S Jaishankar
-
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారతీయులు దుర్మరణం
రియాద్ : సౌదీ అరేబియాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు దుర్మణం పాలయ్యారు. ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రమాదంపై స్థానిక అధికారులతో మాట్లాడుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. Grieved to learn of this accident and the loss of lives. Spoke with our Consul General in Jeddah, who is in touch with the concerned families. He is extending fullest support in this tragic situation. https://t.co/MHmntScjOT— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 29, 2025ప్రమాదంపై జిజాన్లో భారత రాయభార కార్యాలయం మృతులకు సంతాపం తెలిపింది. ప్రమాద బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని, స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపింది. ప్రమాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. జెడ్డాలోని రాయబార కార్యాలయంతో తాను మాట్లాడినట్లు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అడిగి తెలుసుకున్నామన్న జైశంకర్ ఈ విషాద పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. -
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (donald trump) ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు షురూ అయ్యాయి. ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధిత విభాగం ఆయా దేశాలకు ఆహ్వానం పంపుతోంది. తాజాగా భారత్ (india)కు సైతం ఆహ్వానం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొనాలంటూ భారత్కు ఆహ్వానం అందింది. భారత్ తరుఫున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) హాజరు కానున్నారు.గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ‘ట్రంప్-వాన్స్ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వానం మేరకు, విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భారత ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.’ అని కేంద్రం వెల్లడించింది. అమెరికా పర్యటనలో ట్రంప్తో పాటు, ఇతర నేతలు, రాజకీయేతర ప్రముఖుల్ని సైతం కలవనున్నారు. క్యాపిటల్ భవనం ముందు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ ప్రసంగిస్తారు. ప్రమాణ స్వీకారానికి జో బైడెన్ హాజరుకానున్నారు. కాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్.. జోబైడెన్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. ట్రంప్ ప్రారంభోత్సవ వేడుకకు పలువురు ప్రపంచ నేతలను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించినట్లు సమాచారం 👉చదవండి : నా ఉరిశిక్షను రద్దు చేయండి.. కోర్టుకు ట్విన్ టవర్స్ దాడి మాస్టర్మైండ్ -
ట్రంప్ విజయంపై భారత్ ఆందోళన?.. జైశంకర్ రిప్లై ఇదే..
ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి.. అధ్యక్షుడిగా ఎన్నికవటంపై భారత్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక చాలా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయని, కానీ వాటిలో భారత్ లేదని స్పష్టం చేశారు. ముంబైలో ఆదిత్య బిర్లా 25వ సిల్వర్ జూబ్లీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్లో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు అధ్యక్షులుగా పని చేసిన పలువురితో సత్సంబంధాలను ఏర్పరచుకున్నారు. మోదీ.. మొదట వాషింగ్టన్ డీసీని సందర్శించినప్పుడు.. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత డొనాల్డ్ ట్రంప్, ఆయన అనంతరం జో బిడెన్ అధ్యక్షులుగా ఉన్నారు. మోదీ అమెరికా అధ్యక్షులుగా ఉన్నవారితో సంబంధాలను సహజంగానే ఏర్పరుచుకుంటారు. అయితే.. ప్రస్తుత పరిస్థితులల్లో అనేక దేశాలు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ గురించి ఆందోళన చెందుతున్నాయి. అయితే వాటిలో భారత్ లేదు’’ అని స్పష్టం చేశారు.#WATCH | Mumbai: At Aditya Birla 25th Silver Jubilee Scholarship Program, EAM Dr S Jaishankar says "...The Prime Minister was among the first three calls President Trump took. PM Modi has built rapport across multiple Presidents. When he first came to DC, Obama was the President,… pic.twitter.com/hSLDK8sKKF— ANI (@ANI) November 10, 2024ఇక.. నవంబర్ 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన అనంతరం భారత ప్రధాని మోదీ ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఫోన్ సంభాషణ సమయంలో.. ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోదీని అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. ప్రపంచం మొత్తం మోదీని ప్రేమిస్తోందని అన్నారు.చదవండి: ట్రంప్ ‘2.0’ విదేశీ విధానంపై సర్వత్రా ఉత్కంఠ చదవండి: కెనడాలో ఆలయంపై దాడి.. స్పందించిన భారత విదేశాంగ శాఖ -
పన్నూ మమ్మల్ని బెదిరించాడు: ఆస్ట్రేలియన్ టుడే
భారతదేశ విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఇంటరర్వ్యూ ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా టుడే మీడియా సంస్థపై ఇటీవల కెనడా నిషేధం విధించింది. అయితే.. వ్యవహారంపై తాజాగా ఆ మీడియా సంస్థ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ జితార్థ్ జై భరద్వాజ్ స్పందించారు. ప్రతికాస్వేచ్ఛను హత్య చేయటమేనని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై మండిపడ్డారు. గుళ్లపై పదేపదే దాడులు జరుగుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నిచారు.‘‘ కెనడా చర్య.. పత్రికా స్వేచ్ఛను హతమార్చటం అవుతుంది. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉంది. విభిన్న అభిప్రాయాలన్నింటినీ చర్చించడానికి, అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికే పత్రికలు ఉన్నాయి. గురుపత్వంత్ సింగ్ పన్నూ మమ్మల్ని బెదిరించాడు. ...ఇతర వేర్పాటువాదుల నుంచి కూడా బెదిరింపులు వచ్చాయి. అమెరికా, కెనడాలో కవరేజీ చేసినందుకు మా చిత్రాలను పన్నూ ఆన్లైన్లో పెట్టారు. అనేక రకాలుగా హాని తలపెట్టమని ఆయన మద్దతుదారులను ఉసిగొల్పారు. అయినా.. మేం భయపడకుండా నిరంతరం రిపోర్టింగ్ చేస్తున్నాం’’అని అన్నారు.చదవండి: కెనడాలో ‘ఆస్ట్రేలియా టుడే’పై నిషేధం -
కెనడాలో ఆలయంపై దాడి.. స్పందించిన భారత విదేశాంగ శాఖ
బ్రాంప్టన్లోని హిందూ దేవాలయంపై ఇటీవల జరిగిన దాడిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం.. తీవ్రవాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తోందని ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన ఆస్ట్రేలియాలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘కెనడాలోని బ్రాంప్టన్లో ఖలిస్తాన్ తీవ్రవాదులు.. హిందూ ఆలయంపై దాడి చేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా నిరాధారమైన ఆరోపణలు చేసింది. కెనడా అక్రమంగా భారతీయ దౌత్యవేత్తలను నిఘాలో ఉంచింది. కెనడా భారత్పై ఆరోపణలు చేసే విధానాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. కెనడా భారత్ దౌత్యవేత్తలు నిఘా ఉంచింది. ఇది ఆమోదయోగ్యం కాని విషయం. కెనడా తీవ్రవాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తోందని భావిస్తున్నా. కెనడాలో జరిగిన దాడి ఘటన భారత్కు ఆందోళన కలిగించింది’’ అని అన్నారు.#Breaking: EAM Dr S Jaishankar reacts to Canada developments "Canada has developed a pattern of making allegations without providing specifics" Unacceptable Indian diplomats put under surveillance "Political space given to extremists force" in #Canada pic.twitter.com/lj9bIjTv91— Rohit Chaudhary (@rohitch131298) November 5, 2024 -
పాకిస్తాన్లో జై శంకర్.. ప్రధాని షరీఫ్తో కరచాలనం
ఇస్లామాబాద్: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సదస్సుకు హాజరయ్యేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం పాకిస్తాన్ చేరుకున్నారు. ఆయనకు నూర్ ఖాన్ ఎయిర్బేస్ వద్ద పాకిస్తాన్ సీనియర్ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇస్లామాబాద్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో జై శంకర్ మావేశమయ్యారు.సభ్యదేశాల అతిథుల కోసం షరీఫ్ ఏర్పాటు చేసిన విందులో ఇరువురు నేతలం కరచాలనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. సభ్యదేశాల నుంచి అగ్రనేతలు పాల్గొంటున్న ఈ సమ్మిట్లో ఆర్థిక, వాణిజ్య, పర్యావరణ, సామాజిక-సాంస్కృతిక సంబంధాల్లో సభ్యదేశాల పరస్పర సహకారంపై చర్చించనున్నారు. #WATCH | Islamabad: Pakistan PM Shehbaz Sharif welcomes EAM Dr S Jaishankar and other SCO Council Heads of Government, to a dinner hosted by him.EAM is in Pakistan to participate in the 23rd Meeting of SCO Council of Heads of Government.(Video Source: PTV) pic.twitter.com/BHtUhuLm9e— ANI (@ANI) October 15, 2024ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇస్లామాబాద్, రావల్పిండిలో కీలక మార్గాలు, వ్యాపారాలను మూసివేశారు. ఇదిలా ఉండగా భారత్-పాక్ మధ్య సంబంధాలు సన్నగిల్లిన క్రమంలో భారత సీనియర్ మంత్రి ఆదేశంలో అడుగుపెట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2015 డిసెంబర్లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆప్ఘనిస్థాన్లో సదస్సు కోసం ఇస్లామాబాద్ వెళ్లారు.Landed in Islamabad to take part in SCO Council of Heads of Government Meeting. pic.twitter.com/PQ4IFPZtlp— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 15, 2024 -
కిమ్ కాదు, సోరోస్ కాదు.. ఉపవాసానికే నా ఓటు!
