phone call
-
Putin: ఎవరి మాటా వినని సీతయ్య!
మాస్కో: ప్రపంచ అధినేతల్లో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కు ఓ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకు ఆయన జీవన.. వ్యవహార శైలులు, నడవడికలు కారణాలని చెప్పొచ్చు. అదే సమయంలో ఇతర అధినేతలతో ఆయన వ్యవహరించే తీరు కూడా చాలా ప్రత్యేకంగా ఉండి.. తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంటుంది కూడా.తాజాగా.. ఉక్రెయిన్ సంక్షోభంలో శాంతి నెలకొల్పే ప్రయత్నాలకు అడుగులు ముందుకు పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇరు దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో.. ట్రంప్ పుతిన్తో ఫోన్లో మాట్లాడగా(Putin Phone call With Trump) ఆ సంభాషణకు ముందు జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశం ఇప్పుడు బయటకు వచ్చింది.మన టైమింగ్స్ ప్రకారం.. మార్చి 18వ తేదీన సాయంత్రం 4గం. నుంచి 6గం. మధ్య ఇద్దరూ మాట్లాడుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ముందస్తు సమాచారం మాస్కోకు కూడా వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం వైట్హౌజ్ నుంచి క్రెమ్లిన్కు టైంకి ఫోన్ వచ్చింది. కానీ ఆ టైంలో పుతిన్ అధ్యక్ష భవనంలో లేరు!. ట్రంప్తో మాట్లాడిన విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా.. తీరికగా మాస్కో ఇంటర్నేషనల్ హాల్లో జరిగిన రష్యా ప్రముఖ వ్యాపారవేత్తల భేటీకి హాజరయ్యారు. అయితే.. అక్కడ జరిగిన పరిణామాన్ని కింది వీడియోలో చూసేయండి. Putin is meant to be speaking to Trump around now, but he is talking to a room full of oligarchs instead. Asked if he's going to be late, Putin waves off the question and says not to listen to his spokesman pic.twitter.com/LDTU8BNQAr— max seddon (@maxseddon) March 18, 2025 ట్రంప్తో ఫోన్కాల్కు టైం దగ్గర పడుతుండడంతో క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్.. ఆ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవరించిన మాజీ ప్రధాని అలెగ్జాండర్ షోకిన్(Alexander Shokhin) ద్వారా పుతిన్కు సమాచారం చేరవేశారు. అయితే.. పుతిన్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సరికదా నవ్వుతూ ‘‘అతని మాటలేం పట్టించకోవద్దు.. అతనికి ఇదే పని’’ అని అనడంతో అక్కడంతా నవ్వులు పూశాయి. దీనికి కొనసాగింపుగా.. ‘ట్రంప్కి ఈ విషయం తెలిస్తే ఎలా స్పందిస్తారో?’’ అని షోకిన్ అనడంతో మళ్లీ నవ్వులు పూశాయి. అయితే తాను ట్రంప్ గురించి అనలేదని.. పెస్కోవ్ను ఉద్దేశించి అన్నానని పుతిన్ చెప్పడంతో ఆ హాల్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఇదంతా జరిగాక కూడా.. పుతిన్ ఆ మీటింగ్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత నిదానంగా క్రెమ్లిన్ వెళ్లి ట్రంప్తో ఫోన్ మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతల వేళ.. ట్రంప్తో కాల్ చాలా ముఖ్యమైందే. అయినా కూడా పుతిన్ అలా వ్యవహరించారు. అలాగని పుతిన్కు ఇలా తన కోసం ఎదురు చూసేలా చేయడం కొత్తేం కాదు. గతంలో.. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్, మత గురువు పోప్ ప్రాన్సిస్.. ఆఖరికి క్వీన్ ఎలిజబెత్ను కూడా తన కోసం వెయిట్ చేయించారు.ఫోన్ కాల్ సారాంశం ఇదే..ట్రంప్ ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అంగీకరించారు. అయితే రష్యా మాత్రం ట్రంప్ ప్రతిపాదనలను వ్యతిరేకించకుండా.. కొన్ని షరతులు పెడుతోంది. అలాగే పూర్తి స్థాయి కాల్పుల విరమణకు దిగిరావాలంటే.. ఉక్రెయిన్కు విదేశీ సాయం నిలిపివేయాలని పుతిన్, ట్రంప్ను కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఫోన్ సంభాషణ ద్వారా పుతిన్తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని ట్రంప్ అంటున్నారు. ఈ క్రమంలో ఇతర అంశాలపై రష్యాతో తమ ప్రతినిధి బృందం చర్చలు జరుపుతుందని ఆయన ప్రకటించారు. -
యుద్ధానికి పాక్షిక విరామం
వాషింగ్టన్/మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా, అమెరికా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ మంగళవారం జరిపిన ఫోన్ చర్చలు ఇందుకు వేదికయ్యాయి. ఉక్రెయిన్పై దాడులకు పాక్షికంగా విరామమిచ్చేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సుముఖత వ్యక్తం చేశారు. అందులో భాగంగా మౌలిక వనరులు, విద్యుదుత్పత్తి, ఇంధన వ్యవస్థలు తదితరాలపై దాడులు జరపబోమని ప్రతిపాదించారు.అయితే అందుకు ప్రతిగా అమెరికా, దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్కు సైనిక, నిఘా సాయాలను పూర్తిగా నిలిపేయాలని షరతు విధించారు! వాటితో పాటు పలు ఇతర డిమాండ్లతో కూడిన భారీ జాబితాను ట్రంప్ ముందుంచారు. వాటన్నింటికీ ఉక్రెయిన్ అంగీకరించాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. గంటకు పైగా జరిగిన సంభాషణలో యుద్ధంతో పాటు అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి. పాక్షిక యుద్ధ విరమణకు పుతిన్ను ఒప్పించడంలో ట్రంప్ సఫలమైనట్టు చర్చల అనంతరం వైట్హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.యుద్ధం ఆగి శాశ్వత శాంతి నెలకొనాలని అధ్యక్షులిద్దరూ ఏకాభిప్రాయం వెలిబుచ్చనట్టు తెలిపింది. ‘‘తర్వాతి దశలో నల్లసముద్రంలో కాల్పుల విరమణ, చివరగా పూర్తిస్థాయి కాల్పుల విరమణపై సాంకేతిక చర్చలు జరిపేలా అంగీకారం కుదిరింది. అవి పశ్చిమాసియా వేదికగా తక్షణం మొదలవుతాయి’’ అని వివరించింది. అమెరికా, రష్యా మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కూడా నేతలిద్దరూ నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ దిశగా త్వరలో కీలక ఆర్థిక ఒప్పందాలు తదితరాలు కుదరనున్నట్టు వెల్లడించింది.అమెరికా ఇటీవల ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ వెంటనే అంగీకరించడం, దానిపై సంతకం కూడా చేయడం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు పుతిన్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. పలు అంశాలపై స్పష్టత కోసం ట్రంప్తో మాట్లాడతానని చెప్పారు. ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించిన భూములు, జపోరిజియా అణు విద్యుత్కేంద్రం తదితరాలు కూడా తమ మధ్య చర్చకు వస్తాయని సంభాషణకు ముందు ట్రంప్ మీడియాకు తెలిపారు.ఇరు దేశాల మధ్య పంపకాలకు సంబంధించి రష్యాతో ఇప్పటికే చర్చలు మొదలు పెట్టినట్టు కూడా చెప్పారు! ఉక్రెయిన్పై యుద్ధానికి దిగినందుకు మూడేళ్లుగా రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలను అమలు చేస్తుండటం తెలిసిందే. పుతిన్, ట్రంప్ తాజా చర్చలను చరిత్రాత్మకంగా రష్యా అభివర్ణించింది. వాటి ఫలితంగా ప్రపంచం మరింత సురక్షితంగా మారిందని అభిప్రాయపడింది. యుద్ధానికి ముగింపుపై ఇటీవల సౌదీ అరేబియాలో అమెరికా పలుమార్లు చర్చలు జరపడం తెలిసిందే. పాక్షిక, దశలవారీ కాల్పుల విరమణ ప్రతిపాదనలు, పుతిన్ తాజా షరతులపై ఉక్రెయిన్ స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది. -
మీ కొడుకు రేప్ కేసులో దొరికాడు
బొంరాస్పేట: ‘హలో..ఆప్ కా బేటా రేప్ కేస్ మే మిల్గయా. ఛోడ్దేనా బోలేతో పచాస్ హజార్ అర్జెంట్ పే కరో.. నైతో జైల్మే దాల్దేతే’.. (నీ కొడుకు అత్యాచార ఘటనలో దొరికాడు. అతడిని విడిచిపెట్టాలంటే వెంటనే రూ.50 వేలు ఫోన్ పే చేయండి. లేదంటే జైలులో వేస్తాం) అంటూ వచ్చిన ఫోన్కాల్తో ఓ తండ్రి భయాందోళనకు గురయ్యాడు. ఏం చేయాలో తోచక పక్కనున్న తన సన్నిహితుడికి ఫోన్ ఇచ్చి మాట్లాడించాడు. ఇది సైబర్ నేరగాళ్ల పని అని తెలుసుకొని ఫోన్ కట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా రేగడిమైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్యామలయ్యగౌడ్ స్థానికంగా కిరాణదుకాణం నడిపిస్తున్నాడు. ఇతని చిన్న కొడుకు సత్యనారాయణగౌడ్ భార్యాపిల్లలతో హైదరాబాద్లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం 10.38 గంటలకు శ్యామలయ్యగౌడ్కు ఓ నంబరు నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడుతూ.. నీ కొడుకు ఓ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో దొరికాడని చెప్పాడు.ఫోన్లో పోలీస్ వాహనాల సైరన్ వినిపిస్తూ సత్యనారాయణను అరెస్టు చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేశాడు. హడలిపోయిన శ్యామలయ్యగౌడ్ వెంటనే పక్కనున్న వ్యక్తికి ఫోన్ ఇచ్చాడు. సైబర్ నేరగాళ్లుగా అనుమానించిన ఆయన పోలీస్స్టేషన్ వివరాలు అడగగా అవతలి వ్యక్తి పరుషపదజాలంతో తిట్టాడు. దీంతో ఫేక్ అని భావించి ఫోన్ కట్ చేశాడు. ఆ వెంటనే సత్యనారాయణకు ఫోన్ చేయగా, తాను ఆఫీసులో ఉన్నానని తండ్రికి చెప్పాడు. కొడుకుతో వీడియోకాల్ మాట్లాడిన తర్వాత తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. అనంతరం ఈ ఘటనపై నేషనల్ హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఫోన్కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. -
జిన్పింగ్తో ట్రంప్ చర్చలు
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ఫోన్లో మాట్లాడారు. ‘‘వ్యాపారం, వాణిజ్యం, టిక్టాక్ తదితర అంశాలపై జిన్పింగ్తో చక్కటి సంభాషణ జరిగింది. ప్రపంచాన్ని మరింత భద్రంగా మార్చడానికి చేయాల్సిందంతా చేస్తాం’’ అని ట్రంప్ ఉద్ఘాటించారు. అధ్యక్షుడిగా రెండో టర్మ్లో చైనాతో సంబంధాలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. -
వణికించిన ఫోన్ కాల్.. రూ. 7.28 లక్షలు దోపిడీ
ఆన్లైన్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. వయసుతో సంబంధం లేకుండా యువత, ఉన్నత విద్యావంతులు కూడా ఈ మోసాలకు గురవుతున్నారు. తాజాగా 25 ఏళ్ల ఐఐటీ బాంబే విద్యార్థి అధునాతన మోసంలో రూ. 7.28 లక్షలు కోల్పోయి బాధితుడయ్యాడు.వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. విద్యార్థికి ట్రాయ్ అధికారినంటూ ఓ వ్యక్తి నుండి కాల్ వచ్చింది. విద్యార్థి మొబైల్ నంబర్పై చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన 17 ఫిర్యాదులు నమోదయ్యాయని ఆ వ్యక్తి చెప్పాడు. తమ సూచనలను పాటించకపోతే "డిజిటల్ అరెస్ట్" అయ్యే ప్రమాదం ఉందని బెదిరించాడు.చట్టపరమైన పరిణామాలు, అభియోగాల తీవ్రతకు భయపడిన విద్యార్థి వారి సూచనలను అనుసరించడానికి అంగీకరించాడు. కేసుల నుంచి పేరును తొలగించడానికి, చట్టపరమైన సమస్యలను నివారించడానికి రూపొందించిన ప్రక్రియ పేరుతో స్కామర్లు పలు దఫాలుగా రూ. 7.28 లక్షలను వారి ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించారు. భయంతో అతను వారి సూచనలను అనుసరించిన విద్యార్థి చివరికి bమోసానికి గురయ్యాడు.వణికిపోవద్దు..ఇలాంటి ఆన్లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఇలాంటి మోసాలకు బలి అవుతున్న వ్యక్తుల సంఖ్య దేశంలో పెరుగుతోంది. ఈ స్కామ్లలో చాలా వరకు వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లు లేదా చట్టబద్ధమైన సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్ల ద్వారా జరుగుతన్నాయి. అటువంటి కాల్స్ వచ్చినప్పుడు కాలర్ గుర్తింపును ధ్రువీకరించుకోవాలని, సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పరిస్థితిని అంచనా వేయడానికి కొంత సమయం తీసుకోవాలని, భయంతో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. -
నేను అండగా ఉంటా.. జగన్ పరామర్శ
-
కాల్ చేస్తే కట్ చేయొచ్చు
సిడ్నీ: ఆఫీసులో పని ముగించుకొని, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యాజమాన్యం నుంచి ఫోన్లు, మెసేజ్లు వస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాకు కలుగుతుంది కదా! ఆ్రస్టేలియాలో ఇలాంటి చిరాకు ఇకపై ఉండదు. ఎందుకంటే ‘రైట్ టు డిస్కనెక్ట్’ నిబంధన అమల్లోకి వచ్చింది. పని వేళలు ముగించుకొని ఇంటికెళ్లిన ఉద్యోగులకు యాజమాన్యాలు అనవసరంగా ఫోన్ చేస్తే జరిమానా విధిస్తారు. యాజమాన్యాలు ఫోన్లు, మెసేజ్లు చేస్తే ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. మాట్లాడకపోతే శిక్షిస్తారేమో, ఉద్యోగం పోతోందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఆఫీసు అయిపోయాక యాజమాన్యం ఫోన్ చేస్తే ఫెయిర్ వర్క్ కమిషన్(ఎఫ్డబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేయొచ్చు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం నుంచి ఫోన్ వస్తే ఉద్యోగులు స్పందించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఫోన్కాల్ను తిరస్కరించకూడదు. ఎఫ్డబ్ల్యూసీ నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలకు 94 వేల డాలర్లు, ఉద్యోగులకు 19 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. ఆఫీసులో పని ముగిశాక తమకు ఫోన్ చేయవచ్చా? లేదా? అనేది నిర్ణయించుకొనే అధికారాన్ని ఉద్యోగికి కట్టబెట్టారు. ఆ్రస్టేలియాలో ఆఫీసు టైమ్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేయడం మామూలే. ఒక్కో ఉద్యోగి ప్రతిఏటా సగటున 281 గంటలు అధికంగా ఆఫీసులో పని చేస్తున్నట్లు గత ఏడాది ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈ ఓవర్టైమ్ పనికి అదనపు వేతనం ఉండదు. -
హిందువులకు రక్షణ కల్పిస్తాం: యూనుస్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పిస్తామని, దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనుస్ భారత ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. యూనుస్ శుక్రవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాతి పరిణామాల్లో మోదీ, యూనుస్లు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. ‘ప్రజాస్వామ్యయుత, సుస్థిర, శాంతికాముక, ప్రగతిశీల బంగ్లాదేశ్కు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పునరుద్ఘాటించాను’ అని మోదీ ఎక్స్లో వెల్లడించారు. ‘ప్రొఫెసర్ యూనుస్ కాల్ చేశారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని, సురక్షితంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు’ అని మోదీ తెలిపారు. వివిధ అభివృద్ధి పనుల్లో బంగ్లాదేశ్ ప్రజలకు సహాయపడటానికి కట్టుబడి ఉన్నామని యూనుస్కు తెలిపారు. అదే సమయంలో బంగ్లాదేశ్లోని హిందువులకు భద్రత కలి్పంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. బంగ్లాదేశ్లో పరిస్థితి అదుపులోకి వచి్చందని, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని మోదీకి స్పష్టంచేసినట్లు యూనుస్ ‘ఎక్స్’లో తెలిపారు. -
ట్రంప్ నాకేం ఫోన్ చేయలేదు: ఇజ్రాయెల్ ప్రధాని
టెల్అవీవ్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ఓ కథనం వెలువడింది. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చేలా ఇజ్రాయెల్ను ప్రోత్సహించేందుకు ట్రంప్ ఈ ఫోన్కాల్ చేసినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే.. తాజాగా ఈ కథనాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ‘‘ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నిన్న (బుధవారం).. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడలేదు’’ ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.ట్రంప్.. ఫోన్ చేసిన హమాస్తో కాల్పుల విరమణ కోసం నెతన్యాహును పోత్సహించినట్లు యాక్సిస్ నివేదిక పేర్కొంది. మరోవైపు.. ఈ విషయంపై ట్రంప్ ప్రచార బృందం కూడా స్పందించకపోవటం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఈజిప్ట్, అమెరికా, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇవాళ గాజా కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు జరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చలను ఎక్కడ జరుపుతారనే విషయంపై స్పష్టత లేదు. -
ట్రంప్ కు బైడెన్ ఫోన్ కాల్..
-
కమలా హారీస్తో రాహుల్ ఫోన్.. క్లారిటీ ఇచ్చిన వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్
ఢిల్లీ: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ మాట్లాడుకున్నారనే వార్త దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కమలా హారీస్ కార్యాలయం స్పందించింది. కమలా హారీస్తో రాహుల్ మాట్లాడలేదని స్పష్టం చేసింది. ఇదంతా ఫేక్ అని కొట్టిపారేసింది.కాగా, కమలా హారీస్తో రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లారనే వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో కమలా హారీస్ కార్యాలయం శనివారం స్పందించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా..‘కమలా హారీస్తో రాహుల్ మాట్లాడలేదు. ఇదంతా ఫేక్ ప్రచారం మాత్రమే’ అని ఖండించింది. దీంతో, రాజకీయ దుమారానికి తెరపడినట్టు అయ్యింది. అయితే, అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్తో రాహుల్ ఫోన్లో మాట్లాడారనే వార్త రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. Moye moye ho gya ye to The US Vice President's office has denied reports of a phone conversation between Kamala Harris and Indian politician Rahul Gandhi, contradicting earlier claims made by some media outlets and social media posts. This has led to accusations of spreading… pic.twitter.com/8vz3eV09vY— Manisha Singh (@ManiYogini) July 13, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీ మధ్య దౌత్యపరంగా, రాజకీయంగా మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. పలుమార్లు మోదీకి అనుకూలంగానే బైడెన్ మాట్లాడారు. ఇక, మోదీ రష్యా పర్యటన సందర్భంగా కూడా అమెరికా.. భారత్, మోదీకి అనుకూలంగానే కామెంట్స్ చేశారు. -
India-UK Free Trade Agreement: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధం
లండన్: భారత్– బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) ఆచరణలోకి తెచ్చేందుకు సిద్ధమని బ్రిటన్ నూతన ప్రధాని కియర్ స్టార్మర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం ఆయన ఈ మేరకు ఫోన్లో చర్చలు జరిపినట్టు బ్రిటన్ ప్రకటించింది. ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల వికాసానికి కట్టుబడి ఉన్నామని మోదీ ట్వీట్ చేశారు. వాతావరణ మార్పులు, ఆర్థికాభివృద్ధి అంశాల్లో మోదీ నాయకత్వాన్ని స్టార్మర్ స్వాగతించారని ప్రధాని కార్యాలయం తెలిపింది. 2030 రోడ్మ్యాప్పై ప్రధానులు చర్చించారని, పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అంగీకరించారని వెల్లడించింది. త్వరలో భేటీ అవాలని నేతలిద్దరూ నిర్ణయించారు. 38.1 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యంపై భారత్, బ్రిటన్ 2022 నుంచి సంప్రదింపులు జరుపుతున్నాయి. -
చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఫోన్
హైదరాబాద్, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఫోన్ చేశారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించినందుకుగానూ అభినందనలు తెలియజేశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు చంద్రబాబుకి తెలంగాణ సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, అలాగే విభజన హామీలు.. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు కృషి చేద్దామని చంద్రబాబును తెలంగాణ సీఎం రేవంత్ కోరినట్లు తెలుస్తోంది. -
తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు కలకలం సృష్టించాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామంటూ యువతిని అగంతకుడు బెదిరించాడు. వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్చేసి కేసు నుంచి తప్పించేందుకు రూ.50వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.+92 కోడ్తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇది పాకిస్తాన్ కోడ్ అంటున్న సైబర్ పోలీసులు.. ఇలాంటి ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
TDP: డబ్బు కొట్టు... టికెట్ పట్టు!
కొవ్వూరు: తెలుగుదేశం పార్టీలో టికెట్లు అమ్ముకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టికెట్టు ఖరారు విషయంలో జరిగిన బేరసారాల సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.‘రూ.10 కోట్లు చూసుకోండి.. టికెట్టు ఇప్పిస్తాం’ అంటూ జిల్లాలోని నిడదవోలుకు చెందిన ఓ ఎన్ఆర్ఐ మహిళకు స్థానిక నాయకులు వర్తమానం పంపారు. ఆమె సొమ్ము రెడీ చేసుకుంటున్న తరుణంలోనే ముప్పిడి వెంకటేశ్వరరావుకు టికెట్ ఖరారు చేశారు. దీనిపై ఆమె ఆ ముఖ్య నాయకుడికి ఫోన్ చేసి ‘రూ.10 కోట్లు తెస్తే నాకు టిక్కెట్టు ఇప్పిస్తామంటే సరే అన్నాను. ఇప్పుడిలా చేశారేమిటి?’ అని ప్రశ్నించారు. ఆ నాయకుడు ‘డబ్బు లేకుండా రాజకీయం లేదు. అంతా కోట్ల మీదే పని’ అని ఆమెకు బదులిచ్చారు. ‘రూ.10 కోట్లు తెచ్చుకోమ్మా. మేం మాట్లాడతామని నాతో అన్నారు. టికెట్టు వచ్చిన వ్యక్తి ఎంత ఇచ్చారు?’ అని ఆ మహిళ ప్రశ్నిస్తే ‘రూ.15 కోట్లు ఇస్తేనే టికెట్టు ఇచ్చారు’ అని ఆయన చెప్పారు. ‘అంటే నాకంటే మరో రూ.5 కోట్లు పెంచారన్న మాట. ఇంత మాత్రం దానికి రూ.10 కోట్లు తెచ్చుకోమనడం దేనికి’ అంటూ ఆమె వాపోయింది. మండిపడుతున్న పార్టీ శ్రేణులు నియోజకవర్గ ప్రముఖ నాయకుడికి సన్నిహితుడైన చాగల్లుకు చెందిన ఓ నాయకుడు ఆ మహిళతో మాట్లాడిన ఈ ఫోన్ సంభాషణలు టీడీపీలోనూ దుమారం రేపుతున్నాయి. రూ.15 కోట్లిచ్చినవారికే టికెట్టిచ్చినట్టు గుప్పుమనడంతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. గెలుపు గుర్రాలను పక్కన పెట్టి డబ్బు సంచులకే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అతి సామాన్య కుటుంబాలకు చెందిన వ్యక్తులకు వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తుంటే టీడీపీ మాత్రం డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కేవలం సర్వేలను ప్రామాణికంగా తీసుకునే తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు చంద్రబాబు పదేపదే చెబుతున్న మాటలు వాస్తవం కాదని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తొలుత ముగ్గురు వ్యక్తులపై ఐవీఆర్ఎస్ విధానంలో సర్వే నిర్వహించి చివరకు ఆ ముగ్గురిని కాదని ముప్పిడికి టికెట్టు కేటాయించడం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. -
ఓటీపీలతో రూ.6.90 లక్షలకు కుచ్చుటోపీ
పెద్దదోర్నాల: ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం మీ అకౌంట్లోకి జమ చేస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్లోని నగదు మొత్తాన్ని కాజేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఐనముక్కలలో ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘరానా మోసంలో గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు నగదు పోగొట్టుకున్నారు. ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన గ్రామానికి చెందిన చిట్యాల ఆంజనేయరెడ్డి అనే యువకుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్కాల్ వచ్చింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం ఒక్కసారే అకౌంట్లో పడుతుందని, ఫోన్ పే ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మాట్లాడాలని సూచించాడు. తొలుత అకౌంట్ నుంచి కొంత మొత్తం కట్ అయి తిరిగి పడుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. తనది ఆండ్రాయిడ్ ఫోన్ కాకపోవడంతో ఆ యువకుడు గ్రామానికి చెందిన లింగాల శ్రీను నంబర్ నుంచి గుర్తు తెలియని నంబర్కు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాడు. అయితే.. శ్రీను అకౌంట్లో అమౌంట్ తక్కువగా ఉందని చెప్పడంతో శ్రీను తమ్ముడు లింగాల రమేష్ నంబర్ నుంచి ఫోన్చేసి కాన్ఫరెన్స్ కాల్ కలిపి ముగ్గురూ సైబర్ నేరగాళ్లతో మాట్లాడారు. అతని మాటలు నమ్మిన రమేష్ తన ఫోన్కు వచ్చిన ఓటీపీ నంబర్లతో పాటు ఫోన్పేకు సంబంధించిన పాస్వర్డ్ను చెప్పటంతో లింగాల రమేష్ అకౌంట్లోని రూ.6.90 లక్షల నగదు మాయమైంది. అయితే.. మాయమైన డబ్బు నుంచి రూ.79 వేల నగదు తిరిగి బాధితుడి అకౌంట్కు జమ అయినట్లు ఎస్సై తెలిపారు. తమకు వచ్చిన ఫోన్ నంబర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది స్విచ్చాఫ్ వస్తుండటంతో తాము మోసపోయినట్టు సోదరులు గ్రహించారు. హుటాహుటిన పోలీస్ స్టేషన్తో పాటు స్థానిక బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి ఫోన్లు వచ్చాయని, ఏ రాష్ట్రానికి ఫోన్ చేయాలనుకుంటే అదే భాషలతో మాట్లాడే వాళ్లతో ఫోను చేయిస్తారని, డబ్బులు వస్తాయని నమ్మకంగా ఆశ చూపి అకౌంట్లలోని డబ్బులు మాయం చేస్తారని ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
రతన్ టాటాకు ప్రాణ హాని
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ప్రాణ హాని ఉందంటూ వచ్చి న ఫోన్ కాల్ శనివారం ముంబై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. రతన్ టాటాకు తక్షణం భద్రత పెంచాలని, లేదంటే టాటా సన్స్ మరో మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీకి పట్టిన గతే పడుతుందని కాలర్ హెచ్చరించాడు. సైరస్ మిస్త్రీ 2022 సెప్టెంబర్ నాలుగో తేదీన కారు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే. దాంతో పోలీసులు ఆగమేఘాల మీద రతన్ టాటా భద్రతను పెంచారు. కాల్ కర్ణాటక నుంచి వచ్చినట్టు తేల్చారు. కాల్ చేసిన వ్యక్తిని పుణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, అతను ఐదు రోజులుగా ఆచూకీ లేడంటూ భార్య అప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం పోలీసుల దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. బంధుమిత్రులను విచారించగా ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన అతనికి కొంతకాలంగా మతిస్థిమితం లేదని తేలింది. కర్ణాటకలో వేరొకరి ఇంట్లోంచి ఫోన్ తీసుకుని వారికి చెప్పకుండానే ముంబై కంట్రోల్ రూమ్కు ఇతను ఫోన్ చేసి హెచ్చరించినట్లు దర్యాప్తులో తేలింది. మనోవైకల్య బాధితుడు కావడంతో కేసు నమోదు, విచారణ వంటి చర్యలు చేపట్టకూడదని పోలీసులు నిర్ణయించారు. -
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి ఫోన్
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని ఆయనను సీఎం కోరారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డికి సీఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో పూర్తి సహాయసహకారాలు అందించాలన్నారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై సమీక్ష నిర్వహించారు. ధరణి లోటుపాట్లపై వారం, పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్ను ఆదేశించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలన్న సీఎం.. ధరణి యాప్ భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డాటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇదీ చదవండి: తెలంగాణకు తొలి దళిత స్పీకర్.. రేపే అధికారిక ప్రకటన -
కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫోన్ కాల్స్..!?
