importance
-
International Day of Education 2025 దీని ప్రాముఖ్యత, ఏడాది థీమ్ ఇదే!
International Day of Education 2025 : ప్రతీ ఏడాది జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. జనవరి 24ని అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 2018 డిసెంబర్ 3, 2018న ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధి, సమానత్వాన్ని తీసుకురావడంలో విద్య ప్రాముఖ్యతను గుర్తించడం, అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం.నైజీరియాతో సహా 58 సభ్య దేశాల మద్దతుతో వచ్చిన ఈ చారిత్రాత్మక తీర్మానం, విద్య ప్రాప్యత , ప్రతి వ్యక్తికి దాని లోతైన ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన అవసరం అని నొక్కి చెబుతుంది.International Day of Education.To grow is to become wise, and the foundation of wisdom is learning.#UGC #Education #InternationalDayofEducation@PMOIndia @EduMinOfIndia @PIB_India pic.twitter.com/Eam5G2Jiq6— UGC INDIA (@ugc_india) January 24, 2025మానవ అభివృద్ధిలో విద్య పాత్రను గుర్తించడంతోపాటు, సమానమైన నాణ్యమైన విద్యను ప్రాథమిక మానవ హక్కుగా ప్రోత్సహించేలా జనవరి 24, 2019న తొలి సారి అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్నారు.అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025, థీమ్ఈ సంవత్సరం, అంతర్జాతీయ విద్యా దినోత్సవం థీమ్ "ఏఐ అండ్ ఎడ్యుకేషన్గా నిర్ణయించారు. ఆటోమేషన్ ప్రపంచంలో మానవ విలువను పరిరక్షించడం". అంటే ఆటోమేషన్ యుగంలో రోజు రోజుకి అభివృద్ది చెందుతున్న సాంకేతిక తీరుతెన్నులు, పురోగతులు అర్థం చేసుకోవడం, అటువంటి వ్యవస్థలు మానవ నిర్ణయాలు, విద్యా కార్యకలాపాలను ఎలా ప్రభావితం చేస్తాయో ప్రశ్నించడం, విద్యలో కృత్రిమ మేధస్సును పెంచడం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం.విద్య ప్రాముఖ్యతపేదరికం,లింగ సమానత్వంతో సహా అనేక సమస్యలను పరిష్కరించడంలో విద్య చాలా అవసరం. వ్యక్తిగత అభివృద్ధి, సామూహిక పురోగతిని పెంపొందిస్తుంది. శాంతిని నిర్మించడానికి విద్య ప్రాథమికమైనదని యూఎన్జీఏ పేర్కొంది. సమానమైన నాణ్యమైన విద్యను అందించడం, అందరికీ జీవితాంతం అవకాశాలను ప్రోత్సహించడంతోపాటు, ఆయా వ్యక్తులు సమాజాలు విద్యకు ప్రాధాన్యతనిచ్చి పెట్టుబడి పెట్టడానికి ఇది పిలుపు.విద్యమనిషిని మనస్సును శక్తివంతం చేస్తుంది. భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ఈ అంతర్జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నేర్చుకోవడంలోని శక్తిని గుర్తిద్దాం. సెలబ్రేట్ చేసుకుందాం. అది అందరికీ చేరేలా చూసుకుందాం. ఇదీ చదవండి : National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..! -
విభేదాలూ, విద్వేషాలను దహించేసి.. భోగాల రాగాలు
మన్మథుడికి వసంతుడి లాగా, భోగి పండగ సంక్రాంతికి సామంతుడు. పెద్ద పండగకు హంగుదారు. ‘సంక్రాంతి లక్ష్మి వేంచేస్తు న్నదహో, బహుపరాక్!’ అని ముందస్తు హెచ్చరికలు చేస్తూ, ఊరంతటినీ ఉత్తేజపరిచి, పండగ కళకు పటిష్ఠమైన పునాది వేస్తుంది.ధనుర్మాసపు ముచ్చటలకు యథోచితంగా భరతవాక్యం పలికి, పౌష్యయోష ఆగమనానికి అంగరంగ వైభవంగా రంగం సిద్ధం చేస్తుంది. మకర సంక్రమణం జరగ బోతున్న మహత్తర ముహూర్తం వేళకు, చప్పటి సాధారణ జీవితపు స్తబ్ధతను వది లించే ప్రయత్నం చేస్తుంది. చలిమంటల నెపంతో, ఆబాల గోపాలంలోనూ సంబరాల వేడి పుట్టిస్తుంది. పల్లె సీమలలో ప్రతి ఇంటి ముంగిటా సమృద్ధికి సంకేతాలుగా, సంతుష్టికి గుర్తులుగా, పూర్ణ కలశాల ‘కుండ ముగ్గులు’ పూయిస్తుంది.వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి! /అరటి స్తంభాలతో అందగింతాము, / బంతి పూదండలన్ భావించుదాము, / తామరాకులతోడ దళ్ళల్లు దాము, / కలవ కాడల తోడ మెలికలేతాము! అంటూ (రాయప్రోలు వారి) పాటలు పాడుతూ వచ్చి, అందరినీ హుషారు చేస్తుంది.మరో రకంగా చూస్తే, సుదీర్ఘమైన సంక్రాంతి ఉత్సవంలో భోగి పండగ భోగానుభవాల రోజు. పులకింతలు కలిగించే చలిమంటలూ, ఉత్సాహం పెంచే ఉష్ణోదక అభ్యంగన స్నానాలతో ఆరంభించి, కొత్త బట్టల కోలాహలాలతో, వంటలు, పిండి వంటల ఆటోపాలతో, ఆత్మారాముడిని ఆనందపరిచే రోజు భోగి. సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభ సమయం. మార్తాండుడి మకర సంక్రమణ వేళ. కనుక దానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎక్కువ. ఆ రోజు ఆస్తికులు దానాలూ, తపాలూ, పితృతర్పణాల లాంటి ఆధ్యాత్మిక వ్యాసంగాలలో ఎక్కువ కాలం గడుపుతారు. కాబట్టి, సరదాలకూ, భోగాలకూ సమయం సరిపోక పోవచ్చు. కాబట్టి భోగినాడే చలిమంటలలో విభేదాలూ, విద్వేషాలూ, ఈర్ష్యా సూయల లాంటి నకారాత్మక భావనలు యథాశక్తి దహించేసుకొని, ఆ రోజంతా బంధుమిత్రుల సాంగత్యంలో ఉల్లాసంగా గడిపి, జీవితంలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ నింపుకొని, ఆపైన జరపవలసిన సంక్రాంతి విధులకు సన్నద్ధం కావాలి.అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు!– ఎం. మారుతి శాస్త్రి -
Sankranti 2025 : అసలు భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా?
దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు అడుగుపెట్టే సమయంలో వచ్చే అందమైన పండుగ సంక్రాంతి. ఊరూ వాడా అంతా సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా మొదలైపోయాయి. తెల్లవారుఝామున భోగి మంటలతో ఆరంభమై మకర సంక్రాంతి, పొంగళ్లు, కనుమ, ముక్కనుమ మూడు రోజుల పాటు ముచ్చటైన వేడుకలతో పల్లెలన్నీ కళకళ లాడతాయి. ఈ వేడుకల్లో ప్రధానమైంది భోగిపళ్లు. పిల్లలకు భోగి పళ్లు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి. అసలు పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు? ఎలా పోయాలి? ఈ విషయాలు తెలుసుకుందాం రండి.సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపళ్లు పోస్తారు..చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే రేగుపళ్లు పోయడం ద్వారా చాలా రోగాల నుంచి రక్షణ లభిస్తుందంటారు పెద్దలు. అంతేకాదు వారిపై ఉన్న చెడు దిష్టి మొత్తం పోతుందని ప్రతీతి. సూర్యుడికి ప్రతీకగా, పోషకాల ఖజానాగా పిలిచే వీటిని తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారనీ, అలాగే ఆరోజన పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోస్తే సంవత్సరం మొత్తం శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.రేగి పండును అర్కఫలం అని కూడా అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లుతాడు. అందుకే ఆ లోక నాయరాణుని కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్ల పోసే వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తారు. భోగి రోజు వచ్చిందంటే... ఇంట్లో చిన్నపిల్లలందరికీ భోగి పళ్లు పోసే వేడుక నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతారు అమ్మమ్మలు, అమ్మలు. ఎలాగా పిల్లలందరికీ భోగి రోజు పొద్దున్నే భోగి మంటల సందడి ఉంటుంది. పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకొని, తలారా స్నానాలు చేసి, కొత్త బట్టలు వేసుకొని భోగిమంటల విభూదిని దిద్దుకుంటారు.నోటి తీపి చేసుకుంటారు. ఇక భోగి పళ్లు పోస్తున్నామంటూ ముత్తుయిదువలను పేరంటానికి ఆహ్వానిస్తారు. సాయంత్రం ఇంట్లో 10 ఏళ్ల లోపు పిల్లలందరికీ కొత్త బట్టలు తొడిగి ముస్తాబు చేస్తారు. రేగి పళ్లు, పూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు, నానబెట్టిన సెనగలు, అక్షింతలు మొదలైనవి కలిపి ఉంచుతారు. అందరు రాగానే, తూర్పు ముఖంగా కానీ, ఉత్తరముఖంగా చిన్నారులను కూర్చోపెడతారు. ఎలా పోయాలి? ఇంట్లోని పెద్దవాళ్లు (అమ్మమ్మ, నానమ్మ) తల్లి కలిపి ఉంచుకున్న భోగిపళ్లను మూడు గుప్పిళ్లతో పిల్లల శిరస్సు చుట్టూ దిష్టి తీసినట్టు తలచుట్టూ తిప్పి పోయాలి. అంటే మూడు సార్లు సవ్య దిశలో, మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి తలమీద పోయాలి. ఆ తరువాత పేరంటాళ్లు కూడా ఇలాగే చేయాలి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని పిల్లల్ని నిండు మనస్సుతో దీవించాలి.ఈ సందర్భంగా "ఓం సారంగాయ నమః" అనే నామం చెప్పాలని పెద్దలు చెబుతారు.ముత్తయిదువలకు పండూ ఫలం కానుకగా ఇస్తారు. ఇలా కార్యక్రమం పూర్తైన తర్వాత వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వదిలిపెడతారు. పిల్లలకు దిష్ట పోవాలని తీసినవి కాబట్టి, ఈ రేగు పళ్లును ఎవరూ తినకూడదని కూడా చెబుతారు.విశిష్టతశ్రీమన్నారాయణుడు రేగుచెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడనీ, ఆ ఫలాన్ని తింటూనే తపస్సు చేశాడని చెబుతారు. రేగుపళ్లను అర్కఫలం అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్య భగవానుడు. సూర్యుడితో సమానంగా రేగుపళ్లను భావించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటూ భోగిపళ్లు పోస్తారు. రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలు కూడా ఉండడంతో చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయట. -
ఎన్ని అడ్డంకులొచ్చినా...సంకల్పమే మీ బలం!
నూతన సంవత్సరంలో చాలా మంది ఎన్నో గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటారు. కానీ ఆ లక్ష్యాలను సాధించేందుకు కావాల్సినంత సంకల్ప బలం వారిలో ఉండదు. అందుకే మధ్యలోనే ఆ లక్ష్యాలను వదిలిపెడతారు. కొన్నిసార్లు మీ మనసే ఎన్నో సాకులను వెతుకుతుంది. మీ లక్ష్యాన్ని ఓడించాలని చూస్తుంది. అందుకే మీ మనసును చెదరని సంకల్ప బలంతో నింపండి. నేను ఎన్ని అడ్డంకులు ఉన్నా విజయాన్ని సాధిస్తాను! నేను లక్ష్యాన్ని చేరతాను అని పదే పదే మనసులో అనుకోండి! అనుకుందే ఆచరణలో పెట్టండి. మీరు చేయాల్సిన కృషితో పాటు దృఢమైన సంకల్ప శక్తి కూడా ఉండాలి. ఎత్తైన పర్వతాల నడుమ ఒక సుందరమైన లోయ వద్ద ఒక చిన్న ప్రవాహం ఉండేది. అది మహా సముద్రాన్ని చేరాలని కలలు కంటూ ఉండేది. తన ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రతిసారీ దారిలో రాళ్లు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండచరియలు ఎదురవడంతో ఆ చిన్న ప్రవాహం వెనుదిరిగి వెనకకు వెళ్లి΄ోయేది.‘‘నీకు ఇది సాధ్యం కాదు,’’ అని దారిలోని పెద్ద రాళ్లు చెప్పేవి. ‘‘నువ్వు చాలా చిన్నగా, బలహీనంగా ఉన్నావు నువ్వు చేయలేవు’’ అని ఆ చిట్టి ప్రవాహాన్ని నిరుత్సాహ పరిచేవి. ఒకనాడు చిట్టి ప్రవాహం చాలా దిగులుగా, ఇక ఎప్పటికీ తన కలను నెరవేర్చుకోలేనన్న బాధతో, సందేహంతో ఉండటాన్ని వృక్షమాత గమనించింది. వృక్ష మాత ప్రవాహంతో ఇలా చెప్పింది, ‘‘ఇలా బాధ పడినంత మాత్రాన నీ లక్ష్యాన్ని నీవు చేరగలవా..?? నువ్వు బాధ పడటం వల్ల ఏ ఉపయోగం లేదు! మహా సముద్రాన్ని చేరాలనే నీ తపననే నీ శక్తిగా మలుచుకో..నీ సంకల్పాన్ని బలపరుచుకో.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుదిరగననే వజ్ర సంకల్పం చేసుకో!’’ అని చిట్టి ప్రవాహానికి కొండంత ధైర్యమిచ్చి, విజయోస్తు! అని దీవించి పంపింది వృక్ష మాత. ఆ ధైర్యంతో, ప్రవాహం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది ముందుకు వెళ్లాలని సంకల్పించుకుంది. పెద్ద రాళ్ళు ఎదురైనప్పుడు వాటి మధ్యనున్న చిన్న సందులనే మార్గంగా చేసుకుంది. ఎండ తీవ్రతకు ఆవిరైపోయే పరిస్థితి వచ్చినప్పుడు, మేఘాలకెగసి అక్కడి నుండి నదిగా భువికి తిరిగి వచ్చింది. ఒకప్పటి చిట్టి ప్రవాహమే ఇప్పుడు మహా ప్రవాహమై చివరికి మహాసముద్రంలో లీనమైంది. ‘‘నీ లక్ష్యాన్ని నీవు సంకల్ప శక్తితో సాధించావు’’ అని వృక్ష మాత హర్షించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా చెదరని సంకల్ప బలంతో ముందుకు సాగండి. లక్ష్యాన్ని సాధించడంలో ఇటువంటి మనఃస్థితి ఉంటే ఏ పనిలోనైనా నిస్సందేహంగా విజయాన్ని సాధించవచ్చు. ఈ యావత్ విశ్వంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు! – మాతా ఆత్మానందమయిఆధ్యాత్మిక గురువు -
మనిషి మనిషికో ఇంటిమసీ అవసరం
అంజలి, కార్తీక్లకు పెళ్లయి మూడేళ్లవుతోంది. అంజలికి ప్రయాణాలంటే ఇష్టం. అడ్వంచర్ ట్రిప్స్ అంటే ప్రాణం. ఎప్పటికప్పడు కొత్త హాబీలను ప్రయత్నిస్తుంటుంది. కార్తీకేమో ఒక పరిశోధకుడు. మెదడుకు పదునుపెట్టే పుస్తకాలు చదవడం, సమకాలీన అంశాలపై లోతుగా చర్చించడం చాలా ఇష్టం. కార్తీక్ తనతో సంతోషంగా లేడని అంజలికి అనిపించేది. అంజలి తన ఆలోచనలను అర్థం చేసుకోవడంలో ఆసక్తి చూపడం లేదని కార్తీక్కు అనిపించేది. కానీ ఆ విషయం ఒకరికొకరు చెప్పుకోలేక మథనపడుతున్నారు. రవి సాఫ్ట్వేర్ ఇంజినీర్, మీరా స్కూల్ టీచర్. రవి తన ప్రేమను ముద్దులు, హగ్గులు, బెడ్ టైమ్లో వ్యక్తీకరించేవాడు. మీరా రోజువారీ విషయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఉండేది. కానీ రవి తన మాటలు వినడంలేదని అనిపించేది. రవేమో మీరా తనను పట్టించుకోవడంలేదని భావించేవాడు. దీంతో ఇద్దరి మధ్య ఆత్మీయతానురాగాలు దూరమవుతున్నాయి. తరచూ గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమస్య మీకూ ఎదురై ఉండవచ్చు. మీరూ మీ భాగస్వామి బాగానే ఉంటున్నా, ఏదో దూరం పెరుగుతోందని అనిపించవచ్చు. అందుకు కారణమేంటో తెలియక ఆందోళన పడుతూ ఉండవచ్చు. అందుకు ప్రధాన కారణం సాన్నిహిత్యం (intimacy) గురించి అవగాహన లేకపోవడమేనని చెప్పవచ్చు. శారీరక సాన్నిహిత్యం ఉంటే అన్నీ సర్దుకుంటాయని చాలామంది అనుకుంటారు. కానీ అంతకుమించి అవసరమైన సాన్నిహిత్యాలు కూడా ఉన్నాయి. వాటిని గుర్తించకపోవడం లేదా పరిష్కరించకపోవడం సమస్యలకు దారితీస్తుంది. దంపతులు పరస్పరం వారి అవసరాలను అర్థం చేసుకుని, సాన్నిహిత్య రకాల మధ్య సమతౌల్యాన్ని కలిగి ఉంటే, సంబంధం మరింత గాఢంగా ఉంటుంది. సమస్యలు తీవ్రమైనప్పుడు ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడం అవసరం. 1. భావోద్వేగ సాన్నిహిత్యంబంధానికి, అనుబంధానికి మూలస్తంభం emotional intimacy ఇద్దరి మధ్య భావాలు, అనుభవాలను నిరభ్యంతరంగా పంచుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు భావోద్వేగ సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అయితే, ఒక వ్యక్తి ఎమోషనల్గా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు మరో వ్యక్తి దూరంగా ఉంటే అది అసంతృప్తికి, ఒంటరితనానికి దారితీస్తుంది. మీరా సమస్య అదే. రవి తనతో ఎమోషనల్గా కనెక్ట్ కావడంలేదని బాధపడుతోంది. 2. శారీరక సాన్నిహిత్యంPhysical intimacy అంటే కౌగిలింతలు, ముద్దులు, లైంగిక సంబంధాల వంటివి. దీనికి ఎంత ప్రాధాన్యం ఇస్తారనేది వారి వారి స్థాయిల్లో ఉంటుంది. ఒకరికి శారీరక సాన్నిహిత్యం అవసరం ఎక్కువగా ఉంటే, మరొకరికి దాని ప్రాముఖ్యత తక్కువగా ఉండవచ్చు. అప్పుడు ఇద్దరి మధ్యా దూరం ఏర్పడుతుంది. ఉదాహరణకు రవికి ఫిజికల్ ఇంటిమసీ ముఖ్యమైతే, మీరాకు ఎమోషనల్ ఇంటిమసీ అవసరం. వారిద్దరి మధ్య దూరానికి అదే కారణం. 3. మేధో సాన్నిహిత్యంఆలోచనలు, అభిప్రాయాలు, లోతైన చర్చల ద్వారా ఏర్పడేదే intellectual intimacy ఇద్దరు వ్యక్తులు తమ అభిప్రాయాలను పంచుకుంటూ మానసికంగా కలిసి ఉంటే, వారి సంబంధం మరింత బలపడుతుంది. కానీ, ఒకరు మేధోపరమైన చర్చల పట్ల ఆసక్తి చూపితే, మరొకరు ప్రాక్టికల్ విషయాలకే ప్రాధాన్యం ఇస్తే, అది అసంతృప్తికి దారితీస్తుంది. అంజలి, కార్తీక్ల మధ్య సమస్య ఇదే. 4. అనుభవైక సాన్నిహిత్యంఒకే విధమైన అనుభవాలను పంచుకోవడం ద్వారాexperiential intimacy ఏర్పడుతుంది. ఉదాహరణకు, కలిసి ప్రయాణం చేయడం, వంట చేయడం లేదా ఇతర హాబీలను పంచుకోవడం. ఇది బంధంలో టీమ్వర్క్ను పెంపొందిస్తుంది. కానీ, ఒక వ్యక్తి బహుళ అనుభవాలకు ప్రాధాన్యమిచ్చి.. మరొకరు వ్యక్తిగత సమయాన్ని కోరుకుంటే సమస్యలు వస్తాయి.5. ఆధ్యాత్మిక సాన్నిహిత్యంకొందరికి మతపరమైన లేదాspiritual intimacy చాలా ముఖ్యమైనది. కలిసి ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం లేదా జీవితంపై చర్చలు చేయడం ఈ బంధాన్ని బలపరుస్తాయి. అయితే, ఆధ్యాత్మిక లక్ష్యాల్లో భిన్నత్వముంటే సమస్యలు తలెత్తుతాయి. ఉదాహరణకు.. పరమ భక్తురాలికి నాస్తికుడు భర్తగా ఉంటే ఎలా ఉంటుందో మీరే ఊహించండి. 6. ఆర్థిక సాన్నిహిత్యండబ్బు సంబంధిత విషయాల్లో పారదర్శకత, పరస్పర నమ్మకం కలిగి ఉండటమే financial intimacy. ఒకరు ఆదా చేయడంలో ఆసక్తి చూపుతుండగా, మరొకరు ఖర్చుల పట్ల ఆసక్తి చూపితే అది విభేదాలకు దారితీస్తుంది. -
Karthika Pournima: కార్తీక పౌర్ణమి విశిష్టత..! త్రిపుర పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు?
కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు , శ్రీమహా విష్ణువులని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ శివాలయాలు, విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇదే కార్తీక మాసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. వారాణాసి లాంటి ఉత్తర భారతదేశంలోఇదే రోజుని దేవ దీపావళి, దేవ దివాళి అని పిలుస్తుంటారు. అలాగే అలాగే దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల దీన్ని త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు. అంత పరమ పవిత్రమైన ఈ కార్తీక పూర్ణిమ వెనుకున్న నేపథ్యం, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా..!ఏం చేస్తారంటే..కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి ఆ పరమ శివుడిని పూజించి రోజంతా ఉపవాసం ఉండటం భక్తులకి ఆనవాయితీ. కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే , శరీరానికి ఎన్నో శక్తులు చేకూరుతాయని... అందులోనూ పవిత్రమైన నదుల్లో ఈ నదీ స్నానం మరింత పవిత్రతని , పుణ్యంని చేకూరుస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందువల్లే కార్తీక పౌర్ణమి రోజున ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వారణాసి భక్తుల రాకతో కిటకిటలాడుతుంటుంది.ఇంట్లో తులసి మొక్కకు కానీ లేదా దేవాలయాల్లో కానీ ఇవాళ దీపారాధన చేస్తే మరింత పుణ్యం , పూజా ఫలం దక్కుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. కొంతమంది కార్తిక పౌర్ణమి రోజున 365 దీపాలు వెలిగిస్తుంటారు. దీనికి అర్థం.. సంవత్సరంలో ఒక్కో రోజుకి ఒక్కో దీపం చొప్పున అన్ని దీపాలు ఈ పరమ పవిత్రమైన రోజే వెలిగించి మీ అనుగ్రహం కోరుకుంటున్నాను దేవా అని.సత్యనారాయణ వ్రతం :సత్యనారాయణ వ్రతం జరుపుకోవడానికి కార్తీక పౌర్ణమి కన్నా అతి పవిత్రమైన రోజు మరొకటి లేదు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకు కారణం ఆ శ్రీ మహా విష్ణువుకి ఈ కార్తీక పౌర్ణమి అతి ప్రీతి పాత్రమైనది కావడమే. అందుకే మిగతా రోజుల్లో సత్యనారాయణ వ్రతం చేయడం కన్నా కార్తీక పౌర్ణమి రోజున చేసే వ్రతానికే పూజా ఫలం అధికం అని అంటుంటారు పెద్దలు.ఏకాదశి రుద్రాభిషేకం :ఈరోజు శివనామస్మరణతో మోగిపోయే ఆలయాలన్నింటిలో సర్వ సాధారణంగా కనిపించేది ఏకాదశి రుద్రాభిషేకం. పదకొండుసార్లు రుద్ర చమకం లేదా శివ నామస్మరణతో శివుడిని అభిషేకించడమే ఈ ఏకాదశి రుద్ర అభిషేకం ప్రత్యేకత. జ్వాలాతోరణం...ఈ రోజు సంధ్యాసమయంలో శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. పార్వతీపరమేశ్వరులను పల్లకిలో ఉంచి ఈ తోరణం నుంచి మూడుసార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకిని అనుసరించి శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక జన్మల నుంచి చేసిన పాపాలన్నీ పటాపంచలై సుఖ సంతోషాలతో వర్థిల్లుతారని శాస్త్రవచనం.ఈ పూర్ణిమకు మరొక పేరు..కార్తీక పూర్ణిమ నాడు శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన రోజు. అందువలన ఈరోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీకపురాణం ప్రకారం ఈరోజు దీపదానం, సాలగ్రామ దానం చేయాలి. దానధర్మాలు చేయాలి. ఇవి కోటిరెట్లు ఫలితాన్నిస్తాయని భక్తుల నమ్మకం. ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు. ప్రాముఖ్యత గలిగిన ఈ జ్యోతి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. పౌర్ణమినాడు శ్రీ కృష్ణుని రాసలీలకు పెట్టినది పేరు. అందువలన ఈ రోజు శ్రీ కృష్ణ స్మరణ కూడా అత్యంత ఫలవంతమైనది. మరోవేపు సిక్కులు , జైనులు కూడా..సిక్కులు , జైన మతస్తులు కూడా ఈ కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటుంటారు. సిక్కులు దైవంగా భావించే శ్రీ గురు నానక్ పుట్టింది కార్తీక పౌర్ణమి రోజే కావడంతో సిక్కులు ఈ రోజుని పవిత్రమైనదిగా భావిస్తారు. జైన్లు కూడా ఈ కార్తీక పౌర్ణమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం విశేషం.(చదవండి: 365 వత్తులు..కార్తీక పురాణం ఏం చెబుతోంది?) -
365 వత్తులు.. కార్తీక పురాణం ఏం చెబుతోంది?
కార్తీక మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున స్నానం, దీపం,దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పవిత్ర కార్తీకమాసంలో పౌర్ణమికిచాలా ప్రాధాన్యత ఉంది. చాలా పవిత్రమైంది భక్తులు పరిగణిస్తారు. ఈ ఏడాది కార్తికపౌర్ణమి ఎపుడు, పూజలు గురించి తెలుసుకుందాం.కార్తీక పౌర్ణమి రోజున ఆలయాలన్నీ దీప కాంతులతో వెలుగొందుతాయి. శివనామ స్మరణలతో శివాలయాలన్నీ మార్మోగుతాయి. కార్తీక పూర్ణిమ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు నమ్ముతారు. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. త్రిపురాసురుని పీడ తొలగిపోయినందుకు దేవతలు స్వర్గమంతా దీపాలతో వెలిగించారట.. అందుకే భక్తులు కూడా ఈ విజయాన్ని ఎంతో భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు. దేవాలయాలు , నదీ తీరాల దగ్గర దీపాలను వెలిగిస్తారు. ముఖ్యంగా అరటి దొప్పల్లో నేతి దీపాలను వెలగించి నీటిలో వదిలే దృశ్యాలు శోభాయమానంగా ఉంటాయి.ఈ రోజున విష్ణువు తన మత్స్య (చేప) అవతారంలో కనిపించడాన్ని సూచిస్తుందని, ఇది సృష్టి సంరక్షణకు సంబంధించిన విశ్వ చక్రంతో ముడిపడి ఉందని నమ్ముతారు. ఈ పూర్ణిమ నాడు చేసే పుణ్య కార్యాలు ఆధ్యాత్మిక వృద్ధితోపాటు, సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.“అల్పమపి క్షితౌ క్షిప్తం వటబీజం ప్రవర్ధతే.జలయోగాత్ యథా దానాత్ పుణ్యవృక్షో ⁇ పి వర్ధతే॥”“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”కార్తీక పూర్ణిమ నాడు పవిత్ర స్నానం , దానంగంగా , యమునా, కృష్ణ లాంటి వంటి పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం, లభిస్తుందని సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఆవునేతిలో ఉంచిన 365 వత్తులను ఆ దేవుడి ముందు వెలిగించి పాపాలను తొలగించి, ముక్తిని ప్రసాదించమని కోరుకుంటారు. సంవత్సరమంతా పూజలు చేయకపోయినా, కార్తీకమాసం అంతా దీపారాధన చేయలేనివారు కనీసం కార్తీక పౌర్ణమిరోజు భక్తితో ఇలా దీపం ముట్టించి, ఆ దేవదేవుడికి నమస్కరిస్తే చాలని కార్తీక పురాణం చెబుతోంది.రోజంతా ఉపవాసం ఉండి శివాలయం లేదా వైష్ణవ ఆలయంలో ఆవునేతి లో నానబెట్టి ఉంచుకున్న 365 వత్తులను వెలిగిస్తారు. భక్తితో పూజాదికాలు సమర్పించి అపుడు ఉపవాసాన్ని విరమిస్తారు. దేవాలయాలక, నదీ తీరాలకు వెళ్లలేని వారు ఇంట్లో చక్కగా శుభ్రం చేసి పిండితో ముగ్గులు పెట్టుకొని అలంకరించుకున్న తులసమ్మ దగ్గర పున్నమి కాంతుల్లో ఈ దీపాలు వెలిగించి నమస్కరించినా, శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతారు. అలాగే కార్తీక పూర్ణిమ నాడు చేసే విరాళం ఈ రోజున అత్యంత ముఖ్యమైనది. బ్రాహ్మణులు ,నిరుపేదలకు ఆహారం, దుస్తులు, ఇతర వస్తువులను దానం చేస్తారు. గరుడ పురాణంతో సహా వివిధ హిందూ గ్రంథాలలో దాతృత్వం గురించిన ప్రాముఖ్యత చెప్పబడింది. మరికొంతమంది ఈ రోజు కేదారీశ్వరుడిని నోము నోచుకొని అన్నదానం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపాలను దానం చేయడం మరో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ, తులసి పూజ కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. జ్వాలా తోరణంతో కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. తద్వారా ఆధ్యాత్మిక ఫలితాలతోపాటు ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. -
శరీర ధర్మం
మానవ ధర్మంగా తగినంత ప్రయత్నం చేయకుండా, ఫలాన్ని గురించి ఆలోచించడం వివేకంతో కూడుకున్న పని కాదు. మానకుండా మానవ ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే, ఆ ప్రయత్నానికి సరైన సమయంలో దైవం అందించే సహకారం తోడవుతుంది. ‘దేవుడిస్తాడులే!’ అనుకుంటూ ఏరోజు కారోజు, ఏవిధమైన ప్రయత్నమూ చేయ కుండా, ఇంట్లో కూర్చుంటే ఎవరికైనా సంపద ఎలా చేకూరుతుంది? పళ్ళెంలో వడ్డించివున్న పంచభక్ష్య పరమాణ్ణాలు, ఎవరికైనా గాని తింటేనే కదా కడుపులోకి వెళ్ళేది! తినే ప్రయత్నం కూడా చేయకపోతే కడుపెలా నిండుతుంది? ఆక లెలా తీరుతుంది? అందువల్ల సారాంశంగా తేలేది ఏమిటంటే మనిషి కోరకుండా దేవుడు ఇవ్వడం కూడా సంభవం కాదు. ఆకలితో ఉన్న బిడ్డడు, ఆ విషయాన్ని తల్లికి చెప్పి అడగనిదే అమ్మయినా పెట్టలేదు. ఇంట్లో అన్ని రకాల దినుసులు పుష్కలంగా ముందు నుండీ ఉంటాయి. కాని, వండి వార్చకుండా భోజనానికి వీలయ్యే పదార్థాలుగా అవి మార్పు చెందవు కదా! ఈ విషయాన్నే గట్టుప్రభువు తన ‘కుచేలోపా ఖ్యానం’ కావ్యం, ప్రథమాశ్వాసంలోని ఈ కింది పద్యం ద్వారా చెప్పాడు. కం. కావున మనుజుడు సేయక దేవుండీయంగ లేడు తెగి యేమియు నా నావిధ ధాన్యము లుండిన వావిరి వండకయె రిత్త వంటక మగునే. శ్రమించడం శరీర ధర్మం అని చెప్పడం పై పద్యంలోని మాటల ముఖ్యోద్దేశం. ఆ శరీర ధర్మాన్ని పాటించే వ్యక్తికే దైవ సహాయమైనా ,అంతకంటే ముందు ఆ కష్టాన్ని ప్రత్యక్షంగాతన కళ్ళతో చూసి స్పందించే తోటి మనిషి సహాయమైనా అందుతుంది తప్ప ఆ ఉత్తమ ధర్మాన్ని పాటించని వ్యక్తులకు కాదని తెలుసు కోవాలి.– భట్టు వెంకటరావు -
తీర్థాన్ని ఎలా తీసుకోవాలి? ఇతర నియమాలు
గుడికి వెళ్తే ప్రసాదం తీసుకున్నా లేకున్నా తీర్థం తప్పకుండా తీసుకుంటాం. పూజారిగారు మరేదో వ్యాపకంలో ఉన్నా అడిగి మరీ తీసుకుంటాం. తీర్థం అంత అమూల్యమైంది, శ్రేష్ఠమైంది.తీర్థం తీసుకునేటప్పుడు కుడిచేతిని గోకర్ణంలా (ఆవు చెవి ఆకృతి) పెట్టాలి. అంటే చేతిని డిప్పలా ముడిచి, చూపుడు వేలును బొటనవేలుకు ఆనించాలి. అంతే తప్ప ఒక చేయి, లేదా రెండు చేతులను దోసిళ్ళలా పట్టకూడదు.ఉద్ధరణితో మూడుసార్లు తీర్థం పోసిన తర్వాత కళ్ళకు అద్దుకుని తాగాలి. తీర్థం తాగేటప్పుడు నిలబడకూడదు. కూర్చుని మాత్రమే సేవించాలి. తీర్థం తీసుకునేటప్పుడు జుర్రిన శబ్దం రాకూడదు.మనసులో దేవుని స్మరించుకుంటూ నిశ్శబ్దంగా సేవించాలి.కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలుఅన్నం తింటున్నప్పుడు అన్నాన్ని, ఆ అన్నం పెట్టువారిని తిట్టటం, దుర్భాషలాడటం చేయరాదు. ఏడుస్తూ తినడం, గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదుఒడిలో కంచం, పళ్ళెం పెట్టుకుని అన్నం తినరాదు. భోజనసమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనటం, గేలిచేయటం నష్టదాయకం. భోజనానంతరం ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవారికి వచ్చే పుణ్యం, అన్నదాతకు కూడా రాదు. -
టంగ్ కంగు తినడానికి కాదు!
ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. అలాగే టంగ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ హెల్త్ అనుకోవచ్చు. అంటే... నాలుక అన్నది ఆరోగ్యానికి మంచి సూచిక అని అర్థం. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లగానే నాలుక చూపించమని అడుగుతుంటారు. దాన్నిచూసిన వెంటనే డాక్టర్లకు బాధితుల ఆరోగ్య విషయాలు ఎన్నో తెలుస్తుంటాయి. తల్లో నాలుకల వ్యవహరిస్తూ అనేక నములు తున్నప్పుడు రుచి తెలియజేయడం, పంటి కిందికి ఆహారాన్ని తోయడం వంటి అనేక పనులు చేసే నాలుక గురించి మాత్రం మనందరిలోనూ పెద్దగా తెలుసుకున్న దాఖలాలు ఉండవు. నాలుక చేసే కీలకమైన పనులు, దానికి వచ్చే కొన్ని సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం.సాధారణంగా నాలుక పింక్ రంగులో ఉంటే అది ఆరోగ్యానికి ఓ మంచి సూచన. ఒకవేళ అలా లేదంటే అది ఏదైనా అనారోగ్యానికి సూచన కావచ్చు. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లినప్పుడు వారు నాలుక చూపించమంటారు. అలా వ్యక్తుల ఆరోగ్యాన్ని గురించి తెలుసుకుంటారు.నాలుక కింది భాగం ఓ కండరంతో నోటిలోని కింది భాగానికి అతుక్కుపోయి... బయటకు అది చాలా చిన్నగా కనిపించినప్పటికీ, దాదాపు పది సెంటీమీటర్ల పొడవుంటుంది. దాదాపు 60 గ్రాముల బరువుంటుంది.జీర్ణ ప్రక్రియలో తొలి అంకం నాలుక దగ్గర్నుంచే... ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో నాలుక భూమిక ఎంతో కీలకం. ఆహారాన్ని పళ్ల కిందికి తోసేందుకు మనమంతా మనకు తెలియకుండానే నాలుకను వాడుతుంటాం. అలా మనం తీసుకున్న ఆహారం చిన్న చిన్న ముక్కలుగా (పార్టికిల్స్గా) మారేందుకు ఉపయోగ పడుతుంది. అంటే ఆహారం జీర్ణం కావడంలో తొలి అంకం ఇక్కణ్ణుంచే మొదలవుతుంది. ఆ తర్వాత మింగడం అనే ప్రక్రియ కూడా కేవలం నాలుక వల్లనే సాధ్యమవుతుంది. నాలుక వెనుక భాగం నమిలిన ఆహారాన్ని గొంతు ద్వారా కడుపులోకి నెడుతుంది. నాలుక దిగువన ఉండే చిన్న తీగ వంటి భాగంతోనే అది నోటి అడుగుభాగానికి అతుక్కు΄ోయి ఉంటుంది. ఈ తీగ పొడవు ఉండాల్సిన దాని కంటే బాగా తక్కువగా ఉంటే, మాట్లాడటంలో సమస్యలు వస్తాయి. నత్తి వంటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకప్పుడు ఈ తరహా ఇబ్బందులకు పరిష్కారం అంతగా ఉండేది కాదు గానీ... ఇప్పుడు ఇలాంటి సమస్యను శస్త్రచికిత్సతో సరిచేసి, సరిగా మాట్లాడేలా చేసే అవకాశముంది.రుచితోనూ ఆరోగ్యం గురించి... అనారోగ్యం కలిగిన కొన్నిసార్లు రుచి తెలియదు. ఉదాహరణకు తీవ్రమైన జ్వరం వచ్చిన సందర్భాల్లోనూ, అలాగే జలుబు చేసినప్పుడు ముక్కుకు వాసనలూ, నాలుకకు రుచులూ తెలియని పరిస్థితి వస్తుంది. తాజాగా కరోనా వైరస్ సోకినప్పుడు కూడా ఇదే ప్రక్రియ వల్ల బాధితులకు రుచి తెలియకుండా΄ోయి, తమకు కరోనా వచ్చిన సంగతి తెలిసింది.నాలుకకు వచ్చే కొన్ని అనారోగ్యాలు... అన్ని అవయవాల లాగే నాలుకకూ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. నాలుకకు వచ్చే ఇన్ఫెక్షన్ను గ్లాసైటిస్ అంటారు. కొన్ని యాంటీబయాటిక్స్ ఉపయోగించడం ద్వారా ఇన్ఫెక్షన్ను తేలిగ్గా తగ్గించవచ్చు. ఐరన్లోపంతో వచ్చే రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో నాలుక ఆరోగ్యకరమైన పింక్ రంగుకు బదులుగా ఎర్రగా ఉండి, ముట్టుకుంటే బాధకలిగించే టెండర్గా మారుతుంది పచ్చకామెర్లు (జాండీస్) సోకినవారిలో పసుపురంగులోకి మారి కనిపిస్తుంటుంది.కొన్ని ఫంగస్లు సోకినప్పుడు నాలుకపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. యాంటీఫంగల్ మందులు వాడటం ద్వారా దీన్ని తేలిగ్గా అధిగమించవచ్చు జింక్ లోపం వల్ల తలెత్తే ‘డిస్గ్యూసియా’ అనే సమస్య వచ్చిన వారిలో చక్కెర చేదుగానూ, చాక్లెట్ ఉప్పగానూ అనిపించవచ్చు. సాధారణంగా ఫ్లూ వంటి వ్యాధులు సోకిన తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. జింక్ పుష్కలంగా ఉండే పోషకాహారం తీసుకుంటే, కొద్ది రోజుల్లోనే నాలుక మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది అరుదుగా వచ్చే ‘హై΄ోగ్యూసియా’ అనే సమస్యలో నాలుక రుచులను గుర్తించే సామర్థ్యాన్ని దాదాపుగా కోల్పోతుంది. వారు ఏది తిన్నా రుచీపచీ ఉండదు విటమిన్ (చాలావరకు విటమిన్ బి కాంప్లెక్స్) లోపాల వల్ల నాలుక పగుళ్లుబారినట్లు అనిపించడం, నాలుక మీద పొక్కులు రావడం మామూలే. సాధారణంగా ‘బి–కాంప్లెక్స్’ మందులతో ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు పొగతాగేవారిలో నాలుక మీద ఉండే రుచిమొగ్గలు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుకే పొగతాగేవారికి రుచులు అంత స్పష్టంగా తెలియవు. అంతేకాదు... పొగతాగడం వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లతో పాటు నాలుక క్యాన్సర్ కూడా రావచ్చు. ఇది ప్రమాదకరమైన పరిణామం అందుకే పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. -
పుష్పాలతోనే ఎందుకు పూజించాలి?
నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత.ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పామూలే వసేద బ్రహ్మ్ర మధ్యేచ కేశవః పుష్పాగ్రేచ మహాదేవః సర్వదేవాః స్థితాదళే పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివసిస్తుంటారని, పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి. పరంజ్యోతిః పుష్పగతం పుష్పేణైవ ప్రసీదతి త్రివర్గ సాధనం పుష్పం పుష్టిశ్రీ స్వర్గమోక్షదమ్ పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడట. కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం. అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది. -
Valmiki Jayanti 2024 ఆది స్మరణీయుడు
జగదానంద కారకుడు, శరణాగత వత్సలుడు, సకల గుణాభిరాముడు, మూర్తీభవించిన ధర్మతేజం శ్రీరాముని దివ్యచరిత్రను, శ్రీరామ నామ మాధుర్యాన్ని మన కందించిన కవికోకిల, ఆది కవి వాల్మీకి మహర్షి చిరస్మరణీయుడు. శ్రీరాముని దివ్యచరితాన్ని కావ్య రూపంలో అందించమని ఆదేశించిన బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు శ్రీరాముని కీర్తి పరిమళాలను ముల్లోకాల్లో గుబాళింప చేసిన వాల్మీకి మహర్షి శ్రీరామాయణ మహాకావ్యాన్ని అందించారు. రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి వాల్మీకి చక్కగా విశదపరచాడు. శిష్య ధర్మం, భ్రాతృధర్మం, రాజ ధర్మం, పుత్ర ధర్మం, భత్యు ధర్మం, ఇంకా పతివ్రతా ధర్మాలు, ప్రేమలూ, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్య పరిపాలన, ఉపాసనా రహస్యాలు, సంభాషణా చతురత, జీవితం విలువ, ధర్మాచరణ మున్నగు అనేక రకాల ఉపదేశాలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏదీ లేదు. ఆధునిక సమాజంలో మనం ఉపయోగించే ప్రసార కౌశలాలు, కార్యనిర్వహణ కౌశలాలు, ప్రశాసనం, నగర, గ్రామీణ నిర్మాణ యోజన, సార్థకమైన వ్యూహరచనా నిర్మాణం, ఆంతరిక రక్షణా పద్ధతి, యుద్ధ వ్యూహరచన మొదలైనవాటికి రామాయణ రచన నిధి వంటిది.ఇంత విలువైన సత్యాలను చెప్పి, ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షి సదావందనీయుడు. ప్రతి ఒక్కరూ రామాయణ కావ్యం చదివి అందులోని నీతిని అవలోకనం చేసుకుని, అందులో కొంతయినా ఆచరించ గలిగితే ఆ మహాకవి ఋణం తీర్చుకున్నట్లే. -
దసరా పండుగ విశిష్టత ఇదీ!
ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దసరా.దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది. ఈ పది రోజుల పండుగని ‘నవరాత్ర వ్రతం‘ అనీ, ‘దేవీ నవరాత్రులు‘, ‘శరన్నవరాత్రులు‘ అని వ్యవహరిస్తాం. తొమ్మిది రోజులు నియమ నిష్ఠలతో జగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే శరన్నవరాత్ర వ్రతం.తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించటమంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం. నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం. తొమ్మిది రోజుల దీక్ష వలన పదవరోజు విజయం లభిస్తుంది. అంటే తొమ్మిది రోజుల దీక్షకు ఫలం లభిస్తుంది. కనుక పదవ రోజును ‘విజయదశమి‘ పేరిట పండుగ జరుపుకుంటాము.జగన్మాత ఆదిపరాశక్తి గొప్పదనాన్ని, మహిమను గురించి, దేవీ భాగవతం, మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాలు, ఉపనిషత్తులు వివరిస్తాయి, త్రిపురా రహస్యంలో విపులమైన వివరణ కనిపిస్తుంది. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలందుకుంటోంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గ, పార్వతి, హైమవతి, అపరాజిత, భవాని, లలిత, జయంతి, మంగళ, భద్రకాళి, కాపాలిని, క్షమా, శివదూతి, స్వాహా, స్వధా, చాముండి, విష్ణుపత్ని, ఈశ్వరి ఇటువంటి అనేకమైన నామాలతో ఆరాధనలందుకుంటోంది.మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే, దైవ అనుగ్రహంతో, మంత్ర శక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. అందుకే దసరా నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజులు ఈ జగన్మాతను బాలా త్రిపురసుందరిగా, గాయత్రీ మాతగా, అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మి దేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా, సప్తమి రోజున శ్రీ మహా సరస్వతీ దేవిగా, అష్టమి నాడు దుర్గామాతగా, నవమి నాడు మహిషాసుర మర్దినిగా, దశమినాడు జయా విజయా సహిత అపరాజితా దేవిగా – రాజరాజేశ్వరీ దేవిగా ఆరాధిస్తాం. తొమ్మిది రోజులు కఠినమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన నియమాలను పాటిస్తూ, నామ మంత్ర జపం, నామ పారాయణ చేస్తూ, కీర్తనలతో, భజనలతో కొలుస్తూ, ఉపవాస నియమాలను, నక్త వ్రతముల వంటి వాటిని పాటిస్తూ దశమినాడు చక్కగా జగన్మాతను షోడశోపచారాలతో పూజించి, అనేక విధాలైన పిండివంటలు తయారు చేసి, నైవేద్యం పెట్టి అమ్మను ఆరాధిస్తాం. ఆ పిండి వంటలను ప్రసాదంగా బంధుమిత్రులందరికీ పెట్టి, ఆరగిస్తాం. ఆదిపరాశక్తిని లక్ష్మీ, గాయత్రీ, సరస్వతీ, రాధ, దుర్గా అనే ఐదు పరిపూర్ణ మూర్తులుగా ఆరాధిస్తారు.యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా !నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః!!పరమేశ్వరుని సంకల్ప శక్తి జగన్మాత. ఆ సంకల్పం వల్లే సృష్టి స్థితి లయలన్నీ జరుగుతున్నాయి. ఆదిపరాశక్తి ప్రకృతి అయితే, పరమాత్మ పురుషుడు. ప్రకృతి పురుషుల కలయిక వల్లే సృష్టి యేర్పడుతుంది. అంటే శివపార్వతుల చిద్విలాసం యావద్విశ్వం. ఈశ్వరుడని కొలిచినా, విష్ణువు అని కొలిచినా, జగన్మాత అంబిక అని కొలిచినా ఉన్న శక్తి ఒక్కటే అని మనకి ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఒక్కటిగా ఉన్న ఆ శక్తిని, చిచ్ఛక్తినే మనం అమ్మవారిగా, జగన్మాతగా ఆరాధిస్తున్నాము. చండీ సప్తశతిలో జగన్మాత మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహా సరస్వతిగా దుష్ట రాక్షసులను దునుమాడిన వైనాన్ని కీర్తించారు.అమ్మవారు దేవతలకు – ఎప్పుడు దుష్ట రాక్షసుల నుంచి బాధలు కలిగినా, తాను అవతరించి, దుష్ట శిక్షణ చేస్తానని అభయమిచ్చారు. జగన్మాత, యోగ నిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును జాగృత పరిచి, మధు కైటభులనే రాక్షసులను సంహరింపజేసింది. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించగా, దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు, రుద్రుల దగ్గరికి వెళ్ళి మహిషాసురుని ఆగడాలను గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే శివకేశవులకు ధర్మాగ్రహం కలిగింది. ఆ క్రోధం ఒక ఆకృతి దాల్చి, వెలుగు రూపంలో బయటకొచ్చింది. దేవతలందరి ముఖాల నుంచి తేజస్సు బయటికి వచ్చి, ఆ సమష్టి తేజస్సు ఒక మహాద్భుత రూపం దాల్చి, అష్టభుజాలతో మహాలక్ష్మీదేవిగా, ఆదిపరాశక్తి ్తగా భాసించింది. ఈ తల్లిని దేవతలు ‘అమ్మా! నీవే సర్వకారణభూతురాలివి, కార్య కారణ రూపిణివి, క్రియా రూపిణివి, నీవు లేనిదే ఏదీ లేదు, అంతా నీలోనే ఉంది తల్లి అంటూ కీర్తించారు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు. కనీసం స్పందించను కూడా లేడట. శక్తి లేకపోతే, చలనం, స్పందన ఉండదు అని జగద్గురువు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి గురించి ప్రస్తుతించారు. ఆమె మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి మహిషాసురమర్దినిగా కీర్తించబడింది.జగన్మాతే ధూమ్రాక్షుడిని, రక్తబీజుడిని, చండ, ముండులను, శుంభ, నిశుంభులనే రాక్షసులను సంహరించింది. ఈ రాక్షసులందరూ బ్రహ్మదేవుని గురించి, పరమేశ్వరుని గురించి తపస్సులు చేసి వరాలు పొందినటువంటి వారు. దేవతల నుంచి ఎటువంటి భయాలు లేకుండా వరాలు పొందారు. కానీ స్త్రీ అంటే చులకన. ఆడవారు మననేం చేస్తారులే! అనే చులకన భావన స్త్రీల మీద! కనుకనే అమ్మవారు ఈ రాక్షసులందరినీ తనలో నుంచి బ్రాహ్మీ , వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఐంద్రీ, వారాహి, నారసింహీ, చాముండా, శ్యామలా, కాళీ మొదలైన దేవతాగణాలను ఉద్భవింపజేసి, వారితో కలిసి రాక్షసులతో యుద్ధం చేసి, దానవులందరినీ సంహరించింది. ఈ దుష్ట రాక్షసులందరినీ జగన్మాత ఈ నవరాత్రులలో సంహరించినందున నవరాత్రులలో జగన్మాత వివిధ రూపాలను, అవతారాలను మనం కీర్తిస్తాం, ఆరాధిస్తాం. విజయదశమి నాడు, జగన్మాత దుష్ట రాక్షసులను సంహరించి విజయం సాధించిన రోజు కాబట్టి మనమంతా విజయదశమి పండుగను వేడుకగా జరుపుకుంటాం.విజయదశమి జరుపుకోవటంలోఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి భేదం ఉండవచ్చు కానీ హైందవులందరూ ఈ పండుగ జరుపుకుంటారు. విజయదశమి పండుగ దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపబడుతున్నది. మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి.ఈ విజయదశమి పండుగ జరుపుకోవడానికి మనకు అనేక కారణాలు కనిపిస్తాయి. కాలంలో వచ్చే మార్పులను బట్టి దైవ శక్తిని ఆరాధించటం ఒక భావన అయితే, మనలోని దైవ శక్తిని వృద్ధిపరచుకోవటం, సమాజం లో అందరితో అన్యోన్యంగా సహకరిస్తూ ఉండటం అన్నది మరొక అంశం.ఈ విజయదశమినాడే అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో కౌరవుల మీద విజయం సాధించి విజయుడు అయ్యాడు. శమీ వృక్షం మీద పెట్టిన తమ ఆయుధాలలో నుంచి తన గాండీవాన్ని తీసుకుని యుద్ధం చేసి విజయం సాధించాడు కనుక మనం ఈనాడు విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. ఈనాడు శమీవృక్షాన్ని పూజిస్తాం.‘శమీ శమయతే పాపంశమీ శత్రు వినాశినీ!అర్జునస్య ధనుర్ధారీరామస్య ప్రియ దర్శిని’అని చెప్తూ శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తాం. ఈ విజయదశమి పండగనాడు అందరూ కూడా ఈ శమీ పత్రాలను – శమీ వృక్షపు ఆకులను పెద్దలకు ఇచ్చి నమస్కరిస్తారు. పెద్దలు వాటిని తీసుకుని పిల్లలను ఆశీర్వదిస్తారు.ఈ విజయదశమి రోజునే శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించినందున, విజయదశమి రోజున ‘రామలీల‘ను ప్రదర్శిస్తారు. రావణ దహనం చేస్తారు. జగన్మాత ఆరాధన వలన, దుర్జనుల వలన సంఘానికి చేటు కలగకుండా, అధివ్యాధుల సమస్యలు లేకుండా దేశానికి భద్రత కలుగుతుంది. అందుకే సాక్షాత్తూ ఆ జగజ్జనని మనని పాలిస్తూ ఉన్నట్లుగా.. ఆమె పాలనలో మనందరం క్షేమంగా.. సుఖంగా ఉన్నట్లు భావించుకుందాం. పూజించుకుందాం.‘‘అఖిలాండేశ్వరీ... చాముండేశ్వరీ.. పాలయమాం గౌరీ... పరిపాలయమాం గౌరీ...’’ అని ప్రార్థిస్తూ... మనల్ని పాలించమని అమ్మను వేడుకుందాం.మహిషం అంటే దున్నపోతు, జంతువు. మహిషాసురుడు అంటే జంతు తత్వం కలిగినటువంటి వాడు. రాజస తామస గుణాలకు ప్రతీకలు రాక్షసులు. మహిషాసురుడిని, చండ ముండులను, శుంభ, నిశుంభులను జగన్మాతసంహరించింది అంటే, మనలోనే ఉన్న కామ క్రోధాది అరిషడ్వర్గాలను, లోభ మోహాలను, అహంకారాన్ని నశింప చేసుకోవాలి అని గ్రహించాలి. చండ ముండాది రాక్షసులు దుర్మార్గమైన, ధర్మ విరుద్ధమైన బలదర్పాలకు ప్రతీకలు. కనుక అటువంటి బలహీనతలను జయించాలి. మనలోని రజోగుణాలను, తమో గుణాలను అరికట్టి, సత్వగుణాన్ని వృద్ధి పరచుకుని, శుద్ధ సత్వ గుణాన్ని పొందడానికి సాధన చేయాలి. అది ఈ జగన్మాతను నవరాత్రులలో ఆరాధించడం వలన సాధ్యపడుతుంది. శుద్ధ సత్వ గుణాన్ని వృద్ధి చేసుకుంటే దైవత్వాన్ని దర్శించగలుగుతాము, పొందగలుగుతాము.మథు, కైటభులు అనే రాక్షసులు అహంకార మమకారాలకు ప్రతీకలు. నేను, నాది అనే భావాలకు ప్రతీకలు. మధువు అంటే తేనె. అన్నింటి కంటే మనకు ఇష్టమైనది, తీయనైనది ఎవరికి వారే! ఒక్క నేను అనేది ఉంటే, అనేకమైన నావి, నా వారు, నా బంధువులు, నా అధికారం, నా పదవులు వంటి అనేకమైనవి బయలుదేరతాయి. ఒక్క తేనె చుక్క ఉంటే, అనేకమైన కీటకాలు చుట్టూ చేరినట్లుగా, ఒక్క నేనుకి, అనేకమైన – నావి అనేవి బయలుదేరతాయి. ఈ నేను, నాది అనే అహంకార, మమకార భావాలను సంహరించటమే మధుకైటభములను సంహరించటం. ధూమ్రాక్షుడు లేక ధూమ్రలోచనుడు అంటే పొగ బారిన, మసకబారిన కన్నులు కలవాడు, అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు అని అర్థం. కళ్ళు మసకబారినప్పుడు యదార్థం కనిపించదు. అలాగే అజ్ఞానం వలన జ్ఞానం బహిర్గతం కాదు. వివేక జ్ఞానం ఉదయించదు. కనుక మనలోని ఆ అజ్ఞానాన్ని సంహరించాలి. రక్తం అంటే రాగం, మోహం. రక్తబీజుడు అంటే ఎంత వద్దనుకున్నా మోహం ఆనే బీజం మొలకెత్తుతూనే ఉంటుంది. అందుకే కాళికాదేవి తన పెద్ద నాలుకను చాపి, ఆ రక్తబీజుని శరీరం నుంచి కారే రక్తబిందువులను మింగేసి, ఇంక మళ్ళీ రక్తబీజులు పుట్టే అవకాశం లేకుండా చేసింది. అప్పుడు జగన్మాత వాడిని సంహరించింది. అలాగే మనలోని రాగద్వేషాలను పూర్తిగా ఎప్పుడైతే మనం జయిస్తామో, అప్పుడు జగన్మాత దర్శనం మనకు ప్రాప్తిస్తుంది.విజయదశమి దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపుకుంటున్న పండగ. ఇప్పుడు రాక్షసులు లేకపోవచ్చు కానీ, మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి.(గతంలో డా. తంగిరాల విశాలాక్షి, విశ్రాంత ఆచార్యులు సాక్షి కోసం రాసిన ప్రత్యేక వ్యాసమిది -
పరువు కాదు ముఖ్యం: ఆటిజం పిల్లలకు మాటివ్వండి!
యుకేలో ముప్పై ఏళ్లుగా పిల్లలు, టీనేజర్లు, వారి కుటుంబాలతో కలిసి పనిచేయడంలో నైపుణ్యం కలిగిన పీడియాట్రిక్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ సియాన్ విల్సన్. ఆటిజంలో క్లినికల్ స్పెషలిస్ట్గా స్కూళ్లు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. సోషల్ కోచ్గా సేవలు అందిస్తున్నారు.భారతదేశం పిల్లల్లో డిజేబిలిటీ ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయంపై సమీక్ష జరపడానికి ఇండియాకు వచ్చారు. పాతికేళ్లుగా చిల్డ్రన్ డిజేబిలిటీస్ పై వర్క్ చేస్తున్న మాధవి ఆదిమూలం, సియాన్ విల్సన్ లు యుకెలోనూ, ఇండియాలోనూ ఉన్న పరిస్థితులు, అమలు చేయాల్సిన విధానాల గురించి హైదరాబాద్లోని మాదాపూర్లో జరిగిన ఈవెంట్లో డిజేబిలిటీ చిల్డ్రన్ తల్లిదండ్రులతో కలిసి చర్చించారు.నాటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాల వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక థెరపిస్ట్గా పిల్లల వృద్ధికి దోహదపడేవారు. ఇప్పుడు తల్లితండ్రీ మాత్రమే కాదు ఒంటరి తల్లుల సంఖ్య పెరుగుతున్న ఈరోజుల్లో పిల్లల పెంపకం సమస్యగానే మారుతోంది అంటున్నారు నిపుణులు.స్పెషలిస్ట్లు ఎక్కువ‘‘యుకేలో స్పెషల్ చిల్డ్రన్ డెవలప్మెంట్కి సంబంధించిన విధానం, ఖర్చు అంతా అక్కడి కౌన్సిల్ చూసుకుంటుంది. కొన్నాళ్లుగా ఇండియాలోని ప్రముఖ చైల్డ్ డెవలప్మెంట్ క్లినిక్స్తో సంప్రదింపులు చేస్తున్నాను. ఇక్కడితో పోల్చితే యుకేలో స్పెషల్ చిల్డ్రన్ని చాలా చిన్నవయసులోనే గుర్తించడంలో అవగాహన అక్కడి పేరెంట్స్కు ఎక్కువ ఉంది. ఆటిజం చైల్డ్లో స్పీచ్ థెరపీ ద్వారా సరైన మెరుగుదలను తీసుకురావడానికి వారి స్థితిని బట్టి నార్మల్ స్కూల్ స్టూడెంట్స్తో కలుపుతారు. అయితే, అలాంటి ఒక చైల్డ్కి ఒక టీచర్ చొప్పున లెర్నింగ్ స΄ోర్ట్ అసిస్టెంట్ను కేటాయిస్తారు. అంటే, తన వయసు పిల్లలతో కలిసి ఉండే దోరణి వల్ల ఆ స్పెషల్ చైల్డ్లో మానసిక ఆరోగ్యం బాగవుతుంటుంది. ఎవరూ కూడా ఈ విధానానికి అడ్డు చెప్పరు’ అంటూ దేశంలో స్పెషల్ చైల్డ్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తెలియజేశారు సియాన్ విల్సన్.పరువు కాదు ముఖ్యం‘చాలా మంది తల్లులు తమ పిల్లల్లో ఉన్న ఆటిజం సమస్యను గుర్తించడమే లేదు. ఒక వేళ ఏదైనా డిజేబిలిటీ ఉన్నా బయటకు తెలిస్తే పరువు ΄ోతుంది అనుకుంటున్నారు. ‘మా అమ్మాయి/అబ్బాయిని ట్యూషన్కో లేదో మ్యూజిక్, డ్యాన్స్ స్కూల్కో తీసుకెళుతున్నామని చెప్పి, తీసుకువస్తున్నామ’ని చెబుతున్నారు. టీనేజర్ స్థాయిలో ఉన్న పిల్లలను కూడా ఇంట్లోనే ఉంచుతున్నారు. వారికి ఎలాంటి థెరపీ ఇవ్వక΄ోవడం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. దీంతో అప్పుడు నిపుణులను కలుస్తున్నారు. సమస్యను మొదట్లోనే గుర్తిస్తే, పరిష్కారం కూడా త్వరగా లభిస్తుంది’ అని వివరించారు థెరపిస్ట్ లక్ష్మీ ప్రసన్న.పరువుతో వెనకడుగు వేయద్దు‘‘అనన్య చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పేరుతో 19 ఏళ్లుగా ఆటిజం పిల్లలకు సేవలు అందిస్తున్నాను. మా బాబు స్పెషల్ కిడ్ అవడంతో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయిన నేను స్పెషలైజేషన్ చేసి, ఈ తరహా పిల్లల కోసమే పనిచేస్తున్నాను. ఇప్పుడు మా బాబు వయసు 24 ఏళ్లు. వాడు సంగీతంలో నైపుణ్యం సాధించడంతోపాటు ప్రదర్శనలు కూడా ఇస్తున్నాడు. మా బాబును ఇక్కడ సాధారణ స్కూల్లో చేర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. ఎడీహెచ్డీ ఆటిజం ఉన్న పిల్లల్లో మెరుగుదల కనిపిస్తున్నప్పుడు వారిని, మిగతా అందరిలాగే స్కూళ్లో చేర్చగలిగే శక్తిని కూడా అందించాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్లు సాధారణంగా ఎదుగుతారు. అంతేకాదు ఆటిజం పిల్లల పెంపకంలో వారిలో కొన్ని నైపుణ్యాలు కనిపిస్తుంటాయి. ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తూ ఉంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. తమకు తాముగా పనులు చేసుకోవడమే కాదు నైపుణ్యాలను కూడా చూపుతారు. అందుకే ఈ విషయాల్లో గ్రామీణ స్థాయిలోనూ అవగాహన క్యాంపులను నిర్వహిస్తున్నాం. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం. అక్యుపేషనల్ థెరపిస్ట్ల కొరత మన దగ్గర చాలా ఉంది. థెరపిస్ట్ల సంఖ్య, తల్లిదండ్రులలో అవగాహన పెరిగితే ఈ సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది’ అని వివరించారు మాధవి ఆదిమూలం.– నిర్మలారెడ్డిఫొటోలు: బాలస్వామి, సాక్షి -
‘మిలాద్ ఉన్ నబి’: మహా ప్రవక్త జననం
అజ్ఞానతిమిరంలో తచ్చాడే మానవజాతికి జ్ఞానకాంతులతో సన్మార్గం చూపిన మహాత్ముడు ఇహలోకం వీడి దాదాపు 1450 సంవత్సరాలు అవుతున్నా ఆ మహనీయుని బోధలు మనవద్ద సురక్షితంగా ఉన్నాయి. వాటిని గనక మనం ఆచరించగలిగితే, నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ అధిగమించి ఓ సుందర సత్సమాజాన్ని ఆవిష్కరించు కోవచ్చు. నేటి పరిస్థితుల నేపథ్యంలో ముహమ్మద్ ప్రవక్త(స) బోధనల పట్ల దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది.క్రీ.శ. 571 ఏప్రిల్ నెల ఇరవయ్యోతేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో ముహమ్మద్ ప్రవక్త(స) జన్మించారు. తల్లి దండ్రులు ఆమినా, అబ్దుల్లాహ్. ఈ మహనీయుడు జన్మించక ముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. అనాథ అయిన ఆరేళ్ళ బాబును తాతయ్య అక్కున చేర్చుకున్నారు. నీతి, నిజాయితీ, సేవాతత్పరత, సత్యసంధత, విశ్వసనీయత ఆయనకు ఉగ్గుపాలతోనే అలవడ్డాయి. ఈ కారణంగానే ఆయన ప్రజల మనసులు చూరగొని ‘సాదిఖ్ ’గా, ‘అమీన్’ గా పిలవబడ్డారు. ముహమ్మద్కు చదవడం, రాయడం రాదు. అయినా ఆయన బోధలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. నాటి యావత్ అరేబియా ద్వీపకల్పమంతా ఆయన బోధనలకు ఆకర్షిత మైంది. ఫలితంగా సమస్త దుర్మార్గాలూ అంతమయ్యాయి. అసత్యం, అవినీతి, అక్రమాలు, దోపిడి, సారాయి, జూదం, వడ్డీ, అంటరానితనం, హత్యలు, అత్యాచారాలు అన్నీ సమసి పోయాయి. స్త్రీ అంగడి సరుకు అన్న భావన నుంచి, స్త్రీని గౌరవించనిదే దైవప్రసన్నత దుర్లభమన్న విశ్వాసం వేళ్ళూనుకుంది. అన్నిరకాల చెడులు, అసమానతలుఅంతమై పొయ్యాయి.బడుగులు, బలహీనుల హక్కులు పరిరక్షించబడ్డాయి. మానవ సమాజంలో అన్ని విధాలా శాంతి, సౌభాగ్యాలు పరిఢవిల్లాయి. అందుకే, ధర్మబోధకులందరిలో అత్యధికంగా సాఫల్యాన్ని పొందిన ప్రవక్త ‘ముహమ్మద్ ’ మాత్రమేనని ఎన్ సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ఘనంగా కీర్తించింది. అంతేకాదు, ప్రారంభకాలపు మూల గ్రంథాలన్నీ ఆయన్ని విశ్వసనీయమైన వ్యక్తిగా, సత్యసంధుడైన మనిషిగా పరిచయం చేస్తాయని ప్రకటించింది. ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మహా పురుషులను గురించి మైకేల్ హెచ్.హార్ట్ ఒక పుస్తకం రాశారు. అందులో రాసిన వందమంది మహాపురుషుల జాబితాలో ‘ముహమ్మద్’ ప్రవక్త పేరు అందరికన్నా అగ్రస్థానంలో మనకు కనిపిస్తుంది. ఇంతమంది ఇన్నిరకాలుగా ప్రశంసించిన ఆమహనీయులు నేడు మనమధ్యలేరు.కాని ఆయన బోధనలు మనవద్ద సురక్షి తంగా ఉన్నాయి. మనం వాటిని ఆచరించ గలిగితే చాలు. ఎందుకంటే, నేటి మన సమాజం అన్నిరకాల అవలక్షణాలతో సతమతమవుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ఎంతప్రగతి సాధించినా, నైతిక, ధార్మిక, మానవీయ రంగాల్లోమాత్రం తిరోగమనంలోనే ఉన్నామన్నది నిజం. నేటి మన సమాజంలో ఏరంగమూ సంతృప్తికరంగాలేదు. ఎంత ప్రగతిపథంలో పయనిస్తున్నా, నేటికీ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. స్త్రీలకు రక్షణలేని పరిస్థితి. అవినీతి, అక్రమాలకు కొదవే లేదు. మద్య΄ానం, జూదం, అశ్లీలం, అంటరానితనం, నిరక్షరాస్యత, ఆడసంతానం హత్యలు, అత్యాచారాలు, హత్యా రాజకీయాలు నిరాఘాటంగా సాగిపోతూనే ఉన్నాయి. ఇవన్నీ సమసి΄ోవాలంటే, సమాజం నుండి ఈ దుర్మార్గాలు అంతం కావాలంటే, నీతి, నిజాయితీలతో కూడిన, ఎలాంటి వివక్ష, తారతమ్యాలకు తావులేని, ఉన్నత మానవీయ విలువలతో నిండిన సుందర సౌభాగ్యవంతమైన సమాజం పునర్ నిర్మాణం కావాలంటే ఈ అమృత బోధనలను అధ్యయనం చేయాల్సిన, ఆచరించాల్సిన అవసరం ఉంది.(నేడు ప్రవక్త జయంతి ‘మిలాదున్నబీ’)– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
Lalbaugcha Raja: లాల్బాగ్ గణపతి ప్రత్యేకతలివే..
