక శ్రావణమాసం ప్రారంభం అవుతోంది. 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం ఇది. ఈ మాసం నేటి(జూలై 18) నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు అధిక శ్రావణ మాసం ఉంటుంది. అయితే ఈ అధిక మాసం అనేది కేవలం వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం మాసాలకు మాత్రమే వస్తుంది. మిగతా మాసాలకు ఎప్పుడూ అధిక మాసం రాదు. ఐతే ముందుగా ఈ అధిక మాసం వచ్చి ఆ తర్వాత నిజమాసం వస్తుంది. అసలు అధికమాసం ఎందుకు వస్తుంది?. అంటే ఇది డూప్లికేట్ అని అర్థమా? ఎలాంటి జపతప వ్రతాలు ఆచారించాల్సిన పని లేదా? అధికమాసం ఎందుకు వస్తుదంటే.. తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు, రుతువులు, పంచాంగ గణన ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంపావు రోజులు వ్యత్యాసం ఉంటుంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇలా ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం అవదు. చాంద్రమానంలో సూర్య సంక్రాంతి లేని మాసాన్ని అధికమాసం అంటారు. చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని పిలుస్తారు. ఇది పాటించం అంటే కుదరదు.. కొన్ని ఏళ్ల తర్వాత జోడు శ్రావణ మాసాలు రావడం జరిగింది. శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తామో అదేవిధంగా మొదటి శ్రావణంలో కూడా అవే నియమాలను తప్పక పాటించాలి. ఉదాహరణకు కవల పిల్లలు పుడితే వద్దంటామా..? లేదు కదా అలాగే జోడు శ్రావణ మాసాలు వచ్చినప్పుడు కూడా ఒకటి పాటిస్తాం మరొకటి పాటించము అంటే ధర్మశాస్త్రము అంగీకరించదు. కావున రెండూ శ్రావణ మాసాలే. మొదటి శ్రావణ మాసంలో కూడా వ్రతాలు, పూజలు అనగా శ్రావణ సోమవారాలను, శ్రావణ శుక్రవారాలను, శ్రావణ శనివారాల వంటివి, అలాగే మధ్య మాంసాలను స్వీకరించకుండా కేవలం సాత్విక ఆహారాలను మాత్రమే స్వీకరించడం తదితరాలన్ని చేయాల్సిందే. విష్ణువుకి ఎంతో ఇష్టమైనది.. శ్రీమహా విష్ణువుకి మహా ప్రీతికరమైన మాసం ఇది. అందుకే దీన్ని అధిక రాధా పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఈ మాసంలో చేసే దానాలు, వ్రతాలు అధిక ఫలితాలనిస్తాయి. ఈ మాసంలో ఏది దానం చేసిన శ్రీ అధిక రాధా పురుషోత్తమ ప్రీత్యర్థం ఇస్తున్న దానం పేరు చెప్పి కరిష్యే అనాలి. అలాగే ఈ రోజుల్లో శ్రీ అధిక రాధా పురుషోత్తమాయ నమః అని 108 సార్లు జపం చేయాలి. విష్ణువు శ్రీమహాలక్ష్మికి ఓ సందర్భంలో పురుషోత్తమ మాస విశిష్టతను వివరిస్తూ ‘ఎవరైతే ఈ మాసంలో పుణ్య నదీస్నానాలు, జపహోమాలు, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్ల ఫలితాలు లభిస్తాయి. అధిక మాసంలో పుణ్యకర్మలు ఆచరించని వారి జీవితాల్లో కష్టనష్టాలు ఎదురవుతాయి. అధిక మాసం శుక్ల పక్షంలో కానీ, కృష్ణ పక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అలాగే పౌర్ణమి నాడైనా పుణ్యకార్యాలు చేయాలి. దానివల్ల వారికి అపారమైన ఫలితం లభిస్తుందని వివరించాడని పురాణ కథనం. (చదవండి: ఈ అమావాస్య..కొన్ని కోట్ల గ్రహణములతో సమానమైనది!) -
మిస్త్రీ కారు ప్రమాదం.. వెనక సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే..?
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోడం వ్యాపార, వాణిజ్య వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదానికి గల కారణాలను అధికారులు, నిపుణులు అన్వేషిస్తున్నారు. మిస్త్రీతో పాటు కారు వెనుక సీట్లో కూర్చున్న జహంగీర్ పండోలే.. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని నిపుణులు అంటున్నారు. వారిద్దరూ కనుక సీట్ బెల్ట్ ధరించివుంటే ఎయిర్బ్యాగ్స్ తెరుచుకుని ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు పరిశీలిస్తే ముందు భాగంలో రెండు ఎయిర్ బ్యాగ్లు తెరుచుకున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. దీంతో ముందు సీట్లో ఉన్న డేరియస్ పండోలే, కారు నడుపుతున్న ఆయన భార్య డాక్టర్ అనాహిత గాయాలతో బయటపడ్డారు. వారిద్దరూ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎయిర్ బ్యాగ్లు తెరుచుకుని ప్రమాద తీవ్రత తగ్గి ప్రాణాలు నిలుపుకున్నారు. (క్లిక్: మిస్త్రీ హఠాన్మరణం.. ఆనంద్ మహీంద్ర భావోద్వేగం) సెక్యురిటీ ఫీచర్లు ఉన్నప్పటికీ.. కారుకు ఒకవైపు మాత్రమే అమర్చినట్లుగా కనిపించే నీలం రంగు సైడ్-కర్టెన్ ఎయిర్బ్యాగ్లు కూడా ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. మిస్త్రీ, జహంగీర్ సీటు బెల్ట్ ధరించపోవడంతో వారి సీట్లలో నుంచి ఎగిరిపడివుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన మెర్సిడెస్ జీఎల్సీ ఎస్యూవీలో అత్యంత సురక్షితమైన సెక్యురిటీ ఏర్పాట్లు ఉన్నప్పటికీ అజాగ్రత్త కారణంగానే మిస్త్రీ, జహంగీర్ ప్రాణాలు కోల్పోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే వెనుక సీటులో సీట్ బెల్ట్లు ధరిస్తారన్న విషయం తెలిసిందే. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమౌతుంది? కారు వెనుక కూర్చున్న వారు సీటు బెల్ట్ ధరించకపోతే ఏమవుతుందనే దాని గురించి తెలిపే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెనుక సీట్లో ఉన్న ఇద్దరిలో ఒకరు మాత్రమే సీటు బెల్ట్ ధరించారు. ప్రమాదం జరిగినప్పడు సీటు బెల్ట్ పెట్టుకోని వ్యక్తి ఎగిరి ముందు సీటులోని వ్యక్తి ఎగిరిపడిపోయినట్టుగా వీడియో చూపించారు. బాహుశా మిస్త్రీ కారు ప్రమాదానికి గురైనప్పుడు ఈవిధంగానే జరిగివుండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కారులో ప్రయాణించే వారంతా తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని చెబుతున్నారు. (క్లిక్: చిన్న పొరపాట్లే మిస్త్రీ ప్రాణాలు తీశాయా.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..!) చట్టం ఏం చెబుతోంది? సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) ప్రకారం వెనుక సీటులో కూర్చున్న ప్రయాణికులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. సీఎంవీఆర్ రూల్ 138 (3) ప్రకారం వాహనం కదులుతున్నప్పుడు.. ముందు సీటులో కూర్చున్న వారితో పాటు వెనుక సీటులో ఉన్న వారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి 1,000 రూపాయల జరిమానా విధిస్తారు. కాగా, కారులో అన్ని సీట్లకు Y- ఆకారపు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉండాలని ఈ సంవత్సరం ప్రారంభంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. 25 శాతం మరణాలను నివారించొచ్చు వెనుక సీటు బెల్ట్లను ఉపయోగించడం వల్ల 25 శాతం మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అంతేకాదు ప్రమాదాల్లో ముందు సీటు ప్రయాణికులకు అదనపు గాయాలు లేదా మరణాన్ని కూడా నిరోధించవచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. -
Tea: చాయ్ గరీబుకు విందురా భాయ్
జీవితంలో చాయ్ (టీ) ఓ భాగమైపోయింది. నిద్ర లేవగానే ఓ కప్పు చాయ్ కడుపులో పడితే గాని ఏ పని చేయలేం. ఇంట్లో ఉన్నా, ఆఫీసుకు వెళ్లినా ఓ కప్పు చాయ్ కావాల్సిందే. దోస్తులు కలిసినా.. అతిథి వచ్చినా తేనీటి విందు తప్పనిసరి. భారత ప్రధాని మోదీ నిర్వహించే కార్యక్రమానికి ‘చాయ్ పే చర్చ’ అనే పేరు పేట్టారంటే టీ ఎంతలా మనలో స్థానం సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. జనంలో అత్యంత ఆదరణ ఉండడంతో టీని జాతీయ పానీయంగా గుర్తించారు. అయితే ఇక్కడ చాయ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ రోజు ‘ఇంటర్నేషనల్ టీ డే’ కాబట్టి. సాక్షి, హైదరాబాద్: నాలుగో శతాబ్దంలో ఓ చైనా వైద్యుడికి కొంత సుస్తిగా ఉండగా, వైద్య పరీక్షల్లో భాగంగా కొన్ని ఆకులను తీసుకొని ఎండబెట్టాడు. వేడి నీటిలో వాటిని నానబెట్టగా వచ్చిన డికాషన్ను తాగాడు. దీంతో అతడు ఎంతో ఉత్తేజాన్ని పొందాడు. ► 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ తాగడం ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నల్లమందుకు బదులుగా టీని చైనా నుంచి దిగుమతి చేసుకునేది. 1823లో బ్రిటన్కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో దేశీయంగా తేయాకును కనిపెట్టిట్టారు. అప్పటి నుంచి భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమైంది. ► 1860 నాటికి భారతదేశంలోని టీ ప్లాంటేషన్ బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడ టీ ఉత్పత్తి సుమారు 10లక్షల కేజీలు ఉండేది. నేడు పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ టీని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా ప్రసిద్ధి చెందాయి. చదవండి: తల్లి వద్దు.. ప్రియుడే కావాలి.. -
దేశం గర్వించతగ్గ ఘటన.. ఆ చిరస్మరణీయ విజయానికి విశాఖ వేదికైంది..
