kaushik reddy
-
కౌశిక్రెడ్డి ప్రవర్తనపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ ప్రవర్తనపై మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి స్పందించారు. ఉత్తమ్కుమార్రెడ్డి శుక్రవారం(జనవరి24) మీడియా చిట్చాట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి కార్యక్రమ సమావేశంలో కౌశిక్ రెడ్డి తీరుపై ఉత్తమ్ అసహనం వ్యక్తం చేశారు. మంత్రిని తాను స్టేజ్పై ఉండగానే అల్లరి చేయడం లీడర్ లక్షణం కాదన్నారు.యువ రాజకీయ నాయకుడికి అంత ఆవేశం పనికిరాదు.కౌశిక్రెడ్డి తన తీరు మార్చుకోకపోతే రాజకీయ భవిష్యత్తులో ఇబ్బందులు పడతాడు.తనకు కౌశిక్రెడ్డికి రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవని ఉత్తమ్కుమార్రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాగా, ఇటీవల కరీంనగర్ డీఆర్సీ సమావేశంలో ఇంఛార్జ్ మంత్రిగా ఉత్తమ్కుమార్రెడ్డి వేదికపై ఉండగానే కౌశిక్రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో గొడవ పెట్టుకోవడమే కాకుండా ఆయనను నెట్టివేశారు. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ గొడవలో కౌశిక్రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. అంతకు ముందు కూడా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి వివాదాస్పద సవాల్ విసిరి గొడవకు కారణమయ్యారు.బీఆర్ఎస్ వల్లే కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం...ఉత్తమ్కుమార్కృష్ణానది జలాల వాటల్లో తెలంగాణకు అన్యాయం బీఆర్ఎస్ (BRS) వల్లే జరిగిందినీళ్ల విషయంలో ప్రభుత్వం పై హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారునీళ్ల కోసం బీఆర్ఎస కొట్లాడినట్లు హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయి.హరీష్ రావు-కేసీఆర్ నిర్ణయాల వల్ల ఇరిగేషన్ శాఖ కోలుకోలేని విధంగా తయారు అయింది.బనకచర్ల ప్రాజెక్టులో హరీష్ రావు అన్నట్లు 200 టీఎంసీలు తరలిపోతున్నాయి అనేది అవాస్తవం.ఏపీ ఒక లేఖ మాత్రమే రాసింది...దానికి వెంటనే కౌంటర్ లేఖ రాశాముకేసీఆర్ చేసిన తప్పిదాలను మేము సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.నీటి వాటాల్లో తెలంగాణ 299 టీఎంసీ-512టీఎంసీకి కేసీఆర్ ఒప్పుకున్నారు.ఇప్పుడు మేము మొత్తం 811 టీఎంసీలో 70శాతం తెలంగాణాకు, 30శాతం ఏపీకి ఇవ్వాలని కోరుతున్నాం.నీళ్లను ఏపీకి అప్పగించి...ఇవ్వాళ దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నారుఘైఐఏఎస్ అధికారిని తప్పుపట్టడం కరెక్ట్ కాదు...బీఆర్ఎస్ వ్యాఖ్యలు చిల్లర రాజకీయాలే -
కౌశిక్ రెడ్డిపై టమోటాలు విసిరిన కాంగ్రెస్ నేతలు
-
పోలీస్ విచారణకు కౌశిక్ రెడ్డి
-
BRS ఎమ్మెల్యే పాడి కౌశిర్రెడ్డికి ఊరట
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి అరెస్టు
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి(Kaushik Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం (జనవరి13) కౌశిక్రెడ్డిని జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్(Sanjaykumar)ను నెట్టివేసిన కేసులో కౌశిక్రెడ్డిని కరీంనగర్ వన్టౌన్ పోలీసులు(Karimnagar police) అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం కౌశిక్రెడ్డిని పోలీసులు కరీంనగర్కు తరలించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆదివారం తనను కౌశిక్రెడ్డి దుర్భాషలాడుతూ నెట్టివేసిన వ్యవహారంలో పోలీసులకు ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా కౌశిక్రెడ్డిని అరెస్టు చేశారు. కాగా, కరీంనగర్ కలెక్టరేట్లో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్రెడ్డి, సంజయ్కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. సంజయ్కుమార్ మాట్లాడుతుండగా కౌశిక్రెడ్డి కల్పించుకుని ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావని ప్రశ్నించడంతో గొడవ పెద్దదైంది. ఈ క్రమంలోనే కౌశిక్రెడ్డి సంజయ్కుమార్పై చేయి వేసి ఆయను నెట్టివేశారు. అనంతరం సమావేశ మందిరం నుంచి కౌశిక్రెడ్డిని పోలీసులు లాక్కెల్లారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్రెడ్డి కూడా ఉండడం గమనార్హం. ఈ ఘటనపై ఎమ్మెల్యే సంజయ్కుమార్ కౌశిక్రెడ్డిపై కరీంనగర్ పోలీసులతో పాటు తన హక్కులకు భంగం కలిగించారని స్పీకర్కు కూడా రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే కౌశిక్రెడ్డిని కరీంనగర్ పోలీసులు ప్రస్తుతం కౌశిక్రెడ్డిని అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టు దారుణం:కేటీఆర్హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్యపూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు అలవాటుగా మారిందిముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారుపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం -
‘నన్ను నెట్టేస్తావా.. కాంగ్రెస్తో కలిసి పని చేస్తే ఇంత అక్కసా?’
కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి(kaushik reddy) తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నిన్న (ఆదివారం) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) లో కౌశిక్రెడ్డి తనను నెట్టివేశాడని సంజయ్ కుమార్(Sanjay Kumar)ఆరోపించారు. ‘ నిన్న జరిగింది అధికారిక సమావేశం. నన్ను కౌశిక్రెడ్డి నెట్టేశాడు. కౌశిక్రెడ్డి ఇలా చేయడం ఎంతవరకూ కరెక్ట్.నేను ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని దూషించలేదు. కౌశిక్రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఆయనపై కేసులున్నాయి. కౌశిక్రెడ్డికి బెదిరించడం అలవాటు,. వరంగల్లో బెదిరించి సెటిల్మెంట్ చేశాడు. స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశాను. స్పీకర్ దీనిపై చర్యలు తీసుకోవాలి. కౌశిక్రెడ్డి వ్యాఖ్యలను ఎవరూ హర్షించరు. నేను ప్రజా సమస్యలపై మాట్లాడుతామనుకుంటే నాకు ఆటంక కల్గించాడు. జగిత్యాల అభివృద్ధి కొరకే ప్రజలు నన్ను గెలిపించారు.. అభివృద్ధి చేయడం నా ధర్మం . కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తే ఇంత అక్కసు ఎందుకు? అని ప్రశ్నించారు సంజయ్.సమీక్షా సమావేశంలో తోపులాటఆదివారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది. జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్ను కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. -
కౌశిక్రెడ్డిVsసంజయ్కుమార్: గంగుల కీలక వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్ జిల్లా: ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి,సంజయ్ కుమార్ వ్యవహారంలో కౌశిక్రెడ్డిని పోలీసులు లాక్కెళ్లడం విచారకరమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వచ్చారని, అక్కడికి మమ్మల్ని ఆహ్వానిస్తేనే వెళ్లామని తెలిపారు. ఎమ్మెల్యేల బాహాబాహీపై గంగుల సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘సమావేశం ఎజెండా క్లియర్గా ఉంది. ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యల్ని తీసుకెళ్లాలనుకున్నాం. మా డిమాండ్స్ సభ ముందు పెట్టాం. ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని వాటి కోసం ఫొటోలు దిగినవారంతా భ్రమలో ఉన్నారు. ఇళ్లపై క్లారిటీ ఇవ్వాలని కోరాం. దీనిపై సమాధానం రాలేదు.ఎమ్మెల్యేను లాక్కెల్లడం నేనెప్పుడూ చూడలేదు. ముగ్గురు మంత్రులు అనుమతిస్తేనే లాక్కెళ్లారా..? అనుమతిస్తే మీరు సభ నడపడంలో విఫలమైనట్టే. మీ ఆదేశాలు లేకుండా పోలీసులు స్టేజ్ ఎక్కారంటే మీరు క్షమాపణ చెప్పాలి. సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ ఇరిటేట్ అయ్యాడు. కోపతాపాలు సర్వసాధారణమే అయితే వాటిని కంట్రోల్ చేయాలి.ఒక ఎమ్మెల్యేను గుంజుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతమందిపై మీరు కేసులు పెడతారు?అదేమైనా బలప్రదర్శన వేదికనా..? పోలీసు కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. కౌశిక్,సంజయ్ మధ్య ఏం జరిగిందనేది డిఫరెంట్, అది వ్యక్తిగతం. కానీ, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారనేది మా ప్రశ్న’అని గంగుల అన్నారు. -
ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్రెడ్డిల మధ్య తోపులాట
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది.జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్ను కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. -
HYD: కౌశిక్రెడ్డికి అర్ధరాత్రి బెయిల్
సాక్షి,హైదరాబాద్:బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ సీఐని దుర్భాషలాడిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం(డిసెంబర్5)అర్ధరాత్రి ఒంటిగంటకు కొత్తపేటలోని జడ్జి నివాసంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు ప్రవేశపెట్టగా జడ్జి బెయిల్ మంజూరు చేశారు.రూ.5వేల పూచీకత్తుతో కౌశిక్రెడ్డికి బెయిల్ ఇచ్చారు.కౌశిక్రెడ్డికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా జడ్జి నివాసం వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్,రాగిడి లక్ష్మారెడ్డి, శ్రీధర్రెడ్డి తదితరులతో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. కౌశిక్రెడ్డిని గురువారం ఉదయం ఆయన ఇంటివద్ద బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసినప్పుడు హైడ్రామా జరిగింది. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగి అడ్డుకోవడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం విడుదల చేశారు. ఇదీ చదవండి: కౌశిక్రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత -
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నేతల ఆందోళన
-
హైదరాబాద్ లో BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్
-
అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలం: కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: తనను హత్య చేయడానికి అనుచరులను పంపించానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరోక్షంగా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సహచ ఎమ్మెల్యేను హత్య చేయడానికి పంపించారంటే ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉండదని తీవ్రంగా మండిపడ్డారు. ఆయన తెలంగాణ భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు పార్టీ నాయకులు కొట్లాడుకున్నారని అన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకొని హైదరాబాద్ బ్రాండ్ డ్యామేజ్ చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో నేనే అనుచరులను పంపిన అంటున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాని ప్రశ్నించినదుకు సీఎం రేవంత్ నన్ను హత్య చేయాలని అనుకున్నారా?. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ, హోమ్స్ సెక్రెటరీ స్పదించాలి. .. డీజీపీ, హోం శాఖ స్పదించక పోతే రేపు(మంగళవారం) గవర్నర్ను కలుస్తా. పోలీసులు సీఎం రేవంత్పైన 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి. సైబరాబాద్ పోలీస్ కమిషన్కు మంచి పేరు ఉంది. అవినాష్ మహంతి కరీంనగర్ సీపీగా డైనమిక్గా పని చేస్తున్నారు. డైనమిక్ లాగా అవినాష్ మహంతి పని చేయాలి. ఎమ్మెల్యే ఇంటి మీద ఎటాక్ జరిగితే ఎం జరిగిందో పోలీసులు చెప్పరా? ..ఒకన్నీ అరెస్ట్ చేసి ఇంకొకనికి ఎస్కార్ట్ ఇచ్చి చింతపండు చేసినం అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. మరీ ఓటుకు నోటు కేసులో చింతపండు అయిన విషయం మర్చిపోయినవా? నేను తెలంగాణ జనం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. సీఎం రేవంత్ స్థాయి.. వీధి రౌడీ స్థాయికి దిగజారిపోయింది. సీఎం రేవంత్ మనుషులు హత్య చేస్తామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఇంటలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డికి ఫోన్ కాల్స్ వివరాలు ఇచ్చాను. నా ప్రాణానికి హాని జరిగితే రేవంత్ రెడ్డిదే బాధ్యత. రాష్ట్రంలో మల్లా బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది.. ఇది పక్కా. అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలం’ అని అన్నారు. -
డీసీపీ ఫిర్యాదు..ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు
సాక్షి,హైదరాబాద్:హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో శనివారం(సెప్టెంబర్14) కేసు నమోదైంది. అడిషనల్ డీసీపీ హరిచందద్రారెడ్డి ఫిర్యాదుతో బీఎన్ఎస్ఎస్ 132 కింద కౌశిక్రెడ్డిపై కేసు నమోదు చేశారు.గురువారం తన ఇంటిపై ఎమ్మెల్యే గాంధీ దాడి తర్వాత కౌశిక్రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి సైబరాబాద్ కమిషనరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి తనను బెదిరించారని డీసీపీ ఫిర్యాదు చేశారు. కాగా, కౌశిక్రెడ్డి ఇంటిపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు కౌశిక్రెడ్డి, గాంధీ మధ్య వాగ్యుద్ధం ముదిరి దాడులు, కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు -
ప్రాంతీయతపై కేటీఆర్కు పొన్నం కౌంటర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రవాణా శాఖ, హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. శనివారం(సెప్టెంబర్14) కౌశిక్రెడ్డి ఇంట్లో మీడియాతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పొన్నం స్పందించారు.‘ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్ సభ్యులు కాదా.హైదరాబాద్ లో నివసించే వారిని ఏనాడూ కాంగ్రెస్ విమర్శించలేదు. అత్యంత దారుణంగా ఆంధ్రా ప్రజలను విమర్శించింది కేసీఆర్ కాదా.బీఆర్ఎస్ పని అయిపోయిందని ఆ పార్టీ నేత గాంధీనే చెప్తున్నారు.ప్రాంతీయతను రాజకీయంగా వాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది.బీఆర్ఎస్ ప్రభుత్వంలా నియంతృత్వ పోకడలకు మేం పోవడం లేదు.గాంధీ,కౌశిక్ చేసింది తప్పే.కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం కరెక్టా.భౌతిక దాడులు మంచివి కావు’అని పొన్నం అన్నారు. ఇదీ చదవండి.. కౌశిక్రెడ్డిపై దాడి వెనుక పోలీసులు: కేటీఆర్ -
హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ పగ: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: అరికెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.శనివారం కౌశిక్రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనను పరామర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. పోలీస్ ఎస్కార్ట్తో వచ్చి కౌశిక్రెడ్డి ఇంటిపై గాంధీ దాడి చేశారని మండిపడ్డారు. హైదరాబాద్లో శాంతి భద్రతలను రేవంత్ కాపాడలేకపోయారన్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాలేదని, ఇక్కడి ప్రజలను రేవంత్ పగబట్టారని విమర్శించారు. ఇందుకే హైడ్రా తీసుకు వచ్చారన్నారు. నగరంలోప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. తమ పదేళ్ల పాలనలో హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు.‘మా పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి రేవంత్రెడ్డి కండువా కప్పారు. రేవంత్రెడ్డి ఆయన తొత్తులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలకు రేవంత్ స్వయంగా కండువా కప్పారు. కోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గడగడ వణికి పోతున్నారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉరి తీయాలని గతంలో రేవంత్ అన్నారు.మరి ఇప్పుడెందుకు మా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటనా. పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి మరీ కౌశిక్రెడ్డి ఇంటిపై దాడి చేయించిన చరిత్ర రేవంత్రెడ్డిది. దాడికి సహకరించిన పోలీసులపై చర్య తీసుకోవాలి. రాజకీయాలను కాంగ్రెస్ దిగజార్చుతోంది’అని కేటీఆర్ మండిపడ్డారు. విదేశీ పర్యటన ముగించుకుని శనివారం ఉదయమే కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం తొలుత కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కౌశిక్ ఇంటిపై దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కౌశిక్ రెడ్డిని వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ నేతలున్నారు. కాగా, పార్టీ ఫిరాయింపుల విషయమై రెండు రోజుల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడిచాయి. ఇవి కాస్తా ముదిరి ఎమ్మెల్యే గాంధీ తన అనుచరుతో కలిసి కౌశిక్రెడ్డి ఇంటి మీద దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.దీంతో పోలీసులు హైదరాబాద్ నగరంలోని బీఆర్స్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో శుక్రవారం పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు -
ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు
సాక్షి,హైదరాబాద్:శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మీద హత్యాయత్నం కేసు నమోదైంది.హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడి మీద గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.కౌశిక్రెడ్డి ఇంటి మీద దాడి చేసిన ఘటనపై ఎస్ఐ మహేష్ ఇచ్చిన ఫిర్యాదుతో రెండు రోజుల క్రితమే ఒక కేసు నమోదవగా ఆ కేసులో గాంధీ ఇప్పటికే బెయిల్ తీసుకున్నారు. తాజాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు పెట్టారు.కాగా, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్రెడ్డి, గాంధీలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఇవి కాస్తా హద్దు మీరి కౌశిక్రెడ్డి ఇంటి మీద గాంధీ దాడి చేసే దాకా వెళ్లింది. ఈ దాడిపై బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు నిరసన తెలిపారు. ఈ నిరసన ఉద్రిక్తంగా మారడంతో హరీశ్రావు సహా ముఖ్యనేతలను పోలీసులు అరెస్టు చేసి తర్వాత విడిచిపెట్టారు. ఇదీ చదవండి.. ఎమర్జెన్సీ కన్నా దారుణం: హరీశ్రావు -
ఇరు పార్టీల నేతల మధ్య పేలిన మాటల తూటాలు
-
హరీశ్ నీచ రాజకీయాలతో బీఆర్ఎస్ ఖతం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు హరీశ్రావు చేస్తున్న నీచ రాజకీయాలతో ఖతం అవుతుందని మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. హరీశ్రావు.. కౌశిక్రెడ్డిని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయాలకు తెరలేపారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న చిల్లర వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత పత్తా లేకుండా పోయారని విమర్శించారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో తన సోదరి కవితకు బెయిల్ రాగానే కేటీఆర్ అమెరికాకు చెక్కేశారని, ఇక్కడ వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ఏమాత్రం సోయి లేకుండా అమెరికాలో ఎంజాయ్ చేయడానికి వెళ్లడం సిగ్గుచేటని మండిపడ్డారు.తెలంగాణ ఉద్యమంలో ఆ కుటుంబం చేసిన క్షుద్ర ఆలోచనలతో ఎంతో మంది యువకులు బలి అయ్యారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఉన్మాదిలా తయారయ్యారని అన్నారు. మహిళల ఆత్మగౌరావన్ని దెబ్బతీసేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరి ఉందని విమర్శించారు. ఆ పారీ్టలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటే కౌశిక్రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అరికెçపూడి గాంధీ బీఆర్ఎస్ సభ్యుడే అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలన అంతా కమీషన్ల కోసమే సాగిందని, కానీ రేవంత్రెడ్డి ప్రభుత్వంలో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాతో కేసీఆర్ కుటుంబం ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు.ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. కౌశిక్రెడ్డివి పిల్ల చేష్టలని, ఆయన బీఆర్ఎస్ పార్టీ పరువు తీస్తుంటే హరీశ్రావు ప్రోత్సహిస్తున్నట్లు ఉందని అన్నారు. గతంలో గవర్నర్ తమిళిసై మీద ఇష్టానుసారంగా మాట్లాడి కౌశిక్రెడ్డి మహిళలను అగౌరవపర్చాడన్నారు. కౌశిక్రెడ్డి తన ప్రవర్తన మార్చుకోకపోతే బడిత పూజ ఖాయమని హెచ్చరించారు. -
ఎమర్జెన్సీకన్నా దారుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా దారుణ పరిస్థితులు నెలకొన్నాయని.. సీఎం రేవంత్ చేస్తున్న రాజకీయ డ్రామాలతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు బీఆర్ఎస్ నేతల అరెస్టులు దుర్మార్గమని విమర్శించారు. బీఆర్ఎస్పై, కేసీఆర్పై ఉన్న కక్షను తెలంగాణ మీద చూపుతున్నారని.. నంబర్ వన్గా ఉన్న రాష్ట్రాన్ని నియంతృత్వ పోకడలతో నిరీ్వర్యం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ వైఖరి వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.గురువారం కోకాపేటలోని తన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, పార్టీ నేతలు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులతో కలిసి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ‘‘శాంతి భద్రతలను అదుపు చేయకుండా హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ మాట్లాడటం సిగ్గుచేటు. రేవంత్, డీజీపీ ఎమ్మెల్యే గాం«దీకి బందోబస్తు ఇచ్చి ఎమ్మెల్యే కౌశిక్ నివాసంపై దాడులు చేయించారు. కౌశిక్ నివాసంపై దాడి చేసింది గాంధీ కాదు సీఎం రేవంత్. బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేసిన పోలీసులు గాం«దీని ఎందుకు నిర్బంధించలేదు?’’అని ప్రశ్నించారు. హత్యాయత్నం చేసిన అరికెపూడి, ఆయన అనుచరులను బందోబస్తు మధ్య ఇంటికి పంపి.. తమను మాత్రం అరెస్టు చేసి అర్ధర్రాతి అటవీ ప్రాంతాల్లో తిప్పారని విమర్శించారు. భాషను మార్చుకోకుండా నీతులా? సీఎం రేవంత్ తన అసభ్య, సంస్కారహీనమైన భాషను మార్చుకోకుండా యూట్యూబ్ చానళ్లకు నీతులు చెబుతున్నారని.. తొమ్మిది నెలలుగా పాలనపై కాకుండా పైసలపై దృష్టి పెట్టడంతో శాంతి భద్రతలు పాతాళానికి పడిపోయాయని హరీశ్రావు ఆరోపించారు. ‘‘మీడియాకు లీకులు, చిట్చాట్లతో శాంతి భద్రతలు అదుపులోకి రావు. సీఎం వాడుతున్న బజారు భాషతో రాష్ట్రంలో విద్వేషాలు చెలరేగి ప్రశాంతత మంటగలుస్తోంది. పార్టీ ఫిరాయింపులపై సీఎం ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడుతున్నారు. పీఏసీ చైర్మన్ నియామకంలో రేవంత్ వ్యాఖ్యలు దుర్మార్గం. డీజీపీ రాజకీయ కుట్రలో భాగమై ప్రతిపక్షాల గొంతును నొక్కాలని చూడటం దారుణం’’అని విమర్శించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు, పీఏసీ చైర్మన్ నియామకాన్ని వ్యక్తుల మధ్య కొట్లాటగా చిత్రీకరించి పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. -
సీఎం కనుసన్నల్లోనే దాడులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు సమావేశం పెట్టుకునేందుకు కూడా అనుమతులు లేవా అనిప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రి వెన్నులో వణుకు వస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నివాసంపై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులు, గూండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.కౌశిక్రెడ్డిపై దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వ జులుంను సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని.. ప్రశి్నస్తున్న ప్రజాప్రతినిధులపై సీఎం కనుసన్నల్లోనే గూండాలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులకు దిగే సంస్కృతిని రేవంత్ తీసుకొచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పారీ్టకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్యానించారు. -
బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధం
సాక్షి, హైదరాబాద్/ దుండిగల్/ గచ్చిబౌలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నివాసంపై దాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. మాజీ మంత్రి హరీశ్రావును, ఎమ్మెల్యేలను హౌజ్ అరెస్టు చేసి, నివాసం నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. నేతలతోపాటు క్షేత్రస్థాయి క్రియాశీల నాయకులు, కార్యకర్తలను కూడా పోలీస్స్టేషన్లకు రావాలంటూ ఆదేశించడం గమనార్హం. ఎక్కడికక్కడ బలగాల మోహరింపుతో.. ఫిరాయింపుల అంశంపై వివాదం, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నివాసంపై దాడి నేపథ్యంలో.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ గురువారం రాత్రి ప్రకటించింది. దీనితో అప్రమత్తమైన పోలీసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచే భారీగా మోహరించారు. జిల్లాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేసేందుకు ప్రయతి్నంచగా.. అడ్డుకుని అరెస్టులు చేశారు. ఆస్పత్రికి వెళ్లకుండా అడ్డుకుని.. మంత్రి హరీశ్రావు కేశంపేట పోలీసు స్టేషన్ నుంచి విడుదలయ్యాక శుక్రవారం తెల్లవారుజామున కోకాపేటలోని తన నివాసానికి చేరుకున్నారు. అప్పట్నుంచే అక్కడ పోలీసులు మోహరించారు. పార్టీ నేతలెవరూ హరీశ్రావు ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. గురువారం నాటి తోపులాటలో భుజానికి గాయమై నొప్పితో బాధపడుతున్న హరీశ్రావు.. ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. దీంతో హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు భుజానికి గాయమైన హరీశ్రావును పరామర్శించేందుకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి,, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, పార్టీ నేతలు జైపాల్రెడ్డి తదితరులు ఆయన ఇంటి వద్దకు రాగా పోలీసులు అడ్డుకున్నారు.దీంతో వారు పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం తర్వాత పోలీసులు హరీశ్రావును ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించారు. దీంతో ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఎడమ భుజానికి స్కానింగ్తోపాటు ఇతర వైద్య పరీక్షలు చేశారు. పదిహేను రోజుల పాటు ఫిజియోథెరపీ తీసుకోవాలని హరీశ్కు వైద్యులు సూచించారు.శంభీపూర్ రాజు నివాసం వద్ద ఉద్రిక్తత మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసం నుంచి అరికెపూడి ఇంటికి వెళతామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో.. శుక్రవారం తెల్లవారుజాము నుంచే అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అప్పటికే శంభీపూర్ రాజు ఇంటికి చేరుకున్నారు. ఈ ఇద్దరినీ పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఆ ఇంటి పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని మేడ్చల్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో శంభీపూర్ రాజు నివాసం వద్ద పాడి కౌశిక్రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి తనను హత్య చేయించేందుకు ప్రయతి్నంచారని, తన ఇంటిపై దాడికి ఉసిగొల్పాడని ఆరోపించారు.హైడ్రా పేరిట ఇష్టానుసారం బిల్డింగులను కూల్చివేస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి తరలించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తనకు దూకుడు ఎక్కువని అంటున్న దానం నాగేందర్కు గోకుడు ఎక్కువని వ్యాఖ్యానించారు. అరికెపూడి గాం«దీకి నీతి, నిజాయతీ ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు నమోదు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద గురువారం బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తన విధులకు కౌశిక్రెడ్డి ఆటంకం కలిగించారని, బెదిరింపులకు పాల్పడ్డారని సైబరాబాద్ అడ్మిన్ ఏడీసీపీ రవి చందన్రెడ్డి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో కౌశిక్రెడ్డిపై బీఎన్ఎస్ 132, 351(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
కౌశిక్ రెడ్డికి దానం నాగేందర్ కౌంటర్
-
KSR Live Show: గాంధీకి కౌంటర్ గా కౌశిక్ రెడ్డి మాస్టర్ ప్లాన్..
-
గాంధీకి కౌంటర్ గా కౌశిక్ రెడ్డి మాస్టర్ ప్లాన్..
-
కౌశిక్ రెడ్డి పై ఆరెకపూడి గాంధీ కామెంట్స్
-
కౌశిక్ రెడ్డి, ఆరెకపూడి గాంధీ ఎపిసోడ్ పై కాంగ్రెస్ నేత రియాక్షన్..
-
కౌశిక్ రెడ్డి ఇంటినుండి బయటకు వస్తే అడ్డుకుంటారు గాంధీ ర్యాలీగా వస్తుంటే అడ్డుకోరా..