ముంబై: దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలో 10 రోజుల పాటు ఘనంగా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో ఇక్కడి లాల్బాగ్చా రాజా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. లాల్బాగ్లో పూజలు అందుకునే వినాయకుణ్ణి చూసేందుకు మనదేశం నుంచే కాదు ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.సెంట్రల్ ముంబైలోని లాల్బాగ్ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన గణేశుడిని లాల్బాగ్చా రాజా అని పిలుస్తుంటారు. ఉత్సవాల సమయంలో లాల్ బాగ్ ప్రాంతమంతా భక్తులతో కళకళలాడుతుంటుంది. గణేశుని దర్శనం కోసం భక్తులు క్యూ కడుతుంటారు. ఇక్కడి వేదికపై ప్రతిష్ఠించిన విఘ్నహర్త గణేశుడి విగ్రహాన్ని నవశాచ గణపతి అంటారు. ఈ రూపం భక్తుల సమస్త కోరికలను తీరుస్తుందని చెబుతుంటారు.లాల్బాగ్లో నిర్వహించే 10 రోజుల గణేశ ఉత్సవంలో ప్రతిరోజూ లక్షల మంది భక్తులు స్వామివారిని చూసేందుకు తరలి వస్తుంటారు. ఈ 20 అడుగుల ఎత్తయిన విఘ్నహర్త విగ్రహాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. 89 ఏళ్లుగా ఈ అందమైన బప్పా విగ్రహాన్ని రూపొందించే బాధ్యతను కాంబ్లీ కుటుంబం పర్యవేక్షిస్తోంది.కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలవారు ఇక్కడి గణపతి బప్పాను దర్శించుకుని, ఆశీస్సులు పొందుతారు. బాలీవుడ్ ప్రముఖులతో పాటు అంబానీ కుటుంబ సభ్యులు కూడా లాల్బాగ్చా రాజా ఆశీర్వాదం కోసం ఇక్కడికి వస్తారు. -
జాతీయ పోషకాహార వారోత్సవం 2024 : అందంగా ఆరోగ్యంగా దీర్ఘాయుష్షుతో జీవించాలంటే!
మనిషి ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే సరైన పోషకాలు అవసరం. కుల, మత, లింగ, వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి శిశువుల నుంచి వృద్ధుల దాకా పోషకాహారం చాలా కీలకం. పోష కాహారంపై శ్రద్ధ పెట్టకపోతే జీవితం అతలాకుతలమవుతుంది. అనేక వ్యాధులకు మూలంగా మారి పోతుంది. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలి, శరీరానికి పోషకాహారం ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జాతీయ పోషకాహార వారోత్సవాన్ని పాటిస్తారు. సెప్టెంబరు 1 నుండి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాన్ని నిర్వహిస్తారు.1982లో కేంద్రం (ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్) ఈ వారోత్సవాన్ని ప్రారంభించింది. పోషకాహారం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ వార్షిక కార్యక్రమం భాగంగా పోషకాహార లోపాన్ని గుర్తించడం, పరిష్కరించడం. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో , వ్యాధులను నివారించడంలో సమతుల్య ఆహారం కీలక పాత్రపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని లక్ష్యం.ముఖ్యమైన పోషకాలు విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు, నీరు, కార్బోహైడ్రేట్లు ఇవన్నీ శరీరానికి కావల్సిన పోషకాలు. ముఖ్యంగా పిలల్లో ఈ పోషకాల ప్రాముఖ్యత పాత్ర చాలా ఉంది. వారి మానసిక,శారీరక ఎదుగుదలకు వికాసానికి, ఎముకల బలానికి చాలా అవసరం., పోషకాహారం లోపంతో శారీరక బలహీనత ఏర్పడి, అనేక రోగాలు కారణమవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి వైరస్ల దాడి చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం మనిషి జీవితకాలాన్ని పెంచుతుంది.పోషకాహారం అంటే?కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ,ఫైబర్ల మిశ్రమాలతో సంపూర్ణ ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం నిత్యం తీసుకునే ఆహారంలో సహజంగా లభించే వివిధ రకాల తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, మొలకెత్తిన గింజలు, పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోకుండా ప్రొటీన్ ఫుడ్పై శ్రద్ధపెట్టాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. చక్కెర, ఉప్పు వాడకాన్ని నియంత్రించాలి. కూల్ డ్రింక్లు, అనారోగ్య కరమైన కొవ్వులు అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన, ఫాస్ట్ ఫుడ్లకు దూరంగా ఉండాలి. టీ, కాఫీలను పరిమితం చేసుకోవాలి. హెర్బల్ టీలను ఎంచుకోవడం బెటర్. -
తల్లిపాల వారోత్సవాలు : బాధ్యత మనందరిదీ!
నవమాసాలు మోసి బిడ్డను కనిపెంచడంలో తల్లి పాత్ర చాలా కీలకమైంది. అలాగే తల్లి పాలల్లో మహత్తర శక్తి ఉంది. పుట్టిన వెంటనే బిడ్డకు స్తన్యమివ్వడం చాలా అవసరం. దీనిపై అవగాహన కల్పించేందుకే ఆగస్టు 1 నుండి ఆగస్టు 7 వరకు 120కి పైగా దేశాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకుంటారు. పిల్లల సక్రమమైన అభివృద్ధికి తల్లిపాలు చాలా అవసరం. బిడ్డకు పోషకాహారాన్ని ఇవ్వడం మాత్రమేకాదు, తల్లీబిడ్డల బాంధవ్యాన్ని పెంచుతుంది. పసివయస్సులో తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా భద్రతనిస్తుంది. మొదటి టీకాగా పనిచేస్తాయి తల్లిపాలు. 1992లో మొట్టమొదటిసారిగా ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ప్రతిపాదను ఆమోదం లభించింది.1990లో ఆగస్టులో ప్రభుత్వ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ , ఇతర సంస్థలచే తల్లిపాలను రక్షించడానికి, ప్రోత్సహించడానికి , మద్దతు ఇచ్చేలా ఇన్నోసెంటి డిక్లరేషన్పై సంతకాలు జరిగాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడం, దానికి మద్దతు ఇవ్వడం , ప్రోత్సహించడంతో పాటు ప్రతిచోటా తల్లులు శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యాలు.World Breastfeeding Week...1st to 7th August 2024@OfficeOfLGJandK @SyedAbidShah @DrRakesh183 pic.twitter.com/QmgPtjLWWh— DIRECTORATE OF HEALTH SERVICES JAMMU (@dhs_jammu) August 1, 2024ప్రతీ ఏడాది, ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ డేని వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ (WABA) ఎంపిక చేసిన కొత్త థీమ్తో జరుపుకోవడం ఆనవాయితీ. “అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు” (Closing the gap: Breastfeeding support for all) అనే థీమ్తో ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తల్లిపాలు ప్రాముఖ్యత , ప్రయోజనాలునవజాత శిశువులకు తల్లి పాలు బలవర్ధకమైన పోషకాహారం. అనేక రకాల సాధారణ వ్యాధులనుంచి రక్షించే రోగనిరోధక శక్తిని అందించడంలో తల్లిపాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. తల్లిపాలలోని పోషకాలు, యాంటీబాడీస్,ఎంజైమ్లు పిల్లల్ని అనారోగ్యాలు ,ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.తల్లి-పిల్లల బంధాన్ని బలోపేతం చేయడం, ప్రసవానంతరం బాలింతలు వేగంగా కోలుకోవడానికి, రొమ్ము, అండాశయ కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో తల్లి పాలు ఏంతో మేలు చేస్తాయి. ఒక కొత్త జీవిని ఈ సమాజంలోకి తీసుకొచ్చే ఈ ప్రయాణంలో అమ్మకు మనం అందరంఅండగా నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి మానసిక, శారీరక స్థితిని అర్థం చేసుకొని అటు భర్త, ఇటు ఇరు కుటుంబ సభ్యులు ఆమె తోడుగా నిలవాలి. అలాగే కమ్యూనిటీ స్థాయిలో రాష్ట్ర, జిల్లా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆరోగ్య సంస్థలు అధికారులు ఇందుకు మద్దతుగా నిలబడాలి. ఈ అవగాహన పెంచేందుకు,తల్లులు ఎదుర్కొంటున్ ఇబ్బందులను పరిష్కరించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఈవెంట్లు, సెమినార్లు, వర్క్షాప్ల ద్వారా కృషి చేస్తారు. -
సైలెంట్ డీహైడ్రేషన్ అంటే ఏంటి?ఎలక్ట్రోలైట్ల ప్రాధాన్యత ఎంత?
రోజూ తగినన్ని నీళ్లు తాగుతున్నా, తరచూ నిస్సత్తువ, జబ్బుల బారిన పడితే ‘సైలెంట్ డీహైడ్రేషన్’ బారినపడ్డట్లే అంటున్నారు వైద్యులు. తెలంగాణా సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లక్షల మంది ఈ సైలెంట్ డీహైడ్రేషన్కు గురవుతున్నారు.కొద్దిపాటి జాగ్రత్త, ముందుచూపుతో ఈ సమస్యను అధిగమించడం చాలా సులువు అంటున్నారు నిపుణులు.ఆహారంతో పాటు శరీరానికి తగినంత నీరు కూడా అవసనం, నీటితోపాటే శరీరానికి అవసరమైన లవణాలు కొన్నింటిని జోడిస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... దాహమేస్తే నీళ్లు తాగుతాం కానీ... ఖనిజ, లవణాలు తగ్గిపోతే ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అందుకే దీన్ని ‘సైలెంట్ డీహైడ్రేషన్’ అంటారు దీన్ని. శరీరంలో నీటి మోతాదు, ఇతర లవణాలు తగ్గిపోవడం, అతిసారం వంటి వ్యాధుల వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.హైదరాబాద్ నగరంలో ఏటికేడాదీ కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని, మొత్తం వ్యాధిగ్రస్తుల్లో 10 - 15 శాతం మందికి సైలెంట్ డీహైడ్రేషనే కారణమని గాంధీ వైద్య కళాశాల మాజీ అధ్యాపకులు, పీడియాట్రిక్స్ విభాగాధిపత్రి డాక్టర్ సి.సురేశ్కుమార్ తెలిపారు. పరిస్థితి చేయి దాటకముందే ఈ సైలెంట్ డీహైడ్రేషన్ను గుర్తించాలనీ, ముఖ్యంగా ద్రవ సమతౌల్యం కోసం ఎలక్ట్రోలైట్లు కచ్చితంగా కావాలి. నాడీ, కండరాల పనితీరును నియంత్రించేందుకు, కణాల్లో జరిగే జీవక్రియల కోసం ఈ ఎలక్ట్రోలైట్లు కీలకం. పైగా... సైలెంట్ డీహైడ్రేషన్కు దారితీసే పరిస్థితుల్లో (అతిసారం కాకున్నా) శరీరానికి చాలా ఎక్కువ శక్తి అవసరమవుతుందన్నది గుర్తించాలన్నారు.డబ్ల్యూహెచ్ఓ ఓఆర్ఎస్తో లాభం...శరీరంలో ద్రవ సంతులనాన్ని కాపాడుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసే ఓఆర్ఎస్ ఎంతో ఉపయోగపడుతుందని, డీహైడ్రేషన్, అతిసారం రెండింటి నియంత్రణకు వాడుకోవచ్చునని డాక్టర్ సి.సురేశ్ కుమార్ తెలిపారు. సైలెంట్ డీహైడ్రేషన్కు దారితీసే పరిస్థితుల నుంచి కోలుకునేందుకు కూడా ఓఆర్ఎస్లోని ఎలక్ట్రోలైట్లు బాగా ఉపయోగపడతాయన్నారు.జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, వేడి కారణంగా వచ్చే జబ్బులు, వాంతులు లాంటి ఇతర సందర్భాల్లో తగినన్ని నీళ్లు, ఎలక్ట్రోలైట్లు తీసుకోవడం మంచిదని, పిల్లలు, వృద్ధులు ఈ విషయంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని కోరారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చాలామంది వడదెబ్బ కారణంగా ఏర్పడ్డ డీహైడ్రేషన్తో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, హైదరాబాద్లో పిల్లలు కూడా బలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ అధ్యాపకులు డాక్టర్ ఎన్.ఎల్.శ్రీధర్ మాట్లాడుతూ ‘‘సైలెంట్ డీహైడ్రేషన్పై అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పిల్లలు, వృద్ధుల్లో ఇది చాలా త్వరితగతిలో ముదిరిపోతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకూ దారితీయవచ్చు’’ అని ఆయన తెలిపారు. -
తొలి ఏకాదశి విశిష్టత? ఆ పేరు ఎలా వచ్చిందంటే..!
హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా.. ఈ పండగ విశిష్టత, పూజా విధానం గురించి సవివరంగా తెలుసుకుందాం..ఒక ఏడాదిలో 24 ఏకాదశుల్లో వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.పూజకు పూజ.. ఆరోగ్యానికి ఆరోగ్యం..ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగానూ మనకు మేలు చేస్తుందన్నమాట.ఏకాదశి విశిష్టత..కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు.. బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట. నాటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు రుషులు చెబుతారు.ఏం చేయాలి..?ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు.తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఈరోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలలపాటు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. కార్తికంలో వచ్చే ఉత్థాన ఏకాదశినాడు తిరిగి మేల్కొంటాడు. దక్షిణాయన ప్రారంభకాలంలో వచ్చే తొలి ఏకాదశి పర్వం విష్ణుభక్తులకు పరమపవిత్రం. ఉపవాస జాగరణలతో ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ఈ రోజు జగన్నాథుడికి స్వర్ణాలంకారం జగన్నాథుడి తిరుగు రథయాత్ర మొదలైన మరునాడు– అంటే, తొలి ఏకాదశి రోజున జగన్నాథుని స్వర్ణాలంకృతుని చేస్తారు. దీనినే స్థానికంగా ‘సునా బేషొ’ అంటారు. జగన్నాథుడి స్వర్ణాలంకార వేషాన్నే ‘రాజ వేషం’, ‘రాజాధిరాజ వేషం’ అని కూడా అంటారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలకు బంగారు కాళ్లు, చేతులను, ముఖాలకు బంగారు ఊర్థ్వపుండ్రాలను అలంకరిస్తారు. జగన్నాథుడి ఊర్ధ్వపుండ్రానికి వజ్రం, బలభద్రునికి కెంపు, సుభద్ర ఊర్ధ్వపుండ్రానికి పచ్చ ΄దిగి ఉంటాయి.జగన్నాథుడి చేతుల్లో బంగారు శంఖు చక్రాలను, బలభద్రుడి చేతుల్లో బంగారు గద, హలాయుధాలను అలంకరిస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు వజ్రాలు సహా రత్న కిరీటాలు, కర్ణకుండలాలు, నాసాభరణాలు, కంఠహారాలు, బంగారు పుష్పమాలలు, వడ్డాణాలు, రాహురేఖలను అలంకరిస్తారు. జగన్నాథుడి కిరీటంపై ప్రత్యేకంగా బంగారు నెమలి పింఛాన్ని కూడా అలంకరిస్తారు.(చదవండి: రూ.14 వేలకే 'దివ్య దక్షిణ యాత్ర'..తొమ్మిది రోజుల్లో ఏకంగా ఏడు..!) -
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి అత్యంత విశిష్టత ఉంది. ఈ పండుగను ఇవాళే జరుపుకుంటాం. వైశాఖంలో వచ్చే ఈ శుక్ల పక్ష తదియకు ఎందుకంత ప్రాముఖ్యం. పైగా ఈ రోజు బంగారం కొంటే అక్షయం అవుతుందని నమ్ముతారు. అసలు బంగారానికి ఈ అక్షయ తృతియకు సంబంధం ఏంటీ?. ఈ రోజున ఏం చేస్తారు..?ఆ పేరు ఎలా వచ్చిందంటే..మత్స్య పురాణం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే ఇంత విశిష్టత ఈ తిథికి. ఈరోజు ఉపవాస దీక్ష చేసి.. ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి "అక్షయ తృతీయ" అని పేరు.ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును బ్రాహ్మణులకు దానమిచవ్వగా.. మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందుతారని పురాణోక్తి. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుంచి కావచ్చు, యవల నుంచి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.విశిష్టత..కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు. అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే. అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే..ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజిది.బంగారం కొనాల్సిందేనా..?అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. పురాణాల ప్రకారం, కలి పురుషుడు ఐదు స్థానాల్లో ఉంటాడు. అందులో ఒకడి పసిడి. బంగారాన్ని అహంకరానికి హేతువుగా పరిగణిస్తారు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమే అర్థమని కొందరి వాదన. అయితే ఈరోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకొచ్చిందంటే.. ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు.. దానం చేయాలన్నది అసలు విషయం. అయితే బంగారం కొనుగోలు చేసే శక్తి, సామర్థ్యాలు చాలా మందికి ఉండవు. అందుకే ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పెద్దలు చెబుతారు. అంతేగాదు ఈ రోజున ఏ కార్యాన్ని తల పెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయతృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.ఈ రోజునే పురాణల్లో జరిగిన సంఘటనలు..కృతయుగం ఆరంభం అయిన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునే అని విష్ణుపురాణంలో ఉంది.నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే ..ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడుశ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు..వైశాఖ శుద్ద తదియ రోజు రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయతృతీయే వ్యాస మహర్షి "మహా భారతం" వినాయకుడి సహాయంతో రాయడం మొదలెట్టిన రోజు అక్షయ తృతీయ అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజేకుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజేకటిక దారిద్రం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి బిక్షకు వెళ్లిన జగద్గురు ఆదిశంకరాచార్యులు "కనకధారాస్త్రోత్రం" పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదేఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు..బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది. సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం , చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయఅన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం. -
గంగాస్నానం ఎంత గొప్పదంటే...
గంగేమాం పాహి... అంటూ ముత్తుస్వామి దీక్షితార్ వారు చేసిన కీర్తన చివరి చరణాల్లో. ‘‘..సకల తీర్థమూలే సద్గురు గుహలీలే/వరజహ్నుబాలే వ్యాసాది కృపాలే’’ అంటారు. దీక్షితార్ వారి కీర్తికి ప్రధాన కారణం గంగమ్మ ప్రసాదంగా లభించిన వీణకాగా మరొకటి తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం. సద్గురువు అయిన గుహుడు.. సుబ్రహ్మణ్యుడు గంగానది ఒడ్డున ఆడుకునేవాడని అన్నారు. అక్కడ ఆడుకునేవాడని చెప్పడం వెనుక సుబ్రహ్మణ్య జననం గురించి గుర్తు చేస్తున్నాడు. శివవీర్యం తేజస్సు భరించలేని దేవతలు దానిని అగ్నిహోత్రునివద్ద ఉంచారు. ఆయన ఒకనాడు గంగమ్మ దగ్గరకు వెళ్ళి...‘‘ఇది దేవతాకార్యం. దీనిని నీవు ఉంచుకుని గర్భం ధరించు’’ అన్నాడు. గంగ అంగీకరించింది. అయితే శివ తేజస్సు శరీరం అంతటా ప్రవహించేసరికి తట్టుకోలేక..‘నేను వదిలిపెట్టేస్తాను.. ఎక్కడ వదిలిపెట్టేయను’ అనడిగింది. ‘‘రెల్లుగడ్డి పొదలో వదిలి పెట్టు’’ అని అగ్నిహోత్రుడు సలహా ఇచ్చాడు. అదే శరవణ భవ.. మంత్రం. అక్కడ సుబ్రహ్మణ్య జననం జరిగింది. అందువల్ల బాల సుబ్రహ్మణ్యుడు గంగానదీ ప్రవాహ తీరంలో ఆడుకునేవాడు. అదే సద్గురు గుహలీలే... అన్న చరణం. బ్రహ్మ, విష్ణు స్పర్శ పొందిన గంగ... సగరుల భస్మరాశిమీదుగా ప్రవహించడానికి పాతాళానికి భాగీరథుడి రథం వెంట పరుగెడుతూన్నది. మార్గమధ్యంలో జహ్నుమహర్షి యజ్ఞవాటికను ముంచెత్తడంతో ఆయన ఆగ్రహించి మొత్తం గంగను తపశ్శక్తితో లోపలకు పుచ్చేసుకున్నాడు. భగీరథుడి అభ్యర్థన మేరకు మళ్ళీ విడిచిపెట్టాడు. అలా గంగ రుషి పుత్రిక జాహ్నవి అయింది. వ్యాసాది కృపాలే... అని కూడా అన్నాడు.. వ్యాసమహర్షికి గంగానది అంటే ఎంత వ్యామోహమో! పరమశివుడు శపిస్తే... గంగను, కాశీని వదిలిపెట్టి పోవడానికి వ్యాసుడు క్షోభిల్లాడు. గంగకు ఒకగొప్పదనం ఉంది. గంగావతరణమ్ గురించిగానీ, గంగను గురించిగానీ వింటే చాలు... అంటారు భీష్ముడు అనుశాసనిక పర్వంలో అంపశయ్య మీద పడుకుని ధర్మరాజుతో మాట్లాడుతూ –‘‘గంగానది పేరు తలచుకోవడం గానీ, గంగలో స్నానం చేయడం గానీ, ఒక చుక్క గంగనీటిని నాలుకమీద వేసుకోవడం గానీ చేయాలి. ఆచరించవలసినవే అయినప్పటికీ యజ్ఞయాగాదులకన్నా, బ్రహ్మచర్యం కన్నా, తపస్సుకన్నా, దానం కన్నా, గంగాస్నానం గొప్పది’’ అంటాడు. కాశీఖండంలో శ్రీనాథుడు...‘‘గౌరియొక్కతె యాకాశగంగ యొకతె/కాశియొక్కతె దక్షిణకాశి యొకతె/నలుగురును శంభునకు లోకనాయకునకు/రాణ్ వాసంబులనురాగ రసమ పేర్మి?’’ అని అంటాడు భీమేశ్వర పురాణంలో. అంటే గౌరిని ఎంతగా ప్రేమిస్తాడో శంకరుడికి గంగ, కాశి, దక్షిణ కాశి అన్నా కూడా అంతే అనురాగమట. ఎవరయితే భక్తితో గంగానది పేరు తలచుకుని ఒక్క గంగనీటి చుక్కను నాలుకమీద వేసుకుంటారో వారికి యమధర్మరాజుతో సంవాదం లేదన్నారు. అంటే వారికి యమదూతల దర్శనం ఉండే అవకాశం లేదు. అంతగొప్పగా గంగానదీ వైభవాన్ని కీర్తించిన ముత్తుస్వామి దీక్షితార్ వారి నోట కీర్తనల రూపంలో ప్రవహించిన శాబ్దికగంగను కూడా మనం నిత్యం వింటూ ఉండాలి. (చదవండి: అక్కా తమ్ముడు-అన్నా చెల్లెళ్లకు ఆ ఆలయంలోకి నో ఎంట్రీ!) -
'శ్రీ పంచమి'కి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజే అక్షరాభ్యాసాలు ఎందుకు?
ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనగా మనకు కొన్ని పండుగలు ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో శ్రీపంచమి ఒకటి. మాఘ శుద్ధ పంచమినాడు ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని సరస్వతీ జయంతి, మదన పంచమి అని కూడా అంటారు. ఇది రుతు సంబంధమైన పర్వం. వసంత రుతువుకు స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది. వసంత రుతువు రాకను భారతదేశమంతటా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది కనుక ఈ మాఘ శుద్ధ పంచమిని ‘వసంత పంచమి’గా వ్యవహరిస్తారు. అయితే ఈ పంచమినే రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎందుకని? ఈ తిథికి ఎందుకంత ప్రాముఖ్యత? రుతు సంబంధమైన పండుగ కావడంతో, దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పర్వదినాన్ని 'శ్రీపంచమి', 'మదన పంచమి', 'సరస్వతీ జయంతి' అనే పేర్లతోనూ పిలుస్తారు. మకర సంక్రాంతి తరవాత వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. చెట్లు చిగురించడం, పూలు పూయడం వంటి శుభ సంకేతాలు ఇదే రుతువులో ఆరంభమవుతాయి. వసంతుడికి ఆహ్వానం పలుకుతూ ప్రకృతి కాంత శోభాయమానంగా విరాజిల్లుతుంది. జ్ఞానానికి అధిదేవత సరస్వతీ దేవి. ఆమె జ్ఞాన స్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైనవాటిని చదువుల తల్లి సరస్వతీదేవి అంశలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెబుతారు మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి. వసంతం అందరికీ ఎనలేని ఆనందం కలిగిస్తుంది. హరి పూజ, నూతన వస్త్రధారణను విధులుగా భావిస్తారు. రంగులు చల్లుకుంటారు. కొత్త ధాన్యం వచ్చే రోజులు కాబట్టి, బియ్యంతో పాయసం వండి నైవేద్యం పెడతారు. ఈ వసంత పంచమిని రాజస్థాన్లో విశేషంగా ఆచరిస్తారు. వంగ దేశంలో 'శ్రీ పంచమి' పేరుతో నిర్వర్తిస్తారు. సరస్వతి జన్మించిన రోజుగా భావించి, ఆ దేవిని భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. గ్రంథాలను ఆ ప్రతిమ దగ్గర ఉంచి, పూజించి, సాయంకాలం వూరేగింపుగా వెళ్లి జలాశయంలో నిమజ్జనం చేస్తారు. రోమనులు సైతం పూజించేవారు.. ప్రాచీన కాలంలో రోమనులు సైతం ఈ ఉత్సవం జరిపేవారని చరిత్ర చెబుతోంది. ‘బ్రహ్మ వైవర్త పురాణం’ వసంత పంచమినాడే సరస్వతిని పూజించాలంటుంది. రతీదేవికి, కామదేవుడికి, వసంతుడికి పూజలు చేస్తారు. ముగ్గురూ ఒక్కరోజునే పూజలందుకుంటారు. వసంతోత్సవాల్ని వేర్వేరు పేర్లతో, పలు విధాలుగా ఆచరిస్తుంటారు. ఇది శీతకాలానికి, వేసవి కాలానికి సంధికాలం కావడంతో ప్రజలకు ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త పంటలు వచ్చే కాలం ఇది. పైగా పశువులకు గ్రాసం పుష్కలంగా లభించేది కూడా ఈ కాంలోనే. ఇక వసంత పంచమినాడే సరస్వతీ జయంతి కావడంతో, ఈ పర్వదినం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అక్షరానికి ఆమె అధిదేవత. ప్రణవ స్వరూపిణి, జ్ఞానానంద శక్తి, లౌకిక-అలౌకిక విజ్ఞాన ప్రదాయిని ఆమె. శ్రీవాణి కృప లేకుంటే, లోకానికి మనుగడే లేదు. వాగ్దేవి ఉపాసన వల్ల వాల్మీకి రామాయణ రచన చేశాడంటారు. శారద దీక్ష స్వీకరించి, వ్యాసుడు వేదవిభజన చేయగలిగాడంటారు. ఆదిశేషువు, బృహస్పతి, ఆదిశంకరులు, యాజ్ఞవల్క్యుడు వంటి ఎందరో శారదానుగ్రహం కారణంగా జ్ఞాన సంపన్నులయ్యారు. నాటి వ్యాసపురే నేటి బాసరగా.. వ్యాసుడు గోదావరీ తీరాన సైకతమూర్తి రూపంలో వాణిని ప్రతిష్ఠించాడని పురాణ కథనం. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, బాసరగా ప్రసిద్ధి చెందింది. సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. వసంత రుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి, శ్వేత వస్త్రాలంకృతగా హంస వాహినిగా తామర పుష్పం మీద కొలువుతీరి జ్ఞాన క్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధాశక్తి, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. అంత మహిమాన్వితమైన ఈ రోజునే చిన్నారులకు అక్షరాభ్యసం చేయిస్తే చక్కగా చదువుకుని వృద్ధిలోకి వస్తారని భక్తుల నమ్మకం. వేదాలు సరస్వతీ మాత నుంచే వెలువడ్డాయని ‘గాయత్రీ హృదయం’ గ్రంథం అభివర్ణించింది. సరస్వతీనది అంతర్ముఖీనమై గంగ యమునలతో కలిసి ‘త్రివేణి’ గా విరాజిల్లింది. దేశ విదేశాల్లో గీర్వాణి ఆరాధనలందుకుంటోంది. సరస్వతీదేవి వద్ద ఆయుధాలుండవు. అలాగే గ్రీకులు, రోమనులు ఆమెను జ్ఞానదేవతగా పూజించేవారు. వసంత పంచమిని విద్యారంభ దినంగా పరిగణిస్తారు. జ్ఞానశక్తికి అధిష్టాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలత్వాదుల్ని అనుగ్రహిస్తుందంటారు. సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసాదేవి. అమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీ దేవిని అహింసకు అధినాయికగా పేర్కొంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రితవరదాయినిగా దర్శనమిస్తుంది. సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి, శ్వేత వస్త్రాలంకృతగా హంస వాహినిగా తామర పుష్పం మీద కొలువుతీరి జ్ఞాన క్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంతరుతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త బ్రహ్మకు శారదే శక్తిదాయిని. అందువల్లే ఈ వసంత పంచమిని విద్యారంభ దినంగా పరిగణించారు మన పెద్దలు. (చదవండి: భవ్య రామమందిరంలోని బాలరాముడి కళ్లను వేటితో చెక్కారో తెలుసా!) -
‘ప్రామిస్ డే’ అంటే ఏమిటి? వాలంటైన్ వీక్లో దీని ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న ‘ప్రామిస్ డే’గా జరుపుకుంటారు. ఇది ప్రేమికుల వారంలో ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతి సంబంధానికి ఈ రోజు ప్రత్యేకమైనదే అయినప్పటికీ, ప్రేమికులకు ‘ప్రామిస్ డే’ ఎంతో ప్రాధాన్యత కలిగినది. ‘ప్రామిస్ డే’నాడు ప్రేమికులు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. బలహీనపడ్డ బంధాలకు తిరిగి ప్రాణం పోయవచ్చు. అయితే మీరు మీ భాగస్వామికి ఎలాంటి ప్రామిస్ చేయలి? ఈ విషయంలో ఎంత నిజాయితీగా వ్యవహరించాలి? అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన అనుబంధాల విషయంలో మీ ఇష్టాలు, అయిష్టాలను అవతలి వ్యక్తిపై ఎట్టిపరిస్థితుల్లోనూ రుద్దకూడదు. అలా కాదని మీకు నచ్చినట్లు వ్యవహరిస్తే క్రమంగా సంబంధం బలహీనపడుతుందని గుర్తించండి. మీరు నిజాయితీగా భాగస్వామిని ప్రేమిస్తే వారు ఎలా ఉన్నారో అలానే అంగీకరించండి. ఈ ప్రామిస్ డే నాడు హృదయ పూర్వకంగా భాగస్వామికి ఇటువంటి వాగ్దానం చేయండి. నాకోసం నువ్వు మారాలని ఏనాడూ కోరనని వాగ్దానం చేయండి. గతంలో ఏమి జరిగినా, వాటిని హృదయపూర్వకంగా అంగీకరించండి. మధురంగా మాట్లాడటం, బహుమతులు ఇవ్వడం ద్వారా ప్రేమికులు పరస్పరం ప్రపోజ్ చేసుకుంటారు. ప్రతి కష్టమైన మలుపులో తోడుగా ఉంటానని చెప్పుకుంటారు. ఈ హామీని ప్రతీ ఒక్కరూ నిలబెట్టుకోలేరు. అయితే దీనిని నిలబెట్టుకోవడంలోనే అసలైన ప్రామిస్కు అర్థం ఉంటుంది. అబద్ధం చెప్పే అలవాటు ఉంటే ఎలాంటి సంబంధమైనా కొద్దికాలానికే తెగిపోతుంది. అబద్ధాలు వినడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే వాటిని చాలామంది అలవోకగా మాట్లాడేస్తుంటారు. ప్రామిస్ డే నాడు మీ భాగస్వామితో జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని వాగ్దానం చేయండి. -
సంక్రాంతికి ముగ్గులు వేయడంలో దాగున్న ప్రాశస్త్యం ఏంటీ?
'సంక్రాంతి వచ్చింది తుమ్మెద' 'సరదాలు తెచ్చింది తుమ్మెదా'.. అన్న పాటలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడ ఉన్నవాళ్లు కష్టపడి మరి తమ సొంతూళ్లకి వచ్చేస్తారు. ఎంత ఖర్చు పెట్టి అయినా పండుగకి ఊరు వెళ్లి పోవాల్సిందే. అక్కడ ఉండే సందడే వేరు. ముఖ్యంగా కోడిపందాలు, పిండి వంటలతో ఊరు ఊరంతా సందడి సందిడిగా ఉంటుంది. ఈ పండుగల్లో మంచి ఆకర్షణగా కనిపించేవి ముగ్గులు. వచ్చిరాని పడుచులు సైతం ఏదో రకంగా ముగ్గు వేసి శభాష్ అనిపించుకోవాలని తెగ ఆరాట పడిపోతుంటారు. అసలు ఈ నాలుగు రోజుల పండుగల్లో కచ్చితంగా రకరకాల రంగవల్లులతో ముగ్గులు పెడతారు ఎందుకని? దీని వెనుక దాగున్న రహస్యం ఏంటీ? వాస్తవానికి సాధారణ రోజుల్లో కూడా ఇంటి ముందు ముగ్గులు వేస్తాం. ఇలా ముగ్గులతో వాకిళ్లను అందంగా అలంకరిస్తే ఇంటికి శ్రేయస్సును తెస్తాయని పెద్దల నమ్మకం. పైగా లక్ష్మీ దేవిని ముచ్చటపడి ఇంట్లోకి వస్తుందని, ఆమె అనుగ్రహం లభిస్తుందని పురాణ వచనం. ముగ్గు ప్రాముఖ్యత.. హిందూసంప్రదాయంలో ముగ్గులకు అధిక ప్రాధాన్యం ఉంది. ముగ్గులు వేయడానికి ఎంతో చారిత్రక సంబంధం కూడా ఉంది. ముగ్గుల్లో తామర పువ్వు, పూల ఆకారాలు, నెమళ్లు, మామిడి పండ్లు, చేపల చిహ్నాలు ఎక్కువగా ఉంటాయి. రంగురంగుల ముగ్గులను చూసినప్పుడు ప్రశాంతత, దైవిక శక్తుల ఉనికిని అనుభవిస్తారు. ఇంట్లోకి దేవతలను స్వాగతించడానికి, ప్రజలను ఆశీర్వదించడానికి దేవతల చిత్రాలను, లక్ష్మీ దేవి పాద చిహ్నాలను గీస్తారు. అలాగే అతిథులను స్వాగతించడానికి కూడా ఇలా ముగ్గులు వేస్తారు. అయితే చరిత్ర మాత్రం చెడున అరికట్టి మంచి చేకూరాలనే ఉద్దేశ్యంతో తెల్లటి బియ్యపిండితో ముగ్గు వేస్తారని చెబుతోంది. ఇది శరీరానికి మంచి ఫిట్నెస్ లాంటిది కూడా.. ఓర్పును నేర్పే కళ… ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్ల ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి. భోగి నాడు వేసే ముగ్గు ఇష్టంతో కూడిన కష్టం! పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు. శాస్త్రీయ కారణాలు.. చుక్కలను కలిపే వక్ర నమూనాలు విశ్వంలోని అనంతమైన స్వభావాన్ని సూచిస్తాయి. ఇటువంటి నమూనాలు ధ్వని వేవ్ హార్మోనిక్స్ను పోలి ఉంటాయి. వీటిని చూస్తే డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో సహా అనేక రుగ్మతలు దరిచేరకుండా మనసు ఆహ్లాదభరితంగా ప్రశాంతంగా ఉంటుంది. తెలియకుండానే మనసులో ఓ ఆధ్యాత్మకి భావన వస్తుంది. విశ్వకవి రవీంద్రుడు సైతం ముగ్గు గురించి ప్రస్తావించారు! అంతేకాదండోయ్ రవీంద్రనాథ్ ఠాగోర్ 1919 లో రాసిన 'బంగ్లర్ బ్రత' అనే పుస్తకంలో వ్రతం, పూజ విధానాలలో 'అల్పన' (ముగ్గు) గురించి ప్రస్తావించారు. లక్ష్మీకాంత్ ఝా అరిపన్' మిథిల జానపద సంస్కృతి గురించి రాసిన రచనలలో రంగోలి ప్రస్తావన తెచ్చారు. ఇక ఈ ముగ్గులు వేయడం అనేది కేవలం దక్షిణాదికే పరిమితం కాదని భారతదేశం అంతటా ఈ ముగ్గులు వేయడం అనేది వారి సంస్కృతిలో భాగం అని పరిశోధకులు కూడా పేర్కొన్నారు. అంతేగాదు కామశాస్త్రంలో ప్రస్తావించిన 64 కళల్లో నృత్యం, సంగీతం, తలపాగాలు చుట్టడం, పూల మాలలు అల్లడం, వంటలు, అల్లికలతో పాటు ముగ్గులు వేయడాన్ని కూడా ఒక కళగా పేర్కొన్నారని చెప్పారు. అంతటి ప్రాశస్యం గల ఈ ముగ్గులను రకరకాల రంగవల్లులతో తీర్చిదిద్ది కలర్ఫుల్గా జోయ్ఫుల్ చేసుకోండి ఈ సంక్రాంతి పండుగని. (చదవండి: భోగి రోజే గోదా కళ్యాణం.. చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు?) . -
సంక్రాంతిని 'పెద్ద పండుగ' అని ఎందుకు పిలుస్తారు?