ఓవైపు అంతర్జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకునే విదేశాంగ మంత్రి ఎస్.జైశకంర్ తనలోని సరదా కోణాన్ని ఆవిష్కరించారు. వాక్చాతుర్యంతో సభికులను కడుపుబ్బా నవ్వించారు. ఒక కార్యక్రమంలో ముఖాముఖి సందర్భంగా వ్యాఖ్యాత ఆయనకు ర్యాపిడ్ఫైర్ ప్రశ్న సంధించారు. ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, భారత్ను విమర్శించే హంగరీ అమెరికన్ కుబేరుడు జార్జ్ సోరోస్ల్లో మీరు ఎవరితో భోజనం చేస్తారని అడిగారు. జైశంకర్ ఏ మాత్రం తడుముకోకుండా, ‘దుర్గా నవరాత్రులు కదండీ! నేను ఉపవాస దీక్షలో ఉన్నా!’ అంటూ బదులివ్వడంతో అంతా పగలబడి నవ్వారు. ఐరాస.. ఓ పాత కంపెనీ ఐక్యరాజ్యసమితి ప్రస్తుత పరిస్థితిపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో స్థలాన్ని ఆక్రమించుకుని, మార్కెట్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేని పాత కంపెనీలా మారిందంటూ ఆక్షేపించారు. ఆదివారం ఆయన కౌటిల్య ఆర్థిక సదస్సులో మాట్లాడారు. ‘‘ప్రపంచ దేశాలను నేడు రెండు తీవ్ర సంక్షోభాలు తీవ్రంగా ఆందోళన పరుస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఐరాస ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. కీలకాంశాలను పట్టించుకోకుంటే దేశాలు తమ దారి చూసుకుంటాయి. కోవిడ్ కల్లోలంలోనూ ఐరాస చేసింది చాలా తక్కువ’’ అన్నారు. – న్యూఢిల్లీ -
నాడు సుష్మా స్వరాజ్.. మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్కు జైశంకర్
ఢిల్లీ: ఇస్లామాబాద్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ వెళ్లనున్నారు. ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశాలు అక్టోబర్ 15-16 తేదీలో జరగనున్నాయి. ఈ సమావేశాలకి సంబంధించి.. పాకిస్తాన్ నుంచి ఆహ్వానం అందినట్లు భారత్ ఆగస్టు 30న ధృవీకరించింది. ఎస్సీఓ సమావేశంలో మంత్రి జైశంకర్ భేటీ అవుతారనే విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ప్రకటించారు. 2015 డిసెంబర్ అనంతరం భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్కు వెళ్లడం ఇదే తొలిసారి. దివంగత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 2015లో ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించి భద్రతా సదస్సులో పాల్గొనేందుకు ఇస్లామాబాద్ను సందర్శించారామె.ఈసారి పాకిస్తాన్ అధ్యక్షతన ఎస్సీఓ ప్రభుత్వాధినేతల సమావేశాలు ఇస్లామాబాద్లో రెండురోజుల పాటు జరగనున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశాలకు ముందుగా మంత్రివర్గ సమావేశం, ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఆర్థిక, ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక, మానవతా సహకారంపై దృష్టి సారించే విధంగా పలు సీనియర్ అధికారుల సమావేశాలు జరుగనున్నాయి.MEA Spokesperson Randhir Jaiswal confirms: "EAM Jaishankar will lead a delegation to Pakistan for the SCO summit in Islamabad on 15th and 16th October."#SJaishankar #Pakistan #Islamabad #India #SCOSummit #IndiaPakRelations pic.twitter.com/Aq5UHYYjzy— Neha Bisht (@neha_bisht12) October 4, 2024ఇక.. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల అధ్యక్షులు కలిసి.. 2001లో షాంఘైలో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ను స్థాపించారు. 2017లో భారత్, పాకిస్తాన్లు ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం పొందాయి. గత ఏడాది జూలైలో భారతదేశం నిర్వహించిన వర్చువల్ సమ్మిట్ ఆఫ్ గ్రూపింగ్లో ఇరాన్ కూడా ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం పొందింది. ఆర్థిక, భద్రతా కూటమిగా, అతిపెద్ద ట్రాన్స్-రీజినల్ అంతర్జాతీయ సంస్థలలో ఒకటిగా ఎస్సీఓ ప్రారంభమైంది. గత ఏడాది ఎస్సీఓ సమ్మిట్ను భారత్ వర్చువల్గా నిర్వహించగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.చదవండి: ‘మీరే హిందూ మతానికి అసలైన శత్రువులు’.. పవన్కు డీఎంకే కౌంటర్ -
పాక్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది: జైశంకర్
న్యూయార్క్: జమ్ము కశ్మీర్పై పాకిస్తాన్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈక్రమంలో భారత్.. పాకిస్తాన్కు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తగిన ఫలితం తప్పకుండా అనుభవిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. సరిహద్దు ఉగ్రవాదమే పాకిస్తాన్ విధానం అంటూ ఎద్దేవా చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ..‘కశ్మీర్ అంశంపై పాక్ ప్రధాని షరీఫ్ విచిత్రమైన వాదనలు చేశారు. పాక్ తీరుపై భారత్ వైఖరిని నేను స్పష్టం చేస్తున్నా. సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. పాక్ విధానం ఎప్పటికీ సఫలం కాదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశం తగిన ఫలితం అనుభవించక తప్పదు. అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని పాకిస్తాన్ ఖాళీ చేయడం ఒక్కటే రెండు దేశాల మధ్య ఉన్న ఈ సమస్యకు పరిష్కారం. పాకిస్తాన్ దేశ ఆవిర్భావం నుంచి అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇందుకు ఉగ్రవాదాన్ని ఎంచుకోవడం కూడా ఒక కారణం. రాజకీయాలతో మతోన్మాదాన్ని ప్రేరిపిస్తున్న ఆ దేశంలో తీవ్రవాదం, దాని ఎగుమతుల పరంగానే జీడీపీ కొలవాలి అని స్పష్టం చేశారు.ఇక, అంతకుముందు.. ఐరాస జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ.. కశ్మీర్ అంశంలో అక్కసు వెళ్లగక్కారు. కశ్మీర్లో పరిస్థితిని పాలస్తీనాతో పోల్చారు. ఆర్టికల్ 370 గురించి ప్రస్తావించారు. ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్ ప్రజలు సైతం స్వేచ్ఛ, నిర్ణయాధికారం పోరాటం చేస్తున్నారు. భారత్ చట్ట విరుద్ధంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ హెచ్చరిక.. ఇరాన్ కీలక నిర్ణయం -
ఆసియా భవిష్యత్తుకు భారత్-చైనా సంబంధాలే కీలకం: జై శంకర్
భారత్-చైనా సరిహద్దు వివాదంపై విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్లోని ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్లో జై శంకర్ మాట్లాడుతూ.. 2020 నుంచి గాల్వాన్ వ్యాలీ వద్ద భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొందని తెలిపారు. అక్కడ జరిగిన ఘర్షణలు భారత్-చైనా సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయని అన్నారు. అయితే చైనాతో సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.తూర్పు లఢక్లో సైన్యం తొలగింపు విషయంలో భారత్-చైనా సరిహద్దు వివాద చర్చల్లో 75 శాతం పురోగతి సాధించినట్లు చెప్పారు.సరిహద్దులో హింస ఉండకూడదని, ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు ఉంటే ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపుతాయని అన్నారు. చైనాతో భారత్కు స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ 2020లో బీజింగ్ అనేక మంది సైనికులను వాస్తవ నియంత్రణ రేఖకు తరలించిందని జైశంకర్ అన్నారు.‘చైనాతో ఢిల్లీకి కష్టమైన చరిత్ర ఉంది. బీజింగ్తో మనకు స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ, కోవిడ్ కాలంలో ఈ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా పెద్ద సంఖ్యలో బలగాలను ఎల్ఏసీ కి తరలించడాన్ని మనం చూశాం. దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జరిగింది కూడా. తద్వారా ఇరు దేశాలకు చెందిన అనేక మంది సైనికులు మరణించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి’ అని పేర్కొన్నారు.కాగా ఈ నెల ప్రారంభంలో జైశంకర్ మాట్లాడుతూ.. చైనాతో సరిహద్దు చర్చల్లో భారత్ పురోగతి సాధించిందని, ఆ దేశ బలగాల ఉపసంహరణకు సంబంధించిన సమస్యలు దాదాపు 75 శాతం పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. తూర్పు లడఖ్ సరిహద్దు వద్ద చైనా సైనికీకరణ పెరుగుతుండడం అతిపెద్ద సవాలుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.#WATCH | New York: During the Asia Society at the Asia Society Policy Institute, EAM Dr S Jaishankar says, "We have a difficult history with China... Despite the explicit agreements we had with China, we saw in the middle of covid that the Chinese moved large number of forces in… pic.twitter.com/vNyfWTZrJY— ANI (@ANI) September 24, 2024 ఈ విషయాన్ని తాజాగా ప్రస్తావిస్తూ.. చైనాతో సరిహద్దు విషయంలో 75 శాతం పరిష్కరించిందని తాను చెప్పింది కేవలం బలగాల ఉపసంహరణ మాత్రమేనని తెలిపారు.. అయితే పెట్రోలింగ్ సమస్యలు కొన్ని పరిష్కరించాల్సి ఉందని,. తదుపరి చర్చల్లో వీటిని ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు.ఆసియా భవిష్యత్తుకు భారత్-చైనా సంబంధాలు కీలకమని భావిస్తున్నట్లు జైశంకర్ వెల్లడించారు. ఇది కేవలం ఖండంలోనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. రెండు దేశాల సమాంతర పెరుగుదల నేటి ప్రపంచ రాజకీయాల్లో చాలా పెద్ద సమస్యగా ఉందని పేర్కొన్నారు. ఆసియా, ప్రపంచాన్ని బహుళ ధృవంగా మార్చడానికి భారతదేశం- చైనా మధ్య సంబంధాలే కీలకమని నొక్కి చెప్పారు. -
బాధ్యతలు స్వీకరించిన పలువురు కేంద్ర మంత్రులు
ఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని మోదీ సహా పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణం చేసిన మంత్రులకు నిన్న (సోమవారం) మంత్రిత్వ శాఖలు కేటాయించబడ్డాయి.Priority areas for Jaishankar in Modi 3.0 government: Border stability with China, cross-border terror solution with PakistanRead @ANI Story | https://t.co/bSVWKuPFfA#Jaishankar #MEA #India #China #Pakistan pic.twitter.com/kmHQatgmbf— ANI Digital (@ani_digital) June 11, 2024 దీంతో మంగళవారం పలువురు కేంద్ర మంత్రులు తమ మంత్రిత్వ శాఖ బాధ్యతులు స్వీకరించారు. విదేశాంగ శాఖ మంత్రిగా ఎస్. జయశంకర్ బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ బాధ్యతలు స్వీకరించించారు.#WATCH | Delhi: Suresh Gopi takes charge as Minister of State (MoS) in the Ministry of Tourism. pic.twitter.com/qaolUiCV3Y— ANI (@ANI) June 11, 2024 అదేవిధంగా పెట్రోలియం శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పూరి, పెట్రోల్ శాఖ సహాయ మంత్రిగా సురేష్ గోపి, అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి భూపేంద్ర యాదవ్ మంత్రులు బాధ్యతలు స్వీకరించారు.#WATCH | Delhi: Manohar Lal Khattar takes charge as the Minister of Power. pic.twitter.com/HmaLfC9BUv— ANI (@ANI) June 11, 2024సమాచార, ప్రసార మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు. #WATCH | Delhi: Ashwini Vaishnaw takes charge as Information and Broadcasting (I&B) Minister pic.twitter.com/gf4QMPvuo6— ANI (@ANI) June 11, 2024 కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించారు. అమిత్ షాకు స్వాగతం పలికిన సహాయ మంత్రులు బండి సంజయ్, నిత్యానంద రాయి. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శివరాజ్ సింగ్ చౌహన్, కిరణ్ రిజీజు, జ్యోతిరాధిత్యసిందియా, జేపీ నడ్డా. -
సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్డర్ ఎస్ జైశంకర్ టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ను అమితంగా ఇష్టపడే జైశంకర్ను అత్యుత్తమ భారత బ్యాటర్ ఎవరని ప్రశ్నించగా.. విరాట్ కోహ్లికి తన ఓటు వేశాడు. ఈ విషయంలో జైశంకర్కు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లి రూపంలో మూడు ఆప్షన్లు ఇవ్వగా.. విరాట్పైపు మొగ్గు చూపాడు. ఫిట్నెస్ మరియు వైఖరి కారణంగా కోహ్లిను ఇష్టపడతానని జైశంకర్ చెప్పుకొచ్చాడు. ఈ కారణాలు మినహాయించి సచిన్, గవాస్కర్లను పక్కకు పెట్టడానికి వేరే కారణాలు లేవని తెలిపాడు. సుశాంత్ సిన్హా యూట్యూబ్ ఛానెల్లో మాట్లడుతూ జైశంకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి 35 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్లో ఉండి ఇరగదీస్తున్నాడు. కోహ్లి ఈ వయసులోనూ భీకర ఫామ్లో ఉండటానికి అతని ఫిట్నెస్సే కారణమని అంతా అంటుంటారు. ఆట పట్ల అతనికున్న అంకితభావం, దృక్పదం అతన్ని లేటు వయసులోనూ టాప్ క్రికెటర్గా నిలబెడుతుంది. చాలా మంది యువ క్రికెటర్లు సైతం ఫిట్నెస్ విషయంలో, యాటిట్యూడ్ విషయంలో విరాట్ను ఆదర్శంగా తీసుకుంటారు. Question:- Virat Kohli or Sachin Tendulkar or Sunil Gavaskar? (Sushant Sinha YT).External affairs Minister Dr Jaishankar:- "I have biased towards Virat Kohli because of his fitness, attitude. That's why I will pick Virat".pic.twitter.com/Y7ossf99CQ— Tanuj Singh (@ImTanujSingh) May 29, 2024పెద్దపెద్ద సెలబ్రిటీలు సైతం విరాట్ ఫిట్నెస్కు ముగ్దులవుతుంటారు. ప్రపంచ క్రికెట్లో దృవతారగా వెలగడానికి విరాట్ ఫిట్నెస్సే కారణమనడం అతిశయోక్తి కాదు. మైదానంలో అతను ప్రదర్శించే దూకుడు, చిన్న చిన్న విషయాలకు సైతం స్పందించే విభిన్నమైన తత్వం విరాట్ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. మంత్రులే కాక దేశాధినేతలు సైతం విరాట్ను అభిమానించడానికి అతని ఫిట్నెస్, ఆట పట్ల అతనికున్న అంకితభావమే కారణం.ఇదిలా ఉంటే, విరాట్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్లో భీకర ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నీలో విరాట్ 15 మ్యాచ్ల్లో 61.75 సగటున సెంచరీ, 5 అర్ధసెంచరీ సాయంతో 714 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. విరాట్.. జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్కప్లో ఇదే ఫామ్ను కొనసాగిస్తే టీమిండియా రెండోసారి టైటిల్ గెలవడం ఖాయం. -
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భారత్లో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కొంతమంది బలహీనత వల్లే పీఓకేపై భారత్ నియంత్రణ కోల్పోయిందని ఆరోపించారు. ఒకరు చేసిన పొరపాటే దీనికి కారణమని చెప్పారు. భారత తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా ఉద్ధేశిస్తూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్లో ‘విశ్వబంధు భారత్’ పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ పీఓకేపై జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ విలీనం చేసుకునే విషయమై లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయంటే తాను నమ్మబోనని చెప్పారు.లక్ష్మణ రేఖ వంటిది ఏదీ లేదని పేర్కొన్నారు. భారత్లో పీఓకే అంతర్భాగమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కొందరి బలహీనత వల్లే పీఓకే తాత్కాలికంగా మన నుంచి చేజారిందని, దానిపై పట్టు కోల్పోవడానికి వారి పొరపాటే కారణం అని నెహ్రూపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. విశ్వ వేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని, స్వీయ విశ్వాసాన్ని ఏనాడూ వీడొద్దన్నారు.చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, పాక్తో బీజింగ సహకారంపై జై శంకర్ విమర్శలు గుప్పించారు. ‘నేను చైనా రాయబారిగా ఉన్నాను, చైనా గత చర్యల గురించి మనందరికీ తెలుసు. ఈ భూమిని పాకిస్తాన్ లేదా చైనా తమదని చెప్పుకోలేదని మేము వారికి పదేపదే చెప్పాము. సార్వభౌమాధికారం ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే, అది భారతదేశం. మీరు ఆక్రమిస్తున్నారు, మీరు అక్కడ నిర్మిస్తున్నారు, కానీ చట్టపరమైన హక్కు మాదే.’నని పేర్కొన్నారు.చైనా పాకిస్తాన్ మధ్య 1963 సరిహద్దు ఒప్పందాన్ని కూడా జైశంకర్ ఎత్తి చూపారు. అక్కడ పాకిస్తాన్ దాదాపు 5,000 కి.మీ భూభాగాన్ని చైనాకు అప్పగించిందని అన్నారు. ‘1963లో, పాకిస్తాన్- చైనా తమ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి. చైనాను దగ్గరగా ఉంచడానికి, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో దాదాపు 5,000 కి.మీలను డ్రాగన్కు అప్పగించింది. ఈ ప్రాంతం భారతదేశానికి చెందింది’ ఆయన తెలిపారు. -
నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్పై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్ స్పందించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని, ఇందులో భారత్కు ఎలాంటి సంబంధం లేదన్నారు.కాగా, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులు కరణ్ప్రీత్ సింగ్ (28), కమల్ప్రీత్ సింగ్ (22), కరణ్ బ్రార్ (22)లను కెనడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి అరెస్ట్పై జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని పేర్కొన్నారు. ఆ విషయాల్లో భారత్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తరచూ భారత్ను విమర్శిస్తుండడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.మరోవైపు.. కెనడాలో అరెస్టైన ముగ్గురు నిందితుల గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు ఇచ్చింది. ఈ సందర్భంగా కొంతమంది గ్యాంగ్స్టర్లు కెనడాలో ఉంటూ భారత్లో తమ నేర కార్యకలాపాలను సాగిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిందితులుగా పేర్కొన్న చాలా మంది ఆ దేశంలో స్థిరపడ్డారు. భారత వ్యతిరేక, ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలు సాగించేందుకు వారికి పాక్ ఐఎస్ఐ నుంచి నిరంతరం నిధులు అందుతున్నాయి. దీని గురించి మేం చాలా సార్లు అనేక ఆధారాలు ఇచ్చినా.. కెనడా ప్రభుత్వం గానీ, పోలీసుల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. ఇప్పుడు తాజా కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత ప్రభుత్వంపై కెనడా నిందలు మోపుతోంది. అరెస్టయిన ఆ ముగ్గురు డ్రగ్స్ దందా చేస్తున్నారని, వారికి ఐఎస్ఐతో సంబంధాలున్నాయని పేర్కొంది. -
విదేశీ మీడియాపై విదేశాంగ మంత్రి జై శంకర్ ఫైర్