-
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై స్పీకర్కు ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు శుక్రవారం (సెప్టెంబర్13) స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో కౌశిక్రెడ్డి ఓటర్లను బెదిరించి గెలిచారని ,గెలిచాక మహిళలను కించపరుస్తూ మాట్లాడినందున కౌశిక్రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేసిన వారిలో మహిళా కాంగ్రెస్ నేతలు బండ్రు శోభారాణి, కాల్వ సుజాత తదితరులున్నారు. ఫిర్యాదు అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ కౌశిక్రెడ్డితో బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. అంతకుముందు కౌశిక్రెడ్డి మీడియా సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి చీర,గాజులను పంపిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పట్ల మహిళా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువారం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్లో ఆందోళన చేశారు. ఇదీ చదవండి.. మళ్లీ ఉద్రిక్తత.. ఎమ్మెల్యే అరికెపూడి ఇంటి వద్ద బందోబస్తు -
తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన గాంధీ, కౌశిక్ రెడ్డి ఎపిసోడ్
-
బీఆర్ఎస్లోనే గాంధీ.. ప్రతిపక్షానికే పీఏసీ: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్గా ఎన్నికైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముమ్మాటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే ప్రతిపక్షానికి పీఏసీ పదవి కట్టబెట్టామని తేల్చిచెప్పారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అడ్డగోలు నియామకాలు చేసింది బీఆర్ఎస్ కాదా అని విరుచుకుపడ్డారు. ‘అసెంబ్లీ చివరి రోజు పార్టీ బలాబలాలను స్పీకర్ ప్రకటించారు. బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబితే ఆరోజు బీఆర్ఎస్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మా సంఖ్య 38 కాదు.. 28 మాత్రమే అని వాళ్లు అనలేదు. అలాంటప్పుడు అనర్హత అనే అంశమే ఇక్కడ తలెత్తదు’ అని స్పష్టం చేశారు. పార్టీ పరిస్థితులపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్.. తన అధికార నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా అరికెపూడి గాందీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వివాదంతోపాటు పలు అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో పీఏసీ ఎంపిక తీరును తప్పుపట్టారు. ‘కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2018 నుంచి 2023 వరకు అక్బరుద్దీన్ ఒవైసీ పీఏసీ చైర్మన్ ఎలా ఉన్నారు. అప్పుడు సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్కు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలని అంటే... అది స్పీకర్ విచక్షణాధికారమని బీఆర్ఎస్ నేతలన్నారు. 2014లో టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు బీఏసీ సభ్యులుగా ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్రెడ్డి పేర్లు ఇస్తే... రేవంత్రెడ్డి పేరుకు ప్రత్యామ్నాయం సూచించాలని స్పీకర్ ఎందుకు అన్నారు? ఎర్రబెల్లి పార్టీ మారినప్పుడు నన్ను ఫ్లోర్ లీడర్గా గుర్తించాలని చెబితే ఎందుకు గుర్తించలేదు? 2014, 2018లో ఈ విధానాన్ని ప్రారంభించింది మీరే కదా’ అని అన్నారు. పీఏసీలో 13 మంది సభ్యులుంటే బీఆర్ఎస్ నుంచి ఆరుగురికి, సీపీఐ, ఎంఐఎం, బీజేపీ నుంచి ఒక్కక్కరికి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ నుంచి నలుగురికి మాత్రమే అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సభ్యులు ఎన్నిక కోరలేదు కాబట్టే స్పీకర్ నామినేషన్లను పరిశీలించి గాందీకి అవకాశం కల్పించారని తెలిపారు. కౌశిక్ వ్యాఖ్యలపై వారంతా క్షమాపణ కోరాలి కౌశిక్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్రెడ్డి, ‘బతకడానికి వచ్చినోళ్లు అంటూ గాం«దీని ఉద్దేశించి కౌశిక్రెడ్డి వాళ్ల బాస్ చెప్పిందే మాట్లాడారు. కౌశిక్ అలా మాట్లాడొచ్చా లేదా అనేది కేసీఆరే చెప్పాలి. కౌశిక్ వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు సమాధానం చెప్పాలి’ అని అన్నారు. బతకడానికి వచ్చిన వాళ్ల ఓట్లు కావాలి కానీ వాళ్లు వద్దా? అని నిలదీసిన ముఖ్యమంత్రి.. వాళ్లు ఓట్లేస్తేనే కదా గ్రేటర్లో గెలిచిందని గుర్తుచేశారు. ‘బీఆర్ఎస్ పెద్దలు మాట్లాడమంటే కౌశిక్ మాట్లాడాడా, లేక ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలా అనేది స్పష్టం చేయాలి. వీళ్లు మాట్లాడమంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. కౌశిక్ వ్యక్తిగతంగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ది సైకలాజికల్ గేమ్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టు తీర్పును ప్రస్తావించగా, ‘తీర్పును నేను అధ్యయనం చేయలేదు. అది చూస్తేనే దీనిపై మాట్లాడగలను’ అని అన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారనగా.. ‘బీఆర్ఎస్ నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు. మా పార్టీకి 66 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ 66 మంది ఎమ్మెల్యేలు ఒళ్లు దగ్గర పెట్టుకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులేం ఉండవు. ప్రభుత్వాన్ని పడగొడతామన్నందుకే ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఈ చర్చలన్నీ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నందుకే చర్చ జరుగుతోంది. ఆ రెండు పార్టీలు కలిసి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి లేదని కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే ప్రస్తుత ప్రభుత్వం మరింత పటిష్టంగా ఉన్నట్లే కదా. ఏ ఎమ్మెల్యే అయినా అటూఇటూ దిక్కులు చూస్తే అనర్హత వేటు పడుతుందంటే ఇక ప్రభుత్వానికి ఢోకా ఎక్కడుంది’ అని అన్నారు. ఇదే అంశంపై మరింత స్పష్టతనిస్తూ ‘కోర్టుకెళ్లి అనర్హతలపై ఆర్డర్ తెచ్చామంటున్నారు. బీఆర్ఎస్ నేతలు ఏ ఆర్డర్ తెచ్చినా.. ప్రభుత్వంలోని పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ప్రభుత్వంలో ఉన్న పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కునే అవకాశమే లేదని చట్ట ప్రకారం నిర్ణయం వస్తే, ప్రతిపక్ష పార్టీలకన్నా, మా పార్టీ వాళ్లమే ఎక్కువ సంతోషిస్తాం. ఎమ్మెల్యేలు ఎక్కడివారక్కడే ఉండాలని బీఆర్ఎస్ వాళ్లంటున్నారు. మేమూ అదే కోరుకుంటున్నాం. ఎక్కడివారు అక్కడే ఉంటే నా 66 మంది నాతో ఉంటారు. కేసీఆర్ లక్కీ నంబర్ నా వద్దే ఉంది కదా’ అని అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొడతామని తిరిగేకంటే పథకాల అమలు గురించి ప్రశ్నిస్తే బాగుంటుందని సూచించారు. మంత్రివర్గం విస్తరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన తర్వాతే ఎవరిని తీసుకోవాలనే విషయంలో సీఎం పాత్ర వస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో అడ్డగోలుగా 14 వేల మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులిచ్చారని, వీటిని ఫిల్టర్ చేసేలా జర్నలిస్టు సంఘాలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిని గృహ నిర్బంధం చేసి.. పోలీసుల సాయంతో అరికెపూడి గాంధీ గుండాలు రెచ్చిపోయి దాడులకు పాల్పడటం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇంతకు మించి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ‘‘పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ప్రభుత్వం దాడి చేయించటమే ఇందిరమ్మ పాలన, ప్రజా పాలనా?’’అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను కచి్చతంగా రాసి పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. అరికెపూడి ఇంటికి వెళ్తానన్న కౌశిక్రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు.. అరికెపూడిని మాత్రం కౌశిక్రెడ్డి ఇంటికి వచ్చేందుకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు.వందల మంది కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేశారంటే పక్కాగా ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేశారని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఫ్యాక్షనిజానికి, రౌడీయిజానికి అడ్డాగా మార్చేస్తుండటం చూస్తుంటే బాధగా ఉందని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా సీఎం రేవంత్రెడ్డి చేయించిన దాడేనని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తున్న కౌశిక్రెడ్డిని ప్రభు త్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు. కావాలనే అక్రమ కేసులు, హత్యాయత్నాలకు పాల్పడి బెదిరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ స్థైర్యాన్ని దెబ్బతీయలేరు.. ‘‘సీఎం రేవంత్రెడ్డీ.. మా పార్టీ సైనికుల పోరాటాని కి నీకు నచ్చిన పేరు పెట్టుకో. కాంగ్రెస్ గూండాల దౌర్జన్యాలు, దాడులు బీఆర్ఎస్ సైనికుల స్థైర్యాన్ని ఇసుమంత కూడా దెబ్బ తీయలేవు. తెలంగాణలోని ప్రతి అంగుళాన్ని మీ అవినీతి, దుర్మార్గ పాలన నుంచి కాపాడుకుంటాం. కౌశిక్రెడ్డితో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు..’’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. -
తెలంగాణ భవన్ను ముట్టడించిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్/మణికొండ: మహిళలను కించపరిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ను ముట్టడించారు. ఖబడ్దార్ కౌశిక్రెడ్డి అంటూ కల్వ సుజాతతోపాటు పలువురు మహిళా నేతలు ప్లకార్డులను ప్రదర్శించారు. ముట్టడి సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా భవన్ ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు. వారిని లోనికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకోగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆందోళనకు దిగిన మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచేలా చీర, గాజులను చూపారని ధ్వజమెత్తారు. మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే కౌశిక్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కౌశిక్ క్షమాపణ చెప్పకపోతే గవర్నర్ను, స్పీకర్ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు.కౌశిక్రెడ్డి.. ఖబడ్దార్ కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే కౌశిక్రెడ్డి హైదరాబాద్లో తిరిగే పరిస్థితి ఉండదని ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, టి.ప్రకాశ్గౌడ్ హెచ్చరించారు. నార్సింగి పోలీస్స్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్న ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీకి సంఘీభావం తెలిపేందుకు వారు తమ అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కౌశిక్రెడ్డి పిల్ల బచ్చా అని, తన స్థాయి మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీశ్రావు సీజనల్ పొలిటీషియన్ అని, వారు మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమ నుంచి బయటకు రావాలన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కౌశిక్ యత్నిస్తున్నారని, దానిని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. రాష్టం విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉన్న వారి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేçశం, మాజీ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఫయూమ్ పాల్గొన్నారు. కేసీఆర్ స్పందించాలి: అద్దంకి దయాకర్ పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీని ఆంధ్రోడు అన్న కౌశిక్ మాట లు హాస్యాస్పదమని, ఈ మాటలపై కేసీఆర్ స్పందించాలని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. పదేళ్లు అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉన్నాడని, అప్పుడు ఆంధ్రోడని ఎందుకు అనలేదో చెప్పాలన్నారు. సెంటిమెంట్ను వాడుకొని పబ్బం గడుపుకుంటున్న వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల ని డిమాండ్ చేశారు. కౌశిక్ లాంటి కమెడియన్ను ఎందుకు ఎన్నుకున్నామా అని హుజూరాబాద్ ఓటర్లు ఫీలవుతున్నారని పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులకు మహిళలంటే చిన్న చూపని ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి విమర్శించారు. అధికారం పోగానే మళ్లీ ఆంధ్ర.. తెలంగాణ లొల్లి గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. కౌశిక్ ఆంధ్రోళ్ల పేరుతో మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కౌశిక్ వ్యాఖ్యలను సమర్థించకపోతే కేసీఆర్ ఆయనను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. -
నన్ను చంపేందుకు కుట్ర
-
కౌశిక్ రెడ్డిపై రాళ్లు, కర్రలతో దాడి
-
నా హత్యకు కుట్ర పన్నారు: కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఆహ్వానిస్తే.. ఆయన తన గూండాలను తనపైకి పంపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఇది తన హత్యాయత్నం కుట్రలో భాగంగా జరిగిన దాడేనని ఆరోపించారాయన. ‘‘గూండాలు వచ్చి దాడి చేయడం కరెక్టేనా?. కట్టెలు, కర్రలతో వచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రీ ప్లాన్డ్గా దాడి చేశారు. తెలంగాణలో లా అండ్ ఆర్డ్ ఉందా?. ఒక ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేకపోతే సామాన్యుల పరిస్థితేంటి? కచ్చితంగా దాడికి ప్రతిదాడి ఉంటుంది. రేపు వాళ్ల సంగతి తేలుస్తా’ అని అన్నారు.కౌశిక్రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాంధీ అనుచరులు కౌశిక్ ఇంట్లోకి దూసుకెళ్లారు. కౌశిక్ ఇంటిపై గాంధీ అనుచరులు రాళ్లు విసిరారు. ఈక్రమంలో ఇరు వర్గాలు కుర్చీలతో కొట్టుకున్నారు. ఒక దశలో ఇరు వర్గాలను పోలీసులు అదుపు చేయలేకపోయారు.చదవండి: కౌశిక్రెడ్డి ఇంటిపై దాడి.. బలవంతంగా అరికెపూడి తరలింపు -
పాడి కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లి సినిమా చూపిస్తా
-
కౌశిక్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన అరికెపూడి గాంధీ
-