భోగభాగ్యల భోగి పండుగను చిన్నా పెద్ద అంతా ఆనందంగా జరుపుకున్నారు. ఇక తరువాత రోజే అసలైన పండుగ 'సంక్రాంతి'. ఈ పండుగ రోజు ఉండే హడావిడి అంతా ఇంత కాదు. పైగా ఈ పండుగను పెద్దల పండుగ లేదా పెద్ద పంగ అని అంటారు. ఈ రోజు నవ్వులతో చేసిన వంటకాలను తప్పకుండా తింటారు. నాలుగు రోజులు పండుగల్లో ఈ సంక్రాంతి మాత్రమే ఎలా పెద్ద పండుగ అయ్యింది?. ఇన్ని సంక్రమణాలు ఉండగా ఈ సంక్రమణానికి ఎందుకంత విశిష్టత? నెలకు ఒక రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం కలిపి 12 రాశుల్లో సంచరిస్తాడు. రాశిమారిన ప్రతిసారీ సంక్రమణం అంటారు. కానీ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు. అదే సంక్రాంతి పండుగ. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన అధ్యాయం మొదలు కాబోతుందనే దానికి సంకేతం. అలాగే దక్షిణదిక్కువైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తరదిక్కులో సంచరిస్తుంటాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. ఈ సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. సంక్రాంతి ఎలా పెద్ద పండుగంటే.. సంక్రాంతి పండుగ సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు. ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకుని తినరు. ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు. అందుకే ఆ బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు తయారు చేస్తారు. ఇలా చేస్తే పిండివంటలు చేసుకున్నట్లు కూడా ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ పొంగల్ అని పిలుస్తారు. పంట చేతికందించిన దేవుడికి ధన్యవాదాలు తెలిపేందుకు ఇలా నైవేద్యం సమర్పిస్తారు. ఈ పండుగలో ముఖ్యంగా ప్రకృతిని పూజించడంతోపాటు పశువులను కూడా పూజిస్తుంటారు. అలాగే సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా ప్రతి పదార్థంలో నువ్వులు ఉంటాయి. సూర్య భగవానుడికి సమర్పించే నీటిలోనూ నువ్వులు వేస్తారు. సంక్రాంతి సమయంలో నువ్వుల వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు అప్పటి వరకు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. దీని వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటి నుంచి తట్టుకునేలా శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు నువ్వులను కచ్చితంగా తీసుకోవాలని మన పెద్దలు నియమం ఏర్పాటు చేశారు. ఈ రోజునే పెద్దలకు తర్పణాలు.. సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణాలు వదలడం తప్పనిసరిగా చేస్తారు. ఉత్తరాయణ కాలం మొదలైన ఆరోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని పితృదేవతలకి స్వర్గ ప్రాప్తి లభించడం కోసం ఇలా చేస్తారు. ఈరోజు పెద్దలని స్మరించుకుంటూ వారిని సంతోష పెట్టే విధంగా వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఇది పెద్దల పండుగ లేదా పెద్దల పండుగ అయ్యింది. కొత్త అల్లుళ్ల సందడి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకం. కొత్తగా పెళ్ళైన కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచి తమ ఆతిధ్యంతో ఔరా! అనిపిస్తారు. కొత్త అల్లుళ్ల రాకతో ఇల్లు కళకళాడిపోతాయి. మరదళ్ళు బావలని సరదాగా ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక మహిళలు ఇళ్ల ముందు పెద్ద పెద్ద రంగవల్లులు వేసి మురిసిపోతారు. గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ పాటలు పాడుకుంటూ డాన్స్ వేస్తారు. పల్లెటూరులో అయితే ఏ వీధిలో చూసినా కన్నె పిల్లలు పరికిణీలు కట్టి పూల జడలు వేసుకుని అందంగా ముస్తాబై తిరుగుతూ సందడి చేస్తారు. కోడి పందేలు, ఎడ్ల పోటీలు.. గోదావరి జిల్లాల్లో కోడిపందేలతో ఫుల్ జోష్తో పండుగ జరుగుతుంది. వీటిని చూసేందుకు దూరప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తారు. పూర్వకాలంలో దీన్ని యుద్ధనీతిని గెలిపించే పందెంగా భావించేవారు. అంతేగాదు ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారట. ఆ తర్వాత అదే కాలక్రమేణ ఓ సరదా జూదంలా మారింది. ఈ పండుగ రోజు కొన్ని ప్రాంతాల్లో ఈ కోడిపందేలు కచ్చితంగా జరుగుతాయి. మరికొన్ని చోట్ల ఈ రోజు ఎండ్ల పోటీలు నిర్వహిస్తారు. గాలిపటాలు ఎగరువేసేది కూడా. కొన్ని చోట్ల ఈ సంక్రాంతి పండుగను పతంగులు పండుగగా జరుపుకుంటారు. ఆ రోజు చిన్నా పెద్దా అని తేడా లేకుండా గాలి పటాలు ఎగరేస్తూ ఆనందిస్తారు. దీంతో ఆకాశంలో రంగు రంగుల గాలి పటాలు ఎగురుతూ కనువిందు చేస్తాయి. మరీ ఇన్ని విశేషాలు ఉన్న సంక్రాంతి పెద్ద పండగే కదా! -
ప్రపంచ చీరల దినోత్సవం! 'చీర' అందమే అందం!
'చీర' అంటే అందం, ఆనందం. అలాంటి 'చీర' కేవలం సౌందర్యాన్ని పెంచే ఓ వస్త్రమే కాదు...భారతీయ సంస్కృతికి చిహ్నం కూడా. అందుకే అతివల దుస్తుల వరుసలో చీర ఎప్పుడూ ముందుంటుంది. ‘నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా...ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ’ అన్నాడో కవి. పట్టు చీరే కాదు...పట్టుమని వంద రూపాయలు చేయని చీరలో కూడా మగువ అందం మూడింతలవుతుంది. దక్షిణాది కంజీవరం నుంచి బెంగాల్ వారి బలుచరి వరకు... సెలెబ్రిటీలు కట్టే ఫ్యాన్సీ చీరల నుంచి పల్లె పడుచులు కట్టే నేత చీర వరకూ...చీర చీరకూ అందమే.కట్టిన ప్రతి పడతిలోనూ సౌందర్యమే. అందుకే కాబోలు సినీతారలు సైతం చీరను చిన్నచూపు చూడరు. అలాంటి గొప్ప ప్రత్యేకతను దక్కించుకున్న చీర కోసం ఓ రోజుని ప్రత్యేకంగా కేటాయించి మరీ చీర అందాన్ని తెలియజేసేలా ప్రపంచ చీర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది దీన్ని డిసెంబర్ 21న ఘనంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఎలా వచ్చింది? ఎందుకు జరుపుకుంటున్నాం తదితరాల గురించే ఈ కథనం!. 'చీర' అనే పదం ఎలా వచ్చిందంటే.. సంస్కృతంలో "చీర" అనే పదానికి "వస్తానికి సంబంధించిన స్ట్రిప్(చిన్న ముక్క)" అని అర్ధం. కానీ సహస్రాబ్దాలుగా పట్టు, దూది లేదా నారతో ధరించే భారతీయ స్త్రీలకు, పురుషులకు ఈ వస్త్రాలు కేవలం సాధారణ వస్త్రాలు మాత్రం కాదు. వాటిని వారు ఎంతో విలువైన వాటిగా చూస్తుంటారు. ఆ చీరతో ముడిపడి ఉన్న బంధాలు, జ్ఞాపకాలు వారి కళ్ల ముందు కదలాడుతుంటాయి. ఈ దినోత్సవం ఎలా ఏర్పడింది..? 2020లో ఫ్యాషన్ ప్రియులు సింధూర కవిటి, నిస్తుల హెబ్బార్ అధికారిక 'వరల్డ్ చీర దినోత్సవం' ఉద్యమాన్ని ప్రారంభించారు. వారు దీని గురించి ఒక ప్రత్యేక తేదీని (డిసెంబర్ 21వ తేదీ)ని సూచించారు. మన దేశ సరిహద్దులు దాటి చీరకు సంబంధించిన సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు. ఇక ఈ చీరలు లేకుంటే ప్రపంచం రంగుల మయం కాదు. చాలా ఏళ్ల నుంచి భారతీయ సంస్కృతిలో ఈ చీరలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అలాగే ఫ్యాషన్ పరంగా కూడా ఈ చీరలే అగ్రస్థానంలో ఉన్నాయి. సౌలభ్య పరంగానే కాకుండా ఆకట్టుకునే స్థాయిలో చీరదే తొలిస్థానం. ఏ పండుగైన ఒక్క చీరతో సంప్రదాయం ఉట్టిపడి నిండుదనం తీసుకురావడమే గాక అలనాటి రోజుల్లోకి తీసుకుపోతుంది. ఎందుకు జరుపుకుంటున్నాం అంటే.. ఈ పండుగ ప్రధానా ఉద్దేశ్యం వీటిని ఎంతోకష్టపడి తయారు చేసే కార్మికుల నైపుణ్యాన్ని గుర్తించడమే గాక ఎప్పటికప్పుడూ వైవిద్యాన్ని ప్రదర్శిస్తూ సరికొత్తచీరలను మన ముందుకు తీసుకొస్తున్న వారి కళ నైపుణ్యతను కొనియాడాల్సిందే. కనీసం ఈ సందర్భంగానైనా..ఒక చీర కోసం కార్మికులు పడే శ్రమ, ఎంతలా ఓపికతో చేస్తే ఓ చీర మన ముందుకొస్తుందో కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దాని గొప్పదనాన్ని గుర్తించాలి. వేల ఏళ్ల నాటి నుంచి ఉన్న మహిళల అవసరాలకు తగ్గట్టుగా ఆ చీరలో మార్పులు సంతరించుకుంటూ తన క్రేజ్ని చాటుకుంటూనే వచ్చింది. ఎన్ని రకాల ఫ్యాషన్ డ్రస్లు వచ్చినా చీర అందం ముందు బలదూర్ అని ఫ్రూవ్ చేసుకుంది. ఆధునికంగా 'చీర కట్టు' విధానం.. నిజానికి భారతదేశంలో చీర బ్లౌజ్ లేకుండా ధరించేవారు. కనీసం శారీ పెట్టికోట్లు ఉండేవి కావు. అయితే చీర మాత్రం ఓ మోస్తారు మందంతో ఉండి, మోకాలి వరకు ధరించేవారు. అయితే ఆ చీరతో బయటకు రావడం కాస్త ఇబ్బందిగా ఉండేది కూడా. అయితే ఆ రోజుల్లో మహిళలు రావడం కూడా అరుదు కావడంతో అలానే చీరలు ధరించేవారు. ఆ తర్వాత నెమ్మదిగా మార్పులు రావడం, మహిళలకు కూడా బటయకు రావడం జరిగింది. వారు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేయడంతో చీర ఆహార్యంలో మార్పులు వచ్చాయి. సౌలభ్యంగా ధరించేలా చీరలో కాలనుగుణంగా పలుమార్పులు వచ్చాయి. అయితే ఆధునికంగా చీర కట్టుకునే విధానం మాత్రం ఠాగూర్ కుటుంబం నుంచే వచ్చిందిన చెబుతున్నారు ప్రొఫెసర్-రచయిత జస్వీందర్ కౌర్. ఆయన భారతీయ వస్త్రధారణలో ఎలా కాలనుగుణంగా మార్పులు వస్తూ అభివృద్ధి సాధించిందే పంచుకుంటూ ఆదునిక చీర కట్లు విధానం గురించి మాట్లాడారు. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబసభ్యలచే ప్రాచుర్యం పొందిందని చెప్పారు. అందుకు సంబంధించిన ఓ ఆసక్తికర కథనాన్ని కూడా పంచుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కోడలు జ్ఞానదానందిని దేవి ద్వారా ఆధునిక చీర కట్టు విధానం ప్రాచుర్యం పొందిందని చెప్పుకొచ్చారు. ఠాగూర్ సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్ భాతర సివిల్ సర్వీస్ చేరిన తొలి భారతీయుడు. ఆ టైంలో భారతీయ స్త్రీలు ధరించే చీర విధానంతో బయటకు రావడం కాస్త ఇబ్బందిగా ఉండేది. దీన్ని ఆమె ఠాగూర్ విశ్వభారతి పత్రికలో కూడా ప్రస్తావించారు. అయితే కోల్కతాలో వైస్రాయి రిసెప్షన్లో సత్యేంద్రనాథ్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమె తక్షణమే వెళ్లాల్సిన పరిస్థితి అయితే అప్పుడే ఆమె హుందాగా ఆధునికంగా కొత్త పద్ధతిలో(బ్లౌజ్తో తలపై ముసుగు వేసుకుని) ధరించి వెళ్లారు. అప్పటి నుంచే అందరూ దీన్ని అనుసరించనట్లుగా ఓ ఆసక్తికర కథనాన్ని జస్వీందర్ వెల్లడించారు. అందుకే కోసం ఎన్ని రకాల విచిత్ర వస్త్రధారణ వచ్చిన చీర ధరించడం కనుమరుగవ్వలేదు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా తన క్రేజ్ని చాటుకుంటునే ఉంది. (చదవండి: డయానా ధరించిన డ్రెస్ ధర ఏకంగా రూ. 9 కోట్లు! మరోసారి రికార్డు స్థాయిలో..) -
ధనుర్మాసంలో ఇలా చేస్తే నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుందట!
సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని ‘పండుగ నెలపట్టడం’ అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు. భోగితో ముగుస్తుంది: సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్) మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి , స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు , పూజలు , జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు , వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం. శ్రీకృష్ణుడికి తులసిమాల ప్రతి రోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు , నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా: ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు , పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చనీ , నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి , తిరుప్పావై గాన , శ్రవణం చేసిన వారికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ , ఆశిద్దాం. ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ? ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం , దద్దోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం , జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి. కోరికలు నెరవేరుతాయి వివాహం కాని , మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాధుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది. గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ , పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్ర్తీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది. పాశురములు చదివేటప్పుడు.. మొదటి పాశురము రెండు సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి. అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడి గా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను , చివరపాశురంలో ఒక లైను చదవాలి. చివరగా గోదా హారతి చదవాలి. మంత్ర పుష్పం కూడా చదవాలి. మళ్ళి ఏ రోజు పాశురం ఆ రోజు రెండు సార్లు చదివి హారతి ఇవ్వాలి. నైవేద్యం సమర్పంచాలి (రోజు పొంగలి , దద్ధోజనం , పరవాన్నం) ఉండి తీరాలి. టైమ్ ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే నియమం కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి , పొంగలి ముఖ్య నైవేద్యం కుదిరితే అది పెట్టండి కుదరని వాళ్ళు పండ్లు , పాలు పెట్టి చేసుకోండి , భక్తి ముఖ్యం* -
దిలీపుడికి మాఘ మహిమ తెలిపిన విప్రుడు
ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడికి పూర్వీకుడైన దిలీప మహారాజు ఒకసారి మృగయా వినోదం కోసం సపరివారంగా అడవికి వెళ్లాడు. క్రూరమృగాలను వేటాడుతూ కొన్ని రోజులు అడవిలోనే గడిపాడు. దిలీపుడు, ఆయన పరివారం అడవిలోని క్రూరమృగాలను వేటాడుతూ ముందుకు సాగుతున్నారు. నట్టడవిలో నీరు లేక మహారాజు దిలీపుడు సహా ఆయన పరివారానికి గొంతెండిపోయే పరిస్థితి ఏర్పడింది. వేటకు కొద్దిసేపు విరామమిచ్చి, పరివారమంతా జలాన్వేషణలో పడ్డారు. కొద్ది దూరం ముందుకు వెళ్లి చూడగా, అక్కడ ఒక సరోవరం కనిపించింది. భటులు తామరాకులను దొన్నెలుగా చేసి, వాటిలో నీరు సేకరించి దిలీప మహారాజుకు అందించారు. పరివారంలోని భటులు కూడా సరోవరంలోని నీరు తాగి సేదదీరారు. తర్వాత మరికాసేపు వేట కొనసాగించారు.అడవిలో క్రూరమృగాల సంచారం దాదాపుగా కనుమరుగైపోవడంతో దిలీపుడు ఇక వేట చాలించి, రాజధానికి వెళదామన్నాడు. పరివారానికి పురమాయించి, అప్పటి వరకు వేటాడిన మృగాల చర్మాలను ఒలిపించి, వాటిని రథాల మీదకు చేర్పించాడు. అందరూ తిరుగు ప్రయాణం ప్రారంభించారు. దిలీపుడు, ఆయన పరివారం అడవిలో తిరుగు ప్రయాణం సాగిస్తుండగా, తోవలో బ్రహ్మతేజస్సుతో వెలుగొందుతున్న ఒక విప్రుడు ఎదురయ్యాడు. ఆయనను చూడగానే, దిలీపుడు తన భద్రగజం పైనుంచి కిందకు దిగి, ఆ విప్రుడికి నమస్కరించాడు. విప్రుడు ఆశీర్వచనం పలికాడు. ఆయన దిలీప మహారాజు ముఖాన్ని పరికించి, ‘ఈ మహారాజు గుణవంతుడిలా ఉన్నాడు. ఇతనికి ఏదైనా మేలు చేయాలి’ అని తలచాడు. ‘మహారాజా! శుభప్రదమైన ఈ మాఘమాసంలో సరోవరం వరకు వెళ్లి కూడా నువ్వు, నీ పరివారం స్నానం చేయకుండా తిరుగుముఖం పడుతున్నారేం? మాఘ మహాత్మ్యం నీకు తెలియదా?’ అని ప్రశ్నించాడు.‘విప్రోత్తమా! కొద్దిరోజులుగా వేట సాగిస్తూ అడవిలోనే ఉండిపోయాం. మాఘమాస ఆగమనం గురించి బహుశా పురోహితులు చెప్పే ఉంటారు. నేను మరచి ఉంటాను. మన్నించండి. దయచేసి, నాకు మాఘ మహాత్మ్యాన్ని వివరించండి’ అని వినయంగా అడిగాడు దిలీపుడు. ‘మహారాజా! మీ కులగురువైన వశిష్ఠులవారు తరచు నీ వద్దకు వస్తూనే ఉంటారు కదా, ఆయన వద్ద మాఘ మహాత్మ్యం గురించి తెలుసుకో. ఇప్పుడు నేను సంధ్యవార్చుకోవడానికి పోతున్నాను’ అని చెప్పాడు విప్రుడు.రాజధానికి చేరుకున్న దిలీపుడు మర్నాడు వేకువనే నిద్రలేచి, స్నానాదికాలు కావించుకుని, కొద్దిమంది పరివారంతో వశిష్ఠాశ్రమానికి చేరుకున్నాడు. కుశల ప్రశ్నలయ్యాక, ‘మహర్షీ! ఒక విప్రుని ద్వారా మాఘ మహాత్మ్యాన్ని గురించి విన్నాను. మీ వద్ద ఎన్నో పురాణేతిహాసాలు తెలుసుకున్నాను. ఇప్పుడు మాఘ మహాత్మ్యాన్ని తెలుసుకోవాలని వచ్చాను. దయచేసి ఎరుకపరచగలరు’ అని కోరాడు. ‘దిలీపా! మాఘ మహాత్మ్యాన్ని వర్ణించడం నిజానికి నాకు కూడా సాధ్యం కాదు. నీకు సులభగ్రాహ్యంగా ఉండేలా మాఘ మహాత్మ్యాన్ని చెబుతాను. ముందుగా వ్యాఘ్రముఖుడైన గంధర్వుని కథ చెబుతాను విను’ అంటూ ఇలా చెప్పాడు: వింధ్యపర్వత ప్రాంతంలోను, రేవా నదీ పరివాహక పరిసరాల్లోను ఒకసారి తీవ్రమైన కరవు ఏర్పడింది. భృగు మహర్షి అంతటి వాడు కూడా ఆ కరవును తట్టుకోలేక అక్కడి నుంచి హిమాలయాలకు చేరుకున్నాడు. కైలాస పర్వతానికి సమీపంలోని ఒక కొండ మీద ఆయన తపస్సు చేసుకోసాగాడు.ఒకనాడు భృగు మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటుండగా, ఒక గంధర్వుడు భార్యాసమేతుడై వచ్చాడు. అతడు వ్యాఘ్రముఖుడు. భృగుమహర్షికి నమస్కరించి, అతడు తన దీనగాథను వినిపించాడు.‘మహర్షీ! నాకు ఈ పులిముఖం ఎందుకు కలిగిందో తెలియడం లేదు. నా భార్య రూపవతి, గుణవతి, మహాసాధ్వి. నా వికృతరూపం కారణంగా నాతో పాటు ఆమె కూడా అంతులేని మనోవ్యధ అనుభవిస్తోంది. తపస్సంపన్నులైన మీరే నా కష్టాన్ని తీర్చగలరు’ అని ప్రాధేయపడ్డాడు.‘నాయనా! పాపం, దారిద్య్రం, దురదృష్టం మనుషులను పీడిస్తాయి. వీటిని నివృత్తి చేసుకోవాలంటే, అందుకు మాఘస్నానమే తగిన తరుణోపాయం. అదృష్టవశాత్తు ఇది మాఘమాసం. వెంటనే నువ్వు భార్యా సమేతంగా నిష్ఠగా భక్తిశ్రద్ధలతో మాఘస్నానం ఆచరించు. నీ మనోవాంఛ తప్పక నెరవేరుతుంది’ అని ధైర్యం చెప్పాడు భృగు మహర్షి. మహర్షి వాక్కుపై నమ్మకంతో ఆ గంధర్వుడు సమీపంలోనే పర్వతం నుంచి ప్రవహిస్తున్న నదిలో భార్యా సమేతంగా స్నానమాచరించాడు. స్నానం ముగించి ఒడ్డుకు రాగానే, గంధర్వుడికి వికృతమైన పులిముఖం మాయమై, అందమైన మానవ యువకుడి ముఖం వచ్చింది. ఆశ్చర్యకరమైన ఈ మార్పుతో గంధర్వ దంపతుల ఆనందానికి అవధులు లేకపోయాయి. వారిద్దరూ హుటాహుటిన భృగు మహర్షి చెంతకు చేరుకుని, ఆయన పాదాల మీద పడ్డారు. ‘మహర్షీ! ఎంతో దుష్కరమైన బాధ నుంచి మమ్మల్ని సునాయాసంగా గట్టెక్కించారు. మీ మేలు జన్మజన్మలకు మరువలేము’ అంటూ ఆయనను వేనోళ్ల స్తుతించారు. భృగు మహర్షి వారిని ఆశీర్వదించి సాగనంపాడు. -సాంఖ్యాయన -
సందేశాత్మకం నవరాత్రి అలంకరణం
త్రేతాయుగం, ద్వాపరయుగం...ఇలా ఏ కాలంలోనైనా, ఏ అంశంలోనైనా స్త్రీని అత్యున్నత స్థానంలో ఉంచి గౌరవించారు. ఆమెను తొలిగురువుగా, ఆది శక్తిగా భావించి ఆరాధించారు. మన పురాణాలను కూలంకషంగా పరిశీలించినట్లైతే ఈ విషయం మనకు అవగతమౌతుంది. భారతావని అంతటా వైభవోపేతంగా జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల్లోనూ అమ్మవారిదే వైభోగమంతా. ఆ జగన్మాతని ఆరాధించేందుకే ఈ మహా శరన్నవరాత్రి సంరంభమంతా... విజయదశమి....పదిరోజుల పండుగ...మనిషిలో దాగిన లోభం, అలసత్వం, జడత్వం, దురాశ, పాప–చింతనలాంటి వికారాలను నశింపచేసి, సాత్వికప్రవృత్తి వైపు నడిపిస్తుంది. మనలోని శక్తిని జాగృతం చేసి శుభసంకల్పాలకు నాంది పలికి చైతన్యం వైపుగా నడిపిస్తుంది. విజయదశమి–నవరాత్రి–దుర్గాపూజ...అన్ని శబ్దాలకూ ఒకటే అర్థం....తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాలుగా భావిస్తూ ఆ జగన్మాతని పూజించుకోవటం. అసలు దసరా పండుగను తొమ్మిది రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు, అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఎందుకు కొలుస్తారు, దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి తెలుసుకుందాం. త్రిపురసుందరి, త్రిపురేశ్వరి, పరమేశ్వరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి వంటి అనేక నామాలతో పూజలందుకుంటున్న లలితాదేవి అఖిలాండకోటి బ్రహ్మాండాలకు జనని. పిపీలికాది బ్రహ్మపర్యంతమూ సకల జీవకోటికీ మాతృదేవత. తన బిడ్డలుగా భావించిన ప్రజలను పట్టి పీడిస్తున్న భండాసురుడనే రాక్షసుడినీ, వాడి ముప్ఫైమంది సంతతినీ, వారి సైన్యాన్నీ ఆదిశక్తి అవలీలగా వధించింది. అలాగే చండాసురుడు, ముండాసురుడు, మహిషాసురుడు అనే లోకకంటకులైన రాక్షసులను సంహరించి, చతుర్దశ భువనాలకూ శాంతిని ప్రసాదించింది. అందుకు ప్రతీకగా జరుపుకుంటున్నవే దసరా ఉత్సవాలు. దశహరా అంటే పది రకాల పాపాలను నశింపజేసేవని అర్థం. అదే క్రమేణా దసరాగా మారింది. విజయదశమి – వివిధ కారణాలు ఆయా రాక్షసులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు జరుపుకునే పండుగే విజయదశమి. ఇవి గాక విజయదశమి జరుపుకోవడానికి మరికొన్ని కారణాలున్నాయి. మహర్నవమినాడు శ్రీరామచంద్రుడు దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దుర్గాదేవి మహిషారుని సంహరించిన రోజని, అజ్ఞాతవాస పరిసమాప్తి కాగానే విజయుడు (అర్జునుడు) ఉత్తర గోగ్రహణం చేసి విజయం సాధించిన రోజని మరో గా«థ ఉంది. ఐకమత్యమే ఆయుధ బలం ఎంతటి దైవమైనా రాక్షసులను సంహరించాలంటే ఒక్కరి వల్లే కాదు. ఎందుకంటే రాక్షసులు కూడ తపశ్శక్తి సంపన్నులే! కాని వారి లక్షణాలు మాత్రం సరైనవి కావు. అందుకే ఆ తల్లి ఈశ్వరుడి నుంచి త్రిశూలాన్ని, కుమారస్వామినుంచి శక్తి ఆయుధాన్ని, వినాయకుడి నుంచి విఘ్న నివారణ ఆయుధాన్ని, విష్ణువు నుంచి చక్రాయుధాన్ని, ఇంద్రుని నుంచి వజ్రాయుధాన్ని, విశ్వకర్మనుంచి డాలుని, అగ్నిదేవుని నుంచి ఆగ్నేయాస్త్రాన్ని, యుముని నుండి పాశాన్ని, వరుణుని నుంచి వారుణాస్త్రాన్ని, వీటన్నింటినీ కూడగట్టుకోవడానికి కుబేరుని నుంచి ధనరాశులతో నిండిన కుండను, దానితోబాటు వారందరి బలాన్ని కూడగట్టుకుని యుద్ధంచేసి విజయం సాధించింది. సమష్టి బలం దీనిని బట్టి మనం తెలుసుకోవలసినదేమంటే ఏ ఒక్కరూ విడిగా చేయలేని పనిని ఐకమత్యంగా ఉండి, అందరి శక్తినీ ఒక్కచోట చేర్చితే ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించగలం. విజయదశమి పండుగ మనకు సమైక్యతతో ఉండవలసిన ఆవశ్యకతను, స్త్రీ శక్తి ప్రాధాన్యతనూ చాటి చెబుతోందన్నమాట. అందరి మొరలూ ఆలకించే అసలైన అమ్మ మన మనస్సులోని తలంపులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు అమ్మ ప్రసన్నవదనంతోనూ, కలుషితంగా ఉన్నప్పుడు అమ్మ భయంకరాకారంలోనూ కనిపిస్తుంది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మను పూజిస్తే ఐహిక, ఆముష్మిక ఫలితాలు కలుగుతాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. లౌకిక బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాధి పీడితులకు ఆరోగ్యం చేకూరుతుంది. చిత్తస్థై్థర్యం, శత్రు విజయం చేకూరతాయి. ఒక్కరోజు పూజతో సంవత్సర ఫలం దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు మూడు రోజులు, మూడురోజులు కూడా కుదరని వారు కనీసం చివరి రోజయిన విజయ దశమినాడు ఒక్కరోజయినా సరే ఆ దివ్యమంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా అమ్మను దర్శించుకుని పూజ చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఇక విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. జమ్మిని పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులను అందుకోవాలి. శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్షం కనక ధారలు కురిపిస్తుందనే విశ్వాసం, శమీవృక్ష నీడ, శమీవృక్షపు గాలులు అన్నీ విజయ సోపానాలకు దారితీస్తాయనే నమ్మకం అనాదిగా ఉంది. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాయడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్త్రాలను జమ్మిచెట్టుపైనే దాచారు. మహిషాసురమర్దిని: సర్వదేవతల తేజస్సుల కలయిక అయిన ఆదిశక్తి మహిషాసుర మర్దిని. ఆశ్వయుజ శుద్ధ నవమిరోజున మహిషాసురుడిని సంహరించింది కనుక మహర్నవమినాడు అమ్మకు ఆ అలంకరణ చేస్తారు. సింహవాహన అయిన మహిషాసురమర్దిని నేటి పర్వదినాన ఉగ్రరూపంలోగాక శాంతమూర్తిగా దర్శనమివ్వడం విశేషం. మహిషాసురమర్దిని అలంకార ంలో అమ్మను దర్శించుకోవడం వల్ల సకల శుభాలూ చేకూరడమేగాక పిశాచబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీరాజరాజేశ్వరి: లోకశుభంకరి, అపరాజితాదేవి అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి దసరా ఉత్సవాల ముగింపు రోజయిన విజయదశమినాడు భక్తులకు చెరకుగడతో, అభయముద్రతో, ఆర్తితో పిలవగానే వచ్చే పాపగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ అవతారాన్ని దర్శించడం వల్ల సర్వకార్యానుకూలత, దిగ్విజయ ప్రాప్తి కలుగుతాయి. దుష్టరాక్షసులయిన రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను తయారు చేసి టపాసులతో పేల్చేయడమో లేదా దహనం చేయడమో ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు. దీనికే రామలీల అని పేరు. తెలంగాణ ప్రాంతం నవరాత్రులలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యమిస్తే, విజయనగరంలో పైడితల్లి వేడుకలు జరుపుతారు. ఆంధ్రప్రాంతంలోని పల్లెలలో ‘శమీశమయితే పాపం శమీ శత్రువినాశనం, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’ అంటూ శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. తెలంగాణలో జమ్మి ఆకును తీసుకు వచ్చి, జమ్మి బంగారాన్ని అందరికీ పంచి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, పెద్దలకు జమ్మిని ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం ఒక వేడుకగా జరుగుతుంది. పెద్ద పెద్ద సంస్థలలోనూ, కర్మాగారాలలోనూ యంత్రాలను పూజిస్తారు. బాక్స్ దుర్గానవరాత్రులో ఆఖరి అవతారం శ్రీరాజరాజేశ్వరి. భక్తులకు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఙ్ఞానశక్తిని ప్రసాదించే అవతారం శ్రీరాజరాజేశ్వరి. ఏ దేవి రూపమైనా, ఏ శక్తి రూపమైనా అన్నిటికి మూలమైన శక్తి పరమేశ్వరి. ఈరోజు లలితా సహస్రనామ పారాయణతో పూజించాలి. చేమంతులతో ఆరాధన చేయాలి. భక్ష్య, భోజ్యాలతో మహానివేదన చేయాలి. ఈ రోజున అశ్వపూజ, ఆయుధపూజ, ఉఛ్చైశ్రవ పూజ, వాహన పూజ నిర్వహిస్తారు. శ్రీరాముడు విజయదశమి రోజున ‘అపరాజితాదేవిని’ పూజించి రావణునిపై విజయాన్ని సాధించాడు. నవరాత్రుల అనంతరం దశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయంలో శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని స్మరిస్తారు. ‘‘శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శినీ’’ ఈ మంత్రంతో తమ తమ గోత్రనామాలు చెప్పుకుని జమ్మి వృక్షాన్ని పూజ చేసి మూడు ప్రదక్షిణలు చేస్తారు. శ్రీరాముడు దశకంఠుని సంహరించిన రోజు గనుక ‘దశహర’ అని కూడా పిలువబడుతోంది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని సంపాదించినది కూడా దశమి రోజునే. తిథి, వార, నక్షత్ర గణన లేకుండా విజయదశమి రోజున చేపట్టిన సకల కార్యాలు విజయం పొందుతాయని నమ్మిక. ఇదే విషయం ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రంథం విపులీకరించింది. దేవీ ఉపాసకులు అంతవరకు తాము చేసిన జప సంఖ్యననుసరించి హోమాలు చేస్తారు. నవరాత్రి వ్రత సమాప్తి గావించిన వారు సర్వ సిద్ధులు పొందుతారు, సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. చెడుపై మంచి సాధించిన విజయం దానవత్వంపై దైవం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాటం చేయడానికి దానవులు లేరు –మానవులు తప్ప. కానీ మనం పోరాడి తీరవలసిన శత్రువులున్నారు. వారే అందరిలోనూ ఉండే అరిషడ్వర్గాలనే శత్రువులు. వారితోనే మనం పోరాడి విజయం సాధించాలి. జీవితాలను ఆనందమయం చేసుకోవాలి. విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి. ఆ రోజున ఆరంభించే ఏ శుభకార్యమైనా, మంచి పని అయినా, రకరకాల వృత్తులు, వ్యాపారాలు అయినా అఖండ విజయం సాధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభిద్దాం. ఈ విజయ దశమి అందరికీ సుఖ సంతోషాలను, విజయాలను ప్రసాదించాలని అమ్మను కోరుకుందాం. –డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: సింహం వద్ద సలహదారు ఉద్యోగం! ) -
కొత్త జిల్లా ఎలా ఏర్పాటవుతుంది? గవర్నర్ పాత్ర ఏమిటి?