-
Uttarkashi tunnel collapse rescue: పీడకల... అగ్నిపరీక్ష
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకొని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికిన 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి క్షేమంగా బయటకు వచ్చారు. సొరంగంలో తమకు ఎదురైన భయానక అనుభవాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్న తీరును పలువురు కార్మికులు బుధవారం మీడియాతో పంచుకున్నారు. సొరంగంలో తామంతా కష్టసుఖాలు కలబోసుకున్నామని, మిత్రులుగా మారామని చెప్పారు. ఆడిన ఆటలు, పాడుకున్న పాటల గురించి తెలియజేశారు. సొరంగంలో చిక్కుకున్నప్పుడు ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని జార్ఖండ్లోని ఖిరాబేడా గ్రామానికి చెందిన అనిల్ బేడియా(22) అనే కార్మికుడు వెల్లడించాడు. ‘‘నవంబర్ 12న సొరంగంలో మేము పనిలో ఉండగా, హఠాత్తుగా కొంత భాగం కూలిపోయింది. భారీ శబ్ధాలు వినిపించాయి. మేమంతా లోపలే ఉండిపోయాం. బయటకు వచ్చే దారి కనిపించలేదు. ఎటు చూసినా చిమ్మచీకటి. అక్కడే సమాధి కావడం తథ్యమని అనుకున్నాం. మొదటి రెండు రోజులపాటు బతుకుతామన్న ఆశ లేకుండాపోయింది. క్రమంగా ధైర్యం కూడదీసుకున్నాం. బయట పడడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ముందు ఎలాగైనా ప్రాణాలు రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాం. నిజంగా అదొక పీడకల, అగ్ని పరీక్ష. సొరంగం పైభాగంలోని రాళ్ల సందుల నుంచి పడుతున్న ఒక్కో చుక్క నీటిని ఒడిసిపట్టుకొని చప్పరించాం. మా దగ్గరున్న బొరుగులతో 10 రోజులపాటు కడుపు నింపుకున్నాం. అర్ధాకలితో గడిపాం. ఆ తర్వాత అధికారులు పైపు గుండా పండ్లు, భోజనం, నీళ్ల సీసాలు మాకు అందించారు. ప్రమాదం జరిగాక 70 గంటల తర్వాత అధికారులు మాతో మాట్లాడారు. అప్పుడే ప్రాణాలపై మాలో ఆశలు మొదలయ్యాయి. మేమంతా కలిసి నిత్యం దేవుడిని ప్రార్థించేవాళ్లం. చివరకు దేవుడు మా ప్రార్థనలు ఆలకించాడు. మొదట్లో కష్టంగా గడిచింది సొరంగంలో తాము చిక్కుకున్నట్లు తెలియగానే ఆందోళనకు గురయ్యామని ఉత్తరాఖండ్లోని చంపావత్ గ్రామానికి చెందిన పుష్కర్సింగ్ ఐరే అనే కార్మికుడు చెప్పాడు. మొదట్లో చాలా కష్టంగా గడిచిందని, చనిపోతామని అనుకున్నామని, క్రమంగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డామని తెలిపాడు. తొలుత సరైన ఆహారం లేదు, బయటున్నవారితో మాట్లాడే వీలు లేదని అన్నాడు. ఒంటిపై ఉన్న బట్టలతోనే 17 రోజులపాటు ఉండాల్సి వచి్చందని, స్నానం చేయలేదని, సొరంగం లోపలంతా అపరిశుభ్రంగా మారిందని తెలియజేశాడు. ప్లాస్టిక్ షీట్లపై నిద్రించామని పేర్కొన్నాడు. ఆహారం, నీరు అందిన తర్వాత ఊపిరి పీల్చుకున్నామని చెప్పాడు. కాలక్షేపం కోసం పేకాడామని, కాగితాలను క్రమపద్ధతిలో చింపుతూ ఉండేవాళ్లమని వివరించాడు. సాక్సులతో బంతులు చేసి, చోర్–సిఫాయి ఆట ఆడామని, పాటలు పాడుకున్నాం తెలిపాడు. నిత్యం యోగా, వాకింగ్ చేశాం.. సొరంగం నుంచి బయటకు వచి్చన 41 మంది కార్మికులతో మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారు. వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సొరంగంలో ఉన్నప్పుడు నిత్యం యోగా, వాకింగ్ చేశామని, తద్వారా మనోస్థైర్యం సడలకుండా జాగ్రత్తపడ్డామని, ఆత్మవిశ్వాసం పెంచుకున్నామని ప్రధానమంత్రికి కార్మికులు తెలియజేశారు. విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రమాదాల్లో చిక్కుకుంటే మన ప్రభుత్వం కాపాడిందని, స్వదేశంలోనే ఉన్న తామెందుకు భయపడాలని భావించామని అన్నారు. రిషికేశ్ ఎయిమ్స్కు కార్మికుల తరలింపు సిల్క్యారా టన్నెల్ నుంచి బయటకు వచి్చన కార్మికులను బుధవారం రిషికేశ్లోని ఎయిమ్స్కు హెలికాప్టర్లో తరలించారు. డిజాస్టర్ వార్డులో చేర్చి, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మానసిక పరిస్థితి కూడా పరీక్షిస్తామని, అవసరమైన వారికి తగిన చికిత్స అందిస్తామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఆరోగ్యం కుదుటపడిన వారిని ఇళ్లకు పంపిస్తామని వెల్లడించారు. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధులను కూడా సిల్క్యారా నుంచి బస్సుల్లో ఎయిమ్స్కు తీసుకొచ్చారు. కార్మికుల గ్రామాల్లో సంబరాలు ఖిరాబేడా గ్రామం నుంచి మొత్తం 13 మంది యువకులు సొరంగం పనుల కోసం ఉత్తరకాశీకి చేరుకున్నారు. అదృష్టం ఏమిటంటే వారిలో ముగ్గురు మాత్రమే సొరంగంలో చిక్కుకున్నారు. బాధితులుగా మారిన మొత్తం 41 మంది కార్మికుల్లో 15 మంది జార్ఖండ్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. ఖిరాబేడాలో అనిల్ బేడియా తల్లి 17 రోజులపాటు తల్లడిల్లిపోయింది. కుమారుడు జాడ తెలియక ఆందోళనకు గురైంది. ఇంట్లో వంట చేసింది లేదు. ఇరుగు పొరుగు అందించిన భోజనంతో కడుపు నింపుకుంది. ఎట్టకేలకు కుమారుడు అనిల్ బేడియా సొరంగం నుంచి బయటకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇదే గ్రామానికి చెందిన శ్రవణ్ బేడియా(55)కు పక్షవాతం. ఏకైక కుమారుడు రాజేంద్ర సొరంగం నుంచి బయటపడడంతో అతని ఇంట సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రశంసలందుకున్న నాగపూర్ నిపుణుల సేవలు సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పాల్గొన్నాయి. నిపుణులు తమవంతు సేవలందించారు. కార్మికులకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది లేకుండా, కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరగకుండా వీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ డబ్ల్యూసీఎల్కు నిపుణులు సొరంగం వద్దే మకాం వేశారు. భారీ యంత్రాలతో తవ్వకం పనులు చేపట్టడంతో సొరంగం లోపల కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతుండేవి. ప్రమాదకర స్థాయికి చేరగానే యంత్రాలను ఆపించేవారు. వారి సేవలు ప్రశంసలందుకున్నాయి. సొరంగంలో కార్మికులు భుజాలపై ఎత్తుకున్నారు ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణుల్లో ఢిల్లీకి చెందిన ఫిరోజ్ ఖురేïÙ, యూపీకి చెందిన మోను కూమార్ తొలుత సొరంగంలోని కార్మికుల వద్దకు చేరుకున్నారు. తమను చూడగానే కార్మికులు ఆనందంతో భుజాలపై ఎత్తుకున్నారని ఫిరోజ్ వెల్లడించాడు. ‘‘మాకు పండ్లిచ్చారు. పేర్లు అడిగారు. అరగంట పాటు సొరంగంలో ఉన్నాం’’ అని మోను కూమార్ చెప్పాడు. తాము కార్మికుల వద్దకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం వచ్చారని పేర్కొన్నాడు. కార్మికులను కాపాడినందుకు తాము డబ్బులేమీ తీసుకోలేదని తెలియజేశాడు. తల్లిదండ్రుల ఫొటో చూస్తూ కాలం గడిపా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఖేరీ జిల్లా భైరాంపూర్కు చెందిన 25 ఏళ్ల మంజీత్ చౌహాన్ సిల్క్యారా టన్నెల్లో చిక్కకొని, 17 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. అతడి రాకతో స్వగ్రామంలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. మంజీత్ తల్లిదండ్రులు భైరాంపూర్లో ఉంటున్నారు. అతడి సోదరుడు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లిదండ్రుల ఫొటో మంజీత్ వద్ద ఉంది. ఆ ఫొటో చూస్తూ ధైర్యం తెచ్చుకొని సొరంగంలో కాలం గడిపానని, ఒత్తిడిని అధిగమించానని చెప్పాడు. ‘‘సొరంగం లోపలిభాగం కూలిన సమయంలో అక్కడికి కేవలం 15 మీటర్ల దూరంలోనే పని చేస్తున్నాను. తొలుత అసలేం జరిగిందో అర్థం కాలేదు. క్రమంగా అది పీడ కలగా మారింది. ప్రమాదం జరిగాక మొదటి 24 గంటలు చాలా కష్టంగా గడిచాయి. మేమంతా భయందోళనకు గురయ్యాం. ఆకలి, దాహం, నీరసం, నిరాశ వంటివి అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. నాలుగు అంగుళాల పైపు గుండా అధికారులు ఆహారం, నీరు పంపించిన తర్వాత మా మానసిక స్థితి మారింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలియడంతో మాలో మనోధైర్యం పెరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగాం. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని నాన్నకు చెప్పా. ఫోన్ వాల్పేపర్లో నా తల్లిదండ్రుల ఫొటో చూస్తూ ఉండిపోయేవాడిని. ప్రాణాలపై ఆశ కోల్పోకుండా అది ఉపయోగపడింది. సొరంగంలో అటూ ఇటూ నడుస్తూ ఉండేవాళ్లం. పైపు గుండా అధికారులు పంపించిన పప్పు నాకెంతో నచ్చింది. సొరంగంలో చిక్కుకున్న మేమంతా ఒకరికొకరం మంచి మిత్రులుగా మారిపోయాం. మా కష్ట సుఖాలు తెలియజేసుకున్నాం. క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడలేకపోవడం పట్ల విచారంగా ఉంది. ఇంటికెళ్లిన తర్వాత మ్యాచ్ హైలైట్స్ చూస్తా’’ అని మంజీత్ చౌహాన్ ఉత్సాహంగా చెప్పాడు. సొరంగం పనులు కొనసాగుతాయి ఉత్తరాఖండ్లో 4.5 కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగం పనులు కొనసాగుతాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. కూలిపోయిన ప్రాంతంలో మరమ్మతులు, సేఫ్టీ ఆడిట్ ముగిసిన తర్వాత పనులు యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభంచిన 900 కిలోమీటర్ల ‘చార్ధామ్ యాత్ర ఆల్ వెదర్ రోడ్’ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా టెన్నల్ను నిర్మిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్ధామ్లో భాగమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను అనుసంధానించడానికి కేంద్రం రూ.12,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నాలుగు క్షేత్రాలను చుట్టిరావడానికి వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 డిసెంబర్ 27న శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2020 మార్చిలోగా ప్రాజెక్టు పూర్తికావాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జాప్యం జరుగుతోంది. కేబినెట్ భేటీలో మోదీ భావోద్వేగం సిల్క్యారా సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచి్చంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ మంగళవారం రాత్రి సమావేశమైంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను తలచుకొని ప్రధానమంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం చెప్పారు. కార్మికులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు స్వయంగా ఆరా తీశారని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. దేశ విదేశాల్లోని భారతీయులను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని ఉద్ఘాటించారు. -
కేటీఆర్ ఫోన్ కాల్ లీక్.. ఆడియో షేర్ చేసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రచార ముగింపు వారం రోజులే ఉండటంతో అన్నీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 119 నియోజవర్గాల్లోని గల్లీగల్లీ తిరుగుతూ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఏ వాడ, ఊరిలో చూసిన ప్రచార సభలు, రోడ్షోలే దర్శనమిస్తున్నాయి. ఓవైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. మరోవైపు ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలో రావాలని బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తుండగా.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ ఫోన్ కాల్లీక్ అయ్యిందంటూ కాంగ్రెస్ ఓ ఆడియో కలఇప్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనే ప్రచారానికి పోవాలంటే క్యాడర్ వెనకాడుతుందని, ఫోన్లు చేసి బ్రతిమాలాడుకునే పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చిందని విమర్శిస్తూ..కేటీఆర్ వాయిస్తో ఉన్న ఆడియోను పోస్టు చేసింది. ఈ ఆడియోలో.. వారం రోజుల్లో ప్రచారం ముగిస్తుందని.. ఈ కొన్ని రోజులు సిరిసిల్లలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా.. కౌన్సిలర్లు, సర్వంచులు, మాజీలు, అందరూ కలిసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు పదిమంది పది రకాలుగా మాట్లాడటం బంద్ చేయాలని హెచ్చరించారు. మెజార్టీ తగ్గుందని మనోళ్లే ప్రచారం చేస్తున్నారని, మనల్ని మనమే తగ్గించుకోవద్దని అక్కడి నాయకులకు క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రం మొత్తం సిరిసిల్ల వైపు చూస్తోందని, ఈ వారం రోజులు ఏ ఊరి వాళ్లు ఆ ఊరిలో, ఏ బూత్ వాళ్లు ఆ పరిధిలో పటిష్టంగా ఇంటింటా ప్రచారం చేయాలని సూచిస్తున్నట్లు వినిపిస్తుంది. గతంలో కాకుండా వచ్చే ఎన్నికల తర్వాత వారంలో కనీసంగా రెండు రోజులు సిరిసిల్లకు వచ్చి స్థానికంగా అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పాలంటూ, మీకేమైనా సమస్యలుంటే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పండంటూ పేర్కొన్నారు. ఇక కేటీఆర్ ఫోన్ కాల్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే ప్రచారానికి పోవాలంటే వెనకాడుతున్న కేడర్. ఫోన్లు చేసి బ్రతిమాలాడుకునే పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్ పరిస్థితి.#ByeByeKCR pic.twitter.com/PXOvRujqt4 — Telangana Congress (@INCTelangana) November 22, 2023 -
మాజీ టెలికాం మంత్రికే బురిడీ! ఒక్క ఫోన్ కాల్తో రూ.లక్ష మాయం..
టెక్నాలజీ విస్తృతం అవుతున్నకొద్దీ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్నే బురిడీ కొట్టించి రూ.లక్ష కాజేశారు. తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, ఆ కాలర్తో ఎటువంటి వివరాలు పంచుకోనప్పటికీ తన బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ. లక్ష డెబిట్ అయ్యాయని దయానిధి మారన్ ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ప్రకారం.. దయానిధి మారన్కు అక్టోబర్ 8వ తేదీన తనకు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ అందుకున్న తర్వాత, ఆయన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 99,999 డెబిట్ అయింది. తాను బ్యాంక్ సిబ్బంది అని చెప్పుకుంటూ ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. దయానిధి మారన్ బ్యాంకు వివరాలు అడిగారు. కానీ ఆయన ఆ వివరాలేవీ ఆ వ్యక్తితో పంచుకోనప్పటికీ, కొద్దిసేపటికే అనధికార లావాదేవీ జరిగినట్లు గుర్తించామని ఫిర్యాదును ఉటంకిస్తూ పోలీసులు తెలిపారు. ఎంపీ దయానిధి మారన్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 9న అక్కడి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్)లో కేసు నమోదు చేశారు. మాజీ టెలికాం మంత్రి.. దయనిధి మారన్ గతంలో కేంద్ర ఐటీ, టెలికం మంత్రిగా పనిచేశారు. తన పదవీకాలంలో కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెద్ద మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సేకరించడంలో కీలక పాత్ర పోషించారు. నోకియా, మోటరోలా, ఎరిక్సన్, ఫ్లెక్స్ట్రానిక్స్, డెల్తో సహా అనేక బహుళజాతి టెలికాం కంపెనీలు దేశంలో యూనిట్లను ఏర్పాటు చేశాయి. -
పోయి కేసీఆర్ ని అడుక్కో..హోమ్ గార్డ్ ఆడియో లీక్ వైరల్
-
జీ20 సదస్సుకు హాజరు కాలేకపోతున్నా
న్యూఢిల్లీ: భారత్లో వచ్చే నెలలో జరిగే జీ20 కీలక సదస్సుకు తాను హాజరు కాలేకపోతున్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. భారత్, రష్యా ద్వైపాక్షిక సహకారం, ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో జరిగిన ‘బ్రిక్స్’ సదస్సు ప్రస్తావనకు వచ్చింది. సెపె్టంబర్ 9, 10న జరిగే జీ20 సదస్సుకు హాజరయ్యే విషయంలో తన అశక్తతను పుతిన్ తెలియజేశారు. ఈ సదస్సుకు రష్యా తరఫున తమ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని పేర్కొన్నారు. జీ20కి సారథ్యంలో భాగంగా భారత్ నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు గాను పుతిన్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ హాజరు కాలేదు. -
అలిపిరిలో బాంబు బ్లాస్ట్ బెదిరింపు ఫోన్ కాల్స్.. వ్యక్తి అరెస్టు..
తిరుమల: అలిపిరి వద్ద బాంబు బ్లాస్ట్ చేస్తానంటూ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితున్ని తమిళనాడు రాష్ట్రం, సేలం జిల్లాకు చేందిన బాలాజీ(39)గా గుర్తించారు. అతన్ని ఈ రోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తారీఖున అలిపిరి చెక్ పాయింట్ ల్యాండ్ ఫోన్ కి కాల్ చేసాడో వ్యక్తి. మధ్యాహ్నం 3గంటలకు 100 మందిని బాంబ్ బ్లాస్ట్ తో చంపేస్తానని చెప్పడంతో వెంటనే అప్రమత్తం అయ్యారు పోలీసులు. టీటీడీ పోలీసు, విజిలెన్స్ అధికారుల సమన్వయంతో అలిపిరి చెక్ పాయింట్ తనిఖీ చేసారు. అయినప్పటికీ ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్ధాలు లభించలేదు. బాంబు పేలుడుకు సంబంధించి ఫోన్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆకతాయి, దుష్ట చేష్టలకి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల డీఎస్పీ భాస్కర్ రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ఏపీ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల హవా -
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషణ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. చాబర్ బహర్ నౌకాశ్రయాన్ని పూర్తి స్థాయిలో కనెక్టివిటీ హబ్గా మార్చడం సహా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు వారు పునరుద్ఘాటించారు. బ్రిక్స్ విస్తరణ వంటి అంతర్జాతీయ వేదికలపై సహకారంపైనా వారు చర్చించారు. దక్షిణాఫ్రికాలో త్వరలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. -
'అమ్మ.. నీ ప్రార్థనలు ఫలించాయి; చల్లగా ఉండు బిడ్డా'
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తరపున ముకేశ్ కుమార్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కాగా కిర్క్ మెకెంజీ రూపంలో ముకేశ్ కుమార్ తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. 32 పరుగులు చేసిన మెకెంజీ ముకేశ్ బౌలింగ్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీమిండియా తరపున అంతర్జాతీయ అరేగంట్రం చేసిన 395వగా ఆటగాడిగా ముఖేష్ కుమార్ నిలిచాడు.కాగా దాదాపు ఏడాది నుంచి భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం ముఖేష్ కుమార్కు చోటు దక్కడం లేదు. అయితే రెండో టెస్టుకు గాయం కారణంగా పేసర్ శార్ధూల్ ఠాకూర్ దూరం కావడంతో.. ముఖేష్ ఎంట్రీకి మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే టీమిండియా తరపున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ముకేశ్కుమార్ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్కాల్లో తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ''హలో అమ్మా.. నీ ప్రార్థనలకు ఈరోజు సమాధానం దొరికింది. ఎట్టకేలకు దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిందంటూ తల్లితో పేర్కొన్నాడు. ముకేశ్ తల్లి స్పందిస్తూ.. సంతోషంగా ఉండు.. కెరీర్లో ఎదిగే ప్రయత్నం చెయ్యు.. నా దీవెనలు ఎప్పుడు నీ వెంట ఉంటాయి'' అంటూ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ వీడియో రూపంలో షేర్ చేయగా వైరల్గా మారింది. 2015లో బెంగాల్ తరపున ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి ముఖేష్ అడుగుపెట్టాడు. 2018-19 రంజీ సీజన్లో తన సత్తా ఎంటో క్రికెట్ ప్రపంచానికి ముఖేష్ తెలియజేశాడు. ఆ సీజన్లో కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లో 6 వికెట్లు పడగొట్టి.. బెంగాల్ను ఫైనల్కు చేర్చాడు. ఆ తర్వాత ముఖేష్ తన కెరీర్లో వెనక్కి తిరిగి చూడలేదు. తన ఫస్ట్క్లాస్ క్రికెట్లో 39 మ్యాచ్లు ఆడిన అతడు 149 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-2023 మినీ వేలంలో రూ. 20 లక్షల బేస్ ప్రైజ్తో వచ్చిన అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 5.5 కోట్ల రూపాయాలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన అతడు కేవలం 7 వికెట్లు మాత్రమే సాధించాడు. అనంతరం డబ్ల్యూటీసీ ఫైనల్- 2023కి స్టాండ్ బైగా కూడా ఎంపికయ్యాడు. No Dream Too Small! 🫡 Mukesh Kumar's phone call to his mother after his Test debut is all heart ❤️#TeamIndia | #WIvIND pic.twitter.com/Sns4SDZmi2 — BCCI (@BCCI) July 21, 2023 Mukesh Kumar's maiden Test wicket! A moment for him to savour. A video for you to savour. #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/fpCQSf1LsF — FanCode (@FanCode) July 22, 2023 చదవండి: #HarmanpreetKaur: 'డేర్ అండ్ డాషింగ్' హర్మన్ప్రీత్.. కుండ బద్దలయ్యేలా! -
ధోని వల్లే ఇలా మారాల్సి వచ్చింది..!
-
చంపేస్తామంటూ కేంద్రమంత్రికి బెదిరింపు కాల్.. ఈ ఏడాదిలో రెండోసారి
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. సోమవారం ఢిల్లీలోని గడ్కరీ నివాసానికి ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంత్రి కార్యాలయం నుంచి నితిన్ గడ్కరీకి ప్రాణహాని ఉన్నట్లు తమకు ఫిర్యాదు అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వివరాల ఆధారంగా ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. కాగా నితిన్ గడ్కరీకి తన కార్యాలయంలో హత్య బెదిరింపు కాల్స్ రావడం ఈ ఏడాది ఇది రెండోసారి. అంతకుముందు జనవరిలో, మహారాష్ట్రలోని అతని నివాసం, కార్యాలయానికి అలాంటి కాల్స్ వచ్చాయని, కాల్ చేసిన వ్యక్తి కర్ణాటకలోని బెలగావిలో జైలులో ఉన్న వ్యక్తిగా గుర్తించామని నాగ్పూర్ పోలీసులు తెలిపారు. చదవండి: షాకిచ్చిన ఓటర్లు.. మృతి చెందిన అభ్యర్థికి తిరుగులేని విజయం -
కర్ణాటక బీజేపీ నేతకు మోదీ ఫోన్ కాల్
బెంగళూరు: దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు ఫోన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. ఆ మరుసటి రోజే ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ స్వయంగా ఈశ్వరప్పకు ఫోన్ చేయడం గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం టికెట్లు ఆశించి భంగపడ్డ బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న తరుణంలో.. పార్టీ దిద్దుబాటు చర్యకు దిగింది. ఇప్పటికే చాలామంది సీనియర్లకు ప్రత్యామ్నాయ హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న ఈశ్వరప్పకు స్వయంగా ఫోన్ చేశారు మోదీ. ‘‘మీలాంటి గొప్ప నేత.. నాలాంటి ఓ సాధారణ కార్యకర్తకు ఫోన్ చేయడం గొప్పగా భావిస్తున్నా అని ఈశ్వరప్ప, మోదీతో పేర్కొన్నారు. దానికి ప్రతిగా.. ‘మీరు పార్టీ పట్ల వీరవిధేయతను కనబరిచారు. అందుకు నాకు సంతోషంగా ఉంది. అందుకే మీతో మాట్లాడాలనుకున్నా. ఈశ్వరప్పజీ.. థాంక్యూ’ అని ప్రధాని మోదీ ఆ కాల్లో ఆయనకు బదులిచ్చారు. అంతేకాదు.. తాను ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన శివమొగ్గ నియోజకవర్గంలో బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న చెన్నబసప్ప తరపున తాను ప్రచారం సైతం చేస్తానని, కర్ణాటకలో బీజేపీ గెలుపునకు తన శాయశక్తులా కృషిచేస్తానని ఈశ్వరప్ప.. మోదీకి హామీ ఇచ్చారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఈశ్వరప్ప.. ఆరో దఫా సైతం పోటీ చేయాలని భావించగా, పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. దీంతో అసంతృప్తితో రగిలిపోతూ ఆయన ఎన్నికల రాజకీయాలకు గుడ్బై చెబుతూ బహిరంగ ప్రకటన చేశారు. ఇక శుక్రవారం ప్రధాని మోదీతో ఫోన్కాల్ మాట్లాడిన అనంతరం.. ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడారు. ఇదీ చదవండి: వివాదాల పుట్ట.. ఈశ్వరప్ప మోదీగారు తనకు ఫోన్ చేస్తారని జీవితంలో అనుకోలేదని, ఆయన చేసిన పని తనకెంతో స్ఫూర్తినిచ్చిందని మీడియాకు ఈశ్వరప్ప బదులిచ్చారు. कुर्सी, सत्ता, दबदबा किसी भी हाल में बना रहना चाहिए… जो फोन पर बात कर रहे है वो BJP के #Eshwarappa है जिन्होंने 40% कमीशन की मांग कर एक कांट्रेक्टर को आत्महत्या के लिए मजबूर किया, बाद में मंत्री से इस्तीफा और टिकिट कटा देश के #PM उन्हें भरोसा देते हुए pic.twitter.com/uml1QCnl9I — Chhaya Thakur (@ChhayaThakurInc) April 21, 2023 బీజేపీ మే 10వ తేదీన జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఎక్కువగా కొత్త ముఖాలను, యూత్ లీడర్లను దించుతోంది. దీంతో పార్టీ దిగ్గజాల్లో చాలామంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే మాజీ సీఎం జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు కూడా. అయితే మొదట ఈశ్వరప్ప సైతం పార్టీతీరుపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం నడిచినప్పటికీ, తాను పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానంటూ గురువారం ఈశ్వరప్ప ఒక ప్రకటన చేశారు కూడా. తాను ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది కూడా పార్టీని బలోపేతం చేయడానికేనని పేర్కొన్నారు. పాతికేళ్లుగా శివమొగ్గ ప్రజలకు సేవలందించా. ఇకపైనా వాళ్లకు అందుబాటులో ఉంటా అని పేర్కొన్నారాయన. ఇదీ చదవండి: ఈశ్వరప్ప కొడుకుకూ దక్కని సీటు -
అబ్బే!.. రాంగ్ డయల్ కూడా కాదయా!
అబ్బే!.. రాంగ్ డయల్ కూడా కాదయా! -
జన్నారంలో చెరువు భూముల ఆక్రమణలపై స్పందించిన ఎమ్మెల్యే రేఖ నాయక్
-
ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాతుండగా పేలిన ఫోన్.. వ్యక్తి మృతి..
భోపాల్: ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కాల్స్ మాట్లాడొద్దని నిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్ బాద్నగర్ తహసీల్దార్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. దయారామ్ బరోద్ అనే 68 ఏళ్ల వ్యక్తి ఫోన్ బ్యాటరీ డౌన్ కావడంతో ఛార్జింగ్ పెట్టాడు. అప్పుడే కాల్ వచ్చింది. ఛార్జింగ్ ప్లగ్ తీయకుండా అలాగే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. దీంతో ఫోన్ పేలిపోయింది. పేలుడు ధాటికి దయారామ్కు తల, మొహం, ఛాతీపై తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు సమయంలో దయారామ్ అతని స్నేహితుడు దినేశ్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఒకరి అంత్యక్రియలకు హాజరయ్యే విషయంపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో దయానంద్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. కాల్ సడన్గా కట్ కావడంతో దినేశ్ దయారామ్కు మళ్లీ ఫోన్ చేశాడు. కానీ కాల్ కలవలేదు. దీంతో ఏం జరిగి ఉంటుందా అని దగ్గర్లోనే ఉన్న దయారామ్ ఇంటికి వెళ్లిన అతడు షాక్ అయ్యాడు. తీవ్ర గాయాలపాలై దయానంద్ అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఇతని భార్య మరణం తర్వాత ఒంటరిగా జీవిస్తున్నట్లు దినేశ్ చెప్పాడు. ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు ఛార్జర్ స్విచ్ బోర్డుకు కనెక్ట్ అయ్యే ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. అయితే అతను ఏ కంపెనీ ఫోన్ ఉపయోగించాడనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడినప్పుడు ఓవర్హీట్ వల్ల అది పేలిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటరీ రెడ్ మార్క్లో ఉన్నప్పుడు ఇలా చేయడం చాలా డేంజర్ అని సూచించారు. చదవండి: హత్రాస్ సామూహిక అత్యాచారం కేసు.. ముగ్గురు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించిన యూపీ కోర్టు -
ప్రీతి ఫోన్ కాల్ ఆడియో వెలుగులోకి.. తల్లితో ఏం చెప్పింది?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. నిమ్స్లో ఐదు రోజులుగా చికిత్స కొనసాగుతోంది. కాగా, సైఫ్ వేధింపులపై మెడికో ప్రీతి ఫోన్ కాల్ ఆడియో బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి ముందు తల్లికి ప్రీతి ఫోన్ చేసి తన బాధను ఫోన్కాల్లో చెప్పుకుంది. ‘‘సైఫ్ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లు అంతా ఒక్కటే. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా లాభం లేకుండా పోయింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి’’ అంటూ తల్లితో ప్రీతి ఆవేదన వ్యక్తం చేసింది. సైఫ్పై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా ఒకటై నన్ను దూరం పెడతారని, ప్రిన్సిపాల్కు ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్వోడి నాగార్జునరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రీతి ఆవేదన చెందగా, సైఫ్తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని ప్రీతి తల్లి చెప్పింది. కాగా, ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్ కాలేజీ, ఎంజీఎం హెచ్ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్ఫోన్, వాట్సాప్ గ్రూపులలో చాటింగ్ల ఆధారంగా విచారణ జరిపారు. ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చదవండి: నవీన్ హత్యకేసు నిందితుడు హరిహర ఫోన్ కాల్ వైరల్ -
నవీన్ హత్య కేసు నిందితుడు హరిహర ఫోన్ కాల్ వైరల్
-
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కలకలం.. బాంబు బెదిరింపు కాల్..!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి బళ్లారి ఎక్స్ప్రెస్లో బాంబు ఉందని కాల్ చేశాడు. ఆగి ఉన్న రైలులో బాంబు ఉందని బెదిరింపు కాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే, జీఆర్పీ పోలీసులు కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. -
అయోధ్య రామమందిరాన్ని పేలుస్తామంటూ బెదిరింపు కాల్.. పోలీసులు అలర్ట్!