పాకిస్తాన్.. దాయాది దేశం పేరు వింటనే పౌరుషం పొంగుకొస్తుంది. అలాంటి శత్రుదేశంతో యుద్ధం జరిగితే.. ఆ యుద్ధంలో మన త్రివర్ణపతాకం రెపరెపలాడితే.. ఆ చిరస్మరణీయ విజయానికి మన విశాఖే వేదికైతే.. ఇంకెంత గర్వంగా ఉంటుందో కదా. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ నాలుగో తేదీన భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తారు. జాతి గర్వించదగిన గెలుపునకు గుర్తుగా బీచ్రోడ్లో ‘విక్టరీ ఆఫ్ సీ’ స్థూపం నిర్మించారు. భారత నౌకాదళం ప్రపంచంలోనే అతి పెద్ద దళాల్లో ఒకటిగా సమర్థమైన నౌకాదళ శక్తిగా మారగా.. దేశంలోనే ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం అభివృద్ధి చెందింది. నౌకాదళ దినోత్సవం నిర్వహించుకోడానికీ కేంద్ర బిందువు కూడా విశాఖపట్నం కావడం మరో విశేషం. సాక్షి, విశాఖపట్నం: దేశానికి తూర్పు తీరం వ్యూహాత్మక రక్షణ ప్రాంతం. సహజ సిద్ధమైన భౌగోళిక రక్షణతో పాటు శత్రుదేశాలకు సుదూరంగా ఉండటం తూర్పు నౌకాదళం ప్రత్యేకత. అందుకే రక్షణఅవసరాల దృష్ట్యా బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతాన్ని కీలకంగా భావించారు. ఇందులో భాగంగానే తూర్పు నావికా దళం ఏర్పాటైంది. 1923 డిసెంబర్లో విశాఖను తూర్పు తీరంలో వ్యూహాత్మక కేంద్రంగా గుర్తించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలమైన 1942–45 మధ్య కాలంలో విశాఖ తీరాన్ని ప్రధానంగా వినియోగించుకున్నారు. ఇక్కడి నుంచే బర్మాకు ఆయుధాలను రవాణా చేశారు. స్వాతంత్య్రానంతరం 1954లో విశాఖ నేవీ పోస్ట్ను కమాండర్ హోదాకు పెంచుతూ, బేస్ రిపేర్ ఆర్గనైజేషన్ కార్యకలాపాలను ప్రారంభించారు. 1962లో ఇండియన్ నేవీ హాస్పిటల్ సర్వీసెస్ (ఐఎన్హెచ్ఎస్) కల్యాణి ప్రారంభమైంది. అనంతరం 1967 జూలై 24న కమాండర్ హోదాను రియర్ అడ్మిరల్ హోదాకు అప్గ్రేడ్ చేయడంతో పాటు తూర్పు తీరంలో ఫ్లాగ్ ఆఫీసర్స్ పోస్టులను కూడా మంజూరు చేశారు. చివరిగా 1968 మార్చి 1న విశాఖ ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం( ఈఎన్సీ ) కార్యకలాపాలు ప్రారంభమై చరిత్రకు శ్రీకారం చుట్టింది. 1971 మార్చి1న ఈఎన్సీ చీఫ్గా వైస్ అడ్మిరల్ నియామక శకం మొదలైంది. క్రమక్రమంగా ఈఎన్సీ విస్తరించింది.1971 నవంబర్ 1 నుంచి ఈఎన్సీ ఫ్లీట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి ఈఎన్సీ చీఫ్గా రియర్ అడ్మిరల్ కేఆర్ నాయర్ నియమితులయ్యారు. ప్రస్తుతం 29వ చీఫ్గా వైస్ అడ్మిరల్ బిస్వజిత్దాస్ గుప్తా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. రక్షణలో వెన్నెముక మయన్మార్లోని కొండ ప్రాంతం మినహా దక్షిణ హిందూ మహా సముద్రం వరకూ ఈస్ట్రన్ నేవల్ కమాండ్ పరిధిలో సురక్షితంగా ఉంది. ఉత్తరాన సుందర్బన్ నుంచి దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకూ విస్తరించి ఉంది. 2,600 కి.మీ నిడివి కలిగిన తూర్పు తీరంలో 30 శాతం అంటే 6 లక్షల చ.కిమీ పరిధిలో ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ విస్తరించి ఉంది. ఈ తీరంలో 13 మేజర్ పోర్టులున్నాయి. భారత సర్కారు లుక్ ఈస్ట్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత సముద్ర వాణిజ్యానికి తూర్పు తీరం ప్రధాన కేంద్రంగా మారడంతో వాణిజ్య నౌకల రక్షణ బాధ్యత కూడా తూర్పు నౌకాదళమే నిర్వర్తిస్తోంది. దీంతో పాటు డీఆర్డీవో కార్యకలాపాలకు కూడా తూర్పు తీరమే వేదికగా మారింది. పలు క్షిపణులు తయారు చేసే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లేబొరేటరీస్ (ఎన్ఎస్టీఎల్) కూడా విశాఖలోనే ఏర్పాటైంది. డిసెంబర్ 4 విజయానికి నాంది ఘాజీ కాలగర్భంలో కలిసిపోవడంతో బంగాళఖాతంలోని జలప్రాంతాలన్నీ ఇండియన్ నేవీ.. తన ఆధీనంలోకి తెచ్చుకుంది. భారత్ ముప్పేట దాడితో పాకిస్తాన్ తలవంచక తప్పలేదు. డిసెంబర్ 16న పాకిస్తాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సైనిక లొంగుబాటు జరిగిన యుద్ధమిదే.