Lakshman
-
బీఆర్ఎస్,కాంగ్రెస్కు ఎంపీ లక్ష్మణ్ ఛాలెంజ్
సాక్షి,హైదరాబాద్:వికసిత్ భారత్ 2047 విజన్ లక్ష్యంగానే కేంద్రం 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం(ఫిబ్రవరి2) లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో మూడు ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేశాం. ఆర్ఆర్ఆర్కు కేంద్రమే నిధులు ఇస్తోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వమే పునరుద్ధరించిందికరోనా లాంటి గడ్డు పరిస్థితి తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకుని దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ గాడిలో పెట్టారు. 2014లో 2 లక్షలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటే ఇప్పుడు ఏకంగా 12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు. ఇదొక మైల్ స్టోన్. దశాబ్ద కాలంలో మోదీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.మధ్య తరగతి ప్రజలతో దేశ ఆర్థిక ప్రగతి సాధ్యమని భావించి మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల హక్కులకు ప్రాధాన్యం కల్పిస్తూనే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సామాన్యుడు కూడా నాణ్యమైన విద్య, వైద్యం అందుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దారుప్రతిపక్షపార్టీలు కళ్లు లేని కబోదులుగా మారి విమర్శలు చేస్తున్నాయి. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు కాంగ్రెస్కు కంచుకోటలాగా మెదక్ను చెప్పుకున్నారు.. కానీ అన్ని ఏండ్లు అధికారంలో ఉన్నా రైలు మార్గం వేయలేదు. కానీ మేము వేశాం. త్వరలో రైలు ప్రారంభమవుతుంది. ధర్నా చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్..మా హయాంలో పదేండ్లలో మేమేం చేశాం.. మీరేం చేశారు అనే అంశంపై చర్చకు సిద్ధమా?’అని లక్ష్మణ్ సవాల్ విసిరారు.కాగా శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్లో 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్లో తెలంగాణకు ఎప్పటిలాగే సున్నా నిధులు కేటాయించారని ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నాయి. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి బీజేపీ తెలంగాణకు మొండి చెయ్యి చూపించిందని రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి. -
తిరుమలలో ‘లక్ష్మణ’ లీలలు!
అమరావతి: తిరుమల తిరుపతి దేవ స్థానం (టీటీడీ)లో ప్రైవేట్ వ్యక్తుల హవాకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. 2014– 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ ఓ పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో దేవస్థానంలో చక్రం తిప్పుతుంటే మరోవైపు లోకేశ్ మనిషిగా ముద్రపడ్డ లక్ష్మణ్కుమార్ ఏకంగా ‘సూడో’ అదనపు ఈఓగా చెలరేగిపోతున్నారు. అదన ఈఓ వెంకయ్య చౌదరి పక్కనే ఈయనకు కుర్చీవేసి ప్రొటోకాల్ మర్యాదలు అందిస్తున్నారంటే ఈయన హవా ఏ స్థాయిలో నడుస్తోందో అర్థంచేసుకోవచ్చు.లక్ష్మణ్కుమార్కు ఛాంబర్, వాహనం, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఏ అధికారిక ఉత్తర్వులు లేకపోయినా టీటీడీలో తిష్టవేసి అందరినీ శాసిస్తున్న లక్ష్మణ్కుమార్ వ్యవహారం ఇప్పుడు టీటీడీలో హాట్ టాపిక్. టీటీడీలో ఎలాంటి ఉత్తర్వుల్లేకుండా అధికారిక సమావేశంలో పాలొ్గనడం, ఏఈఓతోపాటు సమీక్షల్లో ఉండడం.. నిఘా, ముఖ్యభద్రతాధికారి పాల్గొన్న సమావేశానికీ హాజరైన ఈ సూడో అడిషనల్ ఈఓ కథా కమామిషు ఇదీ..అంతటా ఆయనే..సీఎం కార్యాలయం నుంచి వచ్చే సిఫార్సు లేఖలతో పాటు, టీటీడీకి ప్రపంచం నలుమూలలు నుంచి వచ్చి దాతలిచ్చే విలువైన కానుక లపై ఈ సూడో ఏఈఓ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం. కొందరు అజ్ఞాత భక్తులు స్వామివారికి కానుకలిచ్చే సమయంలో తమ పేరు చెప్పడానికి సైతం ఇష్టపడరు. అలాంటి వాటిపై సూడో ఏఈఓ అవతారమెత్తిన లక్ష్మణ్కుమార్ ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు విద్యుత్ దీపాలంకరణ బాధ్యతను దాత సహాయంతో అంతా లక్ష్మణ్కుమారే నడిపించినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.ఆయన చూస్తేనే అదనపు ఈఓ సిఫారసు..తిరుమలలో అదనపు ఈఓ కార్యాలయంలో ఏ పని జరగాలన్న లక్ష్మణ్కుమార్ కనుసన్నల్లోనే జరగాలని.. ఆ తర్వాతే ఏఈఓ వెంకయ్యచౌదరి సంతకాలు చేస్తారని టీటీడీ ఉద్యోగులు చెబుతున్నారు. అసలు ఏ అర్హతతో ఈయన్ను ఏఈఓ కార్యాలయంలో ప్రత్యేక చాంబర్ ఏర్పాటుచేయాల్సి వచ్చింది? స్పెషల్ టైప్–05 నెంబర్ గెస్ట్హౌస్ను ఆయనకు ఎందుకు నివాసంగా ఏర్పాటుచేశారని వారు చర్చించుకుంటున్నారు. పైగా.. ఈయన ఏఈఓ కార్యాలయంలోనే అపవిత్ర కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తామేంచేసినా చెల్లుబాటవుతుందనేలా వీరు రాజ్యాంగేతర శక్తులుగా అవతరిస్తున్నారు. వ్యవస్థల్ని శాసిస్తూ, దోచుకునేందుకు తిరుమల కొండపై తిష్టవేశారని ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక తిరుమలను ప్రక్షాళన చేస్తానంటూ ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబునాయుడు.. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్ట డమే ప్రక్షాళనా అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అదనపు ఈఓకు అనుభవంలేకపోవడంతో..నిజానికి.. టీటీడీ అదనపు ఈఓగా ఉన్న వెంకయ్యచౌదరికి పాలనా అనుభవంలేకపోవడం, నిత్యం కార్యాలయ పనులపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో లక్ష్మణ్కుమార్ సూడో అడిషనల్ ఈఓ చెలామణి అవుతున్నారు. అసలు కస్టమ్స్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తిని టీటీడీ అదనపు ఈఓగా ఎలా నియమిస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పైగా.. తిరుమలలో జేఈఓ కార్యాలయంలో పనిచేసేందుకు ఐఏఎస్ అధికారులు ఎవరూ లేన్నట్లు ఐఆర్ఎస్ అధికారిని అదనపు ఈఓగా తీసుకురావడం.. దీనికితోడు మరో సూడో అదనపు ఈఓకు పెత్తనం ఇవ్వడం పవిత్ర తిరుమల భ్రష్టుపట్టిపోవడానికి దారితీస్తోందని కార్యాలయ సిబ్బంది మండిపడుతున్నారు.తిరుమలను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే..టీటీడీకి సంబంధించిన ప్రతి విషయం ఎంతో గోప్యంగా, భద్రంగా ఉంటుంది. కానీ, చంద్రబాబు ఈ మొత్తం వ్యవస్థను తన చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకే లక్ష్మణ్కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన పరకామణి, పోటు, దాతలిచ్చే విరాళాలు, టీటీడీ ఈ– ఫైల్స్, టీటీడీ టెండర్లు తదితర వాటిపై పెత్తనం సాగిస్తున్నారు. రహస్య సమాచారం అంతా ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. అలాగే, సిఫార్సు లేఖలు కూడా ఎవరికివ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే విషయాలనూ ఆయనే చూసుకుంటున్నారు. ఈయన చూసి ఓకే చేసిన తర్వాతే టీటీడీ ఏఈఓ, ఈఓ నిర్ణయం తీసుకునేలా వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. ఇలా కీలక వ్యవహారాలన్నీ చంద్రబాబు ఓ ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో ఏ స్కాం జరిగినా బయటకు రాకుండా వ్యవస్థను ఏర్పరుచుకున్నారని టీటీడీ సిబ్బంది చర్చించుకుంటున్నారు. -
భార్యను వదిలేసి పరారీ..
బాన్సువాడ: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను రోడ్డు పక్కన వదిలేసి పారిపోయాడొక భర్త. తనకోసం భర్త వస్తాడని ఆ అభాగ్యురాలు ఆరు రోజులుగా నిరీక్షిస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. నిజామాబాద్ జిల్లా రుద్రూర్కు చెందిన లక్ష్మణ్ బిచ్కుందలో ఫాస్ట్ఫుడ్ సెంటర్లో కూలీగా పనిచేస్తున్నాడు. లక్ష్మణ్ భార్య జ్యోతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఈనెల 18న రాత్రి లక్ష్మణ్ తన భార్య జ్యోతిని తీసుకుని బాన్సువాడలోని సరస్వతి మందిరం సమీపానికి వచ్చాడు. అక్కడ ఉన్న ఇసుక డంప్పై ఆమెను పడుకోబెట్టి, తెల్లారి వస్తానని చెప్పి, మూడు నెలల బాబును మాత్రం తీసుకుని వెళ్లాడు. తెల్లారి వస్తానని చెప్పి వెళ్లినవాడు ఇప్పటికీ రాలేదు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి నడవలేని స్థితిలో ఉన్న జ్యోతి.. చలిలో ఇసుకపైనే గడుపుతోంది. అక్కడ ఉన్న స్థానికులు దీనిని గమనించి రోజూ అన్నం పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించేందుకు ప్రయతి్నంచామని, కానీ వైద్యులు చేర్చుకోలేదని తెలిపారు. మంగళవారం కొందరు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి జ్యోతిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. భర్త వచ్చి తనను తీసుకెళ్తాడని జ్యోతి ఆశతో ఇప్పటికీ ఎదురుచూస్తోంది. -
డబ్బుల కోసం తల్లిదండ్రుల హత్య
నర్సాపూర్: డబ్బుల కోసం తల్లిదండ్రులను హత్య చేశాడో కిరాతకుడు. వారు నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి చంపి.. అనంతరం మృతదేహాలను పెట్రోల్పోసి తగులబెట్టాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్లో చోటుచేసుకుంది. తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్కు చెందిన చాకలి కిష్టయ్య (75), నర్సమ్మ (70) దంపతులు. గ్రామంలో ఉన్న భూమిని అమ్మగా వచ్చిన డబ్బును పిల్లలకు సమానంగా ఇచ్చారు. తన వాటా కింద వచ్చిన రూ.4 లక్షలను చిన్న కుమారుడు లక్ష్మణ్ ఫైనాన్స్లో కారు రుణం కోసం చెల్లించాడు. అయినా రుణం తీరలేదు. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించేందుకు అతను పలుమార్లు తల్లిదండ్రులను డబ్బు కావాలని ఒత్తిడి చేయగా.. కొంత డబ్బు ఇచ్చారు. ఈ క్రమంలో గత నెలలో మళ్లీ డబ్బుల కోసం ఒత్తిడి చేయగా తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఎలాగైనా వారిని హతమార్చి వారి వద్ద ఉన్న బంగారు నగలు తీసుకోవాలన్న దురాశతో హత్యకు పథకం రచించాడు.గుమ్మడిదల మండలం బొంతపల్లిలో నివాసం ఉంటున్న లక్ష్మణ్.. గత నెల 17న సాదుల్లానగర్కు వెళ్లి తల్లిదండ్రులను మరుసటి రోజు తనతో పాటు కారులో తాను నివాసం ఉంటున్న బొంతపల్లికి తీసుకెళ్లాడు. మర్నాడు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను మరోసారి అడిగినా వారు నిరాకరించడంతో కోపంతో లక్ష్మణ్ అదేరోజు రాత్రి నిద్రిస్తున్న తల్లిదండ్రులను గొంతు నులిమి చంపాడు. తల్లి వద్ద ఉన్న 3 తులాల నగలు తీసుకున్నాడు. అనంతరం మృతదేహాలను కారులో తీసుకుని నర్సాపూర్ చెరువు వద్దకు తెచ్చి శవాలపై పెట్రోల్ పోసి తగలపెట్టి వెళ్లిపోయాడు. వాట్సాప్ గ్రూపుల్లో పోలీసుల ప్రచారం: గుర్తు తెలియని జంట శవాలు దొరికిన విషయాన్ని వాట్సాప్ గ్రూప్ల ద్వారా తమ సిబ్బంది ప్రచారం చేశారని డీఎస్పీ వెంకట్రెడ్డి చెప్పారు. రెండు శవాలు దొరికిన విషయం సాదుల్లానగర్ గ్రామస్తులకు తెలియడంతో వారు అనుమానంతో లక్ష్మణ్ను నిలదీయగా అసలు విషయం బయటకు వచి్చందని డీఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
ఫోన్ ట్యాపింగ్లో కీలక వ్యక్తుల అరెస్టు ఎప్పుడు: ఎంపీ లక్ష్మణ్
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేవరకు బీజేపీ పోరాటం చేస్తుందని, ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ సీబీఐకి అప్పగించాల్సిందేననన్నారు. ఫోన్ట్యాపింగ్ కేసులో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద శుక్రవారం జరిగిన ధర్నాలో లక్ష్మణ్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ మోసాన్ని గ్రహించి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మరోసారి ప్రజలు పట్టం కడ్తారు. తెలంగాణలో కాంగ్రెస్ కంటే అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తాం. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్నదాన్ని కక్కిస్తాం అన్నారు. కేసీఆర్ అవినీతి, కుంభకోణాల మీద రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని శాశ్వత పరుచుకునేందుకు నిఘా వ్యవస్థను కేసీఅర్ దుర్వినియోగం చేశారు. ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయడానికి, ప్రత్యర్ధులను దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారు. అరెస్ట్ అయిన వాళ్ళు వాంగ్మూలం ఇచ్చినా మిగిలిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. టెలికాం రెగ్యులేటరీ నిబంధనలకు భిన్నంగా, కేంద్రం అనుమతి లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది.తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని చెప్పుకున్న రేవంత్రెడ్డి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందా..? రేవంత్ రెడ్డికి ఏ మాత్రం పౌరుషం ఉన్నా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులను శిక్షించాలి. రేవంత్ రెడ్డి కుర్చీ కోసం అధిష్టానానికి లొంగిపోతారా స్పష్టం చేయాలి. బీజేపీ సీనియర్నేత బీఎల్ సంతోష్ మీద కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించడం కోసమే బీజేపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గం. బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడింది. బీఆర్ఎస్ నేతలను ఏ మాత్రం కాపాడినా రేవంత్ రెడ్డికి కూడా అదే గతిపడుతుంది’అని లక్ష్మణ్ హెచ్చరించారు. -
‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
