Launches
-
షుగర్ పేషెంట్ల కోసం గ్లెన్మార్క్ కొత్త మెడిసిన్
ప్రముఖ ఔషధ సంస్థ గ్లెన్మార్క్ మధుమేహ రోగుల కోసం కొత్త మెడిషన్ విడుదల చేసింది. గ్లైసెమిక్ నియంత్రణ, బరువు తగ్గించే ఔషధాన్ని ప్రారంభించినట్లు గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. ముంబైకి చెందిన ఈ ఔషధ సంస్థ గ్లెంపా (ఎంపాగ్లిఫ్లోజిన్ 10/25 ఎంజీ) బ్రాండ్ పేరుతో విస్తృతంగా గుర్తింపు పొందిన ఎస్జీఎల్టీ2 ఇన్హిబిటర్ ఎంపాగ్లిఫ్లోజిన్ను తన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్డీసీ)'తో కలిపి విడుదల చేసింది.టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న వారిలో గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరచడానికి ఈ మందులను రూపొందించారు. అదే సమయంలో కార్డియోవ్యాస్కులర్ ముప్పు ఉన్న రోగులకు కూడా మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ (టీ2డీఎం) పేషంట్లలో గ్లైసెమిక్ నియంత్రణని మెరుగుపర్చడం, బరువు తగ్గడానికి మద్దతునివ్వడం, కార్డియోవాస్కులర్-రీనల్ రిస్కులను తగ్గించడంతో పాటు ఎంపాగ్లిఫ్లోజిన్ పలు ప్రయోజనాలు చేకూరుస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది.“భారత్లో కార్డియోమెటబోలిక్ సంరక్షణకు సంబంధించి వినూత్నమైన చికిత్సలను అందుబాటు స్థాయిలో ఆవిష్కరించడంలో గ్లెన్మార్క్కు ఘన చరిత్ర ఉంది. సీవీడీతో పాటు టీ2డీఎంను సమర్ధంగా ఎదుర్కొనడంలో పేషంట్లకు, హెల్త్కేర్ నిపుణులకు సాధికారత కల్పించేందుకు సమగ్రమైన, చౌకైన సొల్యూషన్ను అందించాలన్న మా నిబద్ధతకు గ్లెంపా శ్రేణి ఆవిష్కరణ నిదర్శనంగా నిలుస్తుంది” అని గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ఇండియా ఫార్ములేషన్స్ బిజినెస్ అలోక్ మాలిక్ తెలిపారు. -
అల్ట్రావయొలెట్ తొలి స్కూటర్ వచ్చేసింది..
ఎలక్ట్రిక్ బైక్లు తయారు చేసే అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్సెరాక్ట్ (Ultraviolette Tesseract) విడుదలతో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి బోల్డ్ ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులో జరిగిన కంపెనీ "ఫాస్ట్ ఫార్వర్డ్ ఇండియా" కార్యక్రమంలో తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్తోపాటు అడ్వెంచర్-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ‘షాక్ వేవ్’ను ఆవిష్కరించింది.ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్. మొదటి 10,000 కొనుగోలుదారులకు మాత్రమే రూ .1.20 లక్షలకు (ప్రారంభ ధర) లభిస్తుంది. ఆ తర్వాత రూ .1.45 లక్షలు పెట్టి కొనాల్సి ఉంటుంది. టెస్సరాక్ట్ అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే పనితీరును కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. 20.1 బీహెచ్నీ పవర్ మోటార్ తో నడిచే ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 125 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. కేవలం 2.9 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 261 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది.7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను టెస్సెక్ట్ కలిగి ఉంది. రాడార్ అసిస్టెడ్ కొలిషన్ అలర్ట్స్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్ టేక్ అలర్ట్స్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ టెక్నాలజీలను ఇందులో పొందుపరిచారు. ఈ స్కూటర్లో విశాలమైన 34-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇచ్చారు. యుద్ధ హెలికాప్టర్ల ప్రేరణతో దీని సొగసైన డిజైన్ను రూపొందించారు.షాక్వేవ్.. తొలి ఎలక్ట్రిక్ ఎండ్యూరో బైక్టెస్సెరాక్ట్ తో పాటు అల్ట్రావయోలెట్ భారతదేశపు మొట్టమొదటి రోడ్-లీగల్ ఎలక్ట్రిక్ ఎండ్యూరో మోటార్ సైకిల్ అయిన షాక్ వేవ్ (Ultraviolette Tesseract) ను కూడా లాంచ్ చేసింది. మొదటి 1,000 కొనుగోలుదారులు రూ .1.50 లక్షలకు (ఆ తర్వాత రూ .1.75 లక్షలు) దీన్ని సొంతం చేసుకోవచ్చు. అడ్వెంచర్ ఔత్సాహికుల కోసం ఈ బైక్ను రూపొందించారు. 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉన్న ఈ బైక్ 165 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. ఈ బైక్ 2.9 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.షాక్వేవ్ కఠినమైన డిజైన్ లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, వైర్-స్పోక్ వీల్స్, డ్యూయల్-పర్పస్ టైర్లను కలిగి ఉంది. ఆఫ్-రోడ్తోపాటు పట్టణ భూభాగాలకు అనుకూలంగా ఉంటుంది. స్విచబుల్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, నాలుగు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్లు, ఆరు లెవల్స్ రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
టీవీఎస్ జూపిటర్ కొత్త బండి లాంచ్
టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. అధునాతన ఎమిషన్ టెక్నాలజీలను ఇందులో టీవీఎస్ వినియోగించింది. కొత్త టీవీఎస్ జూపిటర్ 110 బేస్ డ్రమ్ వేరియంట్ ప్రారంభ ధరను రూ .76,691గా (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది.వేరియంట్లు.. ధరలు2025 టీవీఎస్ జూపిటర్ 110 విభిన్న కస్టమర్ ప్రాధాన్యతలను తీర్చడానికి నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ డ్రమ్ వేరియంట్ ధర రూ.76,691. ఇది అన్నింటిలో కాస్త తక్కువ ఖరీదు మోడల్. డ్రమ్ అల్లాయ్ వేరియంట్ ధర రూ.82,441. ఇది మెరుగైన లుక్, మన్నిక కోసం అల్లాయ్ వీల్స్ ను అందిస్తుంది. డ్రమ్ ఎస్ఎక్స్సీ వేరియంట్ ధర రూ.85,991. ఇందులో అదనపు స్టైలింగ్, కన్వీనియన్స్ ఫీచర్లు ఉన్నాయి. డిస్క్ ఎస్ఎక్స్సి వేరియంట్ రూ .89,791 ధరతో మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్తో వస్తుంది.OBD-2B ప్రయోజనాలుOBD-2B (ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్) టెక్నాలజీ అనేది సరికొత్త అప్ గ్రేడ్. ఇది క్లిష్టమైన ఇంజిన్ ఉద్గార పారామీటర్ల రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తుంది. అధునాతన సెన్సార్లతో కూడిన టీవీఎస్ జూపిటర్ 110 థ్రోటిల్ రెస్పాన్స్, ఎయిర్-ఫ్యూయల్ రేషియో, ఇంజిన్ టెంపరేచర్, ఫ్యూయల్ క్వాంటిటీ, ఇంజిన్ వేగాన్ని ట్రాక్ చేయగలదు. ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) సరైన పనితీరు, మెరుగైన మన్నిక, తక్కువ ఉద్గారాలను ధృవీకరించడానికి ఈ డేటాను రియల్ టైమ్ లో ప్రాసెస్ చేస్తుంది. ఇది స్కూటర్ ను దాని జీవితచక్రం అంతటా క్లీనర్గా, మరింత పర్యావరణ అనుకూలమైనదిగా చేస్తుంది.ఇంజిన్, పనితీరుకొత్త టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్లో 113.3సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజన్ ఇచ్చారు. ఇది 6,500 ఆర్పీఎం వద్ద 5.9 కిలోవాట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ అసిస్ట్ తో 5,000 ఆర్పీఎం వద్ద 9.8 ఎన్ఎం టార్క్, 5,000 ఆర్పీఎం వద్ద 9.2 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్మూత్ యాక్సిలరేషన్, ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. సౌకర్యవంతమైన, స్థిరమైన రైడ్ కోసం రూపొందించిన ఈ స్కూటర్లో 1,275 మిమీ వీల్ బేస్, 163 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది.ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త మైలురాయిడిజైన్, ఫీచర్లుటీవీఎస్ జూపిటర్ 110లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, డీఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడీ హెడ్లైట్లు, కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, నావిగేషన్, ఐగో అసిస్ట్, హజార్డ్ ల్యాంప్స్, వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది రెండు వైపులా 12-అంగుళాల వీల్స్ ఉంటాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు , వెనుక భాగంలో మోనో-షాక్ ను కలిగి ఉంది. రెండు వీల్స్కు డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లు అధిక ట్రిమ్ లలో లభిస్తాయి. -
యాక్సిస్ నుంచి.. కొత్త ‘ఫండ్’ గురూ..!
యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ నిఫ్టీ ఎఎఎ బాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ – మార్చ్ 2028 ఇండెక్స్ ఫండ్ను ప్రవేశపెట్టింది. ఇది, నిఫ్టీ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాండ్ మార్చ్ 2028 ఇండెక్స్లోని సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. ఒక మోస్తరు వడ్డీ రేటు రిస్కు, మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ క్రెడిట్ రిస్కు ఉంటుంది.దీనికి ఫండ్ మేనేజరుగా హార్దిక్ షా వ్యవహరిస్తారు. ఈ న్యూ ఫండ్కి నిఫ్టీ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాండ్ మార్చ్ 2028 ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. మార్చ్ 4 వరకు ఎన్ఎఫ్వో అందుబాటులో ఉంటుంది.ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో అత్యంత నాణ్యమైన, ఎఎఎ–రేటింగ్ ఉన్న సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఈ కొత్త స్కీము అవకాశం కల్పిస్తుందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ – సీఈవో బి. గోప్కుమార్ తెలిపారు. రిస్కులు, రాబడుల మధ్య సమతౌల్యాన్ని కోరుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని వివరించారు. -
శాంసంగ్ నుంచి మూడు కొత్త స్మార్ట్ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) తన గెలాక్సీ ఎ-సిరీస్ లైనప్లో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను భారత్లో విడుదల చేసింది. అవి శాంసంగ్ గెలాక్సీ ఎ56, గెలాక్సీ ఎ36, గెలాక్సీ ఎ26. ఆకట్టుకునే ఫీచర్లు, ఆకర్షణీయ ధరలో విస్తృత శ్రేణి వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ డివైజ్ లను రూపొందించారు. వీటిలో ఏయే స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.. ధరలెంత అన్న విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..గెలాక్సీ ఎ56గెలాక్సీ ఎ56 కొత్త లైనప్ లో ఫ్లాగ్ షిప్ మోడల్. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఎక్సినోస్ 1580 చిప్ సెట్ తో నడిచే ఏ56 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లను అందిస్తుంది.. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ డ్యూయల్ 5జీ సిమ్ కార్డులకు సపోర్ట్ చేస్తుంది.కెమెరా సామర్థ్యాల విషయానికి వస్తే, గెలాక్సీ ఎ56లో విభిన్న ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ కూడా ఉంది.గెలాక్సీ ఎ56 మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి ఆసమ్ ఆలివ్, ఆసమ్ లైట్గ్రే, ఆసమ్ గ్రాఫైట్. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.41,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.44,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.47,999గానూ కంపెనీ నిర్ణయించింది.గెలాక్సీ ఏ36గెలాక్సీ ఎ36 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో సహా అనేక ఫీచర్లను ఎ56లో మోడల్లో ఉన్నట్లుగానే ఉంటాయి. అయితే ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ను అందించారు. ఏ36లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ను ఇచ్చారు.గెలాక్సీ ఏ36లో కెమెరా సెటప్ విషయానికి వస్తే ఓఐఎస్తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఇక ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్. ఎ56 మాదిరిగానే ఎ36 కూడా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ కూడా ఉంది.గెలాక్సీ ఎ36 లావెండర్, బ్లాక్, వైట్ రంగులలో లభిస్తుంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.32,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.35,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.38,999గానూ నిర్ణయించారు.గెలాక్సీ ఏ26గెలాక్సీ ఎ26 కొత్త లైనప్ లో అత్యంత చవక మోడల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + సూపర్ అమోలెడ్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ పై పనిచేసే ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను అందించారు.గెలాక్సీ ఏ26లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ ఉంది.గెలాక్సీ ఏ26 ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. బ్లాక్, వైట్, మింట్, పీచ్ పింక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. -
బ్లేడ్ బ్యాటరీ బస్సు.. బుల్లి కారు..
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో (Bharat mobility expo 2025)వివిధ కంపెనీల నుంచి నూతన ఎలక్ట్రిక్ వాహనాలు కొలువుదీరాయి. వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ ఆటో భారత్కు ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. వీఎఫ్–7, వీఎఫ్–6 ఎలక్ట్రిక్ ఎస్యూవీలను ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరినాటికి వీటిని మార్కెట్లోకి తేనున్నట్టు తెలిపింది. తమిళనాడులోని ట్యూటికోరిన్ వద్ద 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రం స్థాపించనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది రెండవ అర్ద భాగంలో ఈ ప్లాంటు రెడీ అవుతుందని విన్ఫాస్ట్ ఆసియా సీఈవో పామ్ సాన్ ఛావ్ తెలిపారు.హ్యుండై టీవీఎస్ జోడీహ్యుండై మోటార్ కంపెనీ, టీవీఎస్ మోటార్ కంపెనీ చేతులు కలిపాయి. అధునాతన ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లు, చిన్న ఫోర్–వీలర్లను అభివృద్ధి చేసే లక్ష్యంతో భాగస్వామ్యాన్ని అన్వేషించనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా హ్యుండై తన మైక్రో మొబిలిటీ కాన్సెప్ట్ ఈవీలను ఆవిష్కరించింది. ఈ భాగస్వామ్యం కార్యరూపం దాలిస్తే డిజైన్, ఇంజనీరింగ్, సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలని హ్యుండై యోచిస్తోంది. అయితే భారత్లో ఈ వాహనాల తయారీ, మార్కెటింగ్పై టీవీఎస్ దృష్టి పెడుతుంది.కొలువుదీరిన ఎంజీ మోడళ్లుజేఎస్డబ్లు్య ఎంజీ మోటార్ ఇండియా మజెస్టర్ పేరుతో మధ్యస్థాయి ఎస్యూవీని ఆవిష్కరించింది. కాంపాక్ట్ కార్స్ కంటే పెద్దగా, పూర్తి స్థాయి కార్స్ కంటే చిన్నగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఐఎం5, ఐఎం6, ఎంజీ హెచ్ఎస్, ఎంజీ7 ట్రోఫీ ఎడిషన్ మోడళ్లను సైతం కంపెనీ ప్రదర్శించింది. మోంట్రా ఎలక్ట్రిక్ కొత్త మోడళ్లుమురుగప్ప గ్రూప్ కంపెనీ మోంట్రా ఎలక్ట్రిక్ రెండు కొత్త వాహనాలను లాంచ్ చేసింది. ఈవియేటర్ పేరుతో చిన్న తరహా వాణిజ్య వాహనాన్ని, సూపర్ కార్గో పేరుతో త్రీవీలర్ను ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్తో ఈవియేటర్ 245 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.15.99 లక్షలు. సూపర్ కార్గో ఈ–త్రీవీలర్ 200 కిలోమీటర్లపైగా పరుగెడుతుంది. పూర్తి ఛార్జింగ్ కోసం 15 నిమిషాలు సమయం తీసుకుంటుంది. ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.4.37 లక్షలు. కంపెనీ 55 టన్నుల హెవీ కమర్షియల్ ఎలక్ట్రిక్ ట్రక్ రైనో సైతం ప్రదర్శించింది. బీవైడీ సీలయన్–7..చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం బీవైడీ భారత్లో సీలయన్–7 కూపే–ఎస్యూవీ ఆవిష్కరించింది. కంపెనీ నుంచి ఇది భారత మార్కెట్లో నాల్గవ మోడల్గా నిలవనుంది. 82.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్ చేస్తే వేరియంట్నుబట్టి 542–567 కిలోమీటర్లు పరుగెడుతుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పర్ఫామెన్స్ వేరియంట్ 4.5 సెకన్లలో, ప్రీమియం వేరియంట్ 6.7 సెకన్లలో అందుకుంటుంది.ఒలెక్ట్రా బ్లేడ్ బ్యాటరీ ఛాసీ..హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా 12 మీటర్ల పొడవున్న బ్లేడ్ బ్యాటరీ ఛాసీని ఆవిష్కరించింది. 9 మీటర్ల పొడవున్న సిటీ బస్, 12 మీటర్ల పొడవుతో కోచ్ బస్ సైతం ప్రదర్శించింది. బ్లేడ్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2024 సెప్టెంబర్ 30 నాటికి 2,200లకుపైగా యూనిట్ల ఎలక్ట్రిక్ బస్లను సరఫరా చేసి ప్రజా రవాణా రూపు రేఖలను మార్చినట్టు ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. అశోక్ లేలాండ్ సాథీవాణిజ్య వాహనాలు, బస్ల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ సాథి పేరుతో తేలికపాటి చిన్న వాణిజ్య వాహనాన్ని ఆవిష్కరించింది. అత్యాధునిక ఎల్ఎన్టీ సాంకేతికతతో తయారైంది. 45 హెచ్పీ పవర్, 110 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. 1,120 కిలోల బరువు మోయగలదు. ధర రూ.6.49 లక్షలు. అలాగే మల్టీ యాక్సెల్, ఫ్రంట్ ఇంజన్, 15 మీటర్ల పొడవున్న గరుడ్–15 ప్రీమియం బస్ సైతం కొలువుదీరింది. 42 స్లీపర్ బెర్తులను ఈ బస్లో ఏర్పాటు చేశారు. కాగా, ఈ–టిరాన్ పేరుతో ఎలక్ట్రిక్ పోర్ట్ టెర్మినల్ ట్రాక్టర్ను సైతం కంపెనీ ఆవిష్కరించింది. మైక్రో మొబిలిటీతో బజాజ్?స్విట్జర్లాండ్కు చెందిన మైక్రో మొబిలిటీ సిస్టమ్స్లో వాటాను కొనుగోలు చేయడంతో సహా ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిళ్లను ఉత్పత్తి, ఎగుమతి చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం బజాజ్ ఆటో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మైక్రోలీనో పేరుతో రెండు సీట్ల ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ను, అలాగే మైక్రోలెటా పేరుతో మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ను మైక్రో మొబిలిటీ తయారు చేస్తోంది. నగరాల్లో తక్కువ దూరం ప్రయాణానికి అనువైన వాహనాల తయారీలో మైక్రో మొబిలిటీ సిస్టమ్స్కు పేరుంది.జేబీఎం ఎలక్ట్రిక్ కొత్త వాహనాలుజేబీఎం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎక్స్పో వేదికగా గెలాక్సీ లగ్జరీ కోచ్, ఎక్స్ప్రెస్ ఇంటర్సిటీ బస్, లో ఫ్లోర్ మెడికల్ మొబైల్ యూనిట్ ఈ–మెడిలైఫ్, దేశంలో తొలిసారిగా 9 మీటర్ల పొడవున్న టార్మాక్ కోచ్ ఈ–స్కైలైఫ్ను విడుదల చేసింది. లిథియం–అయాన్ బ్యాటరీలు కలిగిన ఈ వాహనాలకు ఆల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది. ఇప్పటికే కంపెనీ భారత్తోపాటు యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో 1,800 ఎలక్ట్రిక్ బస్లను విక్రయించింది. 10,000 పైచిలుకు ఈ–బస్లకు ఆర్డర్ బుక్ ఉందని జేబీఎం గ్రూప్ వైస్ చైర్మన్ నిశాంత్ ఆర్య తెలిపారు. -
గోద్రెజ్ కొత్త రకం డిజిటల్ స్మార్ట్ లాక్ ప్రారంభం
గోద్రెజ్ (Godrej) ఎంటర్ప్రైజెస్ గ్రూప్ వ్యాపార విభాగం అయిన లాక్స్ అండ్ ఆర్కిటెక్చరల్ సొల్యూషన్స్ తమ అడ్వాంటిస్ ఐఓటీ9 (Advantis IoT9) స్మార్ట్ లాక్ను తెలుగురాష్ట్రాల్లో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో అడ్వాంటిస్ IoT9 స్మార్ట్ లాక్ను ప్రారంభించినట్లు ప్రకటించింది.ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సాంకేతికతతో అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ స్మార్ట్ లాక్ శ్రేణి ఇంటికి మెరుగైన భద్రతను అందిస్తుంది. డిజిటల్ లాక్లలో IoT9ని పరిచయం చేసిన మొదటి బ్రాండ్ ఇదే. ఈ డిజిటల్ లాక్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో 100 కుపైగా రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్లో భాగమైన లాక్స్ అండ్ ఆర్కిటెక్చరల్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ శ్యామ్ మోత్వాని మాట్లాడుతూ.. హైదరాబాద్లో అడ్వాంటిస్ IoTని ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నామని, ఈ నగరం డిజిటల్ లాక్లకు కీలకమైన మార్కెట్గా ఉద్భవించిందని పేర్కొన్నారు.అడ్వాంటిస్ ఐఓటీ9 ముఖ్య ఫీచర్లుబ్లూటూత్, వైఫై, ఎన్ఎఫ్సీ, స్మార్ట్వాచ్లు, ఫింగర్ప్రింట్, ఆర్ఎఫ్ఐడీ కార్డ్లు, పాస్కోడ్లు, మెకానికల్ కీ లేదా రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ లాక్ను అన్లాక్ చేయొచ్చు. ఇంగ్లీష్, హిందీతోపాఉట ప్రాంతీయ భాషలలో వాయిస్-గైడెడ్ ఆదేశాలతో పని చేస్తుంది. లాక్ చేయకుండా సౌకర్యవంతమైన కదలిక కోసం పాసేజ్ మోడ్ ఉంది. అత్యవసర సమయంలో ఫైర్ అలారం మోగుతుంది. ఎవరైనా ట్యాంపర్ చేయడానికి ప్రయత్నిస్తే మూడు తప్పు ప్రయత్నాల తర్వాత యాప్ నోటిఫికేషన్లను పంపుతుంది. దేశంలోనే హోస్ట్ చేసే ఇంటిగ్రేటెడ్ క్లౌడ్ స్టోరేజ్ వినియోగదారు డేటా భద్రతను నిర్ధారిస్తుంది. -
లాంచీ సర్వీసుల లాంచింగ్
నాగార్జునసాగర్/ కొల్లాపూర్ రూరల్: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంకు కృష్ణానదిలో ఒకేరోజు రెండు ప్రధాన కేంద్రాల నుంచి లాంచీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. నాగార్జున సాగర్ నుంచి ఒకటి, సోమశిల నుంచి మరొక లాంచీ సర్వీ స్ను శనివారం ప్రారంభించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో వీటిని నడుపుతున్నారు. కార్తీకమాసం తొలిరోజున శనివారం నాగార్జునసాగర్ నుంచి నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ జెండా ఊపి లాంచీని ప్రారంభించారు. నాగార్జున సాగర్ జలాశయంలో సరిపడా నీటి లభ్యత లేకపోవడం, కరోనా తదితర కారణాలతో ఐదు సంవత్సరాలుగా నాగా ర్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని నిలిపి వేశారు. ఈ సంవత్సరం విస్తృతంగా వర్షాలు కురిసి నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో పర్యాటకశాఖ లాంచీ ప్రయాణాన్ని పునఃప్రారంభించింది. నదిలో సుమారు 110 కిలోమీటర్ల దూరం ఐదు గంటలపాటు ఈ లాంచీ ప్రయాణం కొనసాగుతుంది. లాంచీలో ప్రయాణి కులు నాగార్జునసాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ అందాలను వీక్షించేలా ప్రయాణం ఉంటుందని పర్యాటక శాఖ అధికా రులు తెలిపారు. మరోవైపు నాగర్కర్నూల్ జిల్లా సోమశిల నుంచి కూడా శ్రీశైలం వరకు శనివారం లాంచీ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 110 మంది ప్రయాణికులు ప్రయాణించేలా ఏసీ లాంచీని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంవరకు లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ. 1,600 ధర నిర్ణయించారు. సోమశిల నుంచి శ్రీశైలంకు రాను పోను ప్రయాణ టికెట్ పెద్దలకు రూ.3 వేలు, పిల్లలకు 2,400గా నిర్ణయించారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఒక ట్రిప్పుకు మాత్రమే అయితే పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1,600గా టికెట్ను నిర్ణయించారు. తొలిరోజు సోమశిల నుంచి 50 మంది ప్రయాణించారు. నాగార్జునసాగర్ జలాశ యం నీటిమట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణి కుల రద్దీనిబట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నారు. కార్యక్రమంలో లాంచీ మేనేజర్ హరి, ఉద్యోగుల సంఘం నాయకులు నర్సింహ పాల్గొన్నారు. -
‘డ్రీమ్’ మిషన్ను లాంచ్ చేసిన చైనా
బీజింగ్: చైనా తన డ్రీమ్ మిషన్ అయిన షెంజౌ-19ను విజయవంతంగా ప్రయోగించింది. చైనాలోని జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఈరోజు (బుధవారం)తెల్లవారు జామున 4.27 గంటలకు (చైనా కాలమానం ప్రకారం) ఈ మిషన్ ఆకాశంలోకి దూసుకెళ్లింది.ఈ మిషన్లో భాగంగా ఒక మహిళా స్పేస్ ప్లైట్ ఇంజనీర్తో సహా ముగ్గురు వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు బయలుదేరారు. షెంజౌ-19 నింగిలోకి దూసుకెళ్లిన పది నిమిషాల అనంతరం ఆ వ్యోమగాములతో కూడిన అంతరిక్ష నౌక రాకెట్ నుండి విడిపోయి దాని కక్ష్యలోకి ప్రవేశించింది. వ్యోమగాములంతా క్షేమంగా ఉన్నారని, ప్రయోగం విజయవంతమైందని చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ వెల్లడించింది. Congratulations to the successful launch of #Shenzhou19 crewed spaceship🚀 and wish the 3 astronauts all the best! #SpaceChina pic.twitter.com/v26V0pAExK— CAI Run 蔡润 (@AmbCaiRun) October 29, 2024ఈ షెంజౌ-19లో మిషన్ కమాండర్ కై జుబేతో పాటు వ్యోమగాములు సాంగ్ లింగ్ డాంగ్, వాంగ్ హవోజ్ ఉన్నారు. కై జుబే ఎంతో అనుభవజ్ఞుడైన వ్యోమగామి. దీనికి ముందు ఆయన 2022లో షెంజౌ-14 మిషన్లో పాల్గొని అంతరిక్షంలో ప్రయాణించారు. వాంగ్ ప్రస్తుతం చైనాలో ఏకైక మహిళా అంతరిక్ష ఇంజనీర్గా పేరొందారు. ఆమె అంతరిక్ష యాత్రకు వెళ్లిన మూడో చైనా మహిళ అని స్పేస్ ఏజెన్సీ మీడియాకు తెలిపింది. ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
వస్త్రం బై సింఘానియాస్ను ప్రారంభించిన ఏపీ మిస్ యూనివర్స్ (పోటోలు)
-
ఎయిర్టెల్ సంచలన ఫీచర్.. కస్టమర్లకు ఇక నో టెన్షన్!