ఈ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం లభించింది. డిసెంబర్ 16న యుద్ధం ముగిసినా దానికి కారణం డిసెంబర్ 4న అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచీపై చేసిన మెరుపుదాడేనని చెప్పుకోవచ్చు. అందుకే 1971 యుద్ధంలో మన నౌకాదళం ప్రదర్శించిన సాంకేతిక ప్రతిభా పాటవాలు, వ్యూహాలు, ధైర్య సాహసాలకు గుర్తుగా డిసెంబర్ నాలుగో తేదీన భారత నౌకాదళ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. తీర ప్రాంత రక్షణలో వెన్నెముకగా ఉన్న ఈఎన్సీ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో ఇండియన్ నేవీ ఎప్పటికప్పుడు నౌకా సంపత్తిని పెంచుకుంటూ శత్రుదుర్భేద్యంగా మారుతోంది. తూర్పు నౌకాదళం పరిధిలో 52 వరకు యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలున్నాయి. యుద్ధ నౌకల పనితీరు, పరిజ్ఞానం బట్టి వాటిని వివిధ తరగతులుగా విభజించారు. అదే విధంగా సబ్మెరైన్లను కూడా వాటి సామర్థ్యం, పనితీరు బట్టి వివిధ తరగతులుగా విభజించారు. భారత నౌకాదళంలో ఉన్న షిప్స్ పేర్లన్నీ ఐఎన్ఎస్తో మొదలవుతాయి. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్. యుద్ధ నౌకల్లో ఐఎన్ఎస్ ఢిల్లీ క్లాస్, రాజ్పుత్, గోదావరి, తల్వార్, కోల్కతా, శివాలిక్, బ్రహ్మపుత్ర, ఆస్టిన్, శార్దూల్, దీపక్, మగర్, కుంభీర్, కమోర్తా, కోరా, ఖుక్రీ, అభ్య, వీర్, పాండిచ్ఛేరి, అస్త్రధరణి, సరయు, సుకన్య, కార్ నికోబార్, బంగారం, త్రికర్ట్.. ఇలా విభిన్న తరగతుల యుద్ధ నౌకలున్నాయి. సబ్మెరైన్ల విషయానికొస్తే.. న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్లను అరిహంత్, చక్ర(అకుళ–2) క్లాస్లుగా, కన్వెన్షనల్లీ పవర్డ్ సబ్మెరైన్లను సింధుఘోష్, శిశుమార్ క్లాస్ సబ్మెరైన్లుగా విభజించారు. ఇటీవల ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకతో పాటు పలు హెలికాఫ్టర్లు, అడ్వాన్స్డ్ యుద్ధ విమానాల రాకతో ఈఎన్సీ బలం మరింత పెరిగింది. సాయుధ సంపత్తికి కీలకం.. రజాలీ ఈస్ట్రన్ నేవల్ కమాండ్కు అత్యంత వ్యూహాత్మక, కీలకమైన ఎయిర్స్టేషన్ రజాలీ. ఇది తమిళనాడులోని అరక్కోణం జిల్లాలో ఉంది. ఇది ఈఎన్సీకే కాదు.. భారత నౌకాదళానికీ కీలకమైన ఎయిర్స్టేషన్. 2,320 ఎకరాల విస్తీర్ణంలో అతి పొడవైన, వెడల్పైన రన్వే కలిగిన రజాలీ.. ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్స్టేషన్గా గుర్తింపు పొందింది. తూర్పు, దక్షిణ తీరాల మధ్యలో భూ ఉపరితల, సముద్ర మార్గాల ద్వారా దాడి చేసేందుకు వచ్చే శత్రుదేశాల తుదిముట్టేంచేందుకు కావల్సిన ఆయుధ సంపత్తి అంతా రజాలీలోనే నిక్షిప్తమై ఉంది. 1985లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆధీనంలోకి ఈ ఎయిర్స్టేషన్ వచ్చింది. ఆ తర్వాత భారత నౌకాదళం రజాలీని వ్యూహాత్మక ఎయిర్స్టేషన్గా తీర్చిదిద్దింది. 1992 మార్చి 11న అప్పటి రాష్ట్రపతి వెంకటరామన్ ఈ ఎయిర్ స్టేషన్ను జాతికి అంకితం చేశారు. ఈఎన్సీకి చెందిన స్థావరాలు మొత్తం 15 ఉండగా.. ఇందులో ఏడు నేవల్ బేస్లు విశాఖలోనే ఉన్నాయి. నేవల్ బేస్ ఐఎన్ఎస్ వర్ష రాంబిల్లిలో నిర్మితమవుతోంది. నౌకాదళానికి, ప్రజలకు వారధి.. నేవీడే తూర్పు నౌకాదళం అత్యంత ప్రధానమైన కమాండ్. దేశ రక్షణలో అశువులు బాసిన నావికులు చేసిన సేవలు శ్లాఘనీయం. లుక్ ఈస్ట్, టేక్ ఈస్ట్ విధానాలతో తూర్పు నౌకాదళానికి ప్రాధాన్యం పెరిగింది. మిషన్ డిప్లాయ్స్ ఆపరేషన్స్ అనే విధానాన్ని ప్రస్తుతం నేవీ అనుసరిస్తోంది. ఈ విధానం వల్ల అనుకున్న సమయానికి అనుకున్న ప్రదేశంలో అందుబాటులో సిబ్బంది ఉండగలుగుతున్నారు. హెలికాఫ్టర్లు, యుద్ధ నౌకల ద్వారా దాయాదిదేశాలకు చెందిన వాటిని గుర్తించి ఎదుర్కొనేందుకు నిత్యం పహారా కాస్తున్నాం. ఒకవేళ అలాంటివి ఎదురైనా.. వాటిని తిప్పికొట్టేందుకు సమర్థంగా ఉన్నాం. కోవిడ్ కారణంగా ఈ ఏడాది కూడా విన్యాసాలు చేపట్టలేకపోతున్నాం. – వైస్ అడ్మిరల్ బిస్వజిత్దాస్ గుప్తా, తూర్పు నౌకా దళాధిపతి చదవండి: మిలాన్ మెరుపులు..46 దేశాలకు ఆహ్వానం! -
ఒకరికొకరు నిలబడదాం
‘‘ఎవరు ఎలా ఉంటే వాళ్లను అలాగే అంగీకరిద్దాం. వేరే వారితో పోల్చి చూడటం మానేద్దాం’’ అంటున్నారు తమిళ నటి వరలక్ష్మీ శరత్కుమార్. సామాజిక అంశాల మీద తరచూ ఏదో ఓ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారామె. తాజాగా పాతకాలపు ఆలోచనా విధానాన్ని ఎలా బద్ధలుకొట్టాలి? స్త్రీలకు అండగా ఎలా నిలబడటం ఎంత ముఖ్యం? అనే విషయాలపై ఓ పోస్ట్ చేశారు వరలక్ష్మి. ‘‘ఒక స్త్రీ ఎలా ఉండాలనుకుంటుందో అది తన ఇష్టం. ఒక సమాజంగా తన ఇష్టాన్ని మనందరం గౌరవించాలి. నువ్వెందుకు ఇలా ఉన్నావు? మిగతావారిలా లేవు? అని పోల్చి చూడొద్దు. ప్రతీ ఒక్కరం ఏదో ఒక సమస్యతో నిరంతరం పోరాడుతూనే ఉంటాం. సమస్యను అనుభవించే వాళ్లకే ఆ నొప్పి తెలుస్తుంది. ఒకరికొకరం నిలబడదాం.. తోడుగా నిలబడదాం. మనలో ఎవ్వరూ సంపూర్ణంగా లేము. మనకి ఉన్నది ఒక్కటే జీవితం. నచ్చినట్టు బతుకుదాం.. నచ్చిన పనిని నచ్చినట్టు చేసుకుంటున్న ప్రతి స్త్రీకి నా అభినందనలు’’ అన్నారామె. కాగా వరలక్ష్మి సినిమాల విషయానికి వస్తే రవితేజ ‘క్రాక్’, అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాల్లో నటిస్తున్నారు. -
