Manohar Lal Khattar
-
‘అమృత్’ స్కామ్.. కేంద్రమంత్రికి కేటీఆర్ ఫిర్యాదు
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం(నవంబర్ 11) ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో అమృత్ టెండర్లలో స్కామ్ జరిగిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్లాల్ కట్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్రెడ్డి బావమరిది సూదిని సృజన్రెడ్డికి చెందిన శోద కంపెనీకి రూ.1100 కోట్ల రూపాయల టెండర్లను ఏకపక్షంగా కట్టబెట్టారని ఫిర్యాదులో తెలిపారు. రూ.2 కోట్ల లాభం కూడా లేని కంపెనీకి ఇంత పెద్ద టెండర్ ఇవ్వడం వెనుక ఏదో గోల్మాల్ జరిగిందన్నారున. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు. టెండర్లు రద్దు చేయాలన్నారు.కాగా, గతంలో అమృత్ స్కామ్పై కేటీఆర్ మీడియా సమావేశాలు పెట్టి సీఎం రేవంత్పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంలో బీజేపీ నేతలు కూడా రేవంత్రెడ్డిపై ఆరోపణలు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: కేసీఆర్కు సీఎం రేవంత్ కౌంటర్లు -
Haryana Assembly Elections 2024: బీజేపీలో చేరాలంటూ సెల్జాకు ఖట్టర్ ఆఫర్
చండీగఢ్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కుమారి సెల్జాను బీజేపీలో చేరాల్సిందిగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ఆహ్వానించారు. ప్రముఖ దళిత నేత కూడా అయిన సెల్జా వచ్చే నెలలో జరిగే హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారన్న వార్తల నేపథ్యంలో మంత్రి ఈ ఆఫర్ ఇవ్వడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత పోరు తీవ్రతరమైందని మంత్రి ఖట్టర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఘరువాండాలో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో మాట్లాడారు. -
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
బీజేపీ పాలిత ర్యానాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అసెంబ్లీలో బలపరీక్ష డిమాండ్ చేసిన దుష్యంత్ చౌతాలాకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇచ్చారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గురువారం మధ్యాహ్నం బీజేపీ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. పానిపట్లోని మంత్రి మహిపాల్ దండా నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఖట్టర్, మహిపాల్తో సుమారు అరగంటపాటు జేజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అరగంటపాటు సాగిన ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న తాజా సంక్షోభంపై చర్చించినట్లు సమాచారం.కాగా ఇటీవల ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు (సోంబీర్ సంగ్వాన్, రణధీర్ సింగ్ గొల్లెన్, ధరంపాల్ గోండర్) బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో నయాబ్ సింగ్ సైనీ సర్కార్ సంక్షోభంలో పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీఫ్ దుష్యంత్ చౌతాలా గురువారం హర్యానా గవర్నర్కు లేఖ రాశారు. ఒకవేళ ప్రభుత్వానికి మెజారిటీ రాకపోతే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.కాగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కాంగ్రెస్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ మాజీ మిత్రపక్షమైన దుష్యంత్ చౌతాలా స్పష్టం చేశారు. అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే తాము బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేస్తామని తెలిపారు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంచుకుంటే కాంగ్రెస్కు బయటి మద్దతు ఇస్తానని ప్రకటించారు. -
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
చంఢిగఢ్: లోక్సభ ఎన్నికల వేళ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా బీజేపీకి తమ మద్దతు ఉపసంహరించుకోవటంతో హర్యానాలో నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మైనార్టీలోకి పడిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధావారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవటంతో బీజేపీ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం పడదు. మాతో కూడా పలువురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. పలువురు నేతలు సైతం మాకు మద్దతుగా నిలుస్తున్నారు.వారిని రక్షించుకోవాలి.అయితే తర్వరలోనే తమతో ఎంతమంది టచ్లోకి వచ్చారన్న విషయంలో స్పస్టత వస్తుంది’ అని మనోహర్ లాల్ కట్టర్ అన్నారు.ఇక.. మంగళవారం స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్ (దాద్రీ), రణధీర్ సింగ్ గొల్లెన్ (పుండ్రి), ధరంపాల్ గోండర్ (నీలోఖేరి)లు.. రోహ్తక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో బీజేపీకి తమ మద్దతును ఉపసహరించున్న విషయాన్ని వెల్లడించారు.ఈ లోక్సభ ఎన్నికల్లో సీనియర్ నేత అయిన ఖట్టర్.. కర్నాల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని మొత్తం పది స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.హర్యానాలో మొతం 90 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 45 స్థానాలు. మనోర్ లాల్, రంజిత్ చౌతాలా రాజీనామాల కారణంగా రెండు స్థానాలు ఖాలీ అయ్యాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 88. ప్రస్తుతం బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.బీజేపీ హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. అయితే నిన్న ముగ్గరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించగా.. బీజేపీ కి ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. -
హర్యానా సీఎం రాజీనామా
-
హర్యానా నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ
హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ఎన్నుకుంది ఆ రాష్ట్ర బీజేఎల్పీ. మంగళవారం అక్కడి రాజకీయాల్లో ఒకదాని వెంట ఒకటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయగా.. ఆయన ప్రధాన అనుచరుడైన నాయబ్ ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అంతకు ముందు.. జేజేపీ- బీజేపీల మధ్య పొత్తు తెగిపోవడంతో.. ఖట్టర్ రాజీనామా, నూతన ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. అయితే ఖట్టర్ మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించగా.. అనూహ్యంగా నాయబ్ సింగ్ సైనీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగానే కొనసాగుతున్నారు. అంతేకాదు కురుక్షేత్ర పార్లమెంటు సభ్యుడు(ఎంపీ) కూడా. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు సీఎంగా ఆయన ప్రమాణం చేయనున్నారు. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయబ్ సింగ్ సైనీ గత ఏడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. సైనీకి సంఘ్ కార్యకాలాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 1996లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2002లో అంబాలా బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎంపికయ్యారు. ఇదీ చదవండి: జేజేపీ అవుట్ చేసేందుకే బీజేపీ వ్యూహం! 2005లో ఆయన బీజేపీ అంబాలా యువమోర్చా జిల్లా అధ్యక్షుడయ్యారు. తరువాత బీజేపీ హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2012లో అంబాలా జిల్లా అధ్యక్షునిగా నాయబ్ సింగ్ సైనీ నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణగఢ్ నుంచి గెలిచి హర్యానా అసెంబ్లీకి చేరుకున్నారు. 2016లో ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో నాయబ్ సింగ్ సైనీ కురుక్షేత్ర ఎంపీగా ఎన్నికయ్యారు. 2023లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. -
సెక్యూరిటీ లేకుండా పబ్లిక్ లోకి వచ్చిన సీఎం..
-
బుల్లెట్ నడిపిన సీఎం ఖట్టర్
చంఢీగర్: ఎలాంటి భద్రత లేకుండా బైక్ రైడ్ చేశారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై సీఎం ముందు వెళుతుండగా.. భద్రతా సిబ్బంది, అధికారులు ఆయనను అనుసరించారు. కర్నాల్ ఎయిర్పోర్టు వరకు బైక్ ప్రయాణం చేశారు. హరియాణాలో 'కార్ ఫ్రీ డే' సందర్భంగా సీఎం బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ను తగ్గించే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. వారంలో ఓ రోజు కార్లను ఉపయోగించకుండా ప్రజలను ప్రోత్సహించే సంకల్పంతో బైక్ రైడ్ నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన కర్నాల్లో ఈ ర్యాలీ చేపట్టారు. "कार फ्री डे" हो या "नशामुक्त हरियाणा" बनाने का संकल्प हो बिना जनसहयोग के पूरा नहीं हो सकता! “कार फ्री डे” पर करनाल एयरपोर्ट तक की यात्रा बाइक द्वारा करके, आज के दिन कार ट्रैफिक कम करने का एक छोटा सा प्रयास मेरा भी रहा। मुझे आशा है कि प्रदेश के जागरूक लोग इस सन्देश को आगे… pic.twitter.com/a5DQeDn1ky — Manohar Lal (@mlkhattar) September 26, 2023 ఇదీ చదవండి: బీజేపీ నేతపై లుక్అవుట్ నోటీసులు -
చంద్రయాన్-4లో నిన్ను పంపిస్తా.. మహిళతో హర్యానా సీఎం వెటకారం!
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఓ పేద మహిళ అడిగిన ప్రశ్నకు కోపంగా సమాధానం చెబుతూ వెటకారంగా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీఎం తీరుపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. తమ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని కోరిన ఓ పేద మహిళను సీఎం ఖట్టర్ దారుణంగా అవమానించారు. ఈ సందర్భంగా ఆగ్రహానికిలోనైన ఖట్టర్.. ‘చంద్రయాన్-4తో నిన్ను కూడా పంపుతా.. కూర్చో’ అంటూ సదరు మహిళను ఉద్దేశించి వెటకారంగా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్గా మారింది. సీఎం ఖట్టర్ తీరుపై ప్రతిపక్షాలు నేతలు మండిపడుతున్నారు. ఖట్టర్ వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పందిస్తూ.. ‘ఉపాధి చూపమని సదరు మహిళ సీఎంను కోరటం నేరమా? సీఎం ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజా సేవచేయడానికి ఎన్నుకోబడ్డ నాయకులు.. ప్రజలపైనే పరిహాసమాడుతున్నారు. ఇదే విధమైన డిమాండ్ ప్రధాని మోదీకి మిత్రులైన బడా కోటీశ్వరులు, కార్పొరేట్ల నుంచి వస్తే.. అప్పుడు మొత్తం హర్యానా ప్రభుత్వ యంత్రాంగమే వారి సేవలో నిమగ్నమయ్యేది’ అని ఆప్ ఎద్దేవా చేసింది. ఇక, కాంగ్రెస్ స్పందిస్తూ.. పేద మహిళ తన కష్టం చెప్పుకుంటే సీఎం ఖట్టర్కు నవ్వులాటగా ఉంది. మహిళల పట్ల బీజేపీకి గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. Apathy at display: A woman posed a request to Haryana CM Manohar Lal Khattar to establish a factory so that employment can be generated. He replies “Next time when Chandrayaan-4 is launched, we will send you to the moon.” #Haryana #ManoharLalKhattar @BJP4Haryana pic.twitter.com/44fLWJd9vA — NewsTAP (@newstapTweets) September 7, 2023 ఇది కూడా చదవండి: ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. లైవ్ అప్డేట్స్ -
నిన్ను చంద్రయాన్ ఎక్కిస్తా.. హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
చండీగఢ్: ఇటీవల నూహ్ అల్లర్ల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన హర్యానా రాష్ట్రం తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వివాదాస్పదమైన వ్యాఖ్యల వలన మరోసారి వార్తల్లో నిలిచింది. హర్యానా ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్కు ఓ మహిళ తన గోడు వినిపించగా సీఎం వెటకారంగా నిన్ను చంద్రయాన్-4 ఎక్కించి పంపిస్తానని వెటకారం చేశారు. మహిళ పట్ల సీఎం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. హర్యానా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్వయం సహాయక గ్రూపు మహిళలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా మొదట మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను సందర్శించిన ముఖ్యమంత్రి తర్వాత మహిళలతో కాసేపు మాట్లాడారు. వారు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఇదే క్రమంలో ఓ మహిళ తమ గ్రామానికి సమీపంలో ఒక ఫ్యాక్టరీని నిర్మిస్తే మాలాంటి కొంత మహిళలకు ఉపాధి దొరుకుతుందని అభ్యర్ధించగా అందుకు సీఎం బదులిస్తూ.. మళ్ళీ ఇక్కడి నుంచి చంద్రయాన్ వెళ్తే అందులో నిన్ను పంపిస్తానని ఎద్దేవా చేశారు.. దీంతో అక్కడి వారంతా ఆ మహిళను వెంటనే కూర్చోమని బలవంతం చేశారు. ఇంకేముంది ఇలాంటి అవకాశం కోసమే కాచుకుని కూర్చున్న ప్రతిపక్షాలు ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఊరుకుంటాయా. సీఎం మాట్లాడిన వీడియోతో సహా విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అధికారంలోకి వచ్చే వరకు ఒకలా ఉంటారు.. అధికారం దక్కించుకున్నాక ఒకలా ఉంటారని ఉదహరించారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇదే కోరిక ప్రధాని మోదీ సన్నిహితులెవరైనా కోరి ఉంటే ఆఘమేఘాల మీద ఫ్యాక్టరీని నిర్మించేవారని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ బీజేపీ ఆరెస్సెస్ మహిళలకు అంతకంటే ఏమి గౌరవమిస్తుందని విమర్శించింది. "अगली बार #Chandrayaan जाएगा तो उसमें तुमको भेज देंगे।" धिक्कार है ऐसे मुख्यमंत्री पर। जिन्हें जनता ने सेवा करने के लिए चुना था आज वही जनता का मज़ाक़ उड़ा रहे हैं। महिला का अपराध इतना था कि उसने रोजगार के लिए फैक्ट्री मांगी यही मांग अगर मोदी जी के अरबपति मित्रों ने अपने… pic.twitter.com/OERfbfaCGt — AAP (@AamAadmiParty) September 7, 2023 BJP के मुख्यमंत्री की सोच देखिए... हरियाणा में एक महिला ने CM खट्टर से कहा कि उसके क्षेत्र में फैक्ट्री लगा दी जाए, जिससे उसे और दूसरी महिलाओं को काम मिल सके। इसके जवाब में CM चेहरे पर बेशर्म हंसी लिए कहते हैं- अगली बार तुम्हें चंद्रयान से चांद पर भेजेंगे। और उस गरीब महिला की… pic.twitter.com/wdV47Ow2db — Congress (@INCIndia) September 7, 2023 ఇది కూడా చదవండి: నాగ్పూర్ పోలీస్ శాఖ క్రియేటివ్ యాడ్ -
హర్యానా ఘర్షణలు.. నుహ్ జిల్లాలో బుల్డోజర్ చర్యకు దిగిన ప్రభుత్వం
చండీగఢ్: మత ఘర్షణలతో హర్యానా రాష్ట్రం అట్టుడుకుతోంది. నాలుగు రోజుల క్రితం చెలరేగిన అల్లర్లతో నూహ్, గురుగ్రామ్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నూహ్ జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హర్యానా ప్రభుత్వం బుల్డోజర్ చర్చ చేపట్టింది. హింసాకాండకు గురైన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోని టౌరు ఏరియాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నివసిస్తున్న వసలదారుల గుడిసెలను అధికారులు కూల్చివేశారు. కాగా విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా చెలరేగిన హింసలో బయటి వ్యక్తులు(చొరబాటుదారులు) పాల్గొన్నారని పోలీసులతోపాటు సీఎం మనోహర్లాల్ ఖట్టర్ సైతం ఆరోపించారు. ఈ క్రమంలో అల్లర్లకు పాల్పడిన వారికి చెందిన నిర్మాణాలుగా భావించి బుల్డోజర్ యాక్షన్కు దిగినట్లు తెలుస్తోంది. స్వయంగా సీఎం ఖట్టరే ఈ కూల్చివేతలకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో అస్సాంలో ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ శరణార్థులు.. ఇటీవల హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో నివసిస్తున్నారు. నూహ్ జిల్లాలోని తౌరు పట్టణంలోని మహ్మద్పూర్ రహదారి మార్గంలో వార్డు నంబర్ వన్లోని హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. సుమారు ఎకరం స్థలంలో 250కి పైగా గుడిసెలు నిర్మించి, వారు గత నాలుగేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు సమాచారం. చదవండి: హర్యానా ఘర్షణల ఎఫెక్ట్.. నూహ్ ఎస్పీపై వేటు -
పెళ్లి కాని వారికి గుడ్న్యూస్.. ప్రతీ నెలా 2,750 పెన్షన్
చండీఘడ్: హర్యానా ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెళ్లి కాని యువతీ యువకుల కోసం ప్రత్యేక పెన్షన్ స్కీమ్ను ప్లాన్ చేసింది. హర్యానాలో వివాహం చేసుకోని వారికి ప్రతీ నెలా రూ.2,750లను పెన్షన్గా ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వివరాల ప్రకారం.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గురువారం కీలక ప్రకటన చేశారు. హర్యానాలో పెళ్లి కాని ఆడవాళ్లకు, మగవాళ్లకు ప్రతి నెలా రూ.2,750 ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే, ఈ స్కీమ్ 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే వర్తించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. అవివాహిత పెన్షన్ అందుకునేవారి వార్షిక ఆదాయం రూ.1.80 లక్షలకు తక్కువగా ఉండాలని ప్రభుత్వం రూల్ పెట్టింది. మరోవైపు.. హర్యానాలో వితంతవులను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వితంతువులకు కూడా పెన్షన్ను అందించనున్నట్టు సీఎం ఖట్టర్ ప్రకటించారు. 40 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వితంతువులకు ప్రతినెలా రూ.2750 ఇవ్వనున్నట్టు తెలిపారు. అయితే వాళ్ల వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలనే నిబంధనను విధించారు. मैं घोषणा करता हूं कि हरियाणा के 45 से 60 वर्ष तक की आयु वाले अविवाहित पुरुष व महिलाओं को अब से ₹2,750 मासिक पेंशन दी जाएगी। ₹1.80 लाख से कम वार्षिक आय वाले व्यक्तियों को इस पेंशन का लाभ मिलेगा। इसके अलावा 40-60 वर्ष आयु तक के विधुर पुरुष, जिनकी वार्षिक आय ₹3 लाख से कम है… pic.twitter.com/Jwn5fO5sWp — Manohar Lal (@mlkhattar) July 6, 2023 ఇది కూడా చదవండి: మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు.. ఎంపీ ఎన్నిక రద్దు.. -
Rattan Lal Kataria: బీజేపీ ఎంపీ రతన్లాల్ కన్నుమూత
చండీగఢ్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ రతన్లాల్ కటారియా(72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో (న్యుమోనియా) బాధపడుతున్న రతన్లాల్.. చండీగఢ్లోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రస్తుతం ఆయన హర్యానాలోని అంబాలా నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2019 నుంచి 2021 వరకు రతన్లాల్ కేంద్రమంత్రిగా పనిచేశారు. కేంద్ర జల్శక్తి, సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కటారియా మృతిపట్ల హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్, స్పీకర్ జియాన్ చంద్ గుప్తా సంతాపం తెలిపారు. గురువారం సాయంత్రం అధికార లాంఛనాలతో రతన్లాల్ కటారియా అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో, అంబాలా లోక్సభ స్థానం నుంచి ప్రస్తుత హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కుమారి సెల్జాపై 57 శాతం ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అంతకు ముందు 1999, 2014లో అంబాలా నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో కుమారి సెల్జా చేతిలో ఓటమిని చవిచూశారు. చదవండి: హైదరాబాద్కు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ.. 1200 మందికి ఉపాధి -
గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఆరుగురు యువకులు మృతి
చండీగఢ్: హర్యానాలో గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మహేంద్రగఢ్, సోనిపత్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన వేరు వేరు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మహేంద్రగఢ్లో ఏడు అడుగుల వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కాలువలోకి దిగిన 9 మంది యువకులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మిగతా ఐదుగురిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోనిపత్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు సరయూ నదిలోకి దిగిన ఇద్దరు యువకులు నీటమునిగి చనిపోయారు. ఈ విషాద ఘటనలపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గణేష్ నిమజ్జనంలో పాల్గొనేందుకు వెళ్లి వీరంతా ప్రాణాలు కోల్పోవడం తన హృదయాన్ని కలచివేసిందని ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే సహాయక చర్యల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రశంసించారు. महेंद्रगढ़ और सोनीपत जिले में गणपति विसर्जन के दौरान नहर में डूबने से कई लोगों की असामयिक मृत्यु का समाचार हृदयविदारक है। इस कठिन समय में हम सभी मृतकों के परिजनों के साथ खड़े हैं। NDRF की टीम ने कई लोगों को डूबने से बचा लिया है, मैं उनके शीघ्र स्वस्थ होने की प्रार्थना करता हूँ। — Manohar Lal (@mlkhattar) September 9, 2022 చదవండి: అడ్డు తొలగించుకునేందుకే హత్య.. భార్య అంగీకారంతోనే.. -
సీబీఐ చేతికి సోనాలి ఫోగట్ మృతి కేసు?
