palm oil
-
భారీగా పడిపోయిన పామాయిల్ దిగుమతులు
భారత్ పామాయిల్ దిగుమతులు 2025 జనవరిలో 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. అదే సమయంలో సోయా దిగుమతులు భారీగా పెరిగాయి. సోయా దిగుమతులు మునుపటి సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ నమోదయ్యాయి. పామాయిల్ శుద్ధి చేసేందుకు అయ్యే ఖర్చు.. దానివల్ల సమకూరే మార్జిన్లు సోయా దిగుమతులకు కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. పామాయిల్ దిగుమతులు పడిపోవడానికిగల కొన్ని కారణాలను విశ్లేషిస్తున్నారు.దిగుమతి చేసుకున్న పామాయిల్ రిఫైనింగ్ మార్జిన్లు తక్కువగా ఉంటున్నాయి. చాలా కంపెనీల రెవెన్యూపై దీని ప్రభావం పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని ప్రాంతాలు పామాయిల్ ధరలను టన్నుకు 80-100 డాలర్లు తగ్గించాయి. అయినప్పటికీ దిగుమతులు మందగించాయి. ఇండోనేషియా, మలేషియా వంటి ప్రధాన పామాయిల్ ఉత్పత్తి దేశాలు ఎగుమతి సరఫరాలను కఠినతరం చేశాయి. ఇది సోయా నూనె వైపు మళ్లడానికి మరింత ప్రోత్సహించింది. ప్రపంచంలోనే అత్యధికంగా కూరగాయల నూనె(ఎడిబుల్ ఆయిల్)లను కొనుగోలు చేస్తున్న భారత్ పామాయిల్ దిగుమతులు తగ్గడం ప్రపంచ మార్కెట్లపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్ నుంచి డిమాండ్ తగ్గడంతో మలేషియా పామాయిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2025.. అర్హతలివే..ఫిబ్రవరిలో పామాయిల్ దిగుమతులు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అవి సాధారణం కంటే తక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు. సోయా దిగుమతులు కొద్దిగా తగ్గవచ్చని, సన్ఫ్లవర్ నూనె దిగుమతులు స్వల్పంగా పెరగవచ్చని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) అంచనా వేసింది. -
పామాయిల్ సాగుతో ఎకరానికి ఏటా రూ. లక్ష నికరాదాయం
సాక్షి, హైదరాబాద్: పామాయిల్ సాగు విస్తరణ ద్వారానే వంట నూనెల ఉత్పత్తిలో మన దేశం స్వావలంబన సాధించగలుగుతుందని, రైతులకు ఎకరానికి ఏటా కనీసం రూ. లక్ష నికరాదాయం వస్తుందని పామాయిల్ సాగు నిపుణులు, తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారు డాక్టర్ బి.ఎన్.రావు చెప్పారు. ‘ఆయిల్పామ్ సాగు, ప్రాసెసింగ్ - ఆహార, ఆహారేతర రంగాల్లో ఉపయోగాలు’ అనే అంశంపై తార్నాకలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో జరిగిన జాతీయ సమావేశంలో శనివారం సాయంత్రం జరిగిన చర్చాగోష్టిలో డా. రావు మాట్లాడారు. ఏయే ఇతర పంటల్లో లేని విధంగా ఆయిల్పామ్లో రైతులకు నిరంతర ఆదాయం వస్తుందని ఆయన అన్నారు.అయితే, ఏడాది పొడవునా కాలువ / బోరు నీటి సదుపాయం పుష్కలంగా ఉండి, 30 ఏళ్ల పాటు నీటి సమస్య ఉండదనుకున్న రైతులే పామాయిల్ సాగు చేపట్టాలని సూచించారు. పామాయిల్ ఉత్పత్తికి సంబంధించిన శాస్త్రవేత్తలు, ప్రాసెసింగ్ శాస్త్రవేత్తలు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీసీఎంబీ విశ్రాంత ప్రిన్సిపల్ సైంటిస్ట్, అగ్రి-హార్టీకల్చర్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఏవీ రావు మాట్లాడుతూ వాతావరణ మార్పులు, నిపుణుల కొరత, పరిశోధనల లేమి కారణంగా పామాయిల్ సాగులో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. మలేషియాలో మాదిరిగా ఇక్కడ దిగుబడులు రావాలని లేదన్నారు.శాస్త్రవేత్తలు, నూనె పరిశ్రమదారులు పామాయిల్ రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ ఉద్యానశాఖ ఏడీ డాక్టర్ లహరి మాట్లాడుతూ తెలంగాణలో పామాయిల్ సాగు 29 జిల్లాల్లో జరుగుతోందన్నారు. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ. 20,506 ఉందని చెబుతూ, ప్రభుత్వం నిర్ణయించే ధరలకే కంపెనీలు కొనుగోలు చేస్తాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సీనియర్ శాస్త్రవేత్త డా. అహ్మద్ ఇబ్రాహిం మాట్లాడుతూ వంట నూనెలు ఎన్ని ఉన్నా దేనికి ఉండే ప్రత్యేకతలు దానికి ఉన్నాయన్నారు. ఏదో ఒక వంట నూనెనే వాడటం మంచిదికాదన్నారు. మళ్లీ మళ్లీ వంటనూనెలను మరిగించి వినియోగించటం ఆరోగ్యకరం కాదంటూ, ఎన్ఐఎన్ మార్గదర్శకాలను పాటించాలన్నారు. అధ్యక్షతవహించిన ఎస్.కె. పట్నాయక్ మాట్లాడుతూ వంట నూనెల రంగంలో ప్రతిబంధకాలను అధిగమిస్తే స్వావలంబనకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. -
పామాయిల్ సాగు చేయండి.. దర్జాగా బతకండి
నల్లగొండ: రైతులు పామాయిల్ సాగు చేస్తే.. మీసం మీద చేయి వేసుకుని దర్జాగా బతకొచ్చని వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. బుధవా రం నల్లగొండలోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కె ట్లో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పామాయిల్ పంట తక్కువ నీటితో సాగవుతుందని చెప్పారు. తాను వంద ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నానని.. మీరు మంత్రి కోమటిరెడ్డిని వెంటబెట్టుకుని వచ్చి చూడవచ్చని రైతులకు సూచించారు. నల్లగొండ జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తే.. ఇక్కడే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని.. మిగిలిన రుణమాఫీని కూడా చేయా లని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం ఎటు పోయిందో.. ఎవరు తిన్నారో కూడా తెలియదని.. రూ.50 వేల కోట్ల అప్పులయితే ఉన్నాయని చెప్పా రు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినవారే ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని విమర్శించారు. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నా మని.. ఆ ధాన్యం కొనుగోలు చేసి రేషన్ కార్డు దారులకు, హాస్టళ్లకు బియ్యం సరఫరా చేస్తామ న్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మళ్లీ మంత్రిగా రావడంతోనే సొరంగ మార్గం పనులు మొద లయ్యాయని, ఆయన హయాంలోనే సొరంగ మార్గం పూర్తవుతుందని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేకపోయిందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని చెప్పారు. -
పామాయిల్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదా? ఎందుకని?
పామాయిల్ అనేది పామ్ పండ్ల నుంచి తీసే ఒక రకమైన కూరగాయ నూనె ఇది. దీన్ని ప్రాసెసింగ్ చేసే ఆహారపదార్థాల్లోనూ, సౌందర్య సాధనాలు, గృహోపకరణాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. తక్కువ ధరలోనే లభించే నూనె కావడంతో చాలామంది దీన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అయితే పామాయిల్ ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతుంటారు. అదీగాక ఈ పామాయిల్ చెట్ల పెంపకం అటవీ నిర్మూలన, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు వంటి పర్యావరణ నష్టాలతో ముడిపడి ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అసలు నిజంగానే ఈ పామాయిల్ ఆరోగ్యానికి మంచిది కాదా? ఎందువల్ల? తదితరాల గురించి సవివరంగా చూద్దాం. ఎలా ఆరోగ్యానికి హానికరం అంటే..ఇందులో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి సుమారు 50% వరకు ఉంటాయి. అందువల్ల దీన్ని అధికంగా ఉపయోగిస్తే శరీరంలో ఎల్డీఎల్ అనే చెడు కొలస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన పామాయిల్లో సంభావ్య ట్రాన్స్ఫ్యాట్స్లు ఏర్పడతాయి. ఇవి గుండెజబ్బులు, మంట, ఇన్సులిన్ నిరోధకతతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.అంతేగాదు అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్రాసెస్ చేయడం వల్ల ఆ ఆయిల్లో ఆరోగ్యానికి హానికరమైన కలుషితాలు ఉత్పత్తి అవుతాయి. ఈ సమ్మేళనాలు కేన్సర్ కలిగించేవని పరిశోధనల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు జంతు అధ్యయనంలో మూత్రపిండాలు, కాలేయం సంబంధ సమస్యలను కలిగిస్తుందని తేలిందని వెల్లడించారు. కొన్ని అధ్యయనాల్లో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్లో ఈ పామాయిల్ శరీరంలో మంటను పెంచుతుందని తేలింది కూడా. దీర్ఘకాలిక మంట అనేది గుండె జబ్బులు, మధుమేహం, కేన్సర్లతో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పామాయిల్ను కలిగి ఉండే ఆహారాలు తరుచుగా ప్రాసెస్ చేసినవి, కేలరీలు దట్టమైనవి. అందువల్ల తరుచుగా ఇవి తినడం వల్ల బరువు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది. పైగా టైప్ 2 మధుమేహం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే పామాయిల్ ఉత్పత్తి ప్రక్రియలో పురుగుమందుల అవశేషాలు, ఇతర పర్యావరణ కలుషితాలు కలిగి ఉండవచ్చు. ఇది ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది. ముడి పామాయిల్లో విటమిన్ ఈ, బీటా కెరోటిన్ వంటి ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి. అయినప్పటికీ ఆహార ఉత్పత్తులలో ఉపయోగించే చాలా పామాయిల్ శుద్ధి చేయబడిందే. దీనిలో ప్రయోజనకరమైన పోషకాలు ఉండనే ఉండవని చెబుతున్నారు. పామాయిల్ మితంగా వినియోగిస్తే సమతుల్య ఆహారంలో భాగం కావచ్చు. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు. అయితే ఏదీఏమైనా పామాయిల్ కంటే ఆలివ్, కొబ్బరి లేదా అవకాడో వంటి ఆరోగ్యకరమైన వంట నూనెలకే ప్రాధాన్యత ఇవ్వమని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: పీసీఓసీ ఉంటే పాల ఉత్పత్తులు నివారించాలా..?) -
ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు మంచి లాభాలు
-
‘పామ్’ తోటల ఖమ్మం
సాక్షిప్రతినిధి, ఖమ్మం : రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ పామ్ సాగుకు చిరునామాగా మారుతోంది. గత పదిహేనేళ్లుగా పామ్ తోటలు సాగుచేసే రైతులు నెమ్మదిగా పెరుగుతున్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా పామాయిల్కు డిమాండ్ ఉండటంతో ప్రభుత్వం కూడా రైతులకు రాయితీలు కల్పిస్తూ ఈ పంట సాగును ప్రోత్సహిస్తోంది. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఖమ్మంలో 17,834 ఎకరాల్లో రైతులు పామాయిల్ సాగు చేయగా.. ప్రస్తుతం అది 73,938 ఎకరాలకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఈ పంట సాగు ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో సాగుకు అనుకూలమైన వాతావరణం, నేలలు ఉండటంతో ఒక వైపు పంట సాగు విస్తరిస్తుండగా, పామాయిల్ను ఉత్పత్తిచేసే ఫ్యాక్టరీలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేటల్లో టీఎస్ ఆయిల్ఫెడ్ కంపెనీ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసింది. అలాగే కొత్తగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మరో ఐదు వరకు ఫ్యాక్టరీలు రానున్నాయి. సాగు విస్తీర్ణం పెంపుపై ప్రభుత్వాల దృష్టి.. గ్లోబల్ ఈడిబుల్ ఆయిల్ మార్కెట్లో వ్యాపారం సాగే తొమ్మిది ప్రధాన నూనెల్లో పామాయిల్ ఒకటి. కాగా, ప్రపంచ మార్కెట్లో ఇండోనేసియా, మలేసియా మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రపంచ ముడి పామ్ ఆయిల్ ఉత్పత్తిలో ఈ రెండు దేశాల నుంచి 90 శాతం వరకు వాటా ఉంది. ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలోనూ పామాయిల్కు డిమాండ్ పెరగడంతో ఇక్కడ కూడా సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రస్తుతం తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగవుతోంది. 2020 వరకు తెలంగాణలో టీఎస్ ఆయిల్ఫెడ్, గోద్రెజ్ ఆగ్రోవెట్, రుచిసోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే మూడు కంపెనీలు ఉండగా, ప్రస్తుతం వీటితోపాటు మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఎస్ ఆయిల్ఫెడ్, గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీల ద్వారా ఫ్యాక్టరీ జోన్లలో నర్సరీలు కూడా ఏర్పాటయ్యాయి. ప్రాసెసింగ్ ప్లాంట్లకు ప్రాధాన్యం.. పామాయిల్ దీర్ఘకాల పంట కావడంతో దేశీయంగా నూనె లభ్యతను పెంపొందించే ప్రక్రియలో ఆయిల్పామ్ సాగు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందుకోసం ప్రభుత్వాలు సాగుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాయి. 2000 సంవత్సరంలో ఈ పంట 17,834 ఎకరాల్లో సాగవగా, 2020 నాటికి 42,899 ఎకరాలకు, ప్రస్తుతం 73,938 ఎకరాలకు చేరుకుంది. సాగు విస్తీర్ణం పెరగడంతో ప్రభుత్వం ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చింది. డిమాండ్ పెరగడంతో ధర కూడా పెరుగుతూ వచ్చింది. 2010లో టన్ను గెలల ధర రూ.సగటున రూ.5,136 ఉండగా 2022 నాటికి రూ.18,069కి చేరింది మొదట్లో రెండు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి.. 2005లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. తొలుత 5 టన్నుల సామర్థ్యంతో ప్రారంభించగా, పలు దఫాలుగా సామర్థ్యం పెరుగుతూ, ప్రస్తుతం 60 టన్నులకు చేరింది. ఇక్కడ పామాయిల్ గెలలను 120 నుంచి 160 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు స్టీమ్ చేస్తారు. ఆ తర్వాత యంత్రాలతో గెలల నుంచి ముడి నూనెను తీసి, నేరుగా పైపులైన్ల ద్వారా పెద్ద ట్యాంకుల్లోకి పంపి నిల్వ ఉంచుతారు. ఇలా నిల్వ చేసిన క్రూడాయిల్ను లారీ ట్యాంకర్లలో ప్రాసెస్ యూనిట్లకు తరలిస్తారు. స్టీమ్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను, నూనె గింజలను (నెట్) వేరు చేస్తారు. గెలల వ్యర్థాలను టన్నుల లెక్కన ఇతర అనుబంధ ఫ్యాక్టరీలకు విక్రయిస్తారు. అశ్వరావుపేట తర్వాత దమ్మపేట మండలం అప్పారావుపేటలో 2017 ఏప్రిల్లో మరో ఫ్యాక్టరీ ప్రారంభమైంది. రూ.80 కోట్ల వ్యయం, మలేసియా టెక్నాలజీతో అత్యాధునిక పరికరాలను ఉపయోగించి దీనిని నిర్మించారు. తొలుత ఇది 60 టన్నుల సామర్థ్యంతో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 90 టన్నులకు పెరిగింది. ఈ ఫ్యాక్టరీకి 2018లో రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ రంగ విభాగంలో ఉత్తమ ఫ్యాక్టరీ అవార్డు దక్కింది. అదే ఏడాది కేంద్రం ద్వారా గ్లోబల్ అవార్డు వచ్చింది. కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 3 ఫ్యాక్టరీలు ఉండగా.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరిగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, అశ్వాపురం మండలం బి.జె.కొత్తూరు, ములకలపల్లి గ్రామాల్లో నూతనంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు కానున్నాయి. వీటి ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలో పామాయిల్ తోటల సాగు మరింతగా విస్తరించి దేశీయంగా నెలకొన్న కొరతను తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈయనే సాగు మొదలు పెట్టింది.. 1991లో ప్రభుత్వ సబ్సిడీ ఏమీ లేకుండా.. అశ్వారావుపేటకు చెందిన పిన్నమనేని మురళి అనే రైతు ఆయిల్పామ్ పంట సాగును ప్రయోగాత్మకంగా మొదట ఐదు ఎకరాల్లో ప్రారంభించారు. మొదట్లో ఆయన మొక్క రూ.25 చొప్పున కొనుగోలు చేశారు. సమీపంలో గెలల కొనుగోలు, ఫ్యాక్టరీ లేనప్పటికీ.. ఆయన ఈ పంట సాగు చేయడంతో మిగిలిన రైతులు కూడా ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం మురళి 100 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండటం, ఫ్యాక్టరీలు అందుబాటులో ఉండటంతో ఈ పంట ఆదాయం మెరుగ్గా మారిందని మురళి చెప్పారు. లాభదాయకమైన పంట.. పామాయిల్ సాగు ద్వారా రైతులకు ఏటా లక్షల్లో ఆదాయం వస్తుంది. పంట సాగు చేసిన నాలుగేళ్లలో ఆదాయం ప్రారంభమవుతుంది. సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పామాయిల్ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఫ్యాక్టరీలు సైతం రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి. –జినుగు మరియన్న, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం ఎకరం ఆయిల్పామ్సాగుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ.. మొక్కలకు(ఎకరానికి 57 మొక్కలు): రూ.11,600 ఎరువులు, అంతర పంటలకు ఏడాదికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లు: రూ.16,800 బిందు సేద్యం: రూ.22,518 మొత్తం రూ. 50,918 -
అధిక దిగుబడికి..ఎత్తుమడుల పద్ధతి
-
రైతులకు వరంగా పామాయిల్ సాగు
-
పామ్ ఆయిల్ పంటకు ప్రభుత్వం భారీగా రాయితీలు.. పెరిగిన డిమాండ్
-
అందుకే సన్రైజర్స్తో జట్టు కట్టాం.. ఇక ముందు ప్రత్యేక దృష్టి పెడతాం
సాక్షి, హైదరాబాద్: పామాయిల్ ఉత్పత్తుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నవభారత్ లిమిటెడ్ (ఎన్బీఎల్) కంపెనీ ఇకపై మరింత విస్తరణకు సిద్ధమైంది. ఇప్పటి వరకు దాదాపు పూర్తిగా హోల్సేల్ అమ్మకాలకే పరిమితమైన ఎన్బీఎల్ మున్ముందు రిటెయిలింగ్ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఐపీఎల్లో హైదరాబాద్ టీమ్ ‘సన్రైజర్స్’తో ఎన్బీఎల్ జత కట్టి తమ ప్రచార కార్యక్రమాలను వేదికగా మార్చుకుంది. తాజా సీజన్లో రైజర్స్కు ‘సింప్లిఫై పార్ట్నర్’గా ఎన్బీఎల్ వ్యవహరించింది. బుధవారం ఎన్బీఎల్ బృందంతో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రైజర్స్ బ్యాటర్ హ్యారీ బ్రూక్తో పాటు కోచ్లు డేల్ స్టెయిన్, ముత్తయ్య మురళీధరన్, హేమంగ్ బదానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్బీఎల్ సంస్థ పురోగతి గురించి సీఈఓ శ్రీనివాస ప్రసాద్ వెల్లడించారు. ‘రూ. 40 కోట్లతో మొదలైన మా టర్నోవర్ ప్రస్తుతం రూ. 1700 కోట్లకు చేరింది. ఎక్కువగా పామాయిల్ ఉత్పత్తులపైనే దృష్టి పెట్టాం. సూపర్మతి ఆయిల్కు మంచి గుర్తింపు ఉంది. రిఫైనరీ ద్వారా రోజుకు సుమారు 850 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు తయారు చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఆయిల్ రంగంలో ఇతర సంస్థలకు పోటీగా సన్ఫ్లవర్, రైస్బ్రాన్ ఆయిల్ల రంగంలో కూడా అడుగుపెడుతున్నాం. రిటైల్పై ఇక ముందు ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం ఆసక్తి చూపించే ఐపీఎల్ ఫ్రాంచైజీతో జత కట్టి ప్రచారం చేశాం’ అని వివరించారు. -
పామాయిల్ సాగుకు 4.36 లక్షల హెక్టార్లు అనుకూలం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 27.99 లక్షల హెక్టార్ల భూమి పామాయిల్ సాగుకు యోగ్యంగా ఉండగా, అందులో 4.36 లక్షల హెక్టార్లు తెలంగాణలో ఉన్నాయని పేర్కొన్నారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్– ఆయిల్పామ్ కింద పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాలో ఈ భూమి విస్తరించి ఉందని, పామాయిల్ సాగు తెలంగాణ రైతులకు పెద్దఎత్తున లబ్ధిని చేకూరుస్తుందని వెల్లడించారు. పామాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశంలో 2019–20 నాటికి 3.5 లక్షల హెక్టార్లలో ఉన్న పామాయిల్ సాగును 2025–26 నాటికి 10 లక్షల హెక్టార్లకు పెంచాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈశాన్య రాష్ట్రాలలో 3.28 లక్షల హెక్టార్ల భూమిని, మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి 3.22 లక్షల హెక్టార్ల భూమిని పామాయిల్ సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. ఈ పథకం అంచనా వ్యయం రూ. 11,040 కోట్లు కాగా, అందులో ఈశాన్య రాష్ట్రాలకు 90:10 ప్రాతిపదికన, మిగిలిన రాష్ట్రాలకు 60:40 ప్రాతిపదికన భారత ప్రభుత్వం రూ. 8,844 కోట్లు ఖర్చు చేయనుందని వివరించారు. మొత్తం వ్యయంలో రూ. 5,170 కోట్లను తెలంగాణ వంటి జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు కేటాయించగా అందులో భారత ప్రభుత్వం చెల్లించవలసిన వాటా రూ.3,560 కోట్లుగా ఉందని తెలిపారు. ఎస్సీ 17, ఎస్టీలకు 8 శాతం చొప్పున లబ్ధి రైతులకు లబ్ధి చేకూర్చటమే ప్రధాన ఉద్దేశంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్– ఆయిల్పామ్ మార్గదర్శకాలను రూపొందించారు. ఈ పథకం కింద వనరులన్నింటినీ 17 శాతం ఎస్సీలకు, 8 శాతం ఎస్టీలకు లబ్ధి చేకూర్చటానికి కేటాయించారు. జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ/ఎస్టీలకు కేటాయింపులు చేయటానికి వీలు కల్పించారు. -
పండుగ తర్వాత షాకిచ్చిన కేంద్రం.. పెరగనున్న వంటనూనె ధరలు!
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాకిచ్చింది. పామాయిల్ దిగుమతి సుంకాలను 6-11 శాతం పెంచనుంది. తాజాగా నోటిఫికేషన్ ద్వారా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయిల్పై (Oil) దిగుమతి సుంకాల పెంపు నిర్ణయం వల్ల వినియోగదారులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కందుల గింజల ధరల కారణంగా అల్లాడుతున్న రైతులను ఆదుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ ప్రకారం.. ముడి పామాయిల్ (CPO) దిగుమతి సుంకం టన్నుకు 858 డాలర్ల నుంచి 952డాలర్లకి పెరిగింది. అలాగే ఆర్బీడీ (RBD) పామాయిల్ దిగుమతి సుంకం టన్నుకు 905డాలర్ల నుంచి 962డాలర్లకు ఎగసింది. ఇతర పామ్ ఆయిల్ టారిఫ్ కూడా టన్నుకు 882 డాలర్ల నుంచి 957 డాలర్లకు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం ముడి పామాయిల్పై ప్రాథమిక దిగుమతి పన్నును రద్దు చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎడిబుల్ ఆయిల్స్, బంగారం, వెండి దిగుమతి ధరలను ప్రభుత్వం సవరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్కు అధిక భాగం రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా నుంచి సరఫరా జరుగుతోంది. చదవండి: 45వేల ఉద్యోగులు కావాలి.. అంతా మహిళలే.. ఎక్కడంటే! -
వంట నూనెల హబ్.. 'కాకినాడ'
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పెన్షనర్స్ ప్యారడైజ్గా పిలిచే కాకినాడకు వంట నూనెల హబ్గానూ పేరుంది. ఈ విషయంలో కాకినాడ.. గుజరాత్ తర్వాత దేశంలోనే రెండో స్థానంలో నిలుస్తోంది. అలాగే రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంటోంది. ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్, రష్యా తదితర దేశాల నుంచి ఇక్కడకు ముడి పామాయిల్ దిగుమతి అవుతోంది. ఇక్కడున్న 12 రిఫైనరీలలో ముడి వంట నూనెలను శుద్ధి చేసి పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. భవిష్యత్లో వచ్చే కాకినాడ గేట్వే పోర్టుతో పారిశ్రామికంగా ఈ రంగం మరింత పరుగులు తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం కూడా ఇందుకు దోహదం చేయనుందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. కాకినాడలో ప్రభుత్వ రంగ యాంకరేజ్ పోర్టు, ప్రైవేటు రంగంలో కేఎస్పీఎల్ (కాకినాడ సీపోర్ట్సు లిమిటెడ్) రెండు పోర్టులు ఉన్నాయి. పలు రాష్ట్రాల రిఫైనరీలు.. ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్ నుంచి ఏటా 9 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్ను కాకినాడ సీపోర్ట్సుకు దిగుమతి చేసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చే ముడి నూనెలను ఓడ సముద్రతీరాన జట్టీలో ఉన్నప్పుడే నేరుగా రిఫైనరీకి తరలించే ప్రత్యేక ఏర్పాటు ఇక్కడ ఉంది. అందుకే పలు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రిఫైనరీల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. పోర్టు నుంచి రిఫైనరీలకు నేరుగా పైపులైన్లు ఉండటంతో సమయం, ఖర్చులు ఆదా అవుతున్నాయంటున్నారు. 12 రిఫైనరీలలో శుద్ధి.. ప్యాకింగ్.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ పామాయిల్ను కాకినాడ పరిసరాల్లో వాకలపూడి, వలసపాకల, సూర్యారావుపేటలలో 12 రిఫైనరీలలో శుద్ధి చేసి ప్యాకింగ్ చేస్తున్నారు. అదానివిల్మార్, అగర్వాల్, లోహియా, జెమిని, అమ్మిరెడ్డి, రుచిసోయ, భగవతి, సంతోíÙమాత, శ్రీ గాయత్రి, వెంకట రమణ తదితర కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ రిఫైనరీల్లో శుద్ధి చేసిన వంట నూనెలను వివిధ బ్రాండ్ల పేరుతోఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు తదితర రాష్ట్రాలకు ప్యాకింగ్ ఆయిల్, లూజు ఆయిల్గా రవాణా చేస్తున్నారు. రోజూ ట్యాంకర్ల ద్వారా 500 మెట్రిక్ టన్నుల ఆయిల్ (లూజు), 2,500 మెట్రిక్ టన్నులు లీటర్ చొప్పున ప్యాక్ చేసి ట్రక్కులలో కాకినాడ నుంచి పంపుతున్నారు. ప్రత్యక్షంగా సుమారు 20 వేల మంది, పరోక్షంగా 50 వేల మంది ఏడాది పొడవునా ఉపాధి పొందుతున్నారు. చదవండి: ముర్రా.. మేడిన్ ఆంధ్రా కాకినాడ తర్వాత కృష్ణపట్నం.. దేశవ్యాప్తంగా ప్రజల వినియోగానికి కోటి 40 లక్షల మెట్రిక్ టన్నుల వంట నూనెలు అవసరమని అంచనా. దేశీయంగా అందుబాటులో ఉండే వంట నూనెలు మినహాయిస్తే.. విదేశాల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నులు వరకు దిగుమతి అవుతున్నాయి. వీటిలో గుజరాత్లోని రెండు పోర్టులు ముడి వంట నూనెల దిగుమతిలో మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో రెండో స్థానంలో, రాష్ట్రంలో మొదటి స్థానంలో కాకినాడ పోర్టు ఉంది. దేశవ్యాప్తంగా దిగుమతి అవుతున్న ముడి వంట నూనెల్లో 20 శాతం రాష్ట్రంలోని పోర్టులకు దిగుమతి అవుతున్నాయి. కాకినాడ సీపోర్టు ద్వారా ఏటా 9 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కాకినాడ తర్వాత రెండో స్థానాన్ని కృష్ణపట్నం పోర్టు దక్కించుకుంటోంది. క్రియాశీలకంగా కాకినాడ సీపోర్టు.. క్రూడ్ పామాయిల్ దిగుమతిలో కాకినాడ సీపోర్టు క్రియాశీలకంగా ఉంది. పోర్టు నుంచి నేరుగా రిఫైనరీల వరకు పైపులైన్ ఉండటంతో ముడి నూనె ఎటువంటి వృథా కాకుండా రవాణా అవుతుండటం కంపెనీలకు కలిసివస్తోంది. –ఎన్.మురళీధరరావు, సీఈవో, కాకినాడ సీపోర్టు లిమిటెడ్ రవాణా రంగానికి ఊపిరి.. కాకినాడ సీపోర్టును ఆనుకుని పలు ఆయిల్ రిఫైనరీలు నిర్వహిస్తుండటంతో రవాణా రంగానికి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. డ్రైవర్లు, ట్రక్ యజమానులు, క్లీనర్లు తదితరులు వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. – బావిశెట్టి వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు, లారీ ట్యాంకర్స్ యూనియన్, కాకినాడ -
పల్నాడు: పొట్లూరు వద్ద పామాయిల్ ట్యాంకర్ బోల్తా
-
పెరిగిన పామాయిల్ దిగుమతులు, ఎన్నిటన్నులంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పామాయిల్ దిగుమతులు స్వల్పంగా వృద్ది చెంది జూన్ మాసంలో 5,90,921 టన్నులు నమోదైంది. సోయాబీన్ ఆయిల్ దిగుమతులు 12 శాతం ఎగసి 2.30 లక్షల టన్నులు, పొద్దు తిరుగుడు నూనె 32 శాతం తగ్గి 1.19 లక్షల టన్నులకు వచ్చి చేరింది. టారిఫ్ రేట్ కోటా కింద డ్యూటీ ఫ్రీ ముడి సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనె దిగుమతులకై కేటాయింపులు పెంచాల్సిందిగా సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. క్రితం ఏడాదితో పోలిస్తే వంటలకు ఉపయోగించే నూనెలతోసహా అన్ని రకాల నూనెలు 9.96 లక్షల టన్నుల నుంచి ఈ ఏడాది జూన్లో 9.91 లక్షల టన్నులకు దిగొచ్చాయి. మొత్తం దిగుమతుల్లో పామాయిల్ వాటా ఏకంగా 50 శాతముంది. టారిఫ్ రేట్ కోటా కింద 2022–23, 2023–24 సంవత్సరాలకుగాను ముడి సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనె ఒక్కొక్కటి 20 లక్షల టన్నులు దిగుమతికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. -
పామాయిల్పై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకనైనా ధరలు తగ్గేనా
ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెట్రోలు ధరలను తగ్గించిన కేంద్రం కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించింది. వీటితో పాటు వంట నూనె ధరల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ధరలు అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా పామాయిల్పై బేస్ దిగుమతి సుంకం తగ్గించింది. ఈ మేరకు కేంద్రం మంగళవారం పొద్దు పోయాక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తాజాగా బేస్ దిగుమతి సుంకాలు సవరించడంతో టన్ను క్రూడ్ పామాయిల్ దిగుమతికి ఇంతకు ముందు 1703 డాలర్లు అవగా ఇప్పుడు 1625 డాలర్లకే రానుంది. రిఫైన్డ్ చేసిన పామాయిల్ విషయానికి వస్తే ఆర్బీడీ పామ్ ఆయిల్ ధర 1765 నుంచి 1733 డాలర్లకు దిగివచ్చింది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో పామాయిల్ ధరలు తగ్గుతాయని ఆనందించేలోపు సోయా రూపంలో ప్రమాదం వచ్చి పడింది. సోయా ఆయిల్ టన్ను ధర 1827 నుంచి 1,866కి పెరిగింది. చదవండి: ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీ తగ్గింపు -
ఒక్కసారి వేస్తే 30 ఏళ్ల పాటు పంట: ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం
తగరపువలస/విశాఖపట్నం: సేద్యంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు భీమిలి నియోజకవర్గ రైతులు. ఒక్క సారి పెట్టుబడి పెడితే.. 30 ఏళ్లు వరసగా ఆదాయం పొందే ఆయిల్పామ్ తోటల వైపు మళ్లుతున్నారు. భీమిలి డివిజన్లో నారాయణరాజుపేట, దాకమర్రి, సంగివలస, రావాడ, గెద్దపేట, కురపల్లి, రెడ్డిపల్లి, కుసులవాడ, మజ్జిపేట తదితర పంచాయితీల్లో 200 ఎకరాలకు పైగా ఆయిల్పామ్ సాగు చేస్తుండగా.. ప్రస్తుతం దిగుబడి ఇస్తున్నాయి. ఏడాదిలో 8 నెలల పాటు 15 రోజులకొకసారి ఎకరానికి 10–12 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను ఆయిల్పామ్ గెలల ధర రూ.21 వేలకు కంపెనీల యజమానులు కొనుగోలు చేస్తున్నారు. నర్సీపట్నం వద్ద బంగారుమెట్ట, విజయనగరం జిల్లా పార్వతీపురంలో కంపెనీలకు ఆయిల్పామ్ గెలలను తరలిస్తున్నారు. మొదటి నాలుగేళ్లే.. నిరీక్షణ సాధారణంగా ఎక్కువ ఎకరాలు భూమి కలిగిన రైతులు ఆయిల్పామ్ తోటలను సాగు చేస్తుంటారు. ఒకసారి పంటకు ఉపక్రమించిన తర్వాత నాలుగేళ్లు వరసగా పెట్టుబడి పెట్టాలి. గోదావరి జిల్లాల్లో అయితే చిన్న కమతాలు కలిగిన రైతులు కూడా ఆయిల్పామ్కే మొగ్గు చూపుతారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.60 ఉండే ఆయిల్పామ్ మొక్కను రాయితీ పోను మూడు ఎకరాల్లోపు రైతులకు రూ.5, మూడు నుంచి ఐదు ఎకరాల్లోపు రైతులకు రూ.10, ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు రూ.30 వంతున ప్రభుత్వం సరఫరా చేసేది. ప్రస్తుతం రూ.300 ఉన్న మొక్కను.. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రైతులకు ఎన్ని కావాలంటే అన్ని అందిస్తోంది. గత ప్రభుత్వాలు దిగుబడి వచ్చే నాలుగేళ్ల వరకు హెక్టారుకు ఏడాదికి రూ.4 వేల విలువైన ఎరువులు ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.4 వేల నగదును నేరుగా రైతుల ఖాతాకు జమ చేస్తోంది. పెట్టుబడి గోరంత.. ఆదాయం కొండంత ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు మొక్కలు ఉచితంగా లభిస్తుండగా ఎకరాకు గాను పెట్టుబడి నిమిత్తం రూ.30 వేల నుంచి 40 వేలు అవుతుంది. మొక్కకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో రోజుకు 250 లీటర్ల నీరు, మూడు నెలలకు ఒకసారి మొక్కకు 3–4 కిలోల ఎరువులు, అవసరమైన చోట మట్టలు నరకడం చేస్తే సరిపోతుంది. నాలుగేళ్ల తర్వాత ఏడాదిలో ఎనిమిది మాసాలకు కలిపి 16సార్లు దిగుబడి వస్తుంది. దీంతో ఖర్చులు పోను ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం లభిస్తుంది. అంతర పంటగా వేస్తే అదనపు ఆదాయం 2013లో నాకున్న 9 ఎకరాల్లో మొదట ఆయిల్పామ్ వేశాను. తర్వాత 18 ఎకరాలకు విస్తరించాను. మొత్తంగా 27 ఎకరాల్లో ఆయిల్పామ్తో పాటు అరటి, బొప్పాయి అంతర పంటలుగా వేశాను. మధ్యలో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేశాను. సోలార్ ద్వారా బిందుసేద్యం మొదలుపెట్టాను. ఆయిల్పామ్ నాలుగేళ్లు తర్వాత దిగుబడి ప్రారంభయి జీవితకాలం 30 ఏళ్ల వరకు ఆదాయం ఇస్తుంది. అరటి, బొప్పాయి వలన ఏడాదికి రూ.లక్ష అదనపు ఆదాయం లభిస్తుంది. మార్కెటింగ్ సమస్య లేదు. – కాద సూర్యనారాయణ, సర్పంచ్, నారాయణరాజుపేట, భీమిలి మండలం పక్షుల బెడద ఉంటుంది ఆయిల్పామ్కు తెగుళ్ల బాధ తక్కువ. ఒకవేళ తెగుళ్లు సోకినా ఇబ్బంది లేదు. పంట దిగుబడి సమయంలో ఆయిల్పామ్ పండ్లను గోరపిట్టలు, కాకులు, ఉడతలు తినేస్తుంటాయి. సాధారణంగా ఆయిల్పామ్ గెల 30 కిలోలు ఉండగా.. గెలకు అరకిలో వరకు నష్టం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా రక్షణ చర్యలు తీసుకోవాలి. వచ్చే ఆదాయం ముందు నష్టం ఏమంత కాదు. – మజ్జి చినపైడితల్లి, రైతు, మజ్జిపేట, భీమిలి మండలం -
పామాయిల్ ఎగుమతులకు ఇండోనేసియా ఓకే
జకార్తా: నెల రోజుల క్రితం పామాయిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఇండోనేసియా ప్రభుత్వం గురువారం తెలిపింది. దేశీయంగా సరఫరా పెరగడం, చమురు ధరలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. వంటనూనె ఎగుమతులు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతాయని అధ్యక్షుడు జొకొ విడొడొ తెలిపారు. ప్రపంచ పామాయిల్ ఉత్పత్తిలో ఇండోనేసియా, మలేసియాలు 85% వాటా కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాలకు పామాయిల్ ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరు. నిషేధం తొలగడంతో, భారత్లో పామాయిల్ ధరలు దిగివస్తాయని భావిస్తున్నారు. చదవండి: అదృష్టం అంటే వీరిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట -
కీలక నిర్ణయం తీసుకున్న ఏషియన్ కంట్రీ.. కుకింగ్ ఆయిల్ ధరలు తగ్గేనా?