విదేశీ మీడియాపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శలు గుప్పించారు. సరైన సమాచారం లేకుండా భారత దేశంపై విదేశీ మీడియా విషం చిమ్ముతోందని మండిపడ్డారు. భారత్లోని ఎన్నికలకు సంబంధించి పూర్తి సమాచారం లేని పాశ్చాత్య మీడియా విమర్శలతో రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. మంగళారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్ పలు అంశాలుపై మాట్లాడారు. ‘విదేశీ మీడియా భారత ప్రజాస్వామాన్ని హేళన చేస్తోంది. వారికి మన దేశానికి సంబంధించి సరైన సమాచారం లేదు. ఎందుకుంటే వారు కూడా మన దేశ ఎన్నికల్లో రాజకీయలు, జోక్యం చేసుకోవాలని యోచిస్తున్నారు. విదేశీ మీడియాలో పలు కథనాలు చదివారు. భారత్లో ప్రస్తుతం అత్యధిక వేడిగా ఉంది. ఈ సమయంలో భారత్ ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తోంది ?అని రాస్తున్నారు. అయినా పాశ్చాత్య దేశాల్లో ఓటింగ్ శాతం కంటే భారత్లో ఓటింగ్ శాతం ఎక్కువ...మన దేశంలోని రాజకీయాలను ప్రపంచ వ్యాప్తంగా చర్చిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచ రాజకియాలు.. ప్రస్తుతం భారత్లోకి చొరబడాలని భావిస్తున్నాయి. విదేశీ మీడియా మన ఎన్నికల వ్యవస్థలో భాగమని భావిస్తోంది. కానీ పాశ్చాత్య మీడియా ఆలోచనలకు చెక్ పెట్లాల్సిన సమయం వచ్చింది. విదేశీ మీడియా కథనాలకు తిప్పికొట్టాలి. మన ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘంపై విదేశీ మీడియా విమర్శలు చేస్తోంది’ అని జైశంకర్ అన్నారు. -
ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మహిళా క్యాడెట్
న్యూఢిల్లీ: ఇరాన్ అధీనంలో ఉన్న సరుకు రవాణా నౌక ఎంఎస్సీ ఏరీస్లోని 17 మంది భారతీయ సిబ్బందిలోని ఏకైక మహిళా క్యాడెట్ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. కేరళలోని త్రిసూర్కు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్ను ఇరాన్ ప్రభుత్వం విడుదల చేయడంతో గురువారం మధ్యాహ్నం విమానంలో కొచ్చిన్కు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మిగతా 16 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, భారత్లోని కుటుంబసభ్యులతో ఫోన్లో సంభాషిస్తున్నట్లు కూడా వివరించింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ నాలుగు రోజుల క్రితం ఇరాన్ విదేశాంగ మంత్రి అమిర్ అబొల్లాహియన్తో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసింది. ఇజ్రాయెల్తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇరాన్ ప్రత్యేక బలగాలు ఈ నెల 13న హొర్ముజ్ జలసంధిలో ఉన్న ఎంఎస్సీ ఏరీస్ నౌకను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
ఇరాన్కు జైశంకర్ ఫోన్.. భారత సిబ్బందిని కలవడానికి అనుమతి
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల వేళ భారత్కు వచ్చే ఓ నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అందులోని భారతీయ సిబ్బందికి టెహ్రాన్ కాస్త ఊరటనిచ్చింది. మన దేశ అధికారులు వారిని కలిసేందుకు అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. గత శనివారం హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెలీ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్సీ ఏరిస్ను ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి అధీనంలోకి తీసుకొంది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులే. ఈ క్రమంలోనే వారిని రక్షించేందుకు మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆదివారం ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్తో మాట్లాడారు. నౌకలోని భారతీయులను విడుదల చేయాలని కోరారు. పశ్చిమాసియాలో ఘర్షణలను నివారించాలని, దౌత్య మార్గాల్లో పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు చదవండి: ఇజ్రాయెల్ నౌకపై దాడి.. ఆధీనంలోకి తీసుకున్న ఇరాన్ నేవీ -
భారత్ Vs చైనా: అరుణాచల్పై మళ్లీ కవ్వింపులు..
బీజింగ్: డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి భారత్తో కవ్వింపు చర్యలకు దిగింది. ఎన్నికల వేళ భారత సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మరో దుందుడుకు చర్యకు దిగింది. తాజాగా అరుణాచల్లో కొన్ని ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది.కాగా, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనని ఇటీవలే చైనా వితండవాదం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో అడుగు వేసి మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను విడుదల చేశారు.అరుణాచల్లోని మొత్తం 30 ప్రాంతాలకు చైనా తాజాగా కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో చైనా చర్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ.. ఈరోజు నేను మీ ఇంటి పేరు మర్చినట్లయితే అది నాది అవుతుందా?. అరుణాచల్ భారత్లో ఒక రాష్ట్రం. అరుణాచల్ ఎల్లప్పుడూ భారత్ భూభాగమే. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఏమీ ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మా సైనం మోహరించి ఉంది అని కామెంట్స్ చేశారు.#WATCH | Surat, Gujarat: On China's claim regarding Arunachal Pradesh, EAM Dr S Jaishankar says, "If today I change the name of your house, will it become mine? Arunachal Pradesh was, is and will always be a state of India. Changing names does not have an effect...Our army is… pic.twitter.com/EaN66BfNFj— ANI (@ANI) April 1, 2024 ఇదిలా ఉండగా.. భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. చైనా 2017లో అరుణాచల్ ప్రదేశ్లోని ఆరు ప్రదేశాలకు, 2021లో 15 స్థలాలకు, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లను చైనా ప్రకటించింది. ఇవన్నీ తమ దేశంలోని ప్రాంతాలేనని చెప్పుకొచ్చింది. -
భారత్ Vs చైనా: అరుణాచల్పై మళ్లీ కవ్వింపులు..
బీజింగ్: డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి భారత్తో కవ్వింపు చర్యలకు దిగింది. ఎన్నికల వేళ భారత సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మరో దుందుడుకు చర్యకు దిగింది. తాజాగా అరుణాచల్లో కొన్ని ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. కాగా, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనని ఇటీవలే చైనా వితండవాదం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో అడుగు వేసి మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను విడుదల చేశారు. అరుణాచల్లోని మొత్తం 30 ప్రాంతాలకు చైనా తాజాగా కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో చైనా చర్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ.. ఈరోజు నేను మీ ఇంటి పేరు మర్చినట్లయితే అది నాది అవుతుందా?. అరుణాచల్ భారత్లో ఒక రాష్ట్రం. అరుణాచల్ ఎల్లప్పుడూ భారత్ భూభాగమే. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఏమీ ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మా సైనం మోహరించి ఉంది అని కామెంట్స్ చేశారు. #WATCH | Surat, Gujarat: On China's claim regarding Arunachal Pradesh, EAM Dr S Jaishankar says, "If today I change the name of your house, will it become mine? Arunachal Pradesh was, is and will always be a state of India. Changing names does not have an effect...Our army is… pic.twitter.com/EaN66BfNFj — ANI (@ANI) April 1, 2024 ఇదిలా ఉండగా.. భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. చైనా 2017లో అరుణాచల్ ప్రదేశ్లోని ఆరు ప్రదేశాలకు, 2021లో 15 స్థలాలకు, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లను చైనా ప్రకటించింది. ఇవన్నీ తమ దేశంలోని ప్రాంతాలేనని చెప్పుకొచ్చింది. -
‘భారత్ ప్రయోజనాలను రష్యా ఎప్పుడూ దెబ్బతీయదు’
న్యూఢిల్లీ: భారత్-రష్యా మధ్య సంబంధాలు చాలా స్థిరంగా, స్నేహపూర్వకంగా ఉంటాయని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. భారత ప్రయోజనాలను రష్యా ఎప్పుడూ దెబ్బతీయదని స్పష్టం చేశారు. జర్మనీకి చెందిన వార్త పత్రికతో కేంద్రమంత్రి జైశంకర్ మాట్లాడారు. ఉక్రెయిన్లో రష్యా యుద్ధాన్ని ముగించాలని పశ్చిమ దేశాలు ఒత్తిడి చేస్తున్న వేళ ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను జైశంకర్ మరోసారి గుర్తు చేశారు. ‘పూర్వపు అనుభావాలతోనే ప్రతి ఒక్కరూ మంచి స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తారు. నాకు తెలిసినవరకు భారత దేశానికి స్వాతంత్రం రాక ముందు నుంచి భారత్-రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా భారత్-రష్యా ఇరు దేశాలు కూడా ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరించలేదు. ఇరు దేశాల మధ్య స్థిరమైన, చాలా స్నేహిపూరిత సంబంధాలు ఉన్నాయి. ఈ అనుభావాల రీత్యా మాస్కోతో భారత్ స్నేహబంధం బలంగా ఉంది’ అని విదేశాంగ మంత్రి జై.శంకర్ పేర్కొన్నారు. రష్యా వద్ద భారత్ ముడి చమురు కొనుగోలు విషయంపై కేంద్రమంత్రి జైశంకర్ స్పందించారు. ‘రష్యా నుంచి ముడి చమురరు కొనగోలు చేయకుండా ప్రతి ఒక్కరూ.. ఇతర దేశాల మీద ఆధారపడితే.. ఇతర దేశాల్లో చమురుపై డిమాండ్ అధికమై ధరలు పెరిగేవి’అని తెలిపారు. ఉక్రెయిన్పై ఫిబ్రవరి, 2022 నుంచి రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యా ముడి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. భారత్ మాత్రం రష్యా వద్ద చమురు కొనుగోళ్లు ఆపకపోవటం గమనార్హం. ఇక.. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా విషయంలో భారత్ జోక్యం చేసుకుంటే రష్యా యుద్ధాన్ని ఆపే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. చదవండి: మహారాష్ట్ర: మరాఠా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం -
వారితో కలిసిపోతానంటూ.. కేంద్ర మంత్రి చమత్కారం!