చీర, గాజులు VS చెప్పు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహిళ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉందని అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘మహిళలను అడ్డుపెట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. పాడి కౌశిక్ రెడ్డి చీర, గాజులు పంపాలనుకుంటే మొదట కేసీఆర్కే పంపాలి. ఇతర పార్టీ నాయకుల చేరికతో టీఆర్ఎస్ పుట్టింది. కేసిఆర్ రాజకీయ పుట్టుక ఎక్కడ ఉందో చూసుకో. పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మహిళ కమిషన్ పాడి కౌశిక్ రెడ్డి వాఖ్యలు సుమోటోగా తీసుకొని విచారణకి పిలవాలి. ఆయన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరుతున్నాం. ప్రభుత్వాన్ని పడగోడతాం అంటేనే నిలబెడుతామని ఎమ్మేల్యేలు కాంగ్రెస్లో చేరారు’’అని అన్నారు. ఆమె మాట్లాడుతూ ఒక దశలో.. మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని చెప్పు చూపించి మరీ హెచ్చరించారు. కౌశిక్ రెడ్డిది ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన చరిత్ర:బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పాడే ఎక్కే సమయం వచ్చిందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత అన్నారు.‘ తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన చరిత్ర పాడి కౌశిక్ రెడ్డిది. బిడ్డ, భార్యను అడ్డుపెట్టుకొని చనిపోతామని ప్రచారం చేసి మరీ గెలుపొందావు. పాడి కౌశిక్ రెడ్డి నిజాయితీ గల లీడర్ అన్నట్లు మాట్లాడుతున్నాడు. మహిళలను అగౌరవ పరిస్తే చెప్పుదెబ్బల పాలు అవుతారు. వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పకపోతే బయట తిరగనివ్వం’ అని తీవ్రంగా హెచ్చరించారు.చదవండి: పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: కౌశిక్ రెడ్డి -
TG: పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: శాసన సభా సంప్రదాయాన్ని కాపాడే వ్యక్తి కోర్టును అగౌర పరిచేలా మాట్లాడటం సరికాదని బీఆర్ఎష్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు క్రెడిబిలిటీ కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం(సెప్టెంబర్11) అసెంబ్లీ స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కె.పి. వివేకానంద అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.‘‘ పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి , తెల్లం వెంకట్రావ్ల అనర్హతపై నాలుగు వారాల్లో నివేదిక ప్రకటించాలని ఆ సెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు కోరింది. నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వక పొతే సుమోటోగా హైకోర్టు కేసును నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. తీర్పు కాపీ రాలేదని.. టై పాస్ చేయొద్దని, తక్షణం యాక్షన్ తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని కలిశాం. మిగతా ఎడుగురి ఎమ్మెల్యే అనర్హత స్పీకర్ కార్యాలయంలో వుంది. వారిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి.. అప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. మంత్రి శ్రీధర్బాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.సభా సంప్రదాయాన్ని కాపాడే వ్యక్తి కోర్టును అగౌరపరిచేలా మాట్లాడటం సరికాదు. శ్రీధర్ బాబు క్రెడిబిలిటీ కోల్పోతున్నారు. 10 ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. పార్టీ పిరాయించిన రాహుల్ గాంధీ ఏమో వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. చట్టం తీసుకొస్తా అని చెప్పింది రాహుల్ గాంధే కదా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. సీఏసీ చైర్మన్ నియామకం సభ నియమావళికి విరుద్దంగా జరిగింది. 14 నామినేషన్ వేస్తే ఎన్నికలు పెట్టాలి.. కానీ పెట్టలేదు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. హరీశ్ రావ్ నామినేషన్ ఎక్కడికి పోయింది. పార్టీ తరుపున 3 పేర్లు ఇచ్చారు. నాలుగో పేరు ఎవరు ఇచ్చారు. శ్రీధర్ బాబు దిగజారి మాట్లాడుతున్నారు. తీర్పు వచ్చాక పార్టీ మరీనా ఎమ్మెల్యేలు ఒక్కోరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. 10 ఎమ్మెల్యేలను మోసం చేశారు రేవంత్ రెడ్డి. ముందు నోయీ వెనక గొయ్యిలాగా వుంది వారి పరిస్థితి.పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయంతెలంగాణలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ‘ దానం నాగేందర్ బిచ్చగాడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, దానం నాగేందర్ బిగ్ చీటర్, మాజీ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ మిలిగిపోతారు. కడియం శ్రీహరి పచ్చి మోసగాడు. కడియం రాజీనామా చేయాలి. డిపాజిట్ కూడా కడియంకు రాదు. చీరలు , గాజులు 10 మంది ఎమ్మెల్యేలకు కొరియర్ చేస్తా వేసుకొని తిరగండి. స్పీకర్ నిర్ణయం కంటే ముందే మీరు రాజీనామా చేయాలి. గత 10 ఏళ్లలో ఒక్క ఎమ్మెల్యేకు అయినా వ్యక్తి గతంగా పార్టీ కండువా కేసీఆర్ కప్పినట్టుగా చూపితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’అని అన్నారు. ప్రస్తుతం కౌశిక్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.చదవండి: పార్టీ ఫిరాయింపుల కేసు: అసెంబ్లీ సెక్రటరీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుచదవండి: నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ -
కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
కరీంనగర్క్రైం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి అధికారులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని జెడ్పీ సీఈవో ఎం.శ్రీనివాస్ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్టౌన్ పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. కొత్తగా అమలులోకి వచి్చన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 221, 126(2) సెక్షన్ల కింద కేసు నమోదైంది. జెడ్పీ సీఈవోపై ఎమ్మెల్యే ఫిర్యాదు హుజూరాబాద్ నియోజకవర్గంలో సమస్యలపై తాను జెడ్పీ సమావేశంలో ప్రశ్నించేందుకు ప్రయత్నించగా జెడ్పీ సీఈవో తన విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో దళితుల కోసం దళితబంధు, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కోసం ప్రజాప్రతినిధిగా ప్రశి్నస్తున్న సమయంలో తన విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా జెడ్పీ సీఈవో ప్రొటోకాల్ ఉల్లంఘించారని కౌశిక్రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే విచారణ చేసి సీఈవోపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
కరీంనగర్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్తల్లో నిలిచారు. నిన్న(మంగళవారం) జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్లే సమయంలో అడ్డుకునేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బైఠాయించారు. జడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు.. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం 221, 126 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బీఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డిపై నమోదు అయంది. బీఎన్ఎస్ యాక్టు కింద కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావడం గమనార్హం. కౌశిక్ రెడ్డి కేసుపై కేటీఆర్ ఆగ్రహంహుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసినట్లు మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడేది లేదన్న కేటీఆర్ తేల్చిచెప్పారు. -
కాంగ్రెస్ మంత్రిని ఇమిటేట్ చేసిన కౌశిక్ రెడ్డి
-
అన్ని వ్యవస్థలు రేవంత్ గుప్పిట్లోనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, పాడి కౌశిక్రెడ్డి, కోవాలక్ష్మి, నేతలు జీవన్రెడ్డి, పి.శశిధర్రెడ్డి గురువారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. ► ఎమ్మెల్యే దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించడంలో స్పీకర్ చేస్తున్న జాప్యంపై తాము హైకోర్టులో వేసిన పిటిషన్ సోమవారం విచారణకు వస్తుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వెల్లడించారు. పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చేందుకు వెళితే అసెంబ్లీ కార్యదర్శి బాత్రూంలో దాక్కున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని, ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఉపఎన్నికలు వస్తాయని వెల్లడించారు. ► బీఆర్ఎస్ తరపున ఎన్నికై పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాము కోరుతున్నా స్పీకర్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ ప్రభావితం చేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద విమర్శించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ తాము అపాయింట్మెంట్ కోరినా ఇవ్వడం లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడం లేదని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ తమకు సమయం ఇవ్వక పోవడంతో రిజిస్టర్ పోస్టులో పిటిషన్లు పంపినట్టు వెల్లడించారు. ‘హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా అక్కడ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేశారు. దీనిని తెలంగాణ స్పీకర్ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ ఎవరిని కొట్టాలో చెప్పాలి. అభద్రతాభావంతో ఉన్న రేవంత్ కొడంగల్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు’ అని ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. ► 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మంత్రి ఉత్తమ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆరోపించారు. ప్రజాపాలన చేతకాని కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. -
‘ఖబడ్దార్’పై కలకలం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ గురువారం దారి తప్పింది. ‘ఖబడ్దార్’అంటూ కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య సభలో కలకలం సృష్టించింది. విపక్ష బీఆర్ఎస్ సభ్యులు అంతే దూకుడుతో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ సభ్యుడు పాడి కౌశిక్రెడ్డి ఆవేశంతో ప్రతి సవాళ్ళు విసరడం సభలో వేడిని మరింత పెంచింది. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ప్రసంగాన్నే లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి వ్యంగా్రస్తాలు సంధించారు. ‘కిరోసిన్ దీపం కింద చదువుకున్న... కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి వేల కోట్లు ఎలా సంపాదించారు?’అని ప్రశ్నించారు. ప్రజల కోసమే తాను పార్టీ మారిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కేసీఆర్కు జోకడం తప్ప, ఎదురు చెప్పలేని స్థితి మాజీ మంత్రిది అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు మూకుమ్మడిగా లేచి అభ్యంతరం చెప్పా రు. ప్రతిగా అధికార పక్ష సభ్యులూ లేవడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి అధికార పక్షం వైపు వేలెత్తి చూపారు. పరస్పర వాగ్వాదం కొనసాగుతున్న తరుణంలోనే రాజగోపాల్రెడ్డి ‘పదేళ్ళు భరించాం.. ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం. ఖబడ్దార్’అంటూ చేసిన హెచ్చరిక సభా వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. కొత్త వాళ్ళున్నారు... కాస్త జాగ్రత్త వాగ్వాదాల మధ్య మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి జోక్యం చేసకుని ‘ఈ సభ లో కొత్త వాళ్ళున్నారు. సభా మర్యాద కాపాడాలి. వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. వ్యక్తిగత దూషణలు, తిట్టుకోవడం మంచిది కాదు’అంటూ సలహా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. సభ లో ‘ఖబడ్దార్’అనే పదం వాడొచ్చా? అని బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. దీనిపై రూలింగ్ ఇవ్వాలని స్పీకర్ను కోరారు. ఏం జరిగిందో పరిశీలిస్తానని, ఖబడ్డార్ అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. ఆ తర్వాత సభ సర్దుమణిగింది. చర్చ కొనసాగుతుండగానే బీఆర్ఎస్ సభ్యులు సభలో లేకపోవడాన్ని గమనించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అనంతరం కొద్ది సేపటికే బీఆర్ఎస్ సభ్యులు సభలోకి ప్రవేశించారు. -
సంక్షేమం కావాలా..? సంక్షోభం కావాలా?
హుజూరాబాద్: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో.. సంక్షోభం సృష్టించే పార్టీలు కావాలో ప్రజలే ఆలోచించాలని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాందీచౌక్ వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సర్వేలన్నీ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్రెడ్డి గెలుస్తారని చెబుతున్నాయని అన్నారు. ఇక హుజూరాబాద్లో జీ హుజూర్ రాజకీయాలు నడవయని పేర్కొన్నారు. గత ఉప ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఈటల రాజేందర్ ఎన్నో మాయమాటలు చెప్పారని, దళితబంధు రాదని ఒక అపనమ్మకాన్ని సృష్టించారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్లో 100 శాతం దళితబంధు అమలుచేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్రానికి ఒరిగేదేంలేదన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు నెలకు రూ.3 వేలు, అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామని చెప్పారు. గ్యాస్ సిలిండర్ను రూ.400కు అందిస్తామని వివరించారు. కౌశిక్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత తనదే అని మంత్రి హామీ ఇచ్చారు. ఈటల మాటలు వింటే పదేళ్లు వెనక్కి హుజూరాబాద్ ప్రజలు ఈటల మాటలు వింటే అభివృద్ధిలో పదేళ్లు వెనకబడిపోతారని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. గెలిచాక హుజూరాబాద్ను విడిచిపెట్టి వెళ్లారని విమర్శించారు. ఈసారి హుజూరాబాద్, గజ్వేల్లో ఈటల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఢిల్లీ నాయకులను హుజూరాబాద్కు తీసుకొస్తున్న ఈటల.. వారితో ఈ నియోజకవర్గానికి ఒరిగే ప్రయోజనం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. దమ్ముంటే ఉప్పల్ రైల్వే ఓవర్బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ముక్కోణపు ప్రేమకథ
అభినవ్ మదిశెట్టి, స్నేహా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ సే’. మంకల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 4న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పి. కౌశిక్ రెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ అతిథులుగా హాజరయ్యారు.‘‘ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది’’అని మంకల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని అన్నారు. -
కేసీఆర్కు కొత్త టెన్షన్.. పొలిటికల్ ప్లాన్ రివర్స్!