అదీఇదీ అని తేడా లేదు. సబ్బు బిళ్ల నుంచి బస్సు ఛార్జీల వరకు ఒకటా రెండా మూడా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో వస్తువు ధర పెరిగిందన్న వార్తలే వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వంట నూనెల ధర కాస్త తగ్గవచ్చనే ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి. ఎగుమతులపై నిషేధం ప్రపంచంలోనే పామాయిల్ ఎగుమతుల్లో ఇండోనేషియా దేశం నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే దేశీయంగా పామాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో పామాయిల్ ఎగుమతులను నిషేధిస్తున్నట్టు 2022 ఏప్రిల్ 28న అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇండోనేషియా నుంచి పామాయిల సరఫరా ఆగిపోతుందనే వార్తలతో వంట నూనె ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. మే 23 నుంచి గత మూడు వారాలుగా పామాయిల్ ఎగుమతులపై నిషేధం కారణంగా ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టు ఇండోనేషియా ప్రభుత్వం గుర్తించింది. దీంతో 2022 మే 23 నుంచి తిరిగి ఎగుమతులకు అవకాశం ఇస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో మే 19న ప్రకటించారు. ధర తగ్గడంతో నిషేధం విధించేప్పుడు టోకు మార్కెట్లో లీటరు పామాయిల్ ధర 19,800 రూపయల దగ్గర ఉంది. నిషేధం కారణంగా ఆక్కడ పామాయిల్ ధర దిగివచ్చి ప్రస్తుతం 17 వేల రూపాయల దగ్గర ట్రేడవుతోంది. అయితే ఆ దేశం పెట్టుకున్న టార్గెట్ మాత్రం లీటరు పామాయిల్ 14 వేల రూపాలయకు దిగిరావాలని, అయితే దేశీయంగా పామాయిల్ నిల్వలు సమృద్ధిగా ఉండటంతో పాటు స్థానిక వాణిజ్య రంగాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ధర తగ్గేనా? ఇండోనేషియా నుంచి పామాయిల్ ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో దేశీయంగా కుకింగ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇండోనేషియా నుంచి భారత్ భారీ ఎత్తున పామాయిల్ దిగుమతి చేసుకుంటుంది. ఇండోనేషియా నిషేధాన్ని సాకుగా చూపుతూ మిగిలిన అన్ని వంటి నూనెల ధరలు పెంచాయి వ్యాపార వర్గాలు. కానీ త్వరలో పామాయిల్ దిగుమతి అవడం వల్ల డిమాండ్ మీద ఒత్తిడి తగ్గి ధరలు అదుపలోకి వచ్చేందుకు ఆస్కారం ఉంది. చదవండి: ‘పామాయిల్’ సెగ తగ్గేదెలా! -
‘పామాయిల్’ సెగ తగ్గేదెలా!
దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న వంట నూనెల ధరలపై తీవ్ర ఆందోళనతో ఉన్న కేంద్రం ప్రభుత్వం వీటి ధరలను అందుబాటులోకి తెచ్చే మార్గాలపై అన్వేషణ చేస్తోంది. ముఖ్యంగా భారత్కు అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారుగా ఉన్న ఇండోనేషియా ప్రకటించిన ఎగుమతులపై ఆకస్మిక నిషేధం ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా వంట నూనెల దిగుమతులపై విధించే సెస్ను తగ్గించాలని యోచిస్తోంది. మరోపక్క వంట నూనెల ప్రధాన ఎగుమతిదారులైన బ్రెజిల్, అర్జెంటీనాల నుంచి దిగుమతులు పెంచేకునే మార్గాలను వెతుకుతోంది. భారత్లో వంట నూనెల అవసరాల్లో 70 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. మొత్తంగా దిగుమతి అవుతున్న నూనెల్లో 50 శాతం పామాయిల్ ఉంటుండగా, దీనిలో ఇండోనేషియో వాటానే ఏకంగా 47 శాతానికి పైగా ఉంది. ఏటా ఇండోనేషియో నుంచి 8.8 మిలియన్ టన్నుల పామాయిల్ భారత్కు ఎగుమతి అవుతోంది. అయితే అక్కడి ప్రభుత్వం స్థానిక మార్కెట్లలో ధరలను తగ్గించేందుకు వీలుగా ఏప్రిల్ 28 నుంచి ఎగుమతులపై నిషేధం విధించింది. దీని ప్రభావం భారత్పై తీవ్రంగా పడనుంది. దీనికి తోడు ఇప్పటికే ఉక్రెయిన్–రష్యా యుధ్దం కారణంగా సన్ఫ్లవర్ నూనెల సరఫరా తగ్గింది. రష్యా నుంచి 60 శాతానికి పైగా సన్ఫ్లవర్ నూనె మన దేశానికి ఎగుమతి అవుతుండగా, తూర్పు యూరప్లో వివాదం కారణంగా వీటి రవాణాలో వేగం తగ్గింది. యుధ్దం కొనసాగినంత కాలం నూనెల సరఫరాల్లో ఆటంకాలు తప్పేలా లేవు. ఈ కారణాల రీత్యా ఇప్పటికే గత ఫిబ్రవరిలో పామాయిల్ లీటర ధర రూ.120–130 వరకు ఉండగా.. అది ఇప్పుడు రూ.165–175కి చేరింది. ఈ ధర మరో 20 నుంచి 25 శాతానికి పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పామాయిల్ సరఫరా పెంచే మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఎగుమతులకు ప్రోత్సాహం..లభ్యత పెంచడం పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధంతో తలెత్తిన తక్షణ సంక్షోభాన్ని అధిగమించేలా దేశంలో తగినంత వంటనూనెల నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. దేశంలో నెలకు సగటు పామాయిల్ వినియోగం 1–1.10 మిలియన్ టన్నుల మేర ఉండగా, ప్రస్తుతం దేశంలో 2.1 మిలియన్ టన్నుల మేర నిల్వలుండగా, మరో 1.2 మిలియన్ టన్నులు ఈ నెలాఖరుకు దేశానికి చేరుతాయని అంచనా వేసింది. అంటే మూడు నెలల అవసరాలకు సరిపడా నిల్వలున్నాయని అంటోంది. ఒకవేళ అప్పటికీ ఇండోనేషియా నిషేధం కొనసాగిన పక్షంలో అర్జెంటీనా, బ్రెజిల్, మలేషియా దేశాల నుంచి ఎగమతులను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగానే వంట నూనెలపై విధిస్తున్న వ్యవసాయ మౌలిక సదుపాయిల సెస్ను తగ్గించాలనే ఆలోచనలో ఉంది. నిజానికి గత నవంబర్లోనే ప్రభుత్వం పామాయిల్పై సెస్ను 20 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించగా, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై 5 శాతానికి తగ్గించింది.. దీనిని మరో 5 శాతం తగ్గించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను రేకెత్తిస్తున్న నేపథ్యంలో.. ఆకస్మిక ఎగుమతి నిషేధంపై ఇండోనేషియాతో భారత్ ద్వైపాక్షిక చర్చలు కూడా నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వంలోని కీలక అధికారుల నుంచి సమాచారం అందుతోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
మంట నూనెలు!
ఇది ఒక విచిత్ర పరిస్థితి. ఒక వస్తువును అత్యధికంగా ఉత్పత్తి చేసి, అతి పెద్ద ఎగుమతిదారుగా నిలిచే దేశంలోనే ఆ వస్తువుకు కొరత ఏర్పడితే? ఆ ఉత్పత్తి మీద అక్కడి ప్రభుత్వం ధరల నియంత్ర ణలు, రవాణాపై నిరోధాలు పెడితే? ఎగుమతులపై పూర్తిగా నిషేధం విధిస్తే? ప్రపంచంలోకెల్లా పామాయిల్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఇండోనేషియాలోని చిత్రమైన పరిస్థితి ఇప్పుడు ఇదే. నిజానికి, గత ఏడాది చివరి నుంచి ప్రపంచవ్యాప్త ముడి పామాయిల్ (సీపీఒ) ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ శాక నూనెల సరఫరా తగ్గడం, పామాయిల్ ఉత్పత్తిలో రెండో అతి పెద్ద దేశమైన మలేషియాలో కరోనాతో శ్రామికుల కొరత, ప్రపంచవ్యాప్త ఆహార ఇన్ఫ్లేషన్, ఉక్రె యిన్ యుద్ధం – ఇలా కర్ణుడి చావుకు కారణాలెన్నో! అందుకే, ఇండొనేషియా పామాయిల్ ధరలపై నియంత్రణ పెట్టింది. దానివల్ల అక్రమ నిల్వలు, తిరిగి అమ్మడాలు పెరిగాయి. చివరకు ఈ ఏప్రిల్ 28 నుంచి ఎగుమతుల నిషేధం విధించింది. భారతదేశపు శాకనూనెల వినియోగంలో 40 శాతం పామాయిలే! అక్కడి సంక్షోభంతో భారత్లో, ప్రపంచవ్యాప్తంగా ధరలకు రెక్కలొచ్చాయి. ముడి పామాయిల్ వరకు నిషేధం లేదని ఇండొనేషియా చెప్పినా, ఇప్పటికీ వంట నూనెల్లో విదేశీ దిగు మతులపై ప్రాథమికంగా ఆధారపడుతున్న మనం దీర్ఘకాలిక పరిష్కారం చూడాలని గుర్తు చేశాయి. వివరంగా చెప్పాలంటే, ఇండొనేషియాలో పామాయిల్ కొరతకు ప్రధానంగా రెండు కారణాలు. మొదటి కారణం– పామాయిల్ తర్వాత ప్రపంచంలో అధికంగా ఎగుమతి అయ్యే సన్ఫ్లవర్, సోయాబీన్ లాంటి ఇతర వంటనూనెల సరఫరాకు అంతరాయాలు ఏర్పడడం! సన్ఫ్లవర్ ఆయిల్ ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం ఉక్రెయిన్, రష్యాలవే. తీరా ఫిబ్రవరి 24న మొదలైన ఉక్రెయిన్ యుద్ధంతో నౌకా రవాణా చిక్కుల్లో పడింది. రష్యాపై ఆంక్షలతో సన్ఫ్లవర్ ఆయిల్ వాణిజ్యానికీ అడ్డు ఏర్పడింది. మరోపక్క దక్షిణ అమెరికాలో పొడి వాతావరణంతో సోయాబీన్ ఉత్పత్తి ఆరేళ్ళలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోనుందని అంచనా. వెరసి, యుద్ధం, వర్షాభావంతో సన్ఫ్లవర్, సోయా బీన్ నూనెల కొరవడి, భారం పామాయిల్ మీద పడింది. ఇక, రెండో కారణం – బయో ఇంధనంగా పామాయిల్ వినియోగం పెరగడం. ఇండొనేషియా ప్రభుత్వం 2020 నుంచి శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించడం కోసం డీజిల్లో 30 శాతం మేర పామాయిల్ను కలపడం తప్పనిసరి చేసింది. ఇలా బయో ఇంధనం దిశగా పామాయిల్ను మళ్ళించడంతో దేశీయ వంట నూనె వాడకం, ఎగుమతి విషయంలో కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఇండొనేషియాలో పామాయిల్ ధరలు పైపైకి ఎగబాకి, అక్కడి ప్రభుత్వం నియంత్రణలు, చివరకు ఎగుమతుల నిషేధం బాట పట్టింది. ఇండొనేషియాలోని సంక్షోభం భారత్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచంలో వంటనూనెలు అత్యధికంగా దిగుమతి చేసుకొనేది మన దేశమే. మన వార్షిక దిగుమతులైన 14–15 మిలియన్ టన్నుల వంట నూనెల్లో 8–9 మిలియన్ టన్నులతో సింహభాగం పామాయిలే. తర్వాత స్థానంలో సోయాబీన్ (3–3.5), సన్ఫ్లవర్ నూనె (2.5 మిలియన్ టన్నులు) వస్తాయి. మూడింటికీ ఇబ్బంది వచ్చిపడడంతో మన వంట నూనెల మార్కెట్ కుదుపునకు లోనైంది. ఇండొనేషియాలో ఈ జనవరి చివరలో పెట్టిన ఎగుమతి నియంత్రణల దెబ్బకే మన దేశంలో సీపీఓ మూల్యం 38 శాతం పెరిగింది. కొత్త నిషేధంతో పరిస్థితి మరింత జటిలమైంది. అయితే, శుద్ధి చేసిన ‘రిఫైన్డ్ బ్లీచ్డ్ డీ–ఓడరైజ్డ్’ (ఆర్బీడీ) పామోలిన్ ఎగుమతి మీదే నిషేధం పెట్టామనీ, ముడి పామాయిల్కు ఆ నిషేధం వర్తించదనీ ఇండొనేషియన్ అధికారులు తాజాగా వివరణ ఇచ్చింది. ఇటు వినియోగదారులకూ, అటు విధాన నిర్ణేతలకూ ఇది కొంత సాంత్వన. కనీసం ముడి పామాయిల్ను తెప్పించుకొని, ఉన్న దేశీయ నూనె శుద్ధి వసతులతో రిఫైన్డ్ వంటనూనె సిద్ధం చేసుకొనే వీలు అయినా మిగిలింది. అలా కాకుండా పూర్తి నిషేధమంటే గనక మన వార్షిక వంటనూనెల అవసరాల్లో నాలుగో వంతు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వచ్చేది. మన ఆహార మార్కెట్లో సంక్షోభం తలెత్తేది. యుద్ధంతో ఈ మార్చిలో ప్రపంచవ్యాప్త ఆహార ధరలు 13 శాతం పెరిగాయని ఐరాస లెక్క. కనివిని ఎరుగని రీతిలో ఇండొనేషియా సర్కార్ చేసిన నిషేధ ప్రకటనతో ఇతర శాకనూనెల ప్రపంచ ధరలు నింగి వైపు చూడసాగాయి. ప్రకటన వెలువడ్డ ఏప్రిల్ 22నే సోయాబీన్ నూనె ధర ఒక్క సారిగా 4.5 శాతం హెచ్చింది. ఈ ఒక్క ఏడాదే మన దేశంలో 29 శాతం పెరిగింది. కొన్ని దశాబ్దాలు గానే మనకీ పామాయిల్, సన్ఫ్లవర్ నూనెలు అలవాటు. ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడి, ఆ ధరల హెచ్చుతగ్గులు భరించే బదులు, వాటిని క్రమంగా తగ్గించుకుంటూ దేశీయ వంట నూనెల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి. వేరుసెనగ నూనె, ఆవనూనె, నువ్వుల నూనె లాంటి స్థానిక సాంప్రదాయిక నూనెల వినియోగాన్ని పెంచాలి. చౌకధరల దుకాణాల్లో పంపిణీ లాంటి ఆలోచనలు చేయవచ్చు. అప్పుడే దేశీయంగా వంటనూనెల విషయంలో భద్రత సాధ్యం. వంటనూనెలపై మన దేశ విధా నాలు సైతం తాత్కాలిక ఉపశమన ధోరణిలో సాగడం మరో సమస్య. 1.25 లక్షల హెక్టార్లలో పామా యిల్ సాగును సబ్సిడీలతో ప్రోత్సహించి, ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం గత ఏడాదే ఓ ప్రణాళికను ప్రకటించింది. కానీ, పామాయిల్ చెట్లు ఫలించడానికి అయిదారేళ్ళు పడు తుంది. ఈలోగా పరిస్థితి ఏమిటి? ఎగుమతుల నిషేధంతో ఇండొనేషియాలో ధరలు తగ్గచ్చేమో కానీ, మన దగ్గర చుక్కలనంటడం ఖాయం. రానున్నది మంటనూనెల కష్టకాలమని భయపడుతున్నది అందుకే! -
గెల.. గలగల!
దేవరపల్లి, రంగంపేట (తూర్పు గోదావరి): మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్న పామాయిల్ రైతన్నలకు కాసులు కురిపిస్తోంది. రెండేళ్లలో పామాయిల్ గెలల ధర గరిష్ట స్థాయికి చేరడంతో సాగుదారులు మంచి ఆదాయం పొందుతున్నారు. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ.21890 చొప్పున పలికి సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. జనవరిలో రూ.17,500 ఉన్న ధర మార్చిలో రూ.19,300కి చేరుకోగా తాజాగా మరింత పెరిగింది. యుద్ధం.. దిగుమతులు ఆగడంతో ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పామాయిల్ దిగుమతులకు ఆటంకం తలెత్తడంతో మార్కెట్లో వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. 2019లో టన్ను గెలల ధర రూ.ఆరు వేలు మాత్రమే ఉండగా 2020లో రూ.8,000 పలికింది. 2021లో రూ.10,000కి చేరుకుంది. ఈనెల 4వ తేదీన ఉద్యాన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.ఎస్ శ్రీధర్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రైతులకు ఏప్రిల్ నుంచి టన్ను పామాయిల్ గెలలకు రూ.21,890 చొప్పున చెల్లించాలి. ఈ మేరకు కాకినాడ జిల్లా పెద్దాపురంలోని రుచి సోయా పామాయిల్ కంపెనీతో పాటు మిగిలిన 12 కంపెనీలు కూడా ఇదే ధర చెల్లించాల్సి ఉంది. ఉభయ గోదావరిలో భారీగా సాగు కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజక వర్గాల పరిధిలో 55 వేల ఎకరాల్లో పామాయిల్ పంట సాగులో ఉంది. అనపర్తి, పెద్దాపురం, గండేపల్లిలోనూ సాగు చేపట్టారు. గత మూడు నెలల వ్యవధిలో ఆరు వేల ఎకరాల్లో కొత్తగా నాట్లు వేయడంతో ఉభయ గోదావరిలో సాగు విస్తీర్ణం 81 వేలకు పెరిగిపోయింది. జూన్, జూలైలో మరో ఐదు వేల ఎకరాల్లో నాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. పొగాకుకు ప్రత్యామ్నాయంగా పొగాకు పంట గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు చేసి లాభాలు పొందుతున్నారు. పొగాకు భూముల్లో రెండేళ్లుగా రైతులు పామాయిల్ తోటలు వేస్తున్నారు. దాదాపు 8,000 ఎకరాల్లో ఈ తోటలు వేసినట్లు సమాచారం. పెట్టుబడి తక్కువ, ఆదాయం బాగుండటంతో వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఎకరాకు రూ.2.20 లక్షల ఆదాయం పామాయిల్ ఎకరాకు 10 టన్నుల గెలలు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ.21,890 ఉండడంతో రూ.2.20 లక్షలు వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. అన్ని పంటల కంటే ఆయిల్ పామ్కు మంచి ధర లభిస్తోందని, మెట్ట రైతులను పామాయిల్ ఆదుకుందని ఆనందంగా చెబుతున్నారు. రైతులను ఆదుకుంది.. ఈ ఏడాది పొగాకు మినహా అన్ని పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. పామాయిల్ పంట రైతులను ఆదుకుంది. ఎకరాకు 10 టన్నుల దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలు అవుతుంది. సగటున ఎకరాకు రూ.1.70 లక్షల నికర ఆదాయం వస్తుంది. – నరహరిశెట్టి రాజేంద్రబాబు, డైరెక్టర్, రాష్ట్ర ఆయిల్పామ్ బోర్డు, యర్నగూడెం ఊహించని ధర ఇంత ధర ఊహించలేదు. పామాయిల్ తోటలు రైతులను ఆదుకుంటున్నాయి. 30 ఎకరాల్లో సాగు చేస్తున్నా. 300 టన్నుల దిగుబడి వచ్చింది. ఎకరాకు సగటున రూ.1.50 లక్షలు మిగులుతుంది. మార్కెట్లో ధర మరింత పెరిగే అవకాశ«ం ఉంది. – యాగంటి వెంకటేశ్వరరావు, రైతు, దేవరపల్లి లాభాల పంట ఆయిల్ పామ్ లాభాల పంట. రెండేళ్ల నుంచి మంచి ఆదాయం వస్తోంది. ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం లభిస్తోంది. డ్రిప్ ద్వారా నీటితడులు, పశువుల ఎరువు వాడడం వల్ల దిగుబడులు పెరిగాయి. ఎకరాకు 10 నుంచి 11 టన్నుల దిగుబడి వస్తోంది. గత రెండు సంవత్సరాలు దిగుబడులు, రేటు ఆశాజనకంగా లేక లాభాలు తగ్గాయి. 11 ఎకరాల్లో తోట ఉంది. 112 టన్నులు దిగుబడి వచ్చింది. – పల్లి వెంకటరత్నారెడ్డి, రైతు, త్యాజంపూడి -
పామాయిల్ ‘పంట’ పండుతోంది!
-
వంట నూనెల దిగుమతులు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు ఫిబ్రవరిలో 9,83,608 టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. 2021 ఫిబ్రవరిలో 7,96,568 టన్నుల వంట నూనె భారత్కు సరఫరా అయింది. ప్రధానంగా శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులలో గణనీయమైన పెరుగుదల కారణంగా ఈ స్థాయిలో వృద్ధి నమోదైందని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది. అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో శుద్ది చేసిన పామాయిల్ 6,000 నుంచి ఏకంగా 3,02,928 టన్నులకు చేరింది. వంటలకు కాకుండా ఇతర ఉత్పత్తుల తయారీలో వాడే నూనెలు 42,039 నుంచి 36,389 టన్నులకు వచ్చి చేరింది. ఇతర ఉత్పత్తులకు వినియోగించే నూనెలతో కలిపి మొత్తం నూనెల దిగుమతులు 8,38,607 నుంచి 10,19,997 టన్నులకు ఎగశాయి. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య అన్ని రకాల నూనెలు 7 శాతం అధికమై 46,94,760 టన్నులుగా ఉంది. శుద్ధి చేసిన పామోలిన్ 21,601 నుంచి 5,19,450 టన్నులకు చేరాయి. ముడి పామాయిల్ 24,89,105 నుంచి 15,62,639 టన్నులకు దిగొచ్చింది. ప్రతి నెల సగటున 1.75–2 లక్షల టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ విదేశాల నుంచి భారత్కు వస్తోంది. యుద్ధం కొనసాగితే.. ‘రష్యా–ఉక్రెయిన్ వివాదం సన్ఫ్లవర్ (పొద్దు తిరుగుడు) నూనె సరఫరాకు అంతరాయం కలిగించింది. ఫిబ్రవరి 2022లో దాదాపు 1,52,000 టన్నులు భారతదేశానికి దిగుమతైంది. అదే పరిమాణం ఈ నెలలోనూ వచ్చే అవకాశం ఉంది. యుద్ధానికి ముందు బయలుదేరిన ఓడలు ప్రస్తుత నెలలో భారతీయ ఓడరేవులకు చేరుకుంటాయి. యుద్ధం కొనసాగితే తరువాతి నెలల్లో సన్ఫ్లవర్ ఆయిల్ రవాణా తగ్గుతుంది. సన్ఫ్లవర్ ఆయిల్ లభ్యత స్వల్పంగా తగ్గినప్పటికీ దేశీయంగా సోయాబీన్, ఆవనూనెల అధిక లభ్యత ఉపశమనం కలిగిస్తుంది. దేశీయ విక్రయాల పరిమితిని 20 నుంచి 30 శాతానికి పెంచుతూ మార్చి 9న ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇండోనేషియా ఎగుమతి పరిమాణాన్ని మరింత తగ్గిస్తుంది. అలాగే ప్రపంచ ఎగుమతి సరఫరాలను కఠినతరం చేస్తుంది. ఈ అంశాలు అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరల్లో గత కొన్ని రోజులుగా అధిక అస్థిరతకు దారితీస్తున్నాయి. పామాయిల్ ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుంచి భారత్కు వస్తోంది. ముడి సోయాబీన్ నూనె అర్జెంటీనా, బ్రెజిల్ నుండి దిగుమతి అవుతోంది. ముడి సన్ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్, రష్యా నుండి భారత్కు సరఫరా అవుతోంది’ అని అసోసియేషన్ తెలిపింది. -
వంట నూనెలకు యుద్ధం సెగ
తాడేపల్లిగూడెం: ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రభావం వంట నూనెలపై పడింది. రష్యా, ఉక్రెయిన్ల నుంచి పామాయిల్, పొద్దు తిరుగుడు నూనెల (సన్ఫ్లవర్ ఆయిల్)దిగుమతి భారత్కు దాదాపుగా ఆగిపోయింది. మన దేశానికి రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి పామ్క్రూడ్, పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతాయి. ఇండోనేషియా డొమెస్టిక్ సేల్స్ పేరిట పామ్క్రూడ్, పామాయిల్ను ఇతర దేశాలకు పంపించడం లేదు. రష్యా నుంచి 30 శాతం, ఉక్రెయిన్ నుంచి 70 శాతం సన్ఫ్లవర్ ఆయిల్ మనకు దిగుమతి అవుతుంది. కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల మీదుగా ఈ నూనెలు తెలుగు రాష్ట్రాల ప్రజల అవసరాల నిమిత్తం దిగుమతి చేస్తారు. మలేషియా, ఇండోనేషియా నుంచి పామాయిల్, పామ్క్రూడ్ దిగుమతి అవుతాయి. మార్కెట్ పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఆయా దేశాల నుంచి నూనెల దిగుమతులు తగ్గాయి. ఉన్నట్టుండి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తెరపైకి రావడంతో ఈ ప్రభావం నూనెల ధరలపై పడింది. లీటరుకు రూ.30 నుంచి రూ.40 పెరుగుదల దిగుమతులు తగ్గడంతో వంట నూనెల ధర వారం రోజుల వ్యవధిలో లీటరుకు ఏకంగా రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగింది. పామాయిల్ ధర లీటరు రూ.115 నుంచి రూ.145కు చేరింది. మార్కెట్లో సన్ఫ్లవర్ ఆయిల్ నిల్వలు నిండుకోగా.. లీటరు ధర రూ.130 నుంచి రూ.170కి ఎగబాకింది. ధరలకు «రెక్కలు రావడంతో స్థానికంగా లభించే రైస్బ్రాన్ ఆయిల్ ధర కూడా పెరిగింది. లీటర్ రూ.145 నుంచి రూ.170కి చేరింది. వేరుశనగ నూనె ధర లీటరు రూ.139 నుంచి రూ.165కు పెరిగింది. పెరిగిన ధరలతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దిగుమతిదారుల వద్దే నిల్వలు రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా నుంచి పామ్క్రూడ్, పామాయిల్, సన్ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకున్న ఐదారు కంపెనీలు నిల్వలను తమ వద్దే ఉంచుకున్నాయి. యుద్ధ ప్రభావం వల్ల రష్యా, ఉక్రెయిన్ల నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి నిలిచిపోయింది. ఇండోనేషియాలో స్థానిక అవసరాల నిమిత్తం డొమెస్టిక్ సేల్స్ పేరిట ఎగుమతులను ఆ దేశం నిలిపివేసింది. మలేషియాలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఫిబ్రవరి మొదటి వారం వరకు కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు దిగుమతి అయిన ఈ నూనెలు అక్కడే ఉండిపోయాయి. భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దిగుమతిదారులు ఆచితూచి సరుకును గుత్త వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. దీంతో నూనెల కొరత మార్కెట్ను వెంటాడుతోంది. రాష్ట్రంలోని గుత్త, రిటైల్ వ్యాపారుల వద్ద నూనెల నిల్వలు దాదాపుగా అయిపోతున్నాయి. దిగుమతిదారుల నుంచి సరుకు వచ్చే అవకాశాలు తగ్గాయి. దీంతో ఉన్న సరుకు హాట్కేక్లా అమ్ముడుపోతోంది. -
భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. రిటైల్ మార్కెట్లో రేట్లు ఇలా..!