స్పామ్, అవాంఛిత కాల్స్, మెసేజ్ల బెడద రోజురోజుకీ పెరుగుతోంది. ఇవి మొబైల్ యూజర్లను విసిగించడమే కాకుండా వారిని మోసాలకు సైతం గురిచేస్తున్నాయి. ఈ ముప్పును అరికట్టడానికి భారతీ ఎయిర్టెల్ సంచలన ఫీచర్ను తీసుకొచ్చింది. “దేశంలో మొట్టమొదటి ఏఐ శక్తియుత, నెట్వర్క్ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్”ను ఆవిష్కరించింది. తమ కస్టమర్ల కోసం ఇన్హౌస్ టూల్గా ఎయిర్టెల్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది అనుమానిత స్పామ్ కాల్స్, మెసేజ్లపై కస్టమర్లకు రియల్-టైమ్ అలర్ట్స్ను అందిస్తుంది. తద్వారా అటువంటి అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్లు చాలా వరకు కట్టడయ్యే అవకాశం ఉంటుందని కంపెనీ చెబుతోంది.“స్పామ్ కస్టమర్లకు పెనుముప్పుగా మారింది. మేము గత పన్నెండు నెలలుగా దీనిని సమగ్రంగా పరిష్కరించడం కోసం కృషి చేశాం. దేశ మొట్టమొదటి ఏఐ-ఆధారిత స్పామ్-రహిత నెట్వర్క్ను ప్రారంభించడం ద్వారా ఈ రోజు ఒక మైలురాయిని సూచిస్తుంది“ అని ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గోపాల్ విట్టల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఉచితంగా..ఈ ఫీచర్ను తమ కస్టమర్లకు ఎయిర్టెల్ ఉచితంగా అందించనుంది. వినియోగదారులందరికీ ఆటోమేటిక్గా యాక్టివేట్ చేస్తారు. అంటే దీని కోసం సర్వీస్ రిక్వెస్ట్ పెట్టాల్సిన పని గానీ, దానిని యాక్సెస్ చేయడానికి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం గానీ లేదు.ఇదీ చదవండి: జియో సూపర్హిట్ ప్లాన్..ఈ సిస్టమ్ డ్యూయల్-లేయర్డ్ “AI షీల్డ్”ను ఉపయోగించడం ద్వారా పని చేస్తుందని ఎయిర్టెల్ వివరించింది. ఇది నెట్వర్క్ అలాగే ఐటీ సిస్టమ్ స్థాయిలు రెండింటిలోనూ ప్రతి కాల్ను, ఎస్ఎంఎస్ని ఫిల్టర్ చేస్తుంది. ఇది సందేశాలను గుర్తిస్తుండగా ప్రతిరోజూ 150 కోట్ల మేసేజ్లను, 250 కోట్ల కాల్స్ను ప్రాసెస్ చేసి 30 లక్షల స్పామ్ ఎస్ఎంఎస్లు, 10 కోట్ల స్పామ్ కాల్స్ గుర్తించగలదని విట్టల్ వెల్లడించారు. -
ఎల్ఐసీ నుంచి మాన్యుఫాక్చరింగ్ ఫండ్
ముంబై: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ తయారీ రంగంలో పెట్టుబడుల అవకాశాలతో ‘మాన్యూఫాక్చరింగ్ ఫండ్’ను ప్రారంభించింది. అక్టోబర్ 4 వరకు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని తెలిపింది. నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్ ఈ పథకానికి ప్రామాణికంగా ఉంటుందని పేర్కొంది. తయారీ రంగంలో వైవిధ్యమైన కంపెనీలతో కూడిన పోర్ట్ఫోలియోని ఈ పథకం అందిస్తుందని, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, హెవీ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, మెటల్స్, షిప్ బిల్డింగ్, పెట్రోలియం ఉత్పత్తుల కంపెనీలకు ఇందులో చోటు ఉంటుందని వివరించింది.ఈ సందర్భంగా కొత్త పథకం (ఎన్ఎఫ్వో) వివరాలను ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో ఆర్కే ఝా వెల్లడించారు. తయారీ థీమ్ లోని కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పె డుతుందని, ఇన్వెస్టర్లకు మంచి సంపద సమకూర్చడమే మాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఆవిష్కరణ ఉద్దేశ్యమని చెప్పా రు. ఇన్వెస్టర్లు రోజువారీగా రూ. 300 లేదా నెలవారీగా రూ.1,000 నుంచి, త్రైమాసికం వారీగా అయితే రూ.3,000 చొప్పున ఈ పథకంలో సిప్ చేసుకోవచ్చని తెలిపారు.‘‘ఈ పథకం అక్టోబర్ 16 నుంచి తిరిగి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు రోజువారీ సిప్ రూ.100కు, నెలవారీ సిప్ రూ.200కు తగ్గుతుంది. తక్కువ ఆదాయంలో ఉన్న వారు సైతం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు’’ అని ఝా వివరించారు. ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రూ.5,000 నుంచి చేసుకోవచ్చని చెప్పారు. పరిశ్రమ వ్యాప్తంగా 11 మాన్యుఫాక్చరింగ్ ఫండ్స్ ఉన్నాయని, వీటి నిర్వహణలో రూ.34,700 కోట్ల ఆస్తులున్నట్టు తెలిపారు. -
పునర్వినియోగ రాకెట్ రూమీ–1
చెన్నై: పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ–1ను భారత్ మొట్టమొదటిసారిగా ప్రయోగించింది. 80 కిలోల ఈ రాకెట్ తమళినాడులోని చెన్నై తీరం నుంచి శనివారం ఉదయం హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. అతి తక్కువ బరువున్న మూడు క్యూబ్ ఉపగ్రహాలు, 50 పికో ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లింది. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితులు, ఓజోన్ పొరలో మార్పులు, గ్లోబల్ వారి్మంగ్ వంటి అంశాలపై ఈ ఉపగ్రహాలు అధ్యయనం చేస్తాయి. భూమిపైకి విలువైన సమాచారం చేరవేస్తాయి. తమిళనాడులోని స్పేస్జోన్ అనే స్టార్టప్ కంపెనీ మారి్టన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో కలిసి రూమీ–1 రాకెట్ను అభివృద్ధి చేసింది. మిషన్ రూమీ–2024 విజయవంతం కావడం వెనుక ఆయా సంస్థ కృషి ఉంది. ఈ ప్రయోగంలో 1,500 మంది పాఠశాల విద్యార్థులు సైతం పాలుపంచుకున్నారు. రూమీ–1 రాకెట్ 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని, ఉపగ్రహాలను ఉపకక్ష్య ప్రాంతంలో విడిచిపెట్టిందని స్పేస్జోన్ ప్రతినిధులు చెప్పారు. సాధారణంగా ఉపగ్రహ ప్రయోగం పూర్తయిన తర్వాత రాకెట్ వాతావరణంలో మండిపోవడమో లేక సముద్రంలో కూలిపోవడమో జరుగుతుంది. కానీ, పారాచూట్ల సాయంతో రాకెట్ను భూమికి చేర్చి, మళ్లీ వినియోగి ంచుకోవడం పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రత్యేకత. రాకెట్ ప్రయోగాల ఖ ర్చును తగ్గించాలన్న లక్ష్యంతో పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ను తయారు చేసినట్లు స్పేస్జోన్ కంపెనీ వెల్లడించింది. -
హైదరాబాద్లో సంయుక్త మీనన్ డైమండ్ స్టోర్ ప్రారంభం (ఫొటోలు)
-
పిల్లల కోసం నటి ఆలియా భట్ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్ (ఫొటోలు)
-
‘ఆప్ కా రామ్రాజ్య్’ లాంచ్ చేసిన ఆమ్ ఆద్మీ!
శ్రీరామ నవమి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్ కా రామరాజ్య్’ వెబ్సైట్ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆప్ నేత సంజయ్ సింగ్ తెలియజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ ప్రస్తావించిన రామరాజ్యంలో అసమానత లేదని, రామరాజ్యం నెలకొల్పాలనే కలను సాకారం చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ ఎంతగానో కృషి చేశారన్నారు. అరవింద్ కేజ్రీవాల్ లేకుండా చేసుకుంటున్న తొలి శ్రీరామనవమి ఇదేనని అన్నారు. అయితే కేజ్రీవాల్ జైలు నుంచి తమకు సందేశాలు పంపుతూనే ఉన్నారని, అతనిపై నిరాధారమైన కేసులు బనాయించారని సంజయ్ సింగ్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్పై ప్రధానికి ద్వేషం ఉందని, ఎందుకంటే కేజ్రీవాల్ చేస్తున్న పనులను ప్రధాని చేయలేరన్నారు. ఈ సందర్భంగా మరోనేత అతిశీ మాట్లాడుతూ రఘుకుల సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని, ప్రాణం పోయినా ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘించకూడదన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఢిల్లీ, పంజాబ్ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ మేలు చేస్తున్నారన్నారు. రాముడు అజ్ఞాతవాసానికి వెళ్లవలసి వచ్చినప్పటికీ, తాను ఇచ్చిన మాట తప్పలేదని, అదేవిధంగా ఢిల్లీలో స్కూళ్లు, హెల్త్, విద్యుత్ వ్యవస్థ బాగున్నాయా లేదా అని తమకు మెసేజ్ పంపారన్నారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ రామరాజ్యంలో అందరిలో ప్రేమ, సోదరభావం ఉండేదని అన్నారు. -
అప్పుడేం జరిగిందో యువతకు తెలియాలి
బాబీ సింహా, వేదిక, మకరంద్ దేశ్పాండే, రాజ్ అర్జున్, అనుష్యా త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ ఫిల్మ్ ‘రజాకార్’. ‘సైలెంట్ జెనొసైడ్ ఆఫ్ హైదరాబాద్’ (హైదరాబాద్లో జరిగిన నిశ్శబ్ద మారణహోమం) అనేది ట్యాగ్లైన్. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మార్చి 1న విడుదల కానుంది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం నిజాం పాలన, సామాన్య ప్రజలపై రజాకార్ల క్రూరమైన చర్యలు, నిజాం పాలన నుంచి ప్రజలు విముక్తి పొందేలా సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన వ్యూహాత్మక ప్రయత్నాలు వంటి అంశాల నేపథ్యంతో ‘రజాకార్’ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటి–దర్శక–నిర్మాత కంగనా రనౌత్ మాట్లాడుతూ– ‘‘రజాకార్’ సినిమా పట్ల చిత్ర యూనిట్ చూపిస్తున్న అంకితభావం, తపన నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’’ అన్నారు. ‘‘చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన, గౌరవించుకోవాల్సిన ఓ అధ్యాయాన్ని ‘రజాకార్’ సినిమాగా తీశాం. 15 ఆగస్టు 1947–17 సెప్టెంబరు 1948ల మధ్య నిజాం పాలనలో ఏం జరిగింది? అనే అంశాలు ఈ తరం యువతీ యువకులకు తెలియాల్సిన అవసరం ఉంది’’ అన్నారు నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి. ‘‘నిరంకుశత్వం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన వారి పరాక్రమాన్ని ఈ సినిమాలో వెండితెరపై చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు దర్శకుడు యాటా సత్య నారాయణ. -
ఆన్లైన్ ద్వారా సమ్మక్క–సారలమ్మలకు ‘బంగారం’
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారలమ్మలకు ఆన్లైన్ ద్వారా నిలువెత్తు బంగారం (బెల్లం) సమరి్పంచే కార్యక్రమాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం.. అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం తన మనవడు రియాన్‡్ష పేరిట నిలువెత్తు బంగారాన్ని ఆన్లైన్ ద్వారా సమర్పించారు. అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా ఈ సందర్భంగా తన మనవరాలి నిలువెత్తు బంగారాన్ని ఆన్లైన్ ద్వారా అమ్మవార్లకు సమరి్పంచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. మేడారంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధిస్తూ పోస్టర్ మేడారం మహాజాతరలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ, జాతరను పరిశుభ్రంగా జరుపుకోవాలని భక్తులను కోరుతూ సీఎం రేవంత్రెడ్డి ఓ పోస్టర్ను ఆవిష్కరించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పోస్టర్ను ఆవిష్కరించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొన్నారు. -
కొత్త సంవత్సరంలో వస్తున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే..
కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా? పాత ఫోన్లు బోర్ కొట్టేశాయా? లేటెస్ట్ ఫీచర్లతో వచ్చే టాప్ బ్రాండ్ల సరికొత్త స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? మీలాంటి వారి కోసమే ఈ సమాచారం. షావోమీ, శాంసంగ్, వన్ప్లస్, వీవో వంటి టాప్ స్మార్ట్ఫోన్ బ్రాండ్లు 2024 సంవత్సరం జనవరి నెలలో పలు మోడల్లను లాంచ్ చేస్తున్నాయి. ఆయా మోడల్ల స్మార్ట్ ఫోన్ల లాంచ్ తేదీలు, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు అందిస్తున్నాం.. వన్ప్లస్ 12 సిరీస్ (OnePlus 12 series) వన్ప్లస్ 12 (OnePlus 12), వన్ప్లస్ 12ఆర్ (OnePlus 12R)లను ఆ కంపెనీ భారత్లో జనవరి 23న రాత్రి 7.30 గంటలకు విడుదల చేయనుంది. చైనాలో లాంచ్ అయిన వేరియంట్ ప్రకారం, వన్ప్లస్ 12 5G 6.82-అంగుళాల క్వాడ్-HD+ LTPO OLED స్క్రీన్ను కలిగి ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్తో వస్తుంది. గరిష్టంగా 24GB ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందించవచ్చు. కెమెరా పరంగా వన్ప్లస్ 12లో 50MP సోనీ LYT-808 ప్రైమరీ లెన్స్, 64MP టెలిఫోటో కెమెరా, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి హాసెల్బ్లాడ్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రావచ్చు. వన్ప్లస్ 12 5G 100W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్తో 5,400 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ (Xiaomi Redmi Note 13 series) షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ను జనవరి 4న భారత్లో లాంచ్ చేస్తుంది. ఈ సిరీస్లో రెడ్మీ నోట్ 13 (Redmi Note 13), రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ (Redmi Note 13 Pro+) మోడల్లు ఉన్నాయి. ఇవి ఇప్పటికే చైనాలో అందుబాటులోకి వచ్చాయి. భారత్లో కూడా అవే స్పెసిఫికేషన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా 6.67-అంగుళాల AMOLED డిస్ప్లే, నోట్ 13 మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC, ప్రో మోడల్ స్నాప్డ్రాగన్ 7s Gen 2 SoC, ప్రోప్లస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా SoCతో రావచ్చు. కెమెరా విషయానికొస్తే, నోట్ 13 మోడల్ 100MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్తో వస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రో మోడల్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP శాంసంగ్ ISOCELL HP3 ప్రైమరీ సెన్సార్తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉండే అవకాశం ఉంది. 16MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఈ సిరీస్ 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వివో ఎక్స్100 సిరీస్ (Vivo X100 series) ఇప్పటికే చైనాలో విడుదలైన వివో ఎక్స్100 సిరీస్ త్వరలో భారత్లో లాంచ్ కానుంది. ఈ సిరీస్లో వివో ఎక్స్100 (Vivo X100), వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro) మోడల్స్ ఉండే అవకాశం ఉంది. చైనాలో లంచ్ అయిన వేరియంట్ల ప్రకారం, ఇవి ఆండ్రాయిడ్ 14 ఆధారిత OriginOS 4పై రన్ అయ్యే అవకాశం ఉంది. 6.78 అంగుళాల 8 LTPO AMOLED డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్తో పాటు వివో V3 చిప్తో వస్తాయని భావిస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే రెండు 50MP ప్రైమరీ సెన్సార్తో Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 mAh బ్యాటరీ రావచ్చు. అయితే ప్రో మోడల్ 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్కు మద్దతు ఇచ్చే 5,400 mAh బ్యాటరీతో రావచ్చు. వీటితో పాటు 2024 జనవరిలో రానున్న మరికొన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే వాటి లాంచింగ్ తేదీలను ఆయా కంపెనీలు కన్ఫమ్ చేయలేదు. శాంసంగ్ గెలాక్సి ఎస్24 (Samsung Galaxy S24) సిరీస్, ఏసస్ రోగ్ ఫోన్ 8 (Asus ROG Phone 8), ఐకూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) మోడల్స్ వచ్చే నెలలో విడుదల కానున్నట్లు సమాచారం. -
మైగ్రేన్ తలనొప్పి నివారణ పరికరం..
-
Nita Ambani: రిలయన్స్ ‘స్వదేశ్ స్టోర్’ లాంఛ్. సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
ఇస్రో గగన్ యాన్ ప్రయోగం..దూసుకెళ్లిన TV-D1 రాకెట్
-
రోజా చేతుల మీదుగా ‘మీ కడుపునిండా’ రెస్టారెంట్ ప్రారంభం (ఫొటోలు)
-
అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములేనన్నారు. 10,032 సచివాలయాల పరిధిలో విలేజ్ క్లినిక్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘‘ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పడతాం. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నయం అయ్యే వరకు తోడుంటాం’’ అని సీఎం స్పష్టం చేశారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే ఇంకో డాక్టర్ అంబులెన్స్లో గ్రామాల్లోకి వెళ్తారు’’ అని సీఎం జగన్ తెలిపారు. చదవండి: ప్రజలందరికీ.. ‘ఆరోగ్య సురక్ష’ -
విడుదలకు సిద్దమవుతున్న కొత్త బైకులు, ఇవే!
Upcoming Bikes: 2023 ఆగష్టు నెల ముగిసింది.. గత నెలలో హీరో కరీజ్మా ఎక్స్ఎమ్ఆర్, టీవీఎస్ ఎక్స్ ఈ-స్కూటర్, హోండా SP160, ఓలా ఎస్1 వంటివి విడుదలయ్యాయి. కాగా ఈ నెలలో మరి కొన్ని విడుదలకావడానికి సన్నద్ధమవుతున్న బైకులు ఏవి? ఎప్పుడు లాంచ్ అవుతాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310.. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ మోటార్స్ ఈ నెలలో అపాచీ ఆర్ఆర్310 నేక్డ్ స్ట్రీట్ఫైటర్ వెర్షన్ను విడుదల చేయనుంది. ఇది కేవలం రీబ్యాడ్జ్ బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ మాత్రమే కాదు.. చూడటానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉండే అవకాశం ఉండనై ఆశిస్తున్నాము. ఇది 2023 సెప్టెంబర్ 06న విడుదలకానున్నట్లు సమాచారం. 2024 కేటీఎమ్ 390 డ్యూక్.. యువతరానికి ఇష్టమైన కెటిఎమ్ బ్రాండ్ త్వరలో 2024 కెటిఎమ్ 390 డ్యూక్ విడుదల చేయనుంది. ఈ బైక్ 399 సీసీ ఇంజిన్ కలిగి 44.8 హార్స్ పవర్ & 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాము. సుజుకి వీ-స్ట్రోమ్ 800 డీఈ.. సుజుకి మోటార్ సైకిల్ కంపెనీ ఈ నెలలో తన వీ-స్ట్రోమ్ 800 డీఈ బైక్ లాంచ్ చేయనుంది. ఇది 776 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందించనుంది. ఈ కొత్త 800DE ఒక ఆధునిక ఎలక్ట్రానిక్స్ సూట్ అండ్ 21 ఇంచెస్ ఫ్రంట్ వీల్ను కలిగి ఉంది. ఈ కొత్త బైకుకి సంబంధించిన ధరలు, ఇతర వివరాలు లాంచ్ సమయంలో అధికారికంగా విడుదలవుతాయి. -
గృహలక్ష్మి పథకం ప్రారంభం.. కుటుంబంలో మహిళా పెద్దకు రూ.2000
బెంగళూరు: ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం గృహ లక్ష్మి పథకంతో ఘణంగా వేడుకను జరుపుకుంది. ఈ పథకంలో ప్రతి ఇంట్లో ఒక మహిళా పెద్దకు రూ.2000 అందించనున్నారు. ఈ కార్యక్రమం సీఎం సిద్ధరామయ్య స్వస్థలం మైసూర్లో జరిగింది. కేంద్రం నుంచి సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, మళ్లికార్జున ఖర్గే హాజరయ్యారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి మహిళలు కూడా కార్యక్రమానికి వచ్చారు. నేడు 50 శాతం మందికి అందాల్సిన రూ.1.08 కోట్ల లబ్దిదారులకు అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. మిగిలిన లబ్దిదారుల అకౌంట్లలో రేపు జమ అవుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమానికి హాజరైన పలువురు మహిళలు.. తమ అకౌంట్లలో డబ్బులు పడ్డాయని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇకపై తన పిల్లల స్కూల్ ఫీజులు సులభంగా చెల్లించవచ్చని అన్నారు. Congress has always delivered as promised. Guarantee schemes guaranteed for the welfare of people. Gruha Lakshmi is launched to provide Rs 2000 for every woman head of the family.#CongressGuarantee pic.twitter.com/8nVz2uQJ1Q — Siddaramaiah (@siddaramaiah) June 2, 2023 ఫెరిఫికేషన్పై అభ్యంతరాలు.. జీఎస్టీ రిటర్న్లు ఫైల్ చేయని కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. అయితే.. ఈ పథకం అమలు తీరుపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల ఆధారంగా వారి జీఎస్టీ వివరాలు సేకరిస్తామని కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి లక్ష్మి హెబ్బాల్కర్ తెలిపారు. కుటుంబ సాఫ్ట్వేర్ ఆధారంగా వివరాలు భద్రపరుస్తామని పేర్కొన్నారు. అయితే.. డేటా భద్రతపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే ఇంటి నుంచి ఇద్దరు మహిళలకు స్కీం వర్తించకుండా జాగ్రత్తలు పాటించామని మంత్రి తెలిపారు. కానీ మరణించినవారి పేరుపై ఉన్న రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. త్వరలో ఈ వివరాలు మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: అమితాబచ్చన్కి రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ.. -
మంచు విష్ణు భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’ లాంఛ్ ఫొటోలు
-
అన్ని రోజులూ బ్యాంక్ సేవలు!
దేశంలోని బ్యాంకులు ప్రస్తుతం వారానికి 6 రోజులు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు, పబ్లిక్ హాలిడేస్లో బ్యాంకులు మూతపడతాయి. రానున్న రోజుల్లో వారానికి 5 రోజులే పనిదినాలు ఉండేలా ప్రతిపాదనలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు బ్యాంక్ హాలిడేస్ గురించి ఆందోళన చెందుతుంటారు. దేశంలోని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank) కస్టమర్ల కోసం అన్ని రోజులూ సేవలు అందించనుంది. ఇందుకోసం వినూత్నమైన పరిష్కారాన్ని తీసుకొచ్చింది. దేశంలో 24x7 లైవ్ వీడియో బ్యాంకింగ్ సేవను ప్రారంభించిన మొదటి బ్యాంక్గా ఏయూ స్మాల్ ఫైనాన్స్ నిలిచింది. తాము తీసుకొచ్చిన 24x7 వీడియో బ్యాంకింగ్ సదుపాయం బ్యాంక్ బ్రాంచ్లు అందుబాటులో లేనివారికి, టెక్నాలజీ మీద అవగాహన ఉన్నవారికి, బిజీగా ఉండే ప్రొఫెషనల్లకు, సీనియర్ సిటిజన్లకు అనుకూలంగా ఉంటుందని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 24x7 వీడియో బ్యాంకింగ్ ఫీచర్లు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 24x7 వీడియో బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు నేరుగా బ్యాంకు సిబ్బందితో వీడియో కాల్లో మాట్లాడవచ్చు. అన్ని రోజులూ ఎప్పుడైనా వీడియో కాల్ చేసి బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. ఈ బ్యాంక్ గతంలోనే వీడియో బ్యాంకింగ్ సదుపాయం తీసుకువచ్చినప్పటికీ ఇప్పుడు దాన్ని 24x7 కస్టమర్లకు సేవలు అందించేలా విస్తరించింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 24x7 వీడియో బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు డెమోగ్రాఫిక్ అప్డేట్లు చేయించుకోవచ్చు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చు. కొత్త ఖాతాలను తెరవవచ్చు. అంతేకాకుండా క్రెడిట్ కార్డ్లు, లోన్లపై విచారణతోపాటు ఇతర బ్యాంకింగ్ సమస్యలు ఉన్నా రియల్ టైమ్ సేవలు పొందవచ్చు. భద్రత, ఇతర ప్రయోజనాలు వీడియో బ్యాంకింగ్ సేవల ద్వారా డేటా లీక్ అవుతుందని, మోసాలు జరుగుతాయని కస్టమర్లు భయపడాల్సిన పని లేదని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చెబుతోంది. కస్టమర్ల సమాచారాన్ని, లావాదేవీలను రక్షించడానికి ఎన్క్రిప్షన్, ఫేషియల్ రికగ్నిషన్, ఓటీపీ, వీడియో ధ్రువీకరణ వంటి అధునాతన చర్యలను తీసుకుంటున్నట్లు బ్యాంక్ పేర్కొంటోంది. ఇదీ చదవండి: Bank Charges: బ్యాంక్ కస్టమర్లకు దిమ్మతిరిగే విషయం.. చార్జీలు ఎన్ని రూ.వేల కోట్లు కట్టారో తెలుసా? -
కొత్త స్మార్ట్ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా!