టైటిల్ : కృష్ణమ్మనటీనటులు: సత్యదేవ్, మీసాల లక్ష్మణ్, నందగోపాల్, కృష్ణ తేజ రెడ్డి, అతిర, అర్చన అయ్యర్, రఘు కుంచె తదితరులునిర్మాత: కొమ్మలపాటి కృష్ణదర్శకత్వం: గోపాలకృష్ణసమర్పణ : కొరటాల శివసంగీతం: కాలభైరవవిడుదల తేది: మే 10, 2024‘కృష్ణమ్మ’కథేంటంటే..ఈ సినిమా కథంతా 2003-2015 మధ్యకాలంలో జరుగుతుంది. విజయవాడలోని వించిపేటకు చెందిన భద్ర(సత్యదేవ్), కోటి(మీసాల లక్ష్మణ్), శివ(కృష్ణ తేజరెడ్డి) అనే ముగ్గురు అనాధలు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్లుగా బతుకుతారు. ఓ కేసు విషయంలో చిన్నప్పుడే జైలుకెళ్లిన శివ..బయటకు వచ్చాక నేరాలు చేయడం తప్పని భావించి ప్రిటింగ్ ప్రెస్ పెట్టుకుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి దందా, చిన్న చిన్న నేరాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. వించిపేటలోనే హాస్టల్లో ఉంటూ ప్రింటింగ్ ప్రెస్లో పని చేస్తున్న మీనా(అతిర)తో శివ ప్రేమలో పడతాడు. మరోవైపు భద్ర అదే కాలనీలో ఉంటున్న పద్మ(అర్చన అయ్యర్)తో ప్రేమలో పడతాడు. అనాధ అయిన కారణంగా భద్ర ప్రేమను పద్మ తండ్రి ఒప్పుకోరు. మరోవైపు మీనా.. భద్రను సొంత అన్నయ్యలా భావిస్తుంది. మీనా రాకతో అనాధలైన ఈ ముగ్గురికి ఓ ఫ్యామిలీ దొరుకుతంది. భద్ర, కోటి నేరాలు చేయడం మానేసి ఆటో నడుపుకుంటారు. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో వీరికి అత్యవసరంగా మూడు లక్షల రూపాయలు కావాల్సి వస్తోంది. దానికి కోసం చివరగా ఓ నేరం చేద్దామనుకుంటారు. అయితే అనుకోకుండా ఈ ముగ్గురు పోలీసులకు పట్టుపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ ముగ్గురు చేసిన నేరం ఏంటి? వీరిపై నమోదైన కేసు ఏంటి? ఈ ముగ్గురిలో ఒకరు ఎలా చనిపోయారు? ఎవరు చంపారు? సీఐ పాండా వెంకట సుబుద్ది వీరిని నమ్మించి ఎలా మోసం చేశాడు? స్నేహితుడి కోల్పోయిన భద్ర.. తన పగను ఎలా తీర్చుకున్నాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రివెంజ్ డ్రామా సినిమాలు తెలుగు తెరకు కొత్తకాదు. చేయని నేరానికి హీరోకి శిక్ష పడడం.. బయటకు వచ్చాకా రివెంజ్ తీర్చుకోవడం.. ఈ కాన్సెప్ట్ బోలెడు సినిమాలు వచ్చాయి. కృష్ణమ్మ కథ కూడా ఇదే. ఈ రివేంజ్ డ్రామాకి స్నేహబంధం యాడ్ చేసి..డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపాల కృష్ణ. కానీ కథతో పాటు కథనం కూడా రొటీన్గా ఉండడంతో.. ఏదో పాత సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో వచ్చే ట్విస్టులు ముందే ఊహించొచ్చు. రా అండ్ రస్టిక్ పేరుతో హీరోకి గెడ్డం పెంచడం.. స్లమ్ ఏరియాల్లో జీవించడం.. స్మగ్లింగ్.. ఇవన్నీ గత సినిమాల్లో చూసినట్లుగానే అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్లో అసలు కథే ఉండదు. హీరో, అతని స్నేహితుల పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకే సమయంలో ఇద్దరి ప్రేమకథలు చూపించారు. శివ పాత్ర లవ్స్టోరీ కాస్త ఆసక్తికరంగా అనిపించినా.. భద్ర లవ్స్టోరీ మాత్రం కథకి అతికినట్లుగా అనిపిస్తుంది. ఏదో హీరో అన్నాక.. హీరోయిన్ ఉండాలి.. ఓ లవ్స్టోరీ ఉండాలి అని పద్మ పాత్రను క్రియేట్ చేసినట్లుగా ఉంటుంది. ఆ పాత్రకి సరైన ముగింపు కూడా లేకపోవడం గమనార్హం. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకుంటే బాగుండేది. సెకండాఫ్లో కథంతా సీరియస్ మూడ్లో కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఈ ముగ్గురిపై పెట్టిన దొంగ కేసు ఏంటి అనేది తెలిసిన తర్వాత కథపై ఆసక్తి సన్నగిల్లుతుంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా తెలిసిపోతుంది. స్నేహితుడిని చంపినందుకు హీరో తీర్చుకునే రివెంజ్ కూడా సినిమాటిక్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సత్యదేవ్ మంచి నటుడే అందులో నో డౌట్. కానీ ప్రతి సినిమాకు ఒకే లెవల్ ఎక్స్ప్రెషన్స్.. డైలాగ్ డెలివరీ కూడా ఒకేలా ఉండడంతో ఆయన నటనలో కొత్తదనం కనిపించడం లేదు. ఈ చిత్రంలో కాస్త డిఫరెంట్గా ట్రై చేశాడు. కానీ అది పూర్తిగా వర్కౌట్ కాలేదు. విజయవాడ స్లాంగ్లో మాట్లాడానికి ట్రై చేశాడు కానీ తెరపై కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. యాక్షన్ సీన్స్లో పర్వాలేదు. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. నడి రోడ్డుపై స్నేహితుడు చనిపోయినప్పుడు సత్యదేవ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అలా గుర్తిండిపోతుంది. ఇక హీరో స్నేహితులు కోటిగా మీసాల లక్ష్మణ్, శివగా కృష్ణతేజ చక్కగా నటించారు. హీరోయిన్గా నటించిన అతిరా రాజ్కి ఇది తొలి సినిమా అయినా.. తెరపై చాలా సహజంగా నటించింది. అర్చన అయ్యర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే నటించింది. నందగోపాల్, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ పాటలు గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ.. బీజీఎం ఓకే. ఎడిటింగ్ ఇంకా షార్ప్గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాత విలువలు బాగున్నాయి. -
కవలలకు కన్నీటి ‘పరీక్ష’
పెగడపల్లి(ధర్మపురి)/నిజామాబాద్ రూరల్: ఒకవైపు పదో తరగతి పరీక్ష.. మరో వైపు కన్నతండ్రి మరణం.. పుట్టెడు దుఃఖంలోనూ కవల బిడ్డలు పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన గాజె చంద్రయ్య–లక్ష్మి దంపతులకు మొదటి సంతానంలో కూతురు జన్మించింది. రెండో సంతానంగా ఇద్దరు కవలలు రామ్, లక్ష్మణ్ జన్మించారు. వీరు స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరి తండ్రి చంద్రయ్య నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో పురుగు మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కాగా, మృతుని కుమారులు మంగళవారం పదో తరగతి హిందీ పరీక్షకు హాజరు కావలసి ఉంది. చదువుకు ఆటంకం కలగొద్దని బంధువులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి రామ్, లక్ష్మణ్లను పెగడపల్లి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పుట్టెడు దుఃఖంతోనే కవల సోదరులు పరీక్ష రాశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. విషాదాన్ని దిగమింగి.. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం కేశాపూర్ గ్రామానికి శ్రీనివాస్రెడ్డి సోమవారం బైక్ అదుపుతప్పి తాళ్ల కొత్తపేట్, మల్లారం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు ధనుష్ తీవ్ర దుఃఖంతోనే మంగళవారం శివాజీనగర్లోని శ్రీనూతన వైశ్య ఉన్నత పాఠశాలలో హిందీ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
ఎన్నికల ముందే కాంగ్రెస్ కాడి ఎత్తేసింది : ఎంపీ లక్ష్మణ్
-
బీఆర్ఎస్తో పొత్తు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెరదించారు. ఢిల్లీలో ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి ఎలాంటి పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కాళ్ల బేరానికి వచ్చినా ఆ పార్టీతో పొత్తు ఉండదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను పార్లమెంటరీ బోర్డు సభ్యుని హోదాలో చెబుతున్నానన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్లో ఉన్నారని లక్ష్మణ్ తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య ఒప్పందం చేసుకున్నాయన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కవిత కేసులో విచారణ జరుగుతోందన్నారు. ఆంధ్రలో పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 17 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది : కిషన్రెడ్డి రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ విజయసంకల్ప యాత్రలు మంగళవారం నుంచి ప్రారంభమవనున్న సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. యాత్ర రథాలను స్వయంగా నడిపారు. అనంతరం మాట్లాడుతూ ‘రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తాం. 20 నుంచి మార్చి 2 వరకు విజయ సంకల్ప యాత్రలు జరుగుతాయి. సమిష్టి నాయకత్వంలో, పార్టీ జెండా కింద యాత్రలు కొనసాగుతాయి. యాత్రల్లో భాగంగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు ఉంటాయి. అన్ని సామాజిక వర్గాలను కలుస్తాం. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో సైతం బీజేపీ గెలవడం ఖాయం’ అని చెప్పారు. ఇదీ చదవండి.. ఆ ఎంపీ స్థానం నుంచే పోటీ.. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు -
నీ ముఖానికి నువ్వు హీరో ఏంటి..?
-
దుబాయి నుంచి వచ్చి.. భార్య ప్రియుడిపై.. పక్కా ప్లాన్తో రాత్రికి రాత్రే..
కరీంనగర్: భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని తెలుసుకున్న భర్త దుబాయి నుంచి వచ్చి యువకుడిని హత్య చేశాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలో సంచలనం సృష్టించింది. గ్రామస్తులు, చందుర్తి సీఐ కిరణ్కుమార్ తెలిపిన వివరాలు. మల్యాలకు చెందిన పడిగెల నరేశ్(27) అదే గ్రామానికి చెందిన వివాహిత(32)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన వివాహిత బావ కుమారుడు లక్ష్మణ్ దుబాయ్లో ఉంటున్న ఆమె భర్త మల్లేశంకు తెలిపాడు. ఈనెల 3వ తేదీన గల్ఫ్ నుంచి వచ్చిన మల్లేశం ఇంటికిరాకుండా ఎక్కడో తలదాచుకున్నాడు. నరేశ్ను చంపేందుకు అదును కోసం ఎదురుచూస్తున్నాడు. బుధవారం రాత్రి నరేశ్ సదరు వివాహిత ఇంట్లోకి వెళ్లడం గమనించిన బావ కొడుకు లక్ష్మణ్ ఆమె భర్త మల్లేశంకు సమాచారం అందించాడు. మల్లేశం మాస్కులు ధరించి బైక్పై ఇంటికి చేరుకుని.. భార్యతో ఇంట్లో ఉన్న యువకుడిపై కత్తితో దాడి చేశాడు. మంచం పై నుంచి కింద పడ్డ నరేశ్పై పదే..పదే కత్తితో దాడి చేయగా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే హత్యకు పాల్పడ్డ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య విషయం తెలుసుకున్న చందుర్తి సీఐ కిరణ్కుమార, పలువురు ఎస్సైలు బుధవారం అర్ధరాత్రి ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. మల్లేశం కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. హత్య జరిగేందుకు మరో నలుగురు సహకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి సీఐ కిరణ్కుమార్ వివరించారు. సాయంత్రం విందు.. అర్ధరాత్రి హత్య.. పడిగెల నరేశ్కు అదే గ్రామానికి చెందిన వివాహితతో ఐదేళ్ల క్రితమే వివాహేతర సంబంధం ఏర్పడింది. అదే సమయంలో వివాహిత కుటుంబ సభ్యులకు, యువకుడి మధ్య గొడవలు జరుగడంతో నరేశ్ దుబాయి వెళ్లాడు. అక్కడే ఐదేళ్లపాటు ఉన్నాడు. గత ఆగస్టు 29న ఇంటికొచ్చిన నరేశ్ తిరిగి సదరు వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇది గమనించిన వివాహిత భర్త అన్నలతోపాటు వారి కుమారుడు ఈ విషయాన్ని గల్ఫ్లో ఉంటున్న మల్లేశంకు తెలిపారు. ఈనెల 3న దుబాయి నుంచి ఇండియా వచ్చిన మల్లేశం బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం వివాహిత కుటుంబ సభ్యులు బుధవారం యువకుడి ఇంట్లోనే విందు చేసుకున్నారు. తర్వాత యథావిధిగా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. బంధువుల ఇంట్లో తలదాచుకున్న మల్లేశంను అదే సమయంలో స్వగ్రామానికి పిలిపించుకున్నారు. ఇది తెలియని యువకుడు రాత్రి అందరూ పడుకున్న సమయంలో వివాహిత వద్దకు వెళ్లాడు. గమనించిన లక్ష్మణ్ తన చిన్నాన్న మల్లేశంకు ఫోన్ చేయడంతో బైక్పై వచ్చి యువకుడిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. అనుమానితులను విచారిస్తున్న పోలీసులు.. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మల్లేశం పరారీకాగా.. అనుమానం ఉన్న ముగ్గురితోపాటు వివాహితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు సహకరించిన వారి వివరాలను కాల్డాటా ఆధారంగా సేకరిస్తున్నట్లు సమాచారం. వారం క్రితమే హత్యకు పథకం రచించినట్లు తెలిసింది. పోలీసుల లుక్ఔట్ నోటీసు.. యువకుని హత్యలో ప్రధాన నిందితునిగా భావిస్తున్న మల్లేశ దుబాయి నుంచి ఈనెల 3న ఇండియాకు వచ్చాడు. హత్య చేసేందుకు ముందుగానే తిరిగి దుబాయి వెళ్లేందుకు సిద్ధమై.. రాత్రి 11 గంటల ప్రాంతంలో హత్యచేసి ఎయిర్పోర్టుకు అదే రాత్రి వెళ్లిపోయాడన్న ప్రచారంతో పోలీసులు లుక్ఔట్ నోటీస్ జారీ చేసినట్లు తెలిసింది. -
చిత్తూరు కుర్రాడితో శ్రీలంక యువతి ఫేస్బుక్ ప్రేమ.. విమానమెక్కి..!
వి.కోట(చిత్తూరు జిల్లా): ఫేస్బుక్లో పరిచయమైన శ్రీలంకకు చెందిన ఓ యువతిని చిత్తూరు జిల్లా యువకుడు ప్రేమ వివాహం చేసుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచి్చంది. వివరాల్లోకి వెళితే... వి.కోట మండలంలోని ఆరిమాకులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్కు ఆరేళ్ల కిందట ఫేస్బుక్లో శ్రీలంక దేశం కొలంబోలోని బొలగుండుకు చెందిన విఘ్నేశ్వరితో పరిచయమైంది. వీరి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలో విఘ్నేశ్వరి ఈ నెల 8వ తేదీ టూరిస్ట్ వీసా తీసుకుని ఇండియా వచ్చింది. ఈ నెల 20వ తేదీ లక్ష్మణ్, విఘ్నేశ్వరి వి.కోటలోని సాయిబాబా మందిరంలో వివాహం చేసుకున్నారు. ఆరిమాకులపల్లి గ్రామంలోని లక్ష్మణ్ ఇంట్లో ఉంటున్నారు. విఘ్నేశ్వరి టూరిస్ట్ వీసా గడువు ఆగస్టు 6వ తేదీతో ముగియనుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న వి.కోట పోలీసులు లక్ష్మణ్, విఘ్వేశ్వరిలను చిత్తూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించినట్లు తెలిసింది. -
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
తెలంగాణ నుంచి మరొకరికి కేంద్రమంత్రి పదవి..?
-
తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
-
కేసీఆర్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్
-
కేసీఆర్ శైలి తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఉంది: లక్ష్మణ్
-
RSS చీఫ్ ను విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదు : ఎంపీ లక్ష్మణ్
-
నాకు పదవి ఇవ్వాల్సిందే..