గులాబీ బాస్కు కొరుకుడు పడని సీటుగా హుజూరాబాద్ పేరు తెచ్చుకుంది. తనను ధిక్కరించి కమలం గుర్తు మీద మళ్ళీ గెలిచిన ఈటల రాజేందర్ను ఈసారి ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఈటలకు సరిజోడు అనుకున్న కౌశిక్రెడ్డి దుందుడుకు స్వభావం సీఎం కేసీఆర్ను చికాకు పెడుతోందట. రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ కారు అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు అనేక పేర్లు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్లో గులాబీ పార్టీ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి పాలు కావడంతో గులాబీ దళపతి కేసీఆర్ మరింత కసిగా వచ్చే ఎన్నికల్లో ధీటైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. అక్కడి ప్రజల్ని ఆకర్షించడానికి ఉప ఎన్నికల సమయంలోనే దళితబంధు సహా పలు పథకాలు హుజూరాబాద్ నుంచే ప్రకటించారు. పార్టీ నియమించిన అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ ఓటమితో.. కాంగ్రెస్ నుంచి కౌశిక్రెడ్డిని తీసుకువచ్చి ఎమ్మెల్సీని చేసి, ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి కేబినెట్ ర్యాంక్ కల్పించారు. హుజూరాబాద్ ఇన్చార్జ్గా నియమించి వచ్చే ఎన్నికల కోసం రెడీ అవ్వమని కౌశిక్రెడ్డిని ఆదేశించారు. అయితే, కౌశిక్రెడ్డి దూకుడు స్వభావి అనుకుంటే.. ఆయన దుందుడుకు పోకడలతో అందరికీ దూరం అవుతున్నారు. వివాదాస్పద వ్యవహారాలతో పార్టీ పరువును తీస్తున్నారని కేసీఆర్కు నివేదికలందాయి. తెరపైకి ప్రశాంత్ రెడ్డి.. కౌశిక్రెడ్డిని తీసుకువచ్చి అత్యంత ప్రాధాన్యమిచ్చి, పదవి ఇచ్చి, ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తే ఇప్పుడు మొత్తం రివర్స్ కావడంతో కేసీఆర్కు ఆలోచన మొదలైంది. కౌశిక్రెడ్డి ప్రత్యామ్నాయంగా మరొకరిని చూడాలని నిర్ణయించుకున్నారు. కొత్త ముఖాన్ని తీసుకువచ్చి హుజూరాబాద్లో నిలపాలని భావిస్తున్నారు. ఆ ఆలోచనతోనే సర్వేలు నిర్వహించగా.. కౌశిక్రెడ్డి, ఉప ఎన్నికల అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ను కాదని.. ఓ పోలీస్ ఆఫీసర్ను నియోజకవర్గ ప్రజలు ఆదరించడం హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ అంతర్గత సర్వేల్లో డీఎస్పీగా ఉన్న పింగళి ప్రశాంత్రెడ్డి పేరు బాగా వినిపించిందట. అయితే, అంతకుముందే మాజీ మంత్రి పెద్దిరెడ్డిని హుజూరాబాద్లో ఉండమని కేసీఆర్ ఆదేశించారట. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్బాబును హుజూరాబాద్ బరిలో దించితే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోందట. ఈటలకు దూరపు బంధువు.. హుజూరాబాద్లో ఈటలకు ధీటుగా డీఎస్పీ పింగళి ప్రశాంత్ రెడ్డి పేరు వినిపించడంపై గులాబీ బాస్ కూడా ఒకింత ఆశ్చర్యపోయారట. కుల, మతాల మధ్య సమైక్యతతో పాటు జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంచే క్రమంలో ప్రశాంత్ రెడ్డి.. జమ్మికుంట చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిత్య జనగణమన కార్యక్రమం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. నిత్య జనగణమన కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల అమలుచేస్తున్నారు. ఆ కార్యక్రమంతో ప్రజలకు చేరువైన ప్రశాంత్ రెడ్డి అయితే ఈటలకు ధీటైన వ్యక్తిగా ప్రచారం సాగుతోంది. ఆయనకు ప్రజల ఆదరణ కూడా ఉండటంతో.. ప్రశాంత్పై ఇప్పుడు గులాబీ బాస్ గుడ్ లుక్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈటలకు దూరపు బంధువు కూడా అయిన ప్రశాంత్నే బరిలో దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా జరుగుతోందని సమాచారం. తన ప్రమేయమేమీ లేకుండానే ప్రజల్లో ఆదరణ కనిపిస్తున్నప్పుడు సహజంగానే ప్రశాంత్ రెడ్డి లాంటి అధికారుల్లో ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అదీ తనను ఓ పొలిటీషియన్గా ప్రజలు చూడాలనుకోవడం పట్ల ఆయన కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో పింగళి ప్రశాంత్ రెడ్డి అనే డీఎస్పీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి అవుతారా..? లేక ఆ మూడో కృష్ణుడు పెద్దిరెడ్డా.. సతీష్ అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో మొదలైంది. ఇది కూడా చదవండి: బీజేపీ ‘పరివార’ చర్చలు -
ఈటల భద్రతపై కేటీఆర్ ఆరా..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆయన భార్య జమున సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జమున.. ఈటలను హత్య చేసేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నాడని ఆమె తెలిపారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్రెడ్డి చెలరేగిపోతున్నాడు. మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పుల దండ వేస్తారని కౌశిక్పై ఈటల జమున మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. దీంతో, ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్.. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్కు ఫోన్ చేశారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్తో వెరిఫై చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫునే సెక్యూరిటీ ఇవ్వాలని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈటల రాజేందర్కు భద్రత పెంపుపై డీజీపీ అంజనీ కుమార్ సమీక్ష చేయనున్నారు. దీంతో, సీనియర్ ఐపీఎస్ కాసేపట్లో ఈటల ఇంటికి వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. ఈటల జమున కామెంట్స్పై ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి స్పందించారు. ఈటల రాజేందర్ దంపతులు చేసిన వ్యాఖ్యలు నిజాలు కావని తెలిపారు. రూ. 20 కోట్లు ఇచ్చి తాను ఈటలను హత్య చేయిస్తాననేది పచ్చి అబద్దమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసే అన్ని ఆరోపణలపై తాను బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. హత్యా రాజకీయాలను ఈటల కంటే గొప్పగా ఎవరూ చేయలేరని విమర్శించారు. ఎక్కడ హుజురాబాద్లో ఒడిపోతాడనే భయంతో తనను హత్య చేస్తాడేమోననిపిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాను రాజకీయాల్లోకి వచ్చిందే ఈటల రాజేందర్ను ఓడించేందుకని స్పష్టం చేశారు. ఆయన్ను ఓడిస్తేనే నాకు సంతృత్తి ఉంటుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య ఆరోపణలు.. కడియం కీలక వ్యాఖ్యలు -
ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డిపై ఫిర్యాదు
హైదరాబాద్: ముదిరాజ్ లపై అనుచిత వాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని ఖైరతాబాద్ ముదిరాజ్ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ముదిరాజ్ కులస్తులపై కౌషిక్ రెడ్డి అనుచిత వాఖ్యలు దారుణమన్నారు. కౌషిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇన్ స్పెక్టర్ పి.నిరంజన్ రెడ్డి కోరినట్టు తెలిపారు. -
ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డికి తప్పిన ప్రమాదం
మానకొండూర్: ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డికి ప్రమాదం తప్పింది. అతడు ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు ద్విచక్రవాహనదారుడిని ఢీ కొని, అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. బెలూన్స్ ఓపెన్కావడంతో కౌశిక్రెడ్డి, గన్మెన్లు, డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మానకొండూర్ మండలం శంషాబాద్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తనకారులో సోమవారం ఉదయం కరీంనగర్ నుంచి హుజూరాబాద్ బయల్దేరా డు. మానకొండూర్ మండలం శంషాబాద్ చేరుకోగానే అదే గ్రామానికి చెందిన బూస సంపత్ ద్విచక్రవాహనంతో రోడ్డు దాటుతుండగా కౌశిక్రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు అతడిని ఢీకొట్టింది. కారు డ్రైవర్ అప్రమత్తమై కుడివైపు తిప్పగా.. రోడ్డు కిందకు దిగింది. రెండు చెట్లను ఢీకొట్టబోతుండగా డ్రైవర్ తప్పించడంతో చిన్నపాటి కందకంలో దిగింది. కారు ముందుభాగం దెబ్బతింది. ప్రమాదసమయంలో కౌశిక్రెడ్డి ముందుసీట్లో కూర్చుకున్నాడు. బెలూన్స్ ఓపెన్కావడంతో కారులోని వారికి ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహనదారుడికి గాయాలు కాగా.. కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కౌశిక్రెడ్డి మరోకారులో హుజూరాబాద్ వెళ్లిపోయారు. కాగా.. కౌశిక్రెడ్డి డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా కా రు నడపడంతో తనతండ్రి ప్రమాదానికి గురయ్యాడని సంపత్ కొడుకు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజ్కుమార్ వివరించారు. -
ఈటల,రేవంత్ రెడ్డి ఇద్దరూ తోడుదొంగలు
-
రేవంత్, ఈటల మాటల యుద్ధంలోకి విజయశాంతి ఎంట్రీ
-
తప్పైంది.. నన్ను క్షమించండి
సాక్షి, న్యూఢిల్లీ: ‘తప్పైంది.. నన్ను క్షమించండి’ అని జాతీయ మహిళా కమిషన్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి క్షమాపణ చెప్పారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై చేసిన వ్యాఖ్యలపై నోటీసులు అందుకున్న కౌశిక్రెడ్డి.. మంగళవారం ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ సుమారు 40 నిమిషాల పాటు ఆయన్ను గతంలో చేసిన వ్యాఖ్యలపై విచారించారు. ఈ సందర్భంగా కమిషన్కు కౌశిక్రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అంతేగాక ఈ అంశంలో కమిషన్కు క్షమాపణలు చెప్పారని.. త్వరలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు లిఖితపూర్వక క్షమాపణ చెప్తానని కౌశిక్రెడ్డి హామీ ఇచ్చినట్లు జాతీయ మహిళా కమిషన్ ట్వీట్ చేసింది. -
జాతీయ మహిళా కమిషన్ ముందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
-
గవర్నర్ తమిళిసై తీవ్ర వ్యాఖ్యల ఎఫెక్ట్.. ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డికి షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో, గవర్నర్ కూడా వారికి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. గవర్నర్ తమిళిసై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన దగ్గర పెట్టుకున్నారని, ఒక్క ఫైల్ను కూడా కదలనివ్వడం లేదని ఆరోపణలు చేశారు. దీంతో, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుంది. కౌశిక్రెడ్డి వ్యాఖ్యలను కమిషన్ సుమోటోగా తీసుకుని ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చింది. ఈనెల 21న కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. గవర్నర్పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల నిరసనలు తెలిపారు. -
హుజూరాబాద్లో హీటెక్కిన పాలిటిక్స్.. చేతులు కలిపిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా వ్యవహారం చల్లబడిందో లేదో మళ్లీ హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గం పంచాయితీ తెరపైకి వచ్చింది. హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికపై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు గురువారం ఏకంగా కలెక్టరేట్ ఏవో నారాయణకు ఫిర్యాదు ప్రతులను అందజేశారు. హుజూరాబాద్ నుంచి నేరుగా బీఆర్ఎస్కు చెందిన 22 మంది, బీజేపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం వద్దకు చేరుకొని చైర్పర్సన్పై అవిశ్వాసం విషయంలో ఏకతాటిపై ఉండాలని ప్రతిజ్ఞ చేసిన అనంతరం కరీంనగర్కు చేరుకొని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో హుజూరాబాద్ అవిశ్వాస వ్యవహారం అధికార బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదే బాటలో జమ్మికుంట పాలకవర్గంలో కూడా అవిశ్వాస ముసలం పుట్టినట్లు సమాచారం. గతనెల 31వ తేదీన జమ్మికుంటలో భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అగ్రనేతలంతా బీజేపీ విధానాలపై దుమ్మెత్తిపోసిన రెండురోజులకే అదే పార్టీ నేతలతో కలిసి అవిశ్వాసానికి వెళ్లడం గమనార్హం. ఏకపక్ష నిర్ణయాల వల్లే... హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక భర్త గందె శ్రీనివాస్ వ్యవహార శైలి వల్లే అవిశ్వాసం వరకు అసమ్మతి రగడ రాజుకుందనే ప్రచారం మెండుగా ఉంది. గతంలో శ్రీనివాస్ వ్యవహారంపై అప్పటి మంత్రి ఈటల రాజేందర్, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్కు, మరికొంత మంది పార్టీ ముఖ్యనేతలకు ఫిర్యాదు చేశారు. అయినా ఆయన వ్యవహార శైలిలో మార్పులేకపోవడం వల్లే అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నట్లు సమాచారం. అభివృద్ధి పనుల విషయంలో తోటి కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా, బినావీులతో కాంట్రాక్టు పనులు చేయిస్తూ మెజార్టీ కౌన్సిలర్ల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, అధికారులను భయబ్రాంతులకు గురి చేయడం వల్లే ఈ నిర్ణయానికి మెజార్టీ సభ్యులు తోడైనట్లు తెలిసింది. పాలకవర్గంలో 30 మంది సభ్యులుండగా ఒకరు మృతి చెందారు. 25 మంది కౌన్సిలర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్కు ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే మద్దతుగా మిగిలారు. ఎమ్మెల్సీ వద్దకు పంచాయితీ.. 25 మంది కౌన్సిలర్లు గురువారం సాయంత్రం హుజూరాబాద్లో ఉన్న ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డిని కలిసి విషయాన్ని వివరించినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం నిర్ణయించిన మేరకు నడుచుకోవాలని, సమస్యను పార్టీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు తావివ్వద్దని ఎమ్మెల్సీ వారికి సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ మెజార్టీ కౌన్సిలర్లు పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలని, పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా తాము వ్యవహరించమని, మెజార్టీ సభ్యుల మనోభావాలను గుర్తించి నిర్ణయం తీసుకోవాల్సిందేనని మొరపెట్టుకున్నట్లు వినికిడి. దీంతో ఈ విషయాన్ని ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. హుజూరాబాద్ తరహాలోనే జమ్మికుంట మున్సిపల్ పాలకవర్గంలో కూడా ముసలం పుట్టినట్లు సమాచారం. వరుస పరిణామాలతో అధికార పార్టీలో గందరగోళం నెలకొంది. - గత పాలకవర్గంలోనూ ఇదే తరహాలో అర్ధంతరంగా అవిశ్వాసం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్న సమయంలో 2018 ఆగస్టులో అప్పుడు చైర్మన్గా ఉన్న విజయ్కుమార్తో రాజీనామా చేయించారు. అనంతరం ఆ స్థానంలో మందా ఉమాదేవి చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టగా.. ఆమె 10 నెలలపాటు పదవిలో కొనసాగారు. ఆ తరువాత ప్రత్యేకాధికారుల పాలన సాగింది. అనంతరం 2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగ్గా.. జనవరి 27న గందె రాధిక నేతృత్వంలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మూడేళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో రాష్ట్రాల అవిశ్వాసాలకు తెరలేవగా.. ఆ మంటలు ఇక్కడ కూడా అంటుకున్నాయి. చైర్పర్సన్ రేసులో ముగ్గురు..! బీఆర్ఎస్–బీజేపీ కౌన్సెలర్లు అవిశ్వాస తీర్మానం ఇవ్వగా.. అన్నీ అనుకూలిస్తే అవిశ్వాసం విజయవంతమైతే చైర్పర్సన్ స్థానానికి ముగ్గురు పోటీలో ఉన్నారు. మందా ఉమాదేవి, దండ శోభ, వైస్ చైర్పర్సన్ కొల్లిపాక నిర్మల రేసులో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కానుంది. -