గోవా: హరియాణా బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడటం లేదు. మృతికి కొద్ది గంటల ముందు జరిగిన సంఘటనలకు సంబంధించిన పలు వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో అవసరమైతే సోనాలి మృతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగిస్తామని తెలిపారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్తో ఫోగట్ కుటుంబ సభ్యులు కలిసిన తర్వాత ఈ మేరకు వెల్లడించారు సీఎం. ‘హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నాతో మాట్లాడారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆయను కలిసి సీబీఐ దర్యాప్తు జరపాలని కోరిన క్రమంలో.. అదే విషయాన్ని నాతో చెప్పారు. ఈ రోజు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక.. అవసరమైతే కేసును సీబీఐకి అప్పగిస్తాం.’ అని తెలిపారు ప్రమోద్ సావంత్. సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్ను శనివారం కలిశారు. నటి మృతి కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. అనంతరం.. సీబీఐ దర్యాప్తు కోసం గోవా ప్రభుత్వానికి లేఖ రాస్తామని హరియాణా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మరోకరి అరెస్ట్.. సోనాలి ఫోగట్ మృతి కేసుకు సంబంధించి శనివారం ఇద్దరిని అరెస్ట్ చేశారు గోవా పోలీసులు. నిందితులు సోనాలి వెళ్లిన క్లబ్ యజమాని, డ్రగ్ డీలర్ దత్తప్రసాద్ గోయంకర్, ఎడ్విన్ నన్స్గా తెలిపారు. తాజాగా ఆదివారం మరో డ్రగ్స్ సరఫరాదారుడిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదీ చదవండి: సోనాలి ఫోగట్ను ఎవరు చంపారో తేల్చాలి.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులా కావొద్దు -
విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటల 25 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11గంటల 05 నిమిషాలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడినుంచి 11గంటల 50 నిమిషాలకు రుషికొండ పెమ వెల్నెస్ రిసార్ట్కు వెళ్తారు. అక్కడ హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2:30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. చదవండి: (శ్రీశారదా పీఠాన్ని సందర్శించిన హరియాణా సీఎం) -
మైనింగ్ జోన్లో విరిగిపడ్డ కొండ చిరియలు.. 20 మంది కార్మికులు గల్లంతు!
చండీఘడ్: రాష్ట్రంలోని మైనింగ్ జోన్లో శనివారం కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 15 నుంచి 20 మంది ఘటనలో చిక్కుకున్నారు. తోషమ్ బ్లాక్లోని దాడం మైనింగ్ జోన్లో జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. హర్యానాలోని భివానీ జిల్లాలో ఉన్న మైనింగ్ ఏరియాలో వాహనాల్లో వేరే ప్రాంతాలకు వెళ్తున్న కార్మికులపై కొండచరియలు విరిగిపడటంతో, వాహనాల్లో కార్మికులందరూ చిక్కుకున్నట్లు సమాచారం. త్వరితగతిన రెస్క్యూ ఆపరేషన్లు, క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించడానికి జిల్లా యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ట్విటర్ వేదికగా తెలిపారు. సంఘటన స్థలాన్ని పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ హుటాహుటిన చేరుకున్నారు. ఇప్పటివరకు ముగ్గురుని రక్షించి ఆసుపత్రికి తరలించామని, ఇద్దరు మృతి చెందారని, ప్రమాదంలో చిక్కుకున్నవారిని ప్రాణాలతో కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి మీడియాకు తెలిపారు. కాగా దాడం మైనింగ్ ప్రాంతం, ఖనాక్ పహారీలో మైనింగ్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతుండేవి. ఐతే కాలుష్యం కారణంగా నేషనల్ గ్నీన్ ట్రిబ్యునల్ విధించిన రెండు నెలలు నిషేధాన్ని గురువారం ఎత్తివేయగా శుక్రవారం నుంచి మైనింగ్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. నిషేధం తర్వాత కేవలం ఒక్క రోజులోనే ఇంత పెద్ద ప్రమాదం జరడగంతో తాజా సంఘటన చర్చనీయాంశమైంది. చదవండి: ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’ -
సీఎం ఇంటి ముందు ధర్నాకు దిగిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
చంఢీఘడ్: 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత రెజ్లర్ వీరేందర్ సింగ్ యాదవ్ అలియాస్ గుంగా పహిల్వాన్.. హర్యానా(అతని సొంత రాష్ట్రం) రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టాడు. బధిర క్రీడాకారులను పారా అథ్లెటుగా గుర్తించాలంటూ, పారా అథ్లెట్లతో సమానంగా తమకు కూడా హక్కులు కల్పించాలంటూ తాను సాధించిన పద్మ శ్రీ, అర్జున అవార్డులతో సీఎం ఇంటి ముందు గల ఫుట్పాత్పై కూర్చొని నిరసన తెలిపాడు. माननीय मुख्यमंत्री श्री @mlkhattar जी आपके आवास दिल्ली हरियाणा भवन के फुटपाथ पर बैठा हूँ और यहाँ से जब तक नहीं हटूँगा जब तक आप हम मूक-बधिर खिलाड़ियों को पैरा खिलाड़ियों के समान अधिकार नहीं देंगे, जब केंद्र हमें समान अधिकार देती है तो आप क्यों नहीं? @ANI pic.twitter.com/4cJv9WcyRG — Virender Singh (@GoongaPahalwan) November 10, 2021 ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. బధిర క్రీడాకారుల సమస్యలపై హరియాణా సీఎం స్పందించాలని కోరాడు. మంగళవారం(నవంబర్ 9) రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న వీరేందర్.. గంటల వ్యవధిలోనే బధిర అథ్లెట్ల హక్కుల కోసం నిరవధిక నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా, హరియాణాలోని సస్రోలిలో జన్మించిన వీరేందర్కు వినబడదు, మాట్లాడలేడు. చదవండి: పాక్ కెప్టెన్ను ఆకాశానికెత్తిన గవాస్కర్.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన -
సైకిల్పై సీఎం సందడి: కొత్త స్కీం
చండీగఢ్: వరల్డ్ కార్ ఫ్రీ డే సందర్భంగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సైకిల్పై సందడి చేశారు. కాలుష్య నివారణపై అవగాహన కల్పించేలా తన మంత్రి వర్గ సహచరులు, ఇతర ఎమ్మెల్యేలతో సైకిల్యాత్ర చేపట్టారు. తన అధికారిక నివాసం నుండి సెక్రటేరియట్ వరకు సైకిల్పై వచ్చి పలువురిని ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ మంత్రి జేపీ దలాల్, రవాణా శాఖ మంత్రి మూల్చంద్ శర్మ సైకిల్పై పౌర సచివాలయానికి చేరుకోవడం విశేషం. (World Car Free Day: ఎంచక్కా సైకిల్పై షికారు చేద్దాం!) ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 75 సంవత్సరాల పైబడిన పాత చెట్ల నిర్వహణ నిమిత్తం, ప్రాణ వాయు దేవత పెన్షన్ యోజన పేరిట ఏడాదికి రూ.2,500 పెన్షన్ అందజేస్తామని చెప్పారు. మొత్తం రాష్ట్రంలో ఇటువంటి చెట్లను గుర్తించి, స్థానిక ప్రజలను ఈ పథకంలో చేర్చడం ద్వారా పరిరక్షణకు చర్యలు చేపడతా మన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఇస్తున్న హరియాణా ప్రభుత్వం త్వరలో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని తీసుకురానుంది. ఈ సందర్భంగా సచివాలయం ఆవరణలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో, ఖట్టర్ చండీగఢ్ నుండి కర్నాల్ వరకు రైలులో ప్రయాణించారు. అలాగే సైకిల్పై పోలింగ్ కేంద్రానికి చేరుకుని అందర్నీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. #WATCH | Haryana Chief Minister Manohar Lal Khattar* rides a bicycle along with his cabinet colleagues and MLAs from his residence to the secretariat in Chandigarh to observe #Worldcarfreeday pic.twitter.com/ME0dt31MJl — ANI (@ANI) September 22, 2021 -
ఏసీ హాల్లో ఎందుకు? గ్రౌండ్లో కూడా పెళ్లి చేసుకోండి: నితిన్ గడ్కరీ
సాక్షి, చండీగఢ్: కేంద్ర మంత్రులు పలు సమస్యలపై ప్రశ్నిస్తే వింతగా సమాధానమిస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. టోల్ గేట్ల ధరల పెంపుపై ప్రశ్నించగా వింతగా సమాధానమిచ్చారు. ‘డబ్బులు చెల్లిస్తే మంచి రోడ్లు వస్తాయి’ అని పేర్కొన్నారు. దానికో ఉదాహరణ కూడా వివరించి సోషల్ మీడియాలో నెటిజన్లకు చిక్కారు. ఆయన చేసిన వ్యాఖ్యలేంటో తెలుసుకోండి. చదవండి: 2023లోనూ టీఆర్ఎస్దే విజయం హరియాణాలోని సోహ్నాలో ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే (డీఎంఈ) పనులను గురువారం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసీ హాల్లో వివాహం చేసుకుంటే డబ్బులు చెల్లించాలి. అదే మైదానంలో అయితే ఏం ఖర్చు ఉండదు. అక్కడ కూడా చేసుకోవచ్చు’ అని తెలిపారు. ఎక్స్ప్రెస్ హైవేలపై టోల్ చార్జీలతో ప్రయాణ వ్యయం పెరుగుతుండడంపై ఆయన ఇచ్చిన ఉదాహరణ. అంతటితో ఆగకుండా మరికొంత ఉదాహరిస్తూ.. ‘ఢిల్లీ- ముంబై ఎక్స్ప్రెస్ హైవే వినియోగిస్తే 12 గంటల్లో ప్రయాణించొచ్చు. ఎక్స్ప్రెస్ వేతో ప్రమాణ సమయం తగ్గుతుంది. ఇంధన ధర తగ్గుతుంది. అదే ఓ ట్రక్కు ముంబై నుంచి ఢిల్లీ చేరడానికి 48 గంటలు పడుతుంది. ఎక్స్ప్రెస్ వేతో ఎక్కువ ట్రిప్పులు తిరగొచ్చు. దాని ద్వారా వ్యాపారం మరింత చేసుకోవచ్చు’ అని తెలిపారు. మెరుగైన రోడ్లు కావాలంటే ప్రజలు డబ్బులు చెల్లించక తప్పదని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. చదవండి: బీజేపీ సరికొత్త ప్రయోగం.. వారికి నో ఛాన్స్ దేశంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీ- ముంబై మధ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న 1,380 కిలోమీటర్ల ఈ ఎక్స్ప్రెస్ వే పనులు 2023లో పూర్తి చేయాలనే లక్ష్యం. ఆ పనులు ముమ్మరం చేయడంలో భాగంగా నితిన్ గడ్కరీ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి పరిశీలించారు. భవిష్యత్లో రోడ్లపై విమానాలు దిగే మాదిరి అత్యంత నాణ్యతతో ఈ పనులు చేస్తున్నట్లు తెలిపారు. -
పారాలింపిక్స్ పతకధారులకు రూ.10 కోట్ల భారీ నజరాన
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో పతకాలు గెలిచిన షూటర్లకు హర్యానా ప్రభుత్వం శనివారం భారీ నజరానా ప్రకటించింది. 50 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో మనీష్ నర్వాల్ బంగారు పతకం సాధించగా, సింఘ్ రాజ్ అధనా రజత పతకం కైవసం చేసుకున్నాడు. గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న మనీష్ నర్వాల్కు రూ .6 కోట్లు, రజత పతకం సాధించిన సింఘ్ రాజ్ అధనాకు రూ.4 కోట్లు రివార్డు ను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. పతకాలు గెలిచిన ఈ ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వనున్నట్లు హర్యానా సర్కార్ ప్రకటించింది. కాగా అంతకముందు పారాలింపిక్స్లో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్ ఆంటిల్కు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రూ .6 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు. డిస్కస్ త్రో ఎఫ్ -56 లో రజత పతకం సాధించినందుకు యోగేష్ కథునియాకు కూడా రూ. 4 కోట్ల రివార్డును ఆయన ప్రకటించారు. ఈ ఇద్దరు అథ్లెట్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. చదవండి: Tokyo Paralympics 2021: భారత్ ఖాతాలో మరో బంగారు పతకం.. -
హాకీ క్రీడాకారిణులకు 50 లక్షల నజరానా
Indian Women Hockey Team Wins Hearts: కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత మహిళా హాకీ జట్టు అద్భుత ప్రదర్శనను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ కొనియాడారు. టోక్యో ఒలింపిక్స్ ఆడిన జట్టులో భాగమైన తమ రాష్ట్ర హాకీ క్రీడాకారిణులకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. మొత్తం తొమ్మిది మందికి ఈ నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. పోరాట పటిమ కనబరిచారంటూ హాకీ జట్టుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం మనోహర్లాల్ ఖట్టర్ శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా భారత మహిళా హాకీ ఒలింపిక్ చరిత్రలో రాణి సేన తొలిసారి సెమీస్కు చేరి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, సెమీ ఫైనల్లో ఓడిన అమ్మాయిలు.. శుక్రవారం కాంస్యం కోసం జరిగిన పోరులో బ్రిటన్తో హోరాహోరీగా పోరాడారు. కానీ, చివరి క్వార్టర్లో ప్రత్యర్థి జట్టు పైచేయి సాధించడంతో 4-3 తేడాతో ఓటమి పాలయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Haryana Government will award Rs 50 lakhs each to the nine members of the Olympics women's hockey team who are from Haryana. I congratulate the Indian team for their praiseworthy performance at the Tokyo Olympics. — Manohar Lal (@mlkhattar) August 6, 2021 -
బీజేపీకి ఊరట: వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
చండీగఢ్: హర్యానాలో బీజేపీకి ఊరట లభించింది. రాష్ట్రంలో మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అసెంబ్లీలో విపక్షాలు చేపట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బీజేపీ-జేజేపీ కూటమికి 55 ఓట్లు రాగా.. కాంగ్రెస్కు కేవలం 32 ఓట్లు మాత్రమే లభించాయి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనను పాలక ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రైతు నిరసనల్లో వందలాది అన్నదాతలు నేలకొరుగుతున్నా ఖట్టర్ సర్కార్ చోద్యం చూస్తోందని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ మాజీ సీఎం, విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా అరోపించారు. రాష్ట్ర సరిహద్దుల్లో 250 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని వారి పేర్లను తాను అందించినా అవి వార్తా పత్రికల్లో కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తప్పుపట్టారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకూ ఒకసారి తన సర్కార్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్పైనా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ దుష్ప్రచారం సాగిస్తోందని హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ సింగ్ చౌతాలా ఆరోపించారు. చదవండి: బుర్ర పనిచేసింది.. లేదంటే.. వైరల్ -
బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం..