పంజగుట్ట(హైదరాబాద్): ‘టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నా.. రూ.కోట్లు పార్టీ అభివృద్ధికి ఖర్చు చేశా.. కానీ ఇప్పటివరకు ఏ నాయకుడు నన్ను గుర్తించలేదు.. ఏ పదవీ ఇయ్యలేదు.. వెంటనే నాకు ఏదో ఓ పదవి ఇవ్వాలి’అని కోరుతూ టీఆర్ఎస్ నాయకుడు ఒకరు సోమవారం ప్రగతిభవన్ ముందు ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకుని అతన్ని స్టేషన్కు తరలించారు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా నాగపురం గ్రామానికి చెందిన లక్ష్మణ్ ముదిరాజ్ 2001 నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్నారు. పార్టీ అభివృద్ధి కోసం రూ.కోట్లు ఖర్చు చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు. కానీ, పార్టీ నుంచి తనకు ఎలాంటి లబ్ధి చేకూరకపోగా ప్రస్తుతం నిరుద్యోగిగా మిగిలిపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో సోమవారం మధ్యాహ్నం 12:15గం.కు ప్రగతిభవన్ ముందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న డీజిల్ ఒంటిపై పోసుకున్నారు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు గుర్తించి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. స్టేషన్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించి సాయంత్రం వరకు దీక్ష చేయడంతో పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి విడుదల చేశారు. -
హారర్ కథా చిత్రం
రుషి లక్ష్మణ్, ఉమేశ్, సాయికుమార్, జాకీష్రాఫ్, షీనారాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సినిమా కథా చిత్రం’. రామ్ఫిలిమ్స్ పతాకంపై మదన్ మోహన్ నాయుడు, జి.తిమ్మారెడ్డి గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి రామ్ మధుసూదన్ దర్శకుడు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టి.రామసత్యనారాయణ, సాయివెంకట్, మోహన్ గౌడ్లు పాల్గొన్నారు. రామ్ మధుసూదన్ మాట్లాడుతూ– ‘‘గతంలో నేను తెరకెక్కించిన ‘వంశం’ చిత్రానికి 13 అవార్డులు వచ్చాయి. లేటెస్ట్గా రుషిని హీరోగా పరిచయం చేస్తూ ‘సినిమా కథా చిత్రం’ చేశాను. హారర్ కథతో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. -
నిర్మాత లక్ష్మణ్ కుమారుడి నిశ్చితార్థ వేడుక
-
నిశ్చితార్థ వేడుకలో ప్రభాస్, విజయ్ల సందడి
ప్రముఖ నిర్మాత లక్ష్మణ్ కుమారుడు ఉజ్వల్ నిశ్చితార్థ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకల్లో రెబల్ స్టార్ ప్రభాస్, విజయ్ దేవరకొండ సందడి చేశారు. వైట్ షర్ట్, కళ్లజోడుతో వచ్చిన ప్రభాస్ నవ్వుతూ అందరిని పలకరించాడు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సూపర్స్టార్ మహేష్ బాబు సతీమణీ నమ్రత తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మె: తీవ్ర ఉద్రిక్తత, లక్ష్మణ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో శనివారం బీజేపీ బస్ భవన్ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు బస్ భవన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ని, ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డిని అరెస్ట్ చేశారు. దాంతో ఓ ఆర్టీసీ కార్మికుడు చెట్టు ఎక్కి నిరసన తెలిపాడు. ధర్నా నేపథ్యంలో బస్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్థంభించడంతో జనాలు ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే.. ప్రగతి భవన్ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇన్ని రోజులుగా కార్మికుల సమస్యలు పరిష్కరించని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి.. వారికి న్యాయం జరిగేవరకు అండగా ఉంటుందని తెలిపారు. కార్మికుల సమస్యలపై స్పందించకపోతే.. కేసీఆర్ పాలనను స్తంభింపచేస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు. -
ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు బీజేపీ మద్దతు
-
కాంగ్రెస్లో జోష్ లేదు.. బీజేపీలో హోష్ లేదు
సాక్షి, హైదరాబాద్: ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’అని చెప్పే ప్రధాని తెలంగాణకు మొండిచేయి (హాథ్) ఇచ్చారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బుధవారం కంటోన్మెంట్ ఏరియాలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశానికి హాజరై ప్రసంగించారు. తెలంగాణలో రూ.80వేల కోట్లతో చేపడుతున్న కాళేశ్వరం, లేదా రూ.40వేల కోట్లతో చేపడుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకాల్లో ఏదైనా ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తి చేసినా స్పందించలేదన్నారు. పన్నుల్లో రాష్ట్ర వాటా మినహా కేంద్రం రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో 2019లో కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వాన్ని నిర్ణయించే స్థాయిలో మనముంటే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని కూటమి 70 నుంచి 100 ఎంపీ సీట్లు సాధించి దేశంలో కీలకం కాబోతుందన్నారు. దీంతో ఢిల్లీలో ఏర్పడబోయే ప్రభుత్వాన్ని మనమే నిర్ణయిస్తామన్నారు. అఖిలేష్ సహా పలు ప్రాంతీయ పార్టీ ల నేతలు కేసీఆర్తో టచ్లో ఉన్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు అవసరమైన రక్షణ, రైల్వే భూములు కావాలని ఏళ్ల తర బడి అడుగుతున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. ప్యాట్నీ–తూముకుంట, ప్యారడైజ్–సుచిత్ర మార్గాల్లో ఫ్లై ఓవర్ల కోసం 100 ఎకరాల రక్షణ భూములకు బదులుగా 500 ఎకరాలు ఇస్తా మని చెప్పినా బదలాయించడం లేదన్నారు. గాంధీభవన్లో అటెండర్లే మిగులుతారు టీఆర్ఎస్లోకి వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసలు చూస్తుంటే.. గాంధీభవన్లో అటెండ ర్లే మిగిలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తన నియోజకవర్గం పరిధిలో 20వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలం ఉందని, ఆ మేరకు సీఎం సహకారంతో త్వరలోనే నిర్మాణం చేపడతామన్నారు. ‘సీఎం హమారా.. పీఎం హమారా’అన్న నినాదంతో కేంద్రంలో టీఆర్ఎస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కేసీఆర్ కడుపున పులిబిడ్డ కేటీఆర్ పుడితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కడుపున పప్పు పుట్టాడన్నారు. విజన్ ఉన్న నేత కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తామంతా గర్వపడుతున్నామన్నారు. భారీ మెజారిటీతో సికింద్రాబాద్ ఎంపీని గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామన్నారు. సభలో హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ ప్రభాకర్, టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేశవరావులు ప్రసంగించారు. మేయర్ బొంతు రామ్మోహన్ సహా పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. రాహుల్, మోదీ తప్పితే నేతలు లేరా? పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే సాగుతున్నాయి అన్నట్లుగా ఆయా పార్టీల నేతలు పదే పదే చెబుతున్నారని.. దేశంలో రాహుల్, మోదీ తప్పితే నేతలే లేరా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల మధ్య పోటీ బోఫోర్స్, రఫేల్గా మారిందన్నారు. కాం గ్రెస్లో జోష్ లేదని, బీజేపీలో హోష్ లేదని ఎద్దేవా చేశా రు. 71 ఏళ్లలో ఒకట్రెండు ఏళ్లు మినహా ఈ 2 పార్టీలే దేశాన్ని ఏలాయని, అయినా నేటికీ చాలా గ్రా మా లు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయన్నారు. లచ్చన్న సవాలు హాస్యాస్పదం బీజేపీ అధ్యక్షుడు లచ్చన్న (లక్ష్మణ్) మరోసారి తనపై సవాలు విసురుతుండటం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ అన్నారు. బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇలాంటి సవాలే విసిరి అభాసు పాలయ్యారని అన్నారు. అప్పట్లో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ముషీరాబాద్, అంబర్పేట, గోషామహల్, ఉప్పల్, ఖైరతాబాద్ స్థానాల్లోనూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు గెలిచారన్నారు. ముషీరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్కు వచ్చిన మెజారిటీ ఓట్లు కూడా లక్ష్మణ్కు రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని కేటీఆర్ అన్నారు. తెలంగాణ నుంచి కేవలం దత్తాత్రేయకు మాత్రమే కేంద్ర కేబినెట్లో స్థానం దక్కగా, ఏడాదిలోనే అవమానకర రీతిలో ఆయనను పదవి నుంచి తొలగించారని అన్నారు. -
సుగుణాకర్రావుకు బీజేపీ బీఫాం
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది పి.సుగుణాకర్రావును పార్టీ తరపున పోటీలో నిలపాలని నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆయనకు బీఫాం కూడా అందజేసినట్లు ఆయ న వెల్లడించారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పట్ల, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి బలమైన అభ్యర్థి సుగుణాకర్రావుతో పోటీ చేయిస్తున్నామన్నారు. విద్యావంతులు తమ మొదటి ప్రాధాన్య ఓటును సుగుణాకర్రావుకు వేసి గెలిపించాలని కోరారు. స్వతంత్రులుగా రణజిత్ మోహన్, రవి! బీజేపీ రాష్ట్ర నాయక త్వం మొదటి నుంచీ సుగుణాకర్రావును పోటీలో నిలపా లని శ్రద్ధ చూపుతున్న నేప థ్యంలో పార్టీనే నమ్ముకుని, ఉద్యోగాన్ని వదులుకుని పనిచేస్తున్న తనకు పార్టీ మద్దతు ఇవ్వాలని రణజిత్ మోహన్ పట్టుబట్టారు. ఎడ్ల రవి కూడా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ వర్గాలను కోరారు. రణజిత్మోహన్ ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు కోసం పార్టీ వర్గాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నించారు. కానీ పార్టీ గురు వారం బీఫాంను సుగుణాకర్రావుకు ఇవ్వడం తో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రణజిత్మోహన్ ప్రకటించారు. మరోవైపు ఎడ్ల రవి కూడా బరిలో నిలిచే అవకాశముంది. -
‘టీటీడీ అక్రమాలపై విచారణ జరిపించాలి’
సాక్షి, హైదరాబాద్ : పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్ర - తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీటీడీలో అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని తెలిపారు. వీటి వెనక రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపించారు. గత నెల టీటీడీలో టికెట్ల కుంభకోణం వెలుగు చూసినప్పటికి ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్ను ఆదేశించాల్సిందిగా గవర్నర్ను కోరామని మంత్రి దత్తాత్రేయ తెలిపారు. ఈవోకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాల వల్ల భక్తులకు తిరుమల దేవస్థానం పట్ల నమ్మకం సన్నగిల్లుతుందనిదత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తిరుమలలో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై తాను చర్యలు తీసుకున్నట్లు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వెలుగు చూసిన టికెట్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఈ నెల 15న తెలంగాణలో అమిత్షా పర్యటన
-
కేటీఆర్ ఛాలెంజ్ను స్వీకరించిన సచిన్,లక్ష్మణ్
-
యూపీలో బీజేపీ మరో ఎత్తుగడ
లక్నో : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నలు ముమ్మరం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లక్ష్మణుడు విగ్రహం ఏర్పాటు చేయాలని యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలు రామకృష్ణ యాదవ్, రజ్నీష్ గుప్తాలు లక్నోలో లక్ష్మణుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. లక్నోలోని చారిత్రాత్మక తేలి వాలీ మసీద్కు ఎదురుగా విగ్రహ నిర్మాణం జరగాలని కోరారు. దీనిపై ముస్లిం సామాజిక వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మసీద్కు ఎదురుగా లక్ష్మణుడి విగ్రహం నిర్మిస్తే రాష్ట్రంలో మత కల్లోలాలు సంభవించే అవకాశం ఉందని, తాము ప్రశాంతంగా నమాజ్ కూడా చేసుకోలేమని మసీద్ ఇమామ్ మోలానా ఫజీల్ అన్నారు. విగ్రహ ఏర్పాటు సంబంధించి పూర్తి వివరాలను రానున్న అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. యూపీలో రామ్-లక్ష్మణులకు ఘనమైన చరిత్ర ఉందని, అది భవిష్యత్తు తరాలకు గుర్తుండే విధంగా భారీ విగ్రహన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. లక్నో పేరును లక్ష్మణ్పురిగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరినట్లు రామకృష్ణ యాదవ్ వెల్లడించారు. -
కౌలు రైతుకు రూ.3వేల పింఛన్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను విస్మరిస్తోందని.. వచ్చే ఎన్నికల్లో తాము గెలిచి అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రూ.3వేల పింఛన్ అందజేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రకటించారు. అలాగే రూ.2లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేయడంతో పాటు ప్రతీ ఏటా వడ్డీలను కూడా ప్రభుత్వమే చెల్లిం చేలా చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్యయాత్ర బుధవారం మహబూబ్నగర్ జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేటల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో లక్ష్మణ్ ప్రసంగించారు. మహిళలకు అవమానం బతుకమ్మ చీరల పేరిట సీఎం కేసీఆర్ నాసిరకం చీరలు పంపిణీ చేసి తెలంగాణ మహిళలను అవమానపరిచారని లక్ష్మణ్ విమర్శించారు. బతుకమ్మ చీరల పంపిణీకి సంబం ధించి దాదాపు రూ.200 కోట్ల అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులు ఉన్నా.. ఇక్కడి వారికి పని కల్పించకుండా సూరత్లో చీరలను కొనుగోలు చేశారన్నారు. తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటామని వెల్లడించారు. టీఆర్ఎస్లో బీసీలకు స్థానం లేదు.. కుటుంబ పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ అనే లిమిటెడ్ కంపెనీలో బీసీలకు స్థానం లేదని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో కొడుకు, కూతురు, అల్లుడు తప్ప మరెవరి మాటా చెల్లుబాటు కాదన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్నేత డి.శ్రీనివాస్ను కూడా పార్టీలో నుంచి సాగనంపే కార్యక్రమం చేపట్టారన్నారు. గతంలో ఆలె నరేంద్ర, విజయశాంతి, ప్రొఫెసర్ జయశంకర్ తదితరులను కూడా కేసీఆర్ కరివేపాకులా వాడుకుని వదిలేశారని ఆరోపించారు. 60 ఏళ్లు కాంగ్రెస్కు, ఐదేళ్లు టీఆర్ఎస్కు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలు.. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వా లని కోరారు. బీజేపీకి అవకాశం ఇస్తే సమన్యాయం చేయడంతో పాటు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. ఈ సభల్లో ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నేతలు నాగూరాం నామాజీ, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ను జనం గద్దెదింపుతారు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఇదే పంథాలో టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పలుకుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోతున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో చూసిన ప్రజలు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్ ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశంలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి లక్ష్మణ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న అన్ని వర్గాల ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రతిష్టను పెంచుతున్న మోదీ విధానాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నా రు. కార్యక్రమంలో పార్టీ మీడియా సెల్ కన్వీనర్ సుధాకరశర్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్ట్ లక్ష్మణ్కు జర్నలిస్టు సంఘాల నివాళి
-
ప్రకంపనలు..మీ పార్టీలో రాకుండా చూసుకోండి!
సాక్షి, మేడ్చల్ జిల్లా: భూప్రకంపనలు ఢిల్లీలో కాదు, ముందు మీ పార్టీలో రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్లో అంతర్యుద్ధ్దం కొనసాగుతోందని, అది ఎప్పుడు భగ్గుమంటుందో తెలియనిస్థితిలో ఆ పార్టీ ఉందని అన్నారు. ప్రజాసమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట డ్రామాలాడుతున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బీజేపీ ఫోబియా పట్టుకుందని అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్లో నిర్వహించిన గ్రామ స్వరాజ్ అభియాన్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కుటుంబపాలన సాగించే ప్రాంతీయపార్టీలతో ఫెడరల్ఫ్రంట్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలు, హామీలు నిలబెట్టుకోలేని సీఎం దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు ఎలా తెస్తారని ప్రశ్నించారు.ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశ రాజకీయాలను ఫ్యామిలీఫ్రంట్తో భ్రష్టు పట్టిస్తారని విమర్శించారు. దళితున్ని సీఎం చేస్తానని విస్మరించిన, మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించని ముఖ్యమంత్రి దేశ రాజకీయాలను ఎలా ఉద్ధరిస్తారని నిలదీశారు. ఫెడరల్ ప్రంట్తో ఢిల్లీని గడగడలాడిస్తానని కేసీఆర్ చెప్పుకుంటున్నారని, మరి ప్లీనరీకి దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీ నాయకులూ హాజరుకాకపోవడడంపై ఏమంటారో చెప్పాలన్నారు. జూన్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బస్సుయాత్ర అవినీతి రహితంగా మోదీ ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి జూన్లో బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగనున్న బస్సుయాత్ర విజయవంతానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్ అభియాన్ పేరుతో దళితవాడల్లో బస, సహపంక్తి భోజనాలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవటంతో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయకపోవటంతో నిరుద్యోగ యువత ఆవేదన చెందుతున్నారన్నారు. లంచం లేకుండా ఏ కార్యాలయంలోనూ పనులు కావటం లేదన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్రెడ్డి, కిసాన్మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లాల తిరుమల్రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు కప్పర ప్రసాద్రావు, కంభం లక్ష్మారెడ్డి, అమరం మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుణాత్మక మార్పంటే గడీల పాలనా?