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఓ ఆగంతకుడు చేసిన బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఫోన్ చేసిన సదరు వ్యక్తి.. అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని పేల్చేస్తానంటూ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఈ బెదిరింపు ఫోన్ కాల్ నేపథ్యంలో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. వివరాల ప్రకారం.. గురువారం ప్రయాగ్రాజ్కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మనోజ్ కుమార్ అయోధ్యలోని రాంలాలా సదన్ నివాసి కాగా.. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లోని కల్పవస్లో ఉన్నాడు. అయితే, మనోజ్కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. కాల్లో మరికొన్ని గంటల్లో శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. దీంతో, భయాందోళనకు గురైన మనోజ్.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఫోన్ కాల్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కాగా, కాల్ ట్రాకింగ్ ఆధారంగా ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక, బాంబు బెదిరింపు నేపథ్యంలో అయోధ్యలో పోలీసు బందోబస్తు పెంచినట్టు పోలీసు ఉన్నాతాధికారులు స్పష్టం చేశారు. आज दिनांक 02.02.2023 को रामलला सदन के एक शिष्य के मोबाइल पर अज्ञात व्यक्ति द्वारा श्री रामजन्मभूमि को बम से उड़ाने की धमकी देने के सम्बन्ध मे #ayodhyapolice द्वारा की जा रही कार्यवाही के सम्बन्ध मे पुलिस अधीक्षक नगर की बाईट। #UPPolice pic.twitter.com/cp9EcJmMtd — AYODHYA POLICE (@ayodhya_police) February 2, 2023 ఇదిలా ఉండగా.. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం గర్భగుడిలో కొలువుతీరే బాలరాముడి విగ్రహ తయారీకి వినియోగించే పవిత్ర సాలగ్రామ శిలలను నేపాల్ నుంచి తెప్పించారు. దాదాపు ఆరు కోట్ల సంవత్సరాల పురాతన శిలలుగా చెప్పబడే ఈ శిలలను నేపాల్లోని మస్తాంగ్ జిల్లాలోని ముక్తినాథ్కు సమీపంలో కాళీ గండకీ నదీ ప్రవాహప్రాంతం నుంచి సేకరించారు. జానకీరాముల విగ్రహాలను చెక్కేందుకు 26 టన్నులు, 14 టన్నులు బరువైన ఈ రెండు శిలలను రోడ్డు మార్గంలో బుధవారం రాత్రి అయోధ్యకు తీసుకొచ్చారు. 51 మంది వైదికుల వేదమంత్రోచ్ఛారణల నడుమ శిలలను ఆలయానికి సంబంధించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేశారు. ఈ సందర్భంగా కరసేవక్పురంలో గురువారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిలలను చూసి తరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు తరలివచ్చారు. అంతకుముందు, సీతాదేవి జన్మస్థలంగా పేరొందిన నేపాల్లోని జనక్పూర్ నుంచి ఈ శిలల రోడ్డుమార్గ ప్రయాణం మొదలైంది. -
షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం
గువహటి: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనకు ఆదివారం ఉదయం 2 గంటలకు ఫోన్ చేశారని తెలిపారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. గువహటిలో పఠాన్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్పై దాడి జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ విషయంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చానని, శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వం బాధ్యత అని చెప్పానని వివరించారు. అయితే శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో షారుఖ్ ఖాన్ అంటే ఎవరో తనకు తెలియదన్నారు హిమంత. మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నుంచి చాలా మంది తనకు ఫోన్ చేస్తారని, కానీ ఇప్పటివరకు ఆ ఖాన్ ఎవరో తనకు కాల్ చేయలేదని పేర్కొన్నారు. ఒకవేళ అతను ఫోన్ చేస్తే సమస్యల గురించి ఆలోచిస్తానన్నారు. ఆ మరునాడే షారుఖ్ హిమంతకు ఫోన్ చేయడం గమనార్హం. షారఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం ఈనెల 25న దేశవ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ పాటలో హీరోయిన్ దీపికా పదుకొనే కాషాయం రంగు బికినీలో కన్పించింది. దీన్ని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే గువహటిలోని నరెంగిలో పఠాన్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో షారుఖ్ ఖాన్ స్వయంగా సీఎంకు ఫోన్ చేశారు. చదవండి: జనాభాను పెంచేందుకు సిక్కింలో ప్రభుత్వోద్యోగినులకు వరాలు -
బ్రిటన్ రాజుకు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం బ్రిటన్ రాజు చార్లెస్–3తో ఫోన్లో మాట్లాడారు. వాతావరణ మార్పులు, జీవవైవిధ్య పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో వినూత్న ఆవిష్కరణలు వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)తెలిపింది. 27న ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చా’ ఈ నెల 27వ తేదీన వార్షిక ‘పరీక్షా పే చర్చా కార్యక్రమం జరగనుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మోదీ మాట్లాడనున్నారు. ఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో 6వ విడత పరీక్షా పే చర్చా జరగనుందని కేంద్ర విద్యాశాఖ మంగళవారం ట్వీట్ చేసింది. ఇదీ చదవండి: నెతన్యాహుకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ సెక్స్ కాల్ దుమారం
పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా మాట్లాడినట్లుగా ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందర ఈ పరిణామం చోటు చేసుకోవడంతో.. పాక్లో రాజకీయ దుమారం చెలరేగింది. పాకిస్థానీ జర్నలిస్ట్ సయ్యద్ అలీ హైదర్ యూట్యూబ్లో ఆ ఆడియో క్లిపులను షేర్ చేశారు. దీంతో పాక్లో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. అందులో ఉంది ఇమ్రాన్ ఖాన్ వాయిస్ అనేది ఆరోపణ. విశేషం ఏంటంటే.. ఈ ఆడియో క్లిప్స్ తాజావేనని అందులోని సంభాషణల ఆధారంగా తెలుస్తోంది. అయితే.. ఇది ప్రధాని కార్యాలయం నుంచే వెలువడ్డాయని ఖాన్ అనుకూల మీడియా ఛానెల్స్ కథనాలు వెలువరిస్తున్నాయి. మరోవైపు.. పీటీఐ మాత్రం ఈ కాల్ సంభాషణలను కొట్టిపారేస్తోంది. అదంతా ప్రభుత్వం కుట్రేనని, తమ అధినేతను బద్నాం చేసే కుట్రలో భాగంగా ఫేక్ క్లిప్స్తో ప్రచారం చేస్తోందని ఆరోపిస్తోంది. వాళ్లు ఇంతకంటే ఏం చేయలేరని పీటీఐ అధికార ప్రతినిధి అర్సలన్ ఖలీద్ పేర్కొన్నారు. ఇక ఆ ఆడియో క్లిప్లో సదరు మగ గొంతు తనను కలవాలంటూ అవతలి మహిళను బలవంతం పెట్టగా.. ఆమె కుదరదని చెప్పడం వినొచ్చు. అంతేకాదు.. తన భార్యాబిడ్డలు రాకుండా ప్రయత్నిస్తానని కూడా ఆమెతో చెప్పాడు ఆ వ్యక్తి. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ కాస్త ఇమ్రాన్ హష్మీ(బాలీవుడ్ నటుడు)గా మారిపోయాడంటూ సౌత్ ఏషియా కరస్పాండెంట్, జర్నలిస్ట్ నలియా ఇనాయత్ ఎద్దేవా చేశారు. -
రష్యా అధ్యక్షుడికి మోదీ ఫోన్.. అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఉక్రెయిన్పై సైనిక చర్య పేరుతో రష్యా భీకర దాడులు చేస్తున్న క్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసింది. ఈ ఫోన్ సంభాషణపై అగ్రరాజ్య అమెరికా స్పందించింది. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు చర్చలు, దౌత్య ప్రక్రియలే మార్గమని ప్రధాని మోదీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపింది. మీడియా సమావేశంలో పుతిన్, మోదీ ఫోన్ సంభాషణపై ప్రశ్నించగా.. ఈ మేరకు స్పందించారు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్. ‘భారత ప్రధాని మోదీ మాటలను పరిగణనలోకి తీసుకుంటాం. ఆయన సూచనలు ఆచరణలోకి వచ్చినప్పుడు వాటిని స్వాగతిస్తాం. రష్యాతో ఒప్పందాలపై ఇతర దేశాలు వారి సొంత నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే, యుద్ధం ప్రభావాన్ని తగ్గించేందుకు మేము మిత్రదేశాలతో సమన్వయంతో పని చేస్తాం. యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపనకు పాటుపడాలనే ఆసక్తి ఉన్న ఏ దేశమైనా.. ఉక్రెయిన్ మిత్ర దేశాలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.’ అని తెలిపారు వేదాంత్ పటేల్. పుతిన్తో మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు చర్చలు, దౌత్య ప్రక్రియలే మార్గమని పునరుద్ఘాటించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు రష్యా, భారత్ దేశాధినేతల మధ్య ఈ ఏడాది ఐదుసార్లు ఫోన్ సంభాషణలు జరిగాయి. ఇదీ చదవండి: భారత ప్రధానమంత్రి కసాయి -
షాకింగ్ ఘటన: ఊహకే అందని ఫోన్ కాల్...కంగుతిన్న పోలీసులు
ఇంత వరకు మనం క్షణికావేశంలో హతమార్చడం లేదా తప్పుడూ నిర్ణయాలు తీసుకుని చనిపోవడం విని ఉంటాం. ఒక వేళ హత్య చేసిన ఆ తర్వాత భయంతో పోలీసులకు లొంగిపోవడం వంటివి కూడా చూశాం. కానీ నేనే చంపేశా రండి అరెస్టు చేయండి అంటూ పోలీసులకే ఫోన్ కాల్ చేయడం గురించి ఇంత వరకు విని ఉండ లేదు కదా. ఇక్కడొక వ్యక్తి డైరెక్టగా పోలీసులకే అసలు విషయం చెప్పి ఇంటికి రమ్మని పిలవడంతో.. ఒక్కసారిగా ఇది నిజమా? కాదా! అన్నంతగా షాక్ అయ్యారు పోలీసులు. వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి పోలీసులకు ఉదయం ఎనిమిది గంటలకు ఫోన్ చేసి నా భార్యను చంపేశానంటూ పోలీసులకు కాల్ చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..యోగేశ్ కుమార్ అనే వ్యక్తి సుశీల్ గార్డెన్లో ఉన్న తన ఇంట్లోనే తన భార్యను హత్య చేశానని పోలీసులకు కాల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. సదరు నిందితుడు చెప్పిన సంఘటనా స్థలానికి హుటాహుటినా చేరుకున్నారు. అక్కడ నిందితుడి భార్య అర్చన నేలపై విగత జీవిగా పడి ఉంది. దీంతో వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని ధృవీకరించారు. దీంతో పోలీసులు నిందితుడు యోగేశ్ కుమార్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తేలిందని పోలీసులు అన్నారు. దీంతో అతడి భార్య అర్చన తనకు తెలిసిన వారి నుంచి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుంది. ఈ విషయమై ఆదివారం ఆ జంట గొడపడ్డారని, ఆ తర్వాత యోగేశ్ కోపంతో తన భార్య అర్చనను గొంతు నులిమి చంపేశాడని తెలిపారు. (చదవండి: శ్రద్ధా వాకర్ హత్య కేసు: సీబీఐ అవసరం ఏంటి?.. పేరెంట్స్కి లేని అభ్యంతరాలు మీకెందుకు?) -
రూ.100 కోట్లు తీసుకుని హ్యాపీగా ఉండేవాణ్ణి.. కానీ.. తాండూరు కోసమే..
బషీరాబాద్: నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ‘ఎమ్మెల్యేల ఎర కేసు’లో తాను పెద్ద రిస్క్ తీసుకున్నానని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండలం మల్కన్గిరి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని కోరుతూ గ్రామ యువకులు కొందరు వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దీక్ష చేస్తున్న బాలకృష్ణ అనే యువకుడితో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ‘తాండూరు అభివృద్ధి కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నా. లేకుంటే వాళ్లు ఇచ్చే వంద కోట్ల రూపాయలు తీసుకొని నేను హ్యాపీగా ఉంటాను కదా. కానీ నేను మన కోసం రిస్క్ తీసుకున్నా. మీ గ్రామం అభివృద్ధికి ఏమేమి కావాలో నాకు లెటర్ రాయండి. మీ గ్రామం డెవలప్మెంట్ నేను చూసుకుంటా. సమస్యను నా దృష్టిలో పెట్టుకుంటా. ప్రభుత్వం ముందు ప్రపోజల్ చేస్తా..’అని తెలిపారు. నా కోసం దీక్ష విరమించాలని కోరారు. కాగా వారం రోజుల్లో మల్కన్గిరి గ్రామానికి రూ.25 లక్షల నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు దీక్ష చేస్తున్న యువకులు చెప్పారు. రిలే దీక్షలు విరమిస్తున్నట్లు తెలిపారు. చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
మంత్రి కొప్పుల ఈశ్వర్ రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్
-
ఎమ్మెల్యే సతీష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్
-
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్
-
ఎమ్మెల్యేకు ఊహించని ఫోన్ కాల్.. టీఆర్ఎస్ గెలుస్తుందా సార్ అంటూ..
సాక్షి, పెద్దపల్లి: ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేల రాజీనామాలతో ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల కారణంగా ప్రభుత్వం ఆ నియోజకవర్గాలకు భారీ మొత్తంలో ఫండ్స్ రిలీజ్ చేయడం, అభివృద్ధి పనులు చేపట్టడం చేయడం జరిగింది. దీంతో, ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ప్రజలతో చేదు అనుభవం ఎదురైంది. కొందరు తమ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి నియోజకవర్గానికి చెందిన రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రశ్నించాడు. దీనికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.. తనకు తెలియదు అని సమాధానం ఇవ్వడంతో.. పెద్దపల్లి అభివృద్ధి కావాలంటే మీరు కూడా రాజీనామా చేస్తే బాగుంటుంది కదా అని అన్నాడు. దీనికి ఎమ్మెల్యే సమాధానం ఇస్తూ.. మంచిది.. నువ్వు ఇక్కడకు వచ్చి మాట్లాడు.. అన్నారు. కాగా, వీరిద్దరూ మాట్లాడిన వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు మోదీ ఫోన్
న్యూఢిల్లీ/ లండన్: ప్రపంచంలో రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ కలిసి పనిచేయాలని, ఇరు దేశాల నడుమ రక్షణ, ఆర్థికపరమైన భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని బ్రిటన్ నూతన ప్రధానమంత్రి రిషి సునాక్ ఆకాంక్షించారు. రెండు దేశాలు కలిసికట్టుగా సాధించబోయే ఘనత కోసం తాను ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని చెప్పారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తనను అభినందించినందుకు గాను ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలియజేశారు. మోదీ గురువారం ఫోన్లో రిషి సునాక్తో మాట్లాడి, అభినందించారు. ‘‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి మేమిద్దరం కలిసి పనిచేస్తాం. సమగ్ర, సమతుల్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదుర్చుకోవాలని అంగీకారానికి వచ్చాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. దీనిపై రిషి సునాక్ ట్విట్టర్లో స్పందించారు. కొత్త పాత్రలో తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని, బ్రిటన్–భారత్ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్తో మోదీ మాట్లాడడం ఇదే మొదటిసారి. Glad to speak to @RishiSunak today. Congratulated him on assuming charge as UK PM. We will work together to further strengthen our Comprehensive Strategic Partnership. We also agreed on the importance of early conclusion of a comprehensive and balanced FTA. — Narendra Modi (@narendramodi) October 27, 2022 Thank you Prime Minister @NarendraModi for your kind words as I get started in my new role. The UK and India share so much. I'm excited about what our two great democracies can achieve as we deepen our security, defence and economic partnership in the months & years ahead. pic.twitter.com/Ly60ezbDPg — Rishi Sunak (@RishiSunak) October 27, 2022 ఇదీ చదవండి: Rishi Sunak: తొలిరోజే విమర్శల జడివాన.. బ్రేవర్మన్ నియామకంపై వ్యతిరేకత -
అసదుద్దీన్ ఫోన్ నంబర్ కోసం ముంబైలో ఆరా.. బాంబ్ బ్లాస్ట్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చార్మినార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఫోన్ నెంబర్ కోసం ముంబైలోని ఆ పార్టీ యాక్టివిస్ట్ను సంప్రదించాడు. అతడు తిరస్కరించడంతో దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లు చేస్తామంటూ బెదిరించాడు. ఈ వ్యవహారం అక్కడి శాంతాక్రుజ్ సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వెళ్లడంతో కేసు నమోదై నగర వాసి అరెస్టు అయ్యాడు. దీన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ బాలాసాహెబ్ తాంబే సాక్షికి తెలిపారు. చార్మినార్ ప్రాంతానికి చెందిన రంజిత్ కుమార్ వ్యాపారి. ఈయన సోషల్ మీడియా ద్వారా ముంబైలోని శాంత క్రుజ్ వాసి రఫత్ హుస్సేన్ ఫోన్ నెంబర్ సంగ్రహించాడు. గత మంగళవారం ఆయనకు వీడియో కాల్ చేసిన రంజిత్ తనకు ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ ఫోన్ నెంబర్ కావాలంటూ అడిగాడు. హైదరాబాద్లోని పాతబస్తీకి చెందిన రంజిత్ ముంబైలో ఉండే తనకు ఫోన్ చేసి అసదుద్దీన్ ఓవైసీ నెంబర్ అడగటంతో హుస్సేన్ అనుమానించారు. దీనికి తోడు తనకు రంజిత్తో పరిచయం లేకపోవడంతో ఫోన్ నెంబర్ ఇవ్వనంటూ స్పష్టం చేశాడు. దీంతో సహనం కోల్పోయిన రంజిత్ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చాడు. తాను అడిగిన ఫోన్ నెంబర్ ఇవ్వడానికి తిరస్కరించావని, ఫలితంగా బుధవారం (మరుసటి రోజు) దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లు తప్పవంటూ బెదిరించి ఫోన్ పెట్టేశాడు. ఈ పరిణామంతో కంగుతిన్న హుస్సేన్ విషయాన్ని అక్కడి క్రైమ్స్ విభాగం డీసీపీ బాల్సింగ్ రాజ్పుత్కు ఫిర్యాదు చేశారు. వస్త్ర వ్యాపారి అయిన హుస్సేన్ ఫిర్యాదు ఆధారంగా శాంతాక్రుజ్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గత గురువారం నగరానికి వచ్చిన ప్రత్యేక బృందం రంజిత్ను అరెస్టు చేసి తీసుకువెళ్లింది. శుక్రవారం అక్కడి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి అనుమతితో రోజుల పోలీసు కస్టడీకి తీసుకుంది. దీనిపై ఇన్స్పెక్టర్ బాలాసాహెబ్ తాంబే సాక్షితో మాట్లాడుతూ... ప్రాథమిక విచారణలో రంజిత్ తనకు అసదుద్దీన్ అంటే అభిమానమని, ఆయన్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవడానికే ఫోన్ నెంబర్ అడిగానని చెప్పాడు. హుస్సేన్ తిరస్కరించడంతో పాటు నిర్లక్ష్యంగా మాట్లాడటంతోనే అలా వార్నింగ్ ఇచ్చానని వివరించాడు. రంజిత్ ఆకతాయి తనంతోనూ ఇలా చేశాడని అనుమానం ఉంది. -
ఇండియాకు వెళ్లిపో.. ప్రమీలా జయపాల్పై దూషణ పర్వం
సియాటెల్: ఇండో-అమెరికన్ కాంగ్రెస్ఉమెన్ ప్రమీలా జయపాల్కు చేదు అనుభవం ఎదురైంది. ఫోన్ చేసి మరీ ఓ వ్యక్తి ఆమెను దూషించాడు. అంతేకాదు జాతివివక్ష, జాత్యాహంకారం ప్రదర్శిస్తూ.. ఆమెను ఇండియాకు వెళ్లిపోవాలంటూ బెదిరించాడు. ఇందుకు సంబంధించి ఐదు ఆడియో క్లిప్పులను అమెరికా చట్టసభ్యురాలైన ఆమె తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. మరీ అభ్యంతకరంగా, పరుష పదజాలంతో ప్రమీలా జయపాల్ను దూషించాడు ఆ వ్యక్తి. అంతేకాదు పుట్టిన దేశానికే వెళ్లిపోవాలంటూ ఆమెను బెదిరించాడు కూడా. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో అమెరికాలో స్థిరపడిన భారతీయులపై జాత్యహంకారం ప్రదర్శిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఘటనలపై చర్యలు చేపడుతున్నప్పటికీ.. పరిస్థితుల్లో మార్పు మాత్రం రావడం లేదు. Typically, political figures don't show their vulnerability. I chose to do so here because we cannot accept violence as our new norm. We also cannot accept the racism and sexism that underlies and propels so much of this violence. pic.twitter.com/DAuwwtWt7B — Rep. Pramila Jayapal (@RepJayapal) September 8, 2022 చెన్నైలో పుట్టిన ప్రమీలా(55).. సియాటెల్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికా ప్రతినిధుల సభ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి ఇండో-అమెరికన్(డెమొక్రటిక్ పార్టీ తరపున) కూడా ఈమెనే. అయితే ఆమెకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం మొదటిసారేం కాదు. ఈ ఏడాది సమ్మర్లో.. సియాటెల్లోని ఆమె ఇంటి బయట గన్తో ఓ వ్యక్తి వీరంగం వేశాడు. ప్రమీలా కుటుంబ సభ్యుల్ని దూషిస్తూ.. బెదిరింపులకు దిగాడు. దుండగుడ్ని బ్రెట్ ఫోర్సెల్ (49)గా గుర్తించి.. పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: ఆ డాక్టర్ ఏకంగా హౌస్ కీపర్ని పెళ్లి చేసుకుంది! -
హలో బదులు.. వందేమాతరం చెప్పండంటూ అధికారుల ఆదేశం.. ఎక్కడంటే!
సాక్షి, ముంబై: విధుల్లో ఉన్న సమయంలో వచ్చే ఫోన్ కాల్స్కు హలో.. బదులుగా వందేమాతరం.. అని చెప్పాలంటూ మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆదేశాలు జారీ చేసింది. ‘అటవీ శాఖలోని అధికారులు, సిబ్బంది అందరూ విధుల్లో ఉన్న సమయంలో పౌరులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ను తీసుకునేటప్పుడు హలోకు బదులుగా వందేమాతరం అని అని చెప్పాలని కోరుతున్నాం’ అని అందులో ఉంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు హలో బదులుగా వందేమా తరం అని చెప్పాలని తమ శాఖ అధికారులను కోరినట్లు అటవీ శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సుధీర్ ముంగంటివార్ అంతకుముందు మీడియాతో అన్నారు. చదవండి: జార్ఖండ్ సీఎంకు షాక్.. శాసనసభ సభ్యత్వం రద్దు -
పెచ్చుమీరుతున్న రికవరీ ఏజెంట్ల వేధింపులు
నెల్లూరు (క్రైమ్) : లోన్ యాప్స్కు చెందిన రికవరీ ఏజెంట్ల వేధింపులు మితిమీరుతున్నాయి. ఇప్పటివరకు సామాన్య ప్రజలే లక్ష్యంగా సాగుతున్న ఈ వ్యవహారం చివరకు ప్రజాప్రతినిధులను వదలడంలేదు. ‘‘మీ బంధువులు/స్నేహితులు రుణం తీసుకున్నారు.. దానికి మీరే చెల్లింపులు చేయాలి’’ అంటూ ఫోన్లు చేస్తున్నారు. వారెవరో తమకు తెలియదని చెబుతున్నప్పటికీ మాటలతో ఎదురుదాడికి దిగుతున్నారు. సరిగ్గా ఈలాంటి అనుభవమే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రస్తుత మంత్రి, మాజీమంత్రికి ఎదురైంది. ఈ రెండు ఘటనలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖులకు సైతం రికవరీ ఏజెంట్లు ఫోనుచేసి బెదిరిస్తున్న వైనంపై జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. వివరాలివీ.. పదేపదే ఫోన్లుచేసి.. చెన్నైలోని కోల్మాన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వివిధ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలకు లోన్ రికవరీ ఏజెన్సీగా పనిచేస్తోంది. నెల్లూరు రామలింగాపురంలోని ఓ ఫైనాన్స్ సంస్థ పాతపాటి అశోక్కుమార్కు రూ 8.5 లక్షలు రుణమిచ్చింది. అతను తిరిగి చెల్లించకపోవడంతో రికవరీ ఏజెన్సీకి సదరు సంస్థ అతని ఫోను నంబర్ను ఇచ్చింది. ఏజెన్సీ మేనేజర్లు గురుప్రసాద్రెడ్డి, మహేంద్రన్, పెంచలరావు, టీం లీడర్ మాధురివాసులు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రముఖుల ఫోన్ నెంబర్లను సేకరించారు. ఈనెల 25న మంత్రి కాకాణి గోవర్థనరెడ్డికి ఫోనుచేశారు. ఆయన ఫోను తన పీఏ శంకరయ్య వద్ద ఉండడంతో బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. టీం లీడర్ మాధురివాసు ప్రియాంకగా పేరుమార్చి అసభ్యకరంగా మాట్లాడి అతని నుంచి రూ.25వేల నగదు తీసుకుంది. దీంతో పీఏ ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదుచేసి నలుగురు నిందితులను అరెస్టుచేశారు. మాజీమంత్రికి సైతం.. మరోవైపు.. మాజీమంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. పాతపాటి అశోక్కుమార్ రుణం తీసుకున్నాడని.. ఆ రుణం చెల్లించాలంటూ అనిల్కుమార్పై ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించిన కాల్ రికార్డు ఆడియో సోషల్ మీడియాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు క్షేత్రస్థాయిలో విచారిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు మాట్లాడుతూ.. జిల్లాలో మంత్రి, మాజీమంత్రికి ఫోన్లుచేసి బెదిరించిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్టుచేసి వారి నుంచి ల్యాప్టాప్, సెల్ఫోన్లను సీజ్ చేశామన్నారు. ఎవరైతే రుణం తీసుకున్నారో వారికి ఫోన్లు చేయకుండా ఇతరులకు ఫోనుచేసి బెదిరించడం చట్టరీత్యా నేరమన్నారు. ఆన్లైన్ లోన్ యాప్స్లో రుణాలు తీసుకోవద్దని ఆయన హితవు పలికారు. ఎవరికైనా ఈ తరహా ఫోన్లు వస్తే వెంటనే స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ చెప్పారు. ఇదీ చదవండి: AP: రెచ్చిపోతున్న రికవరీ ఏజెంట్లు.. మంత్రి కాకాణి పీఏ శంకర్కు వార్నింగ్ -
రాజగోపాల్రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి.. క్యాడర్లో ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఒకౖవెపు ఆయన పార్టీని విడిచి వెళ్లకుండా అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గానికి చెందిన కొంతమంది అనుచరులు కూడా పార్టీని వీడొద్దని చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు పార్టీలోకి రావాలంటూ బీజేపీ ఒత్తిడి పెంచుతోంది. అయితే ఆయన పార్టీ మారడానికే నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఆయన పార్టీ మారడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తథ్యమని తెలుస్తోంది. దిగ్విజయ్ ఫోన్ పార్టీ వీడే అంశంపై నియోజకవర్గ అనుచరగణంతో రాజగోపాల్రెడ్డి వరుస సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా.. పార్టీ వీడొద్దని కొంతమంది అనుచరులు చెప్పినట్లు తెలిసింది. ఆయన మాత్రం నాలుగైదేళ్లుగా పార్టీ నాయకత్వం ఏ విధంగా అవమానించిందన్న విషయాన్నే వివరించినట్లు సమాచారం. కాగా బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన రాష్ట్ర నేతలు.. రాజగోపాల్రెడ్డితో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తద్వారా అధిష్టానం బుజ్జగింపులకు ప్రయత్నిస్తుందనే సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఒకప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ గురువారం రాజగోపాల్రెడ్డికి ఫోన్ చేయడం హైకమాండ్ ఆలోచనను స్పష్టం చేసింది. పార్టీ మారవద్దని సూచించడంతో పాటు ఏదైనా ఉంటే రెండురోజుల తర్వాత ఢిల్లీకి రావాల్సిందిగా దిగ్విజయ్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రేపు రాజగోపాల్తో భేటీ! మరోవైపు ఉదయం ఢిల్లీలోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నివాసంలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. రాజగోపాల్రెడ్డి వ్యవహారంపై రెండు గంటల పాటు చర్చించారు. ఆయన పార్టీలోనే ఉండేలా చూడాలని అధిష్టానం వీరికి సూచించినట్టు తెలుస్తోంది. దీంతో వీరంతా శనివారం సాయంత్రం రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఒత్తిడి పెంచుతున్న బీజేపీ! మరోవైపు పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ వైపు నుంచి రాజగోపాల్పై ఒత్తిడి పెరిగి నట్టు తెలుస్తోంది. రాజగోపాల్రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని, శుక్రవారం బండి సంజయ్, ఈటల, కిషన్రెడ్డి తదితర నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆయన్ను ఎలాగైనా ఢిల్లీ తీసుకెళ్లాలని సంజయ్, ఈటల తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ క్యాడర్లో ఉత్కంఠ అధిష్టానం బుజ్జగింపులతో రాజగోపాల్ రెడ్డి శాంతిస్తారా? పార్టీని వీడే విషయంలో వెనక్కి తగ్గుతారా? లేక ఇవన్నీ పట్టించుకోకుండా బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపుతారా? అనే విషయమై కాంగ్రెస్ క్యాడర్లో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి తాజా పరిణామాలకు ముందే.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రాజగోపాల్రెడ్డి బీజేపీలోకి వెళ్లాలనే నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. తాజాగా అధిష్టానం రంగంలోకి దిగడంతో ఆయన వైఖరి ఎలా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. శనివారం నాటి సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద అధిష్టానం బుజ్జగింపులు, అనుచరుల అభిప్రాయంతో రాజగోపాల్రెడ్డి కొంత సందిగ్ధంలో పడినా, ఏఐసీసీ దూతలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నా.. బీజేపీలో చేరడానికే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దిగ్విజయ్ ఫోన్
-
పుతిన్కు ప్రధాని మోదీ ఫోన్..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా విషయంలో ఇండియా వైఖరిని మరోసారి గుర్తుచేశారు. శాంతి చర్చలతోపాటు దౌత్య మార్గాల్లో ఇరు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని మోదీ పేర్కొన్నారు. మోదీ, పుతిన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ, ఫుడ్ మార్కెట్లతోపాటు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారని భారత ప్రధానమంత్రి కార్యాలయ(పీఎంఓ) వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. 2021 డిసెంబర్లో పుతిన్ భారత పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు తీరును ఇరువురూ సమీక్షించారని పేర్కొన్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, ఔషధ ఉత్పత్తుల వాణిజ్యంలో భారత్–రష్యా పరస్పరం ఎలా సహకరించుకోవాలన్న దానిపై మోదీ, పుతిన్ సంప్రదింపులు జరిపారు. అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై తరచూ చర్చలు కొనసాగిస్తూ ఉండాలని నిర్ణయానికొచ్చారు. -
ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఫోన్ కాల్
అనంతపురం సిటీ: కుటుంబాన్ని వద్దనుకుని ఇల్లాలు పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భర్త... పిల్లల సహా ఆత్మహత్యాయత్నం చేశాడు. సకాలంలో సమాచారం అందుకున్న పోలీసులు వారిని కాపాడారు. వివరాలు.. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లికి చెందిన రామానాయుడు భార్యాబిడ్డలతో కలసి నగరంలోని ఆదర్శనగర్లో నివాసముంటున్నాడు. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి 13 ఏళ్ల కుమార్తె, 11 ఏళ్ల వయస్సు కలిగిన కొడుకును చూసుకుంటూ రామానాయుడు రోజులు నెట్టుకొచ్చాడు. భార్య కాపురానికి రానని తేల్చి చెప్పడంతో మనస్తాపం చెందిన అతను తన ఇద్దరు బిడ్డలతో కలసి నాయక్నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్పైకి చేరుకున్నాడు. వారిని గమనించిన స్థానికులు డయల్ 100కు సమాచారం అందించడంతో నాల్గో పట్టణ సీఐ జాకీర్ హుస్సేన్ తక్షణమే స్పందించి బ్లూకోట్ సిబ్బందిని రైల్వే ట్రాక్ వద్దకు పంపారు. సకాలంలో పోలీసులు అక్కడకు చేరుకుని ముగ్గురిని కాపాడి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. కౌన్సెలింగ్ అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా బ్లూకోట్ సిబ్బందిని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐ జాకీర్, రైల్వే సీఐ నాగరాజు అభినందించారు. (చదవండి: అర్హులైన రైతులందరికీ ఉచిత పంటల బీమా పరిహారం) -
మంత్రి ఆదిమూలపు సురేష్కు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి: మున్సిపల్ , అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. సురేష్తో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. అస్వస్థతతో బాధపడుతున్న మంత్రికి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స చేసి యాంజియోప్లాస్టి చేశారు. చదవండి: ‘అమరావతి.. చంద్రబాబు బినామీ రాజధాని’ -
పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావును పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఫోన్లో పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఎమ్మెల్యే మాతృమూర్తి సంతోషమ్మ మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంతోషమ్మ మృతికి సీఎం జగన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చదవండి: (పార్వతీపురం ఎమ్మెల్యేకు మాతృవియోగం) -
ఒక్క ఫోన్కాల్తో పీటలపై ఆగిన పెళ్లి; బావా.. ఎంత పని చేస్తివి!
సాక్షి, మహబూబాబాద్ రూరల్: మరికొద్ది గంటల్లో జరగాల్సిన పెళ్లి అంతలోనే వచ్చిన ఓ ఫోన్కాల్తో పీటల మీదే ఆగిపోయింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని కేసముద్రం మండలం పరిధి గ్రామానికి చెందిన వధువుకు బయ్యారం మండలం పరిధిలో గల వరుడితో వివాహం నిశ్చయమైంది. బుధవారం ఉదయం 10 గంటలకు కురవి మండల కేంద్రంలో వివాహం జరిపేందుకు పెద్దలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెళ్లి మరికొద్ది గంటల్లో ఉందనగా వధువు అక్క భర్త వరుడి తండ్రికి ఫోన్చేసి వివాహం ముచ్చట్లు మాట్లాడాడు. బాబాయ్ పెళ్లి ఎక్కడ, ఎలా రావాలి, ఏర్పాట్లు ఎలా చేశారని మంచి చెడు అడిగి తెలుసుకున్నాడు. కాగా, మంగళవారం ప్రధానం వేడుక జరగగా పెళ్లి కుమార్తె వరుడి ఇంట్లో ఉంది. అదే క్రమంలో పెళ్లి కుమార్తె అక్కడే ఉందా అని అడిగాడు. దీంతో వరుడి తండ్రి ఫోన్ను నూతన వధువుకు ఇచ్చాడు. ఆమె బావ మాట్లాడుతూ నిన్న నేను అలిగి ప్రధానం సమయంలో నీతో ఫొటో ఎందుకు దిగలేదో తెలుసా.. నీ మీద కోపంతో నేను ఫొటో దిగలేదని మాట్లాడాడు. ఆ మాటలను కాల్ రికార్డ్లో విన్న పెళ్లి కుమారుడు తనకు ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని మొరాయించాడు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు నివాసం ఉంటుండగా వారు పోలీసులను ఆశ్రయించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ పోలీసులు నూతన వరుడికి కౌన్సెలింగ్ ఇచ్చినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అతడు ఆమెను పెళ్లి చేసుకోనని పట్టుబట్టాడు. టౌన్ సీఐ సతీష్ను వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. చదవండి: సరూర్ నగర్ హత్య: ‘కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు’ -
దోషులకు శిక్షపడేలా చూస్తాం
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డిలో తల్లీ కుమారులు గంగం పద్మ, గంగం సంతోష్లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దోషులకు శిక్షపడేలా చూస్తామని బాధిత కుటుంబానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హామీ నిచ్చారు. రామాయంపేటకు చెందిన బాధిత కుటుంబానికి ఆదివారం ఆయన ఫోన్ చేసి పరా మర్శించారు. సంతోష్ తండ్రి అంజయ్య, సోదరు డు శ్రీధర్లతో మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఫోన్లో మాట్లాడించారని, ఈ సందర్భంగా పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని రేవంత్రెడ్డి వారికి చెప్పినట్టు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. టీఆర్ఎస్ నేతల ఆగడాలు మితిమీరి పోయాయని, ఇంకా చాలా మంది తమలాంటి బాధితులున్నారని సంతోష్ కుటుంబసభ్యులు రేవంత్కు వివరించారని చెప్పాయి. -
కోణార్క్ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు
సాక్షి, మేడ్చల్: కోణార్క్ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్లపల్లి రైల్వేస్టేషన్లో ట్రైన్ను అధికారులు నిలిపివేశారు. స్థానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఫేక్ కాల్గా రైల్వే పోలీసులు తేల్చారు. కోణార్క్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుంచి ముంబైకు వెళ్తోంది. బాంబు బెదిరింపు కాల్తో ట్రైన్ లో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చదవండి: ట్రాఫిక్ చలానా తొందరగా కట్టేయండి.. పొడిగింపు లేదు -
కొత్త మంత్రులకు సీఎంఓ నుంచి ఫోన్
-
తానే జీత ఇస్తానని యువతికి హామీ ఇచ్చిన మంత్రి పేర్నినాని
-
పుతిన్కు ప్రధాని మోదీ ఫోన్.. డెడ్లైన్ విధించిన రష్యా
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా భారతీయులు సురక్షితంగా బయటకొచ్చేందుకు సేఫ్ ప్యాసేజ్ (సురక్షిత మార్గం) కల్పించాలని కోరారు. ఇందుకు రష్యా ఖార్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు 6 గంటల పాటు వెసులుబాటు కల్పించింది. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9.30 గంటలు) వరకు డెడ్లైన్ విధించింది. ఈలోగా తక్షణమే ఖార్కివ్ను వదిలి వెళ్లాల్సిందిగా ఇండియన్ ఎంబసీ భారతీయులను అప్రమత్తం చేసింది. ఆ తర్వాత ఖార్కివ్ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా చిట్టచివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు గంటల పాటు కల్పించిన సేఫ్ ప్యాసేజిని వినియోగించాలని రష్యా సూచించింది. ఖార్కివ్ను చేజిక్కించుకునేందుకు ఏమాత్రం ఆలస్యం చేయబోమని ఈ సందర్భంగా రష్యా పేర్కొంది. చదవండి: (ఉక్రెయిన్లో మరో భారత విద్యార్థి మృతి) -
ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం
బీజింగ్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం మిత్ర దేశం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్తో ఉన్నతస్థాయి సంభాషణలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా పుతిన్ తెలపగా సంక్షోభం ముదరకుండా రెండు దేశాలు చర్చలు ప్రారంభించాలని అధ్యక్షుడు జిన్పింగ్తో చెప్పారని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమేనని జిన్పింగ్కు వివరించారని తెలిపింది. భద్రతపై రష్యా వెలిబుచ్చుతున్న న్యాయపరమైన ఆందోళనలను అమెరికాతోపాటు నాటో కూటమి దేశాలు ఏళ్లుగా నిర్లక్ష్యం చేశాయని పుతిన్ చెప్పారు. హామీలను మరిచి, రష్యా వ్యూహాత్మక భద్రతకు భంగం కలిగించేలా సైనిక మోహరింపులను పెంచుతూ వచ్చాయని చెప్పారు. బదులుగా జిన్పింగ్.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చైనా వైఖరి ఉందని వివరించారు. ‘ఈయూ, అమెరికాలు ప్రచ్ఛన్నయుద్ధం కాలం నాటి ఆలోచనలను పూర్తిగా విడనాడాలి. దేశాల న్యాయమైన భద్రతాపరమైన ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారని జిన్హువా వెల్లడించింది. -
మీది గొప్ప పోరాటం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరిస్తోందంటూ గళం విప్పిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుకు క్రమంగా వివిధ రాష్ట్రాల సీఎంల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ ప్రధాని దేవెగౌడ సీఎం కేసీఆర్కు అండగా నిలవగా తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సైతం కేసీఆర్కు మద్దతు పలికారు. దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవ డానికి సరైన సమయంలో గళం విప్పారంటూ కేసీఆర్ను ప్రశంసించారు. మోదీ ప్రభుత్వంపై పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఠాక్రే బుధవారం సీఎం కేసీఆర్కు స్వయంగా ఫోన్ చేశారు. ఈ నెల 20న ముంబై రావాలని ఆహ్వానించారు. ‘‘కేసీఆర్జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొన సాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారం అందిస్తాం’’ అని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఠాక్రే ఆహ్వానం మేరకు 20న ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబై వెళ్లనున్నారు. ఈ భేటీలో కేంద్రంపై ఏ విధమైన పోరాట పంథాను అనుసరించాలనే అంశంపై ఇరువురు నేతలు చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు సమాచారం. ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల సమావేశం త్వరలోనే ఏర్పాటు చేస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఈ సమావేశంలో ఏదైనా కార్యాచరణ రూపొందుతుందా అనేది తెలియాల్సి ఉంది. -
కేజ్రీవాల్ వినూత్న ప్రయోగం.. ప్రజలకే సీఎం అభ్యర్థి ఎంపిక ఛాన్స్..