Upcoming Smartphones: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం ఆగష్టు నెలలో విడుదలకానున్న కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతున్న స్మార్ట్ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమి మిక్స్ ఫోల్డ్ 3 (Xiaomi Mix Fold 3) ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న షావోమి త్వరలో మిక్స్ ఫోల్డ్ 3 మొబైల్ లాంచ్ చేయనుంది. ఇది చైనా మార్కెట్లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం, భారతదేశంలో తరువాత కాలంలో విడుదలయ్యే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ స్మార్ట్ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జాజ్ ఫోల్డ్ 5కి ప్రత్యర్థిగా ఉండనుంది. వివో వీ29 సిరీస్ (Vivo V29 Series) వివో కంపెనీకి చెందిన వీ29 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో వీ29 అండ్ వీ29 ప్రో ఉండనున్నాయి. ఇది కూడా చైనా మార్కెట్లో విడుదలైన తరువాత భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. రియల్మీ జీటీ 5 (Realme GT 5) 2023 ఆగష్టు నెలలో రియల్మీ తన జీటీ 5 స్మార్ట్ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ ఉంటుంది, అదే సమయంలో 144 Hz ఓఎల్ఈడీ డిస్ప్లే పొందుతుంది. అద్భుతమైన కెమెరా సెటప్ తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం ఈయన సొంతం - వెహికల్స్ ఫ్యూయెల్కే వందల కోట్లు.. ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో (Infinix GT 10 Pro) ఇన్ఫినిక్స్ తన జీటీ 10 ప్రో స్మార్ట్ఫోన్ ఆగష్టు 03న ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. ఈ మొబైల్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ధరలు & ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ రెడ్మీ 12 5జీ (Redmi 12 5G) రెడ్మీ కంపెనీ ఆగష్టు 01న మరో కొత్త 5జీ మొబైల్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో గట్టిపోటీనిచ్చే విధంగా కంపెనీ దీనిని రూపొందించింది. ఇందులో స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 90Hz FHD+ డిస్ప్లేతో 5000 mAh బ్యాటరీ ఉంటాయి. -
Dil Raju : గద్వాల్లో దిల్ రాజు కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభం (ఫొటోలు)
-
చిన్న సంస్థల కోసం వినూత్న బీమా పథకాలు
ముంబై: జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ తాజాగా చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) కోసం మూడు వినూత్న బీమా పథకాలను ప్రవేశపెట్టింది. ఎంఎస్ఎంఈ సురక్షా కవచ్ పాలసీ, ప్రాపర్టీ ఆల్ రిస్క్ (పీఏఆర్) పాలసీ, ఐ–సెలెక్ట్ లయబిలిటీ పాలసీ వీటిలో ఉన్నాయి. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా వీటిని ప్రవేశపెట్టినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి తెలిపారు. సురక్షా కవచ్ పాలసీ.. విపత్తుల నుంచి వాటిల్లే ఆస్తి నష్టాన్ని భర్తీ చేస్తుందని, ప్రమాదాల వల్ల జరిగే ఆస్తి నష్టాల కోసం పీఏఆర్ కవరేజీ ఉపయోగపడుతుందని వివరించారు. ఆభరణాల వంటి విలువైన వాటికి ఐ–సెలెక్ట్ లయబిలిటీతో అదనపు కవరేజీ పొందవచ్చని పేర్కొన్నారు. -
నయా ఫండ్: యాక్సిస్ ఏఎంసీ నుంచి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్
ముంబై: యాక్సిస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్ను ఆవిష్కరించింది. ఇది జూన్ 27న ప్రారంభమై జూలై 11తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చని సంస్థ సీఈవో బి. గోప్కుమార్ తెలిపారు. నిఫ్టీ ఐటీ టీఆర్ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుందని వివరించారు. ఈ ఫండ్ ద్వారా సేకరించే నిధులను ఐటీ సూచీలోని స్టాక్స్లో దాదాపు అదే నిష్పత్తి కింద ఇన్వెస్ట్ చేయనున్నట్లు చెప్పారు. తదనుగుణంగా ఇందులో సిప్, ఎస్టీపీ, ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయొచ్చని చెప్పారు. అన్ని వ్యాపారాల్లోనూ టెక్నాలజీ కీలకంగా మారుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఐటీ రంగానికి మరింత డిమాండ్ ఉండగలదని, తదనుగుణంగా మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉందని గోప్కుమార్ తెలిపారు. -
ఎల్ఐసీ కొత్త ప్లాన్.. జీవిత బీమా రక్షణతోపాటు పొదుపు కూడా
ముంబై: బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్తగా ‘ధన వృద్ధి’ పేరుతో క్లోజ్ ఎండెడ్ ప్లాన్ను ఆవిష్కరించింది. జూన్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ప్లాన్ను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీతో సంబంధం లేని), నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. పొదుపుతో కూడిన సింగిల్ ప్రీమియం ప్లాన్. జీవిత బీమా రక్షణతోపాటు పొదుపును ఆఫర్ చేస్తుంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణానికి గురైతే కుటుంబానికి పరిహారం అందిస్తుంది. గడువు ముగిసే వరకు జీవించి ఉంటే మెచ్యూరిటీ మొత్తం తిరిగి వస్తుంది. ఈ ప్లాన్లో రెండు రకాల బీమా ఆప్షన్లు ఉన్నాయి. మరణ పరిహారం చెల్లించే ప్రీమియానికి 1.25 రెట్లు లేదంటే పది రెట్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 10, 15, 18 ఏళ్ల కాల వ్యవధిపై తీసుకోవచ్చు. కనీసం రూ.1,25,000 బీమా నుంచి ఎంత మొత్తమైనా ఎంపిక చేసుకోవచ్చు. ప్రతి పాలసీ సంవత్సరం ముగిసిన తర్వాత గ్యారంటీడ్ అడిషన్స్ జమ అవుతాయి. ఈ గ్యారంటీడ్ అడిషన్ అనేది మొదటి ఆప్షన్లో ప్రతి రూ.1,000 సమ్ అష్యూర్డ్పై రూ.60–75 మధ్య, రెండో ఆప్షన్లో రూ.25–40 మధ్య ఉంటుంది. ఈ ప్లాన్లో మెచ్యూరిటీ లేదా మరణ పరిహారాన్ని కావాలంటే వాయిదాల పద్ధతిలోనూ తీసుకోవచ్చు. పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంటుంది. -
బజాజ్ గుడ్ న్యూస్:100 శాతం ప్యూర్ హెన్నా
ముంబై: బజాజ్ కన్జ్యూమర్ కేర్ 100 శాతం స్వచ్ఛమైన హెన్నా ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అత్యధిక నాణ్యమైన హెన్నా ఆకుల నుంచి దీన్ని తయారు చేశామని, ఎలాంటి రసాయనాలు వాడలేదని సంస్థ ప్రకటించింది. నూరు శాతం సహజసిద్ధ సురక్షితమైన ఉత్పత్తి అని పేర్కొంది. ఇదీ చదవండి: వైట్హౌస్ డిన్నర్కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్ మహీంద్ర చేతులు, పాదాలకు సైతం వినియోగించుకోవచ్చని తెలిపింది. శిరోజాలకు మంచి కండీషన్తోపాటు సహజ రంగును ఇస్తుందని పేర్కొంది. తమ కస్టమర్లకు వినూత్నమైన, సహజ, సురక్షితమైన ఉత్పత్తులు అందించాలన్న నిబద్ధతకు ఈ ఉత్పత్తి నిదర్శనమని బజాజ్ కన్జ్యూమర్ కేర్ ఎండీ జైదీప్ నంది ప్రకటించారు. 25 గ్రాముల ప్యాకెట్ ధర రూ.10 కాగా, 75 గ్రాముల ధర రూ.35గా సంస్థ నిర్ణయించింది. రూ. 10వేల కోట్ల సుందర్ పిచాయ్ లగ్జరీ భవనం (ఫోటోలు) -
జగనన్న స్వచ్ఛ సంకల్ప వాహనాలు ప్రారంభం
-
తక్కువ ధరలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: స్వదేశీ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఏథర్ ఎనర్జీ భారతదేశంలో కొత్త ఏథర్ 450ఎస్ను విడుదల చేసింది. ఫేమ్-II సబ్సిడీ కోతతో ఈవీల ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో ఏథర్ 450ఎస్ పేరుతో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 1,29,999గా నిర్ణయించింది. బుకింగ్లను కూడా షురూ చేసింది. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత) తమ 450 ఎస్ IDC (ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్) 3 kWh బ్యాటరీ ప్యాక్తో పరిధి 115 కి.మీ. రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. గంటకు 90 కి.మీవేగంతో అత్యుత్తమ సాంకేతికత, పనితీరును అందిస్తుందని ఏథర్ఎనర్జీ కో-ఫౌండర్, సీఈవో తరుణ్ మెహతా తెలిపారు. ఫేమ్-IIఫ్రేమ్వర్క్ కింద తమ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ 450 ఎక్స్ కొత్త ధరలను కూడా ప్రకటించింది. మునుపటి ధరతో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ. 1,65,000 (ఎక్స్-షోరూమ్ బెంగుళూరు)కి అందుబాటులో ఉంటుంది. టాప్ వేరియంట్ ప్రో ప్యాక్ ఏథర్ 450 ఎక్స్ రూ. 1.45 లక్షల నుండి రూ. 1.65 లక్షల వరకు ఉంటుంది. పాత ధరలతో పోలిస్తే దాదాపు రూ. 32,000 వరకు పెరిగింది. -
ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే హెడ్సెట్..
ఐపీఎల్ వీక్షకుల కోసం జియో సరికొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. నేరుగా స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించే జియో డైవ్ (JioDive) అనే కొత్త వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్సెట్ను లాంచ్ చేసింది. ఇదీ చదవండి: WEF Report: 1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్! ప్రపంచ ఆర్థిక వేదిక సంచలన రిపోర్ట్ జియో సినిమా (JioCinema) యాప్లో ఐపీల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఈ వీఆర్ హెడ్సెట్ని ఉపయోగించవచ్చు. ఇందులో 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీ వీక్షణ ఉన్నాయి. దీంతో నేరుగా స్టేడియంలోనే కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ హెడ్సెట్ను జియో సినిమా యూజర్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు. ఈ జియోడైవ్ హెడ్సెట్ ధర రూ. 1,299. జియో మార్ట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. పేటీఎం వ్యాలెట్ ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ. 500 క్యాష్బ్యాక్ లభిస్తుంది. అయితే హైజనిక్ కారణాల వల్ల ఈ ఒక సారి కొనుగోలు చేసిన ఈ వీఆర్ హెడ్సెట్ను రిటర్న్ చేసే వీలు లేదని కంపెనీ పేర్కొంది. జియోడైవ్ వీఆర్ హెడ్సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీల వీక్షణ 4.7 నుంచి 6.7 అంగుళాల స్క్రీన్ ఉన్న ఆండ్రాయిడ్, iOS ఫోన్లకు సపోర్ట్ లెన్స్ ఫోకస్, ఫైన్ ట్యూన్ అడ్జెస్ట్మెంట్ కోసం ఏర్పాటు. హెడ్సెట్ను సౌకర్యవంతంగా పెట్టుకునేందుకు 3వే అడ్జస్టబుల్ స్ట్రాప్ Android 9+, iOS 15+కి సపోర్ట్ ఉపయోగించడం ఎలా? బాక్స్పై ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి జియో ఇమ్మెర్స్ (JioImmerse) యాప్ను ఇన్స్టాల్ చేయండి సూచనలకు అనుగుణంగటా అన్ని అనుమతులను ఇచ్చి లాగిన్ చేయండి. ఇందుకోసం జియో నెట్వర్క్కి కనెక్ట్ అయిఉండాలి. జియోడైవ్ (JioDive) ఆప్షన్ను ఎంచుకుని ‘Watch on JioDive’పై క్లిక్ చేయండి హెడ్సెట్లో ఫ్రంట్ కవర్ని తీసి ఫోన్ సపోర్ట్ క్లిప్, లెన్స్ల మధ్య ఫోన్ను పెట్టిన తర్వాత ఫ్రంట్ కవర్ను మూసివేయండి హెడ్సెట్ను పెట్టకుని స్ట్రాప్స్ను సరిచేసుకోండి ఉత్తమ వీక్షణ అనుభవం, పిక్చర్ క్వాలిటీని అడ్జస్ట్మెంట్ వీల్స్ను సరిచేయండి ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. Bringing you a stadium-like experience at home with #JioDive. - Watch cricket in 360 immersive view - Enjoy #TATAIPLonJioCinema on a 100-inch virtual screen - Experience #360cricket from multiple camera angles Buy now https://t.co/1azFVIwqfR#EnterANewReality #IPL2023 pic.twitter.com/PxplF0SAz9 — JioDive (@jiodiveofficial) April 30, 2023 -
సోనీ బ్రావియా కొత్త టీవీలు
విజయవాడ: సోనీ ఇండియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి సోనీ బ్రావియా ఎక్స్70ఎల్, బ్రావియా ఎక్స్75ఎల్ సిరీస్ టీవీలను విడుదల చేసింది. ఎక్స్1 4కే ప్రోసెసర్, లైవ్ కలర్, డాల్బీ ఆడియా, క్లియర్ ఫేస్ టెక్నాలజీ, 10వేలకి పైగా యాప్స్, గేమ్స్తో పాటు ఏడు లక్షలకు పైగా సినిమాలు, టీవీ సిరీస్లను కలిగిన గూగుల్ టీవీ ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ఎక్స్–ప్రొటెక్షన్ పీఆర్ఓ, వాయిస్ ఆధారిత రిమోట్–స్మార్ట్ రిమోట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఎక్స్ 75ఎల్ సిరీస్లో మొత్తం నాలుగు మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.1.04 లక్షలు – రూ. 51,999 మధ్య ఉన్నాయి. ఇక ఎక్స్70ఎల్ సిరీస్లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో కేడి–43 ఎక్స్70ఎల్ ధర రూ.49,990, కేడి–50 ఎక్స్70ఎల్ ధర రూ.61,990 గా ఉంది. పై రెండు సిరీస్లోని మోడళ్లు ఆంధ్రప్రదేశ్లోని అన్ని సోనీ సెంటర్లు, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షాపుల్లో, ఈ–కామర్స్ పోర్టళ్లలో లభిస్తాయిని కంపెనీ తెలిపింది. -
ఇ-స్టాంపింగ్ సేవలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్
-
వాహన ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా? వీటితో భలే బెనిఫిట్స్!
హైదరాబాద్: రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిశ్రమలోనే మొదటిసారిగా వాహన బీమాకు సంబంధించి మూడు యాడాన్ కవర్లను ప్రవేశపెట్టింది. ప్రైవేటు కార్లకు ‘స్మార్ట్ సేవ్’ పేరుతో యాడాన్ కవరేజీని విడుదల చేసింది. రోడ్సైడ్ అసిస్టెన్స్, రిటర్న్ టు ఇన్వాయిస్ పేరుతో ద్విచక్ర వాహనాలకు రెండు కవర్లను తీసుకొచ్చింది. ఇదీ చదవండి: హోం లోన్ వద్దు.. పర్సనల్ లోనే కావాలి! స్మార్ట్సేవ్ అనే ఉచిత యాడాన్ కవర్ కింద కార్లను యజమానులు రాయల్ సుందరం గుర్తించిన ట్రస్టెడ్ రిపేర్ షాపులు, గ్యారేజీల్లో సర్వీస్ చేయించినట్టయితే, ఓన్ డ్యామేజ్ కవర్ ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. ద్విచక్ర వాహనం ఏదైనా కారణం వల్ల మార్గమధ్యంలో కదల్లేని స్థితిలోకి వెళితే రోడ్సైడ్ అసిస్టెన్స్ కింద సాయాన్ని పొందొచ్చు. రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్లో వాహనానికి నష్టం జరిగితే పూర్తి విలువ మేర చెల్లింపులు ఉంటాయి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు, ఇవే!
కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైపోయింది. కొత్త కార్లు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి ఫ్రాంక్స్, మెర్సిడెస్ బెంజ్ GT63 S ఈ-పెర్ఫార్మెన్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ కార్లు మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతాయి, ఇతర వివరాలేంటి అనే సమాచారం ఈ కథనంలో.. మారుతి సుజుకి ఫ్రాంక్స్: 2023 ఆటో ఎక్స్పోలో అడుగుపెట్టిన మారుతి ఫ్రాంక్స్ ఈ నెల రెండవ వారంలో దేశీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ కొత్త మోడల్ కోసం ఇప్పటికే మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 1.0-లీటర్ టర్బో, 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఆప్షన్స్ పొందనుంది. దీని ధర సుమారు రూ. 8 లక్షల నుంచి రూ. 11 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. మెర్సిడెస్ ఏఎమ్జి జిటి63 ఎస్ ఈ-పర్ఫామెన్స్: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయ విఫణిలో ఈ నెల 11న ఏఎమ్జి జిటి63 ఎస్ ఈ-పర్ఫామెన్స్ విడుదల చేయనుంది. ఇది 4-డోర్ కూపే నుంచి వచ్చిన ఫస్ట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు కావడం విశేషం. ఇది 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 ఇంజన్ & 204 హెచ్పి ఎలక్ట్రిక్ మోటారు పొందుతుంది. ఈ లగ్జరీ కారు ఫ్రంట్ బంపర్పై పెద్ద గ్యాపింగ్ ఎయిర్ ఇన్టేక్లు, పనామెరికానా గ్రిల్, బెస్పోక్ అల్లాయ్ వీల్స్, బూట్ లిడ్పై స్పాయిలర్ పొందుతుంది. దీని ధర కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, కానీ సుమారు రూ. 3 కోట్ల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. లంబోర్ఘిని ఉరస్ ఎస్: ఇటలీకి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని దేశీయ మార్కెట్లో ఉరస్ ఎస్ SUVని విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇది 2023 ఏప్రిల్ 13న అధికారికంగా విడుదలకానుంది. దీని ధర సుమారు రూ. 4.22 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కంటే ఎక్కువ ఉండవచ్చని అంచనా. ఇది 4.0 లీటర్, V8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి అద్బుతంగా పర్ఫామెన్స్ అందిస్తుంది. ఎంజి కామెట్ ఈవీ: భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎంజి మోటార్ ఈ నెల చివరిలో కామెట్ EV అనే ఎలక్ట్రిక్ కారుని విడుదలచేయనుంది. దీనిని నగర ప్రయాణాల కోసం అనుకూలంగా ఉండటానికి ప్రత్యేకంగా రూపొందించారు. కాంపాక్ట్ డైమెన్షన్లు, టూ-డోర్ బాడీ స్టైల్, ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఎలిమెంట్స్ వంటివి దీనిని చాలా ఆకర్షణీయంగా కనపడేలా చేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 250 కిమీ రేంజ్ అందిస్తుందని, ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. -
ఆర్థిక వ్యవస్థలో బొగ్గు కీలక పాత్ర: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తున్నట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. బొగ్గుని నల్ల బంగారంగా పేర్కొన్నారు. వాణిజ్య బొగ్గు గనుల ఏడో విడత వేలాన్ని రాజ్నాథ్ సింగ్ బుధవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ.. ‘‘గడిచిన కొన్నేళ్లలో మన ఇంధన వినియోగం పెరిగింది. అది ఇక ముందూ వృద్ధి చెందుతుంది. ఈ అవసరాలను తీర్చేందుకు ఈ రోజు నుంచే చర్యలు తీసుకోవాలని’’ చెప్పారు. వ్యాపార సులభ తర నిర్వహణను ప్రోత్సహించేందుకు ముందస్తుగా ఉత్పత్తి ప్రారంభించిన వాటికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రాలకు చెల్లించే ఆదాయంలో 50 శాతాన్ని రాయితీగా ఇస్తున్నట్టు చెప్పారు. వచ్చే 40-50 ఏళ్లపాటు బొగ్గు వినియోగం కొనసాగుతుందని చెబుతూ.. భారీగా ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఇప్పటి వరకు ఆరు విడతల వేలంలో 87 బగ్గు గనులను వేలం వేశామని, ఇవన్నీ ఉత్పత్తి ఆరంభిస్తే ఏటా రూ.33,200 కోట్ల ఆదాయంతో పాటు లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. (రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే) 106 గనుల వేలం.. ఏడో విడతలో వేలానికి ఉంచిన 106 గనుల్లో 61 బ్లాక్లు పాక్షికంగా అన్వేషించినవి కాగా, 45 పాక్షికంగా బొగ్గు నిక్షేపాల గురించి అన్వేషణ నిర్వహించినవి. 95 నాన్ కోకింగ్ కోల్ గనులు అయితే, 10 లిగ్నైట్ గనులు ఉన్నాయి. ఈ గనుల నుంచి వెలికితీసే బొగ్గు వినియోగంపై ఎలాంటి ఆంక్షలను ప్రభుత్వం పెట్టలేదు. బొగ్గు రంగంలో ప్రైవేటు కంపెనీలూ తగిన అవకాశాలను సొంతం చేసుకునేందుకు కేంద్ర సర్కారు లోగడ ఈ రంగానికి సంబంధించి ద్వారాలు తెరవడం తెలిసిందే. మరోవైపు ఆరో విడతలో వేలం వేసిన 28 గనులకు సంబంధించి ఒప్పందాలపై బొగ్గు శాఖ సంతకాలు పూర్తి చేసింది. (సహారా కస్టమర్లకు గుడ్న్యూస్: ఇన్వెస్టర్లకు చెల్లింపులు) -
మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!
న్యూఢిల్లీ: మోటరోలా సంస్థ జీ సిరీస్లో భాగంగా జీ13 స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో ఉన్న ఈ ఫోన్ ధర రూ.9,999. ఏప్రిల్ 5న ఫ్లిప్కార్ట్లో అమ్మకాలు మొదలవుతాయని మోటరోలా ప్రకటించింది. (హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు.. ఈవీల కోసం ప్రత్యేక ప్లాంటు!) ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ క్వాడ్ పిక్సల్ కెమెరా సిస్టమ్ ఉండగా, ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, 6.5 అంగుళాల, 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో కూడిన డిస్ ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. (UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్పీసీఐ వివరణ) -
వ్యూ నుంచి ప్రీమియం ఫీచర్లతో టీవీలు
హైదరాబాద్: వ్యూ టెలివిజన్స్ 2023 ఎడిషన్ ప్రీమియం టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. అధునాతన ఫీచర్లతో, బ్రైట్ డిస్ ప్లేతో, చక్కని సౌండ్ పరిజ్ఞానంతో, మంచి వీక్షణ అనుభవాన్నిస్తాయని సంస్థ ప్రకటించింది. 43 అంగుళాలు, 55 అంగుళాల సైజులో టీవీలను తీసుకొచ్చింది. (ఇదీ చదవండి: 7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!) వీటిల్లో ఏప్లస్ గ్రేడ్ 400 నిట్స్ అధిక బ్రైట్నెస్తో కూడిన ఐపీఎస్ డిస్ప్లే ఉంటుందని తెలిపింది. గూగుట్ టీవీ ఓఎస్తో, 50 వాట్ ఇన్బిల్ట్ సౌండ్బార్తో వస్తుందని పేర్కొంది. 43 అంగుళాల ధర రూ.23,999, 55 అంగుళాల టీవీ ధర రూ.32,999. అమెజాన్, ఫ్లిప్కార్ట్, వూటీవీస్ డాట్ కామ్ స్టోర్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. (జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్) -
మహిళా స్టార్టప్లకు నిధుల సాయం, ఎవరు? ఎలా?
హైదరాబాద్: మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎలైట్ ఫుడ్స్ అండ్ ఇన్నోవేషన్స్ గ్రూప్ ‘స్కేల్ యువర్ స్టార్టప్’ పేరుతో క్తొత కార్యక్రమాన్ని ప్రారంభించింది. రూ.10 లక్షలకు మించిన ఆదాయం గడించే మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్లకు మద్దతు ఇవ్వనుంది. స్టార్టప్లకు ఆర్థిక సాయం, మార్గదర్శకం అందించాలన్నది ఎలైట్ గ్రూప్ చైర్మన్, ఎండీ టీఆర్ రఘులాల్ కలల ప్రాజెక్టు అని తెలిపింది. మహిళల ఆధ్వ ర్యంలో నడుస్తూ, వారి వాటా కనీసం 51 శాతం ఉంటే, ఏప్రిల్ 10 వరకు ఎలైట్కనెక్ట్ డాట్ ఇన్ఫో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. (చదవండి: ట్విటర్ మాజీ సీఈవోపై హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు) స్టార్టప్ల ఎంపిక ప్రమాణాలు టీం, మార్కెట్, వ్యాపార నమూనా ,సామాజిక ప్రభావం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.. వివిధ పరిశ్రమల రంగాలకు చెందిన నిపుణుల బృందం ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది. "మహిళా పారిశ్రామికవేత్తలు వారి కలలను సాధించడానికి , వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి తోడ్పాటు అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడమే తమ లక్ష్యమన్నారు ఎలైట్ ఫుడ్స్ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దానేసా రఘులాల్ . (యాక్సెంచర్ సంచలనం: ఏకంగా 19వేల మందికి ఉద్వాసన) ఇదీ చదవండి: ‘నాటు నాటు’ ఫీవర్: నా వల్ల కావడం లేదు..ఇదే లాస్ట్! ఆనంద్ మహీంద్ర -
Neha Shetty Latest Photos: కొంపల్లిలో సందడి చేసిన నేహా శెట్టి (ఫొటోలు)
-
కూకట్పల్లిలో రీతూ వర్మ సందడి (ఫొటోలు)
-
రూ. 16.47 లక్షల కొత్త కవాసకి బైక్
భారతీయ మార్కెట్లో కవాసకి ఇండియా కొత్త జెడ్900ఆర్ఎస్ (Z900RS) బైక్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ బైక్ ధర రూ. 16.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది మన దేశానికీ కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) రూపంలో వస్తుంది. కావున ధర దాని మునుపటి మోడల్ ఏజ్ఎక్స్-ఆర్ కంటే ఎక్కువగా ఉంటుంది. 2023 కవాసకి జెడ్900ఆర్ఎస్ బైక్ 948 సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది 8,500 ఆర్పిఎమ్ వద్ద 107 బీహెచ్పీ పవర్ 6,500 ఆర్పిఎమ్ వద్ద 95 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. కొత్త జెడ్900ఆర్ఎస్ మంచి డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించేవిధంగా ఉంటుంది. ఇందులో రౌండ్ హెడ్ల్యాంప్, టియర్డ్రాప్ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్, క్రోమ్ ఫినిష్డ్ వీల్ రిమ్స్, క్రోమ్ ఎగ్జాస్ట్తో కూడిన మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ బైక్ మెటాలిక్ డయాబ్లో బ్లాక్/మెటాలిక్ ఇంపీరియల్ రెడ్ & క్యాండీ టోన్ బ్లూ అనే రెండు కలర్స్లో లభిస్తుంది. (ఇదీ చదవండి: Oscar Natu Natu-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ అక్షరాలా..!) ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫుల్ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంటుంది. స్లిప్పర్ క్లచ్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో సింగిల్ పీస్ సీటు పొందుతుంది. ఈ బైకులో ట్విన్ 300 మిమీ ఫ్రంట్ డిస్క్లు 250 మిమీ సింగిల్ రియర్ డిస్క్లు అమర్చబడి ఉంటాయి. డ్యూయల్-ఛానల్ ABS స్టాండర్డ్గా లభిస్తుంది. (ఇదీ చదవండి: ఆర్ఆర్ఆర్ స్టార్ 'రామ్ చరణ్' ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?) -
అదిరే ఫీచర్స్తో హోండా కొత్త బైక్స్.. ధర ఎంతంటే?
హోండా మోటార్సైకిల్ ఇండియా ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో హైనెస్ CB350, CB350RS బైకులను విడుదల చేసింది. సీబీ350 బైక్ ధర రూ. 2.10 లక్షల నుంచి రూ. 2.15 లక్షలు, కాగా సీబీ350ఆర్ఎస్ ధర రూ. 2.15 లక్షల నుంచి రూ. 2.18 లక్షల మధ్య ఉన్నాయి. హోండా విడుదల చేసిన ఈ కొత్త బైక్స్ చూడటానికి మునుపటి మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయడం జరిగింది. కావున ధరలు రూ. 9,400 నుంచి రూ. 12,000 వరకు ఎక్కువగా ఉంటుంది. కొత్త హైనెస్ సీబీ350 ట్యాంక్పై రెండు తెల్లటి చారలు గమనించవచ్చు. సీబీ350ఆర్ఎస్ బైక్ గ్లోసి బ్లూ, మాట్ గ్రే/బ్లాక్ కలర్వే కలర్స్లో అందుబాటులో ఉంది. (ఇదీ చదవండి: Oscar Natu Natu-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ అక్షరాలా..!) హోండా కొత్త బైకులలో 349 సీసీ, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 21 హెచ్పి పవర్, 30 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. అదే సమయంలో స్ప్లిట్ సీట్ సెటప్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ సిస్టమ్ కూడా ఇందులో లభిస్తాయి. -
బ్రేలి లిపిలో కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకం
-
కోరుకున్నట్టుగా హెల్త్ పాలసీ: బజాజ్ అలియాంజ్ ఆఫర్
ముంబై: హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను తమకు కావాల్సిన సేవలతోనే తీసుకునే విధంగా ‘మై హెల్త్కేర్ ప్లాన్’ను బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఆవిష్కరించింది. మోటారు వాహన ఇన్సూరెన్స్ను నడిపినంత దూరానికే తీసుకునే విధంగా ఇటీవలే కొత్త తరహా ప్లాన్లు అందుబాటులోకి రావడం తెలిసిందే. ఇదే మాదిరిగా హెల్త్ ఇన్సూరెన్స్లోనూ కొత్త తరహా సేవలతో బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ముందుకు వచ్చింది. కస్టమర్లు తమకు కావాల్సిన కవరేజీ ఎంపిక చేసుకోవచ్చని, వాటి ప్రకారం ప్రీమియం ఖరారు అవుతుందని సంస్థ తెలిపింది. హాస్పిటల్లో ఇన్ పేషెంట్గా చేరినప్పుడు అయ్యే వ్యయాలు, హాస్పిటల్లో చేరడానికి ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే వ్యయాలు, మేటర్నిటీ వ్యయాలు, ఎయిర్ అంబులెన్స్ సేవలు, అధునాతన చికిత్సా విధానాలు, అవయవ దాత వ్యయాలు, ఆయుర్వేదిక్, హోమియోపతీ సేవల కవరేజీ తీసుకోవచ్చు. బేబీ కేర్ కవరేజీ కూడా అందుబాటులో ఉంది. ఒక ఏడాదికి చెల్లించే ప్రీమియానికి రెట్టింపు విలువ మేర.. అవుట్ పెషెంట్ కవరేజీ కూడా ఈ ప్లాన్లో భాగంగా ఉంటుంది. ప్రమాదాలు, తీవ్ర వ్యాధులు, ఆదాయం నష్టం వంటి సందర్భాల్లో అదనపు పరిహారానికి సంబంధించిన రైడర్లను సైతం ఈ ప్లాన్తోపాటు తీసుకోవచ్చు. -
వారికోసం యస్ బ్యాంక్ ప్రైవేట్ డెబిట్ కార్డు, బెనిఫిట్స్ ఏంటి?