మసీదులు, సమాధులు కాదు.. అభివృద్ధికి పునాదులు తవ్వుదాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘అమలుకాని వాగ్దానాలతో గద్దెనెక్కిన మోదీ పాలనలో ధరాఘాతంతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ద్రవ్యోల్బణం పెరిగింది. అప్పులు ఆకాశాన్ని తాకుతుంటే.. రూపాయి పాతాళంలోకి జారిపోయింది. మతం పేరిట చిచ్చురేపడం మినహా బీజేపీ చేసేదేం లేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మసీదులు, సమాధులు తవ్వుదామంటూ రెచ్చగొడతారు. తవ్వాల్సింది మసీదులు, సమాధులు కాదు.. హుజూరాబాద్లో కాలువలు, డబుల్ బెడ్రూం ఇళ్లకు పునాదులు తవ్వుదాం రా..’’మంత్రి కె.తారకరామారావు సవాల్ విసిరారు. మంగళవారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లాలో ‘కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్హౌజ్, ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్.. సాయంత్రం జమ్మికుంట డిగ్రీ కాలేజీ మైదానంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తమ పార్టీ పేరు మాత్రమే మారిందని.. డీఎన్ఏ, జెండా, ఎజెండా మారలేదని.. ప్రజల కోసం అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడుతామని పేర్కొన్నారు. సమాధులు కాదు.. పునాదులు తవ్వుదాం! ప్రధాని మోదీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారని.. దేశ ప్రజలందరి ఖాతాలో రూ.15 లక్షలు, రైతుల ఆదాయం రెట్టింపు, ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు, సొంతిళ్లు అంటూ పలికినవన్నీ ప్రగల్భాలేనని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎంపీ బండి సంజయ్ మోదీని దేవుడనడంపై విస్మయం వ్యక్తం చేశారు. ‘‘రూ.400 ఉన్న సిలిండర్ను రూ.1,200 చేసినందుకా..? నిత్యావసరాల ధరలు పెంచినందుకా? రూ.70 ఉన్న పెట్రోల్ను రూ.110 చేసినందుకా? పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో జనాల నుంచి రూ.30 లక్షల కోట్లు వసూలు చేసినందుకా? దేనికి మోదీ దేవుడు అయ్యాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 14 మంది ప్రధానులు రూ.56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. కేవలం 8 ఏళ్లలో మోదీ ఒక్కడే 100 లక్షల కోట్ల అప్పు చేసినందుకా? చేనేతలపై 5 శాతం జీఎస్టీ విధించినందుకా? గిరిజన రిజర్వేషన్లు కల్పించనందుకా? 30 ఏళ్లలో ఎన్నడూ చూడని నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వచ్చినందుకు మోదీ దేవుడు అయ్యాడా?’’అని ప్రశ్నించారు. ఎవరి పాలనతో అరిష్టం? ‘రైతుబంధుతో 66 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు ఇచ్చిన కేసీఆర్ పాలన అరిష్టమా? లేక 700 మంది రైతుల ప్రాణాలు పోయేందుకు కారణమైన మోదీ పాలన అరిష్టమా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘ప్రజలు ఆగం కావొద్దు. మళ్లీ పొరపాటు చేయవద్దు. సానుభూతి మాటలకు మోసపోవద్దు. హుజూరాబాద్లో గెలిచిన వ్యక్తి ఇక్కడ లేకుండా పోయారు. కానీ గెల్లు శ్రీనివాస్యాదవ్, పాడి కౌశిక్రెడ్డి ప్రజల్లోనే ఉంటున్నారన్న సంగతి గుర్తించాలి. వారి వినతి మేరకు రూ.100 కోట్లను మహిళా సంఘాలకు, రూ.10 కోట్ల చొప్పున జమ్మికుంట, హుజూరాబాద్ క్రీడామైదానాలను మినీస్టేడియాలుగా మార్చేందుకు నిధులు ఇస్తున్నాం. త్వరలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తాం’’అని చెప్పారు. ఈసారి పాడి కౌశిక్రెడ్డికి తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఉంటుందని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఆయనను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించడంతో అనుచరులు, నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సభలో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఈటలకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆరే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇది చేస్తాం అది చేస్తామంటూ ఈటల రాజేందర్ ప్రగల్భాలు పలికారని, గెలిచాక ఒక్క పైసా పని చేశాడా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమని అంటున్న ఈటల తీరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టేనని మండిపడ్డారు. 33 మంది సీనియర్లను కాదని 2004లో ఈటలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. -
మరోసారి సంచలనాలకు వేదికగా హుజూరాబాద్
హుజూరాబాద్ నియోజకవర్గం మరోసారి సంచలనాలకు వేదికగా మారబోతోంది. అదీ గులాబీ పార్టీలోనే పోటీ తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆ సీటును గులాబీ పార్టీలో ముగ్గురు ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు పోటీ ఏ స్థాయిలో ఉండబోతోంది? ఈటల మారారు, సీన్ మారింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని అధికార పార్టీలో మూడు ముక్కలాట నడుస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో హుజూరాబాద్ లో గులాబీ కోట బీటలు వారింది. టీఆర్ఎస్లో అక్కడ ఈటలకు ప్రత్యామ్నాయ నేత ఇంకా తయారు కాలేదనే అనిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల బీజేపీలో చేరి తిరిగి అసెంబ్లీకి ఎన్నికై తన బలాన్ని చూపించుకున్నారు. ఈ ఎఫెక్ట్ కూడా అక్కడ ఎక్కువే ఉంది. అయితే నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గులాబీ పార్టీ కేడర్లో ఒకింత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు నేతలు హుజూరాబాద్ టికెట్ కోసం పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల సభ వద్దు.. శాసనసభ ముద్దు..! 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన కౌశిక్ రెడ్డి ఆ తరవాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతున్నారని ఊహాగానాలు వచ్చినా.. తానే టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉండబోతున్నట్టు ఆడియోలు బయటకు వచ్చినా.. మారిన సమీకరణాలు వ్యూహ ప్రతి వ్యూహాల నేపథ్యంలో ఉప ఎన్నికలకు ముందు కారెక్కారు. కానీ టిక్కెట్ దక్కలేదు. గులాబీ దళపతి ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఎమ్మెల్సీ ఇచ్చినా కౌశిక్రెడ్డి మాత్రం సంతృప్తి చెందలేదు. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయంటున్నారు. ఎమ్మెల్సీ పదవి తృప్తిగా లేదు తనను ఎమ్మెల్యేగా గెలిపించండి అని కౌశిక్ వ్యాఖ్యానించారు. అందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. ముచ్చటగా ముగ్గురి పోటీ మరోవైపు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఈటల మీద ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా తానేం తగ్గేదెలే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేసేది తానే అని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇక మునుగోడుతో రాష్ట్రంలో పొడిచిన కొత్త పొత్తుల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా పరిణామాలు మారే అవకాశాలున్నాయి. పొత్తు కుదిరితే కనుక ఆ సీటు సీపీఐకి వెళ్తుంది. అప్పుడు సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ బాబు సొంత నియోజకవర్గం అయిన హుజూరాబాద్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్బాబు కూడా సొంత నియోజకవర్గానికి వస్తే హుజూరాబాద్ కోరుకునే వారి సంఖ్య మూడుకు చేరుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ టిక్కెట్ ఎవరికి అన్న ప్రశ్న తలెత్తుతోంది. కొత్త వారు కూడా ఈ సెగ్మెంట్ను కోరుకునే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఆయన్ను తట్టుకుని నిలబడే వారు అక్కడ గానీ చుట్టుపక్కల గానీ గులాబీ పార్టీలో కనిపించరనే టాక్ నడుస్తోంది. టీఆర్ఎస్ నుంచి ముగ్గురు పోటీ పడే పరిస్తితి వస్తే అది ఈటలకే ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ టిక్కెట్ను కేసీఆర్ ఎవరికి ఇస్తారో చూడాలి. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
‘బిడ్డా మీ ఆటలు సాగవింక.. ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ఉర్కించి కొడతాం’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడటంతో నాయకుల పరస్పర విమర్శలు రాజకీయ వేడిని తగ్గనీయడం లేదు. తాజాగా టీఆర్ఎస్ గెలుపును తక్కువ చేసి మాట్లాడతున్న నాయకులపై ఆ పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మందికి నీతులు వల్లించే ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజురాబాద్లో ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది అవుతున్న సొంత నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్చేశారు. ఆయన హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి అని కౌశిక్రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మీడియాతో సోమవారం మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ఈ వందల కోట్లు ఎక్కడి నుండి తెచ్చారో చెప్పాలి. చొప్పరి వేణు నీతో ఉంటాడా లేదా? ఈటల హత్య రాజకీయాలు చేసే వ్యక్తి. ప్రవీణ్ యాదవ్ను పోలీసుల టార్చర్ తో చంపింది నిజం కాదా? నన్ను కూడా చంపే ప్రయత్నం చేయలేదా? ఇన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తే కానీ గొడవలు.. మీ భార్య సొంత ఊరిలో ఎలా గొడవలు చేశారు. పలివెల గ్రామంలో పల్లా రాజేశ్వర్ రెడ్డినీ చంపే కుట్ర చేశారు’ అని విమర్శలు చేశారు. (చదవండి: తెలంగాణ సర్కార్కి గవర్నర్ లేఖ.. అందులో ఏముంది?) ఇష్టానుసారంగా మాట్లాడితే కబర్ధార్! ‘వివేక్ నీ మొహానికి మళ్ళీ ఎంపీ గా గెలవగలవా? నువ్వు కనీసం వార్డ్ మెంబర్ గా గెలిచే స్థితి లేదు. కేటీఆర్ పైన ఇష్టానుసారంగా మాట్లాడితే బిడ్డ కబర్దార్. కేసిఆర్, కేటీఆర్ పైన ఇక నుండి ఏం మాట్లాడిన ఉర్కించి కొడతాం. బిడ్డ బీజేపీ నాయకుల్లారా ఇక నుండి మీ ఆటలు సాగవు. ఈటల రాజేందర్ నువ్వు గెలిచి ఏడాది దాటింది. హుజూరాబాద్ లో చేసిందేమిటి. రూ. 3000 పెన్షన్ అన్నవ్ ఇప్పటి వరకు ఇచ్చావా? రోడ్లు, డ్రైనేజ్ లైన అభివృద్ధి చేసినవా?’అని కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. కాగా, వామపక్షాల భిక్షతో టీఆర్ఎస్ గెలిచిందని ఈటల రాజేందర్ విమర్శించిన సంగతి తెలిసిందే. విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసి టీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టారని, అధికార పార్టీకి పోలీసులు కూడా సహాకరించారని ఆరోపించారు. (చదవండి: బీజేపీ ఓటమిపై ఈటల హాట్ కామెంట్స్.. వారి భిక్షతోనే టీఆర్ఎస్ గెలిచింది!) -
తమిళిసై Vs కేసీఆర్.. పొలిటికల్ హీట్కు పాడి కౌశిక్ రెడ్డే కారణమా?
తెలంగాణ రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం మరింతగా పెరుగుతోందా? గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య మాటలు ఎందుకు లేవు? రాజ్భవన్కు సీఎం ఎందుకు వెళ్ళడంలేదు. అసెంబ్లీకి గవర్నర్ను ఎందుకు ఆహ్వానించడంలేదు? గవర్నర్కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ను తెలంగాణ సర్కార్ ఎందుకు పాటించడంలేదు? తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో బాధ్యతలు తీసుకుని మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గవర్నర్ తమిళిసై.. తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. తాను పరిధి అతిక్రమించానంటూ కొందరు విమర్శలు చేస్తున్నారని, గవర్నర్గా తన పరిధి, బాధ్యతలు ఏంటో తనకు తెలుసని ఆమె స్పష్టం చేశారు. గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నవారు.. సీఎం చేస్తున్న రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రాజ్భవన్ పట్ల ముఖ్యమంత్రి వివక్ష ఎందుకు చూపిస్తున్నారని అడిగారు గవర్నర్ తమిళిసై. గవర్నర్కు ఇవ్వాల్సిన కనీస ప్రోటోకాల్ను తెలంగాణ ప్రభుత్వం పాటించడంలేదని, ప్రభుత్వం తనను అనేకసార్లు ఇబ్బంది పెట్టిందని కూడా ఆమె కామెంట్ చేశారు. సమక్క, సారలమ్మ జాతరకు వెళ్ళేందుకు హెలికాప్టర్ అడిగితే ఇవ్వలేదని, తాను నాలుగు గంటల పాటు కారులో ప్రయాణం చేసి అక్కడకు వెళ్ళినట్లు చెప్పారు. తన పర్యటనకు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సంయుక్త సెషన్కు ఆహ్వానించలేదని, రిపబ్లిక్ డే సందర్భంగా పతాకావిష్కరణకు అవకాశం ఇవ్వలేదని, రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమానికి వస్తానని సమాచారం ఇచ్చి హాజరు కాలేదని గవర్నర్ తమిళిసై మీడియాకు వివరించారు. తాను గవర్నర్గా ఉన్న మూడేళ్ళ వ్యవధిలో రాజ్భవన్ను ప్రజా భవన్గా మార్చానని గవర్నర్ చెప్పారు. దాదాపు ఏడాది కాలంగా ప్రగతిభవన్, రాజ్భవన్ మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. హుజూరాబాద్లో పాడి కౌశిక్రెడ్డిని గవర్నర్ కోటాలో మండలికి పంపాలని సిఫార్సు చేస్తే.. గవర్నర్ ఆ ఫైల్ను పక్కన పెట్టారు. ఇక అప్పటి నుంచే ముఖ్యమంత్రికి, గవర్నర్ మధ్య గ్యాప్ పెరగడం మొదలైందనే ప్రచారం సాగుతోంది. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు, సంఘటనలు సామాన్యులకు సైతం అర్థం కాలేదు. ఈ సందర్భంగా గవర్నర్ పలుసార్లు తన అసహనాన్ని, అసంతృప్తిని బహిరంగంగానే వెలిబుచ్చారు. అయినా తెలంగాణ సర్కార్ తన ధోరణిలోనే తాను ముందుకు సాగుతోంది. అయితే జులై మాసంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారం జరిగితే రాజ్భవన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. గవర్నర్ తమిళిసైతో మామూలుగానే మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్యా మళ్ళీ సయోధ్య కుదిరిందని అందరూ భావించారు. ఆగస్ట్ 15న రాజ్భవన్లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి వస్తానని సమాచారం ఇచ్చిన కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఈ ఘటనతో రాజ్భవన్, ప్రగతి భవన్ ఇప్పట్లో దగ్గర కావనే విషయం నిర్ధారణ అయింది. ప్రభుత్వం తనకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని ఇవ్వడంలేదని గవర్నర్ భావిస్తున్నారు. అందుకే తాను ఎక్కడకు వెళ్ళినా కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోయినా తాను ప్రజలకు చేయాల్సిన పనులు చేస్తూనే ఉంటానని.. రాజ్భవన్ను ఈ మూడేళ్ళ కాలంలో ప్రజాభవన్గా మార్చానని తమిళిసై చెబుతున్నారు. -