దుబాయ్: ‘గుజరాతీయులతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వారితో చక్కగా కలిసిపోతా’ అని కేంద్ర మంత్రి ఫన్నీగా సమాధానం ఇచ్చారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ చమత్కారంగా ఇచ్చిన సమాధానం అక్కడి ఉన్నవారిలో నవ్వులు పూయించింది. ఆయన శనివారం దుబాయ్లో భారతీయ విద్యార్థులు నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. #WATCH via ANI Multimedia | EAM Jaishankar's witty response to a student’s query ‘How he feels surrounded by Gujaratis’https://t.co/83kzBWgICR — ANI (@ANI) December 9, 2023 ఈ సందర్భంగా ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన చమత్కారంగా సమాధానం ఇచ్చారు. గుజరాతీయుల మధ్య మీరు ఉండటం ఎలా అనిస్తోంది? అని ఓ విద్యార్థి అడగ్గా.. ‘గుజరాతీయుల మధ్యలో ఉండటం చాలా అసక్తికరంగా ఉంటుంది. ఇండియాలో అన్ని ప్రాంతాల నుంచి నాకు స్నేహితులు ఉన్నారు. గుజరాత్లోని పలు చోట్ల మా బంధువులకు సంబంధించిన కుటుంబాలు కూడా ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా నేను అక్కడికి వెళ్లినప్పటి నుంచి దేశంలో మరే రాష్ట్రానికి వెళ్లనన్నిసార్లు నేను గురురాత్కు వెళ్లా. గుజరాతీయులతో నేను చక్కగా కలిసిపోతా’ అని అన్నారు. ఇక 5 జూలై 2019న గుజరాత్ నుంచి బీజేపీ తరఫున జైశంకర్.. రాజ్యసభ సభ్యునిగా పార్లమెంటుకు ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మోదీ కేబినెట్లో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిగా పదవి బాధ్యలు స్వీకరించారు. -
ఖతార్లో ఉరిశిక్ష పడిన వారి విడుదలకు ప్రయత్నాలు: జైశంకర్
ఖతార్లో ఉరిశిక్ష పడిన భారత నావికాదళ మాజీ అధికారులను విడిపించేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం జైశంకర్ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘ఖతార్లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది భారతీయుల కుటుంబాలను ఈ ఉదయం కలిశాను. ఈ కేసుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వారికి తెలియజేశా. బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన, బాధలను తెలుసుకున్నాం. ఉరిశిక్ష పడిన ఎనిమిది మంది అధికారుల విడుదలకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుందని భరోసా ఇచ్చాం. ఆ విషయంలో వారి కుటుంబాలతో సమన్వయం చేసుకుంటాం’ అని ఎక్స్ (ట్విటర్) వేదికగా జైశంకర్ పేర్కొన్నారు. Met this morning with the families of the 8 Indians detained in Qatar. Stressed that Government attaches the highest importance to the case. Fully share the concerns and pain of the families. Underlined that Government will continue to make all efforts to secure their release.… — Dr. S. Jaishankar (@DrSJaishankar) October 30, 2023 కాగా గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన ఎనిమది మంది మాజీ అధికారులకు మరణశిక్ష విధిస్తూ ఇటీవల ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచేస్తున్న భారత నావికాదళ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్లపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వీరంతా ఇజ్రాయెల్ తరపున ఓ సబ్మెరైన్ ప్రోగ్రాం కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని వీరిపై అభియోగాలపై సదరు అధికారులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టు 30న అదుపులోకి తీసుకుంది. దీనిపై ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఖతార్ కోర్టు తీర్పుతో దిగ్భ్రాంతికి గురయ్యాయమని తెలిపింది. ఈ సమస్యను ఖతార్ అధికారులతో తేల్చుకుంటామని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో సమన్వయం చేసుకుంటున్నామని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించింది. -
భారత్-కెనడా వివాదం: అమెరికాలో విదేశాంగ మంత్రుల రహస్య భేటీ!
భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్, కెనడా విదేశాంగమంత్రి మెలానీ అమెరికాలో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్రిటన్ వార్తా పత్రిక ఫినాన్షియల్ టైమ్స్ కథనం ప్రచురించింది. భారత్తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించేందుకు, న్యూఢిల్లీతో దౌత్యపరమైన సంబంధాలను పునురద్ధరించేందుకు కెనడా ప్రభుత్వం ప్రయత్నిన్నట్లు పేర్కొంది. అయితే ఈ భేటీపై అటు కెనడా కానీ, ఇటు భారత్ కానీ ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు. కెనడా దౌత్యవేత్తలు దేశం విడిచి వెళ్లాలంటూ భారత్ గడువు విధించిన నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఖలిస్తానీ సానూభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెన్సీల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. కెనడా ఆరోపలను భారత్ తీవ్రంగా ఖండించింది. అనంతరం రెండు దేశాల దౌత్యపరమైన సంబంధాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. కెనడాకు వీసా సేవలను భారత్ నిలిపి వేసింది. చదవండి: పఠాన్కోట్ దాడి సూత్రదారి, ఉగ్రవాది లతీఫ్ పాకిస్థాన్లో హతం -
అమెరికా, భారత్ బంధాలకు హద్దుల్లేవ్
వాషింగ్టన్: అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక బంధాలకు హద్దుల్లేవని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యున్నత స్థాయికి చేరుకు న్నాయని, ఇరు దేశాలు పరస్పర అవసరాలు తీర్చుకుంటూ, సౌకర్యవంతమైన, అనుకూలమైన భాగస్వామ్యులుగా మెలగుతున్నాయని పేర్కొన్నారు. చంద్రయాన్ మాదిరిగా ఇరు దేశాల మధ్య బంధాలు చంద్రుడిని తాకాయని, అంతకుమించి హద్దుల్లేకుండా సాగిపోతున్నాయని అభివర్ణించారు. అమెరికాలో పర్యటిస్తున్న జైశంకర్ శనివారం ప్రవాస భారతీయులతో ఇండియా హౌస్లో సమావేశమయ్యారు. ఇక్కడ నిర్వహించిన సెలబ్రేటింగ్ కలర్స్ ఆఫ్ ఫ్రెండ్షిఫ్ కార్యక్రమానికి అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు తరలివచ్చారు. ప్రవాస భారతీయులనుద్దేశించి జై శంకర్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరో కొత్త స్థాయికి తీసుకువెళతామని చెప్పారు. ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చినా ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా సాగుతున్నాయని, ఇక భవిష్యత్లో సరికొత్త రంగాల్లో అమెరికాతో కలిసి పని చేస్తామని వెల్లడించారు. భారత్లో నిర్వహించిన జీ–20 సదస్సుకి అమెరికా సహకారం అందించడం వల్లే విజయ వంతమైందని అన్నారు. ‘‘దేశాలు ఒకరితో ఒకరు వ్యాపారాలు చేస్తాయి. రాజకీ యాలు చేస్తాయి. మిలటరీ బంధాలు కలిగి ఉంటాయి. విన్యాసాలు నిర్వహిస్తాయి. సాంస్కృతిక బదలాయింపులు ఉంటాయి. అయి నప్పటికీ రెండు దేశాలు లోతైన మానవీయ సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడే ఆ బంధం సంపూర్ణమవుతుంది. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య అలాంటి సంబంధాలే ఉండాలి’’ అని జైశంకర్ వివరించారు. -
ఉగ్రవాదాన్ని కెనడా ప్రోత్సహిస్తోంది
వాషింగ్టన్: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై నెలకొన్న విభేదాలను భారత్, కెనడా ప్రభుత్వం పరస్పరం చర్చించుకుంటే పరిష్కరించుకోవచ్చునని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. నిజ్జర్ హత్య కంటే ఉగ్రవాదాన్ని కెనడా ప్రభుత్వం ప్రోత్సహించడం అత్యంత తీవ్రమైన అంశంగా చూడాలని అన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాదానికి, హింసాత్మక కార్యక్రమాలకు ట్రూడో ప్రభుత్వం అనుమతులిస్తోందని వెంటనే వాటిని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న జై శంకర్ వాషింగ్టన్లో శుక్రవారం భారతీయ జర్నలిస్టులతో మాట్లాడారు. నిజ్జర్ హత్య వెనుక భారతీయ ఏజెంట్లు ఉన్నారంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల్ని భారత్ గట్టిగా తిప్పి కొట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కచ్చితమైన ఆధారాలుంటే చూపించాలన్నారు. వాటిని పరిశీలించడానికి భారత్ సిద్ధంగా ఉందని జైశంకర్ చెప్పారు. ‘‘కెనడా ప్రభుత్వం నుంచి భారత్ చాలా కాలంగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఉగ్రవాదం, హింసాత్మక కార్యకలాపాలపై వారి ఉదాసీన వైఖరే ఇందుకు కారణం. భారత్లో నేరాలు చేసిన ఎందరో కెనడాలో తలదాచుకుంటున్నారు. వారిని అప్పగించాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా కెనడా ప్రభుత్వం స్పందించడం లేదు. నిజ్జర్ హత్యపై ఆధారాలు ఇవ్వకుండా అభాండాలు వేస్తోంది. మేము నాలుగ్గోడల మధ్య లేము. ఏదైనా పరిశీలిస్తాం’’ అని జై శంకర్ మండిపడ్డారు. నిజ్జర్ హత్య కంటే కెనడా ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అతి పెద్ద సమస్యని దానినే మొట్టమొదట పరిష్కరించుకోవాలని అన్నారు. -
