palaniswamy
-
తమిళనాట ట్విస్ట్.. ఎన్డీఏకు అన్నాడీఎంకే గుడ్బై..
సాక్షి, చెన్నై: దేశ, తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీఏ కూటమి నుంచి తాము వైదొలగుతున్నట్టు అన్నాడీఎంకే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సందర్బంగా అన్నాడీఎంకే నేతలు తమిళనాడు బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్బంగా అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుస్వామి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నుంచి బీజేపీ, ఎన్డీయే కూటమితో అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకుంటోంది. నేడు జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు అన్నాడీఎంకే ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మా పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. గత ఏడాది కాలంగా మా పార్టీ జనరల్ సెక్రటరీ పళనిస్వామి, పార్టీ కేడర్పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. VIDEO | AIADMK announces to break alliance with BJP in #TamilNadu. "We are breaking our alliance with BJP and NDA. AIADMK will form a new alliance and face upcoming Parliamentary elections," says party. pic.twitter.com/TWpbMrQKPT — Press Trust of India (@PTI_News) September 25, 2023 ఇదే సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మునుస్వామి. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అన్నాడీఎంకే కొత్త కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఇక, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డీఎంకే భారీ మెజార్టీతో విజయం సాధించింది. Chennai, Tamil Nadu | K P Munusamy, AIADMK Deputy Coordinator says, "AIADMK unanimously passed a resolution in the meeting. AIADMK is breaking all ties with BJP and NDA alliance from today. The state leadership of the BJP has been continuously making unnecessary remarks about our… pic.twitter.com/HSx3NJKKOJ — ANI (@ANI) September 25, 2023 అయితే, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడంతో మొదలుపెట్టి ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి జాబితాను విడుదల చేస్తానని అనడం, అలాగే, దివంగత సీఎం అన్నాదురై పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అన్నాడీఎంకే నేతలకు అస్సలు మింగుడుపడలేదు. దీంతో ఆ పార్టీలో సీనియర్లంతా అన్నామలై తీరుపై నిప్పులు చెరిగారు. ఇదే తరుణంలో మాజీ మంత్రి జయకుమార్ సైతం అన్నామలై తీరుపై ఇటీవల కాస్త ఘాటుగానే స్పందించడం, ఢిల్లీలో బీజేపీ నేతలను అన్నాడీఎంకే నేతలు కలవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా, అన్నామలై తీరుపై బీజేపీ పెద్దలకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, వారి ప్రోద్బలం లేకుండా ఆయన అలా మాట్లాడి ఉండరని పళనిస్వామి భావించినట్టు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు రావడంతో ఆ పార్టీ నేతలు తమిళనాడులో సంబురాలు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో బాణాసంచా కాల్పి సంబురాలు జరుపుకుంటున్నారు. #WATCH | Tamil Nadu | AIADMK workers burst crackers in Chennai after the party announces breaking of all ties with BJP and NDA from today. pic.twitter.com/k4UXpuoJhj — ANI (@ANI) September 25, 2023 అన్నాడీఎంకే ప్రకటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై స్పందించారు. ప్రస్తుతం తాను దుర్గ పూజలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశారు. దీనిపై తర్వాత మాట్లాడుతానని తెలిపారు. #WATCH | Coimbatore | On AIADMK breaking alliance with BJP and NDA, Tamil Nadu BJP president K Annamalai says, "I will speak to you later, I don't speak during Yatra. I will speak later." pic.twitter.com/yObr5hSeT3 — ANI (@ANI) September 25, 2023 ఇది కూడా చదవండి: మీరు డమ్మీ సీఎం, అబద్దాల కోరు.. అందుకే పక్కన పెట్టేశారు -
అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం
-
తమిళ పాలిటిక్స్లో ట్విస్ట్.. పళణిస్వామికి బిగ్ షాక్!
సాక్షి,చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి బుధవారం మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. రహదారుల టెండర్లలో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి ఏసీబీ చేపట్టిన విచారణపై స్టే విధించేందుకు న్యాయ మూర్తులు నిరాకరించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో సీఎంగా పనిచేసిన పళనిస్వామి పర్యవేక్షణలో రహదారుల శాఖ వ్యవహారాలు సాగిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో రహదారుల శాఖలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు అరప్పోర్ ఇయక్కం ఆరోపించింది. రూ. 4,800 కోట్లు రహదారుల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా ఏసీబీకి ఫిర్యాదు చేశాయి. అదే సమయంలో ఈ టెండర్ల వ్యవహారం పళనిస్వామి మెడకు చుట్టుకునే విధంగా కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ ఆరోపణలు, ఫిర్యాదులపై ఏసీబీ స్పందించింది. అలాగే, మరోవైపు ఐటీ వర్గాలు సైతం దూకుడు పెంచాయి. పళణి స్వామి సన్నిహితులైన కాంట్రాక్టర్లను టార్గెట్ చేసి సోదాలు నిర్వహించాయి. అదే సమయంలో ఈ అక్రమాలపై దృష్టి పెట్టిన డీఎంకే ప్రభుత్వం తిరుచ్చి డివిజన్ రహదారుల శాఖ పర్యవేక్షణాధికారి, చీఫ్ ఇంజినీర్గా ఉన్న పళణిని సస్పెండ్ చేసింది. కోర్టులో విచారణ ఈ అక్రమాల వ్యవహారం విచారణ సుప్రీంకోర్టు వరకు వెళ్లొచ్చింది. మద్రాసు హైకోర్టు ఈ వ్యవహారంపై త్వరితగతిన విచారణ ముగించే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో ఏసీబీ చర్యలకు సిద్ధం అవుతుండటంతో, ఈ విచారణకు స్టే విధించాలని కోరుతూ పళణి స్వామి హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ అక్రమాలపై ఏసీబీ ప్రాథమిక విచారణ ముగించినట్లు కోర్టుకు ఆ విభాగం తరపు న్యాయవాదులు వివరించారు. విజిలెన్స్ కమిషన్కు నివేదిక పంపించినట్లు, అనుమతి రాగానే, తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం ఏసీబీ తదుపరి చర్యలకు స్టే విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారనను ఈనెల 26వ తేదీకి న్యాయమూర్తులు వాయిదా వేశారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూలైన్ రాంభగీచ వరకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,292 మంది శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా.. 30,641 మంది తలనీలాలు ఇచ్చారు. భక్తులు శ్రీవారి హుండీలో రూ.3.72 కోట్లు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న పళనిస్వామి తిరుమల శ్రీవారిని శనివారం తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలివ్వగా.. టీటీడీ అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. -
మద్రాస్ హైకోర్టులో ఈపీఎస్కు ఊరట
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం ఈకే పళనిస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. అన్నాడీఎంకే నాయకత్వ వివాదంపై న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పార్టీకి పళనిస్వామే సుప్రీం నాయకుడని స్పష్టం చేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నిక చెల్లుతుందని డివిజన్ బెంచ్ పేర్కొంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. జులై 11న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నికయ్యారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్సెల్వం కోర్టును ఆశ్రయించారు. అప్పటి సింగిల్ బెంచ్ ధర్మాసనం పళనిస్వామి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. అయితే ఈ వ్యవహారంపై పళనిస్వామి మరోసారి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో ఈపీఎస్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు కోర్టు తీర్పు అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఎర్పాటు చేశారు. గతంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఆపీస్లో విధ్వంసం సృష్టించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈమేరకు చర్యలు తీసుకున్నారు. చదవండి: కేసీఆర్కు ఘోర అవమానం.. ఇందుకేనా బిహార్ వెళ్లింది?: బీజేపీ -
తమిళనాట ట్విస్ట్.. పన్నీర్సెల్వానికి బిగ్ షాక్
సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలోకి చొరబడి నష్టం కలిగించిన వ్యవహారంపై పన్నీర్సెల్వం, ఆయన అనుచరులకు సమన్లు జారీచేయాలని సీబీసీఐడీ పోలీసులు నిర్ణయించారు. వైద్యలింగం, మనోజ్ పాండియన్ తదితరులకు సైతం సమన్లు పంపనున్నారు. సీబీసీఐడీ డీఎస్పీ నేతృత్వంలోని ఒక బృందం శుక్రవారం పార్టీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించింది. చెన్నై వానగరంలో గతనెల 11వ తేదీన జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి పళనిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఇందుకు నిరసనగా పన్నీర్సెల్వం సహా ఆయన అనుచర వర్గం తీవ్ర ఆగ్రహంతో చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయ ప్రధాన ద్వారాన్ని పగులగొట్టిలోనికి జొరబడి ఫరి్నచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారని, ముఖ్యమైన డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారని ఎడపాడి వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం చెన్నై రాయపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు ప్రతిగా పన్నీర్ వర్గం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెండు వర్గాలకు చెందిన చెరో 200 లెక్కన మొత్తం 400 మంది కార్యకర్తలపై పోలీసులు ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణను గ్రేటర్ చెన్నై పోలీసుల నుంచి సీబీసీఐడీ పోలీసులకు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు తెలిపింది. కార్యాలయంపై దాడి వ్యవహారంపై ఓపీఎస్, ఆయన మద్దతుదారు ముఖ్యనేతలకు వేర్వేరుగా సమన్లు జారీచేసి విచారణ చేపట్టాలని సీబీసీఐడీ నిర్ణయించింది. పన్నీరుసెల్వంకు దర్శకుడు భాగ్యరాజ మద్దతు ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేను అంద రూ కలిసి కాపాడుకోవాలని ప్రముఖ సినీ దర్శకులు భాగ్యరాజా అన్నారు. పారీ్టలో, న్యాయస్థానాల్లో చో టుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించేందుకు పన్నీర్సెల్వం తన అనుచరులతో శుక్రవారం చెన్నై లో సమావేశమయ్యారు. ఇందులో భాగ్యరాజ పా ల్గొని పన్నీర్కు మద్దతు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఒక చిన్న కార్యకర్తలా పార్టీ క్షేమాన్ని కోరుతున్నానని, పారీ్టలోని అన్ని వర్గాలు ఏకం అవుతాయని, ఇందుకు సమయం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఏందయ్యా మీ గొడవ.. కోర్టుకు మరో పనిలేదా..?
అన్నాడీఎంకేలో అగ్రనేతల వర్గపోరు న్యాయస్థానానికి కూడా తలనొప్పిగా మారింది. కోర్టులో దాఖలవుతున్న పిటీషన్ల పరంపరపై సాక్షాత్తూ న్యాయమూర్తే అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రధాన న్యాయమూర్తికి మరో పనిలేదని భావిస్తున్నారా’ అంటూ న్యాయమూర్తి కృష్ణన్ రామస్వామి అన్నాడీఎంకే నేతలు, వారి న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే అగ్రనేతలు ఎడపాడి పళనిస్వామి, పన్నీర్సెల్వం మధ్య అంతర్గత పోరు చిలికిచిలికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. సమన్వయ కమిటీ కనీ్వనర్గా పన్నీర్సెల్వం, ఉప కనీ్వనర్ ఎడపాడి పళనిస్వామి ఉన్న ద్వంద విధానానికి స్వస్తి చెప్పి ఏక నాయకత్వంతో ముందుకు సాగాలనే అంశం పార్టీలో అగ్గిరాజేసింది. ఓపీఎస్ ఆదేశాలను అనుసరించి జూన్ 23వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశాన్ని ఈపీఎస్ వర్గం ధిక్కరించింది. పైగా జూలై 11వ తేదీన మరో సర్వసభ్య సమావేశం నిర్వహించింది. పనిలోపనిగా ఎడపాడిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుని, ఓపీఎస్, ఆయన ఇద్దరు కుమారులు, అనుచరులపై బహిష్కరించింది. అయితే, ఓపీఎస్ వేసిన పిటిషన్తో ఎడపాడి నిర్వహించిన సర్వసభ్య సమావేశం చెల్లకుండా పోగా, పన్నీర్ పదవులు మళ్లీ పదిలమయ్యాయి. అన్నాడీఎంకే నిర్వహించిన సర్వసభ్య సమావేశం చెల్లదని ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎడపాడి పళనిస్వామి మరో పిటిషన్ వేశారు. పార్టీలోని ఇరువర్గాలు ఏకమై మరో సర్వసభ్య సమావేశం జరుపుకోవాలని కోర్టు చేసిన సూచనకు ఎడపాడి తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పన్నీర్సెల్వంతో ఎడపాడి కలిసి పనిచేసేందుకు అవకాశమే లేదని మద్రాసు హైకోర్టులో గురువారం జరిగిన వాదోపవాదాల్లో తేల్చిచెప్పారు. ఇలా ఇరువురూ నేతలూ పోటాపోటీగా మద్రాసు హైకోర్టు, సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో కొన్ని ఇంకా విచారణ దశలో ఉన్నాయి. తాజాగా మరో రెండు.. తిరుచెందూరుకు చెందిన న్యాయవాది, అన్నాడీఎంకే సభ్యుడైన పి. ప్రేమ్కుమార్ ఆదిత్యన్, అదే పార్టీ సభ్యుడు సురేన్ పళనిస్వామి మద్రాసు హైకోర్టులో బుధవారం వేర్వేరుగా రెండు సివిల్ పిటిషన్లు వేశారు. 2017 సెపె్టంబర్ 12వ తేదీన సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. 2021 డిసెంబర్ 1వ తేదీన పార్టీ విధానాల్లో చేసిన మార్పులు, డిసెంబర్ 6వ తేదీన జరిగిన సమన్వయ కమిటీ ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలు, 2022 జూన్ 23వ తేదీన సర్వసభ్యç సమావేశలో చేసిన తీర్మానాలు చెల్లవని ప్రకటించాల్సిందిగా కోరుతూ ఈ పిటిషన్ వేశారు. వీరిద్దరూ దాఖలు చేసిన కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. తాము దాఖలు చేసిన సివిల్ పిటిషన్లు, జూన్, జూలై నిర్వహించిన సర్వసభ్య సమావేశ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ సమన్వయ కమిటీ కన్వీనర్, ఉప కన్వీనర్ దాఖలు చేసిన పిటిషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యతిరేకంగా కొందరు దాఖలు చేసిన పిటిషన్లు విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని అందులో కోరారు. ఇప్పటికే అన్నాడీఎంకే కేసుల విచారణకు ఈనెల 17వ తేదీన ప్రత్యేక న్యాయమూర్తిని ఏర్పాటు చేసి ఉన్నట్లు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రామ్కుమార్ ఆదిత్యన్ తదితరులు వేసిన పిటిషన్లు న్యాయమూర్తి కృష్ణన్ రామస్వామి ముందుకు విచారణకు వచ్చింది. ఇద్దరి నాయకుల తరపున హాజరైన న్యాయవాదులు ప్రత్యేక బెంచ్కోసం రిజి్రస్టార్కు వినతిపత్రం సమర్పించిన విషయం వెలుగులోకి రావడంతో న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. కేసు విచారణ దశలో ఉండగా ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రాలు సమరి్పంచడమే మీపనిగా ఉంది, సీజేకి మరో పనిలేదని భావిస్తున్నారా..? అంటూ న్యాయమూర్తి ప్రశ్నించి కేసు విచారణను సెపె్టంబర్ 9వ తేదీకి వాయిదా వేశారు. గతనెల 11వ తేదీ జరిగిన సర్వసభ్య సమావేశం చెల్లదని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్, సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఇదే న్యాయమూర్తి ముందుకు విచారణకు వచ్చింది. అయితే పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్సెల్వం న్యాయవాది అభ్యర్థన మేరకు కేసు విచారణను మరో న్యాయమూర్తికి బదిలీ చేశారు. ఈమేరకు న్యాయమూర్తి జయచంద్రన్ను నియమిస్తూ ఈనెల 17న ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ దశలో అన్నాడీఎంకే కేసులన్నీ విచారించేందుకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని మరో రెండు పిటిషన్లు దాఖలు కావడంపై న్యాయమూర్తి కృష్ణన్ రామస్వామి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
అన్నాడీఎంకే పాలిటిక్స్లో హై టెన్షన్.. రంగంలోకి దిగిన పోలీసులు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలోకి కార్యకర్తలెవ్వరూ ప్రవేశించరాదని ఎడపాడి పళనిస్వామి మద్దతుదారులు ఆదివారం ఆకస్మిక ఉత్తర్వులు జారీ చేశారు. కార్యాలయ ప్రవేశంపై కోర్టు విధించిన గడువు శనివారం ముగియడంతో ఈ మేరకు తమ పట్టు నిలుపుకునేందుకు అప్రమత్తం అయ్యారు. గతనెల 11వ తేదీన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరగడం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి ఎంపిక కావడంతో రెచ్చిపోయిన పన్నీర్సెల్వం వర్గీయులు పార్టీ ప్రధాన కార్యాలయం ప్రధాన ద్వారం తలుపు బద్దలు కొట్టి మరీ ప్రవేశించారని ఎడపాడి వర్గం ఆరోపిస్తోంది. పైగా లోపలున్న ఫర్నీచర్, ఫైళ్లు, డాక్యుమెంట్లు, కంప్యూటర్లు ధ్వంసం చేశారని చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్యాలయానికి సీలు వేయగా, సీలు తొలగించి పార్టీ కార్యాలయం తాళాలను ఎడపాడికి అప్పగించాలని కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. అయితే, పార్టీ శ్రేణులెవ్వరూ ఆగస్టు 20వ తేదీ వరకు కార్యాలయంలోకి ప్రవేశించరాదని కోర్టు అదేరోజు ఆదేశించింది. ఇదిలా ఉండగా, ఎడపాడి నిర్వహించిన సర్వసభ్య సమావేశం చెల్లదని, అంతకు ముందున్న పరిస్థితులు కొనసాగాలని ఇటీవల కోర్టు తీర్పు చెప్పడంతో పార్టీలో పన్నీర్సెల్వానిదే పైచేయిగా మారింది. పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ హోదా మళ్లీ తన చేతికి వచ్చినా, కార్యాలయ తాళాలు మాత్రం ఇంకా ఎడపాడి చేతుల్లోనే ఉన్నాయి. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్యకర్తల కార్యాలయ ప్రవేశ నిషేధం ఈనెల 20వ తేదీతో ముగిసింది. అయితే, కోర్టు తాజా తీర్పుతో పన్నీర్సెల్వం వర్గం మళ్లీ పార్టీ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశిస్తే గతనెల 11వ తేదీన జరిగిన దుస్సంఘటనకు సంబంధించిన ఆనవాళ్లు రూపుమాపే అవకాశం ఉంటుందని ఎడపాడి వర్గం అనుమానిస్తోంది. దీంతో కార్యాలయంలోకి పార్టీ శ్రేణులు ఎవ్వరూ వెళ్లరాదని ఎడపాడి వర్గం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ ఆదేశాలను పన్నీర్ వర్గం ఖాతరు చేస్తుందా..? అనే కొత్త అనుమానాలు తలెత్తాయి. కోర్టు విధించిన నిషేధం గడువు ముగిసిపోయిన దశలో అదనపు పోలీసు బందోబస్తు మధ్య కార్యాలయం బోసిపోయి దర్శనమిస్తుండడం గమనార్హం. ఇది కూడా చదవండి: కాంగ్రెస్లో ఊహించని షాక్.. నడిరోడ్డుమీదే తన్నుకున్న నేతలు -
పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి.. తమిళ పాలిటిక్స్లో ట్విస్ట్
అంతర్గత కుమ్ములాటలతో కప్పల తక్కెడగా మారిన అన్నాడీఎంకేలో పరిణామాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. బుధవారం కోర్టు తీర్పుతో మళ్లీ పార్టీ కనీ్వనర్, కోశాధికారిగా గుర్తింపు దక్కడంతో పన్నీరు శిబిరం ఆనంద తావడం చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం పన్నీరు.. తన ప్రత్యర్థి పళని స్వామికి కీలక సూచన చేశారు. ఏక, జంట నాయకత్వానికి స్వస్తి పలికి ఉమ్మడిగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అందరూ ఏకం కావాల్సిన సమయం అసన్నమైందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఊసరవెళ్లి తరహాలో రంగులు మార్చే పన్నీరు సెల్వంతో కలిసి ప్రయాణించే అవకాశమే లేదని పళని స్వామి తేలి్చచెప్పారు. సాక్షి, చెన్నై : ‘గొడవలు వద్దు..ఐక్యతే ముద్దు, జంట , ఏక నాయకత్వాలు వద్దు ఉమ్మడిగా పార్టీని బలోపేతం చేద్దాం..’’ అని పళని స్వామికి పన్నీరు సెల్వం పిలుపు నిచ్చారు. అలాగే, చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్కూ ఆహ్వానం పలికారు. అయితే, పన్నీరు పిలుపును పళని తిరస్కరించారు. కలిసి పనిచేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. కీలక మలుపు.. అన్నాడీఎంకే అగ్ర నేతలు పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వివాదాల ఎపిసోడ్ బుధవారం కీలక మలుపు తిరిగింది. జూలై 11వ తేదీన పళని నిర్వహించిన సర్వ సభ్య సమావేశానికి వ్యతిరేకంగా పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సర్వ సభ్య సమావేశం చెల్లదని తేల్చింది. జూన్ 23వ తేదీ నాటి పరిస్థితులనే యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. దీంతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని ఎంపిక చెల్లకుండా పోయింది. అలాగే, అన్నాడీఎంకేలో రెండు గ్రూపులుగా ఏర్పడ్డ పళని, పన్నీరు తమ వాళ్లకు పదవులు కట్ట బెడుతూ జారీ చేసిన ఉత్తర్వులు అన్నీ చెల్లని కాగితాలయ్యాయి. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, కోశాధికారి పదవులు కోర్టు తీర్పుతో మళ్లీ పన్నీరు చేతికి చిక్కాయి. పళని కేవలంలో పార్టీ సమన్వయ కమిటీ కో– కన్వీనర్గా మిగలాల్సిన పరిస్థితి. కోర్టు తీర్పు పన్నీరు శిబిరంలో ఆనందాన్ని నింపితే, పళని శిబిరాన్ని నిరాశకు గురి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు శిబిరాలు వేర్వేరుగా గురువారం సమావేశాల్లో మునిగాయి. తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, పన్నీరు సెల్వం ఇచ్చిన పిలుపు అన్నాడీఎంకే రాజకీయాలను ఆసక్తికరం చేశాయి. పళణితో సామరస్యానికి పన్నీరు ముందుకు రావడమే కాకుండా, చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి దినకర్ను కూడా పారీ్టలోకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. చేతులు కలుపుదాం.. పన్నీరు సెల్వం తన ప్రసంగంలో ప్రియ మిత్రమా చేతులు కలుపుదాం.. కలిసి పనిచేద్దాం అని పిలుపు నిచ్చారు. ఇన్నాళ్లూ మనస్సులో ఉన్న చేదు అనుభవాలు, బాధలు, భేదాలు, వివాదాలను పక్కన పెట్టేద్దామని సూచించారు. అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో సీఎం పగ్గాలు చేపట్టిన పళని స్వామికి నాలుగున్నరేళ్ల సంపూర్ణ సహకారం అందించామని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు ఏక నాయకత్వం అంటే, అంగీకరించే ప్రసక్తే లేదని, అయితే, ఉమ్మడి నాయకత్వంతో అందరం కలిసి కట్టుగా ఐక్యతను చాటుదామని పిలుపు నిచ్చారు. అన్నాడీఎంకేలో ఒకే ఎజెండా మాత్రమే ఉందని, అది ఒక్క ఐక్యత మాత్రమేనని పేర్కొన్నారు. సమష్టిగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపు నిచ్చారు. అందరూ అంటే, చిన్నమ్మ శశికళ, దినకరన్ను కూడా ఆహా్వనిస్తున్నారా..? అని ప్రశ్నించగా, అవును అని సమాధానం ఇచ్చారు. అందరూ మళ్లీ పారీ్టలోకి రావాలని, కలిసి కట్టుగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. అమ్మ జీవించి ఉన్న కాలంలో పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమించి, ఇప్పుడు దూరంగా ఉన్న వారు సైతం రావాలని, అందరూ ఉమ్మడి ప్రయాణం ప్రారంభించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అప్పీల్కు పళని.. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం వ్యవహారంలో ప్రత్యేక బెంచ్ బుధవారం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పళని స్వామి తరపున మద్రాసు హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది విజయనారాయణన్ ఈ పిటిషన్ వేశారు. దీనిని న్యాయమూర్తులు ఎం. దురైస్వామి, సుందర్మోహన్ బెంచ్ విచారణకు స్వీకరించింది. అయితే, సోమవారం నుంచి విచారణ చేపడుతామని ప్రకటించింది. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే తాళాన్ని పళనిస్వామికి అప్పగించిన వ్యవహారంలో పన్నీరు సెల్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ సుప్రీంకోర్టులో గురువారం విచారణకు వచ్చింది. తాళం కోసం పన్నీరు తరపు న్యాయవాదులు తీవ్రంగానే వాదనలు వినిపించారు. పళని స్వామికి తాళం అప్పగిస్తూ హైకోర్టు ఇప్పటికే ఇచ్చి న ఉత్తర్వులకు స్టే విధించాలని కోరారు. అయితే, సుప్రీంకోర్టు స్టేకు నిరాకరించింది. వివరణ ఇవ్వా లని పళని స్వామికి నోటీసులు జారీ చేసింది. అంగీకరించే ప్రసక్తే లేదు.. పళని స్వామి మీడియాతో మాట్లాడుతూ, పన్నీరు ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆయనతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ధర్మయుద్ధం అంటూ గతంలో గళం వినిపించిన పన్నీరు, ఇప్పుడు ఆ యుద్ధాన్ని పక్కన పెట్టేశారా? అని ప్రశ్నించారు. వాళ్లను కూడా పారీ్టలోకి ఆహా్వనిస్తుండడం చూస్తే, ఆయన ధర్మయుద్ధం ఎవరి కోసం చేసినట్లో అర్థం అవుతోందని మండిపడ్డారు. ఆయనకు పదవీ కాంక్ష ఎక్కువని, శ్రమించకుండా ఉన్నత పదవుల్లో కూర్చోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు. పార్టీ కన్నా, కుటుంబమే ఆయనకు ముఖ్యమని, అందుకే ఆయన తనయుడికి కేంద్ర మంత్రి పదవి కోసం గతంలో పట్టుబట్టారని గుర్తు చేశారు. గూండాలతో, రౌడీలతో, పోలీసు భద్రతతో వెళ్లి పార్టీ కార్యాలయం పరువును బజారుకీడ్చారని, కేడర్ను కొట్టించిన పన్నీరుతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏక నాయకత్వం తన వ్యక్తిగతం కాదని, కార్యకర్తలందరి అభీష్టం అని స్పష్టం చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే, పార్టీ సర్వ సభ్య సమావేశంలో చర్చించుకోవాలే గానీ, అనాగరికంగా వ్యవహరించడం సమంజసమా..? అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: బిహార్ పరిణామాలు.. కేంద్రంలో అధికార మార్పునకు సంకేతం -
బిగ్ రిలీఫ్: మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు ఊరట
చెన్నై: అన్నాడీఎంకే నాయకత్వం వ్యవహారంలో పన్నీర్ సెల్వంకు భారీ ఊరట లభించింది. అన్నాడీఎంకే కేసులో స్టేటస్ కో విధించింది మద్రాస్ హైకోర్టు. జూన్ 23న జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించింది. పార్టీ జనరల్ సెక్రెటరీగా ఈ పళనిస్వామి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. దీంతో పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కొత్తగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తాజా ఆదేశాలతో అన్నాడీఎంకేలో సంయుక్త నాయకత్వాన్ని పునరుద్ధరించినట్లయింది. పన్నీరు సెల్వం కోఆర్డినేటర్గా, పళనిస్వామి డిప్యూటీ కోఆర్డినేటర్గా కొనసాగాల్సి ఉంటుంది. అన్నాడీఎంకే కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జూన్ 23న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం అక్రమమని వాదించారు పన్నీరు సెల్వం తరఫు న్యాయవాది. పార్టీ నిబంధనలను అతిక్రమించి పళనిస్వామి సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు. అలాంటి సమావేశం సంయుక్తంగా ఇరువురి నేతల సమక్షంగా చేపట్టాలని వెల్లడించారు. ‘పార్టీ మధ్యంతర జనరల్ సెక్రెటరీగా ఈపీఎస్ నియామకం సరైంది కాదు. ఇరువురు నేతలు కలిసి పనిచేయాలి.’ అని పేర్కొన్నారు ఓపీఎస్ తరఫు న్యాయవాది తమిల్మారన్. గతంలో ఓపీఎస్ను పార్టీ టాప్ పోస్ట్కు రెండుసార్లు ఎంపిక చేశారు అన్నాడీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఆమె మరణించేకన్నా ముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగానూ చేశారు. కానీ, జయలలిత నెచ్చెలి శశికల పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఈపీఎస్ను ముఖ్యమంత్రిగా నియమించారు. మరోవైపు.. శశికల ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ప్రయత్నాలు చేయగా ఓపీఎస్ తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత ఆమె జైలుకు వెళ్లారు. ఇరువురు నేతలు కలిసి పార్టీని నడిపించారు. ఓపీఎస్తో చేతులు కలిపిన ఈపీఎస్ పార్టీ నేత శశికలను బహిష్కరించారు. ఓపీఎస్ను ఉపముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు ఈపీఎస్. ఓపీఎస్ కోఆర్డినేటర్గా, ఈపీఎస్ డిప్యూటీ జాయింట్ కోఆర్డినేటర్గా కొనసాగుతూ వచ్చారు. అయితే, ఇటీవల జరిగిన మూడు ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలవటంతో నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. పార్టీని హస్తగతం చేసుకునేందుకు ద్వంద నాయకత్వంతో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు ఈపీఎస్. పార్టీకి ఒక్కరే నాయకత్వం వహించాలని సూచించారు. ఆ తర్వాత జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. అయితే, తాజాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఓపీఎస్కు ఊరట లభించినట్లయింది. ఇదీ చదవండి: Tamil Nadu: సుప్రీంకోర్టుకు పళనిస్వామి.. తీర్పుపై ఫుల్ ఉత్కంఠ -
అన్నాడీఎంకే: రెండాకుల్లో.. మూడుముక్కలాట!