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటున్న కేసీఆర్, తెలంగాణలో తాను అనుసరిస్తున్న గడీల పాలనను దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. సంతలో పశువులను కొన్నట్టు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొన్న కేసీఆర్, అదే తరహా రాజకీయం జాతీయస్థాయిలో అవసరమని భావిస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. మాటమీద నిలబడే నేత అవసరమని చెప్తున్న ఆయన, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని.. తాను పీఠమెక్కిన తీరుకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఆదివారం లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు మెచ్చిన పాలననందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రాభవం పెరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్, అసహనానికి గురై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన ప్రతిపాదిస్తున్న టెంట్ లేని ఫ్రంట్లను జనం పట్టించుకోరని, గతంలో నేషనల్ ఫ్రంట్, థర్డ్ఫ్రంట్ అంటూ ఎన్నో వచ్చి.. గల్లంతైన విషయాన్ని మరచినట్టున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఈశాన్య భారతంలో విజయదుందుభి మోగించినట్టుగానే త్వరలో కర్ణాటకలో ఆ తర్వాత తెలంగాణలో కూడా బీజేపీ గెలుస్తుందని, దీన్ని ఊహించే కేసీఆర్ దిక్కుతోచని స్థితిలో మాట్లాడతున్నారని అన్నారు. మజ్లిస్ ప్రాపకం కోసమే కేసీఆర్ మోదీపై విమర్శలు చేస్తున్నారన్నారు. -
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు
-
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ
జహీరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మంగళవారం ఓబీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు. ఇక్కడి నుంచే ప్రజా సదస్సులకు శ్రీకారం చుడుతున్నామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. ఉద్యమాలు, ఆత్మ బలిదానాలతో వచ్చిన రాష్ట్రంలో తమ సమస్యలు తీరుతాయని భావించిన ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. 1.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి మూడేళ్లలో కేవలం 16 వేలు మాత్రమే భర్తీ చేశారన్నారు. -
‘మేడారం’లో కాషాయ గుడారం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న కమలనాథులు మేడారం జాతరపై దృష్టి పెట్టారు. కోట్లలో జనం తరలివచ్చే ఈ గిరిజన కుంభమేళాను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే జాతరకు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే గిరిజనులతోపాటు గ్రామాల పురోగతికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న కృషిని వివరించే స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, కిరెణ్ రిజిజు, జుయల్ ఓరం సహా పది మంది కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గిరిజన జనాభా అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్సింగ్లను ఆహ్వానించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్తోపాటు మరికొందరు ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించబోతున్నారు. సాధారణంగా జాతరలు, ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను రాష్ట్ర ప్రభుత్వమే ఆహ్వానిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా కమలనాథులు పార్టీ తరఫున వారిని రప్పించేందుకు యత్నిస్తున్నారు. పథకాలను వివరించే స్టాళ్లు.. కేంద్ర ప్రభుత్వ పథకాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను అక్కడికి వచ్చే భక్తజనం దృష్టికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి కొన్ని స్టాళ్లను ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిడివి రెట్టింపు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం కొత్త రోడ్లు మంజూరు చేసింది. ఇది రాష్ట్రాభివృద్ధిలో కీలక భూమిక పోషించనున్నందున కేంద్ర ఉపరితల రవాణా శాఖ చేత ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయించనున్నారు. అలాగే గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య శాఖల స్టాళ్లను ఏర్పాటు చేయించాలని భావిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న గ్రామీణాభివృద్ధి పథకాలను వివరించనున్నారు. మహారాష్ట్రలో గిరిజన సంక్షేమం, గ్రామీణాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించే చట్టం ఏర్పాటుకు ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు ప్రత్యేక చొరవ చూపారని, దాన్ని వివరించే ఏర్పాటు కూడా చేయాలని నిర్ణయించారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపైనా అవగాహన కల్పించే స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కార్యకర్తలతో ప్రత్యేక శిబిరం బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆర్ఎస్ఎస్కు చేరువగా ఉండే వనవాసీ కల్యాణ్ పరిషత్ కార్యకర్తలు.. భక్తుల సేవలో ఉండేలా నియోగిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ దీనిపై పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబైలకు పార్టీ నేతలు ప్రేమేందర్రెడ్డి, చందా లింగయ్య ఇతర నేతలతో కలసి వెళ్లి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఫడ్నవీస్, గవర్నర్ విద్యాసాగరరావులతో భేటీ అయ్యారు. -
‘గల్ఫ్’ సమస్యలు పట్టని సర్కారు
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ బాధితుల కష్టాలు తీర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దుబాయి, బొగ్గుబాయి, ముంబై వలస లుండవని పేర్కొన్న కేసీఆర్.. ఇప్పుడా విషయాన్నే పట్టించు కోవడం లేదని ఆరోపించారు. మంగళవారం గవర్నర్ నరసింహన్ను రాజ్భవన్లో కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కేరళ, పంజాబ్ తరహాలో ఐఆర్ఐ పాలసీ తీసుకొస్తానన్న హామీని సీఎం విస్మరించారన్నారు. ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి అక్కడే మృతి చెందిన పేదలు, తిరిగి వచ్చిన తర్వాత మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్ష్మణ్ వెంట బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్, మీడియా కమిటీ కన్వీనర్ సుధాకర శర్మ, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి నర్సింహనాయుడు, పలువురు గల్ఫ్ బాధితులు ఉన్నారు. -
కాంగ్రెస్ ఓ కుటుంబ పార్టీ: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కేవలం ఓ కుటుంబ పార్టీగా మిగిలిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మంగళవారం వ్యాఖ్యానించారు. మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం బీజేపీ మోర్చా కన్వీనర్ రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో పలువురు మాజీ సైనికులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశ ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీకి అనుకూలంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్గాంధీ వారసత్వంగా అధ్యక్షుడు అయ్యాడన్నారు. దేశ సైనికులు పాకిస్తాన్తో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ ప్రతినిధులతో రహస్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశ రక్షణ, సమగ్రత కోసం బీజేపీ మాత్రమే కట్టుబడి ఉందన్నారు. -
బీసీలను మోసగిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ సీఎం కేసీఆర్ బీసీలను మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్లో శుక్రవారం జరిగిన ‘బీసీల మహా సంగ్రామ సదస్సు’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీల జనాభా 54 శాతమున్నా సీఎం కేసీఆర్ వారి గురించి ఎందుకు ఆలోచించడంలేదని ప్రశ్నించారు. ఐదేళ్లలో బీసీలకు రూ. 25 వేల కోట్లను ఖర్చు చేస్తామని హామీనిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పటివరకు రూ.15 వేలకోట్లు ఖర్చుచేయాల్సి ఉండగా రూ.3 వేల కోట్లు కూడా ఖర్చుచేయలేదన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చి, బీసీ–ఈ కేటగిరీలో చేర్చడం ద్వారా బీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాటం నర్సింహ్మ యాదవ్ అధ్యక్షత వహించిన సదస్సులో ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్వరలో తెలంగాణలో మోదీ పర్యటన: కె.లక్ష్మణ్ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు కె.లక్ష్మణ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ టీఆర్ఎస్తో కలుస్తుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని స్పష్టం చేశారు. గుజరాత్ ఎన్నికల తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 3 రోజులు రాష్ట్రంలో పర్యటిస్తారని లక్ష్మణ్ చెప్పారు. -
కేసీఆర్ పొగడ్తలు విడ్డూరంగా ఉన్నాయి: లక్ష్మణ్
కోరుట్ల/మెట్పల్లి: ‘తెలంగాణలో రజాకార్ల అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచిన నిజాం గొప్ప రాజట.. సీఎం కేసీఆర్ పొగడ్తలు విడ్డూ రంగా ఉన్నాయి.. తెలంగాణ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారు.. ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. మజ్లిస్ మద్దతు కోసం కేసీఆర్ నిజాంను పొగుడుతున్నారన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పాలన అవినీతితో నిండి పోయిందన్న విషయాన్ని ప్రజలు గమ నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ దేశంలో అవసాన దశలో ఉందన్నారు. రైతులు మద్దతు ధర అడిగినందుకు వారికి బేడీలు వేసిన ఘనత దేశంలో ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని లక్ష్మణ్ అన్నారు. మెట్పల్లిలో చెరకు రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. -
బీజేపీ అసెంబ్లీ ముట్టడి భగ్నం
హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ, ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం ఉదయం చలో అసెంబ్లీ కోసం బయలుదేరిన ప్రజాప్రతినిధులను బషీర్బాగ్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని నారాయణగూడ పీఎస్కు తరలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ప్రభాకరరావు, రాజాసింగ్లతో పాటు 86 మంది అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. సామరస్యంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. నయా నిజాం సీఎం కేసీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకోవడానికి శాంతియుత నిరసనలకు కూడా అవకాశం ఇవ్వకుండా నయా నిజాంలా సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ నేతలు సంకినేని వెంకటేశ్వర్రావు, చింతా సాంబమూర్తి, జి.ప్రేమేందర్రెడ్డితో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ డిమాండ్తో చలో అసెంబ్లీ చేపట్టిన బీజేపీ, యువమోర్చా కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మలను బుధవారం దహనం చేయాలని లక్ష్మణ్ పిలుపిచ్చారు. ఈ నెల 26న ‘నిరుద్యోగ గర్జన’ పేరిట బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు. -
ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం
సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో ప్రజారోగ్యం కుంటుపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ నిమ్స్ వద్ద జరిగిన ప్రజా పంచా యతీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన సీఎం కేసీఆర్ మాయమాటలతో గారడీ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అందుతున్న వైద్యంపై నమ్మకం లేకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్స్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కేంద్రం ఎయిమ్స్ను మంజూరు చేస్తే ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించలేదన్నారు. నిమ్స్ను షూటింగ్లకు ఇస్తూ ఆదాయ వనరుగా మార్చుకునే దుస్థితికి చేరిందని దుయ్యబట్టారు. గుజరాత్ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటిస్తారని లక్ష్మణ్ చెప్పారు. లక్ష్మణ్కు తప్పిన ప్రమాదం సభ జరుగుతుండగానే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో షామియానాలు, స్టేజీ పై కప్పు కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన నాయకులు తలో దిక్కు పరుగుతీశారు. అయితే కార్యకర్తలు లక్ష్మణ్ను సురక్షితంగా బయటికి తీసుకురావడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పోచంపల్లి మండలం ఇంద్రియాలకు చెందిన శ్రీనివాస్, మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
టీఆర్ఎస్ పతనానికి నాంది
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల ఆత్మహత్యలే ఆ పార్టీ పతనానికి నాంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేట, మేడ్చల్ జిల్లాలకు చెందిన పలువురు సర్పంచులు, టీఆర్ఎస్ నేతలు శుక్రవారం ఇక్కడ బీజేపీ లో చేరారు. లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యాలయానికి ‘టు లెట్’ బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి తొందర లోనే వస్తుందన్నారు. 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. అబద్ధాలు చెప్పడంలోనూ, ప్రజలను మోసగించడం లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు. ఉద్యమకారులపై దాడులు చేసినవారు, అవినీతి చరిత్ర ఉన్నవారు టీఆర్ఎస్లో చేరగానే పవిత్రులైపోయారా అని ప్రశ్నించారు. సచివాలయానికి రాకుం డా రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరేనన్నారు. తెలంగాణ ద్రోహులకు, ఉద్య మకారులపై దాడులకు తెగబడినవారికే ఇప్పుడు పదవులు ఇవ్వడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం తో రగిలిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో కంటే టీఆర్ఎస్ పాలనలో ఎక్కువ అవినీతి జరుగుతున్నదని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కనీస పర్యవేక్షణ లేదని ఈ సందర్భంగా లక్ష్మణ్ ఆరోపించారు. -
నిజాంలా వ్యవహరిస్తున్న సీఎం
సెప్టెంబర్ 17పై స్పష్టత ఇవ్వాలి: కె.లక్ష్మణ్ సాక్షి,సిద్దిపేట/జనగామ/సిరిసిల్ల: సీఎం కేసీఆర్ నిజాం నవాబులా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్ర విమోచన యాత్రలో భాగంగా సోమవారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కూటిగల్లు, బైరాన్పల్లి సాయుధ అమరవీరుల ధామం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం బైరాన్పల్లి సభలో మాట్లా డారు. బైరాన్పనల్లి అమరుల ధామాన్ని స్మృతివనంలా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, సాయుధ పోరాటం పాఠ్యాంశంగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని అంగీకరిస్తుందా? లేదా? అనే విషయమై టీఆర్ఎస్ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. మజ్లిస్తో పొత్తు పెట్టుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. యూపీఏ హయాంలో రాష్ట్రం నుంచి ముగ్గు రు కేంద్ర మంత్రులుగా ఉండి తెలంగాణకు చేసిందేమిటని పీసీసీ చీఫ్ ఉత్తమ్ను ప్రశ్నించారు. మోదీ ప్రధాని అయిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ మునిగిపోయిన నావ దేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాగా.. ప్రజల మద్దతు కోల్పోయిన కాంగ్రెస్ నావ నట్టేట మునిగిపోయిందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. సోమవారం జనగామ జిల్లాకు చేరిన విమోచనా యాత్రలో మాట్లాడుతూ దేశాన్ని పదేళ్లు పాలించిన యూపీఏ తెలంగాణకు చేసిందేమీలేదన్నారు. ప్రధాని మోదీని విమర్శించే నైతిక హక్కు ఉత్తమ్కు లేదన్నారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరిన యాత్రలో లక్ష్మణ్ మాట్లాడుతూ ఎంఐఎం పార్టీతో కలిసి టీఆర్ఎస్ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. -
సమైక్య పాలకులకు టీఆర్ఎస్కు తేడా లేదు
సెప్టెంబర్ 17ను ఘనంగా నిర్వహిస్తాం: లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: సమైక్య పాలకులకు టీఆర్ఎస్ పాలకులకు తేడా ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ‘నైజాం సర్కారోడ‘సినిమా బృందానికి ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, నైజాం ఏలుబడిలో మహిళలు, రైతులపై జరిగిన అరాచకాలు వెలుగులోకి రాకుండా పోయాయన్నారు. మహిళలపై జరిగిన అకృత్యాలు అన్నీ, ఇన్నీ కావన్నారు. భారతదేశానికి1947 ఆగస్టులోనే స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు రాలేదని, అప్పటికీ నిజాం ఉక్కు పిడికిలిలోనే తెలంగాణ నలిగిపోయిందని అన్నారు. దేశం నడిబొడ్డులో ఉన్న హైదరాబాద్ స్టేట్ను స్వతంత్ర ముస్లిం రాజ్యంగానో, పాకిస్తాన్లో కలిపేయడానికో నైజాం రాజు సిద్ధమైనాడన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని చాలామంది ఉద్యమకారులు ప్రాణాలను ఒడ్డి పోరాటం చేశారని వివరించారు. భారతదేశంలోనే విలీనం కావాలంటూ పోరాడిన షోయబుల్లాఖాన్, బందగీ, తుర్రెబాజ్ఖాన్ వంటి ముస్లింనేతలను కూడా నిజాం దారుణంగా చంపించాడని లక్ష్మణ్ చెప్పారు. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన సైనికచర్యతో హైదరాబాద్ స్టేట్ కూడా 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైందని వివరించారు. నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చిందన్నారు. దీనిని అధికారికంగా స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోకుండా అప్పటి సమైక్యపాలకులు కుట్రలు చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా వేడుకలు నిర్వహించుకుంటామని ఎన్నోసార్లు చెప్పిన అప్పటి ఉద్యమనేత కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా రజాకార్లు ఏర్పాటు చేసిన మజ్లిస్ చేతిలో పావుగా మారారని విమర్శించారు. సీఎం కేసీఆర్కు, సమైక్య పాలకులకు ఈ విషయంలో తేడా లేదన్నారు. మూడేళ్లుగా దీనికోసం పోరాటం చేస్తున్నామని, ఈ ఏడాది సెప్టెంబర్ 17న తామే ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావు, బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, నైజాం సర్కారోడ సినిమా నిర్మాత రాజమౌళి, చిత్ర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బండి ముందుకు-గుర్రం వెనక్కు