చండీఘడ్: హర్యానా రాష్ట్రంలో అధికార బీజేపీ కూటమి చిక్కుల్లో పడింది. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిడంతో రేపు అసెంబ్లీలో ఓటింగ్ జరుగనుంది. మొత్తం 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలుండగా, మిత్రపక్షం జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి 10 మంది శాసనసభ్యులున్నారు. బీజేపీపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోవాలి అంటే 45 మంది సభ్యుల మద్దతు అవసముంటుంది. సంఖ్యాపరంగా చూస్తే బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేనప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రానికి చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలను చేపడుతన్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలైన చోటు చేసుకోవచ్చని నిఘా వర్గాల సమాచారంతో కాషాయ కూటమి అలర్ట్ అయ్యింది. కాగా, 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అధికార కూటమికి 50 మంది శాసనసభ్యులు, కాంగ్రెస్కు 30, ఇతర పార్టీలకు 8 మంది శాసనసభ్యులున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేపు తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరుకావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విప్ జారీ చేశారు. ఇటు బీజేపీ, జేజేపీ లు కూడా విప్ జారీ చేసాయి. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని మిత్రపక్షం జేజేపీ ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
‘ఎమ్ఎస్పీ తొలగిస్తే రాజీకీయాల నుంచి తప్పుకుంటా’
చండీఘడ్: పంటలకు కల్పించే కనీస మద్ధతు ధరను(ఎమ్ఎస్పీ) ఎవరైనా రద్దు చేయాలని చూస్తే తను రాజకీయాల నుంచి తప్పుకుంటానని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాక్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడంపై రగడ కొనసాగుతున్న తరుణంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఖట్టర్ ఆదివారం మాట్లాడారు. ‘రైతులకు కనీస మద్దతు ధర ఎప్పటికీ ఉంటుంది. దానిని ఎవరైనా తొలగించాలని చూస్తే మనోహర్లాల్ ఖట్టర్ రాజకీయాల నుంచి తప్పుకుంటాడు. ఎమ్ఎస్పీ ఎప్పటికీ రద్దు కాదు. ఎమ్ఎస్పీ గతంలో ఉంది. ఇప్పుడు ఉంది. భవిష్యత్తులోనూ ఉంటుంది’ అని పేర్కొన్నారు. కాగా ద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు ఆదివారానికి 25వ రోజుకు చేరుకున్నాయి. చదవండి: బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి: అమిత్ షా చదవండి: ఈ నెల 25న రైతులతో ప్రధాని మోదీ భేటీ శనివారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను కలిసిన మరునాడు ఖట్టర్ ఈ ప్రకటన చేశారు. ‘చర్చల వల్లనే ఈ సమస్య (అన్నదాతల ఆందోళనలు ) పరిష్కారం అవుతుంది. త్వరలోనే ఈ సమస్య సమిసిపోతుందని భావిస్తున్నా. నూతన చట్టాలపై రైతులతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.’ అని కేంద్రమంత్రితో సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య మరో రౌండ్ చర్చలు జరపవచ్చని ఖట్టర్ పేర్కొన్నారు, కొత్త మూడు వ్యవసాయ చట్టాలపై తమ భయాలను మరింత వివరంగా చెప్పాలని నిరసన తెలుపుతున్న వ్యవసాయ సంఘాలను తోమర్ కోరారు. నిర్దిష్ట సమస్యలపై దృష్టి కేంద్రీకరించడానికి ఇది అవసరమని, వారి ఆందోళనలో స్పష్టత లేదన్నారు. అదే విధంగా చర్చలకు ఓ తేదీని పేర్కొనాలని మంత్రి రైతులను కోరారు. చదవండి: ‘అలా జరగకపోతే రాజీనామా చేస్తా’ మరోవైపు ఒకట్రెండు రోజుల్లో రైతుల నిరసన బృందాలతో తోమర్ చర్చలు జరిపే అవకాశం ఉందని హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. "ఎప్పుడు జరుగుతుందో సరిగా తెలియదు కాని త్వరలోనే నిరసనకారుల డిమాండ్లను చర్చించడానికి తోమర్ రైతుల ప్రతినిధులను కలుసుకునే అవకాశం ఉంది" అని షా ఆదివారం పశ్చిమ బెంగాల్లోని విలేకరుల సమావేశంలో అన్నారు. -
‘రైతుల్లో ఖలిస్థాన్ వేర్పాటు వాదులు’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం శనివారం నాడు ఢిల్లీ నగరాన్ని ముట్టడించడం పట్ల హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల ప్రదర్శనలో ‘ఖలిస్థాని’ వేర్పాటు వాదులున్నట్లు తమకు సమాచారం అందిందని ఆరోపించారు. ‘రైతుల ప్రదర్శనలో అవాంఛిత శక్తులు ఉన్నట్లు మాకు ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయి. బలమైన ఆధారాలు దొరికినాకా ఆ శక్తుల వివరాలను వెల్లడిస్తాం’ అని మీడియాతో చెప్పారు. (చదవండి : దేశ రాజధానిని తాకిన రైతుల సెగ) ‘జబ్ ఇందిరాగాంధీ కో హే కర్ సక్తే హై, తో మోది కో క్యోం నహీ కర్సక్తే (ఇందిరాగాంధీనే చేసినప్పుడు మోదిని చేయలేమా!)’ అని కొంతమంది రైతులు నినాదాలు ఇస్తోన్న ఆడియో, వీడియో క్లిప్పులు తమ వద్దకు వచ్చాయని కూడా కట్టర్ తెలిపారు. ప్రత్యేక ‘ఖలిస్థాన్’ కోసం జరిగిన వేర్పాటు ఉద్యమాన్ని నాటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ అణచి వేసిన నేపథ్యంలో 1984లో ఇందిరాగాంధీని ఆమె బాడీ గార్డులే హత్య చేయడం తెల్సిందే. రైతులు ఆందోళనలో తమ హర్యానా రాష్ట్రానికి చెందిన రైతులెవరూ లేరని, పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతులు ఉన్నారంటూ కూడా కట్టర్ ఆరోపణలు చేశారు. రైతులను పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ రెచ్చగొడుతున్నారని కూడా ఆయన విమర్శించారు. -
వారికి ప్రైవేటు రంగంలో 75% రిజర్వేషన్లు
చంఢీఘడ్: నిరుద్యోగులుకి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించేందుకు హరియాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిరుద్యోగులుకి ప్రైవేటు రంగంలో 75% రిజర్వేషన్లు ఇచ్చే బిల్లును గురువారం ఆమోదించింది. ఉప ముఖ్యమంత్రి, జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్, జానాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతం వ్యక్తం చేశారు. అయినప్పటికి ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. నెలకు 50,000 రూపాయల కన్నా తక్కువ జీతం ఉన్న ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు 75% కొత్త ఉపాధిని కల్పించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ( ఉద్యోగులకు దీపావళి కానుక : ఒక నెల బోనస్ ) ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేటు కంపెనీలు, సంఘాలు, ట్రస్టులు, భాగస్వామ్య సంస్థలు మొదలైన వాటిలో స్థానికులకు ఉపాధి దొరకనుంది. స్థానిక యువతకు ఉపాధి అవకశాలు పెంచేందుకు ఈ బిల్లు తీసుకువచ్చినట్టు ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ అన్నారు. దుష్యంత్ చౌతాలా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. "ఈ రోజు హరియాణలోని లక్షలాది మంది యువతకు ప్రైవేట్ రంగంలో 75 శాతం ఉద్యోగాలు లభిస్తాయి" అని పేర్కొన్నారు. -
బీజేపీ షాక్: రాజీనామా బాటలో డిప్యూటీ సీఎం!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పాటు ఆ పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే అకాలీదళ్ దారిలోనే మరికొన్ని ఉత్తరాది పార్టీలు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఎన్డీయే నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేజేపీ చీఫ్ దుశ్యంత్ సింగ్ చౌతాలా ప్రస్తుతం హర్యానా డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, తాము ఇక ప్రభుత్వంలో కొనసాగలేమంటూ అకాలీదళ్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. చౌతాలా మీదకూడా ఒత్తిడి పెరుగుతోంది. (కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా) కేంద్ర ప్రతిపాదిత బిల్లుపై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీలోని కొంతమంది సీనియర్లు సైతం అధిష్టానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ సీరియర్లు, ఎమ్మెల్యేలతో చౌతౌలా సమావేశం కానున్నారు. ఇక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేజేపీ నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాల కోరారు. రైతుల పక్షపాతిగా చరిత్ర కలిగిన చౌతౌలా కుటుంబం క్లిష్ల సమయంలో రైతాంగానికి అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వైదొలగాలని సూచించారు. మాజీ ఉప ప్రధాని, దేవీలాల్కు రైతు బాంధవుడిగా మంచి గుర్తింపు ఉందని, దుశ్యంత్ ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని ట్విటర్ ద్వారా అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎస్ఏడీ, విపక్ష సభ్యుల నిరసనల మధ్య వివాదాస్పద ‘ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్)’ బిల్లును, ‘ద ఫార్మర్స్(ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్’ బిల్లును గురువారం మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. (బీజేపీకి ఊహించని షాకిచ్చిన మిత్రపక్షం) ఇదిలావుండగా.. 90 స్థానాలు ఉన్న హరియాణాలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిశ్రమ ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ 40 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఫిగర్ (46)ను సొంతంగా అందుకోలేకపోయింది. దీంతో పది స్థానాలు సాధించిన దుష్యంత్ చౌతాలా కింగ్మేకర్గా అవతరించారు. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో జేజేపీ ప్రభుత్వం నుంచి వైదొలిగితే ఖట్టర్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉంది. -
హర్యానా సీఎంకు కరోనా పాజిటివ్
చంఢీగఢ్ : హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతవారం రోజుల్లో సీఎంను నేరుగా భేటీ అయిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు. కాగా దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. -
ఆ సీఎం పౌరసత్వ వివరాలు లేవు
చండీగర్ : హరియాణా ముఖ్యమంత్రి పౌరసత్వానికి సంబంధించి ఒక వ్యకి ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) ద్వారా అడిగిన సమాచారానికి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్, కేబినెట్ మంత్రులు, గవర్నర్ల పౌరసత్వానికి సంబంధించిన వివరాలు కావాలంటూ పానిపట్క చెందిన ఓ వ్యక్తి లేఖ రాశాడు. పౌరసత్వ లేఖకు సమాధానంగా హరియాణాకు చెందిన ప్రజా సంబంధాల అధికారి (పీఐఓ) స్పందిస్తూ..తమ రికార్డులలో సీఎం, మంత్రుల పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని తెలిపారు. పౌరసత్వానికి సంబంధించిన రికార్డులు ఎలక్షన్ కమిషన్ వద్ద లభ్యమవ్వచ్చని హరియాణాకు చెందిన పీఐఓ అధికారి పేర్కొన్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఎన్ఆర్సీని (జాతీయ పౌర పట్టిక) అమలు చేస్తామని సీఎం ఖత్తర్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ప్రజలు మతపరమైన హింస వల్ల హరియాణాలో నివసిస్తున్నారని..వారికి సీఏఏ ద్వారా పౌరసత్వం ఇవ్వవచ్చని గతంలో ఖత్తర్ మీడియాలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: వినూత్న నిరసన తెలిపిన పెళ్లికొడుకు -
హరియాణ సీఎంగా ఖట్టర్ పదవీ స్వీకార ప్రమాణం
-
సీఎంగా ఖట్టర్.. డిప్యూటీ సీఎం దుష్యంత్..