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం వంటనూనె ధరలు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యవసర సరుకుల ధరలతో సతమతమవుతున్న జనాలకు వంటనూనె ధరలు కొద్దిగా ఊరట కలిగిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. దేశంలోని రిటైల్ మార్కెట్లో వంట నూనె ధరలు భారీగా తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రధాన రిటైల్ మార్కెట్లలో కిలో వంటనూనెపై రూ.5-20 వరకు ధరలు తగ్గినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. రిటైల్ మార్కెట్లో వేరుశెనగ నూనె ఆల్ ఇండియా సగటు రిటైల్ ధర కిలో రూ.180, ఆవనూనె కిలో రూ.184.59, సోయా ఆయిల్ కిలో రూ.148.85, సన్ ఫ్లవర్ ఆయిల్ కిలో 162.4, పామాయిల్ కిలో ధర రూ.128.5గా ఉన్నట్లు తెలిపింది. అయితే, అక్టోబర్ 1, 2021న ఉన్న ధరలతో పోలిస్తే వేరుశెనగ & ఆవనూనెల రిటైల్ ధరలు కిలోకు రూ.1.50-3 తగ్గాయి. సోయా & సన్ ఫ్లవర్ నూనెల ధరలు కిలోకు రూ.7-8 తగ్గినట్లు కేంద్రం తెలిపింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అదానీ విల్మార్, రుచి ఇండస్ట్రీస్ కంపెనీలతో సహా ఇతర ప్రధాన వంట నూనె కంపెనీలు లీటరుకు రూ.15-20 ధరలను తగ్గించాయి. వంటనూనెల ధరలను తగ్గించిన కంపెనీలలో జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా, హైదరాబాద్, మోడీ నేచురల్స్, ఢిల్లీ, గోకుల్ రీ-ఫాయిల్స్ మరియు సాల్వెంట్, విజయ్ సాల్వక్స్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ఉన్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో కమోడిటీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, వంటనూనె ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో వాటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత సంవత్సరం భారీగా ఉన్న నూనె ధరలు.. అక్టోబర్ 2021 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. వంట నూనెల మీద దిగుమతి సుంకాలు తగ్గించడం, నకిలీ నిల్వలను నిరోధించేందుకు స్టాక్ పరిమితులపై ఆంక్షలు విధించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టడంతో వంట నూనెల ధరలు తగ్గడానికి ఒక కారణం. వంటనూనెల విషయంలో దేశం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుండటంతో.. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెంచడానికి సిద్దం అయ్యింది. అందుకు తగ్గట్టుగా మిషన్ ఆఫ్ ఆయిల్పామ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఈ మిషన్ ఆయిల్పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. (చదవండి: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో అదిరిపోయే ఆఫర్స్..! వాటిపై 80 శాతం డిస్కౌంట్) -
పామాయిల్ రంగంలో స్వావలంబనే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: వంట నూనెలలో స్వావలంబనే తమ లక్ష్యమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ‘వంట నూనె– ఆయిల్ పామ్ జాతీయ మిషన్ బిజినెస్ సమిట్’ను హైదరాబాద్లో మంగళవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పామాయిల్ రంగంలో దేశం స్వావలంబన సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఈ జాతీయమిషన్కు వనరుల కొరత ఉండబోదని తెలిపారు. ప్రస్తుతం సుమారు 3 లక్షల హెక్టార్ల భూమి పామాయిల్ సాగులో ఉండగా, ఆయిల్ పామ్ సేద్యానికి అనువుగా ఉన్న 28 లక్షల హెక్టార్ల భూమిని సాగులోకి తీసుకురావడం తమ లక్ష్యమన్నారు. పామాయిల్ ఉత్పత్తిని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి మాట్లాడుతూ మనం వంట నూనె దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ వ్యవసాయశాఖ మంత్రి పి.ప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ను ప్రోత్సహించడానికి కేరళ ప్రభు త్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పారు. 30 లక్షల ఎకరాలు ఆయిల్పాం: నిరంజన్రెడ్డి తెలంగాణలో పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం 30 లక్షల ఎకరాలు ఆయిల్పాం లక్ష్యంగా పెట్టుకుందని, నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్పామ్ కింద కేంద్ర ప్రభుత్వం ఆమోదించి నిధులు కేటాయించాలని ఆయన కోరారు. ఆయిల్ పామ్ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (ఎఫ్ఎఫ్బీ) టన్నుకు రూ. 15 వేలు కనీస ఖచ్చితమైన ధర నిర్ణయించి ఆయిల్ పామ్ సాగుకు రైతులను ప్రోత్సహించాలని, అందుకు అవసరమయ్యే బిందు సేద్యం యూనిట్ ధరను పెంచి విస్తీర్ణ పరిమితిని ఎత్తేయాలని కోరుతూ కేంద్ర మంత్రి తోమర్కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో ఆయిల్పామ్ సాగుకు పూర్తి సహకారం అందిస్తామని తోమర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ, 3–4 సంవత్సరాలలో తెలంగాణ దేశంలోనే అతిపెద్ద ఆయిల్ పామ్ ఉత్పత్తి ప్రాంతంగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు ఉత్పత్తి సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల పంపిణీ కూడా జరిగింది. అంతకుముందు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ ప్రభుత్వ దార్శనికతను వివరించారు. -
Oil Price: సామాన్యులకు ఊరట.. దిగిరానున్న వంట నూనె ధరలు!
న్యూఢిల్లీ: వంటనూనెల వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. శుద్ధి చేసిన పామాయిల్పై విధించే ప్రాథమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్(సీబీఐసీ) తన గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది. ఈ కస్టమ్స్ సుంకం తగ్గింపు అనేది మార్చి 2022 వరకు వర్తిస్తుందని సీబీఐసీ తెలిపింది. సీబీఐసీ జారీ చేసిన నోటిఫికేషన్లో ఇలా.. "శుద్ధి చేసిన పామాయిల్పై విధించే ప్రాథమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని మార్చి 31, 2022 వరకు 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించనున్నట్లు" పేర్కొంది. పామాయిల్ కొత్త రేట్లు మంగళవారం(డిసెంబర్ 21) నుంచి అమల్లోకి రానున్నాయి. భారతదేశం నవంబర్ 2020 - అక్టోబర్ 2021 మధ్య కాలంలో రూ.1.17 లక్షల కోట్ల విలువైన వంట నూనెను దిగుమతి చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. వంట నూనె ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం శుద్ధి చేసిన & ముడి వంట నూనెలపై దిగుమతి సుంకాలను ఈ సంవత్సరం అనేకసార్లు తగ్గించింది. వంటనూనె ధరల తగ్గిపుపై దృష్టి సారించిన కేంద్రం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరలు అదుపులో పెట్టడంతోపాటు.. రైతులకు చేయూతనిచ్చేలా రూ.11 వేల 40 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దీనికి కేంద్రమంత్రి వర్గం 2021 ఆగస్టులో ఆమోదం తెలిపింది. (చదవండి: 5జీ స్మార్ట్ ఫోన్ పై బంపరాఫర్, మరికొన్ని గంటలు మాత్రమే!) -
పండుగ వేళ ప్రజలకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సోయాబీన్, సన్ ఫ్లవర్, ముడి పామ్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే మార్చి 2022 వరకు వీటిపై విధిస్తున్న అగ్రి సెస్ కూడా తొలగించినట్లు పేర్కొంది. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పండుగ సీజన్లో వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు అనేది అక్టోబర్ 14 నుంచి మార్చి 31, 2022 వరకు అమల్లో ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ)ఒక నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ సుంకం తగ్గింపు తర్వాత పామాయిల్, సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ ముడి రకాలపై కస్టమ్స్ సుంకం వరుసగా 8.25 శాతం, 5.5 శాతం, 5.5 శాతంగా ఉంటుంది. అంతేగాకుండా, శుద్ధి చేసిన రకాల పొద్దు తిరుగుడు, సోయాబీన్, పామోలిన్, పామాయిల్ నూనెపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గించారు. "పండుగ సీజన్లో అధిక ధరల కారణంగా ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించింది" అని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బివీ మెహతా తెలిపారు.(చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్ను ముంచే విధ్వంసం) -
యాసంగిలో వరిసాగు వద్దు
సిరిసిల్ల: యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా వే రుశనగ, పొద్దుతిరుగుడు, కందులు, కూరగాయలు, ఆయిల్పామ్ పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులకు సూచిం చారు. ప్రత్యామ్నాయ పంటల ఆవశ్యకతను వ్యవసాయాధికారులు రైతులకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై రైతుబంధు సమితి సభ్యులకు మంత్రి కేటీఆర్ అవగాహన కల్పించారు. దొడ్డు వడ్లు కొనమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని మంత్రి సూచించారు. దొడ్డు వరి వద్దనే విషయాన్ని రైతులకు కరాఖండిగా చెప్పాలని సూచించారు. ఆదర్శ రైతు పర్శరాములు బ్లాక్రైస్ పండించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో ప్రస్తావించారు. అయితే మార్కెటింగ్ లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆ రైతు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. మార్కెటింగ్ అంశాన్ని తెలుసుకుని చెప్తానని మంత్రి స్పష్టం చేశారు. దేశానికి తెలంగాణే ఆదర్శం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.5 లక్ష ల బీమాను అమలు చేస్తున్నామని, ఈ విషయంలో తెలంగాణ, దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. అలాగే రైతుబంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతుల రుణమాఫీ వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నా రు. ఇప్పటి వరకు 9 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశామని వివరించారు. రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి.. రైతులు ఎక్కడ ఏ పంట వేశారన్న సమాచారం.. వ్యవసాయ అధికారుల వద్ద పక్కాగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రైతువేదికల్లో క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులు ముందు గా బాధ్యత తీసుకుని ప్రత్యామ్నాయ పంటలు వేయాలని, ఇతర రైతులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. అలాగే ఆయిల్పామ్ సాగు వివరాలు తెలుసుకోవడానికి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు సిరిసిల్ల జిల్లా రైతులను తీసుకెళ్లాలని కేటీఆర్ అధికారులకు సూచిం చారు. ముస్తాబాద్ మండలం మోహినికుంటలో తాను కూడా 15 ఎకరాల భూమి తీసు కుని స్వయంగా ఆయిల్పామ్ సాగు చేస్తానని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పామాయిల్ రైతులపై దిగుమతి సుంకం దెబ్బ
సాక్షి, హైదరాబాద్: పామాయిల్ మొలక విత్తనాలపై కేంద్రం భారీగా పెంచిన దిగుమతి సుంకం రైతులను ఆర్థికంగా దెబ్బతీయనుంది. ఐదు శాతం నుంచి ఏకంగా 30 శాతానికి పెంచడంతో రైతులపై కోట్ల రూపాయల భారం పడనుంది. ఒకవైపు ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు సుంకం పెంచడంపై ఆయిల్ఫెడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో ఆయిల్పామ్ సాగును 20 లక్షల ఎకరాలకు విస్తరింపజేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి దిగుమతి సుంకం పెంపు తీవ్రమైన విఘాతం కలిగిస్తుందని అంటున్నారు. ఇప్పటికే 30% చొప్పున చెల్లింపులు గతంలో లక్ష విత్తనాలకు దిగుమతి సుంకం రూ.3.25 లక్షలు పడితే, ఇప్పుడది రూ.19.50 లక్షలకు పెరగనుంది. 2022– 23 సంవత్సరానికి గాను దాదాపు 55 వేల ఎకరాల సాగుకు అవసరమైన 40 లక్షల విత్తనాలు థాయ్లాండ్, మలేసియా, కోస్టారికా దేశాల నుంచి కొనుగోలు చేయాలని ఆయిల్ ఫెడ్ నిర్ణయించింది. ఒక్కో మొలక విత్తనపు గింజ ధర ఆయా దేశాల్లో సగటున రూ.65 ఉంటుంది. గతంలో ఉన్న 5 శాతం కస్టమ్స్ డ్యూటీ ప్రకారం రూ. 3.25 సుంకం, రవాణా ఖర్చులు కలిపితే ఒక్కో విత్తనం రూ.75 వరకు అయ్యేది. ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ 30 శాతానికి పెరగటంతో సుంకం రూ.19.50కి పెరిగింది. రవాణా ఖర్చులు కలిపితే ఒక్కో విత్తనపు గింజ రూ.95 అవుతుండగా.. లక్ష విత్తనాలకు రూ.19.50 లక్షల సుంకం చెల్లించాల్సి వస్తోంది. దిగుమతి, రవాణా ఖర్చులు కలిపి 40 లక్షల పామాయిల్ విత్తనాలకు గాను ఆయిల్ ఫెడ్కు రూ. 38 కోట్లు ఖర్చవుతోంది. పాత విధానం ప్రకారమైతే రూ. 30 కోట్లే అయ్యేది. అంటే కొత్తగా రూ.8 కోట్ల భారం పడుతోందన్నమాట. పెరిగిన దిగుమతి సుంకం రైతులే భరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు 9 లక్షల మొలక విత్తనాలను కొనుగోలు చేసిన ఆయిల్ ఫెడ్ 30 శాతం చొప్పున దిగుమతి సుంకం చెల్లించింది. కొత్తగా 8.24 లక్షల ఎకరాలు గుర్తింపు రాష్ట్రంలో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోనే ఆయిల్పామ్ సాగవుతోంది. కొత్తగా 25 జిల్లాల్లో 8.24 లక్షల ఎకరాలు దీనికి అనుకూలమైన భూమిగా గుర్తించారు. ఆయిల్పా మ్ నుంచి క్రూడ్ ఆయిల్ తీసేందుకు ఫ్యాక్టరీలు అవసరం కాగా, ప్రస్తుతం అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. కొత్తగా నోటిఫై చేసిన 8 లక్షలకు పైగా ఎకరాలకు గాను కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో గుర్తించిన భూములకు సంబంధించిన రైతుల నుంచి ఆయిల్పామ్ను ఆయా ఫ్యాక్టరీలే కొనుగోలు చేయాలి. వారికి అవసరమైన మొక్కలు అందజేయాలి. మార్కెట్లో ఉన్న ధర రైతుకు ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో కేంద్రం నోటిఫై చేసిన దానికంటే మరింత ఎక్కువగా సాగును ప్రోత్సహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి దిగుమతి సుంకం పెంపు శరాఘాతంలా మారింది. రైతులపై భారం వేస్తే వారు సాగుకు దూరం అవుతారు. కొత్త రైతులు ముందు కు వచ్చే అవకాశం ఉండదని అంటున్నారు. పెంచిన సుంకాన్ని రైతులే భరించాల్సి వస్తుంది దిగుమతి సుంకాన్ని తగ్గించాలని, పాత పద్ధతిలోనే 5 శాతం వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. 30 శాతం దిగుమతి సుంకం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇప్పటివరకు ఐదు శాతం సుంకాన్ని ఆయిల్ఫెడ్ భరించేది. కానీ పెంచిన దిగుమతి సుంకాన్ని రైతులే భరించాల్సి వస్తుంది. – కంచర్ల రామకృష్ణారెడ్డి, చైర్మన్, ఆయిల్ఫెడ్ -
తగ్గనున్న పామాయిల్ ధర.. మరి మిగితావో ?
హైదరాబాద్ : భగ్గుమంటున్న పెట్రోల్ డీజిల్ ధరలు, మండిపోతున్న వంట నూనె ధరలు.... ఇలా పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులకు ఊరట కలిగించే చర్య తీసుకుంది కేంద్రం. వంటలో ఉపయోగించే పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని తగ్గించింది. మూడు నెలల పాటు ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ దిగుమతి చేసుకునేది మన దేశమే. ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి ఏటా 8,50,000 టన్నుల పామ్ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతిపై మన ప్రభుత్వం 15 శాతం వరకు బేస్ ట్యాక్స్ విధిస్తోంది. పెరిగిన ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు పామాయిల్ దిగుమతులపై ఉన్న బేస్ ట్యాక్స్ 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. మూడు నెలల పాటు ఈ పన్ను తగ్గింపు నిర్ణయం అమల్లో ఉంటుంది. పన్ను తగ్గించడం వల్ల అదనంగా 50,000 టన్నుల పామాయిల్ దిగుమతులు పెరగవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. ఫలితంగా పామాయిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మిగిలిన వాటి సంగతో సాధారణంగా పామాయిల్ని ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగిస్తారు. వీటిపై ఇప్పటి వరకు ఉన్న రకరకాల పన్నుల మొత్తం 35 శాతం ఉండగా దాన్ని 30 శాతం తగ్గించింది. కానీ గృహ అవసరాలకు ఎక్కువగా వినియోగించే సోయా, సన్ఫ్లవర్ ఆయిల్లపై దిగుమతి పన్ను తగ్గించకలేదు. దీంతో వాటి ధరలు ఇప్పట్లో తగ్గేది కష్టమే. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం కంటి తుడుపు చర్య అవుతుందే తప్ప సామాన్యులకు దీని వల్ల ఒరిగేది లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. చదవండి : NITI Aayog: పన్ను మినహాయింపులకు నీతి ఆయోగ్ ఓటు -
అంతర పంటలతో ఆదాయం పొందండి
సాక్షి, అమరావతి: ఒకే పంటను పండించి నష్టపోతున్న రైతులు అంతర పంటల సాగుపై దృష్టి సారించేలా ఉద్యాన శాఖ వారికి అవగాహన కల్పిస్తోంది. నాలుగైదు ఏళ్ల తర్వాత దిగుబడి వచ్చే ప్రధాన పంటల మధ్యలో అంతర పంటల్ని సాగు చేయడం వల్ల అధిక ఆదాయాన్ని పొందొచ్చు. తోటల్లో మొక్కల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రధాన పంట కాపునకు వచ్చేంత వరకు అంతర పంటలు సాగు చేయవచ్చు. ఏక పంటగా ఏదో ఒక ఉద్యాన పంటను పండించడం కన్నా అంతర/బహుళ పంటల వంటి సమగ్ర పద్ధతుల్ని అవలంభించడం వల్ల ఒక పంట పోయినా మరో పంటతో ఆదాయాన్ని పొందవచ్చు. వెలుతురు, నీరు, పోషకాల కోసం ప్రధాన పంటతో పోటీ పడని పంటను ఎంచుకోవాలి. పామాయిల్ తోటల్లో అంతర పంటలుగా కోకో, కూరగాయలు, పూల మొక్కలు, జొన్న, మొక్కజొన్న, మిర్చి, పసుపు, అల్లం, అనాస వంటి వాటిని సాగు చేసుకోవచ్చు. కొబ్బరి, పామాయిల్, మామిడి వంటి తోటల్లో మొక్కకు సరిపడే స్థలం వదలాలి. ప్రధానంగా పామాయిల్లో మొక్కల్ని త్రిభుజాకృతి పద్ధతిలో కన్నా చతురస్రాకృతి పద్ధతిన సాగు చేస్తే మంచిది. పామాయిల్లో అంతర పంటల వల్ల సగటున హెక్టార్కు ఏడాదికి రూ.30 నుంచి రూ.50 వేల వరకు అదనపు ఆదాయం పొందవచ్చునని ఉద్యాన శాఖ ఉన్నతాధికారి పి.హనుమంతరావు వివరించారు. -
ఆయిల్ఫెడ్లో ‘వ్యాట్’ కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆయిల్ఫెడ్లో ‘వ్యాట్’ కుంభకోణం ఆలస్యంగా వెలుగుచూసింది. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆయిల్ఫెడ్ దాదాపు రూ.3.76 కోట్ల మేర నష్టపోయినట్లు విశ్వసనీయ సమాచారం. అంత పెద్దస్థాయిలో నష్టం జరగడానికి బాధ్యులను గుర్తించినా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు ఒత్తిళ్లకు లోనవుతున్నారన్న చర్చ జరుగుతోంది. పైగా దానికి బాధ్యులైన కొందరు సీనియర్ ఉద్యోగులు పైస్థాయిలో అండదండలు చూసుకుని జరిగిన నష్టానికి బాధ్యత వహించడం లేదని తెలిసింది. వ్యవహారం బయటకు పొక్కకుండా పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డికి ఇది తెలియకుండా దాచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇది నిర్లక్ష్యమా? లేక కోట్ల రూపాయల నష్టం చవిచూడడంలో ఎవరికైనా లబ్ధి జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయిల్ఫెడ్లో ఇతర ఉద్యోగులు కూడా దీనిపై ఉన్నతస్థాయిలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అసలేం జరిగిందంటే? 2016 నుంచి 2017 జూన్ మధ్య కాలంలో జరిగిన వ్యవహారం ఇది. అప్పట్లో అప్పారావుపేట ఆయిల్ఫాం ప్లాంటును నెలకొల్పారు. అందుకోసం ఆయిల్ఫెడ్ పామాయిల్ ప్లాంటుకు, సివిల్ పనులకు, అన్ని రకాల పనుల కోసం రూ. 75.13 కోట్లు ఖర్చు చేసింది. పామాయిల్ ప్లాంటు, ఇతర యంత్రాలు నెలకొల్పే బాధ్యత ప్రీ యూనిక్ అనే సంస్థకు అప్పగించారు. అందులో ఆ ఒక్కదానికే రూ. 45.42 కోట్లు ఖర్చు చేసింది. ఇలా వివిధ కంపెనీలకు వివిధ రకాల పనులను అప్పగించింది. ఆయా కంపెనీలన్నీ కూడా మిషనరీని కొనుగోలు చేసి అప్పారావుపేటలో ఫ్యాక్టరీని, దానికి సంబంధించిన ఇతర పనులను పూర్తిచేశాయి. మెటీరియల్ విలువను ఆధారం చేసుకొని ఆ కంపెనీలు వ్యాట్ను ప్రభుత్వానికి చెల్లించాయి. ఆ మొత్తం వ్యాట్ విలువ రూ. 3.63 కోట్లు. మరోవైపు అశ్వారావుపేటలో అప్పటికే ఉనికిలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీ ఆధునీకరణ పనుల కోసం ఆయిల్ఫెడ్ కొన్ని కంపెనీలకు బాధ్యత అప్పగించింది. ఆ కంపెనీలు రూ. 6 కోట్లకు పైగా విలువైన మెటీరియల్ను వాడారు. అందుకోసం దాదాపు రూ. 12.74 లక్షలకు పైగా వ్యాట్ సొమ్ము చెల్లించాయి. రెండూ కలిపి మొత్తంగా రూ. 3.76 కోట్ల వ్యాట్ను రెండు ఫ్యాక్టరీలకు కలిపి జరిగిన పనులకు ఆయా కంపెనీలు చెల్లించాయి. ఆ తర్వాతే మొదలైన అసలు కథ... ఆయా కంపెనీలు రూ. 3.76 కోట్లు వ్యాట్ చెల్లించాయి. కంపెనీ ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ, మరో ఫ్యాక్టరీ ఆధునీకరణ అనంతరం అక్కడ పామాయిల్ ఉత్పత్తి జరుగుతోంది. అలా ఉత్పత్తి అయిన పామాయిల్ను ఆయిల్ఫెడ్ విక్రయిస్తుంది. అలా విక్రయించిన పామాయిల్కు కూడా వ్యాట్ను చెల్లిస్తుంది. ఇక్కడ జరిగిందేంటంటే ఒకవైపు ఫ్యాక్టరీ, దానికి సంబంధించిన యంత్రాలకు ఆయా కంపెనీలు అప్పటికే వ్యాట్ చెల్లించాయి. మరోసారి ఆయిల్ఫెడ్ అవే ఫ్యాక్టరీల ద్వారా తాను ఉత్పత్తి చేసిన పామాయిల్ విక్రయాలపైనా వ్యాట్ను చెల్లించింది. కానీ ఇలా చేయాల్సిన అవసరంలేదని ఆయిల్ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయా ఫ్యాక్టరీల మెటీరియల్కు వ్యాట్ చెల్లించినందున, వాటి ద్వారా ఉత్పత్తి అయి విక్రయించిన దానికి వ్యాట్ చెల్లించాల్సిన అవసరంలేదని అంటున్నారు. అంటే అక్కడ మినహాయింపు కోరాల్సిన అవసరం ఉంది. ఆయా కంపెనీలు చెల్లించిన రూ. 3.76 కోట్లను మినహాయింపు కోరే అవకాశం ఆయిల్ఫెడ్కు ఉంది. అంటే ఆయిల్ఫెడ్ తాను అమ్మే పామాయిల్కు చెల్లించే వ్యాట్ సొమ్ములోనుంచి రూ. 3.76 కోట్లు మినహాయించుకోవాలి. కానీ అలా కొద్ది సొమ్మును మాత్రమే మినహాయించినట్లు తెలిసింది. దీంతో ఆ మేరకు సంస్థ నష్టపోయిందని ఆయిల్ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై వ్యాఖ్యానించేందుకు అధికారులు ముందుకు రావడంలేదు. -
నూనె ఎక్కువేద్దాం!
సాక్షి, హైదరాబాద్: మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వంట నూనెల కొరత ఏర్పడింది. నూనె గింజల సాగు తక్కువగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఉద్యానశాఖ అంచనా వేసింది. మన అవసరాలకన్నా 3 లక్షల టన్నులు తక్కువ ఉత్పత్తి ఉంది. మన దేశ అవసరాలకు 2.1 కోట్ల టన్నుల వంట నూనెలు అవసరం కాగా.. 70 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన 1.4 కోట్ల టన్నుల నూనెను రూ.75 వేల కోట్లు వెచ్చించి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మొత్తం దిగుమతుల్లో 60 శాతం పామాయిల్ ఉండటం గమనార్హం. దేశంలో నూనె గింజల ఉత్పత్తి 2.52 కోట్ల టన్నులు కాగా, అందులో వంట నూనెల ఉత్పత్తి 70 లక్షల టన్నులుగా ఉంది. పైగా ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పాదకత కేవలం మూడో వంతు మాత్రమే. అందుకే ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటోంది. తెలంగాణలో 42 వేల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేటల్లో సాగు చేస్తున్నారు. కానీ ఉత్పాదకత తక్కువగా ఉండటంతో ఉత్పత్తి పెద్దగా లేదు. దీంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ వంట నూనెల కొరత వేధిస్తోంది. కార్యాచరణ ప్రణాళిక.. పామాయిల్ సాగును పెంచడం ద్వారానే రాష్ట్రంలో వంట నూనెల కొరతను అధిగమించవచ్చని ఉద్యానశాఖ భావిస్తుంది. మరో 75 వేల ఎకరాలకు పామాయిల్ సాగు విస్తరిస్తే రాష్ట్రంలో నెలకొన్న 3 లక్షల టన్నుల వంట నూనెల కొరతను అధిగమించవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న 4 జిల్లాలు కాకుండా ఇతర జిల్లాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకోసం వివిధ ప్రాంతాల్లో పామాయిల్ సాగుకు గల అనుకూలతలను అధ్యయనం చేస్తున్నట్లు ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే పామాయిల్ సాగుకు అనువైన జిల్లాలను సర్వే చేయించామన్నారు. ఆ సర్వే ద్వారా కొత్తగా 18 జిల్లాల్లోని 206 మండలాల్లో 6.95 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుకు అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఆ స్థాయిలో సాగు పెరిగితే అవసరాలు తీరడమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం ఏర్పడుతుంది. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందన్నారు. కొత్తగా ప్రతిపాదించిన జిల్లాల్లో పామాయిల్ సాగుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. క్రూడ్ పామాయిల్ రికవరీ శాతాన్ని రైతుల కోరిక మేరకు 18.94 శాతంగా నిర్ణయించామని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇది 18.43 శాతంగా ఉంది. దీనివల్ల రైతులకు ఈ ఏడాది పామాయిల్ గెలలకు అధిక ధర లభించనుంది. -
పా‘మాయ’లు సాగనివ్వం
బొబ్బిలి కోట ముందే తేల్చుకుంటాం మంత్రి సుజయ్కృష్ణ రంగారావు తన భూములను రక్షించుకునేందుకు, తన అనుచరులకు పనికి రాని భూములకు ఎక్కువ ధర వచ్చేలా సర్కారుకు అంటగట్టేందుకే మంత్రి పదవి సంపాదించుకున్నారు. శిష్టు సీతారాంపురంలో ఎస్సీలకు ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం ద్వారా పంపిణీ చేసేందుకు ఎకరా కనీసం రూ.6లక్షలు కూడా చెయ్యని భూములను అధికారులతో రూ.14 లక్షలకు కొనుగోలు చేయించిన ఘనత మంత్రిది. కొనుగోలు చేసిన భూముల్లో ఎకరాకు రూ.2 నుంచి రూ.3లక్షల వరకు మంత్రి కమీషన్లు దండుకుంటున్నారు. ఈ భూదందా, దోపిడీలపై బొబ్బిలి కోట ముందే సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తాం. ప్రజాక్షేత్రంలోనే దీనిపై తేల్చుకుంటాం. – బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు సాక్షి ప్రతినిధి, విజయనగరం/టాస్క్ఫోర్స్ : రామభద్రపురం మండలం శిష్టు సీతారాంపురం సిత్రాలు అందరినీ నివ్వెరపోయేలా చేశాయి. తెరవెనుక జరిగిన బాగోతంపై వరుసగా వస్తున్న కథనాలు నేతల్లో కదలిక తీసుకువచ్చాయి. అధికారవర్గాల్లో వణుకు పుట్టించాయి. తప్పు చేసిన వారు నోరెత్తడానికే భయపడి బయటకు రావడం లేదు. పెద్దలకు అండగా వ్యవహారాన్నంతా నడిపించిన జిల్లా అధికారుల్లో ఒకరు జ్వరం వచ్చిందంటూ విధులకు సెలవు పెట్టేస్తే... మరికొందరు తప్పును కప్పిపుచ్చుకునే యత్నాలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి అనుచరులు రంగంలోకి దిగి అధికారులను, ప్రజలను భయపెట్టడం మొదలుపెట్టారు. సాక్షికి ఎలాంటి సమాచారం అందించడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. సాక్షికి ఎవరైనా వాస్తవాలు వెల్లడిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. దళితులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదంటూ విపక్షాలు వారికి అండగా నిలబడేందుకు ముందుకు వచ్చాయి. అధికారపార్టీ నాయకులే కారకులు తక్కువధర భూములు అధికధరలకు కొనుగోలు చేసిన స్కాంలో అధికారపార్టీ నాయకులే కీలకం. మంత్రి అనుచరులు చేసిన ఈ స్కాంలో మంత్రి పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై విచారణ చేసి సూత్రధారులపై చర్యలు చేపట్టి ఎస్సీలకు న్యాయం చేయాలి. బా«ధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలి. – ఒమ్మి రమణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, బొబ్బిలి అధికారులు, పాలకులు కుమ్మక్కయ్యారు ఎస్.సీతారాంపురం భూ పంపిణీ పథకంతో అధికారులు, ప్రభుత్వం కలసి దళితులను ఇరుకున పెడుతున్నాయి. వాళ్ళ నెత్తిన రుణాల భారాన్ని రుద్దుతున్నాయి. దళితుల సంక్షేమాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం దళితులను అనేక చిక్కుల్లో, ఇబ్బందుల్లో పెడుతోంది. ఇప్పటికీ పేదరికంలో మగ్గుతున్న వారిని మరింత అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – పి.కామేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దళితులను దగా చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక జిల్లాలో అనేక చోట్ల అనేక రకాలుగా దళితులపై దాడులు పెరిగాయి. భూ పంపిణీ పథకంలో దళితులను ఇరుకున పెట్టి వాళ్ళకు తెలియకుండానే అప్పుల పాలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలను సీపీఎం చూస్తూ ఊరుకోదు. సీతారాంపురం దళితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. బొబ్బిలి రాజులు అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్ని లాక్కుంటున్నారు. – తమ్మినేని సూర్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి. సబ్ రిజిస్ట్రార్ నిర్ధారించిన ధరే రామభద్రపురం మండలం శిష్టు సీతారాంపురంలో పేదలకు పంపిణీ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ నిర్ధారించిన మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేశాం. చుట్టుపక్కల ధరలను కమిటీ పరిశీలించి అందుకు అనుగుణంగా ధర నిర్ణయించింది. సాధారణ భూములు రూ.13 లక్షల వరకు ధర పలుకుతుంది. శిష్టు సీతారాంపురంలో ఆయిల్పామ్ తోటలు పెంచి డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో వాటికి అయిన ఖర్చును కలుపుకొని అందుకు అనుగుణంగా ధరను నిర్ణయించాం. రెండునెలల క్రితమే ఈ ప్రక్రియ పూర్తిచేశాం. కమిటీలో ఎస్సీ కార్పొరేషన్, ఇరిగేషన్, ఎలక్ట్రికల్, ఉద్యానవనశాఖ, రెవెన్యూశాఖ అధికారులు ఉన్నారు. – బి.సుదర్శనదొర, ఆర్డీఓ, పార్వతీపురం కఠిన చర్యలు చేపట్టాలి వరుసగా పత్రికలో కథనాలు వస్తున్నా అటు అధికారులు కానీ, ఇటు అధికారపార్టీకానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. శిష్టు సీతారాంపురంలో ఎకరా రూ.7లేదా రూ.8లక్షలు ఉంటుంది. అలాంటిది రూ.14లక్షలు ఎలా అంచనా వేసి కొనుగోలు చేశారు? దీనిలో ఎవరి పాత్ర ఎంత ఉందో దర్యాప్తు చేయాలి. బాధ్యులపై చర్యలు చేపట్టాలి. – రెడ్డివేణు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు, బొబ్బిలి ఇదేనా నీతివంతమైన పాలన? మంత్రి నీతివంతమైన పాలన ఇదేనా? గతంలో పేద ఎస్టీలకు ఇచ్చిన భూములు లాక్కున్నారు. ప్రస్తుతం ఎస్సీలకు పనికిరాని ఆయిల్పామ్ తోటను కమీషన్లకోసం బలవంతంగా అంటగట్టి పెద్ద స్కాంకు తెరతీశారు. పాత్రధారులు ఎవరైనా వారిపై చర్యలు చేపట్టాలి. పేదలకు న్యాయం చేయాలి. ఎవరూ నోరుమెదపకపోవడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సమాధానం చెప్పాలి. – ఆకుల దామోదరరావు, లోక్సత్తా రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు, బొబ్బిలి. -
నూనెకు సుంకం సెగ