భారతదేశ పరిపాలనా వ్యవస్థలో పంచాయతీ, తహసీల్, జిల్లా, రాష్ట్రం, దేశం అనే విభాగాలు ఉన్నాయి. ఇందులో జిల్లాను అత్యంత కీలకంగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశంలో మొత్తం జిల్లాల సంఖ్య 800 దాటింది. తాజాగా మధ్యప్రదేశ్లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త జిల్లాలను మైహార్, పంధుర్ణగా పిలవనున్నారు. అయితే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఎలా ఏర్పాటు చేస్తుంది? ఎటువంటి విధానాన్ని అనుసరిస్తుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన స్థానిక పరిపాలన, ఎన్నికైన ప్రతినిధులు, ఇతర సంస్థల నుంచి వస్తుంది. తరువాత దానిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను నిశితంగా పరిశీలిస్తుంది. అనంతరం కొత్త జిల్లా ఆవశ్యకతపై సాధ్యాసాధ్యాలను అధికారులు అధ్యయనం చేస్తారు. ఈ దశలో ఆ ప్రాంత జనాభా, భౌగోళిక పరిసరాలు, పరిపాలనా సౌకర్యాలు, వనరుల లభ్యతతో పాటు, ఆ ప్రాంత సామాజిక పరిస్థితులు మొదలైనవాటిని పరిగణలోకి తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన సరైనదని భావించినప్పుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధులతో చర్చిస్తుంది. ఈ సమయంలో అందరి అంగీకారం మేరకు కొత్త జిల్లాను రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనంతరం అధికారిక గెజిట్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందులో కొత్త జిల్లా ఏర్పాటు ప్రకటనతో పాటు జిల్లా సరిహద్దులను తెలియజేస్తారు. జిల్లా సరిహద్దులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత కొత్త జిల్లాకు గవర్నర్ ఆమోదం తెలిపిన అనంతరం కొత్త జిల్లాకు అధికారిక రూపం వస్తుంది. కొత్త జిల్లా ప్రకటన వెలువడిన తరువాత ప్రభుత్వం ముందుగా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(డీఎం) ఎస్పీలను నియమిస్తుంది. తరువాత క్రమంగా ఇతర అధికారులను నియమిస్తారు. జిల్లా ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పరిపాలనా కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర అవసరమైన సేవలు, ప్రజా సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. దీనితో పాటు, పాత, కొత్త జిల్లాల మధ్య వనరులు, ఆస్తుల పంపిణీ జరుగుతుంది. ఇది కూడా చదవండి: క్షిపణి దాడుల మధ్య వార్ జోన్కు బైడెన్ ఎలా చేరారు? -
ఆ ఘనత ముహమ్మద్ ప్రవక్తకే దక్కింది, మానవాళికి ఆదర్శమయ్యారు
మానవుల మార్గదర్శనం కోసం అల్లాహ్ అన్ని కాలాల్లో, అన్నిజాతుల్లో తన ప్రవక్తలను ప్రభవింప జేశాడు. గ్రంథాలనూ అవతరింప జేశాడు. హజ్రత్ ఆదం (అ) మొదలు, ముహమ్మద్ ప్రవక్త (స) వరకు అనేక మంది సందేశహరులు భూమండలంపై జన్మించారు. వారిలో చిట్టచివరి దైవప్రవక్త ముహమ్మద్ (స). ఆయనపై అవతరించిన చివరి గ్రంథం పవిత్ర ఖురాన్ . ఇక ప్రళయకాలం వరకూ ప్రవక్తలూ రారు, గ్రంథాలూ అవతరించవు. కనుక మానవులు ప్రళయకాలం వరకు ఆయనను అనుసరించవలసిందే. ముహమ్మద్ ప్రవక్త తనంత తాను ఏమీ బోధించలేదు. మానవుల సంక్షేమం కోసం, సాఫల్యం కోసం దైవం అవతరింపజేసిన హితోపదేశాలనే ఆయన మానవాళికి అందజేశారు. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశల్లో, వివిధ రంగాల్లో ఎలా నడుచుకోవాలో, ఏది హితమో, ఏది హితం కాదో ఆచరణాత్మకంగా ఆయన విశద పరిచారు. అందుకే ఆయన ప్రపంచ మానవాళికి సంపూర్ణ మార్గదర్శిగా పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ మహనీయుని పవిత్ర జీవనానికి సంబంధించిన కొంత సమాచారాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. దాదాపు 1450 సంవత్సరాల క్రితం అరేబియా దేశంలోని మక్కానగరంలో ముహమ్మద్ ప్రవక్త (స) జన్మించారు. ఆమినా, అబ్దుల్లాహ్ తల్లిదండ్రులు. పుట్టకముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. తాతయ్య ఆయన్ని పెంచారు. చిన్నతనం నుంచే అనేక సుగుణాలను పుణికి పుచ్చుకున్న ముహమ్మద్ ప్రవక్త, ‘అమీన్’గా, ‘సాదిఖ్’గా వినుతికెక్కారు. ఆయన గొప్ప మానవతావాది. సంస్కరణాశీలి. ఉద్యమనేత. అతి సాధారణ జీవితం గడిపిన సామ్రాజ్యాధినేత. జ్ఞానకిరణాలు ప్రసరింపజేసిన విప్లవజ్యోతి. ప్రాణశత్రువును సైతం క్షమించిన కారుణ్య కెరటం. సుమారు వెయ్యిన్నర సంవత్సరాలంటే.. ఆ సమాజం ఎంత అనాగరికంగా ఉండేదో నేటి ఆధునికులకు తెలియనిదేం కాదు. ప్రవక్త జననానికి ముందు నాటి సమాజంలో ‘కర్రగలవాడిదే బర్రె’ అన్నట్లుగా బలవంతుడు బలహీనుణ్ణి పీక్కుతినేవాడు. స్త్రీల హక్కుల విషయం కాదుగదా అసలు వారికంటూ ఓ వ్యక్తిత్వం ఉన్న విషయాన్నే వారు అంగీకరించే వారు కాదు. స్త్రీని విలాస వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు. అలాంటి జాతిని అన్ని విధాలా సంస్కరించి, వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దిన ఘనత ముహమ్మద్ ప్రవక్తకే దక్కింది. నాటి సమాజంలో లేని దుర్మార్గమంటూ లేదు. అలాంటి ఆటవిక సమాజాన్ని నిరక్షరాస్యులు అయిన ముహమ్మద్ ప్రవక్త సమూలంగా సంస్కరించి, ఒక సత్సమాజంగా ఆవిష్కరించారు. ప్రవక్త బోధనల ప్రకారం... మానవులు తమ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. ఆయనకు మాత్రమే భయపడాలి. తోటిమానవుల్ని, సమాజాన్ని ప్రేమించాలి. స్త్రీలను గౌరవించాలి. ఎలాంటి స్థితిలోనూ నీతినీ, న్యాయాన్ని విస్మరించకూడదు. అనాథలను, వృద్ధులను ఆదరించాలి. తల్లిదండ్రులను సేవించాలి. వారిపట్ల విధేయత కలిగి ఉండాలి. బంధువులు, బాటసారులు, వితంతువులు, నిస్సహాయుల పట్ల తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. సంఘంలో ఒక మనిషికి మరో మనిషిపై పడే విధ్యుక్త ధర్మాల పట్ల ఉపేక్ష వహించకూడదు. అన్యాయం, అధర్మ సంపాదనకు ఒడికట్టవద్దు. ధనాన్ని దుబారా చేయవద్దు. వ్యభిచారం దరిదాపులకు పోవద్దు. దానికై పురిగొలిపే అన్నిరకాల ప్రసార ప్రచార సాధనాలను రూపుమాపాలి. నిష్కారణంగా ఏ ప్రాణినీ చంపవద్దు. ప్రజల ధన, మాన, ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతిని సాధించలేదు. సదా సత్యమే మాట్లాడాలి. చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి. వాగ్దాన భంగానికి పాల్పడకూడదు. పలికే ప్రతి మాటకూ, చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. వ్యాపార లావాదేవీల్లో, ఇచ్చి పుచ్చుకోవడాల్లో లెక్కాపత్రాలు, కొలతలు, తూనికలు చాలా ఖచ్చితంగా, నికార్సుగా ఉండాలి. స్వార్థాన్ని, అహాన్ని త్యజించాలి. తోటి మానవ సోదరులను తమకన్నా తక్కువగా చూడకూడదు. స్త్రీ జాతిని గౌరవించాలి. ఆమె మీకు జన్మనిచ్చిన తల్లి. ఆత్మీయత కురిపించే చెల్లి. ప్రేమించే ఇల్లాలు. అమ్మ పాదాల చెంత స్వర్గం ఉంది. వితంతువుల్ని చిన్నచూపు చూడకూడదు. సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలి. శుభకార్యాల్లో వారినీ ఆహ్వానించాలి. వితంతువుల పునర్వివాహం వారి హక్కు. అజ్ఞానకాలపు దురాచారాలు, దుర్మార్గాలన్నింటినీ నేను అంతం చేస్తున్నాను. ఒక మనిషికి మరో మనిషిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మానవులంతా ఒక్కటే. విద్యార్జన స్త్రీలు, పురుషులు అందరి విధి. జ్ఞానం జీవితం.. అజ్ఞానం మరణం. కళ్ళున్న వాళ్ళు, గుడ్డివాళ్ళు సమానం కానట్లే, జ్ఞాన సంపన్నులు, జ్ఞాన విహీనులు సమానం కాలేరు. ప్రతి తల్లీదండ్రీ తమ సంతానానికి విద్య నేర్పాలి. భావితరాల సంక్షేమానికి ఇది చాలా అవసరం. అధికార దుర్వినియోగం చేయకూడదు. పరిపాలన అంటే కేవలం ప్రజాసేవ మాత్రమే... పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని భావించాలి. ప్రతినిత్యం ప్రజలకు జవాబుదారుగా దైవానికి భయపడుతూ జీవించాలి. ఇక్కడ మనం పలికే ప్రతి మాటకు, చేసే ప్రతిపనికీ రేపు దైవం ముందు సమాధానం చెప్పుకోవాలన్న భావన కలిగి ఉండాలి. ఇలాంటి భావనలే మానవులను మంచివారుగా, నిజాయితీ పరులుగా, సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. ఇటువంటి బాధ్యతాభావాన్ని, జవాబుదారీ తనాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ప్రజల మనసుల్లో నూరిపోసి, మానవీయ విలువలతో తులతూగే ఓ చక్కని సత్సమాజాన్ని ఆవిష్కరించారు. అందుకే ఆయన మానవాళికి ఆదర్శమయ్యారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
చాందినీ చౌక్ చరిత్ర ఏమిటి? ఈ మార్కెట్ ఎలా ఏర్పాటయ్యింది?
ఎవరిమధ్యనైనా ఢిల్లీకి సంబంధించిన ప్రస్తావన వచ్చిప్పుడు చాందినీ చౌక్ను తప్పక తలచుకుంటారు. చాందినీ చౌక్ పలు సినిమాల్లో కూడా కనిపించింది. చాందినీ చౌక్ పేరుతో ఒక చిత్రం కూడా విడుదలయ్యింది. చాందినీ చౌక్ ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. సరసమైన ధరలకు దుస్తులు, ఆభరణాలు.. ఇలా ఒకటేమిటి ఏ వస్తువైనా ఇక్కడ చిటికెలో దొరుకుతుంది. షాపింగ్తో పాటు రుచికరమైన తినుబండారాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. చాందినీ చౌక్ ఎంతో పురాతనమైన మార్కెట్. దీనికి 370 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మార్కెట్లోని ఇరుకైన వీధులను కత్రా అని పిలుస్తారు. మార్కెట్ నిత్యం కొనుగోలుదారులతో రద్దీగా ఉంటుంది. పాత ఢిల్లీలో ఉన్న ఈ చాందినీ చౌక్ మార్కెట్ ఢిల్లీకి గర్వకారణంగా నిలుస్తుంది. ఇక్కడ అన్ని వయసుల వారికి వారు కోరుకున్న వస్తువులు లభ్యమవుతాయి. షాజహాన్ తన కూతురి కోసం.. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని షాజహానాబాద్ అని పిలిచేవారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమార్తెకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె అభిరుచిని నెరవేర్చేందుకు చక్రవర్తి తన ఎర్రకోట ముందు మార్కెట్ను ఏర్పాటు చేశాడు. దీంతో షాజహాన్ కుమార్తె ఇక్కడ షాపింగ్ చేసేది. 1650లో షాజహాన్ ఈ మార్కెట్ను నిర్మించాడు. క్రమంగా ఈ మార్కెట్ చాలా ప్రసిద్ధి చెందింది. ఢిల్లీలోని ప్రత్యేక మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. మత సామరస్యానికి ఉదాహరణ చాందినీ చౌక్ను షాజహాన్ స్థాపించినప్పటికీ, ఇక్కడ అందరికీ షాపింగ్ చేసే అవకాశం ఉంది. చాందినీ చౌక్ ఏరియా అన్ని మతాలకు చెందిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రముఖ గౌరీ శంకర్ ఆలయం, ఫతేపురి మసీదు ఉన్నాయి. అంతే కాదు ప్రసిద్ధ సిక్కు గురుద్వారా శిష్గంజ్ కూడా చాందినీ చౌక్లో ఉంది. సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి కూడా ఇక్కడ ఉంది. చాందినీ చౌక్ మార్కెట్ వెండి, బంగారు ఆభరణాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వివాహ షాపింగ్ చాలా చౌకగా చేయవచ్చని పలువురు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికించిన 8 ఉగ్రదాడులు -
సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? ఎందుకు ధరిస్తారు?
తలపాగా ధరించే సంప్రదాయం ఈ నాటిది కాదు. చాలా చోట్ల పెళ్లిళ్లలో తలపాగాలు ధరిస్తారు. చరిత్రలో తలపాగా ప్రస్తావన ఉంది. పూర్వం రాజులు, చక్రవర్తులు మాత్రమే తలపాగా ధరించేవారు. యోధులు తలపాగాను తమ శక్తికి చిహ్నంగా భావించేవారు. చాలా సినిమాల్లో ఓడిపోయినవారు లేదా బలహీనులు తమ తలపాగాను తీసి కాళ్ల దగ్గర పెట్టడాన్ని చూసేవుంటాం. తలపాగా చూసినప్పుడు మనకు చాలా విషయాలు గుర్తుకు వస్తాయి. సిక్కు మతానికి చెందినవారు తప్పని సరిగా తలపాగా ధరిస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే సిక్కుమతంలో తలపాగాకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు? ప్రభువుల హోదాకు చిహ్నం సిక్కులు తలపాగాను తమ గురువు ఇచ్చిన బహుమతిగా భావిస్తారు. 1699లో బైసాఖీ రోజున సిక్కుల పదవ గురువు గురు గురు గోవింద్ సింగ్ తన ఐదుగురు సన్నిహితులకు తలపాగాలను బహుమతిగా ఇచ్చారు. గురుగోవింద్ సింగ్ కాలంలో తలపాగాను గౌరవ సూచకంగా చూసేవారు. తలపాగా అనేది ప్రభువుల హోదాకు చిహ్నం. ఆ సమయంలో మొఘల్ నవాబులు, హిందూ రాజ్పుత్లు వారి ప్రత్యేక తలపాగాలతో గుర్తింపు పొందారు. హిందూ రాజ్పుత్ల తలపాగా భిన్నంగా ఉంటుంది. వారి తలపాగాలో ఆభరణాలు పొదిగేవారు. హిందూ రాజ్పుత్లు తలపాగాలు ధరించడంతోపాటు ఆయుధాలను కూడా ధరించేవారు. దీనితో పాటు గడ్డం, మీసాలు పెంచేవారు. గురు గోవింద్ సింగ్ అనుమతితో.. ఒకప్పుడు ప్రతి సిక్కు తలపాగా ధరించడం, కత్తిని ఉపయోగించడం, అతని పేరులో సింగ్ లేదా కౌర్ అని రాసేందుకు అనుమతిలేదు. అయితే గురు గోవింద్ సింగ్ సిక్కులందరికీ కత్తి పట్టుకోవడానికి, వారి పేర్లకు సింగ్, కౌర్ అని రాయడానికి, జుట్టును పెంచుకోవడానికి అనుమతినిచ్చారు. ఫలితంగా సిక్కు సమాజంలో పెద్ద, చిన్న అనే అంతరం ముగిసింది. పంజాబీ సమాజంలో బలహీన వర్గాలను రక్షించే బాధ్యత ఖల్సా సిక్కుల చేతుల్లో ఉంది. సిక్కు యోధులను ఖల్సా అని అంటారు. వారు తలపాగా ధరిస్తారు. సిక్కు చివరి గురువు గురుగోవింద్ సింగ్ చివరి కోరిక మేరకు వారు తమ జుట్టును ఎప్పుడూ కత్తిరించుకోరు. తలపాగాను మార్చుకునే ఆచారం గురుగోవింద్ సింగ్ తన ఇద్దరు కుమారులైన అజిత్ సింగ్, జుజార్ సింగ్ తలలకు తలపాగాలు కట్టి, వారికి ఆయుధాలు ఇచ్చారని సిక్కు చరిత్ర చెబుతోంది. గురుగోవింద్ సింగ్ తన పిల్లలిద్దరినీ పెళ్లికొడుకుగా అలంకరించి యుద్ధభూమికి పంపారు. వీరిద్దరూ యుద్ధరంగంలో వీరమరణం పొందారు. తలపై తలపాగా ధరించడం సిక్కు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైనది. అది వారి సాంస్కృతిక వారసత్వం మాత్రమే కాదు. ఆత్మగౌరవం, ధైర్యం, ఆధ్యాత్మికతకు చిహ్నం. సిక్కు సంప్రదాయంలో స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేయడాన్ని ఘనమైన కార్యంగా గుర్తిస్తారు. తలపాగా మార్చుకునే ఆచారం సిక్కు సంస్కృతిలో కనిపిస్తుంది. తలపాగాను అత్యంత సన్నిహిత మిత్రులు మార్చుకుంటారు. తలపాగా మార్చుకున్న వారు జీవితాంతం స్నేహ సంబంధాన్ని కొనసాగించాలి. తలపాగా బాధ్యతకు చిహ్నంగా కూడా సిక్కులు పరిగణిస్తారు. ఇది కూడా చదవండి: నరహంతకుడు జనరల్ డయ్యర్ను మహాత్మాగాంధీ ఎందుకు క్షమించారు? -
ఇది ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవమో తెలుసా!ఏంటీ డౌంట్? అంటే..
ఆగస్టు 15 భారతదేశం తెల్లవాళ్ల పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న చారిత్రక ఘట్టాన్ని స్మరించుకునే రోజు ఇది. 1947లో బ్రిటీష్ వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొందిన తర్వాత నుంచే ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సంపాదించిపెట్టిన ఎందరో త్యాగధనులు, సమర యోధుల అలుపెరగని పోరాటాలను స్ఫురణకు తెచ్చకుని వారికి నివాళులర్పిస్తూ పండుగలా చేసుకుంటాం. అయితే అందరిలోనూ ఎదురయ్యే సందేహం ఇప్పుడూ మనం ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం? అని. ఇది 76వ? లేక 77వ దినోత్సవమా! అని మదిలో ఒకటే డౌట్. అందరూ చెప్పేది మాత్రం మనం 77వ స్వాతంత్య్ర దినోత్సవం అని కరాఖండీగా చెబుతున్నారు. అసలు ఈ సందేహం ఎందుకు వస్తోంది అంటే.. నిజానికి మనం బ్రిటీష్ పాలన నుంచి మన దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత తొలిసారిగా 1948 ఆగస్టు 15న ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఆ లెక్కన గణిస్తే ఇది 76వ స్వాతంత్య్ర దినోత్సవంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇక 77వ స్వాతంత్య్ర దినోత్సవం అని చాలా మంది కాన్ఫిడెంట్గా అనడానికి గల కారణం ఏంటంటే..భారతదేశం ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం లభించిందినే ఆధారంగా లెక్కిస్తే 2023 అనేది 77వ స్వాతంత్య్ర దినోత్సవం అవుతుంది. అయితే ఎక్కువగా 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అంతేకాదు దాదాపు 200 సంవత్సారాల బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశం స్వాతంత్య్రం పొందింది. ఈ దినోత్సవం థీమ్: "నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్" ఈ థీమ్ ముఖ్యోద్దేశం "కష్ట సమయాల్లో కూడా దేశ ప్రయోజనాలకే తొలి స్థానం" ఇవ్వాలనే ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక దినోత్సవాన్ని ఊరు, వాడతో సంబంధం లేకుండా అంతా ఒక్కటిగా ఆనందంగా జరుపుకునే గొప్ప సంబరం. త్రివర్ణ పతాకం ఎగరువేయడంతో ప్రారంభమైన ఈ దినోత్సవం..దేశం సాధించిన విజయాలను పరంపర నుంచి సాధించాల్సిన నిరంతర ప్రగతి ఆవశక్యతను గూర్చి తెలియజేసే సుదినం. ఇది గతానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు..ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూసే అవకాశం. ఇది భారతదేశానికి ఆధారమైన భిన్నత్వంలోని ఏకత్వం ప్రాముఖ్యత తోపాటు ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద ప్రధాని జెండా ఎగరువేసి.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ రోజంతా భారతదేశ గొప్ప సాంస్కృతికి వారసత్వం, వైవిధ్యాన్ని ప్రదర్శించేలా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు కవాతులు జరుగుతాయి. అంతేగాదు రాబోయే తరాలకు బలమైన, సమగ్రమైన, సంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే నిబద్ధతను పునరుద్దరించేందుకు ఈ దినోత్సవం ఓ మంచిరోజు. (చదవండి: స్త్రీ పోరాటాన్ని ఆవిష్కరించిన ఉద్యమం! బ్రిటిషర్లకే చుక్కలు చూపించారు!) -
నేటి నుంచి అధిక శ్రావణమాసం? అంటే ఇది డూప్లికేటా?
ఈనెల జూలై 18వ తారీకు నుంచి అధిక శ్రావణమాసం ప్రారంభం అవుతోంది. 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం ఇది. ఈ మాసం నేటి(జూలై 18) నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు అధిక శ్రావణ మాసం ఉంటుంది. అయితే ఈ అధిక మాసం అనేది కేవలం వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం మాసాలకు మాత్రమే వస్తుంది. మిగతా మాసాలకు ఎప్పుడూ అధిక మాసం రాదు. ఐతే ముందుగా ఈ అధిక మాసం వచ్చి ఆ తర్వాత నిజమాసం వస్తుంది. అసలు అధికమాసం ఎందుకు వస్తుంది?. అంటే ఇది డూప్లికేట్ అని అర్థమా? ఎలాంటి జపతప వ్రతాలు ఆచారించాల్సిన పని లేదా? అధికమాసం ఎందుకు వస్తుదంటే.. తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు, రుతువులు, పంచాంగ గణన ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంపావు రోజులు వ్యత్యాసం ఉంటుంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇలా ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం అవదు. చాంద్రమానంలో సూర్య సంక్రాంతి లేని మాసాన్ని అధికమాసం అంటారు. చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని పిలుస్తారు. ఇది పాటించం అంటే కుదరదు.. కొన్ని ఏళ్ల తర్వాత జోడు శ్రావణ మాసాలు రావడం జరిగింది. శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తామో అదేవిధంగా మొదటి శ్రావణంలో కూడా అవే నియమాలను తప్పక పాటించాలి. ఉదాహరణకు కవల పిల్లలు పుడితే వద్దంటామా..? లేదు కదా అలాగే జోడు శ్రావణ మాసాలు వచ్చినప్పుడు కూడా ఒకటి పాటిస్తాం మరొకటి పాటించము అంటే ధర్మశాస్త్రము అంగీకరించదు. కావున రెండూ శ్రావణ మాసాలే. మొదటి శ్రావణ మాసంలో కూడా వ్రతాలు, పూజలు అనగా శ్రావణ సోమవారాలను, శ్రావణ శుక్రవారాలను, శ్రావణ శనివారాల వంటివి, అలాగే మధ్య మాంసాలను స్వీకరించకుండా కేవలం సాత్విక ఆహారాలను మాత్రమే స్వీకరించడం తదితరాలన్ని చేయాల్సిందే. విష్ణువుకి ఎంతో ఇష్టమైనది.. శ్రీమహా విష్ణువుకి మహా ప్రీతికరమైన మాసం ఇది. అందుకే దీన్ని అధిక రాధా పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఈ మాసంలో చేసే దానాలు, వ్రతాలు అధిక ఫలితాలనిస్తాయి. ఈ మాసంలో ఏది దానం చేసిన శ్రీ అధిక రాధా పురుషోత్తమ ప్రీత్యర్థం ఇస్తున్న దానం పేరు చెప్పి కరిష్యే అనాలి. అలాగే ఈ రోజుల్లో శ్రీ అధిక రాధా పురుషోత్తమాయ నమః అని 108 సార్లు జపం చేయాలి. విష్ణువు శ్రీమహాలక్ష్మికి ఓ సందర్భంలో పురుషోత్తమ మాస విశిష్టతను వివరిస్తూ ‘ఎవరైతే ఈ మాసంలో పుణ్య నదీస్నానాలు, జపహోమాలు, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్ల ఫలితాలు లభిస్తాయి. అధిక మాసంలో పుణ్యకర్మలు ఆచరించని వారి జీవితాల్లో కష్టనష్టాలు ఎదురవుతాయి. అధిక మాసం శుక్ల పక్షంలో కానీ, కృష్ణ పక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అలాగే పౌర్ణమి నాడైనా పుణ్యకార్యాలు చేయాలి. దానివల్ల వారికి అపారమైన ఫలితం లభిస్తుందని వివరించాడని పురాణ కథనం. (చదవండి: ఈ అమావాస్య..కొన్ని కోట్ల గ్రహణములతో సమానమైనది!) -
మిస్త్రీ కారు ప్రమాదం.. వెనక సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే..?
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోడం వ్యాపార, వాణిజ్య వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదానికి గల కారణాలను అధికారులు, నిపుణులు అన్వేషిస్తున్నారు. మిస్త్రీతో పాటు కారు వెనుక సీట్లో కూర్చున్న జహంగీర్ పండోలే.. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని నిపుణులు అంటున్నారు. వారిద్దరూ కనుక సీట్ బెల్ట్ ధరించివుంటే ఎయిర్బ్యాగ్స్ తెరుచుకుని ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు పరిశీలిస్తే ముందు భాగంలో రెండు ఎయిర్ బ్యాగ్లు తెరుచుకున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. దీంతో ముందు సీట్లో ఉన్న డేరియస్ పండోలే, కారు నడుపుతున్న ఆయన భార్య డాక్టర్ అనాహిత గాయాలతో బయటపడ్డారు. వారిద్దరూ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎయిర్ బ్యాగ్లు తెరుచుకుని ప్రమాద తీవ్రత తగ్గి ప్రాణాలు నిలుపుకున్నారు. (క్లిక్: మిస్త్రీ హఠాన్మరణం.. ఆనంద్ మహీంద్ర భావోద్వేగం) సెక్యురిటీ ఫీచర్లు ఉన్నప్పటికీ.. కారుకు ఒకవైపు మాత్రమే అమర్చినట్లుగా కనిపించే నీలం రంగు సైడ్-కర్టెన్ ఎయిర్బ్యాగ్లు కూడా ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. మిస్త్రీ, జహంగీర్ సీటు బెల్ట్ ధరించపోవడంతో వారి సీట్లలో నుంచి ఎగిరిపడివుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన మెర్సిడెస్ జీఎల్సీ ఎస్యూవీలో అత్యంత సురక్షితమైన సెక్యురిటీ ఏర్పాట్లు ఉన్నప్పటికీ అజాగ్రత్త కారణంగానే మిస్త్రీ, జహంగీర్ ప్రాణాలు కోల్పోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే వెనుక సీటులో సీట్ బెల్ట్లు ధరిస్తారన్న విషయం తెలిసిందే. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమౌతుంది? కారు వెనుక కూర్చున్న వారు సీటు బెల్ట్ ధరించకపోతే ఏమవుతుందనే దాని గురించి తెలిపే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెనుక సీట్లో ఉన్న ఇద్దరిలో ఒకరు మాత్రమే సీటు బెల్ట్ ధరించారు. ప్రమాదం జరిగినప్పడు సీటు బెల్ట్ పెట్టుకోని వ్యక్తి ఎగిరి ముందు సీటులోని వ్యక్తి ఎగిరిపడిపోయినట్టుగా వీడియో చూపించారు. బాహుశా మిస్త్రీ కారు ప్రమాదానికి గురైనప్పుడు ఈవిధంగానే జరిగివుండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కారులో ప్రయాణించే వారంతా తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని చెబుతున్నారు. (క్లిక్: చిన్న పొరపాట్లే మిస్త్రీ ప్రాణాలు తీశాయా.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..!) చట్టం ఏం చెబుతోంది? సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) ప్రకారం వెనుక సీటులో కూర్చున్న ప్రయాణికులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. సీఎంవీఆర్ రూల్ 138 (3) ప్రకారం వాహనం కదులుతున్నప్పుడు.. ముందు సీటులో కూర్చున్న వారితో పాటు వెనుక సీటులో ఉన్న వారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి 1,000 రూపాయల జరిమానా విధిస్తారు. కాగా, కారులో అన్ని సీట్లకు Y- ఆకారపు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉండాలని ఈ సంవత్సరం ప్రారంభంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. 25 శాతం మరణాలను నివారించొచ్చు వెనుక సీటు బెల్ట్లను ఉపయోగించడం వల్ల 25 శాతం మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అంతేకాదు ప్రమాదాల్లో ముందు సీటు ప్రయాణికులకు అదనపు గాయాలు లేదా మరణాన్ని కూడా నిరోధించవచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. -
Tea: చాయ్ గరీబుకు విందురా భాయ్
జీవితంలో చాయ్ (టీ) ఓ భాగమైపోయింది. నిద్ర లేవగానే ఓ కప్పు చాయ్ కడుపులో పడితే గాని ఏ పని చేయలేం. ఇంట్లో ఉన్నా, ఆఫీసుకు వెళ్లినా ఓ కప్పు చాయ్ కావాల్సిందే. దోస్తులు కలిసినా.. అతిథి వచ్చినా తేనీటి విందు తప్పనిసరి. భారత ప్రధాని మోదీ నిర్వహించే కార్యక్రమానికి ‘చాయ్ పే చర్చ’ అనే పేరు పేట్టారంటే టీ ఎంతలా మనలో స్థానం సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. జనంలో అత్యంత ఆదరణ ఉండడంతో టీని జాతీయ పానీయంగా గుర్తించారు. అయితే ఇక్కడ చాయ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ రోజు ‘ఇంటర్నేషనల్ టీ డే’ కాబట్టి. సాక్షి, హైదరాబాద్: నాలుగో శతాబ్దంలో ఓ చైనా వైద్యుడికి కొంత సుస్తిగా ఉండగా, వైద్య పరీక్షల్లో భాగంగా కొన్ని ఆకులను తీసుకొని ఎండబెట్టాడు. వేడి నీటిలో వాటిని నానబెట్టగా వచ్చిన డికాషన్ను తాగాడు. దీంతో అతడు ఎంతో ఉత్తేజాన్ని పొందాడు. ► 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ తాగడం ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నల్లమందుకు బదులుగా టీని చైనా నుంచి దిగుమతి చేసుకునేది. 1823లో బ్రిటన్కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో దేశీయంగా తేయాకును కనిపెట్టిట్టారు. అప్పటి నుంచి భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమైంది. ► 1860 నాటికి భారతదేశంలోని టీ ప్లాంటేషన్ బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడ టీ ఉత్పత్తి సుమారు 10లక్షల కేజీలు ఉండేది. నేడు పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ టీని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా ప్రసిద్ధి చెందాయి. చదవండి: తల్లి వద్దు.. ప్రియుడే కావాలి.. -
దేశం గర్వించతగ్గ ఘటన.. ఆ చిరస్మరణీయ విజయానికి విశాఖ వేదికైంది..