ముంబై: అత్యంత సంపన్న కస్టమర్ల (హెచ్ఎన్ఐ) కోసం మాస్టర్కార్డ్ భాగస్వామ్యంతో యస్ బ్యాంక్ కొత్తగా ప్రైవేట్ డెబిట్ కార్డును ఆవిష్కరించింది. సంపన్న ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్ల అవసరాలకు తగినట్లుగా ఇందులో ఫీచర్లు ఉంటాయని యస్ బ్యాంక్ గ్లోబల్ హెడ్ రాజన్ పెంటాల్ తెలిపారు. ట్రావెల్, వెల్నెస్, లైఫ్స్టయిల్ వంటి వివిధ విభాగాల్లో ప్రత్యేక ప్రయోజనాలు అందు కోవచ్చని పేర్కొన్నారు. ఓబెరాయ్ హోట ల్స్ నుంచి ఈ-గిఫ్ట్ వోచర్లు, కాంప్లిమెంటరీ గోల్ఫ్ సెషన్లు, ఎయిర్పోర్ట్ లాంజ్లకు యాక్సెస్ పొందవచ్చని వివరించారు. ఆసి యా పసిఫిక్ దేశాల్లో ఈ తరహా వర ల్డ్ ఎలైట్ డెబిట్ కార్డును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్ తెలిపారు. -
టాటా, హ్యుందాయ్కి పోటీ: మారుతి సుజుకి కాంపాక్ట్ ఎస్యూవీ ఫ్రాంక్స్
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2023లో రెండో రోజు దేశీయ ఆటో దిగ్గజం మారుతి సుజుకి కాంపాక్ట్ ఎస్యూవీని లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్యూవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్యూవీ, మారుతి సుజుకి జిమ్నీ (5డోర్)ను ఆవిష్కరించింది. వీటి బుకింగ్లను కూడా షురూ చేసింది కంపెనీ. కస్టమర్లకు అధునాతన ఫీచర్లు, ఇంజన్ ఎంపికలతో స్పోర్టీ అండ్ స్టైలిష్ వాహనాలను అందించాలని లక్ష్యంతో మారుతి సుజుకి వీటిని లాంచ్ చేసింది. ఇది టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూకి గట్టి పోటీ ఇవ్వనుంది. స్పోర్టీ అండ్ స్టైలిష్ డిజైన్తో మారుతి సుజుకి ఫ్రాంక్స్ రెండు ఇంజన్ ఎంపికలతో ఇది లాంచ్ అయింది. 99 హార్స్పవర్, 147 Nm టార్క్ను ఉత్పత్తి చేసే 1.0 లీటర్ బూస్టర్జెట్ ఇంజన్, 89 హార్స్పవర్, 113 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలలో ఇది లభ్యం.కారు ఫ్రంట్ ఎండ్ ఇటీవల విడుదల చేసిన గ్రాండ్ విటారా, బాలెనో మోడల్లు పోలి వుంది. కూపే లాంటి C-పిల్లర్ను LED స్ట్రిప్ , సిగ్నేచర్ LED బ్లాక్ టెయిల్ లైట్లను జోడించింది. కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, హెడ్స్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్,ఆరు ఎయిర్బ్యాగ్లఇతర ఫీచర్లు. అలాగే 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ , ఏఎంటీమూడు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంటుంది. 1.2-లీటర్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 5 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ తో వస్తోంది. బూస్టర్ జెట్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటో మేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తోంది. -
హైదరాబాద్లో సందడి చేసిన పాపులర్ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ (ఫొటోలు)
-
వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో జియో ట్రూ 5జీ సేవలు
హైదరాబాద్: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను తెలంగాణ లోని వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో మంగళవారం లాంఛనంగా ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్ లో రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో తెలంగాణ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి,ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుందని జియో తెలిపింది. జియో ట్రూ 5జీ పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. చిట్టచివరి అడుగు వరకు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యం మెరుగుపడుతుందని పేర్కొంది. తెలంగాణలో జియో ట్రూ 5జీని విస్తరిండం పట్ల జియో తెలంగాణ సీఈఓ కే సీ రెడ్డి సంతోషం ప్రకటించారు. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ తెలిపింది జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికిట్రూ-5జీని అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా తెలంగాణను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
డుకాటీ బైక్ రూ.72 లక్షలు
న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్బైక్స్ తయారీ సంస్థ డుకాటీ ఈ ఏడాది భారత్కు స్ట్రీట్ఫైటర్ వీ4 లంబోర్గీని మోడల్ను ప్రవేశపెట్టనుంది. 208 హెచ్పీ పవర్తో 1,103 సీసీ ఇంజన్తో రూపుదిద్దుకుంది. డుకాటీ క్విక్ షిఫ్ట్తో 6 స్పీడ్ గేర్బాక్స్, హైడ్రాలికల్లీ కంట్రోల్డ్ స్లిప్పర్ డ్రై క్లచ్ ఏర్పాటు ఉంది. ఎక్స్షోరూంలో దీని ధర రూ.72 లక్షలు ఉండే అవకాశం ఉంది. దీనితోపాటు మరో ఎనమిది మోడళ్లు 2023లో భారత్లో రంగ ప్రవేశం చేయనున్నాయి. ఈ బైక్లు రూ.10.39 లక్షల నుంచి లభిస్తాయి. 2022లో కంపెనీ భారత్లో ఐదేళ్ల గరిష్టం.. 15 శాతం వృద్ధి సాధించింది. -
రాజమండ్రిలో అల్లు శిరీష్, అనసూయ, నేహా శెట్టి సందడి (ఫొటోలు)
-
ఐఫోన్ యూజర్లకు జియో బంపర్ ఆఫర్, ఇలా అప్డేట్ చేసుకోండి!
సాక్షి,ముంబై: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐ ఫోన్ 12, ఆ తకరువాతి మోడల్స్ స్మార్ట్ఫోన్లలో అపరిమిత 5జీ సేవలను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐఫోన్ యూజర్లకు వెల్కం ఆపర్ ప్రకటించింది ఈ మేరకు జియో ఒక ప్రకటన విడుదల చసింది. 5జీ సేవలను పొందేందుకు యూజర్లు తమ ఫోన్లను లేటెస్ట్ సాఫ్ట్వేర్ iOS 16.2 కు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని జియో తెలిపింది. ఐఫోన్12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్12 ప్రో, ఐఫోన్12 ప్రో మ్యాక్స్, ఐఫోన్13, ఐఫోన్13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14, ఐఫోన్14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఎస్ఈ 3(2022) తదితర ఫోన్లు ఉన్నాయని జియో ప్రకటించింది. 5జీకి ఎలా అప్డేట్ అవ్వాలి? ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లలోని iOS 16.2 , లేదా తరువాతి వెర్షన్కు అప్డేట్ చేసుకొని, 'సెట్టింగ్లు' లో 5జీని ఆన్ చేసి, తరువాత 5జీ స్టాండలోన్ను ఆన్ చేయాలని జియో పేర్కొంది. -
టెక్ మహీంద్రా నుంచి క్లౌడ్ బ్లేజ్టెక్ ప్లాట్ఫాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా క్లౌడ్ బ్లేజ్టెక్ ప్లాట్ఫాంను ఆవిష్కరించింది. కంపెనీలు వేగవంతంగా డిజిటల్ వైపు మళ్లేందుకు ఇది సహాయకరంగా ఉండగలదని సంస్థ చీఫ్ డెలివరీ ఆఫీసర్ సుధీర్ నాయర్ తెలిపారు. ఈ ప్లాట్ఫాంతో 25-30 శాతం మేర వ్యయాలు ఆదా కాగలవని, క్లౌడ్కు మైగ్రేట్ అయ్యేందుకు పట్టే సమయం కూడా 30 శాతం తగ్గుతుందని వివరించారు. టెలికం, ఆటోమొబైల్ తదితర రంగాలకు అవసరమైన క్లౌడ్ ఆధారిత సొల్యూషన్స్ను అందించేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. -
ఏటా మూడు వినూత్న ఉత్పత్తులు: డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చికిత్స ప్రమాణాలను మెరుగుపర్చగలిగే మూడు వినూత్న ఉత్పత్తులను ఏటా ఆవిష్కరించాలని ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ (డీఆర్ఎల్) నిర్దేశించుకుంది. అలాగే 2030 నాటికి 150 కోట్ల మంది పేషంట్లకు తక్కువ ధరల్లో ఔషధాలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే దశాబ్ద కాలానికి సంబంధించి నిర్దేశించుకున్న సుస్థిర వృద్ధి లక్ష్యాల ప్రణాళికను కంపెనీ గురువారం ఆవిష్కరించింది. దీని ప్రకారం కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా, 2030 నాటికి పూర్తిగా 100 శాతం పునరుత్పాదక విద్యుత్నే వాడుకునేలా ప్రణాళికలు ఉన్నాయి. అలాగే 2027 నాటికి మార్కెట్లో తామే ముందుగా ప్రవేశపెట్టే ఉత్పత్తులు 25 శాతం ఉండేలా కంపెనీ కృషి చేయనుంది. అటు సీనియర్ లీడర్షిప్ స్థాయిలో మహిళల సంఖ్యను ప్రస్తుత స్థాయికి మూడు రెట్లు పెంచుకుని 35 శాతానికి పెంచుకోనుంది. సామాజిక, పర్యావరణ లక్ష్యాలపరంగా చూస్తే వ్యర్థాలను గణనీయంగా తగ్గించుకోవడం తదితర అంశాలు ఉన్నాయి. (ఈపీఎఫ్వో ఖాతాదారులకు తీపికబురు!) -
గుడ్న్యూస్: క్విక్ హీల్ న్యూ వెర్షన్ 23 లాంచ్
పుణె: సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లు అందించే ‘క్విక్ హీల్’ మాల్వేర్ను గుర్తించే ‘వెర్షన్ 23’ని విడుదల చేసింది. వ్యవస్థలపై సైబర్ దాడులను గుర్తించడమే కాకుండా, ముప్పు తీవ్రతను అంచనా వేస్తుందని కంపెనీ తెలిపింది. లోతైన విశ్లేషణ టూల్స్తో దాడులను నిరోధిస్తుందని వెల్లడించింది. దీనివల్ల సైబర్ దాడుల ముప్పును గుర్తించే సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. ర్యామ్సమ్వేర్ నుంచి రక్షణ, ఎప్పటికప్పుడు ఇంజన్ స్కానింగ్, యాంటీ ట్రాకర్, బ్రీచ్ అలర్ట్ తదితర ఫీచర్లతో ఈ నూతన టెక్నాలజీ పనిచేస్తుందని తెలిపింది. ‘‘కరోనా సంక్షోభం తర్వాత సైబర్ దాడులు అసాధారణ స్థాయిలో పెరిగాయి. ఈ దాడులు ఎంతో అత్యాధునికంగా ఉంటున్నాయి. కనుక వీటిని సాధారణ యాంటీ వైరస్లు గుర్తించలేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెర్షన్ 23ని రూపొందించాం’’అని క్విక్ హీల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సంజయ్ కట్కర్ తెలిపారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త డెబిట్ కార్డులు: రివార్డులు, ఆఫర్లు
హైదరాబాద్: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), వీసా భాగస్వామ్యంతో తన ఖాతాదారుల కోసం కొత్తగా రెండు ప్రీమియం డెబిట్ కార్డులను విడుదల చేసింది. ‘బీవోబీ వరల్డ్ ఒపులెన్స్’అన్నది సూపర్ ప్రీమియం వీసా ఇన్ఫినైట్ డెబిట్ కార్డు కాగా, మరొకటి, ‘బీవోబీ వరల్డ్ సాఫైర్’. క్రెడిట్ కార్డుల మాదిరే వీటిపై రివార్డులు, ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. (Elon Musk సంచలనం: పరాగ్ అగర్వాల్కు మరో షాక్!) బోవోబీ వరల్డ్ ఒపులెన్స్ వీసా ఇన్ఫినైట్ కార్డుపై కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ పికప్, డ్రాప్ సేవ, అపరిమితంగా ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ సందర్శనలు, క్లబ్ మారియట్ సభ్యత్వం, హెల్త్, వెల్నెస్, డైనింగ్ ప్రయోజనాలను అందిస్తోంది. ఆరంభంలో జాయినింగ్ ఫీజు కింద రూ.9,500, ఆ తర్వాత ఏటా రూ.9,500 కస్టమర్లు ఈ కార్డు కోసం చెల్లించుకోవాలి. ఇలాంటి ప్రయోజనాలే కలిగిన బీవోబీ వరల్డ్ సాఫైర్ జాయినింగ్ ఫీజు రూ.750. ఏటా రూ.750 ఫీజు ఉంటుంది. -
మిరే అసెట్ నుంచి టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్
మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా రెండు టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్స్ను ప్రారంభించింది. అవి, మిరే అసెట్ నిఫ్టీ ఎఎఎ పిఎస్యు బాండ్ ప్లస్ ఎస్డిఎల్ ఏప్రిల్ 2026 50:50 ఇండెక్స్ ఫండ్, మిరే అసెట్ క్రిసిల్ ఐబిఎస్ గిల్ట్ ఇండెక్స్– ఏప్రిల్ 2033 ఇండెక్స్ ఫండ్. మొదటిది 2026 ఏప్రిల్ 30తో మెచ్యూర్ అయ్యే ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లు, రాష్ట్ర అభివృద్ధి రుణాల్లో (ఎస్డీఎల్) ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక రెండోది 2033 ఏప్రిల్ 29 నాటికి మెచ్యూర్ అయ్యే గవర్నమెంట్ సెక్యూరిటీల్లో మదుపు చేస్తుంది. కార్పొరేట్ బాండ్లతో పోలిస్తే తక్కువ క్రెడిట్ రిస్కుతో మెరుగైన రాబడి అందుకునేందుకు ఇవి ఉపయోగకరంగా ఉండగలవని సంస్థ తెలిపింది. ఈ రెండు న్యూ ఫండ్ ఆఫర్లు అక్టోబర్ 18న ముగుస్తాయి. కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాలి. సంస్థ సీఐవో (ఫిక్సిడ్ ఇన్కం) మహేంద్ర జాజూ ఈ ఫండ్లను నిర్వహిస్తారు. -
పంజాగుట్టలోని ఓ జ్యువెలరీ ప్రారంభోత్సవంలో బిగ్బాస్ఫేమ్ దివి సందడి (ఫోటోలు)
-
పంజాగుట్టలో డైమండ్ షోరూం ప్రారంభోత్సంలో అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫోటోలు)
-
'బ్యూటిఫుల్ గర్ల్'ను పరిచయం చేసిన అనుపమ పరమేశ్వరన్..
Anupama Parameswaran Launch First Look Of The Story Of A Beautiful Girl: చార్మీతో ‘మంత్ర’, అనుపమ పరమేశ్వరన్తో ‘బటర్ ఫ్లై’ చిత్రాలు నిర్మించిన జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ పై రానున్న తాజా చిత్రం ‘ది స్టోరీ అఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్’. నిహాల్ కొదాటి, దృషికా చందర్ జంటగా రవిప్రకాష్ బోడపాటి దర్శకత్వంలో ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను అనుపమా పరమేశ్వరన్ విడుదల చేశారు. ‘‘మా బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1గా 2007లో ‘మంత్ర’ సినిమా చేశాం. అది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని, ‘బటర్ ఫ్లై’ సినిమా చేశాం. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘ది స్టోరీ అఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్’కి నేను స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా చేశాను. మా సంస్థ నుంచి మరిన్ని మంచి చిత్రాలు అందిస్తాం’’ అని రవిప్రకాష్ బోడపాటి అన్నారు. త్వరలో ‘ది స్టోరీ అఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్’ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని ప్రసాద్ తిరువల్లూరి అన్నారు. -
అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు
‘‘అమిర్ ఖాన్ చేసే ప్రయోగాత్మక పాత్రలను నేను చేయలేను. నా సినిమాలు జనరంజకంగా, జనామోదంగా ఉండాలని ప్రయత్నిస్తుంటాను. నా ప్రమేయం లేకుండా కొన్ని సినిమాలు జరిగిపోతుంటాయి. ఆమిర్ ఖాన్ ‘లాల్సింగ్ చడ్డా’ను నేను సమర్పిస్తున్నందుకు గర్వపడుతున్నాను. అలాంటి కంటెంట్, ఎమోషన్ సినిమాలో ఉంది. కన్నీళ్లు పెట్టుకోం కానీ సినిమా చూస్తున్నప్పుడు చాలా చోట్ల కంటతడి, గుండె తడి ఉంటూనే ఉంటుంది’’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అమిర్ ఖాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లాల్సింగ్ చడ్డా’. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్గా రూపొందిన ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకుడు. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఆదివారం (జులై 24) హైదరాబాద్లో జరిగిన వేడుకలో ‘లాల్సింగ్ చడ్డా’ తెలుగు ట్రైలర్ను చిరంజీవి, ఆమిర్ ఖాన్ రిలీజ్ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘2019లో జపాన్ ఎయిర్పోర్ట్లో నేను, అమిర్ కలిశాం. అప్పుడు ‘ఫారెస్ట్ గంప్’ను రీమేక్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ రీమేక్ ఆమిర్కు అవసరమా? అనే ఫీలింగ్ వచ్చింది కానీ ఆయన ప్యాషన్ చూసి కరెక్ట్ అనిపించింది. మనకు టామ్ హాంక్స్ (‘ఫారెస్ట్గంప్’లో హీరోగా నటించిన హాలీవుడ్ నటుడు) అంటే ఎవరో కాదు.. ఆమిర్ ఖాన్నే. ‘3 ఇడియట్స్’, ‘లగాన్’, ‘పీకే’ ‘దంగల్’.. ఇలా డిఫరెంట్ చిత్రాలు చేశారు ఆమిర్. ఇంత తపన ఉన్న నటుడు ఇండియాలో ఒక్క ఆమిర్ ఖానే ఉన్నారు. సినిమా మేకింగ్లో కర్త, కర్మ తానే అవుతారు. ఇలాంటి యూనిక్ స్టైల్ ఇండియాలో ఏ యాక్టర్లోనూ లేదు. మేం కూడా చేయాలనుకుంటాము. కానీ పరిమితులు ఉంటాయి. సో.. ఆయనలా మేం చేయలేం. అందుకే ఆయన అడగ్గానే ఆబ్లిగేషన్తో కాదు.. ఎంతో హానర్గా ‘లాల్సింగ్ చడ్డా’ని సమర్పించడానికి ఒప్పుకున్నాను’’ అన్నారు. అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘లాల్సింగ్ చడ్డా’ చూసి, నచ్చితే సమర్పించమని చిరంజీవిగారిని కోరాను. ఇప్పటివరకు ఏ సినిమాకూ ఆయన సమర్పకులుగా లేరని నాకు తెలుసు. మా సినిమాకు సమర్పకులుగా ఉన్నందుకు ఆయనకు ధన్యవాదాలు. నాగచైతన్య క్రమశిక్షణ చూసి, తనను బాగా పెంచారని చైతన్య అమ్మ లక్ష్మీగారికి ఫోన్ చేసి, మాట్లాడాను. ఈ సినిమాను మా అమ్మగారు చూశారు. ‘ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు’ అన్నారామె. నా కూతురు ఐరా ఎమోషనల్ పర్సన్. ఈ సినిమాను తను ఇంకా చూడలేదు ’’ అని తెలిపారు. నాగచైతన్య మాట్లాడుతూ .. ‘‘ఈ చిత్రంలో గుంటూరుకు చెందిన బాలరాజు పాత్ర చేశాను. ఈ సినిమా కోసం వర్క్షాప్స్ చేశాం. ఇలా చేయడం నాకు కొత్త. ఈ సినిమాలో నా పాత్ర దాదాపు 30 నిమిషాలు ఉంటుంది. కొన్ని సినిమాల్లో పాత్ర ఎంతసేపు ఉందని కాదు.. కొన్ని మూమెంట్స్ను, ఎక్స్పీరియన్స్ను నేర్పిస్తాయి. యాక్టర్గా ఈ సినిమా నాకో ఇన్వెస్ట్మెంట్. ఆర్టిస్టుగా హెల్ప్ అవుతుందని ఈ సినిమా చేశాను’’ అని పేర్కొన్నారు. చిరంజీవి: ఒకప్పుడు భారతీయ సినిమా అంటే హిందీ సినిమా అన్నట్లుగా చూపించారు. తెలుగు యాక్టర్గా కాదు... నేను ఇండియన్ యాక్టర్ అనిపించుకోవాలని హిందీలో ‘ప్రతిబంధ్, ఆజ్ కా గూండా రాజ్, జెంటిల్మెన్’ సినిమాలు చేశాను. కమల్హాసన్ ‘ఏక్ దూజే కే లియే’ వంటివి చేశారు. అయినా సౌత్ యాక్టర్స్గానే చూశారు. విశ్వనాథ్గారి ‘శంకరాభరణం’ నుంచి తెలుగు సినిమాకు గుర్తింపు వచ్చినా.. తర్వాత అలాంటి గుర్తుంపు వచ్చింది లేదు. రాజమౌళి ఆ హద్దులు చెరిపేశారు. సౌత్, నార్త్ అనే తేడాలు పోయాయి. ఏ భాషలో తీసినా సరే అది ఇండియన్ సినిమాయే. ఇలాంటి వాతావరణం రావాలని తపన పడ్డాను. అమిర్ ఖాన్: చిరంజీవిగారు బాధపడ్డ ఆ సందర్భం గురించి నేను చదివాను. ఓ హిందీ యాక్టర్ అయిన నేను ఇప్పుడు ఆయన హెల్ప్ కోసం ఇక్కడికి వచ్చాను. దక్షిణాది సినిమాలు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’లకు మంచి ఆదరణ లభించింది. నాకు తెలుగు సినిమా చేయాలని ఉంది. చిరంజీవిగారికి ఓసారి ఫోన్ చేసినప్పుడు సల్మాన్ తన సినిమాలో నటిస్తున్నట్లుగా చెప్పారు. నేను ఎందుకు గుర్తు రాలేదని ఆయనతో అన్నాను. -
నాగార్జునకొండకు లాంచీలు పునఃప్రారంభం
నాగార్జునసాగర్: నాగార్జునకొండకు శనివారం నుంచి లాంచీల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కృష్ణా నదిలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో టీఎస్టీడీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లాంచీలను నాగార్జునకొండకు నిలిపి వేశారు. వర్షం, గాలి తగ్గడంతో ప్రస్తుతం లాంచీలు మొదలయ్యాయి. వర్షం కారణంగా విద్యాసంస్థలకు వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నాగార్జునసాగర్ సందర్శనకు తరలి వచ్చారు. లాంచీలు నిత్యం ఉదయం 9గంటల తర్వాత మొదలవుతాయి. మధ్యాహ్నం 2గంటల వరకు పర్యాటకుల సంఖ్యను బట్టి నాగార్జునకొండకు ట్రిప్పులు ఉంటాయి. -
లంచం అడిగితే ఈ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చు: సీఎం వైఎస్ జగన్
-
‘ఏసీబీ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్.. యాప్ ఎలా పనిచేస్తుందంటే?
సాక్షి, అమరావతి: అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ప్రారంభించారు. గతంలో సీఎం ఆదేశాలమేరకు ఏసీబీ ఈ యాప్ తయారు చేసింది. స్పందనపై నిర్వహించిన సమీక్షలో సీఎం.. యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఒకటే మాట చెబుతున్నామని.. ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట చాలా స్పష్టంగా చెప్పామన్నారు. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. చదవండి: Fact Check: 'ఆ పథకాల రద్దు అవాస్తవం.. ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదు' సీఎం ఇంకా ఏమన్నారంటే: ♦చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని లాంటి అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా పంపాం ♦ఎక్కడైనా, ఎవరైనా కూడా.. కలెక్టరేట్ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్రిజిస్ట్రార్ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్స్టేషన్ అయినా, వాలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే.. ఎవరైనా చేయాల్సింది ఒక్కటే. ♦తమ చేతుల్లోని ఫోన్లోకి ఏసీబీ 14400 యాప్ను డౌన్లోడ్ చేసి... బటన్ ప్రెస్చేసి వీడియోద్వారా కాని, ఆడియోద్వారా కాని సంభాషణను రికార్డు చేయండి.. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుంది ♦అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మకమైన మార్పును తీసుకు వస్తున్నాం ♦ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుంది ♦ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉంది ♦అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది ♦మన స్థాయిలో అనుకుంటే.. 50శాతం అవినీతి అంతం అవుతుంది ♦మిగిలిన స్థాయిలో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది ♦అవినీతి లేని పాలన అందించడం మన అందరి కర్తవ్యం: ♦ఎవరైనా పట్టుబడితే.. కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి: యాప్ ఎలా పనిచేస్తుందంటే...: ♦పౌరులు నేరుగా యాప్ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ♦గూగుల్ ప్లే స్టోర్లో యాప్ ♦యాప్ డౌన్లోడ్ చేయగానే మొబైల్ నంబర్కు ఓటీపీ ♦ఓటీపీ రిజిస్టర్ చేయగానే వినియోగానికి యాప్ సిద్ధం ♦యాప్లో 2 కీలక ఫీచర్లు ♦యాప్ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్రిపోర్ట్ ఫీచర్ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ♦లాడ్జ్ కంప్లైంట్ ఫీచర్ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించి.. ఫిర్యాదుకు తనదగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం ♦ఫిర్యాదు రిజిస్టర్ చేయగానే మొబైల్ ఫోన్కు రిఫరెన్స్ నంబరు ♦త్వరలో ఐఓఎస్ వెర్షన్లోనూ యాప్ను సిద్ధంచేస్తున్న ఏసీబీ -
తమిళంలో ఎంట్రీ ఇచ్చిన 'ఆహా'.. లాంచ్ చేసిన సీఎం
ఆహా 100 శాతం తమిళ్ ఎంటర్టైన్మెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్ను తమిళ ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నేతృత్వంలో తెలుగులో ప్రారంభమైన ఓటీటీ ప్లాట్ఫామ్ విజయవంతమైన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తమిళంలో ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించారు. దీనిని తమిళంలోనూ నెంబర్వన్ స్థానంలో నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని అల్లు అరవింద్ పేర్కొన్నారు. 100 శాతం ఎంటర్టైన్మెంట్ సినిమాలు, వెబ్ సిరీస్, టాక్షోలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళం ప్రేక్షకులను అలరించే విధంగా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. దీనికి నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ను అంబాసిడర్లుగా నిర్మించారు. కాగా ఈ వేడుకలో తమిళ సినిమా నాయకులుగా విశేష సేవలు అందించిన దర్శకుడు ఎస్.పి.ముత్తురామన్ భారతీరాజా దివంగత నిర్మాత ఎ.వి.మెయ్యప్పన్, ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్, సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్, గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం, నటి శ్రీదేవి సేవలను గుర్తుచేసుకుంటూ.. గౌరవించే విధంగా కలైంజ్ఞర్ పెరుమై అనే అవార్డులను ప్రదానం చేశారు. -
శామ్సంగ్ నుంచి అయిదు స్మార్ట్ఫోన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీలో ఉన్న శామ్సంగ్ తాజాగా గెలాక్సీ ఏ–సిరీస్లో అయిదు స్మార్ట్ఫోన్స్ ప్రవేశపెట్టింది. ధర రూ.15,000 నుంచి ప్రారంభం. 108 ఎంపీ క్వాడ్ కెమెరా, సూపర్ అమోలెడ్ 120 హెట్జ్ డిస్ప్లేతో గెలాక్సీ ఏ73 5జీ తయారైంది. 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. గెలాక్సీ ఏ53, ఏ23, ఏ13, ఏ33 మోడళ్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. కాగా, ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో రూ.20–45 వేల ధరల శ్రేణి విభాగంలో 40 శాతం వాటాను శామ్సంగ్ లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే ఈ విభాగంలో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. 5జీ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో ప్రస్తుతం 16 మోడళ్లను విక్రయిస్తోంది. నెలకు 3 లక్షల మంది శామ్సంగ్ ఫైనాన్స్ ప్లస్ ద్వారా సులభ వాయిదాల్లో స్మార్ట్ఫోన్స్ కొనుగోలు చేస్తున్నారని కంపెనీ మిడ్, హై స్మార్ట్ఫోన్స్ విభాగం హెడ్ అక్షయ్ ఎస్ రావు మంగళవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. వీరిలో 50 శాతం మంది తొలిసారిగా రుణం తీసుకున్నవారేనని వివరించారు. -
విజయవాడలో నివేదా పేతురాజ్ సందడి ఫొటోలు
-
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం
-
ఇండియన్ మోటార్సైకిల్ ‘చీఫ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న ఇండియన్ మోటార్సైకిల్ సరికొత్త చీఫ్ శ్రేణి మోటార్సైకిల్స్ను భారత్లో ప్రవేశపెట్టింది. ఎక్స్షోరూంలో ధర రూ.20.75 లక్షల నుంచి ప్రారంభం. 2022 చీఫ్ శ్రేణిలో చీఫ్ డార్క్ హార్స్, ఇండియన్ చీఫ్ బాబర్ డార్క్ హార్స్, ఇండియన్ సూపర్ చీఫ్ లిమిటెడ్ మోడల్స్ ఉన్నాయి. 1,890 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ పొందుపరిచారు. 15.1 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, ప్రీలోడ్ అడ్జెస్టేబుల్ రేర్ షాక్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్, ఎల్ఈడీ లైటింగ్, కీలెస్ ఇగ్నిషన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సర్క్యులర్ టచ్ స్క్రీన్ రైడ్ కమాండ్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి. చదవండి : ఎలక్ట్రిక్ బైక్ ఐడియా..భలే ఉంది కదూ! -
సోనూ సూద్ ‘ట్రావెల్’ యాప్
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులకు వ్యాపార అవకాశాలు కల్పించే దిశగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ట్రావెల్ యూనియన్ పేరిట బిజినెస్–టు–బిజినెస్ ట్రావెల్ టెక్నాలజీ ప్లాట్ఫాంను ఆవిష్కరించారు. ఐఆర్సీటీసీ దేశవ్యాప్తంగా నిర్వహించే రైళ్లు, దేశ..విదేశ రూట్లలో 500 పైచిలుకు ఫ్లయిట్లు, 10 వేల పైచిలుకు బస్సు ఆపరేటర్ల వాహనాల్లో టికెట్లతో పాటు హోటళ్లలో గదులను దీని ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు తమ ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకునే వెసులుబాటు అంతగా లేదని, ఒక్కో దానికోసం ఒక్కో ఆపరేటరును ఆశ్రయించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ట్రావెల్ యూనియన్తో ఇలాంటి వాటన్నింటినీ చౌకగా ఒకే చోట పొందవచ్చని సోను సూద్ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారవేత్తలకు ఇది అదనపు ఆదాయ మార్గంగా ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాట్ఫాంలో చేరడానికి కట్టే నామమాత్రపు రుసుము రిఫండ్ అవుతుందని, తద్వారా ఉచితంగానే చేరినట్లవుతుందన్నారు. ట్రావెల్ యూనియన్లో సోనూ సూద్ రెండో అతి పెద్ద వాటాదారుగా ఉన్నారు. -
ఇ–రూపీ వచ్చేసింది..!