భారత్ కెనడా వివాదం.. జైశంకర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య విషయంలో భారత్ కెనడాల మధ్య రగులుతున్న దౌత్య వివాదం నేపథ్యంలో కేంద్ర విదేశాంగశాఖమంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. కెనడాలో హింస, తీవ్రవాదం గణనీయంగా పెరిగిపోయిందని మండిపడ్డారు. కెనడా తీవ్రవాద శక్తులు, వేర్పాటువాదులకు ఆశ్రయం ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాలను సాధారణమైనవిగా చూడరాదని అన్నారు. ఈ సందర్భంగా భారత్-కెనడా వివాదంపై జై శంకర్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భావప్రకటనా స్వేచ్ఛ గురించి ఇతరుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం భారత్కు లేదని తెలిపారు. ‘మాది ప్రజాస్వామ్య దేశం, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో మేము ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాక్ స్వాతంత్ర్యం హింసకు దారితీయకూడదని మేము చెబుతున్నాం. అది స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే అవుతుంది. రక్షించడం కాదు అని జైశంకర్ పేర్కొన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నెలకొన్న తరుణంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కెనాడా ఆరోపణలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దీనిని రెండు దేశాలు కలిసి పరిష్కరించుకోవాల్సిన అసవరం ఉందన్నారు. ఆరోపణలకు సంబంధించి ఏదైనా సమాచారం మాతో పంచుకునేందుకు కెనడా సిద్ధంగా ఉంటే, మేము కూడా దానిని పరిగణలోకి తీసుకుని పరిష్కరించుకునేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. అయితే భారత్కు వ్యతిరేకంగా హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో భాగమైన కొందరు వ్యక్తులు, సంస్థలు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని, ఈ విషయంలో తమ అభర్ధనలకు కెనడా స్పందించలేదని అన్నారు. చదవండి: Trump Vs Biden: ఏడాది ముందే అగ్రరాజ్యంలో ఎన్నికల అగ్గి.. తన విధానాల ప్రకారం భారత్ ఇలాంటి చర్యలకు పాల్పడదని జైశంకర్ పేర్కొన్నారు. ట్రూడో చేసిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంతవరకు కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదన్న ఆయన.. ఒకవేళ నిజ్జర్ హత్యకు సంబంధించి తగిన సమాచారాన్ని అందిస్తే, భారత్ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కెనడాలో పరిస్థితుల కారణంగా భారత దౌత్యవేత్తలు ఎంబసీకి వెళ్లేందుకు కూడా వెనకాడుతున్నారని మంత్రి తెలిపారు. వారు బహిరంగంగా బెదిరింపులకు గురవుతుండటంతో కెనడా పౌరులకు భారత వీసాలు నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించారు. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్పై దాడి, కెనడాలోని ఖలిస్తానీ బెదిరింపు పోస్టర్లపై ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘ మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఒకవేళ మీ రాయబార కార్యలయాలు, మీ దౌత్యవేత్తలు, మీ దేశ ప్రజలకు బెదిరింపులు ఎదురైతే మీరు ఎలా స్పందిస్తారని అడిగారు. మేము మీ దేశంపై విమర్శలు చేసాం, మీ కాన్సులేట్లపై దాడులకు పాల్పడ్డం. పోస్టర్లు పెట్టాం. దీనిని మీరు సాధారణమైనవిగా భావిస్తారా? ఇదే వేరే దేశానికి జరిగితే మీరు ఎలా స్పందిస్తారు. కెనడాలో జరుగుతున్నది జనరల్గా చూడవద్దు. అక్కడ ఏం జరగుతుందో బయట ప్రపంచానికి తెలియడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదం, తీవ్రవాదం, హింస మొదలైన విషయాల్లో కొన్నేళ్లుగా మాకు కెనడా, కెనడా ప్రభుత్వంతో సమస్యలు ఉన్నాయి. భారత్, కెనడాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్లతో చర్చించాం’ అని తెలిపారు. కాగా అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్, ఆదేశ విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్తోనూ భేటీ అయ్యారు. భారత్- అమెరికా మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో విదేశాంగ ఇదరుదేశాల విదేశాంగ మంత్రులు విస్తృతంగా చర్చించారు. చదవండి: సన్నిహిత సంబంధాలకే మొగ్గు: ట్రూడో -
భారత వ్యతిరేక కార్యకలాపాల అడ్డాగా కెనడా
వాషింగ్టన్: కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతి, దానికి సంబంధించిన రగడపై అమెరికాతో లోతుగా చర్చించినట్టు విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో భేటీ అయ్యారు. హత్యపై కెనడా జరుపుతున్న దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని బ్లింకెన్ ఈ సందర్భంగా సూచించినట్టు విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం పేర్కొన్నారు. అనంతరం దీనిపై జై శంకర్ స్పందించారు. భారత్ లక్ష్యంగా వేర్పాటువాదం, హింస, వ్యవస్థీకృత నేరాలు, మనుషుల అక్రమ రవాణా వంటివాటికి కెనడా కొన్నేళ్లుగా అడ్డాగా మారుతోందని మండిపడ్డారు. ‘పైగా అక్కడి ప్రభుత్వం కూడా కొన్నేళ్లుగా అలాంటి వాటిని అనుమతిస్తున్న ధోరణి కనబరుస్తోంది. ట్రూడో సర్కారు రాజకీయ అనివార్యతలే ఇందుకు కారణం‘ అని ఆరోపించారు. ‘కెనడాలో భారత దౌత్యవేత్తలను బాహాటంగా బెదిరించే దుస్థితి నెలకొంది! కార్యాలయాలకు వెళ్లడం కూడా రిసు్కగా మారింది. అందుకే ఆ దేశానికి వీసా సేవలను కూడా ఆపేయాల్సి వచి్చంది‘ అని జైశంకర్ వివరించారు. బ్లింకెన్తో జైశంకర్ -
స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్కు భారత్ కీలకం
న్యూఢిల్లీ: స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ సాధనలో భారత్ అనివార్య భాగస్వా మి అని జపాన్ విదేశాంగ మంత్రి యోషిమస హయా షి పేర్కొన్నారు. భారత్తో అన్ని రంగాల్లో ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం బలోపేతం చేసుకునేందుకు జపాన్ ఆసక్తితో ఉందన్నారు. గ్లోబల్ సౌత్పై దృష్టిసారించిన భారత్ను హయాషి ప్రశంసించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు సరైన శ్రద్ధ చూపకుంటే స్వేచ్ఛాయుత, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ క్రమత ఒట్టి నినాదంగానే మారిపోతుందన్నారు. భారత్కు రెండు రోజుల పర్యటనకు వచ్చిన హయాషి శుక్రవారం విదేశాంగ ఏర్పాటు చేసిన భారత్–జపాన్ ఫోరం సమావేశంలో మాట్లాడారు. సైబర్, అంతరిక్ష రంగాల్లో రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించామన్నారు. రక్షణ ఉత్పత్తులు, సాంకేతిక అంశాలకు సంబంధించిన చర్చల్లో సహకారంపై చర్చలు సాగుతున్నాయని వివరించారు. ఈ చర్చలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ..భారత్కు జపాన్ సహజ భాగస్వామిగా పేర్కొన్నారు. -
జులై 24న పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
న్యూడిల్లీ: జులై 24న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రమంత్రి ఎస్ జైశంకర్ సహా పది మంది సభ్యుల పదవీకాలం పూర్తవనుండటంతో జూలై 24న రాజ్యసభకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఏడాది జులై – ఆగస్ట్ మధ్య పశ్చిమ బెంగాల్, గోవా, గుజరాత్ నుంచి ఈ 10 స్థానాలు ఖాళీ అవుతున్నట్లు పేర్కొంది. కాగా అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్లో మూడు, గోవాలో ఒక స్థానం ఖాళీ కానుంది. ఆయా స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జులై 6న విడుదలవుతుందని తెలిపింది. జూలై 13 వరకు నామినేషన్లు స్వీకరణ, ఉపసంహరణకు జులై 17న చివరి తేదీగా పేర్కొంది. 24న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. పదవికాలం ముగియనున్న వారు.. ►పశ్చిమ బెంగాల్లో డెరెక్ ఓబ్రియెన్, డోలా సేన్, ప్రదీప్ భట్టాచార్య, సుస్మితా దేవ్, శాంత ఛెత్రి, సుఖేందు శేఖర్ రాయ్ల పదవీకాలం ముగియనుంది. ►గుజరాత్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, దినేష్ జెమల్భాయ్ అనవాదియా, లోఖండ్వాలా జుగల్ సింగ్ మాథుర్జీల పదవీకాలం కూడా ముగియనుంది. ►గోవా నుంచి ఎంపీ వినయ్ డీ టెండూల్కర్ గత ఏడాది జులైలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. రాజస్థాన్లో కాంగ్రెస్ మూడు స్థానాలను నిలబెట్టుకోగా, రాజస్థాన్, మహారాష్ట్రల్లో ఒక్కో స్థానంలో గెలుపొందింది. అదే విధంగా పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గోవా మాజీ ముఖ్యమంత్రి లుజిన్హో ఫలేరో తన స్థానానికి, తృణమూల్ కాంగ్రెస్కు రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. -
పాస్పోర్ట్ కష్టాలకు చెల్లుచీటి.. కొత్త విధానం అమలుపై జై శంకర్ ప్రకటన!
