Indrakeeladri
-
విజయవాడ : భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : అంగరంగ వైభవంగా దుర్గమ్మకు జ్యోతుల ఉత్సవం (ఫొటోలు)
-
విజయవాడ : ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి.. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భవానీలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిలో ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు
-
ఇంద్రకీలాద్రిలో సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
-
ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో దుర్గమ్మ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : మహాచండీ దేవి అలంకారంలో దుర్గమ్మ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి: వీఐపీ దర్శనాలతో సామాన్య భక్తుల అగచాట్లు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రికి ప్రోటోకాల్ దర్శనాలు పోటెత్తాయి. ప్రోటోకాల్ దర్శనాలు.. సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీఐపీ టైమ్ స్లాట్ దర్శనాలు అమలుకావడం లేదు. సిఫార్సు లెటర్స్ ఉంటే చాలు అంతా వీఐపీలే అన్నట్టుగా, ఉదయం నుంచి సిఫార్సు లెటర్లతో భారీగా క్యూకట్టారు. క్యూలైన్లు ముందుకు కదలక సామాన్య భక్తులు నానా అవస్థలు పడుతున్నారు.500 రూపాయలు టిక్కెట్లు తీసుకున్న భక్తులు నాలుగు గంటలుగా క్యూలైన్లలోనే పడిగాపులు పడుతున్నారు. ప్రోటోకాల్ దర్శనాలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అధికారులతో 500 రూపాయల క్యూలైన్లలోని భక్తులు వాగ్వాదానికి దిగారు. ఐదు రూపాయల ఎందుకు పెట్టారంటూ మండిపడ్డారు.మరోవైపు ఇంద్రకీలాద్రిపై లడ్డూలు అందక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు లేదు ఇవ్వటం కుదరదంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఘాట్ రోడ్డులో ఒకే ఒక్క లడ్డూ సేల్ పాయింట్ను అధికారులు ఏర్పాటు చేయడంతో దుర్గమ్మ దర్శనానంతరం ప్రసాదం అందకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: గోల్మాల్ సర్కార్.. వరద లెక్కలో ‘బాబు’ లీలలే వేరయా! -
లలితాత్రిపుర సుందరీ దేవీ అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం
-
అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన విజయవాడ కనకదుర్గ (ఫొటోలు)
-
విజయవాడ: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారు.. ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ప్రారంభం
-
ఇంద్రకీలాద్రి : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతం (ఫొటోలు)
-
శ్రావణ శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : రికార్డు స్థాయిలో దుర్గమ్మకు సారె సమర్పణ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు (ఫొటోలు)
-
విజయవాడ : దుర్గమ్మకు ఘనంగా ఆషాడమాసం సారె (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వైభవంగా శాకంబరీదేవి ఉత్సవాలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆషాఢ మాసోత్సవాలు (ఫొటోలు
-
విజయవాడ : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి పై ఘనంగా వసంత నవరాత్రి ఉగాది మహోత్సవాలు
-
ఇంద్రకీలాద్రిపై ముగిసిన శివరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
విజయవాడ : ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి..ముగిసిన భవానీ దీక్ష విరమణ (ఫొటోలు)
-
కృష్ణా తీరాన.. అభివృద్ధి పతాక
ఓబుల్రెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి ప్రతినిధి, విజయవాడ విజయవాడ.. ఇప్పుడు పేరెన్నికగన్న నగరాలకు దీటుగా రూపుదిద్దుకుంటోంది. ఓ వైపు ఫ్లైఓవర్లు.. మరోవైపు బైపాస్ రహదారుల నిర్మాణంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. వాణిజ్యపరంగా పేరెన్నికగన్న ఈ నగరంలో కేవలం నాలుగేళ్లలోనే ఊహించని అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. నిత్యం కృష్ణానది వరదనీటి ప్రవాహం వల్ల ముంపుతో బాధ పడుతున్న నగరవాసులకు రక్షణ గోడతో పూర్తి స్థాయి ఉపశమనం లభించింది. వరద వస్తే చాలు.. తట్టా బుట్టా చేత పట్టుకుని ఎగువ ప్రాంతానికి పరుగులు తీసే దుస్థితి తప్పింది. నగర నడిబొడ్డున ఠీవీగా నిలిచిన అంబేడ్కర్ విగ్రహం.. అభివృద్ధి అంటే ఇదీ.. అన్నట్లు మనందరికీ చూపిస్తోంది. మెట్రోపాలిటన్ నగరాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో రూపు రేఖలు మారిపోయాయి. బెజవాడకు మణిహారం ఫ్లైఓవర్లు.... నగరవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేలా కొత్తగా నిర్మించిన జంట ఫ్లైఓవర్లు బెజవాడకు మణిహారంగా నిలుస్తున్నాయి. జెంజి సర్కిల్–1 ఫ్లైఓవర్ 48 స్పాన్లతో 1.470 మీటర్ల వెడల్పుతో(అప్రోచ్రోడ్డు సహా) 2.27 కిలోమీటర్ల పొడవుతో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించారు. ► రెండోఫ్లైఓవర్ ఏడాదిన్నరలో పూర్తి చేయాలన్నది టార్గెట్. కానీ ఏడాదిలోనే అది అందుబాటులోకి వచ్చింది. దీని పొడవు 1.703 కిమీలు, స్పాన్లు 55, వెడల్పు 12.5 మీటర్లు. నిర్మాణానికి అయిన ఖర్చు రూ.96 కోట్లు. ► దీంతో పాటు బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ వెస్ట్, ఈస్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు పనులకు అడ్డంకిగా నిలిచిన భూసేకరణ సమస్య పరిష్కారమైంది. పశ్చిమం వైపు 2.47 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న సర్వీస్రోడ్డుకు రూ. 25కోట్లు ఖర్చు చేస్తున్నారు. తూర్పువైపు పెండింగ్లో ఉన్న 860మీటర్ల సర్వీస్రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ► బెంజి సర్కిల్నుంచి పోరంకి వరకు 6 కిలోమీటర్ల మేర డ్రైనేజీ పనులు రూ. 15కోట్లతో చేపడుతున్నారు. ఇంకా గుణదల ఫ్లైఓవర్, రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ పనులకు మార్గం సుగమం అవుతోంది. ► గన్నవరం విమానాశ్రయం వద్ద హాఫ్ ఫ్లైఓవర్ను రూ. 23.77 కోట్లతో నిర్మించారు. హైదరాబాద్ హైవే నిర్మాణానికి అవరోధంగా నిలిచిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, అసంపూర్తి పనులను రూ17కోట్లతో చేపట్టారు. ► గ్రీన్ ఫీల్డ్ హైవే(విజయవాడ–ఖమ్మం)కు సంబంధించి భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరింది. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. కనకదుర్గ ఫ్లైఓవర్కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను ఈ మధ్యనే ప్రారంభించారు. బైపాస్లతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ నగరానికి వచ్చే వాహనాలకు ఇక ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వెస్ట్, ఈస్ట్ బైపాస్ నిర్మాణాలు ఉపకరించనున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్కు సంబంధించి 30 కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసల రహదారి(చిన్న అవుటపల్లి నుంచి– గొల్లపూడి)ని రూ1148 కోట్లతో 2021 ఫిబ్రవరిలో ప్రారంభించారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. ► గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 17.88కి.మీ పొడవున రహదారి పనులు, కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన పనులు వేగంగా సాగుతున్నాయి. విజయవాడ తూర్పు వైపు నిర్మించతలపెట్టిన బైపాస్ రోడ్డుకు దాదాపు పూర్తి కావచ్చింది. ► కృష్ణా జిల్లా పొట్టి పాడు నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు 49.3 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. కృష్ణానదిపైన 3.750 కిలోమీటర్ల పొడవుతో ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు. దీనికోసం రూ4607.80కోట్లు వెచ్చించనున్నారు. ముంపు నుంచి ఉపశమనం నగరంలోని కృష్ణానదీతీరవాసులు ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ముంపు సమస్యనుంచి ఉపశమనం కలిగించారు. కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్Š వరకూ రక్షణగోడ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వారధినుంచి పద్మావతి ఘాట్ నుంచి రక్షణ గోడ పనులు సాగుతున్నాయి. మొదటి దశలో రూ.93,22 కోట్లు, రెండో దశలో రూ. 180.24 కోట్లు, మూడో దశలో రూ. 120.81 కోట్లు కలిపి మొత్తమ్మీద రూ394.27 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రిటైనింగ్ వాల్ వెంబడి రెండు దశల్లో రూ.33.39కోట్లతో బ్యూటిఫికేషన్ పనులు జరగనున్నాయి. గ్రీనరీ, పార్కులు, వాకింగ్, సైకిల్ ట్రాక్తో అందంగా తీర్చిదిద్దుతున్నారు. కాలువలపై రూ. 31కోట్లతో ఏడు వంతెనలు నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిమస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించేలా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం ఠీవిగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారు. జనవరి19న ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించేలా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం ఠీవిగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారు. జనవరి19న ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నారు. అందాల వాడగా తీర్చిదిద్దాం బెజవాడను అందాల వాడగా తీర్చిదిద్దాం. నగరంలో జలకాలుష్యం తగ్గించేందుకు మూడు ప్ర«ధాన కాలువలను శుభ్రం చేశాం. కెనాల్ బండ్స్ను సుందరీకరించాం, ప్లాస్టిక్ వినియోగం తగ్గేలా చేశాం. విజయవాడలో రోడ్లు, గ్రీనరీ, పార్కులను అభివృధ్ది చేశాం. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కమిషనర్, వీఎంసీ ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించాం నగర వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కలిగించేలా ఫ్లైఓవర్లు నిర్మించాం. జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చాం. నగరంలో రోడ్లు, పచ్చదనం చేపట్టాం. కృష్ణానది వెంబడి రక్షణ గోడ నిర్మించాం. పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తున్నాం. – ఎస్.ఢిల్లీరావు, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా నగరాభివృద్ధిపై మహానేత చెరగని ముద్ర విజయవాడ నగర అభివృద్ధిపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయన ఐదేళ్ల పాలనలో నగరాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. పేదలకు జేఎన్యూఆర్ఎం కింద గృహాలు నిర్మించి అందజేశారు. నగర శివారులో వైఎస్సార్ కాలనీ నిర్మించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చనమోలు వెంకట్రావు పేరుతో మిల్క్ ప్రాజెక్టు వద్ద ఫ్లై ఓవర్ నిర్మించారు. రైల్వే స్టేషన్ రోడ్డు, గుణదల పడవల రేవును కలుపుతూ 6 కిలో మీటర్ల మేర బీఆర్టీఎస్ రోడ్డు నిర్మించారు. అజిత్సింగ్ నగర్ బుడమేరు వరద నివారణకు కట్ట నిర్మించారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో... ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఇళ్లు పేరుతో ఎన్టీఆర్ జిల్లాలో తొలి విడతలో 1.07లక్షల మందికి ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 14,995 ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలు చేశారు. కాల్వ గట్లు, ప్రభుత్వ స్థలాల్లో , రోడ్ల పక్కన ఆవాసం ఉంటున్న వారిని తొలగించి వాంబే కాలనీలో ఇళ్లు కేటాయించారు. పటేల్ నగర్ ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, నేతాజీ కాలనీ, రాధానగర్, రాజీవ్నగర్, వడ్డెర కాలనీ, నందా వారి కండ్రిక ప్రాంతాల్లో గతంలో కార్పొరేషన్ 13,915 ఇళ్లు నిర్మించి కొన్నింటినే రిజి్రస్టేషన్ చేశారు. టీడీపీలో గ్రాఫిక్స్తోనే సరి... టీడీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిపై శీత కన్నేసింది. అమరావతి రాజధాని పేరుతో గ్రాఫిక్స్తోనే ప్రజలను మభ్య పెట్టి కాలయాపన చేసింది. విజయవాడకు సంబంధించి ప్రధాన ఫ్లై ఓవర్లు, రోడ్లు, ట్రాఫిక్ సమస్య గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. టీడీపీ హయాంలో ప్రారంభమైప కనకదుర్గ ఫ్లై ఓవర్ç పూర్తి చేయకుండా కాలం వెళ్లదీసింది. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పూర్తి చేయాలనిగానీ, నగరానికి నలువైపుల నుంచి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రోడ్లను జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలన్న ఆలోచనే చేయలేదు. ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్తో ప్రజల కళ్లకు గంతలు కట్టారు. ఈవెంట్లతో పబ్బం గడుపుకున్నారు. గత టీడీపీ హయాంలో అభివృద్ధి పేరుతో మాయ చేసిన వైనాన్ని, ఈ ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, వెస్ట్, ఈస్ట్ బైపాస్, నగరంలో రోడ్లు, కాల్వల ప్రక్షాళన, పచ్చదనం వంటి పనులు చేపట్టిన తీరు చూసి నిజమైన అభివృద్ధి అంటే ఇది అని చర్చించుకుంటున్నారు. సరికొత్తగా ఇంద్రకీలాద్రి ఇప్పటికే సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఇంద్రకీలాద్రిపై మరిన్ని అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ ఇటీవలే ప్రారం¿ోత్సవాలు, కొత్తవాటికి శంకుస్థాపన చేశారు. కనకదుర్గానగర్ గోశాల వద్ద రూ. 