Norway
-
వారానికి రూ. 5 కోట్లు.. జాక్పాట్ కాదు! అంతకు మించి..
నార్వే ఫుట్బాల్ స్టార్ ఎర్లింగ్ హాలాండ్(Erling Haaland) జాక్పాట్ కొట్టేశాడు. ఊహకందని రీతిలో వారానికి రూ. 5 కోట్ల చొప్పున సంపాదించనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్లోని మాంచెస్టర్ సిటీ(Manchester City) ఫుట్బాల్ క్లబ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా 2000 సంవత్సరంలో జన్మించిన హాలాండ్ నార్వే జాతీయ జట్టు తరఫున ఫుట్బాల్ ఆడుతున్నాడు.రెండుసార్లు ‘గోల్డెన్ బూట్’ఈ క్రమంలో ఇంగ్లండ్లో జరిగే ప్రీమియర్ లీగ్(Premier League)లో అడుగుపెట్టిన హాలాండ్.. అరంగేట్రంలోనే రికార్డులు బద్దలుకొట్టాడు. తొలి సీజన్లోనే 36 గోల్స్తో దుమ్ములేపాడు ఈ స్ట్రైకర్. ఇక గత సీజన్లో మాంచెస్టర్ తరఫున 27 గోల్స్ కొట్టిన అతడు.. రెండుసార్లు ‘గోల్డెన్ బూట్’ గెలిచాడు.కానీ ఈ దఫా 16 గోల్స్తో సరిపెట్టాడు. ఇక గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. అతడు మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్తో ఇంకో రెండేళ్లు మాత్రమే కొనసాగాల్సి ఉంది. కానీ తాజాగా ఈ డీల్ను పొడగిస్తూ మాంచెస్టర్ సిటీ నిర్ణయం తీసుకుంది. తొమ్మిదిన్నరేళ్ల పాటు హాలాండ్ను కొనసాగించనుంది.కళ్లు చెదిరే మొత్తంప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఇది సుదీర్ఘకాలం పాటు సాగే ఒప్పందం. అంతేకాదు.. ఈ డీల్ ద్వారా హాలాండ్ వారానికి ఐదు లక్షల పౌండ్లు(భారత కరెన్సీలో దాదాపు ఐదున్నర కోట్లకు పైగా) ఆర్జించనున్నాడట. ఈ నేపథ్యంలో హాలాండ్ స్పందిస్తూ.. ‘‘నేను చాలా చాలా సంతోషంగా.. గర్వంగా ఉన్నాను. సిటీ క్లబ్తో సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ఒప్పందం గురించి సులువుగానే నిర్ణయానికి వచ్చేశాను.ఇక ఆటపై నేను మరింత దృష్టి పెట్టగలను. ఒకే జట్టుతో ఎక్కువకాలం కలిసి ప్రయాణించడం సానుకూల ఫలితాలను ఇస్తుంది’’ అని పేర్కొన్నాడు. ఇక మాంచెస్టర్ సిటీ టీమ్ మేనేజర్(కోచ్) జోసెప్ గ్వార్డియోలా సలాతో కలిసి మరికొంతకాలం పనిచేయడం ద్వారా తన నైపుణ్యాలు మరింత మెరుగుపరచుకోవచ్చని హాలాండ్ హర్షం వ్యక్తం చేశాడు.అలాంటి వ్యక్తిని చూడలేదు‘‘నేను ఇప్పటికే చాలా మెరుగయ్యాను. అతడితో కలిసి పనిచేయడం చాలా బాగుంటుంది. అతడు కేవలం అత్యుత్తమ వ్యక్తి మాత్రమే కాదు.. హార్డ్వర్కర్ కూడా. అలాంటి వ్యక్తిని నేను ఇంతకు ముందు చూడనేలేదు’’ అని గ్వార్డియోలాపై హాలాండ్ ప్రశంసలు కురిపించాడు. కాగా స్పెయిన్కు చెందిన గ్వార్టియోలా మాంచెస్టర్ సిటీ క్లబ్కు 2016 నుంచి కోచ్గా ఉన్నాడు. వివిధ టోర్నీల్లో కలిపి మొత్తంగా 18 సార్లు ట్రోఫీ అందించాడు. ఇదిలా ఉంటే.. తాజా ఒప్పందం ప్రకారం ఎర్లిండ్ హాలాండ్ మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్తో 2034 వరకు కొనసాగనున్నాడు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ -
ఫుడ్ ప్యాక్లో ఎలుక
అవున్నిజమే! విమానంలో ఎలుక కనిపించింది. అంది కూడా ఓ ప్రయాణికురాలికి అందించిన ఫుడ్ పార్సిల్లో. ఆమె పార్సిల్ తెరవగానే ఎలుక అమాంతం బయటికి దూకి సీట్ల కింద దూరింది! దాంతో విమానంలో కలకలం రేగింది. నార్వే రాజధాని ఓస్లో నుంచి స్పెయిన్లోని మలగాకు వెళ్తున్న స్కాండినేవియన్ ఎయిర్లైన్స్ విమానంలో జరిగిందీ ఘటన. ఆ దెబ్బకు విమానాన్ని అత్యవసరంగా కోపెన్హాగన్లో దించారు. ప్రయాణికులను వేరే విమానంలో మలగాకు పంపించారు. విమానాల్లోని ఎలకి్ట్రకల్ వైరింగ్ తదితరాలను ఎలుకలు కొరికాయంటే అంతే సంగతులు. అందుకే అవి విమానంలోకి రాకుండా ఎయిర్లైన్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి! అలాంటిది ఏకంగా ఫుడ్ పార్సల్లోనే బతికున్న ఎలుక రావడాన్ని ఎయిర్లైన్స్ సంస్థ సీరియస్గా తీసుకుంది. ఆహార పంపిణీ సంస్థను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టింది. ప్రయాణికులను క్షమాపణ కోరింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పుకొచ్చింది. ఇటీవల దక్షిణ ఇంగ్లాండ్లో రెండు ఉడతలు రైలెక్కడంతో చివరకు ఆ సరీ్వసును రద్దు చేయాల్సి వచి్చంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
లెబనాన్ పేజర్ల పేలుళ్లలో కేరళ టెక్కీ ప్రమేయం?
హెజ్బొల్లా లక్ష్యంగా జరిగిన పేజర్ల పేలుళ్ల కేసులో.. కేరళకు చెందిన ఓ టెక్కీని బల్గేరియా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నార్వేలో స్థిరపడిన అతనికి.. బల్గేరియాలో ఓ కంపెనీ ఉంది. అక్కడి నుంచే పేజర్ల సప్లై జరిగిందని, పేలుడు పదార్థాలను ఇక్కడే అమర్చి ఉంటారన్న అనుమానాల నడుమ మూడు రోజులపాటు అతన్ని విచారించారు. వయనాడ్కు చెందిన రిన్సన్ జోస్(37).. నార్వేలో స్థిరపడ్డాడు. రెండేళ్ల కిందట బల్గేరియాలో నోర్టా గ్లోబల్ లిమిటెడ్ అనే కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు చేశాడు. అయితే.. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ సభ్యులకు ఇతని కంపెనీ నుంచే పేజర్లు వెళ్లాయని తొలుత అధికారులు అనుమానించారు. ఈ అనుమానాలకు అతని కదలికలు కూడా మరింత బలం చేకూర్చాయి. దీంతో.. బల్గేరియా దర్యాప్తు సంస్థ డీఏఎన్ఎస్, ఆ దేశ విదేశాంగ సహకారంతో జోస్ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది. చివరకు.. పేలుళ్లకు సంబంధించిన పేజర్లకు, ఇతని కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని గుర్తించారు. అంతేకాదు.. లెబనాన్ పేలుళ్లలోని పేజర్లు అసలు బల్గేరియా నుంచే వెళ్లలేదని ప్రకటించారు.‘‘లెబనాన్ పేజర్ల పేలుళ్లకు నోర్టా గ్లోబల్ లిమిటెడ్తో ఎలాంటి సంబంధం లేదు. ఈ కంపెనీ యాజమానితో పేజర్లకు సంబంధించి లావాదేవీలు(ట్రాన్జాక్షన్స్) జరిగాయన్న వాదనలోనూ నిజం లేదు’’ అని డీఏఎన్ఎస్ ప్రకటించింది. మరోవైపు ఓస్లో(నార్వే) పోలీసులు సైతం ప్రాథమిక విచారణలో జోస్కు ఎలాంటి సంబంధం లేదని తేల్చాయి.ఇదీ చదవండి: పేరు వేరే అయినా.. పేజర్ వీళ్లదేసెప్టెంబర్ 17వ తేదీన లెబనాన్లో జరిగిన పేజర్ల పేలుళ్లలో 12 మంది మరణించగా.. వేల మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటుందని, పేజర్లలో పేలుడు పదార్థాలను అమర్చి ఉంటుందని లెబనాన్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో..తైవాన్కు చెందిన పేజర్ల కంపెనీ గోల్డ్ అపోలో పైనా అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే.. పేలుడుకు గురైన ఏఆర్-924 పేజర్లకు తమకు సంబంధం లేదని తైవాన్ కంపెనీ స్పష్టం చేసింది. హంగేరీ బుడాపెస్ట్కు చెందిన ఓ కంపెనీ దగ్గర వాటి తయారీ ట్రేడ్ మార్క్ ఉందని తేలింది. అయినప్పటికీ నార్వే, బల్గేరియా వైపే దర్యాప్తు అధికారుల దృష్టి మళ్లింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన రిన్సన్ జోస్.. కొంతకాలం లండన్లోనూ పని చేశాడు. ఆపై సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకున్నాడు. అతని భార్య కూడా ఓస్లోలోనే ఉంది. తాజా పరిణామాలతో కేరళలోని జోస్ కుటుంబం ఆందోళనకు గురైంది. అతన్ని ఇరికించే కుట్ర జరిగిందని ఆరోపణలు చేసింది. మూడు రోజులపాటు అధికారులు అతన్ని కనీసం ఫోన్లో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని భార్య మీడియా వద్ద వాపోయింది. అయితే లెబనాన్ పేలుళ్ల కేసు నుంచి క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ అతన్ని ఇంకా అధికారులు విడుదల చేయలేదని సమాచారం. -
అట్టహాసంగా యువరాణి పెళ్లి
నార్వే యువరాణి మార్తా లూయిస్ (52), అమెరికాకు చెందిన డురెక్ వెర్రెట్ (49) వివాహం అట్టహాసంగా జరిగింది. నార్వేలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం, కైరుంగి పట్టణంలో శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు మార్తా తండ్రి, కింగ్ హెరాల్డ్ (87), ఇతర రాజకుటుంబీకులు హాజరయ్యారు. మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, రియాలిటీ స్టార్లు, టీవీ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మార్తాకిది రెండో వివాహం. మొదటి భర్తతో ఆమెకు 21, 19, 15 ఏళ్ల వయస్సున్న కూతుళ్లున్నారు. వాళ్లు కూడా వేడుకలో పాల్గొన్నారు. తనకు దేవదూతలతో మాట్లాడే శక్తి ఉందని మార్తా; ఆత్మలతో సంభాíÙంచగలనని, వ్యాధులను నయం చేయగలనని వెర్రెట్ చెప్పుకుంటారు. తమ కుటుంబానికి ఆరు తరాలుగా అతీత శక్తులు సక్రమిస్తూ వస్తున్నాయని వెర్రెట్ ప్రకటించుకున్నారు. – ఓస్లో -
ఆ ‘రష్యన్ స్పై వేల్’ ఇక లేదు!
రష్యా గూఢచారిగా 2019 నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెల్లని బెలుగా తిమింగలం చనిపోయింది. హవాల్దిమిర్గా పేరున్న ఈ తిమింగలం కళేబరం దక్షిణ నార్వేలోని రిజావికా బే వద్ద నీటిపై తేలియాడుతూ శనివారం స్థానికుల కంటబడింది. 14 అడుగుల పొడవు, 1,225 కిలోల బరువున్న హవాల్దిమిర్ కళేబరాన్ని క్రేన్తో బయటకు తీశారు. బెలుగా కళేబరంపై ఎటువంటి గాయాలు లేవని, మృతికి కారణాలను కనుగొనేందుకు పోస్టుమార్టం చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ఒంటిపై కెమెరాను అమర్చేందుకు వీలుగా బెల్టు లాంటి ఒక పరికరం అమర్చి ఉండటం, దానిపై ‘ఎక్విప్మెంట్ సెయింట్ పీటర్స్బర్గ్’అని రాసి ఉండటంతో నార్వే ప్రజలకు అనుమానం మొదలైంది. రష్యాయే నిఘా కోసం ఈ తిమింగలాన్ని పంపి ఉంటుందని, నార్వే–రష్యా భాషలను కలిపి ‘హవాల్దిమిర్’గా పిలవనారంభించారు. సాధారణంగా తిమింగలాలు గుంపులుగా సంచరిస్తుంటాయి. అందుకు విరుద్ధంగా హవాల్దిమిర్ ప్రజలకు మచ్చికయ్యింది. ఇంతకీ, ఇది రష్యా పంపిందేనా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. బహుశా, రష్యా నిర్బంధంలో ఉంటూ అనుకోకుండా తప్పించుకుని వచ్చి ఉంటుందని, అందుకే ప్రజల సంజ్ఞలకు స్పందించే లక్షణం అబ్బి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. – హెల్సింకీ -
నార్వే చెస్ టోర్నీ విజేతగా కార్ల్సన్..
నార్వే చెస్ టోర్నీ-2024 ఛాంపియన్గా వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్ రౌండ్లో ఫాబియానో కారువానాపై కార్ల్సన్ విజయం సాధించాడు. తొలుత వీరిద్దిరి మధ్య జరిగిన క్లాసికల్ గేమ్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత ఉత్కంఠగా సాగిన ఆర్మగెడాన్ ప్లేఆఫ్లో ఫాబియానో కరువానాను కార్ల్సన్ ఓడించాడు. మరొక ఆర్మగెడాన్ పోటీలో హికారు నకమురాను భారత గ్రాండ్మాస్టర్ ప్రగ్నానంద రమేష్బాబు.. హికారు నకమురాను ఓడించడంతో కార్ల్సెన్ విజయం లాంఛనమైంది.నకమురా ఓటమి పాలవ్వడంతో కార్ల్సెన్ స్టాండింగ్లో తన ఆధిక్యాన్ని నిలుపునకుని ఛాంపియన్గా అవతరించాడు. కార్ల్సన్కు ఆర్మగెడాన్ ఫార్మాట్ ఇది ఐదో విజయం కావడం విశేషం. ఇక ఈ టోర్నీలో కార్ల్సన్(17.5) తొలి స్ధానం సంపాదించగా.. నకమురా(15.5), ప్రగ్నానంద(14.5) వరుసగా రెండు మూడు స్ధానాల్లో నిలిచారు. ఇక మహిళల విభాగంలో జు వెన్షున్(చైనా) విజేతగా నిలిచింది. 🐐🐐🐐 @MagnusCarlsen pic.twitter.com/MUH73HWmNG— Chess.com (@chesscom) June 7, 2024 Magnus Carlsen beats Fabiano Caruana in Armageddon to earn at least a playoff for the #NorwayChess title! https://t.co/vj9WZbbkJq pic.twitter.com/fdWy4evo1K— chess24 (@chess24com) June 7, 2024 -
పాలస్తీనా స్వతంత్ర దేశం
టెల్ అవీవ్: పాలస్తీనా విషయంలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని తాము గుర్తిస్తున్నామని బుధవారం ప్రకటించాయి. ఈ నెల 28న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి. నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాల తాజా ప్రకటనను పాలస్తీనియన్లు స్వాగతించారు. పాలస్తీనా దేశాన్ని ఇప్పటికే భారత్ సహా దాదాపు 140 దేశాలు అధికారికంగా గుర్తించాయి. అంటే ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన మొత్తం దేశాల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. తాజాగా మరో మూడు దేశాలు ఈ జాబితాలో చేరడం విశేషం. శాంతి, సామరస్యం కోసమే.. తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ను కలిపి ప్రత్యేక పాలస్తీనాను దేశంగా గుర్తించాలని లక్షలాది మంది పాలస్తీనియన్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 1967లో జరిగిన మిడిల్ఈస్ట్ యుద్ధంలో ఆ మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ప్రస్తుతం తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ నియంత్రణ కొనసాగుతోంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించకపోతే మధ్యప్రాచ్యంలో శాంతి, సామరస్యం నెలకొల్పడం సాధ్యం కాదని నార్వే ప్రధాని జోనస్ గహర్ పేర్కొన్నారు. ఐర్లాండ్కు, పాలస్తీనాకు ఇదొక చరిత్రాత్మకమైన, ముఖ్యమైన రోజు అని ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్ వ్యాఖ్యానించారు. తమ నిర్ణయం ఇజ్రాయెల్సహా ఎవరికీ వ్యతిరేకం కాదని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పష్టంచేశారు. హంతకులకు, రేపిస్టులకు బంగారు పతకాలా? పాలస్తీనాను ఒకదేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చేసిన ప్రకటన పట్ల ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు దేశాల నుంచి తమ రాయబారులను వెనక్కి పిలిపించింది. తమ దేశంలో ఉన్న నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది. తద్వారా తమ నిరసనను తెలియజేసింది. హమాస్ హంతకులకు, రేపిస్టులకు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ బంగారు పతకాలు బహూరిస్తున్నాయని, ఈ పరిణామాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ పేర్కొన్నారు. -
ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
టెల్ అవీవ్: గాజాలో హమాస్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతునే ఉంది. హమాస్ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రయాల్ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, నార్వే దేశాలలోని తమ రాయబారులు స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు దేశాలు పాలస్తీనియన్లకు ప్రత్యేక దేశం హోదాకు గుర్తింపు ఇవ్వాలని అభిప్రాయపడిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడారు. ‘‘నిస్సందేహంగా నేను ఐర్లాండ్, నార్వే దేశాలకు స్పష్టమైన సందేశం పంపతున్నా. మా దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు హాని కలిగించే పరిస్థితులపై అస్సలు మౌనంగా ఉండము. మేము సాధించే లక్ష్యాలను ఐర్లాండ్, నార్వే దేశాలు అడ్డుకోలేవు. మా దేశ పౌరులకు భద్రత పునరుద్ధరిస్తాం. హమాస్ను అంతం చేసి, బంధీలను ఇంటికి చేరుస్తాం, ఇంతకు మించి ఏం జరగబోదు’’ అని ఇజ్రాయెల్ కాట్జ్ స్పష్టం చేశారు.మరోవైపు స్పెయిన్ దేశాన్ని కూడా ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. తమ దేశం కూడా పాలస్తీనాను మే 28 నుంచి ప్రత్యేక దేశంగా గుర్తిస్తుందని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ బుధవారం వెల్లడించారు. దీంతో ఐర్లాండ్, నార్వేల వలే స్పెయిన్పై కూడా చర్యలు ఉంటాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది.‘‘స్పానీష్ ప్రజల మెజార్టీ సెంటిమెంట్లను పరిగణలోకి తీసుకుంటున్నాం. వచ్చే మంగళవారం(మే 28). మంత్రుల కౌన్సిల్ సమావేశంలో పాలస్తీనా ప్రత్యేక దేశం గుర్తింపు విషయంలో ఆమోదం తెలుపుతాం. శాంతి, న్యాయంల కోసం ఆ నిర్ణయం మాటాలను నుంచి కార్యరూపం దాల్చుతుంది’’ అని పెడ్రో శాంచెజ్ తెలిపారు. -
మంచు పాన్పు
చలికాలపు రాత్రి నిద్రొస్తే మనమంతా బిర్రుగా ముసుగు తన్నిపడుకుంటాం. కానీ ఈ మంచు ఎలుగుబంటి మాత్రం సుఖమనిన ఇదియెగాద అనుకుంటూ మంచుపాన్పుపై హాయిగా నిద్రపోయింది. ఐస్బర్గ్పై ఎలుగు నిద్రపోతున్న ఫొటోను బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ నీమా సరిఖానీ తీశారు. ఈ ఫొటో.. పీపుల్స్ ఛాయిస్ సంస్థ చేపట్టిన ఓటింగ్లో పాల్గొన్న వేలాది మందికి తెగ నచ్చేసింది. దీంతో నీమాను పీపుల్స్ ఛాయిస్ వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించారు. నార్వేకు చెందిన స్వాల్బార్డ్ ద్వీపసమూహంలో ఉత్తర ధృవానికి అత్యంత సమీప ఐస్బర్గ్ల వద్ద ఈ ఫొటోను తీశారు. -
ఫిన్లాండ్, స్వీడన్లో రికార్డు స్థాయి చలి
స్టాక్హోమ్: నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఫిన్లాండ్లను చలి వణికిస్తోంది. 25 ఏళ్ల తర్వాత స్వీడన్, ఫిన్లాండ్ దేశాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 40 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. ఎముకలు కొరికే చలికి తోడు దట్టమైన మంచు కురుస్తుండటంతో మూడు దేశాల్లోనూ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. స్వీడన్లోని ఉత్తరప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1999 తర్వాత –43.6 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ తెలిపింది. 1951లో, తిరిగి 1999లోనూ –49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు గుర్తు చేసింది. పొరుగునే ఉన్న ఫిన్లాండ్లోని వైలివియెస్కాలో ఉష్ణోగ్రత మంగళవారం –37.8 డిగ్రీలుగా నమోదైంది. -
జాన్ ఫోసేకు సాహిత్య నోబెల్
నార్వే రచయిత జాన్ ఫోసేకు సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరించింది. బయటకు చెప్పుకోలేని ఎన్నో అంశాలకు తన నవలలు, నాటకాలు, చిన్న పిల్లల పుస్తకాల ద్వారా గళంగా నిలిచినందుకు ఫోసే ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. నోబెల్ లిటరేచర్ కమిటీ చైర్మన్ ఆండర్స్ ఓల్సన్ గురువారం అవార్డును ప్రకటించారు. ఫోసే చేసిన రచనల్లో నార్వే సంస్కృతి, స్వభావాలు ఉట్టిపడుతూ ఉంటాయని కొనియాడారు. ఈ పురస్కారం కింద ఫోసేకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్లు (10 లక్షల డాలర్లు) లభిస్తాయి. సాహిత్యంలో నోబెల్ పురస్కారం లభించిందంటే తనని తాను నమ్మలేకపోయానంటూ జాన్ ఫోసే తీవ్ర ఉద్విగ్నానికి లోనయ్యారు. ‘‘నోబెల్ కమిటీ ఫోన్ చేసి చెప్పగానే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. మళ్లీ నన్ను నేనే నిలవరించుకున్నారు. గత పదేళ్లుగా నోబెల్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. ఈ అవార్డు విపరీతమైన ఆనందాన్ని ఇస్తోంది. కాస్త కూడా భయం వేస్తోంది. ’’ అని నార్వే మీడియాకు చెప్పారు. నార్వేలో అత్యంత ప్రతిభావంతుడైన నాటక రచయితగా గుర్తింపు పొందిన ఫోసే 43 వరకు నవలలు, నాటకాలు, చిన్న కథలు, పిల్లల పుస్తకాలు, అనువాదాలు, పద్యాలు, గద్యాలు రచించారు. అయితే నాటక రచయితగానే ఆయనకు విశేషమైన గుర్తింపు లభించింది. మాటల్లో తమ బాధల్ని చెప్పుకోలేని ఎన్నో వర్గాలకు ఆయన తన రచనలతో ఒక గళంగా మారి సామాజిక పరిస్థితుల్ని అద్దంలో చూపించారంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీ ఘటనలే కథా వస్తువు నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే ఘటనలే జాన్ ఫోసే రచనలకు ఆధారం. అలాంటి ఘటనల్ని సరళమైన భాషలో,, శక్తిమంతమైన భావ ప్రకటనతో రచనలు చేసి సామాన్యుల మనసుల్ని కూడా దోచుకున్నారు. మానవ సంబంధాల్లోని బలమైన భావోద్వేగాలను , సామాజిక పరిస్థితుల్ని చిన్నారులకి కూడా అర్థమయ్యేలా రచనలు చేసి సమాజంలో వివిధ వర్గాలపై ఎంతో ప్రభావాన్ని చూపించారు. నార్వేలో 1959లో క్రిస్టియన్ మతాచారాల్ని గట్టిగా ఆచరించే ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలోనే ఆయన తన కుటుంబంపైన, మతంపైనా తిరుగుబాటు ప్రకటించారు. తాను నాస్తికుడినని ప్రకటించారు. చిన్నప్పట్నుంచి తిరుగుబాటు ధోరణి కలిగిన జాన్ ఫోసే రచనల్లో, నాటకాల్లో అది వ్యక్తమయ్యేది. 1983లో ఆయన రాసిన మొదటి నవల రెడ్, బ్లాక్లో ఆత్మహత్యల అంశాన్ని స్పృశించారు. అప్పట్నుంచి ఆయన వెనక్కి చూసుకోలేదు. నవలైనా, నాటకమైనా, పద్యాలైనా, గద్యాలైనా ఆ రచనల్లో ఆయన ముద్ర స్పష్టంగా కనిపించేది. 40 భాషల్లో పుస్తకాల అనువాదం ఫోసే చేసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 40 భాషల్లోకి అనువాదమ య్యాయి. 2015లో ది డైలీ టెలిగ్రాఫ్ రూపొందించిన భూమ్మీద ఉన్న లివింగ్ జీనియస్లలో టాప్ 100 జాబితాలో ఫోసే 83వ స్థానంలో నిలిచారు. 2022లో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అవార్డు కోసం ఆయన రాసిన ‘‘ఏ న్యూ నేమ్ :సెప్టాలజీ Vఐ– Vఐఐ’’ షార్ట్ లిస్ట్లో నిలిచింది. జాన్ ఫోసేకు మూడు పెళ్లిళ్లయ్యాయి. ఆరుగురు పిల్లలకు తండ్రి. 64 ఏళ్ల వయసున్న జాన్ ఫోసే ఆస్ట్రియాలోని తన రెండో భార్యతో కలిసి ఉంటున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు దేవుడ్ని నమ్మని జాన్ ఫోసే ప్రస్తుతం కాథలిజంలోకి మారి దానినే అనుసరిస్తున్నారు. ఫోసే చేసిన రచనల్లో బోట్హౌస్, మెలాంకలి, సెప్టాలజీ అత్యంత ప్రజాదరణ పొందాయి. ఫోసే రచించిన నాటకాలను వేలాది ప్రొడక్షన్ హౌస్లు వివిధ దేశాల్లో ప్రదర్శించాయి. ఇంగ్లిష్ భాషలోకి అనువదించిన ఫోసే సెప్టాలజీ సిరీస్లో ది అదర్ నేమ్, ఐ ఈజ్ అనదర్, ఏ న్యూనేమ్ ఆయనకు చాలా గుర్తింపు తీసుకువచ్చాయి. భాషకు పట్టాభిషేకం జాన్ ఫోసే రచనలు నార్వేజియన్ భాషలో రాస్తారు. నార్వేలో 10% మంది మాత్రమే ఈ భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. నార్వేలో ఉన్న రెండు అధికారిక భాషల్లో ఇదొకటి. గ్రామీణ ప్రాంత ప్రజలు మాట్లాడే మాండలికంలో ఉండే ఈ భాష 19వ శతాబ్దంలో డానిస్కు ప్రత్యామ్నాయంగా పుట్టింది. స్వచ్ఛమైన సెలయేరులాంటి భాషలో ప్రజలు రోజువారీ ఎదుర్కొనే సమస్యలకి తన రచనల్లో కొత్త కోణంలో పరిష్కారం మార్గం చూపించడంతో ఆయన పుస్తకాలు అపరిమితమైన ఆదరణ పొందాయి. అందుకే ఈ పురస్కారం తనకే కాకుండా, తన భాషకి కూడా పట్టాభిషేకం జరిగినట్టుగా ఉందని ఫోసే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Nobel Prize: నార్వే రచయితకు సాహిత్యంలో నోబెల్
స్టాక్హోం: ప్రపంచలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. తాజాగా సాహిత్యం కేటగిరిలో 2023 సంవత్సరానికి నోబెల్ బహుమతిని ప్రకటించారు. కాగా, 2023 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతిని గురువారం ప్రకటించారు. నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసెను ఈ ఏడాది సాహిత్య నోబెల్ వరించింది. ఇక, ఇప్పటికే రసాయన శాస్త్రం, భౌతిక, వైద్య రంగాల్లో నోబెల్ అవార్డులను ప్రకటించారు. తాజాగా సాహిత్యంలో నోబెల్ ప్రకటించారు. శాంతి కేటగిరిలో ప్రకటించాల్సి ఉంది. The 2023 Nobel Prize in Literature is awarded to the Norwegian author Jon Fosse “for his innovative plays and prose which give voice to the unsayable". (Pic: The Nobel Prize) pic.twitter.com/RI2jThwOYV — ANI (@ANI) October 5, 2023 -