శ్రీకాకుళం: నూనెల ధరలు మండిపోతున్నాయి. దిగుమతులపై సుంకాన్ని కేంద్రం పెంచుతుండటంతో పామాయిల్, సన్ఫ్లవర్ నూనెల ధరలు ని ప్పులు కక్కుతున్నాయి. కిలో నూనెపై ఒక్కరోజులో రూ.10 పెరిగింది. డబ్బా పరంగా (15 కిలోలు) చూసుకుంటే రూ. 150 పెరిగింది. నూనెల మార్కె ట్ చరిత్రలో ఇంత పెరుగుదల కనిపించడం ఇదే ప్రథమం. మలేషియా నుంచి రాష్ట్రంలోని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల మీదుగా పామ్క్రూడ్ (శుద్ధి చేయని పామాయిల్), పామాయిల్ (రిఫైన్డ్ చేసిన పామాయిల్), సన్ఫ్లవర్ నూనె దిగుమతి అవుతోంది. దిగుమతులను ప్రోత్సహించే క్రమంలో 200 శాతం ఉన్న సుంకాన్ని గత యూపీఏ ప్రభుత్వం క్రమేణా తగ్గించుకుంటూ వచ్చింది. చివరకు దిగుమతి సుంకం జీరోకు చేరుకుంది. దేశంలో పా మాయిల్ సాగు విస్తరించడం, విదేశాల నుంచి ఈ నూనెను దిగుమతి చేసుకుంటే దేశీయ రైతులకు నష్టం వాటిల్లుతుందనే కారణంగా కేంద్రం ఇటీవల పామ్క్రూడ్ దిగుమతులపై సుంకాలు విధించడం మొదలైంది. 12 శాతంగా మొదలై 30 శాతానికి చేరుకుంది. బుధవారం నుంచి ఇది మరింత ఎగసి 44 శాతానికి పెరిగింది. దీనిపై సంక్షేమ సర్చార్జీలు 4.4 శాతం కలిపితే దిగుమతి సుంకం 48.4 శాతా నికి చేరుకుంది. ఈ ప్రభావం నేరుగా ధరపై పడి ఒక్కరోజులో కిలో పామాయిల్ ధర రిటైల్ మార్కెట్లో రూ.10 పెరిగి రికార్డు సృష్టించింది. రిఫైన్డ్ బ్లీచ్డ్ డీ ఆక్సైడ్ ఆయిల్ (డీబీడీ) శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులపై కూడా సుంకాలు పెరిగాయి. 40 శాతంగా ఉన్న దిగుమతి సుంకం 59.40 శాతానికి చేరుకుంది. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో పామాయిల్, సన్ఫ్లవర్కు, ఇతర నూనెల ధ రలకు రెక్కలు వచ్చాయి. పది కిలోల పామాయిల్ రూ.670 నుంచి రూ.770కి చేరుకుంది. సన్ఫ్లవర్ ఆయిల్ 10 కిలోల ధర రూ.750 నుంచి రూ.850 కి చేరుకుంది. వీటి ప్రభావం మిగిలిన నూనెల ధరలపై కూడా పడింది. 10 కిలోల రిఫైన్డ్ కాటన్ సీడ్ ఆయిల్ ధర రూ.723 నుంచి రూ.790కు పెరిగింది. చేతులెత్తేసిన దిగుమతిదారులు కాకినాడ, కృష్ణపట్నం రేవుల్లో సుమారు 10 మంది దిగుమతిదారులు నూనెల దిగుమతులు నిలిపివేశారు. ఒక్కసారిగా రికార్డు స్థాయిలో నూనెల ధర పెరగడంతో మార్కెట్లో నూనె వ్యాపారం స్తంభించిపోయింది. ఈ కారణంగా జిల్లాలోని హోల్సేల్ నూనె వ్యాపారుల కొనుగోలు చేయడం నిలిపివేశారు. ఈ ప్రభావం ఇప్పటికే ఉన్న స్టాక్ పడి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. కొందరి వ్యాపారుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రూ.10 కోట్ల వరకూ భారం పెరిగిన ఒక్క పామాయిల్, సన్ఫ్లవర్ ధరలను చూసుకుంటే రాష్ట్రంలోని వినియోగదారులపై రూ.8 కోట్ల భారం పడినట్టు తెలుస్తోంది. రోజుకు రాష్ట్రానికి రెం డు పోర్టుల ద్వారా 90 ట్యాంకుల పామాయిల్ దిగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీని ప్రకారం నెలకు 2,700 ట్యాంకర్ల ద్వారా నూనె దిగుమతి అవుతోంది. ఒక్కో ట్యాంకరులో వెయ్యి కిలోల నూనె ఉంటుంది. ఒక్కొక్క ట్యాంకరుకు రూ.21వేల ధర పెరుగుతోంది. 90 ట్యాంకర్లకు కలిపితే రూ.18 .90 లక్షల పెరుగుదల ఉండగా, మొత్తంగా రూ.8కో ట్ల పైమాటే. జిల్లా విషయానికి వస్తే రోజుకి 6 టన్ను ల పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ విక్రయం అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈలెక్కన రోజుకు జిల్లా ప్రజలపై రూ.60వేల భారం పడుతుంది. గతంలో ఎప్పుడూ లేనంత పెరుగుదల తొలిసారిగా నూనెల ధర ఒక్కసారిగా పెరగడం చూస్తున్నా. ఇంతలా మార్కెట్ చరిత్రలోనే నమోదుకాలేదు. ఏకంగా కిలోకు రూ.8 దాటి పెరుగుదల ఉంది. సర్చార్జీ, పన్నులు కలుపుకొని కిలోకు రూ.10 పెరిగింది. దిగుమతి సుంకం 12 శాతం నుంచి సుమారు 50 శాతం దాటి పెరిగింది. ఈ ధరల్లో నూనె వ్యాపారం చేస్తే సొమ్ముకు వడ్డీ కూడా దండగలా ఉంది. – శ్రీనివాసరావు,హోల్సేల్ నూనెల వ్యాపారి, శ్రీకాకుళం -
పామాయిల్ విక్రయాల్లోకి ట్రైమెక్స్
⇒ భారత్లో ఫెల్డా బ్రాండ్తో రిటైల్లోకి ⇒ దేశవ్యాప్తంగా రిఫైనరీల ఏర్పాటు ⇒ రూ.1,000 కోట్ల దాకా పెట్టుబడి ⇒ ట్రైమెక్స్ ఈడీ ప్రశాంత్ కోనేరు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఖనిజాలు, లోహాల వ్యాపారంలో ఉన్న ట్రైమెక్స్ ఇండస్ట్రీస్ తాజాగా పామాయిల్ విపణిలోకి ప్రవేశించింది. ముడి పామాయిల్ ఉత్పత్తిలో ప్రపంచ దిగ్గజమైన మలేషియా సంస్థ ఫెల్డా గ్లోబల్ వెంచర్స్ హోల్డింగ్ బెర్హడ్తో కంపెనీ చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం కింద ఫెల్డా ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ట్రైమెక్స్ విక్రయిస్తుంది. దేశీయంగా తయారైన ఫెల్డా బ్రాండ్ పామాయిల్ ఉత్పత్తులను 2017 చివరినాటికి ప్రవేశపెడతామని ట్రైమెక్స్ ఈడీ ప్రశాంత్ కోనేరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు కంపెనీ తొలి ప్రాధాన్యతగా చెప్పారు. సామాన్యుల కోసం ప్రత్యేకంగా 250 గ్రాముల సైజులో సైతం ప్యాక్లను తీసుకొస్తామని వెల్లడించారు. 2021 నాటికి టాప్ బ్రాండ్లలో ఒకటిగా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రపంచ పామాయిల్ వినియోగంలో 12 శాతం వాటాతో భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఫెల్డా గ్లోబల్ ఇప్పటికే ఏటా 6 లక్షల టన్నుల పామాయిల్ ఉత్పత్తులను భారత్లోని పలు కంపెనీలకు సరఫరా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనూ రిఫైనరీ.. మలేషియాలోని ఫెల్డా ప్లాంట్ల నుంచి ముడి పామాయిల్ను దిగుమతి చేసుకుని భారత్లో శుద్ధి, ప్యాకింగ్ చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న రిఫైనరీల కొనుగోలు లేదా కొత్తవి ఏర్పాటు చేస్తామని ప్రశాంత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లతోపాటు దేశవ్యాప్తంగా రెండేళ్లలో 8–10 రిఫైనరీలు అందుబాటులోకి రానున్నాయి. 2.5 లక్షల లీటర్ల వార్షిక సామర్థ్యంతో ప్రారంభించి 15 లక్షల లీటర్ల స్థాయికి తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. రిఫైనరీల ఏర్పాటు, మార్కెటింగ్కుగాను వచ్చే మూడేళ్లలో రూ.1,000 కోట్ల దాకా ఇరు సంస్థలు పెట్టుబడి పెడతాయని చెప్పారు. రిటైల్ ధర ఇతర కంపెనీలకు పోటీనిచ్చేదిగా ఉంటుందని అన్నారు. మలేషియాలో పామాయిల్ గెలలను చెట్టు నుంచి వేరు చేసిన 24 గంటల్లోపే ముడి నూనెగా మార్చగలిగే వ్యవస్థ ఫెల్డాకు ఉందని వివరించారు. భారత్లో పామాయిల్ సాగు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కాగా, భారత్కు దిగుమతి అవుతున్న ముడి వంట నూనెల్లో పామాయిల్ వాటా అత్యధికంగా 54 శాతముంది. -
‘ఆయిల్ఫెడ్’లో అధికారుల ఇష్టారాజ్యం
- అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి పాత బాయిలర్ కొనుగోలు - ప్రారంభించి నెల దాటినా పనిచేయని వైనం - కీలక సమయంలో 4 నెలలు ఫ్యాక్టరీ మూసివేత... రూ.12 కోట్లు నష్టం సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ విస్తరణ వివాదంగా మారింది. పామాయిల్ ఫ్యాక్టరీ ఆధునికీకరణ, విస్తరణను గత నెల 16న స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్ ప్రారంభించారు. పనిచేయని పాత బాయిలర్ను ఏర్పాటు చేయడంతో అది ఇంకా పనిచేయడం లేదు. తాజాగా శనివారం బాయిలర్ అధిక ఉష్ణోగ్రత కారణంగా అందులోని గోడలు విరిగి పడిపోయాయి. దీంతో అది పని చేస్తుందా లేదా అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో పామాయిల్ తోటలు అధికంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనే ఉన్నాయి. వాటిని రైతుల నుంచి కొనుగోలు చేయాల్సిన బాధ్యత అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీదే. రోజు రోజుకూ పామాయిల్ సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో అదే జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో మరింత సామర్థ్యంతో సుమారు రూ.75 కోట్లతో మరో కొత్త ఫ్యాక్టరీకి రంగం సిద్ధం చేశారు. అది సిద్ధమయ్యేలోగా ప్రస్తుతం అశ్వారావుపేటలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని విస్తరించాలని నిర్ణయించారు. గంటకు 30 టన్నులకు పెంచాలనేది దీని ఉద్దేశం. అందుకోసం జాప్రో అనే కంపెనీకి విస్తరణ యంత్రాలను అందించేందుకు టెండర్ అప్పగించారు. సరఫరా చేసే యంత్రాల్లో కీలకమైన బాయిలర్ను ఆ కంపెనీకి అప్పగించలేదు. ముంబయిలో ఒక పాత దాన్ని రూ.1.90 కోట్లకు కొనుగోలు చేశారు. వాస్తవంగా కొత్త బాయిలర్ ఖరీదు రూ.2.50 కోట్లు ఉండగా పాతదాన్ని అంతధరకు ఎందుకు కొనుగోలు చేశారని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఫైబర్ బాయిలర్కు బదులు కోల్ బాయిలర్ కొనుగోలు చేయడం గమనార్హం. కొందరు అధికారులు కమీషన్ల కోసమే ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆయిల్ఫెడ్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. నెల రోజులుగా విస్తరణ విభాగం పనిచేయడంలేదు. విస్తరణ కోసం నాలుగు నెలలపాటు ఫ్యాక్టరీని మూసేశారని, దీనివల్ల 40 వేల టన్నుల పామాయిల్ గెలలను ఇతర చోట్లకు పంపారని, ఫలితంగా ఆయిల్ఫెడ్కు రూ. 12 కోట్లు నష్టం వచ్చిందని ఆరోపించారు. నాలుగైదు రోజుల్లో మరమ్మతులు పూర్తి: మురళి, ఎం.డి., ఆయిల్ఫెడ్ బాయిలర్ అధిక వేడి కారణంగా అందులోని గోడలు పగిలిపోయిన మాట వాస్తవమేనని ఆయిల్ఫెడ్ ఎం.డి. మురళి అశ్వారావుపేటలో విలేకరులకు తెలిపారు. త్వరలో బాగు చేసి నడిపిస్తామని చెప్పారు. -
పాపాల గుట్టు రట్టు
♦ సాక్ష్యాలతో పట్టుకున్న పోలీసులు ♦ సామగ్రి స్వాధీనం... అదుపులో నిందితుడు అశ్వారావుపేట : పాలు.. తాగడమంటే ఎవరికైనా ఇష్టమే. విటమిన్లు ఉంటాయని.. అందరూ తాగొచ్చని వైద్యులు సలహాలు సూచనలు చేస్తారు.. కానీ.. ఇక్కడి పాలు తాగిన వారు డబ్బులిచ్చి చేజేతులా ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నట్లే.. యూరియా, వంట నూనె, పంచదార, పాలపిండి, మంచినీళ్లతో క్షణాల్లో పాలు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పోలీసుల తనిఖీల్లో ఏళ్ల తరబడి కుటీర పరిశ్రమలా నడుస్తున్న నకిలీ పాల గుట్టు రట్టు కావడంతో ఊరి జనమంతా ఇదెక్కడి దందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అచ్యుతాపురం గ్రామానికి చెందిన పాల సేకరణ వ్యాపారి ఇంట్లో ఏళ్ల తరబడి గుట్టుగా నిర్వహిస్తున్న నకిలీ పాల తయారీ యంత్రాన్ని అశ్వారాపుపేట, దమ్మపేట పోలీసులు సోమవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. నిర్వాహకుడు పాలను సృష్టిస్తుండగా ఆధారాలతో సహా దొరికిపోయాడు. అచ్యుతాపురం, నారంవారిగూడెం గ్రామాల్లో పాల ఉత్పత్తి ఎక్కువ. ఇక్కడి నుంచి చాలా మంది పాలను సేకరించి.. ప్రైవేటు డెయిరీలకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో ఇదే వ్యాపారం చేస్తున్న అచ్యుతాపురానికి చెందిన వేజల మురళి ఇంటి ముందు దమ్మపేట ఎస్సై నాగరాజు, అశ్వారావుపేట పీఎస్సై వెంకన్న, ఏఎస్సై కోటేశ్వరరావు, రెండు పోలీస్స్టేషన్ల సిబ్బంది తెల్లవారేసరికి ఉన్నారు. దీంతో గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. తీరా అతగాడే నకిలీ పాలు తయారు చేస్తున్నాడని తెలిసి నిర్ఘాంతపోయారు. క్షణాల్లో పాల తయారీ.. విష పదార్థాలేమీ లేకుండా యూరియా, వంట నూనె, పంచదార, పాలపిండి, మంచినీళ్లతో క్షణాల్లో పాలు తయారు చేస్తున్నాడు. లీటరు నూనె, కిలో యూరియా, లీటరు నీళ్లు, పావుకిలో పంచదార, పావుకిలో పాలపిండి కలిపి సరిపడా నీళ్లు పోసి అన్నింటినీ ఒకే మిశ్రమంగా పాల సేకరణ డ్రమ్ములో కలుపుతున్నాడు. తర్వాత విద్యుత్ మోటార్కు అమర్చిన కవ్వంతో చిలుకుతున్నాడు. డ్రమ్ముపై మూత గట్టిగా ఉండటంతో చుక్క కూడా బయట పడకుండా మిశ్రమం అంతా మదించబడి పాలవంటి పదార్థం పైకి తేలుతుంది. దీనిని సేకరించిన పాలలో కలిపి పాల సేకరణ కేంద్రాలకు విక్రయిస్తున్నాడు. పాలలోని వెన్న శాతాన్నిబట్టి ప్రైవేటు కంపెనీలు లీటరుకు రూ.70 వరకు చెల్లిస్తుండటంతో.. రూ.100 పెట్టుబడితోనే రూ.వెయ్యి విలువైన పాలవ ంటి మిశ్రమాన్ని తయారు చేస్తున్నాడు. సేకరణ కేంద్రాల నుంచి పసిపిల్లల దాకా.. పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, కుడితి, పశువు, పొదుగు లేకుండా ఎరువు, వంటనూనెతో తయారు చేసిన నకిలీ పాలను అశ్వారావుపేట, దమ్మపేటలోని హెరిటేట్, మోడల్ డెయిరీలకు విక్రయిస్తుంటాడు. ఇతడితోపాటు ఇటువంటి పాల తయారీదారులు అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో వందలాది మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వాళ్లు విక్రయించిన నకిలీ పాలు పాల శీతలీకరణ కేంద్రాల గుండా మిల్క్ చిల్లింగ్ సెంటర్లకు తరలిస్తారు. ఇక్కడి నుంచి పలు పరిమాణాల్లో ప్యాకెట్ల రూపంలో ఐఎస్ఓ స్టాండర్డ్లతో విక్రయిస్తుంటారు. కొనే పాల ప్యాకెట్లో విషం పసిపాపల నుంచి వృద్ధుల వరకు ప్రభావాన్ని చూపుతోందని నిర్వాహకుడు చెప్పేదాన్నిబట్టి తెలుస్తోంది. శాస్త్రం తెలిసిన వ్యక్తే ఆద్యుడు.. అశ్వారావుపేటలోని మోడల్ డెయిరీలో గతంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసిన రామకృష్ణ అనే వ్యక్తి ఈ టెక్నాలజీని పరిచయం చేసినట్లు చెబుతున్నాడు మురళి. పాల లో వెన్న శాతం అధికంగా రావాలంటే.. పాలు అధికంగా ఉండాలంటే ఇలా నూనె, ఎరువులు కలిపితే లాభాలు వస్తాయని చెప్పినట్లు చెబుతున్నాడు. ఆఫ్ హెచ్పీ మోటార్, ప్లాస్టిక్ కవ్వం, కలిపే విధానం, టెక్నాలజీని నేర్పినందుకు రూ.35వేలు తీసుకున్నట్లు చెబుతున్నాడు. పాల తయారీకి వాడిన నూనె ప్యాకెట్లను ఎప్పటికప్పుడు ఇంటి ఆవరణలోనే తగుల బెడుతున్నాడు. అంతేకాక గ్రామంలో ఎవరితోనూ వివాదం లేకుండా అమాయకుడిలా కనిపించే మురళి ఇలా చేయడం గ్రామస్తులను విస్మయానికి గురిచేస్తోంది. పాలు కొనేందుకు ఎవరయినా వచ్చినా.. ఇంటిలో నుంచి తడికదాకా వచ్చి పాలు పోసే వాడని.. తీరా పోలీసులు వచ్చాక మోసం బయటపడిందని గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు. ైరె తుల నుంచి రోజుకు 40 లీటర్ల పాలు సేకరించి.. తర్వాత 450 లీటర్ల పాలు విక్రయించడంపై గ్రామస్తులకు వచ్చిన అనుమానంతో గుట్టు పాల తయారీకి వాడిన 80 నూనె ప్యాకెట్లు, 8 డ్రమ్ములు, 20 కిలోల యూరియా, పాలపిండి, పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
‘పప్పు’లేని మెతుకు నూనెకు నోచుకోని బతుకు
♦ 5 నెలలుగా అందని కందిపప్పు ♦ ఏడాదిన్నరగా నిలిచిపోయిన పామాయిల్ ♦ నిర్వీర్యమవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ ♦ నెలల తరబడి అందని సరుకులు ♦ జిల్లాలో 7.79 లక్షల ఆహారభద్రత కార్డులు ♦ బహిరంగ మార్కెట్లో మండుతున్న ధరలు ♦ బియ్యం, చక్కెర, గోధుమలతోనే సరి జోగిపేట: బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు కొని తినలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చౌక ధరల దుకాణాల ద్వారా రాయితీపై నిత్యావసర వస్తువులను అందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. సరఫరాను బియ్యం, చక్కెర, గోధుమలకే పరిమితం చేసింది. నిల్వలు లేవని గతంలో పసుపు, ఉప్పు, కారం, పామాయిల్, గోధుమ పిండి, చింతపండు సరఫరాలను నిలిపివేసిన ప్రభుత్వం 5 నెలలుగా కందిపప్పును కూడా ఆపేసింది. దీంతో నిత్యావసర వస్తువులు మార్కెట్లో కొనలేక లబ్ధిదారులు ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. కరువుతో అల్లాడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలపై కనికరం చూపాల్సిన ప్రభుత్వం కనీసం పప్పు మెతుకులకు నోచుకోకుండా చేసిందని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో 1077 గ్రామ పంచాయతీలలో 7.79 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. వీటికి ప్రతి నెలా బియ్యంతో పాటు గోధుమలు పంపిణీ చేస్తున్నారు. బయట మార్కెట్లో ఈ వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంతగా పెరిగిపోవడంత ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తోంది. కానీ నిల్వలు లేవని గడిచిన 5 నెలలుగా కందిపప్పు సరఫరా నిలిపేసింది. కొన్ని సార్లు కార్డుకు అరకిలో ఇచ్చే చక్కెరను కూడా పంపిణీ చేయలేకపోతున్నారు. తొమ్మిది వస్తువులకు మంగళం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రూ.185కే 9 నిత్యావసర వస్తువులను చౌక ధరల దుకాణాల ద్వారా పేద ప్రజలకు అందించారు. రూ.40 కి పామాయిల్, రూ.50కి కందిపప్పు, రూ.10 పసుపు, రూ.7 గోధుమలు, రూ.5కు ఉప్పు, రూ.6.75కు చక్కెర, రూ.30కి చింతపండు, రూ.20కి కారం, రూ.16.50కి గోధుమ పిండిని పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బియ్యం కోటా లబ్దిదారుడికి రూ.4 కిలోల నుంచి 6 కిలోలకు పెంచి సంతోషపెట్టారు. కానీ తొమ్మిది నిత్యావసర వస్తువుల సంఖ్యను తగ్గించారు. ఉప్పుకారం, గోధుమ పిండి, పసుపు, చింతపండు, పామాయిల్ సరఫరా గత ఏడాది నుంచి నిలిపివేశారు. ఐదు మాసాల క్రితం కంది పప్పును నిలిపివే సారు. కందిపప్పు, చక్కెర ధరలతో అవస్థలు బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.120 నుంచి రూ.150కి పెరిగింది. చౌకధర దుకాణాలలో కిలో రూ.50కేల దొరికేది. చక్కెర కిలో రూ.40 పలుకుతుంది. చౌకధరల దుకాణంలో రూ.14కు వచ్చేది ఈ పరిస్థితిలో ఈ రెండు వస్తువులు చౌక ధరల దుకాణాల్లో లేకపోవడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. తొమ్మిది వస్తువులను పునరుద్ధరించాలి గతంలో చౌక ధరల దుకాణం ద్వారా రూ.185కే తొమ్మిది వస్తువులు ఇచ్చే వారు. ప్రస్తుతం బియ్యం, గోధుమలు, చక్కెర మాత్రమే ఇస్తున్నారు. కంది పప్పు నిలిచిపోవడంతో చాలా కష్టంగా ఉంది. గతంలో పామాయిల్, కందిపప్పులను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేవారు. తిరిగి నిలిపివేసిన వస్తువులన్నింటిని పంపిణీ చేసి ఆదుకోవాలి. పేద ప్రజలు పండుగలు చేసుకోవాలంటేనే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. - లక్ష్మి, రాంసానిపల్లి పామాయిల్, కందిపప్పు సరఫరా లేదు రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు తగ్గిన మాట వాస్తవమే. ప్రస్తుతం చక్కెర, బియ్యం, గోధుమలు, గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో 7 లక్షలకు పైగా ఆహార భద్రత కార్డులున్నాయి. గత సంవత్సరం నుంచి పామాయిల్ను సరఫరా చేయడం లేదు. కొన్ని నెలలుగా కంది పప్పు కూడా రాకపోవడంతో దుకాణాలల్లో పంపిణీ చేయలేకపోతున్నాం. పామాయిల్కు బదులుగా వేరే ఆయిల్ను పంపిణీ చేసేందుకు అధికారులు యోచిస్తున్నారు. పేదలకు అవసరమయ్యే బియ్యం విషయంలో మాత్రం గట్టి చర్యలు తీసుకుంటున్నాం. అనురాధ, డీఎస్ఓ సంగారెడ్డి -
ఆయిల్ కోసం ఉరుకులు పరుగులు
పిడుగురాళ్లరూరల్ : ఆయిల్ ట్యాంకర్కు గేదె అడ్డుగా రావడంతో ట్యాంకర్ బోల్తాపడి ఒకరు గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ కామేపల్లి గ్రామ బైపాస్ మీద గేదె అడ్డుగా రావడంతో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ సుభాని గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతనిని స్థానిక ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. బోల్తాపడిన ట్యాంకర్ నుంచి లీకవుతున్న ఆయిల్ కోసం చుట్టుపక్కల గ్రావూల నుంచి ప్రజలు బిందెలు, బకెట్లు పట్టుకుని ఆ ప్రాంతానికి పరుగులుదీశారు. బిస్కెట్ల తయూరీకి దీనిని వాడతారని, ఇళ్లల్లో వినియోగించవచ్చా లేదో తెలియదని లారీ క్లీనర్ చెప్పాడు. -
కాలువై పారిన ముడి పామాయిల్
గుంటూరు : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి వద్ద పామాయిల్ వరదై ప్రవహించింది. స్థానికులు బిందెలు, బకెట్లతో పట్టుకెళ్లారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు ముడి పామాయిల్తో వెళ్తున్న ట్యాంకర్ మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్యాంకులోని ఆయిల్ కిందికి లీకై పక్కనే ఉన్న పంట కాల్వ నిండింది. గమనించిన గ్రామస్తులు వెంటనే బిందెలు, బకెట్లతో అక్కడికి చేరుకుని పామాయిల్ను పట్టుకెళ్లిపోయారు. అది వంటకు పనికి రాదని ట్యాంకర్ డ్రైవర్ వారించినా పట్టించుకోలేదు. -
జీరో కమాల్
►చక్కర, సబ్బులు, నూనెసహా నిత్యావసర వస్తువుల అక్రమ దందా ►రోజూ రూ.10 లక్షల పన్నుఎగవేస్తూ ఒకే బ్రాండ్ సబ్బుల దిగుమతి ►చక్కెర, నూనెలదిగుమతిలోనూ రోజుకు రూ.లక్షల్లో పన్ను ఎగవేత ►సర్కారు ఆదాయానికి ప్రతినెలా రూ.100 కోట్లకుపైగా గండి ►జోరుగా కల్తీనూనె వ్యాపారం.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ►కరీంనగర్ టవర్సర్కిల్, గంజ్ ప్రాంతాలు అడ్డాగా వ్యాపారం ►కార్పొరేషన్కు చెందిన ముఖ్య నేత అండతో చెలరేగుతున్న వైనం సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: ‘అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేదీ అక్రమాలకు అనర్హం’ అన్నట్లుగా జిల్లాలో పరిస్థితి తయారైంది. ఒకవైపు కల్తీ, మరోవైపు జీరో దందాతో సరుకులు దిగుమతి అవుతున్నాయి. చక్కెర, సబ్బులు, సర్ఫ్ వంటి వస్తువులు పన్నులు చెల్లించకుండా లారీల కొద్దీ దిగుమతి అవుతుండగా... పామాయిల్, పల్లీ, సన్ఫ్లవర్ నూనెల పేరుతో తయారు చేసిన కల్తీ నూనెల వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రతిరోజూ రూ.కోట్లలో పన్నును ఎగవేస్తూ కొందరు వ్యాపారులు జీరో దందా కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. జీరో దందా ఫలితంగా ప్రతినెలా పన్నుల రూపంలో సర్కారు ఖజానాకు చేరాల్సిన దాదాపు రూ.100 కోట్లు జీరో దందా కేటుగాళ్ల జేబుల్లోకి వెళుతోంది. మరోవైపు ఈ కేటుగాళ్లకు నగర పాలక సంస్థకు చెందిన ఓ ప్రజాప్రతినిధి అండతో చెలరేగుతున్నారు. ఒకే బ్రాండ్ సబ్బుతో సర్కారుకు రూ.కోటిన్నర గండి కరీంనగర్ జిల్లాలో బట్టల సబ్బుల్లో ఓ బ్రాండ్కు సంబంధించిన సబ్బుల విక్రయాలు విరివిగా అమ్ముడుపోతున్నారుు. తెలంగాణ సరిహద్దు జిల్లాలో ఈ బ్రాండ్ సబ్బు తయారవుతోంది. జిల్లాలో ప్రతిరోజు ఎన్ని బట్టల సబ్బులు అమ్ముడుపోతాయో అందులో సగం వాటా ఈ బ్రాండ్దే. ప్రతిరోజూ ఈ సబ్బుల కాటన్లతో జిల్లాకు లారీలు వస్తుంటారుు. నెలకు సగటున 40కిపైగా లారీలు జిల్లాకు వస్తుంటాయి. నిబంధనల ప్రకారం ఒక్కో లారీకి సుమారు రూ.5 లక్షల వరకు టాక్స్ చెల్లించాలి. ఆ మేరకు ట్యాక్స్ చెల్లించినప్పటికీ సదరు సబ్బుల డీలర్కు ఒక్కో లారీలోని కాటన్లను అమ్మడం ద్వారా రూ.5 లక్షల వరకు లాభం వస్తుంది. కానీ సదరు డీలర్ టాక్స్ చెల్లించకుండా తెలివిగా ఎత్తులు వేస్తున్నాడు. నెలలో 5 నుంచి 10 లారీలకు మాత్రమే టాక్స్ కట్టి మిగతా వాటిని అక్రమంగా జిల్లాకు తరలిస్తున్నారని తెలుస్తోంది. దీనివల్ల ఒక్కోలారీకి రూ.5 లక్షల టాక్స్ మిగలడమే కాకుండా మరో రూ.5 లక్షల లాభం చేకూరుతుందని తెలిసింది. కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, లక్షెట్టిపేటతోపాటు పలు ప్రాంతాలకు నగరం నుంచే ఈ సబ్బులను సరఫరా చేస్తున్నారు. టవర్సర్కిల్ అడ్డాగా నగరానికి చెందిన ఓ వ్యాపారి ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. సదరు వ్యాపారి జీరో దందాకు మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఓ ప్రజాప్రతినిధి అండ ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులకు ఈ వ్యాపారి జీరో దందా విషయం తెలిసినప్పటికీ ప్రజాప్రతినిధి మద్దతు ఉండటంతో కిమ్మనలేకపోతున్నారు. దీనికితోడు సదరు అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతుండటంతో తమకెందుకులే అనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. చక్కెర దందాతో రూ.కోటి గండి చక్కెర విషయంలోనూ ఇదే తంతు. ప్రతినెలా వందల కొద్దీ చక్కెర లారీలు జిల్లాకు వస్తుంటాయి. ఒక్క జిల్లా కేంద్రానికే ప్రతిరోజు సుమారు 5 లారీల చక్కెర దిగుమతి అవుతుంది. నిబంధనల ప్రకారం ఒక్కో లారీ లోడ్కు రూ.50 వేల మేరకు పన్ను చెల్లించాలి. ఆ పన్నులతో కలిపి అమ్మకాలు నిర్వహించాలి. కానీ టాక్స్లు చెల్లించకుండా రిటైల్ వ్యాపారులకు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు. తద్వారా ప్రతినెలా ప్రభుత్వ ఖజానాకు రూ.కోటికి పైగా గండికొడుతున్నారు. ప్రతినెలా మామూళ్లు వచ్చి చేరుతుండడంతోనే అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పుసహా పలు రకాల పప్పుల విషయంలోనూ ఇదే తంతు. నగరంలోని గంజ్ కేంద్రంగా కొందరు వ్యాపారులు రశీదులు, ట్యాక్స్లు లేకుండానే జీరో దందా కొనసాగిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. పప్పు, చక్కెర వంటి వాటిని శివారు ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. కల్తీ నూనె దందా... జిల్లాలో కల్తీ నూనె వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండా పోరుుంది. నిబంధనల ప్రకారం లూజ్ నూనె అమ్మకాలు చేయరాదు. కాని నగరంలోని పలు వ్యాపార ప్రాంతాల్లో వందలాదిడ్రమ్ముల్లో నూనె అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పామాయిల్, పల్లీ, సన్ఫ్లవర్ పేరుతో శుద్ధి చేయకుండా కల్తీ నూనె విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీటితోపాటు కొందరు అక్రమార్కులు కరీంనగర్ శివారు ప్రాంతాలు, సమీప గ్రామాల్లో డ్రమ్ముల కొద్దీ నూనెను నిల్వ చేస్తున్నారు. అక్కడే క్యాన్లు, టిన్లు, ప్యాకెట్లలో నూనెను నింపి కొత్త కొత్త పేర్లతో ప్యాకింగ్ చేస్తూ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రతి రోజు నకిలీ బ్రాండ్ల నూనె ప్యాకెట్లు, క్యాన్ల వ్యాపారం సుమారు రూ.10 లక్షలకుపైగా ఉంటున్నట్లు సమాచారం. అనుమతులు లేకుండా తయారు చేస్తున్న నూనెల్లో ప్రమాదకరమైన రసాయాలను కలపడమే కాకుండా శుద్ధి చేయకపోవడం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. గుట్కా రూటే సపరేటు ఒకప్పుడు జిల్లాలో గుట్కా విక్రయాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. గుట్కా అక్రమార్కులకు కరీంనగర్ కార్పొరేషన్కు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల అండ పుష్కలంగా ఉంది. ఇందులో ఒకరు గుట్కా దందాలో కీలక భాగస్వామి కాగా... మరొక ముఖ్యనేత అందడండలున్నారుు. ఇటీవల కరీంనగర్ మండలంలో సుమారు రూ.2.5 లక్షల విలువైన గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. రంగంలోకి దిగిన ముఖ్యనేత తన అధికారిన్ని అడ్డుపెట్టి గుట్కా బయటకు రాకుండా దొరికి చోటనే తాళలు వేయిం చారు. ఈ కే సులో ప్రమేయమున్న తన నమ్మకస్తున్ని చాకచక్యంగా తప్పించారనే ప్రచారం పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతోంది. -
పామాయిల్కు పాడె కడుతున్న సర్కారు
రాష్ట్రంలో అగచాట్లు పడుతున్న ఆయిల్పాం రైతులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్ రైతు సమస్యల వలయంలో చిక్కుకున్నాడు. తాను పండించిన ఆయిల్పాం గెలలను అమ్ముకోవడానికి అవకాశం లేక ఆర్థికంగా నష్టపోతున్నాడు. ఆయిల్పాం సాగు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నా.. అందుకు తగ్గట్లు గెలలను కొనుగోలు చేయడంలో విఫలమవుతోంది. దీంతో గత్యంతరం లేక రైతులు ప్రైవేటు ఫ్యాక్టరీలకు తెగనమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటుచేయకుండా, ఉన్న ఫ్యాక్టరీని విస్తరించకుండా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో దాదాపు 31 వేల ఎకరాల్లో ఆయిల్పాం తోటలున్నాయి. వీటి గెలలను క్రషింగ్ చేసేందుకు ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో క్రషింగ్ ఫ్యాక్టరీ ఉంది. దాని సామర్థ్యం రోజుకు 360 టన్నులే. కానీ సరాసరి రోజుకు వెయ్యి టన్నుల ఆయిల్పాం గెలలు వస్తున్నాయి. గెలలు నిల్వ ఉంటే చెడిపోతాయి.. దీన్ని ఆసరాగా తీసుకుంటున్న ఏపీ ఫ్యాక్టరీల యజమానులు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఫలితంగా రైతులు టన్నుకు రూ. 430 నష్టపోతున్నారు. రెండో ఫ్యాక్టరీ ఏర్పాటులో ఆలస్యం రాష్ట్రంలో ఒకే ఒక్క ఫ్యాక్టరీ ఉండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రెండో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని 2013లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించినా అది కార్యరూపం దాల్చలేదు. దమ్మపేట మండలం అప్పారావుపేటలో రెండో ఫ్యాక్టరీకి సంబంధించి ప్రస్తుతం రూ. 52 కోట్లతో టెండర్లు ఖరారు చేశారు. మలేిసియాకు చెందిన ప్రీ-యూనిక్ కంపెనీకి టెండర్ కట్టబెట్టారు. కానీ కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న అశ్వారావుపేట ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని రెండింతలు పెంచాలని యోచిస్తున్నారు. ఈ ఏడాది నుంచి పంట దిగుబడి 50 శాతం అదనంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విస్తరణ అయినా వేగంగా జరగకపోతే రైతులు మరిన్ని కష్టాలను ఎదుర్కొనక తప్పదు. తాము త్వరలో ముఖ్యమంత్రి, వ్యవసాయమంత్రిని కలసి తమ సమస్యలపై విన్నవిస్తామని దమ్మపేట ఆయిల్పాం రైతు సేవా సంఘం అధ్యక్షుడు డి.తాతారావు ‘సాక్షి’కి చెప్పారు. -
రూ.11 లక్షల విలువచేసే పామాయిల్ సీజ్
నెక్కొండ: అక్రమంగా పామాయిల్ను నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయిల్స్టోర్పై దాడి చేశారు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని జరిగింది. వివరాలు.. మండల కేంద్రంలోని తిరుమల అయిల్ స్టోర్లో అక్రమంగా పామాయిల్ నిల్వ చేసినట్టు అధికారులకు సమాచారం రావడంతో దాడి చేశారు. ఈ దాడిలో రూ. 11 లక్షల విలువ చేసే పామాయిల్ను నిల్వ ఉంచినట్లు గుర్తించి అధికారులు ఆయిల్ నిల్వలను సీజ్ చేశారు. యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేదల వంటనూనెకు మంగళం
- ఇక పామాయిల్ లేనట్లే.. - ఏడాదిన్నర నుంచి ఇదేతంతు.... - రేషన్ షాపుల్లో ప్రైవేట్ బ్రాండ్ల విక్రయం - పట్టని పౌరసరఫరాల శాఖ సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే పేదల వంట నూనె (పామాయిల్)కు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పామాయిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఏడాదిన్నర కాలంగా పామాయిల్ కోటా కేటాయింపు లేక పోవడంతో రేషన్ షాపుల్లో ప్రైవేట్ బ్రాండ్లు దర్శనమిస్తున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో డీలర్లు బహిరంగంగా ప్రైవేట్ బ్రాండ్ పామాయిల్ ప్యాకెట్లను లబ్ధిదారులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. నిరుపేదలకు దూరమే.. నిరుపేదలకు పామాయిల్ దూరమైంది. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో ప్రతీ నెల సుమారు 20.29 లక్షల లీటర్ల పామాయిల్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం అసలు కేటాయింపులే లేకుండా పోయాయి. గతంలో పామాయిల్ కోసం డీలర్లు డీడీలు చెల్లించినా పూర్తి స్థాయిలో సరఫరా చేయకపోవడంతో వారి డబ్బు ప్రభుత్వం వద్ద పెండింగ్లో పడిపోయింది. అసలు కేటాయింపులు లేకపోవడంతో డీలర్లు పామాయిల్ కోసం డీడీలు చెల్లించడం మానేశారు. దీంతో ప్రభుత్వ పామాయిల్ అడ్రస్ లేకుండా పోయింది. భగ్గుమంటున్న వంట నూనె ధరలు... బహిరంగ మార్కెట్లో వంట నూనె ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కనీసం లీటర్ నూనె ధర రూ.85 నుంచి 95ల వరకు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ ధరకు రెక్కలు రావడంతో మార్కెట్లో పామాయిల్ ధర రూ.58 నుంచి 65 వరకు పెరిగింది. గతంలో చౌకధరల దుకాణాల ద్వారా లీటరు రూ.40లకు లభించేది. బహిరంగ మార్కెట్లో మంచి నూనె ధరలు మండిపోతుండటంతో లబ్ధిదారులు పామాయిల్ కోసం గగ్గోలు పెడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. డీలర్లు ప్రైవేట్ బాండ్లను లబ్ధిదారులకు అంటగట్టి లీటర్కు రూ.65 రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అస్తవ్యస్తంగా రేషన్ పంపిణీ!