Punjab Assembly Election 2022: ప్రజాభిప్రాయం మేరకే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిని ప్రకటిస్తానని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు 24 గంటల తర్వాత, ప్రజలు అభ్యర్థిని ఎంచుకోవడానికి ఓ ఫోన్ నంబర్ను 70748 70748 ప్రారంభించారు. అనంతరం సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సీఎం అభ్యర్థి ఎంపికకు పంజాబ్ ప్రజలు తమ ఎంపికను తెలియజేయడానికి కాల్/ మెసేజ్ లేదా వాట్సాప్ చేయాలని అన్నారు. 'పంజాబ్లోని 3 కోట్ల మంది ప్రజల నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాము. జనవరి 17 సాయంత్రం 5 గంటలలోపు ప్రజలు తమ ఎంపికను తెలియజేయాలి. ప్రజల ఓటు ద్వాఆరా సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే పద్ధతిని ఉపయోగించడం ఇదే తొలిసారి' అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. చదవండి: (10 సూత్రాలతో 'పంజాబ్ మోడల్'.. ప్లాన్ రెడీ చేసిన అరవింద్ కేజ్రీవాల్) పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్మాన్ను ఎంపిక చేస్తారని వస్తున్న ఊహాగానలపై కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. 'భగవంత్ మాన్ నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి. తలుపులు మూసి నాలుగు గోడల మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయవద్దని ఆయనే నాకు సూచించారు. సీఎం ఎంపిక కోసం ప్రజల్లోకి వెళ్లాలన్నది ఆయన ఆలోచనే అని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. చదవండి: (ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2021: దేశంలో పెరిగిన పచ్చదనం..) -
రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ చర్చలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో సంభాషించారు. డిసెంబర్ 6వ తేదీన పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు గురించి ఇరువురు నేతలు చర్చించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులతోపాటు ఇతర అంతర్జాతీయ అంశాలపై ముచ్చటించినట్లు ప్రధాని మోదీ అనంతరం ట్విట్టర్లో తెలిపారు. డిసెంబర్ 6వ తేదీన పుతిన్ భారత్ పర్యటనలో 28 ఒప్పందాలపై సంతకాలు జరిగిన విషయం తెలిసిందే. చదవండి: (ఆధార్– ఓటర్ ఐడీ అనుసంధానానికి లోక్సభ ఓకే) -
ఏపీ సీఎం వైఎస్ జగన్కు ప్రధాని మోదీ ఫోన్
సాక్షి, అమరావతి: ఏపీలోని వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితులపై ప్రధాని ఆరా తీశారు. ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల పరిస్థితులను ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ వివరించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు చదవండి: ‘చంద్రబాబు దొంగ ఏడుపులు.. ప్రజలు నమ్మరు’ Spoke to Andhra Pradesh CM @ysjagan Garu on the situation in the wake of heavy rainfall in parts of the state. Assured all possible support from the Centre. I pray for everyone’s well-being and safety. — Narendra Modi (@narendramodi) November 19, 2021 -
గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఫోన్లో ఆరా తీశారు. బుధవారమే గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన సీఎం జగన్ సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని అన్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: (Andhra Pradesh: సంస్కరణలకు శుభారంభం) కాగా, 88 ఏళ్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నవంబర్ 17న మధ్యాహ్నం 1 గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు. అయితే గవర్నర్కు నవంబర్ 15న కోవిడ్ పాజిటివ్గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. కాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
రాంగ్ కాల్.. ఆ దివ్యాంగురాలి జీవితాన్నే మార్చేసింది..
సాక్షి, రాయచూరు(కర్ణాటక): అనుకోకుండా ఫోన్ ద్వారా పరిచయమైన దివ్యాంగురాలిని ఆర్టీసీ ఉద్యోగి ప్రేమించి ఆదర్శ వివాహం చేసుకున్నాడు. యాదగిరి తాలకా హుణసిగి బాగప్ప(34) బెంగళురు కేఎస్ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్నాడు. తెలిసినవారికి ఫోన్ చేస్తుండగా ఆ కాల్.. అనుకోకుండా.. విజయపుర ముద్దేబిహాళ్ తాలకా తరర్కు చెందిన రేణుక(32)కు వెళ్లింది. అప్పటి నుంచి ఇద్దరూ తరచూ ఫోన్లోనే మాట్లాడుకునేవారు. రేణుక దివ్యాంగురాలు. టెన్త్ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి శనివారం విజయపురలోని అంబేడ్కర్ భవన్లో వివాహం చేసుకున్నారు. -
వైరల్: షో మధ్యలో బాలయ్యకు ఫోన్ చేసిన రోజా
Roja Phone Call To Bala Krishna Goes Viral: బాలకృష్ణ, రోజా కలిసి బైరవ ద్వీపం, బొబ్బిలిసింహం సహా ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. తాజాగా షో జరుగుతుండగానే నటి రోజా బాలకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడారు. పాలిటిక్స్ పరంగా ఇద్దరూ వేరు వేరు పార్టీల్లో ఉన్నా ఇద్దరూ ఎంతో సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఓ కామెడీ షోకు రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అందరి సమక్షంలో బాలకృష్ణకు ఫోన్ చేయాల్సిందిగా యాంకర్ అనసూయ కోరగా..వెంటనే అంగీకరించిన రోజా బాలయ్యకు ఫోన్ చేసింది. ఈ సందర్భంగా ఇద్దరం కలిసి మళ్లీ ఎప్పుడు సినిమా చేద్దాం అని రోజా ప్రశ్నించగా..మన ఇద్దరి కాంబినేషన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారంటూ బాలయ్య ఆన్సర్ ఇచ్చారు. అంతేకాకుండా త్వరలోనే షోకు కూడా వస్తానంటూ సరదాగా మాట్లాడారు. ప్రస్తతం వీరిద్దరి ఫోన్ సంబాషణ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. చదవండి: శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్ పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది: నటి -
ఆరవ తరగతి విద్యార్థినికి సీఎం స్టాలిన్ ఫోన్ కాల్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరవ తరగతి విద్యార్థినికి ఫోన్ చేశారు. కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలను నవంబర్ 1 నుంచి తెరవనున్నట్లు ఆ అమ్మాయికి సీఎం స్టాలిన్ చెప్పారు. 'అయితే పాఠశాలకు వెళ్లేటపుడు టీచర్ సూచనలు పాటించండి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి' అంటూ సూచించారు. కాగా, గతంలో తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో గల హొసూరులోని టైటాన్ టౌన్షిప్కు చెందిన విద్యార్థిని ప్రజ్ఞా పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడో తెలుసుకోవడానికి ఓ లేఖ రాసింది. ఆ లేఖలో తన ఫోన్ నెంబర్ను కూడా రాసింది. చిన్నారి లేఖ చదివిన సీఎం స్టాలిన్ తనకున్న బిజీ షెడ్యూల్లోనూ ప్రజ్ఞాకి ఫోన్ చేసి మాట్లాడారు. దీనిపై ప్రజ్ఞా మాట్లాడుతూ.. సీఎం తనతో ఫోన్లో మాట్లాడటాన్ని నమ్మకలేకపోయానని చెప్పింది. చదవండి: (బంగారంతో పెట్టుబడి.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం) -
'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్ బుక్ను ముంచే విధ్వంసం
అక్టోబర్ 4న ఫేస్బుక్, దానికి అనుసందానంగా ఉన్న సర్వీస్లు ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలు సైతం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో అసౌకర్యానికి గురైన 2.7 బిలియన్ యూజర్లు ప్రత్యామ్నాయ సోషల్ నెట్ వర్క్లను వినియోగించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఫేస్బుక్లోని పరిణామాలతో భారతీయులు సైతం ఫోన్ కాల్స్, మెసేజెస్, గూగుల్ మ్యాప్స్ను విపరీతంగా వినియోగిస్తున్నట్లు పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. ఫేస్బుక్లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్గా పని చేసిన మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ఫ్రాన్సెస్ ఆరోపణలు చేసిన ప్రారంభంలో జూకర్ బెర్గ్ సైతం ఇదంతా 'టీ కప్పులో తుఫాను' అని అనుకున్నారు. కానీ పెను విధ్వంసానికి దారితీసింది. దీంతో ఫేస్బుక్ గురించి పాజిటివ్ ప్రచారం చేయాలని ఫేస్బుక్ ఉద్యోగులను బతిమాలడుడుకుంటుంది.అయినా పరిస్థితి చక్కబడేలా లేదని తెలుస్తోంది. ఫ్రాన్సెస్ హౌగెన్ పెట్టిన చిచ్చు..భారత్లో ఫేస్ బుక్ వినియోగం మరింత తగ్గిపోతున్నట్లు తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ 'బాబుల్ ఏఐ' (Bobble AI) నివేదిక ప్రకారం..భారతీయులు కుటుంబ సభ్యుల్ని,స్నేహితుల్ని పలకరించేందుకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను వినియోగించేవారు. కానీ వాటి వినియోగం ఇప్పుడు బాగా తగ్గినట్లు నివేదికలో పేర్కొంది. మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ఫోన్ ద్వారా కమ్యునికేషన్ చేసే పద్దతి 75 రెట్లు పెరిగినట్లు చెప్పింది. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లలో గూగుల్ పేలో యూజర్ల వినియోగం 200 రెట్లు పెరిగిందని,యూజర్ల తాకిడి ఎక్కువై కొన్ని సార్లు స్తంభించినట్లు వెల్లడించింది. అక్టోబర్ 4న, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దాని మెసెంజర్ ప్రపంచంలోని 3.5 బిలియన్ వినియోగదారులకు ఆరు గంటల పాటు అందుబాటులో లేవు. ఈ అంతరాయంతో ఇతర సోషల్ నెట్వర్క్ సిగ్నల్కు 140రెట్లు, ట్విట్టర్కు 7రెట్ల యూజర్ల వినియోగం పెరిగింది. యూట్యూబ్లో 30రెట్లు, జియోప్లే వంటి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్లలో 20రెట్ల ట్రాఫిక్ పెరిగింది. ఎఫ్ఎం రేడియో వినియోగం 20 రెట్లు, ఇతర మ్యూజిక్ యాప్స్ వాడకం 700 రెట్లు పెరిగినట్లు తేలింది. గేమింగ్ కేటగిరీలో బాటిల్ రాయల్ గేమ్స్ 70 సార్లు, టెంపుల్ రన్ 40 సార్లు, పార్కింగ్ జామ్ 3డి 15 సార్లు ట్రాఫిక్ పెరిగినట్లు స్టార్టప్ బాబుల్ ఏఐ చెప్పింది. చదవండి: ఆరు గంటల్లో 50 వేల కోట్ల నష్టం.. హ్యాకింగ్ కాదు జరిగింది ఇది -
చాలా కాలం తర్వాత మాట్లాడుకున్న ఆ రెండు దేశాల అధినేతలు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు శనివారం ఫోన్ చేసి మాట్లాడారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిన్పింగ్కు ఫోన్లో మాట్లాడం ఇది రెండోసారి. సాధారణంగా అమెరికా, చైనా మధ్య పలు అంశాల్లో విపరీతంగా పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరు చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 12న మాట్లాడారు. ఆ సంభాషణలో.. ఇరువురు నాయకులు విస్తృతమైన, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకొన్నారు. వాటితో పాటు ఈ దేశాల మధ్య నెలకొన్న పోటీ వివాదంగా మారకుండా ఉండేలా అమెరికా తీసుకొంటున్న చర్యలను బైడెన్ జిన్పింగ్కు స్పష్టంగా వెల్లడించారని వాషింగ్టన్ అధికారులు తెలిపారు. ఈ ఫోన్కాల్పై చైనా బ్రాడ్కాస్టింగ్ సంస్థ సీసీటీవీ స్పందిస్తూ.. ఇరు పక్షాలు వ్యూహాత్మక అంశాలపై లోతుగా చర్చించుకొన్నట్లు పేర్కొంది. వాషింగ్టన్ అభ్యర్థన మేరకు ఈ సంభాషణ జరిగిందని తెలిపింది. యూఎస్, చైనా విధానం ద్వైపాక్షిక సంబంధాలలో తీవ్రమైన ఇబ్బందులకు దారితీసిందని, రెండు దేశాలలోని ప్రజల ప్రాథమిక ప్రయోజనాలకు, అదే విధంగా అన్ని దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు విరుద్ధంగా నడిచే అవకాశం ఉన్నట్లు జి- బైడెన్తో వెల్లడించినట్లు తెలిపింది. చైనా-అమెరికాల మధ్య సంబంధాలను సరైన మార్గంలో నడిపిస్తే అది ప్రపంచానికి చాలా ప్రయోజనకరమని షీజిన్పింగ్ అభిప్రాయడ్డారని వెల్లడించింది. చదవండి: అక్కడ క్షణాల్లో బైడెన్ని ఓడిస్తా: ట్రంప్ -
పారా ఒలింపిక్స్ విజేతలకు ప్రధాని ఫోన్ కాల్
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్లో భారత్కు పతకాల పంట పండుతోంది. ఈవెంట్లో దేశానికి తొలి స్వర్ణం సాధించిన షూటర్ అవని లేఖారా, రజతం సాధించిన డిస్కస్ త్రోయర్ యోగేశ్ కతునియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. మోదీ లేఖారాతో మాట్లాడుతూ.. ఇది చాలా గర్వించదగ్గ విషయం అని ఆమెను అభినందించారు. ప్రధాని మాటల అనంతరం అవని.. దేశ ప్రజల నుంచి తనకు లభించిన మద్దతు పట్ల సంతోషం వ్యక్తం చేసింది. లేఖారా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్1 ఈవెంట్లో మొత్తం 249.6 స్కోరుతో ప్రపంచ రికార్డును సమం చేసింది. ఎఫ్56 విభాగంలో రజత పతకం సాధించిన కతునియాను అభినందిస్తూ, ప్రధానీ మోదీ ట్వీట్ చేశారు. అందులో.. యోగేశ్ కతునియాది అత్యుత్తమ ప్రదర్శన. అతను మన దేశానికి రజత పతకం తెచ్చినందుకు సంతోషిస్తున్నాను. అతని విజయం వర్ధమాన అథ్లెట్లను ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం ప్రధాని కాల్ చేసి.. యోగేశ్ విజయానికి భరోసా ఇవ్వడంలో అతని తల్లి చేసిన కృషిని ప్రశంసించారు. 40 ఏళ్లలో రెండుసార్లు స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝజారియా కూడా ఎఫ్ 46 విభాగంలో సోమవారం రజత పతకాన్ని సాధించాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఝజారియాను ప్రధాని అభినందించారు. మోదీ ట్వీట్ చేస్తూ.. అద్భుతమైన ప్రదర్శన! మా అత్యంత అనుభవజ్ఞులైన అథ్లెట్లలో ఒకరు రజత పతకం సాధించారు. మీరు సాధించిన పతకాలతో దేశం గర్వపడుతుందన్నారు. చదవండి: Tokyo Paralympics 2021: పారా ఒలింపిక్స్లో భారత్కు పతకాల పంట.. -
పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతల ఆగడాలు
-
వైరల్: స్వేరోస్ పేరుతో ఎమ్మెల్యే గాదరి కిషోర్కి బెదిరింపులు
-
మరొకరితో వివాహేతర సంబంధం.. 25 నిమిషాలు ఫోన్లో మాట్లాడి..
సాక్షి, మునగాల(నల్లగొండ): ఉరేసుకుని వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని ముకుందాపురంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఓర్సు వెంకన్న భార్య సరిత(32) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. పొలానికి వెళ్లిన భర్త తిరిగి వచ్చే సరికి మృతిచెందింది. సరిత అఘాయిత్యానికి ముందుకు 25 నిమిషాల పాటు మరొకరితో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. ఆమె ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఫోన్ మాట్లాడుతూ లోతైన బావిలో.. కేకలు వేసినా ఫలితం లేదు
పలమనేరు: ఫోన్ మాట్లాడుతూ.. పరాకుగా కాలుజారి 60 అడుగుల లోతున్న పాడుబడ్డ బావిలో పడిపోయాడు. ఈత రావడంతో కొద్దిసేపు ఈది చెట్ల వేర్లను పట్టుకుని నిలదొక్కుకున్నాడు. రక్షించమని కేకలు వేశాడు. నిర్మానుష్యంగా ఉన్న అటువైపు ఎవరూ రాకపోవడంతో ప్రయోజనం లేకపోయింది. దాదాపు 17 గంటల తర్వాత అతడి కేకలు పశువులు మేపుకొనే వ్యక్తికి వినిపించాయి. దీంతో అతడి ప్రాణాలు దక్కాయి. మరో 3 గంటలకు అతడిని పైకి తీశారు. మొత్తం 20 గంటలపాటు మృత్యుపోరాటం చేశాడతడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. పలమనేరుకు చెందిన రియల్ ఎస్టేట్ దళారి చంద్రశేఖర్ గురువారం మధ్యాహ్నం పట్టణానికి సమీపంలోని ఓ దాబాలో భోజనం చేసి ఫోన్ మాట్లాడుతుండగా, దాబా వెనుక ఉన్న మెట్లు లేని బావిలో కాలుజారి పడ్డారు. 60 అడుగుల లోతైన ఆ బావిలో 12 అడుగుల నీరుంది. ఈదుకుంటూ కొంతసేపటి తర్వాత చెట్ల వేర్లను పట్టుకుని నీటిపైకి చేరుకున్నాడు. ఎవరైనా కాపాడాలంటూ గట్టిగా అరిచాడు. అటువైపు ఎవరూ రాకపోవడంతో అతని గోడు ఎవరికీ తెలియలేదు. గురువారం రాత్రంతా బావిలోనే గడిపాడు. శుక్రవారం ఉదయం పశువులు మేపడానికి జీవన్ అనే యువకుడు వెళ్లాడు. బావిలోంచి అరుపులు రావడంతో వెళ్లి చూసిన జీవన్కుమార్కు చంద్రశేఖర్ కనిపించాడు. అగ్ని మాపక సిబ్బంది తాడు సాయంతో చంద్రశేఖర్ను బావిలోంచి బయటకు లాగారు. తాను ప్రాణాలతో బయటపడాతానని అనుకోలేదన్న చంద్రశేఖర్.. తనను కాపాడిన జీవన్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఫోన్ మాట్లాడుతూ.. రెండు డోసులు?
సాక్షి, అబ్దుల్లాపూర్మెట్: పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లో ఓ యువతికి నర్సు ఫోన్లో మాట్లాడుతూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట్లూర్లోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన లక్ష్మీ ప్రసన్న (21) ఈ నెల 17న పెద్దఅంబర్పేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్కు టీకా తీసుకునేందుకు వెళ్లింది. ఆమెకు వ్యాక్సిన్ వేస్తుండగానే నర్సుకు ఫోన్ రావడంతో ఆమె ఫోన్లో మాట్లాడుతూ లక్ష్మీప్రసన్నను అక్కడే కూర్చోమని చెప్పింది. ఫోన్ మాట్లాడిన అనంతరం తిరిగొచ్చిన నర్సు మరోసారి వ్యాక్సిన్ ఇచ్చింది. ఈ విషయాన్ని లక్ష్మీప్రసన్న అక్కడున్న వారికి తెలుపడంతో కొద్దిసేపు గందరగోళం చోటుచేసుకుంది. అనంతరం ఆమెను వైద్య సిబ్బంది పరిశీలనలో ఉంచి వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యాక్సిన్ వేస్తున్న సమయంలోనే నర్సుకు ఫోన్ వచ్చిందని, ఫోన్ మాట్లాడిన అనంతరం రెండో డోసు వేసిందని, ఆందోళన చేయడంతోనే తనను ఏరియా ఆస్పత్రికి తరలించారని బాధితురాలు ఆరోపించారు. కాగా, లక్ష్మీ ప్రసన్నకు రెండు డోసులు వేశామన్నది అవాస్తవమని, యువతి ఆందోళన చేయడం వల్లనే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి పరిశీలన కోసం పంపించామని వైద్యాధికారులు అంటున్నారు. -
సర్పంచూ.. 22న మీ ఊరొస్తున్నా : ఫోన్లో సీఎం కేసీఆర్
తుర్కపల్లి: సీఎం కేసీఆర్ తాను హామీ ఇచ్చిన మేరకు ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి వెళ్తున్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ గ్రామ సర్పంచ్ పోగుల అంజయ్యకు శుక్రవారం సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనం, గ్రామసభ ఏర్పాటు కోసం స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, సర్పంచ్ అంజయ్య మధ్య సంభాషణ సాగిందిలా.. సీఎం కేసీఆర్: హలో సర్పంచ్: సార్ నమస్తే సార్ సీఎం: నమస్తే అంజయ్య.. బాగున్నవా? సర్పంచ్: బాగున్న సార్.. బాగున్న సార్ సీఎం: అంజయ్యా.. ఇప్పుడేందంటే 22న వస్తున్న మీ ఊరికి. సర్పంచ్: 22 తారీఖా సార్. సీఎం: ఎందుకంటే ఈ మధ్య నాకు కరోనా వచ్చింది. దేశమంతా కరోనా వచ్చే. సూద్దమంటే కూడ రాలేకపోయిన. అప్పుడు నేను మాటిచ్చిన కాబట్టి 22న వచ్చి, ప్రాజెక్ట్ టేకాఫ్ చేద్దాం ఇగ. సర్పంచ్: ఓకే సార్. థాంక్యూ సార్. సీఎం: నువ్వు రెండు జాగలు జూడాలే. ఊరందరికీ భోజనం నేనే పెట్టాలే. ఎవరు పెట్టే అవసరం ఉండదు. ఎమ్మెల్యే గారికి కూడ చెప్పిన. నేనే పంపిస్తా. టీమ్ హైదరాబాద్ నుంచి వస్తారు. మొత్తం మీ ఊరి జనాభా ఎంతయ్యా? సర్పంచ్: 2,600 సార్. సీఎం: మూడు వేల మందికి వండితే సరిపోతదిగా మంచిగ? సర్పంచ్: మూడు వేలకు సరిపోతది సార్. సీఎం: నా వెంబడే వస్తది జిల్లా యంత్రాంగమంతా.. సర్పంచ్: అయితే ఎక్కువ గావలే సార్.. సీఎం: సరిపోతది.. నా వెంబడి 200 మంది వస్తే.. ఇంకో 200 మందికి ఎక్స్ట్రా అనుకుందాం. సర్పంచ్: సరిపోతది సార్. సీఎం: పోలీసోళ్లు, వాళ్లు, వీళ్లు ఉంటరు చూద్దాంలే. దానికి నువ్వెందుకు బాధ పడతవుగని. నేను జేపిస్తలే, టీమ్ వచ్చి సపరేట్ చేస్తరులే నువ్వేం గాబరా గావాల్సిన అవసరం ఉండది, కాకపోతే రెండు జాగాలు చూడాలే నువ్వు. మీ కలెక్టర్ కూడ వస్తది. సర్పంచ్: ఇప్పుడే వస్తదా సార్? సీఎం: ఆ.. కలెక్టర్ ఇప్పుడొస్తది. నీకు చెప్పే వస్తది, నీ పేరు కూడ చెప్పిన.. మధ్యాహ్నం వరకు వస్తదేమో. మొత్తం టీమ్, టీమ్ వస్తరిగ. మొత్తం రెండు జాగలు, ఒకటి ఊరి మొత్తం కులం, మతం, జాతి లేకుండా అందరికీ గలిసి సామూహిక భోజనం. ఒక్కతాననే తిందాం. నేను పదకొండున్నర, 12 మధ్యన చేరుకుంట. అందరితోపాటు కలిసి నేనుగూడ తింట. మందిల్నే కూర్చుని తింట. మీ మంత్రి గారొస్తరు. లోకమంత వస్తరు. దాని తర్వాత ఇంకో జాగల మీటింగ్ సర్పంచ్: సార్.. ఓకే సార్ సీఎం: దీనికి కూడ రెయిన్ ఫ్రూప్ టెంట్ ఏర్పాటు చేయాలే.. వానొచ్చినా ఇబ్బంది లేకుంట.. కలెక్టర్కు చెప్పిన. వాళ్లు చూసుకుంటరు. ఊరంత కూర్చొని తినడానికి. ఊరంత గూసోని మళ్లీ సభ జరుపుకోవడానికి రెండు జాగలు మంచివి నీట్గా ఉండేవి చూడాలె. అర్థమైందిగదా.. సర్పంచ్: ఊరు చిన్నది సార్. గ్రామ పంచాయతీ అంటే మరీ మధ్యన అయితది, అంతమంది కూర్చోవడానికి వీలు కాకపోవచ్చు సార్. మన రామాలయం అప్పుడు మీరు కారు ఆపిండ్రు చూడు సార్ టర్నింగ్ల, కొండాపూర్ రోడ్ల, అక్కడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంటడు. అక్కడ అయనది ఓ ముప్పై ఎకరాలుంటది. హాస్టల్ దగ్గర.. సీఎం: అక్కడనే పెట్టియ్యి. అదే జాగల పెట్టు. సర్పంచ్: అక్కన్నే పెడ్తసార్. మీరొచ్చే తొవ్వలనే.. మీరు రావడానికి ఈజీ ఉంటది సార్. ట్రాఫిక్ ఇబ్బంది ఉండది. సీఎం: నాది బస్సు వస్తది. అండ్లనే బాత్రూం గిట్ల అన్ని ఉంటయి. నేను ఎవరింటికి పోవాల్సిన అవసరం ఉండది. బస్సులకే పోత. సర్పంచ్: మా ఇంటికి రావాలే సార్, ఓ సారి.. సీఎం: మీ ఇల్లు ఎక్కడుంది? సర్పంచ్: మాది ఊరి లోపలుంటది సార్. చిన్నది పెంకల ఇల్లు సార్. సీఎం: ఆ.. ఏముంది మీ ఇంటికి వస్తా. సర్పంచ్: మా ఇంటికి వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి పోవాలే సార్. సీఎం: నో ప్రాబ్లం. ముందో, తరువాతనో పోచేలా ప్లాన్ చేసుకుందాం. సర్పంచ్: ఒకే సార్, సరే సార్. సీఎం: దీంట్ల చిల్లర రాజకీయాలు, పార్టీలుండవు. సర్పంచ్: నా దగ్గర అట్లాంటివి లేవు సార్. సీఎం: నీదిగాదు నేను చెప్పేది వేరే పార్టీలోళ్లు ఉంటే గూడ ఓపికతో కలుపుకొని పోవాలే. ప్రతి ఇంటిని బాగు చేయాలనే చూస్తున్నం. వీడు, వాడు అనేదేం ఉండదు మనకు, నువ్వు మంచిగ చేస్తే, ప్రాజెక్ట్ మంచిగ ఇంప్లిమెంట్ జేస్తే నీకు మంచి ఫలితాలు ఉంటాయి. సర్పంచ్: మీ దయ, బ్లెస్సింగ్స్ సార్. సీఎం: బాగ చెయ్యి ఊరును, నీకు మంచిగుంటది. సర్పంచ్: సరే సార్ సీఎం: అన్నం తినే జాగ, మీటింగ్ జాగ వేరే ఉండాలి. అర్థమైంది గద. సర్పంచ్: అర్థమైంది సార్. సీఎం: మీటింగ్ అయ్యే లోపున అన్నం తిని మీ ఇంటికి వస్తా, పబ్లిక్ తిని మీటింగ్ వచ్చే వరకల్ల మీ ఇంటికి పోయి వద్దాం. సర్పంచ్: మంచిది సార్. -
ఫోన్కాల్ కలకలం: ‘నువ్వేమైనా కేసీఆర్వా.. లేక ఎర్రబెల్లివా?’
హన్మకొండ అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సోదరి చాడ సరిత వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో మొరం తరలింపు విషయం వివాదంగా మారింది. అప్పట్లో స్వాధీనం చేసుకున్న ఇటాచీ సహా ఇతర వాహనాలను తక్కువ జరిమానాతో వదిలేయాలని అక్కడి తహసీల్దార్ విజయలక్ష్మికి ఫోన్లో హుకుం జారీ చేశారు సరిత. అయినా తహసీల్దార్ వినకపోవడంతో గట్టిగా బెదిరించారు. ఇటీవల జడ్పీటీసీ, తహసీల్దార్ మధ్య సాగిన ఫోన్ సంభాషణ బుధవారం సోషల్ మీడి యాలో వైరల్గా మారింది. తాను చెప్పినా.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పినా ఒక్కటిగా భావించాలని, ఎమ్మెల్సీ మాట వింటారా, ఎంపీపీ మాట వింటారా మొదట తేల్చుకోవాలని జడ్పీటీసీ సరిత చెప్పారు. ‘రూ.25 వేలు కట్టించుకుని మిషన్ రిలీజ్ చేయండి.. అక్కడే పెట్టుకుంటే తుప్పు పట్టి పోవాల్నా.. అవసరమైతే ఎమ్మార్వో ఆఫీసు ఎదుట కూర్చుంటా’అని సరిత హెచ్చరించారు. అయితే.. తాము మొదటి నుంచీ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తున్నామని, అయినా కలెక్టర్ చెప్పినట్లు చేస్తానని తహసీల్దార్ చెప్పడంతో.. జడ్పీటీసీ జోక్యం చేసుకొని ‘మనవాడే కదా అని తీసుకొస్తే రూ.లక్ష కట్టమంటే ఎలా? రూ.25 వేలు కట్టించుకొని రిలీజ్ చేయాలని హుకుం జారీ చేశారు. అసలు ఎంపీపీ ఎవరు? ఏమన్నా.. ఎర్రబెల్లి దయాకర్రావా.. లేకుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్రావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ప్రతీదిఅన్నయ్యకు చెప్పి చేస్తా.. ఇది మా అన్నయ్య మాట. పల్లా మాట వింటారా... ఎంపీపీ మాట వింటారా మీ ఇష్టం అని’సరిత చెప్పారు. తర్వాత ఏం జరిగిందో కానీ వేలేరు తహసీల్దార్ విజయలక్ష్మిని కలెక్టరేట్కు బదిలీ చేయడం కొసమెరుపు. చదవండి: కఠిన కర్ఫ్యూ.. తెలంగాణలో భారీగా లాక్డౌన్ సడలింపులు -
జైలుకెళ్లడం కోసం ప్రధాని మోదీకి బెదిరింపు కాల్ చేశాడట..!