216.05 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ. 23.145కోట్లతో పూర్తయిన పనులను ప్రారంభించారు. ఆధ్యాత్మిక విహారం కృష్ణా నదిలో జల విహారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నదీ తీరంలోని అలయాలు, పర్యాటక ప్రదేశాలను కలుపుతూ టెంపుల్ టూరిజంకు రూపకల్పన చేశారు. కృష్ణా నదిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జలవిహారం చేస్తూ 82 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయటం ద్వారా ఎనిమిది ప్రాంతాలను కవర్ చేసే విధంగా ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ సంస్థ చర్యలు తీసుకొంటోంది. ఇందుకోసం దుర్గఘాట్నుంచి అమరావతి వరకు ఐదు ప్రదేశాలను కలుపుతూ ఓ సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు. ముక్త్యాల నుంచి అమరావతికి నాలుగు ప్రదేశాలను కలుపుతూ ఇంకో సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు. జెట్టీలలోనే భోజనం, అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు. పిల్లలకోసం ఆట పరికరాలు, ఎమ్యూజ్మెంట్ పార్కులు, ఓపెన్గేమ్స్, ఎడ్వంచర్ గేమ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిపాదనలు ఇలా... రెండు యాంత్రీకరణ బోట్లు కొనుగోలుకు : రూ.22 కోట్లు ఏడు ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణం, సౌకర్యాలకోసం : రూ. 24 కోట్లు రూఫ్ టాప్ సోలార్ పవర్ చార్జింగ్ స్టేషన్ల కోసం: రూ.4 కోట్లు మొత్తం అయ్యే ఖర్చు : రూ .50 కోట్లు -
Bhavani Deeksha Viramana Images: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ రద్దీ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రికి సరికొత్త శోభ
-
పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.!
-
Bhavani Devotess In Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల రద్దీ (ఫోటోలు)
-
పండుగ రోజు ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
-
Vijayawada: దసరా శరన్నవరరాత్రులు ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ (ఫొటోలు)
-
Indrakeeladri : వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
దుర్గ గుడిలో అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి
-
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం
-
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం: మంత్రి కొట్టు
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇంద్రకీలాద్రి పై దసరా మహోత్సవాల ఏర్పాట్లను శనివారం.. మంత్రి పరిశీలించారు. ఆయన వెంట మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు, దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రతీ భక్తుడికి అమ్మవారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఓమ్ టర్నింగ్ వరకూ మూడు క్యూలైన్లు.. అక్కడి నుంచి ఐదు వరుసల క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. కేశ ఖండన చేసుకున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇటీవల కొండ చరియలు విరిగిపడిన దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ‘‘సబ్ కలెక్టర్ కార్యాలయం, వీఎంసీలో ఒక టికెట్ కౌంటర్ పెట్టాం. 3,500 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రోటోకాల్ వీవీఐపీలకు మాత్రమే అంతరాలయ దర్శనం. 500 రూపాయల తీసుకున్న వారికి ముఖమండపం నుంచి దర్శనం. భక్తులకు పాలు, మజ్జిగ, బిస్కెట్లు క్యూలైన్లు లో ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మూలా నక్షత్రం రోజు సీఎం రాకకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేశాం. గతేడాది సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అందుకే ఈసారి బీఎస్ఎన్ఎల్, ఫైబర్ నెట్, ఏసీటీ నుంచి కనెక్షన్లు తీసుకున్నాం. వృద్ధులకు దర్శనం కోసం ఉదయం, సాయంత్రం రెండు ప్రత్యేక స్లాట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. చదవండి: టీడీపీ వీరాభిమానికి గుండె వ్యాధి.. ఆదుకున్న సీఎం జగన్ ప్రభుత్వం -
కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కొట్టు
-
ఇంద్రకీలాద్రి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..
-
శ్రావణ శుక్రవారం.. భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
సాక్షి, విజయవాడ: శ్రావణమాసం శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో ఇంద్రకీలాద్రి దర్దీగా మారింది. ఉదయం నుంచి దర్శనాలు కొనసాగుతున్నాయి. నేడు వరలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్మమ్మకు ఆలయ అర్చకులు 31 రకాల విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భ్రమరాంబ ఉదయాన్నే భక్తులు రద్దీని పరిశీలించారు. కాగా దుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 8న ఉచితంగా సామూమిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు. వరంగల్ భద్రకాళి అమ్మావారికి పోటెత్తిన భక్తులు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలతో అమ్మవారు ఆలయాలు భక్తులతో కిటకిటలాడున్నాయి. వరంగల్లోని భద్రకాళి అమ్మవారు ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలతో తరిస్తున్నారు. హంటర్ రోడ్లోని సంతోషిమాత ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో అమ్మవారు ఆలయాలు భక్తజనసంద్రంగా మారాయి. -
Vijayawada : ఇంద్రకీలాద్రిపై శ్రావణమాస శోభ (ఫొటోలు
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
శరన్నవరాత్రి ఉత్సవాలు :భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు(ఫోటోలు)
-
ఇంద్రకీలాద్రిపై ఆషాడోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
-
3న దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ జూలై 3న ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనుంది. కమిటీ సభ్యులు బుధవారం విజయవాడలో దుర్గగుడి ఈవో భ్రమరాంబతో సమావేశమై చర్చించారు. కార్యక్రమ వివరాలను ఆలయ ఈవో, ఇంజనీరింగ్ అధికారులకు వివరించారు. ఈ ఏడాది బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు కమిటీ ప్రతినిధులు ఈవోకు వివరించారు. ఈవోను కలిసిన వారిలో వైస్ చైర్మన్ ఆనందరావు, గాజుల అంజయ్య, మధుసూదన్గౌడ్, అన్సరాజ్ తదితరులున్నారు. (చదవండి: అమ్మవారి హుండీల్లో ఫారిన్ కరెన్సీ) -
కాంట్రాక్టర్ చీరవాటం.. ఇంద్రకీలాద్రిపై మరో అవినీతి బాగోతం వెలుగులోకి..