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే ప్రబలశక్తి. రెండాకుల గుర్తుపై గణనీయమైన ఓటు బ్యాంకు ఈ పార్టీకి సొంతం. ఎంజీఆర్, జయలలిత కాలం నాటి క్రమశిక్షణ కనుమరుగైపోగా, రెండాకుల పార్టీ కోసం ఈపీఎస్, ఓపీఎస్, వీకేఎస్ మధ్య మూడుముక్కలాట తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. వ్యవస్థాపక అధ్యక్షునిగా ఎంజీ రామచంద్రన్, ఆ తరువాత పగ్గాలు చేపట్టిన జయలలిత ప్రధాన కార్యదర్శిగా పార్టీని పరుగులు పెట్టించారు. జయ మరణం తరువాత పార్టీపై పెత్తనం కోసం వీకే శశికళ (వీకేఎస్), ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్), ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్) పోటీపడ్డారు. ఆస్తుల కేసులో శశికళ జైలుపాలు కావడంతో ఓపీఎస్,ఈపీఎస్ల జంట నాయకత్వం అనివార్యమైంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో శశికళ జైలు నుంచి విడుదల కావడం, పార్టీ ఓటమి తరువాత అంతః కలహాలు మొదలయ్యాయి. ఏక నాయకత్వం నినాదంతో గద్దెనెక్కాలని ఎడపాడి చేస్తున్న ముమ్మురమైన ప్రయత్నాలపై ఓపీఎస్ న్యాయపోరాటానికి దిగారు. పోటీగా ఈపీఎస్ సైతం కోర్టు మెట్లెక్కారు. ముచ్చటగా మూడో నేత.. ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరించడం ద్వారా పార్టీని కైవసం చేసుకుకోవాలని ఎడపాడి పళనిస్వామి భావిస్తుండగా ఆ ప్రయత్నాలకు పన్నీర్సెల్వం గండికొడుతున్నారు. ఈపీఎస్, ఓపీఎస్ కుమ్ములాటతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల గుర్తుపై ఈసీ (ఎన్నికల కమిషన్) నిషేధం విధించింది. ఇక అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ కలవరాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేలా శశికళ రాష్ట్రవ్యాప్త పర్యటన మొదలుపెట్టారు. ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులనే నిజమైన నేతలుగా పరిగణించాలి, కార్యకర్తలను కలుపుకుపోగల ఏక నాయకత్వమే పార్టీకి శ్రేయస్కరమని ఈనెల 4వ తేదీన పూందమల్లి జరిపిన పర్యటనలో శశికళ అన్నారు. క్యాడర్ను ఏకతాటిపై నడిపించేందుకు పార్టీ శ్రేణులు తన నాయకత్వాన్ని కోరుతున్నారని ఆమె చెప్పారు. చదవండి: Viral: బ్యాండ్ వాయించి సీఎం ఏక్నాథ్కు వెల్కమ్ చెప్పిన భార్య స్టే కోసం ఓపీఎస్ పిటిషన్ ఎడపాడి పళనిస్వామి మద్దతుదారులు ఈనెల 11వ తేదీన తలపెట్టిన సర్వసభ్య సమావేశం నిర్వహణపై స్టే విధించాలని కోరుతూ పన్నీర్సెల్వం మంగళవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను అత్యవసర కేసుగా పరిగణించి విచారణ చేపట్టాలని ఓపీఎస్ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఈమేరకు స్టే కోరుతూ దాఖలైన ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్టే కోసం ఒకవైపు ఓపీఎస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, మరోవైపు ఈపీఎస్ సర్వసభ్య సమావేశానికి సన్నాహాలు చేస్తున్నారు. 11వ తేదీన సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా తనను కార్యకర్తలే ఎన్నుకునేలా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని వ్యూహం పన్నుతున్నారు. ఈ సమావేశానికి పోలీసు బందోబస్తు కల్పించాలని మాజీ మంత్రి జయకుమార్ డీజీపీకి మంగళవారం దరఖాస్తు చేశారు. అసాంఘిక శక్తుల వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. జనరల్బాడీ సమావేశానికి హాజరయ్యే సభ్యులకు బార్కోడ్తో కూడిన గుర్తింపుకార్డు విధానాన్ని ప్రవేశపెట్టాలని పార్టీ భావిస్తోంది. అంతేగాక, పన్నీర్సెల్వం వర్గాన్ని తమవైపునకు తిప్పుకునేలా ఎడపాడి నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. పనిలో పనిగా పన్నీర్సెల్వంకు సైతం ఎడపాడి ఆహ్వానం పంపడం విశేషం. -
అన్నాడీఎంకేలో తారాస్థాయికి ముసలం.. జయ సమాధి వద్ద ఉద్రిక్తత
చెన్నై: అన్నాడీఎంకేలో ఆధిపత్య ముసలం ఆగలేదు.. మళ్లీ తారాస్థాయిలో రాజుకుంది. పళనిస్వామి, పన్నీరు సెల్వంలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 14వ తేదీన జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ తరుణంలో.. జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జయలలిత సమాధి వద్ద కిరోసిన్ పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పళనిస్వామి అన్నాడీఎంకే అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు. అన్నాడీఎంకే అధినేతగా జయలలిత పేరే ఉండాలంటూ డిమాండ్ చేశాడు. కార్యకర్తను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీకి ముందు పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్ పళనిస్వామి(EPS), మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్ పన్నీరుసెల్వం వర్గీయులు వాళ్ల వాళ్ల డిమాండ్లతో రచ్చకెక్కుతున్నారు. జూన్ 23న(గురువారం) జరగబోయే మీటింగ్లో పార్టీ అంతా ఒక్కరి నాయకత్వంలోనే నడవాలని పళనిస్వామి తీర్మానం చేయనున్నాడు. అదే సమయంలో.. తన సంతకం లేకుండా జనరల్ బాడీ ఆ తీర్మానం ఆమోదించడానికి వీల్లేదంటూ పన్నీర్ సెల్వం వాదిస్తున్నాడు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్ను కలిసి తన పాయింట్ను వినిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులను ఆశ్రయించాడు ఆయన. అయితే.. ఈ భేటీ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో మాజీ మంత్రి బెంజిమన్ ఓ పిటిషన్ దాఖలు చేయగా.. మంగళవారం ఆ పిటిషన్ను తోసిపుచ్చింది హైకోర్టు. నిర్వహణ ఉండాలా? వద్దా? అనేది పార్టీ జనరల్ కౌన్సిల్కు సంబంధించిన నిర్ణయమని, దానిని ఆపాలని ఆదేశించలేమని బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాదు.. భేటీకి హాజరయ్యే సభ్యులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఈ తరుణంలో అన్నాడీఎంకే వర్గపోరు వేడి.. అక్కడి రాజకీయాలను హీటెక్కిస్తోంది. -
తమిళనాడు సీఎంకు శస్త్రచికిత్స
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ సోమవారం చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్కాగా ఆయనకు హెర్నియా శస్త్రచికిత్స చేశారు. ఈనెల 6న పోలింగ్ ముగిసిన నాటి నుంచి సేలం జిల్లాల్లోని తన స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం సేలం నుంచి చెన్నైకి చేరుకున్న సీఎం ఎడపాడి తన క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వాధికారులతో లతో సమావేశమై కరోనా పరిస్థితులను సమీక్షించారు. ఆక్సిజన్ కొరత.. ఏడుగురి మృతి సాక్షి ప్రతినిధి, చెన్నై: రోగులకు ఆక్సిజన్ అందక ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులో సోమవారం చోటు చేసుకుంది. వేలూరు జిల్లా అడుక్కంపారై ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక వార్డులో పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు. అయితే ఆక్సిజన్ అందక రాజేశ్వరి (68), ప్రేమ్ (40), సెల్వరాజ్ (66) సహా ఏడుగురు మృతి చెందారు. ఆక్సిజన్ కొరత అని కొందరంటుండగా, ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదని, వేర్వేరు కారణాలతో రోగులు మృతిచెందారని వేలూరు కలెక్టర్ షణ్ముగ సుందరం, ఆస్పత్రి డీన్ సెల్వి తెలిపారు. కరోనా సెకెండ్ వేవ్తో తమిళనాడు అతలాకుతలమవుతోంది. రోజుకు 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమ వారం 10,941 కేసులు నిర్ధారణ అయ్యాయి. 44 మంది మృతి చెందారు. చదవండి: నేతల ఆట విడుపు.. కొడైకెనాల్లో తిష్ట -
నేతల ఆట విడుపు.. కొడైకెనాల్లో తిష్ట
సాక్షి, చెన్నై: తెల్ల పంచె, తెల్లచొక్క అంటూ రాజకీయ వ్యవహారాల్లో బిజీబిజీగా గడిపిన నేతలకు కాస్త విరామం లభించింది. కొడైకెనాల్లో పలువురు నేతలు ఆటవిడుపుగా తిష్ట వేశారు. కొందరు అయితే, కుటుంబాలతో కలిసి పర్యాటక కేంద్రాల్లో చక్కర్లు కొడుతున్నారు. వీరు తమ నాయకులేనా అని గుర్తు పట్టలేని రీతిలో వేషాల్ని మార్చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందుగా సిట్టింగ్ సీట్లు మళ్లీ దక్కేనా అన్న ఆందోళన అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు పడ్డ విషయం తెలిసిందే. చివరకు సీట్లు దక్కించుకున్న వాళ్లు, ఎన్నికల ప్రచారంలో రేయింబవళ్లు ఓటర్లను ఆకర్షించేందుకు కుస్తీలు పట్టారు. పార్టీల ముఖ్య నేతలు, మంత్రులు అంటూ నెలన్నర రోజులు తీవ్రంగానే శ్రమించారు. ఈనెల ఆరవ తేదీతో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఫలితాల వెల్లడికి మే 2వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం విరామ సమయం నేతలకు దొరికింది. తమ కుటుంబాలతో గడిపేందుకు మరింతగా సమయం దొరికింది. సీఎం పళనిస్వామి అయితే, స్వగ్రామం ఎడపాడికి వెళ్లి కుటుంబం, బంధువులతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతోంది. డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం సొంతూరు బోడినాయకనూర్కు పరిమితమయ్యారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అయితే, కుటుంబంతో కలిసి కొడైకెనాల్ వెళ్లారు. వేషాల్ని మార్చేసి.. తమిళ నేతలు సాధారణంగా తెల్లపంచె, తెల్ల చొక్కాలతో దర్శనం ఇవ్వడం నిత్యం చూస్తూ వచ్చాం. అయితే, ఇప్పుడు విరామ సమయంలో తమ వేషాల్నే మార్చేశారు. భార్య దుర్గ, కుమారుడు ఉదయ నిధి, కోడలు, మనుమళ్లు, మనుమరాళ్లతో స్టాలిన్ కొడైకెనాల్లో రెండు రోజులుగా బస చేశారు. గోల్ఫ్ ఆడుతూ ఎక్కువ సమయం గడుపుతున్నారు. సాయంత్రం సతీమణితో కలిసి అలా పర్యాటక అందాల్ని తిలకించేందుకు కారులో చక్కర్లు కొట్టే పనిలో పడ్డారు. ట్రాక్, టీషర్టుతో కనిపించిన స్టాలిన్తో సెల్ఫీలకు పలువురు ఎగబడడం విశేషం. ఈ పరిస్థితుల్లో కొడైకెనాల్లో స్టాలినే కాదు, అన్నాడీఎంకే ముఖ్య నేతలు, మంత్రులు పలువురు సైతం కుటుంబాలతో కలిసి తిష్ట వేసి ఉండడం వెలుగు చూసింది. అయితే, వీళ్లేనా తమ నేతలు, తమ మంత్రులు అని గుర్తు పట్టలేని పరిస్థితుల్లో వేషాల్ని మార్చేశారు. థర్మాకోల్ మంత్రిగా ముద్ర పడ్డ సహకార మంత్రి సెల్లూరురాజు ఆదివారం ఉదయం కుటుంబంతో వాకింగ్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఆయన్ను తొలుత ఎవ్వరూ గుర్తు పట్టనప్పటికీ, చివరకు దగ్గరకు వెళ్లి పలకరించగా, ఆయనే సెల్లూరు రాజు అని తేలింది. దీంతో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పలువురు యువకులు ఆసక్తి చూపించారు. తానే కాదు, మరెందరో నేతలు కొడైకెనాల్లో విశ్రాంతిలో ఉన్నట్టుగా సెల్లూరు సంకేతం ఇవ్వడం గమనార్హం. పంచెకట్టు, తెల్ల చొక్కాల్ని పక్కన పెట్టి, టీషర్టులు, జీన్స్లు, ట్రాక్లతో వేషాల్ని మార్చిన మనోల్ని గుర్తు పట్టడం కాస్త కష్టమే అన్నట్టుగా పరిస్థితి నెలకొని ఉండడం గమనార్హం. గతంలో ముఖ్య నేతలు ఎన్నికల అనంతరం విదేశాలకు చెక్కేసేవారు. తాజాగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో దిండుగల్ జిల్లా కొడైకెనాల్కు పరిమితమైనట్టుంది. చదవండి: రాత్రి కర్ఫ్యూ.. ఆదివారం ఫుల్ లాక్డౌన్ -
నా మాటల్ని వక్రీకరించారు: రాజా
సాక్షి, చెన్నై: తన వ్యాఖ్యలను వక్రీకరించి బయటకు విడుదల చేశారని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు డీఎంకే ఎంపీ రాజా వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సమగ్ర, న్యాయబద్ధంగా విచారణ జరగాలని కోరారు. పెరంబలూరు ఎన్నికల ప్రచారంలో డీఎంకే ఎంపీ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. సీఎం పళనిస్వామి, ఆయన తల్లిని కించపరిచే రీతిలో రాజా వ్యాఖ్యలు చేశారంటూ అన్నాడీఎంకే వర్గాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఆయనపై చర్యకు పట్టుబడుతూ అన్నాడీఎంకే నేతృత్వంలో నిరసనలు సైతం సాగాయి. సీఎం పళనిస్వామి సైతం ఆయన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఎన్నికల ప్రచారంలో ఉద్వేగానికి లోనయ్యారు. సీఎం ఉద్వేగానికి గురికావడంతో మనసు నొప్పించి ఉంటే మన్నించండి అంటూ రాజా క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణించిన ఎన్నికల కమిషన్ వివరణ కోరుతూ రాజాకు నోటీసులు జారీ చేసింది. న్యాయవాదితో వివరణ రాజా స్వయంగా వచ్చి ఈసీ సాహుకు వివరణ ఇస్తారన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే తన న్యాయవాది పచ్చయప్పన్ ద్వారా రాజా వివరణ లేఖను కేంద్ర, రాష్ట్ర కమిషన్లకు పంపించారు. అందులో తాను ఎన్నికల ఆదాయం కోసం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించ లేదని వివరించారు. తానేదో వ్యాఖ్యలు చేసినట్టుగా అన్నాడీఎంకే, బీజేపీలు తీవ్రంగా దుమారం రేపుతున్నాయని, వాస్తవానికి తన వ్యాఖ్యల్ని కత్తిరించి, వక్రీకరించి బయటకు వీడియోల రూపంలో విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర, న్యాయబద్ధంగా విచారణ జరిగితే, తాను ఏ తప్పు చేయలేదన్నది, వ్యాఖ్యలు చేయలేదనేది స్పష్టం అవుతోందన్నారు. సీఎం ఉద్వేగానికి గురయ్యారన్న సమాచారంతో ఒక వేళ తానేమైనా తప్పు చేశానా.. అని భావించి మనసు నొప్పించి ఉంటే మన్నించాలని క్షమాపణ కూడా కోరినట్టు గుర్తు చేశారు. అన్నాడీఎంకే వర్గాలు తనపై మోపిన ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదు నకలు అందించాలని, ఆ మేరకు పూర్తి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. -
బీజేపీతో మైత్రి కొనసాగుతుంది: అన్నాడీఎంకే
సాక్షి, చెన్నై : బీజేపీతో తమ మైత్రి కొనసాగుతుందని, త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తామని అన్నాడీఎంకే చీఫ్ కోఆర్డినేటర్, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. శనివారం కేంద్ర మంత్రి అమిత్షా తమిళనాడు పర్యటన సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా పొత్తు కొనసాగుతుంది. మేము పదేళ్ల పాటు మంచి పాలనను అందించాము. 2021 ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాము. తమిళనాడు ప్రజలు ఎల్లప్పుడూ ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటారు’’ అని పేర్కొన్నారు. అమిత్షా కూడూ తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ( డీఎంకేకి షాక్.. అమిత్ షా- అళగిరిల భేటీ?!) చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తమిళనాడులో కరోనాను నియంత్రించడానికి ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంల కృషి అభినందనీయం. తమిళనాడులో కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉంది. తమిళనాడును ఓ గర్భిణిలా ప్రభుత్వం చూసుకుంది. ఇలా ఏ ఇతర ప్రభుత్వం చేయలేదు. కుటుంబ రాజకీయాలు చేసే వారికి ప్రజలు బుద్ధి చెబుతారు. 2జి స్కాంలో దొరికిపోయిన వారు రాజకీయాల గురించి మాట్లాడే హక్కులేదు’’ అని అన్నారు. -
అన్నాడీఎంకేలో కుర్చీ వార్
సాక్షి, చెన్నై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో నిప్పు రాజుకుంది. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం ఎవరికివారు ‘నేనంటే నేనే’ అంటూ వాదులాడుకునే స్థాయికి చేరింది. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు పార్టీ సోమవారం స్పష్టం చేసింది. చదవండి: (కుష్బూను సందిగ్ధంలో పడేసిన గ్రూపు రాజకీయాలు) ఎడపాడి, పన్నీర్ మాటల యుద్ధం చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సోమవారం పార్టీ కార్యవర్గ సమావేశం రసవత్తరంగా సాగింది. ఎడపాడి, పన్నీర్ వర్గాలు రెండుగా విడిపోయి బలప్రదర్శన చేస్తూ తమ నేతలకు స్వాగతం పలికాయి. తమనేతే సీఎం అభ్యర్థి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున హోం మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు సీఎం ఎడపాడికి బందోబస్తు పెంచారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఈ సమావేశంలో ఎడపాడి, పన్నీర్ మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఈ అంశంపై 11 మందితో మార్గదర్శక కమిటీని వేయాలని పన్నీర్ ప్రతిపాదించగా, పార్టీ పరంగానే నిర్ణయం తీసుకోవచ్చు, కమిటీ అవసరం లేదని ఎడపాడి నిరాకరించారు. జయలలిత ఆదేశాల మేరకు సీఎం అయినందున తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని పన్నీర్సెల్వం చెప్పగా, మిమ్మల్నే కాదు జయను సైతం సీఎంను చేసింది శశికళేనని ఎడపాడి బదులిచ్చారు. సుమారు ఐదు గంటపాటు సమావేశం జరిగినా ఓ అవగాహనకు రాలేకపోయారు. వచ్చే నెల 7వ తేదీన జరుగనున్న జనరల్ బాడీ సమావేశంలో ఎడపాడి, పన్నీర్ సంయుక్తంగా ప్రకటన చేస్తారని ఆ పార్టీ అగ్రనేత కేపీ మునుస్వామి మీడియాకు తెలిపారు. 15 తీర్మానాలు ఆమోదం పార్టీ ప్రయోజనాలు, సిద్ధాంతాలకు కట్టుబడి సమష్టిగా పాటుపడదాం, తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం జీఎస్టీ సహా పలు అభివృద్ధి కార్యక్రమాల బకాయిలను చెల్లించాలని, కరోనా కష్టకాలంలో ప్రజల కోసం శ్రమించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఆరోగ్య, పోలీస్ శాఖలతోపాటు అన్నాడీఎంకే శ్రేణులకు ధన్యవాదాలు, ద్విభాషా విధానం, తమిళనాడులో నీట్ పరీక్ష రద్దు తదితర 15 తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. -
దిండుగల్లో పోస్టర్ల హల్చల్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సీఎం వివాదం రోజుకో రూపంలో తెరపైకి వస్తోంది. దిండుగల్లో సీఎం పన్నీరు.. డిప్యూటీ పళని అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇది దిండుగల్ అన్నాడీఎంకే గ్రూపువార్ను తెరపైకి తెచ్చింది. 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి అంటూ మంత్రులు సెల్లూరు రాజు, కేటీ రాజేంద్ర బాలాజీల భిన్న వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇది కాస్త సీఎం, డిప్యూటీ సీఎం శిబిరాల మధ్య చిచ్చుకు దారి తీసింది. బుధవారం దిండుగల్ జిల్లాలో సీఎంపన్నీరు..డిప్యూటీ పళని అంటూ పోస్టర్లు వెలిశాయి. దిండుగల్ జిల్లా అన్నాడీఎంకేలో మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్, మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ కీలకం. ఇది వరకు పన్నీరు విశ్వాసపాత్రుడి ఉన్న విశ్వనాథన్, ప్రస్తుతం సీఎం పళనికి నమ్మకస్తుడయ్యారు. ఇది దిండుగల్ శ్రీనివాసన్ మద్దతుదారుల్ని కలవరంలో పడేసింది. నత్తం రూపంలో శ్రీనివాసన్కు చిక్కులు తప్పవన్న ఆందోళన బయలుదేరింది. ఈ పరిస్థితుల్లో రెండు శిబిరాల వివాదం కాస్త సీఎం ఎవరో చర్చను మరోమారు తెరపైకి తెచ్చింది. 2021 ఎన్నికల్లో గెలుపుతో సీఎంగా పన్నీరు, డిప్యూటీ సీఎంగా పళని వ్యవహరించడం ఖాయం అంటూ వెలిసిన ఈ పోస్టర్లు దిండుగల్ రాజకీయ గ్రూప్ వార్ను తెర పైకి తెచ్చింది. -
'ఆయన పుణ్యానా ఎమ్మెల్యేను కోల్పోయాం'