న్యూఢిల్లీ: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో పారదర్శకతను మెరుగుపరచడం, ప్రయోజనాలను నేరుగా లక్ష్యిత సేవలకు అందించడం లక్ష్యంగా కేంద్రం ‘ఇ–రూపీ’ని తీసుకొచ్చిం ది. వ్యక్తులు అలాగే నిర్దిష్ట ప్రయోజనాల కోసం వినియోగించే ఈ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ను సోమవారమిక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతానికి ఇ–రూపీ సదుపాయం ఆరోగ్య సేవలకు అందుబాటులో ఉంటుంది, రానున్న కాలంలో ఇతర విభాగాలకు కూడా దీన్ని విస్తరించనున్నారు. ఆయుష్మాన్ భారత్, ఎరువుల సబ్సిడీ వంటి వాటికి కూడా కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ‘ఇ–రూపీ ద్వారా డిజిటల్ పాలనలో దేశం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. డిజిటల్ లావాదేవీలు అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)ని మరింత సమర్థవంతంగా మార్చడంలో ఇ–రూపీ వోచర్ అద్భుతమైన పాత్రను పోషించబోతోంది. లక్ష్యిత వర్గాలందరికీ పారదర్శకమైన, లీకేజీ రహిత ప్రయోజనాలు అందించడంలో దోహదం చేస్తుంది‘ అని ఇ–రూపీ ప్రారంభం సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. లీకేజీలకు అడ్డుకట్ట... ప్రభుత్వ ప్రయోజనాలను నిర్దేశిత లబ్ధిదారులకు, వృథా (లీకేజీ) రహితంగా. లక్ష్యిత వర్గాలకు చేరేవిధంగా పలు పథకాలను గత కొన్నేళ్లుగా కేంద్రం ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పుడు అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రానికల్ వోచర్ అనేది సుపరిపాలన విజన్ను పెంపొందించడంలో మరింత తోడ్పాటును అందించనుంది. ఇది ఒక్క ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినది కాదని, ప్రైవేటు సంస్థలు లేదా ఎవరికైనా తమ వైద్య చికిత్సలు, విద్య లేదా ఇతరత్రా ఎలాంటి పనులకైనా సరే సహాయం చేయాలనుకుంటున్న సంస్థలు నగదుకు బదులు ఇ–రూపీ రూపంలో ఇవ్వవచ్చని ప్రధాని వివరించారు. దీనివల్ల ఏ ప్రయోజనం కోసమైతే డబ్బును ఇచ్చారో, అదే పని కోసం కచ్చితంగా అది వినియోగించబడేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ వంటి నిర్దిష్ట ప్రయోజనాలను అవసరమైన వారికి చేరువ చేసేందుకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఈ లీకేజీ రహిత యంత్రాంగాన్ని ఉయోగించుకోవచ్చని వివరించారు. రాష్ట్రాలు కూడా సంక్షేమ పథకాలను నిర్దేశిత లబ్ధిదారులకు చేరువ చేసేందుకు ఇ–వోచర్ను వినియోగించుకోవాల్సిందిగా ప్రధాని సూచించారు. ప్రైవేటు రంగం సైతం తమ ఉద్యోగుల సంక్షేమం, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాలకు ఈ డిజిటల్ వోచర్ల ప్రయోజనాలను వాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. వంట గ్యాస్, రేషన్ సరుకులు అలాగే ఇతరత్రా సంక్షేమ పథకాలకు సంబంధించి సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి వేయడం (డీబీటీ) ద్వారా భారీగా లీకేజీలకు అడ్డుకట్ట వేయగలిగామని, అదేవిధంగా నకిలీ లబ్ధిదారులను ఏరివేయగలిగామని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వం రూ.1.78 లక్షల కోట్ల మొత్తాన్ని ఆదా చేయడంలో ఇది ఎంతగానో తోడ్పడిందని ఆయన చెప్పారు. కరోనా లాక్డౌన్ సమయంలో డీబీటీ ఎంతగా ఉపయోగపడిందనేది ప్రధాని వివరిస్తూ... జామ్ (జన్ధన్ ఖాతా, మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు)తో డిజిటల్ ఇండియా అనుసంధానం వల్ల ఒక్క క్లిక్తో నేరుగా కోట్లాది మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేసేందుకు తోడ్పడిందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇప్పటికీ దీని కోసం భౌతిక వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. డీబీటీ ప్లాట్ఫామ్ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకూ కేంద్రం అందిస్తున్న 300కు పైగా స్కీములకు రూ.17.5 లక్షల కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ‘వంట గ్యాస్ సబ్సిడీ, పెన్షన్లు, పీఎం కిసాన్ యోజన, స్కాలర్షిప్లు వంటి వాటి కోసం దాదాపు 90 కోట్ల మంది ఈ డీబీటీ ప్లాట్ఫామ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయడం ద్వారా రూ.1.78 లక్షల కోట్లు ఆదా అయింది’ అని చెప్పారు. సేవల కల్పనలో నవకల్పనలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విషయానికొస్తే, ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింటితో పాటు భారత్ కూడా ప్రపంచ నాయకత్వాన్ని అందించే సత్తాను సొంతం చేసుకుందని ప్రధాని పేర్కొన్నారు. -
పోలీసులకు ఫిట్నెస్ ప్రోగ్రాం
సాక్షి, ముంబై: కరోనా కాలంలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని కోల్పోయిన ముంబై పోలీసు శాఖ భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టింది. ఈ మేరకు ముంబై పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఫిట్నెస్ పట్ల అవగాహన కల్పించాలని నిర్ణయించింది. తమ పోలీసులు ఫిట్గా ఉండేలా చూసుకునేందుకు ప్రత్యేక ఫిట్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు పోలీసులకు ఫిట్నెస్పై అవగాహన, కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ముంబై పోలీసు కమిషనర్ హేమంత్ నగరాలే వెల్లడించారు. దీన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు స్వయంగా ఆయనే చొరవ తీసుకుంటున్నారు. ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్ కోసం వీరు ద ఇండియన్ న్యూట్రిషన్ కోచ్ అనే సంస్థతో కలిసి పనిచేయనున్నారు. ఈ సంస్థను ప్రస్తుతం పోలీసు విభాగంలోనే ఎస్సైగా పనిచేస్తున్న ఒకరి కూతురు నడుపుతోంది. ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్లో భాగంగా ముంబైలోని పోలీసు స్టేషన్లలో ఎంత మంది పోలీసులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు..? వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నాయి..? 45 ఏళ్ల పైబడిన వారు ఎంతమంది ఉన్నారు..? తదితర వివరాలు సేకరిస్తారు. వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నవారిని, 45 ఏళ్ల పైబడిన వారిని మొదటి గ్రూపులో చేరుస్తారు. వారికి ఒక్కొక్కరిగా కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వారు ఎలాంటి ఆహారం తినాలి, ఏది తినవద్దు, ఫిట్గా ఉండేందుకు ఎలాంటి వ్యాయమాలు చేయాలి, రోజువారీ దినచర్య ఎలా ఉండాలి తదితర అంశాలపై మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు. దీనికోసం ప్రభుత్వం ఒక్కో పోలీసుపై రూ. 3 వేల వరకు అదనంగా ఖర్చు చేయనుంది. ఇలా నగరంలోని అన్ని పోలీసు స్టేషన్ల నుంచి సేకరించిన వివరాల ప్రకారం దశలవారీగా సిబ్బందిని ఎంపిక చేసి వారికి ఫిట్నెస్పై శిక్షణ ఇస్తారు. ప్రస్తుతానికి ఘట్కోపర్, పంట్ నగర్, ఆర్సీఎఫ్, శివాజీ నగర్, ట్రాంబే పోలీసు స్టేషన్ల నుంచి ఒక్కో స్టేషన్ నుంచి 20 మంది చొప్పున 100 మందితో తొలి బ్యాచ్ను జూలై 19న ప్రారంభించారు. కరోనాతో 122 మంది పోలీసుల మృతి కరోనా మహమ్మారి రాష్ట్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు విశ్రాంతి లేకుండా అహోరాత్రులు విధులు నిర్వర్తిస్తున్నారు. సమయానికి భోజనం, తగినంత విశ్రాంతి లేక, నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు కరోనా వైరస్ను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు నడుం బిగించారు. దీర్ఘకాలిక సెలవులు, వారాంతపు సెలవులను కూడా ప్రభుత్వం రద్దు చేయడంతో విశ్రాంతి అనేది లేకుండా వారు విధులు నిర్వర్తించారు. 24 గంటలు నాకా బందీలు, తనిఖీలు, కాలక్షేపానికి బైక్లపై తిరుగుతున్న యువతను అడ్డుకోవడం, అనవసరంగా రోడ్లపై తచ్చాడుతున్న వారిని పట్టుకుని చర్యలు తీసుకోవడం లాంటి పనులు చేపట్టారు. ఫలితంగా కరోనా సోకి 2020లో ముంబై పోలీసు శాఖలో పనిచేస్తున్న 19 మంది పోలీసులు చనిపోయారు. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 122కి పెరిగింది. ఒక్క ముంబైలోనే 122 మంది పోలీసులు కరోనా కాటుకు బలికావడాన్ని ముంబై పోలీసు కమిషనర్ హేమంత్ నగరాలే జీర్ణించుకోలేకపోయారు. దీంతో పోలీసు సిబ్బందిలో ఫిట్నెస్పై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. వెంటనే ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్కు శ్రీకారం చుట్టారు. అంతేగాక, పోలీసు శాఖలో అనేక మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లకు భారీ పొట్ట ఉంది. వీరేం పరుగెడతారు..? దొంగలను ఎలా పట్టుకుంటారు...? అంటూ ప్రజలు వీరిపై జోకులు వేస్తున్నారు. ఇలాంటి వారివల్ల పోలీసు శాఖ ప్రతిష్ట మసకబారుతోంది. అంతేగాక బానెడు పొట్ట వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. దీంతో ఇలాంటి వారిని కూడా ఎంపిక చేసి పొట్ట తగ్గించేందుకు ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయాలో కూడా ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్లో భాగంగా నేర్పించనున్నారు. -
గాల్లో తేలే రైళ్లు.. గంటకు 600కిమీ వేగం..!
బీజింగ్: చైనా 600 కిలోమీటర్ల వేగంతో వెళ్లే మాగ్లెవ్ రైలును లాంచ్ చేసింది. ఈ రైళ్లతో బీజింగ్ నుంచి షాంఘైకి వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండున్నర గంటల్లో చేరుకోవచ్చునని ఒక ప్రకటనలో తెలిపింది. ఒకవేళ విమానంలో వెళ్తే సుమారు 3 గంటల సమయం పట్టనుంది. విమానం కంటే వేగంగా మాగ్లెవ్ రైలు వెళ్లనుంది. ఖింగ్దావ్లో చైనా ఈ రైలును అభివృద్ధి చేసింది. గాల్లో తేలే రైళ్లు.. సాధారణ రైళ్లకు, మాగ్లెవ్ రైళ్లకు చాలా వ్యత్యాసం ఉంది. సాధారణ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తాయి. కానీ ఈ మాగ్లెవ్ రైళ్లకు పట్టాలున్నా.. పట్టాలపై పరుగులు తీయదు. పట్టాలకు తాకకుండా విద్యుదయస్కాంత శక్తితో గాల్లో కొంత ఎత్తులో రైలు నడుస్తుంది. చైనా గత రెండు దశబ్దాలుగా మాగ్లెవ్ రైళ్ల టెక్నాలజీను ఉపయోగిస్తుంది. పరిమిత సంఖ్యలో మాగ్లెవ్ చైనాలో నడుస్తున్నాయి. జపాన్, జర్మనీ వంటీ దేశాలు మాగ్లెవ్ రైలును అభివృద్ది చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. -
మారుతి కార్ల ధరలకు రెక్కలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఈ ఏప్రిల్ నుంచి తన అన్ని రకాల కార్ల మోడళ్లపై ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ముడి పదార్థాల ధరలు, ఇన్పుట్ వ్యయాలు పెరగటంతో ధరల్ని పెంచక తప్పడం లేదని కంపెనీ చెప్పుకొచ్చింది. అయితే ఏ మోడల్ ఎంత ధర పెరుగుతుందో అనే అంశాన్ని వెల్లడించలేదు. ఇప్పటికే మారుతీ ఈ ఏడాది జనవరిలో కొన్ని కార్ల ధరలను రూ. 34 వేల వరకు పెంచింది. మూడు స్టార్టప్ల ఎంపిక.. మొబిలిటీ, ఆటోమొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్ (మెయిల్) ప్రోగ్రాం కింద 3 కొత్త స్టార్టప్లను షార్ట్లిస్ట్ చేసినట్లు మారుతీ తెలిపింది. నేబుల్ ఐటీ, రెడ్బాట్, స్లీవ్ వీటిలో ఉన్నాయి. ఇవి ఇకపై పెయిడ్ ప్రాజెక్టుల్లో భాగం కావచ్చని మారుతీ ఎండీ కెనిచి అయుకావా తెలిపారు. ఫిబ్రవరిలో మారుతి సుజుకి 168,180 వాహనాలను ఉత్పత్తి చేసింది, అంతకు ముందు ఏడాది 140,933 యూనిట్లు. ఇందులో 165,783 ప్యాసింజర్ వాహనాలు, 2,397 లైట్ కమర్షియల్ యుటిలిటీ వాహనాలు ఉన్నాయి.ఇక అమ్మకాల విషయానికొస్తే, కంపెనీ 2021 ఫిబ్రవరిలో 164,469 యూనిట్లను విక్రయించింది, లేదా గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 11.8 శాతం ఎక్కువ. గత నెలలో 144,761 ప్యాసింజర్ వాహనాలు, 2,722 తేలికపాటి వాణిజ్య వాహనాలు, 5,500 వాహనాలు ఇతర OEM లకు విక్రయించబడ్డాయి మరియు 11,486 ఎగుమతి చేసిన యూనిట్లు ఉన్నాయి. అయితే, 2020-21 ఏప్రిల్-ఫిబ్రవరి అమ్మకాల గణాంకాలు 12.8 శాతం తగ్గి 1,290,847 యూనిట్లకు చేరుకున్నాయి. సాక్షి,సిటీబ్యూరో: నగరంలో సరికొత్త ‘ఈక్లాస్’ మెర్సిడీస్ బెంజ్ సిల్వర్స్టార్ని లాంచ్ చేశారు. ఈ సిల్వర్ స్టార్ని బంజారాహిల్స్లోని తాజ్ దక్కన్ హోటల్లో సీఈఓ మహేష్ దేవ్, సేల్స్ లీడ్ సాయిహార్ష కలిసి ఆవిష్కరించారు. ఈ మోడల్లో ఆధునిక సాంకేతను ఉపయోగించి వినూత్నంగా ఎమ్బీయూఎక్స్ సిస్టమ్, ట్విన్ డిజిటల్ టచ్ స్క్రీన్, హే మెర్సిడీస్ వాయిస్ కమాండ్స్తో రూపొందించామని వారు తెలిపారు. -
గుడ్న్యూస్ : 4000 రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ వైఫై
సాక్షి,న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేకు చెందిన బ్రాండ్బ్యాండ్, వీపీఎన్ సర్వీసెస్ కంపెనీ రైల్టెల్ దేశంలోని 4 వేల రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ వైఫై సేవలను ప్రారంభించింది. ఇప్పటికే 5,950కి పైగా స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధ్రువీకరణతో ఎవరైనా సరే ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. తాజాగా విడుదల చేసిన ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకారం ప్రయాణికులు రోజుకు 30 నిమిషాల ఉచిత వైఫైను 1 ఎంబీపీఎస్ వేగంతో ఉపయోగించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ వేగవంతమైన లేదా 34 ఎంబీపీఎస్ వేగం వరకు ఇంటర్నెట్ కోసం వినియోగదారులు నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 5 జీబీ డేటా చార్జీ రూ.10, 10 జీబీకి రూ.15 చార్జీ, అలాగే ఐదు రోజుల వ్యాలిడిటీతో 10 జీబీ చార్జీ రూ.20, 20 జీబీ చార్జీ రూ.30గా ఉన్నాయి. 10 రోజుల వ్యాలిడిటీతో 20 జీబీ చార్జీ రూ.40, 30 జీబీకి రూ.50, అదేవిధంగా 30 రోజుల వ్యాలిడిటీ ఉండే 60 జీబీకి రూ.70 చార్జీలున్నాయి. వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణమైన ప్లాన్స్ను ఎంచుకునేలా రూపొందించామని రైల్టెల్ సీఎండీ పునీత్ చావ్లా తెలిపారు. -
సరికొత్త ముస్తాబుతో డుకాటీ ‘‘స్క్రాంబ్లర్’’
సాక్షి, న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్బైకుల తయారీ సంస్థ డుకాటీ శుక్రవారం 2021 డుకాటీ స్క్రాంబ్లర్ రేంజ్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన ఈ మోడల్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఐకాన్ డార్క్ వేరియంట్ రూ.7.99 లక్షలుగా ఉంది. స్క్రాంబర్ల్ ఐకాన్, ఐకాన్ డార్క్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.8.49 లక్షలు, రూ.10.99 లక్షలుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉండే డుకాటీ డీలర్ షాపుల్లో బైకులను బుక్ చేసుకోవచ్చని, జనవరి 28 నుంచి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యధిక కస్టమర్లు మెచ్చే బైకుల జాబితాలో స్క్రాంబ్లర్ రేంజ్ మోడళ్లు ఎల్లప్పుడూ స్థానాన్ని కలిగి ఉంటాయని ఆవిష్కరణ సందర్భంగా డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర తెలిపారు. -
ఫార్చూనర్ కొత్త వెర్షన్...
సాక్షి, న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ప్రీమియం ఎస్యూవీ ఫార్చూనర్ కొత్త వెర్షన్ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్షోరూం వద్ద దీని ధర రూ.29.98 –-రూ.37.43 లక్షల మధ్య ఉంది. మొత్తం ఏడు వేరియంట్లలో వస్తున్న ఈ కారు లెజెండర్ వేరియంట్ ధర రూ. 37.58 లక్షలుగా నిర్ణయించారు. ఈ కొత్త టయోటా ఫార్చూనర్ పెట్రోల్, డిజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్, 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. సీట్ వెంటిలేషన్ సిస్టమ్, ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థతో పాటు 11 స్పీకర్లతో జేబిల్ ఆడియో, ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ లాంటి లేటెస్ట్ ఫీచర్లను ఇందులో సమకూర్చారు. కొత్త డిజైన్ అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉన్న ఈ కార్ల డెలివరీ త్వరలో ప్రారంభమవుతుంది. భారత్లో గడిచిన 11 ఏళ్లతో సుమారు 1.7 లక్షల ఫార్చూనర్ కార్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. -
సరికొత్తగా ‘జియోపేజెస్’ మొబైల్ బ్రౌజర్
న్యూఢిల్లీ: సరికొత్తగా తీర్చిదిద్దిన దేశీ మొబైల్ బ్రౌజర్ ‘జియోపేజెస్’ను రిలయన్స్ జియో ప్రవేశపెట్టింది. ఇది ఎనిమిది భారతీయ భాషల్లో లభ్యమవుతుందని సంస్థ వెల్లడించింది. మరింత మెరుగైన బ్రౌజింగ్ అనుభూతిని ఇవ్వడంతో పాటు డేటా గోప్యతకు పెద్ద పీట వేస్తూ దీన్ని రూపొందించినట్లు వివరించింది. గూగుల్ ప్లేస్టోర్లో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు జియో ప్రతినిధి తెలిపారు. వేగవంతంగా పేజ్ లోడింగ్, మెరుగ్గా మీడియా స్ట్రీమింగ్, ఎన్క్రిప్టెడ్ కనెక్షన్ మొదలైన ప్రత్యేకతలు ఈ బ్రౌజర్లో ఉన్నాయని వివరించారు. (ఈ-కామర్స్ కంపెనీల టేకాఫ్ అదుర్స్ ) గత వెర్షన్కు 1.4 కోట్ల డౌన్లోడ్స్ ఉన్నాయని, వీటన్నింటినీ దశలవారీగా లేటెస్ట్ వెర్షన్కి అప్గ్రేడ్ చేయనున్నామని పేర్కొన్నారు. ఇంగ్లీష్, తెలుగు సహా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో జియో పేజెస్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. జియోపేజెస్ బ్రౌజర్ను యూజర్లు తమకు కావల్సిన కంటెంట్ పొందేలా కస్టమైజ్ చేసుకునేందుకు కూడా వీలుంటుంది. రాష్ట్రాన్ని బట్టి స్థానికంగా ప్రాచుర్యం పొందిన సైట్లు.. స్క్రీన్పై కనిపిస్తాయి. గూగుల్, బింగ్, ఎంఎస్ఎన్, యాహూ వంటి సెర్చి ఇంజిన్లను డిఫాల్ట్ సెర్చి ఇంజిన్లుగా పెట్టుకునేలా హోమ్ స్క్రీన్ కూడా పర్సనలైజ్ చేసుకోవచ్చు. ‘ఇన్ఫర్మేటివ్ కార్డ్’ ఫీచరు ద్వారా వార్తలు, క్రికెట్ స్కోర్ మొదలైన వాటి గురించి తెలుసుకోవచ్చు. -
ఈపీఎఫ్ఓ : వాట్సాప్ హెల్ప్లైన్
సాక్షి, న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకోసం కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. పీఎఫ్ చందారుల సౌలభ్యం కోసం కొత్తగా వాట్సాప్ హెల్ప్లైన్ సేవను ప్రారంభించింది. దీని ద్వారా ఫిర్యాదులు, సందేహాల నివృత్తి చేసుకోవచ్చని ప్రకటించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 24x7 టోల్ ఫ్రీ నంబర్, పోర్టల్ , ఫేస్ బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు అదనంగా దీన్ని అందుబాటులో తీసుకొచ్చింది. దేశంలోని 138 ప్రాంతీయ కార్యాలయాలలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. సంబంధిత ప్రాంతీయ కార్యాలయ హెల్ప్లైన్ నంబర్ ద్వారా పీఎఫ్ అందించే సేవలకు సంబంధించిన సందేహాలు తీర్చుకోవడంతొపాటు, ఫిర్యాదులను దాఖలు చేయవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా సత్వర, సురక్షితమైన సేవలు లభిస్తాయని ప్రకటించింది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా 1,64,040 కు పైగా ఫిర్యాదులను, ప్రశ్నలను పరిష్కరించామని తెలిపింది. ఈ కొత్త సౌలభ్యం ద్వారా ఖాతాదారులు కార్యాలయాలను భౌతికంగా సందర్శించాల్సిన అవసరాన్ని బాగా తగ్గిస్తుందని పేర్కొంది. అలాగే వాట్సాప్లో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి, ప్రతి ప్రాంతీయ కార్యాలయంలో ప్రత్యేక నిపుణుల బృందం అందుబాటులో ఉంటుందని కార్మికశాఖ తెలిపింది. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా ప్రాంతీయ కార్యాలయాల వారీగా వాట్సాప్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. -
యూఏఈ కొత్త చరిత్ర
దుబాయ్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చరిత్ర సృష్టించింది. సొంతంగా రూపొందించిన అల్ అమాల్ అనే అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఒక అరబ్ దేశం మరో గ్రహం కక్ష్యలోకి అంతరిక్ష నౌకను పంపిస్తుండడం ఇదే తొలిసారి. ఇందుకు జపాన్లోని టానేగషిమా స్పేస్పోర్టు వేదికగా నిలిచింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1.58 గంటలకు హెచ్–2ఏ అనే రాకెట్ సాయంతో అల్ అమాల్ నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాంటి అపశ్రుతులు లేకుండా ప్రయోగం విజయవంతమైనట్లు సమాచారం అందగానే దుబాయ్లోని మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్లోని శాస్త్రవేత్తలు, యూఏఈ ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. అల్ అమాల్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల యూఏఈ నాయకత్వానికి, ప్రజలకు భారత్ అభినందనలు తెలియజేసింది. నౌక బరువు 1.3 టన్నులు. ఇది 49.5 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి అంగారక గ్రహం కక్ష్యలోకి చేరుకోనుంది. గ్రహం చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడమే అల్ అమాల్ లక్ష్యం. -
అన్నదాతలకు ఆన్లైన్ కన్సల్టేషన్
సాక్షి, హైదరాబాద్: రైతులకు అండగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రూపొందించిన టీకన్సల్ట్ యాప్ అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్లో టీకన్సల్ట్ ప్రారంభించామన్నారు. ఈ యాప్ ద్వారా పదివేల కన్సల్టేషన్లు చేయడాన్ని మంత్రి అభినందించారు. టీకన్సల్ట్ అగ్రికల్చర్ అప్లికేషన్ను వానాకాలంలో రైతాంగం ఉపయోగించుకోవాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఒక మండలంలో నిర్వహించిన అనంతరం విదేశాల్లోని నిపుణులతోనూ మన రైతులను అనుసంధానం చేసేందుకు కృషి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్వయంగా నిపుణులతో అనుసంధానం అయ్యారు. ఈ యాప్నకు సంబంధించి తొలి వినియోగదారుడిగా మారి తెలంగాణ వ్యవసాయ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్, రిటైర్డ్ ప్రొఫెసర్ జలపతిరావుతో టీకన్సల్ట్ ద్వారా సందేహాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు, అగ్రి సైంటిస్టులను అనుసంధానం చేయాలని సూచించారు. ఈ ఆన్లైన్ సేవలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల మాట్లా డుతూ టీటా ద్వారా ఇప్పటివరకు విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందించామని, దీనికి కొనసాగింపుగా వ్యవ సాయానికి సాంకేతికతను జోడిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, వ్యవసాయ శాఖ ఓఎస్డీ, టీటా సలహాదారు ఎల్.కె.సంగమేశ్వరరావు పాల్గొన్నారు. -
‘హెల్తీ వే రెస్టారెంట్’ను ప్రారంభించిన సమంత అక్కినేని
-
విజయవాడలో హీరో రామ్చరణ్ సందడి
-
ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో టెండర్లు
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో 104, 108, ఈఆర్సీ (ఆపరేషన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్స్)ల ఏర్పాటుకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో ఉంచినట్లు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.శివశంకరరావు తెలిపారు. గుంటూరులోని ఆర్అండ్బీ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ జ్యుడీషియల్ ప్రివ్యూ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జ్యుడీషియల్ ప్రివ్యూ ‘లోగో’ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా బాధ్యత గల పౌరులుగా ప్రజలు, కాంట్రాక్టర్లు, నిష్ణాతులు.. టెండర్లపై తమ అభ్యంతరాలు, సూచనలను ఈ నెల 31వ తేదీలోగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు ప్రభుత్వం కొనుగోలు చేయనున్న 200 రిగ్గుల యంత్రాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను పరిశీలించి, అందులోని లోపాలను సవరించాలని చెప్పామన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలకు తాగునీరు అందించేందుకు వీలుగా రూ.600 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారని, ఆ టెండరును పరిశీలించి లోపాలను సవరించాలని అధికారులకు సూచించామని తెలిపారు. తర్వాత వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేసి.. అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. గాలేరు నగరి – సుజల స్రవంతి పనులకు సంబంధించిన టెండర్ జ్యుడీషియల్ ప్రివ్యూకు వచ్చిందని, దానిని పరిశీలించాల్సి ఉందన్నారు. -
దిగి వచ్చిన జియో : కొత్త రీచార్జ్ ప్లాన్లు
సాక్షి, ముంబై : ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కొత్త మంత్లీ ప్లాన్లను లాంచ్ చేసింది. ఇటీవల నిమిషానికి 6 పైసల చార్జీల వడ్డనపై నిరసనలు వెల్లువెత్తడంతో జియో కొత్త ఎత్తుగడతో వచ్చినట్టు కనిపిస్తోంది. ఉచిత ఐయూసీ కాల్స్ ఆఫర్తో ‘జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ (మూడు రీచార్జ్ ప్లాన్ల)ను సోమవారం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల ద్వారా రోజుకు 2 జీబీడేటాను అందిస్తోంది. ప్రధానంగా ఈ ప్లాన్లలో విశేషం ఏమిటంటే జియోయేతర మొబైల్ నంబర్లకు 1,000 నిమిషాల ఉచిత టాక్టైమ్ను ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు ఎప్పటిలాగే జియో టు జియో అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం. ఈ కొత్త ప్లాన్స్ ఒక నెలకు రూ. 222, 2 నెలలకు రూ. 333, 3 నెలలకు రూ. 444 లు ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. తమ కొత్త ప్లాన్స్ ఇతర ప్రత్యర్థి కంపెనీల కంటే మార్కెట్లో కనీసం 20-50 వరకు వరకు చౌకగా ఉన్నాయని జియో ఒక ప్రకటనలో తెలిపింది. జియో కస్టమర్లు తమ ప్లాన్స్ను రూ. 111తో అప్గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొంది. 3 నెలల 2జీబీ ప్యాక్(రూ. 448) తో పోలిస్తే.. రూ. 444 మాత్రమే ఖర్చు అవుతుంది. రూ. 396 (198x2) ప్లాన్స్లో మునుపటి ఖర్చుతో పోలిస్తే ఇపుడు రూ. 333 మాత్రమే ఖర్చవుతుందని, అలాగే అదనంగా 1,000 నిమిషాల ఐయూసీ వాయిస్ కాల్స్ ఉచితమని జియో తెలిపింది. విడిగా దీన్ని కొనాలంటే 80 రూపాయలు వినియోగదారుడు వెచ్చించాల్సి వస్తుందని జియో వెల్లడించింది. కాగా ఇంటర్కనెక్ట్ యూజర్ ఛార్జీ పేరుతో నిమిషానికి రూ. 6 పైసల వసూలును ఇటీవల జియో ప్రకటించింది. అలాగే ఒక రోజు వాలిడిటీ ఉన్న రూ.19 ప్లాన్ను, 7రోజుల వాలిడిటీ రూ. 52ప్లాన్ను తొలగించింది. దీనిపై వినియోగదారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కాగా, అటు ప్రత్యర్థి కంపెనీ వొడాఫోన్ స్పందిస్తూ తాము ఎలాంటి ఐయూసీ చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
సామ్ సందడి
-
విశాఖలో సినీ నటి కాజల్ అగర్వాల్ సందడి
-
అల్లు శిరీష్ సందడి
-
కొస్ట్గార్డ్ అమ్ములపొదిలో అత్యాధునిక నౌక వీర
-
‘సి- స్పేస్’ ప్రారంభించిన అల్లు అర్జున్
-
తొలి దేశీ ఎలక్ట్రానిక్ చిప్!!