సంజయ్... జిల్లా నేతలకు ‘జై’
సాక్షి, హైదరాబాద్ : ‘బండి’కూర్పులో కొంచెం మార్పు, కొంచెం నేర్పు కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటులో అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన ముద్ర వేశారు. జిల్లాల నేతలకు సం‘జై’కొట్టారు. హైదరాబాద్లో ఉంటున్నవారికే ఇప్పటిదాకా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలకు చెక్ పెట్టారు. ఈసారి ఆయా జిల్లాల నేతలకు రాష్ట్ర కమిటీలో ఎక్కువ పదవులు కేటాయించారు. రాష్ట్రకమిటీలో మొత్తంగా 23 మందికి చోటు కల్పించగా అందులో 17 మంది జిల్లాల నేతలే కావడం గమనార్హం. సంజయ్ స్వయంగా కరీంనగర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అధికార ప్రతినిధుల్లో నల్లగొండ నుంచి పి.రజనీకుమారికి స్థానం కల్పించారు. కమిటీలో మాజీ ఎమ్మెల్యేలకు కూడా పెద్దపీట వేశారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి కూడా కమలదళంలో చోటు లభించింది. 8 మంది ఉపాధ్యక్షుల్లో ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు, సెక్రటరీల్లో ఒక మాజీ ఎమ్మెల్యేకు స్థానం కల్పించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన విజయరామారావు, యెన్నం శ్రీనివాస్రెడ్డి, శోభారాణికి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్కుమార్లకు మరోసారి అవకాశం కల్పించారు. బీజేపీ జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతికి ప్రధాన కార్యదర్శిగా అవకాశం వచ్చింది. రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులైన వారిలో శ్రీనివాస్ గౌడ్, కుంజా సత్యవతి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కాగా ప్రకాష్రెడ్డి, రఘునందన్ రావు, మాధవి ఇప్పటివరకు అధికార ప్రతినిధులుగా పనిచేశారు. మరో కార్యదర్శి బొమ్మ జయశ్రీ మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కూతురు. ఇక గత కమిటీలో పనిచేసిన కార్యదర్శులలో మళ్లీ ఎవరికీ చాన్స్ దక్కలేదు. పార్టీ కోశాధికారిగా గత కమిటీలో ఉన్న శాంతికుమార్నే మళ్లీ నియమించారు. నార్త్ ఇండియన్ భవర్లాల్ వర్మను జాయింట్ ట్రెజరర్గా నియమించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిని మార్పు చేశారు. ఆరుగురు మహిళలకు చోటు... బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు. ఉపాధ్యక్షులుగా ఒకరికి, ప్రధాన కార్యదర్శిగా మరొకరికి, కార్యదర్శుల్లో నలుగురికి స్థానం దక్కింది. సామాజికవర్గాల వారీగా చూస్తే రాష్ట్ర కమిటీలో అగ్రకులాలవారికే ఎక్కువ చోటు దక్కింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆరుగురు, వెలమ ముగ్గురు, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. బీసీల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి అధ్యక్షునితో కలుపపుకొని నలుగురు ఉన్నారు. -
అప్పటినుంచే వాడకం..ఆ సబ్బుపై నిషేధం
చేతులు శుభ్రంగా కడుక్కున్నావా ఈ మధ్య ప్రతీ ఇంట్లో వినిపిస్తున్న మాట. కరోనా కారణంగా వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. తద్వారా ఏదైనా వస్తువును ముట్టుకున్నా, తినడానికి ముందు సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ చేతులు శుభ్రపరుచుకోవడం అనివార్యం అయ్యింది. మన శరీరంలోనూ కొన్ని వేల సూక్షజీవులు ఉంటాయి. వాటి నుంచి అనారోగ్యానికి గురికాకుండా సబ్బుతో శుభ్రపరుచుకుంటారు. ఇంత ప్రాముఖ్యం ఉన్న సబ్బు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ? దీన్ని ఎవరు కనుగొన్నారు ?సబ్బుల్లోనూ హానికారకమైనవి ఎలా గుర్తించాలి..ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్లనే మనం ఫాలో అవుతున్నాం సబ్బును మొట్టమొదటగా పురాతన బాబీలోనియన్లు క్రీ.పూ. 