త్వరలో భారత్లో రెండవ దశ పాస్పోర్ట్ సేవ ప్రోగ్రామ్ (పీఎస్పీ - వెర్షన్ 2.0)ను లాంచ్ చేయనున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ప్రకటించారు. పాస్పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..దేశ పౌరుల పాస్ పోర్ట్ సేవల్ని మరింత సులభతరం చేసే అంశంలో కేంద్రం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమయానుకూలంగా, విశ్వసనీయంగా, పారదర్శకంగా, మరింత సమర్థవంతంగా పాస్పోర్ట్లను రెన్యూవల్ చేయాలని పాస్ పోర్ట్లను జారీ చేసే అధికారులకు జై శంకర్ పిలుపునిచ్చారు. పీఎస్పీ - వెర్షన్ 2.0లో ఈ - పాస్ట్ పోర్ట్లను సైతం అప్గ్రేడ్ చేసుకోనేలా అవకాశం లభించనుంది. ‘ఈజ్ ఆఫ్ లివింగ్ ఫర్ సిటిజన్ పోగ్రామ్’ ద్వారా దేశ పౌరులకు మెరుగైన పాస్ పోర్ట్ సేవల్ని అందించే విజన్తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని జై శంకర్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇందుకోసం, EASE : E : ఎన్ హ్యాన్స్డ్ పాస్పోర్ట్ టూ సిటిజెన్స్, A : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ సర్వీస్ డెలివరీ, S : స్మూతర్ ఓవర్ సిస్ ట్రావెల్ యూజింగ్ చిప్ ఎనేబుల్డ్ ఈ - పాస్పోర్ట్, E : ఎన్హ్యాన్స్డ్ డేటా సెక్యూరిటీ విధానాన్ని సత్వరమే అమలు చేసేలా పాస్పోర్ట్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. తద్వారా దేశ పౌరులకు పాస్పోర్ట్ సేవలు మరింత సలుభతరం కానున్నాయని సూచించారు. Here is a message from EAM @DrSJaishankar, as we observe the Passport Seva Divas today. #TeamMEA reaffirms its commitment to provide passport and related services to citizens in a timely, reliable, accessible, transparent and efficient manner. pic.twitter.com/k1gmaTPLKq — Arindam Bagchi (@MEAIndia) June 24, 2023 -
అందరికీ నాణ్యమైన డేటా
న్యూఢిల్లీ: నాణ్యమైన డేటా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని, ఈ విషయంలో సాంకేతిక ప్రజాస్వామీకరణ ఒక ముఖ్యమైన సాధనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డేటాను అందించడంలో అంతరాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం వారణాసిలో జరిగిన జీ20 దేశాల డెవలప్మెంట్ మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత్లో డిజిటలీకరణ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని, ఈ రంగంలో తమ అనుభవాన్ని భాగస్వామ్య దేశాలతో పంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అవసరంలో ఉన్నవారికి రుణాలు సులభంగా లభించేలా ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు రావాలని ఆకాంక్షించారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, వనరుల సమర్థ కేటాయింపునకు, ప్రజలకు పాలనాపరమైన సేవలు మెరుగ్గా అందించడానికి అత్యంత నాణ్యమైన డేటా అవసరమని వివరించారు. ప్రజా సాధికారతకు, డేటాను ప్రజలకు అందించడానికి టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటున్నామని వెల్లడించారు. నగరాలు, పట్టణాలే కాదు, మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి సైతం నాణ్యమైన డేటాను అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి లక్ష్యాలు సాధిద్దాం కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వల్ల ప్రపంచ దేశాలు ఆర్థికాభివృద్ధిలో వెనుకంజ వేశాయని మోదీ గుర్తుచేశారు. అభివృద్ధి లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా కృషి చేయడం మన బాధ్యత అని సూచించారు. మన ప్రయత్నాలనీ పారదర్శకంగా, సమగ్రంగా ఉండాలన్నారు. అభివృద్ధి లక్ష్యాల సాధనకు పెట్టుబడులు పెంచాలని చెప్పారు. చాలా దేశాలు అప్పుల ముప్పును ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి మార్గాలు కనిపెట్టాలని పిలుపునిచ్చారు. భారత్లో వందకుపైగా లక్ష్యిత జిల్లాల్లో ప్రజల జీవనాన్ని మరింత మెరుగుపర్చడానికి చర్యలు చేపట్టామని ప్రధానమంత్రి వివరించారు. ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అవి ఇప్పుడు అభివృద్ధి ఉత్ప్రేరకాలుగా మారాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ డెవలప్మెంట్ మోడల్ను అధ్యయనం చేయాలని జీ20 దేశాల మంత్రులకు నరేంద్ర మోదీ సూచించారు. ప్రకృతిని ఆరాధించడం భారత్లో ఒక సంప్రదాయంగా వస్తోందన్నారు. వాతావరణ మార్పుల నియంత్రణకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేవారు. తమ దేశంలో మహిళా సాధికారతకు ఎలాంటి పరిమితులు లేవన్నారు. సమాజంలో మార్పునకు, ప్రగతికి మహిళలే సారథులని తేల్చిచెప్పారు. అభివృద్ధి ఎజెండాను వారే నిర్దేశిస్తారని అన్నారు. కాశీని సందర్శించండి ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి భారత్లో వారణాసి అత్యంత పురాతన నగరమని ప్రధాని మోదీ తెలియజేశారు. విజ్ఞానానికి, చర్చకు, సంవాదానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు వారణాసి కొన్ని శతాబ్దాలుగా ముఖ్యమైన కేంద్రంగా వెలుగొందుతోందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల కలయికకు ఇదొక కూడలి అని చెప్పారు. భారత్లోని భిన్నమైన సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడ చూడొచ్చని అన్నారు. సదస్సు జరిగే గదులకే పరిమితం కాకుండా కాశీ నగరాన్ని సందర్శించాలని, కాశీ స్ఫూర్తిని అనుభూతి చెందాలని జీ20 దేశాల మంత్రులకు మోదీ విజ్ఞప్తి చేశారు. గంగా హారతిని, సారనాథ్ను తిలకిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించే ప్రేరణ కచ్చితంగా లభిస్తుందని తెలిపారు. వారణాసి తన సొంత నియోజకవర్గమని తాను ఈ మాట చెప్పడం లేదని మోదీ వ్యాఖ్యానించారు. -
ఎక్కడ ఏవిధంగా ఉండాలో నాకు తెలుసు: రాహుల్కి గట్టి కౌంటర్
విదేశాంగ మంత్రి జైశకంర్ ఎక్కడ ఏవిధంగా ఎలా ఉండాలో తనకు తెలుసునంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండానే కౌంటరిచ్చారు. రాహుల్ గాంధీ యూఎస్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జైశంకర్. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం కేప్ టౌన్ పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడ భారతీయ కమ్యూనిటీతో జరిగిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ పేరు ప్రస్తావించకుండా యూఎస్లో ఎవరో చేసిన వ్యాఖ్యల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని భారతీయ కమ్యూనిటీ ప్రశ్నించగా..విదేశాంగ మంత్రి ఈ విధంగా బదులిచ్చారు. తాను విదేశాల్లో ఉంటే తన గురించే మాట్లాడతానని, అక్కడ రాజకీయాలు చేసేందుకు చూడనని చెప్పుకొచ్చారు. అదే స్వదేశంలో ఉంటే మాత్రం వాదిస్తాను లేదా విభేదించడానికి సిద్ధంగా ఉంటానని చెప్పారు. ప్రజాస్వామ్య సంస్కృతి అర్థం పట్టేలా.. జాతీయ ప్రయోజనం కలిగించేలా సమిష్టిగా పనిచేయడం అనేది ఒక నిర్దిష్ట సాముహిక బాధ్యత అని అన్నారు. కాగా, రాహుల్ గాంధీ అమెరికాలోన శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన మొహబ్బత్కి దుకాన్ కార్యక్రమంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. బీజేపీ చర్యల ఫలితం భారత్లోని ముస్లింలు, దళితులు, గిరిజన ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోందని, వారి కోసం ప్రేమ, అప్యాయతలతో పోరాడలంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆర్థిక అసమానతలు గురించి కూడా వ్యాఖ్యానించారు. (చదవండి: అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను..) -