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ను నియంత్రించడంతో పాటు 5జీ కనెక్షన్స్కు ఉపయోగపడేలా దేశీయంగా తొలి ఎలక్ట్రానిక్ చిప్సెట్ పృథ్వీ 3ని బెంగళూరుకు చెందిన సాంఖ్య ల్యాబ్స్ రూపొందించింది. మొబైల్ ఫోన్స్లో నేరుగా టీవీ ప్రసారాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని డిజైనింగ్, అభివృద్ధి పూర్తిగా దేశీయంగానే జరిగినట్లు చిప్సెట్ను ఆవిష్కరించిన సందర్భంగా టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి, అధునాతన టీవీ వ్యవస్థ గల చిప్ అని ఆయన పేర్కొన్నారు. టెలికం ఆపరేటర్లు ఎదుర్కొంటున్న కాల్స్ నాణ్యతాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. వీడియో కంటెంట్ను మొబైల్ నెట్వర్క్ నుంచి వేరు చేయడం ద్వారా స్పెక్ట్రంపై ఎక్కువ భారం పడకుండా కాల్ నాణ్యతను పెంచేందుకు ఈ చిప్ తోడ్పడుతుందని సాంఖ్య ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పరాగ్ నాయక్ చెప్పారు. దీనితో.. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను శాటిలైట్ ఫోన్లా ఉపయోగించుకోవచ్చన్నారు. ఎలక్ట్రానిక్ డివైజ్లలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ చిప్సెట్స్ను ప్రస్తుతం విదేశీ కంపెనీలే తయారు చేస్తున్నాయి. దేశీయంగా అధునాతన సెమీకండక్టర్ తయారీ ప్లాంటు లేకపోవడంతో భారత్లో వీటిని ఉత్పత్తి చేయడం లేదు. సాంఖ్య ల్యాబ్స్ ఎలక్ట్రానిక్ చిప్సెట్స్.. దక్షిణ కొరియాలోని శామ్సంగ్ ప్లాంటులో తయారవుతున్నాయి. -
మహిళల ‘కష్టాలు’ తీర్చే బుల్లి సాధనం
న్యూఢిల్లీ: అపరిశుభ్రంగా ఉండే ప్రజా మరుగుదొడ్లు, వాష్రూమ్స్లో మహిళలు నిలబడే మూత్రవిసర్జన చేసేందుకు ఉపయోగపడే అత్యంత సురక్షితమైన చిన్న వస్తువును ఐఐటీ విద్యార్థులు తయారుచేశారు. వరల్డ్ టాయిలెట్æ డే ను పురస్కరించుకుని సోమవారం దాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చారు. వాష్రూమ్లోని టాయిలెట్ సీటుకు తగలకుండా నిలబడే మూత్రవిసర్జన చేసేలా శాన్ఫీ(శానిటేషన్ ఫర్ ఫిమేల్)ని డిజైన్ చేశారు. దీని ధర కేవలం రూ.10. ఎయిమ్స్లో దీని ప్రయోగపరీక్షలు గతంలోనే పూర్తయ్యాయి. స్టాండప్ ఫర్ యువర్సెల్ఫ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా లక్ష శాంపిళ్లను ఉచితంగా పంపిణీచేయనున్నారు. ‘పనిమీద బయటికొచ్చిన సందర్భాల్లో ఇకపై మహిళలు మూత్రాన్ని ఉగ్గబట్టుకోవాల్సిన పనిలేదు. గర్భిణిలు, వికలాంగులు ఇలా మహిళలందరికీ అనువుగా దీన్ని తయారుచేశాం. రైల్వేస్టేషన్లు, రైళ్లు, బస్స్టేషన్లలో పబ్లిక్ టాయిలెట్లలో వాడేందుకు వీలుగా డిజైన్ చేశాం. శాన్ఫీ పైభాగం నీటికి తడిచిపోదు. ఒకసారి మాత్రమే వాడి పడేసే ఇది పర్యావరణహితం. రుతుస్రావ సమయంలోనూ దీన్ని వాడుకోవచ్చు’ అని అర్చిత్ వివరించారు. -
ఎల్ఇడి టీవీలను లాంచ్ చేసిన పూజారా గ్రూప్
-
ఇండియా పోస్టల్ పేమేంట్స్ బ్యాంక్ ప్రారంభం
-
మైక్రోమ్యాక్స్ కొత్త స్మార్ట్ఫోన్ ‘యూ ఏస్’
న్యూఢిల్లీ: హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ సంస్థ తాజాగా తమ సబ్ బ్రాండ్ యూ కింద కొత్త స్మార్ట్ఫోన్ ‘యూ ఏస్‘ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 5,999. సెప్టెంబర్ 6 నుంచి ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్కార్ట్లో విక్రయాలు ప్రారంభమవుతాయని సంస్థ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ శుభదీప్ పాల్ తెలిపారు. 5.45 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 18:9 యాస్పెక్ట్ నిష్పత్తి, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ ఓరియో ఓఎస్ మొదలైనవి ఇందులో ప్రత్యేకతలు. ఫోన్ వెనుకవైపు 13 ఎంపీ, ముందువైపు 5 ఎంపీ కెమెరాలు ఉంటాయి. -
బిగ్సిలో గెలాక్సీ నోట్9ను లాంచ్ చేసిన పూజా హెడ్గే
-
సాంకేతిక పరిజ్ఞానంలో అదరగొడుతున్న చైనా
-
భారీ సబ్సిడీతో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
సాక్షి, బెంగళూరు: బెంగళూరు ఆధారిత స్టార్టఅప్ కంపెనీ ఏథర్ ఎనర్జీ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మంగళవారం లాంచ్ చేసింది. మేడిన్ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశంలో తయారైన స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్ ఫౌండర్ మద్దతుతో ఎథర్ కంపెనీ ఏథర్ 340, ఎథర్ 450 పేరిట ఈ రెండు స్కూటర్లు మార్కెట్లో ఆవిష్కరించింది. ఎథర్ వెబ్సైట్తోపాటు బెంగుళూరులోని ఎథర్ స్టోర్లో ప్రీ బుకింగ్స్ను ప్రారంభించారు. అమెరికాలోని తెస్లా తరువాత ఈ తరహాలో ఎలక్ట్రిక్ బైక్స్లను తయారుచేస్తున్న తొలి సంస్థగా ఏథర్ నిలవనుంది. ప్రభుత్వం నుంచి దాదాపు 20 శాతం సబ్సిడీతో కలిపి ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవాహనాలతో పోలిస్తే సగం ధరలకే ప్రారంభించింది. అయితే ఈ వాహనాలు తొలుత బెంగళూరులో మాత్రమే లభ్యమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఇతర నగరాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రెండు మోడల్స్లోను సిమ్కార్డుల ఇన్బిల్ట్గా ఉంటాయి. రెండు స్కూటర్లు పూర్తిగా విద్యుత్పై ఆధారపడి పనిచేస్తాయి. దీనికోసం ప్రత్యేకమైన బ్యాటరీలను ఏర్పాటు చేశారు. కేవలం 1 నిమిషం పాటు చార్జింగ్ పెడితే చాలు, 1 కిలోమీటర్ దూరం వెళ్లగలిగేంత వేగంగా చార్జింగ్ అవుతాయి. సిటీ రైడింగ్ కండిషన్స్కు అనుకూలంగా తయారు చేసిన ఎథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 3.9 సెకండ్లలోనే గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్ను ఈ స్కూటర్ సొంతం. అలాగే ఎథర్ 340 స్కూటర్ గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ స్కూటర్ 5.1 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్ను అందుకోగలదు. దీనితోపాటు ఏథర్ ఎనర్జీ బెంగళూరు నగర వ్యాప్తంగా ఇప్పటికే 30 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఏథర్గ్రిడ్ ఛార్జింగ్ స్టేషన్లు ఫాస్ట్-ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది. ఫీచర్లు 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. అందులో స్పీడ్, బ్యాటరీ కెపాసిటీ, తిరిగిన కిలోమీటర్లు, నావిగేషన్ వంటి సదుపాయాలు లభిస్తున్నాయి. ఇక ఈ స్కూటర్లలో ఉండే సాఫ్ట్వేర్కు ఎప్పటికప్పుడు ఓటీఏ (ఓవర్ ది ఎయిర్) రూపంలో అప్డేట్లను అందిస్తారు. ఈ స్కూటర్లను మొబైల్ యాప్ ద్వారా ఫోన్కు కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా స్కూటర్ ఎక్కడ ఉంది ఫోన్లో లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చన్నమాట. ఈ స్కూటర్లలో ఉన్న బ్యాటరీ లైఫ్ 5 నుంచి 6 సంవత్సరాలు. ఐపీ67 రేటింగ్ ఈ బ్యాటరీ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ను జోడించింది. ఈ బ్యాటరీలు 50వేల కిలోమీటర్ల వరకు పనిచేస్తాయి. ఈ స్కూటర్లలో ఉన్న బ్యాటరీ పూర్తి చార్జింగ్కు 4 గంటల 18 నిమిషాల సమయం పడుతుంది. ఈ స్కూటర్లకు 2 ఏళ్ల వారంటీ (30వేల కిలోమీటర్లు)ని అందిస్తున్నారు. అంతేకాదు బ్యాటరీకి 3 ఏళ్ల వారంటీని అందిస్తోంది. ధర, ఇతర ఆఫర్లు ఏథర్ 450 ఆన్రోడ్ ధర రూ.1,24,750 ఉండగా, ఏథర్ 340 ఆన్రోడ్ ధర రూ.1,09,750 గా ఉంది. ఇందులో ఎలక్ట్రిక్వాహనాలకు ప్రోత్సాహమిచ్చే ప్రభుత్వ పథకం "ఫేం" కింద 22 వేల రూపాయల సబ్సిడీ జీఎస్టీ, రోడ్ట్యాక్స్, స్మార్ట్ కార్డ్ ఫీజు, రిజిస్ట్రేషన్ కార్డు, ఇన్సూరెన్స్ అన్నీరేట్లను కలిపి ఈ ధర అని తెలిపింది. వీటి కొనుగోలుకు ఈఎంఐ ఆఫర్ కూడా లభ్యం.. అలాగే 700రూపాయల నెలవారీప్లాన్ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో సర్వీసు, డోర్స్టెప్ పికప్, డెలివరీ, బ్రేడ్ డౌన్ అసిస్టెన్స్, వాహనాలపై డేటా ఛార్జీలు, వినియోగం, ఇంధనం లాంటి ఇతర సేవలను ఆఫర్ చేస్తోంది. ఇంటి దగ్గర, ఆఫీసు, లేదా సాధారణ సాకెట్ నుండి వినియోగదారులు ఈ వాహనాన్ని ఛార్జ్ చేయవచ్చు. మూడు నెలల లోపల దీన్ని రీఫండ్ ఇస్తుంది. కాగా దేశంలోని నెంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, వాల్మార్ట్ భాగస్వామి ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు, హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ సహా, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పెట్టుబడిదారుల నుండి ఇప్పటివరకు 43 మిలియన్ డాలర్ల నిధులు సేకరించింది ఏథర్ ఎనర్జీ. -
ఆ కంపెనీలకు షాక్: కొత్త స్మార్ట్ టీవీలు వచ్చేశాయ్
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి థామ్సన్ టీవీలు వచ్చేశాయ్.. ముఖ్యంగా స్మార్ట్టీవీ సెగ్మెంట్లోకి చైనా కంపెనీ షావోమి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో థామ్సన్ సరికొత్త రీఎంట్రీ ప్రాధాన్యతను సంతరించుకుంది. స్మార్ట్ ఎఫ్హెచ్డీ టీవీలను భారత టీవీ మార్కెట్లో లాంచ్ చేసింది. గురువారం 40, 43, 32 అంగుళాల మూడు స్మార్ట్ టీవీలను ప్రారంభించింది. ఫ్లిప్కార్ట్లో శుక్రవారం విక్రయాలు మొదలు కానున్నాయని కంపెనీ వెల్లడించింది. 43 అంగుళాల 4కే యూహెచ్డీ థామ్సన్ టీవీ ధరను 27,999రూపాయలుగానూ, 40అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ 19,990 రూపాయల ధర ట్యాగ్ను, 32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ రూ. 13.490గా నిర్ణయించింది. 43 అంగుళాల 4కే యేహెచ్డీ టీవీ మోడల్ పేరు 43టీఎం4377 : 3840x2160 పిక్సల్స్ రిజల్యూషన్ హెచ్డీఆర్, విత్ ఎల్ జీఐపీఎస్ ప్యానెల్ , ఆండ్రాయిడ్ 4.4.4 కిట్ కాట్, 1.4GHz డ్యూయల్ కోర్ కార్టెక్స్- ఏ53 ప్రాసెసర్, అలాగే మాలి-టీ720 జీపియూ, 1 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, 10వాట్స్ రెండు స్పీకర్లు, వై ఫై కనెక్టివిటీ 40అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ 40టీఎం4099 మోడల్ , 1920x1080 పిక్సల్స్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్, కార్టిక్స్- ఏ53 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ , 10 వాట్స్ రెండు స్పీకర్లు, వై ఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లు 32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ 32ఎం3277 మోడల్: 1366x768 పిక్సల్స్ రిజల్యూషన్, 450 నిట్స్ , ఆండ్రాయిడ్ 5.1.1 కార్టిక్స్-ఏ53 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, 20వాట్స్ టోటల్ ఆడియో అవుట్పుట్, వైఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి. కాగా ఫ్రాన్స్కు చెందిన బిజినెస్ ఫ్రాన్స్, టెక్నికలర్ ఎస్ఏ ఫ్రాన్స్ ల ఉమ్మడి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండే థామ్సన్. యురోపియన్ మార్కెట్లో థామ్సన్ స్మార్ట్ టీవీలను విక్రయిస్తోంది. తాజా వ్యూహంతో తక్కువ ధరకే స్మార్ట్ టీవీలతో భారత మార్కెట్లో పాగా వేయనుంది. తద్వారా దేశంలో మైక్రోమ్యాక్స్, వూ, షావోమి లాంటి బడ్జెట్ ధరల్లో టీవీలను అందిస్తున్న కంపెనీలకు భారీ షాకే ఇవ్వనుంది. -
హోండా కొత్త యాక్టివా 5జీ.. మార్కెట్లోకి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్స్ అండ్ హోండా స్కూటర్స్ ఇండియా కొత్త స్కూటర్ను లాంచ్ చేసింది. యాక్టివా వారసత్వాన్ని కొనసాగిస్తూ, హోండా యాక్టివా ను సరికొత్తగా విడుదల చేసింది. ఆటో ఎక్స్పో-2018 లో ప్రారంభించిన యాక్టివా 5జీని కొత్తగా అప్గ్రేడ్ చేసి మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ప్రామాణిక మోడల్ ధర రూ. 52,460 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) గా నిర్ణయించింది. డీలక్స్ వెర్షన్ ధర రూ. 54,325(ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) గా ఉంది. స్కూటర్ల కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయనీ, డెలివరీలు వెంటనే ప్రారంభించాలని నిర్ణయించినట్టు హోండా ఒక ప్రకటనలో తెలిపింది. హోండా యాక్టివా 5జీ కొత్త అవతార్లో మార్పుల విషయానికి వస్తే.. కొత్త ఎల్ఈడా హెడ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ డేలైట్స్ను పొందుపర్చింది. డీలక్స్ వెర్షన్లో కొత్త డిజిటల్ అనలాగ్మీటర్, 3 డీ ఎంబ్లమ్ను జోడించింది. 110 సీసీ నాలుగు-స్ట్రోక్ ఇంజిన్, 8బీహెచ్పీ పవర్, 9ఎన్ఎం టార్క్, గంటకు గరిష్టంగా 83 కి.మీ వేగం. సీవీటీ గేర్బాక్స్, రియర్ మోనోషాక్, కాంబీ బ్రేక్ సిస్టం,10-అంగుళాల అల్లాయ్ వీల్స్ విత్ 90/100 ట్యూబ్ లెస్ టైర్లు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. డాజిల్ ఎల్లో, పర్ల్ స్పార్టన్ రెడ్ రంగుల్లో ఈ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. -
సుజుకి కొత్త గిక్సర్ బైక్స్ లాంచ్...
సాక్షి న్యూఢిల్లీ: సుజుకి మోటార్ కార్పొరేషన్కు చెందిన సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా గిక్సర్ సిరీస్లో కొత్త మోడల్ బైక్లను లాంచ్ చేసింది. 2018 ఫ్లాగ్షిప్ మోటార్ సైకిల్ 2018 మోడల్స్ను మంగళవారం విడుదల చేసింది. 2014లో లాంచ్ చేసిన గిక్సర్ బ్రాండ్కు చెందిన గిక్సర్ , గిక్సర్ ఎస్ఎఫ్ పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చింది. గిక్సర్ ధరను రూ. 80,928, గిక్సర్ ఎస్ఎఫ్ ధరను రూ .90,037గా నిర్ణయించింది. వీటిల్లోసుజుకి ఎకో పెర్ఫామెన్స్ టెక్సాలజీ (ఎస్ఈపి) అల్ట్రా లైట్ 155 సీసీ ఇంజీన్ అమర్చినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గిక్సర్ మోడల్స్ తమకు కీలకమైన ఉత్పత్తులని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రతినిధి సజీవ్ రాజశేఖరన్ చెప్పారు. వీటి పంపణీ ఇప్పటికే మొదలైందని దేశవ్యాప్తంగా తమ డీలర్షిప్లలో లభ్యమవుతాయని వెల్లడించారు. -
బ్యూటీ ప్రొడక్ట్ లాంచింగ్లో మెరిసిన కాజల్
-
అతి చవకధరలో స్మార్ట్వాచ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ కంప్యూటర్ ఉపకరణాల సంస్థ అంబ్రేన్ చవక ధరలో స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. ఏఎస్ డబ్ల్యు-11పేరుతో దీన్ని సోమవారం విడుదల చేసింది. దీని ధరను కేవలం రూ.1,999 కే ప్రారంభించింది. ఈ స్మార్ట్ వాచ్ ఫిట్నెస్ ట్రాకర్ గా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. తమ స్మార్ట్ వాచ్ ద్వారా వినియోగదారులు రోజువారీ ఫిట్నెస్ కార్యకలాపాలను ట్రాక్ చేయొచ్చనీ, అలాగే పెడోమీటర్ సహాయంతో నడకదూరాన్ని , స్లీప్ పాటర్నీ కూడా పరిశీలిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చాలా ఖరీదైన వాచ్లను ఇది రీప్లేస్ చేస్తుందనీ, అలాగే ఫిట్నెస్ ట్రాకర్ పాత్రను కూడా పోషిస్తుందని అంబ్రేన్ ఇండియా డైరెక్టర్ గౌరవ్ దూరెజా తెలిపారు. బ్లాక్ కలర్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్వాచ్ ఒక సంవత్సరం వారెంటీతో అన్ని ప్రముఖ రిటైల్, ఇ-టెయిల్ స్టోర్లలో లభిస్తుందని చెప్పారు. -
అద్భుత ఫీచర్లు, చవక ధర: ఐ వూమీ మొబైల్స్
సాక్షి, న్యూఢిల్లీ: చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ప్రముఖ మొబైల్ మేకర్ ఐ వూమీ సరసమైన ధరల్లో రెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. మి సిరీస్లో భాగంగా 'మి 3', 'మి 3 ఎస్' పేరుతో భారత మార్కెట్లో శుక్రవారం ప్రవేశపెట్టింది. వీటి ధరలను వరుసగా రూ .5,499, రూ.6,499 గా నిర్ణయించింది. రెండు డివైస్లు 5.2 అంగుళాల ఫుల్హెచ్డీ షట్టర్ డిస్ ప్లే, (పగలని) , 64-బిట్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.0, 3000ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్స్గా ఉన్నాయి. 'మి 3' లో 2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత మెమరీ (128జీబీ దాకా ఎక్స్పాండబుల్) 8 మెగా పిక్సెల్ ముందు, వెనుక కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ ఇతర ఫీచర్లు. ‘మి 3 ఎస్ ’ లో 3 జీబి ర్యామ్, 32 జీబి ఇంటర్నల్ మెమెరీ, (128 వరకు ఎక్స్పాండబుల్), 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ మిస్ 3 ఎస్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే ఇవి ఫ్లిప్కార్ట్లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు విక్రయానికి అందుబాటులోఉన్నాయి. దేశీయ మొబైల్ కస్టమర్ల జీవనశైలిని మరింత సులభతరం చేసేందుకు ఫ్లాగ్షిప్ ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ఆనందంగా వుందని ఐవూమీ ఇండియా సీఈఓ అశ్వన్ భండారి ఒక ప్రకటనలో తెలిపారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త యూనిట్
చెన్నై: ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ కంపెనీ ఐషర్ మోటార్స్ ఇండియాలో మరో యూనిట్ ప్రారంభించింది. ఐషర మోటార్స్ విభాగానికి చెందిన రాయల్ ఎన్ ఫీల్డ్ చెన్నై సమీపంలో వల్లం వడగల్లో కమర్షియల్ ప్రొడక్షన్ యూనిట్ను ప్రారంభించింది. ఈ కొత్త ఉత్పాదన కేంద్రం నుంచి వాణిజ్య ఉత్పత్తిని నేటి నుంచి ప్రారంభించింది. ఇక్కడినుంచి ఇండియా మార్కెట్తోపాటు అంతర్జాతీయ మార్కెట్లు కోసం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను తయారు చేయనున్నామని ఐషర్ మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి దశలో సంవత్సరానికి 300,000 బైక్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉన్నట్టు తెలిపింది. కాగా ఈ ప్లాంట్ తో రాయల్ ఎన్ ఫీల్డ్ కు ఇది మూడవ ఉత్పత్తి కేంద్రం. 2018 ఆర్థికసంవత్సరానికి గాను మొత్తం మూడు ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం 825,000 యూనిట్లుగా ఉంది. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సంస్థ ఓ మొబైల్ వాలెట్ను ప్రారంభించింది. డిజిటల్ ఇండియా సాధనలోభాగంగా డిజిటల్ చెల్లింపులు సంస్థ మొబిక్విక్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తద్వారా 100మిలియన్లకు పైగా ఉన్న తన చందాదారులకు వన్ ట్యాప్ బిల్లు పేమెంట్ను పద్ధతిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1.5 మిలియన్ల కేంద్రాల ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ముఖ్యంగా అర్ధ పట్టణ, గ్రామీణ భారతదేశానికి చెందిన కస్టమర్ల డిజిటల్ చెల్లింపుల నిమిత్తం తమ కొత్త డిజిటల్ వాలెట్ను ఆవిష్కరించినట్టు బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా వినియోగదారులు ఆన్లైన్ రీఛార్జ్, బిల్లు చెల్లింపులు, బస్సు, రైలు టికెట్ బుకింగ్తోపాటు షాపింగ్ కూడా చేసుకోవచ్చని చెప్పింది. అలాగే ఇది స్మార్ట్ఫోన్ , ఫీచర్ ఫోన్ రెండింటిలోనూ పని చేస్తుంది. టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఈ డిజిటల్ వాలెట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మనోజ్ సిన్హా మాట్లాడుతూ తరచూ నిర్లక్ష్యానికి గురి అవుతున్న గ్రామీణ ప్రాంతాలకు సులభ చెల్లింపుల విధానాన్ని బలోపేతం చేయనున్నామన్నారు. బీఎస్ఎన్ఎల్, మోబిక్విక్ తో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిజిటల్ ఇండియాని సాధించే దిశగా మరొక ముఖ్యమైన మైలురాయి అని బిఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రొ-బ్రాండెడ్ మోబిక్విక్ వాలెట్ ద్వారా మొబైల్ మరియు ఇతర ఆర్ధిక చెల్లింపులను చేసుకోవచ్చని చెప్పారు. ఈ కొత్త వాలెట్ ద్వారా భారతదేశంలో విశ్వసనీయమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం లభిస్తుందని మొబీ క్విక్ స్థాపకుడు, సీఈవో బిపిన్ ప్రీత్ సింగ్ చెప్పారు. -
జీఎస్టీ పన్ను రేట్లు తెలుసుకోవాలంటే..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) రేట్లపై వినియోగదారుల అవగాహనకోసం విస్తృతంగా ప్రయత్నిస్తున్న కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ పరిధిలో వివిధ పన్నులరేట్లపై సందేహాలను నివృత్తి చేసేందుకు మొబైల్ యాప్ను శనివారం ప్రారంభించింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఒక 'జీఎస్ఎం రేట్స్ ఫైండర్' పేరుతో ఆ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు. దీని ద్వారా గూడ్స్, సర్వీసు టాక్స్ వివిధ పన్ను రేట్లను తెలుసుకోవచ్చు. అన్నిఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా ఈ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐవోఎస్ లో త్వరలో విడుదల చేయనుంది. అంతేకాదు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆఫ్లైన్ మోడ్లోనూ ఈ యాప్ పనిచేయడం దీని ప్రత్యేకత. ‘జీఎస్టీ రేట్స్ ఫైండర్’ పేరుతో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) ఈ మొబైల్ యాప్ను తీసుకువచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా ఏయే వస్తువులపై ఏ పరిధిలో ఎంత పన్ను విధిస్తున్నారనే పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతొపాటు వివిధ రేట్లు తెలుసుకునేందుకు వినియోగదారులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ వెబ్సైట్ http://cbec-gst.gov.in కు కూడా లాగిన్ అవ్వవచ్చు. కొత్త పరోక్ష పన్ను పాలసీ ప్రకారం పన్ను చెల్లింపుదారుడు వర్తించే సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, యూటీజీఎస్టీ పన్ను రేటు, పరిహారం సెసేస్ కోసం శోధించవచ్చని మంత్రిత్వ శాఖ వివరించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చునని ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ ఆదియా తదితరులు ఈ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై సందేహాలు, అనుమానాలు తీర్చేందుకు హెల్ప్లైన్ నంబర్ను ప్రకటించింది. ఆస్క్ జీఎస్టీ పేరుతో ట్విట్టర్లో సందేహాలను తీరుస్తోంది. అలాగే దూరదర్శన్ ద్వారా ఆరు రోజుల పాటువివిధ అంశాలపై అవగాహన, ప్రశ్నోత్తరాలను నిర్వహిస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా 60 కేంద్రాలను ఏర్పాటు చేసింది. దేశంలోనే అతి పెద్ద సంస్కరణగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. GST Rate Finder app of CBEC is available on google play store. ioS version will be launched shortly. #GSTSimplified #GSTForCommonMan pic.twitter.com/WhJMo03rHA — Arjun Ram Meghwal (@arjunrammeghwal) July 8, 2017 -
శాంసంగ్ గెలాక్సీ జె 5ప్రొ 2017
న్యూఢిల్లీ: కొరియా మొబైల్మేకర్ శాంసంగ్ తన జె సిరీస్లో అప్గ్రేడెడ్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. గెలాక్సీ జె 5 ప్రొ 2017 వెర్షన్ను విడుదల చేసింది. 2016 మోడల్ను అప్గ్రేడ్ చేసింది. ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్సిస్టంతో పాటు ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్, కెమెరా , మెటల్ డిజైన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ తదితర ఫీచర్లను నవీనకరించిన ఈ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం థాయ్లాండ్లో లాంచ్ చేసింది. మన కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ.19వేలు. గెలాక్సీ జె 5ప్రొ 2017 5.2అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 720x1280 పిక్సెల్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 3 జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256జీబీ ఎక్స్పాండబుల్ 13 పిక్సెల్ రియర్ కెమెరా 13ఎంపీ సెల్ఫీకెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఇండియాలో ఎపుడు లాంచ్ చేస్తుందనేసమాచారం మాత్రం ఇంకా అందుబాటులోరాలేదు. కాగా జె5 ప్రొ 2016 మాత్రం భారత్ రూ.10990ధరలో అమెజాన్ద్వారా లభిస్తున్న సంగతి తెలిసిందే. -
డుకాటి సూపర్ బైక్స్ లాంచ్..ధరలు?