జిల్లాలో పౌరసరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆరు నెలలుగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. కందిపప్పు కూడా పంపిణీ చేయడం లేదు. దీంతో జిల్లాలోని సుమారు 11లక్షల మంది తెల్లకార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో పామాయిల్ ఇవ్వాలని పేదలు కోరుతున్నారు. విజయవాడ : ఆధార్ సీడింగ్.. పథకాల మార్పు పేరుతో పౌరసరఫరాల విభాగం అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని చౌకధరల దుకాణాల్లో పేదలకు సరుకులు సక్రమంగా అందడం లేదు. ఆరు నెలలుగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. బియ్యం, పంచదార, కిరోసిన్ మాత్రమే ఇస్తున్నారు. అక్కడక్కడా గోధుములు కూడా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 2,148 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా షాపుల ద్వారా 11,27,903 తెల్ల కార్డుదారులకు సరుకులు సరఫరా చేయాల్సి ఉంది. ఒక్కో కార్డుకు కిలో పామాయిల్ అందించాల్సి ఉంది. ఆరు నెలలుగా పామాయిల్ సరఫరా నిలిపివేయడంతో పేదలు మార్కెట్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు సరుకుల పంపిణీకి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సంక్రాంతికి కూడా తమకు పచ్చడిమెతుకులేనని పేదలు వాపోతున్నారు. ‘అమ్మహస్తం’కు బ్రేక్ గత కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మహస్తం పథకం పేరుతో తొమ్మిది రకాల సరుకులను 199 రూపాయలకు అందజేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని రద్దు చేసింది. దాని స్థానంలో ఎన్టీఆర్ పేరుతో ‘అన్నహస్తం’ అనే కొత్త పథకాన్ని జనవరి నుంచి ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. కానీ, దీనిపై నేటి వరకు అధికారులకు ఉత్తర్వులు అందలేదు. సంక్రాంతికి గిఫ్ట్ ప్యాక్ అందేనా! పేదల నిరసనలను నియంత్రించేందుకు ప్రభుత్వం ‘గిఫ్ట్ ప్యాక్’కు రూపకల్పన చేసినట్లు తెలిసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరిలో చౌకధరల దుకాణాల ద్వారా ఎన్టీఆర్ పేరుతో ఈ గిఫ్ట్ ప్యాక్లను అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్యాక్లో తక్కువ ధరకు బెల్లం, కందిపప్పు, సన్ఫ్లవర్ ఆయిల్ అందిస్తారని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే రేషన్ షాపు ద్వారా పాత పద్ధతిలోనే అన్ని సరుకులు పంపిణీ చేయాలని పేదలు కోరుతున్నారు. పేదల ఇబ్బందులు వర్ణణాతీతం ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలేదు. టీడీపీ ప్రభుత్వం పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం లేదు. పామాయిల్ ఇవ్వడంలేదు. ఇతరసరుకులు కూడా అరొకరగా ఇస్తున్నారు. మార్కెట్లో సరుకుల ధరలు చుక్కలనంటుతున్నాయి. కొనుగోలు చేయలేక పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - సీహెచ్ బాబూరావు, సీపీఎం నగర కార్యదర్శి -
పామాయిల్ రైతు నెత్తిన ‘క్రూడ్’ పిడుగు!
అంతర్జాతీయంగా తగ్గుతున్న క్రూడాయిల్ ధరలు పామాయిల్ రైతుల పాలిట పిడుగులయ్యాయి. తగ్గిన క్రూడాయిల్ ధరలతో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గి హర్షం వ్యక్తమవుతున్న తరుణంలో పామాయిల్ రైతులు మాత్రం గొల్లుమంటున్నారు. పామాయిల్ దిగుమతి కోసం భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న ప్రభుత్వం పామాయిల్ రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సిద్ధంకాకపోతుండడం విషాదకరం. - పుట్టా సోమన్న చౌదరి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు(క్రూడాయిల్) బ్యారల్ ధర తాజాగా 62 డాలర్లకు పడిపోవడంతో పామాయిల్ ముడి నూనె ధరపైన కూడా తీవ్రప్రభావం పడింది. ఈ కారణంగా స్థానికంగా టన్ను పామాయిల్ గెలల ధర కూడా భారీగా పతనమవుతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. సుమారు నెల క్రితం రూ. 8,400 ఉన్న ధర తొలుత రూ. 6,400 కు, ప్రస్తుతం రూ. 5,650కు పడిపోయింది. ధర వేగంగా తగ్గిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్ రైతులు ఈ పంట కొనసాగింపుపై పునరాలోచనలో పడ్డారు. పామాయిల్ తోటల పెంపకం మొదటి నుంచీ ఒడిదుడుకులతోనే సాగుతోంది. ఉద్యానవన పంటల్లో రాజుగా పేరుపొందిన పామాయిల్ తోటల పెంపకం అంతర్జాతీయ ముడి చమురు ధరలతో ముడిపడి ఉండటం ఒక ప్రధాన సమస్యగా మారింది. ఈ కారణంగా ముడిచమురు ధరలతోపాటు తరచూ ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూ రైతులను గందరగోళపరుస్తున్నాయి. ధరలు బాగా తగ్గినప్పుడు కనీస మద్దతు ధరను అమలుపర్చకపోవటం వల్ల రైతులు నష్టాలపాలవుతున్నారు. తెలుగు రైతులు భేష్ ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించిన మన దేశం నూనె గింజల సాగు విషయంలో చతికిలపడి.. ఏటా రూ. 40 వేల కోట్ల విలువైన పామాయిల్ను దిగుమతి చేసుకుంటున్నది. 2012-13లో 70 లక్షల టన్నుల పామాయిల్ దిగుమతైంది. ఇతర వంట నూనెల కంటే పామాయిల్ ధర తక్కువ. అందువల్లే మన దేశంలో వాడే వంట నూనెల్లో మూడొంతుల వాటా పామాయిల్దే. ప్రపంచంలో ఉత్పత్తయ్యే పామాయిల్లో 40 శాతాన్ని మనమే వాడుతున్నాం. ఏటా వేల కోట్ల రూపాయల పామాయిల్ను దిగుమతి చేసుకోక తప్పటం లేదు. నూనెగింజల సాగులో స్వయం సమృద్ధి సాధించడమే ఈ సమస్యకు పరిష్కారం. అయితే, భారత ప్రభుత్వం అరకొర ప్రోత్సాహం వల్ల అవసరమైనంతగా సాగు విస్తరించడం లేదు. గత ఇరవయ్యేళ్లలో 6 లక్షల ఎకరాల్లో మాత్రమే పామాయిల్ తోటల విస్తీర్ణం పెరిగింది. అయితే, 60 వేలకు పైగా తెలుగు రైతులు మాత్రం తెగువను ప్రదర్శించి పామాయిల్ సాగు చేపట్టారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల 50 వేల ఎకరాల్లో పామాయిల్ సాగులోకి వచ్చింది. ఇతర 5 రాష్ట్రాల్లో కలిపి చూసినా లక్షా 50 వేల ఎకరాలకు మించదు. పామాయిల్ సాగు విస్తీర్ణంలో పశ్చిమ, తూర్పు గోదావరి, ఖమ్మం జిల్లాలు దేశంలోనే మొదటి 3 స్థానాలు పొందాయి. కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో కూడా పామాయిల్ తోటలున్నాయి. సంక్షోభాల చరిత్ర.. పామాయిల్ రైతులు గతంలో మూడుసార్లు తీవ్రస్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఆగ్రహించిన రైతులు అప్పట్లోనే 30 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలను నరికివేశారు. టన్ను గెలలకు కనీసం రూ. 5,800 ధర ఉండేలా చూస్తామని అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వడంతో తిరిగి పామాయిల్ సాగు కొనసాగింది. 2012 మార్చిలో ధర రూ. 5,100కు దిగజారినప్పుడు తోటల నరికివేతకు రైతులు సిద్ధపడ్డారు. అప్పటి కిరణ్కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల వల్ల టన్నుకు రూ. 7,516 వరకు రైతులకు గిట్టుబాటైంది. క్రమంగా రికార్డు స్థాయిలో రూ. 8,500కు పెరిగి ప్రస్తుతం రూ. 5,650కి దిగజారింది. ప్రోత్సాహ లోపమే సమస్య మొక్కలు నాటిన 4 ఏళ్లకు గాని ఫలసాయం చేతికి అందదు. ఈ కారణంగా చిన్న రైతులు ఆసక్తి చూపడం లేదు. కూలీల కొరత వల్ల పెద్ద రైతులు మాత్రమే మొగ్గుచూపుతున్నారు. సాగు విస్తీర్ణం పెంచాలంటే హెక్టారుకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 30 వేలతోపాటు అదనంగా రూ. 20 వేల ప్రత్యేక నగదు ప్రోత్సాహాన్నివ్వాలన్నది రైతుల డిమాండ్. ఏటా రూ. 10,800 కోట్ల చొప్పున ఆరేళ్లపాటు కేటాయిస్తే 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును విస్తరింపజేసి, విదేశీ మారకద్రవ్యాన్ని 60% వరకు ఆదా చేసుకోవచ్చని జాతీయ వ్యవసాయ ధరల నిర్ధారణ కమిషన్ (సీఏసీసీ) కేంద్రానికి సూచించినా స్పందన కరువైంది. వంట నూనెల కొరత దేశాన్ని పీడిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పామాయిల్ సాగునుఅవసరమైనంతగా ప్రోత్సహించడం లేదు. ముడిచమురు ధర ఎంత పతనమైనా పామాయిల్ గెలల ధర కనీస మద్దతు ధరకన్నా తగ్గకుండా ఉండేలా ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నది రైతుల ఆకాంక్ష. కాకినాడ ఎంపీ తోట నరసింహం ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంటులో ప్రస్తావించారు. ఏది ఏమైనా వంట నూనెల కొరత సమస్యకు పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవడమే సరైన పరిష్కారమని ప్రభుత్వం గుర్తించాలి. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు. మొబైల్: 94403 39682) -
ఆ దిగుమతులు రైతుల ఉరితాళ్లు
ధరలు తగ్గినందుకు నిరసనగా రైతులు వీధుల్లో బంగాళదుం పలను బస్తాల కొద్దీ పారబోయకుండా ముగిసే కాలాన్ని ఇటీ వలి కాలంలో మనం చూసి ఉండం. కేంద్రప్రభుత్వం మాత్రం మొట్టమొదటిసారిగా బంగాళదుంపల దిగుమతికి అనుమతించింది. దేశీయ సరఫరాను పెంచడానికీ, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికే దిగుమతులను అను మతిస్తున్నట్లు అధికారికంగా చెబుతున్నారు. నిజా నికి దేశంలో బంగాళదుంపల ఉత్పత్తి ఈ ఏడు సాధా రణ స్థాయిలోనే ఉంది. ఈ ఏడు వీటి ఉత్పత్తిలో త గ్గుదల 2.3 శాతం మాత్రమే ఉంటుందని అంచనా. కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ఈ ఏడాది నవంబర్ చివరినాటికి బంగాళ దుంపల దిగుమతులు దేశంలోకి వచ్చేలా టెండర్లు జారీ చేయవలసిందిగా జాతీయ వ్యవసాయ, మార్కెటింగ్ సమాఖ్యను ఆదేశించింది. కానీ, పంజాబ్ నుండి బంగాళదుంపల దిగుబడి నవంబర్ మధ్యనాటికే మార్కెట్ను ముంచెత్తుతుందని అంచనా. ఈ నేప థ్యంలో రైతులు మరోసారి బళ్లకొద్దీ ఆలు దుంపలను ప్రధాన రహదారులపై వదిలివేయక తప్పదనిపిస్తోంది. ఉత్పత్తిలో కాసింత తగ్గుదల కూడా లేనప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంలోని ఆర్థిక హేతుబద్ధత ఏమిటి? ఖరీఫ్ పంట దిగుబడి బాగానే వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. నవం బర్ మధ్య నాటికి వస్తుందనుకుంటున్న శీతాకాలపు పంట కూడా సాధారణంగానే ఉంటుందని అంచనా. చైనా, రష్యాల తర్వాత ప్రపంచంలోనే బంగాళ దుంపలను అధికంగా పండి స్తున్న మూడో అతిపెద్ద దేశం భారత్. కానీ శక్తిమంతమైన ఆర్థికవేత్తల లాబీ ఒత్తిడితో.. పళ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల దిగుమతి కోసం భారతీయ మార్కెట్ను బార్లా తెరవడానికి ఆహార ద్రవ్యోల్బణం చక్కటి సాకుగా మారింది. ఇండో-యూరోపియన్ యూని యన్ మధ్య ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో ఈయూ దీన్నే డిమాండ్ చేస్తోంది. దేశ ఎగుమతి దిగుమతి విధానానికి బంగాళ దుంపలు మాత్రమే బలి కావడం లేదు. హర్యా నాలోని సోనేపట్లో ఉన్న ఒక ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాన్ని సందర్శించినప్పుడు దిగ్భ్రాంతికర విష యం తెలిసింది.. కొనుగోలుదారులు లేక రైతులు తాము పండించిన టమాటాలను వీధుల్లో విసిరి వేస్తున్న సమయంలో భారత్, టమాటా పేస్టును భారీ మొత్తం లో చైనా నుంచి దిగుమతి చేసుకుందని అక్కడి రైతులు చెప్పా రు. ఆహార ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరుకున్నప్పుడు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో సహా దేశంలోని పలు ప్రాంతాలలో రైతులు టమాటా పంటను వృథాగా పారవేసినట్లు వార్తలొచ్చాయి. టమాటా ధరలు కిలోకు రెండు రూపాయల కంటే తక్కువకు పడిపోయి నప్పుడు వాటిని పశువులకు ఆహారంగా వదిలేయడమో, లేదా వీధుల్లో విసిరివేయడమో తప్ప రైతు లకు మరో మార్గం లేకుండా పోయింది. 2014 ఆగస్టు 28 నుం చి సెప్టెంబర్ 28 వరకు ఒక్క నెలలోనే భారత్ 376,009 డాలర్ల విలువైన టమాటా ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసు కుంది. మనం ఇళ్లలో వాడుతున్న టమాటా కెచప్, టమాటా పురీ చివరకు టమాటా జ్యూస్ వంటి పాపులర్ బ్రాండ్లన్నీ చైనా, నేపాల్, ఇటలీ, అమెరికా, నెదర్లాండ్స్ నుండే దిగుమతి అవుతున్నాయి. అంటే, మన దేశీయ టమాటా రైతులు గిట్టు బాటు ధరలు లేక చస్తున్న సమయంలోనే టమాటా ఉత్ప త్తులను మనకు ఎగుమతి చేస్తున్న దేశాల రైతులకు సహాయం చేస్తున్నామన్నమాట. ఉదాహరణకు పాస్తానే తీసుకోండి. దేశీయంగా గోడవు న్లలో భారీ మొత్తంలో గోధుమ పేరుకుపోయి ఉన్నప్పుడు సం వత్సరానికి 39 శాతం చొప్పున అసాధారణ వృద్ధితో ఇటలీ నుంచి పిండిని భారత్ దిగుమతి చేసుకుంటోంది. గోధుమ నుంచే అది తయారవుతున్నప్పుడు దేశంలోనే దాన్ని ఎందుకు తయారు చేయకూడదు? భారతీయ పాస్తా దిగుమతులు 2003-04లో 3.39 బిలియన్లు ఉండగా 2013-14లో అవి 17.22 బిలియన్లకు ఎగబాకాయి. దేశంలోని లక్షలాది నూనె గింజల ఉత్పత్తిదారుల పొట్ట గొడుతూ విదేశీ వంటనూనెలను నిస్గిగ్గుగా ప్రోత్సహిస్తున్నారు. ఆహార దిగుమతులు దేశీయ ఉత్పత్తిని ధ్వంసం చేస్తున్నాయి. ఇండోనేసియా, మలేసియా, బ్రెజిల్, యునెటైడ్ స్టేట్స్ దేశాల వంట నూనెల ఉత్పత్తిదారుల ఆర్థిక ప్రయోజనాల కోసం దేశం లోని మెట్ట ప్రాంతాలలో సన్నకారు రైతులు జీవన విధానాన్నే లాగేస్తున్నారు. వాస్తవానికి గత 3 దశాబ్దాలలో భారతీయ వంటనూనెల దిగుమతి బిల్లు అమాంతంగా పెరిగిపోయింది. 2012 చివరినాటికి వంటనూనెల దిగుమతులు 9.01 మిలి యన్ టన్నులకు చేరాయి. దీని విలువ రూ.56,295 కోట్లు. 2006-07, 2011-12 మధ్యకాలంలో మన వంటనూనెల దిగు మతులు 380 శాతం పెరిగాయి. వంటనూనెల దిగుమతిని తగ్గించడానికి దేశంలో నూనెగింజల ఉత్పత్తిని పెంచాల్సి ఉందని మాజీ వ్యవసాయ మంత్రి శరద్ పవార్ పదే పదే వల్లించేవారు. అయితే 1994-95 నాటికే నూనెగింజల ఉత్పత్తిలో భారత్ దాదాపు స్వయంపోషకత్వ స్థాయికి చేరుకున్న విషయం ఎవ రూ ప్రస్తావించడం లేదు. ఆ నాటికి మన వంటనూనెల దిగు మతులు కేవలం 3 శాతం మాత్రమే. 1994-95 తర్వాత నూనె గింజల దిగుమతి సుంకాలు క్రమానుగతంగా తగ్గిస్తూ వచ్చారు. దీంతో దిగుమతులు పెరిగాయి. దిగుమతి సుంకాన్ని 300 శాతానికి పెంచాలని నిబంధన ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో నూనె దిగుమతులపై జీరో టారిఫ్ను భారత్ అనుమతించింది. దేశీయ అవసరాలలో 50 శాతం పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దేశీయ నూనెగింజల విప్లవాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఆర్థిక వేత్తల లాబీ ఇప్పుడు పామాయిల్ తోటల సాగును ప్రోత్సహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.. దేవిందర్ శర్మ పామాయిల్ వ్యవసాయంతో భూమి ఎడారి కావడమే కాకుండా కార్బన్ డయాక్సైడ్ 10 రెట్లు అధికంగా విడుదలై భూతాపం పెరుగుతోందని వరల్డ్ వాచ్ సంస్థ పేర్కొంది. కానీ, భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మిజోరం, త్రిపుర, అస్సాం, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని హరితారణ్యా లను నిర్మూలించి 10 లక్షల పైగా హెక్టార్ల భూమిలో పామాయిల్ తోటల పెంపకానికి పథకాలు రచిస్తోంది. (దీని ద్వారా సంవత్సరానికి నాలుగు లేదా అయిదు టన్నుల పామాయిల్ మాత్రమే ఉత్పత్తవుతుంది. దీనిలోని ఆర్థిక హేతుబద్ధత ఏమి టో నా అవగాహనకు అందటం లేదు.) ముందుగా నూనె గిం జల ఉత్పత్తిదారులను నాశనం చేయడం, తర్వాత వంట నూనెల ఉత్పత్తికి అడవులను నిర్మూలించడం. ఇది నిజంగానే అద్భుతమైన అభివృద్ధి నమూనాయే మరి. (వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు) -
‘కల్తీ’ గుట్టురట్టు
నువ్వుల నూనె, ఆవు నెయ్యి పేరిట పామాయిల్ అమ్మకాలు విజయవాడ పాత ఆర్ఆర్పేటలో తయారీ కేంద్రం స్థానికుల సమాచారంతో రంగంలోకి అధికారులు సరుకు, గోడౌన్ సీజ్ విజయవాడ : భక్తులు దీపారాధనకు వినియోగించే ఆవునెయ్యి, నూనెను కల్తీ చేసి వాటిని మార్కెట్లో అమ్ముతూ అక్రమార్కులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ వ్యవహారం విజయవాడలో వెలుగులోకి వచ్చింది. పాత రాజరాజేశ్వరిపేటలోని కొత్త మసీదు వీధిలో శ్రీలక్ష్మీసాయి అయిల్ ట్రేడర్స్ పేరిట అమరా రామసుధాకర్రావు మూడేళ్లగా దీపారాధన నూనెల వ్యాపారం చేస్తున్నారు. డాల్డా, పామాయిల్తోపాటు కొన్ని రసాయనాలు, రంగులను కలిసి ఆవునెయ్యి పేరుతో 50, 100, 500 మిల్లీలీటర్ల ప్యాకెట్లలో నింపుతున్నాడు. నూనె చిక్కబడేందుకు కొన్ని రసాయనాలతో కొవ్వును సైతం కలుపుతున్నట్లు సమాచారం. నువ్వుల నూనె పేరిట రైస్ బ్రాన్ ఆయిల్తో పాటు ఎందుకూ పనికిరాని వైట్ ఆయిల్లో సుగంధ ద్రవ్యాలను కలిపించి ప్యాకింగ్ చేయిస్తున్నాడు. డాల్డా, పామాయిల్తో నెయ్యి తయారీ సందర్భంలో పలు రసాయనాలను వినియోగిస్తునట్లు తెలిసింది. వాటిని వేడి చేసేందుకు గ్యాస్ పొయ్యిలను వినియోగిస్తున్నారు. నెయ్యి విక్రయాలలో పేరుపొందిన నందిని పేరును అనుకరిస్తూ శ్రీనందిని, సత్యభామ, ఎస్ఎల్ఎస్ ఆయిల్ పేరిట దీపారాధన నూనెలను మార్కెట్లోకి సంస్థ నిర్వాహకుడు సరఫరా చేస్తున్నారు. ఈ వ్యవహారం అత్యంత పకడ్బందీగా చేస్తున్నారు. ప్యాకింగ్ జరిగే భవనం ఎదురుగా ఎవరు వచ్చినా తమకు కనిపించేలా సీసీ కెమెరాలను సంస్థ నిర్వాహకుడు ఏర్పాటు చేయించారు. వాటి ద్వారా నిఘా ఉంచి, సరుకు కల్తీ గుట్టు రట్టవకుండా సంస్థ నిర్వాహకుడు జాగ్రత్తలు తీసుకున్నారు. శనివారమే బట్టబయలు మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం రాబోతుండటంతో రేయింబవళ్లు పెద్దఎత్తున కల్తీ ఆవునెయ్యి, నువ్వుల నూనెలను ఈ సంస్థలో ప్యాకింగ్కు సిద్ధం చేస్తున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం మధ్యాహ్నం పోలీసులకు విషయం తెలిసినా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. శనివారం రాత్రి కొత్తపేట పోలీసులు మచిలీపట్నంలోని ఫుడ్ ఇన్స్పెక్టర్లు అన్నపురెడ్డి సుందరరామరెడ్డి, ఎం.శ్రీనివాసరావులకు సమాచారం అందించారు. కొత్తపేట సీఐ వెంకటేశ్వర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు శనివారం రాత్రి నూనె గోడౌన్ను పరిశీలించారు. ఆదివారం పంచనామా నిర్వహించాలని భావించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా రెండు శాఖల అధికారులు జాగ్రత్తలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుడ్ ఇన్స్పెక్టర్లు మధ్యాహ్నం గోడౌన్ నుంచి ఆయిల్ శాంపిల్స్ను తీసుకుని హైదరాబాద్కు పంపారు. వీటి పరీక్షలకు సంబంధించి రిపోర్టు వచ్చే వరకు గోడౌన్తో పాటు స్టాక్ను సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. కల్తీ జరిగిందని తెలిస్తే రూ.2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. రాష్ర్టవ్యాప్తంగా విక్రయాలు డాల్డా, పామాయిల్తో తయారు చేసిన ఆవునెయ్యి, నువ్వుల నూనె రాష్ర్టంలోని అన్ని ప్రముఖ దేవాలయాలతో పాటు ప్రముఖ నగరాలలో విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. భారీఎత్తున జరుగుతున్న ఈ వ్యాపారానికి ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా పలువురు అధికారులకు, స్థానిక నేతలకు సంస్థనుంచి నెలనెలా మామూళ్లు అందుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆవునెయ్యి, నువ్వుల నూనెలను కల్తీ చేస్తున్న వ్యాపారులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. కార్పొరేషన్లో సేల్స్ టాక్స్, పుడ్ ఇన్స్పెక్టర్లకు మేనేజ్ చేసుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామని ఈ సంస్థ నిర్వాహకుడు చెబుతున్నట్లు తెలిసింది. మరో 10 రోజులలో తమ స్టాక్ని రిలీజ్ చేయించుకోగలమని అతను ధీమా వ్యక్తం చేస్తున్నాడని సమాచారం. ఎలాంటి అనుమతులు లేకుండా నగరపాలక సంస్థ నుంచి తీసుకున్న ట్రేడ్ లెసైన్స్తో లక్షల రూపాయల కల్తీ వ్యాపారం జరుగుతున్నా తమ దృష్టికి రాలేదని సేల్స్ టాక్స్ అధికారులు చెప్పడం శోచనీయం. -
పండక్కి పామాయిల్ హుళక్కేనా?