సాక్షి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్పై సీఎం పళనిస్వామి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన పుణ్యమా అని ఓ ఎమ్మెల్యేను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. వద్దంటున్నా, ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ఇప్పుడు ఒకరి ద్వారా మరొకరికి వైరస్ వ్యాప్తి పెరిగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కోయంబత్తూరు అధికారుల పనితీరు అభినందనీయమని కొనియాడారు. మెజిస్ట్రేట్ విచారణ నివేదిక మేరకు సాత్తాన్ కులంలో తండ్రి, కుమారుడి మరణంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం పళనిస్వామి గురువారం కోయంబత్తూరులో పర్యటించారు. రూ.238 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధిపనుల్ని ప్రారంభించారు. స్మార్ట్ సిటీ పనులు, వంతెనల నిర్మాణాలు, భారీ ఫ్లైఓవర్ల పనులు, అత్తికడవు అవినాశి ఉమ్మడి నీటి పథకం పనుల పరిశీలన అంటూ పలు పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే, రూ. 779 కోట్లతో చేపట్టనున్న పిల్లూరు తాగునీటి పథకం, సొరంగం తవ్వకాల పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజామణి, మంత్రి ఎస్పీ వేలుమణి, డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి జయరామన్లతో కలిసి కరోనా నివారణ చర్యల మీద సమీక్షించారు. అలాగే, చిన్న ,మధ్యతరహా, భారీ పరిశ్రమల యాజమాన్యాలు, ప్రతినిధులతో భేటీ అయ్యారు. స్వయం సహాయక బృందాలు, మహిళా సంఘాలతో సమావేశం అయ్యారు. సాయంత్రం మూడు గంటలకు మీడియా ముందుకు సీఎం వచ్చారు. కోయంబత్తూరు భేష్.. కోయంబత్తూరులో చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ముందుగా సీఎం పళనిస్వామి వివరించారు. కరోనా నివారణ చర్యలను గుర్తు చేస్తూ, వైరస్ కట్టడిలో అధికారుల పనితీరు అభినందనీయమని కొనియాడారు. ఇక్కడ వైరస్ అన్నది కట్టడిలో ఉందని, ప్రస్తుతం 112 మంది మాత్రమే చికిత్సలో ఉన్నట్టు వివరించారు. ఇక్కడున్న పరిశ్రమల్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం ద్వారా రూ. 761 కోట్ల మేరకు రుణాల్ని ఇప్పించామని తెలిపారు. గత 90 రోజులుగా రాష్ట్రంలోని ప్రతి అధికారి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు, వైద్యుల నుంచి నర్సులు, వార్డుబాయ్ల వరకు రేయింబవళ్లు కరోనా నివారణ, కట్టడి, బా«ధితుల సేవలో ఉన్నారని వివరించారు. వీరందరికి తాను ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. అయితే, రోగాన్ని అడ్డం పెట్టుకుని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చేస్తున్న రాజకీయం జూస్తుంటే, తీవ్ర ఆవేదన , ఆగ్రహం కల్గుతోందన్నారు. ఓ ఎమ్మెల్యేను కోల్పోయాం.. కరోనా కట్టడి లక్ష్యంగా అందరూ రేయింబవళ్లు శ్రమిస్తుంటే, ప్రభుత్వం చేతులెత్తేసిందని, సీఎంకు మానవత్వం లేదని, అధికారులు అసమర్థులు అన్నట్టుగా స్టాలిన్ వ్యాఖ్యలు చేస్తుండడం విచారకరంగా పేర్కొన్నారు. వాస్తవానికి స్టాలిన్ ఇచ్చిన ఆలోచనల్ని తాను అనుసరించి ఉంటే, ఈ పాటికి రాష్ట్రంలో కరోనా విలయతాండవం, మరణమృదంగం మార్మోగి ఉండేదేమో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే నేతృత్వంలో కరోనా నివారణ చర్యలు, కట్టడి, బాధితులకు సాయం అన్న ప్రకటన చేయగానే, తొలుత ఆక్షేపణను తానే తెలియజేసినట్టు తెలిపారు. ఇందుకు కారణం, వైద్య నిపుణులు, పరిశోధకులు ఇచ్చిన నివేదికేనని వివరించారు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా సేవల్లో నిమగ్నమైన పక్షంలో కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని ఆ నివేదికలో హెచ్చరించారన్నారు. అందుకే తాను అడ్డుకోవడం జరిగిందని, అయితే, కోర్టు ద్వారా వారు సేవల్ని కొనసాగించారన్నారు. ఇందుకు మూల్యంగా ఓ ఎమ్మెల్యేను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల్ని విస్మరించి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో భౌతిక దూరాలు, సామాజిక బాధ్యతల్ని మరిచి ప్రజలు సహాయకాల కోసం తరలివచ్చారని, ఇప్పుడు అదే జనం వైరస్ బారిన పడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ ఒకరి ద్వారా మరొకరికి సంక్రమించినట్టు తాజా నివేదిక స్పష్టం చేసిందని, అయితే, సమాజంలోకి ఇది వ్యాపించ లేదన్నారు. ఇష్టానుసారంగా సేవలు అంటూ దూకుడుగా ముందుకు సాగి వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణం కావడమే కాకుండా, ఓ ఎమ్మెల్యేను కోల్పోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరో అన్నది ప్రజలు గుర్తెరగాలని పిలుపునిచ్చారు. తానో జాతీయ నేతను అని స్టాలిన్ గొప్పలు చెప్పుకుంటున్నారని, అలాంటప్పుడు ముంబై, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో పెరుగుతున్న కేసుల విషయంగా ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. కరోనా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న విషయాన్ని పసిగట్టి, ఏదో ఒక రూపంలో బురద చల్లడం లక్ష్యంగా వ్యక్తిగత ప్రచారం కోసం రోజుకో ప్రకటనలు ఇచ్చుకోవడం ఆయనకు అలవాటుగా మారి ందని మండిపడ్డారు. కాగా, సాత్తాన్ కులం తండ్రి, కుమారుల మరణం గురించి ప్రశ్నించగా, మెజి్రస్టేట్ విచారణ కోర్టు పర్యవేక్షణలో సాగుతున్నదని, మదురై ధర్మాసనం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా తప్పు చేసి ఉంటే, వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. -
చెన్నైలో భయం.. భయం
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మంగళవారం నాటికి కరోనా పాజిటివ్ కేసులసంఖ్య రెండువేలు దాటింది. రాష్ర్టంలో మొత్తం 37 జిల్లాల్లో కృష్ణగిరి మినహా అన్ని జిల్లాల్లో నెలరోజులుగా పాజిటివ్ కేసులు రోజూ నమోదవుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలోనే అత్యధిక కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తుంది. రాష్ర్టవ్యాప్తంగా మంగళవారం నిర్ధారణ అయిన 121 కరోనా పాజిటివ్ కేసల్లో 103 కేసులు ఒక్క చెన్నైలోనే నమోదుకావడం గమనార్హం. అయితే చాలా కేసుల్లో వైరస్ ఎలా సోకిందనే లింక్ దొరక్క పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇలీవలె చెన్నైలో 43 కేసులు బయటపడగా వీరిలో 13 మందికి వైరస్ ఎలా సోకిందనే లింక్ దొరకలేదు. ఇప్పటివరకు రాష్ర్టంలో 2,058 కరోనా కేసులు నమోదుకాగా 25 మంది చనిపోయారు. (కరోనా భయం: తమిళనాడులో అమానుషం) ‘స్వచ్ఛంద’వ్యాప్తి.. ప్రజల్లో భీతి లాక్డౌన్తో తినడానికి సరిగ్గా తిండి దొర్కక అవస్తులు పడుతున్న వారి ఆకలి తీర్చేందుకు ఓ స్వచ్ఛంద సేవకుడు ప్రతీరోజు కొంతమంది నిరాశ్రయులకు ఆహారం అందించాడు. అయితే గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఉండటంతో పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది. సదరు యువకుడు కొన్ని రోజులుగా నిరాశ్రయులు, కార్మికులు, కొంతమంది పోలీసులకి సహా దాదాపు 80 మందిదాకా ఆహార పొట్లాలు అందించి తనకు చేతనైన సహాయం చేశాడు. దీంతో వీరందరిని గుర్తించి, వారు ఎవరెవరిని కలిశారో అన్నదానిపై విచారిస్తున్నారు. సరి(హద్దు)లేని జాగ్రత్తలు.. వైరస్ను అడ్డుకట్టవేసేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయం వారికి కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు బయటివారిని రానివ్వకుండా గోడను కట్టారు. దీంతో పాలు, కూరగాయలు వంటి అత్యవసర సరుకుల పంపిణీకి తీవ్ర ఆటంకం కలిగింది. సరిహద్దు జిల్లాల కలెక్టర్ల మధ్య సమన్వయ లోపంతో వాహనాలు వేరే ప్రాంతాల మీదుగా అక్కడికి చేరుకోవాల్సి వచ్చింది. గుడియాత్తం–పలమనేరు రోడ్డు మధ్యలో ఈనెల 26వ తేదీ సాయంత్రం గోడను కట్టడంతో ఏపీ నుంచి తమిళనాడుకు అత్యవసర వస్తువులతో బయలుదేరిన లారీలన్నీ పలమనేరులో నిలిచిపోయాయి. మరికొన్ని వాహనాలు పలమనేరు నుంచి చిత్తూరుకు వెళ్లి అక్కడి నుంచి కాట్పాడి మీదుగా సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించి తమిళనాడులోకి ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యవసర చికిత్స కోసం వేలూరు ఆసుపత్రికి వెళ్లలేక పలువురు రోగులు అల్లాడిపోయారు. సమాచారం అందుకున్న వేలూరు జిల్లా కలెక్టర్ షణ్ముగం ఆదేశంతో గోడను తొలగించారు. (సెల్ ఫోన్ పేలి చూపు కోల్పోయిన యువతి) -
చెన్నైకు తాగునీరివ్వండి
సాక్షి, అమరావతి : చెన్నై నగరవాసుల తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగ నుంచి నీటిని విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి ఆదేశాల మేరకు తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి, మత్స్య శాఖ, పాలనా సంస్కరణల మంత్రి జయకుమార్, ముఖ్య కార్యదర్శి మనివాసన్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని, అందుకు నీటిని విడుదల చేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. తాగునీరు లేక 90 లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని మంత్రులు చెప్పగా.. వైఎస్ జగన్ వెంటనే స్పందించి చెన్నైకి తాగునీటిని విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరభావంతో మెలగాలని తమిళనాడు మంత్రుల బృందంతో అన్నారు. కష్టాల్లో పాలు పంచుకోవాలని, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరముందని సీఎం జగన్ వివరించారు. -
చెమ్మ దొరకని చెన్నపట్నం
ఎండిపోయిన బోర్లు. నిండుకున్న రిజర్వాయర్లు. నీటికోసం తల్లడిల్లే పల్లెలు అనగానే మనకు వెంటనే గుర్తువచ్చేది మహారాష్ట్రలోని వెనుకబడిన మరఠ్వాడా, విదర్భ. నీటికోసం అల్లాడిపోతున్న మరాఠాలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా రైలు భోగీలను ఏర్పాటు చేసి.. నీటిని తరలించిన పరిస్థితిని గతంలో లాతూర్లో చూశాం. కానీ ఇప్పుడు మహారాష్ట్ర సరసన తమిళనాడు చేరింది. తమిళనాట నీటి కటకట. నీరు కోసం తమిళ తంబీల తండ్లాట. నీటి చెమ్మ దొరకని చెన్నపట్నం. గుక్కెడు జలం కోసం జనం విలవిళ్లాడుతున్న పరిస్థితి. మొన్న మహారాష్ట్ర, నేడు తమిళనాడులో నీటి కోసం చిన్నపాటి యుద్ధలే జరుగుతున్నాయి. సాక్షి, చెన్నై: గుక్కెడు మంచినీళ్ల కోసం తమిళనాడులోని చెన్నై నగరం విలపిస్తోంది. మునుపెన్నడూ లేనంతగా తీవ్ర నీటి సంక్షోభంతో చెన్నై విలవిలలాడుతోంది. రిజర్వాయర్లలో నీళ్లు పూర్తిగా అడుగంటిపోయాయి. బోర్లు ఎండిపోయాయి. వాటర్ ట్యాంకర్ బుక్ చేసినా.. వస్తుందో రాదో తెలియని పరిస్థితి. బిందెడు నీళ్లు కావాలంటే.. లక్కీ డ్రాలో గెలవాల్సిందే. మంచినీళ్ల కోసం టోకెన్లు తీసుకోవాల్సిన పరిస్థితి. ఆఖరికి కాలకృత్యాలు తీర్చుకుందామన్నా ఎక్కడా నీళ్లు దొరకడం లేదు. వంటలకు నీళ్లు లేక హోటళ్లు మూతపడుతున్నాయి. నీటికోసం ఏకంగా యుద్ధాలే జరుగుతున్నాయి. ఒక ట్యాంకరు వస్తే చాలు నీళ్ల కోసం పెద్ద క్యూలలో ప్రజలు నిలబడుతున్నారు. గంటలకొద్దీ నీటికోసం క్యూలో నిలబడి సహనం కోల్పోయి గొడవలు పడుతున్నారు. తంజావూరులో నీటిని అక్రమంగా నిల్వ చేసుకుంటున్నారని ప్రశ్నించిన సామాజిక కార్యకర్త ఆనంద్ బాబును కొట్టి చంపారు. చెన్నైలో నీళ్ల పంపకాల విషయంలో జరిగిన గొడవలో మహిళపై పదునైన పరికరంతో దాడి చేశారన్న ఆరోపణలతో.. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ కారు డ్రైవర్ ఆదిమూలంను పోలీసులు అరెస్ట్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ చేయూత... ఎక్కడ నీళ్లు ఎక్కువ వాడాల్సి వస్తుందోనని.. తమకిష్టమైన సాంబారు కూడా చేసుకోవడం లేదు తమిళ తంబీలు. ఇదీ ప్రస్తుతం తమిళనాడును వెంటాడుతున్న దుర్భర నీటి కష్టం. చెన్నైలో ఓవైపు నీటి ట్యాంకర్ల వద్ద నీటియుద్ధాలు జరుగుతుంటే.. మరోవైపు అధికార, విపక్ష పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. నీటిఎద్దడిపై డీఎంకే ఆందోళన చేస్తుంటే.. ఏమంత ఎద్దడి లేదంటూ కొట్టిపారేస్తోంది అధికార అన్నాడీఎంకే. జలాశాయాలు అడుగంటిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. పక్క రాష్ట్రాల నుంచి చైన్నై రావాల్సిన నీరు రావడం లేదని చెబుతోంది పళని సర్కార్. ప్రభుత్వ వైఫల్యంపై సాక్షాత్తు మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చే వరకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని తీవ్రంగా మందలించింది. అప్పటికి గాని సీఎం పళనిస్వామి పరిస్థితిపై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయలేదు. ప్రజల కష్టాలను చూసి చలించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన సొంత ఖర్చుతో నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి.. ప్రజల దాహర్తిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే తమిళనాడులో పరిస్థితి ఏవిధంగా ఉండో అర్థమవుతోంది. వాటర్ ట్యాంకర్ బుకింగ్.. సాధారణంగా చెన్నై నగరం నీటి పేరుచెబితే భయంతో వణుకుతుంది. ఎందుకంటే.. దేశంలో వరదల తాకిడికి ఎక్కువగా గురయ్యే నగరం అదే. కానీ, ఇప్పుడదే చెన్నై నీటి చుక్క కోసం తపిస్తోంది. తీవ్ర నీటి ఎద్దడితో తమిళ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కళ్లెదుట మహా సముద్రం కనిపిస్తున్నా.. కనీసం గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు విలవిలలాడుతున్నారు. స్నానాలు చేసి రెండు, మూడులు రోజులవుతున్నా భరిస్తున్న చెన్నై వాసులు.. మంచినీటి కోసం మాత్రం దాహం.. దాహం అంటూ తపిస్తున్నారు. పుజల్, పాండీతో సహా.. చెన్నై నగరానికి దాహార్తిని తీర్చే రిజర్వాయర్లన్నీ అడుగంటిపోయాయి. బోరుబావులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో జనం ఆగచాట్లు పడుతున్నారు. నీటి ట్యాంకర్లు బుక్ చేసినా వస్తుందో లేదో తెలియని పరిస్థితి. నీళ్లు లేక హాస్టళ్లు, హోటళ్లు మూతపడుతున్నాయి. కొన్ని హాస్టళ్లలో కేవలం ఒక గంట పాటు మాత్రమే నీటిని సప్లై చేస్తున్నారు. ఆ గంటలోనే స్నానాలు, బట్టలు ఉతుక్కోవడం అన్నీ పూర్తికావాలి. లేదంటే అంతే. మరోవైపు నీళ్లు ఎక్కువగా వాడాల్సి రావడంతో.. తమకిష్టమైన సాంబారును కూడా వదులుకుంటున్నారు చెన్నై ప్రజలు. కొన్ని హోటళ్లలో సాంబారు వండటం లేదు. నీళ్లు లేక కొన్ని హోటళ్లను పూర్తిగా మూసేశారు. చెన్నై నగరవాసుల నీటి అవసరాలు తీర్చేందుకు ప్రతి రోజు 80 కోట్ల లీటర్ల నీరు అవసరం. అయితే ప్రభుత్వం ప్రతి రోజు 50 కోట్ల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో నీటి కోసం చెన్నైవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఐటీపై ఆంక్షలు.. ప్రైవేటు ట్యాంకర్ల వద్ద మహిళలు రోజంతా బారులు తీరుతున్నారు. ఉదయం 4 గంటలకు బయటకు వస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా తమ వంతు రావడం లేదని, కుటుంబానికి పది బిందెలకు మించి నీరు సరఫరా కావడం లేదని గృహిణులు ఆవేదిన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే, నీటి ఎద్దడిని ఎదుర్కోవడం కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి రైలు ట్యాంకర్ల ద్వారా చెన్నైకి నీటిని తరలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్క చెన్నైలోనే కాదు.. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. బిందెడు నీళ్ల కోసం బావుల వద్ద మహిళలు కిలోమీటర్ల కొద్దీ క్యూ కడుతున్నారు. జనం నీటి అవసరాలను అవకాశంగా తీసుకుంటున్న కొందరు ట్యాంకర్ యజమానులు, బిందె నీటిని 50 రూపాయలకు అమ్ముతున్నారట. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొచ్చే కుటుంబాలు.. సాధారణ అవసరాలకు కూడా ప్రతీరోజూ నీళ్లను కొనుగోలు చేయాలంటే తమవల్ల కాదంటున్నారు. నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని చెన్నైలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఆంక్షలు విధించాయి. కొన్ని సంస్థలు ఇంటి వద్దే పనిచేయమంటే, మరికొన్ని సంస్థలు భోజనం ఇంటి నుండే తెచ్చుకోమని సూచిస్తున్నాయి. రైళ్ల ద్వారా మంచినీటిని సరఫరా వేసవి వచ్చిందంటే నీటి కొరత గురించి గుర్తుకొస్తుంది. అంతకుముందు నీటి అవసరం పెద్దగా లేకపోవడం వల్ల నీళ్ల గురించి ఎవరికీ పట్టింపు వుండదు. వేసవిలో భూగర్భల జాలాలు అడుగంటినప్పుడు మళ్లీ నీటి గురించి వెతుక్కునే పరిస్థితులు, నీటి కటకటలు మొదలవుతాయి. ఇక ఎక్కడ చూసినా దాహార్తులే. గుక్కెడు మంచినీటికోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు. అందుబాటులో వున్న జలాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్ల తలెత్తే పరిణామాలివి. ప్రస్తుతం తమిళనాడు లాగే.. గతంలో మహారాష్ట్ర కూడా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంది. 2016లో తీవ్ర కరువు తాండవించినప్పుడు మరఠ్వాడాలోని లాతూరు వంటి ప్రాంతాల్లో తాగడానికి కూడా మంచినీరు లభించలేదు. దీంతో రైళ్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాల్సివచ్చింది. మహారాష్ట్రలోని మొత్తం 358 తాలూకాల్లో సగానికిపైగా కరువు కోరల్లో మగ్గుతున్నాయి. ఈ తాలూకాల్లోని దాదాపు 30 వేల గ్రామాలు నీటి ఎద్దడితో అలమటిస్తున్నాయి. వందకు పైగా పల్లెలు నరకం చూస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర మాత్రమే కాదు.. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సైతం నీటి ఎద్దడి ఎక్కువగా వుంటోంది. ముఖ్యంగా మహానగరాల్లో ప్రతీ ఏటా నీటి ఎద్దడి పెరుగుతూనేవుంది. నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోవడంతో.. వర్షపు నీరు నేల ఒడికి చేరడం లేదు. -
తమిళనాట చేతులు కలిపిన బీజేపీ, ఏఐఏడీఎంకే
-
తమిళనాట చేతులు కలిపిన బీజేపీ, ఏఐఏడీఎంకే
చెన్నై : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని పాలక ఏఐఏడీఎంకే, బీజేపీ మంగళవారం అధికారికంగా ప్రకటించాయి. తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్లు సంయుక్తంగా ఈ విషయం వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఐదు స్ధానాల్లో పోటీ చేస్తుందని తాము తమిళనాడు, పుదుచ్చేరిలో ఉమ్మడిగా బరిలో దిగుతామని పన్నీర్సెల్వం పేర్కొన్నారు. పొత్తుపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయల్ మాట్లాడుతూ తమిళనాడులోని 21 అసెంబ్లీ స్ధానాల ఉప ఎన్నికల్లో తాము ఏఐఏడీఎంకేకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పన్నీర్సెల్వం, పళనిస్వామి నాయకత్వంలో, కేంద్ర స్ధాయిలో నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు తాము అంగీకరించామన్నారు. అంతకుముందు పీఎంకేతో పొత్తుపై ఏఐఏడీఎంకే ప్రకటించింది. ఆ పార్టీ ఏడు లోక్సభ స్ధానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించింది. పీఎంకేకు ఓ రాజ్యసభ సీటు ఇచ్చేలా అంగీకారం కుదిరింది. అవగాహనలో భాగంగా తమిళనాడులో రానున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో ఏఐఏడీఎంకేకు పీఎంకే మద్దతు ప్రకటిస్తుంది. -
వంద కోట్ల జరిమానా
సాక్షి, చెన్నై: రాజధాని నగరంలోని బకింగ్హాం కాలువ, కూవం, అడయార్ నదులు కలుషితం కావడాన్ని జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ తీవ్రంగా పరిగణించింది. ఈ నదుల్లో పూడికతీత కరువు, దుర్గంధం వంటి అంశాలతో పాటు నిధులు కేటాయించినా పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వానికి రూ. వంద కోట్లు జరిమానా విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులపై అప్పీలుకు అధికార వర్గాలు సిద్ధం అవుతున్నాయి. చెన్నైలో బకింగ్ హాం కాలువ, కూవం, అడయార్ నదులు ఉన్నాయి. ఒకప్పుడు ఈ నదుల్లో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహించేవి. పడవ సవారీ కూడా సాగేదని చెప్పవచ్చు. కాలక్రమేనా నగరాభివృద్ధితోపాటు స్వచ్ఛత కరువై మురికి నీటి మార్గంగా ఈ నదులు మారాయి. కూవం, అడయార్ నదీ పరివాహక ప్రదేశాలన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. ఆ నదుల తీరంలోని పరిశ్రమలు, నివాస గృహాల నుంచి వెలువడే వ్యర్థాలతో, చెత్తా చెదారాలతో మురికి కూపంగా, అటువైపు వెళ్తే చాలు ముక్కు మూసుకోవాల్సినంత పరిస్థితి తప్పడం లేదు. కూవం ప్రక్షాళన, అడయార్కు మహర్దశ అంటూ పాలకులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. నిధుల్ని సైతం కేటాయిస్తున్నా, అందుకు తగ్గపనులు అడుగైనా ముందుకు సాగడం లేదు. అందుకే 2015లో చెన్నై భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పలేదు. కుండపోత వర్షం, పోటెత్తిన వరదలతో కూవం, అడయార్లు ఉప్పొంగి జనావాసాల మీదుగా దూసుకొచ్చాయి. అష్టకష్టాల్ని చెన్నై వాసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా, పాలకులు గుణపాఠం నేర్వలేదు. వర్షాలు వస్తున్నాయంటే, హడావుడి సృష్టిం చడం, ఆతదుపరి యథారాజా తథా ప్రజా అన్నట్టుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. ట్రిబ్యునల్లో పిటిషన్.. కూవం, అడయార్, బకింగ్హాంల కలుషితంపై పర్యావరణ ట్రిబ్యునల్లో అనేక పిటిషన్లు విచారణలో ఉన్నాయి. వీటికి తోడు గత ఏడాది తిరువాన్మియూరుకు చెందిన జవహర్లాల్ షణ్ముగం దాఖలు చేసిన పిటిషన్ను ట్రిబ్యులన్ తీవ్రంగా పరిగణించింది. బకింగ్ హాం కాల్వలో అత్యధికంగా నిర్మాణ శకలాలు ఉన్నాయని, మట్టి, చెత్తాచెదారాలు పేరుకు పోయాయని, వర్షా కాలంలో నివాసాల వైపు వరదలు దూసుకొచ్చేంతగా పరిస్థితి ఉందని ఆ పిటిషన్లో జవహర్లాల్ వివరించారు. దీంతో ఇది వరకు దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ విచారించడం మొదలెట్టింది. ప్రభుత్వాన్ని వివరణ కూడా కోరింది. గతంలో బకింగ్ హాం కాలువ, కూవం, అడయార్ల ప్రక్షాళన పేరిట 1,646 కోట్లతో ప్రత్యేక పథకం, తొలి విడతగా రూ.604 కోట్ల కేటాయింపు వంటి అంశాల ప్రస్తావన ట్రిబ్యునల్ ముందుకు చేరింది. 2016లో చేపట్టిన చర్యలు, అలాగే, 13 పరిశ్రమలు, ఆ తీరం వెంబడి ఉన్న విద్యా సంస్థల నుంచి వెలుపలకు వస్తున్న మురికి అంతా కలిపి ఆ నదుల్ని పూర్తి స్థాయిలో కలుషితంకు కారణంగా తేల్చే రీతిలో నివేదికలు చేరాయి. వీటన్నింటిని పర్యావరణ ట్రిబ్యునల్ సమగ్రంగానే పరిశీలించినట్టుంది. శనివారం ఢిల్లీలో సాగిన విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో కూడిన నివేదికను ట్రిబ్యునల్ పరిశీలించింది. అధికారుల నిర్లక్ష్యం అన్నది కొట్టచ్చినట్టు కనిపిస్తున్నదని, పాలకులు చర్యలు అసంతృప్తికరంగా ఉందని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. పర్యావరణ పరిరక్షణలో పూర్తిగా విఫలం అయ్యారని, కలుషితం కాబడ్డ నదుల్లో పూడిక తీత, వ్యర్థాల తొలగింపు అన్నది సక్రమంగా సాగలేదని, ప్రక్షాళన అన్నది ప్రకటకే పరిమితం కావడంతో తమిళనాడు ప్రభుత్వానికి రూ.వంద కోట్లు జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించి మధ్యంతర ఉత్తర్వుల్ని ట్రిబ్యునల్ జారీ చేయడం గమనార్హం. కేంద్ర పర్యావరణ శాఖకు ఈ వంద కోట్ల జరిమానా చెల్లించాలని, ఈ మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి ఉపయోగించాలని ట్రిబ్యునల్ పేర్కొనడంతో పళని సర్కారుకు షాక్ తగిలినట్టు అయింది. దీంతో సోమవారం పర్యావరణశాఖ, ప్రజా పను లశాఖ వర్గాలతో సీఎం పళనిస్వామి సమాలోచనకు నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో తీసుకునే నిర్ణయం మేరకు అప్పీలు ప్రయత్నాలు చేపట్టబోతున్నారు. -