న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్బైర్ బైక్ మేకర్ డుకాటీ రెండు కొత్త వేరియంట్ సూపర్ బైక్లను లాంచ చేసింది. దేశవ్యాప్తంగా మాన్స్టర్ 797, మల్టిస్ట్రాడా 950 మోడళ్లను విడుదల చేసింది. వీటి ధరలను వరుసగా రూ. 7.77 లక్షలు, రూ. 12.6 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ప్రకటించింది. ఈ ఏడాది కంపెనీ పరిచయం చేయనున్న అయిదింటి మోడళ్లులో భాగంగా ఈ సూపర్ బైక్లను పరిచయం చేసింది. కాగా దేశంలో మొత్తం 19 మోడళ్లను ఇప్పటికే ప్రవేశపెట్టింది. వచ్చే నెలలో బైక్ల డెలివరీ ప్రారంభమవుతుంది. మాన్స్టార్ 797లో టేకర్ బ్రేకింగ్ వ్యవస్థ, ఏబీఎస్ , ట్రాక్షన్ నియంత్రణల , ఎయిర్ కూల్డ్ 803 సీసీ ఇంజీన్తో రూపొందించింది. ఎల్ఈడీ లైట్స్,ఎల్సీడీ స్ర్కీన్ సహా ఇతర ఫీచర్లను జోడించింది. మల్టిస్ట్రాడా 950లో 937 సీసీ ఇంజీన్ ను అమర్చింది. ఇది 113 హెచ్పీ గరిష్ట టార్క్ను అందిస్తుంది. వచ్చే నెలనుంచి వీటి డెలివరీ ని ప్రారంభించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో డుకాటీ ఉత్పత్తి శ్రేణి విస్తరణలో ఇది కీలకమైన చర్య అని, ఈ మోడల్స్ ప్రారంభంతో, కంపెనీ ఇప్పుడు ధరల పరంగా పోటీ పడుతుందని డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రవి అవలూర్ విలేకరులతో అన్నారు. ఈ రెండు మోడళ్ళతో, భారతీయ పెద్ద బైక్ మార్కెట్,సంబంధిత విభాగాలలో తమ మార్కెట్ వాటాను వేగంగా పెంచుకోనున్నామని చెప్పారు. డుకాటీ ఇప్పటికే ఢిల్లీ, ముంబై, కొచ్చిన్, అహ్మదాబాద్, పూణే, బెంగళూరులలో ఆరు డీలర్షిప్లను కలిగి ఉండగా ఈ సంవత్సరం కోల్కతా, చెన్నై , హైదరాబాద్లో మూడు డీలర్షిప్లను ప్రారంభించాలని యోచిస్తోంది. భారతదేశంలో స్థానిక తయారీ పథకాలపై అవలూర్ మాట్లాడుతూ "ప్రస్తుతం తాము ప్రధానంగా థాయ్లాండ్ నుంచి దిగుమతి చేస్తున్నామనీ, థాయ్లాండ్తో స్వేచ్చాయుత వాణిజ్య ఒప్పందాన్ని కలిగి ఉండటం ఉపయోగకరంగా ఉందన్నారు. ప్రస్తుతం భారతదేశంలో విక్రయాల నెట్ వర్క్ అభివృద్ధి పై దృష్టిపెట్టనట్టు చెప్పారు. -
భారీ క్యూఐపీకి తెరతీసిన ఎస్బీఐ
ముంబై: అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీకి క్యూఐపీ లాంచ్ చేసింది. ప్రైవేటు ప్లేస్మెంట్ ద్వారా రూ .287.58 కోట్ల షేర్లను విక్రయించనున్నట్టు సోమవారం ప్రకటించింది . ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ల నుంచి 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించే ప్రణాళికలో భాగంగా దీన్ని ప్రారంభించినట్టు మార్కెట్ ఫైలింగ్ లో తెలిపింది. సంస్థాగత కొనుగోలుదారులకు రూ .1 ముఖ విలువ గల షేర్ల 'క్వాలిఫైడ్ సంస్థాగత ప్లేస్మెంట్' ప్రారంభించినట్టు ఎస్బీఐ చెప్పింది. సెబీ ధరల సూత్రం ఆధారంగా ఈ సమస్యపై ఫ్లోర్ ధర, బ్యాంకు యొక్క ఈక్విటీ వాటాకి 287.58 రూపాయలు ( 5 జూన్, 2017)గా నిర్ణయించింది. . అలాగే ఫ్లోర్ ధరకి 5 శాతానికి తగ్గకుండా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్యూఐపి ద్వారా ద్వారా రూ .11వేల కోట్లు నిధులు సేకరించాలని ఎస్బీఐ యోచిస్తోంది. కాగా గత మార్చి ఎస్బీఐ సెంట్రల్ బోర్డు 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.15వేలకోట్ల ఈక్విటీ క్యాపిటల్ని పెంచుకోవడానికి అనుమతినిచ్చింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ , రైట్స్ ఇష్యూ, అమెరికన్ డిపాజిటరీ రిసీప్, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్, ఉద్యోగి స్టాక్ ఆప్షన్స్ ద్వారా బ్యాంకు నిధులను సేకరించటానికి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలతో ఎస్బీఐ బ్యాంకు స్టాక్ బిఎస్ఇలో 0.02 శాతం నష్టపోయి 287.35 వద్ద ముగిసింది. -
ఫోక్స్వాగన్ కొత్త ఎస్యూవీ లాంచ్
జర్మనీ కార్ మేకర్ ఫోక్స్వాగన్ ఇండియా తనకొత్త ఎస్యూవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారతదేశంలో తయారు చేసిన మొట్టమొదటి వాహనాన్ని బుధవారం లాంచ్ చేసింది. టిగ్వాన్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కారును రెండు వేరియంట్లలోలాంచ్ చేసింది. కంఫర్ట్ లైన్ రూ .27.68 లక్షలు (ఎక్స్ షోరూమ్ ముంబై)లుగాను, హై లైన్ రూ .31.04 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై)లుగా నిర్ణయించింది. 4 మోషన్ టెక్రాలజీ లాంటి డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్తో పాటు మాడ్యులర్ ట్నాన్స్వెర్జ్ ఎంక్యూబీ ప్లాట్ఫాంలో 2791, 4704ఎంఎం 2.0లీటర్ల డీజిల్ ఇంజీన్, 7 స్పీడ్ డీఎస్ జీ గేర్ బాక్స్ 147 బీహెచ్పవర్ 340 ఎన్ఎం టాప్ టార్క్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రో యాంటి స్లీప్ రెగ్యులేషన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ ఇంజన్, డ్రాగ్ టార్క్ కంట్రోల్ సిస్టమ్ అమర్చింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ స్కొడా ప్లాంట్లో దీన్ని రూపొందించిది. ఢిల్లీ ఆటో ఎక్స్ పో 2016 లో ఫోక్స్ వ్యాగన్ మొట్టమొదటిసారి టిగువాన్ ప్రదర్శించింది. ఆడి 3కి పోలిన ఈ కొత్త కారు టయోటా ఫార్చ్యునర్, ఫోర్డ్ ఎండీవర్ లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మరొక అంతర్గత ప్రత్యర్థి స్కోడా రాబోయే మోడల్ కోడియాక్ కు గట్టి పోటీగానిలవనుందని అంచనా. దేశీయంగా తమకు ఎస్యూవీ సెగ్మెంట్లో భారీ డిమాండ్ను టిగువాన్ తీరుస్తుందని సంస్థ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ మైఖేల్ మేయర్ గతంలో చెప్పారు. ఇటీవల దీనికి సంబంధించిన టీజర్ ను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
ఒప్పో ఎఫ్3 ఫోన్ లాంఛ్ చేసిన అదాశర్మ
-
విజయమ్మ చేతుల మీదుగా ఏసు ప్రేమ సీడీ ఆవిష్కరణ
-
పోస్ట్ పెయిడ్ యూజర్స్కి ఐడియా సూపర్ ఆఫర్
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సంస్థ ఐడియా సెల్యులర్ శుక్రవారం కొత్త ఆఫర్ ప్రకటించింది. పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్లను పరిచయం చేసింది. దీని ప్రకారం 4జీ మొబైల్ వినియోగదారులకు రోజుకి 1జీబీ 4జీ డాటాను అందించనుంది. లిమిటెడ్ రెంటెడ్ ప్లాన్స్లో ప్రీ పెయిడ్ వినియోగదారులందరికీ ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నట్టు చెప్పింది. కొత్త ఐడియా ప్యాక్స్ రూ.199 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త పథకం ప్రకారం రూ.499 ఆ పైన ప్లాన్లో రూ.300 విలువైన డేటా సేవలు ఉచితమని కంపెనీ చెబుతోంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం రూ.349- రూ.498లమధ్య రెంటల్ ప్లాన్ లో రూ.50 డిస్కౌంట్. అలాగే రూ.149-రూ.349 రెంటల్ ప్లాన్పై సబ్స్క్రైబ్ అయిన ఖాతాదారులకు రూ.100 డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిపింది. రూ. 300 యాడ్ ఆన్ ప్యాక్తో రోజుకు 1 జీబీ చొప్పున నెల రోజుల పాటు 4జీ డేటాను అందించనున్నట్లు తెలిపింది. రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ రెంటల్ ఉన్న పోస్ట్పెయిడ్ కస్టమర్లు రూ. 50 అదనంగా చెల్లించి మూడు నెలలపాటు ఈ ఆఫర్ను పొందొచ్చని ఐడియా స్పష్టం చేసింది. అలాగే మూడు నెలల తరువాత మార్చి 2018 వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్ పొందాలంటే రూ.199-రూ.349మధ్యప్లాన్లో అదనంగా రూ. 200, రూ.349- రూ.498 మధ్య ప్లాన్లో అదనంగా రూ.50 చెల్లిస్తే సరిపోతుందని ఐడియా తెలిపింది. ఏప్రిల్ 30, 2017 వరకు దీని సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ 4జీ హ్యాండ్సెట్లకు మాత్రమే. పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఈ తరహా భారీప్రయోజనాల ఆఫర్ అందుబాటులోకి తీసుకు రావడం ఇదే ప్రథమమని ఐడియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్తెలిపారు. -
లలితా బ్రాండ్ రైస్ ప్రారంబించిన సుహాసిని
-
ఇండిగో తగ్గింపు ధరలు ఇవిగో..
ముంబై: రాయితీ టిక్కెట్ల వార్ లోకి దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా ఎంట్రీ ఇచ్చింది. దేశీయ మార్గాల్లో తగ్గింపు ధరలను బుధవారం ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో అన్నీ కలుపుకుని రూ.777రూపాయలకే టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ లో బుకింక్స్ ఫిబ్రవరి 25 వరకు అందుబాటులోఉండనున్నట్టుతెలపింది. అలాగే ఈ టికెట్ల ద్వారా ఏప్రిల్ 27 వరకూ ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. సెలెక్టెడ్ సెక్టార్లో, సెలెక్టెడ్ విమానాలకుమాత్రం ఈ ఆఫర్ పరిమితమని పేర్కొంది. ఈ తగ్గింపు టికెట్ల ధరలు అగర్తలా-గౌహతి, శ్రీనగర-చండీఘఢ్ మధ్య రూ.777 అందుబాటులో ఉండగా, చెన్నై-హైదరాబాద్ మధ్య రూ. 999గా ఉండనున్నాయి. ప్రయాణానికి 19రోజుల ముందుబుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.అలాగే పరిమితమైన సీట్లు అందుబాటులో ఉన్నాయనీ, ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే చట్టబద్ధమైన పన్నులు మాత్రమే తిరిగి చెల్లించనున్నామని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు ఇండిగోఎయిర్లైన్స్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించగలరు. -
రెనాల్ట్ క్విడ్ కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంత?
న్యూఢిల్ల్లీ: ఫ్రెంచ్ బ్రాండ్ ఆటో మేకర్ రెనాల్ట్ ఇండియా సరికొత్త వెర్షన్లో తన హ్యాచ్ బ్యాక్ కారు 'క్విడ్' కొత్త వేరియంట్ ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరను రూ 3.54 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. క్విడ్ ఆర్ఎక్స్ఎల్ 1.0 లీటర్ ఎస్సీఈ (స్మార్ట్ కంట్రోల్ ఎఫీషియన్సీ) పేరుతో దీన్ని గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్ మాన్యువల్, ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెర్షన్ లో అందుబాటులో ఉండనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెర్షన్ క్విడ్ ధర రూ. 3.84లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా ఉండనుంది. ఫీచర్లు, ట్రాన్స్మిషన్ ఆధారంగా దీని గరిష్ట ధర రూ. 4.32 లక్షలుగా ఉండనుందని కంపెనీ పేర్కొంది. ఇండియాలో తమ మార్కెట్ను మరింత విస్తరించుకోడానికి ఫ్రెంచ్ ఆటో దిగ్గజం ఈ కొత్త వేరియంట్ ద్వారా తమ మార్కెట్ను స్థిరీకరించాలని భావిస్తున్నట్టు రెనాల్ట్ ఇండియా సిఇఓ, ఎండి సుమిత్ సాహ్నీ తెలిపారు. ముఖ్యంగా టైర్ II-IV లో మార్కెట్లలో వినియోగదారులకు మరింత అందుబాటులోకి యోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. 1.0 లీటర్ ఎస్సీఈ ఇంజన్ సామర్థ్యం డోర్స్పై న్యూ స్పీడ్ స్పోర్ట్స్ గ్రాఫిక్స్ టు-టోన్ ఓఆర్వీఎంఎస్ 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ క్విడ్ ఏఎంటీ వెర్షన్ లో 1.0 లీటర్ ఇంజన్ సహా దాదాపు ఇవే ఫీచర్స్ ఉన్నాయి. -
అప్పో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్
బెంగళూరు: ప్రముఖ మొబైల్ మేకర్ అప్పో తనకొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. అతి పెద్ద బ్యాటరీతో ఎ 57 పేరుతో మంగళవారం లాంచ్ చేసిన ఈ ఫ్లాగ్ షిప్ మొబైల్ ధరను కంపెనీ రూ. 14,990గా నిర్ణయించింది. అతి తక్కువ లైటింగ్ కండిషన్స్ లో అద్భ తమైన ఫోటోలకు తీసి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫ్రింగర్ ప్రింట్ రీడర్ దీని ప్రత్యేకతలుగా చైనీస్ స్మార్ట్ఫోన్ ఫోన్ అప్పో చెబుతోంది. ఫిబ్రవరి 3 నుంచి ఇది వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అప్పో స్టోర్లు, ఆన్ లైన్ స్టోర్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ ద్వారా విక్రయించనున్నారు. ప్రీమియం ఫోటోగ్రఫీ, ఫ్రింగర్ ప్రింట్ రీడర్ వంటి ఆధునిక ఫీచర్లతోదీన్ని అందుబాటులోకి తెచ్చినట్టు అప్పో వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ స్కై లీ చెప్పారు. ఫింగర్ తడిగా వున్న కూడా అత్యాధునిక హైడ్రోఫోబిక్ జిర్కోనియం సహాయంతో సెన్సర్ పనిచేస్తుందని చెప్పారు. ఫీచర్లు 5.2 అంగుళాల సోనీ ఐఎంఎక్స్ 258 సెన్సార్ 0.1 సెకండ్లో అల్ట్రా-హెచ్ డి ఆటో ఫోకస్, గొరిల్లా గ్లాస్ ఆండ్రాయిడ్ 6.0 , ఆక్టాకోర్ ప్రాసెసర్ మరియు 3జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 13ఎంపీ వెనుక కెమెరా 2900 ఎంఏహెచ్ బ్యాటరీ -
సన్నీలో కొత్త వెర్షన్
న్యూఢిల్లీ : జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ తన మిడ్ సెజ్ సెడాన్ సన్నీలో కొత్త వెర్షన్ కారును ఆవిష్కరించింది. రూ.7.91 లక్షల(ఎక్స్-షోరూం ఢిల్లీ ) ప్రారంభ ధరతో ఈ కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. '' నిస్సాన్ ఇండియా వినియోగదారుల అభిప్రాయాలను నిరంతరం తీసుకుంటూ ఉంటుంది. కొత్త సన్నీ 2017లో విశాలమైన ఇంటీరియర్ ఉంటుంది. ఈ కారు మంచి ఇంధన సామర్థ్యం కలిగి ఉంది'' అని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా చెప్పారు. పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో ఈ కారును నిస్సాన్ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. పెట్రోల్ వెర్షన్ 1,498సీసీ ఇంజిన్, డీజిల్ వేరియంట్ 1,461 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉంది. పెట్రోల్ ఆప్షన్ ధర రూ.7.91 లక్షల నుంచి రూ.10.89 లక్షల మధ్య ఉండగా.. డీజిల్ వేరియంట్ ధరలు రూ.8.8 లక్షల నుంచి రూ.10.76 లక్షల మధ్య ఉంది. యాంటీ లాక్ బ్రేకింగ్(ఏబీఎస్), ఎలక్ట్రిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(ఈబీడీ), బ్రేక్ అసిస్ట్(బీఏ), డ్యూయల్ ఫ్రంట్, సైడ్ ఎయిర్బ్యాగ్స్ దీనిలోని సేఫ్టీ ఫీచర్లు. నిస్సాన్ లైన్-అప్లో సన్నీకి మంచి డిమాండ్ ఉంది. ఈ కారు గ్లోబల్గా 16 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయింది. -
శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: సౌత్ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ జె సిరీస్ ను విస్తరిస్తూ తాజాగా గెలాక్సీ జె2ఏస్, గెలాక్సీ జె1 4జీ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. రూ. 10 వేల లోపు ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జె2 ఏస్ ధర ను రూ.8,490, గెలాక్సీ జె1 4జీ ధరను రూ. 6,890 కంపెనీ నిర్ణయించింది. అలాగే ఈ రెండు మోడల్స్ లో బ్రౌజింగ్ అనుభవంకోసం ఎస్ సెక్యూర్' 'ఎస్ పవర్ ప్లానింగ్' , అల్ట్రా డేటా సేవింగ్ మోడ్ ఫీచర్స్ అందించడం ప్రత్యేకత. సరసమైన ధరలకు 4జీ మొబైళ్లను వినియోగదారులకు అందించడం తమ లక్ష్యమని శాంసంగ్ ఇండియా(మొబైల్ బిజినెస్) ఉపాధ్యక్షుడు మను శర్మ పేర్కొన్నారు. జె2 ఏస్ 5 ఇంచెస్ స్క్రీన్ టర్బో స్పీడ్ టెక్నాలజీ 1.4గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1.5జీబీ ర్యామ్ 8 మెగా పిక్సల్ రియర్ కెమెరా 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా గెలాక్సీ జె1 4జీ 4.5 ఇంచెస్ స్క్రీన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ 1జీబీ ర్యామ్ 5 మెగా పిక్సల్ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా -
ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ కొత్త అధ్యాయం
న్యూఢిల్లీ: భారతి ఎయిర్ టెల్ తన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు జాతీయంగా గురువారం లాంచ్ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెల్లింపుల బ్యాంక్ ను అధికారికంగా ప్రారంభించారు. రూ .3,000 కోట్ల ప్రారంభ పెట్టుబడి తో పొదుపు ఖాతాలపై 7.25 శాతం వడ్డీ రేటుతో ఎయిర్టెల్ పే మెంట్ బ్యాంక్ దేశవ్యాప్తంగా కార్యకలాపాలను ప్రారంభించింది. దీని ద్వారా దాదాపు 29 నగరాల్లో తన బ్యాంకింగ్ సేవలను అందించనుంది. తమ ఎయిర్ టెల్ చెల్లింపులు బ్యాంక్ తో, ప్రయాణం లో మరొక ముఖ్యమైన అధ్యాయం ప్రారంభించామని భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ చెప్పారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు లక్ష్యంతో 260 మిలియన్ల వినియోగదారుల బేస్ ఉన్న ఎయిర్ టెల్ లోని ఖాతాదారుల మొబైల్ నెంబరే పే మెంట్ బ్యాంక్ సేవింగ్ ఎకౌంట్ ఖాతాగా పరిగణిస్తామన్నారు. డిజిటల్ చెల్లింపుల ఎకో సిస్టంకు తమసంస్థ కట్టుబడి ఉందని తెలిపారు. కాగా గత ఏడాది నవంబరు పైలట్ ప్రాజెక్టుగా రాజస్థాన్ లో లాంచ్ అయింది. అనంతరం డిసెంబర్ ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల్లో సేవలను ప్రారంభించింది. అయితే రిజర్వ్ బ్యాంక్ లైసెన్సు లు మంజూరు చేసిన 11 పే మెంట్ బ్యాంకుల్లో 4-5 టెలికాం కంపెనీలవే కావడం విశేషం. -
ఆసుస్ కొత్త ట్యాంగో 3డీ స్మార్ట్ ఫోన్
లాస్ వెగాస్ :. తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ఆసుస్ కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ 3డీ ట్యాంగో టెక్నాలజీ ఆధారిత జెన్ ఫోన్ ఏఆర్ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను బుధవారం విడుదల చేసింది. వినియోగదారులకు అగ్ మెంటెడ్ ,వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని అందించనుంది. ఇండోర్ మ్యాపింగ్, అగ్ మెంటెడ్ రియాలిటీ టాంగో కంప్యూటింగ్ ప్లాట్ ఫాం లో ఇది రెండవ మొబైల్. ట్యాంగో టెక్నాలజీ ఆధారిత మొదటి డివైస్ ను గత ఏడాది చైనా సంస్థ లెనోవో ఫ్యాబ్ 2 లాంచ్ చేసింది. మన చుట్టూ ఉన్న పరిసరాలను 3డీ స్కానింగ్ చేయగలగడం ఈ ఫోన్ ప్రత్యేకత. అయితే ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు జెన్ ఫోన్ ఏఆర్ ఫీచర్స్: ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 5.7- అంగుళాల సూపర్ అమోల్డ్ స్క్రీన్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 821 ప్రాసెసర్, 8జీబీర్యామ్ 23 ఎంపీ కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ లాస్ వెగాస్ లో నిర్వహించిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో సీఈఎస్-2017లో దీన్ని ఆవిష్కరించింది. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో దీన్ని అందుబాటులోకి తేనున్నట్టు అసుస్ ఛైర్మన్ జానీ షిస్ తెలిపారు. టాంగో, గూగుల్ డే డ్రీమ్ ఆధారిత మొబైల్ ను లాంచ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. స్మార్ట్ ఫోన్ రంగంలో ఇది మరో సంచలనమని మార్కెటింగ్ చీఫ్ ఎరిక్ హెర్మాన్ సన్ చెప్పారు. మరోవైపు డజన్ల కొద్దీ ట్యాంగో ఆధారిత యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు గూగుల్ ప్రాజెక్ట్ ట్యాంగో లీడర్ జానీ లీ వెల్లడించారు. -
బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ ఆఫర్ అదుర్స్!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ ఎల్ మరో సరికొత్త ఆఫర్ తో నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. శనివారం వెల్లడించిన ఈ మంత్లీ ప్లాన్ తో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో ఎఫెక్ట్ తో దాదాపు అన్ని టెలికం కంపెనీలో ఫ్రీ కాలింగ్ వార్ లోకి ఎంటర్ కావడంతో ఈ కోవలోకి బీఎస్ఎన్ఎల్ కూడా చేరిపోయింది. అన్ లిమిడెట్ కాలింగ్ అంటూ ఓ సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు రూ.144 లకే అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ శ్రీ వాస్తవ తెలిపారు. రూ.144 ల మంత్లీ ప్లాన్ లో (లోకల్ అండ్ ఎస్టీడీ) ఏ నెట్ వర్క్ కైనా ఉచిత కాలింగ్ సౌకర్యంతోపాటు 300 ఎంబీ డాటాను ఫ్రీగా అందిస్తోంది. ఈ ప్లాన్ ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. మరోవైపు దేశ్యాప్తంగా 4400 వైఫై హాట్ స్పాట్లను లాంచ్ చేసింది చెన్నైలోని మహాబలిపురం కూడా త్వరలో లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. హాట్ స్పాట్ ల విస్తరణే తమ తదుపరి లక్ష్యమన్నారు. మరుసటి సంవత్సరం నాటికి సుమారు 40 వేల హాట్ స్పాట్ లను నెలకొల్పనున్నట్టు అనపమ్ శ్రీవాప్తవ్ చెప్పారు. -
ఏపీలో రెండు కొత్త రైళ్లు ప్రారంభం
-
బయటికొచ్చిన సొమ్మంతా పేదలకే:మోదీ
-
బయటికొచ్చిన సొమ్మంతా పేదలకే: మోదీ
పెద్ద నోట్లను రద్దు చేసిన అంనంతరం బయటికొచ్చిన నగదంతా పేదల కోసమేనని ప్రధాని మోదీ అన్నారు. అత్యంత కీలకమైన పాత నోట్ల డిపాజిట్ వ్యవహారం నేటితో ముగియడంతో దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఢిల్లీలో జరిగిన ఢిజీధన్ మేళాలో ఆయన పాల్గొన్నారు. డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసేందుకు భీమ్ పేరుతో ఓ కొత్త యాప్ను మోదీ ఆవిష్కరించారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు లక్కీ డ్రా పథకాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 50 రూపాయల నుంచి డిజిటల్ లావాదేవీలు జరిపిన వారికి ఈ బహుమతులు అందజేయనున్నామని, అంబేద్కర్ జయంతి రోజును మొదటి డ్రా ప్రారంభమవుతుందని వెల్లడించారు. వందరోజుల పాటు లక్కీ డ్రాలో 15వేల మందికి, రూ.10వేలను బహుకరించనున్నారు. దేశంలోనే భీమ్ యాప్కు ప్రత్యేకత కలిగి ఉంటుందని పేర్కొన్నారు. -
రూ.23 రీచార్జ్ తో అన్లిమిటెడ్ ఆఫర్