11 లక్షల కార్డుదారులు ఎదురు చూపు గుడ్లవల్లేరు : సాధారణ రోజుల్లో తిన్నా తినకపోయినా కనీసం పండగ రోజైనా పాయసం తిని పిండి వంటలు చేసుకోవాలనే పేదవాడి ఆశ నిరాశగానే మిగిలిపోతోంది. పేదలతో సహా సాధారణ, మధ్య తరగతి ప్రజానీకం సాదక, బాధకాలను పట్టించుకోని ప్రభుత్వపాలకులు, అధికారుల అలసత్వమే అందుకు కారణభూతమవుతోంది. దసరాకు ఎలాగో లేదు... ఈ దీపావళి పండుగకయినా రేషను దుకాణాల్లో పామాయిల్ సరఫరా చేస్తారనుకుంటే ఆ పరిస్థితులేవీ కనబడడం లేదు. గత దసరా నుంచే పామాయిల్ను పంపిణీ చేస్తామని మౌఖిక ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఆ విషయాన్నే మరచిపోయింది. ఎన్నికల ముందు అమ్మహస్తం పథకం సమయంలో పామాయిల్ను అందుకున్న వినియోగదారులకు మళ్లీ రేషను సరుకుల్లో పామాయిల్ కనబడకుండా పోయింది. అమ్మహస్తం పథక నిర్వహణ సమయంలోనే ఆ సరుకులకు ప్రభుత్వం టెండర్లు పిలిచినపుడు కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో కిరణ్ ప్రభుత్వం జిల్లాలో పామాయిల్ పంపిణీ నిలిపేసింది. చంద్రబాబు సర్కార్ వచ్చాక పామాయిల్ను వినియోగదారులు అందుకున్న పాపం లేదు. అమ్మహస్తం పథకం స్థానే వేరే పథకం పేరిట ఏఏ సరుకులు ఇవ్వాలనే విషయంలోప్రభుత్వం తర్జనభర్జన పడుతోందని తెలిసింది. కానీ దసరా నుంచి పామాయిల్ విడుదల చేస్తామన్న ప్రభుత్వం ఈ దీపావళికి కూడా అందించే టట్లుగా కనబడటం లేదు. పామాయిల్పై ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకునే లోగా హుదూద్ విలయతాండవంతో ఆ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందని సమాచారం. నిర్ణయం తీసుకుని ఏపీలో పామాయిల్ పంపిణీ చేసేందుకు జనవరి వరకూ సమయం పడుతుందని సమాచారం. ఈ విషయమై డీఎస్వో సంధ్యారాణిని వివరణ కోరగా ఎన్నికల ముందు నుంచి పామాయిల్ పంపిణీ నిలిచిపోయిందన్నారు. అమ్మహస్తం సరుకుల స్థానే మార్పు చేసి, ఏఏ సరుకులకు ప్రాధాన్యత ఇచ్చి విడుదల చేస్తారనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపారు. పామాయిల్ పంపిణీపై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి రాలేదని తేల్చి చెప్పారు. -
పండుగకు పరేషాన్
విశాఖ రూరల్ : జిల్లాలో 12.3 లక్షల తెల్లరే షన్కార్డుదారులు ఉన్నారు. చౌక దుకాణాల నుంచి వీరు ప్రతీ నెలా ఏ వస్తువు తీసుకోకపోయినా పామాయిల్ను మాత్రం కచ్చితంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ కుటుంబానికి అవసరమైన ఈ వంటనూనె సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయింది. గత మార్చి నుంచి ఉత్పత్తి కొరత పేరుతో పామాయిల్ పంపిణీ పూర్తిగా ఆపేశారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్డిపోల్లో సరఫరా చేసే పామోలిన్కు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ విడుదల చేయాల్సి ఉంటుంది. గత ఏడు నెలలుగా రాయితీ నిధులు జమ చేయడం లేదు. దీంతో సరఫరా నిలిచిపోయింది. పామోలిన్ లీటర్ ధర రూ.63.50 ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ రాయితీ రూ.15, రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రూ.8.50 చెల్లించి.. కార్డుదారులకు రూ.40కే చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసేది. మలేషియా నుంచి క్రూడ్ను కొనుగోలు చేయగా కాకి నాడ పోర్టుకు తీసుకువచ్చి అక్కడ పామాయిల్ను ప్యాకింగ్ చేసి జిల్లాలకు కేటాయింపులు చేసేవారు. కానీ గత ఏడు నెలలుగా పామాయిల్ను కొనుగోలు చేయలేదు. దీంతో 12.3 లక్షల మంది కార్డుదారులు బహిరంగ మార్కెట్లో లీటర్ పామోలిన్ను రూ.63 నుంచి రూ.68కు కొనుగోలు చేయాల్సి వస్తోంది. సాధారణంగా కార్డుదారులకు ప్రతీ నెలా అరకిలో పంచదార ఇస్తున్నారు. పండుగ మాసాల్లో మాత్రం అదనంగా మరో అరకిలో ఇచ్చేవారు. వినాయక చవితి పండుగకు అదనపు చక్కెర ఇస్తారని భావించినప్పటి ప్రభుత్వం ఎటువంటి కేటాయింపులు చేయలేదు. కనీసం దసరాకైనా అరకిలో అదనంగా ఇస్తారనుకున్నా ప్రభుత్వం కనీసం ఆ విషయంపైనే దృష్టి సారించలేదు. ఇందుకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు గాని, అదనపు కేటాయింపులు గానీ జరగకపోవడంతో దసరాకు కూడా పంచదార అదనంగా ఇచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. కేవలం బియ్యం, పంచదార మినహా మిగిలిన సరుకులు ఇవ్వడం లేదు. దీంతో పండుగ మాసంలో కూడా పేదలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. -
పామాయిల్ ధర పతనం
పెట్టుబడి కూడా రావడం లేదంటూ రైతుల గగ్గోలు పట్టించుకోని ప్రభుత్వం నూజివీడు : ఒకప్పుడు సిరులు కురిపించే పంటగా అన్నదాతల మన్ననలు పొందిన ఆయిల్పామ్ తోటలకు ఆపదొచ్చింది. మద్ధతు ధర లభించక ఆయిల్పామ్ రైతులు నష్టాల బాట పడుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్కు పన్ను రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు సొంత రాష్ట్రంలో పండిస్తున్న రైతులకు మాత్రం గిట్టుబాటు ధరను కల్పించలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయిల్పామ్ టన్ను ధర పడిపోవడంతో రైతాంగం పీకల్లోతు అప్పుల్లో మునిగిపోతున్నారు. ఈ ఏడాది జనవరిలో రూ.8,441 ఉన్న ధర ఆగస్టుకు వచ్చేసరికి రూ.7,000కు పతనమైనంది. ఎనిమిది నెలల కాలంలో టన్నుకు రూ.1,400 ధర తగ్గడంపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు రూ. 10వేల నుంచి రూ.12వేల వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ పామాయిల్ ధరలు తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆయిల్ఫెడ్ వర్గాలు చెబుతుండగా, మలేషియా, ఇండోనేషియాల నుంచి విచ్చలవిడిగా పామాయిల్ను దిగుమతి చేసుకోవడం వల్లే నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 25వేల ఎకరాలలో సాగు.. ఆయిల్పామ్ను రైతులు జిల్లాలో 25వేల ఎకరాలలో సాగుచేస్తున్నారు. నూజివీడు, ముసునూరు, బాపులపాడు, ఉంగుటూరు, చాట్రాయి, నందిగామ, జగ్గయ్యపేట మండలాల్లో పామాయిల్ సాగులో ఉంది. ఏటా దాదాపు లక్ష టన్నుల పామాయిల్ గెలలు దిగబడి వస్తుంది. ఈ గెలలను బాపులపాడు మండలం అంపాపురంలో ఉన్న రుచిసోయా కంపెనీకి రైతులు తీసుకెళతారు. ఈగెలలకు సంబంధించిన ధరను క్రూడ్ పామాయిల్ ధరను బట్టి ఆయిల్ఫెడ్ ధరను నిర్ణయిస్తుంది. ఇండోనేషియా, మలేషియాలలో ఆయిల్పామ్ గెలల దిగుబడి ఎక్కువగా వచ్చినప్పుడు ఇక్కడ ధర తగ్గిపోతుంది. ప్రపంచమార్కెట్ బట్టి ధరను నిర్ణయిస్తున్న నేపథ్యంలో, దేశంలోని ఆయిల్పామ్ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటుపాడాల్సి ఉన్నప్పటికీ పామాయిల్ దిగుమతిపై కేంద్రం కేవలం 2.5శాతం మాత్రమే ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తోంది. ఇంత తక్కువ పన్ను విధించడం వల్ల స్థానిక ఆయిల్పామ్ సాగుచేసిన రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించక నష్టాలలో కూరుకుపోతున్నారు. రూ.9వేలు అయితే గిట్టుబాటు ఆయిల్పామ్ గెలలు టన్నుకు కనీసం రూ.9వేలు ధర లభిస్తేనే సాగు లాభదాయకంగా ఉంటుంది. కూలి ఖర్చులు, ఎరువుల ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు పెరగడంతో పెట్టుబడులు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆయిల్పామ్ గెలల ధర తగ్గుతుండటంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించి, దేశీయంగా ఉన్న రైతులను ప్రభుత్వమే ప్రోత్సహించాలి. బొబ్బా వీరరాఘవరావు, ఆయిల్పామ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు -
చేతి‘చమురు’
చౌకడిపోలలో వింతపోకడ మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు పామాయిల్ విక్రయం లబోదిబోమంటున్న రేషన్ కార్డుదారులు విశాఖ రూరల్/పెదగంట్యాడ : ప్రజాపంపిణీ వ్యవస్థ రూపురేఖలు మారనున్నాయి. పేదవాడి ‘చౌక’ సరకులు ఒక్కొక్కటిగా మాయం కానున్నాయి. అమ్మహస్తం పథకానికి తెలుగుదేశం ప్రభుత్వం మంగళం పాడేందుకు సిద్ధమవుతోంది. సరకుల్లో కోత విధించి ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై అందిస్తున్న సరకుల ధరలను పెంచాలని భావిస్తోంది. దీనిపై పూర్తి విధి విధానాల రూపకల్పనకు మరో రెండు రోజుల్లో హైదరాబాద్లో పౌర సరఫరా శాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తోంది. పదేళ్ల క్రితం టీడీపీ హయాంలో చేపట్టిన విధానాలనే మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తొలుతగా చౌక దుకాణాల ద్వారా సబ్సిడీ ధరకు విక్రయించాల్సిన వంట నూనెను సరఫరా చేసే ఏర్పాట్లు చేయకుండా విజయ పామాలిన్ను అందిస్తోంది. దీన్ని మార్కెట్ ధరకే విక్రయిస్తుండడంతో కార్డుదారుల్లో ఆందోళన నెలకొంది. 6 నెలలుగా పామాయిల్ లేదు జిల్లాలో 12.5 లక్షల తెల్లరే షన్కార్డుదారులు ఉన్నారు. చౌక దుకాణాల నుంచి వీరు ప్రతి నెలా ఏ వస్తువు తీసుకోకపోయినా పామాయిల్ను మాత్రం కచ్చితంగా కొనుగోలు చేస్తున్నారు. గత మార్చి నుంచి ఉత్పత్తి కొరత పేరుతో పామాయిల్ పంపిణీ పూర్తిగా ఆపేశారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్డిపోల్లో సరఫరా చేసే పామోలిన్కు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ విడుదల చేయాల్సి ఉంటుంది. గత ఆరు నెలలుగా రాయితీ నిధులు జమ చేయడం లేదు. దీంతో సరఫరా నిలిచిపోయింది. పామోలిన్ లీటర్ ధర రూ.63.50 ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ రాయితీ రూ.15, రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రూ.8.50 చెల్లించి.. కార్డుదారులకు రూ.40కే చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. మలేషియా నుంచి క్రూడ్ను కొనుగోలు చేయగా కాకి నాడ పోర్టుకు తీసుకువచ్చి అక్కడ పామాయిల్ను ప్యాకింగ్ చేసి జిల్లాలకు కేటాయింపులు చేసేవారు. కానీ గత 6 నెలలుగా పామాయిల్ను కొనుగోలు చేయలేదు. దీంతో కార్డుదారులు బహిరంగ మార్కెట్లో లీటర్ పామోలిన్ను రూ.60 నుంచి రూ.65కు కొనుగోలు చేయాల్సి వస్తోంది. రేషన్షాపుల్లో మళ్లీ ‘విజయ’ పామోలిన్ చౌక దుకాణాల ద్వారా పేదలకు తక్కువ ధరలకు నిత్యావసరాలను విక్రయించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా వారిపై మరింత భారం మోపుతోంది. వంటనూనెను సబ్సిడీ ద్వారా ఇవ్వకుండా అందుకు భిన్నంగా మార్కెట్ ధరకు విక్రయిస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కార్డుదారులు సైతం ఆయిల్ను కొనుగోలు చేయలేక లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వం నిన్నమొన్నటి వరకూ రూ.40లకే పామోలిన్ ప్యాకెట్ను విక్రయించింది. ప్రస్తుతం పామాయిల్ రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫెడరేషన్కు చెందిన ‘విజయ’ ప్రీమియం బ్రాండ్ పామోలిన్, రిఫైన్డ్ సన్ప్లవర్ వంటనూనెను చౌకదుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. ఈ బ్రాండ్కు చెందిన పామోలిన్ ప్యాకెట్ (లీటరు) రూ.62గా ఉంది. బహిరంగ మార్కెట్లో ఇతర బ్రాండ్ల పామాయిల్లు కూడా అదే ధరకు లభ్యమవుతున్నాయి. విజయ బ్రాండ్ పామాయిల్ విధిగా విక్రయించాలని అధికారులు ఆదేశించడం వల్ల వీటిని విక్రయిస్తున్నట్టు కొంతమంది డీలర్లు చెబుతున్నారు. ప్యాకెట్ అమ్మితే వచ్చే లాభం కన్నా లబ్ధిదారులు పెట్టే శాపనార్థాలు ఎక్కువగా ఉన్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే బ్రాండ్ నూనె విక్రయించేవారని, మళ్లీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం విజయ ప్రీమియం బ్రాండ్ తెరపైకి రావడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తాము మాత్రం ఎవరిపైన ఒత్తిడి తెచ్చి విజయ వంటనూనె విక్రయించాలని చెప్పలేదని సర్కిల్-3 ఏఎస్ఓ పి.భీమశంకరరావు ‘న్యూస్లైన్’కు తెలిపారు. ప్రభుత్వం గుర్తింపు ఉన్నందున ఇటీవల జరిగిన సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం మేరకు డిపోల ద్వారా విజయ బ్రాండ్ వంటనూనెను లబ్ధిదారులకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. నెలకో వస్తువు మాయం తెల్లరేషన్ కార్డుదారులకు తొమ్మిది రకాల నిత్యావసరాల సరకులు అందించేందుకు గత ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా పామాయిల్ లీటర్, కందిపప్పు, గోధుమలు, గోధుమపిండి, ఉప్పు కిలోచొప్పున, పంచదార 500 గ్రామాలు, కారం 250 గ్రాములు, పసుపు 100 గ్రామాలు, చింతపండు అరకిలో కలిపి రూ.185కే అందిస్తామని ప్రకటించింది. కానీ ఒక్క నెల కూడా సక్రమంగా సరకులు పంపిణీ చేయలేక చేతులెత్తేసింది. ఈ సరకుల్లో నాణ్యత లేకపోవడంతో కార్డుదారులు వాటిపై ఆసక్తి చూపించలేదు. ఫలితంగా తొలుత కారం, పసుపు, చింతపండు పంపిణీని నిలిపివేశారు. పురుగులు పట్టిన గోధుమలు, గోధుమ పిండి పంపిణీ చేస్తున్నప్పటికీ ఎవరూ విడిపించుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం కందిపప్పు, పంచదార మినహా మిగిలిన అన్ని సరకుల పంపిణీ నిలిచిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఒకటి, రెండు సరకుల సరఫరాకే పరిమితమైన ఈ పథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
చక్కెర లేదు.. పామాయిల్ రాదు
సాక్షి, ఏలూరు : ఆర్థిక శాఖ అనుమతి రాకపోవడంతో రేషన్ కార్డులపై ఈ నెల కూడా పామాయిల్ ఇవ్వడం లేదు. రంజాన్ పండగకు చక్కెర అదనపు కోటాను నిలిపివేశారు. దీంతో సబ్సిడీ ధరకు లభించే పామాయిల్ లీటర్ ప్యాకెట్ను రూ.25 అదనంగా చెల్లించి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల జిల్లాలోని 11.22 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులు ప్రతి నెలా రూ.2.80 కోట్ల మేర ఆర్థికంగా నష్టపోతున్నారు. సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేసే విషయమై ఆర్థిక శాఖ నుంచి ఇప్పటివరకూ అనుమతి రాకపోవడంతో అదనపు కోటా ఇవ్వలేకపోతున్నామని పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి డి.శివశంకరరెడ్డి అంటున్నారు. ఏప్రిల్ నుంచి ఇంతే జిల్లాకు 11.38 లక్షల లీటర్ల పామాయిల్ అవసరం కాగా, డీలర్లు ప్రతినెలా డీడీలు తీసేవారు. గత డిసెంబర్లో డీడీలు తీసినాప్రభుత్వం పామాయిల్ కంపెనీలకు చెల్లించాల్సిన సబ్సిడీ ఇవ్వకపోవడంతో వారు సరఫరా నిలిపివేశారు. సరుకు రాకపోవడంతో డీలర్లు వడ్డీ నష్టపోయారు. దీంతో డీడీలు తీసే విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనూ విడుదల కాని పామాయిల్ తర్వాత రెండు నెలలు వచ్చింది. ఏప్రిల్ నుంచి నిలిచిపోరుుంది. సబ్సిడీపై రూ.40కి లభించే పామాయిల్ లీటరు ప్యాకెట్ను రూ.65కు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు కోట్లాది రూపాయాలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అదనపు కోటా అత్యాశేనా రెండేళ్ల క్రితం వరకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండగకు రేషన్ కోటాలో కొన్ని సరుకులు అధికంగా ఇచ్చేది. నెలకు 560 టన్నుల పంచదారనే కేటారుుంచడం ద్వారా ఒక్కో కార్డుపై అరకేజీ చొప్పున ఇస్తున్నారు. అయితే పండగకు మరో అరకేజీ కలిపి కేజీ ఇచ్చేవారు. అదే విధంగా పామాయిల్ లీటర్ ప్యాకెట్ ఇవ్వాల్సి ఉండగా, మరో ప్యాకెట్ అదనంగా ఇచ్చేవారు. గతేడాది ఈ ఆనవాయితీని తప్పించారు. పండగ వేళల్లో నిత్యావసర సరుకుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. పేద ప్రజలు ఆ ఖర్చును భరించలేరు. కొన్నేళ్లుగా వరుస విపత్తులతో రైతులు నష్టాల పాలవుతున్నారు. సామాన్యులు అధిక ధరలతో కుదేలయ్యారు. పనులు లేక కూలీల చేతుల్లోనూ సొమ్ములు లేవు. దీంతో ఉన్న కొద్దిపాటి డబ్బును ఆచితూచి ఖర్చుచేసుకోవాలి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం నుంచి రాయితీ ధరలకు నిత్యావసర సరుకులు అందితే ప్రజలు సంతోషంగా పండగ జరుపుకుంటారు. కానీ ఈసారి కూడా అదనపు కోటా ఇవ్వడం లేదు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలోనూ అదనపు కోటా ఊసెత్తలేదు. -
రేషన్లో పామాయిల్ పరేషాన్..!
సబ్సిడీ భరించేందుకు కేంద్రం విముఖత నేడు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్: రేషన్ సరుకుల్లో పామాయిల్ను కొనసాగించాలా, వద్దా అన్న అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పామాయిల్ సరఫరాతో ప్రతినెలా పడుతున్న రూ.15 కోట్ల భారాన్ని భరించేందుకు కేంద్రం విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో దాన్ని భరించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ముందుకు వస్తుందా అనేది సందిగ్ధంగా మారింది. దీనిపై బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశ ం ఉంది. సమైక్య రాష్ట్రంలో అమ్మహస్తం పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతినెలా రూ.185కే తొమ్మిది రకాల సరకుల పంపిణీ జరిగేది. ఈ పథకం కింద పంపిణీ చేసే లీటర్ పామాయిల్ సబ్సిడీ భారాన్ని 2013 అక్టోబర్ వరకు భరించిన కేంద్రం ఆ తరువాత చేతులెత్తేసింది. దీంతో ఆ భారం రాష్ర్ట ప్రభుత్వంపై పడింది. తెలంగాణలోనే 15 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించింది. అమ్మహస్తం పేరు మార్పు.. సరుకుల కుదింపు? బుధవారం కేబినెట్ భేటీలో ప్రధానంగా ‘అమ్మ హస్తం’ పథకం పేరు మార్పు, పథకంలో అందజేస్తున్న సరుకుల కుదింపుపైనా చర్చ జరుగవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం పథకంలో భాగంగా పంపిణీ చేస్తున్న సరుకుల్లో చింతపండు, కారం, పసుపుపై వినియోగదారుల నుంచి పెద్దగా డిమాండ్ లేదు. 20 శాతం మంది మాత్రమే వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఈ నేపథ్యంలో వీటిని పథకం నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న చక్కెరను అరకేజీ నుంచి కేజీకి, గోధుమలను కిలో నుంచి నుంచి కిలోన్నరకు పెంచే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నాలుగు నెలలుగా పామాయిల్ నిల్
ఘట్కేసర్ టౌన్: చౌక ధరల దుకాణాల ద్వారా రాయితీ ధరల్లో విక్రయించే పామాయిల్ నాలుగు నెలలుగా సరఫరా కావడం లేదు. ఏప్రిల్లో జరిగిన స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో రేషన్ దుకాణాలకు పామాయిల్ సరఫ రా నిలిచిపోయింది. ఎన్నికలు ముగిసి నాలుగు నెలలైనా పామాయిల్ సరఫరా కాక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో అధిక ధరలను వెచ్చించి కొనుగోలు చేస్తున్నా రు. దీంతో జిల్లావ్యాప్తంగా 10.85 లక్షల లబ్ధిదారులపై ఆర్థికభారం పడుతోంది. నిర్ణయం తీసుకునేవారేరీ... రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సిన పామాయిల్ మలేసియా నుంచి దిగుమతి అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలకు కావలసిన పామాయిల్ను టెండర్ల ద్వారా కాంట్రాక్టుకు ఇచ్చేవారని తెలుస్తోంది. నూతన ప్రభుత్వం ఏర్పడక ముందు గవర్నర్ పాలన ఉండడం వల్ల టెండర్ల ప్రక్రియను చేపట్టకపోవడంతో పామాయిల్ కొరత ఏర్పడింది. దీంతో రాష్ట్ర సర్కారు వద్ద పామాయిల్ నిల్వలు లేనందున రేషన్ దుకాణాలకు సరఫరా చేయలేకపోతోంది. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి పామాయిల్పై నిర్ణయం తీసుకునేంతవరకు పామాయిల్ వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. రేషన్ దుకాణాల్లో రాయితీ ధరలో రూ. 40కు లభించే కిలో పామాయిల్ బహిరంగ మార్కెట్లో 65-70 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో పేదలపై నెలకు కోట్లాది రూపాయల భారం పడుతోంది. కాగ పామాయిల్ సరఫరాపై ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సమాచారం అందలేదని, అధికారుల ఆదేశానుసారమే రేషన్ దుకాణాలకు పామాయిల్ను సరఫరా చేస్తామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రభు తెలిపారు. -
పామాయిల్.. నిల్
జిల్లాలోని చౌక దుకాణాల్లో మూడు నెలల నుంచి పామాయిల్ పంపిణీ చేయడం లేదు. అధికారులు మాత్రం ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది అంటూ కాలయాపన చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో లీటరు పామాయిల్ రూ.70 ఉంది. అదే చౌక దుకాణంలో రూ.40కే లభిస్తుంది. చౌక దుకాణాలకు పామాయిల్ సరఫరా నిలిచిపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం పడుతోంది. జమ్మలమడుగు: జిల్లాలోని చౌకదుకాణాల్లో మూడునెలల నుంచి రేషన్కార్డుదారులకు పామాయిల్ అందడంలేదు. ఈ నెలలోనైనా పామాయిల్ సరఫరా అవుతుందా? అంటే అధికారులు మాత్రం లేదనే చెబుతున్నారు. జిల్లాలో దాదాపు 2500 వరకు చౌకదుకాణాలు ఉన్నాయి. వీటి నుంచి 10లక్షల తెల్లరేషన్ కార్డు దారులు తక్కువ ధరకే పామాయిల్ కొనుగోలు చేసుకుం టున్నారు. బహిరంగ మార్కెట్లో లీటరు పామాయిల్ రూ.65 నుంచి రూ.70లు ఉంది. అదే చౌకదుకాణాల్లో అయితే లీటరు రూ.40లకే వస్తుంది. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారు చౌకదుకాణాల్లో పామాయిల్ కొనుగోలు చేసే వారు. ప్రభుత్వం సరఫరా చేయకపోవడం తో అదనంగా రూ.25 నుంచి రూ.30లు వరకు భారం పడుతోంది. టెండర్ల ప్రక్రియ కొనసాగలేదని... ప్రభుత్వానికి పామాయిల్ సరఫరా చేసే కంపెనీలకు సమయం దాటిపోయింది. తిరిగి రీటెం డర్ నిర్వహించకపోవడంతోనే పామాయిల్ రావ డం లేదని రేషన్షాపు డీలర్లు పేర్కొంటున్నా రు. అయితే అధికారులు మాత్రం కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ నిధులు రాకపోవడం తో మూడునెలలనుంచి పామాయిల్ సరఫరా కావడంలేదని చెబుతున్నారు. డీలర్లు ఒక మాట, అధికారులు మరో మాట చెబుతూ వస్తున్నారు. ఏది ఏమైనా పామాయిల్ చౌకదుకాణాల్లో లభిం చక సామాన్యులు అవస్థలు పడుతున్నారు. ‘అమ్మహస్తం’ కూడా అంతంతే... ప్రభుత్వం తెల్లరేషన్కార్డుదారులకు అమ్మహస్తం పథకం ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాల్సి ఉంది. ప్రతినెలా బియ్యం,పామాయిల్(లీటర్) కందిపప్పు(కిలో), చక్కెర(అరకిలో), గోధుమలు లేదా గోధుమ పిండి(కిలో), ఉప్పు(కిలో), చింతపండు(అరకిలో), కారంపొడి, పసుపుపొట్లాలను సరఫరా చేసే వారు. అయితే ప్రస్తుతం బియ్యం,చక్కెర, ఉప్పు, గోధుమలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. కారంపొడి,చింతపండు,పసుపు పొట్లాలు నాణ్యత లేవు. -
ఈ నెల నూనె లేనట్టే
ఇంత వరకు దిగుమతి కాని పామోలిన్ తెల్లకార్డుగలవారిపై రూ.3.70 కోట్ల అదనపు భారం నర్సీపట్నం: జూలై నెలకు పామాయిల్ సరఫరా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ డీలర్లు డీడీలు తీయకపోవడం దీనికి నిదర్శనం. జిల్లాలో ప్రస్తుతం 12,34,104 కార్డులున్నాయి. ఒక్కొక్క కార్డుపై నెలకు లీటరు పామాయిల్ నూనె సరఫరా చేసేవారు. నూనె సరఫరా ఎప్పటినుంచో కొనసాగుతున్నా కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం అమ్మహస్తం పథకంలోకి చేర్చింది. వాస్తవానికి పౌరసరఫరాల కోటాగా జిల్లాకు 12 లక్షల 34వేల 104 లీటర్ల పామాయిల్ను సరఫరా చేయాలి. మలేషియా నుంచి కాకినాడ పోర్టుకు దిగుమతయ్యే పామాయిల్ను రాష్ట్రంలోని 18 జిల్లాలకు సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం దిగుమతి లేకపోవడంతో సరఫరా నిలిచిపోయింది. రేషన్ కార్డుపై రూ.40కు లీటరు నూనె సరఫరా చేస్తున్నారు. దీని ధర బయటి మార్కెట్లో రూ.70 వరకు పలుకుతోంది. ప్రస్తుతం కోటాలో పామాయిల్ సరఫరా చేయకపోవడం వల్ల కార్డుదారులు బయట రూ.70కి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం కార్డుదారులు సుమారు రూ.3.70 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విశేషం. -
రిక్త హస్తం
- అరకొరగా సరుకుల పంపిణీ - 48 వేల రచ్చబండ కార్డులకు సరుకుల నిలిపివేత - పామాయిల్పై రాయితీ ఎత్తేసిన గత ప్రభుత్వం - దీనిపై స్పష్టత ఇవ్వని నూతన ప్రభుత్వం సాక్షి, అనంతపురం : అమ్మహస్తం.. ఈ పేరు వింటేచాలు నిరుపేదలు హడలెత్తుతున్నారు. నెలనెలా అందించే నిత్యావసర సరుకుల్లో కోతలు పెడుతుండడంతో పేదల కడుపునిండడం లేదు. పేదలకు సబ్సిడీపై అందించే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువుల పథకం ‘అమ్మ హస్తం’ అమలు అస్తవ్యస్తంగా మారింది. తొమ్మిది సరుకులలో కోత విధిస్తుండటంతో ఉపయోగం లేకుండా పోతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో మొత్తం 2,880 చౌకధరల దుకాణాల పరిధిలో 11.50 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డుదారులకు ప్రతి నెలా అమ్మహస్తం పథకం కింద పామాయిల్ (లీటర్), కందిపప్పు (కిలో), చక్కెర (అరకిలో), గోధుమ పిండి (కిలో), గోధుమలు (కిలో), అయోడైజ్డ్ ఉప్పు (కిలో), కారంపొడి (250 గ్రాములు), పసుపు (100 గ్రాములు), చింతపండు (అరకిలో) సరఫరా చేయాలి. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు జరిగిన రచ్చబండలో ఇచ్చిన 48 వేల రేషన్కార్డులకు రెండు నెలలుగా సరుకులు ఇవ్వడం లేదు. ఇక మిగతాకార్డుదారులకు పామాయిల్, పసుపు పంపిణీ చేయడం లేదు. పామాయిల్కు రాయితీ ఎత్తివేత మలేషియా నుంచి పామాయిల్ను కాకినాడకు తీసుకువచ్చి అక్కడే ప్యాకింగ్ చేసి జిల్లాకు పంపుతారు. దీనిపై మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం రాయితీ నిలిపివేసింది. ఆ వెంటనే దిగుమతి కూడా ఆగిపోయింది. రాష్ట్రపతి పాలన అమల్లోకి రావడం, వరుస ఎన్నికలు వచ్చిపడడంతో దీనిపై దృష్టి సారించలేదు. కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరినా పామాయిల్కు రాయితీ కొనసాగింపు విషయంలో ప్రకటన చేయలేదు. దీంతో రెండు నెలలుగా కార్డుదారులు పామాయిల్కు నోచుకోలేదు. అంతా గందరగోళమే అమ్మహస్తం సరుకుల సరఫరాలో గందరగోళం నెలకొంది. వీటి కొనుగోలుకు డీలర్ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడులు పెట్టాలి. డీలర్లు అంత మొత్తంలో పెట్టుబడులు పెట్టే సామర్థ్యం లేకపోవడంతో బ్యాంకు రుణాలు తెచ్చుకుంటున్నారు. అయితే అమ్మహస్తం సరుకుల్లో నాణ్యత లోపిస్తుండంతో వీటిలో కొన్నింటిని తీసుకోవడానికి కార్డుదారులు సుముఖత చూపడం లేదు. దీంతో కొన్ని సరుకులు అమ్ముడుపోనందున.. అప్పు చేసి డీడీ తీయాల్సి వస్తుందని డీలర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆదాయం.. చేసిన అప్పుకు వడ్డీ కట్టేకే సరిపోతుందంటున్నారు. ఈ కారణంతో డీలర్లు కొన్ని సరుకులను సరఫరా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మరోవైపు సరుకులను జిల్లాకు తెప్పించడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. బియ్యంతో పాటే సరుకులను కూడా గోదాముల్లో నిల్వ చేయాలి. బియ్యంతో పాటే రేషను సరుకులు సకాలంలో జిల్లాకు రాకపోవడం, సకాలంలో వచ్చినా రెండింటినీ నిల్వ చేసే సామర్థ్యం గోదాముల్లో లేకపోవడంతో ఆలస్యంగా వచ్చిన సరుకులు గోదాముల్లోనే మూలగాల్సిన దుస్థితి నెలకొంది. పథకం అమలు తీరుపై ఆరా ‘అమ్మహస్తం’ పథకంపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆరాతీస్తున్నట్లు తెలిసింది. ఆ సరుకులు ఎంతవరకు ప్రజల అవసరాలు తీరుస్తున్నాయో పరిశీలించి నివేదికలు పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ రూ.16 వేల కోట్ల లోటుతో ఉంది. ఈ మేరకు లోటును తగ్గించుకోవాలంటే ప్రజలకు పెద్దగా అవసరం ఉండని పథకాలను కొన్నింటిని ప్రభుత్వం రద్దు చేసే యోచనతోనే ఈ విధమైన ప్రతిపాదనలు కోరుతున్నట్లు తెలిసింది. ‘అమ్మహస్తం’లోని తొమ్మిది రకాల వస్తువుల్లో కొన్నింటిని ప్రజలు తీసుకెళ్లడం లేదన్నది బహిరంగ రహస్యం. బియ్యంతో పాటు పామాయిల్, పంచదార, గోధుమలు, కందిపప్పు సరఫరా చేస్తే చాలని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సరుకులలో కొన్నింటిని తొలగించే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది. -
అమ్మహస్తం..అస్తవ్యస్తం
ఖమ్మం కలెక్టరేట్ : పేదలకు రూ.185కే తొమ్మిదిరకాల నిత్యావసర సరుకులను అందించే లక్ష్యంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం అస్తవ్యస్తంగా తయారైంది. సరుకుల్లో నాణ్యత లేకపోవడంతో పాటు మార్కెట్ ధరతో పోల్చితే పెద్దగా తేడా లేకపోవడంతో ఈ పథకానికి ప్రజల నుంచి ఆదరణ కొరవడింది. గత ఉగాది సందర్భంగా లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి వచ్చేసరికి ఘోరంగా విఫలమైంది. మూడు నెలలుగా అందని పామాయిల్... రేషన్ వ్యవ స్థపై అధికారుల అజమాయిషీ కొరవడింది. ప్రజలకు కావాల్సిన సరుకులు అందించడంలో ఇటు అధికారులు, అటు డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు ప్రతి నెల 7.70 లక్షల పామాయిల్ ప్యాకెట్లు అవసరం కాగా, గత మూడు నెలలుగా అసలు సరఫరానే లేదు. డీలర్లు తేవడం లేదా.. అసలు ప్రభుత్వమే సరఫరా చేయడమే లేదా.. అని వినియోగదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు రోజుల తరబడి రేషన్ షాపుల వద్దకు తిరుగుతున్నా సరుకుల అందని పరిస్థితి నెలకొంది. నాణ్యతకు తిలోదకాలు... అమ్మహస్తం ద్వారా అందించే తొమ్మిది రకాల నిత్యావసరాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముక్కిపోయిన కందిపప్పు, గింజ తీయని చింతపండు, పురుగులు పట్టిన గోధుమలు, గోధుమ పిండి, ఘాటు లేని కారం పొడి, రుచిలేని నూనె ప్యాకెట్లు పంపిణీ చేస్తుండడంతో వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు వెనుకాడుతున్నారు. రూ.185కే తొమ్మిది రకాల సరుకులు వస్తున్నాయన్న ఆశతో చౌకధర దుకాణాలకు వెళ్తున్న మహిళలు సరుకులను చూసి పెదవి విరుస్తున్నారు. ఇటీవల పలు దుకాణాల్లో నాసిరకం సరుకులు ఇస్తున్నారంటూ మహిళలు ఆందోళనకు దిగిన ఘటనలు కూడా ఉన్నాయి.. మూడు సరుకులపైనే ఆసక్తి .. ఈ పథకం కింద అందించే తొమ్మిది రకాల సరుకుల్లో వినియోగదారులు మూడు సరుకులపై మాత్రమే ఆసక్తి కనబరుస్తున్నారు. గోధుమలు, చక్కెర, పామాయిల్ కొనుగోలు చేసి మిగితా వాటి జోలికి వెళ్లడం లేదు. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఈ పథకాన్ని ప్రారంభమైన మరుసటి రోజునే నాణ్యత లేని సరుకుల సరఫరా చేసిన ప్రభుత్వం తన అసలు రంగును బయటపెట్టింది. దీంతో సరుకులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా చింతపండు, పసుపు ఏనాడూ సక్రమంగా పంపిణీ చేసిన దాఖలాలు లేవు. ప్రచార అర్భాటమే... ‘అమ్మహస్తం’తో ప్రజలకు కలిగే లబ్ధి గోరంతే అయినా ప్రభుత్వం కొండంత ప్రచారం చేసింది. తెల్లకార్డుదారులకు రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు ఇస్తున్నామని ప్రకటిం చింది. అయితే వీటిపై ప్రభుత్వం నెలసరి భరించే సబ్సిడీ రూ. 7.78 మాత్రమే. వాస్తవంగా ఈ పథకం కింద కొత్తగా ఇస్తున్న సరుకులు నాలుగు మాత్రమే. ఇందులో మూడు వస్తువులకు ప్రభుత్వం కొంత సబ్సిడీ భరిస్తుండగా పసుపు మాత్రం మార్కెట్ ధరకంటే ఎక్కువకే విక్రయిస్తుండటం గమనార్హం. డీలర్ల నిరాసక్తత... రేషన్ డీలర్లు సైతం ఈ తొమ్మిది రకాల సరుకులు తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. వీటి అమ్మకాలపై కమీషన్ గిట్టుబాటు కాకపోవడం, వాటిని వినియోగదారులు కొంటారనే నమ్మకం లేకపోవడంతో వారు తెచ్చేందుకు వెనుకాడుతున్నారు. తొమ్మిది సరుకులు(ఒక కిట్) విక్రయిస్తే లభించే కమీషన్ రూ.4.09 పైసలు మాత్రమే. అయితే ఇందులో సరుకుల దిగుమతి, రవాణా ఖర్చులే ఎక్కువవుతున్నాయి. దీనికి తోడు సరుకులన్నీ అమ్ముడుపోకపోవడంతో తమకు నష్టం వస్తోందని డీలర్లు వాపోతున్నారు. -
కోటా నిల్!