2800 సంవత్సరంలోనే తయారుచేశారు. కలప, బూడిద, కొంచెం నీటిని వాడి సబ్బులా తయారుచేశారు. అయితే దీన్ని వ్యక్తిగత శుభ్రతకు ఉపయోగించలేదు. కేవలం ఉన్ని, పత్తి లాంటి వాటిని శుభ్రపరిచేందుకు వినియోగించినట్లు తేలింది. అయితే ఆ తర్వాత బాబీలోనియన్లు ఉపయోగించిన పదార్థాలతోనే ఈజిప్టియన్లు సబ్బును తయారుచేసి పుండ్లు, చర్మ వ్యాధుల చికిత్స కోసం వినియోగించారు. రోమన్ శతాబ్దాం వరకు వ్యక్తిగత శుభ్రతకు సబ్బును వాడలేదని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే దశాబ్దాలు మారినా బేసిక్ సబ్బు తయారీ విధానం మాత్రం మారలేదు. ఏ సబ్బు తయారీలో అయినా సాధారణంగా నీరు, నూనె ( వెజిటేబుల్ ఆయిల్ ) , బేసిక్ ఆల్కలీ, అయానిక్ ఉప్పు ను వాడతారు. సరైన నిష్పత్తిలో ఈ పదార్థాలన్నింటినీ కలపడం ద్వారా రసాయన ప్రక్రియ జరిగి సబ్బు తయారవుతుంది. ఈ పద్దతిని సోపోనిఫికేషన్ అంటారు. సబ్బు తయారీకి చల్లని ప్రక్రియ (కోల్డ్ ప్రాసెస్ ), వేడి ప్రక్రియ ( హాట్ ప్రాసెస్ ) అని రెండు పద్దతులను వాడతారు. అయితే వేడి ప్రక్రియ ద్వారానే సులభంగా సబ్బు చేయడానికి వీలుంటుందని రుజువైంది. ఆ సబ్బుపై నిషేదం నిత్యం ఎన్నో సూక్షజీవులతో మనం జీవిస్తున్నాం. సబ్బులో నీరు, నూనె వంటి గుణాలు ఉండటం వల్ల బాక్టీరియా, క్రిములు తొందరగా ఆకర్షించబడతాయి. దాదాపు 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులను శుభ్రపరుచుకోవడం వల్ల క్రిములు నశిస్తాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే..తడిచేతులను అలాగే వదిలేయరాదు. దీని వల్ల సూక్షజీవులు మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే టువాలు లేదా టిష్యూలు వాడి చేతులు తడిబారకుండా చూసుకోవాలి. అయితే అన్ని సూక్షజీవులు హానికారం కాదు. కొన్ని మనకు మేలుచేసేవి ఉంటాయి. ఏ సబ్బు అయినా క్రిములను చాలామేర తగ్గిస్తుంది కానీ మొత్తానికే వాటిని నాశనం చేయదు. అయితే యాంటీ బాక్టీరియల్ సబ్బులు మాత్రం బాక్టీరియా లోపలి కణ త్వచాలోకి వెళ్లి చంపేస్తుంది. ఈ సబ్బులోని ట్రైక్లోసన్ లేదా ట్రైక్లోకార్బన్ వంటి పదార్థాలు శరీరంపై దీర్ఘకాలిక దుష్ర్పభావాలను చూపిస్తుందని అధ్యయనంలో తేలడంతో 2016 నుంచి ఎఫ్డీఏ యాంటీ బాక్టీరియల్ సబ్బుల అమ్మకాలపై నిషేదం విధించింది. పీహెచ్ లెవల్ పెరిగితే చర్మ సమస్యలు ప్రస్తుతం శానిటైజర్ల వినియోగం బాగా పెరిగింది. అయితే 60-95% ఆల్కహాల్ సాంద్రత కలిగిన హ్యాండ్ శానిటైజర్లు సూక్షజీవులను చంపడంలో ఎక్కువ శక్తిమంతమైనవి. అయితే ఎక్కువసార్లు శానిటైజర్ వాడటం వల్ల చేతులు పొడిబారే అవకాశం ఉంది. పీహెచ్ లెవర్ ఎక్కువగా ఉన్న సబ్బులు వాడటం వల్ల శరీరం దురద, మంట, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తక్కువ పీహెచ్ లెవల్ ఉన్న సబ్బులు వాడాలి. అంతే కాకుండా సబ్బులను డైరెక్ట్ గా వాడకుండా తప్పకుండా నీరు కలిపి వాడాలి. హెర్బల్, యాంటీ ఆక్నె, శరీరం చర్మ తత్వాన్ని బట్టి సబ్బులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. -
మానసిక స్థయిర్యమే నా బలం: కోహ్లి
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తను శారీరక దృఢత్వంకంటే మానసిక సంసిద్ధతకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానని చెప్పాడు. అందుకే ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే తిరిగి అదేస్థాయిలో ఆటను మొదలుపెట్టే బలం తనలో ఉందన్నాడు. ఐపీఎల్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని... ఒకే టోర్నీలో అన్ని దేశాల వారినీ కలుపుకొని ఆడుతూ అందరినీ అలరించే లీగ్ అని చెప్పాడు. అయితే కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు మునుపటిలా ఉండవని... తప్పకుండా మార్పులుంటాయని... వీటిని అంగీకరించాల్సిందేనన్నాడు. ‘ఐసీసీ టోర్నీలకంటే భిన్నమైంది ఐపీఎల్. అందుకే ఆ లీగ్ అంటే నాకెంతో ఇష్టం. మనతో కొత్తగా ఆడేవాళ్లతో మన అనుభవాలు పంచుకోవచ్చు. పాతవాళ్లతో అనుబంధం కొనసాగించవచ్చు. ఎప్పుడోగానీ చూసే విదేశీ ఆటగాళ్లతో తరచూ కలిసి ఆడే అవకాశం ఈ లీగ్ ద్వారానే కలుగుతుంది. అందుకే ఐపీఎల్ అంటే అందరికీ మోజే. అభిమానులకు క్రేజే’ అని అన్నాడు. మీ ఫేవరెట్ మ్యాచ్ ఏదనే ప్రశ్నకు బదులిస్తూ ‘ఇది చెప్పడం తేలిక కాదు. ఎందుకంటే అలాంటివి నాకెన్నో ఉన్నాయి... అయితే అప్పటి పరిస్థితి, ప్రాధాన్యతను బట్టి చూస్తే టి20 ప్రపంచకప్ (2016)లో భాగంగా మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన పోరు నా ఫేవరెట్ మ్యాచ్ల్లో ఒకటి. ఓడిపోయేస్థితిలో ఉన్న ఈ మ్యాచ్లో మేము గెలిచాం’ అని చెప్పాడు. -