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని చంపుతానంటూ బెదిరింపు ఫోన్కాల్ చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. సల్మాన్ అనే 22 ఏళ్ల యువకుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చిన అతను మళ్లీ జైలుకు వెళ్లాలని భావించాడు. అయితే జైలుకు వెళ్లడం కోసం ఏకంగా ప్రధాని మోదీని చంపేస్తా అంటూ ఢిల్లీ పోలీసులకు బెదిరింపు కాల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నెంబర్ను ట్రేస్ చేసి సల్మాన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా విచారణలో తనకు బెయిల్పై బయట ఉండడం ఇష్టం లేదని.. ఎలాగైనా జైలుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ పని చేశానని సల్మాన్ వివరించాడు. అయితే మోదీకి సంబంధించి బెదిరింపు కాల్ కావడంతో ఇంటలిజెంట్ విభాగం మరోసారి అతన్ని విచారించనుంది. కాగా సల్మాన్ ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. చదవండి: ప్రియుడి మోసం.. ఇంటి ముందు యువతి రచ్చ -
చేతులు ఎత్తేసిన తెలంగాణ మంత్రులు
బోథ్: రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలని, డిమాండ్ లేదనే మొక్కజొన్న పంట వేయవద్దని తెలిపామని, కానీ ప్రత్యామ్నాయ పంట కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పలేదని, కొనడం కష్టమేనని, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రైతులకు స్పష్టం చేశారు. జొన్నపంటను కొనుగోలు చేయాలని మంత్రులకు ఫోన్ చేసిన రైతులతో అన్న మాటలివి. పంట కొంటామనలేదు.. టీ– శాట్ ఛానల్లో సోమవారం సాయంత్రం సేంద్రియ వ్యవసాయంపై నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఫోన్ చేసిన రైతులకు పలు సూచనలు చేశారు. బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన భీమ గోవింద రాజు టి శాట్ ఛానల్కి ఫోన్ చేయగా.. మంత్రి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట వేయవద్దని చెప్పిందని.. ప్రత్యామ్నాయంగా జొన్నపంట వేశామని, ప్రభుత్వం కొనాలని మంత్రికి విన్నవించారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. రైతులు ప్రత్యామ్నాయ పంటను వేయాలని మాత్రమే చెప్పామని అన్నారు. ఆ పంటను ప్రభుత్వం కొంటుందని ఎక్కడా చెప్పలేదని మంత్రి తెలిపారు. మా చేతిలో ఏమీ లేదు: మంత్రి ఐకేరెడ్డి మండలంలోని ధన్నూర్ గ్రామానికి చెందిన పసుల చంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మంగళవారం జొన్న పంట కొనుగోలు చేయాలని ఫోన్లో విన్నవించారు. మంత్రి స్పందిస్తూ.. జొన్న పంటను కొనుగోలు చేయడం మా చేతుల్లో లేదని, బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసిందని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను మాత్రమే వేయాలని రైతుకు సూచించారు. తమ జిల్లాలో 50వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారని, ప్రభుత్వం కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. జొన్న పంట వేయమని ప్రభుత్వం చెప్పలేదని తెలిపారు. మంత్రులు పంట కొనుగోలుపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రభుత్వం జొన్న పంటను కొనుగోలు చేస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
సీఎం కేసీఆర్కు ప్రధాని మోదీ ఫోన్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కాగా సమీక్షా సమావేశానంతరం సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ కాల్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేసిన సూచనలను కేంద్రమంత్రి హర్షవర్ధన్ తనకు వివరించారని ప్రధాని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలా బాగున్నాయి. వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం..మీ సూచనలకు అభినందనలు’ ’ అంటూ ప్రధాని సీఎం కేసీఆర్ ను అభినందించారు. రాష్ట్రానికి మరింతగా ఆక్సీజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానికి విజ్జప్తి చేశారు. సీఎం చేసిన విజ్జప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. అందుకు సంబంధించి సత్వరమే చర్యలు చేపడతామని సీఎం కు హామీ ఇచ్చారు. చదవండి: కోవిడ్-19పై ముగిసిన కేసీఆర్ సమీక్షా సమావేశం -
పెళ్లి చేసుకుంటానంటూ పరిచయం.. చివరికి
రాజేంద్రనగర్: వివాహ పరిచయ వేదికలో పేరు నమోదు చేసుకున్న ఓ యువతికి.. రష్యా నుంచి ఓ యువకుడు ఫోన్ చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ పరిచయం చేసుకున్నాడు. అనంతరం గిఫ్ట్ పంపిస్తున్నానంటూ రెండు లక్షల రూపాయలను బ్యాంక్ ఖాతాలో వేయించుకోని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో ఆ యువతి రాజేంద్రనగర్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. కిస్మత్పూర్ ప్రాంతానికి చెందిన 24 సంవత్సరాల యువతి ప్రైవేట్ ఉద్యోగి. వివాహం చేసుకునేందుకు వివాహ పరిచయ వేదికలో తన పేరు, ఫోన్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసుకుంది. అయితే తాను రష్యాలో ఉంటానని చెబుతూ గత వారం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన వివరాలు తెలుపుతూ మాటలు కలిపాడు. ఫోన్లో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడి వివాహం చేసుకునేందుకు అంగీకరించారు. ఆ యువకుడు గిఫ్ట్ పంపిస్తున్నానంటూ తెలిపి ఇంటి చిరునామా, తదితర వివరాలు తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి మాట్లాడుతున్నామంటూ గిఫ్ట్ ప్యాక్ వచ్చిందని, పన్ను రూపేనా రెండు లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పాడు. దీంతో ఆ యువతి రష్యా యువకుడికి ఫోన్ చేసి తెలపడంతో ఖరీదైన గిఫ్ట్ అని పన్ను కట్టి తీసుకోవాలంటూ సూచించాడు. అంత డబ్బు తన వద్ద లేవని తెలపడంతో మూడు దఫాలుగా కట్టమని సూచించాడు. సదరు యువతి ఆరు రోజుల క్రితం మూడు దఫాలుగా రెండు లక్షల రూపాయలను శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫోన్ చేస్తున్నామని తెలిపిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. మూడు రోజుల అనంతరం గిఫ్ట్ వస్తుందని తెలిపారు. మూడు రోజులుగా డబ్బు తీసుకున్న వ్యక్తి, వివాహం చేసుకుంటానని తెలిపిన ఇద్దరు వ్యక్తులు సెల్ఫోన్లు స్విచాఫ్ రావడంతో లబోదిబోమంటూ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో కేసులో ఇలా.. వివాహ పరిచయ ద్వారా యువకుడి ఫోన్ నంబర్ తీసుకుని ఓ యువతి 48 వేల రూపాయలను బ్యాంక్ అకౌంట్లో వేయించుకోని స్విచ్ఆఫ్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సులేమాన్నగర్ ప్రాంతానికి చెందిన యువకుడు తన పెళ్లి కోసం వివాహ పరిచయ వేదికలో పేరు నమోదు చేసుకున్నాడు. అతడి ఫోన్ నంబర్కు ఖతార్ దేశానికి చెందిన యువతి ఫోన్ చేసి తాను వివాహం చేసుకుంటానంటూ తన వివరాలతో పాటు అతడి వివరాలు సేకరించింది. గత వారం ఫోన్లో అన్ని వివరాలు మాట్లాడుకున్న అనంతరం ఆ యువతి హైదరాబాద్ వస్తున్నానని తెలిపింది. సోమవారం ఉదయం తాను శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగానని తన వద్ద ఉన్న లగేజీ, ఇతర విలువైన సామాన్లకు రూ.48 వేల ఇండియన్ కరెన్సీ కట్టమంటున్నారని తెలిపింది. తన వద్ద ఖతార్ కరెన్సీ ఉందని ఈ నగదు చెల్లదంటున్నారని తెలపడంతో.. సదరు యువకుడు గూగుల్ పే ద్వారా రూ.48 వేలు పంపించాడు. ఆ తర్వాత యువతి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన యువకుడు గురువారం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: ప్రేమ పెళ్లికి నిరాకరించారని ఇంటి నుంచి పరార్ ) -
తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి ఎలా ఉంది? కట్టడికి ఏమేం చర్యలు తీసుకుంటున్నారు? వ్యాక్సిన్ పంపిణీ, ఆక్సిజన్ కొరత వంటి తదితర విషయాలు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా పరిస్థితులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ వైరస్ విస్తరణ, నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై ఇద్దరూ చర్చించారు. కోవిడ్ వైరస్ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, వైరస్ సోకిన వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలపై సీఎం జగన్ ప్రధానికి వివరించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచి, కోవిడ్ బాధితులకు వైద్యం అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానిక సీఎం జగన్ వివరించారు. సీఎం కేసీఆర్కు.. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో కూడా ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి కూడా ఆరా తీసినట్లు సమాచారం. అనంతరం ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రుల్రతో కూడా ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై వివరాలు తెలుసుకుంటున్నారు. చదవండి: ఒకే రోజు లాక్డౌన్ ప్రకటించిన రెండు రాష్ట్రాలు చదవండి: కరోనాపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు -
ప్రేమ విఫలం: లవర్తో సెల్ఫోన్లో మాట్లాడుతూనే..
సిద్దిపేటకమాన్: ప్రేమ విఫలమై యవకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం వెలుగు చూసింది. సిద్దిపేట వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణం హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న మనోజ్కుమార్ (33) పట్టణంలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. కొంత కాలంగా మనోజ్కుమార్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయంపై గతంలో పెద్దలు ఇరువురికి రాజీ కుదుర్చారు. ఈ క్రమంలో మనోజ్కుమార్ బుధవారం రాత్రి అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యాడు. సర్జికల్ బ్లేడ్తో చేతి మణికట్టు, ఆపై గొంతు భాగంలో కొసుకున్నాడు. వెంటనే అమ్మాయి మనోజ్కుమార్ కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపింది. దీంతో మనోజ్ కుటుంబీకులు హుటాహుటిన అతడి గదికి వెళ్లి చూడగా రక్తం మడుగులో పడి ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మనోజ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హలో వెంకటయ్య.. నేను హరీశ్ను!
మంత్రి హరీశ్రావు: ‘హలో.. వెంకటయ్య నేను హరీశ్ను మాట్లాడుతున్నాను.. వెంకటయ్య: సార్.. సార్.. చెప్పండి హరీశ్రావు: అంతా బాగున్నారా? నీళ్లు మంచిగా ఉన్నాయా? బోరు పోస్తుందా.. ? వెంకటయ్య: సార్ బాగున్నాం.. నీళ్లకు ఢోకాలేదు.. హరీశ్రావు: ఆయిల్ పామ్ గురించి మొన్న మీటింగ్లో విన్నావు కదా! ఎన్ని ఎకరాలు సాగు చేస్తావు.. వెంకటయ్య: రెండు ఎకరాలు వేద్దామని అనుకుంటున్న సార్ హరీశ్రావు: రెండు ఎకరాలు వేస్తే ఏం లాభం.. మూడు ఎకరాలు సాగు చేయి.. వెంకటయ్య: మీరు చెప్పినంక మాకేం భయం సార్.. మూడు కాదు.. నాలుగు ఎకరాల్లో పామ్ ఆయిల్ వేస్తా సార్.. హరీశ్రావు: ఓకే వెంకటయ్య.. నీతోపాటు పక్క రైతులను కూడా సాగుచేయమని చెప్పు. మంచి లాభాలు వచ్చే సాగు. ఎకరానికి ప్రభుత్వం రూ.30 వేలు ప్రోత్సాహకాలు కూడా అందజేస్తుంది. ఫ్యాక్టరీని కూడా మన సిద్దిపేటలోనే ఏర్పాటు చేస్తున్నం. మంచి లాభం వచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.. ఆర్థిక మంత్రి హరీశ్రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన రైతు వెంకటయ్యతో బుధవారం ఫోన్లో చేసిన సంభాషణ ఇది. సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మొత్తం 55 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 28వ తేదీన సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతుల ఉత్సాహాన్ని చూసిన మంత్రి హరీశ్రావు బుధవారం హైదరాబాద్ నుంచి 300 మంది రైతులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి రైతులు ఆయిల్ పామ్ వేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఆయిల్ పామ్ దిగుబడి, లాభాలు, జిల్లాలో ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు వంటి విషయాలను మంత్రి రైతులకు వివరించారు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి జిల్లా రైతులకు దశల వారీగా ఆయిల్ పామ్ తోటలు సాగుచేసిన రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన సిద్దిపేట నియోజకవర్గం నుంచి 150 మంది రైతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, దమ్మపేటలకు పంపిస్తున్నామని, రైతులు అక్కడకు వెళ్లి ఆయిల్ పాం సాగులో మెలకువలు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ సురేందర్రెడ్డి, సిద్దిపేట జిల్లా వ్యవసాయాధికారి శ్రావణ్, హార్టికల్చర్ అధికారి రామలక్ష్మి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇప్పుడు మాట్లాడొచ్చా?
ట్రంక్ కాల్ నాటి ‘ఎదురు చూసే’ కాలం మళ్లీ వచ్చేసింది! మీ కాంటాక్ట్ లిస్ట్ లోంచి ఏదో ఒక నెంబర్ కి కాల్ చేసి చూడండి. ‘వేరొక కాల్ లో బిజీ గా ఉన్నారు’ అని వినిపిస్తుంది. నిజమే. ఒక మనిషి ఇంకో మనిషికి నేరుగా అయినా కనెక్ట్ ఆవుతారేమో, ఫోన్ లైన్లో మాత్రం వెంటనే కాంటాక్ట్లోకి రావడం అన్నది ఏ యుగానికో సంభవించే ఒక భూగోళ అద్భుతం అన్నట్లుగా అయింది! మనకే ఇలా ఉంటే మరి దేశాధినేతలు ఫోన్లో ఒకరికొకరు ఎలా దొరుకుతారు? ఫోన్ చేసి, ‘ఎవరు మాట్లాడేది?‘ అని అడిగే మానవాళి మధ్యే కదా వాళ్లూ జీవిస్తున్నది. వాళ్లకూ రాంగ్ నెంబర్ నుంచి కాల్ వస్తుందా? జిన్పింగ్ జర్మనీ చాన్స్లర్తో ఇప్పటికప్పుడు మాట్లాడాలంటే ఎలా? ఇద్దరు దేశాధినేతలు ఫోన్లో మాట్లాడుకోవాలంటే వాళ్లకన్నా ముందు ఎంతమంది ఆ ఇద్దరికి లైన్ కలపడం కోసం ఫోన్లు చేసుకోవాలి? కొద్ది రోజులుగా పుతిన్ ప్రయత్నిస్తున్నా బైడెన్ ఫోన్ ఎత్తడం లేదని వదంతి!! అసలు దేశాధ్యక్షులు ఒకరికొకరు ఎలా ఫోన్ చేసుకుంటారు? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓసారి చూద్దాం. జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు ‘‘విదేశాంగ శాఖలు ఒక్కోసారి ఎంత గుడ్డిగా ఉంటాయంటే.. మనుషుల్లానే అవీను..’’ అని న్యూయార్క్ టైమ్స్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై ఇంకా ప్రమాణ స్వీకారం చేయని కొత్తల్లో ఒక వార్త రాసింది. న్యూయార్క్ సిటీలోని ‘ట్రంప్ టవర్’కి ఫోన్ చేసేవారట విదేశాంగ కార్యదర్శుల సహాయకులు.. ట్రంప్తో కనెక్ట్ అవడం కోసం! బిజినెస్మన్గా ఉన్నప్పుడు ట్రంప్ గానీ, ప్రెసిడెంట్ అయ్యాక మిస్టర్ ప్రెసిడెంటే కదా. ఆయన లైన్ కలవడానికి ముందు, ఆయనకు లైన్ కలపడానికి ముందు రెండు వైపులా పెద్ద టీమ్ పనిచేయాల్సి ఉంటుంది. ఎవరు ఫోన్ చేయబోతున్నదీ ముందే తెలియాలి. ఫోన్ చేసి ఏం మాట్లాడబోతున్నదీ ముందే తెలియజెప్పాలి. అమెరికా అధ్యక్షుడితో కనుక తైవాన్ ప్రెసిడెంట్ ఫోన్లో మాట్లాడాలని అనుకుంటే, తైవాన్కీ, మిగతా దేశాలకు ఉన్న సంబంధాలు ఏమిటో కూడా అమెరికా అధ్యక్షుడికి తెలిసి ఉండాలి. ఇన్ని లెక్కలు ఉంటాయి! అయితే ట్రంప్ వేరు కదా, అధ్యక్షుడి సీట్లో కూర్చున్నాక అకస్మాత్తుగా ఓరోజు ఆయన.. ‘‘ఇప్పుడే త్సాయ్ ఇంగ్–వెన్తో ఫోన్లో మాట్లాడి వస్తున్నా’’ అన్నారు. ఇంగ్–వెన్ తైవాన్ అధ్యక్షురాలు. డొనాల్డ్ ట్రంప్,అమెరికామాజీఅధ్యక్షుడు వైట్ హౌస్లోని విదేశాంగ అధికారులు నివ్వెరపోయారు. నలభైఏళ్లుగా అమెరికా, తైవాన్ మధ్య సంబంధాలు లేవు. చైనాకు తైవాన్ అంటే పడదు కనుక అమెరికాకూ పడలేదు. ఆ సంగతి తెలియక ట్రంప్ మాట్లాడినట్లున్నారు. లేక, తెలిసే మాట్లాడారేమో! ఒక ప్రెసిడెంట్కి ఇంకో ప్రెసిడెంట్తో కానీ, ప్రధానితో కానీ డైరెక్ట్గా లైన్ కలవడానికి ముందు ఇన్డైరెక్ట్గా అనేకమంది అధికారుల మధ్య లైన్స్ కలవవలసి ఉంటుంది. అయితే చక్కటి స్నేహ సంబంధాలు ఉన్న రెండు దేశాల అధ్యక్షుల మధ్య ఫోన్ కాల్స్కి ఇంత తతంగం ఉండదు.. ‘‘మా ప్రెసిడెంట్ మీ ప్రెసిడెంట్తో మాట్లాడతారట’’ అని డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఫోన్ చేయగానే కాల్కి తక్షణం ఏర్పాట్లు జరిగిపోతాయి. జరిగాక కూడా, లైన్ కలిశాక కూడా.. ‘‘హాయ్ దిస్ ఈజ్ పుతిన్, ఈజ్ ఒబామా ఇన్’’ అనే ఒక ప్రారంభ వాక్యంతో సంభాషణ మొదలవుతుంది. పెద్దగా సంబంధాలు లేని దేశాల మధ్య అధ్యక్షులను ఫోన్లో కలిపే బాధ్యతనైతే రాయబారులు తీసుకుంటారు. ఎవరు, ఎందుకు, ఎంతసేపు మాట్లాడదలచిందీ వివరాలు వెళతాయి. ఇద్దరికీ కుదిరే టైమ్ చూసుకున్నాక లైన్ కలుస్తుంది. సంభాషణలో రాగల ప్రశ్నలకు సమాధానాలు కూడా ముందే సిద్ధమై ఉంటాయి! అంటే.. ఇద్దరు దేశాధ్యక్షులు ఫోన్లో మాట్లాడుకునే సంభాషణ ముందే జరిగిపోతుందన్నమాట! మర్యాదపూర్వకమైన ఫోన్ కాల్ అయితే మర్చిపోకుండా అడగవలసినవి కొన్ని ఉంటాయి. ఉదా: జబ్బున పడి కోలుకుంటున్న ప్రెసిడెంట్ భార్య లేక భర్త ఆరోగ్యం ఎలా ఉందో అడగడం! కాల్కి ముందు వాటిని గుర్తు చేస్తారు కీలక సిబ్బంది. పర్సనల్ టచ్ కోసం! మరీ దేశభద్రతకు సంబంధించిన విషయమైతే.. ‘‘మీరొక్కరే ఉన్నారా’’ అనే మాటతో సంభాషణ మొదలై, అతి సంక్షిప్తంగా ముగిసిపోతుంది. అది కేవలం సమాచారాన్ని చేరవేయడమో, అనివార్యంగా తీసుకున్న ఒక నిర్ణయం గురించి తెలియజేయడమో అయి ఉంటుంది. వెంటనే లైన్ కట్. ప్రపంచాధినేతల మధ్య ఫోన్ కాల్స్ సంభాషణలు కనీసం కొద్దిమందికైనా తెలియకుండా పోవు. సహాయకులు, అనువాదకులు.. వీళ్లను దాటుకుని వాళ్ల మాటలు దాగలేవు. ఫోన్ సంభాషణలు సాధారణంగా ఇంగ్లిష్లోనే సాగుతాయి. మాతృభాషలో మాట్లాడవచ్చు కానీ, దేశానికది చిన్నతనంగా ఉంటుంది. అయినప్పటికీ అపార్థాలు రాకుండా, అపోహలు కలగకుండా ఉండటం కోసం ఇంగ్లిష్కు బదులుగా, అంతకన్నా తమకు బాగా వచ్చిన భాషలోనే అధ్యక్షులు మాట్లాడుతుంటారని వైట్ హౌస్లో లింగ్విస్ట్గా పని చేసిన కెవిన్ హెండ్టెల్ అంటారు. అమెరికా అధ్యక్షుడితో ఫోన్ మాట్లాడ్డమైతే లోపల ఉన్నవాళ్లకు కూడా కనాకష్టమైన సంగతి. అధ్యక్షుడు ఇలా చెయ్యి ముందుకు అని, అలా ఫోన్ అందుకుంటారు కానీ.. అలా అందుకోడానికి ముందు... అవతల ఉన్నది రైట్ పర్సనేనా అనేది చేసుకోడానికి వంద చెకింగ్లు జరిగి ఉంటాయి. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హిల్లరీ క్లింటన్ విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారు. ఓసారి ఆమె ఒబామాకు లైన్ కలపమని అడిగారు. ఆపరేటర్ కలపలేదు. ‘ఐ యామ్ హిల్లరీ క్లింటన్, హానెస్ట్లీ ఐ యామ్ అని చెప్పుకోవలసి వచ్చింది’ అని హిల్లరీ 2010 నాటి ఓ ఈ మెయిల్లో తన సన్నిహితులతో షేర్ చేసుకున్నారు. ఆపరేటర్లు అనుమానించడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. తప్పు పట్టకూడదు కూడా. ఎందుకంటే.. ప్రెసిడెంట్లకు కొన్ని ప్రాంక్ కాల్స్ కూడా వస్తుంటాయి. ఆట పట్టించే కాల్స్. స్పెయిన్ మాజీ ప్రధాని మారియానోకు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటి ఫోన్ కాల్ వచ్చింది! స్పెయిన్ నుంచి వేరుపడాలని చూస్తున్న కేటలోనియా ప్రాంత వేర్పాటు వాద నాయకుడి గొంతుతో ఓ రేడియో ప్రెజెంటర్ సరదాగా చేసిన ఆ కాల్ని నిజం అనుకుని ఆపరేటర్ లైన్ కలిపారు! తర్వాత ఆ ఆపరేటర్ ఉద్యోగం ఉందో పోయిందో తెలీదు. మయామీలోని ఒక యూఎస్ రేడియో స్టేషన్ 2003లో ఒకేసారి ఒక తాజాను, ఒక మాజీని బుట్టలో వేసింది. పుతిన్, రష్యాఅధ్యక్షుడు వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫైడెల్ క్యాస్ట్రోలను కొంతసేపు కాల్ మాట్లాడుకునేలా ‘ఫ్రాంక్’ చేసింది! ఎల్ జోల్ అనే ఆ రేడియో స్టేషన్లో పనిచేసే ప్రెజెంటర్ మొదట క్యాస్ట్రో మాట్లాడున్నట్లుగా గొంతు మార్చి ఛావెజ్కి ఫోన్ చేశాడు. తర్వాత క్యాస్ట్రోకి ఫోన్ చేసి ఛావెజ్లా మాట్లాడాడు. ఆ సంగతిని క్యాస్ట్రో కనిపెట్టడంతో వివాదం అయింది. ఇలాంటివే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడొక వదంతి వినిపిస్తోంది. పుతిన్ ఫోన్ చేస్తుంటే బైడెన్ లిఫ్ట్ చెయ్యడం లేదని. బహుశా అది మీమ్ కావచ్చు. అయితే కొన్నాళ్లుగా జో బైడెన్ పుతిన్ మీద ఆగ్రహంతో ఉన్నారు. పుతిన్కి ఫోన్ చేసి తిట్టానని కూడా ఈమధ్యే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. ఏమైనా ఈ రెండు అగ్రరాజ్యాల అధినేతల సంభాషణలు ఫోన్ కాల్ స్థాయికి మించినవి. వీళ్లకో హాట్ లైన్ ఉంది. దశాబ్దాలుగా ఉంది. దాని పేరు ‘రెడ్ టెలిఫోన్’. అయితే అది టెలిఫోన్ కాదు. ఒక ప్రత్యేకమైన, అత్యంత గోప్యమైన సమాచార వాహక వ్యవస్థ. ఆ హాట్ లైన్ ద్వారా టెక్స్ట్ మెసేజ్లు, రేఖాచిత్రాల రూపంలో మాత్రమే సంభాషణ జరిపేందుకు వీలవుతుంది. 1962లో ఈ రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు తలెత్తినప్పుడు ఇలాంటి హాట్ లైన్ అవసరం అయింది. ఇప్పుడు స్మార్ట్ఫోన్లు వచ్చాక కూడా ల్యాండ్ లైన్ల మీదే చాలావరకు దేశాధ్యక్షుల అధికారిక సంభాషణలు జరుగుతున్నాయి. -
హలో సీఎం సార్.. నేను హరీశ్ను
సాక్షి, గజ్వేల్: ‘హలో.. సీఎం సార్.. నేను హరీశ్ను మాట్లాడుతున్నా.. సిద్దిపేట జిల్లా కొడకండ్లలో కాళేశ్వరం కాల్వ వద్ద ఉన్న కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు వదలాలని రైతులు కోరుతుండ్రు. ఎండలు ముదరడం వల్ల ఈ వాగు పరీవాహక ప్రాంతాల్లో ఉన్న బోరుబావుల్లో నీటిమట్టం తగ్గి 11 వేల ఎకరాల్లో వరిపంట పొట్టకొచ్చే దశలో ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది. మీరు అనుమతిస్తే కొడకండ్ల కాల్వ నుంచి గోదావరి జలాలు వదిలి కూడవెల్లి వాగును నింపుతాం. రోజుకు 500 క్యూసెక్కుల నీటిని వాగులోకి పంపే అవకాశముంటుంది. దీని ద్వారా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో 36 చెక్డ్యామ్లు నిండే అవకాశంతో పాటు, భూగర్భ జలమట్టం పెరగడం ద్వారా బోరుబావులు పుష్కలంగా నీరు పోసే అవకాశం ఉంటుంది. దీంతో పంటలు దక్కుతాయి..’ఇదీ సీఎం కేసీఆర్కు ఆర్థిక మంత్రి హరీశ్రావు ఆదివారం ఫోన్ ద్వారా చేసిన విజ్ఞప్తి. ఈ వినతిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ‘హరీశ్ గో ఏహెడ్... రైతుల పంటలు కాపాడడమే మన ప్రభుత్వ లక్ష్యం. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేయండి. వెంటనే కాల్వల ద్వారా కూడవెల్లిలోకి నీళ్లు వదలండి.. అంటూ ఆదేశించారు. అలాగే గజ్వేల్ కాల్వ ద్వారా చేబర్తి పెద్ద చెరువును నింపి పైన ఉన్న కూడవెల్లి వాగు మిగతా భాగంలోకి గోదావరి జలాలను తరలించాలని సూచించారు. (చదవండి: ఉద్యోగులకు పీఆర్సీ 30శాతం!) 11 వేల ఎకరాల్లో వరికి ఊపిరి సమస్య చెప్పిందే తడవుగా తమ సమక్షంలోనే సీఎంకు ఫోన్ చేసి అక్కడికక్కడే పరిష్కారానికి మంత్రి హరీశ్ చొరవ చూపడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం గజ్వేల్ మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన మంత్రి హరీశ్కు కూడవెల్లి వాగు పరీవాహక ప్రాంతం రైతులు తమ సమస్య వివరించారు. తక్షణమే స్పందించిన ఆయన కొడకండ్ల వద్ద ఉన్న కాళేశ్వరం కాలువ నుంచి కొడకండ్ల చెక్ డ్యామ్ ద్వారా కూడవెల్లి వాగు నింపే అవకాశముందని తెలుసుకొని, హుటాహుటిన రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఇతర నేతలు, అధికారులతో కలసి అక్కడికి వెళ్లారు. ఫోన్ ద్వారా సమస్యను సీఎంకు వివరించారు. కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో మంగళవారం ఉదయం నీటి విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా జగదేవ్పూర్ మండలంలో 7, గజ్వేల్ మండలంలో 7, తొగుటలో 8, మిరుదొడ్డిలో 10, దుబ్బాకలో 5 చెక్డ్యామ్లు పూర్తిగా నిండనున్నాయి. ఫలితంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని కూడవెల్లి పరీవాహక ప్రాంతంలో కుడి, ఎడమవైపు ఉన్న 11 వేల ఎకరాల్లో వరిపంట దక్కే అవకాశం కలిగింది. ' (చదవండి: నాణ్యమైన బియ్యానికి.. చెల్లిన 'నూకలు') -
బైడెన్కు మోదీ ఫోన్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం తొలిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా బైడెన్కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురు నేతలు పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు లక్ష్యంగా ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని, వాతావరణ మార్పుపై పోరులో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ‘ప్రెసిడెంట్ బైడెన్, నేను న్యాయబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నాం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరతల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాం’ అని మోదీ ట్వీట్ చేశారు. -
ఉత్తరాఖండ్ : 12 మందిని కాపాడిన ఫోన్ కాల్
డెహ్రాడూన్: ధౌలిగంగా నది ఉగ్రరూపం ఉత్తరాఖండ్ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆకస్మికంగా సంభవించిన ఈ విలయంలో 170 మంది వరకు గల్లైంతైనట్లు సమాచారం. ఇంతటి విషాదంలో ఓ ఫోన్ కాల్ 12 మంది ప్రాణాలు కాపాడింది. వివరాలు... మంచు చరియలు విరిగిపడటంతో ఉప్పొంగిన ధౌలీనది ఉగ్ర రూపం దాల్చింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని చమేలి తపోవన్ పవర్ ప్రాజెక్ట్ వర్కర్లు 12 మంది ఓ అండర్గ్రౌండ్ టన్నెల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు ఆ చుట్టుపక్కల ఉన్న వారిని ప్రమాదం గురించి.. బయటకు రావాల్సిందిగా తెలిపారు. ఇది విన్న వర్కర్లు టన్నెల్ నుంచి బయటకు రావాలని ప్రయత్నించారు. కానీ ఈ లోపే వరద నీరు టన్నెల్లోకి వచ్చింది. అంతేకాక వారు బయటకు వచ్చే అవకాశం లేకుండా ప్రవేశ మార్గాన్ని బురద కప్పేసింది. టన్నెల్ నుంచి బయటపడే మార్గం లేకపోవడం.. బయట ఉన్న బురద వల్ల లోపల ఉన్న తమ గురించి అధికారులకు తెలిసే అవకాశం ఉండదని భావించిన ఆ 12 మంది వర్కర్లు జీవితం మీద ఆశ వదిలేసుకున్నారు. అక్కడే సజీవ సమాధి తప్పదని భావించారు. అయితే వారికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయని ఓ వ్యక్తి మొబైల్ నిరూపించింది. అతడి ఫోన్కి సిగ్నల్ అందడంతో వెంటనే కంపెనీకి కాల్ చేసి తమ పరిస్థితిని వివరించాడు. ఈ విషయాన్ని కంపెనీ జీఎం ఐటీబీపీ అధికారులకు చెప్పడంతో వారు టన్నెల్ వద్దకు చేరుకుని బురదను తొలగించి.. వర్కర్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత వీరందరిని ఐటీబీపీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘మేం 300 మీటర్ల లోతైన టన్నెల్లో ఉన్నాం. వరద నీటిలో చిక్కుకున్నాం. ఇక జీవితం మీద ఆశ వదిలేసుకున్నాం. ఈ సమయంలో టన్నెల్లో ఓ చోట వెలుతురు పడటం.. గాలి ఆడటం గమనించాం. ఎలాగోలా అక్కడకు చేరుకున్నాం. ఇంతలో మాలో ఒకరి ఫోన్కి సిగ్నల్ వచ్చింది. అధికారులకు కాల్ చేయడం.. వారు స్పందించి ఐటీబీపీ వారిని పంపిచడంతో బతికి బయటపడ్డాం. ఆ ఒక్క ఫోన్ కాల్ మా 12 మందిని కాపాడింది. మాకు సాయం చేసిన ఐటీబీపీ అధికారులకు జీవితాంతం రుణపడి ఉంటాం’’ అన్నారు. చదవండి: విషాదం: 170 మంది మరణించినట్లేనా? ప్రకృతి విపత్తులతో వణికిపోయిన దైవభూమి -
ఫోన్ చేస్తే చాలు..చర్చలకు సిద్ధం..