ఎట్టకేలకు పెళ్లి కబురు చెప్పిన రొమాంటిక్ కపుల్
రాచరికపు విలాసాలను కాదని సాధారణ జీవితాన్ని ఎంచుకున్న నార్వే యువరాణి మార్థా లూయిస్ గుర్తుందా. ప్రేమికుడు, హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్ ఆరో తరం షమన్ డ్యూరెక్ వెరేట్ను త్వరలోనే పెళ్లాడనుంది. ఈ రొమాంటిక్ కపుల్ అధికారికంగా తమ పెళ్లి కబురును ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగస్టు 31న (2024 ఆగస్టు 31) పెళ్లాడ బోతున్నట్టు బుధవారం ప్రకటించారు. (వాట్సాప్ కొత్త ఫీచర్ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను) నైరుతి నార్వేలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ,ఫ్జోర్డ్ ఒడ్డున గీరాంజర్లో వివాహ వేడుక జరగనుంది. గీరాంజర్ అందమైన పరిసరాలలో ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని ఈ లవ్బర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరి విహహ ప్రకటనపై రాజు హరాల్డ్ , రాణి సోంజా , ప్రిన్స్ హాకోన్ దంపతులను అభినందించారు "డ్యూరెక్ వెరెట్ను కుటుంబంలోకి స్వాగతించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. (రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్బీఐ కీలక ఆదేశాలు ) View this post on Instagram A post shared by Durek Verrett (@shamandurek) 2022 జూన్లో మార్తా లూయిస్, డ్యూరెక్ వెరెట్ తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి, కింగ్ హెరాల్డ్ ఆశీర్వాదం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత ఏడాది నవంబరులో వెర్రెట్తో తన ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారంపై దృష్టి పెట్టడానికి ఆమె తన రాజ బాధ్యతలను వదులుకుంది. నార్వే యువరాణి టైటిల్ని మాత్రం వదులు కోలేదు. కానీ దానిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించనని అంగీకరించింది. తనకు ఎలాంటి వైభవాలు అక్కర్లేదంటూప్రియమైన వ్యక్తితో కలిసి అమెరికా వెళ్లిపోయింది. రాజకుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాని ఆమె ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యామ్నాయ చికిత్సల అభిమాని అయిన లూయిస్ తాను దేవదూతలతో మాట్లాడగలగడం తనకు లభించిన గిఫ్ట్అని పేర్కొంది. అయితే లూయిస్ కు అంతకుముందే పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భర్త, రచయిత అరిబెన్తో విడాకులు తీసుకుంది. విడిపోయిన మూడేళ్లకు 2019లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Princess Märtha Louise (@princessmarthalouise) . -
పోరాడి ఓడిన ప్రజ్ఞానంద.. జగజ్జేతగా కార్ల్సన్
బకూ (అజర్బైజాన్): ఫైవ్ టైమ్ వరల్డ్ చెస్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) తన తొలి వరల్డ్కప్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందతో ఇవాళ (ఆగస్ట్ 24) జరిగిన ఫైనల్ టైబ్రేక్స్లో కార్ల్సన్ అద్భుత విజయం సాధించి జగజ్జేతగా అవతరించారు. 🏆 Magnus Carlsen is the winner of the 2023 FIDE World Cup! 🏆 Magnus prevails against Praggnanandhaa in a thrilling tiebreak and adds one more prestigious trophy to his collection! Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/sUjBdgAb7a — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్లో ప్రజ్ఞానంద తొలి గేమ్ కోల్పోగా.. రెండో గేమ్ను ఇరువురు డ్రాకు అంగీకరించడంతో కార్ల్సన్ విజేతగా నిలిచాడు. ప్రజ్ఞానంద రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. టోర్నీ ఆధ్యాంతం దూకుడుగా ఆడిన ప్రజ్ఞానంద ఫైనల్లో కార్ల్సన్ ఎత్తుల ముందు చిత్తయ్యాడు. అంతకుముందు ఫైనల్లో భాగంగా జరిగిన రెండు గేమ్ల్లో కార్ల్సన్, ప్రజ్ఞానంద తలో గేమ్ గెలవడంతో టైబ్రేక్స్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. Praggnanandhaa is the runner-up of the 2023 FIDE World Cup! 🥈 Congratulations to the 18-year-old Indian prodigy on an impressive tournament! 👏 On his way to the final, Praggnanandhaa beat, among others, world #2 Hikaru Nakamura and #3 Fabiano Caruana! By winning the silver… pic.twitter.com/zJh9wQv5pS — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 Fabiano Caruana clinches third place in the 2023 FIDE World Cup and secures a ticket to the #FIDECandidates tournament next year, after prevailing against Nijat Abasov in the tiebreaks. Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/Z35mDJJMwz — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 -
రాజమౌళిపై రేణు దేశాయ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆమె పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. ఆమె చేసిన కామెంట్స్తో మరోసారి చర్చల్లో నిలిచారు. ఎందుకంటే కొద్దిరోజుల క్రితమే తన విడాకుల విషయం, పవన్ గురించి ఆమె పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె దర్శకధీరుడు రాజమౌళిపై చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: నా విషయంలో పవన్ది 100% తప్పే: రేణుదేశాయ్) అయితే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని నార్వోలోని స్టావెంజర్ నగరంలోని ఓ థియేటర్లో ప్రదర్శించారు. అక్కడ సినిమా చూసేందుకు రేణ్ దేశాయ్, తన కుమారుడు అకీరా నందన్తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె థియేటర్లో సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేసిన లయ.. దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. రేణు తన ఇన్స్టాలో రాస్తూ.. ' ఒక భారతీయ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం చాలా అద్భుతంగా ఉంది. రాజమౌళి సార్.. మీరు ప్రేక్షకుల కోసం సృష్టించిన అనుభూతిని వర్ణించడానికి నా దగ్గర పదాలు లేవు. స్టావెంజర్లోని థియేటర్లో బాహుబలి చూసిన అనుభవం మరిచిపోలేనిది. ఈ కార్యక్రమానికి నన్ను, అకీరాను ఆహ్వానించినందుకు శోబు సార్కు ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. అద్భుతమైన లైవ్ ఆర్కెస్ట్రాతో మనం అత్యంత ఇష్టపడే చిత్రాన్ని చూడటం అద్భుతంగా ఉందంటూ రేణుదేశాయ్ ఎమోషనలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: పవన్తో విడాకుల టైమ్లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్ ) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
SS Rajamouli Norway Vacation Images: నార్వేలో భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న దర్శకధీరుడు (ఫోటోలు)
-
మీకు తెలుసా! అక్కడ పోలీస్ల వద్ద ఆయుధం ఉండకూడదట!
కొన్ని దేశాల్లో విద్యా విధానం నుంచి ఆఫీసర్ల హోదాల వరకు కాస్త భిన్నంగా ఉంటాయి. చాలా వరకు కొన్ని విషయాల్లో అన్ని దేశాలు దాదాపు ఒకే విధానాన్ని అనుసరిస్తాయి. ఐతే కొన్ని మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. ఎంతలా అంటే ఆయా విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో కొన్ని చూద్దాం! నార్వే చిన్న దేశమైనా కూడా కరోనా సమయంలో అన్ని దేశాలకు వైద్య సేవలందించి శభాష్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. అలాంటి నార్వేలో పోలీస్ ఆఫీసర్ కావాలంటే ప్రత్యేకించి పోలీస్ యూనివర్సిటీలో డిగ్రీ చేయాలి. అంతేగాదు మొదటి రెండు సంవత్సరాలు క్రిమినల్ లా, ఎథిక్స్, సోషల్ సైన్సెస్ చదువుకోవాల్సి ఉంటుంది. మూడో సంవత్సరం ప్రాక్టికల్ ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ పోలీసులే ప్రాసిక్యూటర్లుగా వ్యవహరిస్తారు. అక్కడ ఏకీకృత పోలీసు విధానం అమలులో ఉంది. ఒకే ఒక పౌర పోలీసు దళం ఉంటుంది. పైగా అక్కడ ప్రాంతాలు లేదా నగరాలకు సొంత పోలీసు బలగాలు కలిగి ఉంటాయట. పోలీసులంతా నేషనల్ పోలీస్ డైరెక్టరేట్ కిందే పనిచేస్తారు. ఇక్కడ పోలీసులకు చాలా అధికారాలుంటాయి. అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే పోలీసులంతా కూడా ఆయుధాలను ఎల్లప్పుడూ కలిగి ఉండకూదు. వారు తమ ఆయుధాలను పోలీసు కారులోని ట్రంక్లో లేదా లాకర్లో పెట్టుకోవాలట. నార్వేలో నేరాలు, హత్యలు జరిగే సంఖ్య చాల తక్కువ. అలాగే విధినిర్వహణలో చనిపోయే పోలీసుల సంఖ్య కూడా అత్యల్పమేనట. నార్వేలో పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అల్లర్లు, ఉద్రిక్తతలకు తావివ్వకుండా ఎల్లప్పుడూ శాంతిగా ఉండేలా పోలీసులు గట్టిగా పర్వవేక్షించడం విశేషం. కేఎఫ్సీ రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం ఇక అలాగే మరో విచిత్రమైన అంశం ఏంటంటే అందరూ ఇష్టంగా లాగించే ప్రఖ్యాత ఫాస్ట్ ఫుడ్ కెంటకీ ఫ్రైడ్ చికెన్(కేఎఫ్సీ) స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ఆశ్చర్యపరిచింది. 2008లో రోడ్లపై గుంతలను పూడ్చే ప్రాజెక్టును చేపట్టి తన కస్టమర్లకు మరింత చేరువయ్యే యత్నం చేసింది. అయితే ఇదంతా కేఎఫ్సీ ఎందుకు చేసిందంటే తన అమ్మకాలు తగ్గిపోవడంతో మార్కెటింగ్ ప్రచారం చేయాలనే యోచనతో చేసింది. అందులో భాగంగా కస్టమర్లకు దగ్గరఅవ్వాలి ఎంతలా అంటే వారెప్పటికీ మర్చిపోని ఫుడ్ సెంటర్గా గుర్తించుకోవాలనే విధంగా తన మార్కెటింగ్ ప్రచారం ఉండాలనుకుంది. అందులో భాగంగానే ఈ రోడ్లపై గుంతలను పూడ్చే పనులు చేపట్టింది. ఓ పక్క గుంతలను పూడ్చుతూ అక్కడ తన కేఎఫ్సీ బోర్డులు పెట్టి క్షేమంగా బయటకు వచ్చి..కెఎఫ్సీని ఆస్వాదించి ఆనందంగా వెళ్లండి అని ప్రచారం చేసుకుంది. ఓ పక్కన మార్కెటింగ్ తోపాటు సామాజిక సేవను జోడించి తనదైన తరహాలో దూసుకుపోతోంది. (చదవండి: ఆ దేశం పీతలను నిర్మూలించడానికి ఏకంగా రూ. 26 కోట్లు..!) -
భావి ఫలం
పాత కథే. కానీ కొత్త విషయానికి ప్రారంభంగా పనికొస్తుంది. చావు దగ్గరపడిన ఓ ముసలాయన ఎంతో శ్రద్ధగా మొక్క నాటడాన్ని చూసిన బాటసారి నవ్వడం మనకు తెలుసు. అది ఎప్పటికి పెరిగేనూ, ఎప్పటికి కాసేనూ! ప్రతి పనినీ మన కోసమే చేయం. ముందు తరాలకు పనికొచ్చేట్టుగా చేస్తాం. అదే వాళ్ల పూర్వీకులుగా మనం ఇవ్వగలిగే కానుక! బాటసారిలో గౌరవం పెరిగేలా వృద్ధుడు ఇదే చెబుతాడు. సరిగ్గా ఇలాంటి భావనతోనే నార్వేలో ‘ఫ్యూచర్ లైబ్రరీ ప్రాజెక్ట్’ ప్రారంభమైంది. దీనికి శ్రీకారం చుట్టింది స్కాట్లాండ్కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ కేటీ పేటర్సన్. ఈమె వయసు 41 ఏళ్లు. ఈ భవిష్యత్ గ్రంథాలయ ప్రాజెక్టు 2014లో ప్రారంభమైంది. వందేళ్ల పాటు అంటే 2114 వరకూ కొనసాగుతుంది. ఒక్కో ఏడాదికి ఒక్కో రచయిత తన సరికొత్త అముద్రిత రచనను ఈ గ్రంథాలయానికి బహూకరిస్తారు. మొదటి రచనగా 2014 సంవత్సరానికి మార్గరెట్ అట్వుడ్ (కెనడా) తన ‘స్క్రిబ్లర్ మూన్ ’ సమర్పించారు. 2015కు డేవిడ్ మిషెల్ (ఇంగ్లండ్) తన ‘ఫ్రమ్ మి ఫ్లోస్ వాట్ యు కాల్ టైమ్’ను ఇచ్చారు. 2016కు షివోన్ (ఐస్లాండ్), 2017కు ఏలిఫ్ షాఫక్ (టర్కీ) తమ రచనలు బహూకరించారు. 2018కి హాన్ కాంగ్ (దక్షిణ కొరియా), 2019కి కార్ల్ ఊవ్ నాస్గార్డ్ (నార్వే), 2020కి ఓసియన్ వువాంగ్ (వియత్నాం) ఇచ్చారు. ఈ రచనలన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయని కాదు, అలా ఇవ్వాలని కూడా లేదు. సౌకర్యార్థం శీర్షికల వరకు ఆంగ్లంలో అనువదించి ఉంచారు. విశేషం ఏమంటే– ఇందులోకి చేరే ‘పుస్తకాలు’ ఏమిటో కేటీకి గానీ, ఈ లైబ్రరీని నిర్వహించడానికి నెలకొల్పిన ‘ద ఫ్యూచర్ లైబ్రరీ ట్రస్టు’కు గానీ తెలీదు. సాహిత్యానికి గానీ కవిత్వానికి గానీ అద్భుతమైన చేర్పు అయిన, భవిష్యత్ తరాల ఊహలను అందుకోగలిగే శక్తి సామర్థ్యాలున్న రచయితను ఆ సంవత్సరపు రచయితగా ఎంపిక చేసుకుంటారు. వారు అంగీకరించాక, అది రాయడానికి ఒక ఏడాదైనా పడితే, ఆ పూర్తయిన రాతపత్రిని నార్వేలో జరిపే ప్రత్యేక వేడుక ద్వారా స్వీకరిస్తారు. అందుకే 2021కి గానూ సిత్సి దాంగెరెంబ్గా(జింబాబ్వే) ‘నారిని అండ్ హర్ డాంకీ’ని 2022లో ఇచ్చారు. 2022 సంవత్సరానికి జుడిత్ షలన్ స్కీ (జర్మనీ) ఈ జూన్ లో అందజేస్తారు. ఆ రాతప్రతిని ప్రత్యేకమైన వస్త్రాల్లో చుట్టి, ఓస్లో ప్రజా గ్రంథాలయంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన గదిలో ఉంచుతున్నారు. ఇవి వందేళ్ల తర్వాత ప్రచురితమవుతాయి. మరో విశేషం ఏమంటే, ఈ పుస్తకాలను అచ్చు వేయడానికే వెయ్యి చెట్లను ప్రత్యేకంగా అక్కడి నార్డ్మార్కా అటవీ ప్రాంతంలో పెంచుతున్నారు. ఈ వంద చేతిరాత ప్రతులను ఈ చెట్లతో తయారుచేసిన కాగితాలతో లిమిటెడ్–ఎడిషన్ గా ప్రచురిస్తారు. అందుకే దీన్ని ప్రపంచపు అత్యంత రహస్య గ్రంథాలయం అని గార్డియన్ పత్రిక అభివర్ణించింది. అయితే వందేళ్ల పాటు వీటిని చదవకుండా పాఠకులకు దూరంగా ఉంచుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. వందేళ్ల నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించిన వాళ్లుగానీ, దీనికి పుస్తకాలు సమర్పించిన చాలామంది రచయితలుగానీ ఉండరు. మార్గరెట్ అట్వుడ్ వయసు 83 ఏళ్లు. అంతెందుకు, ఈ ప్రాజెక్టు రచయితలుగా పరిగణనలోకి వచ్చిన టోమాస్ ట్రాన్స్ ట్రోమార్ (స్వీడన్ ), ఉంబెర్టో ఎకో (ఇటలీ) ఇప్పటికే మరణించారు కూడా. ‘‘అప్పటికి దీర్ఘకాలంగా నిశ్శబ్దంగా ఉన్న నా గొంతుక ఉన్నట్టుండి, ఒక వందేళ్ల తర్వాత మేల్కొంటుందన్న ఆలోచనే చిత్రంగా ఉంది. ఆ కంటెయినర్ లోంచి ఆ పుస్తకంలోని మొదటి పేజీ తెరిచే ఇప్పటికింకా శరీరంగా రూపుదిద్దుకోని ఆ చేతికి ఆ గొంతుక ఏం చెబుతుంది?’’ అని ఉద్విగ్నంగా మాట్లాడారు మార్గరెట్ అట్వుడ్. ‘‘భవిష్యత్తులో ఎప్పుడో చదువుతారని ఆశిస్తున్న ఒక రాతప్రతిని రాయడమనే ఆలోచనే ఒక ఉత్తరం రాసి నదిలో వేయడం లాంటిది. అది ఎటు పోతుందో మనకు తెలీదు, ఎవరు చదువుతారో తెలీదు– ఆ కాలప్రవాహాన్ని విశ్వసించడమే’’ అన్నారు ‘ద బాస్టర్డ్ ఆఫ్ ఇస్తాంబుల్’, ‘ద ఫార్టీ రూల్స్ ఆఫ్ లవ్’ లాంటి నవలలు రాసిన ఎలిఫ్ షఫాక్. ఆమె ఇచ్చిన ‘ద లాస్ట్ టాబూ’ కాల ప్రవాహంలో ఏ మలుపులు తీసుకుంటుందో! ‘‘నేనెట్లాగూ మరో వందేళ్లు ఉండను. నేను ప్రేమించేవాళ్లు కూడా ఉండరు. ఈ కనికరం లేని వాస్తవం నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన విషయం గురించి ఆలోచించేట్టు చేసింది. నేనెందుకు రాస్తాను? నేను రాస్తున్నప్పుడు ఎవరితో సంభాషిస్తున్నాను? ఆ తర్వాత నేను ఒక ప్రపంచాన్ని ఊహించాను, అక్కడ నేను ప్రేమించేవాళ్లు ఎవరూ ఉండరు. కానీ ఆ ప్రపంచంలో నేను బతికి వుండగా కలిసిన నార్వేలోని చెట్లు ఇంకా ఉంటాయి. మనుషులకూ, చెట్లకూ మధ్య ఉన్న స్పష్టమైన ఈ అంతరం నన్ను తాకింది. ఈ ధ్యానం ఎంత తీవ్రమైనదంటే, మన నశించిపోయే జీవితాల అశాశ్వతత్వానికీ, విలువైన పెళుసుదనాల మన జీవితాలకూ నేరుగా కళ్లు తెరిపించింది’’ అంటారు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్. ‘‘ఈ ఆలోచన అద్భుతం. ఇప్పటికింకా పుట్టని పాఠకులకు మన కాలం నుంచి వారి కాలానికి ఒక చిన్న పడవను పంపడమే ఇది’’ అన్నారు కార్ల్ ఓవ్ నాస్గార్డ్. ఇప్పుడు పెరుగుతున్న ఈ చెట్ల నుంచి కాయనున్న పుస్తకాలను ఆరగించడానికి ప్రపంచంలోని ఏ మూలల్లో మనుషులు జీవం పోసుకోనున్నారో! వందేళ్ల తర్వాత ఏం జరుగుతుందో చూడాలని ఇప్పుడే కుతూహలంగా లేదూ! -
నార్వేను ఉలిక్కిపడేలా చేసిన ‘ఇస్డాల్ ఉమన్’
ఉన్నత ఆశయానికీ.. ఒట్టి మోసానికీ పోలికేంటీ? గొప్ప ప్రేరణకు.. స్వార్థ గుణానికి పొంతనేంటీ? కానీ ఆమె జీవితంలో.. వాటన్నింటికీ చోటుంది. అవును.. ఆమె బతుకు, చావు రెండూ మిస్టరీనే. నార్వే చరిత్రలో ఎన్నో అనుమానాలతో లిఖించిన ‘ఇస్డాల్ ఉమన్ ’ స్టోరీ పూర్తిగా చదివితే అది నిజమే అనిపిస్తుంది. 1970 నవంబర్ 29, ఆదివారం మిట్ట మధ్యాహ్నం మొదలైందీ కథ. నార్వేలోని బర్గన్ నగరానికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఇస్డాలెన్ వ్యాలీ సమీపంలోని కొండ మీదకు ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లతో హైకింగ్ ట్రయల్కి వెళ్లాడు. ఉన్నట్టుండి కాలిన వాసన గుప్పుమంటూ.. ఆ తండ్రీకూతుళ్లను ఆ చుట్టూ వెతికేలా చేసింది. కాసేపటికి.. వెనుకవైపు ఏటవాలుగా ఉన్న లోయలో సగం కాలిన ఓ అమ్మాయి శవం.. వాళ్లని గజగజా వణికించింది. వెంటనే ముగ్గురూ బర్గన్ పోలీస్ స్టేషన్కి పరుగుతీశారు. దట్టమైన చెట్లతో.. చెత్తాచెదారంతో కాస్త భయంకరంగా ఉండే ఆ చోటు.. చాలామందికి పర్యాటక ప్రదేశం. నిరంతరం ఆత్మహత్యలు, అనుకోని ప్రమాదాలతో అప్పటికే ఇస్డాలెన్ లోయకి ‘ది డెత్ వ్యాలీ’ అనే పేరు పుట్టుకొచ్చింది. నిటారుగా, అగమ్యగోచరంగా ఉన్న క్రైమ్ స్పాట్కి చేరుకోవడం పోలీసులకు చాలా కష్టమైంది. శవం సగంపైనే కాలిపోయింది. రూపం చెదిరిపోయింది. రెండు పిడికిళ్లు బిగించి.. బాక్సర్ పొజిషన్ లో ‘ఫైట్ చేయడానికి సిద్ధమే’ అన్నట్లుంది ఆమె శవం. ఆ పక్కనే సగం కాలిన గొడుగు, రెండు ప్లాస్టిక్ సీసాలు, లిక్కర్ బాటిల్ ఇలా చాలా పడి ఉన్నాయి. నిజానికి అక్కడ ప్రతి గుర్తింపుని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లనిపించింది. డ్రెస్ లేబుల్స్, బాటిల్ లేబుల్స్ ఏవీ లేవు. పైగా ఆమె నగలు, వాచ్ ఓ పక్కన పొందిగ్గా కనిపించాయి. వైద్యపరీక్షల్లో ఆమె కడుపులో 50 నుంచి 70 దాకా నిద్రమాత్రలున్నాయని.. తేలింది. కొన్ని రోజులకి బర్గన్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో 2 సూట్కేసులు దొరికాయి. వాటిపై చనిపోయిన అమ్మాయి వేలిముద్రలు ఉండటంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఓపెన్ చేశారు. అందులో 2 కళ్లద్దాలు.. రంగురంగుల డ్రెస్లతో పాటు చాలా విగ్గులు.. జర్మనీ, నార్వే, బెల్జియం వంటి దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు.. కోడింగ్లో రాసిన ఒక పేపర్, షూ షాప్ కవర్ ఉన్నాయి. అన్నింటిలో కోడింగ్ పేపర్, షూ కవర్.. కేస్ను ఛేదించే క్లూస్గా కనిపించాయి. షూ కవర్.. నార్వేలోని స్టవంగర్లో రార్ట్వెట్ షూ షాప్కి చెందిందని గుర్తించి.. అక్కడికి వెళ్లి ఆరా తీశారు. కొన్ని రోజుల క్రితం ఒక యువతి తమ దగ్గర జత బూట్లు కొన్నదని.. సెలెక్ట్ చేసుకోవడానికి చాలా సమయం తీసుకుందని.. తను చాలా వినయంగా, అందంగా ఉందని.. కళ్లు, జుట్టు గోధుమ రంగులో ఉన్నాయని.. ఆ షాప్ యజమాని కొడుకు చెప్పాడు. మృతదేహం దగ్గర దొరికిన షూస్ అవేనని అతడు గుర్తించాడు. దాంతో పోలీసులు వెంటనే ఆమె ఊహాచిత్రాన్ని గీయించారు. ఇంతలో కోడింగ్ పేపర్లో ఉన్నదాన్ని కనిపెట్టి.. ఆమె బస చేసిన ఓ హోటల్కి వెళ్లారు. ఊహాచిత్రం ఆధారంగా ఆ హోటల్లో ఆరా తియ్యగా.. ఆమె ‘ఫనెలా లార్ష్’ అనే పేరుతో చెక్ ఇన్ అయ్యిందని, కొన్ని రోజుల అక్కడే ఉందని తేలింది. ఆల్విల్డా రంగ్నెసా అనే వెయిట్రెస్.. ఆమెని వెంటనే గుర్తుపట్టింది. ‘ఆమె చాలా అందంగా ఉంది. ఆమె అందానికి ముగ్ధురాలినయ్యానని ఆమె గ్రహించి.. నన్ను చూసి కొంటెగా నవ్వేది. అందుకే తను నాకు బాగా గుర్తుండిపోయింది’ అని చెప్పింది. అలాగే ఆమె మరో కీలక సమాచారాన్నీ ఇచ్చింది. ‘ఒకరోజు ఆమె.. డైనింగ్ హాల్లో ఇద్దరు జర్మనీ నేవీ అధికారుల పక్కనే చాలాసేపు కూర్చుంది. అయితే తను వాళ్లతో మాట్లాడటం నేను చూడలేదు’ అనీ చెప్పింది. దాంతో కోడ్ లాంగ్వేజ్ రాతలను సరిపోల్చుకుంటూ.. ‘ఆమె ఒక గూఢాచారి’ అన్న అభిప్రాయం ఏర్పడింది. కొన్నిరోజులకు ఆమె చాలా మారుపేర్లతో, మారువేషాలతో.. పలు హోటల్స్లో ఉందనే సమాచారం వచ్చింది. 1960లో నార్వేజియన్ పెంగ్విన్ క్షిపణి ట్రయల్స్తో ఒక స్త్రీ కదలికలు చురుగ్గా ఉండేవని, ఆమె ఈమే కావచ్చనే నివేదికలూ బయటికొచ్చాయి. ఈ క్రమంలోనే.. ‘ఆమె మోసగత్తె అయ్యి ఉంటుంది, డబ్బు కోసం వేషాలు మారుస్తూ ఉండేదేమో?’ అని కొందరు.. ‘లేదు లేదు తనో వేశ్య కావచ్చు’ అని మరికొందరు సొంత కథనాలు అల్లడం మొదలుపెట్టారు. పోలీసులు ఎంత దర్యాప్తు చేసినా.. కనీసం ఆమె పేరు కూడా తెలుసుకోలేకపోయారు. ఆమె శవం ఇస్డాలెన్లో దొరికింది కాబట్టి కాలక్రమంలో ‘ఇస్డాల్ ఉమన్’ అంటూ వార్తాపత్రికలే నామకరణం చేశాయి. అయితే సడెన్గా 1971లో పోలీసులు ఆ కేసును క్లోజ్ చేశారు. సరిగ్గా 46 ఏళ్ల తర్వాత.. 2016లో తీవ్ర ఒత్తిళ్ల మధ్య.. ఈ కేసుని రీ–ఓపెన్ చేశారు. ఆమె అవశేషాలకు మళ్లీ వైద్య పరీక్షలు చేయించారు. ఆమె ఊపిరితిత్తుల్లో పొగ రేణువులు ఉన్నాయని.. మంటల్లో కాలుతున్నప్పుడు ఆమె బతికే ఉందని.. శరీరం పెట్రోల్తో కాలిందని, కడుపులోని నిద్రమాత్రలతో పాటు.. మంటలతో ఏర్పడిన కార్బ¯Œ మోనాక్సైడ్ కూడా ఆమె మరణానికి కారణమైందని వైద్యులు తేల్చారు. ఇక రీ ఓపెన్లోనూ సేమ్ సీన్. ఆమె చావుపై కాస్త క్లారిటీ వచ్చినా.. ఆమె ఎవరన్నది ఎవరికీ తెలియలేదు. 2019లో ఫ్రాన్స్లోని ఫర్బాష్ నివాసి ఒకరు ‘లే రిపబ్లికేన్ లోరేన్ ’ అనే న్యూస్ పేపర్లో వచ్చిన ఈమె కథనాన్ని చదివి.. ఆ సంస్థ రిపోర్టర్స్ని కలిశాడు. ‘1970 వేసవిలో.. నేను సుమారు 26 ఏళ్ల వయసున్న ఓ యువతితో కలసి జీవించాను. తను చాలా భాషల్లో మాట్లాడగల సమర్థురాలు. యూరప్లోని బాల్కన్ యాసలో మాట్లాడేది. వ్యక్తిగత వివరాలు పంచుకోవడానికి ఇష్టపడేది కాదు. తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చేవి. తన దగ్గర చాలా విగ్గులు, రంగురంగుల దుస్తులు ఉండేవి. ఆమె అచ్చం ఇస్డాల్ ఉమన్ ఊహాచిత్రంలానే ఉంది’ అని చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారం కథను రసవత్తరంగా మార్చింది తప్ప.. ముందుకు మాత్రం తీసుకెళ్లలేదు. ఇక ఈ కేసుని శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకున్నారు. డీఎన్ఏ ప్రొఫైల్ ఆధారంగా.. ఆమె యూరప్ సంతతికి చెందని మహిళ అంటూ.. ఆమె బంధువుల్ని వెతికే పనిలో పడ్డారు. నిజానికి వాళ్ల ప్రయత్నం ఫలిస్తే.. ఏదో ఒకరోజు ఆమె ఎవరు అన్నది ప్రపంచానికి తెలుస్తుంది. కానీ అది హత్యా? ఆత్మహత్యా? హత్య అయితే ఎవరు చేశారు? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకడం మాత్రం కష్టమే. ఏదేమైనా చివరికి ఆమె సృష్టించుకున్న మారుపేర్లు, మారు రూపాలే.. ఆమె ఉనికిని కాలగర్భంలో కలిపేశాయి. ఆమె ఒక స్పై(గూఢచారి)గా తన దేశానికి గొప్ప సేవ అందించి యోధగా శత్రువు చేతిలో మరణించిందా? లేక మోసగత్తెగా ఎవరి ప్రతికారానికైనా బలయ్యిందా? జీవితంపై విరక్తితో నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? అన్న ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాల్లేవు. - సంహిత నిమ్మన -
కన్నబిడ్డల కోసం ఆ తల్లి పోరాడింది, చివరకు..