ఘనంగా రజనీ కుమార్తె వివాహం
-
గిన్నీస్ బుక్ వేటలో జల్లికట్టు
చెన్నై: గిన్నీస్ బుక్ రికార్డు కోసం తమిళనాడులో అతిపెద్ద జల్లికట్టును అధికారులు ఏర్పాటు చేశారు. పుదుకొట్టై జిల్లా విరాళీమలైలో సీఎం పళణిస్వామి ఆదివారం జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. దీనిలో 2500 ఎద్దులు, 3వేల మంది యువకులు పాల్గొన్నారు. జల్లికట్టు ఎద్దు మృతి.. నామక్కల్ జరిగిన జల్లికట్టుకు కొల్లిమలైకు చెందిన మణికంఠన్ తన ఎద్దు తీసుకెళ్లాడు. ఈ ఎద్దు వాడివాసల్ నుంచి వెలుపలికి రాగా, దాని వేగానికి భయపడిన వీరులు పట్టుకోలేకపోయారు. దీంతో ఎద్దు పరుగులు తీస్తూ మైదానానికి వెలుపల ఉన్న 50 బావిలో పడిపోయింది. వెంటనే అక్కడ ఉన్న అగ్నిమాపకసిబ్బంది హుటాహుటిన ఆ ఎద్దును బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందింది. -
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు : ఎమ్మెల్యే అరెస్టు..!
-
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు : ఎమ్మెల్యే అరెస్టు..!
సాక్షి, చెన్నై : ప్రముఖ హాస్య నటుడు, అన్నా డీఎంకే ఎమ్మెల్యే, శశికళ వర్గం నేత కరుణాస్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, పలు వార్త సంస్థలు, రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై సెప్టెంబర్ 16న జరిగిన ఒక ధర్నాలో కరుణాస్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో క్షమాపణలు సైతం చెప్పారు. అనంతరం కొన్ని రోజులుగా కరుణాస్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో.. పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేయక తప్పలేదు. మత ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న కురుణాస్ను అరెస్ట చేశామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఎమ్మెల్యే అరెస్టుకు సంబంధించి స్పీకర్తో చర్చిస్తామని వెల్లడించారు. కాగా, అరెస్టుపై న్యాయపరంగా వెళ్తానని కరుణాస్ తెలిపారు. ఇదిలాఉండగా కరుణాస్ 2016లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే టికెట్పై తిరవదనై నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
కరుణ అంత్యక్రియలు ఎక్కడ?
సాక్షి, చెన్నై: కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ జరపాలనే అంశంపై తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. మెరీనా బీచ్లో అన్నాదురై స్మారకం పక్కనే కరుణ అంత్యక్రియలు జరపాలని డీఎంకే పట్టుబడుతోంది. ఇందుకోసం ఏకంగా స్టాలినే ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయితే.. మెరీనాలో అంత్యక్రియలకు అనుమతివ్వబోమని పళనిస్వామి ప్రభుత్వం స్పష్టం చేసింది. మెరీనా బీచ్లో స్మారకానికి న్యాయపరమైన చిక్కులున్నాయని అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ కుదరదని తేల్చి చెప్పింది. దీంతో డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తాత్కాలిక న్యాయమూర్తి కులువాడి రమేష్ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ వివాదంపై విచారణ ప్రారంభించింది. అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగినా ఎటూ తేలలేదు. దీంతో విచారణ బుధవారం ఉదయం 8 గంటలకు వాయిదా పడింది. మెరీనాలోనే కరుణానిధి అంత్యక్రియలు జరపాలంటూ సినీనటుడు రజనీకాంత్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు డిమాండ్ చేశారు. ప్రజాజీవితాన్ని మరిచారా?: స్టాలిన్ కరుణానిధి ప్రజా జీవితం, ఆయన రాజకీయాలకు చేసిన సేవలను గుర్తుంచుకుని మెరీనా బీచ్లో అంత్యక్రియలకు అనుమతివ్వాలని స్టాలిన్ లేఖ రాశారు. సీఎం పళనిస్వామికి రాసిన ఈ లేఖలో.. కరుణానిధి రాజకీయ గురువైన అన్నాదురై స్మారకం పక్కన మౌజోలియం కాంప్లెక్స్ లోపల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించాలన్నారు. కరుణ మృతికి కొద్ది గంటల ముందు సీఎంను స్టాలిన్ కలిశారు. అటు, ప్రభుత్వం పేర్కొంటున్నట్లుగా మెరీనా బీచ్లో కరుణ స్మారకానికి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందుల్లేవని న్యాయమూర్తికి డీఎంకే తరఫు లాయర్ వెల్లడించారు. సీఆర్జెడ్ (కోస్ట్ రెగ్యులేషన్ జోన్) పరిధిలోకి వస్తుందని తమిళనాడు ప్రభుత్వం చెప్పడంలో వాస్తవం లేదని న్యాయమూర్తికి ఆయన తెలిపారు. అన్నా సమాధి ఉన్న స్థలం కోస్టల్ జోన్ పరిధిలో లేదని, అది కూవం నదీ తీరంలో ఉన్నట్టు వివరించారు. అన్నా సమాధి వద్ద కరుణానిధి సమాధి ఏర్పాటుకు అవకాశం ఉందని, అయితే, తాము వేసి ఉన్న కేసుల్ని సాకుగా చూపించి, స్థలం కేటాయించకుండా ప్రభుత్వం నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని జయ స్మారకం నిర్మాణంపై కేసు వేసిన న్యాయవాదులు బాలు, దురైస్వామిలు పేర్కొన్నారు. తాము వేసిన పిటిషన్ల ఆధారంగానే న్యాయపరమైన చిక్కులున్నట్లుగా భావిస్తే.. ఆ కేసులన్నీ వెనక్కు తీసుకుంటామని ప్రకటించారు. కరుణానిధి అంత్యక్రియలకు మెరీనా తీరంలోని అన్నా సమాధి పక్కనే కేటాయించాలని కోరారు. అయితే, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలుచేసిన పిటిషన్తో చిక్కులున్న కారణంగా న్యాయమూర్తి ముందు వాదనలు జోరుగా సాగాయి. (మెరీనా బీచ్లో అంత్యక్రియలకు తమిళసర్కారు నో చెప్పడంతో బీభత్సం సృష్టిస్తున్న కార్యకర్తలు) చిక్కులు తొలగిపోలేదు: ప్రభుత్వం మెరీనా బీచ్లో స్థలం కేటాయించడం కుదరదని.. మాజీ ముఖ్యమంత్రులైన చక్రవర్తి రాజగోపాలచారి, కే కామరాజ్ల స్మారకాలున్న గిండీ ప్రాంతంలోని గాంధీ మండపంలో రెండెకరాల స్థలం కేటాయిస్తామని ప్రభుతవం వెల్లడించింది. కరుణానిధి సిట్టింగ్ సీఎం కానందునే మెరీనాబీచ్లో అంత్యక్రియలకు అనుమతిచ్చేందుకు పళనిస్వామి నిరాకరించారని తెలిసింది. అన్నాదురై, ఎంజీఆర్, జయలలితలు సీఎంలుగా ఉంటూ కన్నుమూసినందుకే వారికి సముద్రం ఒడ్డున స్మారకం నిర్మించారు. ఎంజీఆర్, జయలలితలు కరుణానిధికి రాజకీయంగా బద్ధ శత్రువులు. ప్రభుత్వ నిర్ణయం తెలియడంతో డీఎంకే కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి వద్ద ఉన్న కార్యకర్తలు ఆగ్రహంతో బారికేడ్లు తెంచుకుని రోడ్లపైకి పరిగెత్తారు. పరిస్థితి చేయిదాటుతుందని ఊహించిన పోలీసులు డీఎంకే కార్యకర్తలను చెదరగొట్టారు. మెరీనాలోనే కార్యక్రమానికి అనుమతివ్వాలంటూ కార్యకర్తలు చెన్నై నగరంలో పలుచోట్ల వాహనాలను తగులబెట్టారు. మమతా బెనర్జీ నివాళి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం రాత్రి గోపాలపురంలో ఉన్న కరుణానిధి నివాసానికి చేరుకుని కరుణ భౌతికకాయానికి అంజలి ఘటించారు. సినీనటుడు రజనీకాంత్ కూడా కరుణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ కరుణ మృతికి సంతాపం తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బుధవారం చెన్నైకి రానున్నారు. ప్రముఖుల సంతాపాలు ‘కరుణానిధి మరణం చాలా బాధించింది. ప్రజానేతగా, తమిళనాడు అభివృద్ధిలో భాగస్వామిగా కీలకపాత్ర పోషించారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు, డీఎంకే కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయాభివృద్ధికి కరుణ తన జీవితాన్ని అంకితం చేశారు’ –రాష్ట్రపతి కోవింద్ ‘దీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన ప్రముఖ నాయకుడు కరుణానిధి. ఆయన మరణం తీవ్ర విచారకరం. మొత్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి 56 ఏళ్లపాటు ఆయన తమిళనాడు శాసనసభలో సభ్యుడిగా ఉన్నారు. ఐదుపర్యాయాలు ముఖ్యమంత్రిగా తమిళనాడుకు సేవలందించారు’. –ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‘కలైజ్ఞర్ కరుణానిధి ఇక లేరనే వార్త బాధాకరం. దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నేతల్లో ఆయనొకరు. ఓ బలమైన మాస్లీడర్, గొప్ప ఆలోచనాపరుడు, మంచి రచయిత, పేదలు, అణగారిన వర్గాలకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతను కోల్పోయాం’ –ప్రధాని మోదీ ‘తమిళ ప్రజలకు కరుణానిధి అంటే ఎంతో ప్రేమ. ఆరు దశాబ్దాలపాటు ఆయన తమిళ, దేశ రాజకీయాలకు విశేష సేవలందించారు. ఆయన మరణంతో దేశం ఓ గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆయన కుటుంబానికి, ఆయన మరణానికి చింతిస్తున్న కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’ –కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ‘కరుణానిధి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. డీఎంకే నేతలు, కార్యకర్తలు, కలైజ్ఞర్ అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. పాఠశాలలో చదివే రోజుల నుంచే ఆయన కళా రంగంలోనూ రాణిస్తూ, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు’ – తమిళనాడు సీఎం పళనిస్వామి ‘కలైజ్ఞర్ మృతి మరచిపోలేనిది. నా జీవితంలో ఇదో చీకటి రోజు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’.–ప్రముఖ నటుడు రజనీకాంత్ గొప్ప మానవతావాది: గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: కరుణానిధి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సంతాపం వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు గొప్ప పరిపాలనా దక్షుడిని కోల్పోయిందని అన్నారు. కరుణానిధి గొప్ప మానవతావాది అని నరసింహన్ పేర్కొన్నారు. భారత రాజకీయ రంగానికి తీరని లోటు: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కరుణానిధి మృతి పట్ల తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణానిధి తమిళ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా, క్రియాశీల నాయకుడిగా సేవలందించారన్నారు. సామాన్య ప్రజలకు రాజకీయ చైతన్యం కలిగించిన కొద్ది మందిలో ఒకరిగా కరుణానిధి దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. కరుణానిధి మరణం భారతదేశ రాజకీయ రంగానికి తీరని లోటు అని కేసీఆర్ అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయాం: వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కరుణానిధి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్కు కరుణానిధి మరణం వార్త తెలియగానే సంతాపం ప్రకటించారు. ద్రవిడ రాజకీయాల్లో కరుణానిధిది ఒక విశిష్ట స్థానమని, సినిమా రచయితగానే కాకుండా ద్రవిడ రాజకీయాలను శాసించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణ అని జగన్ కొనియాడారు. -
ముఖ్యమంత్రి వియ్యంకుడి ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి వియ్యంకుడు సుబ్రమణ్యం నివాసంలో మంగళవారం ఐటీ సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులు సుబ్రమణ్యంను అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇప్పటివరకు చెన్నైలో జరిగిన ఐటీ సోదాల్లో కాంట్రాక్టర్ సెయ్యాదురై, ఆయన బంధువుల నివాసంలో 160 కోట్లు నగదు, 100 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా సెయ్యాదురై ట్వీట్ ఒకటి సంచలం సృష్టిస్తోంది. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెయ్యాదురై శుభాకాంక్షలు తెలపడం విశేషం. -
సొంత గూటికి వచ్చేయండి: సీఎం
సాక్షి, చెన్నై : అనర్హత వేటు పడిన దినకరన్ వర్గానికి 18 మంది ఎమ్మెల్యేలను తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్వయకర్త ఎడపాడి పళనిస్వామి పార్టీలోకి ఆహ్వానించారు. అనర్హత వేటు పడినవారంతా మళ్లీ చేరాలని వస్తే పార్టీలోకి స్వాగతిస్తామని పేర్కొన్నారు. కానీ ఇంతవరకు అలాంటి ప్రతిపాదన తన వద్దకు రాలేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దినకరన్ గూటికి చేరిన 18 మంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వస్తారని మీడియా ద్వారానే తెలుసుకున్నాను. ఒకవేళ వారు తిరిగి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామ’ని పేర్కొన్నారు. ఆ 18 మందిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారటగా అని విలేకరులు ప్రశ్నించగా ‘అది నేను ఎలా ఇవ్వగలను’ అని సమాధానమిచ్చారు. అనర్హత పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉందా అని అడగ్గా.. ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని, దాని గురించి మాట్లాడబోమని అన్నారు. కాగా, దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో అనిశ్చితి నెలకొంది. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించకపోవడంతో విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా, స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం విచారణ సందర్భంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. -
న్యాయవ్యవస్థకే ఇది మచ్చవుతుంది
సాక్షి, న్యూఢిల్లీ : కోర్టు నియామకాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోకుండా అడ్డుకున్నంత మాత్రాన న్యాయ వ్యవస్థ స్వతంత్రత నిలబడదు. ఎంత పటిష్టంగా, ఎంత వేగంగా తీర్పును వెలువరిస్తోంది అన్న అంశాలపై న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఆధారపడి ఉంటుంది. రాజకీయ, పాలనాపరమైన ప్రాధాన్యత గల కేసుల విషయంలో కూడా అంతులేని కాలయాపన చేస్తున్నప్పుడే న్యాయ వ్యవస్థపై పలు అనుమానాలు తలెత్తుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. తమిళనాడులో 18 అసెంబ్లీ నియోజక వర్గాలు 2017, సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రాతినిధ్యం లేకుండా ఖాళీగా ఉన్నాయి. పాలకపక్ష అన్నాడీఎంకే పార్టీలో అధికార సంక్షోభం ఏర్పడి 18 మంది ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్తో జట్టుకట్టారన్న కారణంగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వారిని అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. ఎడపాడి పళనిస్వామి అతి తక్కువ మెజారిటీతో సభా విశ్వాసాన్ని పొందిన నేపథ్యంలో 18 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ చెల్లదని ప్రతిపక్షం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ 18 మంది ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ తీర్పును వాయిదా వేస్తున్నట్టు జనవరి 23వ తేదీన ప్రకటించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం లేకుండా పోయిన సందర్భాల్లో ప్రజలకు, పాలనా వ్యవహారాలకు ఇబ్బందులు కలుగరాదన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తోంది. మరెందుకో 18 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయి ఎనిమిది నెలలు పూర్తవుతున్న తీర్పు వెలువడ లేదు. అదే ఓ పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంలో హైకోర్టు త్వరితగతిన కేసును విచారించి త్వరగానే తీర్పును వెలువరించింది. పళనిస్వామితో ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి మళ్లీ ఆయనతో పన్నీర్ సెల్వం వర్గంలోని 11 మంది ఎమ్మెల్యేలు కలిసిపోయారు. పార్టీ విప్ను ఉల్లంఘించి ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారన్న కారణంగా వాళ్లను సస్పెండ్ చేయాలంటూ విపక్షం కోర్టుకెక్కింది. 11 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్పై వేగంగా విచారణ పూర్తి చేసిన హైకోర్టు, ఇప్పటికీ పళనిస్వామి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ కేసులో తీర్పు వెలువరించక పోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. -
అకస్మాత్తుగా సీఎం, డిప్యూటీ సీఎం నిరాహార దీక్ష
సాక్షి, చెన్నై: కావేరీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేదిశగా తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం అకస్మాత్తుగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం నిరాహార దీక్ష దిగారు. వెంటనే కావేరీ జలాల మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఒక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. ఈ నిరాహార దీక్షలో పార్టీ శ్రేణులు, నేతలు, మంత్రులు పాల్గొంటారని మొదట తెలిపారు. దీక్షలో కూర్చునే నేతల జాబితాలో సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్ పేరు లేదు. కానీ, కావేరీ జలాల విషయంలో అన్నాడీఎంకే కేంద్రంపై తగినంత ఒత్తిడి తీసుకురావడం లేదన్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఏకంగా పళని, పన్నీర్ ఇద్దరూ దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు దీక్షలో పాల్గొంటున్నాయి. -
బైక్ను తన్నిన పోలీసు.. గర్భిణి మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: హెల్మెట్ చెకింగ్ కోసం ఆగకుండా వెళ్లిపోతున్న ఓ వ్యక్తి బైక్ను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంబడించి కాలితో తన్నడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఓ గర్భిణి మరణించింది. బైక్ నడుపుతున్న ఆమె భర్తకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో జరిగింది. తిరుచ్చిరాపల్లిలోని తువకూడీ టోల్ప్లాజా సమీపంలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం హెల్మెట్ చెకింగ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా భార్యతో కలసి బైక్పై బయలుదేరిన రాజాను ఆపడానికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కామరాజ్ యత్నించారు. కానీ రాజా బైక్ను ఆపలేదు. వెంటనే మరో బైక్పై వెంబడించిన కామరాజ్.. తిరుచ్చిరాపల్లి–తంజావూరు హైవేపై రాజా బైక్ను కాలితో తన్నారు. దీంతో బైక్పై ఉన్న దంపతులిద్దరూ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ నాలుగు నెలల గర్భిణి ఉషాను ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కామరాజ్ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఉషా మృతికి సంతాపం తెలిపిన సీఎం పళనిస్వామి.. మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.7 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఉష కుటుంబానికి రూ.రెండు లక్షల ఆర్థిక సాయాన్ని మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ ప్రకటించారు. -
రచ్చకెక్కిన ‘అమ్మ’ విగ్రహం.!