చండీగఢ్: హరియాణ ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ వరుసగా రెండోసారి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. హరియాణ గవర్నర్ సత్యదేవ్ ఖట్టర్తో ప్రమాణం చేయించారు. అనంతరం జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాజ్భవన్లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, జేజేపీ, శిరోమణి అకాలీ దళ్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. 90 స్థానాలు ఉన్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిశ్రమ ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ 40 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఫిగర్ (46)ను సొంతంగా అందుకోలేకపోయింది. దీంతో పది స్థానాలు సాధించిన దుష్యంత్ చౌతాలా కింగ్మేకర్గా అవతరించారు. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా జేజేపీతో బీజేపీ అక్రమపొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. -
హరియాణా: బీజేపీకి గవర్నర్ ఆహ్వానం
చండీగఢ్: హరియాణాలో బీజేపీ కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శనివారం రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఆమోదం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఆహ్వానించారు. కాగా, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా సమర్పించగా గవర్నర్ ఆమోదించారు. రాజ్భవన్లో ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు మరోసారి ముఖ్యమంత్రిగా ఖట్టర్ ఆదివారం గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేయనున్నారు. ఈరోజు జరిగిన బీజేఎల్పీ సమావేశంలో శాసనసభా పక్ష నేతగా ఖట్టర్ను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. జన నాయక జనతా పార్టీ (జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా(31) ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. దుష్యంత్ ప్రమాణ స్వీకారోత్సావానికి ఆయన తండ్రి అజయ్ చౌతాలా హాజరుకానున్నారు. టీచర్ల భర్తీ కుంభకోణంలో దోషిగా తేలిన అజయ్ ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. శనివారం ఆయనకు కోర్టు 14 రోజుల పెరోల్ మంజూరు చేసింది. కాగా శుక్రవారం సాయంత్రం బీజేపీతో పొత్తుపై అధికారిక ప్రకటన చేయడానికి ముందు దుష్యంత్ తిహార్ జైలులో ఉన్న తన తండ్రిని కలిశారు. -
హరియాణా సీఎంగా రేపు ఖట్టర్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. బీజేఎల్పీ సమావేశంలో ఆయన శాసనసభా పక్ష నేతగా శనివారం ఎన్నికయ్యారు. దీంతో ఖట్టర్ ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే గురువారం వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో హరియాణాలో ఏ పార్టీకి మెజారిటీ రాని విషయం తెలిసిందే. 90 స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లు గెలుచుకున్న జన నాయక జనతా పార్టీ (జేజేపీ)తో బీజేపీ శుక్రవారం పొత్తు పెట్టుకుంది. దీంతో ఖట్టర్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీ నేత దుశ్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఖట్టర్ ఇవాళ సాయంత్రం గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. వివాదాస్పద స్వతంత్య్ర ఎమ్మెల్యే గోపాల్ కండా మద్దతు తీసుకోవడం లేదని మరో బీజేపీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. -
‘దుష్యంత్ చౌతాలా నన్ను మోసం చేశారు’
చండీగఢ్ : జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా తనను మోసం చేశారని ఆ పార్టీ అభ్యర్థి, భారత ఆర్మీ మాజీ జవాను తేజ్ బహదూర్ యాదవ్ ఆరోపించారు. బీజేపీతో జట్టుకట్టి హరియాణా ప్రజల తీర్పును దుష్యంత్ అపహాస్యం చేశారని విమర్శించారు. బీజేపీకి జేజేపీ బీ- టీమ్లా వ్యవహరిస్తోందని.. తద్వారా ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని అన్నారు. అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 10 సీట్లు గెలుచుకుని స్థానిక జేజేపీ హరియాణా కింగ్మేకర్గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దుతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ- కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేశాయి. అనేక పరిణామాల అనంతరం తమ పార్టీ బీజేపీకి మద్దతునిస్తున్నట్లు జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ప్రకటించారు. బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిపారు. ఇక జేజేపీ అండతో మరోసారి అధికారం చేపట్టనున్న బీజేపీ.. ఆ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కేబినెట్లో తగిన ప్రాధాన్యం కల్పించనున్నట్లు సమాచారం. (చదవండి : హరియాణాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే) ఈ నేపథ్యంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్పై జేజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తేజ్ బహదూర్ దుష్యంత్ తీరుపై మండిపడ్డారు. ‘దుష్యంత్ చౌతాలా నాతో పాటు హరియాణా ప్రజలను ఘోరంగా మోసం చేశారు. బీజేపీని తీవ్రంగా విమర్శించి ఇప్పుడు అదే పార్టీకి మద్దతునిచ్చారు. బీజేపీని రాష్ట్రం నుంచి, అధికారం నుంచి తొలగించాలంటూ ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ఇక 2017లో భారత జవాన్లకు నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ సెల్ఫీ వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన తేజ్ బహదూర్ను భారత భద్రతా దళం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ(ఉత్తరప్రదేశ్)లో చేరిన ఆయన... 2019 లోక్సభ ఎన్నికల్లో యూపీ మహాకూటమి(బీఎస్పీ-ఎస్పీ-ఆర్ఎల్డీ) అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. ఈ క్రమంలో హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబరులో జేజేపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ సంపాదించారు. కర్నాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం మనోహర్లాల్పై పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. -
హరియాణాలో బీజేపీకే ‘జేజే’పీ
న్యూఢిల్లీ: హరియాణాలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడనుంది. గురువారం వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో హరియాణాలో ఏ పార్టీకి మెజారిటీ రాని విషయం తెలిసిందే. 90 స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. 10 సీట్లు గెలుచుకున్న జన నాయక జనతా పార్టీ(జేజేపీ)తో బీజేపీ శుక్రవారం పొత్తు పెట్టుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రిగా జేజేపీ నేత ఉంటారని బీజేపీ చీఫ్ అమిత్ షా, జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా శుక్రవారం సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్నే మళ్లీ సీఎంగా బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఉపముఖ్యమంత్రిగా దుష్యంత్ చౌతాలా ఉంటారని జేజేపీ వర్గాలు తెలిపాయి. హరియాణాలో రాజకీయ సుస్థిరత కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు దుష్యం త్ చౌతాలా తెలిపారు. హరియాణాలో మెజారిటీ వచ్చే అవకాశం లేదని అమిత్ షాకు ముందే సమాచారముందని, అందువల్ల ఫలితాల వెల్లడికి ముందే అమిత్షా దుష్యంత్ చౌతాలాతో మాట్లాడా రని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం శనివారం జరుగుతుందని, ఆ సమావేశానికి పరిశీలకులుగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరవుతారని బీజేపీ హరియాణా ఇన్చార్జ్ అనిల్ జైన్ వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ఖట్టర్ శనివారం గవర్నర్ను కలిసి కోరతారని, దీపావళి తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. ముందు స్వతంత్రుల మద్దతుతో.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన బీజేపీ గురువారం ఫలితాలు వెల్లడైనప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించింది. మెజారిటీకి ఆరు స్థానాలు అవసరమవడంతో.. తాజాగా గెలిచిన ఏడుగురు ఇండిపెండెంట్లతో సంప్రదింపులు జరిపింది. వారు కూడా మద్దతివ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా నివాసంలో మద్దతు లేఖను సీఎం ఖట్టర్కు అందజేశారు. స్వతంత్రుల్లో ఎక్కువమంది బీజేపీ రెబల్సే కావడం గమనార్హం. జేజేపీ మద్దతిచ్చేముందు, ఐఎన్ఎల్yీ ఎమ్మెల్యే అభయ్ చౌతాలా మద్దతూ తమకేనని బీజేపీ నమ్మకంగా ఉంది. గోపాల్ కందా మద్దతుపై అభ్యంతరం స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న సమయంలో.. హరియాణ్ లోక్హిత్ పార్టీ నేత, ఎమ్మెల్యే గోపాల్ కందా నుంచి మద్దతు తీసుకోవడంపై వివాదం నెలకొంది. పలు క్రిమినల్ కేసులున్న స్వతంత్ర ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తీసుకుని పార్టీ నైతిక విలువలకు ద్రోహం చేయవద్దని సీనియర్ నేత ఉమాభారతి పార్టీ నాయకత్వాన్ని కోరారు. వెనక్కు తగ్గని కాంగ్రెస్ కాంగ్రెస్కు చెందిన మాజీ సీఎం భూపీందర్ హుడా కూడా శుక్రవారం ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ తదితరులతో భేటీ అయ్యారు. జేజేపీ(జననాయక్ జనతా పార్టీ)తో చర్చలు జరుపుతూనే, స్వతంత్రులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్తో జేజేపీ కలిసి వచ్చినప్పటికీ మెజారిటీకి మరో ఐదుగురు సభ్యుల బలం అవసరం ఉంటుంది. ఈ పరిస్థితిపై హుడా స్పందిస్తూ.. ‘ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాల్లో మేం ఏమాత్రం వెనుకబడలేదు. స్వతంత్రులు చాలామంది మాతో కూడా టచ్లో ఉన్నారు’ అని పేర్కొన్నారు. స్వతంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించారంటూ వస్తున్న వార్తలపై హుడా స్పందిస్తూ..‘వారి గొయ్యి వారే తవ్వుకుంటున్నారు. ప్రజా విశ్వాసాన్ని కాలరాస్తున్నారు. హరియాణా ప్రజలు వారిని ఎన్నటికీ క్షమించరు. వారిని చెప్పులతో కొట్టడం ఖాయం’అని మండిపడ్డారు. -
ఢిల్లీకి రండి : ఖట్టర్కు అమిత్ షా పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో అంచనాలకు భిన్నంగా ఫలితాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ కసరత్తు చేపట్టింది. హరియాణా ముఖ్యమంత్రి మనోహల్ లాల్ ఖట్టర్ను సత్వరమే దేశ రాజధాని చేరుకోవాలని బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. 90 స్ధానాలు కలిగిన హరియాణాలో మేజిక్ మార్క్కు కొద్దిస్ధానాలు తక్కువగా 41 స్ధానాల్లోనే బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ చేరుకునే పరిస్థితి లేకపోవడంతో కింగ్ మేకర్గా అవతరించిన జేజేపీ కీలకంగా మారింది. జేజేపీని దారిలోకి తెచ్చేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలాతో మాట్లాడి ఆయనను బీజేపీకి సహకరించేలా ఒప్పించే బాధ్యతను కాషాయ నేతలు పంజాబ్ మాజీ సీఎం, అకాలీదళ్ చీఫ్ ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్లకు అప్పగించింది. హరియాణలో బీజేపీ, కాంగ్రెస్లు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సాధించే పరిస్థితి లేకపోవడంతో జేజేపీని ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. -
మోదీ ప్రాభవంతోనే వారిద్దరి గెలుపు!
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీలకు సోమవారం పోలింగ్ కొనసాగుతున్న విషయం తెల్సిందే. మొదటి సారి బీజేపీ ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న దేవేంద్ర ఫడ్నవీస్, మనోహర్ లాల్ ఖట్టర్లు, మరోసారి ముఖ్యమంత్రులుగా కొనసాగాలని కోరుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు ప్రాంతీయంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు నమూనా నాయకులు. వారేమీ ఎన్నికల ద్వారా ప్రముఖులుగా గుర్తింపు పొందిన నాయకులూ కాదు, సీఎం పదవిలో పోటీలో ఉన్న వ్యక్తులు కూడా కాదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కులానికో, వర్గానికో చెందిన వారు కూడా కాదు. అనూహ్యంగా ముఖ్యమంత్రులైన ఇరువురు ఆరెస్సెస్కు చెందిన వారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర చరిత్రలో పూర్తికాలం పాటు అధికారం కొనసాగిన రెండవ ముఖ్యమంత్రి ఫడ్నవీసే. మరాఠాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో బ్రాహ్మణ వర్గం నుంచి వచ్చిన నిలదొక్కు కోవడమే కాకుండా చాలా తెలివిగా ప్రత్యర్థులను తప్పిస్తూ వచ్చారు. చాలా తెలివిగా మాజీ మిత్రపక్షమైన శివసేనతో పొత్తు కుదుర్చుకోవడంలో విజయం సాధించారు. పార్టీలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలివిగా పరిష్కరించుకోగలిగారు. ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి ఆకర్షించగలిగారు. పార్టీలో అన్ని వర్గాలను మెప్పించగలిగిన పాపులర్ నాయకుడు కాకపోయినా కేంద్రంలోని మోదీ ప్రభావం మేరకు మనగుడ సాగిస్తూ వచ్చారు. మనోహర్ లాల్ ఖట్టర్ జాట్లు ఎక్కువగా ఉన్న హర్యానాలో పంజాబీ నాయకుడు మనోహర లాల్ ఖట్టర్ అనూహ్యంగ ముఖ్యమంత్రి అయ్యారు. పదవిలో రాణించేందుకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పంథానే అనుసరించారు. జాట్ల నాయకత్వంలోని ప్రతిపక్షాన్నే ఎదుర్కొంటూనే పాలనపై కొంత దష్టిని కేంద్రీకరించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనద్వారా కొంత మంచి పేరు తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఖట్టర్ కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రాభవంపైనే ఎక్కువగా ఆధారపడి గెలవాల్సిందే. గెలుస్తారనే విశ్వాసం ఇప్పటికే ప్రజల్లో నాటుకుపోయింది. రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాల కుమ్ములాటలు పార్టీకి కలిసి వచ్చే మరో అవకాశం. పైగా డబ్బుగల పార్టీ అవడం వల్ల ఈ ఎన్నికల్లో ఇరువురు ముఖ్యమంత్రులు భారీగానే డబ్బులు కుమ్మరిస్తున్నారు. -
జాట్లు ఎటువైపు?
హరియాణాలో 2016లో వెల్లువెత్తిన జాట్ రిజర్వేషన్ ఉద్యమం యావత్ దేశాన్నే ఒక కుదుపు కుదిపేసింది. పంజాబ్, రాజస్తాన్, ఢిల్లీలతో సహా దేశవ్యాప్తంగా 8.2 కోట్ల మంది జాట్ సామాజిక వర్గానికి చెందినవారున్నారు. ఒక్క హరియాణాలోనే వీరు 29 శాతం మంది ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అత్యధిక మంది ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. జాట్ల ఆధిపత్యంలోని హరియాణాలో తిరిగి పాగావేసేందుకు బీజేపీ ‘‘అబ్ కీ బార్ సత్తార్ పార్’ (ఈసారి 70 సీట్లను దాటాలి) అనే నినాదంతో బరిలోకి దిగింది. 18 ఏళ్ల తరువాత తొలిసారి 2014లో జాట్యేతర సామాజికవర్గం నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ అధికారం చేపట్టారు. అయితే రాష్ట్రంలో పాలకుల భవితవ్యాన్ని ఖరారుచేసే ఈ సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో ఎటువైపు నిలుస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉత్తర హరియాణా... 2014లో స్థానాలు చండీగఢ్, పంచకుల, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్ లలో బీజేపీ అత్యధిక స్థానాలు సా«ధించుకుంది. ఈ ప్రాంతంలో జాట్యేతరులదే ఆధిక్యం. బీజేపీ సామాజిక ఎత్తుగడలో భాగంగానే గత ఎన్నికల్లో ఈ ప్రాంతంపై దృష్టిసారించింది. చాలా కాలంగా గుర్తింపునకు నోచుకోని జాట్యేతర పంజాబీ భాషమాట్లాడే బనియా సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలన్న కాషాయ పార్టీ ఎత్తుగడ ఫలించింది. ఈసారి సైతం బీజేపీ విజయాన్ని కైవసం చేసుకునేందుకు ఇదే వ్యూహాన్ని ప్రయోగిస్తోంది. మాజీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సీఎం ఖట్టర్ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడని బీజేపీ ప్రకటించడం అందులో భాగమే. జాట్ బెల్ట్... ‘ఛత్తీస్ బిర్దారీస్’’ (36 సామాజికవర్గాలు) చాలా కాలంగా ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తున్నాయి. హిసార్, భివానీ, మహేంద్రఘర్, రోహతక్, ఝజ్జార్, సోనిపట్, జింద్, కైతాల్ ప్రాంతాల్లో జాట్ సామాజికవర్గం అధికం. గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న భజన్లాల్, భూపేందర్ హుడా, ఓం ప్రకాశ్ చౌతాలాలు ఇదే ప్రాంతం నుంచి గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. గతఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి పెద్దగా కలిసిరానిమాట వాస్తవం. అంతమాత్రాన ఈసారి జాట్లు బీజేపీకి ఓట్లు వేయరనడం ఒట్టిమాటేనంటున్నాయి బీజేపీ శ్రేణులు. 2014లో రోహతక్, సోనాపేట్, ఝజ్జార్లు కాంగ్రెస్కి పట్టున్న ప్రాంతాలైనప్పటికీ ఈ ప్రాంతాల్లో ఆ పార్టీ కేవలం 15 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈసారి కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్దళ్ స్థానిక పాలనాంశాలను తెరపైకి తెస్తే, బీజేపీ మాత్రం ఖట్టర్ క్లీన్ రికార్డుపైనా, ప్రధాని మోదీ ఛరిష్మానీ ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నాయి. గతంలో కేవలం జాట్లు అధికంగా ఉన్న, హుడా కుటుంబాలకు పెట్టని కోటలైన రోహతక్, సోనాపేట్ రెండు జిల్లాలకే విద్య, ఉద్యోగాలు పరిమితమయ్యాయనీ బీజేపీ అంటోంది. ఖత్తార్ ప్రభుత్వం దశాబ్దాల అనంతరం అన్ని ప్రాంతాలకూ సమాన ఉద్యోగావకాశాలు కల్పించిందన్నది బీజేపీ వాదన. ఇదే జాట్లు, జాట్ యేతర సామాజిక వర్గాల మధ్య విభజనని మరింత స్పష్టంచేస్తోంది. -
మేము స్వాగతించాం; క్షమాపణలు చెప్పండి!