రాష్ట్ర సర్కారు తీరుపై బీజేపీ నేత లక్ష్మణ్ ఎద్దేవా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ‘బండి ముందుకుృ గుర్రం వెనక్కు’అన్న చందంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురవుతున్నార న్నారు. రైతులకు రుణమాఫీ కాకపోవడంతో కొత్తగా రుణాలు అందడం లేదని, నకిలీ విత్తనాల సరఫరా జోరుగా సాగుతున్నదని, ఇలాంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోకపోవడం తో నిరుద్యోగ యువత దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. సోమవారం ఆయన పార్టీ నాయకులు చింతా సాంబమూర్తి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్తో కలసి విలేకరుల తో మాట్లాడుతూ, సమైక్యపాలనలో జరిగిన అన్యాయాలు నేటికీ కొనసాగుతున్నాయని అన్నారు. గ్రూప్ృ2 పరీక్షల విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవు తుండడంతో విద్యార్థులు తమ భవిష్యత్పై ఆందోళన చెందుతు న్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి... రాష్ట్రంలో బీజేపీలో చేరేందుకు ప్రజలు ముందుకు రావడం హర్షణీయమని లక్ష్మణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన పేర్కొన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా సదాశివ పేటకు చెందిన కోడూరి శరత్చంద్ర ఆధ్వ ర్యంలో పెద్దసంఖ్యలో యువకులు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సందర్భంగా వారిని లక్ష్మణ్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీనా యకులు ఎన్. శ్రీవర్థన్రెడ్డి, దాసరి మల్లేశం, ఆకుల విజయ, గోదావరి, గుండగోని భరత్గౌడ్, వేణుమాధవ్, అంజిరెడ్డి, సంగారెడ్డి బీజేపీ అధ్యక్షుడు కాసాల బుచ్చి రెడ్డి పాల్గొన్నారు. -
ప్రతి పైసాకూ లెక్క చెబుతాం
కేంద్ర నిధులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చ పెడితే ప్రతి పైసాకు లెక్కచెబుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. చర్చ అసెంబ్లీలో అయినా... ఇంకా ఎక్కడైనా సరే! నిధుల లెక్క చెప్పడానికి తాము సిద్ధమని పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల అభ్యున్నతికి కేంద్రం జాతీయ బీసీ కమిషన్ను ఏర్పాటు చేసి రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకుందన్నారు. ప్రధాని మోదీ బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధితో జాతీయ బీసీ కమిషన్ను ఏర్పాటు చేశారని, దానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ చైతన్య సదస్సులు నిర్వహిస్తామన్నారు. జనాభాలో 12 శాతం ఉన్న మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన కేసీఆర్ను ప్రశ్నించారు. బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాటం నర్సింహ, ప్రధాన కార్యదర్శి ఎ.రవీందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రేమ్రాజ్ పాల్గొన్నారు. -
'అమిత్ షాను తప్పుబట్టే స్ధాయికి ఎదిగిపోయారా'
-
'అమిత్ షాను తప్పుబట్టే స్ధాయికి ఎదిగిపోయారా'
హైదరాబాద్: రాష్ట్ర పర్యటనలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పిన విషయాలన్నీ అబద్దమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ స్పందించారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన అమిత్ షాను తప్పుబట్టే స్ధాయికి మీరు ఎదిగిపోయారా? అంటూ సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆరే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలంటూ ప్రజలను తప్పుబట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి ప్రతి పథకానికి వస్తున్న నిధులను, గ్రాంట్లను దారి మళ్లించి ప్రజల సొమ్మును టీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని అన్నారు. సీఎం తనకు తానో తానీషాలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లక్ష్మణ్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. - కేంద్రం అందజేస్తున్న నిధులు పేద ప్రజలకు చేరడం లేదనే అమిత్ షా ప్రభుత్వాన్ని విమర్శించారు. - ఎర్రటి ఎండలో ప్రజలను కలిసేందుకు అమిత్ షా వెళ్లారని.. సీఎం మాత్రం ప్రగతి భవన్లో ఏసీ వేసుకుని కూర్చున్నారు. - అమిత్ షా మీకు సారీ చెప్పడం కాదు.. మీరే అమిత్ షాకు క్షమాపణ చెప్పాలి. - గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయకుండా కేసీఆర్ మహిళలను అవమానాల పాలు చేస్తున్నారు. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. మీరే వారందరికీ క్షమాపణలు చెప్పాలి కేసీఆర్. - సబ్ కా సాత్ సబ్ కా వికాస్లో భాగంగా అన్ని వర్గాల ప్రజల్లో సమభావన పెంపొందించేందుకు అమిత్ షా సహపంక్తి భోజనం చేస్తే దాని మీద బురదజల్లాలని చూడటం దురదృష్టం. - ఎక్కడో వండిన భోజనాన్ని సహపంక్తి భోజనంగా అమిత్ షా తిన్నారనడం బాధాకరం. - దళిత వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నాటకాలు ఆడింది మీరు. కంటి తుడుపుగా డిప్యూటీ సీఎం పదవిని దళితుడికి ఇచ్చి అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణ లేకుండా తప్పించడం మీరు చేసిన కుట్రే. - ఎందుకు ఇలా చేస్తున్నారో తెలీడం లేదు. అమిత్ షా తెలంగాణకు రాక టీఆర్ఎస్ పీఠంలో కుదుపులు తీసుకొచ్చింది. - కన్ఫ్యూజన్లో బీజేపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారని సీఎం అన్నారు. మీ మీద మీకు అంత నమ్మకం ఉంటే పార్టీ ఫిరాయించిన 30 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మూడేళ్ల మీ పాలన సత్తా నిరుపించుకోండి. మీ బలం ఎంటో మీ పరిపాలన ఏంటో చూద్దాం. -
టీఆర్ఎస్ సర్కార్ విఫలం
సామాజిక న్యాయం కొరవడింది: కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, సామాజికన్యా యం కొరవడిందని, రోజురోజుకు నియంతృ త్వ పోకడలు పెరుగుతున్నాయని ధ్వజమె త్తారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని మొత్తం 250 వెనుకబడిన జిల్లాల్లో నల్లగొండ అత్యంత వెనుకబడిన జిల్లా కావడం, ఇక్కడ పేదరికం, సాగు, తాగునీటి సమస్య, ఫ్లోరైడ్ సమస్య, ఎస్టీల్లో కడు పేదరికం, తండాల్లో పిల్లల అమ్మకం, నిరుద్యోగం వంటివి తీవ్రంగా ఉన్నాయన్నారు. ఉద్యమ సమయంలో నల్లగొండ జిల్లా దైన్యాన్ని, వెనుకబాటుతనాన్ని కథలు కథలుగా వివరించిన టీఆర్ఎస్, అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో ప్రధానమైన సమస్యలను విస్మరించిందన్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా ఈ అంశాన్నింటిన్నీ ఆయన దృష్టికి తీసుకెళతామన్నారు. చరిత్రాత్మక పర్యటన... అత్యంత వెనుకబడిన జిల్లాకు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు రావడం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని లక్ష్మణ్ అన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో సమస్యల అధ్యయనం, దళితులతో సహపంక్తి భోజనాలు, కేంద్ర పథ కాల పరిశీలన వంటివి అమిత్షా చేపడతా రన్నారు. ఉద్యమ శక్తుల్లోని నిరాశా నిçస్పృ హలను తొలగించేందుకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, ప్రజాస్వా మ్యం, సామాజిక తెలంగాణ సాధనకు ఇది దోహదపడుతుందన్నారు. నల్లగొండ జిల్లా లోని చౌటుప్పల్ ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు, దామరచెర్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకోసం 10 వేల ఎకరాల అటవీభూమికి అత్యంత వేగంగా అనుమతి, ఏఐఐఎంఎస్ ఏర్పాటునకు రూ.వందల కోట్ల కేటాయింపు వంటివి కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి సందర్భంగా సమాజంలోని చిట్టచివరి పేద వారికి అభివృద్ధి ఫలాలు అందాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే ఈ పర్యటన జరుగుతోందన్నారు. -
ఒంటరి పోరాటం...అధికారమే లక్ష్యం
-
ఒంటరి పోరాటం... అధికారమే లక్ష్యం
- 2019 ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ - టీఆర్ఎస్ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగి 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ప్రధాన ఎజెండాగా తమ పార్టీ ముందుకు సాగుతోం దని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. మూడేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు, ప్రధాని మోదీ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా టీఆర్ఎస్ పాలన సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలతో రైతాంగం, విద్యార్థులు, నిరుద్యోగ యువత... ఇలా వివిధ వర్గాల ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. ఇతర రాజకీయ పార్టీలపై నమ్మకం సన్నగిల్లడంతో పాటు టీఆర్ఎస్పై బీజేపీ ఒక్కటే రాజీలేని పోరాటం చేస్తుందనే భావన బలపడుతోందన్నా రు. బాహుబలిని తలదన్నే, అణ్వాస్త్రాన్ని మించిన బ్రహ్మాస్త్రం మోదీ రూపంలో వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్షా పర్యటన పార్టీకి సత్ఫలితాలనిస్తుందన్నారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో అమిత్షా రాష్ట్ర పర్యటన నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్టుల సంఘం (టీజేయూ) మంగళవారం లక్ష్మణ్తో మీట్ ది ప్రెస్ నిర్వహించింది. ఏ పార్టీతో పొత్తు ఉండదు... వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో పాటు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లడం, ఇతర అంశాలపై పోరాడతామన్నారు. అమిత్షా పర్యటనకు ఇతరపార్టీల నాయకులు బీజేపీలో చేరికకు సంబంధం లేదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్, ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ... పార్టీలో చేరే విషయంపై చాలామంది చర్చలు జరుపుతున్నారని, ఎవరన్నా చేరితే మీడియాకు తెలియజేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయాలా.. లేక ఎమ్మెల్యేగానా అన్నది పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఒకవేళ పార్టీ పోటీ చేయవద్దన్నా సామాన్య కార్యకర్తగా పని చేస్తానన్నారు. పార్టీలో సీఎం ఎవరనే రేసు ఉందా అన్న మరో విలేకరి ప్రశ్నకు బీజేపీలో ఎలాంటి రేస్లుండవని, పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందని జవాబిచ్చారు. సీఎం స్పందించరా? ప్రతిపక్షాలను ఉద్దేశించి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి... రెచ్చిపోతే చచ్చిపోతారన్న వ్యాఖ్యను సీఎం కేసీఆర్ ఖండించకపోవడం దేనికి సంకేతమని లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు హద్దులు మీరి రెచ్చిపోతే చట్టప రంగా చర్యలు తీసుకోవాలే తప్ప.. మం త్రులు హింసను ప్రేరేపించేలా మాట్లాడడం తగదన్నారు. సోమవారం ధర్నాచౌక్ వద్ద ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమ న్నారు. ప్రతిపక్షాలు, ప్రజాసం ఘాలపై ఇంత పెద్ద ఎత్తున నిర్భందాన్ని ప్రయోగించడం అవసరమా అని ప్రశ్నించారు. -
కేంద్ర నిధులపై శ్వేతపత్రం ఇవ్వాలి
టీఆర్ఎస్ నీటిబుడగలాంటిది: కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్రం లోని వివిధ ప్రభుత్వ శాఖలకు వచ్చిన నిధులు, వాటి వ్యయంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ నేత చింతా సాంబమూర్తితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న పథకాలు రాష్ట్రంలో సరిగా అమలు కావడం లేదన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, జాతీయ రహదారుల కోసం వేలాది కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ.వెయ్యి కోట్లు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ... ఇలా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం పెద్ద మొత్తంలో నిధులిచ్చిందన్నారు. రైతులకు బేడీల ఘటనపై సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ నీటి బుడగని, వచ్చే ఎన్నికల్లో పేలిపోతుందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని, ‘ఒంటరిగా ఎదుగు.. ఒంటరిగా సాగు’నినాదంతో ముందుకు సాగుతామని చెప్పారు. పేద ముస్లింల సహకారంతో హైదరాబాద్ ఎంపీ సీటును కైవసం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 29 నుంచి జూన్ 17 వరకు ‘పల్లె పల్లెకూ బీజేపీ, ఇంటింటికీ మోదీ’ చేపడుతున్నామన్నారు. -
కేంద్రంపై అభాండాలు సరికాదు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల మిర్చి రైతులు తీవ్ర ఇబ్బం దులు పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు డా.కె.లక్ష్మణ్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తన వైఫల్యాలను, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై అభాండాలు వేయడం మంచి పద్ధతి కాద న్నారు. రాష్ట్రంలో ఎంత మిర్చి సాగు చేశారు, దిగుబడి ఎంత వస్తుందనే లెక్కలు కూడా తెలియని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఒక ప్రకటనలో విమర్శించారు. మిర్చి రైతులను ఆదుకోవాలని రెండు రోజుల క్రితం ఢిల్లీలో తాను, కేంద్రమంత్రి దత్తాత్రేయ, జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్రావు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి అహ్లువాలియాను కలసి వినతిపత్రాన్ని సమర్పించామని తెలి పారు. దీనికి స్పందనగా మిర్చి క్వింటాల్ కు రూ.6,250గా నిర్ణయించినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. -
23 నుంచి అమిత్షా రాష్ట్ర పర్యటన
మూడు రోజులు టూర్: లక్ష్మణ్ సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 23, 24, 25 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించ నున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలి పారు. సోమవారం ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీని సంస్థాగ తంగా బలోపేతం చేయడానికి అమిత్షా రాష్ట్రం లో పర్యటించనున్నట్లు చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తూ ప్రజావ్యతిరేక విధా నాలను అవలంబిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ బలోపేతానికి అవకాశాలు ఉన్నాయని, ఈ విషయాలపై జాతీయ అధ్య క్షుడితో చర్చించామని, దాని కి అనుగుణంగా పార్టీ పటిష్ట తకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. అమితా షాతో సమావేశంలో హైకోర్టు విభజన అంశంపైనా చర్చించామన్నారు. అయితే ఈ విషయం సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని అమిత్షా చెప్పారన్నారు. సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొ న్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి అహ్లూవాలియాతో సమావేశమైన దత్తాత్రేయ, లక్ష్మణ్ తెలంగాణలో మిర్చి రైతులను ఆదుకో వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందిం చిన కేంద్ర మంత్రి... రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకుంటానని చెప్పారు. బీజేపీలోకి కాంగ్రెస్ నేత నందీశ్వర్గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నేత, పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ సోమవారం ఢిల్లీలో లక్ష్మణ్, అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. నోట్ల రద్దు, బీసీ కమిషన్కు రాజ్యంగబద్ధ హోదా కల్పించడం లాంటి నిర్ణయాలపట్ల ఆకర్షితుడినై తాను బీజేపీలో చేరినట్టు ఆయన తెలిపారు. బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించే విష యంలో లోక్సభలో బిల్లు ఆమోదం పొందినా.. రాజ్యసభలో కాంగ్రెస్ వివిధ కారణాలు చూపుతూ అడ్డుకోవడం తనను బాధించిందన్నారు. దేశాభి వృద్ధి మోదీతోనే సాధ్యమవుతుందన్నారు. -
త్వరలోనే ఇన్చార్జీల నియామకం
- గ్రో అలోన్, గో అలోన్ మా సిద్ధాంతం... - అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న లక్ష్మణ్తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ సాక్షి, హైదరాబాద్: త్వరలోనే 30, 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వెల్లడించారు. ఆయా నియోజక వర్గాలకు ఇప్పటికే ఇన్చార్జిలను గుర్తించినట్లు చెప్పారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమిస్తా మన్నారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్బూత్ స్థాయిల్లో కార్య కర్తల సదస్సులను నిర్వహిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక విధా నాలు, రైతులు, ధర్నాచౌక్, వంటి ప్రాధా న్యత సంతరించుకున్న ప్రజా సమస్యలపై టీడీపీతోసహా మిగతా పార్టీ లతో కలసి పనిచేసేందుకు అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రంలో ‘గ్రో అలోన్, గో అలోన్’ (సొంతంగా ఎదు గు, ఒంటరిగా పయ నించు) సిద్ధాంతంతో ముందుకు సాగు తున్నామన్నారు. ఎన్డీఏలో టీడీపీ భాగ స్వామ్యపక్షమైనంత మాత్రాన తెలంగాణలో బీజేపీ సొంతంగా ఎదగకుండా ఉండాలని ఏమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని రాష్ట్రపార్టీ నిర్ణయించిం దన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నా యంగా నిలిచే పార్టీ బీజేపీ అనే సంకేతాన్ని కార్యాచరణ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. ముందస్తు ఎన్నికలు జరిగితే సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది కాలాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వూ్యనిచ్చారు. ముఖ్యాంశాలు... ఆయన మాటల్లోనే... ‘‘అస్సాం, యూపీ, మణిపూర్, హర్యా నాలలో బీజేపీ సొంతంగా అధికారానికి వచ్చినపుడు తెలంగాణలో అది ఎందుకు సాధ్యం కాదనేది మా ప్రశ్న. అదే లక్ష్యాన్ని నిర్దేశించుకుని రాష్ట్రంలో ముందుకు సాగు తున్నాం. ఏడాదిలో మూడుసార్లు అమిత్షా, ఒకసారి ప్రధాని మోదీ, 15, 20 మంది కేంద్రమంత్రుల పర్యటనల ద్వారా పార్టీకి మంచి బలాన్ని, ఊపును తీసుకురాగలి గాము. రాష్ట్రంలో ఏ పార్టీకి లేని విధంగా అన్ని జిల్లాలు, మండలాల్లో కమిటీలు ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే. పార్టీ జిల్లా, జోనల్ ఇన్చార్జీలను నియమిస్తున్నాము. ముస్లిం రిజ ర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా మని, దీంతో పాటు రైతులు, మద్యనియం త్రణ, నిరుద్యోగ సమస్య, రెండు పడక గదుల ఇళ్లు, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు తదితర అంశాలపై ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయాలని నిర్ణయించాం. పార్టీ విస్తరణ కోసం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మొదలుకుని మండలపార్టీ అధ్యక్షుడి వరకు 15 రోజుల పాటు గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించాం’ అని లక్ష్మణ్ చెప్పారు. -
ట్రాన్స్ఫార్మర్ దించుతుండగా..