సాక్షి, చెన్నై : అమ్మ జయలలిత విగ్రహం రచ్చకెక్కింది. అమ్మ స్థానంలో మరెవర్నో తీసుకొచ్చి పెట్టారన్న విమర్శలు అన్నాడిఎంకే పాలకుల్ని ఇరకాటంలో పడేసింది. దీంతో ఆ విగ్రహాన్ని మార్చేందుకు నిర్ణయించారు. అన్నాడిఎంకే వర్గాలు అమ్మ జయలలిత 70వ జయంతి వేడుక శనివారం ఘనంగా జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్నిపురస్కరించుకుని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో అమ్మ నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలు ఆవిష్కరించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, అస్సలు అక్కడ ఉన్న విగ్రహం జయలలిత దేనా..? అన్న ప్రశ్న అందరిలో మొదలైయింది. జయలలిత ముఖం పోలికలు ఆ విగ్రహంలో లేవన్న విమర్శలు బయలు దేరాయి. అమ్మ స్థానంలో మరెవర్నో తీసుకొచ్చి పెట్టినట్టున్నారని అన్నాడిఎంకే కేడర్ సైతం విమర్శల్ని గుప్పించే పనిలో పడ్డారని చెప్పవచ్చు. ఇక, సామాజిక మాధ్యమాల్లో అయితే, ఆ విగ్రహం చర్చ హోరెత్తింది. అక్కడున్నది అమ్మా...చిన్నమ్మా..? అంటూ కొందరు ప్రశ్నించారు. కొందరు సీనియర్ నేత వలర్మతిని నిలబెట్టినట్టుందని, మరి కొందరు సీఎం పళని స్వామి సతీమణి ముఖాన్ని పోలినట్టుందని రక రకాల వ్యంగ్యాస్త్రాలతో సామాజిక మాధ్యమాల ద్వారా అన్నాడిఎంకే వర్గాలపై దాడి చేసిన వాళ్లు ఎక్కువే. విగ్రహావిష్కరణ సమయంలో మత్స్య శాఖ మంత్రి జయకుమార్ను పదే పదే మీడియా ప్రశ్నించగా, అమ్మ విగ్రహమే క్షుణ్ణంగా చూడండంటూ సమాధానం ఇచ్చి వెళ్లడం మరింత చమత్కారాలకు దారి తీశాయి. మార్పుకు నిర్ణయం : అమ్మ ఎక్కడ ..? అని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు హోరెత్తడం ఓ వైపు ఉంటే, మరో వైపు అన్నాడిఎంకే వర్గాలు సైతం విగ్రహం మీద పెదవి విప్పడం చర్చకు దారి తీసింది. అన్నాడిఎంకే కేడర్ అమ్మేది అని ప్రశ్నించే స్థాయి పరిస్థితి చేరింది. అదే సమయంలో అన్నాడిఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్ సైతం పన్నీరు, పళనిల తీరుపై విమర్శల దాడిని పెంచారు. అమ్మ విగ్రహాన్ని పరిహాసం చేశారని మండి పడ్డారు. అమ్మ విగ్రహాన్నే సక్రమంగా చేయించ లేని వాళ్లు, ఇక పార్టీ నిర్వాకాన్ని ఏ మేరకు ఒలక బెడుతున్నారో కేడర్ పరిగణించాలని సూచించారు. ఇక, జయలలిత మేన కోడలు దీప సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ ఆ విగ్రహాన్ని తొలగించాల్సిందేని డిమాండ్ చేశారు. అలాగే, ఈ విగ్రహావిష్కరణకు దూరంగా ఉన్న మైలాడుతురై ఎంపి భారతి మోహన్ కూడా విమర్శలు ఎక్కుబెట్టడం విగ్రహం ఆవిష్కరణ రచ్చకెక్కింది. ఇది మరింత జఠిలం అయ్యే అవకాశాలు ఉండటంతో పాలకులు మేల్కొన్నట్టున్నారు. విగ్రహాన్ని మార్చేందుకు తగ్గ చర్యల్లో పడ్డారు. ఈ విషయంగా మత్స్య శాఖ మంత్రి జయకుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఆ విగ్రహాన్ని మార్చి, మరో విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ రచ్చను ఇంతటితో వదలి పెట్టాలని వేడుకోవడం గమనార్హం. -
ముఖ్యమంత్రి సతీమణిలా జయ విగ్రహం!
సాక్షి, చెన్నై : దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విగ్రహంపై వివాదం నెలకొంది. జయలలిత విగ్రహంలోని పోలికలు ముఖ్యమంత్రి పళనిస్వామి సతీమణిని పోలినట్లు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా జయలలిత 70వ జయంతి సందర్బంగా పాలకఅన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో దివంగత నేత భారీ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం నెలకొల్పింది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వంలు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా నెల్లూరులో రూపుదిద్దుకున్న జయ విగ్రహాన్ని గత ఏడాదే పార్టీ కార్యాలయంలో ప్రతిష్టించాల్సి ఉండగా, పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. -
మోదీ చెప్పినందుకే..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకే ఏఐఏడీఎంకే పార్టీలోని తన వర్గాన్ని, సీఎం పళనిస్వామి వర్గంలో విలీనం చేసినట్లు తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ. పన్నీర్ సెల్వం(ఓపీఎస్) వెల్లడించారు. తేని పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళతో విభేదించి ధర్మయుద్ధం జరుపుతున్న సమయంలో ప్రధాని మోదీని కలిసినట్లు చెప్పారు. అయితే, పార్టీ పదవి చేపడతానని ప్రధానికి తెలపగా, ఆయన మాత్రం మంత్రివర్గంలోనే చేరాలని సలహా ఇచ్చారన్నారు. అనంతరం రెండు వర్గాల విలీనంతో మంత్రి పదవి చేపట్టినట్లు చెప్పారు. అమ్మ దయవల్లే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం దక్కిందన్నారు. ఆ గౌరవం తనకు చాలుననీ, పదవులపై వ్యామోహం లేదని చెప్పారు. శశికళ, టీటీవీ దినకరన్ కారణంగా తాను పడిన కష్టాలు, సంక్షోభం మరొకరు ఎదుర్కొని ఉంటే ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవారనీ, అమ్మ కోసమే ఇవన్నీ భరించాననీ తెలిపారు. అయితే, ప్రధానితో భేటీ ఎప్పుడు జరిగిందనే విషయం మాత్రం ఓపీఎస్ చెప్పలేదు. జయలలిత మరణం, తదనంతర పరిణామాలతో ఏఐఏడీఎంకే పార్టీ పన్నీరు సెల్వం, పళనిస్వామి నాయకత్వాల కింద రెండుగా చీలి, తిరిగి ఒక్కటయ్యాయి. -
ఏఐఏడీఎంకే నుంచి 58మంది బహిష్కరణ
చెన్నై: అన్నా డీఎంకే పార్టీ నుంచి 50మందికిపైగా నాయకులను పార్టీ అధినాయకులు ఒ.పన్నీర్సెల్వం, కె.పళనిస్వామిలు బహిష్కరించారు. క్రమశిక్షణ వేటు పడిన 53మంది పార్టీ కాంచీపురం సెంట్రల్ యూనిట్కు చెందినవారు. అలాగే పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగానికి చెందిన ఐదుగురు(అన్నా తోజిర్సంగ పెరవై)ని కూడా బహిష్కరించారు. వారిని అన్ని పోస్టుల నుంచి, ప్రాథమిక సభ్యత్వాల నుంచి తొలగించినట్లు కో ఆర్డినేటర్లు పన్నీరుసెల్వం, పళనిస్వామిలు తెలిపారు. పార్టీ నుంచి విడిపోయిన దినకరన్కు ప్రధాన శక్తులుగా ఉన్న పలువురిని ఇంతకుముందు కూడా బహిష్కరించారు. -
రూ.లక్షకు పెరిగిన ఎమ్మెల్యేల వేతనం
టీ.నగర్: అసెంబ్లీలో వేతనాల పెంపు ముసాయిదాను బుధవారం ప్రవేశపెట్టారు. దీంతో ఎమ్మెల్యేల వేతనం లక్ష రూపాయలకు చేరింది. రాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాన్ని పెంచేందుకు సంబం«ధించిన చట్ట ముసాయిదా అసెంబ్లీ పక్షనేత, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టారు. ఇందుకు ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా మద్దతు ప్రకటించడంతో ముసాయిదాకు అంగీకారం తెలిపినట్లు స్పీకర్ ధనసాల్ ప్రకటించారు. ఈ ముసాయిదాకు డీఎంకే తరఫున ఆ పార్టీ విప్ తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ముసాయిదాలోని వివరాలు.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రిసీడియం చైర్మన్, డిప్యూటీ ప్రెసిడీయం చైర్మన్, ప్రతిపక్ష నేత, ప్రభుత్వ విప్, అసెంబ్లీ సభ్యుల వేతనాలు ఎనిమిది వేల రూపాయల నుంచి రూ.30 వేలకు పెరిగాయి. ఇదే విధంగా పలు రాయితీలు కల్పించారు. అసెంబ్లీ మాజీ సభ్యుల పింఛన్ 12 వేల రూపాయల నుంచి రూ.20 వేలకు పెంచారు. మాజీ సభ్యుల చట్టబద్ధమైన వారసులకు కుటుంబ పింఛన్ ఆరువేల రూపాయల నుంచి రూ.10 వేలు అందించనున్నారు. ఇలాఉండగా ఈ వేతనాలు 2017 జూలై ఒకటవ తేదీ నుంచి అమలుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముసాయిదా నెరవేర్చడం ద్వారా ప్రభుత్వానికి అదనంగా ఏటా రూ.25.32కోట్ల ఖర్చు ఏర్పడనుంది. ఈ విధంగా ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ ముసాయిదా నెరవేరడంతో ఇకపై ఎమ్మెల్యేలు నెలసరి వేతనంగా లక్ష రూపాయలు అందుకోనున్నారు. -
రాజకీయాల్లోకి వస్తున్నా!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తీవ్ర తర్జనభర్జనలు.. ఎన్నో అనూహ్య పరిణామాలు.. ఐదు రోజులుగా అభిమానులతో వరుస సమావేశాలు.. ఓవైపు సహనటుడు కమల్ ప్రభుత్వాలపై కత్తులు నూరుతున్నా మౌనంగానే పరిస్థితులను గమనిస్తూ వచ్చిన సౌతిండియా సూపర్స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన చేశారు. రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానుల కలలను నిజం చేస్తూ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో రాజకీయాలు హీనదశకు చేరుకున్న నేపథ్యంలో ఓ సరైన రాజకీయ వేదిక అవసరం ఉందని.. సొంతగా ఓ పార్టీ పెట్టి ఆ లోటును భర్తీ చేయనున్నట్లు ఆదివారం ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు రజనీ తెలిపారు. ‘నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. ఇది సత్యం’ అని చెన్నైలో జరిగిన అభిమానుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. రజనీ నిర్ణయాన్ని అభిమానులతో సహా చిత్ర, రాజకీయ రంగ ప్రముఖులు స్వాగతించారు. కాగా, పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో నీతి ముఖ్యం సుపరిపాలన, నీతితో కూడిన రాజకీయాలపై రజనీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘నేటి పరిస్థితుల్లో ప్రతీదీ మారాల్సిన అవసరం కనబడుతోంది’ అని వ్యాఖ్యానించారు. ‘ఆధ్యాత్మిక రాజకీయాలు’ ప్రతి కులం, మతంలో పారదర్శకంగా వెల్లివిరియాలని.. అదే తన రాజకీయ ప్రవేశం ఉద్దేశమని రజనీ అభిలషించారు. తను సొంతంగా ముందుకెళ్లటం కష్టమన్న ఆయన.. తన పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు. రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని అన్నిస్థానాల నుంచి పోటీచేయడం తథ్యమని వెల్లడించారు. పార్టీ పేరును ప్రకటించకుండా పార్టీ సిద్ధాంతాలను మాత్రమే ఆయన ప్రస్తావించారు. డిసెంబర్ 26వ తేదీ నుంచి అభిమానులతో సమావేÔ¶శమవుతున్న రజనీకాంత్ చివరి రోజైన ఆదివారం నాడు అభిమానులను ఉద్దేశించి ఉద్వేగపూరితంగా మాట్లాడారు. రజనీ ప్రసంగం కొనసాగినంతసేపు అభిమానులు ఈలలు, చప్పట్లతో అభినందనలు తెలిపారు. రజనీ ఏమన్నారంటే.. ‘నాకు జీవితాన్ని ఇచ్చిన అభిమానుల్లారా, తమిళ ప్రజలారా, టీవీలో నా ప్రసంగాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకుల్లారా.. మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. నా అభిమానులను ఎలా కీర్తించాలో తెలియడం లేదు. ఆర్రోజులుగా ఆరువేలకు మందికి పైగా అభిమానులు నాతో ఫొటో దిగేందుకు ఓర్పు, క్రమశిక్షణ పాటించడం చెప్పలేని అనుభూతిని కలిగించింది. ఇదే క్రమశిక్షణ, ఓర్పు భవిష్యత్తులో కూడా కొనసాగితే ఏదైనా సాధించగలమని అర్థమైంది. మనం సరైన దిశగా వెళ్తున్నాం. రాజకీయాల్లోకి రావడానికి నాకు భయం లేదు, మీడియాను చూస్తేనే భయం. బడా వ్యక్తులే మీడియాను చూసి భయపడుతున్నారు. నేనో పసివాడిని. నీ బాధ్యతలు నీవు నెరవేర్చు, మిగతావి నేను చూసుకుంటానని కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. యుద్ధంలో జయిస్తే రాజ్యం, ఓడితే స్వర్గం ప్రాప్తిస్తుంది. అదే యుద్ధం చేయకుండా వెళ్లిపోతే పిరికిపంద అంటారు. ఇప్పటికే అన్నీపూర్తి చేశాను. బాణాన్ని గురిచూసి వదలడమే మిగిలింది. నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం. ఇదంతా పరిస్థితుల ప్రోద్బలం. తగిన సమయం లేనందున త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటాను. పార్లమెంటు ఎన్నికల నాటికి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను. నేను రాజకీయాల్లోకి రావడం పేరు ప్రతిష్టల కోసం కాదు, కలలో కూడా ఊహించని వెయ్యింతల పేరు ప్రతిష్టలను అభిమానులు ఇప్పటికే ఇచ్చారు. 1996లోనే కుర్చీ నన్ను వెతుక్కుంటూ రాగా వద్దని చెప్పేశాను. 45 ఏళ్లప్పుడు లేని పదవీ వ్యామోహం 68 ఏళ్లకు వస్తుందా? ఆధ్యాత్మికవేత్త అని పిలిపించుకునేందుకు నాకు అర్హత ఉందా? తమిళనాడు రాజకీయాలు బాగా చెడిపోయాయి. ఏడాదిగా తమిళ రాజకీయాలను చూసి పొరుగు రాష్టాలు నవ్వుకుంటున్నాయి. ప్రజాస్వామ్యం పరిహాసంగా మారింది. తమిళనాడు ప్రజలకు తలవంపులుగా తయారైంది. ఇంత జరిగినా.. నేను ఓనిర్ణయం తీసుకోకుంటే అది తమిళనాడు ప్రజలకు ద్రోహం చేసినట్లవుతుంది. రాజకీయ వ్యవస్థలో మార్పులు తేవాలి. నీతి, నిజాయితీ కలిగి, మతసామరస్యంతో కూడిన ఆ«ధ్యాత్మిక రాజకీయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడమే నా లక్ష్యం. దేవుడి దయ, ప్రజల విశ్వాసం, ప్రేమ, అభిమానంతో ప్రత్యేక పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఇందులో విజయం సాధిస్తానని సంపూర్ణమైన నమ్మకం ఉంది. రాజుల కాలంలో యుద్ధాలు చేసి పొరుగు రాజ్యాలను, ఖజానాలను, ప్రజలను కొల్లగొట్టేవారు. కానీ నేడు ప్రజాస్వామ్యం ముసుగులో నేరుగా ప్రజలను దోచుకుంటున్నారు. నాకు కార్యకర్తలు వద్దు, ప్రజా సంక్షేమం కోరే కాపలాదండు (వాలంటీర్లు) కావాలి. ఎవరు తప్పు చేసినా నిలదీయగల ధైర్యమున్న దండు కావాలి. అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల దగ్గరు వ్యక్తిగత అవసరాల కోసం వెళ్లని వాలంటీర్లు కావాలి. ఇలాంటి కాపలాదండుకు నేను ప్రతిని«ధిగా ఉంటాను. గ్రామస్థాయి నుంచి నగరాల వరకు కొన్నివేల సంఘాలు (రిజిస్టర్ అయినవి, కానివి) మనకు ఉన్నాయి. వాటన్నింటినీ ఏకతాటిపైకి తేవడం ఎంతో ముఖ్యం. క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, సత్యం ఇవే నా మొదటి శాసనం. ఇక మనం రాజకీయాలు మాట్లాడరాదు, నేనూ మాట్లాడను. ఎపుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయో అపుడు పార్టీ స్థాపిస్తాను. ఆ పార్టీ ద్వారా ప్రజలకు ఏమి చేయగలమో, ఏమి చేయలేమో చెబుతాం. ప్రజలకు ఇచ్చిన హామీలను మూడేళ్లలోగా నెరవేర్చలేకుంటే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాను’ అని రజనీ పేర్కొన్నారు. తన పార్టీ చిహ్నాన్ని స్పష్టం చేయకున్నా బాబా చిత్రంలోలా రజనీ వేలు మడతలను వేళ్లను మడిచి సంకేతాలు ఇచ్చారు. అనంతరం అభిమానులతో ఫొటోలు దిగారు. వెల్లువెత్తిన అభిమానం రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. సభాస్థలి ఈలలు, చప్పట్లతో మారుమోగింది. రజనీకాంత్ ప్రసంగాన్ని వినేందుకు వీలుగా రోడ్డుపైన సైతం స్పీకర్లు అమర్చారు. ప్రతి మాటకూ బాణసంచా కాల్చి ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఆనందంతో చిందులువేశారు. ప్రసంగాన్ని ముగించిన అనంతరం బాల్కనీలోకి వచ్చి రజనీకాంత్ చేయి ఊపుతూ, విక్టరీ చిహ్నం చూపుతూ అభివాదం చేయడంతో అభిమానుల్లో ఆనందం కట్టలుతెంచుకుంది. రజనీ ప్రకటనను కవర్ చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ మీడియా ఉత్సాహం చూపించింది. చిత్రరంగం శుభాకాంక్షలు రజనీకాంత్ నిర్ణయాన్ని అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సహా పలువురు చిత్ర రంగ ప్రముఖులు స్వాగతించారు. సూపర్స్టార్ రాజకీయ భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ప్రియ మిత్రుడు, తోటి నటుడు, వినయం, విధేయతగల మానవతావాది రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు. ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ‘నా సోదరుడు రజనీకాంత్ సామాజిక బాధ్యత, రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నా’ అని హాసన్ పోస్టు చేశారు. రజనీ ప్రకటన 2017 సంవత్సరానికి అతిపెద్ద వార్త ‘జై హో’ అని అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. సూపర్స్టార్ కచ్చితంగా ప్రజాభిమానాన్ని పొందుతారని బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్ అభిప్రాయపడ్డారు. నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ కూడా రజనీ ప్రకటనను స్వాగతించారు. మమ్మల్ని ఓడించేవారు పుట్టలేదు: పళనిస్వామి రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చని దీని కారణంగా అన్నాడీఎంకేకు నష్టమేమీ జరగదని తమిళనాడు సీఎం పళనిస్వామి వ్యాఖ్యానించారు. తమ పార్టీని ఓడించే వారింకా పుట్టలేదని.. ఇకపై పుట్టబోరని ఆయన పేర్కొన్నారు. ఎంజీఆర్, జయలలితలు స్థాపించిన అన్నాడీఎంకేకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఎవరూ చీల్చలేరన్నారు. ప్రతి భారతీయుడికీ సొంతగా పార్టీ పెట్టుకునే హక్కుందని డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళ్సాయి సౌందరరాజన్ రజనీకి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానుల ఆశలకు అనుగుణంగా రజనీకాంత్ పార్టీని పెట్టడం శుభపరిణామమని డీఎంకే కార్యాధ్యక్షుడు, విపక్ష నేత స్టాలిన్ వెల్లడించారు. ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కూడా రజనీకి అభినందనలు తెలిపారు. -
కొత్త ఎత్తుగడ.. షాకుల మీద షాకులు
సాక్షి, చెన్నై : రెండాకుల గుర్తును దూరం చేసుకున్న అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్కు మరో భారీ షాక్ తగిలింది. రెండు రోజుల వ్యవధిలో శశికళ-దినకరన్ వర్గం నుంచి ఐదుగురు ఎంపీలు జంప్ అయిపోయారు. దుండిగల్ ఎంపీ ఎం ఉదయ్ కుమార్, వెల్లూర్ ఎంపీ సెంగుట్టువన్.. మంగళవారం ముఖ్యమంత్రి ఎడిప్పాడి పళనిస్వామిని కలిసి మద్దతు ప్రకటించారు. గ్రూప్ రాజకీయాలకు చెక్ పెడుతూ పళని-పన్నీర్ వెంటే తాము ఉన్నామని ప్రకటించారు. ఇక ముగ్గురు రాజ్యసభ సభ్యులు నవనీతక్రిష్ణన్, విజిల సత్యానంద్, ఎన్. గోకుల క్రిష్ణన్ (పుదుచ్చేరి) నిన్న పళనిసామి, పన్నీర్ సెల్వంతో నిన్న భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే పార్టీ నుంచి తాము రాజ్యసభ సభ్యులుగా నామినేట్ అయ్యామని.. అధికారిక పార్టీగా గుర్తింపు పొందిన పళని వర్గానికే తాము ఓటేస్తామని వారు ప్రకటించారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా చేజారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా, ఉదయ్ కుమార్ గతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నమ్మ(శశికళ) వీడే ప్రసక్తే లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గుర్తింపు దక్కిన నేపథ్యంలో అధికార పక్షం.. దినకరన్ వర్గాన్ని ఖాళీ చేయించే పనిలో పండింది. ఇక ఆర్కే నగర్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో దినకరన్కు ఈ జంపింగ్లు పెద్ద తలనొప్పిగా మారాయి. -
రీల్ పైకి ఎంజీఆర్ రియల్ లైఫ్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్... ఇప్పుడు ఇటు సౌత్ అటు నార్త్లో బయోపిక్ల (జీవితకథ) ట్రెండ్ నడుస్తోంది. మూవీస్, స్పోర్ట్స్, పాలిటిక్స్కి చెందిన సెలబ్రిటీల జీవిత కథలను సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించడానికి ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్లో ప్రముఖ దివంగత నటుడు, తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ బయోపిక్కి శ్రీకారం జరిగింది. బాలకృష్ణన్ దర్శకత్వంలో రమణ కమ్యూనికేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రారంభం కానుంది. ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రకు ఇంకా ఎవర్నీ సెలక్ట్ చేయలేదు. ఈ పాత్ర కోసం చిత్రబృందం పలువురి పేర్లను పరిశీలిస్తున్నారట. కాగా, ‘బాహుబలి’లో కట్టప్పగా అలరించిన సత్యరాజ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్. తెలుగులోనూ ఎన్టీఆర్ బయోపిక్లు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటు సినిమా, అటు రాజకీయరంగంలో రాణించిన ఎన్టీఆర్, ఎంజీఆర్ బయోపిక్లు ఏకకాలంలో రూపొందనుండటం తెలుగు, తమిళ రాష్ట్రాల్లో హాట్టాపిక్ అయింది. -
ముఖ్యమంత్రి, స్పీకర్కు చీర, నైటీ!