చండీగఢ్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్... తమ పార్టీ అధ్యక్షురాలిపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సీఎం స్థాయిలో ఉండి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మనోహర్లాల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనీపట్లో జరిగిన ప్రచార కార్యక్రమానికి హాజరైన సీఎం మనోహర్లాల్ కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ... ‘లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు తన స్థానాన్ని గాంధీ కుటుంబేతర వ్యక్తి భర్తీ చేస్తారని చెప్పారు. ఆయన నిర్ణయాన్ని మేము కూడా స్వాగతించాం. వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడేందుకు ఇది ఉపయోగపడుతుందని భావించాం. రాహుల్ నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ వాళ్లు దేశవ్యాప్తంగా తమ నాయకుడి కోసం గాలించారు. అయితే కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న చందంగా సోనియా గాంధీనే మళ్లీ పార్టీ చీఫ్ను చేశారు’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మనోహర్లాల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ మహిళా వ్యతిరేకి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొంది. ‘బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దిగజారుడుగా, అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆయన మాటలను మేము ఖండిస్తున్నాం. మనోహర్లాల్ ఖట్టర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి’ అని ట్విటర్ వేదికగా డిమాండ్ చేసింది. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీఏ చైర్పర్సర్ సోనియా గాంధీ మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఇక అత్యధిక స్థానాలున్న యూపీలో తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆమేథీ నుంచి మరోసారి బరిలోకి దిగిన రాహుల్ బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ తరఫున ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
హరియాణాలో రాజకీయ వేడి
హరియాణాలో రాజకీయ వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అగ్రనాయకులంతా హరియాణాలో మకాం వేస్తున్నారు. దీంతో హోరాహోరీ నెలకొంది. రాష్ట్రంలో 2009 వరకు కాంగ్రెస్ హవా కొనసాగినా 2014 తొలిసారి బీజేపీ పాగా వేసింది. గత మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పదికి పది స్థానాల్లోనూ విజయఢంకా మోగించిన కమలం ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదేనని ధీమాతో ఉంది. మరోవైపు కాంగ్రెస్లో అంతర్గ కుమ్ములాటలు కూడా బీజేపీకి మరింత బలాన్నిస్తున్నాయి. అయితే కుమారి సెల్జా నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఎలాగైనా పగ్గాలు చేజిక్కించుకోవాలని కసరత్తు చేస్తోంది. ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ల మధ్యే ఉండనుంది. ‘కశ్మీర్’ పనిచేస్తుందా? బీజేపీకి తీవ్రమైన వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ ప్రజాప్రదర్శనలాంటి పలు కార్యక్రమాలు చేపట్టింది. అస్సాంలో మాదిరిగా హరియాణాలో అక్రమ వలసల నివారణకు ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కోనున్న ప్రధాన సవాల్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) నుంచే. అయితే మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలైన కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు, ముస్లిం మైనారిటీ మహిళల హక్కులను కాపాడే త్రిపుల్ తలాక్ రద్దు చట్టం ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలన్నది నిపుణుల అంచనా. హరియాణాలో 18 ఏళ్ళ తరువాత జాట్యేతరుడైన ఖట్టర్ సీఎం అయ్యారు. అయినా జాట్ల ఉద్యమాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. అయితే ఈసారి ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్న వేళ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు అలుముకున్నాయి. మోదీతో సహా బీజేపీ అగ్రనేతలంతా ప్రచారానికి దిగుతున్నారు. దీంతో అంతర్గత కుమ్ములాటలు చల్లారే అవకాశం ఉంది. భూపేందర్ స్థానమెక్కడ? హరియాణాలో 27 శాతం జాట్ సామాజికవర్గాలే ఉన్నాయి. గతంలో ఐదుగురు ముఖ్యమంత్రులు ఇదే సామాజికవర్గం నుంచి ఉన్నారు. స్వయంగా భూపేందర్ సింగ్ హుడా, అతని కుమారుడు దీపేందర్ సింగ్ హుడా సోనాపేట్, రోహతక్ల నుంచి 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. జాట్ సామాజిక వర్గం ఆధిపత్యంలోని ఈ ప్రాంతం ఒకప్పుడు భూపేందర్కి బలమైన ప్రాంతం. ఈసారి సైతం కష్టతరమేనని నిపుణులు అభిప్రాయం. కాంగ్రెస్లో లుకలుకలు రాష్ట్రంలో పునర్వైభవాన్ని తీసుకొచ్చే మాట అటుంచి, అసలు పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు అంతేలేదు. స్వయంగా రాహుల్ గాంధీయే ఏరికోరి పీసీసీ అధ్యక్షుడిని చేసిన దళిత నేత అశోక్ తన్వర్ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ పై ఈ వర్గాలు తాడోపేడో అన్నట్టున్నాయి. అంతేకాదు. ఏకంగా ఢిల్లీలో సోనియా నివాసం ముందు ధర్నాకి కూడా దిగారు. దీంతో విసిగిపోయిన శ్రేణులు బీజేపీలో చేరిపోయారు. రేపటి నుంచి రాహుల్ ప్రచారం ప్రారంభమౌతున్నా కాంగ్రెస్ని నిరాశాభావం వెంటాడుతోంది. -
కార్యకర్త తల నరికేస్తా మెడ కొసేస్తా
-
చేతిలో గొడ్డలి.. కార్యకర్త తల నరికేస్తానన్న సీఎం
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ సహనం కోల్పోయారు. ఒక కార్యకర్త తనకు కిరీటం తొడిగేందుకు ప్రయత్నించడంతో ఆయనకు కోపం వచ్చింది. ఒక చేతిలో గొడ్డలి పట్టుకున్న ఆయన.. తల నరికేస్తానంటూ సదరు కార్యకర్తపై చిందులు తొక్కారు. ఇటీవల జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది. యాత్రలో భాగంగా ఓపెన్ మినీ ట్రక్ టాప్పై నిలబడి ఖట్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త ఆయనకు గొడ్డలిని బహూకరించారు. గొడ్డలి ర్యాలీలోని ప్రజలకు చూపిస్తుండగా మరో కార్యకర్త ఆయన తలపై కిరీటం పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఖట్టర్కు ఒక్కసారిగా కోపం వచ్చింది. అంతే, సదరు కార్యకర్తను ‘మెడ కొసేస్తా నీది’ (గార్దన్ కాట్ దూంగా తేరి) అంటూ హెచ్చరించారు. ఆ కార్యకర్త చేతులు జోడించి క్షమాపణలు వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా ఈ వీడియోను షేర్ చేశారు. అయితే, ఈ వీడియోపై ఖట్టర్ స్పందిస్తూ.. కిరీటాలను తొడిగే రాజరిక సంప్రదాయానికి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చరమగీతం పాడిందని, ఎవరైనా కార్యకర్త తనకు కిరీటం తొడిగేందుకు ప్రయత్నిస్తే తనకు కోపం వస్తుందని, దానిని సహించబోనని తెలిపారు. అయితే, కోపంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఆ కార్యకర్త బాధపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
బీజేపీలోకి ప్రముఖ క్రీడాకారిణి!
న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్ బబితా ఫొగాట్, ఆమె తండ్రి మహావీర్ సింగ్ ఫొగాట్ సోమవారం బీజేపీలో చేరారు. కేంద్ర క్రీడల మంత్రి కిరెన్ రిజిజు సమక్షంలో ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ ఏడాది చివర్లో హరియాణా అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారులైన బబిత, మహావీర్ బీజేపీ గూటికి చేరారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్ నుంచి అందమైన వధువులను తెచ్చుకోవచ్చంటూ హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బబితా రెండో రోజుల కిందట సమర్థించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ ఆమె గత కొన్ని రోజులుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరుణాన్ని చూసే అదృష్టం నాకు లేకపోయింది. కానీ, ఆర్టికల్ 370, 35ఏల రద్దుతో కశ్మీర్ స్వాతంత్ర్యం పొందడాన్ని చూసే అదృష్టం దక్కినందుకు ఆనందంగా ఉంది’ అని బబిత ట్వీట్ చేశారు. అయితే, క్రీడాకారులకు హరియాణా బీజేపీ సర్కారు అందించే నగదు ప్రోత్సాహకాలు సరిగ్గా లేవంటూ ఆమె గతంలో పలుసార్లు విమర్శలు చేశారు. 2014, 2018 కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన బబిత ప్రస్తుతం ‘నాచ్ బలియే’ డ్యాన్స్ షోలో పాల్గొంటున్నారు. త్వరలో ఆమెను పెళ్లి చేసుకోనున్న సహ రెజ్లర్ వివేక్ సుహాగ్ ఈ షోలో ఆమెకు జోడీగా వ్యవహరిస్తున్నారు. మహావీర్సింగ్ ఫొగాట్, ఆయన కూతుళ్ల జీవితకథ ఆధారంగా ఆమిర్ ఖాన్ 2016లో ‘దంగల్’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. -
ఖట్టర్ వ్యాఖ్యలపై దీదీ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో రాజకీయ నాయకులు అత్యుత్సాహంతో చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ.. విమర్శల పాలవుతున్నారు. ఈ క్రమంలో శనివారం హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ‘ఇక మీదట అందమైన కశ్మీరీ యువతులను కోడళ్లుగా తెచ్చుకోవచ్చు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఖట్టర్ వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని దీదీ సూచించారు. ఈ మేరకు దీదీ ట్విటర్లో ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారు ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడాలి. అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేసి ఇతరులను బాధించకూడదు. కశ్మీరీ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిది. మీ వ్యాఖ్యలు కేవలం కశ్మీరీ ప్రజలనే కాక యావత్ దేశ ప్రజలను బాధించాయి’ అంటూ మమతా ట్వీట్ చేశారు. We,and more so people holding high public office, must restrain ourselves from making insensitive comments about the beloved people of Jammu and Kashmir. These are hurtful, not only for J&K, but the entire nation — Mamata Banerjee (@MamataOfficial) August 10, 2019 'బేటీ బచావో, బేటీ పడావో' కార్యక్రమం విజయవంతం అయిన సందర్భంగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టారియా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం అమలుకు ముందు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉండేవని చెప్పారు. 1000 మంది బాలలకు 850 నుంచి 933 మంది బాలికలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. అప్పుడు బిహరీ యువతులను కోడళ్లుగా చేసుకునే వాళ్లం అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో ఇక మీదట అందమైన కశ్మీరీ యువతులను కోడళ్లుగా చేసుకోవచ్చు అంటూ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
‘ఇక అందరి చూపు కశ్మీరీ అమ్మాయిల వైపే’
చండీగఢ్ : ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్ లోయలో ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలిస్తున్నారు. ఇక బాధ్యత గల పదవిలో కొనసాగుతున్న వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శల పాలవతున్నారు. ‘ఇక అందమైన కశ్మీరీ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు’ అని వ్యాఖ్యానించి దుమారం రేపిన యూపీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వ్యవహారం మరువక ముందే హరియాణా ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహర్షి భగీరథ జయంత్యుత్సవాల్లో పాల్గొన్న సీఎం మనోహర్లాల్ ఖట్టర్ మాట్లాడుతూ..‘మా ప్రభుత్వంలోని కొందరు మంత్రులు బిహార్ నుంచి కోడళ్లను తెచ్చుకుంటామని చెప్పేవారు. ఇకపై అలాంటి పరస్థితి ఉండదు. అందరి చూపు ఇక కశ్మీరీ అమ్మాయిల పైపే ఉంటుంది. ఆర్టికల్ 370 రద్దవడంతోనే ఇది సాధ్యమైంది. కశ్మీరీ అమ్మాయిల్ని కోడళ్లుగా, భార్యగా చేసుకునేందుకు అందరూ మొగ్గుచూపుతారు’అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భేటీ బచావో భేటీ పఢావో కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. ‘భేటీ బచావో భేటీ పఢావో’తో హరియాణాలో లింగ నిష్పత్తిలో వ్యత్యాసం తగ్గిందని అన్నారు. ఈ కార్యక్రమం అమలుకు ముందు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉండేవని చెప్పారు. 1000 మంది బాలలకు 850 నుంచి 933 మంది బాలికలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. -
యోగా డే : మ్యాట్ల కోసం డిష్యుం డిష్యుం
-
యోగా డే నాడు గందరగోళం
చండీగఢ్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హర్యానాలోని రోహ్తక్లో శుక్రవారం యోగా డే కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర సీఎం మనోహర్లాల్ ఖట్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. యోగా శరీరంతోపాటు మనసును ఆరోగ్యంగా ఉంచుతుందని, ఇది ప్రపంచాన్ని ఆరోగ్యకరమైన జీవితం వైపు నడిపిస్తోందని అన్నారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయన వివరించారు. భారతీయ ప్రాచీన సంస్కృతిలో భాగమైన యోగా మన బ్రాండ్ అంబాసిడర్గా మారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో హర్యానాలో యోగా మండలిని ఏర్పాటు చేసినందుకు మనోహర్ లాల్ను అమిత్ షా అభినందించారు. వీరితో పాటు హర్యానా మంత్రి అంజి విజ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ బరాలా తదితరులు యోగా డేలో పాల్గొన్నారు. కాగా ముఖ్య అతిథులు కార్యక్రమ ప్రాంగణాన్ని వీడిన తర్వాత అక్కడ గందరగోళం నెలకొంది. స్థానిక ప్రజలు వేదికపై యోగా మ్యాట్ల కోసం గొడవ పడ్డారు. కొంతమంది మ్యాట్లతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ తతంగాన్నంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ప్రజలు యోగా మాట్స్ కోసం ఎలా గొడవ పడుతున్నారో చూడవచ్చు. -
సీఎంతో సెల్ఫీకి యత్నం.. కంగుతిన్న కార్యకర్త!