ఖానాపూర్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దించుతుండగా.. ప్రమాదవశాత్తు మీదపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మణ్(20) అనే యువకుడు ట్రాక్టర్ పై నుంచి ట్రాన్స్ఫార్మర్ను దించుతున్న సమయంలో ప్రమాదవశాత్తు పట్టుతప్పి మీదపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
కాంతారావు పేరిట స్మారక మందిరం
బీజేపీ సినిమా విభాగం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: అలనాటి సినీ హీరో టీఎల్ కాంతారావు పేరిట స్మారక మంది రాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ సినిమా విభాగం విజ్ఞప్తి చేసింది. కాంతారావు శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆయన పేరిట అవార్డులను ప్రదా నం చేయాలని కోరింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన కాంతారావు వర్ధంతి సభలో బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతా సాంబమూర్తి, డా.జి.మనోహర్ రెడ్డి, సీవీఎల్ నర్సింహారావు, మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు శివాజీరాజా, సినీనటుడు సురేశ్ పాల్గొన్నారు. కాంతారావు కుటుంబానికి గౌరవప్రదమైన నివాసాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ సినిమా విభాగం విజ్ఞప్తి చేసింది. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కాంతారావు కుటుంబానికి తగిన సహా య సహకారాలు అందేలా చూస్తామని లక్ష్మణ్ తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరఫున కాంతారావు కుటుంబాన్ని ఆదు కుంటామని శివాజీరాజా చెప్పారు. -
తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు
-
21, 22 తేదీల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ సాక్షి, న్యూఢిల్లీ: రానున్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో విజయమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి భద్రాచలంలో ఈ నెల 21, 22 తేదీల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తెలిపారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి అవసరమైన ప్రణాళికను సమావేశంలో రూపొందిస్తామన్నారు. శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించనున్నట్లు తెలిపారు. బీజేపీ సిద్ధాంత కర్త దీన్దయాళ్ ఉపాధ్యాయ జన్మ శతాబ్ది ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఏడాదిపాటు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చేస్తున్న పోరాటాలకు సంబంధించి నివేదికను జాతీయ కార్యవర్గ సమావేశంలో సమర్పించామన్నారు. సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి వెదిరే శ్రీరాం, సమన్వయకర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు -
పేదలకు, బడా బాబుల మధ్య ధర్మ యుద్ధం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హన్మకొండ: దేశంలో పేదలు, బడాబాబుల మధ్య ధర్మయుద్ధం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్ అన్నారు. పేదల వైపు ప్రధాని నరేంద్ర మోదీ, బడాబాబుల పక్షాన కాంగ్రెస్ ఉందన్నారు. శుక్రవారం రాత్రి హన్మకొండలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లధనం నిర్మూలనతో కాంగ్రెస్లో భయం పట్టుకుందన్నారు. పెద్దనోట్ల రద్దుతో బయట పడే నల్లధనాన్ని పేదల సంక్షేమానికి, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయడానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ఖర్చు చేస్తామని, గరీబ్ కళ్యాణ్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని గుర్తు చేశారు. దేశంలోని పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తుండడంతో పేదలు ఆయనకు అండగా నిలిచారన్నారు. పేదలను అవమానపరిచేలా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ రూ.4 కోట్ల కారుపై ఏటీఎంకు వచ్చి రూ.4 వేలు తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తోందని అన్నారు. -
తెలంగాణకు అండగా ఉండండి..
- కేంద్ర మంత్రులను కోరిన తెలంగాణ బీజేపీ నేతలు - డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం - కేంద్ర ఇచ్చే నిధులను కూడా వినియోగించడం లేదు: కె.లక్ష్మణ్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలుగా సాయపడాలని కేంద్ర మంత్రులకు రాష్ట్ర బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత కిషన్రెడ్డి, ఉప నేత చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి తదితరులు మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. సమావేశ వివరాలను బీజేపీ కేంద్ర కార్యాలయంలో కె.లక్ష్మణ్ మీడియాకు వెల్లడించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్జవదేకర్లో సమావేశమై.. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ వరకు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు, జిల్లాల పునర్విభజన జరగడంతో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ, కస్తూర్బా విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరామన్నారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు లక్ష్మణ్ తెలిపారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడితో సమావేశమయ్యామని చెప్పారు. మున్సిపాలిటీ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇప్పటికే 90 వేల ఇళ్లు మంజూరు చేయడంతోపాటు, హడ్కో నుంచి రూ.3,300 కోట్లు రుణం మంజూరు చేసిందని వివరించారు. కేసీఆర్ ప్రకటన సరికాదు: తెలంగాణలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి.. ఇప్పుడు నిర్మించలేకపోతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం సరికాదని, దీన్ని తాము తీవ్రంగా తప్పుబడుతున్నామని లక్ష్మణ్ చెప్పారు. ఇళ్ల మంజూరు, నిధుల విడుదలలో కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలస్యం చేస్తున్నారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఇళ్ల మంజూరును వేగవంతం చేయాలని వెంకయ్యను కోరామన్నారు. అలాగే తెలంగాణలో ఆయుర్వేదిక్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరగా.. దీనిపై వెంకయ్య.. కేంద్ర ఆయూష్ శాఖ మంత్రి శ్రీపాద్నాయక్తో చర్చించారు. దీనికి శ్రీపాద్నాయక్ సూత్రపాయంగా అంగీకరించినట్టు తెలిపారు. తెలంగాణలో ఎరుుమ్స్ ఏర్పాటు చేయండి: తెలంగాణలో ఎరుుమ్స్ ఏర్పాటు చేయాలని, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారుల వెంట ట్రామాకేర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను రాష్ట్ర బీజేపీ నేతలు కోరారు. ఉత్తర-దక్షిణ తెలంగాణలో ఒకటి చొప్పున సూపర్ స్పెషాలిటీ కేన్సర్, కంటి ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్లో పసుపు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్సింగ్ను కోరారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి: తెలంగాణలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలని రైల్వే మంత్రి సురేశ్ప్రభును బీజేపీ నేతలు కోరారు. దీనిపై సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని సురేశ్ప్రభు హామీ ఇచ్చినట్టు కె.లక్ష్మణ్ తెలిపారు. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై కర్నూలు-హైదరాబాద్, ఆదిలాబాద్-నాగ్పూర్ జాతీయ రహదారులను ఇండస్ట్రియల్ కారిడార్గా గుర్తించాలని కోరారు. -
రూ.791 కోట్ల నిధులను దారి మళ్లించారు
భువనగిరి మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సాక్షి, యాదాద్రి: కేంద్రం ఇచ్చిన రూ.791 కోట్ల కరువు నిధులు టీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా యన్నారు. రుణమాఫీ కింద రావల్సిన రూ.8 వేల కోట్ల బకారుులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రూ. 1.60 లక్షల సబ్సిడీతో కేంద్రం 91 వేల ఇళ్లను మంజూరు చేస్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిని పేదలకు ఇవ్వలేదన్నారు. -
మద్యం మహమ్మారిపై పోరు: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం మహమ్మారిపై ఉద్యమించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్లు, బార్లను అర్ధరాత్రి వరకు అనుమతించడంతో బెల్ట్షాపులు గ్రామీణ జనజీవనాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని ధ్వజమెత్తింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.35 వేల కోట్ల మేర బడుగు, బలహీన వర్గాల కష్టార్జితాన్ని మద్యం మాఫియా-రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కొల్లగొడుతున్నాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వం ఆబ్కారీ ఆదాయంపైనే దృష్టి పెట్టడం ప్రజాద్రోహమన్నారు. తాగుడు కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల రమ్య వంటి పసి మొగ్గలు రాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సమాజాన్ని తట్టిలేపడానికి, మద్యపాన నియంత్రణకు ఈ నెల 11న ఉదయం 10 గంటల నుంచి 12న ఉదయం 10 గంటల వరకు నాంపల్లిలోని ఆబ్కారీ కార్యాలయం ఎదుట బీజేపీ నేత ప్రొ.ఎస్వీ శేషగిరిరావు నిరాహారదీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. బీజేపీ ఉద్యమానికి ఇది ఆరంభమేనని.. ఈ సాంఘిక దురాచార నిర్మూలనోద్యమానికి ప్రజలందరూ మద్దతివ్వాలని లక్ష్మణ్ కోరారు. సైనికుల గురించి మాట్లాడే అర్హత లేదు దేశ సైనికుల గురించి మాట్లాడే కనీస అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఆత్మహత్యకు పాల్పడిన మాజీ సైనికోద్యోగి రామ్కిషన్ గ్రోవర్ కుటుంబాన్ని పరామర్శించే నైతికహక్కు రాహుల్కు లేదన్నారు. సర్జికల్ దాడుల ఆధారాలు చూపాలంటూ రాహుల్గాంధీ మాట్లాడడం సిగ్గు చేటని.. సైనికులను అవమానపరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ వారికి క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రధాని మోదీని, కేంద్రాన్ని టీపీసీసీ నేత ఉత్తమ్ విమర్శించడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. -
‘టీఆర్ఎస్ నాయకత్వంలో ఉలికిపాటు’
హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వరంగల్ బహిరంగసభలో కొన్ని అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ను సూటిగా ప్రశ్నిస్తే, వాటిపై టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు స్పందించిన తీరు వారి ఉలికిపాటును స్పష్టం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. సోమవారం పార్టీ నాయకులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అమిత్ షా బహిరంగ సభకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం టీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు. రాష్ట్రంలో బీజేపీ తిరంగాయాత్ర ద్వారా హైదరాబాద్ విముక్తి దినోత్సవం, తదితర అంశాలపై టీఆర్ఎస్ అసలు నైజం బయటపడిందని, సీఎం కేసీఆర్ రెండు నాల్కల ధోరణి ప్రజలకు అర్థమైందన్నారు. పార్టీకార్యాలయంలో విలీనదినం జరిపి,ప్రభుత్వపరంగా నిర్వహించకపోవడంపై కేసీఆర్ సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకానితనం, వైఫల్యాలకు కేంద్రంపై నెపం మోపుతారా? ఇది వారి దివాళాకోరుతనానికి నిదర్శనమంటూ ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపులపై మంత్రి హరీష్రావు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 63 నుంచి 90కు పెంచుకోవడంలోనే ప్రగతి ఉందన్నారు. సెప్టెంబర్ 17ను పార్టీపరంగా నిర్వహిస్తూ, ప్రభుత్వపరంగా నిర్వహించకపోవడంపై కేసీఆర్ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. కాశ్మీర్లో తిరంగాయాత్ర నిర్వహిస్తే మంచిదని హరీష్రావు వ్యాఖ్యానించడం దేనికి సంకేతమని నిలదీశారు. కేంద్రం నుంచి అందిన సహాయం, నిధుల మళ్లింపు తదితర అంశాలపై అమిత్ షా లేవనెత్తిన అంశాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. -
కమలహాసన్ టైటిల్లో జయంరవి