సాక్షి, చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎడిపాడి పళినిస్వామి, స్పీకర్ ధనపాల్కు చీర, నైటీలను పంపిన ఎనిమిదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోడ్ ఈస్ట్ జిల్లా కొంగునాడు వెట్టువగౌండర్ యువజన సంక్షేమ సంఘం కార్యదర్శి జగదీశన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు గురువారం ఈరోడ్ తపాలా కార్యాలయానికి చేరుకున్నారు. వీరు సీఎంకు నైటీ, స్పీకర్కు చీర పంపేందుకు వినూత్న ఆందోళన జరిపారు. దీని గురించి వారు మాట్లాడుతూ మెజార్టీ కోల్పోయిన పళనిస్వామి ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష జరిపేందుకు ఉత్తర్వులివ్వని స్పీకర్ ధనపాల్, 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని, ఇది ప్రజాస్వామిక హత్యని విమర్శించారు. మైనార్టీ ప్రభుత్వానికి నాయకత్వం వహించే ఎడపాటి వైఖరిని నిరసిస్తూ ఆందోళన జరుపుతున్నట్లు తెలిపారు. నిరసనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. -
రాజ్నాథ్తో తమిళనాడు గవర్నర్ భేటీ
-
రాజ్నాథ్తో తమిళనాడు గవర్నర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు మరోసారి భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం ఇక్కడ జరిగిన ఈ సమావేశంలో మిళనాడు రాజకీయలపై చర్చ జరిగినట్లు సమాచారం. కాగా టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కాయి. ఈ నేపథ్యంలో విద్యాసాగర్రావు నిన్న కూడా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, హోంమంత్రితో వేర్వేరుగా సమావేశం అయిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ విశ్వాస పరీక్షకు అనుమతిస్తే.. ముఖ్యమంత్రి పళనిస్వామి మరోసారి సీఎంగా నెగ్గటం సులువే. మొత్తం 233 మంది ఎమ్మెల్యేలున్న ప్రస్తుత తమిళ అసెంబ్లీలో (జయ మరణంతో ఆర్కేనగర్ ఖాళీగా ఉంది) విజయానికి 117 సీట్లు అవసరం. అయితే.. పళనిస్వామి వర్గంలో 113 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మిత్రపక్షాలున్నారు. ఈ నేపథ్యంలో 18మందిపై అనర్హత వేటు పడితే.. 215 సభ్యులు మాత్రమే విశ్వాస పరీక్షలో పాల్గొంటారు. అప్పుడు గెలిచేందుకు 109 సీట్లు అవసరం. ఈ మేజిక్ ఫిగర్ను సీఎం వర్గం సులభంగానే చేరుకుంటుంది. అయితే.. రెండ్రోజుల్లో ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
-
18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం తలెత్తింది. రాజకీయ ఉత్కంఠకు తెరదించే విధంగా బల పరీక్ష విషయంలో గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతుందోనని ఎదురు చూపులు చూడగా చివరికి దినకరన్ వర్గానికి స్పీకర్ భారీ షాకిచ్చారు. అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శి దినకరన్ వర్గానికి చెందిన 18 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. సీఎం పళని స్వామిపై తిరుగుబావుట ఎగురవేసిన ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ సోమవారం ప్రకటించారు. దీంతో దినకరన్ వర్గానికి ఏం చేయాలో మింగుడు పడటం లేదు. తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్రావు నేడు చెన్నైకి రానున్న నేపథ్యంలో స్పీకర్ ధనపాల్ ఈ నిర్ణయం తీసుకోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ ధనపాల్ నిర్ణయాన్ని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. తమపై అనర్హత వేటు వేయడం అన్యాయమని, దీనిపై తాము హైకోర్టుకు వెళతామని తెలిపారు. మరోవైపు గవర్నర్ బల పరీక్షకు ఆదేశిస్తే, ఇరాకాటంలో పడుతామన్న ఆందోళనతో సీఎం పళని స్వామి నేతృత్వంలోని ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తమపై తిరుగుబాటు చేస్తున్న వారిపై అనర్హత వేటు పడేలా పావులు కదిపింది. మైనారిటీ ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో దినకరన్ వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. డీఎంకే సభ్యులకూ అనర్హత టెన్షన్..! దినకరన్ వర్గం ఎమ్మెల్యేలతో పాటు డీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. అసెంబ్లీలో సాగిన గుట్కా వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే సభ్యులు 21 మందిని సస్పెండ్ చేయడానికి పళనిస్వామి వర్గం తగ్గ కార్యాచరణ సిద్ధం చేసి, సభా హక్కుల సంఘం ద్వారా ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు సైతం ఇప్పించారు. గుట్కా వ్యవహారం కోర్టులో విచారణలో ఉండడం, ఇప్పటికే నిషేధిత వస్తువులపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఉండటాన్ని అస్త్రంగా చేసుకుని నోటీసు రద్దుకు డీఎంకే సభ్యులు హైకోర్టు తలుపు తట్టడంతో సస్పెన్షన్ వేటు నుంచి ఇటీవల తాత్కాలిక ఊరట లభించింది. ఏ సమయంలోనైనా స్పీకర్ వారిపై వేటు వేసే అవకాశాలున్నాయి. -
అత్తారింటికి వెళ్లేదెవరో!
నేతల మధ్య మాటల తూటాలు.. సవాళ్లు ప్రతి సవాళ్లు సీఎం హెచ్చరిక, విరుచుకుపడ్డ మంత్రులు ఎదురుదాడిలో దినకరన్ అత్తారింటికి వెళ్లేది నువ్వంటే.. నువ్వే నంటూ అన్నాడీఎంకే గ్రూపుల మధ్య శనివారం మాటల తూటాలు పేలాయి. మళ్లీ జైలుకు వెళ్తావంటూ సీఎం పళని స్వామి దినకరన్కు హెచ్చరిక చేశారు. అమ్మ జయలలిత మరణానికి ప్రధాన కారకురాలు చిన్నమ్మ శశికళ అని మంత్రులు విరుచుకు పడ్డారు. తానేమీ తక్కువ తిన్నానా..? అంటూ దినకరన్ ఎదురుదాడికి దిగారు. శాశ్వతంగా ఇంటికి.. ఆ తదుపరి అత్తారింటికి వెళ్లబోయేదెవరో మరి కొద్దిరోజుల్లో తేలుతుందని హెచ్చరించారు. సాక్షి, చెన్నై : సీఎం పళని స్వామిని ఇరకాటంలో పెట్టే రీతిలో, ప్రభుత్వాన్ని కూల్చేందుకు తగ్గ ప్రయత్నాల్ని దినకరన్ వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయన్ను గురిపెట్టి పాలకులు తీవ్రంగా స్పందించే ప నిలో పడ్డారు. సీఎం పళని స్వామి మొదలు, మంత్రుల వరకు శనివారం దినకరన్ను గురిపెట్టి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. చిన్నమ్మ శశికళ కుటుంబంపై దుమ్మెత్తి పోశారు. అమ్మ మరణానికి ప్రధాన కారకురాలు శశికళ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. అత్తారింటికి దినకరన్ వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. అత్తారిళ్లు(జైలు) తనకు కొత్త కాదని, ఇక, వెళ్లబోయేదెవరో వెయిట్ అండ్ సీ.. అని దినకరన్ ఎదురుదాడికి దిగారు. సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య పళని, దినకరన్ శిబిరాల మాటల తూటాలు పేలడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ మొదలైంది. మళ్లీ జైలుకెళ్లడం ఖాయం.. సీఎం పళని స్వామి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, దినకరన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని, అందర్నీ తొలగిస్తున్న దినకరన్, అమ్మ జయ లలిత బతికి ఉండి ఉంటే, ఆమె కూడా పదవి నుంచి తొలగించి ఉండే వాడేమోనని మండిపడ్డారు. అమ్మ కన్నెర్ర చేయడంతో పది సంవత్సరాలు వనవాసంలో ఉన్న దినకరన్, ఇప్పుడు అమ్మ లేని దృష్ట్యా, జబ్బలు చరుస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆయన బెదిరింపులు, హెచ్చరికలకు ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. అమ్మ జయలలిత ఆశీస్సులతో తాను ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యానని పేర్కొంటూ, దినక రన్ లాంటి కపట నాటక దారుడ్ని నమ్మే స్థితిలో అన్నాడీఎంకే కేడర్ లేదని ధీమా వ్యక్తంచేశారు. అమ్మ ఆత్మ ఎన్నడూ క్షమించదని, దినకరన్ అండ్ బృందానికి గుణపాఠం తథ్యమని హెచ్చరించారు. అమ్మ మరణానికి చిన్నమ్మే కారణం దిండుగల్, తిరుచ్చి, తంజావూరుల్లో జరిగిన వివిధ కార్యక్రమల్లో మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, వెల్ల మండి నటరాజన్, ఓఎస్ మణియన్, బెంజమిన్, ఎంపీలు తంబిదురై, వైద్యలిం గం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. దినకరన్, శశికళను గురిపెట్టి తీవ్రంగానే స్పందించారు. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు దిగారు. దిండుగల్ శ్రీనివాసన్ మాట్లాడుతూ, అమ్మ రోగం తీ వ్రత పెరగడంతో, చివరకు సహజ మరణంగా రూపొందించారని ఆరోపించారు. అమ్మను చూసేందుకు ఎవరినీ అనుమతించకుండా శశికళ అడ్డుకున్నారని, అమ్మ మరణానికి ప్రధాన కారకురాలు చిన్నమ్మేనని ఆరోపించారు. అందుకే ఆ కుటుంబాన్ని సాగనంపడం లక్ష్యంగా తమ ప్రభుత్వం, పార్టీ ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు. వెల్లమండి నటరాజన్ స్పందిస్తూ, జయలలిత ఆరోగ్యంపై పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి ఉన్నారని, చిన్నమ్మ శశికళ దగ్గరుండి మరీ అమ్మ ఆరోగ్యం క్షీణించేందుకు ప్రధాన కారకురాలు అయ్యారని ఆరోపించారు. ఓఎస్ మణియన్ పేర్కొంటూ, దినకరన్ను అంగీకరించే ప్రసక్తే లేదని, త్వరలో సంకట పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఖాయం అని హెచ్చరించారు. అదే సమయంలో చిన్నమ్మ శశికళ విషయంగా, ఆమెను వదులుకునే పరిస్థితి ఉండబోదని స్పందించారు. బెంజమిన్ వ్యాఖ్యానిస్తూ, ద్రోహులకు గుణపాఠం నేర్పే రోజు సమీపించిందని హెచ్చరించారు. ఎంపీ వైద్యలింగం మాట్లాడుతూ, దినకరన్ లాంటి వ్యక్తుల కాకమ్మ బెదిరింపులకు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అవసరం అయితే, మెజారిటీ నిరూపించుకుని ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నామన్నారు. తంబిదురై వ్యాఖ్యానిస్తూ, అన్నాడీఎంకే సర్కారును కూల్చడం, ఆ పార్టీని నిర్వీర్యం చేయడం ఎవరితరమూ కాదన్నారు. దినకరన్ ఎదురుదాడి తన మీద ఆరోపణలు, విమర్శనాస్త్రాల్ని ఎక్కుబెట్టడంతో దినకరన్ ఎదురు దాడికి దిగారు. అడయార్లోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. త్వరలో ఈ మంత్రులు అందరూ శాశ్వతంగా ఇంటికి వెళ్లబోతున్నారని పేర్కొన్నారు. శశికళకు పళనిస్వామి తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. అమ్మ ఆశయాలకు తూట్లు పెట్టే విధంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉప్పు తిన్న వాడు నీళ్లు తాగక తప్పదని, తిన్నింటి వాసాలు లెక్కించే పళని స్వామి అండ్ బృందం త్వరలో అత్తారింటికి వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. తనకు అత్తారిళ్లు కొత్త కాదని, అయితే, ఇక వెళ్లబోయే వాళ్లకే కొత్త అని వ్యాఖ్యానించారు. తన మీద విదేశీ మారక ద్రవ్యం కేసు మాత్రమే ఉందని పేర్కొంటూ, సీఎం, మంత్రుల వలేæ తాను అవినీతికి పాల్పడ లేదని, ప్రజాధనాన్ని దోచుకోలేదన్నారు. ప్రజా ధనాన్ని కోట్లు కోట్లుగా దోచి దాచి పెట్టుకుంటున్న వాళ్లకు అత్తా రిళ్లు ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉందని, ఎవరెవరు వెళ్లబోతున్నారో వేచి చూడంటూ ముగించారు. బెంగళూరుకు దినకరన్ మాటల తూటాలు ఓ వైపు సాగుతుంటే, మరోవైపు తన మద్దతు ఎమ్మెల్యేలతో భేటీకి దినకరన్ నిర్ణయించారు. మైసూరు సమీపంలోని ఓ రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేల్ని కలుసుకునేందుకు సిద్ధం అయ్యారు. 20వ తేదీన ఆయన బెంగళూరు మీదుగా మైసూర్కు పయనం కానున్నారు. అలాగే, మత్స్య శాఖ మంత్రి జయకుమార్ చేతిలో ఉన్న మత్స్యకారులకు సంబంధించిన సంఘం పదవిని ఊడగొట్టారు. ఇక, ఈ శిబిరంలో ఉన్న అంబూర్ ఎమ్మెల్యే బాలసుబ్రమణియన్ తాను అజ్ఞాతంలో లేనని, నియోజకవర్గ ప్రజలతో సంప్రదింపుల్లో ఉన్నట్టుగా మీడియా ముందుకు వ్యాఖ్యానించారు. ఇక, తమ నాయకుడ్ని గురిపెట్టి మంత్రులు, సీఎం స్వరం పెంచడంతో దినకరన్ మద్దతు ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ ఎదురుదాడికి దిగుతూ, దమ్ముంటే బల పరీక్షకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ రెండు శిబిరాల సమరంపై ద్రవిడ కళగంనేత వీరమణి స్పందిస్తూ, ఆత్మలు, కాషాయంలతోనే పాలకుల సంప్రదింపులు అని ఎద్దేవా చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ అయితే, పరస్పరం విమర్శలు, ఆరోపణలతో ముందుకు సాగుతున్న వాళ్లను శాశ్వతంగా సాగనంపేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారని వ్యాఖ్యానించారు. -
పళనీ త్వరలోనే అత్తగారింటికి : దినకరన్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామిని త్వరలోనే అత్తగారింటికి(జైలు)కు పంపిస్తానని అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ అన్నారు. త్వరలో జైలుకు వెళ్లేది ఆయనేనని తాను కాదని తెలిపారు. పళనీస్వామి ఇప్పటికే భయపడుతున్నారని, ఆయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ మొదలుపెడితే ఎక్కడ జైలుకు వెళతారోనని బెంబేలెత్తిపోతున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశంతోనే 19మంది ఎమ్మెల్యేలను డబ్బుతో కొని మీ పక్కన పెట్టుకున్నారని పళనీస్వామి వర్గం ఆరోపిస్తుందని గుర్తు చేయగా.. 'అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో కలిసి నేను బాంబులు పెట్టానని కూడా నా విరోధులు ఆరోపిస్తారు. వాటిని మీరు నమ్ముతారా?(మీడియాను ప్రశ్నిస్తూ).. నమ్మరుగా.. దయచేసి అలాంటి అడగకండి' అంటూ దినకరన్ అన్నారు. -
ఆ ఎమ్మెల్యేలపై ‘వేటు’ వాయిదా
సాక్షి, చెన్నై: టీటీవీ దినకరన్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయాన్ని ఈనెల 20వ తేదీ వరకు వాయిదా వేసినట్లు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ శుక్రవారం ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం నుంచి గట్టేక్కేందుకే తమపై కుట్రపూరితంగా వేటు వేస్తున్నారని కోర్టులో దినకరన్ వర్గ ఎమ్మెల్యే వెట్రివేల్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు రాగా ఈ కేసు 20వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆరోజున కోర్టు తీర్పును అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వ న్యాయవాది చేసిన సూచన మేరకు స్పీకర్ వెనక్కుతగ్గారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలో కుట్రపూరితంగా నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశం చెల్లదని, తాము మరలా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత నేత టీటీవీ దినకరన్ శుక్రవారం చెన్నైలో వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి శశికళ నుంచి ఆదేశాలు పొంది త్వరలో సమావేశం కానున్నట్లు చెప్పారు. ఎడపాడి ప్రభుత్వాన్ని వచ్చేవారం కూల్చివేయడం ఖాయమని డీఎంకేతో కూటమి లేకుండానే ఎడపాడిని సాగనంపుతామని పేర్కొన్నారు. ఇక మైసూరులోని రిసార్టులో ఉన్న దినకరన్వర్గ ఎమ్మెల్యేలకు తమిళనాడు పోలీసుల నుంచి ఇబ్బందులు ఏర్పడకుండా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో గట్టి బందోబస్తు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. -
పళని సర్కార్కు 20 వరకూ గడువు
-
పళని సర్కార్కు 20 వరకూ గడువు
సాక్షి, చెన్నై : ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 20 వరకూ ఎలాంటి బలపరీక్ష నిర్వహించవద్దని న్యాయస్థానం గురువారం ఆదేశించింది. కాగా ప్రభుత్వానికి మెజార్టీ లేదనందున పళనిస్వామి ప్రభుత్వాన్ని బలనిరూపణకు ఆదేశించాలంటూ టీటీవీ దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. పళని ప్రభుత్వం మైనార్టీలో ఉందని, తమదే అసలైన అన్నాడీఎంకే వర్గం తమదేనంటూ టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు .. బలపరీక్ష విషయంలో పళనిస్వామి ప్రభుత్వానికి ఆరురోజుల వెసులుబాటు కల్పించింది. మరోవైపు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కూడా పళిని సర్కార్ను విశ్వాస పరీక్షకు ఆదేశించాలన్న పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు స్టాలిన్తో బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా ఇవాళ సమావేశం అయ్యారు. అయితే తాము మర్యాదపూర్వకంగానే కలిశామని భేటీ అనంతరం హెచ్.రాజా తెలిపారు. కాగా వీరి ఇరువురి సమావేశం చర్చనీయంశంగా మారింది. -
చిన్నమ్మ వద్దు..‘అమ్మ’నే శాశ్వతం
-
చిన్నమ్మ వద్దు.. ‘అమ్మ’నే శాశ్వతం
► పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ తొలగింపు ► జయ శాశ్వత ప్రధాన కార్యదర్శి ► అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో నిర్ణయం ► ప్రభుత్వాన్ని కూలుస్తా: దినకరన్ సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ నుంచి ‘చిన్నమ్మ’ శశికళ, ఆమె కుటుంబీకులను దూరం చేసే ప్రక్రియలో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు మరింత వేగం పెంచారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను మంగళవారం తొలగించారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పార్టీలో శశికళ చేపట్టిన నియామకాలన్నీ చెల్లవని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. గతంలో శశికళ తన మేనల్లుడు దినకరన్ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించడం తెలిసిందే.శశికళ చేసిన నియామకాలు చెల్లవని పార్టీ తీర్మానించడంతో దినకరన్ను నియామకం కూడా రద్దైనట్లైంది. దినకరన్ సృష్టించిన అడ్డంకులను అధిగమించి, హైకోర్టు అనుమతితో కట్టుదిట్టమైన భద్రత నడుమ చెన్నై నగరంలో పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అన్నాడీఎంకేకు శాశ్వత అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్, శాశ్వత ప్రధాన కార్యదర్శి ‘అమ్మ’ జయలలితేననీ, వారి స్థానాలను మరెవ్వరితోనూ భర్తీ చేయకూడదంటూ సమావేశంలో పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. కొత్తగా పార్టీలో కో–ఆర్డినేటర్, జాయింట్ కో–ఆర్డినేటర్ పదవులను సృష్టించి వాటిని వరసగా పన్నీర్సెల్వం, పళనిస్వామిలకు కేటాయించారు. వచ్చే ఎన్నికల వరకు వారు ఈ పదవుల్లో కొనసాగుతారు. కొత్త నిబంధనల ప్రకారం పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఈ పదవుల్లోని వారికి ఉంటుంది. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ అధ్యక్షతన పళని, పన్నీర్ల నేతృత్వంలో సర్వసభ్య సమావేశం జరిగింది. పార్టీలో శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ల ఆధిపత్యాన్ని నిలువరించడమే లక్ష్యంగా పళని, పన్నీర్ల వర్గాలు ఇటీవల ఏకమైన విషయం తెలిసిందే. పళని మాట్లాడుతూ అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడం ఎవరి తరం కాదనీ, వెయ్యి మంది దినకరన్లు వచ్చినా ఏమీ చేయలేరని అన్నారు. జయ ఉన్న సమయంలో ఏయే కట్టుబాట్లు పార్టీలో అమల్లో ఉన్నాయో వాటితోనే ముందుకు సాగుతామని పన్నీర్ పేర్కొన్నారు. సమావేశంలో మొత్తం 14 తీర్మానాలు చేశారు. మదురైలో దినకరన్ మంతనాలు శశికళను పదవి నుంచి తొలగించడంతో ఆమె మద్దతుదారులు పలు చోట్ల ఆందోళనకు దిగారు. పళని, పన్నీర్ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు. మరోవైపు సర్వసభ్య సమావేశం సాగుతుండగానే దినకరన్ మదురైలో తన వర్గం వారితో మంతనాలు సాగించారు. సర్వసభ్య సమావేశాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన శశికళ ఏర్పాటు చేయాల్సి ఉందనీ, కాబట్టి పళని, పన్నీర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం చెల్లదని దినకరన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు సీఎం మార్పు కోసం ప్రయత్నించాననీ, ఇకపై ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తానని దినకరన్ శపథం చేశారు. త్వరలోనే శశికళ ఆదేశాలతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామంటూ ప్రకటించారు. మంగళవారం నాటి సర్వసభ్య సమావేశంలో తీసుకునే నిర్ణయాలనే తీర్పు సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని మద్రాసు హైకోర్టు చెప్పడం తెలిసిందే. శశికళను పదవి నుంచి తప్పించడం చెల్లుతుందో లేదో హైకోర్టే తన తీర్పులో చెబుతుందని దినకరన్ అన్నారు. కాగా, మైసూరులోని ఓ రిసార్ట్లో ఉన్న దినకరన్ వర్గం ఎమ్మెల్యేల్లో ఒకరు... తాము అక్కడ బందీలుగా ఉన్నామంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు సీఎం పళనిస్వామి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేలా విశ్వాస పరీక్ష పెట్టేలా గవర్నర్ను ఆదేశించాలని కోరుతూ ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. -
పళని భేటీకి 111 మంది ఎమ్మెల్యేల హాజరు
చెన్నైః తమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న క్రమంలో తమిళనాడు సీఎం పళనిస్వామి నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి 111 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారని మత్స్య శాఖ మంత్రి, ఏఐఏడీఎంకే నేత డీ జయకుమార్ చెప్పారు. సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలు సైతం ఫోన్లో తమ మద్దతు తెలిపారని వెల్లడించారు. సీఎం నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ సమావేశం తీర్మానం చేసినట్టు తెలిపారు. దినకరన్ శిబిరంలోని తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి మద్దతిస్తామని ఫోన్ ద్వారా సమాచారం అందించారని చెప్పారు. తాజా భేటీతో పళనిస్వామి శిబిరంలో ఉత్సాహం నెలకొందని భావిస్తున్నారు. గత నెల 28న జరిగిన సమావేశానికి కేవలం 75 మంది ఎమ్మెల్యేలే హాజరయ్యారని వార్తలు వచ్చాయి. తాజా పరిణామాలను దినకరన్ వర్గం నిశితంగా పరిశీలిస్తోంది. -
మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయాలు
-
గవర్నర్ ఏం చేస్తారో?