సాక్షి, అమరావతి బ్యూరో: ఇంద్రకీలాద్రిపై అవకతవకలకు అడ్డూ అదుపూ ఉండడం లేదు. రోజుకో అవినీతి వ్యవహారం వెలుగులోకి వస్తున్నా.. దేవస్థానం యంత్రాంగంలో మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి వివిధ సరుకుల సరఫరా కాంట్రాక్టులో అక్రమాలు బహిర్గతమయ్యాయి. టెండరు షెడ్యూలులో పేర్కొన్న విధంగా నాణ్యమైన సరుకులకు బదులు నాసిరకం పంపిణీ చేస్తుండడం తెలిసిందే. అలాగే కొబ్బరికాయలు కొట్టే స్థలం వద్ద కాయలు కొట్టినందుకు కొంతమంది కాంట్రాక్టరుకు చెందిన సిబ్బంది భక్తుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్న వైనం కూడా విదితమే. తాజాగా అమ్మ వారికి భక్తులు మొక్కుబడులుగా సమర్పించిన చీరల విక్రయంలోనూ బహిరంగంగా అవినీతికి పాల్పడుతున్నారు. ఇదీ సంగతి.. అమ్మవారికి భక్తులు సమర్పించే చీరలను విక్రయించే కాంట్రాక్టును ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. దేవస్థాన ప్రాంగణంలోనూ, ఘాట్ రోడ్డులో ప్రసాదాలు విక్రయించే కేంద్రాల వద్ద చీరల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ‘శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల వస్త్ర ప్రసాద విక్రయ కేంద్రం’ పేరిట ఉన్న ఈ కౌంటర్లలో చీరలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కౌంటర్లలో కొన్ని చీరలకు మాత్రమే ధరను తెలిపే స్టిక్కర్లను అంటిస్తున్నారు. మిగతా చాలా చీరలను ఆ కౌంటర్లో ఉన్న సిబ్బందే ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. చీరల కొనుగోలుకు వచ్చిన భక్తులను ఎంత ఖరీదువి కావాలని వీరు అడుగుతున్నారు. దాన్ని బట్టి కొన్నింటిని చూపిస్తున్నారు. వాటిపై ఎలాంటి ధర లేకుండానే విక్రయిస్తున్నారు. ఇలా పలు చీరలకు వస్త్ర దుకాణాల్లో ధరల కంటే ఎక్కువ ధర చెప్పి.. కాస్త తగ్గించి ఇస్తున్నారు. ఉదాహరణకు షాపులో రూ.600–700కు మించని (ధర స్టిక్కరు లేని) చీర రూ.వెయ్యి చెప్పి వందో, యాభయ్యో తగ్గిస్తున్నారు. రశీదు కూడా లేకుండా.. వాస్తవానికి భక్తులు అమ్మవారికి చీరలు సమర్పించేటప్పుడు దాని ఖరీదు ఎంతో అడిగి తెలుసుకుని రశీదు ఇస్తారు. వీటిని ఆ ధరపై 20–25 శాతం తక్కువ ధర నిర్ణయించి అమ్మకానికి పెడతారు. ఇలా విక్రయించే చీరలకు విధిగా బిల్లు ఇవ్వాలి. ఇందుకోసం ఈ కౌంటర్లలో ఒక బిల్లింగ్ మిషన్ను కూడా అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ విక్రయించే చీరలకు బిల్లు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.ఇంద్రకీలాద్రిపై అమ్మవారి చీరల విక్రయ కౌంటర్ భక్తుల సెంటిమెంటే ఆయుధం భక్తులు అమ్మ వారి చీర కొనుక్కోవడం అంటే ఎంతో సెంటిమెంటుగా భావిస్తారు. దీంతో చాలామంది చీరలపై ధర లేకపోయినా, బిల్లు ఇవ్వకపోయినా అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ఖరీదు చేసే చీరలను ఎక్కువ ధరకు అమ్మడం, వాటికి బిల్లు ఇవ్వకపోవడం ద్వారా సదరు కాంట్రాక్టరు భక్తుల నుంచి భారీ ఎత్తున దోపిడీ చేస్తున్నారు. కళ్లెదుటే ఇంతటి మోసం జరుగుతున్నా దేవస్థానం అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కాంట్రాక్టరు దోపిడీకి అడ్డుకట్ట వేయడం లేదు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటాం.. నిబంధనల ప్రకారం అమ్మవారి వస్త్ర ప్రసాదం చీరలపై విధిగా ధర ఉండాలి. విక్రయించిన చీరలకు కచ్చితంగా బిల్లు ఇవ్వాలి. అలా విక్రయించడం తప్పు. వస్త్ర ప్రసాద విక్రయ కౌంటర్లలో అక్రమాలకు తావు లేకుండా చూస్తాం. సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటాం. – భ్రమరాంబ, ఈవో, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం -
ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భవానీలు
-
దుర్గమ్మ సేవలో సీజేఐ దంపతులు
-
కోటి దీపోత్సవం కాంతులతో మెరిసిపోతున్న ఇంద్రకీలాద్రి
-
ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు సంస్మరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఆదిశంకరాచార్యులు సందర్శించిన 14 దేవాలయాల్లో సీఎం జగన్ ఆదేశాల మేరకు సంస్మరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నిర్వహించిన ఉత్సవాల్లో దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. 'జగద్గురు ఆదిశంకరాచార్యులు భగవత్ స్వరూపులు. కేదార్నాథ్లో ఆదిశంకరాచార్యుల సంస్మరణోత్సవాలను ప్రధాని మోదీ నిర్వహించడం సంతోషంగా ఉంది. ఆయన సందర్శించిన పవిత్రస్థలాల్లో సంస్మరణ ఉత్సవాలు నిర్వహించాం. ఆదిశంకరాచార్యులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రీచక్రం ప్రతిష్టించారు. అందుకే దుర్గమ్మ ఆలయంలో కూడా సంస్మరణోత్సవాన్ని నిర్వహించాము. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 14 ఆలయాల్లో ఆదిశంకరాచార్యుల సంస్మరణోత్సవాలను నిర్వహించాము. కేదార్నాథ్లో ప్రధాని నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశాము. ఆదిశంకరాచార్యుల విశిష్టతను అందరికీ తెలియజేసేలా కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు' అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: (నెల్లూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్..) -
ఆది దంపతుల తెప్పోత్సవం.. వైభవోపేతం
-
ఇంద్రకీలాద్రి: రేపు, ఎల్లుండి వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాల రద్దు
సాక్షి, విజయవాడ: రేపు, ఎల్లుండి ఇంద్రకీలాద్రిపై వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేశారు. రేపు,ఎల్లుండి సాధారణ దర్శనాలను మాత్రమే అనుమతిస్తామని కలెక్టర్ తెలిపారు. భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించమని కలెక్టర్ తెలిపారు. చదవండి: ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ -
శరన్నవరాత్రి ఉత్సవాలు: ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం
-
Indrakeeladri: దుర్గమ్మను దర్శించిన గవర్నర్ దంపతులు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆలయ పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. (చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ) దర్శనం అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, దసరా మొదటి రోజున దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, కరోనాను ప్రపంచం నుంచి దూరం చేయాలని అమ్మవారిని కోరుకున్నానని గవర్నర్ తెలిపారు. చదవండి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయండి -
శ్రావణ శుక్రవారం : భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి
-
పుష్కరాల వేళ కూల్చేసిన ఆలయాలన్నీ తిరిగి నిర్మించాలి
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/నరసరావుపేట రూరల్ : పుష్కరాల సమయంలో కూల్చి వేసిన ఆలయాలన్నింటినీ తిరిగి నిర్మించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆలయాల సందర్శన కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు శనివారం ఇంద్రకీలాద్రి నుంచి ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఎమ్మెల్సీ మాధవ్తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం కృష్ణానది తీరంలో కూల్చివేసిన ఆలయ ప్రాంతాలను, ప్రభుత్వం ఇటీవల నిర్మాణం చేపట్టిన నాలుగు ఆలయాలను వారు పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని సోము వీర్రాజు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఆలయాలు నేలమట్టమై, అంతర్వేది రథం దగ్ధమై, రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసమై చాలా కాలమైందన్నారు. అయినా ఈ ఘటనలకు కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటూ మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత పోస్ట్లు ఒక వర్గానికే దక్కాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ మర్చిపోయారని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేదని విమర్శించారు. తిరోగమనంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని త్రికోటేశ్వరస్వామిని కోరుకున్నట్టు సోము వీర్రాజు తెలిపారు. -
‘అలా చేస్తే ప్రమాదాలు నివారించవచ్చు’
సాక్షి,విజయవాడ: రెండు వారాల క్రితం ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి సమీపంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఐఐటీ ప్రొఫెసర్ మాధవ్తో కూడిన నిపుణుల కమిటీ కొండ చరియలు విరిగి పడే ప్రాంతాన్ని పరిశీలించారు. ఒక వారం లోపు నేవిదిక సమర్పిస్తామని తెలిపారు. భక్తుల భద్రత మాకు ముఖ్యమని ఐఐటీ ప్రొఫెసర్ మాధవ్ వెల్లడించారు. (చదవండి: ‘సీఎం జగన్ స్పందన అభినందనీయం’) ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. ‘12 ఏళ్ల నుంచి కొండ చరియలు గురించి సలహాలు ఇస్తున్నాం. ఘాట్ రోడ్డు విస్తరణ కు కొండను తవ్వారు. అపుడు కొండ ప్రాంతం దెబ్బతింది. ఫెన్సింగ్ ద్వారా కొంత మేరకు కట్టడి చేశారు. ఈ కొండ రాయి రాక్ ఫాల్ టైప్. ఫెన్సింగ్, కేబుల్, హైడ్రో సీలింగ్ చేస్తే ప్రమాద తీవ్రతను తగ్గించ వచ్చు. కొండ గట్టిదే కానీ కొండ మీద వర్షం వచ్చినపుడు నీరు ఆగితే ప్రమాదం. కొండ మీద నీరు నిల్వ లేకుండా బయటకి పంపేందుకు సలహాలిచ్చాం. కొండ చుట్టూ పూర్తిగా ఫెన్సింగ్ వేస్తే కొండ చరియలు పడినా ప్రమాదాలు నివారించ వచ్చు. హైడ్రో సీలింగ్(సీడ్స్ వేసి చిన్న సైజ్ చెట్లు పెంచితే) చేస్తే ప్రమాదాలు జరగవు’ అన్నారు. -
ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు
-
స్వర్ణకవచాలంకృత రూపంలో దుర్గాదేవి
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారికి నగర సీపీ బత్తిన శ్రీనివాసులు, దుర్గగుడి ఈవో సురేష్ బాబు దంపతులు తొలి పూజ నిర్వహించారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న 10వేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి, శనివారం నుంచి మల్లేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు. అలాగే పదేళ్లలోపు పిల్లలకు, 60ఏళ్లు పైబడిన వారికి దర్శనానికి అనుమతి నిరాకరిస్తున్నారు. అలాగే కేశఖండన, ఘాట్ల వద్ద స్నానాలు నిషేధం విధించారు. (ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శరన్నవరాత్రులు) మూల నక్షత్రం(అక్టోబర్ 21) రోజున తెల్లవారుజమున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. 24వ తేదీ అమ్మవారిని రెండు అలంకారాలలో భక్తులు దర్శంచుకోనున్నారు. ఉదయం దుర్గాదేవిగా, మధ్యాహ్నం నుంచి మహిసాసురమర్ధని దేవిగా అలంకరిస్తారు. 25వ తేదీ (విజయదశమి) రోజున దుర్గాదేవి శ్రీరాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రి వైభవం - మొదటి రోజు ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శరన్నవరాత్రులుగా మనం జరుపుకునే దసరా ఉత్సవాలలో శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతను వివిధ రూపాలలో ప్రత్యేక విధి విధానాలతో పూజిస్తాం. ప్రథమంగా పాడ్యమి నాడు బెజవాడ కనకదుర్గమ్మని స్వర్ణకవచాలంకారంతో షోడశోపచారాలతో పూజిస్తారు. ఆ రోజు చేమంతి పూలను వినియోగిస్తారు. దుర్గా అష్టోత్తర నామాలతో పూజ చేసి, పులిహోరను నివేదించి అమ్మను స్తుతిస్తారు. దేవీస్తుతి: సర్వ మంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్య్రమ్బకే దేవి నారాయణి నమోస్తుతే ఈ నవరాత్రి వ్రతం చేయువారు ఉదయం సాయంత్రం విధివిధానాలతో పూజించాలి. నవరాత్రులలో ఇంటికి వచ్చే ముత్తయిదువులకు యధాశక్తి తాంబూలం సమర్పించుకోవాలి. ఈ వేళ శ్రీశైల భ్రమరాంబికను శైలపుత్రిగా అలంకరిస్తారు. శ్లోకం: ప్రథమా శైలపుత్రీచ, ద్వితీయ బ్రహ్మచారిణి, తతీయ చంధ్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకీ, పంచమా స్కంద మాతేతి, షష్టా కాత్యాయనేతిచ, సప్తమా కాళరాత్రీచ, అష్టమాచాతి భైరవీ, నవమా సర్వసిద్ధిశ్చాత్నవదుర్గా ప్రకీర్తితా’’. – డా. దేవులపల్లి పద్మజ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు సర్వం సిద్ధం