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలతో మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రైతు సంఘాలకు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి రైతు సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ఫోన్కాల్ దూరంలోనే ఉందన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వం శనివారం వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ‘రైతుల ఆందోళనలపై ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తుంది. జనవరి 22వ తేదీన రైతులతో జరిగిన చర్చల సందర్భంగా ఏడాదిన్నరపాటు కొత్త సాగు చట్టాల అమలును నిలిపివేస్తామంటూ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఫోన్కాల్ చేస్తే చాలు రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు వ్యవసాయ మంత్రి తోమర్ సిద్ధంగా ఉన్నారు’ అని స్పష్టం చేశారు. ‘పార్లమెంట్ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు పెద్ద పార్టీలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతరాయాలతో చిన్న చిన్న పార్టీలకు ఇబ్బందులు కలుగుతాయి. వాటికి తమ వాణి వినిపించే అవకాశం లేకుండా పోతుంది’అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు పార్లమెంట్ సమావేశాల్లో తాము ప్రస్తావించాలని భావిస్తున్న అంశాలను తెలిపారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, శిరోమణి అకాలీదళ్కు చెందిన బల్వీందర్ సింగ్, శివసేన నేత వినాయక్ రౌత్, టీఎంసీ నేత బంధోపాధ్యాయ్ రైతు ఆందోళనలను ప్రస్తావించారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ అంశాన్ని చర్చించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టీఎంసీ నేత బంధోపాధ్యాయ్ కోరారు. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు దురదృష్టకరమంటూ వివిధ పార్టీల నేతలు పేర్కొన్నారు. ఆ ఘటనలకు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులను బాధ్యులుగా చేయరాదని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలంటూ బీజేడీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రధానిని కోరాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో మహాత్ముని విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రధాని మోదీ ఖండించారు. ఫోన్ కాల్ దూరమే.. రైతుల ఆందోళనలపై ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తోంది. జనవరి 22న రైతులతో జరిగిన చర్చల సందర్భంగా ఏడాదిన్నరపాటు కొత్త సాగు చట్టాల అమలును నిలిపివేస్తామంటూ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఫోన్కాల్ చేస్తే చాలు రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. గాంధీజి వర్ధంతి పురస్కరించుకుని శనివారం ప్రధాని మోదీ రాజ్ఘాట్లోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. ఆయన బోధనలు ఇప్పటికీ కోట్లాదిమందికి స్ఫూర్తినిస్తున్నాయన్నారు. జాతి శ్రేయస్సు కోసం, దేశానికి స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను అర్పించిన ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. -
బంధం మరింత బలోపేతం కావాలి
వాషింగ్టన్: నాటో కూటమిలో కీలకపాత్ర పోషిస్తూ దానిని బలోపేతం చేయాలని, కోవిడ్ మహమ్మారి, పర్యావరణ మార్పులపై కలసికట్టుగా పోరాటం చేయాలని అమెరికా, బ్రిటన్ నిర్ణయించాయి. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విదేశాలతో సంబంధాలపై దృష్టి సారించిన జో బైడెన్ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్కి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రిటన్తో ఉన్న ప్రత్యేక బంధాన్ని మరింత బలోపేతం చేయాలన్న తన ఉద్దేశాన్ని విడమరిచి చెప్పారు. ‘జో బైడెన్తో మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది. రెండు దేశాల మధ్య చిరకాలంగా ఉన్న స్నేహసంబంధాల్ని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించాం. కోవిడ్ మహమ్మారిని జయించి సుస్థిరత ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు కృషి చేస్తాం’’ అని బైడెన్ శనివారం ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉన్న విభేదాల్ని త్వరలోనే పరిష్కరించుకోవడానికి ఇరువురు నేతలు అంగీకరించినట్టుగా వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. ‘‘నాటో కూటమిలో మళ్లీ కీలక పాత్ర పోషించేలా , ఇరు దేశాల మధ్య చాలా కాలంగా రక్షణ రంగంలో ఉన్న బంధాన్ని మరింత పటిష్టం చేసేలా మాత్రమే బైడెన్ దృష్టి సారించారు. అందుకే జాన్సన్తో మాట్లాడినప్పుడు ఇరు దేశాల ప్రత్యేక సంబంధాల గురించి మాత్రమే మాట్లాడారు’’ అని వైట్హౌస్ వర్గాలు చెప్పాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ, పారిస్ ఒప్పందంలో తిరిగి చేరడంపై బైడెన్ను జాన్సన్ అ«భినందించారు. కరోనా ముప్పు తొలగిన తర్వాత ఇరు దేశాల అధినేతలు కలిసి మాట్లాడుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు బ్రిటన్ కార్యాలయం ప్రతినిధులు చెప్పారు. -
సజీవదహనం చేస్తామంటూ ఆప్ ఎంపీకి బెదిరింపులు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్కు బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చాయి. హిందూ వాహినికి చెందిన గుర్తుతెలియని వ్యక్తి ఫోన్చేసి చంపుతామంటూ సంజయ్ సింగ్పై బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో అప్రమత్తమైన ఆయన నార్త్ ఎవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'హిందూ వాహిని' నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించినట్లు సంజయ్సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. '7288088088 మొబైల్ నంబర్ నుంచి నాకు తెలియని వ్యక్తి నుంచి కాల్స్ వస్తున్నాయి. సోమవారం కూడా అదు నెంబర్ నుంచి నాకు ఫోన్ రావడంతో నా సహోద్యోగి అజిత్ త్యాగి ఫోన్కు మళ్లించాను. మధ్యాహ్నం 3.59 గంటలకు కాల్ తీసుకోగా.. కాల్ చేసిన వ్యక్తి తనను చంపేస్తానంటూ బెదిరించాడు. ఫోన్ చేసిన వ్యక్తి తనకు తానుగా హిందూ వాహిని నుంచి మాట్లాడుతున్నట్లు తెలిపాడు. కిరోసిన్ పోసి సజీవ దహనం చేస్తానంటూ బెదిరించాడని' ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పోలీసులకు ఫిర్యాదు చేసిన కంప్లైంట్ను సంజయ్ సింగ్ తన ట్విటర్లో షేర్ చేశారు. -
మోదీజీ.. ‘జీ–7’కు రండి
లండన్: ఈ ఏడాది జరగనున్న జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించినట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం వెల్లడించారు. బ్రిటన్ అధ్యక్షతన ఈ ఏడాది జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న అభివృద్ధి చెందిన దేశాల సమావేశాలకు తీర ప్రాంతమైన కార్న్వాల్ వేదికగా మారనుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిఖరాగ్ర భేటీకి భారత్తోపాటు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లను ఆతిథ్య హోదాలో ఆహ్వానిం చామన్నారు. గత ఏడాది భారత ప్రధాని మోదీతో ఫోన్ కాల్ సంభాషణ సమయంలోనే ఈ విషయం తెలిపానన్నారు. జనవరి 26వ తేదీన భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వెళ్లాల్సి ఉండగా దేశంలో కరోనా సంక్షోభం కారణంగా ఆ పర్యటన రద్దయిందని ఆయన చెప్పారు. త్వరలోనే, జీ–7 భేటీలకు ముందే భారత్ సందర్శించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. జూన్లో జీ7 భేటీకి హాజరయ్యే 10 మంది నేతలు ప్రపంచంలోని ప్రజాస్వామ్యదేశాల్లోని 60% ప్రజలకు ప్రాతినిధ్యం వహించనున్నారని బోరిస్ జాన్సన్ తెలిపారు. తగరం, రాగి గనులతో 200 ఏళ్ల క్రితం బ్రిటన్లో పారిశ్రామిక విప్లవానికి కీలకంగా నిలిచిన కార్న్వాల్లో జీ7 భేటీ జరుగుతుందన్నారు. జీ 7 (గ్రూప్ ఆఫ్ సెవెన్)బృందంలో ప్రపంచంలో పలుకుబడి కలిగిన అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలున్నాయి. ఈ ఏడాది ఈ దేశాల మధ్య కోవిడ్ మహమ్మారిపైనే ప్రధాన చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. దాదాపు రెండేళ్లకు ముఖాముఖి జరగనున్న ఈ భేటీకి ముందుగా బ్రిటన్ వర్చువల్గా, నేరుగా వివిధ దేశాలతో మంత్రుల స్థాయిలో విస్తృతంగా చర్చలు జరపనుంది. యూకే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది. ప్రపంచ ఔషధాగారం భారత్ ప్రపంచ వ్యాక్సిన్ అవసరాల్లో 50% వరకు సరఫరాచేసిన భారత్ ప్రపంచ ఔషధాగారంగా మారిందని యూకే విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ మహమ్మారి విషయంలో యూకే, భారత్ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని తెలిపింది. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతిచ్చిన పీ–5 దేశాల్లో యూకే మొట్టమొదటిదని పేర్కొంది. 2005లో భారత్ను జీ–7 సమ్మిట్కు యూకే మొదటగా ఆహ్వానం పంపింది. త్వరలో బ్రిక్స్ అధ్యక్ష హోదాతోపాటు, 2023లో జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనుందంది. -
హలో.. నేను సీఎంను మాట్లాడుతున్నా
జహీరాబాద్: ‘హలో.. నేను సీఎంను మాట్లాడుతున్నాను..’అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఓ ఆలుగడ్డ రైతుకు ఫోన్ చేసి పంట గురించి ఆరా తీశారు. సం గారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన రైతు నల్లా నాగేశ్వర్రెడ్డికి శనివారం సీఎం ఫోన్ చేశారు. నాలుగున్నర నిమిషాలపాటు సంభాషించారు. సంభాషణ సాగిందిలా.. సీఎం: మీ ప్రాంతంలో ఈ ఏడాది ఆలుగడ్డ సాగు ఎలా ఉంది? రైతు: పంట సాగు ఆశాజనకంగా ఉంది సర్.. సాగు విస్తీర్ణమేమీ తగ్గలేదు. సీఎం: ఎలాంటి రకాన్ని సాగు చేస్తున్నారు? రైతు: జహీరాబాద్ ప్రాంతంలో 166 రకం సాగు చేస్తారు. దీన్ని కుఫ్రీగా పిలుస్తారు. జ్యోతి, ఖ్యాతి రకాల విత్తనాలు కూడా ఉన్నాయి. వాటిని ఈ ప్రాంతంలో సాగు చేయడం లేదు. సీఎం: ఒక మొక్క బాగుంటే ఎన్ని గడ్డలు ఉంటాయి? రైతు: 8 నుంచి 10 గడ్డల వరకు ఉంటాయి. సీఎం: ఇంతమేర గడ్డలుంటే పంట దిగుబడి బాగా వచ్చినట్లా? రైతు: అవును సార్ సీఎం: ఎంత బరువు తూగుతుంది? రైతు: కిలో మేర తూగుతుంది. సీఎం: ఎకరాకు ఎన్ని బస్తాల విత్తనం ఉపయోగిస్తారు? రైతు: 15 నుంచి 16 బస్తాలు వాడుతాం. పంటను బెడ్ విధానంలో వేశాం. పంట వేసి 45 రోజుల వరకు అయింది. సీఎం: నేను 25 ఎకరాల్లో ఆలుగడ్డ పంట వేశా. పంట బాగుంది. రైతు: ఎకరాకు 12 నుంచి 15 టన్నుల మేర దిగుబడి వస్తుంది. ఒక బస్తా విత్తనానికి 16 బస్తాల వరకు పంట దిగుబడి వస్తుంది. సీఎం: మార్కెట్లో ఆలుగడ్డ పంటకు ధర ఎలా ఉంది? రైతు: ప్రస్తుతం ధర తగ్గింది. క్వింటాలుకు రూ.1,700 నుంచి రూ.2,000 మేర ధర పలుకుతోంది. కోహీర్ ప్రాంతంలో ఎర్ర నేలలు ఉన్నందున పంట ఎరుపురంగులో వస్తుంది. దీనికి ధర తక్కువగా ఉంటుంది. రేగడి నేలల్లో వచ్చే పంట తెలుపు రంగులో ఉండటంతో ధర కొంత ఎక్కువ ఉంటుంది. సీఎం: ఎన్ని రోజుల్లో పంటను తీస్తారు? రైతు: 85 రోజుల్లో పంట చేతికొస్తుంది. పక్షం రోజుల ముందు నుంచే నీటి తడులు ఇవ్వడాన్ని నిలిపివేస్తాం. సీఎం: నేను ఇంకా పంట తీయలేదు. పంట తీసే సమయంలో పిలిపిస్తా. రైతు: సరే సార్.. నాలుగైదు మందిమి వస్తాం. సీఎం: థ్యాంక్యూ ఇదిలా ఉంటే, నాలుగు నెలల క్రితం రైతు నాగేశ్వర్రెడ్డితోపాటు మరో నలుగురు రైతులు సీఎం ఆహ్వానం మేరకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్కు వెళ్లారు. వారితో సీఎం సుమారు ఆరు గంటల పాటు పంటల సాగు గురించి చర్చించిన విషయం తెలిసిందే. -
ఆంధ్రా రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్
సాక్షి, హైదరాబాద్/కృష్ణా జిల్లా : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఘంటసాల పాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావుకు ఫోన్ చేసి, వెద సాగు అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా వ్యవసాయం, పాడి పరిశ్రమ, వ్యవసాయ అనుబంధ రంగాలలో విశేష కృషి చేసిన ప్రసాదరావు అనుభవాలను తెలంగాణాలో ఆచరించేందుకు కేసీఆర్ ఆయన్ను స్వయంగా విందుకు ఆహ్వానించారు. తనతో దాదాపు 10 నిమిషాలు ఫోన్లో సంభాషించిన సీఎం కేసీఆర్ వెద పద్దతిలో వరి సాగులో దిగుబడులు, ఖర్చు వివరాలు అడిగి తెలుసుకున్నారని, రెండు రోజుల్లో తనను కలిసేందుకు కారు పంపుతానని చెప్పారని ప్రసాదరావు తెలిపారు. (బీజేపీకి షాక్.. జిల్లా అధ్యక్షుడి రాజీనామా!) ఈ సందర్భంగా ప్రసాదరావు సాక్షితో మాట్లాడుతూ.. తాను సాగు చేసే పద్ధతులు వివరించారు. వ్యవసాయంతో పాటు 250 గేదెలు, ఆవులు, మేకలు, కోళ్ల పెంపకం చేస్తున్నానని దీని కారణంగా పొలానికి మంచి సేంద్రియ ఎరువులు అంది.. భూమి ఆరోగ్యం మెరుగై దిగుబడులు పెరుగుతున్నాయని వివరించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు స్వయంగా ఫోన్ చేసి సాగు అనుభవాలు తెలుసుకోవటం, విందుకు ఆహ్వానించటం గర్వంగా ఉందని తెలిపారు. వెద సాగుతో ఖర్చులు తగ్గటమే కాక దిగుబడి పెరుగుతుందన్న విషయం రైతులు గుర్తించాలని ప్రసాదరావు సూచించారు. -
జగపతి బాబు సోదరుడికి బెదిరింపు కాల్స్
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు జగపతి బాబు సోదరుడి యుగేంద్ర కుమార్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఫిల్మ్ నగర్లో సివసించే ఆయనకు చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడంతో బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. గుట్టల బేగంపేట స్థలం విషయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటు అతని కుమారుడిని చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు చెప్పారు. దీని వెనుక బంజారాహిల్స్ ఎమ్మెల్యేకాలనీకి చెందిన రాజిరెడ్డి ఉన్నట్లు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. -
శ్రావణితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
తుర్కపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామానికి చెందిన గ్రాడ్యుయేట్ శ్రావణితో మంత్రి కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. గ్రామ ఇన్చార్జిగా వ్యవహరిస్తూ అందరినీ మోటివేట్ చేస్తావా అని ప్రశ్నించారు. కేటీఆర్, శ్రావణి ఫోన్ సంభాషణ వారి మాటల్లోనే.. కేటీఆర్: హలో.. శ్రావణియేనా మాట్లాడేది? శ్రావణి: అవును సార్ శ్రావణిని మాట్లాడుతున్న.. నమస్కారం సార్ కేటీఆర్: నమస్కారమమ్మా.. నేడు చెప్పింది అంతా విన్నావా.. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? శ్రావణి: అనుమానాలు అట్లాంటివి ఏమీ లేవు సార్. మీరు చేసే అభివృద్ధి పనులు చూసి, నా వంతుగా నేను ఎందుకు చేయవద్దు అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామ ఇన్చార్జిగా తీసుకొని ముందుకు వచ్చాను సార్. కేటీఆర్: థాంక్యూ బేటా.. థాంక్యూ వెరీమచ్. ఇదే స్ఫూర్తిని పది మందిలో నింపు. మీది రుస్తాపూర్ కదా.. శ్రావణి: అవును సార్. కేటీఆర్: రుస్తాపూర్లో ఎంత మంది ఓటర్లు ఉంటారు. శ్రావణి: 40, 50 మంది ఓటర్లు ఉంటారు సార్. కేటీఆర్: అందర్నీ మోటివేట్ చేస్తావా? శ్రావణి: అందర్నీ మోటివేట్ చేస్తా.. షూర్గా.. కేటీఆర్: తప్పకుండా.. శ్రావణి: తప్పకుండా చేస్తాను సార్ -
సీఎం వైఎస్ జగన్కు నితీష్ కుమార్ ఫోన్
సాక్షి, తాడేపల్లి : బిహార్ సీఎం నితీష్ కుమార్ గురువారం రాత్రి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి ఫోన్ చేసినట్లు తెలిసింది. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్కి మద్దతు పలకాల్సిందిగా నితీష్ సీఎం జగన్ను ఫోన్లైన్లో కోరారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీకి ఆరుగురు ఎంపీల బలం ఉంది. కాగా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. 2018లో కాంగ్రెస్కు చెందిన బీకే హరిప్రసాద్ను ఓడించి బీజేపీ అభ్యర్థి హరివంశ్ డిప్యూటీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో ఆయన పదవికాలం ముగియనుండడంతో హరివంశ్ మరోసారి పోటీలో నిలిచారు.(చదవండి : ఏకగ్రీవ ఎన్నికకు ఎన్డీయే వ్యూహాలు) -
ఎమ్మెల్సీకి టోకరా వేయబోయాడు
సాక్షి, రాయచోటి: ఓ మోసగాడు ఎమ్మెల్సీకే టోకరా వేయబోయాడు. మంగళవారం రాయచోటిలో ఉన్న ఎమ్మెల్సీ జకియా ఖానమ్కి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు బాబు జగ్జీవన్రావ్ అని, సీఎం ఆఫీసులో ప్రాజెక్టు డైరెక్టరుగా పని చేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. రూ.50 వేలు డిపాజిట్ చేస్తే మీకు ప్రభుత్వం రూ.25 లక్షల రుణమిస్తుందని చెప్పాడు. డబ్బును జమ చేసేందుకని తెలంగాణలోని జగ్గారెడ్డి గూడెం బ్యాంక్ అకౌంట్ నంబర్ను పంపించాడు. దీన్ని ఆమె వెంటనే ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి సీఎం కార్యాలయంలో దీనిపై ఆరా తీశారు. అక్కడ అలాంటి వారెవరూ లేరనే విషయం తెలుసుకున్న శ్రీకాంత్రెడ్డి.. దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాయచోటి అర్బన్ సీఐని ఆదేశించారు. -
మాతోశ్రీని పేల్చేస్తాం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ని పేల్చేస్తామంటూ ఓ ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్కాల్స్ కలకలం రేపాయి. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడినని చెప్పుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్ కాల్స్తో మహారాష్ట్ర పోలీసులు సీఎం ఉద్ధవ్ నివాసానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ‘బాంద్రా కాలానగర్లో ఉన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ ఆగంతకుడు రెండు సార్లు ఫోన్ చేశాడు. తనెవరో చెప్పలేదు. దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం తరఫున ఫోన్ చేస్తున్నట్లు మాత్రమే చెప్పుకున్నాడు. దావూద్ సీఎం ఉద్ధవ్తో మాట్లాడాలనుకుంటున్నాడని అన్నాడు. అయితే, సీఎం నివాసంలోని టెలిఫోన్ ఆపరేటర్ ఈ కాల్స్ను ముఖ్యమంత్రికి ఫార్వార్డ్ చేయలేదు’అని సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఆ ఫోన్ కాల్స్ దుబాయ్ నుంచేనా మరేదైనా ప్రాంతం నుంచి వచ్చాయా అనేది దర్యాప్తు చేస్తున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల విషయమై చర్చించేందుకు ఆదివారం భేటీ అయిన రాష్ట్ర కేబినెట్..బెదిరింపు కాల్స్పై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఘటనపై నేర విభాగం దర్యాప్తు చేస్తుందని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ వెల్లడించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే, ముఖ్యమంత్రి నివాసాన్ని పేల్చేస్తామంటూ ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ అన్నారు. -
పంచాయతీ కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఫోన్
పర్వతగిరి: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవితో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. శనివారం కార్యదర్శికి ఫోన్ చేసిన సీఎం.. పంచాయతీలో గృహ నిర్మాణ రికార్డులు, అనుమతులు, నాలా కన్వర్షన్ తదితర వివరాలపై ఆరా తీశారు. ఏనుగల్ పంచాయతీలో రికార్డుల పరంగా ఎన్ని గృహాలు ఉన్నాయి? నమోదు కాని గృహాలు ఎన్ని.. తండ్రి నుంచి పిల్లలకు వారసత్వంగా వస్తే ఏ విధంగా రికార్డు చేస్తారు..? తండ్రి చనిపోతే రికార్డుల్లో నమోదు చేసే విధానం ఏమిటి.. గృహ నిర్మాణ రికార్డులు రెవెన్యూ విభాగంలో పొందుపర్చి ఉంటాయా అని కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. నాలా కన్వర్షన్ తర్వాతనే.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తనతో పాటు కుమారుడు కేటీఆర్ పేరిట ఎర్రవల్లిలో వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. ఇందులోని ఎకరన్నర స్థలంలో గృహ నిర్మాణం చేపట్టేందుకు ఉన్నతాధికారులతో ఆరా తీయగా.. నాలా కన్వర్షన్ అనంతరం గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. దీంతో నాలా కన్వర్షన్ తదుపరి ఎర్రవల్లి గ్రామపంచాయతీ నుంచి అనుమతి తీసుకుని గృహ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో రైతులు తమ వ్యవసాయ భూముల్లో గృహం నిర్మించాలనుకుంటే ఇదే తరహాలో నాలా కన్వర్షన్ చేశాక నిర్మాణ అనుమతి పంచాయతీ కార్యదర్శులు ఇవ్వాలని సూచించారు. అదే విధంగా ప్రతీ గ్రామపంచాయతీలో రెవెన్యూ శాఖతో సంబంధం లేకుండా గృహ నిర్మాణాల రికార్డులను ఆన్లైన్ చేయాలని తెలిపారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ వ్యవస్థ నెమ్మదిగా ఉన్నా, భవిష్యత్లో పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని వివరించారు. కాగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ స్వగ్రామం ఏనుగల్ కావడం గమనార్హం. -
ఎంపీ కేకేను బురిడీ కొట్టించే ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ పథకమంటూ, కేటీఆర్ సిఫారసు చేశాడని చెబుతూ ఏకంగా టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావును బురిడీ కొట్టించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఎంపీ కేకేకు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి తన పేరు మహేష్ అని, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్నని పరిచయం చేసుకున్నాడు. కేంద్రం నుంచి ఎంపీలకు ప్రైమ్ మినిష్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీం కింద 20 మంది వ్యాపారులకు రూ.25 లక్షల మేర రుణాలు ఇప్పించుకునే అవకాశం ఉందని చెప్పాడు. దీంతో కేకే తన కుమార్తె కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మితో మాట్లాడాల్సిందిగా సూచించాడు. ఆమె తన డివిజన్ పరిధిలో ఉన్న కొందరు కార్యకర్తలకు లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో మహేష్తో మాట్లాడేందుకు అంగీకరించింది. మహేష్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ గారు మీ పేరు సూచించారని ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి కూడా ఈ రుణాల కోసం పోటీ పడుతున్నారని అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తే ఆశాభంగమని చెప్పాడు. ఈ రుణం తీసుకున్న వారికి 50 శాతం సబ్సిడీ కూడా ఉంటుందని ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ రోజే చివరి అవకాశమని దీని కోసం ప్రాసెసింగ్ ఫీజుగా ప్రతి ఒక్కరు రూ. 1.25 లక్షలు కట్టాల్సి ఉంటుందని చెప్పాడు. మంత్రి కేటీఆర్ సూచించడంతోనే తాను ఫోన్ చేస్తున్నట్లు నమ్మబలికాడు. సదరు రుణాలతో సూపర్ మార్కెట్, పౌల్టీ ఫామ్, జనరల్ స్టోర్, ఫోర్ వీల్ ట్రావెల్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. సాయంత్రం 4 గంటల్లోపు డబ్బులను తన పేరున ఉన్న అకౌంట్లో జమ చేయాలని చెప్పాడు. దీంతో అప్పటికప్పు డు కొందరు లబ్ధిదారులను పిలిపించి విషయాన్ని వివరించింది. మంచి అవకాశం ఉందంటూ కార్పొరేటర్ చెప్పడంతో ఆగమేఘాల మీద డబ్బులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఆఖరి నిమిషంలో అనుమానం... అయితే ఆఖరి నిమిషంలో ఈ పథకంపై కేకేకు అనుమానం వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకోవాలని భావించిన ఆయన మరోసారి మహేష్కు ఫోన్ చేసి ఎక్కడున్నారని ఆరా తీయగా తాను ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్తో ఉన్నానని డీడీల మీద సంతకాలు చేయించేందుకు వచ్చినట్లు చెప్పాడు. ఈ విషయాన్ని నేరుగా కేటీఆర్తో కనుక్కుందామని మంత్రికి ఫోన్ చేశాడు. అయితే కేటీఆర్ స్పందించకపోవడంతో ఆయన పీఏకు ఫోన్ చేయగా కేటీఆర్ అసలు హైదరాబాద్లోనే లేరని ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు చెప్పడంతో కేకే అవాక్కయ్యారు. దీంతో తన కుమార్తెకు విషయం చెప్పడంతో ఇదేదో అనుమానంగా ఉందని చెప్పడంతో వారంతా ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా కేవలం ఆధార్ కార్డు మాత్రమే పంపాలని మహేష్ సూచించడంతో దానిపై లోన్ ఎలా ఇస్తారంటూ అనుమానం వ్యక్తం చేశారు. అత్యుత్సాహంతో 50 వేలు హాంఫట్... ఓ వైపు స్కీం విషయమై విజయలక్ష్మి చర్చిస్తుండగానే సదరు వ్యక్తి విజయలక్ష్మి దగ్గర ఉండే యువకుడు మేక అఖిల్కు ఫోన్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తనుకు ఆర్టీజీఎస్ ద్వారా ఎవరు ముందుగా డబ్బులు వేస్తే వారికే రుణం వస్తుందని తొందరపెట్టాడు. దీంతో అఖిల్ తన అకౌంట్ ద్వారా రూ. 50 వేలు మహేష్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాడు. మరో రూ. 50 వేలు ట్రాన్స్ఫర్ చేసేలోగా మోసాన్ని పసిగట్టిన విజయలక్ష్మి ఈ విషయాన్ని అఖిల్కు చెప్పగా మిగతా డబ్బులు వేయలేదు. ఇదే విషయాన్ని బ్యాంకు అధికారులకు అఖిల్ ఫోన్ చేసి చెప్పాడు. ఈ లోగా అతడు వేసిన రూ. 50 వేలలో రూ.40 వేలు నిందితులు అప్పటికే డ్రా చేశారు. మిగతా రూ.10 వేలు డ్రా చేసేందుకు నిందితులు ప్రయత్నిస్తున్న సమయంలో బ్యాంకు అధికారులు మహేష్ బ్యాంకు అకౌంట్ను ఫ్రీజ్ చేశారు. నిజామాబాద్లో విత్ డ్రా అఖిల్ డిపాజిట్ చేసిన నగదులో రూ. 40 వేలను సంజీవ్ అనే వ్యక్తి నిజామాబాద్లో డ్రా చేసినట్లు తెలిసింది. మరో 10 వేలు డ్రా చేసేలోగానే బ్యాంకు అధికారులు అకౌంట్ను ఫ్రీజ్ చేయడంతో సంజీవ్ అనే వ్యక్తి బ్యాంకు అధికారులతో అక్కడ గొడవకు దిగినట్లు సమాచారం. కార్పొరేటర్ విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం, బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఏసీబీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా..
కర్నూలు(అగ్రికల్చర్): ‘విజయవాడ ఏసీబీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాను. మీపై తీవ్రమైన అవినీతి ఆరోపణలతో మాకు ఫిర్యాదులు అందాయి. రూ.5 లక్షలు ముట్టచెబితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ జయరామిరెడ్డికి హర్షవర్ధన్రెడ్డి అనే వ్యక్తి ఫోన్లో బెదిరించాడు. సదరు వ్యక్తి బ్లాక్ మెయిలింగ్పై ఎస్ఈ బుధవారం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీఐ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ గతంలో కూడా విజయవాడ ఏసీబీ ఆఫీసు పేరుతో పలువురు వీఆర్ఓలు, తహసీల్దార్లకు ఫోన్లు చేశారని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బ్లాక్ మెయిలర్ను కటకటాల్లోకి పంపుతామన్నారు. -
2జీ రహిత భారత్..