ఎన్నికల ప్రభావం ఇప్పుడు పామాయిల్ సరఫరాపై పడింది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించని కారణంగా జిల్లాలో తెల్లరేషన్ కార్డుదారులు వంట నూనెకోసం తంటాలు పడాల్సి వస్తోంది. రాయితీతో అందించే పామాయిల్ ఏప్రిల్ కోటా విడుదల చేయని కారణంగా ఈనెల కూడా అందేపరిస్థితి కనిపించడం లేదు. బయట వంటనూనెల ధరలు మండిపోతున్న తరుణంలో కొనుగోలుచేయలేక లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. పాలమూరు, న్యూస్లైన్: జిల్లాలో 2,304 రేషన్షాపులకు సంబంధించి మొత్తం 10.15లక్షల తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. మే నెలకు సంబంధించి జిల్లాలోని రేషన్ దుకాణాలకు పామాయిల్ కోటాను నిలిపేశారు. కొత్త సర్కారు కొలువు దీరిన తర్వాతే పామాయిల్ సరఫరా ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీంతో తెలుపు రేషన్కార్డుదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లబ్ధిదారులకు ప్రతినెలా రూ.40కే పామాయిల్ ప్యాకెట్ను రాయితీపై అందించేవారు. ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన కోటా ఆగిపోవడంతో లబ్ధిదారులు రూ.65 నుంచి రూ.80 వరకు చెల్లించి పామాయిల్ ప్యాకెట్లను కొనుగోలు చేయాల్సి రావడంతో రేషన్ కార్డుదారులకు భారంగా మారింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వమే రేషన్ దుకాణాలకు రాయితీతో కూడిన పామాయిల్ను కేటాయించేది. కేంద్ర ప్రభుత్వం మార్చిలోనే కేటాయింపు నిలిపేసింది. దీంతో ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం లేకపోవడం, ఎన్నికలు జరుగుతుండటంతో ఏప్రిల్ కోటా విడుదల కాలేదు. మార్చిలో విడుదలైన కోటాలో మిగులును ఏప్రిల్లో పంపిణీచేశారు. ఇక ఈనెల నుంచి కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు రేషన్ దుకాణాల్లో పామాయిల్ ఉండదని చెప్పడంతో పేదలు నిరాశకు గురవుతున్నారు. రేషన్దుకాణాల్లో కిలో పామాయిల్ రూ.40కు అందిస్తుండగా బహిరంగ మార్కెట్లో దీనిధర రూ.59 నుంచి రూ.65 వరకు ఉంది. సన్ఫ్లవర్ నూనె ధర రూ.85 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. ఆందోళనలో కార్డుదారులు జిల్లాలో 10.15 లక్షల తెలుపు రేషన్కార్డులు ఉన్నాయి. వాటన్నింటికీ ప్రతినెలా పామాయిల్ను పంపిణీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాకు ప్రతినెలా వెయ్యి టన్నుల పామాయిల్ కోటా విడుదలవుతోంది. జిల్లాలో 14 ఎంఎల్ఎస్ పాయింట్ల (గోదాంల) ద్వారా అన్ని మండలాలకు సరఫరా చేస్తుంటారు. జిల్లాలో 2,304మంది రేషన్డీలర్లు ఉన్నారు. వీరిలో 20 శాతం మంది ప్రతినెలా మాదిరిగానే మే నెల పామాయిల్కు డీడీలు చెల్లించారు. కోటా విడుదల కాదని తెలియడంతో ఆందోళనలో పడ్డారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడంతో కొందరికి ఏప్రిల్లో మిగిలిన ప్యాకెట్లను సరఫరా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు పామాయిల్ కోటా రాదని అధికారులు స్పష్టంచేస్తున్న నేపథ్యంలో ఇటు డీలర్లు, అటు పేదలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. -
పామా..యిల్లే
నిలిచిపోయిన సరఫరా ప్రజా పంపిణీ అస్తవ్యస్తం నెలకో నిత్యావసర వస్తువుకు మంగళం తెల్లకార్డుదారుల అవస్థలు విశాఖ రూరల్, న్యూస్లైన్ : ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తెల్లరేషన్ కార్డుదారులకు చుక్కలు చూపిస్తోంది. ఏ వస్తువు ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం తరువాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోను.. ప్రస్తుత రాష్ట్రపతి పాలనలోనూ దీనిని పట్టించుకున్న నాథులే లేకుండా పోయారు. నెలాకో నిత్యావసర వస్తువు సరఫరా నిలిచిపో తోంది. తాజాగా పామాయిల్ సరఫరా ఆగిపోయింది. బహిరంగ మార్కెట్లో అధిక ధరకు వంటనూనెను కొనుగోలు చేయలేక కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో దాదాపుగా 12.5 లక్షల మంది తెల్లరేషన్కార్డుదారులు ఉన్నారు. వైఎస్ హయాంలో ప్రతినెలా నిత్యావసర సరుకులు సక్రమంగా సరఫరా అయ్యేవి. ఆయన మరణానంతరం ఈ పంపిణీ వ్యవస్థను రాజకీయ లబ్ధికి వినియోగించుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా అమ్మహస్తం పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.185కే తొమ్మిది సరుకులంటూ ఊదరగొట్టింది. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఒక్క నెల కూడా సక్రమంగా నిత్యావసర వస్తువులను కార్డుదారులకు అందించ లేదు. ప్రతి నెలా జిల్లాకు కేటాయింపులు తగ్గిస్తూ వచ్చింది. ఇప్పటికే కారం, పసుపు, చింతపండు కేటాయింపులను నిలిపి వేసింది. సరఫరా చేసే వస్తువుల్లో కూడా నాణ్యత లోపించడంతో కార్డుదారులు కొన్ని సరుకులపై అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉప్పు, గోధుమ పిండి అధ్వానంగా ఉండడంతో వాటిపై ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. ఒక్కోసారి కందిపప్పు కూడా బాగోవడం లేదని కార్డుదారులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా జిల్లాకు నెల నెలా కేటాయింపులు తగ్గిపోతూ వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇప్పటివరకు చౌక దుకాణాల ద్వారా కార్డుదారులు బియ్యం, పామాయిల్లనే అధికంగా తీసుకుంటున్నారు. తాజాగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. సాధారణంగా పామాయిల్ను మలేషియా నుంచి ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుంది. ఒక షిప్ పామ్క్రూడ్కు సుమారు రూ. 80 కోట్లు ఖర్చు చేస్తోంది. మలేషియా నుంచి ఆ షిప్ కాకినాడకు వస్తుంది. అక్కడ రిఫైన్ చేసిన తరువాత ప్యాకింగ్లు చేసి జిల్లాలకు సరఫరా చేస్తుంది. గత నెలలో పామాయిల్ను కొనుగోలు చేసే విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా చౌక దుకాణాల్లో రూ.40జుజ లభించే ఈ వంటనూనెను కార్డుదారులు బహిరంగ మార్కెట్లో రూ.70 వరకు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేద, బలహీనవర్గాల వారు అంత ధరకు నూనెను కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. వచ్చే నెలలో కూడా పామాయిల్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీనిపై అధికారుల వద్ద ఎటువంటి సమాచారం లేదు. ఎలా బతకగలం రేషన్ డిపోలో ఆరునెలలుగా నూనె ఇవ్వడంలేదు. రూ. 40లకు ఇచ్చే దానిని బయట మార్కెట్లో రూ.70 లకు కొనుగోలు చేస్తున్నాం. అంచెలంచెలుగా సరుకులన్నీ ఇలాగే ఇవ్వడం మానేస్తే మాలాంటి పేదోళ్ళం ఎలా బతకగలం. ప్రభుత్వం రేషన్ గురించి పట్టించుకోవడంలేదు. - అట్ట ఈశ్వరమ్మ, ఖాజీపాలెం ఎప్పుడేమిస్తారో తెలియదు రేషన్డిపోలో ఏ నెలలో ఎన్ని సరుకులు ఇస్తారో తెలి యడంలేదు. నూనె ఇవ్వడం మానేశారు. బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అధికారులు ఇవ్వడంలేదో డీలర్లు అమ్మేసుకుంటున్నారో అర్థం కాలేదు. పలానా సరుకులు ఇస్తామని అధికారుల చెప్పడంలేదు. డీలర్ల ఇష్టారాజ్యమైపోతోంది. - సీరపు లక్ష్మి, మార్టూరు -
‘అమ్మహస్తం’ అదృశ్యమయ్యేనా?
మే నెల రేషన్ సరఫరా ఏదీ? నిలిచిపోయిన ఏడు రకాల సరుకులు సరుకుల పంపిణీకి ముగిసిన కాంట్రాక్టు పట్టించుకోని పౌరసరఫరాల శాఖ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో నిరుపేదలకు రేషన్ సరుకుల పంపిణీ అరకొరగా మారింది. మే నెల రేషన్ లో రెండు, మూడు మినహా మిగతా సరుకుల సరఫరా లేకుండా పోయింది. నెల ప్రారంభమై వారం రోజులు గడిచినా బియ్యం, గోధుమ పిండి తప్ప మిగిలిన సరుకులు చౌకధర దుకాణాలకు చేరలేదు. ముఖ్యంగా పామాయిల్తో పాటు చక్కెర, కందిపప్పు, చింతపండు, పసుపు, కారం, ఉప్పు సరఫరా లేకుండా పోయింది. గతేడాది ‘అమ్మహస్తం’ కింద తొమ్మిది సరుకుల సరఫరాకు కుదుర్చుకున్న కాంట్రాక్టు గడువు ఏప్రిల్ మాసంతో పూర్తికావడంతో ఈ నెల సరుకుల సరఫరా నిలిపోయింది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పాత కాంట్రాక్టు పునరుద్ధరణ, లేక కొత్త కాంట్రాక్టుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితం మే నెలకు సంబంధించి సుమారు ఏడు రకాల సరుకుల సరఫరా నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి పాలసీ నిర్ణయాలు తీసుకుంటే గానీ సరుకుల సరఫరాకు మోక్షం లభించే అవకాశాలు లేకుండా పోయినట్లు తెలుస్తోంది. సబ్సిడీ సరుకులపై అనుమానాలు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. రూపాయికి కిలో బియ్యం మినహాయిేస్తే మిగిలిన సరుకుల సరఫరా లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం ప్రస్తుతం లబ్ధిదారులకు అందించిన తెల్లరేషన్ కార్డులను అమలు చేస్తుందా.? లేక వాటిని రద్దు చేసి వేరే కార్డులను జారీ చేస్తుందా? అనేది నిరుపేదలకు తొలిచేస్తున్న ప్రశ్న. మరోవైపు సబ్సిడీ సరుకులు కొనసాగించేనా.. లేదా అనే అంశంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా పరిధిలో సుమారు 17.69 లక్షల వరకు తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. ఇందుకోసం ప్రతి నెలా గ్రేటర్కు కోటా ప్రకారం పెద్దఎత్తున సరకుల సరఫరా జరుగుతుంది. ఈ నెల సరుకుల సరఫరా లేకుండా పోవడంతో లబ్ధిదారులు చౌకధర ల దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. -
కాటేస్తున్న కల్తీ నూనె
విచ్చలవిడిగా కల్తీ అమ్మకాలు {పజల ఆరోగ్యాలను హరిస్తున్న వ్యాపారులు అధికారుల దాడులు శూన్యం కల్తీకి కాదేది అనర్హం అంటున్నారు స్వార్ధపరులు. నూనె కల్తీతో ప్రజల ఆరోగ్యాలను హరిస్తున్నారు. దాడులు చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారు. చోడవరం,న్యూస్లైన్: ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో పేద, దిగువ తరగతి ప్రజల్లో ఎక్కువ శాతం మంది తక్కువ ధరకు లభించే పామాయిల్నే ఎక్కువగా వినియోగిస్తారు. దీనిని ఆసరాగా చేసుకుని ఈ రకం నూనెలోనే ఎక్కువ కల్తీ జరుగుతోంది. రిఫైన్డ్ ఆయిల్ పొద్దుతిరుగుడు పువ్వుల గింజల నుంచి తయారు చేస్తారు. వేరుశనగ, నువ్వులు రకాల నూనెలు ఉన్నప్పటికీ వాటి వాడుక నామమాత్రమే. తౌడు, మొక్కజొన్న కంకెలు, సన్ఫ్లవర్,పామాయిల్ పిప్పి నుంచి తీసే నూనె చాలా ప్రమాదకరం. వీటిని ఈ పామాయిల్లో కలిపేసి అమ్మేస్తున్నారు. వాస్తవానికి పామాయిల్ గెలల నుంచి తొలుత తీసే నూనె వినియోగిస్తే ఎలాంటి ప్రమాదం లేదు. కానీ నూనె తీసేసిన పామాయిల్ పిప్పి, తౌడు, మొక్కజొన్న కంకెలను మళ్లీ గానుగలో వేసి తీసినది అత్యంత నాసిరకం. ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఈ నూనెలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల పామాయిల్లో ఈ నాసిరకం నూనెలను కలిపి విక్రయిస్తున్నారు. మండల కేంద్రాల్లో జరిగే లూజు అమ్మకాల్లో దాదాపు 60 శాతం వరకూ కల్తీ జరుగుతోంది. అరడబ్బా అసలు నూనెలో మరో అరడబ్బా నాసిరకం కలిపేసి విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ నూనె లీటర్ రూ.80 వరకూ ఉంది. అయితే ఈ నాసిరకపు నూనె రూ.40కే లభిస్తుండడంతో దీనిని మేలు రకపు సరుకులో కలిపేసి సొమ్ము చేసుకుంటున్నారు. చోడవరం పాత బస్టాండ్ సమీపంలో ఉన్న హోల్సేల్, రిటైల్ నూనెదుకాణాల్లో ఈ వ్యవహారం మరీ ఎక్కువగా జరుగుతోంది. నేరుగా ట్యాంకర్తో వచ్చిన నూనెను హోల్సేల్ వ్యాపారులు పీపాల్లోకి తీసి వాటి నుంచి 15 కిలోల డబ్బాల్లోకి నింపేటప్పుడు కల్తీ చేస్తున్నారు. కంపెనీ నుంచి వచ్చే డబ్బాల కన్నా లూజు డబ్బాలు తక్కువ ధరకు లభిస్తాయని వినియోగదారులకు ఒప్పిస్తూ ఈ నాసిరకపు నూనెలు అంటగడుతున్నారు. చోడవరం పరిసర ఏడు మండలాల ప్రజలు ఇక్కడే నూనె కొనుగోలు చేస్తారు. వీరంతా రైతులు, సామాన్య ప్రజలు కావడంతో వ్యాపారులు ఇష్టానుసారం ఈ నాసిరకపు సరుకు అంటగడుతున్నారు. ప్రజలు మాత్రం నాసిరకం నూనెలు తిని కాలేయం, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఏనాడూ అధికారులు ఇలాంటి వ్యవహారాలపై దాడులు చేసిన దాఖలాలు లేవు. -
పండగ ప‘రేషన్’
అమ్మహస్తం.. అస్తవ్యస్తం... నేటికీ అందని వస్తువులు సంక్రాంతి గడిచేదెలా.. అమ్మహస్తం పథకం రానురాను అస్తవ్యస్తంగా తయారవుతోంది. పండగపూట కూడా పేద, మధ్యతరగతి ప్రజలు పచ్చడి మెతుకులతో కడుపు నింపుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకం అమలుపై ప్రభుత్వం ఎందుకింత అలక్ష్యం వహిస్తోందో అర్థం కావడం లేదు. విజయవాడ సిటీ, న్యూస్లైన్ : జిల్లాలోని చౌకధరల దుకాణాలకు నేటికీ సగానికి సగం సరకులు చేరలేదు. అధికారులు సోమవారం నాటికి పామాయిల్ గోడౌన్లకు చేర్చారు. స్టాక్ లేకపోవడంతో గత డిసెంబర్లో జిల్లా వ్యాప్తంగా పామోలిన్ సరఫరా పూర్తిగా నిలిపివేసిన ప్రభుత్వం పండగ వచ్చేసినా పంపిణీ చేయలేకపోయింది. అధికారులు ప్రయాసలు పడి ఎంఎల్సీ పాయింట్లకు చేర్చినా ఇంకా ప్రజలకు అందలేదు. విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని పలు రేషన్ దుకాణాలకు పామాయిల్ సరఫరా కాలేదని తెలిసింది. స్టాక్ వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో కొందరు డీలర్లు సరకు కోసం డీడీలు కట్టకపోవడంతో ప్రజలకు పామాయిల్ తోపాటు ఇతర వస్తువులు అందలేదని చె బుతున్నారు. 49 మండలాల్లో 30 మండలాలకు మాత్రమే అదికారులు ఇప్పటి వరకు పామాయిల్ సరఫరా చేశారు. జిల్లాకు ప్రతి నెలా 1209 మెట్రిక్ టన్నుల పామాయిల్ను అధికారులు కార్డుదారులకు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం 900 మెట్రిక్ టన్నులు మాత్రమే డిపోలకు సరఫరా అయినట్లు తెలిసింది. తాజాగా ఇచ్చిన కొత్త కార్డుదారులతో కలిపి జిల్లా వ్యాప్తంగా 2,150 డిపోలలో12లక్షల రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరకులు అందించాల్సి ఉంది. తొమ్మిదింటిలో నాలుగే సరఫరా .... అమ్మహస్తంలో భాగంగా రూ.185కు 9 వస్తువులు సరఫరా చేయాల్సి ఉంది. ఈ నెలలో అధికారులు బియ్యం, పంచదార, పామాయిల్, కందిపప్పు మాత్రమే సరఫరా చేశారు. ఉప్పు, చింతపండు, గోధుమలు, గోధుమపిండి, పసుపు, కారం సరఫరా నిలిపివేశారు. -
పామాయిల్ పరేషన్
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్లైన్: పండగపూటా పేదలకు పస్తులు తప్పడం లేదు. పండగొచ్చినా ఇంకా ప్రభుత్వ చౌకదుకాణాలకు పామాయిల్ చేరలేదు. దీంతో కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుకాణానికి వెళితే ‘మమ్మల్ని ఏం చేయమంటారు. వస్తే కదా ఇచ్చేది’ అని డీలర్లు చెబుతున్నారని కార్డుదారులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే మండల స్టాకిస్ట్ పాయింట్లలో పనిచేసే అధికారులు అయినవారికి ఆకుల్లో, కానివారికి కం చాల్లో అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న రేషన్దుకాణాలకు మాత్రమే పామాయిల్ పంపారని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క పామాయిల్ పరిస్థితే కాకుండా అమ్మహస్తం సరుకుల విషయంలోనూ ఎంఎల్ఎస్ పాయింట్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. జిల్లాలో మొత్తం 1872 రేషన్దుకాణాలు ఉండగా సగానికిపైగా దుకాణాలకు ఇంకా పామాయిల్ చేరలేదు. ఇకనైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పామాయిల్ పంపిణీ చేయాలని కార్డుదారులు కోరుతున్నారు. -
పండక్కి ప‘రేషాన్’!
తీపి లేదు.. పులుపు లేదు. పల్లెవాసులకు సంక్రాంతి పండుగ సంబురమే లేదు. ఏం కొందామన్నా..ఏం తిందామన్నా ధరలు మండిపోతున్నాయి. చౌక సరుకులైనా కాసింత ఆసరా ఉంటాయనుకుంటే వాటి అతీగతి లేదు. మూణ్నెళ్లుగా పామాయిల్ పంపిణీ చేయకపోవడంతో పేదలకు పిండివంటలు చేసుకొనే భాగ్యమే లేదు. పసుపు, చింతపండు, కారం, చక్కెర లేదు.. పండుగపూట అదనపు కోటా జాడేలేదు. పాలమూరు/కలెక్టరేట్, న్యూస్లైన్: అమృతహస్తం పథకం ద్వారా రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను అందిస్తున్నట్లు ప్రభుత్వం ఓ వైపు చెబుతుండగా..జిల్లాలో మాత్రం ఆ పరి స్థితి లేదు. పండుగ పూట కందిపప్పు, పామాయిల్ కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. జిల్లాలో తెలుపు రేషన్కార్డులతో పాటు ఇతర పథకాల కింద 11.50 లక్షల కార్డులు ఉన్నాయి. వీటికి ప్రతినెలా చౌక దుకాణాల ద్వారా సరుకులను పౌరసరఫరాల శాఖ అందజేయాలి. 2,304 రేషన్షాపులకు 10.90 లక్షల పామాయిల్ ప్యాకెట్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. పండుగ వేళ పామాయిల్ లభించకపోవడంతో లబ్ధి దారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండునెలలుగా జిల్లాలో పామాయిల్ను సరఫరా చేయడమే మానేశారు. దీంతో చేసేదిలేక రేషన్షాపుల్లో రూ.40కి లభించే పామాయిల్ పాకెట్ను బహిరంగ మార్కెట్లో రూ.70కు కొనుగోలుచేస్తున్నారు. జిల్లాలో చక్కెర పరిస్థితి కూడా అదేతంతుగా మారింది. మారుమూల గ్రామాల్లో కొందరు డీలర్లు చక్కెర ఇవ్వడం లేదని లబ్ధిదారులు గగ్గోలుపెడుతున్నారు. ప్రతికార్డుపై ప్రస్తుతం అరకిలో చక్కెర ఇస్తున్నారు. పండుగ సమయాల్లో మరో అరకిలోను కలిపి కిలో చక్కెర ఇవ్వాలి. కానీ పౌరసరఫరాల అధికారులు అదనపుకోటా మాటనే మరిచారు. ‘కొత్త’ కోటా హుష్కాకి! ఇదిలాఉండగా, రెండేళ్ల క్రితం జిల్లావ్యాప్తంగా1.90లక్షల మం ది తెల్లరేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే విచారణ పేరుతో 60 వేలకు పైగా తొలగించిన అధికారులు ఎట్టకేలకు రెండేళ్ల తరువాత 1.32లక్షల మంది అర్హులంటూ తేల్చారు. వారికి తాత్కాలిక రేషన్ కూపన్లు జారీచేశారు. వీ రందరికీ గతేడాది నవంబర్లో నిర్వహించిన రచ్చబండలో కూపన్లను పంపిణీచేశారు. ఇక పంపిణీ సమయంలో డిసెం బర్ కోటాను తీసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. కానీ వారికి ఇప్పటివరకు సరుకులను అందించలేకపోయారు. కానీ రేషన్కోటా మాత్రం రెండు నెలలు యథావిధంగా పంపిణీకా గా, దాన్ని లబ్ధిదారులకు పంపిణీచేయకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక కోటా విషయానికొస్తే డిసెం బర్లో 1.32 లక్షల మందికి రేషన్కోటా మంజూరుచేయగా, ఆనెలలో కేవలం 60వేల మంది మాత్రమే రేషన్ తీసుకున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇలా ఈ రెండునెలల కాలంలో కేవలం 70వేల మంది మాత్రమే రేషన్కోటాను తీసుకున్నారు. ఇక జనవరిలో ఈ కోటాను కాస్త పెంచి లక్షమందికి పంపిణీచేసి మిగిలిన వారిని పక్కకు పెట్టేశారు. 30 వేలకు పైగా పెండింగ్లోనే.. మంజూరైన కూపన్లను పంపిణీచేయడంలో అధికారులు కావాలనే నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే లబ్ధిదారులకు కూపన్లను అందించకపోతే వారికి కోటా ఉండదు, కావునా ఆ కోటాను స్వాహా చేయొచ్చని అనుకున్నారేమో తెలియదు కానీ లబ్ధిదారులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీటిని ఎప్పటివరకు పంపిణీచేస్తారో అంతుచిక్కని ప్రశ్నంగా మారింది. కోటాను పక్కదారిపట్టిస్తే చర్యలు కూపన్లు అందరికీ పంపిణీ చేయని మా టవాస్తవమే. కానీ వారికి మంజూరు చేసిన కోటాను క్లోజింగ్ బ్యాలెన్స్లో డీలర్లు చూ పాల్సిందే. కూపన్లను సకాలంలో పంపిణీచేయని అధికారులపై కఠినచర్యలు తప్పవు. - ఎల్.శర్మణ్, జేసీ -
రచ్చబండ కార్డులకు ఉత్తచేయి!
సాక్షి, రాజమండ్రి : రచ్చబండలో మంజూరు చేసిన కొత్త రేషన్కార్డులకు సర్కారు మళ్లీ మొండిచేయి చూపించింది. పాతవారికి ఆలస్యంగా రేషన్ ఇచ్చి కొత్తవారికి ఇంకా పంపిణీ చేయలేదు. దీంతో పండుగకు ఏం తినాలని పేదలు ప్రశ్నిస్తున్నారు. కాగా పాత కార్డులకు కూడా బియ్యం తప్ప మిగిలిన సరుకులు అరకొరగా పంపిణీ చేయడంతో పండుగను ఎలా జరుపుకోవాలని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2561 రేషన్ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు14.50 లక్షల తెలుపురేషన్ కార్డులున్నాయి. గత రచ్చబండలో మరో లక్షకు పైగా కార్డులు మంజూరు చేశారు. వీరిలో పాత కార్డుదారులకు ఈ నెల ఆరవ తేదీ వరకూ బియ్యం, పంచదార పంపిణీ చేశారు. కానీ కొత్త కార్డులకు మాత్రం ఇప్పటి వరకూ డిపోలకు సరుకులు చేరలేదు. దీంతో పండుగ సరుకు ఇంకెప్పుడిస్తారని కార్డుదారులు అడుగుతున్నారు. పండుగ సెలవుల నేపథ్యంలో కొత్త కార్డులకు సరుకు ఇవ్వాలంటే ఒక్క సోమవారం మాత్రమే మిగిలి ఉంది. కానీ సుమారు 80 శాతం రేషన్డిపోలకు ఇంకా సరుకులు చేరలేదు. ఒక్క సోమవారం సరుకులు డిపోలకు పంపడం, కార్డుదారులకు అందచేయడం సాధ్యంకాని పరిస్థితి అని డీలర్లు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పండుగలోపు కొత్త కార్డులకు జనవరి రేషన్ అందే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది. ఇతర సరుకులదీ అదే దారి బియ్యం, పంచదార, కిరసనాయిల్ తప్ప డిపోలకు కందిపప్పు, పామాయిల్ తదితర మిగిలిన ఆరు వస్తువుల పంపిణీ అరకొరగా సాగుతోంది. దీంతో తాము కార్డుదారులకు సమాధానం చెప్పలేక పోతున్నామని డీలర్లు అంటున్నారు. ప్రతినెలా కందిపప్పు సాధారణ రేషన్ సమయం దాటిపోయాక పంపిణీ చేస్తున్నారు. దీంతో అది ఎప్పుడు వస్తుందో తెలియని కార్డుదారులు కేవలం ఇతర వస్తువులకు డిపోల వెంట పదే పదే తిరగలేక సరుకు తీసుకోవడం మానేస్తున్నారు. దీంతో కొన్ని డిపోల్లో సరుకులు నిల్వ ఉండిపోయి పాడైపోతున్నాయి. దీనిని ఆసరాగా తీసుకుని తాము పంపిణీ చేసినా అమ్మహస్తం ఇతర సరుకులు జనం తీసుకోవడం లేదని అధికారులు చెప్పుకొస్తున్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితిపై పంపిణీ అధికారులను ప్రశ్నించగా ఇప్పటికే కొన్ని డిపోలకు సరుకులు తరలించామని పండుగ లోపే మిగిలిన డిపోలకు వెచ్చాలు తరలించి సరుకు ఇస్తామని చెబుతున్నారు. పండుగ తర్వాతైనా సరుకులు తీసుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు. డీలర్లు మాత్రం ‘ప్రతి నెలా 15వ తేదీలోగా సరుకులు పంపిణీ చేసి ఆ తర్వాత నివేదికలు అధికారులకు సమర్పించి మరుసటి నెలకు వెచ్చాలకు సొమ్ములు చెల్లించవలసి ఉందని, నెలాఖరు వరకూ డిపోలకు సరుకులు తరలిస్తూనే ఉంటే ఎలా పంపిణీ చేసేద’ని అడుగుతున్నారు. కాగా కొందరు డీలర్లు సకాలంలో సరుకులకు డీడీలు తీయకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి నెలకొంటోందని జిల్లా పంపిణీ అధికారులు చెబుతున్నారు. ఇలా ఎవరి వాదనలను వారు బలపరుచుకుంటున్నారు త ప్ప మాకు మాత్రం సకాలంలో సరుకులు ఇవ్వడంలేదని జనం ఆవేదన వ్యక్త చేస్తున్నారు. -
సరుకుల్లేవ్.. సర్దుకోండి
సత్తెనపల్లిరూరల్, న్యూస్లైన్: కొత్త ఏడాది, సంక్రాంతి పండగ నెలలో కూడా పేదలకు ‘రేషన్’ అందడం లేదు. సరుకుల్లేవ్ సర్దుకోండని అధికారులు చెపుతుండడంతో సంక్రాంతి పండగను ఎలా నెట్టుకురావాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. అధికారుల ఉదాశీన వైఖరితో సరుకులు లేక గ్రామాల్లోని రేషన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. కేవలం బియ్యం, కిరోసిన్ మాత్రమే సరఫరా చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గత ఏడాది అట్టహాసంగా ఆరంభించిన అమ్మహస్తం పథకం ద్వారా అందించే సరుకుల్లో కేవలం పామాయిల్ మాత్రమే పంపిణీ చేసి సరిపెడుతున్నారు. ఈ పథకం ద్వారా అందించే తొమ్మిది రకాల సరుకుల్లో రెండు నెలలుగా కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. పామాయిల్ కూడా గత నెలలో సగం దుకాణాలకు మాత్రమే సరఫరా కాగా, మిగిలిన దుకాణాలకు ఈ నెలలో సరఫరా చేస్తామని అధికారులు చెపుతున్నారు. మిగిలిన సరుకుల్లో నాణ్యత లేకపోవటంతో తీసుకొనేందుకు కార్డుదారులు ముందుకు రావటం లేదు. దీంతో దుకాణదారులు అదే రీతిలో సిద్ధమవుతున్నాయి. డీలర్లకు భారంగా మారిన పంపిణీ.... ప్రజా పంపిణీ వ్యవస్థ సరుకులు అరకొరగానే సరఫరా కావటంతో పంపిణీ చేయడం డీలర్లకు భారంగానే మారింది. సత్తెనపల్లి రూరల్ మండలంలో మొత్తం 71 నిత్యావసర చౌక దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 34,186 కుటుంబాలు రాయితీపై నిత్యావసర సరుకులను పొందుతున్నాయి. ప్రతి నెలా 16,17 తేదీల్లోపు డీలర్లు సరుకులకు సంబంధించి బ్యాంకు డి.డి లు చెల్లించాలి. అనంతరం నెల ఆరంభంలో సరుకులను సరఫరా చేస్తారు. డిసెంబర్ నెలకు సంబంధించిన సరుకుల కోసం నవంబర్లో డి.డి లు చెల్లించారు. గోదాములకు పూర్తి స్థాయిలో సరుకులు రాకపోవటంతో సగం మంది డీలర్లకు మాత్రమే సరుకులు సరఫరా చేశారు. మిగిలిన వారికి నేటికీ సరుకులు రాలేదు. ఇక జనవరి నెలకు సంబంధించిన సరుకులకు గత నెలలోనే డి.డి లు చెల్లించారు. నెల ప్రారంభమై పది రోజులు దాటుతున్నా నేటికీ దుకాణాలకు సరుకులు చేరలేదు. పేద, మధ్య తరగతి కుటుంబాలపైనే భారం.. రేషన్ దుకాణాల్లో సరుకులు లేకపోవడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు బహిరంగ మార్కెట్కు వెళ్లక తప్పేలాలేదు. సంక్రాంతి పండగ నాడు కొద్దిగానైనా పిండి వంటలు చేసుకొందామనుకునే సగటు కుటుంబాలపై భారం పడుతోంది. మార్కెట్లో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకటంతో పండగ జరుపుకోవటం ఇబ్బందికరంగానే మారింది. రేషన్ దుకాణాలకు నిత్యవసర వస్తువుల సరఫరా లేకపోయినా అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం బియ్యం, కిరోసిన్తోనే సరిపెట్టుకోవాలంటూ చెప్పటంపై డీలర్లూ పెదవివిరుస్తున్నారు. డి.డి లు కట్టించటంలో ఉన్న హడావుడి సరుకులు అందించటంలో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పథకాల పేరుతో తమను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతోందని డీలర్లు వాపోతున్నారు. -
పండుగకు పామాయిల్ లేనట్టే!