-
దుర్గమ్మను దర్శించుకున్న వృద్ధులు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పండగ సందర్భంగా అనాథాశ్రమాల్లోని వృద్ధులు దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ ప్రేమ ఆశ్రమం, వృద్ధుల సంక్షేమాశ్రమం నుంచి సుమారు 150 మంది వృద్ధులు మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి అమ్మవారి ప్రసాదాలతోపాటు దుర్గమ్మ చీరలను ఆలయ ఈవో ఎంవీ సురేష్బాబు దగ్గరుండి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండగ రోజు వృద్ధులకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని సంకల్పించామన్నారు. అందులో భాగంగానే అనాధాశ్రమంలోని 150 మంది వృద్ధులకు అమ్మవారి దర్శనం కల్పించడంతోపాటు దుర్గమ్మ చీరలను ఇచ్చామని పేర్కొన్నారు. వారికి దుర్గమ్మ అండగా ఉంటుందన్న భరోసా కల్పించేందుకే అమ్మవారి దర్శనం చేయించామన్నారు. అనంతరం వృద్ధులు మాట్లాడుతూ ‘గతంలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగను ఎంతో వైభవంగా జరుపుకునేవాళ్లం. ప్రస్తుతం పిల్లలు, కుటుంబ సభ్యులతో కాకుండా వృద్ధాశ్రమంలోనే సంక్రాంతి జరుపుకోవడం బాధగా ఉన్నా తప్పదు. ఒంటరిగా పండగ జరుపుకున్నప్పటికీ మాకు దుర్గమ్మ అండగా ఉందన్న నమ్మకం కలిగింది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: జీన్స్ వేసుకుంటే అంతరాలయ దర్శనం కల్పించం -
ఆ రోజు విద్యార్థులకు అమ్మవారి ఉచిత దర్శనం
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయని దుర్గగుడి ఈవో ఎంవి సురేష్బాబు తెలిపారు. వేడుకల సందర్భంగా ఆలయ సిబ్బంది దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక అలంకరణ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అమ్మవారి దర్శనం చేయించి అనంతరం వారికి చీరలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. దుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచించారు. ఇకపై జీన్స్ వేసుకున్నా, సంప్రదాయ దుస్తుల్లో రాకున్నా అంతరాలయ దర్శనం కల్పించబోమని స్పష్టం చేశారు. ఇక అమ్మవారిని అంతరాలయం నుంచి దర్శించుకోవాలనుకునే భక్తుల నుంచి రూ.300 చొప్పున టికెట్ వసూలు చేస్తుండగా దీన్ని ఆన్లైన్లో బుక్చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 30న శ్రీపంచమిని పురస్కరించుకుని అమ్మవారు సరస్వతి దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆరోజు విద్యార్ధులకు అమ్మవారి ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో సురేష్బాబు ప్రకటించారు. ఈ నెల 31న సీవీ రెడ్డి వర్ధంతి కావడంతో 100 మందికి స్కాలర్షిప్లు ఇస్తున్నామన్నారు. కొండపై అర్జునుడు ప్రతిష్టించిన ఆలయానికి భక్తులను అనుమతించే మార్గంపై ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. కేశఖండన శాల, ప్రసాదం పోటు శాశ్వత భవనాలకు త్వరలోనే శంకుస్థాప చేస్తామన్నారు. అమ్మవారి పులిహోర ప్రసాదాన్ని రూ.5 నుంచి రూ.10కి పెంచాలని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. చదవండి: ‘అన్ని దేవాలయాలకు ఒకటే వెబ్సైట్’ -
దీక్ష విరమణ ఘట్టం... భక్తి పారవశ్యం
-
కొండపైకి ప్లాస్టిక్ తీసుకురావద్దు: దుర్గాగుడి ఈవో
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్ను నిషేధించామని, భవానీలెవరూ కొండపైకి ప్లాస్టిక్ కవర్లను తీసుకురావద్దని దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్బాబు సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణ కార్యక్రమం ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనుందని తెలిపారు. దీక్షా విరమణ రోజుల్లో తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కొనసాగుతుందని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనార్థం ఏడు లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేశారు. బుధవారం నాడు జరిగే కలశ జ్యోతి మహోత్సవానికి జ్యోతుల ఊరేగింపులో హాజరయ్యే భక్తులు ఘాట్ రోడ్డు మీదుగా కాకుండా కనకదుర్గా నగర్ మీదుగా రావాలని విజ్ఞప్తి చేశారు. భవానీల కోసం ఘాట్ రోడ్డు మీదుగా క్యూలైన్లతో పాటు గిరి ప్రదక్షిణ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో భవానీల కోసం మూడు హోమగుండాలను ఏర్పాటు చేశామన్నారు. -
భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి
-
మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు...ఈ రోజు (సోమవారం) మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ జగన్మాత దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. మహిషుడు అనే రాక్షసుడిని సంహరించింనందుకు జగన్మాతకు మహిషాసురమర్దని అనే పేరు వచ్చింది. తొమ్మిదిరోజులపాటు సాగిన రణంలో రోజుకో రూపంతో అమ్మవారు యుద్ధం చేశారు. సింహ వాహనాన్ని అధిరోహించి, చేతిలో త్రిశూలం ధరించి ఉగ్రరూపంతో తల్లి దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దినిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి దుర్గామాత పటాన్ని బహుకరించారు. -