న్యూఢిల్లీ: ఎప్పుడో పాతికేళ్ల క్రితం ప్రారంభించిన 2జీ టెలిఫోనీ సర్వీసులను ఇక నిలిపివేయాల్సిన సమయం వచ్చిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధానపరంగా తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా తొలి మొబైల్ ఫోన్ కాల్ చేసి పాతికేళ్లయిన సందర్భంగా (సిల్వర్ జూబ్లీ) నిర్వహించిన కార్యక్రమంలో అంబానీ పాల్గొన్నారు. ‘ఒకవైపు భారత్తో పాటు మిగతా ప్రపంచం 5జీ టెలిఫోనీ ముంగిట్లో ఉండగా, దేశీయంగా ఇంకా 30 కోట్ల మంది 2జీ శకంలోనే చిక్కుబడి ఉండిపోయారు. వారు వాడుతున్న ఫీచర్ ఫోన్ల కారణంగా ప్రాథమిక ఇంటర్నెట్ సర్వీసులు కూడా పొందలేకపోతున్నారు. కాబట్టి 2జీని చరిత్రలో కలిపేసే దిశగా ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన విధానపరంగా తగుచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను‘ అని ఆయన చెప్పారు. ఫిక్సిడ్ లైన్ టెలిఫోన్ సర్వీసులతో కాల్పనిక అంశం వాస్తవ రూపం దాల్చిందని, అయితే కమ్యూనికేషన్కు సంబంధించి పాక్షిక స్వాతంత్య్రం మాత్రమే వచ్చిందని అంబానీ పేర్కొన్నారు. ఆ తర్వాత 1995లో మొబైల్ సేవల రాకతో భారత్ ఉజ్వల భవిష్యత్ దిశగా ప్రయాణం ప్రారంభించిందని చెప్పారు. ప్రస్తుతం రిలయన్స్ జియో 4జీ సేవలు మాత్రమే అందిస్తుండగా భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మాత్రం ఇంకా 2జీ టెక్నాలజీతో సర్వీసులు అందిస్తున్నాయి. ప్రస్తుతం చౌకగా మొబైల్ సేవలు.. ప్రస్తుతం మొబైల్ ఫోన్ సర్వీసులు అత్యంత చౌకగా మారాయని అంబానీ తెలిపారు. ‘1995లో సెల్ఫోన్ నుంచి కాల్ చేస్తే నిమిషానికి రూ. 24 చార్జీ అయ్యేది. ఇందులో కాల్ చేసిన వారికి రూ. 16, అందుకున్నవారికి రూ. 8 వర్తించేది. ఇప్పుడు ఎలాంటి పరిమితులూ లేకుండా వాయిస్ కాల్స్ పూర్తి ఉచితంగా లభిస్తున్నాయి. గతంలోలాగా మొబైల్ సేవలు కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కావు. సంపన్నులు, పేదల మధ్య తారతమ్యాలను మొబైల్ టెలిఫోనీ సేవలు చెరిపేసినంతగా బహుశా చరిత్రలో మరొక టెక్నాలజీ సాధనం లేకపోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు తమ ఫోన్ల ద్వారానే వార్తలు తెలుసుకోవడంతో పాటు వీడియోలు చూడటం, వీడియోలు తయారు చేయడం తదితర పనులన్నీ చేయగలుగుతున్నారని అంబానీ వివరించారు. పాతికేళ్ల క్రితం మొబిలిటీ విషయంలో సంపన్న దేశాలను భారత్ అనుసరించాల్సి వచ్చేదని, కీలక టెక్నాలజీలో ప్ర పంచ దేశాలకన్నా భారత్ను ముందు నిల పాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు మెరుగుపడాలి: అన్షు ప్రకాశ్ గ్రామీణ ప్రాంతాల్లో డేటా వినియోగానికి భారీ అవకాశాలు ఉన్నందున.. కనెక్టివిటీని మెరుగుపర్చడంపై టెలికం పరిశ్రమ దృష్టి పెట్టాలని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ సూచించారు. టెలికం సేవలు ప్రస్తుతం ప్రాథమిక అవసరంగా మారాయని ఆయన చెప్పారు. అయితే, భారీ పెట్టుబడులు అవసరమయ్యే రంగం అయినందున రానున్న రోజుల్లో పరిశ్రమ పెను సవాళ్లు ఎదుర్కొనాల్సి రావచ్చని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రకాష్ తెలిపారు. భారత్కి భారీ స్థాయిలో వైర్లైన్ కమ్యూనికేషన్, వైర్లైన్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అవసరమని ఆయన చెప్పారు. 5జీ టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా భారీగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. భారత్ .. జియోపై ఫేస్బుక్, గూగుల్ ఆశలు జియో ప్లాట్ఫామ్స్లో పెట్టుబడుల ద్వారా భారత మార్కెట్లో స్థానం మరింత పటిష్టం చేసుకోవాలని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్, గూగుల్ భావిస్తున్నాయి. ఇన్వెస్టర్లతో సమావేశంలో ఈ రెండు కంపెనీలు భారత మార్కెట్ ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఇందుకు నిదర్శనం. ‘భారత్లో భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయి. జియోతో భాగస్వామ్యంతో వేల సంఖ్యలో కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపార సంస్థలను వాట్సాప్లో భాగం చేయదల్చుకున్నాం. వాట్సాప్ ద్వారా క్రయవిక్రయాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. దీన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ముందుగా చెల్లింపుల సేవలతో దీనికి శ్రీకారం చుడతాం. తద్వారా వ్యాపారం మరింతగా పుంజుకోగలదు‘ అని జియో ప్లాట్ఫామ్స్లో పెట్టుబడులపై స్పందిస్తూ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. రిలయన్స్కి చెందిన డిజిటల్ వ్యాపారాల విభాగం జియో ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్ ఈ ఏడాది ఏప్రిల్లో సుమారు రూ. 43,574 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, భారత్లో డిజిటైజేషన్కు ఊతమిచ్చేలా వచ్చే అయిదు నుంచి ఏడేళ్లలో దాదాపు 10 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఇన్వెస్టర్ల సమావేశంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జియో ప్లాట్ఫామ్స్లో రూ. 33,737 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
సీఎం జగన్కు అమిత్ షా ఫోన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. భారత్-చైనాల మధ్య చోటుచేసుకున్న పరిణామాలపై శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్కు అమిత్ షా ఫోన్ చేశారు. ఈ క్రమంలోనే రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సీఎం జగన్తో ఫోన్లో మాట్లాడారు. కాగా, ప్రధాని మోదీ నిర్వహిస్తున్న రేపటి అఖిలపక్ష సమావేశంలో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు. -
లాక్డౌన్ పొడిగింపుపై మీరేమంటారు?
న్యూఢిల్లీ: ఈనెల 31వ తేదీతో ముగియనున్న దేశవ్యాప్త లాక్డౌన్ను మరికొద్ది రోజులపాటు పొడిగించాలన్న ప్రతిపాదనపై హోం మంత్రి అమిత్ షా గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగో దశ లాక్డౌన్ ఈ నెలాఖరుతో ముగియనున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడిన అమిత్ షా..ఏఏ రంగాలకు మినహాయింపు అవసరం? ఎలాంటి సమస్యలున్నాయి? వంటి అంశాలపై చర్చించారు. సీఎంలు ఏం చెప్పారనే విషయం వెల్లడి కానప్పటికీ, ఏదో ఒక రూపంలో లాక్డౌన్ పొడిగింపునకే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు సమాచారం. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు, జన జీవనం సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం తుది నిర్ణయాన్ని రెండుమూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. -
మల్లన్నా.. గిదేందన్నా!
శామీర్పేట్: అది బుధవారం మధ్యాహ్నం.. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్కు రాజీవ్ రహదారిపై భద్రత బలగాల మధ్య వాహనంలో వెళ్తున్నారు.. రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండల కేంద్రంలోని పోలీస్ ఠాణా ఆవరణలోని ఏపుగా ఎదిగిన పచ్చని చెట్లను చూసి ఆయన అబ్బురపడ్డారు.ఆ సమీపంలోనే ఉన్న పీహెచ్సీ చెత్తా చెదారంతో నిండుకుని ఉన్న దృశ్యం సైతం సీఎం దృష్టిలో పడింది. వెంటనే ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డికి ఫోన్ చేశారు. మంత్రిగారూ.. ఏమిటిది? ప్రభుత్వ ఆస్పత్రి ఇలాగేనా ఉండేది? ఇంత నిర్లక్ష్యమైతే ఎలా? అంటూ ప్రశ్నించారు. పీహెచ్సీపై స్థితిగతులపై ఆయన ఆరా తీశారు. వెంటనే అక్కడ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. దీంతో స్పందించిన మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వేంకటేశ్వర్లు అధికారులు ఆస్పత్రిని సందర్శించారు. పీహెచ్సీ పరిసరాలను పరిశీలించారు. మొక్కలు నాటి, పచ్చదనం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆస్పత్రిని వీలైనంత త్వరగా అభివృద్ధి పరుస్తామని చెప్పారు. కాగా.. శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిసరాలను పచ్చని మణిహారంగా తీర్చిదిద్దిన పోలీస్ అధికారి, ఆరు నెలల క్రితం వరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన సీఐ నవీన్రెడ్డి గురించి సీఎం ఆరా తీసినట్లు సమాచారం. -
ఫోన్ కొడితే మామిడి పండ్లు..
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ద్వారా ఆర్డర్పై వినియోగదారులకు మామిడి పండ్ల సరఫరా చేస్తామని ఉద్యానశాఖ పేర్కొంది. పరిశుభ్రమైన పరిస్థితు ల్లో భౌతిక దూరం పాటిస్తూ సేకరించిన కాయలను సహజ పద్ధతిలో మాగబెట్టి కార్టన్ బాక్స్ల లో 5 కిలోల చొప్పున (సుమారు 12–15 కాయలు) ప్యాక్చేసి నాణ్యమైన మామిడి పండ్లను నేరుగా విని యోగదారుల ఇంటి వద్దకే తపాలా శాఖ పార్సిల్ సర్వీస్ ద్వారా సరఫరా చేస్తామని తెలిపింది. 5 కేజీల బంగినపల్లి మామిడి పండ్ల బాక్స్ ధర రూ.350 (డెలివరీ చార్జీలతో కలిపి). ఎన్ని బాక్స్లు కావాలన్న బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఇచ్చిన 4 నుంచి 5 రోజుల సమయంలో డెలివరీ చేస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5లోపు ఆర్డర్ ఇవ్వాలి. వివరాలకు 79977 24925/79977 24944 సంప్రదించాలి. ఫోన్ ద్వారా ఆర్డర్ల బుకింగ్ మే 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. -
గుజరాత్ సీఎంకు జగన్ ఫోన్
-
గుజరాత్ సీఎంకు ఏపీ సీఎం జగన్ ఫోన్..
సాక్షి, తాడేపల్లి : గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు. గుజరాత్లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. గుజరాత్ సీఎంకు విజ్ఞప్తి చేశారు. వారికి వసతి, భోజన సదుపాయం కల్పించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తిపై గుజరాత్ సీఎం విజయ్రూపానీ సానుకూలంగా స్పందించారు. తెలుగువారిని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
కోవిడ్–19పై సహకరించుకుందాం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్పై యుద్ధం చేయడానికి పరస్పరం సహకరించుకోవాలని అమెరికా, భారత్ నిర్ణయించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య శనివారం జరిగిన ఫోన్ సంభాషణలో పలు అంశాలపై చర్చించుకున్నారు. ప్రపంచ దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొన్న ఈ సమయంలో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగ, ఆయుర్వేద వైద్య విధానం ప్రాముఖ్యతపైన కూడా ఇద్దరు నేతలు చర్చించారు. కోవిడ్–19 రోగులకు ఇచ్చే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుల్ని పంపించాలని ట్రంప్ కోరారు. మలేరియా వ్యాధిని అరికట్టే క్లోరోక్విన్ టాబ్లెట్లు కరోనా వైరస్ను నిర్మూలించడంలో సత్ఫలితాలు చూపిస్తున్నాయని భావిస్తూ ఉండడంతో అమెరికా కొన్నాళ్ల క్రితమే భారత్కి ఆర్డర్ పెట్టుకుంది. భారత్లో కూడా కరోనా కేసులు ఎక్కువ కావడంతో క్లోరోక్విన్ ఎగుమతుల్ని ఈ నెల 4న భారత్ నిషేధించింది. దీంతో ట్రంప్ ఫోన్ చేసి మోదీతో మాట్లాడారు. తమ కంపెనీలు ఆర్డర్ చేసిన క్లోరోక్విన్ మాత్రల్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ట్రంప్ విలేకరులతో.. ‘భారత ప్రధానితో మాట్లాడాను. భారత్ క్లోరోక్విన్ మాత్రలను భారీ స్థాయిలో తయారు చేస్తోంది. నా విజ్ఞప్తిపై భారత్ సీరియస్గానే ఆలోచిస్తోంది’అని అన్నారు. -
తాలిబన్ అగ్రనేతకు ట్రంప్ ఫోన్
వాషింగ్టన్: తాలిబన్ల అగ్రనేత, తాలిబన్ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. అఫ్గాన్లో శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అరగంట పాటు సంభాషణ నడిచిందని తాలిబన్ తెలిపింది. అమెరికా, తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరేందుకు అఫ్గానిస్తాన్లో హింసాత్మక ఘటనలు తగ్గడమే కారణమని, ఇదే పరిస్థితి కొనసాగాలని ట్రంప్ స్పష్టం చేసినట్లు వైట్హౌస్ ప్రకటించింది. శాంతికి కట్టుబడి ఉంటే అఫ్గాన్కు సాయం అందించడంలో అమెరికా ముందుంటుందని ట్రంప్ చెప్పారు. ‘తాలిబన్ అగ్రనేతతో ఈ రోజు మాట్లాడాను. హింసకు తావులేదన్న అంశాన్ని ఇరువురూ అంగీకరించాం. ఏమవుతుందో చూద్దాం’ ట్రంప్ వ్యాఖ్యానించారు. ముల్లాతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. చర్చలపై నీలినీడలు: అఫ్గానిస్తాన్ బలగాలను రక్షించే ఉద్దేశంతో అమెరికా బుధవారం తాలిబన్పై వైమానిక దాడులకు దిగడంతో మార్చి 10వ తేదీన ఓస్లోలో ప్రభుత్వానికి, ఇతరులకు మధ్య చర్చలు జరిగే అంశం డోలాయమానంలో పడింది. బరాదర్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే హెల్మాండ్లో వైమానిక దాడులు జరగడం గమనార్హం. అమెరికా, తాలిబన్ల మధ్య గత శనివారం శాంతి ఒప్పందం కుదరగా, రానున్న 14 నెలల కాలంలో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకుంటున్న విషయం తెలిసిందే. హెల్మాండ్లో మంగళవారం తాలిబన్లు 43 సార్లు దాడులకు ప్రయత్నించారని, వాటిని తిప్పికొట్టేందుకే తాము వైమానిక దాడులకు దిగామని అఫ్గానిస్తాన్లో అమెరికా బలగాల అధికార ప్రతినిధి సన్నీ లెగ్గెట్ తెలిపారు. తాలిబన్లు ఇలాంటి దాడులను కట్టిపెట్టి శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. బుధవారం తాలిబన్ జరిపిన దాడుల్లో సుమారు 20 మంది అఫ్గాన్ సైనికులు మరణించారని మిలటరీ వర్గాలు తెలిపాయి. -
కూన రవికుమార్ మరోసారి రౌడీయిజం
-
ఈ నెంబర్కు ఫోన్ చేస్తే లక్ష ఆఫర్లు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. నా ఫోన్ నెంబర్ 8866288662....నా పేరు అరోహి త్రిపాటి. నన్ను కలుసుకోవాలంటే 8866288662కు ఫోన్ చేయండి....నన్ను ప్రేమించాలన్నా, నాతో డేటింగ్ చేయాలన్నా, ఇదే సమయం ఫోన్ నెంబర్ 8866288662...సన్నీ లియోన్ అభిమానులారా! ఆమెను 8866288662 ఫోన్ నెంబర్లో కలుసుకోవచ్చు.....ఇలాంటి ట్వీట్లతోపాటు 15 జీబీ డేటా ఉచితంగా కావాలంటే.....నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఆరు నెలలపాటు ఆరు నెలల పాటు ఉచితం. మొదటి వెయ్యి కాల్స్కు మాత్రమే పరిమితం....అమెజాన్ప్రైమ్ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితం....ఒక పిజ్జా కొంటే ఒక పిజ్జా ఉచితం, ఈ ఫోన్ నెంబర్ 8866288662కు ఫోన్ చేయండి....’ అంటూ ఒకే నెంబర్తో అనేక ఆఫర్లు ట్విట్టర్లో శనివారం నుంచి వచ్చి పడుతున్నాయి. ఇంతకు ఈ టోల్ఫ్రీ నెంబర్ ఎవరిదంటే...‘పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)ను సమర్థించేవాళ్లు ఈ టోల్ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వండి!’ అంటూ భారతీయ జనతా పార్టీ ఇటీవల దీన్ని ఆవిష్కరించింది. సీఏఏను అపహాస్యం చేయడానికా లేదా ఈ రీతిగానైనా సీఏఏకు మద్దతు సమీకరించాలన్న ఉద్దేశమా తెలియదుగానీ ఇది ట్విటర్ల చేతిలో మాత్రం వ్యంగ్యాస్త్రం అయింది. -
నిశ్చితార్థం రోజున ఫోన్కాల్తో కలకలం
తమిళనాడు, టీ.నగర్ : నిశ్చితార్థం రోజున వరుడి ప్రియురాలినని ఓ యువతి ఫోన్లో మాట్లాడడంతో వధువు కుటుంబీకుల మధ్య కలకలం రేగింది. ఈ వివరాలు ఆదివారం వెల్లడయ్యాయి. చెన్నై విరుగంబాక్కం రామాపురానికి చెందిన మహిళ (23)కు కడలూరు, కురింజి పట్టు పెన్నాగరం ప్రాంతానికి చెందిన వసంత కుమార్ను ఇష్టపడడంతో ఇరు కుటుంబీకుల సమ్మతంతో ఈ నెల ఒకటో తేదీన నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో వధువు ఇంటి వారికి ఒక ఫోన్కాల్ అందింది. అందులో మాట్లాడిన వ్యక్తి తన పేరు విజిలా అని, తాను వసంతకుమార్ ప్రియురాలినని, తాను ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు చెప్పి ఫోన్ కట్ చేసింది. దిగ్భ్రాంతి చెందిన వధువు ఇంటి వారు వరుడు కుటుంబీకులతో వాగ్వాదానికి దిగారు. చివరకు వరుడు ఇంటి వారు దీన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. నిశ్చితార్థం నిలిచిపోవడంతో దీనిపై రాయల్నగర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణలో విజిలాకు ఇది వరకే వివాహం అయినట్లు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. -
కలిసి పనిచేయాలని ఉంది
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: భారత్ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆదివారం ఫోన్ చేశారు. రెండు దేశాల ప్రజల అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఉందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి సాధన కోసం హింస, ఉగ్రవాద రహిత వాతావరణాన్ని, విశ్వాసాన్ని పాదుకొల్పాల్సి ఉందని ప్రధాని మోదీ బదులిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలపడంతోపాటు దక్షిణాసియాలో శాంతి, అభివృద్ధి సాధనకు మోదీతో కలిసి పనిచేయాలని ఉందంటూ ప్రధాని ఇమ్రాన్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ తెలిపారు. ఇరు దేశాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు కలిసి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారన్నారు. అయితే, ప్రధాని ఇమ్రాన్కు కృతజ్ఞతలు తెలిపిన మోదీ...ఈ ప్రాంతంలో అభివృద్ధి, శాంతి నెలకొనాలంటే ముందుగా ఉగ్రవాద, హింసా రహిత వాతావరణం నెలకొనాలని, పరస్పరం విశ్వాసం పెంపొందాలని పేర్కొన్నారు. మళ్లీ అధికార పగ్గాలు చేపట్టనున్న ప్రధాని మోదీకి ప్రపంచ దేశాల నేతల అభినందనలు వెల్లువెత్తుతున్నాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. -
మోదీకి ట్రంప్ ఫోన్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: జూన్లో జపాన్లో జరిగే జీ–20 సమావేశంలో ప్రత్యేకంగా భేటీ కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీలు శుక్రవారం నిర్ణయించుకున్నారు. అమెరికా, ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మోదీని అభినందించేందుకు ట్రంప్ ఫోన్ చేశారు. జపాన్లో ఇండియా, అమెరికా, జపాన్ల మధ్య త్రైపాక్షిక భేటీ ఉంటుందని శ్వేతసౌధం అధికారులు చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛగా నౌకలు తిరిగే అంశంపై వారు ప్రధానంగా చర్చిస్తారంది. జూన్ 28, 29 తేదీల్లో ఈ జీ–20 సదస్సు జరగనుంది. ప్రపంచ దేశాల నేతల అభినందనలు ఎన్నికల్లో ఘనవిజయానికి అభినందిస్తూ మోదీకి పలువురు ప్రపంచ దేశాల అధినేతలు ఫోన్లు చేశారు. వారందరికీ మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, సౌదీ అరేబియా రాజు సల్మాన్బిన్ అబ్దుల్అజీజ్ అల్ సౌద్, నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, ఇండోనేసియా అధ్యక్షుడు జొకో విడొడొ, నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ సహా పలువురు నేతలు మోదీకి అభినందనలు తెలియజేశారు. -
‘సీఎం పళనిస్వామిని చంపేస్తా’
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని చంపేస్తామని వచ్చిన ఓ ఫోన్కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. చెన్నై ఎగ్మూర్లోని కంట్రోల్ రూమ్కు శనివారం రాత్రి ఓ యువకుడు ఫోన్ చేశాడు. ‘నా పేరు గురుశంకర్. కొడైకెనాల్ బస్టాండ్ వద్ద సీఎం పళనిస్వామిని హతమారుస్తా. ఇదే నా సవాల్’ అని కాల్ కట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీస్వర్గాల్లో కలకలం చెలరేగింది. ఉన్నతాధికారులు సీఎం నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. విచారణ ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు తమకు ఫోన్చేసిన వ్యక్తిని దిండుగల్ జిల్లా విరాళి పట్టికి చెందిన గురుమూర్తిగా(25)గా గుర్తించారు. గురుశంకర్ తండ్రి రామమూర్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కొడైకెనాల్లో గాలింపు ముమ్మరం చేశారు. -
ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ఫోన్ చేశారు. పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై వీరు చర్చించారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పుతిన్.. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మోదీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. గత ఏడాది మేలో రష్యాలోని సోచిలో ఇద్దరు నేతల చర్చలు, పుతిన్ భారత్ పర్యటనల ద్వారా అత్యంత కీలకమైన ఉమ్మడి భాగస్వామ్యంలో అధిగమించిన మైలురాళ్లను, సాధించిన విజయాలపై ఇద్దరు సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ రంగం, ఉగ్రవాద వ్యతిరేక చర్యలను మోదీ, పుతిన్ చర్చించారు. అంతర్జాతీయ అంశాలతోపాటు ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్, తదితర ప్రపంచ వేదికలపై పరస్పర సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించారని విదేశాంగ శాఖ తెలిపింది. రష్యాలోని వ్లాడివొస్టోక్లో సెప్టెంబర్లో జరగనున్న ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మోదీని పుతిన్ ఆహ్వానించారు. -
హలో... నేను పైన్ను! అటు ఎవరు?
శుక్రవారం ఆట ముగిశాక, ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ మీడియా సమావేశంలో ఉండగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే... పైన్ మాటలను రికార్డు చేసేందుకు జర్నలిస్టు ఒకరు తన ఫోన్ను అతడి ముందు పెట్టాడు. ఈలోగా ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. పైన్ ఏమాత్రం సంకోచించకుండా ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. ‘నేను టిమ్ పైన్ మాట్లాడుతున్నా. అటు ఎవరు’? అని ప్రశ్నించాడు. దీనికి ‘హాంకాంగ్ నుంచి క్యాసీని మాట్లాడుతున్నా. మీరెవరంటూ?’ సమాధానం వచ్చింది. అనంతరం ‘మీకు మార్టిన్ కావాలా? అతడు మీడియా సమావేశంలో ఉన్నాడు. నేను అతడితో మీకు కాల్ చేయించవచ్చా?’ అని పైన్ అడగ్గా... ‘మెయిల్స్ చెక్ చేసుకోమనండి’ అని జవాబిచ్చాడు. ఈ విషయం మార్టిన్కు చెబుతానని పైన్ నవ్వుతూ సంభాషణను ముగించాడు. -
ఫోన్ వచ్చిందో ఒకటి నొక్కాల్సిందే
బద్వేలుకు చెందిన సురేష్కు ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే నేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నానని, ప్రభుత్వ పని తీరు సంతృప్తిగా ఉందా? అంటూ అడిగారు. సంతృప్తిగా ఉంటే ఒకటి, లేకుంటే రెండు నొక్కాలని అన్నారు. సురేష్ రెండు నొక్కాడు. అంతే ఎందుకు? ఏమిటి? ఎలా? అంటూ సిబ్బంది విసిగించారు. దీంతో ఎందుకొచ్చిన ఈ తిప్పలంటూ అక్కడి నుంచి ఫోన్ వస్తే చాలా ఒకటి నొక్కేస్తున్నారు.పోరుమామిళ్లకు చెందిన చెన్నారెడ్డికి ఫోన్ కాల్ వచ్చింది. పౌరసరఫరాల శాఖ పనితీరు ఎలా ఉందని ప్రశ్నించారు. సంతృప్తిగా లేదని చెప్పాడు. అంతే పదే పదే ఫోన్లు.. ప్రశ్నల మీద ప్రశ్నలు.. చేసేది లేక అంతా బాగుందని చెప్పాడు. వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు: ప్రభుత్వం పాలన కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆర్టీజీఎస్ ద్వారా చేస్తున్న ఫోన్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఫోన్ వచ్చిన తర్వాత సంతృప్తిగా ఉన్నామన్న అభిప్రాయం చెబితేగాని వదలడం లేదు. దీనికి నిదర్శనం సురేష్, చెన్నారెడ్డిలకు వచ్చిన ఫోన్కాల్సే. జిల్లాలో అనేకమంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రభుత్వాలు పథకాలు అమలు చేయడం, వాటిని అర్హులకు అందేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించడం తెలుసు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రచారం చేసుకునేందుకు ప్రజలకు రియల్ టైం గవర్నెన్స్ సోసైటీ (ఆర్టీజీఎస్) ద్వారా ఫోన్లు చేసి ప్రజలతో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిస్తో వస్తున్న ఫోన్ సంతృప్తిగా ఉన్నారా? ఉంటే 1 నొక్కండని, లేదంటే 2 నొక్కాలని అడుగుతున్నారు. ఇలా జిల్లాలో రోజూ ప్రభుత్వ పనితీరు, పథకాల అమలుపై వేలాది మందికి ఫోన్లు వస్తున్నాయి. ఇందులో చాలా మంది ఒకటి నొక్కుతుండటం విశేషం. రెండు నొక్కితే... పొరపాటున అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు నొక్కారంటే రోజంతా పని చేయనవసరం లేదు. అక్కడి సిబ్బంది ఎందుకు అసంతృప్తిగా ఉన్నారంటూ అనేక ప్రశ్నలు వేసి విసిగిస్తారు. పైగా కొందరిని వారికి సంబంధం లేని అంశాలపై కూడా అభిప్రాయాలు కోరుతున్నారు. రేషన్కార్డు లేనివారిని, పెన్షన్ అందుకొని వారిని ఆయా పథకాలపై అభిప్రాయం కోరుతున్నారు. కొందరు తమకు సంబంధం లేని విషయం కావడంతో ఫోన్ కట్ చేస్తున్నారు. అయినా మళ్లీ ఫోన్ చేస్తుండటంతో అభిప్రాయం చెప్పని పరిస్థితి. రెండు నొక్కితే పదే పదే ఫోన్లు వస్తుండటంతో ఎందుకు వచ్చిన సమస్య అంటూ ఒకటి నొక్కుతున్నారు. ఈ ఫోన్లలో ఆధార్కార్డు, ఊరు, పేరు, ఇతర ఇబ్బందికర వివరాలు అడుతుండటంతో ఒకటి బెటర్ అనే భావనలో అసంతృప్తిగా ఉన్నా ఒకటి నొక్కక తప్పడం లేదని వాపోతున్నారు. అనేక మంది అధికారుల మధ్య కూడా ఈ చర్చ నడుస్తూనే ఉంది. అయినా ఎవరూ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెల్లడం లేదు. తీసుకెళ్లినా ప్రభుత్వంతో ఎందుకొచ్చిన ఇబ్బంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రచార్భాటం ప్రజలకు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి లేకపోయినా, ఇష్టం లేకపోయినా, పథకాలు అందకపోయినా ఫోన్కాల్స్తో ఇబ్బంది పడటమెందుకని ఒకటి నొక్కుతున్నారు. దీంతో ప్రభుత్వం ఇది తమ ఘనత అంటూ ప్రచారం చేసుకోవడం విమర్శలు వస్తున్నాయి. ఇటివల కాలంతో ముఖ్యమంత్రితో పాటు అనేక మంది అధికార పార్టీ నేతలు తమ ప్రభుత్వంపై 70–80 శాతం సంతృప్తిగా ఉన్నారంటూ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాన్ని గమనిస్తున్న ప్రజలు మాత్రం నవ్వుకుంటున్నారు. ఇదే సంతృప్తి అనుకుంటే ప్రతిపక్షానికి మంచిదని సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అర్ధం చేసుకోపోయినా పర్వాలేదు గానీ, ప్రజలను విసిగించకుండా ఉంటే మంచిదని కోరుతున్నారు. -
ప్రాణం తీసిన ఫోన్ గొడవ
జవహర్నగర్: ఫోన్ కాల్ విషయమై కొందరు యువకుల మధ్య నెలకొన్న వివాదం ఘర్షణకు దారితీయడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి లోని యాప్రాల్ జెజె నగర్లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సీఐ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాప్రాల్లోని ఇందిరానగర్ చెందిన జైకుమార్ మీరాభాయ్కి ముగ్గురు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు విక్రమ్, మరో కుమారుడు విక్కి అలియాస్ చెన్నారెడ్డి(29)లు ఆదివారం రాత్రి కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గా మాత విగ్రహా ఊరేగింపునకు వెళ్లారు. అనంతరం విక్రమ్ ఇంటికి తిరిగి రాగా విక్కి తన స్నేహితులు జోసఫ్, క్రిష్ణ, వికాస్తో కలిసి జెజెనగర్కు చెందిన శ్రావణ్కుమార్ ఇంటికి వెళ్లి తమ వదిన ఫోన్కు ఎందుకు ఫోన్ చేస్తున్నావని నిలదీయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో విక్కి శ్రావణ్ తలపై కొట్టడంతో అతడికి గాయమైంది. దీం తో ఇంట్లోకి వెళ్లిన శ్రావణ్ కూరగాయల కోసే కత్తి తీసుకువచ్చి విక్కీపై దాడి చేయడంతో అతను కుప్పకూలాడు. దీనిని అడ్డుకునేందుకు యత్నించిన వికాస్పై కూడా దాడి చేశాడు. దీంతో అతను విక్కి సోదరుడు విక్రమ్కు సమాచా రం అందించడంతో విక్రమ్ అక్కడికి చేరుకున్నా డు. ఆగ్రహంతో ఉన్న శ్రావణ్ అతడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. విక్కీని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు విక్కి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విక్రమ్,వికాస్లను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘ టనా స్ధలాన్ని మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, జవహర్నగర్ సీఐ సైదు లు పరిశీలించారు. నిందితుడు శ్రావణ్కుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతుడి తల్లి మీరాభాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సాక్షి టీవీతో మాట్లాడిన సరోగసి బాధితురాలు
-
పొలిటికల్ కారిడర్ 6th August 2018
-
అమెరికా నుంచి జర్నలిస్టులకు సీఎం ఫోన్
పనాజీ: అనారోగ్యం కారణంగా గత నాలుగు నెలలుగా అమెరికాలో చికిత్స పొందుతోన్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ రాష్ట్ర పరిస్థితులపై ఆరాతీశారు. తనకు సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులకు ఫోన్ చేసి రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు. కాగా గత కొద్దికాలంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీకర్ విలేకరులతో మాట్లాడి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థిల గురించి అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని కొద్ది రోజుల్లో రాష్ట్రానికి తిరిగి రానున్నట్లు ముఖ్య మంత్రి పేర్కొన్నారు. సీఎంతో ఫోన్లో మాట్లాడిన ఓ సీనియర్ జర్నలిస్టు మీడియాతో మాట్లాడుతూ... కొద్దిరోజుల్లో గోవాకు వస్తున్నట్లు పరీకర్ చెప్పారన్నారు. ‘ప్రతిరోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాను. ప్రొటోకాల్ ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నాం. ప్రభుత్వ ఫైళ్లు స్కాన్ చేసి నాకు మెయిల్ చేస్తున్నారు. టెక్నాలజీ యంత్రాల ద్వారా ప్రతీది ఇక్కడే నుంచే తెలుసుకుంటున్నాను. డాక్టర్స్ని సంప్రదించి కొద్ది రోజుల్లో రాష్ట్రానికి తిరిగి వస్తా’ అని ముఖ్యమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా, గతవారం ముఖ్యమంత్రి ఖాతాలోని డబ్బును దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పాలన కుంటుపడింది. రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రాంకియాటైటిస్తో బాధపడుతున్న పరీకర్ మార్చి 7 నుంచి అమెరికాలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను ముగ్గురు మంత్రుల బృందం పర్యవేక్షిస్తోంది. -
సీఎం కార్యాలయానికి రైతు ఫోన్
మహాదేవపూర్ వరంగల్ రూరల్ : రైతు బంధు పథకంలోని చెక్కులు, పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లుతున్నాయి. తండ్రి పేరు, సర్వే నంబర్లు, భూముల వివరాలు సరిగా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెక్కులో పేరు తప్పు రావడంతో ఓ రైతు ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మçహాదేవపూర్ మండల కేంద్రం శివారులోని సర్వేనంబర్ 101/ఎలో ఆరేందుల సత్యనారాయణకు 3.29 భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి సత్యనారాయణకు బదులు పెద్దింటి చంద్రయ్య పేరుతో చెక్కు వచ్చింది. దీంతో రైతు సత్యనారాయణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేశాడు. జిల్లా కలెక్టర్ను ఆదేశించి తగిన న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని సత్యనారాయణ తెలిపారు. మీ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని సత్యనారాయణ మొబైల్కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మెస్సేజ్ కూడా వచ్చింది. -
దాచేపల్లి నిందితుడి చివరి ఫోన్కాల్..