పాకిస్తాన్.. దాయాది దేశం పేరు వింటనే పౌరుషం పొంగుకొస్తుంది. అలాంటి శత్రుదేశంతో యుద్ధం జరిగితే.. ఆ యుద్ధంలో మన త్రివర్ణపతాకం రెపరెపలాడితే.. ఆ చిరస్మరణీయ విజయానికి మన విశాఖే వేదికైతే.. ఇంకెంత గర్వంగా ఉంటుందో కదా. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ నాలుగో తేదీన భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తారు. జాతి గర్వించదగిన గెలుపునకు గుర్తుగా బీచ్రోడ్లో ‘విక్టరీ ఆఫ్ సీ’ స్థూపం నిర్మించారు. భారత నౌకాదళం ప్రపంచంలోనే అతి పెద్ద దళాల్లో ఒకటిగా సమర్థమైన నౌకాదళ శక్తిగా మారగా.. దేశంలోనే ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం అభివృద్ధి చెందింది. నౌకాదళ దినోత్సవం నిర్వహించుకోడానికీ కేంద్ర బిందువు కూడా విశాఖపట్నం కావడం మరో విశేషం. సాక్షి, విశాఖపట్నం: దేశానికి తూర్పు తీరం వ్యూహాత్మక రక్షణ ప్రాంతం. సహజ సిద్ధమైన భౌగోళిక రక్షణతో పాటు శత్రుదేశాలకు సుదూరంగా ఉండటం తూర్పు నౌకాదళం ప్రత్యేకత. అందుకే రక్షణఅవసరాల దృష్ట్యా బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతాన్ని కీలకంగా భావించారు. ఇందులో భాగంగానే తూర్పు నావికా దళం ఏర్పాటైంది. 1923 డిసెంబర్లో విశాఖను తూర్పు తీరంలో వ్యూహాత్మక కేంద్రంగా గుర్తించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలమైన 1942–45 మధ్య కాలంలో విశాఖ తీరాన్ని ప్రధానంగా వినియోగించుకున్నారు. ఇక్కడి నుంచే బర్మాకు ఆయుధాలను రవాణా చేశారు. స్వాతంత్య్రానంతరం 1954లో విశాఖ నేవీ పోస్ట్ను కమాండర్ హోదాకు పెంచుతూ, బేస్ రిపేర్ ఆర్గనైజేషన్ కార్యకలాపాలను ప్రారంభించారు. 1962లో ఇండియన్ నేవీ హాస్పిటల్ సర్వీసెస్ (ఐఎన్హెచ్ఎస్) కల్యాణి ప్రారంభమైంది. అనంతరం 1967 జూలై 24న కమాండర్ హోదాను రియర్ అడ్మిరల్ హోదాకు అప్గ్రేడ్ చేయడంతో పాటు తూర్పు తీరంలో ఫ్లాగ్ ఆఫీసర్స్ పోస్టులను కూడా మంజూరు చేశారు. చివరిగా 1968 మార్చి 1న విశాఖ ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం( ఈఎన్సీ ) కార్యకలాపాలు ప్రారంభమై చరిత్రకు శ్రీకారం చుట్టింది. 1971 మార్చి1న ఈఎన్సీ చీఫ్గా వైస్ అడ్మిరల్ నియామక శకం మొదలైంది. క్రమక్రమంగా ఈఎన్సీ విస్తరించింది.1971 నవంబర్ 1 నుంచి ఈఎన్సీ ఫ్లీట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి ఈఎన్సీ చీఫ్గా రియర్ అడ్మిరల్ కేఆర్ నాయర్ నియమితులయ్యారు. ప్రస్తుతం 29వ చీఫ్గా వైస్ అడ్మిరల్ బిస్వజిత్దాస్ గుప్తా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. రక్షణలో వెన్నెముక మయన్మార్లోని కొండ ప్రాంతం మినహా దక్షిణ హిందూ మహా సముద్రం వరకూ ఈస్ట్రన్ నేవల్ కమాండ్ పరిధిలో సురక్షితంగా ఉంది. ఉత్తరాన సుందర్బన్ నుంచి దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకూ విస్తరించి ఉంది. 2,600 కి.మీ నిడివి కలిగిన తూర్పు తీరంలో 30 శాతం అంటే 6 లక్షల చ.కిమీ పరిధిలో ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ విస్తరించి ఉంది. ఈ తీరంలో 13 మేజర్ పోర్టులున్నాయి. భారత సర్కారు లుక్ ఈస్ట్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత సముద్ర వాణిజ్యానికి తూర్పు తీరం ప్రధాన కేంద్రంగా మారడంతో వాణిజ్య నౌకల రక్షణ బాధ్యత కూడా తూర్పు నౌకాదళమే నిర్వర్తిస్తోంది. దీంతో పాటు డీఆర్డీవో కార్యకలాపాలకు కూడా తూర్పు తీరమే వేదికగా మారింది. పలు క్షిపణులు తయారు చేసే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లేబొరేటరీస్ (ఎన్ఎస్టీఎల్) కూడా విశాఖలోనే ఏర్పాటైంది. డిసెంబర్ 4 విజయానికి నాంది ఘాజీ కాలగర్భంలో కలిసిపోవడంతో బంగాళఖాతంలోని జలప్రాంతాలన్నీ ఇండియన్ నేవీ.. తన ఆధీనంలోకి తెచ్చుకుంది. భారత్ ముప్పేట దాడితో పాకిస్తాన్ తలవంచక తప్పలేదు. డిసెంబర్ 16న పాకిస్తాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సైనిక లొంగుబాటు జరిగిన యుద్ధమిదే.ఈ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం లభించింది. డిసెంబర్ 16న యుద్ధం ముగిసినా దానికి కారణం డిసెంబర్ 4న అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచీపై చేసిన మెరుపుదాడేనని చెప్పుకోవచ్చు. అందుకే 1971 యుద్ధంలో మన నౌకాదళం ప్రదర్శించిన సాంకేతిక ప్రతిభా పాటవాలు, వ్యూహాలు, ధైర్య సాహసాలకు గుర్తుగా డిసెంబర్ నాలుగో తేదీన భారత నౌకాదళ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. తీర ప్రాంత రక్షణలో వెన్నెముకగా ఉన్న ఈఎన్సీ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో ఇండియన్ నేవీ ఎప్పటికప్పుడు నౌకా సంపత్తిని పెంచుకుంటూ శత్రుదుర్భేద్యంగా మారుతోంది. తూర్పు నౌకాదళం పరిధిలో 52 వరకు యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలున్నాయి. యుద్ధ నౌకల పనితీరు, పరిజ్ఞానం బట్టి వాటిని వివిధ తరగతులుగా విభజించారు. అదే విధంగా సబ్మెరైన్లను కూడా వాటి సామర్థ్యం, పనితీరు బట్టి వివిధ తరగతులుగా విభజించారు. భారత నౌకాదళంలో ఉన్న షిప్స్ పేర్లన్నీ ఐఎన్ఎస్తో మొదలవుతాయి. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్. యుద్ధ నౌకల్లో ఐఎన్ఎస్ ఢిల్లీ క్లాస్, రాజ్పుత్, గోదావరి, తల్వార్, కోల్కతా, శివాలిక్, బ్రహ్మపుత్ర, ఆస్టిన్, శార్దూల్, దీపక్, మగర్, కుంభీర్, కమోర్తా, కోరా, ఖుక్రీ, అభ్య, వీర్, పాండిచ్ఛేరి, అస్త్రధరణి, సరయు, సుకన్య, కార్ నికోబార్, బంగారం, త్రికర్ట్.. ఇలా విభిన్న తరగతుల యుద్ధ నౌకలున్నాయి. సబ్మెరైన్ల విషయానికొస్తే.. న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్లను అరిహంత్, చక్ర(అకుళ–2) క్లాస్లుగా, కన్వెన్షనల్లీ పవర్డ్ సబ్మెరైన్లను సింధుఘోష్, శిశుమార్ క్లాస్ సబ్మెరైన్లుగా విభజించారు. ఇటీవల ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకతో పాటు పలు హెలికాఫ్టర్లు, అడ్వాన్స్డ్ యుద్ధ విమానాల రాకతో ఈఎన్సీ బలం మరింత పెరిగింది. సాయుధ సంపత్తికి కీలకం.. రజాలీ ఈస్ట్రన్ నేవల్ కమాండ్కు అత్యంత వ్యూహాత్మక, కీలకమైన ఎయిర్స్టేషన్ రజాలీ. ఇది తమిళనాడులోని అరక్కోణం జిల్లాలో ఉంది. ఇది ఈఎన్సీకే కాదు.. భారత నౌకాదళానికీ కీలకమైన ఎయిర్స్టేషన్. 2,320 ఎకరాల విస్తీర్ణంలో అతి పొడవైన, వెడల్పైన రన్వే కలిగిన రజాలీ.. ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్స్టేషన్గా గుర్తింపు పొందింది. తూర్పు, దక్షిణ తీరాల మధ్యలో భూ ఉపరితల, సముద్ర మార్గాల ద్వారా దాడి చేసేందుకు వచ్చే శత్రుదేశాల తుదిముట్టేంచేందుకు కావల్సిన ఆయుధ సంపత్తి అంతా రజాలీలోనే నిక్షిప్తమై ఉంది. 1985లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆధీనంలోకి ఈ ఎయిర్స్టేషన్ వచ్చింది. ఆ తర్వాత భారత నౌకాదళం రజాలీని వ్యూహాత్మక ఎయిర్స్టేషన్గా తీర్చిదిద్దింది. 1992 మార్చి 11న అప్పటి రాష్ట్రపతి వెంకటరామన్ ఈ ఎయిర్ స్టేషన్ను జాతికి అంకితం చేశారు. ఈఎన్సీకి చెందిన స్థావరాలు మొత్తం 15 ఉండగా.. ఇందులో ఏడు నేవల్ బేస్లు విశాఖలోనే ఉన్నాయి. నేవల్ బేస్ ఐఎన్ఎస్ వర్ష రాంబిల్లిలో నిర్మితమవుతోంది. నౌకాదళానికి, ప్రజలకు వారధి.. నేవీడే తూర్పు నౌకాదళం అత్యంత ప్రధానమైన కమాండ్. దేశ రక్షణలో అశువులు బాసిన నావికులు చేసిన సేవలు శ్లాఘనీయం. లుక్ ఈస్ట్, టేక్ ఈస్ట్ విధానాలతో తూర్పు నౌకాదళానికి ప్రాధాన్యం పెరిగింది. మిషన్ డిప్లాయ్స్ ఆపరేషన్స్ అనే విధానాన్ని ప్రస్తుతం నేవీ అనుసరిస్తోంది. ఈ విధానం వల్ల అనుకున్న సమయానికి అనుకున్న ప్రదేశంలో అందుబాటులో సిబ్బంది ఉండగలుగుతున్నారు. హెలికాఫ్టర్లు, యుద్ధ నౌకల ద్వారా దాయాదిదేశాలకు చెందిన వాటిని గుర్తించి ఎదుర్కొనేందుకు నిత్యం పహారా కాస్తున్నాం. ఒకవేళ అలాంటివి ఎదురైనా.. వాటిని తిప్పికొట్టేందుకు సమర్థంగా ఉన్నాం. కోవిడ్ కారణంగా ఈ ఏడాది కూడా విన్యాసాలు చేపట్టలేకపోతున్నాం. – వైస్ అడ్మిరల్ బిస్వజిత్దాస్ గుప్తా, తూర్పు నౌకా దళాధిపతి చదవండి: మిలాన్ మెరుపులు..46 దేశాలకు ఆహ్వానం! -
ఒకరికొకరు నిలబడదాం
‘‘ఎవరు ఎలా ఉంటే వాళ్లను అలాగే అంగీకరిద్దాం. వేరే వారితో పోల్చి చూడటం మానేద్దాం’’ అంటున్నారు తమిళ నటి వరలక్ష్మీ శరత్కుమార్. సామాజిక అంశాల మీద తరచూ ఏదో ఓ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారామె. తాజాగా పాతకాలపు ఆలోచనా విధానాన్ని ఎలా బద్ధలుకొట్టాలి? స్త్రీలకు అండగా ఎలా నిలబడటం ఎంత ముఖ్యం? అనే విషయాలపై ఓ పోస్ట్ చేశారు వరలక్ష్మి. ‘‘ఒక స్త్రీ ఎలా ఉండాలనుకుంటుందో అది తన ఇష్టం. ఒక సమాజంగా తన ఇష్టాన్ని మనందరం గౌరవించాలి. నువ్వెందుకు ఇలా ఉన్నావు? మిగతావారిలా లేవు? అని పోల్చి చూడొద్దు. ప్రతీ ఒక్కరం ఏదో ఒక సమస్యతో నిరంతరం పోరాడుతూనే ఉంటాం. సమస్యను అనుభవించే వాళ్లకే ఆ నొప్పి తెలుస్తుంది. ఒకరికొకరం నిలబడదాం.. తోడుగా నిలబడదాం. మనలో ఎవ్వరూ సంపూర్ణంగా లేము. మనకి ఉన్నది ఒక్కటే జీవితం. నచ్చినట్టు బతుకుదాం.. నచ్చిన పనిని నచ్చినట్టు చేసుకుంటున్న ప్రతి స్త్రీకి నా అభినందనలు’’ అన్నారామె. కాగా వరలక్ష్మి సినిమాల విషయానికి వస్తే రవితేజ ‘క్రాక్’, అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాల్లో నటిస్తున్నారు. -
సంజయ్... జిల్లా నేతలకు ‘జై’
సాక్షి, హైదరాబాద్ : ‘బండి’కూర్పులో కొంచెం మార్పు, కొంచెం నేర్పు కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటులో అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన ముద్ర వేశారు. జిల్లాల నేతలకు సం‘జై’కొట్టారు. హైదరాబాద్లో ఉంటున్నవారికే ఇప్పటిదాకా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలకు చెక్ పెట్టారు. ఈసారి ఆయా జిల్లాల నేతలకు రాష్ట్ర కమిటీలో ఎక్కువ పదవులు కేటాయించారు. రాష్ట్రకమిటీలో మొత్తంగా 23 మందికి చోటు కల్పించగా అందులో 17 మంది జిల్లాల నేతలే కావడం గమనార్హం. సంజయ్ స్వయంగా కరీంనగర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అధికార ప్రతినిధుల్లో నల్లగొండ నుంచి పి.రజనీకుమారికి స్థానం కల్పించారు. కమిటీలో మాజీ ఎమ్మెల్యేలకు కూడా పెద్దపీట వేశారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి కూడా కమలదళంలో చోటు లభించింది. 8 మంది ఉపాధ్యక్షుల్లో ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు, సెక్రటరీల్లో ఒక మాజీ ఎమ్మెల్యేకు స్థానం కల్పించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన విజయరామారావు, యెన్నం శ్రీనివాస్రెడ్డి, శోభారాణికి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్కుమార్లకు మరోసారి అవకాశం కల్పించారు. బీజేపీ జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతికి ప్రధాన కార్యదర్శిగా అవకాశం వచ్చింది. రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులైన వారిలో శ్రీనివాస్ గౌడ్, కుంజా సత్యవతి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కాగా ప్రకాష్రెడ్డి, రఘునందన్ రావు, మాధవి ఇప్పటివరకు అధికార ప్రతినిధులుగా పనిచేశారు. మరో కార్యదర్శి బొమ్మ జయశ్రీ మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కూతురు. ఇక గత కమిటీలో పనిచేసిన కార్యదర్శులలో మళ్లీ ఎవరికీ చాన్స్ దక్కలేదు. పార్టీ కోశాధికారిగా గత కమిటీలో ఉన్న శాంతికుమార్నే మళ్లీ నియమించారు. నార్త్ ఇండియన్ భవర్లాల్ వర్మను జాయింట్ ట్రెజరర్గా నియమించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిని మార్పు చేశారు. ఆరుగురు మహిళలకు చోటు... బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు. ఉపాధ్యక్షులుగా ఒకరికి, ప్రధాన కార్యదర్శిగా మరొకరికి, కార్యదర్శుల్లో నలుగురికి స్థానం దక్కింది. సామాజికవర్గాల వారీగా చూస్తే రాష్ట్ర కమిటీలో అగ్రకులాలవారికే ఎక్కువ చోటు దక్కింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆరుగురు, వెలమ ముగ్గురు, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. బీసీల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి అధ్యక్షునితో కలుపపుకొని నలుగురు ఉన్నారు. -
అప్పటినుంచే వాడకం..ఆ సబ్బుపై నిషేధం
చేతులు శుభ్రంగా కడుక్కున్నావా ఈ మధ్య ప్రతీ ఇంట్లో వినిపిస్తున్న మాట. కరోనా కారణంగా వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. తద్వారా ఏదైనా వస్తువును ముట్టుకున్నా, తినడానికి ముందు సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ చేతులు శుభ్రపరుచుకోవడం అనివార్యం అయ్యింది. మన శరీరంలోనూ కొన్ని వేల సూక్షజీవులు ఉంటాయి. వాటి నుంచి అనారోగ్యానికి గురికాకుండా సబ్బుతో శుభ్రపరుచుకుంటారు. ఇంత ప్రాముఖ్యం ఉన్న సబ్బు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ? దీన్ని ఎవరు కనుగొన్నారు ?సబ్బుల్లోనూ హానికారకమైనవి ఎలా గుర్తించాలి..ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్లనే మనం ఫాలో అవుతున్నాం సబ్బును మొట్టమొదటగా పురాతన బాబీలోనియన్లు క్రీ.పూ. 2800 సంవత్సరంలోనే తయారుచేశారు. కలప, బూడిద, కొంచెం నీటిని వాడి సబ్బులా తయారుచేశారు. అయితే దీన్ని వ్యక్తిగత శుభ్రతకు ఉపయోగించలేదు. కేవలం ఉన్ని, పత్తి లాంటి వాటిని శుభ్రపరిచేందుకు వినియోగించినట్లు తేలింది. అయితే ఆ తర్వాత బాబీలోనియన్లు ఉపయోగించిన పదార్థాలతోనే ఈజిప్టియన్లు సబ్బును తయారుచేసి పుండ్లు, చర్మ వ్యాధుల చికిత్స కోసం వినియోగించారు. రోమన్ శతాబ్దాం వరకు వ్యక్తిగత శుభ్రతకు సబ్బును వాడలేదని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే దశాబ్దాలు మారినా బేసిక్ సబ్బు తయారీ విధానం మాత్రం మారలేదు. ఏ సబ్బు తయారీలో అయినా సాధారణంగా నీరు, నూనె ( వెజిటేబుల్ ఆయిల్ ) , బేసిక్ ఆల్కలీ, అయానిక్ ఉప్పు ను వాడతారు. సరైన నిష్పత్తిలో ఈ పదార్థాలన్నింటినీ కలపడం ద్వారా రసాయన ప్రక్రియ జరిగి సబ్బు తయారవుతుంది. ఈ పద్దతిని సోపోనిఫికేషన్ అంటారు. సబ్బు తయారీకి చల్లని ప్రక్రియ (కోల్డ్ ప్రాసెస్ ), వేడి ప్రక్రియ ( హాట్ ప్రాసెస్ ) అని రెండు పద్దతులను వాడతారు. అయితే వేడి ప్రక్రియ ద్వారానే సులభంగా సబ్బు చేయడానికి వీలుంటుందని రుజువైంది. ఆ సబ్బుపై నిషేదం నిత్యం ఎన్నో సూక్షజీవులతో మనం జీవిస్తున్నాం. సబ్బులో నీరు, నూనె వంటి గుణాలు ఉండటం వల్ల బాక్టీరియా, క్రిములు తొందరగా ఆకర్షించబడతాయి. దాదాపు 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులను శుభ్రపరుచుకోవడం వల్ల క్రిములు నశిస్తాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే..తడిచేతులను అలాగే వదిలేయరాదు. దీని వల్ల సూక్షజీవులు మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే టువాలు లేదా టిష్యూలు వాడి చేతులు తడిబారకుండా చూసుకోవాలి. అయితే అన్ని సూక్షజీవులు హానికారం కాదు. కొన్ని మనకు మేలుచేసేవి ఉంటాయి. ఏ సబ్బు అయినా క్రిములను చాలామేర తగ్గిస్తుంది కానీ మొత్తానికే వాటిని నాశనం చేయదు. అయితే యాంటీ బాక్టీరియల్ సబ్బులు మాత్రం బాక్టీరియా లోపలి కణ త్వచాలోకి వెళ్లి చంపేస్తుంది. ఈ సబ్బులోని ట్రైక్లోసన్ లేదా ట్రైక్లోకార్బన్ వంటి పదార్థాలు శరీరంపై దీర్ఘకాలిక దుష్ర్పభావాలను చూపిస్తుందని అధ్యయనంలో తేలడంతో 2016 నుంచి ఎఫ్డీఏ యాంటీ బాక్టీరియల్ సబ్బుల అమ్మకాలపై నిషేదం విధించింది. పీహెచ్ లెవల్ పెరిగితే చర్మ సమస్యలు ప్రస్తుతం శానిటైజర్ల వినియోగం బాగా పెరిగింది. అయితే 60-95% ఆల్కహాల్ సాంద్రత కలిగిన హ్యాండ్ శానిటైజర్లు సూక్షజీవులను చంపడంలో ఎక్కువ శక్తిమంతమైనవి. అయితే ఎక్కువసార్లు శానిటైజర్ వాడటం వల్ల చేతులు పొడిబారే అవకాశం ఉంది. పీహెచ్ లెవర్ ఎక్కువగా ఉన్న సబ్బులు వాడటం వల్ల శరీరం దురద, మంట, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తక్కువ పీహెచ్ లెవల్ ఉన్న సబ్బులు వాడాలి. అంతే కాకుండా సబ్బులను డైరెక్ట్ గా వాడకుండా తప్పకుండా నీరు కలిపి వాడాలి. హెర్బల్, యాంటీ ఆక్నె, శరీరం చర్మ తత్వాన్ని బట్టి సబ్బులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. -
మానసిక స్థయిర్యమే నా బలం: కోహ్లి
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తను శారీరక దృఢత్వంకంటే మానసిక సంసిద్ధతకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానని చెప్పాడు. అందుకే ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే తిరిగి అదేస్థాయిలో ఆటను మొదలుపెట్టే బలం తనలో ఉందన్నాడు. ఐపీఎల్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని... ఒకే టోర్నీలో అన్ని దేశాల వారినీ కలుపుకొని ఆడుతూ అందరినీ అలరించే లీగ్ అని చెప్పాడు. అయితే కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు మునుపటిలా ఉండవని... తప్పకుండా మార్పులుంటాయని... వీటిని అంగీకరించాల్సిందేనన్నాడు. ‘ఐసీసీ టోర్నీలకంటే భిన్నమైంది ఐపీఎల్. అందుకే ఆ లీగ్ అంటే నాకెంతో ఇష్టం. మనతో కొత్తగా ఆడేవాళ్లతో మన అనుభవాలు పంచుకోవచ్చు. పాతవాళ్లతో అనుబంధం కొనసాగించవచ్చు. ఎప్పుడోగానీ చూసే విదేశీ ఆటగాళ్లతో తరచూ కలిసి ఆడే అవకాశం ఈ లీగ్ ద్వారానే కలుగుతుంది. అందుకే ఐపీఎల్ అంటే అందరికీ మోజే. అభిమానులకు క్రేజే’ అని అన్నాడు. మీ ఫేవరెట్ మ్యాచ్ ఏదనే ప్రశ్నకు బదులిస్తూ ‘ఇది చెప్పడం తేలిక కాదు. ఎందుకంటే అలాంటివి నాకెన్నో ఉన్నాయి... అయితే అప్పటి పరిస్థితి, ప్రాధాన్యతను బట్టి చూస్తే టి20 ప్రపంచకప్ (2016)లో భాగంగా మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన పోరు నా ఫేవరెట్ మ్యాచ్ల్లో ఒకటి. ఓడిపోయేస్థితిలో ఉన్న ఈ మ్యాచ్లో మేము గెలిచాం’ అని చెప్పాడు. -
ఆహార ‘శైలి’ మారింది!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో జనాలంతా ఇంటికే పరిమితమవడంతో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో రోజువారీ ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. మామూలు రోజుల్లో తీసుకునే ఆహారానికి బదులు పోషకాలున్న ఆహారానికే మొగ్గుచూపుతున్నారు. ఖాళీ సమయాల్లో అధిక తిండితో ఊబకాయం, డయాబెటిస్, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి అనారోగ్యాల బారిన పడరాదన్న వైద్యుల సూచనలకు అనుగుణంగా తమ ఆహార శైలిని మార్చుకుంటున్నారు. తృణధాన్యాలు, బ్రౌన్రైస్, బ్రెడ్, పాలు, చేపలు, గుడ్లు, చికెన్ వంటి ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సమతుల ఆహారానికి ప్రాధాన్యం.. లాక్డౌన్తో రెస్టారెంట్లు, హోటళ్లు పూర్తిగా మూతపడటంతో బయటి నుంచి ఆహారం తెచ్చుకొని తినే పరిస్థితులు లేవు. దీంతో ఇంటి ఆహారం తప్పనిసరైంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో సమతుల ఆహారం తీసుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం, వైద్యులు సూచిస్తున్నారు. దీంతో పప్పుల వినియోగం పెరిగింది. పిండి వంటకాలు ఎక్కువగా వండుతున్నారు. హెర్మల్ టీ తాగుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లు మూతపడినప్పటికీ రాష్ట్రంలో ఆరెంజ్, దానిమ్మ, అరటిపళ్లు, మోసంబి, వాటర్ మిలన్ల సగటు వినియోగం ప్రతి రోజూ 20 వేల క్వింటాళ్లకు పైనే ఉంది. పండ్లను స్వయంగా ఇంటికే సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో వీటి వినియోగం పెరిగింది. ఇక సగటున వారానికి డజన్ కోడి గుడ్లను తినే కుటుంబాలు ఇప్పుడు రెండు డజన్లు తింటున్నాయి. యూట్యూబ్ చిట్కాలతో వంటలు.. రాష్ట్ర ప్రభుత్వం జొమాటో, స్విగ్గీ సర్వీసులను పూర్తిగా నిలిపివేయడంతో స్వయం పాకం తప్పనిసరైంది. వంట చిట్కాలకై ఎక్కువగా బ్యాచిలర్స్, ఐటీ ఉద్యోగులు గూగుల్పైనే ఆధారపడుతున్నారు. కేక్ మొదలు, బర్గర్ వరకు, బటర్ చికెన్ నుంచి చికెన్ బిర్యానీ వరకు ఎలాంటివి తినాలన్నా.. చిట్కాలకై యూట్యూబ్ వీడియోలు, పలు వంటకాల యాప్లపై ఆధారపడుతున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చికెన్ బిర్యానీకై సుమారు 15 లక్షల మంది గూగుల్లో శోధించారు. చికెన్ టిక్కా మసాలా, తందూరీ చికెన్, పాలక్ పన్నీర్, దహీవడ, పానీపూరి, కేక్ల తయారీకై శోధించిన వారి సంఖ్య ఈ నెల రోజుల్లో 120 శాతం పెరిగిందని ఆన్లైన్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. చాలా కుటుంబాలు కలిసి భోజనం చేస్తుండటంతో ఆరోగ్యకర భోజనం వండటానికి ఆసక్తి కనబరుస్తున్నారని సర్వేల్లో తెలింది. నో డ్రింక్స్.. ఓన్లీ పాలు, పెరుగు.. లాక్డౌన్ నేపథ్యంలో ప్రధాన కూల్డ్రింక్స్ సంస్థలన్నీ తమ ఉత్పత్తులను నిలిపివేయడంతో వాటి లభ్యత పూర్తిగా పడిపోయింది. దీంతో కూల్డ్రింక్స్ స్థానంలో పాలు, పెరుగు వినియోగం పెరిగిందని సర్వేల ద్వారా తెలుస్తోంది. స్వీట్స్ వంటి వాటికి వినియోగించే పాలు ఇప్పుడు రోజువారీ అవసరాలకు మళ్లాయని, ప్యాకేజ్డ్ పాల వినియోగం లాక్డౌన్ తర్వాత 15 నుంచి 25 శాతం పెరిగిందని సర్వేలు తెలిపాయి. డ్రింక్స్కు బదులు ప్రతి ఇంట్లో వేసవి తాపానికి విరుగుడుగా ఇప్పుడు చల్లని మజ్జిగ, నిమ్మకాయ రసాలు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారని బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి నగరాల్లో చేసిన సర్వేలో వెల్లడైంది. లాక్డౌన్ తర్వాత కూడా అన్ని రంగాలపై ఆర్థిక వ్యవస్థ తన ప్రభావం చూపుతున్నందున ప్రజలు తినడానికి రెస్టారెంట్లు, బార్లకు రారని తెలిపింది. ఆరోగ్య భయాలతోనూ బయటి ఆహారాన్ని తినేందుకు పెద్దగా ఆసక్తి చూపరని వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా 40 శాతానికి పైగా రెస్టారెంట్లు మూతపడే అవకాశం ఉందని తెలిపింది. -
జల కల్పన
ఆమె ఓ ఆర్కిటెక్ట్. లక్షల రూపాయలు ఆర్జించే అవకాశం ఉన్న తన కెరీర్కే పరిమితమై పోకుండా భావితరాలకు విలువైన నీటి బొట్టును ఒడిసిపట్టి అందించేందుకు జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. తరిగిపోతున్న జలసంపదను పది కాలాల పాటు నిల్వచేసేందుకు వినూత్న డిజైన్లు రూపొందించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ననలు పొందారు. ప్రధాని సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు అర్హత సాధించిన ఏడుగురిలో ఒకరిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమే కల్పనా రమేశ్. హైదాబాద్లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు కల్పనా రమేష్. సాహె (సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్) సంస్థను స్థాపించి దశాబ్దకాలంగా వర్షపునీటి సంరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు. ప్రధాని దృష్టి నేను రూపొందించిన వర్షపు నీటి సంరక్షణ డిజైన్లు, చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై సోషల్ మీడియా వేదికగా కొన్ని గ్రూపులకు చెందినవారు దేశవ్యాప్తంగా ఆయా గ్రూపుల్లో పోస్ట్ చేయడంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ట్యాగ్చేశారు. దీంతో ప్రధానమంత్రి కార్యాలయ ‘మై గౌ’ సైట్ సీఈఓ మార్చి 6న నాకు ఫోన్చేసి పీఎం సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు మీరు అర్హత సాధించారని చెప్పడంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. ఈ గుర్తింపు నా బాధ్యతను మరింత పెంచింది. నేరుగా ప్రధాని నరేంద్రమోడీకి సంబంధించిన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సైట్లలో నేను సమాచారాన్ని పొందుపరిచే అవకాశం ఉండదు. మైగౌ సైట్ సీఈఓకు సమాచారం చేరవేస్తే వారు నేను అందించే సమాచారాన్ని పరిశీలించి నా తరఫున ఆయా సైట్లలో నేను కోరిన సమాచారాన్ని పోస్ట్చేస్తారు. ఈ విధానంలో నా ఆలోచనలు, డిజైన్లు కోట్లాదిమందికి చేరతాయని సంతోషంగా ఉంది. విస్తృత అవగాహన గత మూడేళ్లుగా వర్షపునీటి సంరక్షణపై 150కి పైగా అవగాహన కార్యక్రమాలు, 50 ప్రత్యేక చర్చాగోష్ఠులు నిర్వహించాం. తాజాగా హైదరాబాద్లోని సిల్వర్ఓక్ విద్యాసంస్థలో 6–8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వాననీటి సంరక్షణపై రెండునెలలు క్లాస్రూమ్లో, మరో రెండు నెలలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాం. వాళ్లు వెళ్లి ఇళ్లు, కాలనీల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవలే మజీద్ బండ (కొండాపూర్) ప్రాంతంలో కొడికుంట చెరువును మా సాహె సంస్థ దత్తతకు తీసుకుంది. ఈ చెరువులోకి వర్షపునీరు చేరే ఇన్ఫ్లో ఛానల్స్ను ప్రక్షాళన చేస్తోంది. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇళ్లు, కార్యాలయాల విస్తీర్ణం, నిర్మాణ డిజైన్లను బట్టి వాననీటి సంరక్షణ పిట్స్ను మేము డిజైన్ చేస్తున్నాం. నా స్వస్థలం బెంగళూరు. ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేశాను. విద్యాభ్యాసం అక్కడే సాగింది. కానీ గత 20 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో ఉంటున్నాం. ఇప్పుడు ఇదే నా ఓన్సిటీ. ఇక్కడే వర్షపునీటి సంరక్షణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాను. నా భర్త రమేష్ లోకనాథన్ది సాఫ్ట్వేర్ రంగం. ఆయన సహాయ సహకారాలు కూడా నాకెంతగానో ఉన్నాయి. వర్షపు నీటి నిల్వపై క్షేత్రస్థాయిలో పిల్లలకు అవగాహన భవిష్యత్ లక్ష్యం ‘చినుకు.. చినుకు ఒడిసిపట్టు.. భావితరాలకు దాచిపెట్టు’ అన్న నినాదంతో వర్షపునీటిని ఒడిసిపట్టే కృషిలో నిర్విరామంగా పనిచేస్తున్నాను. భవిష్యత్లో నా సేవలు, డిజైన్లు ప్రధాని సోషల్మీడియా అకౌంట్ల ద్వారా కోట్లాదిమందికి చేరనున్నాయి. ఈ జలయజ్ఞంలో ప్రతీ భారతీయుడు భాగస్వామి కావాలన్నదే నా లక్ష్యం.. నా స్వప్నం. కాంక్రీట్ మహారణ్యంలా మారిన నగరాల్లో వర్షపునీటిలో 80 శాతం వృథా అవుతోంది. ఇందులో 50 శాతం ఒడిసిపట్టినా నీటి కరువు ఉండదన్నదే నా నిశ్చిభిప్రాయం’’అని ముగించారు కల్పన. – ఏసిరెడ్డి రంగారెడ్డి, సాక్షి, హైదరాబాద్ నీటి బ్యాంకు! ఇళ్లు, అపార్ట్మెంట్లలో తక్కువ ఖర్చుతో వర్షపునీటిని సంరక్షించుకోవచ్చు. ఇంటి పైకప్పుపై కురిసిన వర్షపునీటిని నేరుగా కింద ఉన్న నీటి సంపులో నింపుకోవాలి. ఇలా ఇంటి విస్తీర్ణాన్ని బట్టి 30 వేల నుంచి లక్ష లీటర్ల వరకు నిల్వచేయవచ్చు. ఇది నిండిన తరవాత ఓవర్ఫ్లో అయ్యే నీటిని ఎండిన బోరుబావిలోకి మళ్లిస్తే మీకు ఏడాదికి సరిపడా జలబ్యాంక్ అందుబాటులో ఉంటుంది. ట్యాంకర్ కష్టాలు లేకుండా చూసుకోవచ్చు. ఏడాదికి సుమారు 35–45 రోజుల పాటు వర్షం తప్పక కురుస్తుంది. ఇందుకోసం ఒకసారి రూ.15–రూ.25 వేల వరకు ఖర్చు చేస్తే సరిపోతుంది. ఉదా.. వెయ్యి చదరపు అడుగుల భవనం రూఫ్టాప్పై పడిన వర్షపు నీటిని ఒడిసిపడితే 70 వేల లీటర్ల జలబ్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి వందరోజుల పాటు సరిపోతాయి. ఇక 2000 చదరపు అడుగుల భవనానికి 1.40 లక్షల లీటర్లు, 3000 చదరపు అడుగుల భవనంపై కురిసిన నీటి ద్వారా 2.10 లక్షల లీటర్లు, 4000 చదరపు అడుగుల భవనానికి 2.80 లక్షల లీటర్ల జలబ్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. కల్పన -
కమలా మేడమ్