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి అలకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సాయంత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారిగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం వైఎస్ జగన్ వెంట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. అంతకుమందు ప్రకాశం బ్యారేజ్ మీదుగా దుర్గగుడికి చేరకున్న సీఎం వైఎస్ జగన్ను.. అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతంతో ఆలయంలోకి ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణ, రూ. 100 టికెట్ క్యూలైన్లలోని భక్తులు యథావిధిగా అమ్మవారిని దర్శించుకునే సౌకర్యం కల్పించారు. వీఐపీ క్యూలైన్లను మాత్రం కొద్దిసేపు నిలిపివేశారు. కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ : (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రేపు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సాయంత్రం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 5న ఢిల్లీ పర్యటన ఉన్న కారణంగా ముందు రోజే ముఖ్యమంత్రి ఇంద్రకీలాద్రికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ సీఎం జగన్ రేపు సాయంత్రం దుర్గమ్మవారిని దర్శించుకొనున్న నేపథ్యంలో డీసీపీ విజయరావు నేడు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజ్ మీదుగా ముఖ్యమంత్రి దుర్గగుడికి చేరుకుంటారని, ఓంకారం వద్ద మంత్రులు సీఎం జగన్కు స్వాగతం పలుకుతారని తెలిపారు. అనంతరం సాంప్రదాయ పద్దతిలో సీఎం జగన్ పట్టు వస్త్రాలు తీసుకువచ్చి దుర్గమ్మకు సమర్పిస్తారని చెప్పారు. అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకునే సమయంలో సాధారణ, 100 టికెట్ క్యూలైన్లు యథావిధిగా నడుస్తాయని.. వీఐపీ క్యూలైన్లు మాత్రమే నిలిపివేస్తామన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఘాట్ రోడ్ పైకి ఏవిధమైన వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. (చదవండి: శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన సీఎం వైఎస్ జగన్) 5న ఢిల్లీకి సీఎం జగన్ అక్టోబరు 5న ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. -
దసరా సంబరానికి ఇంద్రకీలాద్రి ముస్తాబు
-
తలసాని ఎఫెక్ట్; దుర్గగుడిలో నిషేధాజ్ఞలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ పవిత్రతను కాపాడేందుకు దేవస్థానం అధికారులు నిషేధాజ్ఞలను అమలులోకి తీసుకొచ్చారు. ఏపీ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో దుర్గగుడి ఆలయ ప్రాంగణంలోని ఈవో ఛాంబర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పాలన సరిగాలేదని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. తలసాని వ్యాఖ్యలతో రాజకీయ దుమారం లేచింది. ఈ నేపథ్యంలో ఈవో కోటేశ్వరమ్మ దుర్గగుడి ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి వచ్చే ప్రముఖలు ఇక్కడ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయకూడదన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు, వ్యక్తిగత, వ్యాపారానికి సంబంధించి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని ఆంక్షలు విధించారు. దుర్గగుడి ప్రతిష్టను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈవో కోరారు. -
‘టీ షర్టులు, ఫ్యాంట్లు వేసుకుని రావొద్దు’
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఆంగ్ల సంవత్సరాది వేళ దుర్గమ్మ భక్తులందరూ ఇకపై ఫ్యాషన్ దుస్తులను వదిలి, సంప్రదాయ దుస్తుల్లోనే అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు. ఈ మేరకు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం నుంచి కొత్త సంప్రదాయానికి ఆలయ అధికారులు తెరలేపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ ఇకపై తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని ఈవో వీ.కోటేశ్వరమ్మ తెలిపారు. అలా వచ్చిన వారిని మాత్రమే దర్శనానికి అనుమతించాలని ఆలయ అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పురుషులు ఫ్యాంట్, షర్టు లేదా పంచె, లుంగీ ధరించి రావచ్చు. ఇక మహిళలు, యువతులు పంజాబీ డ్రస్సు, టాప్పై తప్పని సరిగా చున్నీ ధరించి రావాలని సూచించారు. మహిళలు చీరలు, లంగా వోణీలు ధరించి దర్శనానికి రావచ్చన్నారు. ముఖ్యంగా మహిళలు, యువతులు టీ షర్టులు, ఫ్యాంట్లు ధరించి ఆలయానికి రావద్దని పేర్కొన్నారు. అలాగే పురుషులు, స్త్రీలు షాట్స్, సీవ్లెస్ టీ షర్టులు ధరించి రావద్దని సూచించారు. మరో వైపు అమ్మవారి దర్శనానికి సంప్రదాయ దుస్తుల్లో రాని పక్షంలో ఆలయ ప్రాంగణంలోనే దేవస్థానం నిర్వహించే ప్రత్యేక కౌంటర్లో రూ.100కు చీర అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. అమ్మవారి దర్శానానికి సంప్రదాయ దుస్తుల్లోనే అనుమతించాలని ఆలయ అధికారులు నిర్ణయించగా, ఆర్జిత సేవల్లో గత కొన్ని నెలలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. -
భవానీలతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
-
భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
-
దుర్గమ్మ గుడిలో మరో మాయాజాలం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): బెజవాడ దుర్గమ్మ గుడిలో మరో మాయాజాలం చోటు చేసుకుంది. దుర్గమ్మకు ఆషాఢ సారెలో సమర్పించిన రూ.18 వేల విలువైన పట్టుచీర ఆదివారం మాయమైంది. ఇంద్రకీలాద్రిపై మహామండపంలోని ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి పట్టుచీరను అలంకరించిన పది నిమిషాల తర్వాత పట్టుచీర మాయం కావడంతో సారెను సమర్పించిన భక్త బృందం తీవ్ర మనస్తాపానికి గురైంది. అమ్మవారి సన్నిధి నుంచి చీరను దొంగిలించడంతో ఇంద్రకీలాద్రిపై భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన లలితా మిగతా పారాయణ భక్త బృందం సభ్యులు దుర్గమ్మకు సారెను సమర్పించారు. సారెలో అమ్మవారికి సమర్పించేందుకు మదనపల్లిలో ప్రత్యేకంగా పట్టుచీరను నేత నేయించారు. సుమారు రూ.18 