సాక్షి, గుంటూరు: దాచేపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య వ్యవహారం ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు పరారీలో ఉన్న సుబ్బయ్య ఆచూకీ కోసం పోలీసులు 17 బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చేపట్టారు. మరో వైపు డ్రోన్ కెమెరాలతో కూడా కృష్ణా నది పరసర ప్రాంతాల్లో కూడా పోలీసులు గాలించారు. ఈ క్రమంలో సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గురజాల మండలం తేలికుట్ల- దైద దగ్గరున్న అమరలింగేశ్వర దేవాలయం సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీస్ యంత్రాంగం అక్కడ వెళ్లి సుబ్బయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుబ్బయ్య ఎప్పుడు చనిపోయాడనే విషయాన్ని వైద్యులు నిర్థారిస్తారని డీజీపీ మాలకొండయ్య వెల్లడించారు. అయితే సుబ్బయ్య గురువారం బంధువులకు ఫోన్ చేసి చనిపోతున్నట్టు తెలిపాడు. అందుకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డు బయటపడింది. ఆయన ఫోన్ కాల్ సంభాషణలో ‘పదిమందికి మంచి చెప్పి బతికేవాణ్ని.. కానీ అనుకోకుండా జరిగిపోయింది. నాకు చావడం ఒక్కడే మార్గం.. నేను చేయకూడని పని చేశాను. నా మొహం చూపెట్టుకోలేను. నేను చేసిన పనితో నా కొడుకు పరువు పోయింది. చావడానికే వెళ్తున్నాను.’ అని సుబ్బయ్య బంధువులకు తెలిపాడు. ఎలాంటి అఘాత్యం చేసుకోవద్దని బంధువులు వారిస్తున్నా సుబ్బయ్య వినిపించుకోలేదు. -
కేటీఆర్కు ట్వీట్తో...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సొంత పనిపై వచ్చాడు... పరిస్థితి చూసి చలించిపోయాడు... అంతే ఏ మాత్రం ఆలోచించలేదు... తన జేబులోంచి సెల్ఫోన్ తీసి ట్విట్టర్ మెస్సేజ్లకు వెంటనే స్పందించే మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశాడు. తరువాత పరిస్థితి తెలిసిందే.... అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సౌకర్యాలు సమకూర్చారు. అసలు విషయంలోకి వెళితే... మంచిర్యాల మునిసిపాలిటీ కార్యాలయం ఆవరణలోని ‘ఈ–డిజిటల్’ సేవ కార్యాలయం నిత్యం వివిధ సేవల కోసం వచ్చే సందర్శకులతో కిటకిటలాడుతుంది. ఇటీవల ఓ యువకుడు తనకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ–డిజిటల్ సేవా కార్యాలయానికి వచ్చాడు. దాదాపు గంట వరకు వరసలో ఉండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా... ఇక్కడే అసలు విషయం జరిగింది. గంట సమయంలో ఆ యువకుడు కార్యాలయంలో పలు సమస్యలు గుర్తించాడు. ఫ్యాన్లు తిరగక పోవడం, ట్యూబ్లైట్లు పని చేయక పోవడం గమనించాడు. సిబ్బంది కొరతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి బాధేసింది. అంతే వెంటనే ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్కు తన మోబైల్ నుంచి మంచిర్యాల ఈ– డిజిటల్ పరిస్థితిని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు ఫోన్ చేసి ఈ–డిజిటల్ సేవలోని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్ కర్ణన్ పరిస్థితిని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధరకు తెలియజేసి... వారితో కలిసి కార్యాలయానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కర్ణన్ వెంటనే ఈ–డిజిటల్ కార్యాలయానికి కొత్త కూలర్ మంజూరు చేయించారు. ఇదే సమయంలో మున్సిపల్ చైర్ పర్సన్ వసుంధర కార్యాలయంలో ట్యూబ్లైట్లు ఏర్పాటు చేయించారు. ఫ్యాన్లు మరమ్మతులు చేయించి అవసరమైతే కొత్త ఫ్యాన్లు ఏర్పాటు చేయించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ద్వారా సమకూరిన సౌకర్యాలకు డిజిటల్ కార్యాలయం సిబ్బందితో పాటు సందర్శకులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే... మంత్రికి ట్వీట్ చేసిన ఆ వ్యక్తి ఎవరో మాత్రం తెలియకపోవడం కొసమెరుపు. -
ఫోన్కాల్తో ఆగిన ఎమ్మెల్యే అరెస్ట్
సాక్షి, లక్నో : లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ను అరెస్ట్ చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ నిర్ణయానికి వచ్చినా పార్టీ ప్రముఖుడి నుంచి వచ్చిన ఫోన్కాల్తో మనసు మార్చుకున్నారని బీజేపీ సీనియర్ నేత పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ను అరెస్ట్ చేయడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించేందుకు సీఎం నిర్ణయం తీసకున్నారని, ప్రముఖ నేత ఫోన్ కాల్తో ఆ నిర్ణయం వాయిదా పడిందని, దీని ప్రభావం పార్టీపై తప్పకుండా ఉంటుందని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత ఐపీ సింగ్ చెప్పారు. చట్టానికి లోబడి నడుచుకోకుంటే పాలక పార్టీ లేదా విపక్షమైనా మూల్యం చెల్లించుకోకుండా తప్పించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఉన్నావ్ లైంగిక దాడి, కస్టడీ మరణాలపై సీబీఐ విచారణతో పాటు ఎమ్మెల్యే సెంగార్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి ఐపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాదాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు లైంగిక దాడి ఆరోపణలు చేసిన బాధితురాలితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సెంగార్పై నార్కో పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన ఇదే యువతి కొన్నేళ్ల కిందట ఓ వ్యక్తిపై లైంగిక దాడి కేసు నమోదు చేసినట్టు తెలిసిందని సింగ్ చెప్పారు. అయితే తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తోసిపుచ్చారు. -
పరుగులు పెట్టించిన ఫోన్ కాల్
రాజేంద్రనగర్: నార్సింగి పోలీసులతో పాటు గండిపేట మండల రెవెన్యూ అధికారులను ఓ ఫోన్ కాల్ ఉరుకులు పరుగులు పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. నార్సింగి పోలీస్స్టేషన్కు గండిపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం మధ్యాహ్నం ఫోన్ చేశాడు. గండిపేట శ్మశానవాటికలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక శవాన్ని మూటలో కట్టి పూడ్చిపెట్టి వెళ్లారని సమాచారం అందించాడు. తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఎక్కడా ఎవరూ మృతి చెందలేదని తెలిపాడు. దీంతో కానిస్టేబుల్ విషయాన్ని ఇన్స్పెక్టర్కు సమాచారం అందించాడు. అప్రమత్తమైన ఇన్స్పెక్టర్ విషయాన్ని గండిపేట మండల తహసీల్దార్కు సమాచారం అందించి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. పోలీసులతో పాటు తహసీల్దార్, ఆర్ఐ శ్మశానవాటికలో పూడ్చిన స్థలం వద్దకు వెళ్లి గోతిని తీయడం ప్రారంభించారు. అనంతరం ఒక తెల్లటి వస్త్రం చుట్టిన మూట కనిపించింది. మూటను బయటకు తీసి చూడగా అందులో కుక్క శవం ఉంది. దీంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు. తిరిగి ఆ కుక్క శవాన్ని అలాగే పూడ్చిపెట్టారు. దాదాపు 4 గంటల పాటు ఈ హైడ్రామా కొనసాగింది. తాము పెంచుకుంటున్న కుక్క మృతి చెందడంతో యజమానులు దానిని తీసుకొచ్చి శ్మశానవాటికలో పూడ్డారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న శ్మశానవాటిక నిర్వాహకుడికి సమాచారం అందించలేదు. -
ఒక్క ఫోన్కాల్.. రూ.42 లక్షలు మాయం
చిత్తూరు అర్బన్: ఒక్క ఫోన్కాల్.. ఇద్దరి వద్ద ఉన్న రూ.42 లక్షల్ని మాయం చేసింది. ఎవరు, ఏమిటని ఆలోచించకుండా సెల్ఫోన్కు వచ్చే కాల్స్కు, మెసేజ్లకు రిప్లై ఇవ్వడం ద్వారా బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.లక్షలు మోసపోయినట్లు గుర్తిం చారు. బాధితులు సోమవారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీసు గ్రీవెన్స్డేకు ఏఎస్పీ రాధికను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. గంగాధరనెల్లూరు మండలం ఎల్లమరాజులపల్లెకు చెంది న లోకనాథరెడ్డి భారత సైన్యంలో జేసీవోగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఇటీవల ఆయనకు ఒక ఫోన్కాల్ వచ్చింది. తాము ఢిల్లీలోని కోకా–కోలా శీతల పానీయం కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నారు. జిల్లాలో తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఏజెన్సీ ఇస్తామని నమ్మబలి కారు. తొలుత కాస్త అనుమానించినా ఫోన్లో అవతలివారి మాటలను బట్టి నమ్మేశాడు. ఇలా ఏజెన్సీ కోసం దశలవారీగా తన బ్యాంకు ఖాతా నుంచి రూ.33,56,361 డిపాజిట్ చేశాడు. అయినా ఇంకా కొంత డిపాజిట్ చేయాలని చెప్పడంతో లోకనాథరెడ్డి గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఫోన్ స్విచ్ఆఫ్ చేసే శారు. ఏంచేయాలో తెలియని బాధితుడు ఏఎస్పీని కలిసి తన బాధను విన్నవించుకున్నాడు. చిత్తూరు నగరం ఎస్టేట్ రోడ్డులో ఉన్న రఘురామ్నగర్ కాలనీకి చెందిన అరుణకుమారి సెల్ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో శ్యామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇటీవల నిర్వహించిన లక్కీడిప్లో రూ.1.50 కోట్ల విలువైన బహుమతి గెలుచుకున్నారని, మెయిల్, ఫోన్, చిరుమానా చెప్పాలని ఉంది. ఆమె వివరాలు ఇచ్చింది. తర్వాత ఓ బ్యాంకు ఖాతా నెంబరు ఇచ్చి ఇందులో తాము చెప్పినంత నగదు డిపాజిట్ చేయాలని అవతలి వ్యక్తులు పేర్కొన్నారు. అరుణకుమారి తన ఖాతా నుంచి పలుమార్లు రూ.8.58 లక్షలు ఆ కంపెనీ చెప్పిన ఖాతాలోకి వేసింది. తీరా తాను మోసపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులను ఆశ్రయించింది. ఈ రెండు ఘటనల్ని సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఏఎస్పీ అధికారులను ఆదేశించారు. -
అయ్యా.. ఎలా మోసపోయావయ్యా..?
దమ్మపేట: ఆయన పేరు శ్యాంబాబు. తాను మోసపోయానంటూ బ్యాంక్ అధికారి వద్దకు వెళ్లాడు. జరిగినదంతా చెప్పాడు. అంతా విన్న ఆ అధికారి.. ‘‘పేపర్లు చూడడం లేదా? టీవీ చూడడం లేదా? ఈమాత్రం తెలియదా? బ్యాంక్ నుంచి ఎప్పుడూ.. ఏ ఒక్కరూ ఫోన్ చేయరు. ఎవరైనా మీకు ఫోన్ చేసి, ఫలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని అన్నారంటే.. అతడుగానీ, ఆమెగానీ పచ్చి మోసగాళ్లన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది తరచుగా పత్రికల్లో, టీవీల్లో వస్తున్నది. అయినా మారు మారకపోతే ఎలాగయ్యా..! ఇలా ఇంకెన్నాళ్లు మోసపోతారయ్యా..?’’ అని, ఆ అధికారి ఆవేదనగా ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే... దమ్మపేటకు చెందిన అతడి పేరు శ్యాంబాబు. పూర్వపు ఎస్బీహెచ్ ఖాతాదారుడు. మంగళవారం అతడికి ఎవడో ఫోన్ చేశాడు. ‘‘నా పేరు అమిత్రెడ్డి. నేను హైదరాబాద్ కోఠి ఎస్బీఐ బ్రాంచి నుంచి మాట్లాడుతున్నాను. మీ ఎస్బీహెచ్ ఖాతా, ఏటీఎం నంబర్లు బ్లాక్ అయ్యాయి. ఎస్బీహెచ్ను ఎస్బీఐలో విలీనం చేశారు. వెంటనే ఏటీఎం నంబర్, పిన్ చెప్పండి. లేకపోతే మీ ఖాతాలోని డబ్బు పోతుంది’’ అన్నాడు. శ్యాంబాబు భయపడ్డాడు. వెంటనే తన ఖాతా నంబర్, ఏటీఎం పిన్ చెప్పాడు. ‘‘మీ ఫోన్కు ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్) వస్తుంది. ఆ నెంబర్ కూడా చెప్పాలి’’ అన్నాడు. కొద్దిసేపటి తరువాత మళ్లీ ఫోన్ చేశాడు. ఓటీపీ నంబర్ను శ్యాంబాబు చెప్పాడు. కొద్దిసేపటి తరువాత, శ్యాంబాబు సెల్కు మెసేజ్ వచ్చింది. ఖాతా నుంచి రూ.500 డ్రా అయిట్టుగా అందులో ఉంది. ఇంకాసేపటిలో మరో మెసేజ్ వచ్చింది. ఈసారి రూ.9000 డ్రా అయినట్టుగా అందులో ఉంది. శ్యాంబాబు లబోదిబోమన్నాడు. అతడు వెంటనే స్థానిక ఎస్బీఐకి పరుగెత్తాడు. అక్కడి మేనేజర్ రాఘవేంద్రకుమార్కు జరిగినదంతా వివరించాడు. ‘‘ఇలాంటి సైబర్ నేరాలపై పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ ఇలాంటివి ఎలా నమ్మారు?’’ అంటూ, మేనేజర్ రాఘవేంద్రకుమార్ ప్రశ్నించారు. ఆయన సూచనతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బాధితుడు శ్యాంబాబు వెళ్లాడు. శ్యాంబాబు నగదు ముంబైలో డ్రా అయినట్టుగా గుర్తించినట్టు మేనేజర్ రాఘవేంద్రకుమార్ తెలిపారు. -
ప్రేయసి ఫోన్ తియ్యలేదని యువకుడి ఆత్మహత్య
ఇరగవరం : ప్రేయసి ఫోన్లో మాట్లాడలేదని క్షణికావేశంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం శివారు గొల్లమాలపల్లిలో మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రుకు చెందిన వింజేటి తాతారావు చిన్న కుమారుడు నవీన్ (21), గొల్లమాలపల్లికి చెందిన యువతి కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. యువతి తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉంటోంది. యువతి నవీన్కు వరుసకు అక్క కూతురు కావడంతో పెద్దలు కూడా వీరికి పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇటీవల యువతి తల్లి సొంతంగా గ్రామంలో భవన నిర్మాణం చేపట్టడంతో ఆ పనులను నవీన్ దగ్గరుండి చేయిస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి నవీన్ యువతికి ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో ఉద్రేకంగా గొల్లమాలపల్లిలోని యువతి ఇంటికి వచ్చి ఫోన్ ఎందుకు ఎత్తలేదని నిలదీస్తూ తాను ఉరేసుకుంటానని బెదిరించాడు. భయంతో యువతి బంధువులను పిలుచుకొచ్చేసరికే నవీన్ చున్నీతో ఉరివేసుకుని మరణించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఇలారా.. నీ నవ్వు బావుంది!
ఐర్లాండ్ పాత్రికేయురాలితో ట్రంప్ వాషింగ్టన్: వింత చేష్టలు, అర్థంకాని హావభావాలకు పెట్టింది పేరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బారిన ఈసారి ఓ ఐర్లాండ్ మహిళా జర్నలిస్టు పడ్డారు. ఆయన ఓపక్క ముఖ్యమైన ఫోన్కాల్లో మాట్లాడుతూ.. మరోపక్క అందరిముందూ ఆమెను ‘ఇలారా..’ అంటూ దగ్గరికి పిలిపించుకుని ‘నీ నవ్వు సూపర్’ అని అతిగా ప్రవర్తించారు. మంగళవారం వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసులో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఐర్లాండ్కు ప్రధానిగా ఎన్నికైన భారత సంతతి నేత లియో వారాడ్కర్ను ట్రంప్ ఫోన్ చేసి అభినందించారు. మాటల మధ్యలో..‘మీ దేశ మీడియా అంతా ఇక్కడే ఉంది’ అని అన్నారు. అలా మాట్లాడుతూనే అక్కడున్న కైత్రియోనా పెర్రీ అనే మహిళా జర్నలిస్టును దగ్గరికి పిలిచారు. ‘ఎక్కణ్నుంచి వచ్చావు? ఇలారా.. ఇలారా..! ఆమె నవ్వు ఎంతో బావుంది. ఆమె మిమ్మల్ని బాగా చూసుకుంటుంది’ అని అటువైపు ఫోన్లో ఉన్న వారాడ్కర్తో చమత్కరించారు. దీంతో పెర్రీ బిక్కచచ్చిపోయింది. తర్వాత ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ ఇదెక్కడి విడ్డూరమని వాపోయింది! ఓ దేశ నాయకుడితో మాట్లాడేటప్పుడు హుందాగా ఉండకుండా అమ్మాయిలతో ఈ పరాచికాలేంటని నెటిజన్లు ట్రంప్ను దులిపేస్తున్నారు. -
కన్నీటి పర్యంతమైన మంత్రి నారాయణ
-
నారాయణను ఫోన్ లో పరామర్శించిన వైఎస్ జగన్
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన మంత్రి నారాయణను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. వైఎస్ జగన్ గురువారం మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా నిషిత్ మృతిపట్ల ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు అతని అంత్యక్రియలు నెల్లూరులో నిర్వహించారు. -
నిషిత్ అంత్యక్రియలు పూర్తి
నెల్లూరు : రోడ్డు ప్రమాదంలో కొడుకును పోగొట్టుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రమాదం జరిగిన రాత్రి తన కుమారుడు నిషిత్తో ఫోన్లో మాట్లాడారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కుమారుడికి ఫోన్ చేశారు. ’నాన్న నిషీ ఎక్కడున్నావ్... టైమ్ పదకొండు అవుతోంది, ఇంకా ఇంటికి వెళ్లలేదా?. భోజనం చేశావా? జాగ్రత్తగా ఇంటికి వెళ్లు. నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. రెండురోజుల్లో తిరిగి వచ్చేస్తాను. నువ్వు కారు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త’ అంటూ ఫోన్లో మాట్లాడారు. అవే తన కొడుకుతో మంత్రి మాట్లాడిన చివరి మాటలు. ...మరికొద్ది గంటల్లోనే కుమారుడి మరణవార్త వినాల్సి వచ్చింది. తన స్నేహితుడు రవిచంద్రతో కలిసి వెళుతున్న నిషిత్ కారు అతివేగంగా మెట్రో ఫిల్లర్ను ఢీకొట్టిన విషయంత తెలిసిందే. ఈ దుర్ఘటనలో నిషిత్తో పాటు అతని స్నేహితుడు దుర్మరణం చెందారు. మరోవైపు కుమారుడి మరణవార్త విన్న మంత్రి నారాయణ హుటాహుటీన లండన్ నుంచి గురువారువారం తెల్లవారుజామున నెల్లూరు చేరుకున్నారు. నిషిత్ మృతదేహాన్ని చూసి ఆయన భోరున విలపించారు. పెన్నానది తీరంలోని బోడిగాడి తోట శ్మశాన వాటికలో నిషిత్ అంత్యక్రియలు జరిగాయి. కొడుకు చితికి మంత్రి నారాయణ నిప్పంటించారు. అంత్యక్రియల కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు నెల్లూరులో నారాయణ కళాశాల నుంచి నిషిత్ అంతిమ యాత్ర కొనసాగింది. -
సెల్ఫోన్ వస్తుందని.. మోసం
చిలుకూరు(కోదాడ): ‘నీ నంబర్కు ఆఫర్ వచ్చింది.. ఖరీదైన సామ్సంగ్ ఫోన్ పంపిస్తున్నాం’ అని ఫోన్ చేసి మోసం చేసిన సంఘటన మంగళవారం చిలుకూరులో చోటుచేసుకుంది. మండలంలోని జానకీనగర్ గ్రామానికి చెందిన బాణోతు రమేష్కు వారం రోజుల క్రితం ఒక ఫోన్ వచ్చింది. ‘నీ ఫోన్ నంబర్కు ఖరీదైన సామ్సంగ్ జే7 ఫోన్ ఆఫర్ వచ్చింది.. అడ్రస్ చెప్తే.. ఫోన్ పంపిస్తా’మని చెప్పారు. దీంతో రమేష్ అడ్రస్ చెప్పాడు. సోమవారం మరోసారి ఫోన్ చేసి నీకు మంగవారం చిలుకూరు ఫోస్టాఫీస్కు సెల్ఫోన్తో కూడిన ఫ్యాకేజీ వస్తుందని అందుకు కేవలం రూ.మూడు వేలు చెల్లించాలని చెప్పారు. రమేష్ వెంటనే మంగళవారం చిలుకూరు ఫోస్టాఫీస్కు వెళ్లడంతో.. రూ.మూడు వేలు ఇచ్చి ఫ్యాకేట్ ఓపెన్ చేయాలని పోస్మెన్ చెప్పడు. దీంతో రమేష్ రూ.మూడు వేలు ఫ్యాకేట్కు, పోస్టల్ ఛార్జీలు రూ.300 చెల్లించి ఫ్యాకేట్ ఓపెన్ చేశారు. అందులో సెల్ఫోన్ లేదు.. లక్ష్మీదేవి బొమ్మ, కూర్మం యంత్రం, శ్రీచక్ర యంత్రం ఉన్నాయి. వీటి విలువ మొత్తం కలిపినా.. కేవలం రూ.100 లోపే ఉంటుంది. దీంతో జరిగిన మోసాన్ని గ్రహించి లబోదిబోమన్నాడు. ఇలాంటి సంఘటన చిలుకూరు మండలంలోని ఇప్పటికే నాలుగు జరిగినట్లుగా తెలిసింది. ఈ విషయంపై ఇప్పటికైనా పోలీసులు చొరవ తీసుకుని ఇలాంటి మోసాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
‘ట్రంప్ ఫోన్ చేశారు.. ఆయనే మాట్లాడలేదు’
వాషింగ్టన్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అటార్నీగా పనిచేస్తున్న భారత సంతతి అమెరికన్ ప్రీత్ బరారాకు ఫోన్ చేసి మాట్లాడేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారని శ్వేతసౌదం తెలిపింది. అయితే, ఆయనే ఫోన్ ఎత్తలేదని పేర్కొంది. గత గురువారమే ట్రంప్ ఆయనకు ఫోన్ చేసేందుకు పలుమార్లు ప్రయత్నించారని వెల్లడించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలన హయాంతో బరారాతోపాటు దాదాపు 46మందిని అటార్నీలుగా నియమించారు. ప్రస్తుతం ట్రంప్ పాలన రావడంతో ఆ స్థానాలు భర్తీ చేసేందుకు ఒబామా హయాంలో నియమించబడిన అధికారులంతా కూడా ఉన్నపలంగా తమ బాధ్యతల నుంచి వైదొలగాలని ఆదేశించారు. అయితే, గతంలోనే ట్రంప్ను కలిసిన బరారా ఆయన కొనసాగేందుకు అనుమతి తీసుకున్నట్లు చెబుతూ తాను బాధ్యతల నుంచి తప్పుకునేందుకు నిరాకరించారు. దీంతో తనపై ట్రంప్ అధికార వర్గం తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బరారా మీడియాకు చెప్పారు. ఈ నేపథ్యంలో స్పందించిన వైట్ హౌస్ తాము ముందే బరారాకు ఈ విషయం చెప్పామని, ఆయనే అందించిన విలువైన సేవలకు ధన్యవాదాలు చెప్పి ఆయనకు అభినందించేందుకు ట్రంప్ ఫోన్ చేసే ప్రయత్నం చేశారని, కానీ, తన సీనియర్ల ఆమోదం లేకుండా తాను ట్రంప్తో మాట్లాడబోనని ఆయన నిరాకరించినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు. -
ఐదు నిమిషాలు హ్యాపీగా ఫోన్లో ట్రంప్
బ్యూనస్ఎయిర్స్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిసియో మ్యాక్రితో ఐదు నిమిషాలు మాట్లాడారు. అది కూడా చాలా సంతోషంగా.. తమ దేశాన్ని సందర్శించేందుకు రావాలంటూ. అదీ కాకుండా ట్రంప్ తమ దేశంలో ఎంతో ముఖ్యంగా భావించే ఉద్యోగాల విషయంలో చర్చించుకుందామని.. ఈక్రమంలో వెనిజులా గురించి కూడా ఆయన మ్యాక్రితో చర్చించారు. ఈ విషయాన్ని అధ్యక్ష భవనం స్పష్టం చేసింది. ‘ట్రంప్ అర్జెంటీనా అధ్యక్షుడు మ్యాక్రితో తో ఐదు నిమిషాలపాటు మాట్లాడారు. ప్రాంతీయ విషయాలు చర్చించుకునేందుకు ఆయన వాషింగ్టన్కు రావాలని ఆహ్వానించారు. అమెరికాలో అర్జెంటీనా నుంచి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. చాలా సంతోషం వ్యక్తం చేశారు. 2016 నవంబర్లో ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు మా అధ్యక్షుడు మ్యాక్రితో మాట్లాడారు. వీరిద్దరి మధ్యగతం నుంచే మంచి సంబంధాలు ఉన్నాయి’ అని శ్వేత సౌదం తెలిపింది. జీ 20 సదస్సు జరిగే సమయాన్ని ఉపయోగించుకొని ఆ సమయంలోనే వాషింగ్టన్ను సందర్శించేలా ఇరు దేశాలు ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా పేర్కొంది. -
మనం కలిసుందాం.. వాళ్లను కుమ్మేద్దాం!
మాస్కో/వాషింగ్టన్: దాదాపు గంటపాటు జరిపిన ఫోన్ సంభాషణలో అగ్రదేశాధినేతలిద్దరూ ప్రపంచ సమస్యలను చర్చించారు. చివరికి ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు.. అమెరికా, రష్యాలు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. అదేసమయంలో భూగోళం నుంచి ఉగ్రవాదాన్ని తరిమేయాలని నిర్ణయించుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రప్ తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో శనివారం ఫోన్లో మాట్లాడారు. ఇద్దరు నేతలు గంటపాటు ఫోన్లో మాట్లాడుకున్నారని, ప్రపంచానికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నట్లు రష్యా అధికార కేంద్రం క్రెమ్లిన్, యూఎస్ అధ్యక్ష భవనం వైట్హౌస్ అధికార ప్రతినిధులు మీడియాకు చెప్పారు. అమెరికా-రష్యాల మధ్య సత్సంబంధాల పునరుద్ధారణ ఆవశ్యకమని ఇరునేతలు అభిప్రాయపడ్డట్లు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఐసిస్, సిరియాలో అంతర్యుద్ధం, అంతర్జాతీయ ఉగ్రవాదం, ఉత్తర కొరియా దూకుడు తదితర అంశాలపై ట్రంప్, పుతిన్లు చర్చించారని ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల ఎత్తివేత గురించి ట్రంప్, పుతిన్ మాట్లాడుకున్నారా లేదా అనేదానిపై ఇరుదేశాల ప్రతినిధులు సమాధానం ఇవ్వలేదు. ఫోన్ చర్చల ఫలితంగా సిరియాలో బాంబుల మోత ఆగుతుందా? లేదా? అనే ప్రశ్నకూ జవాబు దాటవేశారు. కాగా, అతి త్వరలోనే నేరుగా కలుసుకుని చర్చలు జరపాలని ట్రంప్-పుతిన్లు నిర్ణయించుకున్నారు. ట్రంప్ రష్యాకు వెళతారా? లేక పుతిన్నే అమెరికాకు ఆహ్వానిస్తారా? అనేది ఇప్పుడే చెప్పలేమని క్రెమ్లిన్, వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఫోన్ కాల్తో అకౌంట్లో సొమ్ములు మాయం
ద్రాక్షారామ (రామచంద్రపురం) : ఒక ప్రక్క ప్రభుత్వం ప్రజలను హైటెక్కుకు మళ్లించాలని బలవంతపు ప్రయోగాలు చేపడుతోంది. ఇదే అదనుగా ఆ¯ŒSలై¯ŒS మోసగాళ్లు విజృంభిస్తున్నారు. విషయానికి వస్తే బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కె.గంగవరం మండలం కుందూరు గ్రామానికి చెందిన కొరిపల్లి శ్రీనువాసుకు ద్రాక్షారామ స్టేట్బ్యాంకులో ఖాతా ఉంది. ఈ నెల 19న అతనికి 7546944897 నంబరు గల సెల్ నుంచి ఫో¯ŒS వచ్చింది. మేం ద్రాక్షారామ బ్యాంకు నుంచి ఫో¯ŒS చేస్తున్నాం మీ బ్యాంకు అకౌంట్ లాక్ అయ్యింది (అకౌంట్ నెంబరు చెప్పి), మీ ఏటీఎం కార్డు మీద ఆఖరి ఐదు నెంబర్లు చెప్పండి అనడంతో శ్రీనివాస్ ఆ కాల్ నిజమనుకుని వివరాలు చెప్పాడు. తరువాత రోజు బ్యాంకుకు వెళ్లి చూడగా ఖాతాలో రూ. 97,978 లు సొమ్ము మాయమైంది. బ్యాంకు అధికారులకు విషయం చెప్పగా సదరు ఫో¯ŒS చేసిన వ్యక్తి సొమ్ములు కాజేసాడని చెప్పడంతో ఏం చేయాలో అర్ధం కాలేదని శ్రీనివాస్ తెలిపాడు. శుక్రవారం ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు శ్రీనివాస్ తెలిపాడు. -
కాల్ తోంది
-
యూఎస్ నుంచి అజిత్ దోవల్కు ఫోన్కాల్
వాషింగ్టన్: భారత జాతీయ భత్రతా సలహాదారు అజిత్ దోవల్ కు అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సుసన్ రైస్ ఫోన్ చేశారు. ఉడీ ఉగ్రవాద ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో పాకిస్థాన్ను తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆమె దోవల్కు తెలిపారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలపై పాక్ కఠిన చర్యలు తీసుకుంటుందని తాము భావిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఉడీ ఉగ్రదాడి అనంతరం అమెరికా అత్యున్నత అధికారి స్పందించడం ఇదే తొలిసారి. ఉగ్రవాద బాధిత దేశాలకు న్యాయం చేసేందుకు తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామనే ఒబామా సందేశాన్ని ఆమె దోవల్కు వివరించారు. ఉగ్రవాదులను ఒంటరి చేసేందుకు మరింత సహకారంతో కలిసి పనిచేసేందుకు ఆమెహామీ ఇచ్చారని ఫోన్ కాల్ వివరాలను అమెరికా అధ్యక్షుని అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు. -
కృష్ణవంశీకి 'చిరు' కాల్
మెగాస్టార్ చిరంజీవి.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి సర్ప్రైజ్ కాల్ చేశారనే వార్త ఇప్పుడు సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. కృష్ణవంశీ తాజా చిత్రం 'నక్షత్రం'లో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అతిధి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వివరాలు తెలుసుకునేందుకే చిరు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. చిత్ర కథ, తేజు పాత్ర గురించి అడిగారట మెగాస్టార్. కథ విన్న తర్వాత బావుందంటూ మెచ్చుకున్నారట. స్వయంగా చిరంజీవి కాల్ చేయడం, కథ తెలుసుకుని బావుందంటూ కితాబునివ్వడంతో కృష్ణవంశీ బోలెడంత ఆనందంలో మునిగిపోయారు. కాగా సోమవారం చిరంజీవి పుట్టినరోజు కావడంతో అభిమానులు భారీ ఎత్తున వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరు 150వ సినిమాకు 'ఖైదీ నెంబరు 150' అనే టైటిల్ను కన్ఫామ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్.