పిల్లలకు చిన్నగాయమైనా, కాసేపు కనిపించకపోయినా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అలాంటిది.. వాళ్లను తమ నుంచి శాశ్వతంగా దూరం చేసే యత్నం చేస్తే? తమ సంరక్షణలో పెరగనివ్వకుండా చట్టాలు అడ్డుకుంటే!. సముద్రాల అవతల ఎక్కడో విదేశాల్లో దూరమైన బిడ్డలు.. స్వదేశంలో తల్లి చెంతకు చేరిన కథే ఇది. అందుకోసం చట్టం పోరాడిందామె. ఈ క్రమంలో భర్తకు దూరమైంది. ఆయినా ఆమె కుంగిపోలేదు. ప్రయత్నించి.. చివరకు పిల్లలను దక్కించుకుంది. ఆ కథనే రాణీ ముఖర్జీ లీడ్ రోల్లో బాలీవుడ్లో ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’గా తెరకెక్కించారు. తన కన్నబిడ్డల కస్టడీ కోసం భారత్కు చెందిన ఓ మహిళ.. నార్వే ప్రభుత్వంతో పోరాడింది. ఆ పోరాటం అప్పట్లో వార్తల్లో హెడ్లైన్స్ అయ్యింది. ఆ గడ్డపై ఓటమి పాలైనా.. అది తాత్కాలికమే అయ్యింది. చివరికి స్వదేశానికి చేరుకుని పిల్లల కోసం కోర్టు మెట్లెక్కింది. ఆ తల్లి విజయం సాధించి పదేళ్లు పూర్తైంది. ఇంతకీ అప్పుడేం జరిగింది.. పశ్చిమ్ బెంగాల్కు చెందిన అనురూప్ ఛటర్జీ ఉద్యోగం రిత్యా నార్వేకు వెళ్లాడు. కూడా భార్య సాగరికాను తీసుకెళ్లాడు. అప్పటికే వాళ్లకు ఓ కొడుకు ఉన్నాడు. ఆటిజంతో బాధపడుతున్న ఆ బాబును చూసుకోవడంతోనే సాగరికకు సరిపోయేదట. ఈలోపు ఆమె మళ్లీ గర్భం దాల్చింది. దీంతో కొడుకును చూసుకోవడం కష్టంగా మారిందామె. ఇదే ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి, కన్నబిడ్డలను దూరం చేసేందుకు నార్వే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. నార్వేలో పిల్లల సంరక్షణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అందరూ వాటిని పాటించాలి. పిల్లలను కొట్టినా.. చివరకు చేత్తో తినిపించినా శిక్షార్హమైన నేరమే. అలాంటిది కొడుకు కోసం సెపరేట్ బెడ్ లేకపోవడం(తండ్రితోనే పడుకునేవాడు)తో.. ఆమె తన కొడుకును సరిగా చూసుకోవడం లేదంటూ నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్(Barnevarne అని కూడా అంటారు)కు ఫిర్యాదు వెళ్లింది. వెంటనే అనురూప్ ఇంటికి బార్నెవార్నె అధికారులు వెళ్లారు. అయితే.. అప్పటికే ఆమె గర్భవతిగా ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెళ్లిపోయారు. ఈ క్రమంలో.. ఆమె కొడుకు వెళ్లే ప్లే స్కూల్ నిర్వాహకులు.. సాగరిక దినచర్య సరిగా ఉండదని, తరచూ పిల్లాడి విషయంలో కౌన్సిలింగ్కు పిలిచేవాళ్లమంటూ నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్కు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంతలో మరో బిడ్డను ప్రసవించాక ఆ పరిస్థితి మరింత దిగజారింది. పిల్లలిద్దరినీ ఆమె సరిగా పెంచడం లేదంటూ.. వాళ్లను తల్లిదండ్రులకు దూరంగా సంరక్షణా కేంద్రంలో ఉంచారు. అలాగే 18 ఏళ్లు నిండేవరకు వారు అక్కడే పెరుగుతారని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి. ఇది జరిగింది 2011లో. అప్పటికి కొడుకు వయసు రెండున్నరేళ్లు కాగా, పాపకి ఏడాది వయసు కూడా లేదు. కోర్టుకు వెళ్తే.. సంరక్షణా కేంద్రానికే అనుకూలంగా తీర్పు వచ్చింది. కావాలంటే ఏడాదిలో మూడుసార్లు మాత్రమే వచ్చి చూడొచ్చంటూ కోర్టు తల్లిదండ్రులకు చెప్పింది. మానసికంగా వాళ్లకు కుంగదీసింది ఈ పరిణామం. ఆ ప్రభావంతో అనురూప్-సాగరికల మధ్య దూరం పెరిగి.. విడిపోయారు. కోల్కతా కోర్టు తీర్పు అనంతరం బయట సంతోషంగా సాగరిక మరోవైపు సాగరిక కథ హెడ్లైన్స్ ద్వారా భారత్కు చేరింది. ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంది. దౌత్యపరమైన పరిష్కారం కోసం యత్నించింది. కానీ, నార్వే ప్రభుత్వం మొండివైఖరి అవలంభించింది. చివరికి.. భారత్ ఒత్తిడికి తలొగ్గి బంధువులకు అప్పగించేందుకు నార్వే ప్రభుత్వం అంగీకరించింది. అలా.. 2012లో పిల్లలు భారత్లోని తమ బంధువు వద్దకు వచ్చారు. కానీ, సాగరిక తన న్యాయపోరాటం ఆపలేదు. స్వస్థలానికి చేరుకున్నాక.. కోల్కతా హైకోర్టును ఆశ్రయించిందామె. 2013 జనవరిలో కోల్కతా హైకోర్టు పిల్లలను ఆమె కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది. ఎట్టకేలకు ఆమె బిడ్డలు ఆమె చెంతకు చేరారు. ఆ సమయంలో ఆ తల్లికి అవి వర్ణించలేని క్షణాలు. సాగరిక పోరాటాన్నే ఇప్పుడు తెరపై రాణీ ముఖర్జీ ప్రదర్శించబోతున్నారు. మార్చి 17వ తేదీన మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రం విడుదల కానుంది. :::సాక్షి ప్రత్యేకం -
ప్రపంచ చెస్ చాంపియన్ కార్ల్సన్పై విదిత్ విజయం
చెన్నై: ప్రొ చెస్ లీగ్లో భారత గ్రాండ్మాస్టర్ విదిత్ సంతోష్ గుజరా తి గొప్ప ఫలితం సాధించాడు. ప్రపంచ నంబర్వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)పై విదిత్ గెలుపొందాడు. ఆన్లైన్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఇండియన్ యోగిస్ జట్టు తరఫున పోటీపడుతున్న విదిత్ బ్లిట్జ్ గేమ్లో 58 ఎత్తుల్లో కెనడా చెస్బ్రాస్ జట్టు తరఫున ఆడుతున్న కార్ల్సన్పై విజయం సాధించాడు. 16 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీని లక్షా 50 వేల డాలర్ల ప్రైజ్మనీతో నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో కార్ల్సన్ను ఓడించిన నాలుగో భారత గ్రాండ్మాస్టర్ విదిత్ కావడం విశేషం. ప్రజ్ఞానంద, గుకేశ్, ఇరిగేశి అర్జున్ కూడా ఈ నార్వే దిగ్గజంపై వివిధ టోరీ్నలలో గెలుపొందారు. -
సంచలనం.. రెండోరౌండ్లోనే వెనుదిరిగిన టాప్స్టార్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో మరో సంచలనం నమోదైంది. వరల్డ్ మూడో ర్యాంకర్.. నార్వే సూపర్స్టార్ కాస్పర్ రూడ్ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భాగంగా గురువారం కాస్పర్ రూడ్, అమెరికాకు చెందిన 37వ ర్యాంకర్ జెన్సన్ బ్రూక్స్బై మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బ్రూక్స్బై కాస్పర్ రూడ్ను 6-3, 7-5,6-7(4), 6-2తో మట్టికరిపించి మూడో రౌండ్కు దూసుకెళ్లాడు. మ్యాచ్లో తొలి రెండుసెట్లు బ్రూక్స్బై గెలుచుకొని ఆధిక్యం కనబరిచినప్పటికి.. మూడోసెట్ టై బ్రేక్కు దారి తీసింది. టై బ్రేక్లో విజృంభించిన కాస్పర్ రూడ్ సెట్ను కైవసం చేసుకున్నాడు. ఇక నాలుగో సెట్లో తొలుత బ్రూక్స్బై తడబడినప్పటికి తిరిగి ఫుంజుకొని 6-2తో సెట్ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్ను గెలుచుకున్నాడు. గతేడాది రెండు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో రన్నరప్గా నిలిచిన కాస్పర్ రూడ్ ఈసారి ఎలాగైనా తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ కొట్టాలన్న కసితో బరిలోకి దిగాడు. కానీ అతని పోరాటం రెండో రౌండ్తోనే ముగిసిపోయింది. ఇప్పటికే వరల్డ్ నెంబర్ రెండో ర్యాంకర్.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన మ్యాచ్లో మెకంజీ మెక్డొనాల్డ్ చేతిలో నాదల్ ఓటమి పాలయ్యాడు. అయితే ఎడమ కాలి తుంటి గాయంతో బాధపడుతున్న నాదల్ కోలుకోవడానికి 6-8 వారాలు పట్టే అవకాశం ఉందని స్వయంగా పేర్కొన్నాడు. ఇక నెంబర్వన్ ఆటగాడు జొకోవిచ్ మాత్రం దూసుకెళుతున్నాడు. A huge upset on Matchday 4️⃣ 😲 The No. 2️⃣ seed Casper Ruud is sent packing after an inspired performance from American Jenson Brooksby 😲🇺🇸#SonySportsNetwork #SlamOfTheGreats #AO2023 #JensonBrooksby pic.twitter.com/LhrYqBDNfa — Sony Sports Network (@SonySportsNetwk) January 19, 2023 చదవండి: మ్యాచ్ పట్టించుకోకుండా పక్షులు, ఆకాశంకేసి చూస్తున్నారా!? 'మనకి, వాళ్లకి తేడా ఉండాలి కదా.. చిన్నపిల్లాడి మనస్తత్వం!' -
దేశానికే యువరాణి.. కాబోయే భర్త కోసం.. రాజభోగాలు విడిచి..
ఓస్లో: ఆమె ఒక దేశానికి యువరాణి. కనుసైగ చేస్తే చాలు వందిమాగధులు కోరినదేదైనా కాదనకుండా తెస్తారు. అష్టైశ్వర్యాలతో తులతూగే జీవితం. కానీ ఆమె కాబోయే భర్త కోసం అవన్నీ వదులుకుంది. అతను చేసే ఆల్టర్నేటివ్ మెడిసన్ వ్యాపారాలపై దృష్టి పెట్టడానికి యువరాణి బాధ్యతల్ని నుంచి బయటపడింది. ఆమే నార్వే యువరాణి మార్తా లూయిస్. ఆమెకు కాబోయే భర్త డ్యూరెక్ వెరెట్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తూంటారు. ఇదేదో సంప్రదాయ వైద్యం కాదు. ప్రత్యామ్నాయ వైద్యంపై పరిశోధనలు చేయాలి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి డ్యూరెక్ చేస్తున్న కృషికి అండగా నిలవడానికి మార్తా లూయిస్ రాచరిక విధుల నుంచి బయటకు వచ్చారు ‘‘నా వ్యక్తిగత పనులకి, రాజకుటుంబంలో పోషించే పాత్రకి మధ్య విభజన ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. రాజు హరాల్డ్–5 కూడా ఇందుకు అంగీకరించారు. ప్రిన్సెన్స్ టైటిల్ మాత్రం నాతోనే ఉంటుంది. ప్రత్యామ్నాయ వైద్యం ప్రాముఖ్యతను ప్రజలకు చెప్పడంలో ఎంతో ఆనందముంది’’ అని యువరాణి వెల్లడించారు. మరోవైపు తనని తాను దివ్యశక్తులున్న వ్యక్తిగా చెప్పుకునే డ్యూరెక్పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఆయన చేసే వైద్య విధానం మంచిదేనని గొప్పగా చెప్పుకుంటే, మరికొందరు తాంత్రికవాది అంటూ కొట్టి పారేస్తున్నారు. -
ఆయన కోసం రాజభోగాలు వదులుకుంది!
ఓస్లో: అంతులేని వైభోగాలు.. నిత్యం వెన్నంటి ఉండే మందీమార్బలం.. సపర్యలు చేసి పెట్టడానికి వందల మంది సిబ్బంది.. ఇవన్నీ ఎవరు వదులుకుంటారు? కానీ, కొద్ది నెలల క్రితం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ.. రాజరికాన్ని వదులుకుని అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసింది. అదే దారిలో నార్వే యువరాణి మార్థా లూయీస్ నడిచారు. తన రాచరికాన్ని వదులుకుంటున్నట్లు మంగళవారం సంచలన ప్రకటన చేశారు. తనకు కాబోయ భర్తతో కలిసి ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారాలపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రముఖ హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్-అమెరికన్ ఆరవ తరం షమన్ అయిన డ్యూరెక్ వెరెట్తో 51 ఏళ్ల యువరాణి మార్థా లూయీస్ ప్రేమలో ఉన్నారు. అయితే, షమన్తో యువరాణి అనుబంధం కారణంగా 17 శాతం మంది నార్వేయన్లు రాయల్ కుటుంబంపై వ్యతిరేకతతో ఉన్నట్లు గత సెప్టెంబర్లో జరిగిన ఓ పోల్ వెల్లడించింది. మరోవైపు.. ‘రాయల్ కుటుంబంలో ప్రశాంతతను తీసుకొచ్చేందుకు నేను తప్పుకుంటున్నాను’ అంటూ మంగళవారం తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేశారు యువరాణి మార్థా లూయిస్. నార్వే రాజు ప్రకటన.. మరోవైపు.. రాయల్ ప్యాలెస్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. యువరాణి తన రాజరికాన్ని వదులుకుంటున్నారని, ఇకపై ఆమెకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేసింది. అయితే, రాజు కోరిక మేరకు ఆమె యువరాణిగా పిలవబడతారని తెలిపింది. యువరాణి మార్థా ప్రకటన తర్వాత రాణి సంజాతో కలిసి మీడియాతో మాట్లాడారు నార్వే రాజు హరాల్డ్. యువరాణి రాయల్ కుటుంబానికి ఇకపై ప్రాతినిధ్యం వహించదని చెప్పేందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. తన నిర్ణయంపై ఆమె ఎంతో స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే వివాహం.. ముగ్గురు పిల్లలు.. దేవదూతలతో మాట్లాడగలనని చెప్పుకునే మార్థా లూయిస్కు ఇప్పటికే వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నాయి. అయితే, ఆమె తన భర్త అరిబెన్తో విడిపోయారు. 2002లో క్లైర్ వాయెంట్గా పని చేసేందుకు సిద్ధమైన క్రమంలో ‘హర్ రాయల్ హైనెస్’ అనే టైటిల్ను కోల్పోయారు. మరోవైపు.. 2019లో తన వ్యాపారాల విషయంలో ప్రిన్సెస్ టైటిల్ను ఉపయోగించబోనని అంగీకరించారు. గత జూన్లో షమన్ వెరెట్తో అనుబంధం ఏర్పడిన క్రమంలో వారు ప్రత్యామ్నాయ థెరపీలపై దృష్టిసారించారు. సోషల్ మీడియా వేదికగా వాటిపై విస్తృత ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను కీలక బాధ్యతల నుంచి తప్పించాయి పలు హెల్త్కేర్ గ్రూప్లు. View this post on Instagram A post shared by Princess Märtha Louise (@princessmarthalouise) ఇదీ చదవండి: హ్యారీకి అవమానం -
ఏపీ: విదేశీ పెట్టుబడులతో పాటు లోకల్ బ్రాండింగ్ కోసం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ నేతృత్వంలో ఇవాళ(మంగళవారం) బిజినెస్ సమ్మిట్ మొదలైంది. ఈ సమ్మిట్లో నార్వే, జర్మనీ దేశాల్లోని భారత రాయబారులు హాజరయ్యారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, చేనేత, టెక్స్ టైల్ తదితర రంగాల్లో అవకాశాల వివరణకు ఈ సమ్మిట్ ఒక వేదికగా నిలవనుంది. ప్రముఖంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఎగుమతి అవకాశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. నార్వే, జర్మనీ దేశాల్లోని భారత రాయబారులైన బి.భాస్కర్, పి.హరీష్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇక ఈ సదస్సులో ప్రత్యేకార్షణగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, స్థానిక ఉత్పత్తులకు బ్రాండింగే లక్ష్యంగా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు.. పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఉద్యానవనం, ఆహారశుద్ధి, వ్యవసాయం, మత్స్య శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి, పర్యాటక విభాగం అథారిటీ సీఈవో కె.కన్నబాబు, ఏపీఈడీబీ సీఈవో డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తదితరులు హాజరయ్యారు. సంబంధిత కథనం: 3టీ విధానంతో జర్మనీ, నార్వేకు ఎగుమతులు -
3టీ విధానంతో జర్మనీ, నార్వేకు ఎగుమతులు
సాక్షి, అమరావతి: ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా జర్మనీ, నార్వే దేశ అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ దేశాలతో టూరిజం, ట్రేడ్ (వ్యాపారం), టెక్నాలజీ ‘3టీ’ల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఏపీఐఐసీ కార్యాలయంలో నార్వే, జర్మనీ దేశాల ఎగుమతి, దిగుమతిదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి నార్వే, జర్మ నీ దేశాల్లోని భారత రాయబారులు బి.బాలభాస్కర్, పి.హరిష్ హాజరుకానున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన తెలిపారు. రాష్ట్రం నుంచి ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులు, సులభతర వాణిజ్యం కోసం అమలు చేస్తున్న ప్రణాళికలను జర్మనీ, నార్వే దేశ రాయబారులకు వివరించనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఉద్యాన ఉత్పత్తులు, మత్స్య సంపద, చేనేత, టెక్స్టైల్తోపాటు టూరిజం వంటి రంగాలపై దృష్టి సారించామని, మంగళవారం సమావేశానికి ఆయా రంగాల భాగస్వాములు హాజరవుతారని తెలిపారు. అలాగే ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా ఆయా జిల్లాలకు చెందిన ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలను వివరిస్తామని, ఇందులో భాగంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కాకినాడ జిల్లా ఉత్పత్తులను ఆయా జిల్లాల కలెక్టర్లు వర్చువల్గా వివరించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్యర్యంలో అమలవుతున్న అమృత్ సరోవర్ కార్యక్రమం వివరాలను కూడా వివరిస్తారు. రాష్ట్రం నుంచి 2021–22లో రూ.1,43,843.19 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఇది దేశీయ మొత్తం ఎగుమతుల్లో 5.5 శాతం. దీన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగానే దేశంలోఎక్కడా లేనివిధంగా ఒకేసారి నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రూ.25,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. దీంతోపాటు భావనపాడు, రామాయపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, మచిలీపట్నం వద్ద పోర్టు ఆధారిత భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇవన్నీ పూర్తయి, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. -
క్రికెట్లో అరుదైన ఘటన.. నోరెళ్లబెట్టడం ఖాయం!
క్రికెట్లో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. మాములుగా స్లిప్లో ఇద్దరు లేదా ముగ్గురు.. మహా అయితే నలుగురు ఫీల్డర్లు ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మ్యాచ్లో మాత్రం తొమ్మిది మంది స్లిప్ ఫీల్డర్లు కనిపిస్తారు. మాములుగా క్రికెట్ మ్యాచ్లో ఒక జట్టులో ఉండేదే 11 మంది ఆటగాళ్లు. కీపర్, బౌలర్ను వదిలేస్తే మిగతా తొమ్మిది మంది స్లిప్లోనే ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే దీనికి సంబంధించిన ఫోటో క్షణాల్లో వైరల్గా మారింది. ఈ అరుదైన ఘటన యూరోపియన్ క్రికెట్ లీగ్లో జరిగింది. రొమేనియా, నార్వే జట్ల మధ్య టి10 మ్యాచ్ జరిగింది.రొమేనియా ఇన్నింగ్స్ సమయంలో నార్వే స్లిప్లో తొమ్మిది మంది ఫీల్డర్లను మోహరించింది. మరి ఇంత మంది ఫీల్డర్లను చూసి కన్ఫ్యూజ్ అయిన సదరు బ్యాటర్ పరుగులు సాధించాడా లేదా అనే అనుమానం వస్తుంది. కానీ ఆ బ్యాటర్ తెలివిగా వాళ్ల మధ్యలో నుంచి షాట్ ఆడి రెండు పరుగులు తీయడం విశేషం. మ్యాచ్ గెలుస్తామన్న ధీమా వచ్చిన తర్వాతే స్లిప్లో తొమ్మిది మంది ఫీల్డర్లను ఉంచినట్లు నార్వే కెప్టెన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు.. ''వార్నీ స్లిప్లోనే జట్టు మొత్తం కనిపిస్తుంది.. ఇదేం ఫీల్డింగ్'' అంటూ నోరెళ్లబెట్టారు. మ్యాచ్ విషయానికి వస్తే.. నార్వే జట్టు 43 పరుగులతో ఘన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్వే 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రొమేనియా నిర్ణీత 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) చదవండి: సూర్యకుమార్ ‘ప్రాక్టీస్’ -
రేషన్ షాపుల్లో కాదు.. గుండెల్లో పెట్టుకుంటాం!