వేల విలువైన పట్టుచీరతోపాటు పూలు, పండ్లు, పూజా సామగ్రితో 300 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మహామండపం ఆరో అంతస్తులో భక్త బృంద సభ్యులైన పద్మజ, బాలాత్రిపుర సుందరి అమ్మవారికి పట్టుచీరను సమర్పించారు. అమ్మవారి వేదిక వద్ద ఉన్న ఆలయ వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య, అర్చకుడు రమేశ్ ఉత్సవమూర్తికి పట్టుచీరను అలంకరించారు. కొద్దిసేపటి తర్వాత పట్టుచీరను ఉత్సవమూర్తిపై నుంచి తీసి పక్కనే ఉన్న అర్చకులకు అందచేశారు. ఇంతలో భక్త బృందానికి చెందిన బాలాత్రిపుర సుందరి చీరను ఇవ్వాలని కోరగా అప్పటికే చీర మాయమైనట్లు గుర్తించారు. సిబ్బంది ఎదురుదాడి చీర మాయం కావడంతో బాలాత్రిపుర సుందరి, పద్మజ ఆలయ సిబ్బందిని నిలదీశారు. ఆలయ సిబ్బంది మాత్రం మీ బృందం సభ్యులకే చీరను ఇచ్చామంటూ ఎదురుదాడికి దిగారు. భక్తితో అమ్మవారికి సమర్పించిన చీరను తామే తీసుకుని అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముందంటూ వారు సిబ్బందిని ప్రశ్నించారు. చీర మాయమైన వ్యవహారంపై ఆలయ ఈవో ఎం.పద్మకు ఫిర్యాదు చేశారు. తర్వాత సీసీ కెమెరా పుటేజీని భక్త బృందం, ఆలయ అధికారులు పరిశీలించారు. సీసీ పుటేజీ వైదిక కమిటీ సభ్యుడు చీరను ఉత్సవమూర్తి పై నుంచి తీసే వరకే ఉండటం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టైంది. మాయమైన చీర కోసం భక్త బృందం సభ్యులు చీరల కౌంటర్తోపాటు మహామండపం ఆరో అంతస్తులో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో చీర విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని పాలకమండలి సభ్యుడు ఒకరు భక్త బృందం సభ్యులకు సూచించడంతో వారు అవాక్కయ్యారు. ఆలయ సిబ్బందే చీరను మాయం చేసి ఉంటారనే నిర్ధారణకు వచ్చారు. మరోసారి బయటపడిన డొల్లతనం దుర్గగుడిలో సీసీ కెమెరాల పనితీరు డొల్లతనం మరోసారి బయటపడింది. ఆషాఢ మాసం ప్రారంభం నుంచి భక్తుల రద్దీతో ఉంటున్న ఆరో అంతస్తులో సీసీ కెమెరాల పుటేజీ పూర్తిస్థాయిలో లభ్యం కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీరను ఉత్సవమూర్తి పై నుంచి తీసిన తర్వాత పుటేజీ లభ్యం కాకపోవడం వెనుక కచ్చితంగా ఆలయ సిబ్బంది పాత్ర ఉండొచ్చని అంటున్నారు. పుటేజీని కావాలనే తొలగించి ఉంటారని భావిస్తున్నారు. -
ఇంద్రకీలాద్రిపై ఉత్కంఠ రేపిన చిన్నారి మిస్సింగ్
సాక్షి, విజయవాడ/నరసరావుపేట టౌన్: ఇంద్రకీలాద్రిపై చిన్నారి మిస్సింగ్ ఉదంతం 12 గంటల పాటు ఉత్కంఠ రేపింది. చివరకు చిన్నారి ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం అరసబలగాకు చెందిన పైడిరాజు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నవ్యశ్రీ (4)కాగా రెండో కుమార్తె నెలల పిల్ల. నవ్యశ్రీ విజయవాడ చిట్టినగర్లోని తాతయ్య కోరగంజి కృష్ణ ఇంట్లో ఉంటోంది. పైడిరాజు దంపతులు, కృష్ణ దంపతులు ఇటీవల తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు విజయవాడకు చేరుకున్నారు. ఉదయం 8 గంటలకు కొండపైన మల్లికార్జున మహామండపం వద్దకు చేరుకున్నారు. సెల్ఫోన్లు భద్రపరుచుకునే కౌంటర్ వద్దకు వెళ్లిన సమయంలో కొద్ది నిమిషాలు నవ్యశ్రీని తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఆ తర్వాత పాప కనపడకపోవడంతో ఆ దంపతులు ఆందోళన చెందారు. ఆలయం వద్ద మైక్లో చెప్పించినా ఉపయోగం లేకపోవడంతో 10 గంటల ప్రాంతంలో వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అర్జునవీధిలోని ఓ సీసీ కెమెరాను పరిశీలిస్తుండగా.. ఓ మహిళ చిన్నారిని తీసుకెళుతున్నట్లు గుర్తించారు. ఆమెతో పాటు మరో మహిళ, ఓవ్యక్తి కూడా ఉన్నారు. దీంతో పోలీసులు రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలను పరిశీలించగా.. పాప పదో నంబర్ ప్లాట్ఫాంపై మహిళతో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో బయలుదేరిన రైళ్లు గుంటూరు వైపుగా వెళ్లడంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. నరసరావుపేటలో పాప ఆచూకీ ఉదయం కనకదుర్గమ్మ ఆలయంలో తప్పిపోయిన బాలిక రాత్రి గుంటూరు జిల్లా నరసరావుపేట వన్టౌన్ పోలీస్స్టేషన్కు చేరింది. నరసరావుపేటకు చెందిన చల్లా సుబ్బలక్ష్మి పాపను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తాము ఆదివారం ఉదయం దుర్గమ్మ దర్శనానికి వెళ్లామని, తిరిగి వస్తుండగా పాప ఏడుస్తూ కనిపించిందని తెలిపారు. పాప వివరాలు చెప్పలేకపోయిందని, తమతో పాటే వచ్చేసిందని పేర్కొన్నారు. విజయవాడలో ఎవరికి అప్పగించాలో తెలియక నరసరావుపేట పోలీసులకు పాపను అప్పగించామని తెలిపారు. పాపను రాత్రి 10 తర్వాత పోలీసులు విజయవాడకు పంపారు. అమ్మదయతోనే తమ పాప దొరికిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. రాత్రి 8 గంటల సమయంలో పాప ఆచూకీ తెలిసిందన్నారు. బయటపడ్డ భద్రత డొల్లతనం దుర్గగుడిలో 79 కెమెరాలు ఉన్నాయి. అయినా పాప తప్పిపోయిన విషయం గుర్తించలేకపోయారు. అయితే మల్లికార్జున మహామండపం వద్ద ఉన్న కెమెరా వర్షానికి పాడైపోయిందని అధికారులు చెబుతున్నారు. ఘాట్రోడ్డు వద్ద, కొండపైన క్లోక్ రూమ్ వద్ద ఉన్న కెమెరాలు స్పష్టంగా కనపడటం లేదంటున్నారు. కీలకమైన ఈ ప్రాంతాల్లో కెమెరాలు పనిచేయకపోయినా అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ మూడు కెమెరాలే పనిచేయడంలేదని అధికారులు చెబుతున్నా.. వాస్తవంగా సగం కెమెరాలు పనికిరానివేనని సమాచారం. అమ్మవారి ప్రధాన ఆలయం, ఉపాలయాలు వద్ద కెమెరాలు తప్ప మిగిలినవేవీ పనిచేయడం లేదు. అయినా అధికారులు కానీ, పాలకమండలి కానీ పట్టించుకోవడంలేదు. సీసీ కెమెరాలు పనిచేస్తే దేవస్థానం ఉద్యోగుల అక్రమాలు బయటపడతాయని సిబ్బంది కూడా ఈ విషయంపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. -
ఇంద్రకీలాద్రి పై శ్రీపంచమి ఉత్సవం