యాచారం, ఘట్కేసర్ టౌన్, న్యూస్లైన్: మరో ఆరు రోజుల్లో సంక్రాంతి పండుగ.. తెల్ల రేషన్కార్డుదారులకు అమ్మహస్తం సరుకులతో పంపిణీ చేసే పామాయిల్ రెండు నెలలుగా అందడం లేదు. ఈ నేపథ్యంలో పండుగకు పిండివంటలు చేసుకోవడం పేదలకు కష్టంగా మారనుంది. మార్కెట్లో అధిక ధరకు వంటనూనె కొనుగోలుచేసే స్తోమత లేని పేదలు రేషన్దుకాణాల్లో పంపిణీ చేసే పామాయిల్ వైపే మొగ్గు చూపుతారు. అయితే యాచారం మండలంలో డిసెంబర్ నెలకు సంబంధించి డీలర్ల వద్ద డీడీలు కట్టించుకున్న అధికారులు అమ్మహస్తం సరుకుల్లో పామాయిల్ను సరఫరా చేయలేదు. మండలంలో 20గ్రామాల్లో దాదాపు 14వేల వరకు తెల్లరేషన్కార్డుల లబ్ధిదారులున్నారు. డిసెంబర్లో పామాయిల్ సరఫరా చేయకపోవడంతో జనవరిలోని స్టాక్కు డీడీలు తీయవద్దని ఉన్నతాధికారులు డీలర్లను ఆదేశించారు. దీంతో ఈ నెలలో కూడా పామాయిల్తోపాటు గోధుమపిండి కూడా పేదలకు అందే పరిస్థితి కన్పించడం లేదు. పౌరసరఫరాల శాఖ అధికారులను, రెవెన్యూ అధికారులను అడిగినా పామాయిల్, గోధుమపిండి వస్తుందో, రాదో స్పష్టంగా చెప్పడం లేదని పలువురు డీలర్లు ‘న్యూస్లైన్’తో పేర్కొన్నారు. భగ్గుమంటున్న నూనె ధరలు పండుగ దగ్గర పడుతుండడంతో మార్కెట్లో వంటనూనె ధరలు భగ్గుమంటున్నాయి. వారం రోజుల క్రితం లీటర్ రూ.70 ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ ప్రస్తుతం రూ.99 దాటింది. అలాగే పల్లీనూనె రూ.65 నుంచి రూ.65కి చేరింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. పేదలపై రూ.కోటి భారం! ఘట్కేసర్ మండలంలో మొత్తం 38 చౌకధర దుకాణాలుండగా, 35వేలకు పైగా తెల్లరేషన్కార్డుదారులకు సరుకులు అందజేస్తున్నారు. చౌకధర దుకాణాల్లో లీటర్ పామాయిల్ను రూ.40కి పంపిణీ చేస్తుండగా బహిరంగ మార్కెట్లో రూ.65-70కి విక్రయిస్తున్నారు. దీంతో ఒక పామాయిల్ పైనే లబ్ధిదారులకు లీటర్కు రూ.25-30 అదనపు భారం పడనుంది. దీంతో మండలంలో సంక్రాంతి పండుగకు పేదలపై సుమారు కోటి రూపాయల అదపనపు భారం పడుతోంది. ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ను వివరణ కోరగా పండుగకు అన్ని సరుకులతోపాటు పామాయిల్ను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉంటే మండల కేంద్రంలోని పౌరసరఫరాల గోదామును ‘న్యూస్లైన్’ పరిశీలించగా బియ్యం నిల్వలు కూడా కన్పించలేదు. అధికారుల నిర్లక్ష్యమే.. సమయానికి సరుకులను తెప్పించి పేదలకు అందజేయకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. పండుగకు పేదలపై అదనపు భారం పడకుండా రేషన్ దుకాణాల ద్వారా అన్ని సరుకులతో పాటు పామాయిల్ను కూడా పంపిణీ చేయాలి. - అబ్బగోని మీనా, వార్డు సభ్యురాలు. ఘట్కేసర్ -
పామాయిల్ నిల్..
= ఆరునెలలుగా పత్తాలేని నూనె = రేషన్దుకాణాల చుట్టూ లబ్ధిదారుల చక్కర్లు = పట్టింపులేని ఉన్నతాధికారులు సాక్షి,సిటీబ్యూరో: పేదలకు అంత చేస్తున్నాం..ఇంత చేస్తున్నాం..రూ.185కే తొమ్మిదిసరుకులు...ఇక హాయి గా ఉండండి.. అన్న ప్రభుత్వ ఆర్భాటపు నినాదాలు నీటి మూటలవుతున్నాయి. 9 సరుకుల సంగతి దేవుడెరుగు.. ఇస్తున్న సరుకుల్లోనే సర్కారు కోత పెడుతోంది. ఫలితంగా రేషన్ సరుకుల కోసం లబ్ధిదారులు దుకాణాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక్కటికాదు..రెండుకాదు..ఆరునెలలుగా పామాయిల్ను దుకాణాలకు సరఫరా చేయడం లేదు. ప్రతినెలా డీలర్లు ఆయిల్ కోసం డీడీలు కడుతున్నా పౌరసరఫరాల అధికారులు పామాయిల్ను పంపించడం లేదు. దీంతో చేసేదిలేక కార్డుదారులు బహిరంగమార్కెట్లో అధిక ధరలకు పామాయిల్ను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా అర్బన్ పరిధిలోని 12 సర్కిళ్లలో సుమారు 15లక్షల వరకు తెల్లకార్డుదారులు ఉండగా, ప్రతినెలా కనీసం సగటున 15లక్షల లీటర్ల వరకు పామాయిల్ డిమాండ్ ఉంటుంది. డీలర్లు ప్రతిసారి డీడీలు కడుతున్నప్పటికీ సరఫరా మాత్రం సకాలంలో జరగడం లేదు. అయితే పలుమార్లు ఆలస్యంగా సరఫరావుతున్న పామాయిల్ డీలర్ల చేతివాటంతో పక్కాదారి పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ ధరకు రెక్కలు రావడంతో మార్కెట్లో ఇతర కంపెనీల ధర రూ.58 నుంచి 65 వరకు పలుకుతోంది. బహిరంగమార్కెట్లో వేరుశనగ, సన్ఫ్లవర్ నూనె లీటర్ రూ.85 నుంచి 95 పలుకుతోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పామాయిల్ లీటర్ రూ.40కే లభిస్తుండడంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గగ్గోలు పెడుతున్నారు. కొరత వాస్తవమే : డీఎం నెల్లూరు నుంచి తగిన సరఫరా లేకపోవడంతో పామాయిల్ కొరత ఉన్నమాట వాస్తవమేనని సివిల్సప్లై డీఎం లక్ష్మీ అంగీకరించారు. పూర్తిస్థాయి కోటాను త్వరలో అందిస్తామని పేర్కొన్నారు. ఒక్కోకార్డుకు ఒక ప్యాకెట్ చొప్పున ఈనెల కోటాలో ఇచ్చేలా సాధ్యమైన చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. -
పామాయిల్ లేనట్టే..
=డీడీ తీయొద్దని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు =పిండి వంటలకు దూరంకానున్న సామాన్యులు బాలసముద్రం, న్యూస్లైన్ : సంక్రాంతి ముంగిట సామాన్యులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నాసిరకం గోధుమపిండి పంపిణీతో విమర్శలు ఎదుర్కొంటున్న సర్కారు... తాజాగా పామారుుల్ సరఫరా చేయలేక చేతులెత్తేసింది. దీంతో పండుగ వేళ సామాన్యులకు పిండి వంటలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పెరిగిన ధరలతో నిత్యావసర సరుకులు కొనలేక పేద, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రేషన్ సరుకుల్లో కోత పెడుతుండడంపై వారు మండిపడుతున్నారు. డీడీ తీయకండి... రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే అన్ని సరుకులకు సంబంధించి ప్రతి నెల 15 నుంచి 20వ తేదీ వరకు డీడీలు చెల్లించాలి. అయితే జనవరి కోటాకు సంబంధించి పామాయిల్ మినహా మిగిలిన వస్తువులకు డీడీలు తీయాలంటూ రేషన్ డీలర్లకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ చివరి నిమిషంలో అయినా... పరిస్థితిలో మార్పు వస్తుందని అంతా ఎదురుచూశారు. అయితే అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెలలో పామాయిల్ సరఫరా కష్టమేనని తెలుస్తోంది. గత నెలలోనూ కోతే... జిల్లాలో ప్రభుత్వం ప్రతి నెలా 2,113 రేషన్ దుకాణా ల ద్వారా 9.80 లక్షల పామారుుల్ ప్యాకెట్లను పేదలకు అందజేస్తోంది. గతనెలలో పూర్తి కోటా ప్రకారం పామాయిల్ను సరఫరా చేయలేదు. అరవై శాతం కో తతో కేవలం 3.98 లక్షల ప్యాకెట్లు సరఫరా చేసింది. తాజాగా ఈ నెలలో మొత్తం కోటాకు కోత పెట్టింది. నాసిరకం గోధుమపిండి, చింతపండు రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న తొమ్మిది వస్తువుల్లోగోధుమపిండి పూర్తిగా నాసిరకంతో ఉం టోంది. పురుగులతో కూడిన పిండిని కొనుగోలు చేసేందుకు రేషన్ లబ్ధిదారులు జంకుతున్నారు. దీం తో కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో నిల్వలు పేరుకుపోయూయి. దీనికి సంబంధించి జనవరి కోటాలో 30 శాతం మేరకు మాత్రమే డీడీలు వచ్చాయి. చింతపండుదీ ఇదే పరిస్థితి. రేషన్ దుకాణాల్లో చింతపండు అమ్మకం 10 శాతం దాటడం లేదు. -
పండగకు పామాయిల్ ఉన్నట్టా... లేనట్టా...!
=ఈ నెలలో సరఫరా చేసింది సగమే =జనవరికి ఇప్పటికీ కేటాయింపులు లేవు =అయోమయంలో పేద కుటుంబాలు =పండగకు తప్పని అదనపు భారం నర్సీపట్నం, న్యూస్లైన్ : పండక్కి పామాయి ల్ అదనపు కోటా మాట అటుంచి అసలుకే దిక్కులేని పరిస్థితి నెలకొంది. డిసెంబరులో అరకొరగా కేటాయించినప్పటికీ, జనవరికి సంబంధించి అధికారులు ఇప్పటికీ ఏ విషయమూ నిర్దుష్టంగా చెప్పలేకపోతున్నారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తరువు వస్తాయంటున్నారు. ఆమేరకు కేటాయింపు, సరఫరా చేస్తామని చెబుతున్నారు. చౌక దుకాణాల ద్వారా ప్రతీ తెల్లరేషన్కార్డుదారునికి ప్రభుత్వం లీటరు పామాయిల్ను రూ.40కి పంపిణీ చేస్తోంది. బయట మార్కెట్లో ధీని ధర రూ.65 వరకు ఉంది. దీంతో చౌకదుకాణాల పామాయిల్కు మంచి డిమాండ్ ఏర్పడింది. తక్కువ ధర కు వస్తుండటంతో దాదాపుగా అందరూ పామాయిల్ను విడిపించుకుంటున్నారు. జిల్లాలో 12.34 లక్షల మంది కార్డుదారులు ఉంటే డిసెంబరులో కేవలం 6,08,445 లీటర్లు మాత్రమే సరఫరా చేసింది. దీంతో సగానికిపైగా కార్డుదారులకు వంటనూనె అందలేదు. ఇక జనవరిలో సంక్రాంతి పండగకు అదనంగా పంచదార, నూనెను సరఫరా చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం అదనపు కోటా మాట అటుంచి, జనవరికి అవసరమైన కేటాయింపులు ఇప్పటి వరకు జిల్లాకు రాలేదు. విదేశాల నుంచి ప్రతి నెలా పామాయిల్ కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. అక్కడ ప్యాకింగ్లు చేసి వాటిని అవసరాల మేరకు జిల్లాలకు సరఫరా అవుతుంది. ప్రస్తుతం రెండు వేల కిలోలీటర్ల పామాయిల్ పోర్టుకు చేరిన ట్లు దిగుమతి కంపెనీ వర్గాల ద్వారా తెలిసిందని, దాన్ని కేటాయించిన వెంటనే సరఫరా చేస్తామని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతీ నెలా ఒకటో తేదీ నుంచి రేషన్ దాకాణాల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుంటారు. కానీ జనవరి నెల పామాయిల్ ఇప్పటికీ రాకపోవడంతో పండుగ మాసం బహిరంగ మార్కెట్లో అధిక ధర రూ.65 వరకు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఒకవేళ ఆలస్యంగానైనా పామాయిల్ వస్తే వాటిని కార్డుదారులకు సరఫరా చేయడానికి సమయం పట్టనుంది. మొత్తం మీద ఈ పండుగకు ముందైనా ప్రభుత్వం పామాయిల్ను ఇస్తుందో లేదో వేచి చూడాలి మరి. -
పండగకు పామాయిల్ లేనట్టే
=రావాల్సింది 1200 టన్నులు =వచ్చింది 400 టన్నులు =మున్సిపాలిటీల్లోకి పంపిణీ చేసే అవకాశం =గ్రామాల్లో సంక్రాంతి నాటికి అనుమానమే విజయవాడ సిటీ/ నూజివీడు, న్యూస్లైన్ : జిల్లాలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ ఏడాది ముఖ్యమైన పండగలకు ప్రభుత్వం పామాయిల్ సరఫరాకు ఎగనామం పెట్టింది. పర్వదినాలకు అదనంగా సరఫరా చేయాల్సి ఉండగా, అసలుకే ఎసరుపెట్టి పూర్తిగా బంద్ చేసింది. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్లో పామాయిల్ సరఫరాను పౌరసరఫరాల అధికారులు నిలిపివేశారు. జనవరి ఒకటో తేదీ నుంచి కనీసం మున్సిపాలిటీలకైనా సరఫరా చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పై నుంచి సరకు రాకపోయినా జిల్లాలో నిల్వ ఉన్న సరకును పోగుచేసి పట్టణాలకు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కార్డుదారులకు సంక్రాంతి పండగకు కూడా పామాయిల్ అందే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. సింగపూర్ నుంచి షిప్పులో పామాయిల్ సరఫరాలో జాప్యం జరగటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలకు పామాయిల్ అందుబాటులో లేకపోవడం జిల్లాలోని పదిన్నర లక్షల తెల్ల కార్డుదారుల కుటుంబాలను నిరాశకు గురిచేస్తోంది. ప్రభుత్వ యంత్రాంగానికి ముందస్తు వ్యూహం లేకపోవటం వల్లే పామాయిల్ సరఫరాకు ఆటంకం కలిగిందని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. డీడీలు కట్టిన డీలర్ల అగచాట్లు... జిల్లాలో డీలర్లు అందరూ పామాయిల్ కోసం ఈ నెల ఐదో తేదీలోగా డీడీలు చెల్లించారు. ప్రతి డీలరు తమ కోటాను బట్టి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు కట్టారు. పదిన్నర లక్షల లీటర్ల పామాయిల్కు డబ్బు కట్టినా సరఫరా కాలేదని, తమ డీడీలు వేరే సరకుకు మార్చుకునేందుకు కూడా అధికారులు అనుమతించటం లేదని వారు చెబుతున్నారు. నగరంలో డీలర్ల వద్దకు చేరిన పామోలిన్ విజయవాడ నగరంలో మాత్రం 1,90,825 కార్డుదారుల కోసం పామాయిల్ సరఫరా చేశారు. జిల్లాలో కొన్ని కేంద్రాలలో నిల్వ ఉన్న సరకును ఇక్కడికి తరలించారు. నగరంలో 205 దుకాణాలకు సరకును డీలర్లకు పంపారు. వచ్చే నెల ఒకటో తేదీ వరకు పామాయిల్ సరఫరా చేయొద్దని డీలర్లకు ఆదేశాలందాయి. సరకు వచ్చిందని తెలుసుకున్న వినియోగదారులు డీలర్లపై ఒత్తిడి చేస్తున్నారు. 400 టన్నులే వచ్చింది... జిల్లాకు 1200 టన్నుల పామాయిల్ అవసరం ఉందని, డిసెంబర్కు 400 టన్నులు మాత్రమే వచ్చిందని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ చిట్టిబాబు తెలిపారు. దీంతో పామాయిల్ను తుపాను ప్రభావం పడిన తీరప్రాంత మండలాలకు, విజయవాడ అర్బన్కు పంపిణీ చేశామని చెప్పారు. దాదాపు 32 మండలాలకు ఈ నెలకు పామాయిల్ లేనట్టేనని తెలిపారు. సరకు వస్తే ఇక సంక్రాంతి ముందు ఇస్తామని చెప్పారు. -
కోటా కోత
=క్రిస్మస్కు పామాయిల్ లేదు =సంక్రాంతికీ అనుమానమే.. =పది మండలాలకు ‘తుపాను’ నిల్వలు సరఫరా =ఇదేం పౌర పంపిణీ వ్యవస్థ! సాక్షి, మచిలీపట్నం : క్రిస్మస్ పండక్కి పిండివంటలు చేసుకుని తినాలన్న పేదోడి కోరిక ఈసారి నెరవేరే అవకాశం లేదు. సంక్రాంతికి అరిసెల సంగతి అటుంచి కనీసం గారెలు తినాలన్నా సామాన్యుడికి కష్టమే. ఎందుకంటే ఈసారి ప్రభుత్వ చౌకడిపోల ద్వారా జిల్లాలో పామాయిల్ పంపిణీ జరగడం లేదు. ఇతర దేశాల నుంచి దిగుమతి కాలేదు.. తుపానుల సమయంలో ఉంచిన నిల్వలను కొన్ని మండలాలకు పంపేందుకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న పౌర పంపిణీ వ్యవస్థ కారణంగానే పండుగ వేళ పేదలకు ఈ అవస్థలు. జిల్లాలో తెల్లకార్డులు, అంత్యోదయ అన్నయోజన, అన్నపూర్ణ కార్డులు మొత్తం 11,52,152 ఉన్నాయి. వీటికి తోడు తాజాగా ఇటీవల జరిగిన రచ్చబండలో 59,711 కొత్త కార్డులకు తాత్కాలికంగా కూపన్లు జారీ చేశారు. ఒక్కో కార్డుకు నెలకు కనీసం లీటర్ చొప్పున పామాయిల్ ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాకు సుమారు 1150 మెట్రిక్ టన్నులు అవసరం. కాగా, సింగపూర్, మలేసియా నుంచి పామాయిల్ ఇప్పటివరకు రాలేదు. పండుగల నేపథ్యంలో ఆయా దేశాల్లో పామాయిల్కు డిమాండ్ పెరగడంతో మనకు కేటాయించిన కోటా ఎగుమతులు నిలిపివేశారు. పండుగల ముందు నుంచే ఆయా దేశాల్లో మనం ఒప్పందం కుదుర్చుకున్న సంస్థతో మాట్లాడాల్సిన మన యంత్రాంగం ఇప్పుడు ప్రయత్నాలు మొదలెట్టింది. అవి ఫలించి పామాయిల్ వచ్చినా క్రిస్మస్కు కోటా అందదు. ఆయా దేశాల నుంచి ఓడల్లో వచ్చే పామాయిల్ కాకినాడలో ప్యాకింగ్ కావాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు వచ్చినా అందడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. దీంతో డిసెంబర్ కోటాపై ఆశ లేనట్టే. సంక్రాంతినాటికైనా జనవరి కోటా ఇచ్చేందుకు కసరత్తు సాగుతోంది. చౌకడిపోల్లో కిలో రూ.40కి ఇచ్చే పామాయిల్ బయట మార్కెట్లో రూ.65 పలుకుతోంది, మామూలు రిఫైన్డ్ ఆయిల్ కిలో రూ.100 పైమాటే. ఫలితంగా సామాన్యుడు ఇబ్బందిపడక తప్పదు. పది మండలాలకే సరి.. డిసెంబర్ పామాయిల్ కోటా రాకపోవడంతో ప్రత్యామ్నాయ అవకాశాలపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల వచ్చిన తుపానులను దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తగా నిల్వ ఉంచిన పామాయిల్ను కొన్ని ప్రాంతాల్లో చౌక డిపోల ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టినట్టు పౌరసరఫరాల జిల్లా మేనేజర్ చిట్టిబాబు సాక్షికి వివరణ ఇచ్చారు. తుపానులప్పుడు నిల్వ ఉంచిన 387మెట్రిక్ టన్నుల పామాయిల్ను జిల్లాలో పది మండలాలకు డిసెంబర్ కోటాగా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. పెడన, గూడూరు, కోడూరు, నాగాయలంక, బంటుమిల్లి, కృత్తివెన్ను, ముదినేపల్లి, గుడ్లవల్లేరు, ముసునూరు మండలాలతోపాటు విజయవాడ రూరల్ మండలాల్లో పూర్తిస్థాయిలో పామాయిల్ కోటా ఇస్తారు. విజయవాడ నగరం, గుడివాడ, కైకలూరు, మండవల్లి ప్రాంతాల్లో 50 శాతం మంది తెల్లకార్డుదారులకు మాత్రమే పామాయిల్ కోటా కేటాయించారు. కాగా, జిల్లా అంతటా డిసెంబర్ నెలకు బియ్యం, పంచదార, కందిపప్పు, కిరోసిన్, ఇతర సరుకులు మాత్రం ఇస్తున్నారు. -
అపహాస్యం పాలైన అమ్మ‘హస్తం’
=నాసిరకం సరుకులు మాకోద్దంటున్న పేదలు =ఆరు నెలల ‘అమ్మహస్తం’ పంపిణీ తీరుపై సమీక్ష విజయవాడ సిటీ, న్యూస్లైన్ : ప్రజా సంక్షేమమే ధ్యేయమని ప్రగల్భాలు పలుకుతున్న కిరణ్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘అమ్మహస్తం’ పథకం అపహాస్యం పాలైంది. జిల్లాలో ఈ పథకం నిర్వీర్యమైపోయింది. ఆదినుంచే అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటున్న ఈ పథకం ప్రారంభమై ఆరునెలలు గడుస్తున్నా... నేటికి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. చౌకధర దుకాణాల ద్వారా రూ.185 లకే తొమ్మిది రకాల నాణ్యామైన నిత్యావసర సరుకులు అందించాలన్న లక్ష్యం బెడిసికొట్టినట్లయింది. సరుకుల నాణ్యత లేమీ, బహిరంగ మార్కెట్తో పోల్చితే సరుకుల ధరలో పెద్దగా తేడా కనిపించకపోవడంతో ప్రజల ఆదరణ కోల్పోయింది. దీంతో పేదలు సరుకులు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడంతో సరఫరా తగ్గుముఖం పట్టిందని అధికారులే చెబుతున్నారు. జిల్లాలోని 11లక్షల 80వేల మంది కార్డుదారులకు 2,100 చౌకడిపోల ద్వారా వీటినిఅంటగట్టేందుకు అధికారులు నానా అగచాట్లు పడుతున్నారు. నాణ్యతపై అనుమానాలు ‘అమ్మహస్తం’ పథకం కింద తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కందిపప్పు ఉడకటం లేదంటున్నారు. ఒక్కోసారి నిల్వ ఉన్న పప్పును సరఫరా చేస్తున్నారని కార్డుదారులు చెబుతున్నారు. చింతపండు నల్లని రంగు ఉండి గింజలు అధికంగా ఉండటంతో అది నాసిరకమని భావిస్తున్నారు. గోధుమలు, గోధుమ పిండిలో పురుగులుంటున్నాయని వాపోతున్నారు. ఘాటివ్వని కారం పోడి, రుచిలేని నూనె ప్యాకెట్లు లబ్ధిదారులను మెప్పించలేకపోతున్నాయి. పలు రేషన్ షాపుల్లో అమ్మహస్తం సరుకులను చూసి ప్రజలు కంగుతింటున్నారు. కేవలం రూ.185 కే తొమ్మిది రకాల సరుకులు వస్తున్నాయన్న ఆశతో చౌకధర దుకాణాలకు వెళ్తున్న మహిళలు ముక్కిపోయిన సరుకులను చూసి పెదవి విరుస్తున్నారు. తొమ్మిదింటిలో మూడే .. అమ్మహస్తం తొమ్మిది సరుకుల్లో వినియోగదారులు ముచ్చటగా మూడు సరుకులను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కందిపప్పు, చక్కెర, పామాయిల్ మాత్రమే కొనుగోలు చేసి మిగతా ఆరు సరుకుల జోలికి వెళ్లడం లేదు. ప్రచార అర్భాటమే.... ‘అమ్మహస్తం’ ద్వారా ప్రజలకు కలిగే లబ్ధి గోరంతైనా ప్రభుత్వం కొండంత ప్రచారం చేసింది. తెల్లకార్డుదారులకు రూ. 185కే తొమ్మిది నిత్యావసర సరుకులుపై ప్రభుత్వం నెలసరి భరించే సబ్సిడీ రూ. 7.78 మాత్రమే. వాస్తవంగా ఈ పథకం కింద కొత్తగా ఇస్తున్న సరుకులు నాలుగు మాత్రమే. ఇందులో మూడు వస్తువులకు ప్రభుత్వం కొంత సబ్సిడీ భరిస్తుండగా పసుపును మాత్రం కొనుగోలు ధర కంటే ఎక్కువకు విక్రయిస్తుండటం గమనార్హం. నెలసరి సగటున ఒక్కో కార్డుకు ఈ పథకం కింద ప్రభుత్వం ఉప్పుపై 91 పైసలు, మిరప్పొడి (చిల్లీ పౌడర్)పై రూ. 3.75, చింతపండుపై రూ. 4.25 (మొత్తం కలిపి రూ. 8.91) సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. పసుపు మాత్రం కొనుగోలు చేసిన ధర కంటే రూ. 1.13 అధిక రేటుతో విక్రయిస్తోంది. పసుపుపై ప్రభుత్వానికి మిగులుతున్న మొత్తాన్ని మినహాయిస్తే అమ్మహస్తం ద్వారా ప్రభుత్వం ఒక్కోకార్డుదారుపై నెలకు భరించే సబ్సిడీ రూ. 7.78 మాత్రమే . వద్దు మొర్రో అంట్ను డీలర్లు .... రేషన్ డీలర్లు తొమ్మిది సరుకుల పంపిణీపై అసక్తి చూపడం లేదు. ఇవన్నీ వద్దు మొర్రో అంటూ మొత్తుకుంటున్నారు. ప్రజలు పంచదార, నూనె నెలవారీ కొంటున్నారని, గోధుమలు, కందిపప్పు కూడా అప్పుడప్పుడు కొంటున్నారని డీలర్లు చె బుతున్నారు. సరుకుల కోసం అదనపు పెట్టుబడి, కమీషన్ గిట్టుబాటుతో పాటు, లబ్ధిదారుల కొనుగోళ్లపై అనుమానాలతో డీలర్లు వెనుకంజవేస్తున్నారు. సాధారణంగా తొమ్మిది సరుకుల సరఫరా కోసం అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. తొమ్మిది సరుకులు(ఒక కిట్) విక్రయిస్తే లభించే కమీషన్ రూ. 4.09 పైసలు. పైగా సరుకుల దిగుమతి ఖర్చు,రవాణ అదనపు ఖర్చు. లబ్ధిదారులు సరుకులు కొనుగోలు చేయకుంటే జరిగే నష్టంతో పాటు ఉపాధికి గండిపడుతుందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పామాయిల్ కోత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రేషన్ లబ్ధిదారులకు సర్కారు పండుగ షాక్ ఇచ్చింది. దసరాలాంటి ముఖ్య పండుగల సమయంలో ప్రత్యేక ప్రోత్సాహకం కింద రేషన్ వినియోగదారులకు అదనపు కోటాకు మంగళం పాడిన ప్రభుత్వం.. తాజాగా అసలు కోటాకే ఎసరు పెట్టింది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో జిల్లాకు పూర్తిస్థాయి పామాయిల్ కోటా చేరలేదు. చివ రివరకు కోటా వస్తుందంటూ బుకాయించిన పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు.. తీరా పంపిణీ సమయంలో కోటా వచ్చే అవకాశం లేదంటూ చేతులెత్తేశారు. దీంతో జిల్లాలో సగానికిపైగా లబ్ధిదారులకు ఈ నెల రేషన్ సరుకుల్లో పామాయిల్ నూనె తీసుకునే భాగ్యం లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా 10.24లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇందులో తెల్ల రేషన్ కార్డుదారులు 9.58 లక్షలు, 66 వేల అంత్యోదయ రేషన్ కార్డుదారులున్నారు. వీరికిగాను ప్రతి నెల 1,024 కిలోలీటర్ల పామాయిల్ నూనెను పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తోంది. ఇందుకుగాను కృష్ణపట్నం, కాకినాడ ఓడరేవుల నుంచి కోటా ఇక్కడికి వస్తుంది. అయితే కోటా వచ్చే ప్రాంతాల్లో సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో గత మూడు నెలలుగా పామాయిల్ కోటా అరకొరగానే వస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇటీవల జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే నెలాఖరునాటికి కూడా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ నెలకు రావాల్సిన 1,024 కిలోలీటర్ల కోటాలో కేవలం 526 కిలోలీటర్ల నూనె మాత్రమే జిల్లాకు చేరింది. వీటిని ప్రాధాన్యత ప్రకారం అధికారులు రేషన్ డీలర్లకు చేరవేస్తున్నారు. 500 కిలోలీటర్ల పామాయిల్ హుష్..! ఈ నెలలో జిల్లాకు రాావాల్సిన కోటాలో కేవలం 526 కిలోలీటర్ల పామాయిల్ రావడంతో మిగతా 500 కిలోలీటర్ల కోటాపై సందిగ్ధం నెలకొంది. సాధారణంగా నెల ప్రారంభం నాటికే ఈ కోటా రేషన్ దుకాణాలకు చేరితే పంపిణీ ప్రక్రియ సులభతరమయ్యేది. అయితే ఈ నెలలో దసరా పండుగ ఉండడంతో పామాయిల్కు డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న కోటాను మాత్రమే రేషన్ దుకాణాలకు చేరవేశారు. మిగిలిన కోటా ఈ నెలలో వచ్చే అవకాశం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో 500 కిలోలీటర్ల కోటా ఇక లేదనే తెలుస్తోంది. గత మూడు నెలలుగా జిల్లాకు పామాయిల్ కోటా అరకొరగా వస్తుండడంతో ఈ నెలలో డీలర్లు కూడా 70 శాతమే స్పందించి డీడీలు కట్టగా.. వారిలో 52 శాతం మందికి మాత్రమే అరకొరగా పామాయిల్ కోటా చేరింది. -
దిగుమతుల యోచన మానుకోరా?
సాక్షి, హైదరాబాద్: ఉల్లిపాయలు, పామాయిల్ తదితర వ్యవసాయోత్పత్తుల దిగుమతులను వచ్చే ఏడాది 50 శాతం తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని శాసనసభ అంచనాల కమిటీ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ఉత్పత్తి పెంచడంపై దృష్టిపెట్టకపోవడాన్ని కమిటీ తప్పుపట్టింది. ‘ఉల్లిగడ్డను మహారాష్ట్ర, పూలను కర్ణాటక, బియ్యాన్ని పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి, పండ్లను ఇతర రాష్ట్రాల నుంచి, పామాయిల్ను విదేశాల నుంచి.. దిగుమతి చేసుకోవడమేనా పని?... రైతులకు సబ్సిడీలిచ్చి ఆయా పంటలను బాగా పండించి.. ఎగుమతి చేసి ఆదాయం సమకూర్చుకోవాలనే ధ్యాసే మీకు పట్టదా? దిగుమతి ఆలోచనను అసలు మానుకోరా?’ అని శాసనసభ అంచనాల కమిటీ సభ్యులు ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో ఉద్యాన శాఖ అధికారులతో సమావేశమైన కమిటీ సభ్యులు ఉల్లిపాయలు, కూరగాయల కొరత, పామాయిల్ దిగుమతి వంటి అంశాలపై సమీక్షించారు. చెరుకు ముత్యంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కె.ఆర్.ఆమోస్, మల్లాది విష్ణు, పి.నాగేశ్వరరావు, మహేందర్రెడ్డి, పంతం గాంధీ తదితరులు పాల్గొన్నారు. పామాయిల్ ఉత్పత్తిలో మన రాష్ర్టం అగ్రస్థానంలో ఉన్నా... విదేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఎందుకని ప్రశ్నించారు. పామాయిల్ పంటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పామాయిల్ను ఎగుమతి చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఆలోచన రాకపోగా... రూ.వేల కోట్లు వెచ్చించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం శోచనీయమన్నారు. ఉల్లిపాయల తీవ్రకొరతకు దారితీసిన కారణాలను కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది ఉల్లి ధర పడిపోవడంతో గిట్టుబాటు లేదనే భావనతో రైతులు ఈ ఏడాది ఆ పంటవైపు చూడలేదని అధికారులు చెప్పారు. దీనికితోడు మహారాష్ర్టలోనే ఉల్లికి కొరత రావడంతో మన రాష్ట్రంలో ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. దీనిపై స్పందించిన సభ్యులు ఉల్లికి కొరత వస్తుందని తెలిసీ ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.