‘వెల్కమ్ మై ఫ్రెండ్’ అంటూ మొదలయ్యే మూడు వాక్యాల బుల్లి కథ. దానికి తెలుగులో అర్థం. ఎదురుగా బొమ్మ. మరో పేజీలో ‘ద ఎలిఫెంట్ అండ్ ద డాగ్ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్’ అంటూ ఏనుగు– కుక్క కథ. ఇవన్నీ స్కూలుకెళ్లే పిల్లల కోసం అజ్వాని కమల మేడమ్ రూపొందించిన చిన్న కథల పుస్తకాల్లోని బుజ్జి బుజ్జి కథలు. ‘ఐ కెన్ రీడ్ బై మైసెల్ఫ్’ అంటూ ఆమె చిన్న పిల్లల కోసం కథల పుస్తకాలు తయారు చేశారు. ఇందుకు తగిన కారణమే ఉంది. కారణం కన్నా ఆమె స్వీకరించిన సామాజిక బాధ్యత ఉంది. ‘‘మన దగ్గర తెలుగు మీడియంలో చదివే పిల్లలకు పదేళ్లు వచ్చేవరకు ఇంగ్లిష్తో పరిచయమే ఉండడం లేదు. ఐదారు తరగతుల్లో ఇంగ్లిష్ అక్షరాలు నేర్చుకోవడం, ఆ వెంటనే పాఠాలు మొదలవుతున్నాయి. బాగా చదువుతూన్న పిల్లలు కూడా ఇంగ్లిష్ భయంతో స్కూలు ఎగ్గొడతారు. నిజానికి ఇంగ్లిష్ భాష పిల్లలను బడి దొంగలుగా మార్చే మహమ్మారి కాదు. చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్ను పరిచయం చేస్తే పెద్దయ్యాక ఇంగ్లిష్ని మించిన ఫ్రెండ్ మరొకరు ఉండరు. భూగోళంలో ఎక్కడికి వెళ్లినా మనకు తోడు ఎవరూ లేకపోయినా ఇంగ్లిష్ భాషే తోడుగా ఉండి నడిపిస్తుంది’’ అంటారు కమలా మేడమ్. మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యలో ఇంగ్లిష్ లేకపోవడం తో ఆమె స్వయంగా కరికులమ్ రూపొందించారు. లెవెల్–1, లెవెల్–2.. ఇలా మొత్తం 120 పుస్తకాలకు రూపమిచ్చారు. తొంభయ్ ఏళ్ల వయసులో చలాకీగా స్కూళ్లకు వెళ్లి ఆ పుస్తకాలను పిల్లలకు పంచుతున్నారు, ఇంగ్లిష్ పాఠాలు చెబుతున్నారు. తెలుగింటి కోడలు కమల 1931లో చెన్నైలో జన్మించారు. విద్యావంతుల కుటుంబం. తండ్రి అజ్వాని డాక్టర్, తల్లి చంద్రావతి. కమల ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. జెట్టి దశరథరామిరెడ్డిని పెళ్లి చేసుకుని నెల్లూరును సొంతూరు చేసుకున్నారామె. ఆమెకు చదువుకోవడం, చదువు చెప్పడం ఇష్టం. ఆ ఇష్టంతోనే పెళ్లి తర్వాత ఎం.ఈ. చేశారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం చేశారు. అదే సమయంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ అవసరాన్ని తెలియచేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆమె సూచనతో 1962లో ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడలో మహిళా పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించింది. అది ఆసియా ఖండంలోనే మహిళల కోసం స్థాపించిన తొలి పాలిటెక్నిక్ విద్యాసంస్థ. ఆ కాలేజ్కు ప్రిన్సిపల్గా కమలా మేడమ్నే నియమించింది ప్రభుత్వం. గుంటూరు, మహిళా పాలిటెక్నిక్ కాలేజ్, నెల్లూరు కరికులం డెవలప్మెంట్ సెంటర్లో విధులు నిర్వర్తించారు. తేలిగ్గా చదవాలి ప్రభుత్వ స్కూలు పిల్లలతో కమలామేడమ్ విద్యావిధానాన్ని తేలిక పరిచిన గురువు ఆమె. సివిల్ ఇంజనీరింగ్ సిలబస్లో పాఠ్యాంశాలు బరువైన శాస్త్ర సాంకేతిక పదాలతో ఉండేవి. ఇంగ్లిష్ నేపథ్యం లేని విద్యార్థులకు ఏ మాత్రం కొరుకుడు పడనంత కఠినమైన పారిభాషిక పదాలుండేవి. దాంతో స్టూడెంట్స్ ఫెయిలయ్యేవాళ్లు. కొంతమంది కోర్సు సగంలో వదిలేసే వాళ్లు. ఇదంతా గమనించిన కమలామేడమ్కి సబ్జెక్టు సులభంగా అర్థం అయితే ఈ దుస్థితి రాదనిపించింది. తేలికైన ఇంగ్లిష్పదాలతో ఇంజనీరింగ్ పాఠ్యాంశాలన్నింటినీ తిరిగి రాశారామె. అలా ఇంజనీరింగ్ వాళ్ల కోసమే పదకొండు పుస్తకాలు రాశారు. ఆమె చూపించిన దారిలోనే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ప్రొఫెసర్లు కూడా కొత్త పుస్తకాలు రాసుకున్నారు. విద్యార్థుల కోసం ఆమె తీసుకున్న ఆ చొరవ ఆమెను విద్యాశాఖ టెక్నికల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ని చేసింది. కీలకమైన బాధ్యతలు నిర్వర్తించి 1989లో రిటైర్ అయ్యారు కమల. అమెరికా వెళ్లారు.. కానీ కమలామేడమ్కి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరూ యూఎస్లో సెటిలయ్యారు. రిటైర్ అయిన తర్వాత భర్తతో పాటు మేడమ్ కూడా అమెరికా వెళ్లారు. ఎనిమిది మంది మనుమలు– మనుమరాళ్లతో సంపూర్ణమైన జీవితాన్ని గడిపారు. ఐదేళ్ల కిందట భర్త పోవడంతో ఆమె ఇండియాకు తిరిగి వచ్చేశారు. మిగిలిన జీవితం సమాజానికే అని స్థిరంగా నిశ్చయించుకున్నారు. నాలుగేళ్ల నుంచి ఆమె నెల్లూరు జిల్లాలోని గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పించడం అనే మహాయజ్ఞాన్ని తలకెత్తుకున్నారు. శేష జీవితం విద్యాసేవకే అంకితం అని స్వచ్ఛంగా నవ్వారు కమలా మేడమ్. – కొండా సుబ్రహ్మణ్యం, సాక్షి, నెల్లూరు ఫొటోలు: ఆవుల కమలాకర్ ఇంగ్లిష్ మీడియం అత్యవసరం ప్రస్తుతం అన్నిరంగాల్లో పోటీ పెరిగింది. ఉద్యోగాలు రావాలంటే ఇంగ్లీష్ రాయడం, చదవడం, మాట్లాడటం బాగా వచ్చి ఉండాలి. ఇంగ్లిష్ రాకపోవడం అనే ఒకే ఒక్క కారణంగా చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా వాళ్ల చదువుకు సంబంధం లేని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వపాఠశాలల్లో మాతృభాషతో పాటు ఇంగ్లీషులో విద్యాబోధన జరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు. రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఆలోచించగలిగిన దార్శనికత అది. – అజ్వాని కమల, విశ్రాంత జాయింట్ డైరెక్టర్, స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు -
స్వాతికి తెలియదు
స్వాతికే కాదు.. సీతకు, శ్వేతకూ తెలియదు. పల్లవికి, ప్రవల్లికకూ తెలియదు. బాధ్యతగా ఆమె పప్పుల్నీ, ఉప్పుల్నీ లెక్కగట్టి మూడు పూటలా ఇంటిని నడిపిస్తున్నప్పుడు.. బాధ్యతగా అతడూ అప్పుల్నీ, తప్పుల్ని ఏరోజు కారోజు ఇంటికి రాగానే చీటీలో రాసి ఆమె చేతిలో పెట్టాలి. నెలకోసారి.. పే స్లిప్ చూపించడం కాదు. గైస్.. ఒక రూపాయి అప్పు చేసేముందు ఆమెకు ఫోన్ చేసి చెప్పండి.. ఫోన్కి పది రూపాయలు అవుతున్నా సరే! ఒక సంతకం పెట్టే ముందు ఆమె అనుమతి తీసుకోండి.. ఆమె కోసం మీరు కొనబోతున్న శ్వేత సౌధపు అగ్రిమెంట్ కాగితాలైనా సరే. ఉదయం ఆఫీస్కి వెళ్లిన నాన్న సాయంత్రం కొత్త కారుతో ఇంటికి వస్తే పిల్లలు వాకిట్లోకి ఒక్క గెంతు గెంతి ‘హే.. కొత్త కారు’ అని కారులోకి దూకి కూర్చుంటారు. మరీ చిన్నపిల్లలైతే వెళ్లి స్టీరింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ని ‘జుయ్జుయ్’మని తిప్పుతారు. ‘మనదేనా నాన్నా’.. పిల్లలు అడిగే మొదటి ప్రశ్న. ‘ఎక్కడికెళ్దాం నాన్నా’.. రెండో ప్రశ్న. పిల్లల్ని ఎత్తుకుని బుగ్గలపై ముద్దుపెడుతూ భార్య వైపు చూస్తాడు అతడు. ‘మనదే కారు’ అంటూ ఒక ముద్దు. ‘నువ్వు చెప్పు ఎక్కడికెళదామో’ అంటూ ఇంకో ముద్దు. పిల్లలు అడిగినట్లే ఆమెకూ ఒక ప్రశ్న అడగాలని ఉంటుంది. ‘ఎక్కడిదండీ కారు?’ అని. కానీ అడగదు. అడిగితే, కారు ఎలా ఉందో చెప్పకుండా, కారు ఎలా వచ్చిందో చెప్పమని అడుగుతుందేమిటి’ అని భర్త నొచ్చుకుంటాడేమోనని ఆమె భయం. నొచ్చుకుంటాడన్న భయంతో ఆమె అతడిని చాలానే అడగలేదు. పెళ్లయి ఏడెనిమిదేళ్లు అవుతున్నా ఏ నెలలోనూ జీతమెంత అని భర్తను అడగలేదు. జీతంలో కటింగ్స్ ఎన్ని అని అడగలేదు. ఇంట్లోకి ఒకేసారి హైఎండ్ ఏసీ, ఫ్రిజ్, వాషింగ్మిషన్, టీవీ.. ఇంకా రెండుమూడు ‘చిన్న వస్తువుల్ని’ పిల్లల ఆటబొమ్మల్లా భుజాన మోసుకొచ్చిప్పుడు కూడా భుజం మీద నుంచి బరువును దింపిందే తప్ప, దింపాక పెరిగే వాటి బరువు గురించి అతడిని అడగలేదు. ‘ఈఎమ్ఐల్లో తెచ్చా. చిటికెలో అయిపోతాయి’ అని అన్నప్పుడు కూడా ఎవ్రీ మంత్ శాలరీ కన్నా, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ ఎక్కువైపోవు కదా’ అని అడగలేదు. అడిగితే అతడు నొచ్చుకుంటాడు. ‘చిన్న వస్తువుల్ని’ ఇంటికి తెచ్చిన కొన్నాళ్లకే ఓరోజు అతడు ఆమె కళ్లకు గంతలు కట్టి కారులో ఓ పెద్ద ఇంటికి తీసుకెళ్లాడు. గంతలు విప్పాక, కళ్లు నులుముకుని చూసి, అప్పుడు మాత్రం అడిగింది, ‘ఎవరిల్లండీ, బాగుంది’ అని! ‘మనదే!’ అనలేదు అతను. ‘నీదే’ అన్నాడు. ‘నీ కోసమే’ అన్నాడు. అతడెప్పుడూ అలాగే మాట్లాడతాడు. మాట్లాడ్డం కాదు, నిజంగానే అతడు చేసేవన్నీ ఆమె కోసమే. చేయాలనుకునేవన్నీ ఆమె కోసమే. ‘ఇప్పుడున్న ఇంటికే అంత అద్దె కడుతున్నాం. ఈ ఇంటికి ఇంకా ఎక్కువ ఉండదా’ అంది.. కొత్త గోడల్ని, కొత్త తలుపుల్ని, కొత్త కిటికీల్ని తడిమి చూస్తూ. పెద్దగా నవ్వి, ఆమె చుట్టూ చేతులు వేసి గాల్లోకి లేపాడు అతడు. ‘ఇది మన సొంతిల్లు. నీ కోసం, పిల్లల కోసం కొన్న ఇల్లు’ అన్నాడు. ‘ఇకనుంచి మనం అద్దె కట్టనక్కర్లేదు’ అన్నాడు. ‘ఆ కట్టేదేదో మన సొంత ఇంటికి కట్టుకుంటే సరిపోతుంది’ అన్నాడు. కట్టుకున్నది సొంతిల్లు అవుతుంది కానీ, నెల నెలా కట్టేది సొంతిల్లు అవుతుందా! ఆ మాటే ఆమె అనబోయింది. అతడు అననివ్వలేదు. ప్రశ్నలు కట్టిపెట్టు అని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అతడి చేతుల్లో ఆమె భద్రంగా ఉంది. ఇంత భద్రత కొత్తింట్లో ఉంటుందా.. పది వేల అద్దెకు బదులు నెలనెలా కట్టే ఇరవై వేల లోన్ కట్టవలసిన ఇంట్లో?! అతడు సంతోషంలో ఉన్నాడు. తనకొచ్చిన సందేహాలన్నీ భర్తకూ వచ్చి ఉంటాయి. అయినా సంతోషంగా ఉన్నాడూ అంటే.. తను వేరుగా సందేహపడాల్సిందేమీ లేదు. కుడికాలు లోపలికి పెట్టింది. పిల్లలు ‘ఓ.. ఓ..’ అంటూ కొత్తింట్లోని హాల్లోకి, బెడ్రూమ్లోకి, కిచెన్లోకి, బాత్రూమ్లోకి, బాల్కనీలోకి పరుగులు తీస్తున్నారు. ఎంత పిల్లల్తో పోటీపడి పరుగెత్తలేని కాలమైనా రోజుల్ని, వారాల్ని దాటి నెల దగ్గరికి వచ్చేస్తుంది. నెల తర్వాతి నెలకూ వచ్చేస్తుంది. ‘కాస్త టైట్గా ఉంది గురూ. వచ్చే నెల రెణ్ణెల్ల ఇంట్రెస్ట్ కలిపి ఇచ్చేస్తా..’ ఆమె వాకిట్లో ముగ్గేస్తోంది. అతడు ఆమెకు వినిపించనంత దూరం వెళ్లి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆఫీస్లోనే కాదు, ఇంట్లో ఉన్నప్పుడైనా ఫోన్లో ఏ ఉద్యోగం చేస్తుంటే ఆ మాటలే రావాలి. టెకీ అయితే అదేదో జార్గాన్ ఉంటుంది. ఫ్లోచార్టు, డీబగ్, లైఫ్ సైకిల్, టెస్టబుల్ కోడ్.. ఇలాంటి మాటలు రావాలి. డాక్టర్ అయితే రిపోర్ట్స్ అనీ, ఇన్వెస్టిగేషన్ అనీ, మెడికల్ హిస్టరీ అనీ రావాలి. జర్నలిస్ట్ అయితే ప్రెస్మీట్ అని, స్కూప్ అనీ, లీడ్ అనీ ఏవో ఉంటాయి. అవి రావాలి. ఇవేమీ కాకుండా టైట్గా ఉందనీ, ఒకేసారి రెణ్ణెల్లదీ ఇచ్చేస్తాననీ అంటున్నాడంటే.. అదీ ముంగిట్లో ముగ్గు పడే వేళ నుంచే కొత్తగా ‘టైట్ టాక్’ మొదలవుతోందంటే.. ఏనాడూ భార్యాబిడ్డల్తో కలిసి కూర్చుని భోజనం చేసే స్థిమితం కూడా లేని అతడు.. త్వరలోనే త్వరగా ఇంటికి రాబోతున్నాడనే! త్వరగా ఇంటికి వచ్చిన ఆ రాత్రి.. తనని చూసి కేరింతలు కొడుతూ నిద్రమానుకున్న పిల్లలతో కలిసి.. తండ్రీ బిడ్డల్ని చూసి మురిసిపోతున్న భార్యతో కలిసి.. భోజనం చేయబోతున్నాడనే! బయటి నుంచి తను తెచ్చిన ‘ఫుడ్ ఐటమ్స్’ని అందరి భోజనంలో తలా ఇంత చేర్చి పిల్లలకు, భార్యకు తనే మొదటి ముద్ద తినిపించబోతున్నాడనే! హైదరాబాద్లో శనివారం రాత్రి ఇలాగే ఓ కుటుంబం ‘కలిసి భోజనం’ చేసింది! అతడు, ఆమె, ఇద్దరు పిల్లలు. ఆరేళ్లొకరికి. ఏడాదిన్నరొకరికి. టెకీ అతను. చిన్న వయసే. పెద్ద కంపెనీలో పని. పెద్ద జీతం. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. బిజినెస్ చేసి అప్పు తీర్చాలనుకున్నాడు. బిజినెస్ కోసం మళ్లీ అప్పు చేశాడు. బాగా బతకడం కోసం కాదు ఇవన్నీ. ఇంకా బాగా బతకడం కోసం. చివరికి బతకలేక తనను, కుటుంబాన్ని చంపుకున్నాడు! జీతం అప్పును పుట్టిస్తుంది. అప్పును కట్టలేదు. ఒకట్రెండు వాయిదాలైతే జీతం తీర్చేస్తుంది. అప్పుల్ని, వడ్డీల్ని తీర్చే కెపాసిటీ ఎంత పెద్ద జీతానికైనా ఉండదు. ఆ సంగతి అతడికెవరూ చెప్పలేకపోయారా! ఇంత జరుగుతోందని అతడెవరికైనా చెబితేనే కదా! భార్యకు కూడా చెప్పలేదు. చనిపోతూ తండ్రికి రాసిన ఉత్తరంలో మాత్రం చెప్పాడు. ‘స్వాతికి ఇవేవీ తెలియదు నాన్నా..’ అని చెప్పాడు! స్వాతి అతడి భార్య. అతడు నొచ్చుకుంటాడని అతడిని ఏనాడూ ఎందుకు, ఎలా అని అడగని భార్య.. ‘బతకాలని ఉంది స్వాతీ’ అని ఒక్కమాట అని ఉంటే.. బతకలేనంత కష్టం ఏమొచ్చిందో అడిగి తెలుసుకుని ఉండేది. కష్టమో, నష్టమో కలిసే బతుకుదాం అని ధైర్యం చెప్పి ఉండేది. మాటైనా చెప్పకుండా భార్యనీ పిల్లల్నీ తనతో తీసుకుపోయాడు! l -
జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని కనుమా!
మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, పవిత్రమైన ప్రభల తీర్థం. జగ్గన్నతోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం గానీ ఉండవు, అంతా కొబ్బరితోటలే. ఏకాదశ రుద్రులు కొలువు తీరడం వలన జగ్గన్నతోట ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను, చారిత్రాత్మక విశిష్టతను సంతరించుకున్నది. ఏకాదశ రుద్రుల కొలువు లోక కళ్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్ధం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ, అప్పటినుండి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్ధం నిర్వహించబడుతున్నదని చారిత్రాత్మక కథనం. పూర్వం పెద్దాపురం సంస్థానాధీశులైన రాజా వత్సవాయి జగన్నాధ మహారాజు (జగ్గన్న) గారు ప్రభల తీర్థానికి విచ్చేసి, ఏకాదశ రుద్రులను దర్శించి, ప్రభల తీర్ధం ఘనంగా నిర్వహించేందుకు అవిరళ కృషి సల్పినారనీ, నాటి జగ్గన్న పూజల ఫలితంగానే ప్రభల తీర్థం జరిగే ప్రదేశం ‘జగ్గన్న’ తోటగా ప్రసిద్ధికెక్కిందని చారిత్రాత్మక కథనం. ప్రభల తీర్థం రోజున ఏకాదశ రుద్ర గ్రామాలలో కొలువున్న స్వామి వార్లు గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వర స్వామి, గంగలకుర్రు– చెన్నమల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం–వ్యాఘ్రేశ్వరస్వామి, పెదపూడి– మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక–కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు–చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల–రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి–మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి–చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు–అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి వార్లను ప్రభలపై మేళతాళాలతో, భాజా భజంత్రీలతో, మంగళ వాయిద్యాలతో జగ్గన్నతోటకు ఊరేగింపుగా తీసుకొని రావడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రభల తీర్థానికి ఆతిథ్యమిచ్చు మొసలపల్లి–మధుమానంత భోగేశ్వరస్వామి అన్ని ప్రభలకన్నా ముందుగా జగ్గన్న తోటకు చేరుకొని, ప్రభలు అన్నింటికీ ఆహ్వానం పలికి తిరిగి వెళ్ళేవరకూ ఉండటం సాంప్రదాయం. అలాగే జగ్గన్నతోట ప్రభల తీర్థానికి అధ్యక్షత వహించే వ్యాఘ్రేశ్వరస్వామి వారి ప్రభల తీర్ధం లోనికి ప్రవేశించినపుడు మిగిలిన రుద్ర ప్రభలను ఒకసారి పైకి లేపడం సంప్రదాయం. అలాగే జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ప్రత్యేకవిశిష్టతను సంతరించుకున్న గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వర స్వామి, గంగలకుర్రు–చెన్నమల్లేశ్వరస్వామి వార్ల ప్రభావాహనాలను కౌశికలో నుండి అవతలి ఒడ్డుకు చేర్చడం వంటి రమణీయ దృశ్యాలు చూడటానికి రెండు కన్నులూ చాలవు. ముఖ్యంగా జగ్గన్న తోట ప్రభల తీర్థంలో ప్రత్యేక ఆకర్షణగా విరాజిల్లుతూ, చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉండి, అన్ని ప్రభల కన్నా ఆఖరుగా వచ్చే గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వరస్వామి ప్రభావాహనం తీర్ధంలోనికి వచ్చేవరకూ మిగిలిన ప్రభలు కూడా వేచి ఉండటం విశేషం. నిండు ప్రవాహంలో విశ్వేశ్వరస్వామి వారిని ఓలలాడిస్తూ కౌశికను దాటించే తీరు కన్నులారా తిలకించే భక్త జన సందోహ ఆనందానికి అవధులు లేవంటే అతిశయోక్తి కాదు. అలా ఏక కాలంలో ఏకాదశ రుద్రులను ఒకే వేదికపై దర్శించి, తరించే భాగ్యం మరి ఏ ఉత్సవాలలోనూ కలగదు. నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని కనుమా!
మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, పవిత్రమైన ప్రభల తీర్థం. జగ్గన్నతోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం గానీ ఉండవు, అంతా కొబ్బరితోటలే. ఏకాదశ రుద్రులు కొలువు తీరడం వలన జగ్గన్నతోట ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను, చారిత్రాత్మక విశిష్టతను సంతరించుకున్నది. ఏకాదశ రుద్రుల కొలువు లోక కళ్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్ధం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ, అప్పటినుండి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్ధం నిర్వహించబడుతున్నదని చారిత్రాత్మక కథనం. పూర్వం పెద్దాపురం సంస్థానాధీశులైన రాజా వత్సవాయి జగన్నాధ మహారాజు (జగ్గన్న) గారు ప్రభల తీర్థానికి విచ్చేసి, ఏకాదశ రుద్రులను దర్శించి, ప్రభల తీర్ధం ఘనంగా నిర్వహించేందుకు అవిరళ కృషి సల్పినారనీ, నాటి జగ్గన్న పూజల ఫలితంగానే ప్రభల తీర్థం జరిగే ప్రదేశం ‘జగ్గన్న’ తోటగా ప్రసిద్ధికెక్కిందని చారిత్రాత్మక కథనం. ప్రభల తీర్థం రోజున ఏకాదశ రుద్ర గ్రామాలలో కొలువున్న స్వామి వార్లు గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వర స్వామి, గంగలకుర్రు– చెన్నమల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం–వ్యాఘ్రేశ్వరస్వామి, పెదపూడి– మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక–కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు–చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల–రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి–మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి–చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు–అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి వార్లను ప్రభలపై మేళతాళాలతో, భాజా భజంత్రీలతో, మంగళ వాయిద్యాలతో జగ్గన్నతోటకు ఊరేగింపుగా తీసుకొని రావడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రభల తీర్థానికి ఆతిథ్యమిచ్చు మొసలపల్లి–మధుమానంత భోగేశ్వరస్వామి అన్ని ప్రభలకన్నా ముందుగా జగ్గన్న తోటకు చేరుకొని, ప్రభలు అన్నింటికీ ఆహ్వానం పలికి తిరిగి వెళ్ళేవరకూ ఉండటం సాంప్రదాయం. అలాగే జగ్గన్నతోట ప్రభల తీర్థానికి అధ్యక్షత వహించే వ్యాఘ్రేశ్వరస్వామి వారి ప్రభల తీర్ధం లోనికి ప్రవేశించినపుడు మిగిలిన రుద్ర ప్రభలను ఒకసారి పైకి లేపడం సంప్రదాయం. అలాగే జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ప్రత్యేకవిశిష్టతను సంతరించుకున్న గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వర స్వామి, గంగలకుర్రు–చెన్నమల్లేశ్వరస్వామి వార్ల ప్రభావాహనాలను కౌశికలో నుండి అవతలి ఒడ్డుకు చేర్చడం వంటి రమణీయ దృశ్యాలు చూడటానికి రెండు కన్నులూ చాలవు. ముఖ్యంగా జగ్గన్న తోట ప్రభల తీర్థంలో ప్రత్యేక ఆకర్షణగా విరాజిల్లుతూ, చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉండి, అన్ని ప్రభల కన్నా ఆఖరుగా వచ్చే గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వరస్వామి ప్రభావాహనం తీర్ధంలోనికి వచ్చేవరకూ మిగిలిన ప్రభలు కూడా వేచి ఉండటం విశేషం. నిండు ప్రవాహంలో విశ్వేశ్వరస్వామి వారిని ఓలలాడిస్తూ కౌశికను దాటించే తీరు కన్నులారా తిలకించే భక్త జన సందోహ ఆనందానికి అవధులు లేవంటే అతిశయోక్తి కాదు. అలా ఏక కాలంలో ఏకాదశ రుద్రులను ఒకే వేదికపై దర్శించి, తరించే భాగ్యం మరి ఏ ఉత్సవాలలోనూ కలగదు. నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
నవగ్రహాలు – వాటి ప్రాముఖ్యత
రవి: ఈ గ్రహానికి గ్రహరాజు అని పేరు. ఈ గ్రహం మేషంలో ఉచ్ఛ, తులలో నీచ స్థితిలో ఉంటాడు. అధికారానికి, ఆరోగ్యానికి, నేత్ర సంబంధిత వ్యాధులకు కారకుడు రవి. రాజకీయంగా అత్యున్నత పదవులు రావడానికి రవిగ్రహ బలం అవసరం. ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ వంటి వాటికి ఎంపిక అవ్వాలంటే రవిగ్రహ అనుగ్రహం లేనిదే ఆ కోరిక సాధ్యపడదు. రవి అనుగ్రహం వల్ల గొప్ప డాక్టర్ అవుతారు. ఈ రవి జాతకంలో శుభగ్రహ దృష్టి కలిగి ఉంటే అలాంటి డాక్టర్లు ప్రజాసేవ బాగా చేస్తారు. పాపగ్రహ దృష్టి కలిగి ఉంటే డాక్టర్గా ప్రజలను ఎన్నిరకాలుగా దోచుకోవాలో అన్నిరకాలుగా దోచుకుంటారు. గణపతి హోమం చేయించండి. చంద్రుడు: చంద్రుడు మనఃకారకుడు. జలములకు కారకుడు. క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లోను, సంగీత రంగంలో, సినిమా రంగంలో రాణించడానికి చంద్రగ్రహ బలం చాలా అవసరం. చతుష్షష్టి కళాకోవిదుడైన చంద్రుడు ఒక గొప్ప స్థాయికి మనిషి ఎదగడానికి కారకుడు అవుతాడు. చంద్రగ్రహ జాతకుల నవ్వు ఆకర్షణీయంగా ఉంటుంది. మనోబలానికి, మనోధైర్యానికి చంద్రుడు కారకుడు. జల సంబంధమైన వ్యాపారాలు, ఉద్యోగాలు, అదేవిధంగా సినిమాలు తీయడం, వాటికి సంబంధించిన ఫలితాలు చంద్రగ్రహం వల్లనే సంప్రాప్తిస్తాయి. పౌర్ణమి రోజున పండితులను సంప్రదించి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. కుజుడు: ధైర్యానికి, పరాక్రమానికి, సైన్యాధ్యక్ష పదవికి, శక్తిమంతమైన మారణాయుధాలతో పోరాటం చేయడానికి, రక్తానికి, భూమి సంబంధమైన సమస్త సంపదలకు కుజుడే కారణం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణించాలన్నా, కోర్టు వివాదంలో ఉన్న ఆస్తులు మీకు అనుకూలంగా రావాలన్నా కుజగ్రహం చాలాముఖ్యం. ఈ కుజుడు శస్త్ర విద్యకు సంబంధించిన గ్రహం. సర్జన్గా రాణించాలంటే కుజుడి అనుగ్రహం తప్పనిసరి. కుజుడు అగ్నిగ్రహం. అంగారక పాశుపతహోమం చేయించండి. రాహువు: ఛాయాగ్రహం. క్రమశిక్షణకు, కష్టపడి పైకి రావడానికి ప్రయత్నించే మనస్తత్వానికి రాహువే కారకుడు. ఎయిర్ఫోర్స్లో గానీ, నేవీలో గానీ ఉన్నత పదవులలో రాణించడానికి, యుద్ధరంగంలో వ్యూహప్రతివ్యూహాలు రచించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఎక్కువగా శక్తి పూజలు చేస్తారు. రాజకీయంలో అనూహ్యంగా, ఆకస్మికంగా రాణించడానికి రాహువే కారకుడు. అనూహ్య పతనానికి కూడా రాహువే కారకుడు. రాహుగ్రహం ఇచ్చే శుభయోగాలు అనేకం ఉన్నాయి. డ్రగ్స్కి బానిసయ్యే దుర్గుణానికి కూడా రాహువే కారకుడు. రుద్రపాశుపత హోమం చేయించండి. గురువు: సంపూర్ణ శుభగ్రహం. ఉన్నతమైన ఆర్థికపరిస్థితి, అఖండ విద్యాయోగం, సాంప్రదాయ బద్ధమైన జీవన విధానం, అఖండమైన మేధస్సు, ఉన్నత పదవులు అధిష్టించి గొప్పగా రాణించడం, కుటుంబ శ్రేయస్సు పట్ల అధిక శ్రద్ధ, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అధినేతలుగా రాణించడం, భగవత్ అనుగ్రహం సంప్రాప్తించడం, అన్నదాన సత్రాలు పెట్టించడం, గుళ్ళు కట్టించడం, విద్యాదానం చేయడం, ఇలాంటి లక్షణాల న్నీ గురుగ్రహం వల్లనే సంప్రాప్తిస్తాయి. ముహూర్తబలం అంతా గురుగ్రహం పైనే ఆధారపడి ఉంటుంది. నవగ్రహ పాశుపత హోమం చేయించండి. శుక్రుడు: కళత్ర కారకో శుక్రః అన్నారు. ఈ శుక్రుడు భార్య స్థానానికి, భర్త స్థానానికి కారకుడు. మంచి సంబంధం కుదరాలన్నా, సంసార జీవితం బాగుండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. ప్రేమ వివాహాలు ఫలించాలన్నా శుక్రుడే గతి. సురాపాన కారకో శుక్రః. సురాపానం చేసే అలవాటు శుక్రుని వల్ల కలుగుతుంది. అంతరాత్మ ప్రబోధానుసారం వీళ్ళు సురాపానం సేవించడం మానేస్తారు. అత్యంత విలాసవంతమైన జీవితం, సమస్త భోగాలు, రాచమర్యాదలు లభించడం, అందానికి, ఐశ్వర్యానికి మారుపేరుగా నిలబడాలంటే అది ఒక్క శుక్రుడి వల్లనే సాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలో సుఖపడాలంటే శుక్రుని అనుగ్రహం తప్పని సరి. భగుపాశుపత హోమం చేయించండి. శని: నీతి, నిజాయితీలకు, న్యాయానికి, ధర్మానికి కారకుడు శని. ఎవరి ప్రోత్సాహం లేకపోయినా, ఎందరు ఎన్ని అవమానాలు సృష్టించినా, పట్టువీడక జీవితాశయాన్ని సాధించడానికి శనే కారకుడు. సమన్యాయం, సమధర్మం పట్ల కట్టుబడి ఉండేవాళ్ళు శనిగ్రహ ప్రభావ మానవులే. అవినీతి, లంచగొండితనం, కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాలు వీటన్నింటికి అతీతంగా ప్రవర్తించే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద శనిగ్రహ ప్రభావం ఉన్నట్టే లెక్క. శని అత్యంత ముఖ్యమైన ఆయుర్దాయానికి కారకుడు. జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా అవి అనుభవించాలంటే ఆయుర్దాయం కావాలి. దీనర్థం శనిగ్రహం అనుకూలంగా ఉంటేనే సుదీర్ఘ జీవిత ప్రయాణం సాధ్యం. స్త్రీలను వేధించే వారిపట్ల శని చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు. అఘోర పాశుపత హోమం చేరుుంచండి. బుధుడు: అత్యంత తెలివైన గ్రహం. వ్యాపారానికి బుధుడే కారణం. ఏ వ్యాపారం చేసినా డబ్బులు మిగలాలంటే బుధుడి అనుగ్రహం కావాలి. సాహిత్యరంగంలో ప్రపంచ స్థాయి సాధించాలన్నా, వందలాది పుస్తకాలు వ్రాసి ప్రజలలో మహాపండితుడిగా రాణించాలన్నా, జ్ఞానపీఠ్ వంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు లభించాలన్నా, ఆయుర్వేద వైద్యుడిగా రాణించాలన్నా, వందల కోట్లు సంపాదించాలన్నా బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరి. జాతకంలో బుధుడు బాగుంటే ఇవన్నీ ఇప్పిస్తాడు. జ్యోతిష శాస్త్రంలో అఖండమైన పరిజ్ఞానానికి, అఖండమైన కీర్తిప్రతిష్టలకు బుధగ్రహ అనుగ్రహమే కారణం. సుదర్శన పాశుపతహోమం చేయించండి. కేతువు: మోక్షానికి, మంత్రసిద్ధికి, భగవత్ అనుగ్రహానికి, ఉత్తమమైన అంత్యక్రియలకు, అధమాధమమైన అంత్యక్రియలకు ఛాయాగ్రహమైన కేతువే కారణం. ఈ కేతువు ఏ రంగంలోనైనా జాతకుడిని ఉత్తమ స్థితికి తీసుకు వెళ్తాడు. ఉత్తమస్థితి వచ్చిన తరువాత అహంకారంతో రెచ్చిపోతే పతనం అవడానికి కూడా కేతువే కారణం అవుతాడు. సర్పదోషాలకు కేతువే నియంత్రణ గ్రహం. రాహు కేతువులిద్దరూ సర్పగ్రహాలే. అవధూతలను ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన నియమాలతో పూజాపునస్కారాలు చేయడానికి, పవిత్రమైన పుణ్యక్షేత్రాల సందర్శన, వాటి వల్ల వచ్చే పుణ్యానికీ ఈ గ్రహమే కారణం. పితకర్మలు చేయని వారికి కేతువు వల్ల అరిష్టాలు సంప్రాప్తిస్తారుు. గణపతి హోమం చేయించండి. -
విద్యారంగానికి అధిక ప్రాధాన్యత
వర్ని(బాన్సువాడ): రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలం అంబం(ఆర్)లో మంగళవారం జరిగిన మోడల్ స్కూల్ ఐదో వార్షికోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్రం రాక ముందు 240 గురుకులాలు ఉండగా, మూడున్నరేళ్లలో 544 కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి ప్రభుత్వం రూ.లక్ష వెచ్చిస్తోందన్నారు. మోడల్ స్కూల్లో చదివి ఆర్మి జవాన్గా పని చేస్తున్న జలాల్పూర్ శ్రవణ్ను మంత్రి అభినందించారు. యాసంగిలో నిజాంసాగర్ ప్రాజెక్టు కింద వేసిన పంటలకు సాగు నీరందిస్తున్నామన్నారు. కొందరు సోల్లు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత 70ఏళ్లలో రైతులకు నిర్లక్ష్యం చేసిన నాయకులకు 24 గంటల కరెంట్ సరాఫరా చేస్తే కడుపు మండుతుందని దుయ్య బట్టారు. బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంత్, డీఈవో రాజేష్, జెడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి, వర్ని, కోటగిరి ఎంపీపీలు చింగ్లీబాయి, సులోచన, ఏఎంసీ చైర్మన్ గంగారాం, తహసీల్దార్లు హరిబాబు, రాజు, ఎంపీడీవో వేణు గోపాల్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అలూరి నరేందర్ ఉన్నారు. ఎస్ఎంసీ సభ్యుల గైర్హాజరుతో అసంతృప్తి మండల కేంద్రంలో జరిగిన వర్ని, కోటగిరి, రుద్రూర్ మండలాల ఎస్ఎంసీల సమావేశానికి సభ్యులు తక్కువగా రావడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడికే రాకుంటే పాఠశాలకు ఇంకెలా వెళతారు, అసలు వస్తారా..? అనే సందేహం వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతగా పని చేయాలన్నారు. పెత్తనం చెలాయించేందుకు కమిటీలు కాదని, ప్రభుత్వం పాఠశాలలకు కేటాయిస్తున్న నిధులు సక్రమంగా వినియోగించి సమస్యలు పరిష్కరించడం కోసమన్నారు. సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వండి.. జిల్లాలో నెలకొన్న పాఠశాలల సమస్యలపై నివేదిక ఇవ్వాలని డీఈవోను మంత్రి ఆదేశించారు. కొన్ని పాఠశాలలో మూత్రశాలలు లేక విద్యార్థినులు మంచి నీరు తాగడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఇలాగైతే వారి కిడ్నిలు చెడిపోయి అనార్యోగం పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. నివేదికను సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లి మౌలిక సదుపాయాల కల్పనకు చర్చిస్తానని మంత్రి అన్నారు. సమావేశంలో సర్వశిక్షఅభియాన్ సీఎంవో స్వర్ణలత, ఎంఈవోలు శాంతకుమారి, నరేష్ కుమార్, వైస్ చైర్మన్ మేక వీర్రాజు పాల్గొన్నారు. -
సీఎంఆర్లో సిరిసిల్లకు ప్రత్యేకం!