కేసీఆర్ను తిడితే సహించం: కౌశిక్రెడ్డి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హుజూరాబాద్: ‘ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ బ్రోకర్. నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు రమ్మంటే రాకుండా పారిపోయిన దద్దమ్మ’అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. ‘ఈటల హుజూరాబాద్లో ఓట్ల కోసం యాక్టర్, హైదరాబాద్లో జోకర్, ఢిల్లీలో బ్రోకర్’అని ఎద్దేవా చేశారు. రాజేందర్ పెద్ద బ్రోకర్ అన్న సంగతిని బీజేపీ జాతీయ నేతలు గుర్తించి దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో చేరికల కమిటీకి ఆయన్ను చైర్మన్గా చేశారన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో నియోజకవర్గం అభివృద్ధిపై ఈటల చర్చకు రావాలని ఏర్పాటు చేసిన వేదికపైనుంచి కౌశిక్ మాట్లాడారు. 18 ఏళ్లు ఎమ్మెల్యే, ఏడున్నరేళ్లు మంత్రిగా పనిచేసిన ఈటల తన సొంతూరు కమలాపూర్కు కనీసం బస్టాండ్, శ్మశానవాటిక కట్టించలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ను బీజేపీ నేతలు తూలనాడితే సహించబోమని, వారిని బట్టలూడదీసి తరిమికొడతామని హెచ్చరించారు. తనది కౌశిక్రెడ్డి స్థాయి కాదన్న రాజేందర్.. తాను ఎమ్మెల్సీనన్న సంగతి మర్చిపోయారని, ప్రొటోకాల్ ప్రకారం తన కంటే ఈటల చిన్న అని ఎద్దేవా చేశారు. అనంతరం రాజేందర్ కోసం వేదికపై ఏర్పాటు చేసిన కుర్చీకి కౌశిక్రెడ్డి దండ వేసి నిరసన తెలిపారు. కాగా, కౌశిక్రెడ్డి వేదిక మీదకు రాగానే మహిళా మోర్చానేతలు బీజేపీ అనుకూల నినాదాలు చేయడంతో పోలీసులు కలగజేసుకుని అక్కడ నుంచి పంపించేశారు. సభ అనంతరం బీజేపీ నేతలు అక్కడికి రావడంతో కాసేపు తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
హుజురాబాద్ అభివృద్ధిపై టీఆర్ఎస్, బీజేపీ సవాళ్లు
-
చర్చకు రమ్మంటే ముఖం చాటేస్తున్న ఈటల: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్: ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కోరితే సమాధానం చెప్ప కుండా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖం చాటేస్తున్నా రని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. బుధవారం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరినా ఈటల స్పందించకపోవడం తన తప్పును అంగీకరించినట్లేనని స్పష్టం చేశారు. 5న హుజూ రాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద నియోజకవర్గ ప్రజల మధ్యే అభివృద్ధిపై చర్చ పెట్టుకుందామన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక పాల్గొన్నారు. -
ధైర్యముంటే బహిరంగ చర్చకు రా..! ఈటలకు కౌశిక్ రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూపించేందుకు తాను సిద్ధమని.. ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ చేసిందేమిటో చూపించాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి సవాల్ చేశారు. హుజూరాబాద్లోని అంబేడ్కర్ చౌరస్తాలో ఈ నెల 5న బహిరంగ చర్చకు వేచి చూస్తానని ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్లో ఏమీ సాధించని ఈటల రాజేందర్ గజ్వేల్లో సీఎం కేసీఆర్పై పోటీ చేస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. స్వగ్రామం కమలాపూర్లో కనీసం బస్టాండ్ కూడా ఈటల నిర్మించలేకపోయారని, సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో హుజూరాబాద్లో అభివృద్ధి ఎందుకు సాధించలేక పోయారో ఈటల రాజేందర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈటల రాజేందర్ను జోకర్లా చూస్తున్నారని, బీజేపీలో చేరిన తర్వాత ఆయన పరిస్థితి దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. అధికారిక కార్యక్రమాలకు ఈటల రాజేందర్ను నియోజకవర్గ అధికారులు ఆహ్వానిస్తున్నా రావడం లేదని, శిలాఫలకాలపై తనతో పాటు ఈటల పేరు లేకుంటే ముక్కు నేలకు రాస్తానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. చదవండి: టీఆర్ఎస్కు షాక్.. బీజేపీలోకి మంత్రి సోదరుడు! -
ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఫైర్
-
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోమవారం సాయం త్రం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో గుత్తా సుఖేందర్రెడ్డి, కడి యం శ్రీహరి, తక్కల్లపల్లి రవీందర్రావు, బండా ప్రకాశ్ ముదిరాజ్, పాడి కౌశిక్రెడ్డి, పి.వెంకట్రామిరెడ్డి ఉన్నారు. శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు ఈ నెల 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరించగా, టీఆర్ఎస్ నుంచి ఆరుగురు అభ్యర్థులతోపాటు మరో ఇద్దరు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురవడంతో బరిలో టీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు మాత్రమే మిగిలారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అభ్యర్థులు సాయంత్రం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డితో కలిసి అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమకు చట్టసభలో అవకాశమిచ్చిన పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను చూసి ఓర్వలేకనే..: కడియం శ్రీహరి ‘అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తాం. అభివృద్ధిలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ అన్ని ప్రాంతాలు, వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు కావస్తుండగా, జీడీపీ భారీగా తగ్గి కరోనా సమయంలో అట్టడుగుకు పడిపోయింది. మోదీ పాలనాదక్షుడైతే దేశ జీడీపీ ఎలా తగ్గిందో రాష్ట్ర బీజేపీ నేతలు వివరించాలి. ధాన్యం సేకరణ అంశం కేంద్రం పరిధిలోనిదే అయినప్పటికీ కొనుగోలు చేయకుండా సమస్యలు సృష్టిస్తోంది’ అని శ్రీహరి అన్నారు. -
పెరిగిన ఎమ్మెల్సీ వేడి.. తెరపైకి ఆ ముగ్గురి పేర్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పెరిగింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థుల జాబితా ఖరారైన నేపథ్యంలో పలువురికి ప్రగతిభవన్ నుంచి సీఎం నేరుగా ఫోన్చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల కోటాలో పన్నెండు, ఎమ్మెల్యే కోటాలో ఆరు సీట్లను దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం నాలుగు సీట్లు దక్కనున్నాయి. వాస్తవానికి ఆరుగురు అభ్యర్థుల్లో బీసీ సామాజికవర్గం నుంచి ఎల్.రమణ, రెడ్డి సామాజిక వర్గం నుంచి పాడి కౌశిక్రెడ్డికి స్థానాలు ఖరారయ్యాయని సమాచారం. ఇటీవల గవర్నర్ కోటాలో పాడి కౌశిక్రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేట్చేసినా.. ఆయనపై ఉన్న కేసుల కారణంగా అది వాస్తవరూపం దాల్చలేదు. దీంతో ఎమ్మెల్యే కోటాలో అధిష్టానం కౌశిక్కు బెర్త్ కన్ఫర్మ్ చేసిందని ప్రచారం జరుగుతోంది. చదవండి: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. వెంటనే ఆమోదం స్థానిక సంస్థల కోటాలో తెరపైకి ముగ్గురు! త్వరలో స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి జిల్లా నుంచి రెండు స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఈనెల 16వ తేదీన నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రెండుస్థానాల ఆశావహుల జాబితా కూడా రెడీ అయిందని సమాచారం. ప్రస్తుతం ఓసీ (వెలమ సామాజికవర్గం) భానుప్రసాదరావు, బీసీ (ఎల్లాపు) నుంచి నారదాసు లక్ష్మణరావు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఈసారి వెలమసామాజికవర్గానికి చెందిన చెన్నాడి సుధాకర్రావు, బీసీ (యాదవ) నుంచి గెల్లు శ్రీనివాస్యాదవ్తోపాటు, మాజీ జెడ్పీటీసీ వీర్ల వెంకటేశ్వరరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. భాను ప్రసాద్కు ఎమ్మెల్యే టికెట్హామీ దక్కడంతో ఆయన పోటీ చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు నారదాసు లక్ష్మ ణరావుకు ఇప్పటికే రెండుసార్లు అవకాశం కల్పించిన నేపథ్యంలో మూడోసారి ఎమ్మెల్సీ టికెట్ దక్కే చాన్స్లు దాదాపుగా లేవనే చెబుతున్నారు. పార్టీ మొత్తంగా భర్తీ చేయనున్న 18 సీట్లలో నాలుగు సీట్లు ఉమ్మడి జిల్లా నుంచి భర్తీ కానుండటం గమనార్హం. హుజూరాబాద్ ఓటమిని మరిచిపోయేలా.. మరోవైపు పార్టీలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓ టమి తీరని నైరాశ్యాన్ని నింపింది. నాలుగైదు నెలలపాటు భారీ మెజారిటీతో గెలుస్తామన్న ధీమాగా ఉన్న పార్టీకి ఈటల విజయం సాధించడంతో ఊ హించని భంగపాటు ఎదురైంది. దీంతో గులాబీ శ్రేణులు ఒక్కసారిగా ఢీలా పడ్డాయి. అందుకే, ఆ నష్టాన్ని పూడ్చాలంటే.. రాబోయే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటాలో సీట్లు కైవసం చేసుకుని తిరిగి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపాలి. అందుకే, పకడ్బందీగా ప్లాన్ చేసి ప్రతిపక్షాలను తిరిగి ఆత్మరక్షణ ధోరణిలో పడేసేలా పావులు కదుపుతోంది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఆది నుంచి టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న కరీంనగర్ జిల్లాపై ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు సడలనీయవద్దన్న పట్టుదలతో పకడ్బందీగా ముందుకు సాగుతోంది. -
అక్కడ టీఆర్ఎస్కు తొలిసారి ఎదురుదెబ్బ.. తేడా ఎక్కడా?!
సాక్షి , కరీంనగర్: కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీకి తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రెండుసార్లు ఎంపీ పదవికి కేసీఆర్, ఎమ్మెల్యేల పదవికి కేటీఆర్, ఈటల రాజేందర్ రాజీనామా చేసినా ప్రజలు గెలిపించారు. అలాంటి బలమైన పునాదులు ఉన్న జిల్లాలో.. అందులోనూ పార్టీలో సీనియర్ నేత ఎంపీ, కెప్టెన్ లక్ష్మీకాంతరావు సొంత ప్రాంతమైన హుజూరాబాద్లో ప్రతికూల ఫలితం రావడాన్ని పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. ఆ కంచుకోటపై నేడు కాషాయజెండా ఎగరడంపై టీఆర్ఎస్ పార్టీ సమీక్ష ప్రారంభించింది. 23,855 ఓట్ల తేడాతో తమ సిట్టింగ్ స్థానంలో ప్రత్యర్థి విజయం సాధించడంతో.. ఎక్కడ తేడా కొట్టిందో తెలుసుకునే పనిలో మునిగింది. పార్టీ జిల్లా నాయకత్వాన్ని అధిష్టానం నివేదిక అడగనున్నట్లు తెలిసింది. పట్టున్న ప్రాంతాల్లోనూ ప్రత్యర్థిదే పైచేయి హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి. ఇందులో కమలాపూర్ ఈటల రాజేందర్ సొంతప్రాంతం. ఇక్కడ బీజేపీకి ఆధిక్యంరావడంలో వింతేంలేదు. మిగిలినవి హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక. ఈ ప్రాంతాల్లోని మెజారిటీ గ్రామాల్లో టీఆర్ఎస్ అనుకూల సర్పంచులే. జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంది. హుజూరాబాద్ మున్సి పాలిటీ, హుజూరాబాద్ రూరల్, వీణవంక మండలాల్లో భారీ మెజారిటీ వస్తుందనుకున్న గులాబీఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. దీంతో జిల్లా గులాబీ నాయకత్వం గ్రామాలవారీగా పోస్టుమార్టం ప్రారంభించింది. ఎక్కడు ఏ కారణం చేత ఓట్లు తగ్గిపోయాయే తెలుసుకునే పనిలో పడింది. చదవండి: (హుజూరాబాద్ నిశ్శబ్ద తీర్పు.. చక్రం తిప్పిన బండి సంజయ్) గట్టి నేతలు ఉన్నా.. పాడి కౌశిక్రెడ్డి సొంతమండలం వీణవంకలో టీఆర్ఎస్కు 162 ఓట్ల మెజారిటీ వచ్చింది. జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ ప్రచారం చేసిన ఇల్లందకుంట ప్రాంతంలో బీజేపీ మెజారిటీ 1,423 ఓట్లు. గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామం హిమ్మత్నగర్లో బీజేపీకి 549ఓట్లు అధికంగా రావడం గమనార్హం. ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్బాబుల సొంతగ్రామం సింగాపూర్లో టీఆర్ఎస్ కేవలం 133ఓట్ల మెజారిటీ సాధించింది. ఎస్సీ కార్పొరేషన్ బండ శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ల స్వస్థలమైన హుజూరాబాద్ పట్టణంలోనూ బీజేపీకి మెజారిటీ వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు ప్రకటించిన హుజూరాబాద్ మండలం శాలపల్లిలో బీజేపీకి 137మెజారిటీ రావడంపై అధిష్టానం తీవ్ర అసంతృప్తిలో ఉందని సమాచారం. త్వరలోనే నివేదిక ఓటమి విషయంలో అధిష్టానం త్వరలోనే ఓ నివేదిక కోరే అవకాశముందని సమాచారం. నాలుగున్నర నెలలుగా హుజూరాబాద్లోనే మకాం వేసి ప్రచారం చేసినా.. సానుకూల ఫలితం రాకపోయేసరికి జిల్లా నేతలు ఆత్మావలోకనం ప్రారంభించారు. పార్టీలో భారీగా చేరికలు జరిగినా, దళితబంధులాంటి సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా, పెండింగ్ పనులు పూర్తి చేసినా, రూ.కోట్లాది నిధులు విడుదల చేసినా ఎందుకు ప్రజలు తమను తిరస్కరించారు? అన్న విషయంలో బుర్రలు బద్ధలు కొంటుకుంటున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో రాజేందర్ విజయానికి సానుభూతే కారణమని.. పార్టీ అ డిగిందే తడవుగా.. వివరణ ఇచ్చేందుకు సిద్ధపడ్డారని సమాచారం. -
Huzurabad Bypoll: కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులు
-
కౌశిక్ రెడ్డి కసబ్గా మారి పారిపోయాడు.. అందుకే ఆలస్యమైంది
సాక్షి, కరీంనగర్: వేషం మార్చినంత మాత్రాన ఈటల రాజేందర్ ఇవాళ ఉత్తముడు కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. అక్రమ సంపాదన వాటాల్లో గొడవ వల్లే హుజూరాబాద్ ఉపఎన్నిక వచ్చిందన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా రెండో రోజు రేవంత్ రెడ్డి ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అంటున్న కేసీఆర్కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటను కొనలేని పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? అన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మంత్రి హరీశ్రావు ఇద్దరు ఒక్కటేనని విమర్శించారు. చదవండి: (పొమ్మనలేక పొగపెట్టారు: ఈటల) లీటర్ పెట్రోల్పై రూ.65 పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. మోదీ, కేసీఆర్ కలిసి ప్రజలను పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న వారికి ఓటుతో బుద్ది చెప్పాలని కోరారు. పింఛన్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలన్నారు. కౌశిక్ రెడ్డి కసబ్గా మారి పారిపోయాడని, అందుకే అభ్యర్థి ఎంపికలో ఆలస్యమైందన్నారు. ప్రజాసమస్యలు నిరుద్యోగ సమస్యలపై ఏడేళ్లుగా పోరాడుతున్న బల్మూరి వెంకట్ను అభ్యర్థిగా తీసుకువచ్చామని ఓటు వేసి బల్మూరి వెంకట్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. -
కౌశిక్ రెడ్డికి గవర్నర్ ఝలక్
-
కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వంపై అధ్యయనం చేస్తున్నా..