తమిళసినిమా: తనీఒరువన్,భూలోకం,మిరుదన్ ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు జయంరవి. విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ నటిస్తున్న ఈయన తాజాగా మూడు చిత్రాలకు కమిట్ అయ్యారు. వాటిలో రోమియో జూలియట్ చిత్రం ఫేమ్ లక్ష్మణన్ దర్శకతంలో మరోసారి నటిస్తున్న చిత్రం బోగన్. హన్సికనే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. కాగా తదుపరి మిరుదన్ వంటి విజయ వంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శక్తి సౌందర్రాజన్తో మరో చిత్రానికి జయంరవి రెడీ అవుతున్నారు. దీన్ని జపక్ ఇందోశ్ నిర్మించనున్నారు. బోగన్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత జయంరవి ఈ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. కాగా ఈ చిత్రానికి ఇంతకు ముందు భారతీరాజా దర్శకత్వంలో కమలహాసన్ నటించిన రోమాంటిక్ థ్రిల్లర్ కథా చిత్రం టిక్ టిక్ టిక్ టైటిల్ను నిర్ణయించారు. ఆ చిత్ర నిర్మాత అనుమతి పొందే ఈ టైటిల్ను తమ చిత్రానికి పెట్టినట్లు దర్శకుడు శక్తి సౌందర్రాజన్ తెలిపారు. కాగా కోలీవుడ్లో స్పేస్ నేపథ్యంలో రూపొందనున్న తొలి చిత్రంగా టిక్ టిక్ టిక్ ఉంటుందని ఆయన చెప్పారు. ఇక పోతే దీనితో పాటు జయంరవి దర్శకుడు విజయ్ కాంబినేషన్లో కూడా ఒక చిత్రం చేయనున్నారు. ఈ చిత్రం వినాయకచవితి సందర్భంగా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. -
నయీం కేసులో మరో ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్: ఇటీవల పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన గ్యాంగ్స్టర్ నయీం ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. శేషన్న ప్రధాన అనుచరుడు సోమన్నఇచ్చిన సమాచారం మేరకు నగరంలోని కుషాయిగూడలో సిట్ అధికారులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నయీం అనుచరులు శ్రీనివాస్, లక్ష్మణ్లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తమ కార్యాలయానికి తరలించారు. నయీంకు సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం సిట్ అధికారులు వారిని విచారిస్తున్నారు. -
నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రాక
హన్మకొండ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేడు(బుధవారం) జిల్లాకు రానున్నారు. సెప్టెం బర్ 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాట్లపై జిల్లా నాయకులతో లక్ష్మణ్ చర్చించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా, నగర కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్ తెలిపారు. హసన్పర్తి కిట్స్ కళాశాల సమీపంలోని బాలాజీ గార్డెన్లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరుగుతుందన్నారు. -
రానున్నది బీజేపీ ప్రభుత్వమే
కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సిద్దిపేట జోన్: తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. అ దిశగా కార్యకర్తల్లో మనోధైర్యం, నూతన ఉత్తేజం నింపడానికి ఈ నెల 7న ప్రధాని పర్యటన దోహదపడనుందని అన్నారు. శనివారం సిద్దిపేటలోని వీఏఆర్ గార్డెన్లో జరిగిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. ప్రతీ కార్యకర్త పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీపార్టీ మాత్రమే ప్రత్యామ్నాయంగా నిలుస్తుందన్నారు. మజ్లిస్తో టీడీపీ, కాంగ్రెస్ మాదిరే.. టీఆర్ఎస్కూడా జతకట్టిందన్నారు. మతం పేరిట విషబీజాలు నాటుతున్న ఎంఐఎం పార్టీకి దీటుగా నిలబడే ఎకైకపార్టీ బీజేపీ ఒక్కటేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మల్లన్నసాగర్ భయం పట్టుకుందన్నారు. నియంతృత్వ వైఖరితో ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నదని, 2013 చట్టానికి భిన్నంగా 123 జీవోను తీసుకురావడం సరైంది కాదన్నారు. నిర్బంధ చర్యలు ప్రభుత్వ పతనానికి దారితీస్తాయన్నారు. ప్రాజెక్ట్ డీపీఆర్పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించడానికి రాష్ట్రంలో బీజేపీ కాపలా కుక్కల పనిచేస్తుందన్నారు. నరేంద్ర మోడీ ఈ నెల 7న రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించడం వల్ల దక్షణాది రాష్టాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎంసెట్ లీకేజీ వ్యవహరంపై ప్రభుత్వం స్పందించి సంబంధిత మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. అనంతరం ప్రదాని జిల్లా పర్యటన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునందన్రావు,వంగ రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, వాసిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షులు కాసాల బుచ్చిరెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అణచివేతతో భూములు లాక్కుంటారా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్ : రైతులపై పోలీసులతో లాఠీచార్జి చేయించి, ప్రశ్నించేవారిని అణచివేసి భూములను గుంజుకుంటామంటే సహించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మల్లన్నసాగర్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను బయటపెట్టకుండా, దాచిపెట్టడంలో మర్మం ఏమిటని ప్రశ్నించారు. రైతులు, నిర్వాసిత గ్రామస్తులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులతో దాడులు చేయించడం అమానుషమన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ, ఇతర పార్టీల నేతలను అరెస్టు చేయడం అక్రమమన్నారు. ప్రభుత్వ దమనకాండకు నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో మంగళవారం నిరసనలు చేపడుతున్నట్టు ప్రకటించారు. -
కరీంనగర్లో బీజేపీ భారీ ధర్నా
కరీంనగర్: కరీంనగర్ను కరువు జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్తో బీజేపీ భారీగా ఆందోళన చేపట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా సోమవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. జిల్లాలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నా ముఖ్యమంత్రి స్పందించటం లేదని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు. -
ఫైట్స్కి రైట్ హ్యాండ్స్
రైట్ హ్యాండ్ ఒక్కటే ఉంటుంది. తెలుగు సినిమా ఫైట్కి రెండు రైట్ హ్యాండ్స్! రామ్... లక్ష్మణ్... అన్న.. తమ్ముడు. రైట్ సోదరుల్లా వీళ్లు ఫైట్ సోదరులు. వాళ్లు ఏరోప్లేన్లను ఎగరేశారు. వీళ్లు హీరోల కాలర్లను ఎగరేస్తూ... తెలుగు సినిమా యాక్షన్ ఇమేజ్ను అదరగొట్టేస్తున్నారు. చిన్న పల్లెటూళ్లో పుట్టి, చదువు సంధ్య లేకుండా, బర్రెలు, మేకలు కాసుకొనే దశ నుంచి ఇవాళ ఇంతమంది గుర్తించే ఫైట్ మాస్టర్స్గా ఎదగడం ఒక కల లాగా ఉంది. అంతా ఒక సినిమాలాగే అనిపిస్తుంది. అమ్మానాన్నలకు మేము అయిదుగురం. కవల పిల్లలమైన మేమిద్దరమే ఆఖరు. మా నాన్న గారు నాటకాలు గట్రా వేసేవారు. నాన్నగారి ఫ్రెండ్కి ఫ్రెండ్ - ఫైట్మాస్టర్ రాజు గారు. సినీ రంగంలో ఆయనే మాకు గురువు, దైవం. ఆయనదేమో ప్రకాశం జిల్లా చీరాల దగ్గర సంతరావూరు. మాదేమో ఆ పక్కనే నందిగుంటపాలెం. ఊళ్ళో నడిబొడ్డున ఎవరూ కదిలించలేని పెద్ద బండరాయిని పైకి ఎత్తడం ద్వారా అందరి దృష్టీ మా మీద పడింది. ఎప్పటికైనా ప్యాంట్ వేసుకోవాలి, జీవితంలో ఏదో సాధించాలనే తపన మాది. పట్నం వెళ్ళి, ఏదో చేయాలనుకుంటుంటే నాన్న గారు ఫ్రెండ్ ద్వారా చెప్పించడంతో, రాజు మాస్టర్ మాకు ఆశ్రయమిచ్చారు. 1987లో మద్రాసు వెళ్ళి, రాజు మాస్టర్ దగ్గర రెండేళ్ళు శిష్యరికం చేశాం. ఇప్పుడంటే కష్టపడి చెక్కుబుక్ మీద సంతకం పెట్టడం నేర్చుకున్నాం కానీ, అప్పట్లో మాకు తెలుగు తప్ప తమిళం రాదు. ఇంగ్లీషు, హిందీ అసలే రాదు. మాస్టర్ వాళ్ళ నాన్న రాఘవులు గారు సీనియర్ ఫైట్ మాస్టర్. ముసలివారైపోయిన ఆయనకు వండి పెట్టడం, బాగోగులు చూసుకోవడం లాంటివన్నీ చూసేవాళ్ళం. ఆ టైమ్లోనే రాజు మాస్టర్ చిత్రాల్లో విలన్ గ్యాంగ్లో అసిస్టెంట్స్గా తెరపై గుంపులో కనిపించేవాళ్ళం. ఎట్టకేలకు మా గురువు వల్ల 1989లో ఫైటర్స్ యూనియన్లో సభ్యత్వం వచ్చింది. కానీ, దేవుడు రాసే స్క్రీన్ప్లే మన అంచనాలూ, ఊహలకు అందదు. మహేశ్బాబు నటించిన ‘వంశీ’ (2000) షూటింగ్ టైమ్లో మా ఫ్రెండ్ ఒకరు ‘ఫైట్స్ బాగా చేస్తున్నారు. ఫైట్ మాస్టర్స్గా చేయచ్చుగా!’ అన్నాడు. ఫైట్ మాస్టర్గా ఎదగాలంటే - ముందుగా అసిస్టెంట్గా చేసి, కెమేరా యాంగిల్స్ లాంటివన్నీ నేర్చుకోవాలి. కానీ, మేమెప్పుడూ అలా చేసింది లేదు. లోపల ఎక్కడో అలజడి. సీనియర్ హీరో సురేశ్ ‘శివుడు’ సినిమా చేస్త్తున్నారు. ఆయన మాకు తొలిసారి ఫైట్మాస్టర్స్గా ఛాన్సిచ్చారు. అంతకు ముందు మేము తమిళంలో మాకంటూ కథలు తయారు చేసుకొని, నిర్మాతలకు వినిపించేవాళ్ళం. అందువల్ల కథలు చెప్పడం మాకు అలవాటైంది. ఫైట్ మాస్టర్స్ అయినప్పుడు ఆ ప్రాక్టీస్ ఇక్కడ ఉపయోగపడింది. ‘శివుడు’ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మాకున్న కథలు చెప్పడం, వినడం అలవాటు వల్ల కథలోని కంటెంట్, ఎమోషన్స్ అర్థమైంది. ఫైట్మాస్టర్స్గా దాన్ని కెమేరాలో ఎలా బంధించాలన్నది ప్రశ్న! ‘శివుడు’ (2001)కు మొదట మేము చేసింది - కుకట్పల్లి ఆంజనేయస్వామి గుడిలో ఫైట్. అప్పుడు ‘స్టార్ట్ కెమేరా.. యాక్షన్’ అని ఎలా చెప్పాలో రాత్రంతా ప్రాక్టీస్ చేశాం. తీరా సెట్లోకెళ్ళాక, ఎమోషనలై, ‘స్టార్ట్ కెమేరా’ చెప్పకుండానే ‘యాక్షన్’ చెప్పాం (నవ్వు). ఆ తొలి అనుభవం మర్చిపోలేం. ఈ 27 ఏళ్ళ కెరీర్లో యాక్షన్ చిత్రాల కె.ఎస్.ఆర్. దాస్గారి 100వ సినిమా (రిలీజవలేదు) నుంచి ఇప్పటి బోయపాటి గారి దాకా అందరితో, మహేశ్ సహా పెద్ద హీరోలందర్తో చేయడం మా అదృష్టం. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, పంజాబీ, ఒరియా, భోజ్పురీల్లో కలిపి ఫైట్ మాస్టర్సగా 150 చిత్రాలు చేశాం. మా ఈ ప్రయాణంలో... మర్చిపోలేని ఫైట్స్ కొన్నిటి గురించి... 1. ఒక్క పంచ్.. ఒకే ఒక్క పంచ్ ఫైట్ మాస్టర్స్గా రిలీజైన మా తొలి సినిమా మాత్రం పూరీ జగన్నాథ్ గారి ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ (2001). షూటింగ్ హైదరాబాద్ పబ్లిక్గార్డెన్స్లో. హాఫ్ డేలో చేయాలి. ఒకే ఒక్క పంచ్! హీరో రవితేజ కొడితే, అవతలివాడు గిర్రున తిరిగి పడతాడు. మేమూ కసి మీద ఉన్నాం. చెన్నై నుంచి తెచ్చుకున్న డబ్బులైపోయాయి. కృష్ణానగర్ ఇంట్లో ఏదో గంజి కాచుకొని, తాగుతున్నాం. ఆ రోజు షాట్ చేసి, సంపాదిస్తేనే ఫుడ్. కసితో చేశాం. ఒక్క దెబ్బకి ఓకే. సిన్మా రిలీజైంది. పెద్దహిట్. అక్కడి నుంచి కొట్టో కొట్టు... వరుస హిట్లు. 2. ఫేట్ మార్చిన ఫైట్ కల్యాణ్గారి సిన్మా చేయాలనున్నా, మాకెప్పుడూ కుదర్లేదు. డెరైక్టర్ హరీశ్ శంకర్ మమ్మల్ని కల్యాణ్ గారికి పరిచయం చేసి, ‘మన ‘గబ్బర్సింగ్’లో ఒక ఫైట్ ఇచ్చి చూడండ’ని రికమెండ్ చేశారు. ఎగ్జిబిషన్లో జరిగే ఇంటర్వెల్ ఫైట్ ఇచ్చారు. అమ్మ చనిపోయిందన్న బాధలో హీరో ‘మనల్ని చంపడానికొచ్చినప్పుడు చావాలా, చంపాలా’ అంటూ, గూండాల తుక్కు రేగ్గొడతాడు. చివరకు జెయింట్ వీల్ విరిగి, గూండాపై పడుతుంది. ఫైట్ తీసిన తీరు నచ్చి, ‘ఈ సిన్మా ఫైట్లన్నీ రామ్లక్ష్మణ్లే చేస్తార’ని చెప్పేశారు. ఆ సిన్మా మాకు పేరే కాదు, ‘సర్దార్ గబ్బర్సింగ్’ ఛాన్సూ తెచ్చింది. 3. వేలు చూపిస్తే... ఈలలే! ‘ఆర్య’ (2004)లో రౌడీలు హీరో మీదకు వస్తారు. అప్పుడు హీరో రౌడీల్ని కొట్టడు. హీరో గుద్దితే పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మ బద్దలవుతుంది. కాలితో లాగి పెట్టి తంతే, పంపు పైన విరిగి, నీళ్ళు పైకి చిమ్ముతాయి. అల్లు అర్జున్తో మాకు అదే ఫస్ట్ సినిమా. మాకు ఫస్ట్ ‘నంది’ అవార్డు వచ్చిందీ - ఆ ఫిల్మ్కే! ఫైట్ చివరలో హీరో ‘జాగ్రత్త’ అన్నట్లు, వేలు చూపిస్తూ వెళతాడని డిజైన్ చేశాం. హీరో కుర్రాడు కాబట్టి, అలా చూపిస్తే బాగుండదేమోనని డెరైక్టర్ సుకుమార్ అన్నారు. కన్విన్స్ చేశాం. రిలీజయ్యాక జనం మెచ్చారు. 4. ఆ లోటు తీర్చిన క్లైమాక్స్ చిన్నప్పుడు చిరంజీవి గారి ఫిల్మ్లు తెగ చూసేవాళ్ళం. ఫైట్ మాస్టర్లయ్యాక చిరంజీవి గారి అబ్బాయి రామ్చరణ్కి ‘మగధీర’లో ‘10 నిమిషాలలో 400 ఏళ్ళు వెనక్కి’ అంటూ ఇంటర్వెల్ కార్డ్ పడే ముందు వచ్చే హెలికాప్టర్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ డిజైన్ చేశాం. ఇక, ‘గోవిందుడు అందరివాడే’ చేశాం. కానీ, చిరంజీవి గారితో సినిమా చేయలేదే అని లోటుం డేది. నిరుటి ‘బ్రూస్లీ’ క్లైమాక్స్ ఫైట్తో అది కొంత తీరింది. చిరంజీవి గారు హీరోయిన్ను రక్షించి, గుర్రంపై వెళ్ళే స్పెషల్ అప్పీయరన్స సీన్ డిజైన్ చేయడం మాకు మరపురాని అనుభవం. 5. బాధ, కోపం... రెండూ! బోయపాటి తీసిన బాలయ్య బాబు ‘సింహా’ (2010)లో మంచి ఎమోషనల్ ఫైట్ ఉంది. హీరో వేసిన రెండు పాత్రల్లో డాక్టర్ పాత్ర చనిపోయే ఫైట్. పద్మాలయా స్టూడియో డౌన్లో సెట్ వేశాం. ఆ ఎమోషనల్ ఫైట్ డిజైనింగ్కి స్ట్రగులవ్వాల్సొచ్చింది. డాక్టర్ వృత్తిలో ఉన్న హీరో సమాజంలోని దుష్టత్వానికి ఆపరేషన్ చేస్తూ, గొడ్డలి లాంటిది తీసుకొని, ఆవేశంగా చేసే ఫైట్ అది. కొడితే, అవతలివాడి తల తెగుతుంది. నయనతార చనిపోతుంటే హీరో సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ ఉండే ఆ ఫైట్ అందరికీ గుర్తే. 