ఆహార ‘శైలి’ మారింది!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో జనాలంతా ఇంటికే పరిమితమవడంతో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో రోజువారీ ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. మామూలు రోజుల్లో తీసుకునే ఆహారానికి బదులు పోషకాలున్న ఆహారానికే మొగ్గుచూపుతున్నారు. ఖాళీ సమయాల్లో అధిక తిండితో ఊబకాయం, డయాబెటిస్, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి అనారోగ్యాల బారిన పడరాదన్న వైద్యుల సూచనలకు అనుగుణంగా తమ ఆహార శైలిని మార్చుకుంటున్నారు. తృణధాన్యాలు, బ్రౌన్రైస్, బ్రెడ్, పాలు, చేపలు, గుడ్లు, చికెన్ వంటి ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సమతుల ఆహారానికి ప్రాధాన్యం.. లాక్డౌన్తో రెస్టారెంట్లు, హోటళ్లు పూర్తిగా మూతపడటంతో బయటి నుంచి ఆహారం తెచ్చుకొని తినే పరిస్థితులు లేవు. దీంతో ఇంటి ఆహారం తప్పనిసరైంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో సమతుల ఆహారం తీసుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం, వైద్యులు సూచిస్తున్నారు. దీంతో పప్పుల వినియోగం పెరిగింది. పిండి వంటకాలు ఎక్కువగా వండుతున్నారు. హెర్మల్ టీ తాగుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లు మూతపడినప్పటికీ రాష్ట్రంలో ఆరెంజ్, దానిమ్మ, అరటిపళ్లు, మోసంబి, వాటర్ మిలన్ల సగటు వినియోగం ప్రతి రోజూ 20 వేల క్వింటాళ్లకు పైనే ఉంది. పండ్లను స్వయంగా ఇంటికే సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో వీటి వినియోగం పెరిగింది. ఇక సగటున వారానికి డజన్ కోడి గుడ్లను తినే కుటుంబాలు ఇప్పుడు రెండు డజన్లు తింటున్నాయి. యూట్యూబ్ చిట్కాలతో వంటలు.. రాష్ట్ర ప్రభుత్వం జొమాటో, స్విగ్గీ సర్వీసులను పూర్తిగా నిలిపివేయడంతో స్వయం పాకం తప్పనిసరైంది. వంట చిట్కాలకై ఎక్కువగా బ్యాచిలర్స్, ఐటీ ఉద్యోగులు గూగుల్పైనే ఆధారపడుతున్నారు. కేక్ మొదలు, బర్గర్ వరకు, బటర్ చికెన్ నుంచి చికెన్ బిర్యానీ వరకు ఎలాంటివి తినాలన్నా.. చిట్కాలకై యూట్యూబ్ వీడియోలు, పలు వంటకాల యాప్లపై ఆధారపడుతున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చికెన్ బిర్యానీకై సుమారు 15 లక్షల మంది గూగుల్లో శోధించారు. చికెన్ టిక్కా మసాలా, తందూరీ చికెన్, పాలక్ పన్నీర్, దహీవడ, పానీపూరి, కేక్ల తయారీకై శోధించిన వారి సంఖ్య ఈ నెల రోజుల్లో 120 శాతం పెరిగిందని ఆన్లైన్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. చాలా కుటుంబాలు కలిసి భోజనం చేస్తుండటంతో ఆరోగ్యకర భోజనం వండటానికి ఆసక్తి కనబరుస్తున్నారని సర్వేల్లో తెలింది. నో డ్రింక్స్.. ఓన్లీ పాలు, పెరుగు.. లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాన కూల్డ్రింక్స్ సంస్థలన్నీ తమ ఉత్పత్తులను నిలిపివేయడంతో వాటి లభ్యత పూర్తిగా పడిపోయింది. దీంతో కూల్డ్రింక్స్ స్థానంలో పాలు, పెరుగు వినియోగం పెరిగిందని సర్వేల ద్వారా తెలుస్తోంది. స్వీట్స్ వంటి వాటికి వినియోగించే పాలు ఇప్పుడు రోజువారీ అవసరాలకు మళ్లాయని, ప్యాకేజ్డ్ పాల వినియోగం లాక్డౌన్ తర్వాత 15 నుంచి 25 శాతం పెరిగిందని సర్వేలు తెలిపాయి. డ్రింక్స్కు బదులు ప్రతి ఇంట్లో వేసవి తాపానికి విరుగుడుగా ఇప్పుడు చల్లని మజ్జిగ, నిమ్మకాయ రసాలు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారని బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి నగరాల్లో చేసిన సర్వేలో వెల్లడైంది. లాక్డౌన్ తర్వాత కూడా అన్ని రంగాలపై ఆర్థిక వ్యవస్థ తన ప్రభావం చూపుతున్నందున ప్రజలు తినడానికి రెస్టారెంట్లు, బార్లకు రారని తెలిపింది. ఆరోగ్య భయాలతోనూ బయటి ఆహారాన్ని తినేందుకు పెద్దగా ఆసక్తి చూపరని వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా 40 శాతానికి పైగా రెస్టారెంట్లు మూతపడే అవకాశం ఉందని తెలిపింది. -
జల కల్పన
ఆమె ఓ ఆర్కిటెక్ట్. లక్షల రూపాయలు ఆర్జించే అవకాశం ఉన్న తన కెరీర్కే పరిమితమై పోకుండా భావితరాలకు విలువైన నీటి బొట్టును ఒడిసిపట్టి అందించేందుకు జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. తరిగిపోతున్న జలసంపదను పది కాలాల పాటు నిల్వచేసేందుకు వినూత్న డిజైన్లు రూపొందించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ననలు పొందారు. ప్రధాని సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు అర్హత సాధించిన ఏడుగురిలో ఒకరిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమే కల్పనా రమేశ్. హైదాబాద్లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు కల్పనా రమేష్. సాహె (సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్) సంస్థను