కర్నాల్: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ మరోసారి బహిరంగంగా తన కోపాన్ని ప్రదర్శించారు. హరియాణా కర్నాల్లో ఆయన గురువారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలపై ఆయన పూలు చల్లుతుండగా.. ఓ కార్యకర్త ఆయన వద్దకు వచ్చి.. పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఫోన్ తీసి.. సీఎం ఎదురుగా పెట్టి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. కార్యకర్త సెల్ఫీయత్నం సీఎం ఖట్టర్కు తీవ్ర కోపం తెప్పించింది. అతని సెల్ఫీ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ.. సెల్ఫోన్ పట్టుకున్న చేతిని గట్టిగా తోసేసి.. అతనిపై కోపం ప్రదర్శించారు. దీంతో ఆ యువకుడు నిరాశగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. అనంతరం సీఎం కట్టర్ యధావిధిగా ప్రజలపై పూలు చల్లుకుంటూ వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
కార్యకర్తపై కోపాన్ని ప్రదర్శించిన హరియాణా సీఎం
-
రేప్ కేసులపై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయమై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 80 నుంచి 90 శాతం రేప్, ఈవిటీజింగ్ కేసుల్లో బాధిత మహిళలు, నిందితులు ఒకరికొకరు తెలిసినవాళ్లే.. పలు కేసుల్లో వారు చాలాకాలంగా తెలిసినవారే. వారి మధ్య ఏదైనా సమస్య వచ్చి వాగ్వాదం జరిగినప్పుడే.. తనపై లైంగిక దాడి చేశారంటూ మహిళలు కేసులు పెడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘రేప్కేసులు పెరగలేదు. గతంలో జరుగుతూ ఉండేవి. ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ ఆ ఘటన పట్ల ఆందోళనే ఇప్పుడు పెరిగింది’ ఆయన చాలా తేలిగ్గా వ్యాఖ్యలు చేశారు. పంచకుల జిల్లా కల్కా పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత సెప్టెంబర్లో హరియాణ రెవారి జిల్లాలో 19 ఏళ్ల అమ్మాయిని అపహరించి.. గ్యాంగ్రేప్కు పాల్పడిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఇదే జిల్లాలో పాఠశాల నుంచి తిరిగొస్తున్న ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. రాష్ట్రంలో నిత్యం ఇలా అత్యాచారాలు వెలుగుచూస్తున్నా.. ఈ దారుణాలపై సీఎం ఖట్టర్ నిర్లక్ష్య ధోరణిలో వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
రేపిస్టులకు సంక్షేమ పథకాలు కట్..!
చండీగఢ్ : హరియాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యాచార కేసుల్లో నిందితులకు సంక్షేమ పథకాలను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం వారికి రేషన్ మినహా మిగత ప్రభుత్వ పథకాలు నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ గురువారం వెల్లడించారు. అందులో భాగంగా వారి వృద్ధాప్య ఫింఛన్, వికలాంగ ఫింఛన్, డ్రైవింగ్ లైసెన్స్, ఆయుధ లైసెన్స్లను తొలుత తాత్కాలికంగా రద్దు చేస్తారు. ఒకవేళ కోర్టులో వారు దోషిగా తెలితే వాటిపై పూర్తి నిషేధం విధిస్తారు. కాగా రేషన్ మాత్రం యథాతదంగా కొనసాగుతోంది. ఇంకా ఖట్టర్ మాట్లాడుతూ.. మహిళల రక్షణ, భద్రత కోసం ఓ సమగ్ర పథకాన్ని ఆగస్టు 15న గానీ, రక్షా బంధన్(ఆగస్టు 26)న గానీ ప్రారంభించనున్నట్టు తెలిపారు. అత్యాచార బాధితులు తమ తరపున ఇష్టమైన లాయర్ను నియమించుకునేందుకు వారికి 22,000 రూపాయల ఆర్థిక సహాయం అందివ్వనున్నట్టు ప్రకటించారు. అత్యాచార, ఈవ్టీజింగ్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసేలా రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు జారిచేయనున్నట్టు తెలిపారు. అత్యాచారం కేసు విచారణ నెల రోజుల్లో, ఈవ్టీజింగ్ కేసు విచారణ 15 రోజుల్లో పూర్తిచేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలో 6 పాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. -
ఆటగాళ్ల ఫైర్ : పునరాలోచనలో హర్యానా ప్రభుత్వం
చండీగఢ్ : క్రీడాకారుల సంపాదనలో మూడోవంతును ప్రభుత్వానికి ఇవ్వాలని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోహర్ లాల్ ఖత్తర్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ నోటీఫికేషన్ జారీచేయవద్దని సంబంధిత క్రీడా మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ మీడియాకు తెలిపారు. తమ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తాము గర్వంగా ఫీలవుతున్నామని, వారి సమస్యలను పరిగణలోకి తీసుకొని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల్లో ఉన్న అథ్లెట్లు వృత్తిపరమైన క్రీడలతో పాటు వాణిజ్యపరమైన ఆదాయంతో సహా లెక్కగట్టి.. మొత్తం సంపాదనలో మూడవ వంతు సొమ్మును క్రీడా మండలికి చెల్లించాలని ఏప్రిల్ 30 న హర్యానా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అథ్లెట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని ఒలింపిక్ పతాక విజేత సుశీల్ కుమార్, ఫోగట్ సిస్టర్స్ తప్పుబట్టారు. ఆటగాళ్లపై ప్రభుత్వం మరో భారాన్ని మోపడం సరికాదన్నారు. ఈ నోటీఫికేషన్ విడుదల చేసేముందు ప్రభుత్వం తమతో చర్చించాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ నోటిఫికేషన్ను ఆ రాష్ట్ర బీజేపీ నేత జవహార్ యాదవ్ వెనకేసుకొచ్చారు. అథ్లెట్లు క్రీడల్లో గెలిచిన ప్రైజ్ మనీని ఇవ్వమనడం లేదని, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వాణిజ్య ప్రకటనల ద్వారా ఆర్జిస్తున్నారో వారినే ఇవ్వమంటున్నామని తెలిపారు. -
అథ్లెట్లకు హర్యానా షాక్
చండీగఢ్: హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయంతో క్రీడాకారులు షాక్కు గురయ్యారు. రాష్ట్రంలోని క్రీడాకారులు సంపాదించిన మొత్తంలో మూడో వంతును ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. వృత్తిపరమైన క్రీడలతో పాటు వాణిజ్యపరమైన ఆదాయంతో సహా లెక్కగట్టి.. మొత్తం సంపాదనలో మూడవ వంతు సొమ్మును క్రీడా మండలికి చెల్లించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. అథ్లెట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అథ్లెట్లు ప్రొఫెషనల్ స్పోర్ట్స్, కమర్షియల్ ఎండార్స్మెంట్స్లలో పాల్గొనే సమయంలో సదరు నిబంధనలను అంగీకరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో క్రీడాకారులకు అసాధారణ సెలవును (వేతనం ఇవ్వరు) ఇస్తారు. పోటీల ద్వారా సంపాదించిన మొత్తంలో మూడో వంతును హర్యానా రాష్ట్ర స్పోర్ట్స్ కౌన్సిల్ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనిని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి వినియోగిస్తాం అని ఏప్రిల్ 30 న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ముందస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవుపై వెళ్లి ఈవెంట్ లేదా వాణిజ్య ప్రకటనల షూటింగ్లో పాల్గొంటే.. వాటి ద్వారా వచ్చే సంపాదన మొత్తాన్నీ క్రీడా మండలి దగ్గర డిపాజిట్ చేయాల్సిందేనని కొత్త నిబంధన కూడా విధించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై క్రీడాకారులు మండిపడుతున్నారు. హర్యానా క్రీడాకారులు రెజ్లింగ్, బాక్సింగ్లలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
సీఎం తీవ్ర వ్యాఖ్యలు.. దుమారం
చండీగఢ్ : దేశంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నా ప్రభుత్వాల్లో మాత్రం చలనం ఉండటం లేదు. రైతన్నల బాధలు, కష్టాలపై సోషల్ మీడియాలో తరచుగా పోస్టులు చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ రైతులపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఖట్టర్ తీరును నెటిజన్లు తప్పుపడుతూ ట్వీట్లు, కామెంట్లు చేస్తున్నారు. రైతులు దీక్షలు చేయడంపై శుక్రవారం సీఎం ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ.. వాస్తవంగా రాష్ట్ర రైతులకు ఎలాంటి సమస్యలు లేవు. వారు అనవసర విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. పండించిన పంటను రైతులు అమ్ముకోకపోవడం వల్లే వారికి నష్టాలొస్తున్నాయని చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉంటే రైతులకు ఎప్పటికీ మంచి రోజులు రావంటూ బీజేపీ సీఎంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రైతులపై సీఎం తీవ్ర వ్యాఖ్యలు..
-
సీఎంపై ఇంకు దాడి
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్పై ఇంకు దాడి జరిగింది. ఈ ఘటన హిస్సార్లో చోటుచేసుకుంది. గురువారం రోడ్ షోలో పాల్గొన్న ఖట్టర్పై ఓ యువకుడు ఇంకు పోశాడు. ఊహించని పరిణామంతో ఖంగుతిన్న ముఖ్యమంత్రి, సెక్యూరిటీ సిబ్బందిపై మండిపడ్డారు. తాను ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ) కార్యకర్తనంటూ నినాదాలు చేస్తున్న ఆ యువకున్ని సీఎం సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే, ఘటనానంతరం ఖట్టర్ తన చేతి రుమాలుతో ముఖంపై పడిన ఇంకుని తుడుచుకొని రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం దేవీ భవన్లాల్ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఆర్థిక మంత్రి అభిమన్యుతో కలిసి పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రికే సరైన భద్రత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ‘యువకున్ని అదుపులోకి తీసుకున్నాం. అతను ఏ పార్టీకి చెందిన వాడో తెలియాల్సి ఉంది’ అని హిస్సార్ జిల్లా ఐజీ సంజయ్ కుమార్ తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రికి విలేకరులు, కెమెరామెన్లు దూరంగా ఉండాలని గత సంవత్సరం సోనిపట్ జిల్లా యంత్రాంగం పత్రికా ప్రకటన విడుదల చేయడం గమనార్హం. -
నమాజ్ : మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
హర్యానా: మసీదులు, ఈద్గాలు, ఇతర గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే నమాజ్ చేయాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీఎం ఇలా వ్యాఖ్యలు చేసి ఒక్క రోజు కూడా గడవకముందే ఆయన కేబినెట్లోని మరో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖాళీ ప్రదేశాలను ఆక్రమించే పేరుతో నమాజ్ చేయడం సరికాదని, ఆ ఉద్దేశంతో నమాజ్ చేస్తే అనుమతించేదిలేదని మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. గత రెండు వారాలుగా గుర్గావ్లో ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడంపట్ల హిందూ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడం నిషేధించాలని ఆర్ఎస్ఎస్, భజరంగ్దళ్ లాంటి పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ తన్వార్ స్పందించారు. మతపరమైన, సాంఘిక కార్యక్రమాలు అనేక ప్రదేశాల్లో జరుగుతాయని, దానికి సరిపడ స్థలం లేని సందర్భంలో బహిరంగ ప్రదేశాలను ఉపయోగించుకోవడంలో తప్పులేదని అన్నారు. ముఖ్యమంత్రి అన్నివర్గాల ప్రజలను సమానంగా చూడట్లేదని, కుల, మత ప్రతిపాదికన విభజించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతపరమైన భావాలతో కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టి, మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. -
11న గుర్గావ్లో ఏమవుతుంది?
సాక్షి, న్యూఢిల్లీ : హర్యానాలోని గుర్గావ్లోని సహారా మాల్ వద్ద గత శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు దాదాపు మూడు వందల మంది ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి ఉద్యుక్తులవుతుండగా, నాలుగు కార్లలో దాదాపు 20 మంది యువకులు కర్రలు ధరించి రయ్మంటూ దూసుకువచ్చారు. అక్కడ ముస్లింలు ప్రార్థనలు చేయవద్దంటూ ఆ యువకులు కర్రలు ఝుళిపిస్తుండగా అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డగించి, ముస్లింలను అక్కడి నుంచి తక్షణం వెళ్లిపోవాల్సిందిగా అదేశించారు. ముస్లింలు ఆరోజు అక్కడ ప్రార్థనలు చేయకుండానే ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోయారు. గత మూడేళ్లుగా సహారా మాల్ వద్ద ఖాళీగా ఉన్న ప్రదేశంలో ముస్లింలు నిరాటంకంగా ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఈసారి వారికి అనుకోకుండా అవాంతరం ఏర్పడింది. గుర్గావ్లో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో దాదాపు నగరంలోని దాదాపు 96 బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు జరుపుతారు. ఆ రోజు అంటే, శుక్రవారం నాలుగవ తేదీ నాడు దాదాపు పది బహిరంగ ప్రదేశాల్లో ముస్లింల ప్రార్థనలు జరుపుకోకుండా హిందూ యువకులు అడ్డుకున్నారు. వాటిలో సెక్టార్ 29, సెక్టార్ 53 ప్రాంతాలు కూడా ఉన్నాయి. సెక్టార్ 29లో గత 15 ఏళ్లుగా నిరాటంకంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకుంటుండగా, సెక్టార్ 53లో గత 13 ఏళ్లుగా ముస్లిలు ప్రార్థనలు చేసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు జరపరాదని, ప్రార్థనలను మసీదులకే పరిమితం చేయాలని ‘సంయుక్త్ హిందూ సంఘర్ష్ సమితి’ ఇచ్చిన పిలుపు మేరకు ఆరోజు ప్రార్థనలను హిందూ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సంఘర్ష్ సమితిలో ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషద్, భజరంగ్ దళ్, శివసేన, హిందూ జాగారణ్ మంచ్, అఖిల భారతీయ హిందూ క్రాంతి దళ్ సహా 12 హిందూ సంఘాలు ఉన్నాయి. ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు జరిపే బహిరంగ ప్రదేశాల్లో 500 నుంచి 1500 మంది ఒకేసారి ప్రార్థనలు జరపవచ్చు. గుర్గావ్లో మొత్తం 21 మసీదులు ఉన్నాయి. 300 మందికి మించి ఏ మసీదులో ఒకేసారి ప్రార్థనలు జరుపుకునే పరిస్థితి లేదు. సంయుక్త్ హిందూ సంఘర్ష్ సమితి ఆందోళనకు మద్దతుగా రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా మాట్లాడారు.మసీదులు, ఈద్గాలు, ఇతర గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు ప్రార్థనలు జరుపుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి సూచనను కూడా ఎందుకు పాటించరని 29వ సెక్టార్లోని 42 ఏళ్ల యువకుడు నౌషాద్ అలీని మీడియా ప్రశ్నించగా, తాము పనిచేసిన చోటుకు సమీపంలో మసీదు లేదని, ఎక్కడో ఉన్న మసీదు వద్దకు వెళ్లి తిరిగి రావడానికి తనకు మూడు గంటల సమయం పడుతుందని చెప్పారు. తన యజమాని మధ్యాహ్నం భోజనం కోసం గంటకు మించి సమయాన్ని అనుమతించరని, ఏ యజమాని మాత్రం మూడు గంటలు అనుమతిస్తారని అలీ వ్యాఖ్యానించారు. ఓ హిందూ యజమాని వద్దనే అలీ వెల్డర్గా పనిచేస్తున్నారు. ఆ ప్రాంతంలో చిన్నా, పెద్ద కంపెనీలన్నీ హిందువులవే. వారి వద్ద ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ముస్లిం యువకులే ఎక్కువగా పనిచేస్తున్నారు. ఫరీదాబాద్ చౌక్ వద్ద మొన్న ప్రార్థనలను పోలీసులు అనుమతించలేదని, అనుమతించకపోవే ఏం చేయాలో అర్థం కావడం లేదని మొహమ్మద్ గుల్షాద్ అనే యువకుడు ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలోని మీరట్ నుంచి వచ్చిన ఆయన కూడా వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నారు. ఎప్పుడైనా తాము పోలీసుల అనుమతితోనే బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు జరిపేవారమని, అయితే ఎప్పుడు లిఖితపూర్వకంగా అనుమతి ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇదే విషయమై పోలీసు అధికారులను మీడియా సంప్రతించగా, లిఖితపూర్వక అనుమతి అంటూ తాము ఎప్పుడూ ఇవ్వమని, అలాంటి అనుమతి కావాలంటే పౌర ఉన్నతాధికారుల నుంచి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇదే విషయమై ఉన్నత పౌర అధికారలను ప్రశ్నిస్తే బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు ప్రార్థనలు జరపడం ముఖ్యమంత్రికే ఇష్టం లేనప్పుడు తాము మాత్రం ఎలా అనుమతి ఇవ్వగలమని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే శుక్రవారం ఏమవుతుందోనని పలువురు ముస్లిం యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో హిందూ ఓటర్ల సమీకరణకు ఆరెస్సెస్ లాంటి సంస్థలు ఇలాంటి కుట్ర పన్ని ఉండవచ్చని కొందరు ముస్లిం యువకులు అనుమానం వ్యక్తం చేశారు. -
నమాజ్ రోడ్ల మీద చెయ్యడమేంటి?
ఛండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నమాజ్ అనేది మసీదుల్లో, ఈద్గాల్లో చేయాలని కానీ, బహిరంగ ప్రదేశాల్లో కాదని ఆయన వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని.. బహిరంగ ప్రదేశాల్లో నమాజు పేరిట ఉద్రిక్తతలను రేకెత్తిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. శనివారం ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, గురుగావ్ ప్రాంతంలో వారం క్రితం బహిరంగ ప్రదేశాల్లో నమాజ్లు చేస్తున్న వారిని హిందూ సంస్థలు అడ్డగించాయి. జై శ్రీరామ్ నినాదాలతో వారికి అంతరాయం కలిగించాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారగా.. ఇప్పుడు సీఎం ఖట్టర్ స్పందించారు. ‘శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వంగా మా బాధ్యత. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. అది మంచిది కాదు. రోడ్ల మీద కాకుండా మసీదుల్లోనే నమాజు చేసుకోవటం వారికి మంచిది. అలాకాకుండా వ్యవహరిస్తే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని ఖట్టర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు హర్యానాలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కాగా, గుర్గావ్ ఘటనకు కొన్ని రోజుల ముందు సెక్టార్ 53లోని రెండు గ్రామాల్లో కొందరు ముస్లింలను గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేకుండా ప్రతీ శుక్రవారం పెద్ద సంఖ్యలో ముస్లింలు నమాజ్ చేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే నమాజ్లను భగ్నం చేశారంటూ తమకు ఎక్కడా ఫిర్యాదు అందలేదని గుర్గావ్ పోలీసు అధికారులు తెలిపారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడం తమ బాధ్యతని, ప్రార్థనలు ఎక్కడ నిర్వహించాలనేది జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయిస్తుందని వారు పేర్కొన్నారు. -
తల్లిదండ్రుల వివరాలు తెలిస్తేనే..
చండీగఢ్ : హర్యానా ప్రభుత్వం విద్యార్థుల స్కూల్ అడ్మిషన్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే 100 పాయింట్లతో కూడిన దరఖాస్తుని పూర్తి చేయాలని మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో వివాదం ఏముందని అనుకుంటున్నారా.. అందులోని అంశాలని పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. మాములుగా పిల్లల్ని పాఠశాలలో చేర్పించాలంటే వారి తల్లిదండ్రుల పేర్లు, చిరునామా సమర్పిస్తే సరిపోతుంది. కానీ హర్యానాలో పిల్లల తల్లిదండ్రులు చట్టవిరుద్ధ వృత్తిలో కొనసాగుతున్నారా, ఆదాయం, పన్ను చెల్లింపుల సంబంధించిన ప్రశ్నలను అప్లికేషన్ ఫామ్లో పొందుపర్చారు. అంతేకాకుండా ఆధార్ నంబర్లు, విద్యార్హతలు, మతం, కులం, జన్యుపరమైన లోపాలు వంటివి కూడా దరఖాస్తులో పేర్కొనాలి. హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ చర్యపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ ప్రభుత్వం ప్రజల కుల, మత వివరాలు సేకరించడంలో మునిగిపోయిందని ఆ పార్టీ సీనియర్ నేత రణ్దీప్సింగ్ సూర్జేవాలా ట్విటర్లో ఆరోపించారు. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పిల్లలతో పాటు తల్లిదండ్రులపై నిరంతరం నిఘా ఉంచడానికే అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఈ నిబంధనను వెనక్కి తీసుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘ఢిల్లీ రికార్డ్ను బద్ధలు కొడతాం’
హరియాణా : ఢిల్లీలో మాదిరిగానే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం హిసర్లో కేజ్రీవాల్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి.. గతంలో ఢిల్లీలో నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేస్తాం. గత యాభైఏళ్లుగా హరియాణాను అభివృద్ధి చేయటంలో పాలకులు విఫలమయ్యారు. పుట్టినగడ్డ రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించండి’ అని ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. ఢిల్లీలో తన పాలనలో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను అభివృద్ధి చేశానని, ఒక్క అవకాశం ఇస్తే హరియాణాలోనూ అదే అభివృద్ధిని చేపడతాని ఆయన అన్నారు. హరియాణా ప్రభుత్వం ప్రజల మధ్య మతఘర్షణలను పోత్సహిస్తోందని సీఎం మనోహర్లాల్ ఖట్టర్ను ఉద్దేశించి కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ అవినీతితో విసిగిపోయిన హరియాణా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. కానీ, బీజేపీ కూడా అదే అడుగుజాడల్లో నడుస్తోంది. కాబట్టి, మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి’ అని ఆయన ప్రజలను కోరారు. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ.. రైతులను ఆదుకోవడంలో విఫలమైందని.. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
హరియాణాలో మరో ఘోరం
ఫతేహాబాద్ : ‘కురుక్షేత్ర నిర్భయ’ ఘటనపై ఆందోళనలు చల్లారకముందే హరియాణాలో మరో ఘోరం జరిగింది. ఫతేహాబాద్ జిల్లా భుథాన్ గ్రామంలో 20 ఏళ్ల యువతిపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై ఇద్దరు యువకులు దాడిచేసి, పారిపోయారు. ఈ ఘటనపై ఫతేహాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. ఎస్హెచ్వో బీమ్లాదేవి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. సీఎం స్పందన : రాష్ట్రంలో వరుసగా జరుగుతోన్న హత్యలు, అత్యాచారా ఘటనలపై ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ స్పందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారంటూ ముగ్గురు ఐజీ స్థాయి అధికారులపై బదిలీవేటు వేశారు. వేధింపులపై ఫిర్యాదుచేయాలనుకునే మహిళలు 1090 లేదా 100 నంబర్కు ఫోన్ చేయాలని సీఎం ఖట్టర్ సూచించారు. -
హరియాణాలో ‘గీత’ కుంభకోణం!
చండీగఢ్: గత ఏడాది హరియాణాలోని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం అట్టహాసంగా ‘అంతర్జాతీయ గీత మహోత్సవా’న్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం ఖట్టర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని అతిగా దుబారా చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం పది ‘భగవద్గీత’ గ్రంథాలను కొనుగోలు చేసేందుకు రూ. 3.8 లక్షలు ఖర్చుచేసినట్టు తాజాగా ఓ ఆర్టీఐ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానంగా తెలిపింది. గీత మహోత్సవంలో పాల్గొన్న వీవీఐపీలకు కానుకగా అందజేసేందుకు ఈ పది భగవద్గీతలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. బయట మార్కెట్లో సాధారణంగా రూ. 150-200లకు ’భగవద్గీత’ గ్రంథాలు లభిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం భారీగా ఖర్చుచేసి వీటిని కొనుగోలు చేయడం విమర్శలకు తావిస్తోంది. వీఐపీలకు అందజేసేందుకు ఖరీదైన కాగితంతో తాళపత్ర గ్రంథాల తరహాలో ఉండేలా వీటిని రూపొందించామని, అందుకే ఇంత ఖర్చు అయిందని ఖట్టర్ సర్కారు చెప్తోంది. అంతర్జాతీయ గీత మహోత్సవానికి రూ. 4.32 కోట్లు ఖర్చు చేశామని ఖట్టర్ సర్కారు ఓ ఆర్టీఐ ప్రశ్నకు వెల్లడించగా.. అనధికారికంగా ఈ ఉత్సవానికి రూ. 15 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు పెట్టిందని, ప్రజాధనం ఖర్చు చేసే విషయంలో పారదర్శత ఏమాత్రం పాటించడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
‘వాళ్లకూ.. విద్యార్హత ఉండాలి’
సాక్షి, చండీగఢ్ : ప్రజాప్రతినిధులకు కనీస విద్యార్హత ఉండాలని కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అక అడుగు ముందుకేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతను నిర్ణయించాలంటూ.. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. పంచాయితీ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసే వారికి విద్యార్హతను నిర్ణియించాలని కోరుతూ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. పంచాయితీరాజ్ ప్రతినిధులకు కనీస విద్యార్హత లేకపోవడం వల్ల అభివృద్ధి, ఇతర కార్యక్రమాల్లో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన లేఖలే తెలిపారు. -
జర్నలిస్టులూ.. సీఎంకు కొంచెం దూరంగా ఉండండమ్మా..!
న్యూఢిల్లీ: జర్నలిస్టులు ప్రతిసారీ ముఖ్యమంత్రిని చుట్టుముట్టి.. ఆయనకు అత్యంత దగ్గరగా వస్తున్నారు. కెమెరాలు, మైక్రోఫోన్లు సీఎంకు ఇలా దగ్గరగా తీసుకురావడం భద్రత్రాపరంగా ముప్పే. కాబట్టి జర్నలిస్టులు ముఖ్యమంత్రికి తగినంత దూరం పాటించాలంటూ సోనిపట్ జిల్లా అధికార యంత్రాంగం ఒక నోటిఫికేషన్ జారీచేసింది. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మీడియాతో మాట్లాడేటప్పుడు.. జర్నలిస్టులు, కెమెరామేన్ ఆయనకు కొంత దూరంగా ఉండాలని సూచించింది. సీఎం ఖట్టర్ మీడియాతో మాట్లాడేటప్పుడు లేదా, ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగేటప్పుడు.. జర్నలిస్టులు అత్యంత చేరువగా వస్తున్నారని, దీంతో ఈ సమయంలో సీఎంకు రక్షణ కల్పించడం భద్రతా సిబ్బందికి కష్టంగా మారుతోందని ఈ నోటిఫికేషన్లో అధికారులు పేర్కొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా, సీఎం బైట్ తీసుకునే సమయంలో జర్నలిస్టులు, కెమెరామేన్ మైకులు, కెమెరాలతో ఖట్టర్కు అత్యంత చేరువుగా వస్తున్నారని, భద్రతాపరంగా ఇలా రావడం సరికాదని తెలిపారు. కాబట్టి ఇకనైన సీఎం ఖట్టర్కు తగినంత దూరంలో ఉండి మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడాలని, భద్రతా విషయంలో రాజీపడబోమని అధికారులు పేర్కొన్నారు. -
ఇద్దరు సీఎంల అత్యవసర భేటీ
చండీగఢ్: లైంగిక వేధింపుల కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్కు సీబీఐ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించడంతో హరియణా, పంజాబ్ ముఖ్యమంత్రులు అప్రమత్తమయ్యారు. తీర్పు వెలువడిన వెంటనే చండీగఢ్లోని తన నివాసంలో హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఉన్నతాధికారులు, బీజేపీ నాయకులు, మంత్రులతో చర్చించారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆందోళనలకు అవకాశం ఇవ్వరాదని ఖట్టర్ ఆదేశించారు. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని, అవాంఛనీయ సంఘటనలను అదుపు చేసేందుకు భద్రతాదళాలు సిద్ధంగా ఉన్నాయని అమరీందర్ సింగ్ తెలిపారు. గుర్మీత్ రాం రహీమ్ సింగ్కు కోర్టు విధించిన శిక్షను ప్రజలు ఆమోదించాలని, శాంతిని కాపాడాలని ఆయన కోరారు. మరోవైపు రోహతక్లోని సునారియా జైలు పరిసరాల్లో భద్రతను కట్టు దిట్టం చేశారు. కాగా, హరియాణాలోని సిర్సాలో డేరా సచ్ఛా సౌదా మద్దతుదారులు రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులు మరిన్ని విధ్వంసాలకు పాల్పడకుండా చూసేందుకు సైనిక దళాలు సిర్సాలో కవాతు నిర్వహించాయి. -
సీఎం ఖట్టర్ తొలగింపు: బీజేపీ క్లారిటీ
న్యూఢిల్లీ: గుర్మీత్ రాం రహీం సింగ్ మద్దతుదారుల విధ్వంసం నేపథ్యంలో హరియాణ ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్పై బీజేపీ అధిష్టానం వేటు వేయనుందని వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. హరియాణ సీఎంగా ఖట్టర్ను తొలగించే ప్రసక్తే లేదని బీజేపీ అధినాయకత్వం స్పష్టం చేసింది. హరియాణ బీజేపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ అనిల్ జైన్, సీనియర్ నేత కైలాశ్ విజయ్వార్గియాతో భేటీ అయిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా తాజా విధ్వంసం నేపథ్యంలో ఖట్టర్ను ఢిల్లీకి పిలిపించి.. వివరణ కోరే అవకాశం కూడా లేదని షా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్కు రేప్ కేసులో శిక్షపడటంతో ఆయన మద్దతుదారుల దాడులు, విధ్వంసంతో హరియాణ అట్టుడికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హింస తలెత్తడంతో హైకోర్టు సైతం సీఎం ఖట్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పంచకుల తగలబడుతున్న చూస్తూ మిన్నకుండిపోయారని ఖట్టర్ను హైకోర్టు మందలించింది. అయినప్పటికీ ఖట్టర్పై చర్య తీసుకోరాదని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. డేరా స్వచ్ఛ సౌదాకు భారీ మద్దతు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున హింస తలెత్తకుండా ఖట్టర్ ప్రభుత్వం నియంత్రించగలిగిందని షా అభిప్రాయపడినట్టు సమాచారం. -
కొడుకు తప్పు చేస్తే.. తండ్రిని శిక్షించాలా?