‘న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రపంచం అన్నది ప్రతి ఒక్కరి హక్కు.. నిజం చెప్పాలంటే ప్రపంచం ఏమంత బాగాలేదు’.. – ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సమావేశంలో వారం క్రితం నటి ప్రియాంక చోప్రా మాట ఇది.. .... బ్రిటన్ ను దాటి ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా.. కాలరెత్తుకున్న ఇండియన్ – ఓ మెట్టు ఎక్కిన ఆర్థిక భారతం. మానవాభివృద్థి సూచీలో 132వ స్థానంలో మనం.. – విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల్లో మరో మెట్టుజారిన పేద భారతం.. .... ఈ రెండూ దాదాపు వారం తేడాతో వచ్చిన వార్తలే. కానీ పరస్పర విరుద్ధం. ఇది చూస్తే పాత జోక్ ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఓ రిచ్ స్టూడెంట్ పేదవాడిపై రాసిన వ్యాసం.. ‘వాళ్లింట్లో తల్లి, తండ్రి, పిల్లలు అంతా పేదవాళ్లే. వారి ఇంట్లో పనిమనిషి పేదవాడే, తోటమాలీ పేదవాడే.. చివరికి కారు డ్రైవరూ బాగా పేదవాడే..’ అని.. .... ఎకానమీ గణాంకాలు ఎప్పుడూ ‘ద్రవ్యోల్బణం’లా ఉంటాయి.. అర్థమైనట్టే ఉన్నా అయోమయంగా తోస్తాయి. పెరిగాయో, తగ్గాయో తెలియదు.. ఎక్కడ, ఎందుకు పెరుగుతాయో, తగ్గుతాయో సామాన్యులెవరికీ అర్థంకాదు. ... ‘ఏమంత బాగాలేదు’.. అన్న విషయం మాత్రం అనుభవంలోకి వస్తుంది.. ఏదీ సెక్యూరిటీ? విద్య, వైద్యంతో కూడిన మానవాభివృద్థి సూచీకి ప్రాధాన్యం ఎంత ఉంటుందో ఓ నెటిజెన్ షేర్ చేసిన ఈ మెసేజ్ చూస్తే తెలుస్తుంది. ‘‘.. నేను పెద్దవాళ్లు చెప్పినట్టుగా డిగ్రీ చేశా.. మంచి ఉద్యోగం సంపాదించా.. సమాజ నియమాలకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నా.. ఆర్థిక నిపుణుల సూచన మేరకు నడుచుకుని పొదుపు చేసుకున్నా. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నా.. క్రెడిట్ కార్డుల జోలికి వెళ్లనే లేదు. సర్కార్ చెప్పినట్టుగా ట్యాక్స్లు కట్టా.. లైఫ్ అంతా మంచి సిటిజెన్గా ఉన్నా.. నా భార్యకు కేన్సర్ వచ్చింది. ఇన్సూరెన్స్ పోను 20 లక్షలు ఖర్చయింది. పొదుపు చేసిందంతా పోయింది. పాతికేళ్ల కష్టం రోగం పాలైంది. ఇంటి ఈఎంఐలు ఆగిపోయాయి. పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి. ... ఇప్పుడు చెప్పండి మీరు చెప్పే నీతులపై, ఈ ప్రభుత్వాలపై నాకు ఎందుకు గౌరవం ఉండాలి? నాకు ఏం రక్షణ ఉందని నమ్మాలి. నా పిల్లల భవిష్యత్తుకు సొసైటీ, గవర్నమెంట్ ఉపయోగపడుతుందని విశ్వసించాలా? పిల్లల్ని నాలా ఒబీడియెంట్ సిటిజెన్లా పెంచమంటారా?’’ – జీవితంపైనా.. ప్రభుత్వంపైనా సంపూర్ణంగా ఆశలు పోయిన సందర్భం ఇది ఇదీ ప్రయారిటీ.. 132వ స్థానంలో ఉన్న మనం ఇలా ఉంటే.. కొద్ది సంవత్సరాలుగా ‘మానవాభివృద్థి సూచీ’లో అందరి కన్నా ముందు ఉంటున్న నార్వే ఎలా ఉందో చూద్దాం.. చమురు, సహజ వాయువు నిక్షేపాలు నార్వేకు ప్రధాన ఆదాయ వనరు. అయితే ఇలా వచ్చిన డబ్బును ఆ దేశం ప్రజాపనులు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తుంటుంది. నార్వే అద్భుతమైన ఆరోగ్య రంగాన్ని రూపొందించుకుంది. ఎంతలా అంటే.. ఆ దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే ఆరోగ్య బీమా కల్పిస్తుంది. అన్నిరకాల వైద్యం ఉచితంగా అందిస్తుంది. ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన గాలి, నీరు లభించే ప్రాంతాల్లో ఒకటిగా నార్వే పేరు పొందింది. ప్రపంచంలో అతి ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయేది ఆ దేశంలోనే.. కాలుష్య రహిత వాతావరణం, మంచి వైద్య సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ఆదాయం అన్నీ ఉన్న నార్వే ప్రజల ఆయుష్షు కూడా ఎక్కువే. అక్కడివారి సగటు జీవితకాలం 82.3 ఏళ్లు. అక్కడి ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువు పూర్తిగా ఉచితం. విదేశీ విద్యార్థులకు కూడా ఫీజులు తీసుకోరు. నార్వే ప్రభుత్వం ఆ దేశ జీడీపీలో 6.6శాతం విద్యా రంగంపైనే ఖర్చుపెడుతుంది . విద్య, వైద్యం కోసం తమ సంపాదన అంతా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి లేకపోవడంతో ఆ దేశంలో ధనిక, పేద అంతరం మరీ ఎక్కువగా ఉండదు. ప్రతి కుటుంబం మెల్లగా ధనిక స్థాయికి ఎదిగే వాతావరణం ఉంటుంది. ఖర్చు విషయంలో వెసులుబాటు కారణంగా.. ఇప్పటితరం తమ తాతలు, తండ్రుల కంటే ఎక్కువగా విహార యాత్రలు చేయడం, ఎంజాయ్ చేయడం పెరిగింది. నార్వేలో ఉద్యోగిత రేటు 74.4 శాతం. మిగతావారు స్వయం ఉపాధి రంగాల్లో ఉంటారు. అంటే నిరుద్యోగం అతి తక్కువ. అక్కడ టెలి కమ్యూనికేషన్స్, టెక్నాలజీ రంగాల్లో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉంటుంటాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా నార్వే తరహాలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో మెరుగ్గా ఉన్నాయి. శాంతి భద్రతల విషయంలో నార్వే ప్రజలు ఎంతో సంతృప్తితో ఉన్నామని చెప్తుంటారు. రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడానికి ఏమాత్రం భయం అనిపించదని 88 శాతం మంది చెప్పడం గమనార్హం. ఆ దేశంలో సంభవించే మొత్తం మరణాల్లో హత్యలు అరశాతం (0.5%) లోపే కావడం గమనార్హం. ఆ దేశంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సుమారు నాలుగు వేల మంది మాత్రమే. అక్కడి మహిళా ఉద్యోగులు గర్భం దాల్చితే.. పూర్తి జీతంతో కూడిన 8 నెలల (35 వారాలు) సెలవు (మెటర్నిటీ లీవ్) ఇస్తారు. లేదా 80 శాతం జీతంతో పది నెలలు (45 వారాలు) సెలవు తీసుకోవచ్చు. అవసరమైతే తండ్రులు కూడా పెటర్నిటీ లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టిన మూడేళ్లలోపు 12 వారాల పాటు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు. ఇదేం చారిటీ ..! ఈ మధ్య ఓ రేషన్ షాప్ ముందు స్టాండప్ కామెడీ సీన్ ఒకటి జరిగింది. సాక్షాత్తూ దేశ ఆర్థిక మంత్రి పేదవారికి ఇచ్చే కిలో బియ్యంలో కేంద్రం, రాష్ట్రవాటాల లెక్కలేశారు. పేదవారికి పెడుతున్న తిండిలో తమ వాటా 28 రూపాయలనీ, రాష్ట్రం వాటా 4 రూపాయలనీ, ప్రజల వాటా ఒక్క రూపాయనీ తేల్చారు. తమ వాటా ఇంత ఉండగా ప్రధాని మోదీ ఫొటో ఏదని నిలదీశారు... (క్లిక్ చేయండి: సదా.. మీ ‘చెప్పు’ చేతుల్లోనే..) ‘‘.. ఓ దేశం పేదరికాన్ని దాటడమనేది ‘చారిటీ’ కాదు. సహజ న్యాయంగా జరగాలి’’ అన్న నెల్సన్ మండేలా మాట ఆ సమయంలో గుర్తుకొచ్చి ఉంటే బాగుండేది. సహజన్యాయం జరిగితే... నేతలు తమ ఫొటోలను రేషన్ షాపుల్లో వెతుక్కోనక్కర్లేదు. అందరి ఇళ్లలో, గుండెల్లో అవి కనిపిస్తాయి. మానవాభివృద్థి సూచీ దానికదే పరుగులు పెడుతుంది. (క్లిక్ చేయండి: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) -
Davis Cup: భారత్ పరాజయం
లిల్లీహ్యామర్ (నార్వే): డేవిస్కప్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్కు అర్హత సాధించలేకపోయింది. నార్వే జట్టుతో జరిగిన వరల్డ్ గ్రూప్–1 పోటీలో భారత్ 1–3తో ఓడిపోయింది. మూడో మ్యాచ్గా శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ జోడీ 3–6, 6–3, 3–6తో కాస్పర్ రూడ్–విక్టర్ దురాసోవిచ్ (నార్వే) ద్వయం చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది. అంతకుముందు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సింగిల్స్ మ్యాచ్లో రామ్కుమార్ రామనాథన్ 1–6, 4–6తో దురాసోవిచ్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఫలితం తేలిపోయాక నాలుగో మ్యాచ్లో సుమిత్ నగాల్ 6–2, 6–1తో లుకాస్ హెలమ్ (నార్వే)ను ఓడించాడు. తుది ఫలితంతో మార్పు ఉండే అవకాశం లేకపోవడంతో ఐదో మ్యాచ్ను నిర్వహించలేదు. భారత్ వచ్చే ఏడాది వరల్డ్ గ్రూప్–1లో చోటు కోసం ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడుతుంది. -
Davis Cup 2022: తొలి సింగిల్స్లో ప్రజ్నేశ్ పరాజయం
లిల్లీహ్యామర్ (నార్వే): డేవిస్కప్ టీమ్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1లో భాగంగా నార్వేతో శుక్రవారం మొదలైన పోటీలో భారత్కు శుభారంభం లభించలేదు. యూఎస్ ఓపెన్ రన్నరప్, ప్రపంచ రెండో ర్యాంకర్ కాస్పర్ రూడ్తో జరిగిన తొలి సింగిల్స్లో ప్రపంచ 335వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కనీస పోరాట పటిమ కనబర్చకుండానే చేతులెత్తేశాడు. కేవలం 62 నిమిషాల్లో ముగిసిన తొలి సింగిల్స్లో 23 ఏళ్ల కాస్పర్ రూడ్ 6–1, 6–4తో 32 ఏళ్ల ప్రజ్నేశ్ను ఓడించి నార్వేకు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో ప్రజ్నేశ్ నాలుగు ఏస్లు సంధించినా తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయాడు. రెండో సింగిల్స్ విక్టర్ దురాసోవిచ్, రామ్కుమార్ రామనాథన్ మధ్య జరుగుతుంది. నేడు డబుల్స్ మ్యాచ్తోపాటు రెండు రివర్స్ సింగిల్స్ జరుగుతాయి. -
US Open 2022: ‘నంబర్వన్’ సమరం
న్యూయార్క్: పురుషుల టెన్నిస్ చరిత్రలో తొలిసారి గ్రాండ్స్లామ్ టోర్నీ ఫైనల్లో ఇద్దరు క్రీడాకారులు ఏకకాలంలో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్తోపాటు ప్రపంచ నంబర్వన్ ర్యాంక్నూ సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. ఫైనల్లో గెలిచిన ప్లేయర్కు తొలి గ్రాండ్స్లామ్ టైటిల్తోపాటు ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ లభిస్తుంది. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి ఒంటి గంట 30 నిమిషాలకు ఈ ఫైనల్ మొదలవుతుంది. సెమీఫైనల్స్లో ఏడో సీడ్ కాస్పర్ రూడ్ 7–6 (7/5), 6–2, 5–7, 7–2తో 27వ సీడ్ ఖచనోవ్ (రష్యా)పై... మూడో సీడ్ అల్కరాజ్ 6–7 (6/8), 6–3, 6–1, 6–7 (5/7), 6–3తో 22వ సీడ్ టియాఫో (అమెరికా)పై గెలిచారు. 23 ఏళ్ల కాస్పర్ రూడ్ తన కెరీర్లో రెండో సారి గ్రాండ్స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరగా... 19 ఏళ్ల అల్కరాజ్ తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ ఏడాది కాస్పర్ రూడ్ ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్ చేరి రన్నరప్గా నిలిచాడు. పక్కా ప్రణాళికతో... నాన్న క్రిస్టియాన్ శిక్షణలో రాటుదేలిన కాస్పర్ పక్కా ప్రణాళికతో ఆడి రష్యా ఆజానుబాహుడు ఖచనోవ్ ఆట కట్టించాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ శక్తివంతమైన సర్వీస్లను రిటర్న్ చేయడానికి కాస్పర్ బేస్లైన్ వెనుక నిల్చోని రిటర్న్ చేశాక సుదీర్ఘ ర్యాలీలు ఆడాడు. తొలి సెట్ టైబ్రేక్లో కాస్పర్, ఖచనోవ్ మధ్య 12వ పాయింట్ కోసం ఏకంగా 55 షాట్ల ర్యాలీ జరగడం విశేషం. మూడు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్లో కాస్పర్ పది ఏస్లు సంధించాడు. నెట్ వద్దకు 23 సార్లు దూసుకొచ్చి 20 సార్లు పాయింట్లు గెలిచాడు. 53 విన్నర్స్ కొట్టిన కాస్పర్ తన ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఖచనోవ్ 41 అనవసర తప్పిదాలు చేశాడు. వరుసగా మూడో మ్యాచ్లో... ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న అల్కరాజ్ ఈ టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్లోనూ ఐదు సెట్ల పోరాటంలో విజయాన్ని దక్కించుకున్నాడు. 4 గంటల 19 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో 59 విన్నర్స్ కొట్టిన అల్కరాజ్ నెట్ వద్దకు 42 సార్లు దూసుకొచ్చి 32 సార్లు పాయింట్లు గెలిచాడు. మరోవైపు టియాఫో 15 ఏస్లు సంధించి ఆరు డబుల్ ఫాల్ట్లు, 52 అనవసర తప్పిదాలు చేశాడు. 7: ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో వరుసగా మూడు ఐదు సెట్ల మ్యాచ్లు గెలిచి ఫైనల్ చేరిన ఏడో ప్లేయర్గా అల్కరాజ్ గుర్తింపు పొందాడు. గతంలో అగస్సీ (అమెరికా; 2005 యూఎస్ ఓపెన్), ఎడ్బర్గ్ (స్వీడన్; 1992 యూఎస్ ఓపెన్), బన్గెర్ట్ (జర్మనీ; 1967 వింబుల్డన్), టోనీ రోచ్ (ఆస్ట్రేలియా; 1967 ఫ్రెంచ్ ఓపెన్), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా; 1962 ఫ్రెంచ్ ఓపెన్), అలెక్స్ ఒల్మెడో (పెరూ/అమెరికా; 1959 ఆస్ట్రేలియన్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. రాజీవ్–సాలిస్బరీ జోడీకి డబుల్స్ టైటిల్ పురుషుల డబుల్స్లో రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీ టైటిల్ను నిలబెట్టుకుంది. ఫైనల్లో రాజీవ్ రామ్–సాలిస్బరీ ద్వయం 7–6 (7/4), 7–5తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్స్కీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. వరుసగా 22వ ఏడాది యూఎస్ ఓపెన్లో ఆడిన రాజీవ్ 11 వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగాడు. వుడ్ఫర్డ్–వుడ్బ్రిడ్జ్ (ఆస్ట్రేలియా; 1995, 1996) ద్వయం తర్వాత యూఎస్ ఓపెన్లో వరుసగా రెండేళ్లు డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి జోడీగా రాజీవ్–సాలిస్బరీ ద్వయం గుర్తింపు పొందింది. -
నార్వేలో కాల్పుల కలకలం...ఇద్దరు మృతి
నార్వే: నార్వేలోని ఓస్లోలో గే బార్ నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల్లో ఇద్దుర మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. ఐతే కాల్పులు జరిగిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే అనుమానితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసుల ప్రతినిధి టోర్ బార్స్టాడ్ చెప్పారు. గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఓస్లోలోని లండన్ పబ్లో కాల్పుల సృష్టించిన వ్యక్తిని చూసినట్లు ఒక పబ్లిక్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ చెప్పాడన్నారు. ఈ మేరకు జర్నలిస్ట్ ఒలావ్ రోన్నెబర్గ్ మాట్లాడుతూ...తాను ఒక వ్యక్తి బ్యాగ్తో గే బార్ నైట్ క్లబ్లోకి ప్రవేశించడం చూశానన్నారు. ఆ తర్వాత అతను తుపాకీ తీసుకుని కాల్చడం ప్రారంబించాడని చెప్పారు. ఐతే ఈ దాడికి గల కారణాలేమిటో ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల నేపథ్యంలో నార్వేలో రెడ్ అలర్ట్ ప్రకటించామని అధికారులు వెల్లడించారు. (చదవండి: గన్ కంట్రోల్ బిల్లుకు అమెరికా సెనేట్ అమోదం) -
అబ్బబ్బా ఏం చేశారు!.. బాలీవుడ్ పాటకు దుమ్ములేపిన నార్వే డ్యాన్సర్లు
పుట్టినరోజు, పెళ్లి, షష్టిపూర్తి.. వేడుక ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. ఎన్నో టెన్షన్స్, హడావిడీ మధ్య సాగే ఈ పనుల్లో కొంచెం ట్రెండ్ మార్చి ఆటపాటలతో హంగామా చేస్తున్నారు. సంగీతం, డ్యాన్స్లను జోడిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాలతో పోలిస్తే ఇండియాలో జరిగే పెళ్లిళ్లకే ఎంజాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. తాజాగా నార్వేలో జరిగిన పెళ్లిల్లో ఓ డ్యాన్స్ బృందం తామేం తక్కువ కాదంటూ డ్యాన్స్తో దుమ్ములేపారు. ఓ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్న "క్విక్ స్టైల్" అనే బృందం పాటకు తగ్గట్టు కాలు కదుపుతూ అందర్నీ ఆకట్టుకున్నారు. అబ్బాయిలంతా గ్రూప్లా ఏర్పడి బాలీవుడ్ సినిమా తన వెడ్స్ మనులోని సాలి గాలి పాటకు డ్యాన్స్ చేశారు. ఎకరిని మించి ఒకరు ఎనర్జిటిక్గా స్టెప్పులేశారు.‘దీనిని మేము ఇంకా పూర్తి చేయలేదు’ అంటూ ఈ వీడియోను దిక్విక్స్టైల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. చదవండి: క్లాస్రూమ్లో పిల్లలతో కలిసి స్టెప్పులేసిన టీచర్.. అదరహో! నార్వే దేశస్తుల డ్యాన్స్ స్టెప్పులు నెటిజన్ల హృదయాలను దోచుకుంటోంది. ఇప్పటి వరకు ఏడు లక్షలకు పైగా వ్యూవ్స్, దాదాపు లక్ష లైక్లు వచ్చి చేరాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మీ డ్యాన్స్ చూసేందుకు మేము కూడా ఇంకా అలసి పోలేదంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ బృందం ఇంతకముందు కూడా అనేక బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Quick Style (@thequickstyle) -
Norway Chess: ఆనంద్ అదరహో
స్టావెంజర్: నార్వే ఓపెన్ క్లాసికల్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్లో ఆనంద్ గెలుపొందాడు. వారం రోజుల వ్యవధిలో కార్ల్సన్పై ఆనంద్కిది రెండో గెలుపు కావడం విశేషం. ఇదే వేదికపై జరిగిన బ్లిట్జ్ కేటగిరీ టోర్నీలోనూ కార్ల్సన్పై ఆనంద్ విజయం సాధించాడు. క్లాసికల్ టోర్నీలో 31 ఏళ్ల కార్ల్సన్తో జరిగిన ఐదో రౌండ్ గేమ్ను తెల్లపావులతో ఆడిన 52 ఏళ్ల ఆనంద్ 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. అయితే ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయిన గేమ్లో ఫలితం వచ్చేందుకు ప్రత్యేకంగా ‘అర్మగెడాన్’ గేమ్ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ‘అర్మగెడాన్’ గేమ్ నిబంధనల ప్రకారం తెల్ల పావులతో ఆడే ప్లేయర్కు 10 నిమిషాలు, నల్ల పావులతో ఆడే ప్లేయర్కు 7 నిమిషాలు కేటాయిస్తారు. తెల్ల పావులతో ఆడుతున్న ప్లేయర్ గెలిస్తేనే అతనికి విజయం ఖరారవుతుంది. ఒకవేళ గేమ్ ‘డ్రా’ అయితే మాత్రం తక్కువ సమయం పొందినందుకుగాను నల్ల పావులతో ఆడిన ప్లేయర్ను గెలిచినట్లు ప్రకటిస్తారు. రెగ్యులర్ గేమ్లో ఏ రంగు పావులతో ఆడారో అదే రంగును అర్మగెడాన్ గేమ్లోనూ కేటాయిస్తారు. దాంతో కార్ల్సన్తో అర్మగెడాన్ గేమ్లో ఆనంద్ తెల్ల పావులతో ఆడాల్సి వచ్చింది. ఈ గేమ్లో ఆనంద్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చకచకా ఎత్తులు వేస్తూ కార్ల్సన్ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. చివరకు ఆనంద్ 50 ఎత్తుల్లో కార్ల్సన్ను ఓడించాడు. ఈ టోర్నీలో రెగ్యులర్ గేమ్లో విజయానికి మూడు పాయింట్లు కేటాయిస్తున్నారు. గేమ్ ‘డ్రా’ అయి అర్మగెడాన్ గేమ్లో గెలిస్తే 1.5 పాయింట్లు లభిస్తాయి. పది మంది మేటి గ్రాండ్మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత ఆనంద్ 10 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలో ఉన్నాడు. 9.5 పాయింట్లతో కార్ల్సన్ రెండో ర్యాంక్లో ఉన్నాడు. -
విశ్వనాథన్ ఆనంద్కు మూడో విజయం
Norway Chess tournament: నార్వే ఓపెన్ క్లాసికల్ చెస్ టోర్నీలో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ వరుసగా మూడో విజయం నమోదు చేశాడు. ఆనంద్–వాంగ్ హావో (చైనా) మధ్య మూడో గేమ్ 39 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అయితే ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయిన గేమ్లో ఫలితం కోసం ‘అర్మగెడాన్’ గేమ్ను నిర్వహిస్తారు. ఈ అర్మగెడాన్ గేమ్లో ఆనంద్ 44 ఎత్తుల్లో వాంగ్ హావోను ఓడించాడు. మూడో రౌండ్ తర్వాత ఆనంద్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అంజుమ్ రజత గురి బాకు (అజర్బైజాన్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ ఖాతాలో మూడో రజత పతకం చేరింది. శుక్రవారం మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో అంజుమ్ మౌద్గిల్ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో పంజాబ్కు చెందిన 28 ఏళ్ల అంజుమ్ 12–16 పాయింట్ల తేడాతో రికీ ఇబ్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది. ఎని మిది మంది షూటర్ల మధ్య జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో రికీ ఇబ్సెన్ 411.4 పాయింట్లు, అంజుమ్ 406.5 పాయింట్లు స్కోరు చేసి తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్కు చేరారు. చదవండి: Sakshi Malik: ఐదేళ్ల తర్వాత పసిడి పతకంతో మెరిసింది! -
హోడ ఖామోష్..: అఫ్గాన్ అగ్నితేజం
టైమ్ మ్యాగజైన్ ప్రభావశీలుర జాబితా (100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2022)లో చోటు సంపాదించిన వారిలో అఫ్గానిస్థాన్ అగ్నితేజం హోడ ఖామోష్ ఒకరు. ‘ఖామోష్’ అనేది పేరు కాదు. లక్షల గొంతుల రణనినాదం... ఇరాన్లో జన్మించింది హోడ ఖామోష్. తాను చిన్న వయసులో ఉన్నప్పుడే కుటుంబంతో పాటు అఫ్గానిస్థాన్కు వచ్చింది. ఆరోజుల్లో తనకు నిద్ర పట్టాలంటే అమ్మ తప్పనిసరిగా ఏదో ఒక కథ చెప్పాల్సిందే. అలా ఖామోష్ కాల్పనిక ప్రపంచంలోకి ప్రవేశించింది. ఆ ప్రపంచంలో ఎన్నో కథలు చదివింది. ఎన్నో కవిత్వాలు విన్నది. తొలిరోజుల్లో తన కాల్పనిక ప్రపంచంలో వాస్తవాలతో సంబంధం లేని ఊహాకల్పిత సాహిత్యం మాత్రమే ఉండేది. ఆ తరువాత కాలంలో మాత్రం...తన ప్రపంచంలోకి వాస్తవికత నడిచి వచ్చింది. రాజులు, రాణులు, అందమైన కోటలు, అద్భుత దీపాల స్థానంలో... నిజమైన సమాజం దర్శనమిచ్చింది. మనుషులు ఎదుర్కొనే రకరకాల సమస్యలను గురించి లోతుగా తెలుసుకోగలిగింది. తన మనసులోని వేడివేడి భావాలను కవిత్వంగా రాసేది. ‘సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజం తరఫున పనిచేయడానికి ఇది మాత్రమే చాలదు’ అనుకొని జర్నలిస్ట్ కావాలనుకుంది. ఖామోష్ ఆలోచనను హర్షించిన వారు తక్కువ. భయపెట్టిన వారు ఎక్కువ. అయితే అవేమీ తన కలను అడ్డుకోలేకపోయాయి. జర్నలిజంలో శిక్షణ పొందిన ఖామోష్ ఆ తరువాత స్థానిక పత్రికలలో పనిచేసింది. స్త్రీల హక్కులు, ఉద్యమాలపై ప్రత్యేకకథనాలు రాసింది. లోకల్ రేడియో ఛానల్స్ ప్రెజెంటర్గా తన గొంతు వినిపించింది. ఇదంతా ఒక ఎత్తయితే పౌరహక్కుల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం మరో ఎత్తు. ఉద్యమంలో భాగంగా ఎందరో మహిళలకు అండగా నిలిచింది. దాడులను ఎదుర్కొంది. బాధితులకు న్యాయం జరిగే వరకు మడమ తిప్పలేదు. అఫ్గానిస్థాన్లో తాలిబన్ల పాలన మళ్లీ మొదలైన తరువాత చాలామంది కలాలు అటకెక్కాయి. గొంతులు మాట మార్చుకున్నాయి. కానీ ఖామోష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అవే అక్షరాలు...అదే గొంతు! తాలిబన్ల పాలన మొదలై అప్పటికే అయిదు నెలల దాటింది. ఆ సమయంలో ‘స్త్రీలపై జరుగుతున్న అణచివేత’ అనే అంశంపై నార్వేలో మాట్లాడే అవకాశం లభించింది. ‘ఈ సమయంలో మాట్లాడితే ప్రాణాలకే ముప్పు’ అని చాలామంది హెచ్చరించినా ఆమె భయపడలేదు. ‘నేను తప్పు చేయడం లేదు. తప్పుల గురించి మాట్లాడబోతున్నాను’ అంటూ నార్వేకి వెళ్లింది ఖామోష్. నీళ్లు నమలకుండా నిజాలు మాట్లాడింది. ఆనాటి ఆమె ప్రసంగంలో కొన్ని మాటలు... ‘నా పేరు హోడ ఖామోష్. అఫ్గానిస్థాన్లోని వేలాది మంది మహిళలలో నేను ఒకరిని. నేను ఏ రాజకీయపార్టీకి సానుభూతిపరురాలిని కాదు. సభ్యురాలిని కాదు. పౌరహక్కుల ఉద్యమంలో పనిచేస్తున్నాను. తాలిబన్ల పాలనలో ఉన్నాను. భయంతో గుండె వేగంగా కొట్టుకునే చోట, బుల్లెట్ల చప్పుడు నిరంతరాయంగా వినిపించే చోట ఉన్నాను’ ‘కాబుల్ తాలిబన్ల వశం అయిన తరువాత రాజ్యం పోలీసు రాజ్యం అయింది. స్త్రీలపై వివక్షత పెరిగింది. మీరు ఉండాల్సింది విద్యాలయాల్లో కాదు ఇంట్లో...అంటూ అణచివేత మొదలైంది. ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పాపానికి ముర్తాజ సమది అనే ఫొటోగ్రాఫర్ని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. కాబుల్లో స్త్రీల నిరసన ప్రదర్శనకు సంబంధించిన వార్తలు రాసినందుకు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసి నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. తమ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న 70 మంది పౌరులను అరెస్ట్ చేశారు. వారిలో 40 మంది మహిళలను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించి చిత్రహింసలకు గురిచేశారు’ నార్వే సదస్సులో అఫ్గాన్ కన్నీటి చిత్రాన్ని కళ్లకు కట్టిన ఖామోష్ ‘ఇక అంతా అయిపోయింది’ అని నిరాశ పడడం లేదు. ‘స్త్రీలను గౌరవించే రోజులు, స్త్రీల హక్కులు రక్షించబడే రోజులు తప్పకుండా వస్తాయి’ అంటున్న ఖామోష్లో ‘ఆశ’ అనే జ్వాల ఉజ్వలంగా వెలుగుతూనే ఉంది. -
డేవిస్ కప్లో నార్వేతో భారత్ పోరు
న్యూఢిల్లీ: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ 1లో భారత్ తలపడే ప్రత్యర్థి ఖరారైంది. ఈ పోరులో నార్వేతో భారత ఢీకొంటుంది. గురువారం ఈ ‘డ్రా’ విడుదల చేయగా, నార్వే వేదికగానే భారత్ తమ ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి ఉంది. సెప్టెంబర్ 16–18 మధ్య డేవిస్ కప్ మ్యాచ్ జరుగుతుంది. అయితే దాదాపు అదే తేదీల్లో ఆసియా క్రీడలు కూడా జరగనుండటంతో జట్టు ఎంపిక భారత టెన్నిస్ సంఘానికి (ఏఐటీఏ) ఇబ్బందిగా మారనుంది. ఆసియా క్రీడల్లో సెప్టెంబర్ 10–14 మధ్య టెన్నిస్ మ్యాచ్ జరగనుండగా...తక్కువ వ్యవధిలో నార్వే చేరుకొని భారత్ ఆడటం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో తేదీల్లో మార్పు చేసే విషయంపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)కు ఏఐటీఏ విజ్ఞప్తి చేయనుంది. డేవిస్ కప్ చరిత్రలో భారత్, నార్వే ఎప్పుడూ ప్రత్యర్థులుగా తలపడలేదు. ఆ జట్టులో వరల్డ్ నంబర్ 8 కాస్పర్ రూడ్ రూపంలో అగ్రశ్రేణి ఆటగాడు ఉన్నాడు. -
ఆమె కలలో కూడా ఊహించి ఉండదు! ఇలా జరుగుతుందనీ..