ఆ గీత దాట లేదు.. సీఎంతో ఆప్యాయతలు లేవు.. విభేదాలూ లేవు. గవర్నర్, సీఎం మధ్య సంబంధాల్లో ఉండాల్సిన గీత ఇది. రాజకీయాలు వేరు.. రాజ్యాంగబద్ధ పదవి వేరు. ఈ రెండింటి మధ్య గీతను నేనే స్పష్టంగా గీసుకున్నా. దాన్ని ఎన్నడూ దాటలేదు. సోదరిలా కలిసిపోయా.. గవర్నర్లా కాకుండా తెలంగాణ సోదరిగా ఇక్కడి సంస్కృతి అయిన కట్టు బొట్టును అనుసరిస్తూ ఇక్కడి ప్రజల్లో కలిసిపోయా. రాష్ట్ర ప్రజలు అపార ప్రేమ, ఆప్యాయతలను చూపారు. ఈ రాష్ట్ర గవర్నర్గా పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. క్లిష్టమైన పని.. టీఆర్ఎస్.. ప్రాంతీయ పార్టీ. గవర్నర్ కాకముందు నేను వేరే పార్టీలో ఉన్నా. వేరే పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరించడం క్లిష్టమైన పని. ఈ విషయంలో సమన్వయంతో వ్యవహరిస్తున్నా. సామాన్య ప్రజలను పక్షం రోజులకో, నెల రోజులకో ఒకసారి కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడానికి ప్రజాదర్బార్ నిర్వహించాలని గతంలో నిర్ణయించాం. వెబ్ పోర్టల్కు సైతం రూపకల్పన చేశాం. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా ఇది మొదలుకాలేదు. సాధారణ పరిస్థితులు ఏర్పడితే ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తా. గతంలో చెప్పినట్టు గిరిజన గ్రామాలను సైతం సందర్శిస్తా. – తమిళిసై సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించినా తాను ఇంకా ఆమోదించలేదని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో సత్సంబంధాలే ఉన్నాయని, వివాదాలు, విభేదాలు లేవని స్పష్టం చేశారు. గవర్నర్గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఇప్పటివరకు ఆమె పాల్గొన్న కార్యక్రమాల ఫొటోలు, వివరాలతో ‘వన్ ఎమాంగ్ అండ్ ఎమాంగెస్ట్ ద పీపుల్’ పేరిట రూపొందించిన చిత్రమాలికను బుధవారం రాజ్భవన్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సీనియర్ జర్నలిస్టులు గవర్నర్ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా తమిళిసై మీడియాతో మాట్లాడారు. స్నేహపూర్వకంగా సూచనలు.. ‘డెంగ్యూ జ్వరాలు, వరదలు, కోవిడ్ మహమ్మారి వంటి సమయాల్లో ప్రభుత్వ ప్రయత్నాలను అభినందిస్తూనే నా ఆందోళనలను తెలియజేశా. కోవిడ్ సమయంలో కేవలం ఒకే ఆస్పత్రి (గాంధీ ఆస్పత్రి)లో కరోనా చికిత్స ఇస్తుంటే జిల్లా ఆస్పత్రుల్లో సైతం చికిత్స అందించాలని ఓ వైద్యురాలిగా సూచించా. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచాలని ప్రభుత్వాన్ని, సీఎంను పలుమార్లు కోరా. కొంతమేరకు ఆస్పత్రుల పరిస్థితులు మెరుగు అవుతున్నాయి. గవర్నర్లా కాకుండా తెలంగాణ సోదరిలా స్నేహపూర్వకంగా నా సూచనలు తెలియజేశా. విమర్శకు పోలేదు..’ అని పేర్కొన్నారు. సీఎం సానుకూల స్పందన ‘నేను ముఖ్యమంత్రికి ఏం చెప్పాలనుకున్నానో స్పష్టంగా తెలియజేశా. ప్రజల మేలుకు నేను చేసిన సూచనల్లో చాలా వాటికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నేను పలుమార్లు కోరితే, తొలుత విభేధించిన సీఎం చివరకు అంగీకరించారు. ప్రతి విషయంలో సానుకూలంగా ముందుకు పోయా. ప్రభుత్వం సైతం అలాగే స్పందించింది. మా మధ్య సత్సంబంధాలున్నాయి. తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా సమ న్యాయం చేసినట్టు భావిస్తున్నా. గతంలో మద్రాస్ రాష్ట్రంగా తమిళనాడు, తెలుగు ప్రజలు కలిసి ఉన్నాం. అందుకే ఇక్కడి ప్రజలు సొంత ప్రజలుగా అనిపిస్తారు. రాష్ట్ర గవర్నర్గా నా విజయాలను ఇటీవల మరణించిన నా మాతృమూర్తికి అంకితం చేస్తున్నా.’ అని గవర్నర్ తెలిపారు. గతంలో మూడు పేర్లు వెంటనే ఆమోదించా ‘కౌశిక్ రెడ్డిని సామాజిక సేవ కేటగిరీ కింద ఎమ్మెల్సీ పదవిలో నామినేట్ చేయాల్సి ఉంది. దీనిపైనే అధ్యయనం చేస్తున్నా. ఆయన బయోడేటా క్లియర్గా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వంతో ఎలాంటి అభిప్రాయ భేదాలు, అభ్యంతరాలు లేవు. అయితే ఆయన చేసిన కార్యక్రమాలు సామాజిక సేవ కేటగిరీలో ఫిట్ అవుతాయా? అని పరిశీలించి చూడాల్సి ఉంది. అందువల్ల నాకు మరికొంత సమయం కావాలి. గతంలో మరో ముగ్గురి పేర్లను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే తక్షణమే ఆమోదించా. వారికి సంబంధించిన ప్రతిపాదనల్లో స్పష్టత ఉండడంతో వెంటనే నిర్ణయం తీసుకున్నా..’ అని గవర్నర్ తెలిపారు. -
కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీపై గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె రాజ్భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గవర్నర్గా రెండేళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రెండేళ్లు గవర్నర్గా పూర్తి చేసుకున్న ఈ విజయాన్ని ఇటీవల చనిపోయిన తన తల్లికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ఆరు నెలలుగా లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన విధులు సక్రమంగా నిర్వహిస్తున్నానని, ఇందుకు రాజ్ భవన్ సిబ్బంది సహకారం ఉందని తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్గా చేపట్టిన ప్రతి కార్యక్రమానికి మీడియా ఎంతగానో సహకరించిందని, అందుకే తాము ప్రజలకు మరింత చేరువ కాగలినట్లు వెల్లడించారు. కాగా హుజురాబాద్కు చెందిన పాడి కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజిక సేవ చేసే వాళ్లకే ఎమ్మెల్సీ ఇవ్వాలని సూచించారు. కౌశిక్రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై ఆలోచించాలని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్రెడ్డికి గవర్నర్ కోటాలో శాసనమండలికి మంత్రివర్గం నామినేట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: Huzurabad: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కౌశిక్రెడ్డి -
దళిత బంధు రాదంటూ ఈటల తప్పుడు ప్రచారం: మంత్రి హరీశ్ రావు
కరీంనగర్: దళిత బంధు రాదంటూ ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈటల రాజేందర్ చెప్పే మోసపూరిత మాటలు నమ్మొద్దని హరీశ్రావు సూచించారు. ప్రతి దళిత కుటుంబానికి 9లక్షల 90వేలు వస్తున్నట్లు మేసేజ్లు వస్తున్నాయన్నారు. హుజురాబాద్ దళిత బంధు విజయం రాష్ట్రానికి, దేశానికి ఆదర్శం కావాలన్నారు. దళిత బంధుకు పైసలు ఎక్కడివి అని ఈటల అన్నారని, కానీ ఇప్పుడు అందరికీ దళిత బంధు వస్తుందని తెలిపారు. దీనికి ఈటల ఏం చెబుతారని ప్రశ్నించారు. కాగా హుజురాబాద్లో పోటాపోటీ ప్రచారాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ జమ్మికుంటలో సభను ఏర్పాటు చేసింది. బీజేపీ గోడ గడియారాలను, గొడుగులను సభలో ఓ యువకుడు ధ్వంసం చేశాడు. గోడ గడియారాలు భరోసానిస్తాయా అంటూ ప్రశ్నించారు. మంత్రులు హరీశ్ రావు, కొప్పుల వేదికపై ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డిలు పాల్గొన్నారు. చదవండి: Huzurabad Bypoll: ఉప ఎన్నికపై ఈసీకి నివేదిక పంపాలి -
ఈటల, రేవంత్రెడ్డి కుమ్మక్కు అయ్యారు: కౌశిక్రెడ్డి
-
ఈటల రాజేందర్కు రేవంత్ ప్యాకేజీ: కౌశిక్ రెడ్డి
హుజురాబాద్: టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్కు రేవంత్ ప్యాకేజీ ఇచ్చారని కౌశిక్ విమర్షించారు. ఎన్నికల తర్వాత ఈటల కాంగ్రెస్ గూటికి వెళ్తారంటూ కౌశిక్ రెడ్డి జోస్యం చెప్పారు. సీఎంకు ఈటల అంటే ఏంటో అర్థమైంది: ఈటల హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలకు కేసీఆర్ ఎన్ని ఇస్తున్నా.. వారు తన వెంట ఉన్నారని దీంతో సీఎంకు ఈటల అంటే ఏంటో అర్థమైందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ మండలం రాంపూర్లోని వడ్డెర కాలనీ వాసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో పేదిరకం, కన్నీళ్లు ఇంకా పోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 18ఏళ్లు కేసీఆర్ అడుగు జాడల్లో నడిచినప్పుడు తమ్ముడు అని చెప్పి.. ఇప్పుడు దెయ్యం ఎలా అయ్యాడని ప్రశ్నించారు. అనంతరం పలువురు యువకులు బీజేపీలో చేరగా పార్టీ కండువా కప్పి ఈటల ఆహ్వానించారు. చదవండి: వరంగల్ కుటుంబం హత్య: చావాలనుకున్నాడు.. చంపాడు! -
కాషాయ జెండా పట్టుకొని ఎర్ర జెండా డైలాగులా ఈటలా?: మంత్రి హరీశ్రావు
జమ్మికుంట (హుజూరాబాద్): కాషాయ జెండా చేతిలో పట్టుకొని ఎర్ర జెండా డైలాగులు కొడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ప్రజలు నమ్మరని మంత్రి హరీశ్రావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ పత్తి మార్కెట్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐటీయూసీ కార్మిక సంఘాలు, టీడీపీ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. చదవండి: కాటేసిన అప్పులు.. ఇద్దరు రైతులు బలవన్మరణం ప్రజల బాధను తన బాధగా భావించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని, అందుకే వారి బాధలు దూరం చేసే అనేక పథకాలను తీసుకువచ్చారని, కానీ ఈటల రాజేందర్ మాత్రం తన బాధను ప్రజల బాధగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ ఆరోపించారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ పరిధిలో ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇచ్చారా అని ప్రశ్నించారు. జమ్మికుంట, హుజూరాబాద్, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాల్లో కార్మికులు, ఇల్లు లేని పేదకుటుంబాలకు డబుల్బెడ్రూం మంజూరు చేస్తామని, సొంత స్థలాలు ఉండి ఇల్లు కట్టుకునేలా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు బాటలో ఉన్నారని, బీజేపీని చిత్తుగా ఓడించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మిక, రైతు వ్యతిరేకత, వ్యవసాయ మార్కెట్ యార్డు బంద్ అనే పాలన చేస్తున్న బీజేపీకి కార్మికులు, రైతులు గుణపాఠం చెప్పాలని సూచించారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పాడి కౌశిక్రెడ్డి, పురపాలక సంఘం చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: హుజురాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్కు దరఖాస్తులు ఆహ్వానం -
కౌశిక్రెడ్డికి కేసుల గండం?
సాక్షి, హైదరాబాద్: నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీ పదవిపై గందరగోళం ముసురుకుంది. ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే రాష్ట్ర మంత్రి మండలి ఈ నెల 2వ తేదీనే తీర్మానం చేసి పంపినా.. ఇప్పటివరకు గవర్నర్ ఆమోదించినట్టుగా ప్రకటనేదీ రాలేదు. వాస్తవానికి కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ఫైలు సీఎం కార్యాలయంలోనే ఉందని.. కౌశిక్రెడ్డిపై పలు పోలీసుస్టేషన్లలో కేసులు పెండింగ్లో ఉండటమే దీనికి కారణమని విశ్వసనీయ సమాచారం. ఆయా కేసుల వివరాలను పూర్తిగా సేకరించాకే.. ఫైలును గవర్నర్ ఆమోదం కోసం పంపే అవకాశం ఉందని తెలిసింది. చాలా పోలీస్స్టేషన్లలో..: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్రెడ్డిపై ఇల్లందకుంట, సుబేదారి పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టారు. ఆ తర్వాత కూడా వీణవంక, హుజూరాబాద్ టౌన్, కరీంనగర్, జమ్మికుంట, సిరిసిల్ల తదితర పోలీస్స్టేషన్ల పరిధిలో వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వాహనం పార్కింగ్ విషయంలో తమ బంధువుపై కౌశిక్రెడ్డి దాడి చేశారని 2019 ఫిబ్రవరిలో సినీనటులు జీవిత, రాజశేఖర్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు కూడా. మొత్తంగా ఆయా కేసులేమిటి, వాటి వెనుక ఉన్న కారణాలేమిటన్న దానిపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ నివేదికను పూర్తిగా పరిశీలించాకే.. కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్కు పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. హడావుడి సిఫారసు నేపథ్యంలో.. టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ నిష్క్రమణ నేపథ్యంలో.. అప్పటికి కాంగ్రెస్లోనే ఉన్న కౌశిక్రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి తానేనంటూ చేసిన ప్రకటన వివాదాస్పమైంది. కౌశిక్రెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మొదట్లో భావించినా.. తర్వాత పునరాలోచనలో పడినట్టు సమాచారం. అయితే హుజూరాబాద్లో రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కౌశిక్రెడ్డిని హడావుడిగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ తీర్మానించారు. సాహిత్యం, సైన్స్, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవ తదితర రంగాల్లో అనుభవమున్న వారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అధికారం రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. దేశవాళీ క్రికెట్లో రాణించిన కౌశిక్రెడ్డి.. తన తల్లి పేరిట కరీంనగర్ జిల్లాలో ‘పుష్పమాల దేవి మెమోరియల్ ట్రస్టు’ పెట్టి 2009 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మేరకు క్రీడా, సేవా రంగాల్లో చేసిన కృషి మేరకు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తున్నట్టు కేబినెట్ తీర్మానంలో పేర్కొంది. అయితే కౌశిక్రెడ్డికి పదవి ఇవ్వడంపై హుజూరాబాద్ టీఆర్ఎస్ శ్రేణులతోపాటు రాష్ట్ర నాయకుల్లోనూ అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలిసింది. ఇదే సమయంలో కౌశిక్రెడ్డిపై నమోదైన కేసుల విషయంగా సీఎంకు ఫిర్యాదులు అందాయని, దానితో నివేదిక కోరారని సమాచారం. ఆచితూచి నిర్ణయంపై.. మహారాష్ట్రలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను నామినేట్ చేయడంపై దాఖలైన పిటిషన్ హైకోర్టులో నెలల తరబడి నలుగుతోంది. మన రాష్ట్రంలోనూ గవర్నర్ కోటాలో గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్లను నామినేట్ చేయడంపై ధన్గోపాల్రావు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కౌశిక్రెడ్డి్డ విషయంగా ఆచితూచి అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ వీడటంలోనూ వివాదం పాడి కౌశిక్రెడ్డి కాంగ్రెస్ను వీడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్కు లంచం ఇచ్చారని కౌశిక్రెడ్డి ఆరోపించారు. దీనిపై మాణిక్యం ఠాగూర్ పరువు నష్టం దావా వేశారు. -
హుజురాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు
-
హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూలు రేపు లేదా ఎల్లుండి?
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ శుక్ర లేదా శనివారం వెలువడనుందా? ఈ మేరకు ప్రధాన రాజకీయ పార్టీలకు సంకేతాలందాయా? వారం రోజులుగా ముమ్మరంగా సాగుతున్న ఆయా పార్టీల కార్యకలాపాలు దీన్ని బలపరుస్తున్నాయి. ఈనెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్లో దళితబంధు పథకం ప్రారంభిస్తారని తొలుత ప్రకటించారు. అయితే బుధవారం వాసాలమర్రి దళితవాడను సీఎం సందర్శించిన నేపథ్యలో దళితబంధు లబ్దిదారుల ఎంపిక, గురువారం చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించడానికి హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూలు విడుదల సంకేతాలందడమే కారణమనే ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్లో పాడి కౌశిక్రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేరికలకు సీఎం కేసీఆర్ స్వయంగా హాజరవడం, కౌశిక్రెడ్డిని మూడ్రోజుల క్రితం గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయడం వంటి పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. మంత్రి హరీశ్రావు.. హుజూరాబాద్లో పార్టీ సమన్వయంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. మరో మంత్రి గంగుల కమలాకర్, ఇతర ఎమ్మెల్యేలు హుజూరాబాద్లోనే మకాం వేశారు. దీనికంతటికీ ఉపఎన్నిక షెడ్యూలుపై సంకేతాలు రావడమే కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నేడు ఈటల డిశ్చార్జి.. అట్నుంచి హుజూరాబాద్కు పాదయాత్రలో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ఆయన కోలుకునేందుకు 15 రోజులు పడుతుందని సన్నిహితులు అంటున్నారు. అయితే, ఆయన గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగానే, ఉదయం 10.30కి ఆసుపత్రి ఆవరణలోనే మీడియాతో మాట్లాడి నేరుగా హుజూరాబాద్ వెళ్తారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకుండానే ఈటల హుటాహుటీన నియోజకవర్గానికి వెళ్లడం వెనుక ‘ఉపఎన్నిక షెడ్యూలు’వార్తలే కారణమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమై హుజూరాబాద్ ఉపఎన్నికపై చర్చించింది. మూడు ప్రధాన పార్టీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూలు వారాంతంలోగా వెలువడుతుందనే ఊహాగానాలు సాగుతున్నాయి.