6. బాడీ లాంగ్వేజ్కి తగ్గట్లే... నాగార్జున గారితో ‘నేనున్నాను’కు తొలి ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ డే వర్క్ చేశాం. ఎందుకనో ఆ ఫైట్స్ ఫిట్ అవలేదని మమ్మల్ని తీసేశారు. చాలా బాధపడ్డాం. మరో ఛాన్స్ వస్తే మా పనితనం చూపాలనుకున్నాం. కొన్నేళ్ళకు ‘కింగ్’ (2008) ఛాన్స వచ్చింది. అంతే! ప్రూవ్ చేసుకోవాలని రెట్టించిన ఉత్సాహంతో కష్టపడ్డాం. గాలిలో ఎగరడం, దూకడం ఆయన పెద్దగా చేయరు. దాంతో, బాబు బాడీలాంగ్వేజ్కు తగ్గట్లుగా ఫైట్లు డిజైన్ చేశాం. అంతే! దర్శకుడు శ్రీను వైట్ల, నాగార్జున - అంతా హ్యాపీ. మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. 7. దుమ్ము రేగింది! లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘రెబల్’(2012)కి కష్టపడి, ఫైట్లు డిజైన్ చేశాం. సిన్మా యావరేజ్గా నడిచినా, ఫైట్స్ దుమ్ము రేపాయి. ప్రభాస్తోనే కాక, వాళ్ళ పెదనాన్న గారైన కృష్ణంరాజు గారితో మంచి ఎక్స్పరిమెంటల్ ఫైట్ చేయించాం. పోలీస్ స్టేషన్కు వైట్ సూటు బూటులో వచ్చిన కృష్ణంరాజు తప్పు చేసిన సొంత బంధువైన ఇన్స్పెక్టర్ను చితకబాది, కుర్చీలో స్టైల్గా కూర్చొని వార్నింగ్ ఇచ్చే సీన్లో సెంటిమెంట్, ఎమోషన్ - రెండూ ఉంటాయి. అలాగే, సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ బాగుంటాయి. 8. రెండు పాత్రల ఇమేజ్ తంటా బాలకృష్ణ ‘లెజెండ్’లో ఇంటర్వెల్ సీన్ ఫైట్ డిజైనింగ్ మాకో సవాల్. పెద్ద బాలయ్య, చిన్న బాలయ్య - రెండు పాత్రలుంటాయి. ఇంటర్వెల్ సీన్ దగ్గర చిన్న బాలయ్య పాత్రని కొద్దిగా తగ్గించి, పెద్ద బాలయ్య పాత్రను బైటపెట్టాలి. ఆ పెద్ద పాత్రను రివీల్ చేస్తున్నప్పుడు తగ్గ ఎమోషన్ ఉండేలా ఫైట్ ఉండాలి. పెద్ద బాలయ్య ఈటె పట్టుకొని, మెట్లు దిగి వస్తూ, ఒక్కపోటుకు ఆరుగుర్ని హతమార్చి,‘లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా?’ అని విలన్తో అనే సీన్ వెంట్రుకలు నిక్కబొడుచుకొనేలా ఉంటుంది.బీచ్ ఒడ్డున అద్దాన్ని బద్దలు కొట్టు కొని గుర్రంపై చేసే ఛేజ్ కూడా అంతే. 9. ఫైట్లో కథ చెప్పాలంటే... ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ క్లైమాక్స్కి కష్టపడ్డాం. పూరీ గారిలో గొప్పేంటంటే, ఆయన ఫైట్ సంగతి మాస్టర్స్కి అప్పగించి, షూటింగ్లో లేకుండా వెళ్ళిపోతారు. క్లైమాక్స్లో తండ్రి ప్రకాశ్రాజ్కీ, కొడుకైన హీరోకీ మధ్య బంధం తెలియాలి. మరోపక్క బాక్సింగ్ పోటీలో హీరోకూ, హీరో చెల్లెల్ని మోసం చేసిన విలన్కీ ఫైట్. ఆ క్షణంలో హీరోలో సెంటిమెంట్, బాధ, యాక్షన్ - ఇలా చాలా ఎమోషన్స్. ఫైట్లో కథ, ఎమోషన్ రెండూ చెప్పాలని నలిగిపోయాం. చివరకు ఆ బాక్సింగ్ ఫైట్ బాగా వచ్చింది. తాజా ‘బెంగాల్ టైగర్’ ఫైట్స్ పేరు తెచ్చాయి. 10. సిన్మాను బట్టి మారాల్సిందే! మనం చేసేవన్నీ కరెక్ట్ అనుకోనక్కర్లేదు. ఎవరైనా లోపం ఉందంటే సరిదిద్దుకోవాలి. చిన్న ఎన్టీయార్తో ‘ఊసరవెల్లి, దమ్ము’, ఇటీవల ‘నాన్నకు ప్రేమతో’ చేశాం. పేరు తెచ్చాయి. ‘నాన్నకు...’ క్లైమాక్స్లో మాస్గా ఫైట్ ప్లాన్ చేశాం. ఆయన వచ్చి, ‘మాస్టర్! నా గెటప్ క్లాస్ కదా’ అన్నారు. అంతే! ఫైట్ డిజైనింగ్ మార్చేశాం. ఏమైనా, మాస్ మెచ్చే యాక్షన్ ఎంటర్టైనర్స్లో ఫైట్ డిజైనింగ్ ఎప్పుడూ థ్రిల్లింగే. బన్నీ ‘రేసుగుర్రం’లో, లేటెస్ట్ ‘సరైనోడు’లో ఫైట్స్ అలాంటివే. ‘సరైనోడు’లో చేతిలో ఇనుప గుండుతో హీరో ఫస్ట్ ఫైట్, పులివేషాల మధ్య ఫైట్ జనం మెచ్చారు. - రెంటాల జయదేవ -
ఈటల బాట.. అప్పుల వేట: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ అత్యంత అవాస్తవికంగా, ఊహాజనితంగా, అప్పుల కుప్పగా ఉందని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ విమర్శించారు. అబద్ధాలతో అంకెల గారడీ చేసినట్లు ఉందని పేర్కొన్నారు. బడ్జెట్పై మూడోరోజు చర్చలో భాగంగా శుక్రవారం మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టేసినట్లు బడ్జెట్ ఉందన్నారు. ‘ఈటల బాట-అప్పుల వేట.. ఈటల అభివృద్ధి-అంకెల మాయ’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఓవరాల్గా బడ్జెట్ హౌస్ఫుల్.. కలెక్షన్లు నిల్’ అంటూ చురకలు అంటించారు. గత రెండు బడ్జెట్ల అనుభవాలను బేరీజు వేసుకోకుండానే 2016-17 బడ్జెట్లో రూ.1.30 లక్షల కోట్ల కేటాయింపులు జరిపారన్నారు. 30 శాతం అదనపు ఆదాయాన్ని చూపారని, ఇది రాబట్టేందుకు ప్రభుత్వం దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంపై రూ.1.18 లక్షల అప్పుల భారం ఉందన్నారు. వడ్డీలు చెల్లించేందుకే రూ.7,706 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రం రూ. 1.23 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని పేర్కొన్నారు. -
ఫామ్హౌజ్లో చేస్తేనే వ్యవసాయమా?
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు గుణపాఠం చెపుతారని బీజేఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ప్రశ్నించే తత్వాన్ని అణిచివేస్తున్న టీఆర్ఎస్ను ప్రజలు అణచివేస్తారని అన్నారు. పేదోళ్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఫామ్హౌజ్లో చేస్తేనే వ్యవసాయమా అని లక్ష్మణ్ సూటిగా ప్రశించారు. చిన్న, సన్నకారు రైతులు చేసేది వ్యవసాయం కాదా అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. జీహెచ్ఎంసీ డి లిమిటేషన్ ప్రక్రియ దారుసలాంలో జరిగితే టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. -
చాయ్ వాలాకు ఎన్నో అవార్డులు..!
ఢిల్లీలో హిందీ భవన్ ఎదురుగా ప్లాట్ఫామ్పై ఓ టీ కొట్టు.. అందులో టీ అమ్ముతూ కనిపించే ఆరు పదుల వయసు దాటిన ఓ వృద్ధుడు. ఆ పక్కనే అందంగా పేర్చిన పుస్తకాలు. ఢిల్లీ బస్తీవాలాగా జీవితం సాగిస్తున్న లక్ష్మణ్ రావు..18 ఏళ్ళ వయసులోనే రచనలకు శ్రీకారం చుట్టాడు. ప్రధానమంత్రి , రాష్ట్రపతి నుంచీ అవార్డులు అందుకున్నాడు. కానీ నేటికీ టీ అమ్ముకుంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు. లక్ష్మణ్ రావు దైనందిన జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలే పాత్రలుగా ఎన్నో రచనలు చేశాడు. మరెన్నో అవార్డులూ అందుకున్నాడు. అయినా ఆ టీకొట్టునే నమ్ముకున్నాడు. అరవై మూడేళ్ళ వయసులోనూ ఉదయం టీ కొట్టు నడుపుతూనే రాత్రి రచనలు చేస్తూ తన ఇద్దరు కొడుకులనూ చదివిస్తూ తానూ ఢిల్లీ విశ్వవిద్యాలయం ద్వారా ఎంఏ చదువుతున్నాడు. చాయ్ వాలా లక్ష్మణ్ రావ్ కు పల్లె పరిమళాలూ తెలుసు, నగరాల నయా జమానా తెలుసు. పాఠశాల వయసులోనే జీవిత పాఠాలను నేర్చుకున్న ఆయన స్నేహితుల ప్రోత్సాహంతో రచనారంగంలో అడుగు పెట్టాడు. మహారాష్ట్ర తారే గావ్ గ్రామానికి చెందిన లక్ష్మణ్రావు ఎనిమిదో తరగతి డ్రాపౌట్ అయి పనికోసం నగరాల బాట పట్టాడు. ప్రఖ్యాత హిందీ నవలాకారుడు గుల్షన్ నంద రచనలు చదివి సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాడు. ఎప్పటికైనా తాను గుల్షన్ నంద అంతటి వాడవ్వాలని కలలుగన్నాడు. లక్ష్మణ్ పుట్టిన గ్రామంలో స్కూళ్ళు లేవు. ఆమ్రావతి వెళ్ళి చదువుకునేవాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులకు తానూ సాయమందించడంలో భాగంగా చదువుకుంటూనే స్పిన్నింగ్ మిల్లులో పనిచేశాడు. అక్కడ సంపాదన సరిపోక కుటుంబంతోపాటు రాజధానికి పయనమయ్యాడు. మొదట్లో పాన్ బడ్డీ పెట్టుకుని పొట్ట నింపుకున్నాడు. తర్వాత చాయ్ దుకాణం ప్రారంభించాడు. పని చేస్తూనే దూర విద్యలో బీఏ పూర్తి చేశాడు. హిందీ రచనలెన్నో చదివిన లక్ష్మణ్ రావు సాహిత్యంపై మక్కువతో తానూ ఓ పుస్తకాన్ని రాయాలని ప్రయత్నించాడు. ముందుగా 'నయీ దునియా కీ నయీ కహానీ' పేరిట గ్రామం నుంచీ ఢిల్లీ వరకూ సాగిన తన పయనాన్ని పుస్తకంగా మలిచాడు. ఎంతోమంది పబ్లిషర్లను ఆశ్రయించాడు. ఓ చాయ్ వాలా పుస్తకం రాయడంపై వారికి నమ్మకం కలగలేదు. కొందరు ఎగతాళికూడ చేశారు. తర్వాత కాస్త డబ్బు కూడబెట్టి తన 18 ఏళ్ళ వయసులో మొదటి పుస్తకాన్ని అచ్చు వేయించాడు. ఊరంతా తిరిగి అమ్మాడు. లైబ్రరీలకు, షాపులకు ఇచ్చాడు. కొత్త పుస్తకానికి వచ్చిన స్పందనపై వార్తా కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత లక్ష్మణ్ రావు భారతీయ సాహిత్య కళా ప్రకాశన్ పేరిట స్వయంగా పబ్లిషింగ్ హౌస్ ను రిజిస్టర్ చేసుకున్నాడు. చదువుకునే రోజుల్లో నదిలో పడి కొట్టుకుపోయిన తన స్నేహితుడు రామదాస్ యధార్థగాథ లక్ష్మణ్ రావు రెండో పుస్తకంలో అక్షరంగా మారింది. 'రామ్దాస్' నవలకు అవార్డు దక్కడంతో పాటు దాన్ని నాటకంగా కూడ మలిచారు. నాటకమూ విజయవంతమై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దృష్టిలో పడింది. ఆమె లక్ష్మణ్రావును ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించి గౌరవించారు. ఇప్పటి వరకు 28 పుస్తకాలు రాయగా, 'రేణు' అనే నవలను మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చదివి లక్ష్మణ్ రావుపై ప్రశంసలు కురిపించారు. స్వయంగా ఆహ్వానించి రాష్ట్రపతి భవన్లో ఆతిథ్యం ఇచ్చారు. రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన ప్రస్తుతం 'ప్రధాన మంత్రి', బారిస్టర్ గాంధీ, 'పరంపర సే జుడీ భారతీయ రాజ్నీతి', 'పట్టియోంకీ సరసాత్' 'నర్మద' 'అహంకార్' 'అభివ్యక్తి' ఇలా మరెన్నో రచనలను త్వరలో ఆవిష్కరించనున్నారు. లక్ష్మణ్ రావు ఎవరి దగ్గరనుంచీ ఎటువంటి నిధులు, విరాళాలు స్వీకరించడు. ఎవరైనా ఇచ్చేందుకు ముందుకొచ్చినా సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇవ్వాలనుకునే వారు తన పుస్తకాలు కొని చేయూతనిమ్మంటాడు. జీవితం పట్ల సంతృప్తిగా ఉన్నానని, భవిష్యత్ లో పుస్తకాల అమ్మకాలు ఎక్కువైతే టీ అమ్మడం మానుకుని, పూర్తి సమయాన్ని రచనలకే వినియోగిస్తానని చెప్తున్న లక్ష్మణ్ ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నాడు. ఇంద్రప్రస్థ సాహిత్య భారతీ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఆయన్ను స్థానికులు నేటికీ చాయ్ వాలా లేఖక్ గా పిలుచుకుంటున్నారు. -
మజ్లిస్తోనే మా పోటీ
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలక్షన్ కమిటీ గురువారం హైదరాబాద్లో భేటీ అయింది. ఈ సందర్భంగా ఆ పార్టీ శాసన సభ పక్ష నేత డా. కె. లక్ష్మణ్ మాట్లాడుతూ... బల్దియా మేయర్ పీఠాన్ని తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు ప్రధాన పోటీ ఎంఐఎం అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటానికి వ్యూహాన్ని ఖరారు చేస్తున్నామన్నారు. అందుకోసం ఆగస్టు మొదటి వారం నుంచి ప్రజాక్షేత్రంలోని దిగుతామన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీకి చెందిన సీనియరు నేతలు పాల్గొన్నారు. -
ఇళ్లు కూల్చి పేదలను రోడ్డున పడేస్తారా..
మన పాలన అంటే ఇదేనా..? ప్రభుత్వంపై బీజేపీ శాసనసభా పక్షనేత లక్ష్మణ్ మండిపాటు జవహర్నగర్ : నిరుపేదలకు డబుల్ బెడ్రూం కట్టిస్తాం.. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అంటున్న సీఎం కేసీఆర్.. కూలీనాలీ చేసుకుని 60 గజాల్లో కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చివేయడం ఆయన నిరంకుశ ధోరణికి నిదర్శనమని బీజేపీ శాసనసభా పక్షనేత డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం సాయంత్రం జవహర్నగర్లోని అంబేద్కర్నగర్ ప్రాంతంలోని పలు కాలనీలలో రెవెన్యూ అధికారులు కూల్చిన ఇళ్లను పరిశీలించి బాధితులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఊరు.. మన పాలన, మన భూమి.. ఎవరు ఎక్కడ గుడిసె వేసుకుంటే అక్కడే పట్టాలిస్తామని ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనలు చేస్తుంటే.. జవహర్నగర్లో మాత్రం రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సర్వేల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం పద్ధతికాదన్నారు. జీఓ 58, 59 పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి క్రమబద్ధీకరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ విషయమై సీఎం కేసీఆర్తోపాటు కలెక్టర్ రఘునందన్రావుతో చర్చించనున్నట్లు తెలిపారు. ఇకపై పేదల ఇళ్లను కూల్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి బీజేపీ ముందుంటుందని ప్రజలకు లక్ష్మణ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి మోహన్రెడ్డి, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బుద్ది శ్రీను, తెలంగాణ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఇమ్మానుయేల్, నాయకులు మంద లక్ష్మీనారాయణ, ఎరుకల పెంటయ్య, ఆనందరావు, రామారావు, వడ్డెర వెంకటేష్ పాల్గొన్నారు. -
వడదెబ్బతో స్పృహతప్పిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో విధులు నిర్వరిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ శుక్రవారం స్ప్రహ తప్పి పడిపోయాడు. వడదెబ్బ కారణంగానే అతడు స్ప్రహ తప్పి పడిపోయినట్లు సమాచారం. సహచరులు వెంటనే స్పందించి అతడిని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.