స్థాపించి దశాబ్దకాలంగా వర్షపునీటి సంరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు. ప్రధాని దృష్టి నేను రూపొందించిన వర్షపు నీటి సంరక్షణ డిజైన్లు, చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై సోషల్ మీడియా వేదికగా కొన్ని గ్రూపులకు చెందినవారు దేశవ్యాప్తంగా ఆయా గ్రూపుల్లో పోస్ట్ చేయడంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ట్యాగ్చేశారు. దీంతో ప్రధానమంత్రి కార్యాలయ ‘మై గౌ’ సైట్ సీఈఓ మార్చి 6న నాకు ఫోన్చేసి పీఎం సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు మీరు అర్హత సాధించారని చెప్పడంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. ఈ గుర్తింపు నా బాధ్యతను మరింత పెంచింది. నేరుగా ప్రధాని నరేంద్రమోడీకి సంబంధించిన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సైట్లలో నేను సమాచారాన్ని పొందుపరిచే అవకాశం ఉండదు. మైగౌ సైట్ సీఈఓకు సమాచారం చేరవేస్తే వారు నేను అందించే సమాచారాన్ని పరిశీలించి నా తరఫున ఆయా సైట్లలో నేను కోరిన సమాచారాన్ని పోస్ట్చేస్తారు. ఈ విధానంలో నా ఆలోచనలు, డిజైన్లు కోట్లాదిమందికి చేరతాయని సంతోషంగా ఉంది. విస్తృత అవగాహన గత మూడేళ్లుగా వర్షపునీటి సంరక్షణపై 150కి పైగా అవగాహన కార్యక్రమాలు, 50 ప్రత్యేక చర్చాగోష్ఠులు నిర్వహించాం. తాజాగా హైదరాబాద్లోని సిల్వర్ఓక్ విద్యాసంస్థలో 6–8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వాననీటి సంరక్షణపై రెండునెలలు క్లాస్రూమ్లో, మరో రెండు నెలలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాం. వాళ్లు వెళ్లి ఇళ్లు, కాలనీల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవలే మజీద్ బండ (కొండాపూర్) ప్రాంతంలో కొడికుంట చెరువును మా సాహె సంస్థ దత్తతకు తీసుకుంది. ఈ చెరువులోకి వర్షపునీరు చేరే ఇన్ఫ్లో ఛానల్స్ను ప్రక్షాళన చేస్తోంది. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇళ్లు, కార్యాలయాల విస్తీర్ణం, నిర్మాణ డిజైన్లను బట్టి వాననీటి సంరక్షణ పిట్స్ను మేము డిజైన్ చేస్తున్నాం. నా స్వస్థలం బెంగళూరు. ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేశాను. విద్యాభ్యాసం అక్కడే సాగింది. కానీ గత 20 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో ఉంటున్నాం. ఇప్పుడు ఇదే నా ఓన్సిటీ. ఇక్కడే వర్షపునీటి సంరక్షణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాను. నా భర్త రమేష్ లోకనాథన్ది సాఫ్ట్వేర్ రంగం. ఆయన సహాయ సహకారాలు కూడా నాకెంతగానో ఉన్నాయి. వర్షపు నీటి నిల్వపై క్షేత్రస్థాయిలో పిల్లలకు అవగాహన భవిష్యత్ లక్ష్యం ‘చినుకు.. చినుకు ఒడిసిపట్టు.. భావితరాలకు దాచిపెట్టు’ అన్న నినాదంతో వర్షపునీటిని ఒడిసిపట్టే కృషిలో నిర్విరామంగా పనిచేస్తున్నాను. భవిష్యత్లో నా సేవలు, డిజైన్లు ప్రధాని సోషల్మీడియా అకౌంట్ల ద్వారా కోట్లాదిమందికి చేరనున్నాయి. ఈ జలయజ్ఞంలో ప్రతీ భారతీయుడు భాగస్వామి కావాలన్నదే నా లక్ష్యం.. నా స్వప్నం. కాంక్రీట్ మహారణ్యంలా మారిన నగరాల్లో వర్షపునీటిలో 80 శాతం వృథా అవుతోంది. ఇందులో 50 శాతం ఒడిసిపట్టినా నీటి కరువు ఉండదన్నదే నా నిశ్చిభిప్రాయం’’అని ముగించారు కల్పన. – ఏసిరెడ్డి రంగారెడ్డి, సాక్షి, హైదరాబాద్ నీటి బ్యాంకు! ఇళ్లు, అపార్ట్మెంట్లలో తక్కువ ఖర్చుతో వర్షపునీటిని సంరక్షించుకోవచ్చు. ఇంటి పైకప్పుపై కురిసిన వర్షపునీటిని నేరుగా కింద ఉన్న నీటి సంపులో నింపుకోవాలి. ఇలా ఇంటి విస్తీర్ణాన్ని బట్టి 30 వేల నుంచి లక్ష లీటర్ల వరకు నిల్వచేయవచ్చు. ఇది నిండిన తరవాత ఓవర్ఫ్లో అయ్యే నీటిని ఎండిన బోరుబావిలోకి మళ్లిస్తే మీకు ఏడాదికి సరిపడా జలబ్యాంక్ అందుబాటులో ఉంటుంది. ట్యాంకర్ కష్టాలు లేకుండా చూసుకోవచ్చు. ఏడాదికి సుమారు 35–45 రోజుల పాటు వర్షం తప్పక కురుస్తుంది. ఇందుకోసం ఒకసారి రూ.15–రూ.25 వేల వరకు ఖర్చు చేస్తే సరిపోతుంది. ఉదా.. వెయ్యి చదరపు అడుగుల భవనం రూఫ్టాప్పై పడిన వర్షపు నీటిని ఒడిసిపడితే 70 వేల లీటర్ల జలబ్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి వందరోజుల పాటు సరిపోతాయి. ఇక 2000 చదరపు అడుగుల భవనానికి 1.40 లక్షల లీటర్లు, 3000 చదరపు అడుగుల భవనంపై కురిసిన నీటి ద్వారా 2.10 లక్షల లీటర్లు, 4000 చదరపు అడుగుల భవనానికి 2.80 లక్షల లీటర్ల జలబ్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. కల్పన