♦‘రాజ్’భవన్కు చేరిన రాజకీయం ♦నేడు కేంద్రహోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో గవర్నర్ చర్చలు ♦పుదుచ్చేరిలో పన్నీర్, దిష్టిబొమ్మల దహనం ♦ఎవరి జాగ్రత్తల్లో వారు అన్నాడీఎంకే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. రాష్ట్రప్రభుత్వ రాజకీయాలు రాజ్భవన్కు చేరుకున్నాయి. సీఎం ఎడపాడి బంతి గవర్నర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎలాంటి నిర్ణయం తీసుకునేనో, బంతిని ఎవరివైపు విసిరేనో అనే ఉత్కంఠ బయలుదేరింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎడపాడి, పన్నీర్వర్గాల విలీనమైన ముచ్చట తీరకముందే దినకరన్ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. ఎడపాడి ప్రభుత్వాన్ని ఏకంగా మైనార్టీలోకి నెట్టివేసింది. పలు రాజకీయ పక్షాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరిగాయి. అవిశ్వాస తీర్మానం పెడతానని ఒకవైపు, బలపరీక్షకు ఆదేశించాలని గవర్నర్పై ఒత్తిడి తెస్తూ మరోవైపు స్టాలిన్ పట్టుదలతో ఉన్నారు. ఇక రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ (బీజేపీ మినహా) స్టాలిన్తో గొంతు కలిపాయి. 19 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించినట్లు దినకరన్ చెబుతుండగా, ముగ్గురు మిత్రపక్ష ఎమ్మెల్యేలు సైతం అదే బాటలో కొనసాగుతున్నారని స్టాలిన్ చెబుతున్నారు. బలపరీక్షకు ఆదేశించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం బుధవారం గవర్నర్కు లేఖ రాశారు. ఐదుగురు ఎమ్మెల్యేలను కూడగట్టుకోకుంటే ఎడపాడి ప్రభుత్వం ఐదు నిమిషాల్లో కూలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోంమంత్రితో గవర్నర్ భేటీ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు గురువారం ఢిల్లీలో కేంద్రహోంమంత్రి రాజ్నా«థ్ సింగ్ను కలుస్తున్నారు. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన తమిళనాడు రాజకీయాలపై ఇరువురూ చర్చించే అవకాశం ఉంది. ఎడపాడి ప్రభుత్వానికి బలపరీక్ష అవకాశం ఇవ్వడమా.. మైనార్టీలో పడిపోయినట్లు స్పష్టంగా తెలుస్తున్నందున ప్రభుత్వాన్ని రద్దుచేసి మరలా ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియకు ఆదేశాలు జారీచేయడమా.. అనే విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేంద్ర మంత్రితో జరుపుతున్న చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది. పది రోజుల్లోగా అసెంబ్లీని సమావేశపరచడం తప్పనిసరి అని అసెంబ్లీ మాజీ కార్యదర్శి సెల్వరాజ్ బుధవారం మీడియాకు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ వెంటనే ఆదేశించాలని, లేనిపక్షంలో ఎమ్మెల్యేలే కోర్టుకెళ్లి ఆదేశాలు తెచ్చుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దిష్టిబొమ్మల దహనం ఇదిలా ఉండగా పన్నీర్సెల్వం, దినకరన్ వర్గాలు పుదుచ్చేరిలో పోటాపోటీగా ఆందోళన చేపట్టాయి. పన్నీర్సెల్వం మద్దతుదారులు ఉదయం నగరంలో ర్యాలీ నిర్వహించి రిసార్టును ముట్టడించారు. ఆ తరువాత దినకరన్ దిíష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే దినకరన్ వర్గం కార్యకర్తలు బు«ధవారం సాయంత్రం రిసార్టు వద్దకు చేరుకుని పన్నీర్సెల్వం, ఎంపీ వైద్యలింగం పొటోలను, దిష్టిబొమ్మలను తగులబెట్టారు. పదవీ ప్రమాణం చెల్లదు : దివాకరన్ అసెంబ్లీలో తగిన మెజార్టీలేని ఎడపాడి ప్రభుత్వంలోకి డిప్యూటీ సీఎం, మంత్రిగా గవర్నర్ చేయించిన పదవీ ప్రమాణ స్వీకారం చెల్లదని శశికళ సోదరుడు దివాకరన్ అన్నారు. కుంభకోణంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఎడపాడి సంఖ్యా బలాన్ని గుర్తించడంలో గవర్నర్ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. స్పీకర్ ధనపాల్ను సీఎం చేస్తే మద్దతు ఇచ్చేందుకు తమ వర్గం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఎడపాడి ప్రభుత్వం కూలిపోకుండా ఎవరూ ఆపలేరని అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి పుహలేంది అన్నారు. -
విలీనం ఓకే..అదే మిలియన్ డాలర్ క్వశ్చన్
చెన్నై:తమిళనాట సంచలనంగా మారిన పళని స్వామి, పన్నీరు సెల్వం విలీనంపై శశికళవర్గం స్పందించింది. విలీనం సంతోషమే...కానీ తమను (టీటీవీ దినకరన్, సరస్వతి) ఎందుకు దూరం పెడుతున్నారని ఏఐఏడీఎంకే నేత సీఆర్ సరస్వతి ప్రశ్నించారు. అదే మిలియన్ డాలర్ల క్వశ్చన్ అని ఆమె మండిపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత తమిళ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. తాజాగా మరో కీలక మార్పుకు నాంది పడింది. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాగైనా పాగా వేయాలని భావించిన శశికళ 'చిన్నమ్మ' వరుస చిక్కుల్లో చిక్కుకుంటుండగా తాజా పరిణామాలు ఆసక్తి కరంగా మారాయి. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీని చీల్చి, భంగపడిన మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం దిగి వచ్చి పళని స్వామితో ఒక అంగీకారాన్ని కుదుర్చుకున్నారు. ఈ మేరకు సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి విలీనానికి ఇరువర్గాలు అంగీకరించినట్టు సోమవారం అధికారింగా ప్రకటించారు. అనంతరం ఇరువురు నేతలు ఎంజీఆర్ మెమోరియల్, మెరినా మెమోరియల్ను సందర్శించి దివంగత మాజీ ముఖ్యమంత్రికి,అమ్మ జయలలితకు నివాళులర్పించారు. అలాగే పార్టీ పదవినుంచి శశికళ తొలగించడంపై పార్టీ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించనున్నట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా పళని స్వామి తెలిపారు. మరోవైపు డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేయగా, పన్నీరు సన్నిహితుడు పాండి రాజన్ కూడా కొత్త క్యాబినెట్లో మంత్రిగా చేరారు. -
సూపర్ స్టార్ రజనీకి సీఎం షాక్!
చెన్నై: రాజకీయ అరంగేట్రంపై సంకేతాలు పంపుతున్న సూపర్స్టార్ రజనీకాంత్పై తమిళనాడు సీఎం పళనిస్వామి సెటైర్లు విసిరారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు ముందుగా ప్రజలకు సేవ చేయాలన్నారు. సినీ నటులు రాజకీయ ప్రకటనలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మనసులు గెలుచుకోకుండా ఎవరూ అందలం ఎక్కలేరని వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని కూలదోయాలని జరుగుతున్న ప్రయత్నాలు ఫలించబోవన్నారు. అమ్మ ఆశీస్సులు ఉన్నంతకాలం తమ ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు. దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్ జయంతోత్సవాల సందర్భంగా పెరంబలూర్లో జరిగిన బహిరంగ సభలో పళనిస్వామి ప్రసంగించారు. -
ఏఐఏడీఎంకేలో విలీనం లేదు: పన్నీర్ సెల్వం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే వర్గాల విలీనానికి ఇక ఎంతమాత్రం తావులేదని ‘అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ’ వర్గ నేత, మాజీ సీఎం పన్నీర్సెల్వం స్పష్టం చేశారు. మధురై జిల్లా ఉసిలంపట్టిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నుండి అనుమతి రాగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు ఉంటాయని అన్నారు. విలీనం కోసం ఏర్పాటు చేసుకున్న కమిటీని రద్దు చేసినందున ఇక ఆ ఆంశాన్ని పక్కనపెట్టేశామని తెలిపారు. శశికళ వర్గంలో చేరాలని తనకు రూ.30 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు పన్నీర్వర్గ ఎమ్మెల్యే మనోహరన్ విరుదునగర్ జిల్లా రాజపాళయంలో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో తెలిపారు. -
అంతా రహస్యం!
► పన్నీరుతో పళని విలీన వ్యూహం ► ఢిల్లీకి దినకరన్ ► కమలనాథులతో ఆశీస్సుల కోసం ప్రయత్నం ► శశికళతో దివాకరన్ ములాఖత్ ► అన్నాడీఎంకేపై పెరిగిన కేంద్రం ఒత్తిడి ► ప్రతిపక్షాల ఆరోపణ ► మా జోక్యం లేదన్న వెంకయ్య సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో రాజకీయం అంతా రహస్యంగా మారుతోంది. రహస్య చర్చలు, మంతనాల్లో గ్రూపులు నిమగ్నమయ్యాయి. కమలం పెద్దల దర్శనంతో వారి ఆశీస్సుల కోసం దినకరన్ ఢిల్లీ బాట పట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, దినకరన్ ఆదిపత్యానికి చెక్ పెట్టడం లక్ష్యంగా పన్నీరుతో రహస్యంగా విలీన చర్చలో పళని తలమునకలై ఉన్నట్టు సమాచారం. ఈ పరిణా మాల నేపథ్యంలో అన్నాడీఎంకే సర్కారుకు మెజారిటీ ఉందా అన్న ప్రశ్నను తెర మీదకు తెస్తూ గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికి ప్రధాన ప్రతి పక్షం సిద్ధమవుతోంది. అన్నాడీఎంకేలోసాగుతున్న రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్కు మద్దతుగా 32 మంది ఎమ్మెల్యేలు కదలడం, ఆ కుటుంబానికి చెందిన దివాకరన్తో మరి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు భేటీకావడం సీఎం పళనిస్వామి ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితిలో దినకరన్ లేదన్న సంకేతాలు కాస్త ఊరట నిచ్చినా, ఎక్కడ కుర్చీకి ఎసరు పెడుతాడోనన్న బెంగ పళనికి తప్పడం లేదు. దినకరన్ ఆధిపత్యానికి చెక్ పెట్టడం లక్ష్యంగా పళనిస్వామి స్వయంగా రంగంలోకి దిగినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. మాజీ సీఎం పన్నీరు శిబిరంతో విలీనం లక్ష్యంగా పావులు కదిపేందుకు వ్యూహ రచన చేశారు. కమిటీలు, మంత్రుల బృందాల ద్వారా చర్చల వ్యవహారాలు బహిర్గతం అవుతుండడంతో రహస్య మంతనాలకు సిద్ధమైనట్టు తెలిసింది. మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవీ శిబిరంతో విలీనం సాగిన పక్షంలో కేంద్రం అండదండాలు మరింతగా తన ప్రభుత్వానికి దక్కడం ఖాయం అన్న నిర్ణయానికి సీఎం వచ్చారు. కేంద్రం సహకారంతో దినకరన్కు చెక్ పెట్టడంతో పాటు ఎమ్మెల్యేలను గాడిలో పెట్టుకోవచ్చన్న నిర్ణయంతో విలీన ప్రయత్నాల వేగవంతానికి పరుగులు తీస్తున్నట్టుగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం వర్గాల్లో చర్చ సాగుతోంది. రహస్యంగా పరుగులు.. విలీన చర్చలు రహస్యంగా సాగడం లక్ష్యంగా పళని నిర్ణయించారు. స్వయంగా పన్నీరు సెల్వంతో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. సీఎంగా తాను కొనసాగేందుకు కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దృష్ట్యా, ఇక, పన్నీరును విలీనం వైపునకు తిప్పుకోవడం లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పన్నీరుకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించడం ద్వారానే ‘విలీనం’ సాధ్యం అవుతుందన్న నిర్ణయాన్ని ఓ సీనియర్ మంత్రి సీఎంకు సూచించినట్టు తెలిసింది. దీంతో పన్నీరుకు ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించేందుకు కొత్త ఎత్తులకు సిద్ధం అవుతోన్నట్టు చర్చ. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, చిన్నమ్మ శశికళ జైల్లో ఉండడాన్ని పరిగణలోకి తీసుకుని ఆమెను ఆ పదవి నుంచి తప్పించి, పార్టీ సాధారణ సభ్యురాలుగా నియమించేందుకు తగ్గ వ్యూహంతో పళని ముందుకు సాగుతున్నట్టు సమాచారం. శశికళను సాధారణ సభ్యురాలుగా చేసిన పక్షంలో ఆమె నియమించిన ఉప ప్రధాన కార్యదర్శి పదవి రద్దు అయ్యేందుకు చాన్స్ ఉందన్న విషయాన్ని పరిగణించారు. విలీనం తదుపరి కేంద్రం అండదండాలతో దినకరన్ను ఒంటరి చేయడం, ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకుని నాలుగేళ్లు సజావుగా ముందుకు సాగే వ్యూహంతో పళని ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక, పళని వ్యూహాలు ఆచరణలో పెట్టే విధంగా పన్నీరు ముందుకు సాగేనా అన్నది వేచి చూడాల్సిందే. కమలం పెద్దల ఆశీస్సుల కోసం: తనకు వ్యతిరేకంగా పళని సర్కారు వ్యూహ రచనల్లో ఉన్న సమాచారంతో ముందస్తు ప్రయత్నాల్లో దినకరన్ ఉన్నట్టుంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆయన ఢిల్లీలో తిష్ట వేసి కమలం పెద్దల దర్శనం, ఆశీస్సుల కోసం ప్రయత్నాల్లో ఉండడం గమనార్హం. గురువారం రాత్రి తన మద్దతుదారులకు కూడా సమాచారం ఇవ్వకుండా దినకరన్ ఢిల్లీకి చెక్కేయడం గమనార్హం. పళనిస్వామిని ఇరకాటంలో పెట్టే రీతిలో కమలం పెద్దలతో సంప్రదింపులు సాగించి, తనకు ఆశీస్సులుఅందించాలని కమలం పెద్దల్ని వేడుకునేపనిలో పడ్డట్టు చర్చ. ఇక, శశికళ సోదరుడు దివాకరన్ పరప్పన అగ్రహార చెరలో సోదరితో ములాఖత్ కావడం గమనార్హం. ఇక్కడి రాజకీయ పరిస్థితులను, దినకరన్కు మద్దతు కదిలిన ఎమ్మెల్యేలు, తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేల గురించి శశికళకు వివరించినట్టు తెలిసింది. ఫిర్యాదుకు ప్రతి పక్షాలు : అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ ఉందా అన్న ప్రశ్నను ప్రతిపక్షాలు తెర మీదకు తెచ్చారు. కేంద్రం గుప్పెట్లో ఆ ప్రభుత్వం ఉన్న దృష్ట్యా, మనుగడ సాగిస్తున్నదని వీసీకే నేత తిరుమావళవన్ విమర్శించారు. ఇక, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ అయితే, జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో తేల్చుకునేందుకు గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక, తమిళనాడు ప్రభుత్వంలో తమ జోక్యమే లేదని మరో మారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. -
మాటల తూటాలు
► స్వరం పెంచిన శిబిరాలు ► పన్నీరు వైపు 12 మంది మంత్రులు ► 32 మంది ఎమ్మెల్యేలు ► సెమ్మలై వ్యాఖ్యతో పళని శిబిరంలో చర్చ ► పన్నీరు మునిగే నావ.. జయకుమార్ ► ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ: ఎంపీ తంబిదురై సాక్షి, చెన్నై : సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరు శిబిరాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు శిబిరాలు స్వరం పెంచి సై...అంటే సై..అన్నట్టుగా విమర్శల దాడిలో మునిగాయి. తమ వైపు వచ్చేందుకు 12 మంది మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు పన్నీరు మద్దతు ఎమ్మెల్యే సెమ్మలై తూటా పేల్చడం చర్చకు దారి తీసింది. ఇక, పన్నీరు ఓ మునిగే నావ అని, చిల్లులు పడ్డ ఆ నావలోకి ఎక్కేవాళ్లు సముద్రంలో గల్లంతు కావడం తథ్యమని పళని శిబిరం మంత్రి జయకుమార్ స్వరం పెంచడం గమనార్హం. అన్నాడీఎంకేలో ఏకమయ్యే విషయంగా సీఎం పళని, మాజీ సీఎం పన్నీరు శిబిరాలు ఇప్పట్లో నిర్ణయాలు తీసుకోవడం అనుమానమే. అదిగో...ఇదిగో చర్చలు అంటూ ఇన్నాళ్లు కాలయాపన సాగింది. ఇప్పుడు ఆ ఊసే లేదు. రెండు రోజుల క్రితం పన్నీరుసెల్వం కాస్త దూకుడు పెంచి స్థానిక సమరానికి ముందే అసెంబ్లీకి ఎన్నికలు తథ్యం అని సంచలన ప్రకటన చేసి చర్చకు తెర లేపారు. ఇక, సోమవారం పన్నీరు శిబిరానికి చెందిన మాజీ మంత్రి కే మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ చర్చల విషయంగా ఇద్దరు మంత్రులు అడ్డు పడుతున్నారని తీవ్రంగా విరుచుకు పడ్డారు.ఆ ఇద్దరు పేర్లను సైతం ప్రకటించారు. ఇది కాస్త ఆ మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, జయకుమార్లకు పుండుమీద కారం చల్లినట్టు అయింది. అదే సమయంలో ఈ పుండు మీద మరింత కారం చల్లే రీతిలో పన్నీరు మద్దతు ఎమ్మెల్యే సెమ్మలై కొత్త బాంబును పేల్చారు. తమ వైపుగా 12 మంది మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేలు చూస్తున్నారని, పన్నీరు సెల్వం సీఎం పదవి చేపట్టాలన్న కాంక్షతో వాళ్లు ఉన్నట్టు వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, శశికళకు పదవీ ఆశ, దినకరన్కు డబ్బు ఆశ మరీ ఎక్కువేనని శివాలెత్తారు.అందుకే ఒకరు పరప్పన అగ్రహారం, మరొకరు తీహార్ జైలుకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. తమకు ఏ ఆశ లేదని అందుకే ప్రజలు తమ పక్షాన నిలబడ్డారని, కేడర్ తమ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. సెమ్మలై వ్యాఖ్యలతో పళని శిబిరం స్వరం పెంచే వాళ్లు పెరిగారు. పన్నీరు మునిగే నావ: పళని శిబిరం మంత్రి జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ పన్నీరు ఓ మునిగే నావ అని ధ్వజమెత్తారు. ఇప్పటికే అందులో చిల్లులు మరీ ఎక్కువయ్యాయని, అందులో ఎక్కిన వాళ్లు సముద్రంలో గల్లంతు కావడం తథ్యమన్నారు. చిల్లుల్ని ఉప్పుతో పూడ్చినట్టుగా సెమ్మలై వ్యాఖ్యలు ఉన్నాయని విరుచుకు పడ్డారు. చర్చలకు రమ్మంటే, తమ మీద నిందల్ని వేస్తూ, అబద్దాల కోరు అని నిరూపించుకుంటున్నారని మండిపడ్డారు. ఇక, ఆ శిబిరానికి చెందిన అన్నాడీఎంకే అధికార ప్రతినిధి అన్భళగన్ పేర్కొంటూ, తామరలోకి రెండాకుల్ని ఇమడ్చడానికి పన్నీరు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్, ఎంపీ తంబి దురై పేర్కొంటూ, పన్నీరు చెప్పినట్టుగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. చర్చలు సామరస్యంగా సాగాలన్నదే తన అభిమతం అని, అయితే, పరిస్థితులు అనుకూలించాల్సి ఉందన్నారు. ఇక, మరో మంత్రి కామరాజ్ అయితే, మరో అడుగు ముందుకు వేసి, పన్నీరు సీఎంగా ఉన్నప్పుడు గుట్టు చప్పుడు కాకుండా సాగించిన అవినీతి బండారం ఇప్పుడు తెరమీదకు వచ్చి తమ మెడకు చుట్టుకునేలా ఉన్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. కాంట్రాక్టర్ శేఖర్రెడ్డిని పరిచయం చేసింది, తెర మీదకు తెచ్చింది పన్నీరుసెల్వమేనని ఆయన ఆరోపిస్తున్నారు. -
15 కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆర్థికసాయం
కేకే.నగర్: విద్యుదాఘాతానికి బలైన 15 మంది కుటుంబీకులకు తలా రూ.3 లక్షలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాట్టాంగళత్తూరుకు చెందిన శేఖర్, మీంజూరుకు చెందిన గోవిందన్, పిల్లూర్కు చెందిన షణ్ముగం, ఆగైతంబి, కన్నన్, చిత్తయ్యన్, యువరాజ్, ఫోర్మెన్గా పనిచేసిన వాసుదేవన్, సీబీ, గుణశేఖరన్, మహిమ, సెల్వ సుందరి, మాయకన్నన్, జానకిరామన్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటనలు తననెంతో బాధించాయన్నారు. రోడ్డు ప్రమాద మృతులకు సంతాపం.. దిండుకల్ సమీపంలో లారీ, ప్రభుత్వ బస్సు ఢీకొన్న ప్రమాదంలో సీనియమ్మాళ్, సంజయ్, సోమసుందరం, నారాయణన్, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందిన వార్త తనకెంతో ఆవేదన కలిగించిందని సీఎం తెలిపారు. గాయపడిన వారికి తలా రూ.50 వేలు, స్వల్పగాయాల పాలైన వారికి తలా రూ. 25 వేలు ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి అందచేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. చిన్నారితో సీఎం ఫొటో.. మదురై నుంచి చెన్నైకు శుక్రవారం విమానంలో సీఎం ఎడపాడి పళనస్వామి వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న తేని జిల్లాకు చెందిన విద్యార్థిని ప్రియదర్శిని సీఎంతో ఫొటో దిగాలని ప్రయత్నించింది. గమనించిన సీఎం చిన్నారితో ఫొటో దిగారు. -
వంతెనలకు ఎంజీఆర్, జయలలిత పేర్లు
మదురైలో రెండు వంతెనలు ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి కేకేనగర్ : మదురైలో కొత్తగా నిర్మించిన రెండు వంతెనలను ఎంజీఆర్, జయలలిత పేర్లతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రారంభించారు. మదురై వైగై నది మీదుగా రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం 2014లో ప్రారంభమైంది. వీటి నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత రూ.30.47కోట్లను కేటాయించారు. అరబ్ పాలయం, అరుళ్ దాస్పురం, సెల్లూర్, తిరుముల్లై రాయర్ పట్టిదురై ప్రాంతాలను కలిపే విధంగా నదిపై వంతెన నిర్మాణం పూర్తయ్యింది. ఆరబ్ పాళయం – అరుళ్దాస్ పురం వంతెనకు జయలలిత పేరు, సెల్లూర్ – తిరుమలైరాయర్ పట్టిదురై వంతెనకు ఎంజీఆర్ పేరు పెట్టారు. మదురైలో చిత్తిరై ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించే దిశగా ఈ కొత్త వంతెనలను ప్రారంభిచడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, మదురైలో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వంతెనలను ప్రారంభించారు. అనంతరం రూ.22.25 కోట్ల విలువైన అభివృద్ధి పథకాలు, సంక్షేమ సహాయకాలను అందజేసి ప్రసంగించారు. విమానం ద్వారా ఆయన శుక్రవారం మధ్యాహ్నం మదురై చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. -
ఇలాగైతే చర్చలు రద్దు: పన్నీర్ సెల్వం
అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యవహరిస్తున్న తీరుపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. తమ డిమాండ్లు నెరవేర్చకుండా ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ఇక విలీన చర్చలకు ఫుల్స్టాప్ పెట్టి ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలని పన్నీర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. విలీన చర్చల కోసం తాము నియమించిన ఏడుగురు సభ్యుల బృందాన్ని కూడా రద్దు చేయాలని యోచిస్తోంది. అన్నాడీఎంకేలో ఉన్న చీలిక వర్గాలు రెండూ కలిసిపోతే పార్టీకి మేలు జరుగుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల గుర్తుమీద పోటీ చేయొచ్చని తలపెట్టిన అగ్రనేతలు.. విలీన చర్చలు మొదలుపెట్టారు. అయితే, పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్లను పళనిస్వామి వర్గం, ఆయన మంత్రులు తేలిగ్గా తీసుకోవడం, వాటిని నెరవేర్చేందుకు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పన్నీర్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. అసలు వాళ్లను తాము ఎలా నమ్మగలమని పన్నీర్ అంటున్నారు. ఒక పక్క చర్చలు జరుగుతుండగానే మరోవైపు వాళ్లు శశికళ, టీటీవీ దినకరన్ల పేర్లతో కూడిన ఒక అఫిడవిట్ను ఎన్నికల కమిషన్కు సమర్పించి, రెండాకులు గుర్తు కావాలంటున్నారని.. అసలు వాళ్లకు విలీనం కావాలని ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ముఖ్యమంత్రి ఈపీఎస్ మాత్రం తాము బేషరతు చర్చలకు సిద్ధంగానే ఉన్నామంటున్నారు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారు కాబట్టి.. రెండాకుల గుర్తు కూడా తమకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శశికళ, దినకరన్లను తాము పక్కకు పెడతామని ఈపీఎస్ చెబుతున్నా.. వాళ్లను పూర్తిగా పార్టీ నుంచి బహిష్కరించాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తోంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం మీద సీబీఐ విచారణ జరిపించాలన్నది కూడా ఆ వర్గం ప్రధాన డిమాండ్లలో ఒకటి. కానీ ఇది కోర్టు పరిధిలో ఉందని సీఎం అంటున్నారు. దానికి తోడు మంత్రులు, ముఖ్యమంత్రి కూడా చర్చల సందర్భంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలాగైతే తాము ఎందుకు సహించి భరించాలని పన్నీర్ వర్గం అంటోంది. దాంతో.. ఇక చర్చలకు ఫుల్స్టాప్ పెట్టి, ఈనెల 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వర్గం బలాన్ని పెంచుకోవాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు. -
పళనికి పన్నీరు సెల్వం షరతు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గాల విలీనంపై అన్నాడీఎంకేలో హైడ్రామా కొనసాగుతోంది. పన్నీరు సెల్వం వర్గం స్వరం పెంచడంతో చర్చలపై మళ్లీ సందిగ్ధత ఏర్పడింది. శశికళ, ఆమె బంధువు దినకరన్లను పార్టీ నుంచి బహిష్కరించినట్టు అధికారికంగా ప్రకటించాలని, జయలలిత మృతిపై విచారణకు ఆదేశించాలని పన్నీరు వర్గీయులు డిమాండ్లు చేస్తున్నారు. ఆ తర్వాతే విలీనం, పార్టీ బాధ్యతలపై చర్చలకు వెళతామని సెల్వం వర్గీయులు మునుస్వామి, సీహెచ్ పాండియన్ షరతు విధించారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై చర్చలంటూనే అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిని పన్నీరు సెల్వంకు అప్పగించాలని ఆయన వర్గీయులు మరో డిమాండ్ చేస్తున్నారు. జయలలిత నియమించినందున సీఎం పదవి తనకే దక్కాలని సెల్వం భావిస్తున్నారు. కాగా సీఎం పదవి ఇచ్చేదిలేదని పళనిస్వామి వర్గం తెగేసి చెబుతోంది. పళనిస్వామికి 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఆయనే సీఎంగా కొనసాగుతారని తంబిదురై స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య విలీన చర్చలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. -
పెట్రో మంటలు
► వ్యాట్ పన్ను పెంపు ► అధికారపక్షంపై భగ్గుమన్న విపక్షం ► పెట్రోలు లీటరు రూ.74.39 ► డీజిల్ లీటరు రూ.62.49. వేసవి తీవ్రత పెరగకముందే రాష్ట్రం పెట్రో మంటలతో మండిపోతోంది. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ పన్ను పెరగడమే ఈ మంటలకు కారణం. ప్రజలపై ప్రభుత్వం మోపిన పెట్రోభారంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన వ్యాట్ పన్ను పెంపు వల్ల లీటరు పెట్రోలు ధర రూ.70.61 నుంచి రూ.74.97లకు, లీటర్ డీజిల్ ధర రూ.60.73లకు పెరిగింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అన్నీ సంచలనాలే. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 15 రోజుల్లోగా విశ్వాసపరీక్షలో నెగ్గాలని గవర్నర్ ఆదేశించగా, ఆలసించిన ఆశాభంగం అనుకున్నారో ఏమో మూడోరోజనే బలపరీక్షకు సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎడపాడి విశ్వాసపరీక్ష నుంచి గట్టెక్కారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత చాంబర్లో కూర్చుని ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ ఇచ్చిన హామీలపై దృష్టి సారిస్తూ తొలి ఐదు సంతకాలు చేశారు. ఇలా అడుగడుగునా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సీఎం ఎడపాడి తాజాగా పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు కారణమై మరో చర్చకు తెరదీశారు. పెట్రోలుపై ప్రస్తుతం 27 శాతంగా ఉన్న వ్యాట్ పన్నును 34 శాతానికి పెంచారు. అలాగే డీజిల్పై వ్యాట్ పన్నును 21.43 శాతం నుంచి 24 శాతానికి పెంచారు. రాష్ట్రప్రభుత్వ స్థాయిలో తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఉరుములేని పిడుగులా ఒక్కసారిగా పెరిగిపోయాయి. లీటరు పెట్రోలుపై రూ.3.78 లు, లీటరు డీజిల్పై రూ.1.76 అదనపు భారం పడింది. ప్రజల దిగ్భ్రాంతి.. ప్రతిపక్షాల ఆగ్రహం: పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గినా, పెరిగినా సహజంగా కేంద్ర పరిధిలో సాగుతుంది. అయితే రాష్ట్రప్రభుత్వం కారణంగా రాత్రికి రాత్రే పెట్రోలు, డీజిల్ ధరలు మోతమోగ డంపై ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంపు చేపల వేట, రవాణా, పర్యాటక, పారిశ్రామిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అంతేగాక అన్నిరకాల వృత్తులను బాధించగలదని ఆరోపిస్తున్నారు. బియ్యం, పప్పులు, నూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోగలవని అంటున్నారు. మధ్య, కింది తరగతి ప్రజలను తీవ్రంగా బాధించగలదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు రాష్ట్రంలో బినామీ ప్రభుత్వం కారణం కావడం శోచనీయమని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ఎద్దేవా చేశారు. ఈ అరాచక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రగతిని తిరోగమన బాటపడుతుందని విమర్శించారు. పెంచిన వ్యాట్ పన్నును ఉపసంహరించేలా తాము అసెంబ్లీలో పోరాడుతామని చెప్పారు. పీఎంకే అ«ధినేత డాక్టర్ రాందాస్, తమాకా అధ్యక్షుడు జీకే వాసన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తీవ్రంగా ఖండించారు. తమిళనాడు పెట్రోలు, డీజిల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యాట్ పన్నును విపరీతంగా పెంచారని తెలిపారు. ఏ కారణం చేత వ్యాట్ పన్నును పెంచాలి్సవచి్చందో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో పెట్రోలు ధర తమిళనాడు కంటే రూ.6 తక్కువగా ఉందని అన్నారు. తమిళనాడు వ్యవసాయ సంఘం సంయుక్త కార్యాచరణ సమితి అధ్యక్షుడు పీఆర్ పాండియన్ మాట్లాడుతూ ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదో అర్థం కావడం లేదని ఆక్షేపించారు. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఎన్నడూ వ్యాట్ పన్నును పెంచలేదని ఆయన గుర్తు చేశారు. వ్యాట్పన్ను పెంపును ఎంతమాత్రం అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు ఇసుక లారీల యజమానుల సంఘం సమ్మేళన్ అధ్యక్షుడు చెల్ల రాజామణి, వ్యాపార సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మురుగయ్యన్ తీవ్రంగా ఖండించారు. -
తమిళనాడు ముఖ్యమంత్రికి నోటీసులు
-
తమిళనాడు ముఖ్యమంత్రికి నోటీసులు
చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షపై ప్రతిపక్ష డీఎంకే దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సహా, హోంసెక్రటరీ, అసెంబ్లీ స్పీకర్తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మార్చి 10లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తులు జస్టిస్ జి.రమేష్, మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కాగా ఈ నెల 18న అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా శాసనసభ నియమాలను అనుసరించి జరగలేదని పేర్కొంటూ డీఎంకే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. బల పరీక్షలో భాగంగా రహస్య ఓటింగ్ను కోరినా స్పీకర్ ధన్పాల్ పట్టించుకోకుండా తమను సభ నుంచి బయటకు గెంటేశారని, ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభలో జరిగిన విశ్వాస పరీక్ష ఏ రకంగానూ చెల్లదంటూ తన పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. మరోవైపు బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఇప్పటికే తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్రావు నివేదిక కోరారు. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. -
ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగే పన్నీర్ సెల్వం కూడా!
-
తమిళనాట ముగియని రాజకీయ సంక్షోభం
-
ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగే పన్నీర్ సెల్వం కూడా!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ప్రజాక్షేత్రంలోకి బయల్దేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్, తమిళనాడు మాజీ సీఎం దివంగత ఎంజీ రామచంద్రన్ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని ఓపీఎస్ తలపెట్టారు. ఇందుకోసం ఒక ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. మహీంద్రా జీపును కొంత మార్పు చేర్పులు చేయించుకుని ఆయన రెడీ చేయించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే బలపరీక్ష నిర్వహించి, పళని స్వామి నెగ్గినట్లుగా ప్రకటించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మంత్రివర్గంలో పనిచేయడంతో పాటు ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వాన్ని స్వయంగా అమ్మే ముఖ్యమంత్రిగా నియమించారు. అయినా ఆమె కుర్చీలో కూర్చోకుండా.. అందులో జయలలిత ఫొటోను మాత్రం ఉంచి, ఆయన పక్కన వేరే కుర్చీలో కూర్చున్న సంగతి తెలిసిందే. పన్నీర్ సెల్వానికి ప్రజల్లో మంచి స్పందన లభించింది. సామాన్య ప్రజలు ఆయన పట్ల ఆదరణ కనబర్చినా, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోలేకపోవడం.. అసెంబ్లీలో పరిణామాలు చకచకా మారిపోవడంతో పన్నీర్ సెల్వం తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి, వాళ్ల మద్దతు కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. -
ఆ ఎమ్మెల్యేలకు గాలం..
చెన్నై: పన్నీరు వెన్నంటి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్ని, 12 మంది ఎంపీలను తమ వైపుకు తిప్పుకునేందుకు తగ్గ కసరత్తుల్లో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వ్యూహరచనల్లో పడ్డారు. ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ ఆదేశాను సారంగా ఎమ్మెల్యేలను ఆహ్వానించడమా లేదా పదవీ గండం తప్పదన్న హెచ్చరికతో బలవంతంగా తిప్పుకోవడమా అన్న అస్త్రాల్ని ప్రయోగించేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో పన్నీరును వీడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యేలు తేల్చడం విశేషం. అమ్మ జయలలిత మరణంతో అన్నాడీఎంకే రెండుగా చీలింది. చిన్నమ్మ శశికళ శిబిరం, అమ్మ విధేయుడు పన్నీరు శిబిరంగా కార్యకర్తలు చీలారు. అధికారం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు సాగినా, స్పీకర్ ధనపాల్ రూపంలో క్యాంప్ రాజకీయాలతో చిన్నమ్మ విధేయుడు పళనిస్వామికి బలం సమకూరింది. చిన్నమ్మ వీరశపథాన్ని నెరవేర్చామన్న ఆనందంలో ఉన్న టీటీవీ దినకరన్, ఇక, పన్నీరును ఒంటరి చేయడం లక్ష్యంగా వ్యూహ రచనల్లో పడ్డారు. పన్నీరు వెన్నంటి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలను మళ్లీ తమ వైపునకు తిప్పుకోవడం లక్ష్యంగా కసరత్తుల్ని వేగవంతం చేశారు. ప్రభుత్వం తమ చేతిలో ఉన్న దృష్ట్యా, ఇటువైపుగా వస్తే భవిష్యత్తు బాగుటుందని, లేనిపక్షంలో పాతాళంలోకి నెట్టడం ఖాయం అన్న బెదిరింపు ధోరణితో ముందుకు సాగేందుకు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళతో భేటీ అనంతరం ఆమె ఆదేశానుసారంగా ఆహ్వానం పలకడం లేదా, పదవీ గండాన్ని సృష్టించే విధంగా హెచ్చరికలతో ముందుకు సాగేందుకు నిర్ణయించినట్టు ఆ శిబిరంలో చర్చ సాగుతోంది. ప్రధానంగా తమకు ఎమ్మెల్యేల మద్దతు కీలకంగా ఉన్న దృష్ట్యా, 11 మంది ఎమ్మెల్యేలను గురిపెట్టి గాలం వేయడానికి తీవ్ర ప్రయత్నాలు సాగించే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. కేవలం మెజారిటీ నలుగురే ఉన్నందున, డీఎంకే ఎత్తుగడల్ని ఢీకొట్టాలంటే, అటు వైపుగా ఉన్న వాళ్లను ఇటువైపు రప్పించుకోవడం ద్వారా సాధ్యమన్న భావనతో దినకరన్ అడుగులు వేస్తున్నట్టు పేర్కొంటున్నారు. అమ్మ డీఎంకేతో ముందుకు: అధికారం చిన్నమ్మ శిబిరం చేతికి చేరినా, ఎక్కువ కాలం ఈ ప్రభుత్వం కొనసాగేనా అన్న అనుమానాల్ని వ్యక్తం చేసే వాళ్లు రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నారు. ఆ దిశగా ఈ ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా తమ వైపు నుంచి పన్నీరు శిబిరంలోని ఎమ్మెల్యేలు ప్రయత్నాలు వేగవంతం చేయడానికి నిర్ణయిం చినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు శిబిరం నుంచి బయటకు వచ్చి ఉండడంతో, తమ సన్నిహితుల ద్వారా తమకు మద్దతుగా నిలిచేందుకు ఇది వరకు నిర్ణయించిన వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. చిన్నమ్మ అధికారాన్ని ఢీకొట్టే విధంగా పార్టీ రెండాకుల చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ ద్వారా చేజిక్కించుకునే ప్రయత్నాలు వేగవంతం చేయడం లేదా, అమ్మ డీఎంకే నినాదంతో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే వ్యూహంతో పన్నీరు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం మద్దతు ఇస్తుండడం ఆహ్వానించదగ్గ విషయం. పన్నీరు వెన్నంటే: ఎన్ని బెదిరింపులు వచ్చినా, అడ్డంకులు ఎదురైనా పన్నీరు వెంట నడిచేందుకు 11 మంది ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అసెంబ్లీలో స్పీకర్ వ్యవహరించిన తీరును, ప్రధాన ప్రతి పక్షం మీద జరిగిన దాడిని రాజ్భవన్లో గవర్నర్ విద్యాసాగర్రావుకు పన్నీరు సెల్వం నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం ఫిర్యాదు చేసింది. బలపరీక్ష ప్రజా స్వామ్యానికి విరుద్ధంగా జరిగిందని, దీనిని అంగీకరించ వద్దు అని, మళ్లీ బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. అనంతరం పన్నీరు సెల్వం తరఫున ఎమ్మెల్యే, మాజీ మంత్రి పాండియరాజన్ మీడియాతో మాట్లాడారు.మరో రోజు బలపరీక్షకు స్పీకర్ చర్యలు తీసుకుని ఉండాల్సిందని, అయితే, ప్రధాన ప్రతి పక్షంతో పాటు, కాంగ్రెస్ సభ్యులు సైతం సభలో లేని సమయంలో ఓటింగ్ నిర్వహించారని మండిపడ్డారు. అన్ని వివరాలను, ఆధారాలను గవర్నర్ ముందు ఉంచామన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పన్నీరు వెంట ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. త్వరలో మంచి నిర్ణయం వెలువడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
పళని బలపరీక్ష చెల్లదు!
మద్రాస్ హైకోర్టులో డీఎంకే పిటిషన్ బలపరీక్ష రద్దు చేయాలని విజ్ఞప్తి చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో గత శనివారం నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కోర్టుకెక్కింది. ప్రతిపక్షాలు లేకుండానే అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్ష చెల్లదని ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ నుంచి డీఎంకే సభ్యులను బలవంతంగా గెంటేసిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించింది. బలపరీక్షలో భాగంగా రహస్య ఓటింగ్ను చేపట్టాలని కోరినా స్పీకర్ ధన్పాల్ పట్టించుకోలేదని, తమను సభ నుంచి బయటకు గెంటేశారని, మార్షల్స్ తమపై దాడికి పాల్పడ్డారని డీఎంకే పిటిషన్లో ఆరోపించింది. ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభలో జరిగిన విశ్వాస పరీక్ష ఏ రకంగానూ చెల్లదని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా స్వీకరించాలని డీఎంకే తరపు న్యాయవాది కోరగా మంగళవారం విచారణ చేపడతామని న్యాయమూర్తులు జస్టిస్ జి.రమేష్, మహదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఇప్పటికే తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్రావు నివేదిక కోరిన సంగతి తెలిసిందే. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. శాసనసభలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర నాటకీయ పరిణామాలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు సభలో విధ్వంసానికి దిగడంతో అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి గెంటేసి.. విపక్షం లేకుండానే స్పీకర్ విశ్వాస పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాసపరీక్షలో 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పళనిస్వామి గట్టెక్కారు. అయితే, స్పీకర్ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్కు ఆయన అంగీకరించలేదని, తమను బలవంతంగా సభ నుంచి తరిమేశారని స్టాలిన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ అంశంపై న్యాయపోరాటం చేయాలని డీఎంకే నిర్ణయించింది. అందులో భాగంగానే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
బ్రేకింగ్: పళని బలపరీక్ష చెల్లదు!
-
బలపరీక్ష గలాటాపై స్పందించిన గవర్నర్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో శనివారం బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఆ రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్రావు స్పందించారు. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదివారం ఆదేశించారు. శనివారం శాసనసభలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర నాటకీయ పరిణామాలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు సభలో విధ్వంసానికి దిగడంతో అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి గెంటేసి.. విపక్షం లేకుండానే స్పీకర్ విశ్వాస పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాసపరీక్షలో 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పళనిస్వామి గట్టెక్కారు. అయితే, స్పీకర్ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్కు ఆయన అంగీకరించలేదని, తమను బలవంతంగా సభ నుంచి తరిమేశారని స్టాలిన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తొలిసారి స్పందించిన గవర్నర్ బలపరీక్ష సందర్భంగా సభలో జరిగిన పరిణామాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
మెరీనా బీచ్లో హై డ్రామా!
-
చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్
సాక్షి, చెన్నై: ‘‘శాసనసభలో బల పరీక్షలో గెలుపుతో అమ్మ జయలలిత సమాధి సాక్షిగా చిన్నమ్మ శశికళ చేసిన వీర శపథం నేరవేర్చాం’’ అని అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన శనివారం ముఖ్యమంత్రి పళనిస్వామితో కలిసి మెరీనా బీచ్ తీరంలో ఉన్న జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం పోయెస్ గార్డెన్కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. పన్నీర్ సెల్వం చేత చిన్నమ్మ ఎందుకు రాజీనామా చేయించారన్న ప్రశ్నకు అసెంబ్లీలో జరిగిన తాజా పరిణామాలే సమాధానమని పేర్కొన్నారు. ప్రతిపక్ష డీఎంకేతో కలిసి అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పన్నీర్సెల్వం కుట్రకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పన్నీర్కు డీఎంకేతో రహస్య సంబంధాలున్నాయన్న విషయాన్ని గుర్తించి పదవి నుంచి తప్పించారేగానీ, చిన్నమ్మ సీఎం కావాలన్న ఆశతో మాత్రం కాదన్నారు. పార్టీ వర్గాల ఒత్తిడి, జరుగుతున్న పరిణామాలను ఎదుర్కొనేందుకే ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, నేతలంతా ఐక్యతతో ప్రజా సంక్షేమంపై దృష్టి సారిస్తామని, అమ్మ చూపిన మార్గంలో సుపరిపాలనే లక్ష్యంగా ముందుకు సాగుతామని దినకరన్ వెల్లడించారు. బల పరీక్షలో పళనిస్వామి నెగ్గడంతో రాష్ట్రవ్యాప్తంగా శశికళ మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. -
గవర్నర్కు లేఖను సంధించిన స్టాలిన్
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష, ఆ తదనంతర పరిణామాలపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్రావుకు లేఖ రాశారు. డీఎంకే లేకుండా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి.. దొడ్డిదారిలో ముఖ్యమంత్రిని గెలిపించడమే స్పీకర్ అజెండా అని ఆయన లేఖలో దుయ్యబట్టారు. తమిళనాడులో ప్రజాస్వామిక విలువలను కాపాడాలని ఆయన తన లేఖలో కోరారు. బలపరీక్షను వాయిదా వేసి రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహించాలని కోరారు. శాసనసభ వేదికగా జరిగిన బలపరీక్ష సందర్భంగా రోజంతా జరిగిన నాటకీయ పరిణామాలలో స్టాలిన్ కేంద్రబిందువుగా నిలిచారు. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో స్టాలిన్తో సహా డీఎంకే సభ్యులను మార్షల్స్ బలవంతంగా గెటేంసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చొక్కా చినిగిపోయింది. దీంతో బొత్తాలు లేని చినిగిన చొక్కాతోనే మొదట గవర్నర్ను కలిసిన స్టాలిన్ ఆ వెంటనే మెరీనా బీచ్కు వెళ్లి దీక్షకు దిగారు. రోజంతా సాగిన ఈ రాజకీయ డ్రామాలో స్టాలిన్ బాగానే హల్చల్ చేశారు. ఇటు మీడియాలోనూ, ప్రజల దృష్టిలోనూ బలపరీక్ష ఘట్టంలో ఆయన కేంద్రబిందువు అయ్యారు.