she Is The Only Passenger: ఒక్కోసారి మనకు భలే విచిత్రమైన అనుభవాలు చోటు చేసుకుంటాయి. వాటిని మనం కనీసం కలలో కూడా ఊహించి ఉండం. అలాంటి చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. నమ్మశక్యంగా కూడా అనిపించదు. మనం చెప్పిన ఎవరూ నమ్మరు అన్నట్లుగా జరుగుతుంటాయి. అచ్చం అలాంటి విచిత్రమైన అనుభవం ఎదురైంది నార్వేకి చెందిన మహిళకి. వివరాల్లోకెళ్తే...కోవిడ్ -19 ఆంక్షలతో అంతర్జాతీయ ప్రయాణాలు చేయకుండా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో చాలా దేశాల్లో ఇంకా అంతర్జాతీయ విమానాలు తిరగడం లేదనే చెప్పాలి. ఇప్పుడిప్పడే కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పలు దేశాల్లో ఆంక్షలు సడలించడంతో విమానాయాన సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం ప్రారంభమైంది. ఈ మేరకు నార్వే నుంచి రోరోస్ బయలు దేరుతున్న విమానాన్ని ఒకే ఒక్క మహిళా ప్రయాణికురాలు బుక్ చేసుకుంది. ఇంకా ఎవరు బుక్ చేసుకోలేదు. అయితే సదరు మహిళకు కూడా తెలియదు ఆ విమానంలో తాను ఒక్కత్తే ప్రయాణికురాలినని. దీంతో ఆ మహిలో ఆనందానికి అవధులే లేవు. తాను మాత్రమే ఈ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలినని తెలియడంతో ఆమె ఆ విమానంలో ప్రయాణిస్తున్న సంఘటనను గుర్తుంచుకునేలా వీడియో రికార్డు చేసింది. ఆ విమానంలో ఫైలెట్లు, ఆమె తప్ప మరెవ్వరూ లేరు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Aurora Torres (@aurooratorres) (చదవండి: ఆ రాయి అందర్నీ చంపేస్తుంది) -
423 రోజుల తర్వాత గ్రౌండ్లోకి.. గతం ఒక చీకటి జ్ఞాపకం
నార్వేకు చెందిన ఫుట్బాలర్ ఒమర్ ఎలాబ్దెల్లౌయి జీవితం అందరికి ఆదర్శప్రాయం. మానసికంగా గట్టిదెబ్బ తగిలినప్పటికి తన ఆత్మవిశ్వాసంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు. ప్రమాదవశాత్తూ ఒక కన్ను కోల్పోయి 423 రోజుల పాటు తనకు ఇష్టమైన ఆటకు దూరంగా ఉండిపోయాడు. దాదాపు 11 సర్జరీల అనంతరం కంటిచూపు తిరిగి వచ్చింది. తాజాగా మళ్లీ ఫుట్బాల్ గ్రౌండ్లో అడుగుపెట్టి తన కలను సాకారం చేసుకున్నాడు. -సాక్షి, వెబ్డెస్క్ డిసెంబర్ 31,2020.. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఒమర్ తనవాళ్లతో క్రాకర్స్ కాలుస్తూ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. పొరపాటున ఒక క్రాకర్ అతని కంట్లోకి దూసుకెళ్లింది. అంతే నొప్పితో విలవిల్లలాడిన ఒమర్.. ''నేను చూడలేకపోతున్నా'' అంటూ పక్కనున్న వాళ్లతో చెప్పాడు. వెంటనే ఓమర్ను ఆసుపత్రికి తరలించారు. ఎడమ కన్ను బాగా దెబ్బతిందని.. కంటిచూపు రావడం కష్టమేనని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఒమర్ ఎలాబ్దెల్లౌయి ఫుట్బాల్ కెరీర్ అర్థంతరంగా ముగిసిపోతుందని అంతా భావించారు. కానీ ఒమర్ మనసు అందుకు అంగీకరించలేదు. ఎంత కష్టమైన సరే మళ్లీ ఫుట్బాల్ గ్రౌండ్లో అడుగుపెట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కంటిచూపు కోసం ఎంతో మంది స్పెషలిస్టులను కలిశాడు. చివరగా ఫిబ్రవరి 2021లో సిన్సినాటి ఐ ఇన్స్టిట్యూట్ డాక్టర్ ఒమర్కు చిన్న ఆశ కలిగించాడు. ఎడమ కంటిలో స్టెమ్ సెల్స్ దెబ్బతిన్నాయని.. కార్నియాకు ఏం కాలేదని చెప్పాడు. సర్జరీ చేస్తే కంటిచూపు వచ్చే అవకాశముందని పేర్కొన్నాడు. ఒమర్ కంటికి సరిపోయే స్టెమ్ సెల్స్ లభిస్తే.. కాస్త రిస్క్ అయినా ఫలితం వస్తుందని సదరు డాక్టర్ పేర్కొన్నాడు. ఇక్కడే ఒమర్కు అదృష్టం తగిలింది. తన కంటికి కరెక్ట్గా సరిపోయే స్టెమ్ సెల్స్ దొరకడంతో సర్జరీ విజయవంతమైంది. దాదాపు 11 సర్జీరీల అనంతరం ఒమర్కు కంటిచూపు వెనక్కి వచ్చింది. ఆ తర్వాత మరో ఏడాదిపాటు ఇంట్లోనే ఉండి తన కంటిని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అలా మొత్తానికి 423 రోజుల విరామం అనంతరం మళ్లీ ఫుట్బాల్ గ్రౌండ్లో అడుగుపెట్టాడు. గోజ్టేపేతో జరిగిన మ్యాచ్లో గలతసరాయ్ తరపున బరిలోకి దిగిన ఒమర్ 90 నిమిషాల పాటు మ్యాచ్ ఆడాడు. మ్యాచ్లో గలతసరాయ్ 3-2 తేడాతో విజయం సాధించి ఒమర్కు కానుకగా ఇచ్చారు. కాగా మ్యాచ్లో ఒమర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: Virat Kohli: అత్యంత పాపులర్ ఆటగాడిగా అరుదైన గౌరవం Munich Air Disaster: ఫిబ్రవరి 6, 1958.. ఫుట్బాల్ చరిత్రలో అతి పెద్ద విషాదం 😢 Uzun bir aranın ardından formasına kavuşan Omar Elabdellaoui, bitiş düdüğünün ardından gözyaşlarını tutamadı. #GÖZvGS pic.twitter.com/Pu1cnQpwgi — beIN SPORTS Türkiye (@beINSPORTS_TR) February 21, 2022 -
కుర్ర ప్లేయర్.. రూ. ఐదు కోట్లకుపైగా వాల్యూ.. ఏమా కథ?
ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. స్పోర్ట్స్లోనూ క్రిప్టో ప్రాధాన్యం పెరిగిపోతోంది ఇప్పుడు. ఆటగాళ్ల పేరిట ఎన్ఎఫ్టీ(నాన్ ఫంగిబుల్ టోకెన్)లకు ఫుల్ గిరాకీ ఉంటోంది. ఈ క్రమంలో ఒక యువప్లేయర్ ఎన్ఎఫ్టీకి సుమారు 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ డిమాండ్ పలకడం యావత్ క్రీడా రంగంలో చర్చకు దారితీసింది. విశేషం ఏంటంటే.. ఆ ఆటగాడి దరిదాపుల్లో ఏ దిగ్గజ ప్లేయర్ కూడా లేకపోవడం!. బోరష్యా డోర్ట్మండ్.. జర్మనీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ క్లబ్. ఈ క్లబ్కి చెందిన స్ట్రయికర్ ఎర్లింగ్ హాలాండ్ ‘డిజిటల్ కార్డు’ ఏకంగా 5, 11, 000 పౌండ్లకు అమ్ముడుపోయింది. మన కరెన్సీలో దీని విలువ రూ. 5 కోట్ల 13 లక్షలకు పైనే. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా హయ్యెస్ట్ వాల్యూ దక్కించుకున్న క్రిస్టియానో రొనాల్డ్ యునిక్ ఐటెం ధర 2, 04, 000 పౌండ్లు. మన కరెన్సీలో రూ. 2 కోట్ల రూపాయలుగా మాత్రమే ఉంది. అంటే.. హాల్యాండ్ ఎన్ఎఫ్టీ డిజిటల్ స్పోర్ట్స్ ఐటెమ్స్లో ఇప్పటిదాకా అత్యంత విలువైన వస్తువుగా నిలిచిందన్నమాట. గత అక్టోబరులో DFL మరియు Sorareల భాగస్వామ్యంలో డిజిటల్ ప్లేయర్ఐటమ్స్ను ఎన్ఎఫ్టీల రూపంలో.. సోరేర్ ఫాంటసీ ఫుట్బాల్ గేమ్ ఆడడానికి అనుమతిస్తున్నారు. అందుకే తర్వాతి జనరేషన్ గేమర్స్.. ఈ ట్రేడింగ్పై విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎదురులేని ఎర్లింగ్ ఎర్లింగ్ బ్రాట్ హాల్యాండ్.. నార్వేజియన్ ప్రొఫెషనల్ ఫుట్బాలర్. జర్మన్ బుండెస్లిగా క్లబ్ బోరష్యా డోర్ట్మండ్తో పాటు నార్వే నేషనల్ టీం తరపున ఆడుతున్నాడు. వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే కాగా.. ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రయికర్గానూ పేరుంది ఇతనికి. లీడ్స్(ఇంగ్లండ్)లో జన్మించిన ఎర్లింగ్.. తండ్రి అల్ఫ్ ఇంగె హాల్యాండ్ నుంచి సాకర్ను పుణికిపుచ్చుకున్నాడు. చిన్నవయసులోనే ఫుట్బాల్లోకి అడుగుపెట్టిన ఎర్లింగ్.. ఆ తర్వాత బ్రైన్ క్లబ్ తరపున 2016లో ప్రొఫెషనల్ కెరీర్ మొదలుపెట్టాడు. హ్యాండ్బాల్, గోల్ఫ్, ట్రాక్ అండ్ ఫీల్డ్లోనూ మంచి ఆటగాడు. ఐదేళ్ల వయసులో(2006) స్టాండింగ్ లాంగ్ జంప్లో 1.63 మీటర్లు దూకి.. ఏకంగా ప్రపంచ రికార్డును సైతం నెలకొల్పాడు ఎర్లింగ్. సోరారే ఫాంటసీ ఫుట్బాల్ గేమ్.. నిజ జీవితంలో ఆటగాళ్ల ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది. మ్యాచ్డేలో జరిగే పాజిటివ్ (గోల్స్, అసిస్ట్లు) లేదా నెగటివ్ (రెడ్ కార్డ్లు) ఈవెంట్ల ఆధారంగా ఒక్కో గేమ్కు 0 మరియు 100 పాయింట్ల మధ్య ఆటగాళ్లు సంపాదిస్తారు. ఐదుగురు ఆటగాళ్ళు ఒక జట్టుగా ఏర్పడి, ఇతర యూజర్లతో పోటీపడతారు. చదవండి: అంతరిక్షంలోకి యువరాజ్సింగ్ బ్యాట్..! తొలి వ్యక్తిగా రికార్డు..! -
వెయ్యి కోట్ల డాలర్లను విడుదల చేయండి
ఓస్లో: అఫ్గానిస్తాన్ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు తొలిసారిగా పశ్చిమ దేశాల ప్రతినిధులతో అధికారికంగా సమావేశమై చర్చించారు. నార్వే రాజధాని ఓస్లోలో మూడు రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో పాల్గొన్న తాలిబన్ ప్రతినిధులు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు స్తంభింపజేసిన వెయ్యి కోట్ల అమెరికా డాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అఫ్గానిస్తాన్ మానవ సంక్షోభం అంచులో ఉందని అందుకే ఆ నిధులు విడుదల చేయాలని వారు ఒత్తిడి తీసుకువచ్చారు. తాలిబన్ల తరఫున హాజరైన షఫీవుల్లా అజామ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ అఫ్గానిస్తాన్కు చెందిన ఆస్తుల్ని విడుదల చేయాలని, రాజకీయపరమైన విభేదాలతో సాధారణ పౌరుల్ని శిక్షించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆకలి కేకలు, గడ్డ కట్టించే చలి పరిస్థితుల్లో స్తంభింపజేసిన ఆస్తుల్ని విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశానికి ముందు పశ్చిమ దేశాల ప్రతినిధులు అఫ్గాన్ మహిళా హక్కుల కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలతో మాట్లాడి అఫ్గాన్లో క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, యూరోపియన్ యూనియన్కు చెందిన ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. -
దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. 9 రోజుల్లోనే 30 దేశాలకు..
జోహెన్నెస్బర్గ్/లండన్: దక్షిణాఫ్రికాలో తొలిసారిగా నవంబర్ 24న బయటపడిన ఒమిక్రాన్ వేరియెంట్ తొమ్మిది రోజుల్లోనే భారత్సహా 30 దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 375 ఒమిక్రాన్ కేసుల్ని గుర్తించారు. డెల్టా కంటే అయిదు రెట్ల వేగంతో ఈ వేరియెంట్ వ్యాపిస్తూ ఉండడం దడ పుట్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు బయటపడితే, ఆ తర్వాత స్థానాల్లో 50కి పైగా కేసులతో నార్వే, 33 కేసులతో ఘనా, 32 కేసులతో బ్రిటన్ ఉన్నాయి. నార్వేలో క్రిస్మస్ పార్టీకి వెళ్లిన వారికి ఈ వైరస్ సోకినట్టుగా అధికారులు వెల్లడించారు. దీని వ్యాప్తి చాలా విస్తృతంగా ఉండడంతో వేరియెంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్తో పాటు ఫ్రాన్స్లో ఈ కొత్త వేరియెంట్ గురువారమే బయటపడింది. మరికొద్ది వారాల్లో కేసుల తీవ్రత అత్యధిక స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నట్టుగా ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దక్షిణాఫ్రికా తర్వాత యూరప్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే కొద్ది నెలల్లో యూరప్లో నమోదయ్యే కేసుల్లో సగానికి పైగా ఒమిక్రాన్ వేరియెంట్వే ఉంటాయని యూరోపియన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ ఈసీడీసీ అంచనా వేస్తోంది. యువతకే అధికంగా.. ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంటుందన్న దానిపై శాస్త్రవేత్తలు నిర్ధిష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో యువతకే అత్యధికంగా ఈ వేరియెంట్ సోకుతూ ఉందని, వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ప్రస్తుతానికి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. వివిధ దేశాల కఠిన నిబంధనలు ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి చెందుతూ ఉండడంతో వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం, ఇతర నిబంధనల్ని కఠినతరం చేయడంపై వివిధ దేశాలు దృష్టి సారించాయి. లాక్డౌన్, మార్కెట్లు మూసేయడం కంటే వ్యాక్సినేషన్, మాస్కులు సహా కోవిడ్–19 నిబంధనలు పాటించడం ద్వారా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని వివిధ దేశాలు నిర్ణయించాయి. ► వ్యాక్సిన్ తీసుకోని వారి కదలికలను జర్మనీ పరిమితం చేసింది. నిత్యావసరాల దుకాణాలకు తప్పితే అలాంటి వారిని మరే ఇతర స్టోర్లు, మాల్స్, పబ్బులు, క్లబ్బులు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతించబోమని జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ గురువారం ప్రకటించారు. దేశంలో పరిస్థితి సీరియస్గా ఉందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడాన్ని తప్పనసరి చేయడాన్ని పార్లమెంటు పరిశీలిస్తుందని తెలిపారు. గత 24 గంటల్లో 70 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ► 60 ఏళ్లకు పైబడిన వారు టీకా తీసుకోవడానికి నిరాకరిస్తే వారి నెలవారీ పెన్షన్ నాలుగో వంతు కోత వేసే యోచనలో గ్రీస్ ప్రభుత్వం ఉంది.పెన్షన్లో నెలకు 100 యూరోల(రూ.8,471) కోత పడనుంది. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇంకా 17 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో ప్రభుత్వం ఈ జరిమానా అస్త్రం ప్రయోగించింది. ► స్లోవేకియా మాత్రం 60 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సినేషన్ పూర్తిచేసుకుంటే 500 యూరోలు (రూ.42,355) బోనస్గా ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. ► లాక్డౌన్లకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న నెదర్లాండ్స్లో నిరసన ప్రదర్శనల్ని ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది. ► అమెరికా బూస్టర్ డోసుల్ని కూడా ఇస్తోంది. రెండు డోసులు పూర్తయినప్పటికీ కరోనా నుంచి మరింత రక్షణ కోసం బూస్టర్ డోసులు ఇస్తోంది. ► ఒమిక్రాన్ సోకిన వ్యక్తులతో ఎవరు సన్నిహితంగా మెలిగారనేది సదరు రోగుల ఫోన్లపై నిఘా పెట్టడం ద్వారా ఇజ్రాయెల్ తెలసుకుంటోంది. గోప్యత హక్కుకు ఇది భంగకరమని హక్కుల సంఘాలు ధ్వజమెత్తడంతో గురువారం దీన్ని ఆపివేసింది. ► 18 ఏళ్లు పైబడిన వారు ఆరునెలలకు ఒకసారి బూస్టర్ డోస్ను తీసుకోవడాన్ని చిలీ తప్పనసరి చేసింది. అప్పుడే పాస్ రెన్యువల్ అవుతుంది. ఈ పాస్ లేకపోతే రెస్టారెంట్లు, హోటళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లలేరు. -
బార్లు,రెస్టారెంట్లు,నైట్క్లబ్లకు క్యూ కట్టిన నార్వే ప్రజలు
-
‘ప్రవాస తెలుగు పురస్కారం-2021’కు ఎంపికైన రాధికా మంగిపూడి
ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించిన ప్రముఖ రచయిత్రి, వ్యాఖ్యాత, సంఘసేవకురాలు రాధిక మంగిపూడికి 'తెలుగు భాషా దినోత్సవ' సందర్భంగా అంతర్జాతీయ "ప్రవాస తెలుగు పురస్కారం-2021" దక్కనుంది. దక్షిణాఫ్రికా నుంచి "సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ" యూరప్లోని నార్వే నుంచి "వీధి అరుగు" సంస్థల సంయుక్త అధ్వర్యములో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75 తెలుగు సంఘాల భాగస్వామ్యంతో అంతర్జాల వేదికపై వైభవంగా, ఆగస్టు 28 29 తేదీలలో, రెండు రోజులపాటు జరగనున్న "తెలుగు భాషా దినోత్సవం-2021" కార్యక్రమంలో భాగంగా... విదేశాలలో నివసిస్తూ తెలుగు భాష, సాహిత్యం సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన 12 మంది తెలుగు వారిని ఎంపిక చేసి "ప్రవాస తెలుగు పురస్కారాలు-2021" అందజేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి రాధికా మంగిపూడి ఎంపికయ్యారు. చదవండి: వీధి అరుగు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాలు 2020 వరకు సింగపూర్ లో నివసిస్తూ రాధిక, సింగపూర్ నుంచి తొలి తెలుగు రచయిత్రిగా రెండు పుస్తకాలను ప్రచురించి 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్" లో చోటు సంపాదించుకోవడం, 'గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం' ఫేస్బుక్ సంస్థ ద్వారా తెలుగు భాషా సంస్కృతులపై పలు వ్యాసాలను అందించడం, సింగపూర్ లో ఆధ్యాత్మిక సాహిత్య కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా సింగపూర్లోని "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ ప్రధాన కార్యనిర్వాహక సభ్యురాలిగా అందించిన సేవలకుగాను ఆమెకు ఈ గుర్తింపు లభించింది. అనేక అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ప్రణాళికారచన, సుమారు 45 అంతర్జాతీయ కార్యక్రమాలకు వ్యాఖ్యాన నిర్వహణ, 30కి పైగా సాహిత్య సదస్సులలో వక్తగా, అతిథిగా ప్రసంగాలు, ఆమెకు ప్రపంచవ్యాప్తంగా పేరును తెచ్చి పెట్టాయి. "తెలుగు భాషా దినోత్సవ" సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారానికి ఎంపికైన కేవలం 12 మంది తెలుగు భాషాసేవకులలో తాను కూడా ఉండటం, తన కృషికి ఇంతటి చక్కటి గుర్తింపు లభించడం ఎంతో ఆనందంగా ఉందని" రాధిక కార్యక్రమ నిర్వాహకులకు, తనను నిత్యం ప్రోత్సహిస్తున్న "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. "ప్రపంచ నలుమూలలలోని పలు దేశాల నుంచి ఈ పురస్కారాల కోసం వచ్చిన నామినేషన్లను నిష్ణాతులైన న్యాయనిర్ణేతలు పరిశీలించి 12 మందిని పురస్కారాలకు ఎంపిక చేయటం జరిగిందని, ఈ పురస్కారాలను ఆగష్టు 𝟐𝟖వ తేదీ తెలుగు భాషా దినోత్సవ మొదటి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథులచే ప్రధానం చేయటం జరుగుతుంద’’ని నిర్వాహకులు తెలియజేశారు.ఈ సందర్భంగా రాధికకు సింగపూర్ నుంచి 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, ఇతర సభ్యులు, అన్ని దేశాల నుంచి శ్రేయోభిలాషులు శుభాకాంక్షలను తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. చదవండి : సెప్టెంబరులో టొరంటో వేదికగా తెలుగు సాహితి సదస్సు -
వరల్డ్ చాంపియన్షిప్కు బజరంగ్ దూరం
ఢిల్లీ: మోకాలి గాయంతో బాధపడుతున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత వరల్డ్ బజరంగ్ పూనియా రెజ్లింగ్ చాంపియన్షిప్ నుంచి తప్పుకున్నాడు. ఒలింపిక్స్కు ముందే అతనికి ఈ గాయం కాగా, అలాగే ఆటను కొనసాగించిన బజరంగ్ ఇప్పుడు చికిత్స కోసం విరామం తీసుకుంటున్నాడు. పూర్తిగా కోలుకునేందుకు కనీసం ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో అక్టోబర్ 2 నుంచి నార్వేలో జరిగే టోర్నీ దూరమయ్యాడు. క్వార్టర్స్లో సానియా జోడీ క్లీవ్లాండ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ క్లీవ్లాండ్ చాంపియన్íÙప్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సానియా–క్రిస్టీనా మెక్హెల్ (అమెరికా) జంట 6–3, 6–2తో ఒక్సాన కలష్నికొవా (జార్జియా) – ఆండ్రీ మితు (రొమేనియా) జోడిపై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో భారత్–అమెరికా ద్వయం ఆధిపత్యమే కొనసాగింది. రెండు సెట్లలోనూ ఎక్కడ ప్రత్యరి్థకి అవకాశం ఇవ్వకుండా సానియా జోడీ చెలరేగింది. -
Covid-19: ‘చిన్నారుల్లో జలుబు’లా మారిపోతుంది
వాషింగ్టన్: రాబోయే రోజుల్లో కోవిడ్–19 చిన్న పిల్లల్లో వచ్చే సాధారణ జలుబులా మారిపోతుందని అమెరికా, నార్వే తాజాగా నిర్వహించిన ఒక సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సినేషన్ తీసుకోని చిన్నారులపైనే ఈ వైరస్ ప్రభావం ఉంటుందని ఆ సర్వే తెలిపింది. ఇప్పటివరకు కోవిడ్–19 పిల్లలకు స్వల్పంగా సోకినప్పటికీ అంతగా ప్రభావం లేదని పేర్కొన్న సర్వే, మిగిలిన వారంతా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఈ వైరస్ ముప్పు పెద్దలకి తప్పిపోతుందని అంచనా వేసింది. ‘రాబోయే కాలంలో పెద్దలందరికీ వైరస్ సోకడం లేదంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల యాంటీబాడీలు వస్తాయి. దీంతో ఈ వైరస్ తీవ్రత బాగా తగ్గిపోతుంది. వ్యాక్సిన్ తీసుకోని చిన్నపిల్లలకి సాధారణంగా వచ్చే ఓ చిన్నపాటి జలుబులా మారిపోతుంది’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఒట్టర్ బోర్నస్టడ్ చెప్పారు. ఈ అధ్యయనం వివరాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ ప్రచురించింది. ఒక్కసారి గత చరిత్ర చూస్తే ఎన్నో మహమ్మారులు తొలుత ఉగ్రరూపం దాల్చి ఆ తర్వాత పిల్లలకి వచ్చే సాధారణ వ్యాధుల్లా మారిపోయినవి ఉన్నాయని ఆయన చెప్పారు. ‘1889–1890లో పెచ్చరిల్లిన రష్యన్ ఫ్లూ 10 లక్షల మందిని పొట్టన పెట్టుకుందని, ఇప్పుడా వైరస్ 7–12 నెలల పిల్లలకి వచ్చే సాధారణ జలుబులా మారింది. ఏదైనా మహమ్మారి చివరి దశకి వచ్చేటప్పటికి దాని తీవ్రత తగ్గిపోతుందని కోవిడ్–19 కూడా అలాగే మారుతుంది’ అని ప్రొఫెసర్ బోర్నస్టడ్ వివరించారు. కరోనా వైరస్ సోకిన వారిలో కంటే, వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనే అధికంగా యాంటీ బాడీలు వచ్చినట్టుగా తమ పరిశోధనల్లో వెల్లడైనట్టుగా ఆయన తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన చెప్పారు. అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలలో కరోనా వైరస్ ఉధృతిని పరిశీలిస్తూ రియలిస్టిక్ ఏజ్ స్ట్రక్చర్డ్ (ఆర్ఏఎస్) మ్యాథమెటికల్ మోడ్లో రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత ఎలా ఉంటుందో అధ్యయనం చేసినట్టుగా బోర్నస్టడ్ వివరించారు. -
తన రికార్డును తానే బద్దలు కొట్టి స్వర్ణం కొల్లగొట్టాడు
టోక్యో: టోక్యో ఒలింపిక్స్లో భాగంగా 400 మీటర్ల హార్డిల్స్ ఫైనల్ రేసులో నార్వేకు చెందిన కార్స్టెన్ వార్లోమ్ చరిత్ర సృష్టించాడు. మంగళవారం జరిగిన 400 మీ హార్డిల్స్ ఫైనల్స్లో వార్లోమ్ 45.94 సెకండ్లలో గమ్యాన్ని చేరుకొని స్వర్ణం సాధించడమేగాక ప్రపంచరికార్డు నమోదు చేశాడు. ఇంతకముందు 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో 400 మీటర్ల హార్డిల్స్ రేసులో కెవిన్ యంగ్ 46.70 సెకండ్లతో గమ్యాన్ని చేరుకొని స్వర్ణం సాధించాడు. తాజాగా వార్లోమ్ కెవిన్ యంగ్ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు 400 మీటర్ల హార్డిల్స్లో వార్లోమ్ తన రికార్డును తానే బద్దలు కొట్టడం విశేషం. సరిగ్గా నెల రోజుల క్రితం ఓస్లో వేదికగా జరిగిన ఈవెంట్లో 400 మీటర్ల హార్డిల్స్లో 46.70 సెకండ్లలో గమ్యాన్ని చేరుకొని కెవిన్ యంగ్తో సమానంగా నిలిచాడు. ఇక ఒలింపిక్స్లోనూ 400 మీటర్ల హార్డిల్స్ హీట్ విభాగంలోనూ మంచి ప్రదర్శన కనబరిచిన వార్లోమ్ తాజాగా ఫైనల్స్లో ఏకంగా ప్రపంచరికార్డు నమోదు చేసి స్వర్ణం కొల్లగొట్టాడు. ఇక అమెరికాకు చెందిన రాయ్ బెంజమిన్ 46.17 సెకండ్లతో రజతం.. బ్రెజిల్కు చెందిన అలిసన్ దాస్ సాంటోస్ 46.72 సెకండ్లతో కాంస్యం దక్కించుకున్నాడు. WORLD RECORD‼️ Norway's Karsten Warholm breaks his OWN world record to win gold in the men's 400m hurdles and @TeamUSA's Rai Benjamin wins the silver. #TokyoOlympics 📺 NBC 💻 https://t.co/ZOFdXC4e4u 📱 NBC Sports App pic.twitter.com/lPSNrv2Qoo — #TokyoOlympics (@NBCOlympics) August 3, 2021 -
బికినీలకు బదులుగా షార్ట్లు.. ఆటగాళ్లకు భారీ జరిమానా
బ్రసెల్స్: బల్గేరియాలో జరిగిన యురోపియన్ మహిళల బీచ్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో నార్వే జట్టుకు యురోపియన్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ (ఈహెచ్ఎఫ్) భారీ జరిమానా విధించింది. టోర్నీలో భాగంగా స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో నార్వే జట్టు సభ్యులు బికినీలకు బదులు షార్ట్లు వేసుకుని బరిలోకి దిగినందుకు 1500 యూరోలు ఫైన్ వేసినట్లు ఈహెచ్ఎఫ్ ప్రకటించింది. రూల్స్కు వ్యతిరేకంగా అనుమతి లేని దుస్తులు ధరించి మ్యాచ్ ఆడినందుకు డిసిప్లినరి యాక్షన్ కింద జరిమానా విధించినట్లు వెల్లడించింది. అయితే ఈహెచ్ఎఫ్ నిర్ణయంపై నార్వే జట్టు అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. డ్రెస్ కోడ్ విషయంలో 2006 నుంచి పోరాటం చేస్తున్నామని, సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం ఆటగాళ్ల హక్కు అని, ఈ విషయంలో ఈహెచ్ఎఫ్ అనవసర రాద్దాంతం చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో తాము ప్లేయర్స్కు మద్దతుగా నిలుస్తామని, అలాగే వారికి విధించిన జరిమానాను తామే చెల్లిస్తామని తెలిపారు. కాగా, అంతర్జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్ రూల్స్ ప్రకారం మహిళా అథెట్లు తప్పనిసరిగా బికినీలు ధరించే బరిలోకి దిగాలి. View this post on Instagram A post shared by Norges Håndballforbund (@norgeshandballforbund) -
మనిషికి మచ్చికైన గుర్రాల గురించి ఈ విషయాలు తెలుసా?