హిస్సార్ (హరియాణ): తన కొడుకు ఓ యువతిని వెంటాడి వేధించిన కేసులో విపక్షాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న బీజేపీ హరియాణ చీఫ్ సుభాష్ బరాలాకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అండగా నిలిచారు. కొడుకు తప్పు చేస్తే తండ్రిని శిక్షించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. 'ఈ కేసు గురించి నాకు తెలిసింది. చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారు చర్య తీసుకుంటారని నేను భావిస్తున్నా. ఇది సుభాష్ బారాలకు సంబంధించిన విషయం కాదు. ఒక వ్యక్తికి సంబంధించింది. ఆయన కొడుకుకు వ్యతిరేకంగా చర్య తీసుకుంటాం' అని సీఎం విలేకరులతో తెలిపారు. యువతిపై వేధింపుల కేసులో సుభాష్ బరాలా కొడుకు వికాస్ బరాలాతోపాటు అతని స్నేహితుడ్ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చండీగఢ్లో ఓ యువతి శుక్రవారం రాత్రి కారులో తన ఇంటికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న వికాస్ తన స్నేహితుడు ఆశిష్తో కలిసి తమ ఎస్యూవీ వాహనంలో వెంబడించారు. కారు ఆపాలని యువతిని పదే పదే హెచ్చరించారు. దీంతో ఆమె ఏ మాత్రం భయపడకుండా పోలీస్ హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేసి విషయాన్ని తెలిపింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోగా ఆమెను నిలువరించి మరీ ఆ ఇద్దరూ వేధించారు. దీంతో పోలీసులు సంఘటనాస్థలంలోనే వికాస్ను, ఆశిష్ను అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ చీఫ్ సుభాష్ బరాలాపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఆయనను బీజేపీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
గో రక్షణకు హర్యానా సీఎం ముందడుగు
చండీగఢ్: బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యాక దేశంలో పరిస్థితులు మారుతున్నాయి. యూపీ సీఎం యోగి కబేళాలు మూయించడం, గోవధను నిషేధించడంతో మరికొన్ని రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తున్నాయి. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. ఆవులను రక్షించకుండా బయట వదిలేస్తే ఆ మూగజీవుల యజమానులు జరిమానా కట్టాల్సి ఉంటుందని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. పాల ఉత్పత్తిని ఇవ్వని ఆవుల విషయంలోనూ తాను కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. సోమవారం అన్ని జిల్లాల ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం ఖట్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆవులను గోశాలలు, పాకలలో కట్టివేయకుండా వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా నడుచుకునే వాటి యజమానులు ఇకనుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆవులను గోశాలలో ఉంచి వాటి ద్వారా ఎన్నో ఉత్పత్తి చేయవచ్చునని, ఉత్పత్పి ఆగిపోయినా తదితర మార్గాలు ఆన్వేషించాలని అధికారులకు సూచించారు. సహకార సంఘాల సహకారంతో గో ఉత్పత్తులు విక్రయించాలని చెప్పారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఆవుల రక్షణకు పటిష్ట రక్షణకు చర్యలు చేపట్టాలని హర్యానా సీఎం ఆదేశించారు. -
నివేదిక ప్రకారమే ‘వాద్రా’పై చర్య
చండీగఢ్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కంపెనీలకు భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ధింగ్రా కమిటీ నివేదిక ప్రకారమే చర్యలు తీసుకుంటామని హరియాణా సీంఎ మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయన్న కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చారు. 2008లో జరిగిన భూ కేటాయింపుల వ్యవహారంలో వాద్రాపై కమిటీ నేరాభియోగాలు మోపిందని మీడియాలో వార్తలు రావడంతో ఆయనస్పందించారు. వాద్రా కంపెనీలకు లబ్ధిచేకూర్చడానికి కుట్ర జరిగిందని కమిటీ నిర్ధారించినట్లు ఓ దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. వాద్రా కొన్న ఆస్తులపైనా విచారణ జరపాలని కమిటీ నిర్ణయించినట్లు వెల్లడించింది. మరోవైపు, తన భర్త వ్యాపార లావాదేవీలతో తనకేం సంబంధంలేదని వాద్రా భార్య ప్రియాంక గాంధీ ప్రకటించారు. డీఎల్ఎఫ్ నుంచి స్వీకరించిన సొమ్ము నుంచి తన భార్య ఫరీదాబాద్లో ఆస్తులు కొన్నారా అని వాద్రాను విలేకర్లు ప్రశ్నించడంపై ప్రియాంక కార్యాలయం స్పందించింది. వాద్రా కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీకి భూ కేటాయించడానికి ఆరేళ్ల క్రితమే ప్రియాంక ఫరీదాబాద్లోని అమీపూర్ గ్రామంలో రూ.15 లక్షలకు 5 ఎకరాలు కొన్నారంది. నివేదిక ‘లీక్’పై కాంగ్రెస్, బీజేపీ విమర్శలు గుప్పించుకున్నాయి. వాద్రాపై రాజకీయ కక్షతోనే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశపూర్వకంగానే నివేదికలోని కొన్ని విషయాలని లీక్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఖట్టర్ తోసిపుచ్చారు. -
'రూ. 50 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం'
కురుక్షేత్ర: ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను మన్ దీప్ సింగ్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా అంతహేది గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్... మన్ దీప్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసాయిచ్చారు. మన్ దీప్ సింగ్ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. మన్ దీప్ సింగ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం హామీయిచ్చారు. కశ్మీర్ లోని మచ్చిల్ సెక్టార్ లో మన్ దీప్ సింగ్ ను ఉగ్రవాదులు కిరాతంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేశారు. ముష్కరుల దమనకాండపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. -
గత సర్కారును పొగిడిందని అధికారిణికి షాక్!
గత ప్రభుత్వాలపై గురించి చెప్పాల్సి వస్తే.. ప్రస్తుత ప్రభుత్వానికి కోపం రాకుండా అధికారులు జాగ్రత్త పడాలేమో.. హర్యానాలో తాజాగా జరిగిన ఉదంతం ఇదే చాటుతోంది. భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశంసించేలా ఆర్టీఐ కింద వివరాలు వెల్లడించిన ఓ మహిళా అధికారికి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఏకంగా ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంతో పోలిస్తే గత కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన విషయంలో ముందున్నదని పరిశ్రమలు, వాణిజ్య శాఖ అధికారిణి సునితా దేవి ఓ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇచ్చారు. ఇది సహజంగానే రాజకీయంగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టేసింది. అయితే, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన విషయంలో ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందని, అందుకే ఆమెపై చార్జిషీట్ కూడా దాఖలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారని హర్యానా అధికార వర్గాలు చెప్తున్నాయి. -
గుర్గావ్ ఇక గురుగ్రామ్
చండీగఢ్: హరియాణాలోని గుర్గావ్ నగరాన్ని ఇకపై గురుగ్రామ్గా పిలువనున్నారు. పేరు మార్పునకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదించింది. రాష్ట్రస్థాయి స్వర్ణ జయంతి వేడుకల కమిటీ తొలి సమావేశం సందర్భంగా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ ఈ వివరాలు వెల్లడించారు. గుర్గావ్ నగరాన్ని, గుర్గావ్ జిల్లాను ఇకపై గురుగ్రామ్ పేరుతో వ్యవహరించనున్నట్లు తెలిపారు. భారతంలోని పాండవులు, కౌరవులకు విలువిద్య నేర్పిన ద్రోణాచార్యకు ఈ నగరాన్ని పాండవులు దక్షిణగా ఇచ్చారని, గురుగ్రామమనే పేరు తర్వాత గుర్గావ్గా మారిందని ప్రతీతి. -
సీఎంకు అవి చిన్న విషయాలట!
ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం చేసి.. హతమార్చిన ఘటన, బిర్యానీలో బీఫ్ (పశుమాంసం) కలుపుతున్నారంటూ హోటళ్లపై పోలీసుల దాడి.. ఇవి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు చాలా చిన్న విషయాలట. రాష్ట్రాన్ని రాజకీయంగా కుదిపేస్తున్న అంశాలపై అడిగిన విలేకరులకు ఆయన దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. ఇవి చాలా చిన్న విషయాలని, దేశంలో ఎక్కడైనా జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు. హర్యానా రాష్ట్రం 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేవాట్ లో అక్కాచెల్లెళ్లపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐ విచారణ డిమాండ్ గురించి విలేకరులు ప్రస్తావించారు. 'ఇవి పెద్దగా పట్టించుకోవాల్సిన విషయాలు కాదు. ఇలాంటి చిన్నచిన్న వాటిపై నేను దృష్టిపెట్టాను. ఈరోజు హర్యానా స్వర్ణ జయంతి గురించే మాట్లాడాలి' అంటూ దాటవేశారు. విలేకరులు మళ్లీమళ్లీ అడిగితే.. 'స్వర్ణ జయంతి సంబరాలతో పోల్చుకుంటే ఇవి చాలా చిన్న విషయాలు. దేశంలో ఎక్కడైనా ఇలాంటివి జరుగుతాయి' అని ఖట్టర్ చెప్పుకొచ్చారు. ఆగస్టు 24న మేవాట్ లో ఓ 20 ఏళ్ల యువతి, 14 ఏళ్ల ఆమె కజిన్ సోదరిపై కొందరు దుండగులు సామూహిక లైంగిక దాడి జరిపారు. బాధితుల అత్తమామలను ఇంట్లో కట్టివేసి వారి ముందే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన హర్యానాలో ప్రకంపనలు రేపుతోంది. ఇక మేవాట్ లోనే బీఫ్ బిర్యానీ ఆరోపణలపై ఆవుల రక్షణ టాస్క్ ఫోర్స్ డీఐజీ భారతీ అరోరా, గావ్ సేవా ఆయోగ్ చైర్మన్ భానీ రాం మంగ్లా ఆధ్వర్యంలో హైవేపై ఉన్న హోటల్లపై దాడి చేయడం రాజకీయంగా దుమారం రేపింది. అయినా ఇవి చిన్న విషయాలను కొట్టిపారేస్తూ సీఎం ఖట్టర్ స్పందించడానికి నిరాకరించారు. . -
సైకిల్ రిక్షా తొక్కుతూ అసెంబ్లీకి సీఎం
చండీగఢ్: అసెంబ్లీలో జైన దిగంబర సన్యాసితో ప్రవచన కార్యక్రమం నిర్వహించిన హరియాణా ప్రభుత్వం మరో వినూత్న ప్రయోగం చేసింది. ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్, మంత్రులు,అధికార బీజేపీ శాసనసభ సభ్యులు వర్షాకాల సమావేశాల చివరి రోజైన బుధవారం సభకు సైకిళ్లు, రిక్షాలపై వచ్చారు. కార్లు, ఇతర వాహనాలను ఒకరోజు పక్కనపెట్టిన శాసనకర్తలు సాధారణ ప్రజలకు మార్గదర్శకంగా నిలిచారు. కుర్తా, పైజామా ధరించిన ఖట్టర్ సెక్టర్-3లోని అధికార నివాసం నుంచి కిలోమీటర్ దూరంలోని అసెంబ్లీ సముదాయానికి సైకిలుపై వచ్చారు. ఇది పర్యావరణానికి మంచిదని, ప్రజలంతా కనీసం ఒక్క రోజైనా సైకిలు తొక్కాలని అన్నారు. చీఫ్ పార్లమెంటరీ కార్యదర్శి శ్యాంసింగ్... సీపీఎస్ సీమా త్రిఖా, సీఎం సలహాదారు జగదీశ్ చోప్రాను ఎక్కించుకొని సైకిలు రిక్షా తొక్కుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. మరికొందరు శాసనసభ్యులు ఈ-రిక్షాల్లో వచ్చారు. ఒకరోజు ఇలా చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని అడిగినపుడు ఇది స్ఫూర్తిమంత అడుగు. రాష్ట్ర సీఎం, రాజకీయ నాయకులే చేసినపుడు తమ వల్ల కాదా? అని సాధారణ ప్రజలు భావిస్తారు’ అని వ్యవసాయ మంత్రి ఓపీ ధన్కర్ చెప్పారు. -
సింధు.. కర్ణాటక అమ్మాయి: సీఎం
-
సింధు.. కర్ణాటక అమ్మాయి: సీఎం
పీవీ సింధు ఆంధ్రా అమ్మాయా.. తెలంగాణ అమ్మాయా అన్న అనుమానం అక్కర్లేదు. ఆమె కర్ణాటక అమ్మాయి అని హరియాణా సీఎం తేల్చేశారు. ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించి రియోలో భారతదేశానికి తొలి పతకం అందించిన సాక్షి మాలిక్ను ఆమె సొంత రాష్ట్రం హరియాణాలో ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆమెకు రూ. 2.5 కోట్ల పురస్కారం అందించారు. అయితే.. అదే సందర్భంలో పీవీ సింధు విషయంలో మాత్రం ఆయన మాట తడబడ్డారు. సింధును కర్ణాటకకు చెందిన అమ్మాయి అని చెప్పారు. చివరకు ఆమె పేరు కూడా సరిగా పలకలేదు. వరుసపెట్టి టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్.. ఇలా చాలా క్రీడల్లో ఒక్క పతకం కూడా రాక భారతీయులంతా తీవ్ర నిరాశలో మునిగిపోయిన తరుణంలో సాక్షి మాలిక్ దేశానికి మొట్టమొదటి పతకం అందించింది. రియో నుంచి తిరిగి వచ్చిన ఆమెకు ఢిల్లీలోను, తర్వాత హరియాణాలోను కూడా ఘన స్వాగతం లభించింది. అయితే.. సాక్షిమాలిక్ను సత్కరించే సందర్భంలో హరియాణా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ సింధు పేరేంటో మర్చిపోయారు. అంతేకాక, ఆమెను కన్నడ అమ్మాయి అని చెప్పారు. నిజానికి మంత్రులు ఒలింపిక్ క్రీడాకారులను మర్చిపోవడం ఇది మొదటిసారి ఏమీ కాదు. దీపా కర్మాకర్ పేరును సాక్షాత్తు కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ తప్పుగా చెప్పారు. -
ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న సీఎం.. పర్యటన వాయిదా
హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా గుర్గావ్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారట. గత గురువారం దాదాపు 12 గంటలకు పైగా వేలాదిమంది ప్రయాణికులు గుర్గావ్ నుంచి ఢిల్లీకి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. అలాంటి జామ్ పరిస్థితే మళ్లీ ఏర్పడింది. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అందులో చిక్కుకున్నారు. ఢిల్లీ-గుర్గావ్-జైపూర్ మార్గంలోని ౮వ నెంబరు జాతీయ రహదారిపై రాజోకరి ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా జామ్ అవడంతో ఆయన తన ఢిల్లీ ప్రయాణాన్ని రద్దుచేసుకుని వెనుదిరగాల్సి వచ్చింది. న్యూఢిల్లీలోని కోపర్నికస్ మార్గ్ ప్రాంతంలో గల హర్యానా భవన్కు సీఎం వెళ్లాల్సి ఉంది. అయితే గుర్గావ్ సహా జాతీయ రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. కశ్మీర్ గేట్, ఘాజీపూర్, ధౌలా కౌన్, ఢిల్లీ-హరియాణా సరిహద్దు ప్రాంతాల్లో భారీగా గ్రాఫిక్ జామ్ అయింది. రాజోకరి ప్రాంతం దేశ రాజధానిలోకి రావడానికి ఉన్న కీలక జంక్షన్లలో ఒకటి. గత గురువారం ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ఢిల్లీ, హరియాణా ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్న విషయం తెలిసిందే. దానికి బాధ్యులు మీరంటే మీరంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ట్రాఫిక్ జామ్ ఫలితంగా గుర్గావ్ పోలీసు కమిషనర్ విర్క్ మీద బదిలీవేటు కూడా పడింది. -
నిక్షేపంగా జీన్స్ వేసుకోవచ్చు!
పాఠశాలల్లో టీచర్లు జీన్స్ వేసుకోకూడదని తాము ఎప్పుడూ చెప్పలేదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదని, ఎవరైనా అలా చెప్పి ఉంటే దాన్ని వెనక్కి తీసుకుంటామని... అలా జరగనే జరగదని ఆయన చెప్పారు. అంతకుముందు ప్రాథమిక విద్య డైరెక్టర్ కార్యాలయం నుంచి జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లేటపుడు గానీ, విద్యాశాఖ కార్యాలయానికి వచ్చేటపుడు గానీ జీన్స్ ధరించకూడదని చెప్పారు. జీన్స్ వేసుకోవడం అంత బాగోదని, అందువల్ల ఫార్మల్స్ మాత్రమే వేసుకోవాలని ఆ నాలుగు లైన్ల ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంతేతప్ప అందుకు కారణాలు కూడా ఏమీ ప్రస్తావించలేదు. అయితే, సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పారు కాబట్టి టీచర్లు ఇక నిక్షేపంగా జీన్సు వేసుకుని స్కూలుకు వెళ్లొచ్చన్న మాట.