ధాన్యం కేటాయింపుల్లో అవకతవకలు.. రీసైక్లింగ్ దందాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిరునామా నిలుస్తోంది..! ఓ వైపు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక కార్యాచరణతో శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా.. పైరవీలు, అవినీతి వ్యవహారాలతో అక్రమ దందాకు అడ్డుకట్టపడడం లేదు. ఖరీఫ్ ధాన్యాన్ని అలాట్ చేయడంలోనే మిల్లర్లతో కమిట్మెంట్ జరిగింది. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా రైస్మిల్లులున్న కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి పోను ప్రత్యేకంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో ధాన్యం కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది..! సాక్షిప్రతినిధి కరీంనగర్/కరీంనగర్సిటీ: కాలం కలిసొచ్చి ఖరీఫ్ సీజన్లో రైతులకు ఆశించిన మేర దిగుబడి వచ్చింది. రాష్ట్రంలోనే రికార్డుస్థాయిలో ఉమ్మడి జిల్లా ధాన్యం కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం సాధించింది. అయితే.. కొనుగోలు చేసిన «వడ్లను మరాడించి తిరిగి ప్రభుత్వానికి బియ్యంగా ఇవ్వడానికి ఆయా జిల్లాలో నిబంధనల ప్రకారం రైస్మిల్లులకు కేటాయించాల్సి ఉంటుంది. పౌరసరఫరాల శాఖ నుంచి జీవో 21 ప్రకారం రా రైస్ 2 టన్నుల కెపాసిటీ మిల్లుకు 100 లారీలు, బాయిల్డ్ రైస్ 4 టన్ను కెపాసిటీ మిల్లుకు 300 లారీల చొప్పున మిల్లు కెపాసిటీని బట్టి కేటాయించాలి. కరీంనగర్ జిల్లాలో 140 రైస్ మిల్లులున్నాయి. అందులో 80 బాయిల్డ్, 60 రారైస్ మిల్లులున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 140 బాయిల్డ్ రైస్మిల్లులున్నాయి. అయితే.. మిగిలిన జిల్లాలకు పోల్చుకుంటే ఈ రెండు జిల్లాలోనే మొత్తంగా 280 రైస్మిల్లులు అధికంగా ఉన్నాయి. కానీ.. వరిధాన్యం మాత్రం తక్కువగా వచ్చింది. కరీంనగర్లో 1.40 లక్షల టన్నులు, పెద్దపల్లి జిల్లాలో 60 వేల టన్నుల వరిధాన్యం కొనుగోలు చేయగా ఈ రెండు జిల్లాలోని 280 మిల్లులకు నిబంధనల ప్రకారం కేటాయించారు. ఇందులో 220 బాయిల్డ్ మిల్లులు కావడంతో 300 లారీల చొప్పున కేటాయించాల్సి ఉన్నా 150 నుంచి 200 లారీలే కేటాయించారని తెలిసింది. మిల్లులు ఎక్కువగా ఉండి వరిధాన్యం తక్కువగా ఉండడంతో సీఎంఆర్ సకాలంలో ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ శాఖ కమిషనరేట్ ఆదేశాల మేరకు జిల్లాల పరిధిలో కేటాయింపుల కన్నా అధికంగా ఉన్న ధాన్యాన్ని ఇతర జిల్లాల మిల్లులకు కేటాయించాలని ఆదేశాలిచ్చారు. జగిత్యాలలో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశారు. ఇక్కడి 40 మిల్లులకు కేటాయింపులకు పోను 70 వేల మెట్రిక్ టన్నులను పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలోని రైస్మిల్లులకు కేటాయించారు. దీంతోపాటు భూపాలపల్లి, నిర్మల్ నుంచి కరీంనగర్, పెద్దపల్లి మిల్లులుకు వరిధాన్యం కేటాయించారు. అయితే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 40 మిల్లులకు కేటాయించారు. సిరిసిల్లలో 2 టన్నుల కెపాసిటీ మిల్లులే అధికంగా ఉన్నాయి. దీనికితోడు అక్కడ 50 వేల మెట్రిక్ టన్నులు కేటాయింపులకు సరిపోతాయని అంచనా..! అయితే.. జీవో 21 నిబంధనలు తోసిరాజని ఒక్కో మిల్లుకు రెట్టింపు స్థాయిలో వరిధాన్యం కేటాయించడంపై మిల్లర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సిరిసిల్లలోని సంఘ నేత ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల పేరుతో కొందరు అధికారులతో మిలాఖతై మిలర్లకు అధిక ధాన్యం కేటాయింపులు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రారైస్ మిల్లుకు 100 లారీలకు బదులు 350 లారీల వరకు, బాయిల్డ్ రైస్ 300కు మించి 500 లారీల వరకు కేటాయించినట్లు సమాచారం. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూనే ఇతర జిల్లాలకు కేటాయింపు విషయంలో పక్షపాత వైఖరి చూపడంలో ఆంతర్యమేమిటనేది ప్రశ్నార్థకం! ఖరీఫ్ సీజన్కు సంబంధించి కేటాయించిన ఈ వడ్లను మరాడించి సీఎంఆర్ రూపంలో ఫిబ్రవరి చివరికల్లా తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే.. ఈ ప్రత్యేక కేటాయింపుల జిల్లాలో మరో 5 నెలలైనా సీఎంఆర్ పెట్టే పరిస్థితులు లేవని తెలుస్తోంది. అందుకోసం మిల్లర్లు అక్రమంగా రీసైక్లింగ్ దందాను ఎంచుకుంటున్నారు. ప్రభుత్వం అప్పజెప్పిన వడ్లను అమ్ముకుంటూ.. ప్రజల వద్ద రేషన్ బియ్యాన్ని 16 రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి ధాన్యంగా అప్పగిస్తున్నారు. ఇటీవల ఓ మిల్లులో రీసైక్లింగ్ బయటపడ్డ విషయం తెలిసిందే. ఇటీవలే సిరిసిల్ల దగ్గరలోని గూడెం గోడౌన్లో 500 లారీల రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తుండగా అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ విషయంలో స్వయంగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ సిరిసిల్ల జిల్లాకు చెందిన సంబంధిత అధికారిని, మిల్లర్లను, సంఘనేతను పిలిపించుకుని తీవ్రంగా మందలించి బ్లాక్లిస్టులో పెడతానని హెచ్చరించినట్లు సమాచారం. అయితే.. ఈ కేటాయింపుల విషయంలో కమిషనర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..!! నిబంధనల ప్రకారమే... – పద్మ, డీసీఎస్వో, రాజన్న సిరిసిల్ల జిల్లా నిబంధనల ప్రకారమే ధాన్యం కేటాయింపులు జరిపాం. అధికంగా ఇవ్వడమంటూ ఏమీ లేదు. ఇతర జిల్లాల మిల్లులకు కేటాయించాలనీ లేదు. మిల్లింగ్ చేసుకోగలుగుతామనే జిల్లాలోని మిల్లులకు తగిన కేటాయింపులు చేశాం. -
అమెరికా ఇన్పోసిస్లో స్థానికులకే ప్రాధాన్యత
-
హ్యాండీక్రాఫ్ట్స్కు మరింత ప్రాధాన్యం ఇస్తాం
-
భావ వ్యక్తీకరణకు భాషే ప్రధానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : భావ వ్యక్తీకరణకు భాషే ప్రధానమని హర్పర్ కొల్లిన్స్ డిక్షనరీ బోర్డు స్పెషలిస్ట్ అర్నియా సుల్తానా అన్నారు. రాజమహేంద్రవరం ఆల్బ్యాంక్ కాలనీలోని షిర్డీసాయి విద్యానికేతన్, డ్యాఫ్నీ ఏషియాటిక్ స్కూలు సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎక్స్క్విజిట్ ఇంగ్లిషు ఈడెన్’ పేరుతో ఇంగ్లిషు వారోత్స ప్రారంభ వేడుకలు బుధవారం జరిగాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అర్నియా సుల్తానా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇంగ్లిషు ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ పిల్లలు ఆంగ్లంపై పట్టుసాధించేందుకు ఈనెల 25 వరకు వీటిని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వ్యాసరచన, వక్తృత్వం, ఏకపాత్రాభినయం, రోల్ప్లే, క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ కవులు, కవయిత్రుల వేషధారణలో అలరించారు. స్కూలు డైరెక్టర్ తంబాబత్తుల శ్రీవిద్య పాల్గొన్నారు. -
రామయ్యా.. ఎక్కడయ్యా?
-
క్రీడలకు ప్రాధాన్యం
టౌన్హాల్ కమిటీ అధ్యక్షుడు యార్లగడ్డ వీర్రాజు బోట్క్లబ్ (కాకినాడ) : సేవా కార్యక్రమాలతో పాటు క్రీడల నిర్వహణకు టౌన్హాల్ ప్రాధాన్యమిస్తుందని టౌన్హాల్ కమిటీ అధ్యక్షుడు యార్లగడ్డ వీర్రాజు పేర్కొన్నారు. స్థానిక మెయిన్రోడ్డులో ఉన్న టౌన్హాల్లో శుక్రవారం రాష్ట్రస్థాయి సీనియర్, జూనియర్స్ బిలియర్డ్స్, స్నూకర్స్ ర్యాంకింగ్ చాంపియన్ 2016 పోటీలను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ క్రీడలకు టౌన్హాల్ ఆతిథ్యం ఇవ్వడం దశాబ్దాల పాటు సంప్రదాయంగా వస్తోందన్నారు. జూనియన్ విభాగ పోటీలను ప్రారంభించిన టౌన్హాల్ కమిటీ కార్యదర్శి జ్యోతుల రాము మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులకు వసతి సదుపాయాల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ టోర్నమెంట్ టౌన్హాల్ చరిత్రలోనే ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. సభ్యులకు సేవా కార్యక్రమాలుతో పాటు క్రీడా పోటీలను కూడా పలుమార్లు నిర్వహిస్తూ వారి ఆరోగ్య రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. టోర్నమెంట్ కమిటీ ప్రతినిధి ఐవీ రాజీవ్ మాట్లాడుతూ స్నూకర్స్, బిలియర్డ్స్ పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో టౌన్హాల్ కమిటీ శ్రద్ధ తీసుకోవడం అభినందనీమయన్నారు. ఈ పోటీలకు 13 జిల్లాలు నుంచి సుమారు వంద మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ కోశాధికారి వెత్సా ఆనంద్, టోర్నమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు డీవీఎన్రాజు, కార్యదర్శి వి.తరుణ్కుమార్, జె.శ్రీనివాస్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పరిశ్రమ కంటే ప్రజలే ముఖ్యం
వారి కోసం పోరాటాలకు సిద్ధం తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తుని : తొండంగి మండలం సముద్ర తీర ప్రాంతంలో విషపదార్థాలను వెదజల్లే దివీస్ మందుల పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం, పరిశ్రమ కన్నా ప్రజలే ముఖ్యమని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. శనివారం తొండగి మండలం తీరప్రాంతానికి చెందిన మత్స్యకార సంఘం నాయకులు చొక్కా కాశీ విశ్వేశ్వరరావు, మేరుగు హరి, మెసా సత్తిబాబు తుని పార్టీ కార్యాలయంలో రాజాను కలిశారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ వరకూ ఉన్న సముద్ర తీర ప్రాంతంలో లక్ష మంది మత్స్యకారులు చేపల వేటతో జీవనోపాధి పొందుతున్నారని నాయకులు లె లిపారు. దివీస్ మందుల పరిశ్రమ ఏర్పాటు చేస్తే మత్స్య సంపద అంతరించి, మత్స్యకారులు ఉపాధి కోల్పోయి, వలసపోవాల్సి వస్తుందని వివరించారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేయాలే తప్ప కార్పొరేట్ కంపెనీల కోసం కాదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయాయని, 30 ఏళ్ల నుంచి టీడీపీకి కంటికి రెప్పలా ఉన్న మత్స్యకార, యాదవ సామాజిక వర్గాలను యనమల రామకృష్ణుడు నిర్లక్ష్యం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేవలం సొమ్ముల కోసం సొంత సామాజిక వర్గానికి అన్యాయం చేయడం తగదన్నారు. కోటనందూరు మాజీ ఎంపీపీ గొర్లి అచ్చియ్య నాయుడు, తొండంగి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలోకి టీడీపీ మాజీ జెడ్పీటీసీ కాశీ స్థానిక శాంతినగర్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే రాజా సమక్షంలో టీడీపీకి చెందిన కాశీ విశ్వేశ్వరరావు పార్టీ చేరారు. ఆయనకు ఎమ్మెల్యే రాజా కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చొక్కా కాశీ విశ్వేరరావు మాట్లాడుతూ టీడీపీకి మద్దతు ఇచ్చిన తీర ప్రాంత ప్రజలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. తొండంగి మండలంలో ప్రభుత్వం 144 సెక్షన్ అమలు చేసి సభలు జరగకుండా చేసిందని, త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరతారన్నారు. దానవాయిపేట పంచాయతీ మాజీ సర్పంచ్ మేరుగు హరిబాబు, కోస్తా జాతీయ మత్స్యకార పరిరక్షణ కాలుష్య నివారణ సంఘం చైర్మన్ మెసా సత్తిబాబు, ఎ.ప్రకాశరావు, కోటనందూరు మాజీ ఎంపీపీ గొర్లి అచ్చియ్య నాయుడు, మోతుకూరి వెంకటేష్ పాల్గొన్నారు. -
రోడ్లు, రవాణాకు అధిక ప్రాధాన్యం
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మంతన్గౌరెల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన యాచారం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, ఆర్టీసీ బస్సు సౌకర్యాం కల్పించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంతన్గౌరెల్లి గ్రామంలో రూ. కోటి నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, గిరిజన తండాకు బీటీ బీటీ రోడ్డు నిర్మించడానికి ఎన్ని రూ. కోట్లయినా ఖర్చు చేస్తామని స్పష్టంచేశారు. రోడ్డుతో పాటు అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. గిరిజనులు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేయాలని సూచించారు. ఎన్ని కష్టాలోచ్చినా పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. వెనుకబడిన కులాల్లో ఉన్నత చదువుల వల్లే ఉద్యోగాలు పొంది ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉందని చెప్పారు. ప్రతిభ ఉన్న నిరుద్యోగ యువతి, యువతులకు ఎంకేఆర్ ఫౌండేషన్ నుంచి ఉద్యోగాలు సాధించేలా ఉచితంగా శిక్షణ ఇప్పిస్తానన్నారు. ప్రతి గిరిజన తండాకు స్వచ్ఛమైన కృష్ణాజలాలు సరఫరాకు కృషి చేస్తానని అన్నారు. ముందు కాలంలో ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, వీధిలైట్లు, బీటీ రోడ్ల నిర్మాణం కోసం రూ.100 కోట్ల నిధులు ఖర్చు చేసేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడాది కాలంలోనే రూ.500 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. వచ్చే మూడేళ్ల కాలంలో మరో వెయ్యి కోట్లు ఖర్చు చేసి వివిధ అభివృద్ధి పనులు చేసి తెలంగాణాలోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. సోమన్న ఆలయంలో ఎమ్మెల్యే పూజలు... మాల్ - మంతన్గౌరెల్లి గ్రామాల మధ్య ఉన్న సోమన్న ఆలయంలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద సీసీ రోడ్డు, తాగునీరు వసతి కోసం రూ.20 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నల్లవెల్లి, మాల్, మంతన్గౌరెల్లి తదితర గ్రామాల మధ్య వెలసిన సోమన్న దేవాలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్వామివారికి పూజలు చేసి సమృద్ధిగా వర్షాలు కురవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ రమావత్ జ్యోతీనాయక్, జెడ్పీటీసీ కర్నాటి రమేష్గౌడ్, మంతన్గౌరెల్లి ఎంపీటీసీ సభ్యుడు కొర్ర అరవింద్ నాయక్, సర్పంచ్ కనుక నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు రమావత్ శ్రీనివాస్ నాయక్, శంకర్నాయక్, శ్రీనువాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. -
తల్లిపాల ప్రాధాన్యతను తెలుసుకోవాలి
తల్లిపాల ప్రాధాన్యతను తెలుసుకోవాలి మహబూబ్నగర్ న్యూటౌన్: తల్లిపాల ప్రాధాన్యతను ప్రజలందరు తెలుసుకోవాల్సిన అవసరముందని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జ్యోత్సS్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి ప్రారంభమైన తల్లిపాల వారోత్సవాలు ఈ నెల 6వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణిలు, బాలింతలు, కిశోరబాలికలు, ఏఎ¯Œæఎంలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో ప్రతి మహిళ ప్రసవించిన వెంటనే ముర్రుపాలు పట్టడం, 6 నెలల వరకు ముర్రు పాలు పట్టడం వంటి విషయాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నెల 3న స్కూళ్లలో కిశోరబాలికలకు తల్లిపాల ఆవశ్యకతపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 4న జిల్లా స్థాయిలో తల్లిపాలు, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వటం, ఆ తర్వాత అనుబంధ ఆహారం ప్రారంభించడం వంటి వాటిపై అవగాహన, 5న ప్రాజెక్టు స్థాయిలో అవగాహన, 6న వెల్బేబీ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. -
కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటంటే..
-
అమలే హామీకి గీటురాయి
రాజశేఖరరెడ్డి ఆశయాలతోనే ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో వ్యవసాయం గురించి చేసిన ప్రస్తావనలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రైతులకు మేలు చేసిన చరిత్ర వైఎస్ఆర్కు ఉంది. రైతులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన ఘనత ఉంది. ఆ నేపథ్యం, ఇప్పుడు ఇచ్చిన హామీలను బట్టి ఈ మేనిఫెస్టోను వేరుగానే చూడాలి. తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరు ఎన్నికల ప్రణాళికలతో జరుగుతున్న ఎన్నికలను మొదటిసారి చూడబోతున్నాం. ఈ రెండు ప్రాంతాలకు చెందిన రాజకీయ పార్టీల ఎన్నికల వాగ్దానాలను చూస్తుంటే ప్రతి సృష్టి చేయబోతున్నాం అని పురాణ పురుషులు చెప్పే మాటలు గుర్తుకు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి పార్టీలు చేస్తున్న ప్రతిజ్ఞలు, ఇస్తున్న హామీలు, కురిపిస్తున్న వరాలు ఒక తంతుగా కనిపిస్తున్నాయే తప్ప, ఆచరణ సాధ్యమని అనిపించడం లేదు. ఇందుకు వైఎస్ఆర్ సీపీ మినహాయింపు అని కొన్ని కారణాలతో కచ్చితంగా చెప్పుకోగలిగినా, మొత్తం సేద్యం మీద కురిపిస్తున్న హామీలకూ, వాటి ఆచరణకూ మధ్య అగాధమే కనిపిస్తున్నది. తెలంగాణ రైతులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలంటే రాష్ట్ర బడ్జెట్ కాదు, కేంద్ర బడ్జెట్ కూడా చాలదు. ప్రతి జిల్లాకు లక్ష ఎకరాలకు కొత్తగా నీటి సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అంటే పది జిల్లాలకు కోటి ఎకరాలకు నీరు ఇస్తామని వాగ్దానం చేశారు. ఇది ఎంత వరకు సాధ్యం? ఎలా సాధ్యం? ఈ వివరణలు మేనిఫెస్టోలో కానరావు. చాలా వాగ్దానాలను ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను కూడా పట్టించుకోకుండా చేస్తున్నారని అనిపిస్తుంది. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలను చేయరాదనీ, ఉచిత తాయిలాలు ప్రకటించరాదనీ సుప్రీం కోర్టు ఇచ్చిన(జూలై, 2013) ఆదేశాలను ఉటంకిస్తూ ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలను హెచ్చరించింది. తెరాస ఆ ఆదేశాలను పెడచెవిన పెట్టినట్టే ఉంది. ఎందుకంటే, ఒక వాగ్దానం చేస్తే, దానిని నెరవేర్చే మార్గాలను కూడా ప్రస్తావించాలని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. ఆ వాగ్దానాల అమలుకు కావలసిన నిధులు ఎలా సమకూర్చుకుంటారో వాగ్దానాలు చేసిన పార్టీలు స్పష్టం చేయవలసిందే. అయినా చేతికి ఎముక లేదన్న రీతిలో రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయంటే మభ్యపెట్టడానికని చెప్పక తప్పదు. తెరాసతో పాటు, టీడీపీ చేస్తున్న వాగ్దానాలలో కూడా ఆచరణకు సాధ్యం కానివే ఎక్కువ. రైతు రుణాలను మాఫీ చేస్తామని ఈ రెండు పార్టీలు కూడా చెప్పుకున్నాయి. లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని తెరాస హామీ ఇచ్చింది. ఈ పరిమితి ఎంతో తెలుగుదేశం చెప్పలేదు. గృహావసరాలకూ, పరిశ్రమలకూ 24 గంటలు, సేద్యానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తానని కూడా టీడీపీ హామీ ఇచ్చింది. తెదేపా రుణ మాఫీ హామీ ఆచరణ సాధ్యం కాదని సామాన్యులకే అర్థమవుతుంది. ఇక ప్రత్యర్థి పక్షాలకీ, ప్రజా సంఘాలకీ తెలియకుండా ఉంటుందని ఎలా అనుకుంటాం? సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం, అలాంటి రుణ మాఫీ హామీ ఇచ్చినందుకు తెలుగుదేశం మీద వెంటనే చర్య తీసుకోవలసిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర శాఖ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అన్ని రకాల వ్యవసాయ, స్వయం సేవా రుణాలను మాఫీ చేయాలంటే దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయల నిధులు కావాలి. అసలు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ మొత్తమే 1.6 లక్షల కోట్ల రూపాయలు పైనే. అన్నిపథకాలకు కలిపి కేటాయించిన ప్లాన్ బడ్జెట్ మొత్తమే 59,000 కోట్లు. ఈ నేపథ్యంలో రుణ మాఫీ ఎలా సాధ్యమో చెప్పాలని ఆమ్ఆద్మీ కోరుతోంది. రైతన్నలు తీసుకున్న రుణాలలో 70 శాతం ప్రభుత్వం దగ్గర నుంచి కాకుండా, వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నవనీ, ఈ రుణాలను మాఫీ చేయడం ఎలాగో చెప్పాలనీ ఆమ్ ఆద్మీ పార్టీ నిలదీస్తోంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులలో ఎక్కువ మంది ఇలా ప్రైవేటు వ్యక్తుల నుంచి రుణాలు తీసుకున్నవారే. ఇంకా కీలకమైన ప్రశ్న- పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ రుణాల పేరిట తీసుకున్న మొత్తాలను ఏం చేస్తారు? డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతోనే ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో వ్యవసాయం గురించి చేసిన ప్రస్తావనలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రైతులకు మేలు చేసిన చరిత్ర వైఎస్ఆర్కు ఉంది. రైతులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన ఘనత కూడా ఉంది. ఆ నేపథ్యం, ఇప్పుడు ఇచ్చిన హామీలను బట్టి ఈ మేనిఫెస్టోను వేరుగానే చూడాలి. వైఎస్ కుమారుడు జగన్ ఆధ్వర్యంలో విడుదలైన మేనిఫెస్టోలో అమ్మఒడి, విద్యార్థులకు ఫీజుల మాఫీ, మహిళా స్వయం సేవా సంఘాల రుణ మాఫీ వంటి హామీల విషయంలో విభేదించడానికి ఏమీ ఉండదు. ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతన్నకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో రూ. 2,000 కోట్ల కార్పస్ నిధిని ఏర్పాటు చేస్తామని ఈ కొత్తపార్టీ చెబుతోంది. మూడు వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, రైతులకు ఏడు గంటల ఉచిత విద్యుత్ కూడా ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి. ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి వైఎస్ఆర్ మడమ తిప్పకుండా వ్యవహరించారు. ఐదేళ్ల పాటు ఉచితంగా విద్యుత్ను ఇచ్చారు. రూ. 3,000 కోట్లతో నిధి ఏర్పాటు చేసి ధరల స్థిరీకరణకు కృషి చేస్తామని కూడా వైఎస్ఆర్ సీపీ హామీ ఇచ్చింది. గిట్టుబాటు ధరలు లేక నిరంతరం కుంగిపోతున్న రైతు కోసం దీనిని ఉద్దేశించారు. ధ రల స్థిరీకరణను ఎలా సాధ్యం చేయబోతున్నారో ఇప్పుడే చెప్పడం కష్టమే. అయినప్పటికీ ఈ ఆశయంతో పడిన ఒక అడుగుగా ఈ అంశాన్ని గమనించవచ్చు. తెలుగుదేశం కూడా ఇందుకు 5,000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానని చెప్పడం ఆహ్వానించదగినదే. గిట్టుబాటు ధరల గురించి స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయడం, గిడ్డంగుల నిర్మాణం, వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటు, ప్రత్యేక విత్తన చట్టం, వ్యవసాయ యంత్రాల కొనుగోళ్లపై సబ్సిడీ వంటి అంశాలు టీడీపీ మీద పడిన రైతు వ్యతిరేక ముద్రను కొంతయినా తొలగించగలిగినవే. కానీ రైతుల సంక్షేమం విషయంలో ఆ పార్టీకి ఉన్న గత చరిత్రను బట్టి అవి అమలు కావడం మొదలయ్యే వరకు ప్రజలకు నమ్మకం కుదరదు. అమ్మఒడి, విద్యార్థి వేతనాలు, వృద్ధాప్యపు పెన్షన్ 700/- (పెంచినది), ధరల స్థిరీకరణ నిధి, రూ. 20,000 కోట్ల డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ వంటి వాటిపై వైఎస్ఆర్సీపీ ఇప్పటికే నిశ్చితాభిప్రాయంతో ఉంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే వీటికి సంబంధించిన ఫైళ్ల మీద సంతకం చేయాలని జగన్ ఆశయంగా చెబుతున్నారు. పెండింగ్లో లేదా అసంపూర్తిగా ఉన్న పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ వంటి భారీ మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుల పనులు, కృష్ణా, గోదావరి, పెన్న నదుల పరీవాహక ప్రాంతాలలో ముఖ్యమైన డ్రైనేజీ పనులకు ప్రాముఖ్యం ఇవ్వబోతున్నట్టు కూడా వైఎస్ఆర్ సీపీ ప్రకటించింది. రైతులకు సూచనలూ సలహాల కోసం 102 సర్వీసు, రెండేసి జిల్లాలకు ఒక వ్యవసాయ కళాశాల, ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాల నియంత్రణను 102కు అనుసంధానం చేస్తూ కళాశాలలకు అప్పగింత, పశు ఆరోగ్యం కోసం 103 సర్వీసు, ప్రతి జిల్లాలో శీతల గిడ్డంగి, వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్ సౌకర్యం, సేద్యానికి ఇద్దరు మంత్రులు వంటి అంశాలు కూడా చేరడం వల్ల ఈ మేనిఫెస్టోకు ప్రత్యేకత వచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోవచ్చు. కొత్త పార్టీలకు అవకాశం రావచ్చు. పార్టీ ఏదైనా రైతు సంక్షేమం మీద ఏకాభిప్రాయం ఉంటేనే ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. విశ్లేషణ: బలిజేపల్లి శరత్బాబు (వ్యాసకర్త సాగు అంశాల విశ్లేషకులు) -
దుప్పట్లకు కావాల్సిందే ఇక చప్పట్లు!
మన తెలుగువారు దేనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యం దానికి ఇవ్వరని ప్రతీతి. కాస్తంత స్థిమితంగా ఆలోచిస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే... దుప్పటికంటే చిన్న సైజులో ఉంటే శాలువాకు సన్మానాల సమయంలో ఎనలేని సభా గౌరవం ఉంది. ఆ మాటకొస్తే అంతకంటే చిన్నదైన ఎరుపురంగులో ఉండే కొత్త కండువా సైతం శుభకార్యాల్లో యజమాని భుజానికెక్కుతుంది. ఆఖరికి తుండుగుడ్డ కూడా సామాన్య రైతుల తలమీదికెక్కి తైతక్కలాడుతుంది. ఇక గొంగళి మాట చెప్పేదేముంది. అభ్యుదయ గేయకర్తలు, జానపద కళాకారులూ దానికి ఎనలేని ఖ్యాతి తెచ్చారు. విప్లవాన్ని కాంక్షించే ప్రజాకళాకారుడెవరైనా గొంగళి కప్పుకోవాల్సిందేనంటూ ఫత్వాలాంటి అప్రకటిత ఆదేశిక సూత్రాన్ని అలిఖిత రాజ్యాంగం ద్వారా ప్రకటించారు. ఆ డ్రెస్కోడ్ను కంపల్సరీ చేసేసి, గద్దరులాంటి వాగ్గేయకారులు దానికి ఎనలేని గ్లామరు తెచ్చారు. ఎంత ముతకగా ఉంటేనేం... అభ్యుదయానికి ఆటపట్టు గొంగళి. కానీ అటు శాలువా/తువ్వాళ్లకూ, ఇటు గొంగళికీ సెంటర్లో ఉండే దుప్పటి మాత్రం.... పాపం ఎటూగాకుండా అన్యాయమైపోయింది. కానీ దుప్పటిని ఒకసారి శ్రద్ధగా పరిశీలించండి. దాని గొప్పదనం తెలుస్తుంది. తెలుగు సినిమా రంగానికి ఇతోధికంగా సేవ చేసింది దుప్పటేనంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమాలో అనేక సింబాలిక్ సీన్లకు ప్రతీక దుప్పటి. ఓ క్యారెక్టర్ యాక్టరు భుజాల వరకు దుప్పటి కప్పుకుని దగ్గుతూ పడుకున్నాడు/పడుకున్నదంటే... సదరు ఆసామి జబ్బుమనిషి అని అర్థం. అక్కినేని లాంటి అగ్రశ్రేణి తారలంతా శాలువాను భుజాలకెక్కించుకున్నారు గానీ... సపోర్టింగ్ యాక్టర్లు ఎన్నిసార్లు కప్పుకున్నా పాపం... దుప్పటికి సరైన గౌరవం దక్కలేదు. ఇక ఆ జబ్బుమనిషి దగ్గరికి డాక్టర్ వచ్చి ‘‘అయామ్ సారీ!’’ అంటూ భుజాల వరకు ఉన్న దుప్పటిని తల మీదికి పాకించేశాడంటే... సదరు వ్యక్తి ఎలాంటి నటననూ ప్రదర్శించకపోయినా... దుప్పటే ఆ లోటును భర్తీ చేసి సన్నివేశాన్ని రక్తికట్టిస్తుంది. ఇలా దుప్పటి తెలుగు సినీ రంగానికి చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఇక సినీ గేయ రచయితలు సైతం ‘దుప్పట్లో దూరాక దూరమేముంది’ లాంటి అనేక గేయాలు రచించి దాని పట్ల తమ అభినివేశాన్ని చాటుకున్నారు. ఇంతటి ఖ్యాతి గడించిన దుప్పటి తరతరాలుగా మన తెలుగువారి నిర్లక్ష్యానికి లోనవుతూనే ఉంది. ఇక మన తెలుగువాళ్లు గుర్తించని దాన్ని పొరుగువాళ్లు గుర్తించి గౌరవించడం మామూలే కదా. చిన్నది కప్పుకునే ఓణీకి చున్నీ అని చిన్ని పేరు పెట్టుకుని... ఇది చాల్లే అని సరిపెట్టేశాం. కాని మన దక్షిణభారత దుప్పటి జ్ఞాపకార్థం వింధ్యకు ఆ వైపు ఉన్న ఉత్తర భారతదేశస్తులంతా మూకుమ్మడిగా తాము ఓణీలా ధరించే వస్త్రవిశేషానికి ‘దుపట్టా’ అని పేరు పెట్టి మనం నిత్యం కప్పుకునే దుప్పటిని వాళ్లు నిత్యం స్మరిస్తున్నారు. పొరుగువాళ్లు గుర్తించారు కాబట్టి ఇకనైనా దానికి సరైన గౌరవం దక్కుతుందేమో అని నేనంటే... నువ్వే కదా దాని టాలెంట్ను ‘తొక్కేస్తుంటావ్’ అన్నాడు మా ఫ్రెండు. అదెప్పుడ్రా అని నేను తెల్లబోతే... ‘రోజు రాత్రి పక్క మీద’ అంటూ దుప్పటి కప్పి చుట్టుముట్టి కొట్టిన ఫీలింగ్ తెచ్చేశాడు. - యాసీన్ -
2014కు ఎంతో ప్రాధాన్యం
తెలంగాణ సాకారం కానుంది: పొన్నాల ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభం హైదరాబాద్, న్యూస్లైన్: ఈ ఏడాదికి ఎంతో ప్రాధాన్యం ఉందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 74వ అఖిల భారత పారిశ్రామికోత్పత్తుల ప్రదర్శన (నుమాయిష్)ను పొన్నాల బుధవారం ప్రారంభించి మాట్లాడారు. 2014 క్యాలెండర్ 1947 క్యాలెండర్ను పోలి ఉందని చెప్పారు. 1947లో బ్రిటీష్ పాలకుల నుంచి దేశానికి స్వాతంత్య్రం లభించగా, 2014లో తెలంగాణా ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రం సాకారం కానున్నదని చెప్పారు. రానున్న 25 ఏళ్లలో హైదరాబాద్ నగరపరిధిలో 50 వేల ఎకరాల్లో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. గడచిన తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. మెట్రోరైల్ ప్రాజెక్టు నగరానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. వృధాగా సముద్రంలోకి పోయే నదీ జలాలను సాగు కోసం సద్వినియోగం చేసుకునేందుకు చేపట్టిందే జలయజ్ఞం కార్యక్రమమని పేర్కొన్నారు. మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, ఆయా ఉత్పత్తులకు విస్తృతమైన ప్రచారం, ఉపాధి కల్పనకు నుమాయిష్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు ఎస్. రాజేందర్, గౌరవ కార్యదర్శి అశ్విన్, సొసైటీ ప్రతినిధులు సుఖేష్రెడ్డి, హరినాథ్రెడ్డి, వనం వీరేందర్, నిరంజన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహిళలు అలెక్స్స్టాల్ పేరిట ఏర్పాటు చేసిన స్టాల్ను ప్రారంభించారు. అదే విధంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ను ఆ శాఖ డెరైక్టర్ జనరల్ కృష్ణంరాజు ప్రారంభించారు.