మనుషులకు మచ్చికైన జంతువుల్లో గుర్రాలది ప్రత్యేక స్థానం. పూర్వం వేగ వంతమైన రవాణాకు, యుద్ధాల్లో రథాలను నడిపించేందుకు వీటిని వినియోగించేవారు. చాలా యూరప్ దేశాల్లో గుర్రాలను వ్యవసాయ పనులకు కూడా వినియోగిస్తారు. లండన్ వీధుల్లో ఇప్పటికీ గుర్రపు బగ్గీలు తిరుగుతూనే ఉంటాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా గుర్రపు పందేలకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. యంత్రాల శక్తిని కూడా హార్స్ పవర్లో కొలవడం మనకు అలవాటు. అలాంటి హయముల్లో ప్రపంచంలోనే పెద్దదిగా గుర్తింపు పొందిన ‘బిగ్ జేక్ ’ ఇటీవల అమెరికాలోని విస్కాన్సిన్లో కన్నుమూసింది. బెల్జియన్ జాతికి చెందిన ఈ అశ్వం.. 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 1,136 కిలోల బరువుతో ప్రపంచంలోనే ఎత్తయినదిగా 2010లో గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే పెద్దవైన గుర్రం జాతులు, వాటి వివరాలు ఇక్కడ చూద్దాం. – ఏపీ సెంట్రల్ డెస్క్ 1. ఇది బ్రిటీష్ బ్రీడ్ చాలా శక్తిమంతమైనది. అశ్వాల్లోనే పెద్ద జాతిగా పేరొందింది. వీటి సరాసరి ఎత్తు 6 అడుగులు ఉంటుంది. ఇవి 900 నుంచి 1,100 కేజీల వరకు బరువు ఉంటాయి. ప్రపంచంలో ఎత్తయిన అశ్వంగా ఈ జాతికి చెందిన ‘మమ్మోత్’ గతంలో రికార్డు నెలకొల్పింది. అది 7.1 అడుగుల ఎత్తుతో 1,500 బరువు ఉండేది. 2. క్లైడెస్డేల్ స్కాంట్లాండ్కు చెందిన బ్రీడ్. ఈ జాతి తురగాల సగటు ఎత్తు 6 అడుగులు ఉంటుంది. సుమారు 820 నుంచి 910 కేజీల వరకూ బరువు పెరుగుతాయి. అరుదుగా ఒక్కో గుర్రం 1,000 కేజీల బరువు వరకూ పెరుగుతుంది. బ్రిటీష్ రాయల్ అశ్వికదళంలో ఇవి ఎక్కువగా సేవలు అందిస్తాయి. జాతీయ ప్రాముఖ్య దినాలు, ఇతర సందర్భాల్లో జరిగే పరేడ్లలో ఇవి పాల్గొంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్తో పాటు 56 కిలోల బరువుండే మ్యూజికల్ డ్రమ్స్ను మోస్తూ ఇవి పరేడ్లో పాల్గొంటాయి. 3. పెర్చెరాన్ పశ్చిమ ఫ్రాన్స్లోని హ్యుస్నే నది, పర్వత సానువులు దీని జన్మస్థానం. ఇది నివసిస్తున్న దేశాల్లోని పరిస్థితుల ఆధారంగా దీని ఎత్తు, బరువు మారుతూ ఉంటాయి. ఫ్రాన్స్లో ఇది సుమారు 5.10 అడుగుల నుంచి 6.01 అడుగుల ఎత్తు, 500 నుంచి 1,200 కిలోల బరువు వరకూ ఉంటుంది. అమెరికాలో 6.3 అడుగులు, 1,200 కిలోల వరకూ కూడా పెరుగుతాయి. బ్రిటన్లో సుమారు 5.5 అడుగుల ఎత్తు, 810 కిలోల బరువు ఉంటాయి. 4. బెల్జియన్ దీనియన్ బెల్జియన్తో పాటు బ్రబంట్ హార్స్, బెల్జియన్ హెవీ హార్స్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇటీవల మరణించిన బిగ్ జేక్ కూడా ఇదే జాతికి చెందినది. దీని జన్మస్థానం ప్రస్తుత బెల్జియంలోని బ్రబంట్ ప్రాంతం. వీటి సగటు ఎత్తు 5.7 అడుగులు ఉంటుంది. 900 కిలోలకు పైగా బరువు పెరుగుతాయి. ఈ జాతిలో ఇప్పటి వరకూ అతి పెద్ద హయముగా పేరొందిన బ్రూక్లిన్ సుప్రీమ్ 1,451 కేజీల బరువుండేది. 6.5 అడుగుల ఎత్తు ఉండేది. ఇది చాలా కాలం క్రితం కన్నుమూసింది. 5. డచ్ డ్రాఫ్ట్ నెదర్లాండ్స్కు చెందిన జాతి ఇది. కోల్డ్ బ్లడెడ్ తరహా అశ్వం. ఇది చాలా అందంగా ఉంటుంది. దీని కదలికలు చూడ చక్కగా ఉంటాయి. అణకువగా మసలుతుంది. దీనికి నిలకడ శక్తి ఎక్కువ. దీని సగటు ఎత్తు 5.10 అడుగులు ఉంటుంది. బరువు సగటును 750 కిలోల వరకూ పెరుగుతుంది. వీటిలోని ఆడ గుర్రాలు ఎత్తు, బరువు తక్కువగా ఉంటాయి. 6. అమెరికన్ క్రీమ్ పేరుకు తగ్గట్టే ఇది అమెరికాకు చెందిన గుర్రం. దీనిని అమెరికన్ వైట్ హార్స్ అని కూడా పిలుస్తారు. గతంలో అమెరికా ఉన్నత శ్రేణి వర్గాలు, అధికారులు ప్రయాణించే బగ్గీలకు వీటిని వినియోగించేవారు. వీటి సగటు ఎత్తు 5.5 అడుగులు ఉంటుంది. బరువు 820 కిలోల వరకూ పెరుగుతుంది. వీటిల్లోని ఆడవి కాస్త చిన్నవిగా ఉంటాయి. 7. రష్యన్ హెవీ డ్రాఫ్ట్ దీనిని సోవియట్ డ్రాఫ్ట్ హార్స్ అని కూడా పిలుస్తారు. ఈ జాతి బెల్జియం నుంచి రష్యాకు వచ్చింది. వీటి సగటు ఎత్తు 5.3 అడుగులుగా ఉంటుంది. బరువు 850 కేజీల వరకూ పెరుగుతుంది. వీటిలోని ఆడ వాటి బరువు, ఎత్తు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఈ పెద్దదిగా గుర్తింపు పొందిన తురగం 1,000 కేజీల బరువు పెరిగింది. 8. సఫోల్క్ ఇది కూడా బ్రిటీష్కు చెందిన బ్రీడే. దీనిని సఫోల్క్ పంచ్, సఫోల్క్ సోరెల్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా బలమైనది. శక్తిమంతమైనది. పెద్దగా కనిపిస్తుంది. కఠినమైన శ్రమ చేయడంలో ప్రసిద్ధి పొందింది. దీని సగటు ఎత్తు 5.10 అడుగులు ఉంటుంది. బరువు 900 నుంచి 1000 కేజీలు ఉంటుంది. 9. ఫజోర్డ్ నార్వేలోని పశ్చిమ పర్వత సానువులు దీని జన్మస్థానం. శక్తిమంతమైనదే కాకుండా చురుకైనదిగా దీనికి పేరుంది. ఇది పెరిగే ప్రాంతాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి దీని ఎత్తు, బరువుల్లో మార్పు ఎక్కువగా ఉంటుంది. దీని సగటు ఎత్తు 5.5 అడుగులు కాగా, 500 కిలోల వరకూ బరువు పెరుగుతుంది. 10. డోల్ ఇది కూడా నార్వేకు చెందిన అశ్వమే. దీనిని డోల్హెస్ట్ అని కూడా పిలుస్తారు. దీని హృదయం, ఉదర భాగం విశాలంగా ఉంటుంది. ఫజోర్డ్ కన్నా వీటి తోకలు కాస్త చిన్నగా ఉంటాయి. దీని సగటు ఎత్తు 5.2 అడుగులు ఉంటుంది. 530 నుంచి 600 కిలోల వరకూ బరువు పెరుగుతుంది. -
ఇంగ్లీష్ ఛానల్లో ప్రమాదం: 900 మైళ్ల దూరంలో శవం
నార్వే : గత సంవత్సరం బోటులో ఇంగ్లీష్ ఛానల్ను దాటుతూ కుటుంబంతో పాటు గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 900మైళ్ల దూరంలో నార్వేలోని కార్మోయ్లో బాలుడి మృతేహాన్ని గుర్తించారు అధికారులు. గత సంవత్సరం అక్టోబర్ 27న తండ్రి రసూల్, తల్లి శివ, అక్క అనిత, అన్న అర్మిన్తో పాటు 15 నెలల ఆర్టిన్ బోటు ప్రమాదానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో మిగిలిన కుటుంబసభ్యుల మృతదేహాలు లభించినప్పటికి చిన్నారి ఆచూకీ తెలియలేదు. ఇక అప్పటినుంచి అధికారులు బాలుడి మృతదేహం కోసం అన్వేషణ మొదలుపెట్టారు. గత జనవరి నెలలోనే అతడి మృతదేహాన్ని గుర్తించారు. అయితే శవం పూర్తిగా పాడై ఉండగా.. అతడు ఆర్టినో కాదో కనుక్కోవటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో శవానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల అనంతరం అది ఆర్టినేనని తేలింది. చిన్నారి శవాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లాల్సిందిగా ఇరాన్లోని ఆర్టిన్ బంధువులకు అధికారులు సమాచారం అందించారు. కాగా, ఇరాన్కు చెందిన రసూల్ కుటుంబం మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో ఆస్తులన్నీ అమ్ముకుని గత సంవత్సరం ఆగస్టు నెలలో యూకే పయనమైంది. అన్ని అడ్డంకులు దాటుకుని ఫ్రాన్స్కు చేరుకుంది. యూకేను చేరుకోవటానికి చేసిన ఓ రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈనేపథ్యంలో బోటులో ఇంగ్లీష్ ఛానల్ను దాటడానికి ప్రయాణం కట్టారు. అయితే, సామర్థ్యానికి మించి మనషుల్ని కలిగి ఉండటంతో ఆ బోటు అక్టోబర్ 27న సముద్రంలో మునిగిపోయింది. చదవండి : 16 ఏళ్లకు భారీ అదృష్టం.. సరిగ్గా ఏడేళ్లకు ఊహించని విషాదం -
జోష్గా బర్త్ డే పార్టీ.. ప్రధానమంత్రికి భారీ జరిమానా
ఓస్లో: కరోనా మహమ్మారి భూగోళాన్నంతా చుట్టేస్తో మానవాళిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. అన్ని దేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆదేశిస్తున్నా కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే నార్వే దేశంలో ఏకంగా ప్రధానమంత్రే కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. నిబంధనలు ఉల్లంఘించి తన జన్మదిన వేడుకను పర్వతప్రాంతంలోని ఓ రిసార్ట్లో ఘనంగా నిర్వహించుకుంది. దీంతో ఆమెకు అక్కడి అధికారులు భారీగా జరిమానా విధించారు. నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్బర్గ్ ఇటీవల 60వ జన్మదిన వేడుక ఘనంగా చేసుకున్నారు. మొత్తం 13 మంది కుటుంబసభ్యులతో కలిసి ఆ పార్టీలో పాల్గొన్నారు. ఇది తీవ్ర దుమారం రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి ఆమెకు జరిమానా విధించారు. ఎందుకంటే కరోనా సమయంలో ఏ కార్యక్రమమైనా పది మంది కన్నా ఎక్కువ మంది హాజరు కావొద్దు. కానీ ప్రధాని ఎర్నా నిబంధనలు ఉల్లంఘించి తన కుటుంబసభ్యులు 13 మంది పాల్గొన్నారు. ఇది గమనించిన అధికారులు ఆమెకు తాజాగా నార్వే కరెన్సీలో రూ.20 వేలు జరిమానా విధించారు. అది మన కరెన్సీలో దాదాపు రూ.1.75 లక్షలుగా ఉంది.జర -
ఆస్ట్రాజెనెకా కరోనా టీకాకు మరో షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ వినియోగంపై వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కరోనా వైరస్ నివారణకు గాను వాక్సీన్ తీసుకున్న తరువాత రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తాజాగా డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్ దేశాలు గురువారం ప్రకటించాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు రక్తం గడ్డకట్టినట్లు కేసులు వెలుగు చూడటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డెన్మార్క్ ఆరోగ్య అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. డెన్మార్క్లో పరిస్థితులు బాగానే ఉన్నా, వ్యాక్సిన్తో ముడిపడి ఉన్న కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. వీటిని మరింత దగ్గరగా పరిశీలించాల్సిన అవసరం ఉందని హెల్త్ అథారిటీ డైరెక్టర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ తెలిపారు.అందుకే వాడకాన్ని పూర్తిగా నిషేధించలేదు కానీ, తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. టీకా సురక్షితమైనది సమర్థవంతమైందని రుజువు చేసే విస్తృత డాక్యుమెంటేషన్ ఉంది కానీ, ఇతర యూరోపియన్ దేశాలలో తీవ్రమైన దుష్ప్రభావాల గురించి సమాచారాన్ని పరిశీలించాలని బ్రోస్ట్రోమ్ చెప్పారు. (అమెరికన్ల జీవితాలు మారుతాయ్!) మార్చి 9 నాటికి యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో 30 లక్షలమందికి పైగా టీకాలు తీసుకోగా.. రక్తం గడ్డకట్టిన 22 కేసులు నమోదయ్యాయని యూరోపియన్ మెడిసన్స్ ఏజెన్సీ (ఇఎంఎ) తెలిపింది. అలాగే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కారణంగా ఆస్ట్రియా నర్సు మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. టీకా తీసుకున్న తరువాత ఆమె తీవ్రమైన రక్త గడ్డంకట్టే సమస్యతో చనిపోవడంతో ఆస్ట్రాజెనెకా టీకా వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు యూరోపియన్ యూనియన్ దేశాలు ఎస్టోనియా, లాట్వియా, లిధుయేనియా, లక్సంబర్గ్లు కూడా తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ క్రమంలో డెన్మార్క్ నార్వే, ఐస్లాండ్ కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. (కోవిడ్ ముప్పు తొలగిపోలేదు) -
తిమింగలంతో దోస్తి
వావ్ అనిపించే చిత్రం.. ఏదో బెస్ట్ ఫ్రెండ్స్లాగ.. వీరిద్దరి బంధం సూపర్ కదూ.. దీని వెనుక ఓ కథ ఉంది. 2019లో నార్వేలోని హామర్ఫెస్ట్లో శరీరంపై కెమెరా తగిలించి ఉన్న ఈ బెలూగా వేల్ కొంతమంది మత్స్యకారులకు కనిపించింది.. ఈ కెమెరా పరికరం మీద సెయింట్ పీటర్స్బర్గ్ పేరు ఉండటంతో.. రష్యావాళ్లు పంపిన గూఢచారి తిమింగలం అని అప్పట్లో అనుకున్నారు.. కన్ఫర్మ్ కాలేదనుకోండి.. అయితే.. కెమెరా చుట్టి ఉండటంతో ఇది చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది.. తిమింగలం కావడంతో దాన్ని విప్పదీయడానికి అందరూ దూరం నుంచి ట్రై చేశారు.. కానీ సాధ్యం కాలేదు.. అప్పుడు ఈ చిత్రంలోని హెస్టెన్ అనే వ్యక్తి ధైర్యం చేసి.. నీళ్లలోకి దిగి.. దీనికి బంధవిముక్తి కలిగించాడు. అప్పట్నుంచి వీరిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు.. ఆ మధ్య కలిసినప్పుడు ఓ ఫొటోగ్రాఫర్ తీసిన చిత్రమిది.. అద్భుతంగా ఉంది కాబట్టి.. సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డ్స్ 2021 తుది జాబితాకు ఎంపికైన చిత్రాల్లో దీనికీ చోటు దక్కింది. ఇంకో విషయం.. ఈ వేల్కు ఉన్న ఫ్రెండ్లీ నేచర్ వల్ల ఇప్పుడది లోకల్గా ఓ సెలబ్రిటీ అయిపోయింది. దూరప్రాంతాల నుంచి పర్యాటకులు దీన్ని చూడటానికి వస్తుంటారు. -
షాకింగ్.. అంకుల్ అస్థిపంజరాన్నే గిటార్గా చేసి..