ముంబై: టెలికాం రంగంలో కొనసాగుతున్న ప్రైస్ వార్ లోకి తాజాగా మరో టెలికాం ఆపరేటర్ ఎయిర్ సెల్ దూసుకువచ్చింది. వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ పధకాలను బుధవారం లాంచ్ చేసింది. ఏ నెట్వర్క్ కైనా ఉచిత అపరిమిత కాల్స్ అందించే సరికొత్త ఆఫర్ ను అందిస్తోంది. రూ. 23లతో మొదలయ్యే రీచార్జ్ లపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. రూ23, రీఛార్జ్ పై వినియోగదారులు ఒక రోజు ఒక చెల్లుబాటుతో ఏ నెట్ వర్కుకైనా అపరిమిత స్థానిక , ఎస్టీడీ కాలింగ్ అవకాశాన్ని అందిస్తున్నట్టు ఎయిర్సెల్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ . 348 రీఛార్జ్ (స్థానిక మరియు ఎస్టీడీ) అంతటా ఉచిత కాల్స్ అపరిమిత కాలింగ్ సౌకర్యంతో పాటూ 500 ఎంబీ 3జీ డేటా , 4జీ వినియోగదారులకు 1.5జీబీ 3జీ డేటా ఉచితంగా అందిస్తోంది.వాలిడిటీ 28 రోజులు. వినియోగదారులను సంతోషపెట్టేందుకు ఉచిత కాలింగ్, డాటా సదుపాయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని ఎయిర్సెల్ లిమిటెడ్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, అనుపమ్ వాసుదేవ్ తెలిపారు. వినియోగదారులకు ఆహ్లాదం, కాల్ మరియు డేటా ప్రయోజనాలు అందించేందుకు , అందుబాటుధరల్లో ఆన్ లైన్ సదుపాయాన్ని కల్పించేందుకు ఈ రెండు పథకాలను లాంచ్ చేసినట్టు పేర్కొన్నారు. -
జాగ్వార్ కొత్త రేంజ్ రోవర్ లాంచ్
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల దిగ్గజం టాటా మోటార్స్ సొంతమైన లగ్జూరియస్ కార్ల తయారీ సంస్థ జాగ్వర్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) మరో సరికొత్త రేంజ్ రోవర్ కారును లాంచ్ చేసింది. 2107 మోడల్ రేంజ్ రోవర్ ఎవోక్ పేరుతో దీన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.49.10 లక్షలు నుంచి రూ.67.9లక్షల (దిల్లీ ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని సంస్థ తెలిపింది. 'విడుదలైన నాటి నుంచే రేంజ్ రోవర్ ఎవోక్కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా సరికొత్త హంగులతో 2017 మోడల్ను మార్కెట్ లోకి తీసుకు రావడం సంతోషంతగా ఉందని జేఎల్ఆర్ ఇండియా అధ్యక్షుడు రోహిత్ సూరి ఓ ప్రకటనలో తెలిపారు. 017 రేంజ్ రోవర్ ఎవోక్ ఇంజినీయమ్ 2 లీటర్ల డీజిల్ ఇంజిన్ తో , ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. భారతదేశంలో మొట్టమొదటిగా లాంచ్ కానున్న ల్యాండ్ రోవర్ పోర్ట్ఫోలియోలో డిస్కవరీ స్పోర్ట్ రూ 47,59 లక్షల ప్రారంభ ధరగా , రేంజ్ రోవర్ స్పోర్ట్ రూ రూ 1.18 కోట్లు, ఫ్లాగ్షిప్ రేంజ్ రోవర్ రూ.2.13 కోట్లలో విక్రయించనున్నట్టు టాటా మెటార్స్ తెలిపింది. -
హైదరాబాద్లో యుటిసి ఆర్అండ్ డి సెంటర్
-
ఏపీ పర్స్ వ్యాలెట్ను ప్రారంభించిన చంద్రబాబు
-
ఫేస్బుక్ ఇన్స్టెంట్ గేమ్స్ లాంచ్
న్యూయార్క్: మొబైల్ గేమ్ ప్రేమికులకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ గుడ్ న్యూస్ అందించింది. తన మెసెంజర్ యాప్ లో మరో కొత్త ఫీచర్ ను జోడించింది. మెసెంజర్ వినియోగదారుల కోసం ఇన్స్టెంట్ గేమ్స్ ను బుధవారం లాంచ్ చేసింది. టెక్ క్రంచ్ అందించిన సమాచారం ఈ గేమింగ్ సదుపాయం 30 దేశాల్లో పరిచయం చేసింది. . బందాయ్ నామ్కో,కోనామీ, టయోటో్ లాంటి క్లాసిక్ డెవలపర్లు సహాయంతో 17 గేమ్స్ ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ గేమింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. మెసెంజర్ యాప్ లోని గేమ్ కంట్రోలర్ అనే బటన్ ప్రెస్ చేయాలి. స్క్రీన్ మీద టాప్ చేసిన తక్షణమే హెటీఎంల్ 5 లో ఈ గేమ్స్ ఓపెన్ అవుతాయి. -
వినియోగదారులకు ఆర్కామ్ బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ : ఓ వైపు అన్న ముఖేష్ అంబానీ టెలికాం రంగంలో దూసుకెళ్తుండగా.. తమ్ముడు సైతం అన్నకు బలమైన పోటీని ఇస్తున్నారు. వినియోగదారుల కోసం కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) రూ. 149కే అపరిమిత కాలింగ్ ప్లాన్ను మంగళవారం లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా ఏ టెలికాం నెట్వర్క్కైనా, ఏ మొబైల్ నుంచైనా అపరిమిత కాలింగ్ టాక్ టైమ్ సద్వినియోగం చేసుకునేలా ఈ ప్లాన్ దోహదం చేయనుంది. ఎక్కువ దూరం చేసే కాల్స్కు కూడా ఈ ఫ్లాన్ ఉపయోగపడనుంది. దీనికోసం వినియోగదారులు నెలకు రూ.149 చెల్లిస్తే చాలని కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 2జీ, 3జీ, 4జీ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్లో అన్ని నెట్వర్క్లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. 2జీ, 3జీ, 4జీ హ్యాండ్సెట్ ఓనర్లను టార్గెట్గా చేసుకుని ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ ద్వారా, వారిని ఆర్కామ్ నెట్వర్క్లోకి మరల్చడానికి ఈ ప్లాన్ దోహదం చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్పై 300 ఎంబీ డేటా వాడకాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికీ భారత్లో వందల లక్షల మంది 2జీ హ్యాండ్సెట్ ఓనర్లు ఉన్నారని ఆర్కామ్ చెప్పింది. యూజర్లను యూనిట్ రేట్ చార్జింగ్ విధానం నుంచి సింగిల్ రీచార్జ్తో, అపరిమిత వాడక పద్ధతిలోకి టెలికాం మార్కెట్ను తీసుకురావడానికి తమ కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ సహకరించనుందని ఆర్కామ్ కన్సూమర్ బిజినెస్ సీఈవో, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కో-సీఈవో గుర్దీప్ సింగ్ చెప్పారు. లక్షల కొలదీ భారతీయులు తమ అన్లిమిటెడ్ ప్లాన్తో లబ్దిపొందనున్నట్టు ఆశాభావం వ్యక్తంచేశారు. -
ఆ కస్టమర్లకు ఐసీఐసీఐ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: పండుగ సీజన్ లో దిగ్గజ బ్యాంకులు ఖాతాదారులకు బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ మేజర్ ఎస్బీఐ హోంలోన్ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తే ప్రయివేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ నెలవారీ వేతనం పొందే ఉద్యోగులకు మరో ఆఫర్ ప్రకకటించింది. సాలరీడ్ కస్టమర్ల కోసం ఓవర్ డ్రాఫ్ట్ , టర్మ్ లోను పేరుతో రెండు ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్షణ అవసరాల కోసం టర్మ్ లోన్, పెళ్లి, విద్య, వైద్యఖర్చులు, విదేశీ ప్రయాణం తదితర వ్యక్తిగత అత్యవసర ఖర్చులు నిమిత్తం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద నగదు పొందవచ్చని బ్యాంక్ తెలిపింది. ఈ తాజా ఆఫర్ లో ఖాతాదారులు ఆస్తుల తనఖా ద్వారా 5 లక్షలనుంచి కోటి రూపాయల వరకు రుణం పొందవచ్చు. మొత్తం అమౌంట్ లో కనీసం 10 శాతం టర్మ్ లోనుగాను, గరిష్టంగా 90 శాతం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొంది. టర్మ్ లోన్ తీసుకుంటే వడ్డీ నెలవారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ లో అయితే రుణం తీసుకున్న సొమ్ము, రోజులు ఆధారంగా వడ్డీ వసూలు చేస్తారు. అదేవిధంగా, రివర్స్ స్వీప్ సౌకర్యం కూడా అందుబాటులోఉందని బ్యాంక్ తెలిపింది. సేవింగ్స్ ఖాతాలో అందుబాటులో వున్న అదనపు నిధులను ఓవర్డ్రాఫ్ట్ ఖాతాలోకి జమచేయనున్నట్టు పేర్కొంది. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఉద్యోగస్తుని సేవింగ్స్ ఖాతాకు లింక్ చేస్తారు. అంతేకాదు చాలాసులువుగా వీటిని ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. దీంతో వారు వాడుతున్న ఖాతానుంచే అవసరమైన సందర్భాల్లో కావాల్సిన సొమ్మును స్వీకరించవచ్చన్నమాట. అలాగే తమ దగ్గర హోం లోన్ లేని ఉద్యోగులు ముఖ్యంగా కార్పొరేట్ రుణగ్రహీతలు కావాలంటే.. తమ ఖాతాను బదిలీ చేసుకోవచ్చని కూడా సూచించింది. -
ఎయిర్టెల్ మరో ఇంటర్నేషనల్ ఆఫర్
టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ బుధవారం మరో ఇంటర్నేషనల్ రోమింగ్ ఆఫర్ ప్రకటించింది. వ్యాపార ప్రయాణాలు / సెలవుల్లో విదేశీ ప్రయాణించే వినియోగదారులకు అందుబాటులో ఉండేలా బుధవారం కొత్తఆఫర్ ను లాంచ్ చేసింది. 10రోజుల వాలిడిటీ ప్యాక్ ను రూ.1,199లతో మొదలయ్యే ఇంటర్నేషనల్ రోమింగ్ ఆఫర్ అందిస్తోంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, సింగపూర్, మరియు థాయ్ లాండ్లలో పర్యటించే ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ ఇన్కమింగ్ కాల్స్ ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు ఐఆర్( ఇంటర్నేషనల్ రోమింగ్ చార్జీలు) 99 శాతం కోతపెట్టి, 3రూపాయలకే ఒక ఎంబీ , ఇండియాకు, లోకల్ అవుట్ గోయింగ్ కాల్స్ కోసం నిమిషానికి 3 రూపాయలు చార్జ్ చేయనుంది. దీంతో వినియోగదారులు ఫ్రీ వైఫై సెంటర్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, సోషల్ మీడియా, ఈ మెయిల్స్ చెకింగ్ లాంటి సేవలను నిరంతరాయంగా పొందొచ్చని తెలిపింది. మరోవైపు ఈ ప్యాక్ ఎపుడైనా యాక్టివేట్ చేసుకొని, కేవలం వాడుకున్నపుడు మాత్రమే చెల్లించే అవకాశం కల్పించడం మరో ప్రత్యేకత. సింగపూర్, థాయ్ లాండ్ లలో పూర్తి ఉచిత ఇన్ కమింగ్ కాల్స్, 2 జీబీ డాటా, ఇండియాకు 250 నిమిషాల ఉచితకాలింగ్, 100 ఎస్ ఎంఎస్ లు ఉచితంగా అందిస్తోంది. దాదాపు ఇదే తారిఫ్ తో అమెరికా, కెనడా, బ్రిటన్లలో రూ.2999 లతో మొదలయ్యే ప్యాకేజ్ ను తీసుకొచ్చింది. అంతర్జాతీయ వినియోగదారుల రోమింగ్ కోసం కొత్త 10 రోజు చెల్లుబాటయ్యే కొత్త ప్యాక్ పరిచయం సంతోషంగా ఉందని భారతీ ఎయిర్టెల్ - మార్కెట్ ఆపరేషన్స్ (భారతదేశం మరియు దక్షిణ ఆసియా) అజయ్ పూరి తెలిపారు. తమ యూజర్లు ఇప్పుడు అంతర్జాతీయంగా అధిక కాల్ డేటా ఛార్జీల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని 24x7 తమ సేవలను ఎంజాయ్ చేయవచ్చన్నారు. వినియోగదారులు ఎయిర్టెల్ వెబ్ సైట్, మై ఎయిర్టెల్ యాప్, కస్టమర్ కాంటాక్ట్ కేంద్రాల ద్వారా ఈజీగా ఈ ప్లాన్ ను యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకోసం ఈ పట్టిక ను పరిశీలించవచ్చు. -
గెలాక్సీ ఆన్ నెక్ట్స్ లాంచ్...ధర ఎంత?
న్యూఢిల్లీ: కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ ఫోన్ ను శుక్రవారం లాంచ్ చేసింది. 'గెలాక్సీ ఆన్ నెక్ట్స్' పేరుతో భారత్ లో లాంచ్ చేసిన మిడ్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ ధరను రూ.18,490 కంపెనీ నిర్ణయించింది. 2.5డీ గొరిల్లా గ్లాస్ , పవర్ ఫుల్ ఎనిమిదో కోర్ ప్రాసెసర్ సపోర్ట్ తో దీన్ని లాంచ్ చేసింది. గెలాక్సీ సిరీస్ ఫోన్లను లాంచ్ చేయడం ఆనందంగా ఉందని శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను శర్మ, తెలిపారు. యూజర్ల సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే ఎస్ పవర్ ప్లానింగ్, ఎస్ సెక్యూర్ లాంటి ఫీచర్లను డాటా సెక్యూర్ కోసం పొందుపరచడం మరో ప్రత్యేకత అని ప్రకటించారు. ఆన్ నెక్ట్స్ ఫీచర్లు... 5.5 అంగుళాల హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 617 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, డ్యుయల్ సిమ్ 13 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.2 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. -
హైదరాబాద్ నాకు సెకండ్ హోమ్ : త్రిష
-
దీపావళి ఆఫర్తో ఇంటెక్స్ కొత్త టీవీ
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ హ్యాండ్సెట్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ కొత్త ఎల్ఈడి టీవీని లాంచ్ చేసింది. తన సరికొత్త 32 అంగుళాల ఎల్ఈడి టీవీని సోమవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధరను రూ 16,490గా కంపెనీ ప్రకటించింది. 3222 మోడల్ ఎల్ఈడిటీవీలో అన్ డ్యూ ల్యాగ్ తొలగించి, అన్ని వైపుల నుంచి స్మార్టీ లుకింగ్ వ్యూని అందించే ఐ సేఫ్ టి-మ్యాట్రిక్స్ టెక్నాలజీ ని అమర్చారు. ఇప్పటికే వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందిన తాము తమ పోర్ట్ఫోలియోలో ఈ కొత్త శ్రేణి ఎల్ఈడి టీవీని జోడించడానికి సంతోషిస్తున్నామని , ఇంటెక్స్ డైరెక్టర్, బిజినెస్ హెడ్, నిధి మార్కండేయ ప్రకటించారు. అలాగు ఈ టీవీ కొనుగోలుపై దీపావళి ఆఫర్ గా వినియోగదారులు ఐదు సంవత్సరాల వారంటీ తో పాటు 8000ఎంఏహెచ్ పవర్ బ్యాంకు ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు చెల్లుతుందని నిధి వెల్లడించారు. -
ఫేస్బుక్ మరో సరికొత్త యాప్
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖసోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ మరో యాప్ ను రిలీజ్ చేసింది. స్థానికంగా జరిగే విషయాలను తెలుసుకొని,ముఖ్కమైనవి మిస్ కాకుండా.. వాటి గురించి తెలుసుకొని స్నేహితులు, కలీగ్స్ పరస్పరం ఎంజాయ్ చేసేలా స్మార్ట్ ఫోన్ కోసం 'ఈవెంట్స్ యాప్' పేరుతో ఈ సరికొత్త యాప్ విడుదలచేసింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ప్రొడక్ట్ మేనేజర్ ఆదిత్య కూల్ వాల్ ఒక పోస్ట్ లో వెల్లడించారు. ఈ యాప్ సహకారంతో సాహిత్య సమావేశాలు, నాటికలు లాంటి ఇతర ఆసక్తికరమైన కార్యక్రమాలను గురించి, ప్రదేశము, ఆసక్తి తదితర అంశాల ఆధారంగా ఒకరికొకరు పంచుకునేందుకు ఉపయోగపడునుందని తెలిపారు. ఈవెంట్స్ ను ఓపెన్ చేయగానే కొత్త కార్యక్రమాల వివరాలు మీకు అందుతాయనీ, ఆల్ రెడీ కనెక్ట్ అయి వున్న ఈ యాప్ క్లిక్ చేయగానే మీ స్నేహితుల లేటెస్ట్ ఈవెంట్స్ సంబంధించిన వివరాలు, పేజీలు, లైక్స్ తదితర అంశాలు తెలుస్తాయని కూల్ వాల్ తెలిపారు. యాప్లో పుట్టినరోజు, సమావేశాలు, గ్రూప్ మీటింగ్స్, ఎగ్జిబిషన్స్ వంటి ఈవెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చన్నారు. తక్కువ సమయంలో మిత్రులందరికీ సమాచారం అందించడంతో పాటు ఈవెంట్ని గురించి ప్రచారం కూడా చేసుకోవచ్చని కూల్ పేర్కొన్నారు. -
'ఐ ఫోన్ 7 ' హైదరాబాద్ ముంగిట్లో
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఆపిల్ కొత్త మోడల్ ఐ ఫోన్ 7 ఇపుడు హైదరాబాద్ ముంగిట్లో కొలువు దీరనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ పండగ సీజన్ లో హైదరాబాదీలను ఆకట్టుకునేందుకు అక్టోబర్ 7 నగర మార్కెట్లోకి ప్రత్యేకంగా లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సాయంత్రం 7 గంటలకు అప్ట్రానిక్స్, అపెక్స్ స్టోర్లలో ఎక్స్ క్లూజివ్ గా లిమిటెడ్ స్టాక్ ను అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. సమీపంలోఈ స్టోర్లలో సంప్రదించి తమ తాజా డివైస్ ఐ ఫోన్ 7 ను సొంతం చేసుకోవాలని కోరింది. అలాగే అప్ ట్రానిక్స్ తన ఫేస్ బుక్ పేజ్ లో ఐ ఫోన్ లాంచింగ్ విషయాన్ని ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం http://aptronixindia.com/store/service-centers సందర్శించాలని కోరింది. కాగా ఇటీవల ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన సూపర్ ఐ ఫోన్ 7 , ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ఫోన్లు, నేడు భారత వినియోగదారుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. -
రైల్వే యాప్ను సిద్దంచేస్తున్న రైల్వే శాఖ
-
బడ్జెట్ ధరలో ఇంటెక్స్ కొత్త స్మార్ట్ ఫోన్
న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్ ఫోన్ మేకర్ ఇంటెక్స్ టెక్నాలజీస్ కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. 'క్లౌడ్ క్యూ 11' పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ ను మంగళవారం భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. దీని ధరను రూ. 4,699లు గా కంపెనీ నిర్ణయించింది. 3డీ కంటెంట్, ఎల్ఎఫ్టీవై లాంటి అధునాతన ఫీచర్లు తమ కొత్త స్మార్ట్ ఫోన్ సొంతమని, వీఆర్ ఎనేబుల్డ్ డివైస్ ను అమెజాన్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం ఆనందంగా ఉందని ఇంటెక్స్ ఆన్ లైన్ మొబైల్ సేల్స్ జనరల్ మేనేజర్ గుర్విందర్ సోధి ప్రకటించారు. 'క్లౌడ్ క్యూ 11' ఫీచర్లు 5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే 1280x720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 6.0 ఆండ్రాయిడ్ మార్ష్ మిల్లా ఆపరేటింగ్ సిస్టం, 1 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ 3 2జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ తెలుపు,నీలంరంగుల్లో అమెజాన్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. -
వాట్సాప్ , ఫేస్బుక్ లకు భారీ షాక్!
-
జాగ్వార్ కొత్త బిజినెస్ సెడాన్ లాంచ్
జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొత్త సెడాన్ ను లాంచ్ చేసింది.తన ప్రీమియం బిజినెస్ సెడాన్ సెగ్మెంట్ లో 'జాగ్వార్ ఎక్స్ ఎఫ్' బుధవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 49.50 లక్షల (ఎక్స్-ఢిల్లీ) నుంచి ప్రారంభవుతాయని కంపెనీ, తమ అధికారిక 23 జాగ్వార్ సెంటర్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. 2016 సెప్టెంబర్ మాసాంతానికి డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. కొత్త జాగ్వార్ ఎక్స్ఎఫ్ ప్యూర్, ప్రెస్టీజ్, పోర్ట్ఫోలియో అనే మూడు వేరియంట్లలో పెట్రోల్, డీజిల్ రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. జాగ్వార్ మోడల్ కార్లు గత కొన్నేళ్లుగా అత్యంత ప్రజాదరణతో భారత మార్కెట్లో విజయం సాధించాయని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ అధ్యక్షుడు రోహిత్ సూరి తెలిపారు. ఈ నేపథ్యంలో తమకొత్త జాగ్వార్ ఎక్స్ ఎఫ్ ను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. విశాలమైన, విలాసవంతమైన క్యాబిన్ కోసం మునుపటి తరం ఎక్స్ ఎఫ్ తో పోలిస్తే లెగ్ రూం, నీరూంను రూంను 24 మి. మీ,15 మిమీ పెంచినట్టు పేర్కొంది. 132 కెడబ్ల్యూ పవర్ అందించే ఇగ్నీషియం, 4- సిలిండర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజీన్ , మెరిడీయిన్ సౌండ్ సిస్టం 'జె' బ్లేడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ , ఎల్ ఈడీ హెడ్ లైట్స్ తో ప్రస్ఫుటమైన కాంతితో రాత్రి ప్రయాణంలో అలసట తగ్గించడానికి సహాయపడేలా నాణ్యమైన, ప్రకాశవంతమైన లైట్లను అమర్చినట్టు ఒక ప్రకటనలో కంపెనీ తెలిపింది. కాగా ఆడి ఏ6, ఇ-క్లాస్ మెర్సిడెజ్ బెంజ్, వోల్వో ఎస్ 80, బీఎండబ్ల్యు - 3 సిరీస్ కార్లకు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాల విశ్లేషణ. -
వాట్సాప్ , ఫేస్బుక్ లకు భారీ షాక్!
ప్రముఖ సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ మెసేజ్ షేరింగ్ యాప్ వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్ లకు భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలో హల్ చల్ చేస్తున్న చాటింగ్ యాప్స్ కు దీటుగా తన సరి కొత్త యాప్ ను లాంచ్ చేసింది. అలో (ALLO)' పేరిట గూగుల్ ప్లే స్టోర్ లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేలా ఈ యాప్ ను అందుబాటులో ఉంచింది. ప్రతి రోజు స్నేహితులు, కుటుంబంతో సన్నిహితంగా ఉండడానికి వీలుగా తమ యాప్ ను రూ పొందించామని గూగుల్ గ్రూప్ ప్రొడక్షన్ మేనేజర్ అమిత్ ఫులే చెప్పారు. సంప్రదాయ చాటింగ్ యాప్ లకు భిన్నంగా ఈ అల్లో యాప్ లో ఎన్నో ప్రత్యేకతలను పొందు పరిచారు. ముఖ్యంగా గూగుల్ అసిస్టెంట్ ద్వారా ప్రివ్యూ ఎడిషన్, స్మార్ట్ రిప్లై అనే పీఛర్లను అందిస్తున్న ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పనిచేస్తుంది. ప్రముఖ ఆర్టిస్టులతో రూపొందించిన 200పైగా స్టికర్లతోపాటు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ , అదనపు గోప్యతా లక్షణాలు కలిగి ఉండటం దీని ప్రత్యేకత. 'అలో' చాటింగ్ కోసం ఎమోజీలు, స్టిక్కర్లు అందించడంతోపాటు, ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్ను కూడా యూజర్లు సెండ్ చేసుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దింది. అలాగే ఇన్బిల్ట్గా గూగుల్ సెర్చ్ను కూడా అందిస్తోంది. దీని ద్వారా చాటింగ్ చేసే సమయంలోనే అదే విండోలో తమకు కావల్సిన సమాచారాన్ని వెతుక్కోవచ్చు. క్రీడా స్కోర్లు, వాతావరణ వివరాలు, ప్రయాణ సమయం లేదా విమానం స్థితి , రెస్టారెంట్ల వివరాలను కూడా దీని ద్వారా శోధించవచ్చట. కొత్త స్టిక్కర్స్, ఫాంట్ సైజ్ లోమార్పులు, ఫోటోలతోపాటు, ఎదుటి వ్యక్తినుంచి వచ్చే కొన్ని ప్రశ్నలకు ఈ ఇంటిలిజెంట్ యాప్ సమాధానాలను ఇస్తుంది. అంటే మనం తరచుగా వాడే హా, లాల్ లాంటి ఇతర పదాలను గుర్తించి దానికనుగణంగా సమధానాన్ని ఇస్తుందట. వాట్సప్ లోలాగానే మొబైల్ నెంబర్ తో ఈ అల్లో యాప్ లింక్ అయి ఉంటుంది. ఇక గూగుల్ ఖాతాతో లింక్ అయి ఉండటం వల్ల యాజర్ చూస్తున్న వీడియోలు, వెతికే విషయాల ఆధారంగా అతని ప్రవర్తనను, అవసరాలను ఈ యాప్ అంచనా వేస్తుందట. వాట్సాప్ లో ఉన్న అన్ని ఫీచర్స్ తో పాటు గూగుల్ మ్యాప్స్ ను కూడా ఇందులో పంపుకునే వీలుంది. అంతేకాదు ఈ కొత్త యాప్ లో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా (ఉదాహరణకు, భార్య లేదా బాస్) సలహాలు అందిస్తుందట. కాగా అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన గూగుల్ అలో యాప్ మిగిలిన చాటింగ్ యాప్ లకు ప్రతికూల అంశమని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.