ఓ వ్యక్తి గిటారు వాయించడం ప్రస్తుతం వైరల్గా మారింది. అయితే ఆయన గిటార్ వాయించడంలో దిట్ట కాదు, లేదా మైమరిపించే సంగీతాన్ని అందించి రికార్డులు సృష్టించిన వ్యక్తి కాదు. మరి ఎందుకు అంత వైరల్ అయిందనే కదా మీ డౌటనుమానం? ఆయన సంగీత విద్యలో వైవిధ్యం లేదు కానీ.. ఆయన వాయించే గిటారు పరికరంలో మాత్రం ఉంది. ఆ గిటారు చెక్కతోనో, తేలికైన లోహాలతోనో తయారు చేసిందో కాదు..మనిషి అస్థిపంజరంతో తయారు చేసింది. ఏంటి షాకవుతున్నారా? నిజమండి బాబు.. తన అంకుల్ అస్థిపంజరంతో గిటారు తయారు చేసి.. దానితో మ్యూజిక్ వాయిస్తున్నాడు నార్వేకు చెందిన ప్రిన్స్ మిడ్నైట్ అనే యువకుడు. తన అంకుల్ మరణించాక తన అస్థిపంజరంలోని చాతి నుంచి నడుము భాగం వరకు ఉండే ఎముకల గూడును ఉపయోగించి ఆరు ఎలక్ట్రిక్ స్ట్రింగ్స్ గల గిటారు తయారు చేశాడు. దాన్ని లయబద్ధంగా వాయిస్తూ ఆ వీడియోలను యూట్యూబ్లోనూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్గా మారాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తన అంకుల్ ఫిలిప్ గౌరవార్థం ఈ గిటారు తయారు చేశానని తెలిపాడు. ‘కొన్నేళ్ల కిందట మా అంకుల్ ఫిలిప్ చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరపకుండా.. భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజ్కు దానమిచ్చారు. ఇటీవల మెడికల్ కాలేజ్ ఆయన అస్థిపంజరాన్ని ఖననం చేయాలని నిర్ణయించుకొని ఆ విషయాన్ని మా అంకుల్ కుటుంబానికి తెలియజేశారు. కానీ వారి తిరస్కరించారు. దీంతో ఆ అస్థిపంజరాన్ని నేను తీసుకొని గిటారు తయారు చేశాను. నా నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. ప్రస్తుతం ఈ గిటారు చక్కగా పని చేస్తుంది’అని ప్రిన్స్ మిడ్నైట్ తెలిపాడు. -
నార్వేలో ‘టీకా’ విషాదం
ఓస్లో: కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం నార్వేలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఇటీవల ఫైజర్వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి చెందారు. వీరితోపాటు అస్వస్థతకు గురైన 16 మందిలో 9 మంది టీకా తీసుకున్న వెంటనే తీవ్రమైన బాధతో ఇబ్బంది పడ్డారని, వీరికి అలెర్జీ లక్షణాలు, తీవ్ర జ్వరం కనిపించాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనతో టీకా భద్రతపై ఉన్న అనుమానాలు మరింత బలపడ్డట్టయిందని పరిశీలకులు అంటున్నారు. అయితే, 80 ఏళ్లు పైబడి, వయో భారంతో బలహీనంగా ఉండటంతో వ్యాక్సిన్తో సాధారణంగా తలెత్తే దుష్పరిణామాలు వీరిపై తీవ్ర ప్రభావం చూపినట్లు పరీక్షల్లో తేలిందని ప్రభుత్వం తెలిపింది. మరణించిన 23 మందికిగాను 13 మందిలో వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సాధారణ లక్షణాలే కనిపించాయంది. కోవిడ్ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్న ఆరోగ్య శాఖ సిబ్బంది, వృద్ధులకు డిసెంబర్ నుంచి ఫైజర్–బయోఎన్టెక్ తయారీ టీకాను నార్వే ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటి వరకు 33 వేల మందికి మొదటి డోసుగా ఈ వ్యాక్సిన్ వేశారు. ఈ ఉదంతం నేపథ్యంలో కోవిడ్ టీకా ఎవరికి ఇవ్వాలనే విషయంలో వైద్యులు మరింత జాగ్రత్తగా పరిశీలన జరపాలని, 80 ఏళ్లు పైబడిన వారి మిగిలిన జీవిత కాలం చాలా స్వల్పంగా ఉండటంతో, వారికి టీకా ఇవ్వడం ద్వారా పెద్దగా లాభమేమీ కూడా ఉండదని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసినట్లు ‘బ్లూమ్బర్గ్’తెలిపింది. యువజనులు, ఆరోగ్యంతో ఉన్న వారికి మాత్రం వ్యాక్సినేషన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో నార్వే ప్రభుత్వానికి సహకరిస్తామని సదరు టీకా తయారీ సంస్థ ఫైజర్ తెలిపింది. -
నార్వేలో టీకా విషాదం.. 23 మంది మృతి
ఓస్లో: నార్వేలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. దాంతో నార్వే ప్రభుత్వం బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచించింది. వివరాలు.. ఫైజర్ ఎన్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. వీరిలో 13 మందికి శవపరీక్షలు నిర్వహించగా.. టీకా తీసుకున్న తర్వాత వచ్చే సాధారణమైన దుష్ర్పభావాలు తలెత్తి.. అవి తీవ్రంగా మారి మరణించారని నార్వేజియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తెలిపింది. అంతేకాక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కనిపించే సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా బలహీనంగా ఉన్న వారిలో తీవ్రంగా మారాయన్నారు. (చదవండి: ‘వ్యాక్సిన్ వేసుకోవడానికి బలవంతం లేదు’) బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలతో ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని సూచించారు నార్వే అధికారులు. అతి తక్కువ జీవితకాలం ఉన్నవారు టీకా తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. వారికి టీకా అనవసరం అన్న అభిప్రాయాన్ని నార్వే ఆరోగ్య శాఖ వ్యక్తం చేసింది. ఆరోగ్యవంతులు, యువకులు టీకాను తీసుకోవచ్చు అని నార్వే ప్రభుత్వం తెలిపింది. ఇక తమ వ్యాక్సిన్ తీసుకుని 23 మంది మరణించిన ఘటనపై ఫైజర్ కంపెనీ విచారణ చేపడుతున్నది. టీకా వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య తక్కువగానే ఉందని, తాము ముదుగా అనుకున్న రీతిలో సంఘటనలు జరుగుతున్నట్లు ఫైజర్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇక ఇప్పటి వరకు నార్వేలో వైరస్ వల్ల రిస్క్ ఉన్న సుమారు 33 వేల మందికి టీకా ఇచ్చారు. 29 కేసుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం ఉండగా.. దాంట్లో మూడో వంతు మంది 80 ఏళ్లు దాటినవారే ఉన్నారు. -
కరోనా వ్యాక్సిన్కు ఇద్దరు నర్సులు బలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన కరోనా వైరస్ అంతానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్న ఊరటపై ఇద్దరు నర్సులు మరణించారన్న వార్తలు ఆందోళన రేపుతున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత పోర్చుగీసుకు చెందిన నర్సు కన్ను మూసిందన్న భయంనుంచి ఇంకా కోలుకోకముందే మరో నర్సు ప్రాణాలు కోల్పోయిన షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నార్వేలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఫైజర్-బయోఎన్టెక్ వ్యాక్సిన్ తీసుకున్న 48 గంటల తర్వాత వీరు హఠాత్తుగా కన్నుమూసారు. దీనిపై మెడికల్ డైరెక్టర్ ఆఫ్ ద నార్వేజియన్ ఏజెన్సీ, నార్వే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విచారణ మొదలుపెట్టింది. అయితే ఈమరణానికి వ్యాక్సినే కారణమా లేక యాదృచ్ఛికంగా ఈ ఘటన జరిగిందా అన్నదానిపై విచారణ జరుపుతామని నార్వేజియన్ మెడిసిన్స్ ఏజెన్సీ మెడికల్ డైరెక్టర్ స్టీనర్ మాడ్సెన్ వెల్లడించారు. ప్రస్తుతం పెద్ద వయసు ఉన్న వ్యక్తులు మొదట వ్యాక్సిన్ తీసుకుంటుడం వల్ల మరణాలు యాదృచ్చికంగా సంభవించే అవకాశం ఉందని, ఎక్కువగా ఉందని మాడ్సెన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఫైజర్ వ్యాక్సిన్ వల్ల తాము కూడా ఇబ్బంది పడినట్లు గతంలో కొంతమంది వలంటీర్లు చెప్పినట్టు సమాచారం. కాగా పోర్టోలోని పోర్చుగీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలోని పీడియాట్రిక్ విభాగంలో పనిచేసే నర్సు సోనియా అసెవెడో (41) అనూహ్యంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. మరో ఘనటలో ఫైజర్ వ్యాక్సిన్ అందుకున్న 32 ఏళ్ల మహిళా వైద్యురాలు ఆసుపత్రిలో చేరినట్టు మెక్సికన్ అధికారులు ఇటీవల వెల్లడించారు. -
మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం: చైనా
చైనా కాన్ఫిడెన్స్ చూస్తే శత్రువుకి కూడా ముచ్చటేస్తుంది. ట్రంప్ ఎన్నికల మూడ్లో లేకుంటే ఆయనా ముచ్చట పడేవారు. చైనా శుక్రవారం నాడు ఇంటి మీదకు వెళ్లి మరీ నార్వేని హెచ్చరించింది! మావాళ్లకు కనుక నోబెల్ శాంతిబహుమతి ఇచ్చి మాలో మాకు పెట్టారో మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం అని చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ ఇ నార్వేను గట్టిగా బెదిరించారు. ‘మాలో మాకు’ అంటే.. చైనాకు, హాంకాంగ్కి. హాంకాంగ్ ఒక ప్రత్యేక దేశంలా అనిపిస్తుంది కానీ అది చైనా పాలనాధికారాల కింద ఉన్న ప్రత్యేక ప్రాంతం మాత్రమే. ఈమధ్య చైనా ఒక కొత్త భద్రత చట్టం తెచ్చింది. దానిని హాంకాంగ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నిరసన ప్రదర్శనలు జరుపుతూనే ఉన్నారు. ఆ నిరసనకారులకు నార్వే నోబెల్ కమిటీ ‘అండ్.. ఈ ఏడాది శాంతి బహుమతి గోస్ టు..’ అంటూ అవార్డును ప్రకటించే ప్రమాదం ఉందని చైనా స్మెల్ చేసినట్లుంది. (66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్?) అందుకే ఈ ముందు జాగ్రత్త బెదిరింపులు. ఈ మధ్య బ్రిటన్కి కూడా చైనా ఇలాగే వార్నింగ్ ఇచ్చింది. ‘మీ మంచితనం చేత మా మంచివాళ్లని మీ మంచి దేశంలో ఉండటానికి రప్పించుకుంటే మామూలుగా ఉండదు చూడండీ..’ అని టెస్ట్ ఫైర్ లేవో చేసింది. ఇప్పుడు నార్వేకు తాజాగా ‘శాంతి సందేశం’ ఇచ్చింది. అయినా నోబెల్ ఇచ్చేది స్వీడన్ కదా. మధ్యలోకి నార్వే ఎందుకొచ్చింది? పెద్దాయన ఆల్ఫెడ్ర్ నోబెల్ అలా వీలునామా రాసి వెళ్లారు. నోబెల్ శాంతి బహుమతిని మాత్రం నార్వేనే ఇవ్వాలని. కరోనాకు కారణం అయి, ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా చైనానే తిరిగి అందరి పైనా కయ్యి కయ్యి మంటోందంటే.. ఆ కాన్ఫిడెన్స్ను చూసి నెక్స్ట్ ముచ్చట పడవలసిన వాళ్లం మనమే. ప్రస్తుతం చైనా చైనా లో లేదు. ఇండియా బోర్డర్ లో ఉంది. -
భలే మంచి విషయం
‘‘మీకు ‘సస్పెండెడ్ కాఫీ, సస్పెండెడ్ మీల్స్’ అంటే ఏంటో తెలుసా? తెలియనివాళ్ల కోసం నేను వివరంగా చెబుతాను’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. ఈ బ్యూటీ చెప్పిన విషయం చదివితే ఎవరికైనా ‘భలే మంచి విషయం చెప్పింది’ అనిపించడం ఖాయం. ఈ విషయం గురించి కాజల్ మాట్లాడుతూ – ‘‘నార్వేలో ఒక మహిళ రెస్టారెంట్కి వచ్చి ఐదు కాఫీలకు డబ్బులు ఇచ్చి, మూడు తీసుకుని, ‘రెండు సస్పెండెడ్’ అంది. ఒక అతను పది కాఫీలకు డబ్బులు కట్టి, ఐదు తీసుకెళుతూ ‘ఐదు సస్పెండెడ్’ అన్నాడు. ఇంకో వ్యక్తి ఐదు మీల్స్కి బిల్ కట్టి, ‘రెండు సస్పెండెడ్’ అని మూడు మాత్రమే తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఒక పెద్దాయన వచ్చాడు. ఆయన బట్టలు కూడా బాగాలేవు. ‘సస్పెండెడ్ కాఫీ ఏమైనా ఉందా?’ అనడిగాడు. కౌంటర్లో ఉన్న మహిళ ‘యస్..’ అని వేడి వేడి కాఫీ కప్ ఆయన చేతికి ఇచ్చింది. మరికాసేపటికి ఇంకో వ్యక్తి వచ్చి, ‘సస్పెండెడ్ మీల్ ఉందా?’ అనడిగాడు. కౌంటర్లో ఉన్న అబ్బాయి వేడి వేడి అన్నం, కూర, వాటర్ బాటిల్ ఇచ్చాడు. సస్పెండెడ్ అంటే ఏంటో ఇప్పుడు అర్థం అయ్యిందనుకుంటున్నా. మనం డబ్బులు కట్టి కూడా తీసుకోకుండా వదిలేసినవాటిని ఆ రెస్టారెంట్లో అలా అంటున్నారు. వాటిని పేదవారికి ఇస్తున్నారు. ముక్కూముఖం తెలియనివాళ్లకు చేస్తున్న ఈ సహాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. యూరోప్లోని పలు దేశాల్లో ఉన్న రెస్టారెంట్స్లో ఈ పద్ధతిని ఆచరిస్తున్నారు. మెల్లిగా ప్రపంచం మొత్తానికి ఈ విధానం విస్తరిస్తోంది. మనం కూడా ఈ స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను’’ అన్నారు. నిజంగానే భలే మంచి విషయం చెప్పింది కదూ. -
విషాదం : కళ్ల ముందే సముద్రంలోకి..
నార్వే : జూన్ 3న ఉత్తర నార్వేలో ఒక విషాద సంఘటన చోటు చేసుకున్నది. అనేక ఇళ్లను సముద్రం తనలోకి లాగేసుకున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ వీడియోను అల్టా నివాసి అయిన జాన్ ఫ్రెడ్రిక్ డ్రాబ్లోస్ ట్విటర్లో షేర్ చేశాడు. 'అయ్యో ఎంత విషాదం.. చూస్తున్నంతసేపట్లో కొండచరియలతో పాటు అనేక ఇళ్లను సముద్రం తనలో కలిపేసుకుంది' అంటూ క్యాప్షన్ జత చేశాడు.(పానీపూరి ప్రియులను కలవరపరిచే వంటకం) దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో మొదట్లో వాతావరణం అంతా కూల్గా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆ తర్వాత బాగా గమనించినట్లయితే ఇళ్లన్నీ కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. తీరా కాసేపటికి అవన్నీ నీటిలో కలిసిపోయాయి. అసలు ఇదంతా నిజమా లేక గ్రాఫిక్సా అనే అనుమానం కలిగేలోపే జరగాల్సింది జరిగిపోయింది. అయితే ఇదంతా నిజమే.. ప్రస్తుతం ఈ వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 1.6 మిలియన్ మందికి పైగా వీక్షించారు.' ఇది నిజంగా భయానకం'.. ' 2020 మనకు ఏ మాత్రం కలిసిరావడం లేదు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (కోతి, కింగ్ కోబ్రాల ఒళ్లు గగుర్పొడిచే ఫైట్) -
కళ్ల ముందే సముద్రంలోకి..
-
ఆ యువరాణి మాజీ భర్త ఆత్మహత్య!
నార్వే: నార్వే యువరాణి మార్తా లూయిస్(48) మాజీ భర్త, రచయిత అరి బెహ్న్(47) బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. క్రిస్మస్ పండుగ రోజున నార్వే రాజు కింగ్ హెరాల్డ్V మాజీ అల్లుడు ఆత్మహత్యకు పాల్పడడంతో అందరూ దిగ్భ్రాంతికి లోనయయ్యారు. బెహ్న్ మరణించినటట్లు అధికారికంగా ఆయన మెనేజర్ ప్రకటించారు. అయితే ఆయన మరణానికి గల కారణాలను మాత్రం మెనేజర్ వెల్లడించలేదు. కాగా అరి బెహ్న్ గత కొద్దిరోజులుగా మానసిక సమస్యలతో సతమవుతున్నట్లు సమాచారం. ఇక నార్వే రాజు, రాణి అరి బెహ్న్మృతిపై విచారం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి అరి ఎన్నో ఏళ్లుగా తెలుసని, అతనితో ఎన్నో మధురానుభూతులు పంచుకున్నామని తెలిపారు. కుటుంబ సభ్యుల్లో ఒకడిగా కొన్నేళ్లపాటు ఉన్న అరి బెహ్న్ను చాలా దగ్గరినుంచి తెలుసుకున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. కాగా నార్వే యువరాణి మార్తా, నార్వేజియన్ రచయిత అరిబెహ్న్లు 2002లో పెళ్లితో ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు సంతానం. అభిప్రాయభేదాల కారణంగా వీరు 2017లో విడాకులు తీసుకున్నారు. -
వామ్మో ఇదేం చేప.. డైనోసర్లా ఉంది!
సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారుడి ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఎదురైంది. ఓ జాతి చేప కోసం వెళ్లిన ఇతగాడికి మరో అరుదైన రకం చేప చిక్కింది. వివరాలు.. ఆస్కార్ లుండాల్ అనే వ్యక్తి నార్వేలోని ఓ ఫిషింగ్ కంపెనీలో అడ్వైజర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను నీలిరంగు హాలిబట్ అనే జాతి చేప కోసం నార్వే కోస్టల్ తీరానికి వేటకు వెళ్లాడు. అయితే ఈ రకం చేపలు తీరానికి 5 మైళ్ళ దూరంలో ఉంటాయని, దాని కోసం గాలం వేయగా 300 వందల మీటర్ల లోతులో ఓ పెద్ద చేప చిక్కందని, తీరా బయటకు తీసి చూడగా డైనోసర్లా కనిపించిన అరుదైన రకం చేప చిక్కినట్లు ఆస్కార్ తెలిపాడు. దీంతో ఈ చేప ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. చేపను చూసిన నెటిజన్లంతా ‘బాబోయ్ ఇది చూడటానికి భయంకరంగా ఉంది. దాని కళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఇది ఎంత దూరం వరకు చూడగలదు. ఇలాంటి వింత రకం చేపలన్నీ నీటికి అడుగు భాగంలోనే జీవిస్తాయి’ అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇలాంటి చేపను తానేప్పుడూ చూడలేదని, ఇది చుడటానికి డైనోసర్లా ఉండటంతో ఒక్కసారిగా షాక్కి గురయ్యానంటూ ఆస్కార్ టుండాల్ చెప్పుకొచ్చాడు. మనుషులకు ఎలాంటి హాని కలిగించదని తెలిపాడు. అయితే ఈ అరుదైన రకం చేపను ర్యాట్ఫీష్గా అక్కడి వారు గుర్తించారు. సింహం, డ్రాగన్ లాంటి తోకను కలిగిన ఈ చేప గ్రీకు పౌరాణిక రాక్షసుడి నుంచి ఉద్భవించిందని అక్కడి వారి నమ్మకం. -
కేవలం 36 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరస్!
సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా వందేళ్ల క్రితం అంటే, 1919లో ‘స్పానిష్ ఫ్లూ’ మూడొంతుల ప్రపంచాన్ని చుట్టుముట్టడంతో దాదాపు ఐదు కోట్ల మంది మరణించారు. అలాంటి వైరస్ ఇప్పుడు ప్రపంచానికి సోకితే కనీసం ఎనిమది కోట్ల మంది ప్రజలు మరణిస్తారు. ఒకప్పుడు మెల్లగా విస్తరించిన ఈ ఫ్లూ, ఓ దేశానికి చెందిన ప్రజలు, మరో దేశానికి నిరంతరంగా ప్రయాణిస్తున్న నేటి వేగవంతమైన యుగంలో కేవలం 36 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. అదే గనుక జరిగితే అపార జన నష్టంతోపాటు దేశ దేశాల జాతీయ భద్రత అస్తవ్యస్తం అవుతుంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ నాయకత్వంలోని ‘గ్లోబల్ ప్రిపేర్డ్నెస్ మానిటరింగ్ బోర్డ్’ సభ్యుల బందం ఈ హెచ్చరికలను చేసింది. ఈ మేరకు ‘ఏ వరల్డ్ ఎట్ రిస్క్’ శీర్షికతో రూపొందించిన ఓ నివేదికను బుధవారం అమెరికాలో విడుదల చేసింది. ‘ఎబోలా’ లాంటి వైరస్లు వేగంగా సోకుతున్న నేటి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఫ్లూలు ప్రపంచానికి సోకే ప్రమాదం ఉందని, అలాంటి వైరస్లను ఇప్పటి నుంచి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ డైరెక్టర్ –జనరల్, నార్వే మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ గో ఆర్లెం బ్రుండట్లాండ్ నాయకత్వంలోని జీపీఎంబీ బృందం హెచ్చరికలను జారీ చేస్తోంది. ఏ వైరస్ ఏ ప్రాంతాన్నీ, ఏ దేశాన్ని సోకే అవకాశం ఉందో కూడా ప్రపంచ పటంపై మార్కు చేసి చూపించింది. 1918లో స్పానిష్ ఫ్లూ అమెరికాలో విస్తరించినప్పుడు చికిత్స కేంద్రాల్లో పనిచేస్తున్న రెడ్క్రాస్ కార్యకర్తలు అంటే నిఫా వైరస్ ఏ దేశాన్ని చుట్టు ముడుతుందో, కలరా ఏ దేశాన్ని చికెన్ గున్యా, డెంగ్యూలాంటి వైరస్లు ఏయే దేశాలు చుట్టుముడుతాయో మ్యాప్లో సూచించింది. వాటికి సంబంధించి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ఏమిటో కూడా సూచించింది. ఇంతకుముందు విడుదలు చేసిన తమ నివేదికను దేశాధినేతలు సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా అరకొరగానే అమలు చేసినందువల్లనే ఈ రోజు మళ్లీ ఒక నివేదికను విడుదల చేయాల్సి వచ్చిందని బోర్డు వివరించింది. ఎబోలా, జికా, నిపా వైరస్లతోపాటు వెస్ట్ నైల్ వైరస్, డెంగ్యూ, ప్లేగ్, హ్యూమన్ మంకీపాక్స్ల గురించి హెచ్చరికలు చేసింది. -
నడిసముద్రంలో చిక్కుకున్న నౌక
ఓస్లో: నార్వేతీరంలోని సముద్రంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ఆదివారం కూడా కొనసాగాయి. ఇప్పటివరకు 397 మంది ప్రయాణికులను హెలికాప్టర్ల ద్వారా తరలించారు. దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ట్రోంసో నుంచి స్టావంగర్కు వెళ్తున్న విలాసవంతమైన ఓడలో 1,373 మంది ఉన్నారు. శనివారం ఓడలోని ఇంజిన్లలో సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడింది. కెప్టెన్ అప్రమత్తమై అధికారులకు సమాచారమిచ్చారు. ప్రయాణికులను సముద్రం ఒడ్డుకు తీసుకువచ్చేందుకు అధికారులు హెలికాప్టర్లు పంపారు. ఇప్పటిదాకా 397 మందిని తరలించారు. బలమైన గాలులు వీస్తున్నా, ప్రమాదకర వాతావరణపరిస్థితులు ఉన్నా హెలికాప్టర్ ద్వారా ప్రయాణికుల చేరవేత కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఓడలోని నాలుగు ఇంజిన్లలో మూడింటిని సిబ్బంది మరమ్మతు చేశారు. ఓస్లోకు వాయవ్య దిశలో సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోల్డె పోర్టుకు ప్రయాణికుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. లైఫ్ జాకెట్లతో నౌకలో బిక్కుబిక్కుమంటున్న ప్రయాణికులు -
నీటిలోపల రెస్టారెంట్..డిన్నర్ ఖరీదు ఎంతంటే..
లండన్ : యూరప్లో తొలి అండర్వాటర్ రెస్టారెంట్ నార్వేలో బుధవారం అందుబాటులోకి వచ్చింది. ఈ రెస్టారెంట్లో సముద్ర అందాలను వీక్షిస్తూ ఇష్టమైన సీఫుడ్ను ఆస్వాదించేందుకు ఇప్పటికే ఏడు వేల మంది కస్టమర్లు బుక్ చేసుకున్నారు. అండర్ పేరుతో నార్వే తీరంలో ఏర్పాటైన ఈ రెస్టారెంట్ సముద్రంలో పాక్షికంగా మునిగిన బారీ కాంక్రీట్ ట్యూబ్లా కనిపిస్తుంది. ఈ రెస్టారెంట్ను ఓస్లోలో ఒపెరా హౌస్, న్యూయార్క్లో సెప్టెంబర్ 11 నేషనల్ మెమోరియల్ మ్యూజియంను రూపొందించిన ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ స్నోహెట్టా డిజైన్ చేసింది. నీటిలోపల ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్లో భారీ విండో ద్వారా సముద్ర హొయలను వీక్షించవచ్చని, ఇది ఆక్వేరియం మాదిరి ఉండదని, వాస్తవ అనుభూతిని సందర్శకులకు అందిస్తుందని స్నోహెట్టా వ్యవస్థాపకుడు జెటిల్ ట్రాడెల్ థార్సెన్ చెప్పుకొచ్చారు. రెస్టారెంట్లోని డైనింగ్ హాల్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. దాదాపు 40 మంది అతిధులు కూర్చునేలా డిజైన్ చేసిన డైనింగ్ హాల్ నుంచి భారీ ట్రాన్స్పరెంట్ విండో ద్వారా సముద్ర అందాలను తిలకించే ఏర్పాటు ఆకట్టుకుంటోంది. ఆకుపచ్చని నీటి రంగును రిఫ్లెక్ట్ చేస్తూ పగలంతా రెస్టారెంట్లో సహజ సిద్ధమైన లైటింగ్ ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు. సందర్శకులకు మధురానుభూతిని మిగిల్చే అండర్ వాటర్ రెస్టారెంట్లో స్ధానిక రుచులు, సీఫుడ్ సహా 18 రకాల వంటకాలతో కూడిన భోజనానికి ఒక్కరికి రూ 29,610 వసూలు చేస్తారు. రెస్టారెంట్లో విందు ఆరగించిన వారు ఆ రాత్రికి హోటల్లోనే గడిపే అవకాశం కల్పిస్తారు. తొలిరోజు హోటల్ యజమానుల కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం రెస్టారెంట్ను తెరిచిఉంచగా తొలి పేయింగ్ గెస్ట్లకు ఏప్రిల్ తొలివారం నుంచీ అండర్ను అందుబాటులోకి తీసుకువస్తారు. ప్రపంచంలో కొద్ది సంఖ్యలోనే అండర్వాటర్ రెస్టారెంట్లు అందుబాటులో ఉండగా వీటిలో మాల్దీవుల్లోనే ఈ తరహా హోటళ్లు అధికంగా ఉన్నాయి. -
నార్వే వ్యాపార సదస్సులో 15 ఒప్పందాలు..
న్యూఢిల్లీ: భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నార్వే ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 1.2 బిలియన్ డాలర్ల (రూ.8,356 కోట్లు) వాణిజ్యం జరుగుతుండగా, ఇది మరింత పెరగాలని భావిస్తున్నట్లు ఆదేశ ప్రధాని ఎమ్మా సోల్బర్గ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రారంభమైన ఇండియా–నార్వే మూడురోజుల వ్యాపార సదస్సులో పాల్గొన్న ఆమె.. ‘నూతన వ్యూహాలను అనుసరించటం ద్వారా మా దేశంతో భారత్ కొనసాగిస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాం. ప్రైవేటు రంగంతో కలిసిపనిచేయడం, పరిశోధన, సాంకేతిక సహకారం పెంపొందే దిశగా చర్చిస్తున్నాం. ఇక్కడ మా దేశ కంపెనీలకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, మరీ ముఖ్యంగా ఎనర్జీ రంగంలో అవకాశాలు చాలా ఉన్నట్లు గుర్తించాం. గ్రామీణ ప్రాంత ఆధారి త వాణిజ్యాన్ని కోరుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ సదస్సుకు హాజరైన వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ.. ‘కీలక ఒప్పందాలపై మంగళవారం ఇరుదేశాలు సంతకాలు పూర్తిచేయనున్నాయి. తద్వారా నార్వేతో వ్యాణిజ్యం మరింత ముందుకు సాగనుందని భావిస్తున్నాం.’ అని చెప్పారు. ఈ సదస్సులో.. సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎనర్జీ, ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ, ఆక్వాకల్చర్కు చెందిన 15 కంపెనీలు ప్రధాని మోదీ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశాయి. శ్రేయీతో ఒప్పందం.. శ్రేయీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్కు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్రేయీ ఎక్విప్మెంట్ ఫైనాన్స్.. నార్వే ప్రభుత్వానికి చెందిన ఎక్స్పోర్ట్క్రెడిట్ నార్గేతో (ఈసీఎన్) ఒప్పందం కుదుర్చుకుంది. సదస్సులో ఇరు సంస్థల మధ్య ఎంఓయూలపై సంతకాలు పూర్తయ్యాయి. ‘ఒప్పందం ప్రకారం.. నార్వేజియన్ కాపిటల్ గూడ్స్ దిగుమతి, ఎక్విప్మెంట్ తయారీకి శ్రేయీ ఎక్విప్మెంట్కు ఆదేశం సహయసహకారాలతో పాటు ఎక్స్పోర్ట్ క్రెడిట్ను అందించనుంది.’ అని సంస్థ చైర్మన్, ఎండీ హేమంత్ కనోరియా తెలిపారు. -
పూజ ధండాకు కాంస్య పతకం
బుడాపెస్ట్ (హంగేరీ): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి పూజ ధండా కాంస్య పతకంతో సత్తా చాటింది. 57 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో పూజ మూడో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆమె 10–7 తేడాతో గ్రేస్ జాకబ్ బులెన్ (నార్వే)ను ఓడించింది. ఈ మెగా ఈవెంట్లో భజరంగ్ పూనియా రజతం తర్వాత భారత్కు లభించిన రెండో పతకం ఇదే కావడం విశేషం. అల్కా తోమర్ (2006 – 59 కేజీ), బబితా ఫొగాట్ (2012 – 51 కేజీలు), గీత ఫొగాట్ (2012 – 55 కేజీలు) తర్వాత వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం నెగ్గిన నాలుగో రెజ్లర్గా పూజ ధండా గుర్తింపు పొందింది. కాంస్యం కోసం జరిగిన మరో బౌట్లో రితూ ఫొగాట్ (50 కేజీలు) 5–10 తేడాతో ఒక్సానా లివాక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడి పతకం కోల్పోయింది. -
అక్కడ మరణం నిషేధం
ఓస్లో: నార్వేలోని ఆ పట్టణంలో మరణం నిషేధం. ఆర్కిటిక్ ద్వీపకల్ప ప్రాంతంలో ‘లాంగ్యర్బీన్’ అనే ఆ బొగ్గుగనుల పట్టణంలో అతి శీతల ఉష్ణోగ్రతల వల్ల మృతదేహాలు ఎన్నటికి మట్టిలో కలిసే పరిస్థితి లేదు. అందువల్ల మృతదేహాలతో పాటు వాటిలోని వైరస్, బ్యాక్టీరియాలు కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఆ భయంతోనే అక్కడ చావుపై పూర్తిగా నిషేధమే పెట్టారు. అందుకోసం 2017లో ఓ చట్టాన్ని సైతం తీసుకొచ్చారు. 1918లో స్పానిష్ ఫ్లూ వైరస్ బారిన పడి మరణించిన వారి మృతదేహాల్లో ఇప్పటికీ ఆ ఫ్లూ జాడలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఎందుకీ పరిస్థితి.. నార్వే ఉత్తర ప్రాంతంలో మారుమూల స్వాల్బార్డ్ ద్వీపకల్పాల సమూహంలో ఉన్న లాంగ్యర్బీన్ పట్టణ జనాభా దాదాపు 2 వేలు. ఫిబ్రవరిలో సగటు ఉష్ణోగ్రత –17 డిగ్రీలు కాగా అత్యల్పంగా –46.3 డిగ్రీలకు పడిపోతుంది. ఏడాదిలో నాలుగు నెలల పాటు సూర్యుడి జాడే ఉండదు. భూమిలో ‘పెర్మ ఫ్రాస్ట్’ అనే వాతావరణ పరిస్థితి కారణంగా పాతిపెట్టిన మృతదేహాలు కుళ్లిపోవు. దీనిని 1950లో అధికారులు గుర్తించారు. పెర్మా ఫ్రాస్ట్ అంటే మట్టి లేదా రాతిలో ఉష్ణోగ్రతలు ఎప్పటికీ సున్నా లేదా అంతకంటే తక్కువ డిగ్రీలు ఉండడమే.. ఈ పరిస్థితి కారణంగా చాలా సందర్భాల్లో మృతదేహాలు భూమి ఉపరితలంపైకి కూడా వచ్చేస్తాయి. 1950 తర్వాత ఈ విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలు పెట్టారు. మృతదేహాల్లో స్పానిష్ ఫ్లూ జాడలు 1918లో ప్రాణాంతక ‘స్పానిష్ ఫ్లూ వైరస్’ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మంది మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో మరణించిన వారి 11 మృతదేహాలు ఇప్పటికీ లాంగ్యర్బీన్లో ఉన్నాయి. ‘పెర్మ ఫ్రాస్ట్’ ప్రభావంతో ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అయితే ఆ మృతదేహాల్లో స్పానిష్ ఫ్లూ వైరస్ కూడా ఇంకా సజీవంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 1998, ఆగస్టులో నార్వేలోని యూనివర్సిటీ ఆఫ్ విండ్సర్కు చెందిన కర్స్టి డంకన్ లాంగ్యర్బీన్లో పరిశోధనలు నిర్వహించారు. ఫ్లూతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహంలో ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇంకా బతికే ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. మరణాల్ని నిషేధిస్తూ 2017లో చట్టం.. భూమి శాశ్వతంగా ఘనీభవన స్థితిలో ఉండడంతో పాతిపెట్టిన శవాలు కుళ్లిపోకుండా.. ఉపరితలం పైకి వస్తున్నందున 2017లో అక్కడ మరణాలపై చట్టం చేసినట్లు నార్వే విశ్వవిద్యాలయానికి చెందిన జాన్ క్రిస్టియన్ మేయర్ తెలిపారు. అక్కడ ప్రాణాంతక వైరస్ స్థానికులకు సోకకుండా ఉండేందుకు మరణానికి చేరువలో ఉన్న వారిని నార్వేలోని ప్రధాన భూభాగానికి వెంటనే తరలిస్తారు. ఒకవేళ ఎవరైనా అకస్మాత్తుగా అక్కడ మరణించినా, అక్కడే మరణించాలని కోరుకున్నా.. వారి అంతిమ సంస్కారాల్ని అక్కడ నిర్వహించరు. అయితే వారి అస్థికలను అక్కడి భూమిలో పూడ్చేందుకు మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి ప్రభుత్వ అనుమతి అవసరం. -
మధ్యలోనే వెనక్కి వెళ్లిన విమానం
నార్వే : టాయిలెట్లలో సమస్య ఏర్పడి దాదాపు సగం దూరం వెళ్లిన విమానాన్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చి దింపేశారు. ఆ విమాన ప్రయాణీకుల్లో టాయిలెట్స్లో సమస్య ఏర్పడితే పరిష్కరించే ప్లంబర్స్ 60మందికి పైగా ఉన్నప్పటికీ వారు ముందుకు రాకపోవడంతో దాదాపు రెండున్నరగంటలపాటు రివర్స్ జర్నీ చేసి సమస్య పరిష్కరించుకోవాల్సి వచ్చింది. నార్వే ఎయిర్ విమానంలో ఈ సమస్య తలెత్తింది. వివరాల్లోకి వెళితే.. నార్వేలోని ఓస్లో నుంచి డీవై 1156 అనే విమానం జర్మనీలోని మ్యూనిచ్కు బయలుదేరింది. అది సరిగ్గా స్వీడన్ బోర్డర్ దాటే సమయంలోనే టాయిలెట్లలో సమస్య ఉన్నట్లు తెలిసింది. అయితే, అదే విమానంలోమ మొత్తం 186మంది ప్రయాణీకులు ఉండగా కనీసం 60 నుంచి 70మంది ప్లంబర్లు ఉన్నారు. వారంతా రార్క్జాప్ అనే కంపెనీలో పనిచేసేందుకు మ్యూనిచ్కు వెళుతున్నారు. పైగా వారందరికీ మంచి సుశిక్షితులుగా గుర్తింపు ఉంది. కానీ, వారిలో ఏ ఒక్కరు కూడా టాయిలెట్లో సమస్యను పరిష్కరించి తమను తాము నిరూపించుకోలేకపోయారు. దీనిపై వర్కర్లను తెప్పించుకున్న కంపెనీ సీఈవో ఫ్రాంక్ ఓల్సెన్ మాట్లాడుతూ సహాయం చేసేందుకు తమవాళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పటికి విమానం 10వేల అడుగుల ఎత్తులో ఎగురుతోందని, ఆ సమస్య వెలుపల నుంచి పరిష్కరించాల్సింది కావడంతో తమ వారెవరూ కూడా ఆ పనిచేయలేదని వివరణ ఇచ్చారు. మొత్తానికి దాదాపు రెండుగంటలపాటు ప్రయాణించిన విమానాన్ని తిరిగి ఓస్లోకు మళ్లించి సమస్య పరిష్కరించి మరోసారి ప్రయాణం ప్రారంభించారు. -
తప్పతాగి.. ట్యాక్సీలో 3 దేశాల్లో తిరిగి...
ఓస్లో(నార్వే) : న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా ఓ వ్యక్తి తప్పతాగి ఇంటికి వెళ్లడానికి ట్యాక్సీ బుక్ చేశాడు. ఏకంగా మూడు దేశాలగుండా ఆ ప్రయాణం సాగింది. ఎలాగోలా చివరికి గమ్యస్థానానికి చేరుకున్నారు. క్యాబ్ డ్రైవర్ డబ్బులు అడగడంతో.. తాగిన మత్తులో ఉన్న వ్యక్తి డబ్బులేంటని ప్రశ్నించడంతో షాక్ కు గురవ్వడం డ్రైవర్ వంతైంది. వివరాలు.. 40 ఏళ్ల నార్వేకి చెందిన ఓ వ్యక్తి డెన్మార్క్ లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం తాగిన మత్తులో క్యాబ్ ను బుక్ చేశాడు. డెన్మార్క్ లోని కొపెన్ హెగెన్ నుంచి స్వీడన్ మీదుగా చివరికి నార్వే రాజధాని ఓస్లో వరకు 600కిలో మీటర్లు 6 గంటలపాటూ క్యాబ్ లో ప్రయాణించాడు. ఇంటికి చేరుకోగానే మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారు డ్రైవర్ కు డబ్బు ఇవ్వకుండానే వెళ్లి ఇంట్లో పడుకున్నాడు. ఓ వైపు దేశం కాని దేశం అందులోనూ కారు బ్యాటరీ కూడా పనిచేయడం ఆగిపోయింది. దీంతో చేసేదేమీ లేక డ్రైవర్ ఓస్లో పోలీసులకు ఫోన్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని పోలీసులు నిద్రలేపి ఎలాగోలా కారు కిరాయి డబ్బులు (18,000 నార్వేన్ క్రోన్) చెల్లించేలా ఒప్పించారు. అతడికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేకపోవడంతో పోలీసులు కూడా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కారుకు మరమ్మతులు చేపించడంలో సహాయం కోసం ట్యాక్సీ డ్రైవర్కు ఓ రికవరీ వాహనాన్ని పోలీసులు పంపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను నార్వే పోలీసులు తమ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో సరదాగా పోస్ట్ చేశారు. క్యాబ్ కిరాయికి కట్టిన డబ్బుకు ఇంకా కొద్ది డబ్బు కడితే ఓ కొత్త కారు కొనొచ్చు కదా.. అని కొందరు... అదే డబ్బుతో విమానంలోనైతే కొపెన్ హెగెన్ నుంచి ఓస్లోకు ఓ రెండు రౌండ్లు వెయ్యోచ్చని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
కెమెరాను కాకి ఎత్తుకెళ్లింది.. అద్భుత వీడియో
-
కెమెరాను కాకి ఎత్తుకెళ్లింది.. అద్భుత వీడియో
నార్వే : ఓ వ్యక్తికి తాను కొత్త కెమెరా తీసుకున్నాన్న ఉత్సాహం కాసేపు కూడా నిలవలేదు. అత్యంత దగ్గర నుంచి షూట్ చేద్దామని టైమ్ సెట్ చేసి ఉంచగా దానిని దొంగ ఎత్తుకెళ్లారు. అయితే ఆ దొంగ మనిషి కాదండోయ్ ఓ కాకి. అవును నార్వేకు చెందిన జెల్ రాబర్ట్సన్ అనే వ్యక్తి సముద్రపు కాకిని అతి సమీపంలో నుంచి తన కెమెరాలో బందించాలని అనుకున్నాడు. అందులో భాగంగా ఇంటి బయట కంటెగోడపై కెమెరాను పెట్టి దానికి సమీపంలో బ్రెడ్ముక్కలు వేశాడు. తొలుత అక్కడి వచ్చిన కాకులు బ్రెడ్ ముక్కలు తిన్నాయి. అయితే, వాటిల్లో ఒక కాకి నేరుగా ఆ 4 కె కెమెరా వద్దకు వెళ్లి తొలుత ముక్కుతో పొడిచింది. అనంతరం దానిని నోట కరుచుకొని అనూహ్యంగా ఎత్తుకెళ్లింది. ఆ సమయంలో ఆ కెమెరాలో డ్రోన్ వీడియో మాదిరిగా రికార్డ్ అయింది. ఆ కెమెరా కాస్త అతడి ఇంటికి సమీపంలోని గుట్టల ప్రాంతంలో పడేయగా అది దాదాపు ఐదు నెలల తర్వాత దొరికింది. ఆ కాకి కెమెరాను ఎత్తుకెళ్లే సమయంలో రికార్డయిన వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అది కాస్త పెద్ద వైరల్ అయ్యి లక్షల మంది వీక్షించారు. -
ఎలక్ట్రిక్ కార్లలో దూసుకుపోతున్న నార్వే
ఒస్లో: జనాభా ప్రాతిపదికన చూస్తే ప్రపంచంలోకెల్లా నార్వే దేశంలోనే ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఆ దేశంలో 52 లక్షల మంది జనాభా ఉండగా, వారు లక్షకు పైగా ఎలక్ట్రిక్ కార్లు ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రిక్, హైబ్రీడ్ కార్ల వినియోగంలో నార్వే అతి వేగంగా దూసుకెళుతోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో సగానికిపైగా ఈ కార్లే ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లు 17.6 శాతం రిజస్టర్ అవగా, హైబ్రీడ్ కార్లు 33.8 శాతం రిజిస్టర్ అయ్యాయి. అంటే మొత్తం కార్ల రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్, హైబ్రీడ్ కార్ల సంఖ్యనే 51. 4 శాతం ఉందని ఏఎఫ్పీ వార్తా సంస్థ తెలియజేసింది. 2030 నాటికి వాతావరణంలో కార్బన ఉద్గారాలను 40 శాతం తగ్గించాల్సి ఉందని, అందుకనే తమ దేశం ఎలక్ట్రిక్, హైబ్రీడ్ కార్ల ప్రోత్సాహానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వాతావరణం, పర్యావరణశాఖల మంత్రి విదార్ హెల్గేసన్ తెలిపారు. 1990 నుంచే ఈ కార్లను ప్రోత్సహించేందుకు నార్వే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిపై అమ్మకం, రోడ్డు పన్నులను మినహాయించింది. టోల్ గేట్ల వద్ద, షిప్పుల్లో ఉచిత ప్రవేశం కల్పించింది. అన్ని చోట్ల ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించడంతోపాటు బస్సుల కోసం కేటాయించిన ప్రత్యేక ట్రాక్లపై వెళ్లేందుకు అనుమతించింది. ప్రపంచంలోకెల్లా అతివేగంగా ఎలక్ట్రిక్ కార్లను చార్జిచేసే అతిపెద్ద స్టేషన్ను కూడా ఏర్పాటు చేసింది. ఒక్క అరగంటలో 28ను కార్లను ఏకకాలంలో చార్జింగ్ చేసే సామర్థ్యం ఈ స్టేషన్కు ఉంది. 2025 సంవత్సరం నాటికి దేశంలో ఒక్క శిలాజ ఇంధనాలపై పనిచేసే వాహనాలను నిర్మూలించేందుకు నార్వే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2030 నుంచి పెట్రోలు, డీజిల్ కార్లను పూర్తిగా నిర్మూలించాలన్నది నార్వే లక్ష్యం. జనాభా ప్రాతిపదికను పరిగణలోకి తీసుకోకపోయినట్లయితే ప్రపంచంలోకెల్లా చైనాలో ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువగా ఉన్నాయి. -
ఆనందంలో అట్టడుగున..!
సంతోష సూచిలో 121వ స్థానంలో భారత్ ⇒ తొలిస్థానంలో నార్వే ⇒ ఐరాస నివేదికలో వెల్లడి ఐక్యరాజ్యసమితి: భారతీయుల కంటే పాకిస్తానీయులే ఎక్కువ సంతోషకర జీవితాన్ని గడుపుతున్నారు.. మన కంటే ఇరాక్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశ వాసులే అధిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. కాగా సంతోషకర దేశాల జాబితాలో భారత్ 121వ స్థానానికి పరిమితమై అట్టడుగున నిలిచింది. ‘ప్రపంచ సంతోషకర దేశాల నివేదిక 2017’ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ సంతోషకర దినోత్సవం సందర్భంగా సోమవారం ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జాబితాను విడుదల చేశారు. మొత్తం 155 దేశాలకు ర్యాంకులు ప్రకటించారు. 2014–15 నివేదిక ప్రకారం భారత్ స్థానం 118 కాగా.. ఇప్పుడు నాలుగు స్థానాలు తగ్గి చైనా, పాకిస్తాన్, నేపాల్ కంటే వెనుకంజలో నిలిచింది. ప్రజల తలసరి ఆదాయం, సాంఘిక భద్రత, ఆరోగ్యకర జీవితం, నచ్చింది ఎన్నుకోవడంలో ఉండే స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతిపై జాగరూకత ఆధారంగా జాబితాను రూపొందించారు. వ్యక్తిగత అంశాలు సంతోషాన్ని ప్రభావితం చేస్తాయని ఈ నివేదిక వెల్లడించింది. డెన్మార్క్ను వెనక్కినెట్టి... ప్రపంచంలో అంత్యంత సంతోషకర దేశంగా నార్వే నిలిచింది. గతేడాది కంటే మూడు స్థానాలు ఎగబాకి నార్వే ఈ ఘనత సాధించింది. మూడేళ్లుగా నంబర్వన్గా కొనసాగుతున్న డెన్మార్క్ రెండోస్థానంతో సరిపెట్టుకుంది. చైనా (79), పాకిస్తాన్ (80), నేపాల్ (99), బంగ్లాదేశ్ (110), ఇరాక్ (117), శ్రీలంక (120) స్థానాల్లో నిలిచా యి. నార్వే, డెన్మార్క్ తర్వాతి స్థానాల్లో ఐస్లాం డ్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్ ఉన్నాయి. గతేడాది కంటే ఒక స్థానం తగ్గి అమెరికా 14వ స్థానం దక్కించుకుంది. 2012 నుంచి ఇంతవరకూ ఐదుసార్లు ఈ నివేదికల్ని విడుదల చేశారు. -
అమెరికాలో పైసా ఇవ్వరు
వివిధ దేశాల్లో ప్రసూతి సెలవుల తీరుతెన్నులు మన దేశంలో ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచి 18 లక్షల మంది ఉద్యోగినులకు కేంద్ర ప్రభుత్వం ప్రయోజనం కలిగించింది. బిడ్డల సంరక్షణకు తగినంత సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో ప్రసూతి సెలవులు ఎన్ని వారాలు ఇస్తున్నారు? ఈ సమయంలో ఎంత శాతం వేతనం చెల్లిస్తారనే అంశాలను పరిశీలిస్తే ఆశ్చర్యకర, ఆసక్తికర అంశాలున్నాయి. ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకొనే అమెరికాలో ఈ సెలవులు మరీ దారుణం. అక్కడ 12 వారాలు సెలవు తీసుకోవచ్చుగాని జీతం అసలు రాదు. ఇలా వేతనం లేకుండా ప్రసూతి సెలవులిచ్చే దేశాలు ప్రపంచంలో మూడే ఉన్నాయి.. అవి, అమెరికా, లైబీరియా, పపువా న్యూగినియా. వేతనంతో కూడిన సెలవుల విషయంలో నార్వే తొలి స్థానంలో ఉండగా, పనివేళల్లో వెసులుబాటు, సెలవులను తల్లిదండ్రులు పంచుకొనే సౌలభ్యం తదితరాల్లో స్వీడన్ అగ్రస్థానంలో ఉంది. ⇒ స్వీడన్ లో తల్లిదండ్రులిద్దరికీ కలిపి ఇచ్చే 480 రోజుల సెలవులను బిడ్డకు ఎనిమిదేళ్లు నిండేలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. పిల్లల సంరక్షణ కోసం పనిగంటలను 25 శాతం తగ్గించుకునే వెసులుబాటూ ఉంది. అయితే ఎన్ని గంటలు పనిచేశామో అంత కాలానికే వేతనం ఇస్తారు. ⇒ ఫ్రాన్స్ లో తల్లి అయిన ఉద్యోగిని ప్రసూతి సెలవుల అనంతరం రెండున్నరేళ్ల వేతనం లేని ఫ్యామిలీ సెలవు తీసుకోవచ్చు. ⇒ తండ్రికి కూడా పిల్లల పెంపకంలో భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో పురుషులు సెలవు తీసుకోవడాన్ని కొన్ని దేశాలు తప్పనిసరి చేశాయి. ⇒ దత్తత తీసుకున్న దంపతులకు, స్వలింగ దంపతులకు ఫ్రాన్స్ , యూకే, కెనడా, స్వీడన్ లు ప్రసూతి సెలవుల ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. -
నార్వేను ఆదర్శంగా తీసుకోవాలి: చంద్రబాబు
అమరావతి: మానవాభివృద్ధి సూచికకు దేశంలో కేరళను, ప్రపంచ స్థాయిలో నార్వే దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన గురువారం ఆర్ధిక, ప్రణాళిక శాఖల సంయుక్త సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఫలిత ఆధారిత బడ్జెట్ ను రూపొందించాలని అధికారులకు సూచించారు. అయిదు అంశాల ఆధారంగా బడ్జెట్కు రూపకల్పన చేయాలని, సుస్థిర అభివృద్ధి సాధనకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆరో తేదీన నిర్వహించే కార్యదర్శులు, హెచ్ ఓడీల సమావేశం అజెండాపైనా చర్చించినట్లు సమాచారం. ప్రజలు పన్నులు చెల్లించిన నిధులనే ప్రభుత్వం అభివృద్ధికి ఖర్చు చేస్తోందని, కేటాయింపులు ప్రాధాన్యతా క్రమంలో ఉండాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రయోజిత పథకాలు, కేంద్రం సహాయం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న 73 పథకాలతో లక్ష్య సాధనను నిర్దేశించుకోవాలని చెప్పారు. -
ఎఫ్ఎం రేడియోలకు గుడ్బై
ఆస్లో: కారులో ఎక్కడికెళ్లినా ఎఫ్ఎం రేడియో మోగాల్సిందే. ఏ దేశంలోనైనా ఇప్పుడు ఇదే పరిస్థితి. దీన్ని మొట్టమొదటి సారిగా నార్వే బ్రేక్ చేయనుంది. ఎఫ్ఎం రేడియోకు తిలోదకాలిచ్చి డిజిటల్ రేడియో (డీఏబీ)కు తలుపులు తెరవనుంది. వారం రోజుల్లో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ 2017 చివరి నాటికి పూర్తవుతుందని నార్వే ప్రభుత్వం ప్రకటించింది. ఎల్తైన పర్వత శిఖరాలు, వాటి మధ్య లోతైన లోయల్లో నదులు, సముద్ర మార్గాలు, అక్కడక్కడ చెల్లా చెదురుగా విసిరేసి నట్లుండే జనావాసాలున్న నార్వేలో ఎఫ్ఎం రేడియో స్టేషన్లను నిర్వహించడమన్నదే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకనే ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఎఫ్ఎం రేడియో రద్దు దిశగా అడుగులు వేసింది. ఇందుకోసం దశాబ్దకాలం నుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రయోగం ఈ దేశంలో విజయవంతమైతే అనుసరించేందుకు బ్రిటన్ సిద్ధంగా ఉంది. ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లను మూసేసి డిజిటల్ రేడియోలను తెరవడం ద్వారా ఏడాదికి 23 లక్షల డాలర్లు మిగులుతాయన్నది నార్వే ప్రభుత్వం అంచనా. డిజిటల్ రేడియో వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా ఆడియో క్లారిటీ పెరగుతుందని, దూరప్రాంతాలకు కూడా సిగ్నల్స్ సులభంగా వెళతాయని, ఎక్కువ ఛానళ్లను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం వాదిస్తోంది. సిబ్బంది ఉద్యోగాలు పోతాయని, వినియోగదారులకు భారం అవుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగాలు ఏమీ పోవని, ఆ మేరకు డిజిటల్ రేడియో స్టేషన్లను పెంచుతామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అయితే డిజిటల్ రేడియోలను కొనుగోలు చేయడానికి ఒక్కసారి మాత్రమే ప్రజలపై భారం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. దేశంలో నడుస్తున్న 20 లక్షల కార్లలో ఎఫ్ఎం రేడియోలు మూగబోతాయని ఆటోమొబైల్ వర్గాలు పేర్కొంటున్నాయి. 52 లక్షల జనాభా కలిగిన నార్వేలో 70 శాతం ఇళ్లలో ఇప్పటికే డిజిటల్ రేడియోలు ఉన్నాయి. -
పార్లమెంటులో 'పోకేమాన్ గో' ఆడిన ప్రధాని!
-
పార్లమెంటులో 'పోకేమాన్ గో' ఆడిన ప్రధాని!
ఓస్లో: 'పోకేమాన్ గో' ప్రపంచాన్ని ఉర్రుతలూగించిన ఆండ్రాయిడ్ గేమ్. ఈ మధ్యకాలంలో గేమ్ కు కొంచెం క్రేజ్ తగ్గినట్లు కనిపించినా.. అది నిజం కాదని తాజా ఘటన చెబుతోంది. సాక్ష్యత్తూ ఒక దేశ ప్రధానమంత్రి పార్లమెంట్ లో పోకేమాన్ గో ఆడుతూ దొరికిపోయారు. సభలో రసవత్తరమైన డిబేట్ జరుగుతున్నా ఏమీ పట్టనట్లుగా పోకేమాన్ గోలో మునిగిపోయారు నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్ బర్గ్. గతంలో అధికారిక పర్యటన మీద సోల్వాకియా దేశానికి వెళ్తున్న సమయంలో పోకేమాన్ ఆడుతూ కెమెరాకు చిక్కారు. పర్యటన సమయంలో సోల్ బర్గ్ పోకేమాన్ ఆడుతున్న ఫోటోలు ఓ నార్వేయన్ పత్రికలో కూడా ప్రచురితమయ్యాయి. కాగా, పోకేమాన్ గో ఆడుతూ దొరికిపోవడంపై మాట్లాడిన ఆమె మహిళలు ఒకే సమయంలో రెండు పనులను చక్కబెట్టగలరని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. నార్వేకు చెందిన మరో రాజకీయ నేత కూడా విదేశాంగ, రక్షణ శాఖల సమావేశంలో పోకేమాన్ గో ఆడుతూ కనిపించారు. దీంతో సదరు నేతపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శలపై స్పందించిన నేత తాను గేమ్ ఆడుతున్నప్పుడు మరింత శ్రద్ధగా వినగలుగుతానని చెప్పారు.