వృద్ధి అవకాశాల్లో భారత్ నెంబర్ వన్
న్యూఢిల్లీ: అమెరికా నెట్వర్క్ పరికరాల తయారీ సంస్థ– సిస్కో భారత్లో తన భారీ పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. రూటర్లు, స్విచ్ల వంటి ఉత్పత్తుల తయారీకి సంబంధించిన భారత ప్రణాళికలను చైర్మన్, సీఈఓ చక్ రాబిన్స్ ప్రకటించారు. డిజిటల్ మౌలిక సదుపాయాలపై దేశం అద్భుతమైన పురోగతిని సాధించిందని పేర్కొంటూ, వచ్చే దశాబ్దపు వృద్ధి అవకాశాలకు సంబంధించి భారత్ మొదటి అవకాశంగా ఉందని అన్నా రు. తయారీ రంగానికి కేంద్రంగా భారత్ రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు. బహుళ పథకా లు ఇందుకు దోహదపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ తయారీ కార్యకలాపాలు సిస్కో కాంట్రాక్ట్ తయారీదారుల ద్వారా ప్రారంభమవుతాయని తెలిపారు. బిలియన్ డాలర్ల ఎగుమతులు సమీపకాలంలో జరుగుతాయని తాము భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ తదితర సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... ► ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితులు, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం భౌగోళిక రాజకీయ భయాల నేపథ్యంలో టెక్ డిజిటలైజేషన్ వ్యూహాత్మక విలువ మందగించాలి. కానీ అలా జరక్కపోవడం హర్షణీయం. పైగా ఇది పురోగతి బాటన నడుస్తోంది. టెక్నాలజీకి సంబంధి ప్రతి దేశం సాధిస్తున్న విజయానికి ఇది సంకేతం. ► డిజిటలైజేషన్, 5జీ రోల్అవుట్, నైపుణ్య సామర్థ్యాలు, స్టార్టప్ వ్యవస్థ దీనిని బలపరిచే మౌలిక వ్యవస్థ భారత్కు కలిసివస్తున్న అంశాలు. ► భారత్ డిజిటలైజేషన్లో భారీగా పురోగమించింది. మహమ్మారి సమయంలో అలాగే తీవ్ర సవా ళ్ల సమయాల్లో డిజిటలైజేషన్లో దేశం పటిష్ట పురోగతిని సాధించింది. పురోగతి విషయంలో భారత్ ఆశయం చాలా స్పష్టంగా ఉంది. ఇది హర్షణీయ పరిణామం. ప్రధానమంత్రి, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు అనేక అంశాల గురించి మాట్లాడారు. తయారీ నుంచి నైపుణ్యత, సిస్కో కార్యకలాపాలు, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్, 5జీ, సుస్థిర అభివృద్ధి వరకూ అన్ని అంశాలపై ప్రధాని మోదీతో చర్చించడం జరిగింది. భారతదేశంలో తయారీ పురోగతి విషయంలో సహకారం ఇచ్చే విషయంలో మా నిబ ద్ధతను ఈ సందర్భంగా పునరుద్ఘాటించాను. ► ఒక్క డిజిటలైజేషన్లోనే కాదు. భౌతికంగా మౌలిక సదుపాయాల కల్పనలోనూ భారత్ దూసుకుపోతోంది. ► మేడిన్ ఇండియా సిస్కో ప్రొడక్టులు ఈ ప్రాంతానికి, యూరప్కు ఎగుమతి అవుతాయి. దేశంలో క్రమంగా మా వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తాం. ముఖ్యంగా 5జీ పై మాకు ఎక్కువ ఆసక్తి ఉంది. ప్రతి చోటకూ కనెక్టివిటీ హైస్పీడ్కు దోహపపడే అంశం ఇది. ► ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో చోటుచేసుకుంటున్న ఉద్యోగాల కోత ఫలితాలు, పర్యవసానాలు మున్ముందు ఎలా మారతాయన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్తో సిస్కో సీఈఓ చక్ రాబిన్స్ భేటీ -
విదేశీ మారక నిల్వల కంటే వేగంగా... పాక్ విశ్వసనీయత పతనం
బెనౌలిమ్ (గోవా): అంతర్జాతీయ వేదికలపై వక్రబుద్ధి ప్రదర్శించే పాకిస్తాన్ తీరుపై విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ విశ్వసనీయత దాని విదేశీ మారక ద్రవ్య నిల్వల కంటే కూడా శరవేగంగా క్షీణిస్తోందంటూ దుయ్యబట్టారు. శుక్రవారం గోవాలో ముగిసిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) విదేశాంగ మంత్రుల భేటీ ఇందుకు వేదికగా మారింది. కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భేటీలో లేవనెత్తారు. దానిపై పునరాలోచన చేసేదాకా భారత్తో ద్వైపాక్షిక చర్చలకు పాక్ సిద్ధంగా లేదన్నారు. దాంతో భేటీ అనంతరం జై శంకర్ మీడియాతో మాట్లాడుతూ బిలావల్ వ్యాఖ్యలను తూర్పారబట్టారు. ‘‘ఆర్టికల్ 370 ముగిసిన చరిత్ర. ఇప్పటికైనా నిద్ర నుంచి మేల్కొని వాస్తవాలు గమనించండి’’ అంటూ చురకలు వేశారు. బిలావల్ ‘ఉగ్రవాదానికి ప్రోత్సాహకుడు, సమర్థకుడు, అధికార ప్రతినిధి’గా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు! తామూ ఉగ్రవాద బాధితులమేనన్న బిలావల్ వ్యాఖ్యలపైనా జై శంకర్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, పాక్ చేతులు కలుపుతాయా అని ప్రశ్నించగా, ఉగ్రవాద బాధితులు ఎప్పుడూ ఉగ్రవాదానికి పాల్పడిన వారితో కలిసి ఉగ్రవాదంపై చర్చించడానికి కూర్చోరని బదులిచ్చారు. చేశారు. జీ 20 సన్నాహక సమావేశాలను జమ్మూ కశ్మీర్లో జరపడంపై బిలావల్ లేవనెత్తిన అభ్యంతరాలనూ కొట్టిపారేశారు. ‘‘అసలు జీ 20 భేటీలతో మీకేం సంబంధం? దానికంటే, జమ్మూ కశ్మీర్లో మీరు ఆక్రమించుకున్న భూభాగాలను ఎప్పుడు ఖాళీ చేస్తారన్న దానిపై మాట్లాడితే బాగుంటుంది’’ అంటూ వాతలు పెట్టారు. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. ‘‘మేమేదో పాక్పై దౌత్యపరంగా పై చేయి సాధించేందుకు ప్రయత్నించడం లేదు. ఆ దేశం అసలు రంగును రాజకీయంగా, దౌత్యపరంగా ఎప్పటికప్పుడు ప్రపంచం ముందుంచుతున్నాం’’ అని వివరించారు. ఉగ్రమూలాల్ని పెకిలించాలి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సమూలంగా నాశనం చేయాలని ఎస్సీఓ భేటీలో జై శంకర్ పిలుపునిచ్చారు. ‘‘ఉగ్రవాదం ఇప్పటికీ కొనసాగుతోంది. దానినెవరూ సమర్థించరాదు. ప్రభుత్వాల సాయంతో తెరవెనుక సాగే సీమాంతర ఉగ్రవాదం సహా ఏరూపంలో ఉన్నా అరికట్టాలి’’ అని పాక్నుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రమూకల ఆర్థిక మూలాలను సమూలంగా నాశనం చేయాలన్నారు. ఇది ఎస్సీవో లక్ష్యాల్లో ఒకటని గుర్తు చేశారు. సభ్య దేశాల శాంతి, సుస్థిరతలకు భారత్ అత్యంత ప్రాముఖ్యతనిస్తుందన్నారు. ద్వైపాక్షిక అంశాలను ప్రస్తావించరాదనే ఎస్సీవో నిబంధనలను ఉల్లంఘించకుండానే పాక్కు మంత్రి తలంటారు. బిలావల్ మాట్లాడుతూ దౌత్యపరమైన అంశాల్లో ఉగ్రవాదాన్ని అస్త్రంగా వాడుకోరాదన్నారు. ‘‘ఈ సమస్యను రాజకీయాల నుంచి వేరు చేసి అందరూ కలిసికట్టుగా పోరాడాలి. నేనూ ఉగ్రవాద బాధితుడినే. నా తల్లి బేనజీర్ భుట్టో ఉగ్రవాదానికి బలయ్యారు’’ అన్నారు. నమస్కారంతోనే భుట్టోకు పలకరింపు భారత్ సారథ్యంలో ఎస్సీవో సదస్సుకు హాజరైన పాక్ మంత్రి భుట్టో తదితర సభ్య దేశాల విదేశాంగ మంత్రులకు ఎస్.జై శంకర్ తాజ్ ఎగ్జోటికా రిసార్టులో ఏర్పాటు చేసిన వేదిక వద్ద నమస్తేతో స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం హోటల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్లో మాత్రం భుట్టో సహా అతిథులందరితోనూ మంత్రి జై శంకర్ కరచాలనం చేశారు. కార్యక్రమంలో రష్యా, చైనా విదేశాంగ మంత్రులు వరుసగా బిలావల్ భుట్టో, సెర్గీ లావ్రోవ్, క్విన్ గాంగ్తోపాటు ఖజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మంత్రులు పాల్గొన్నారు. -
Video: పాక్ మంత్రికి నమస్కారంతో స్వాగతం పలికిన జైశంకర్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో గోవాలో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల మండలి సమావేశానికి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ సదస్సుకు వచ్చిన పలు దేశాల మంత్రులను భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మర్యాదపూరక్వంగా ఆహ్వానించారు. ఈ క్రమంలో దాయాది పాక్ మంత్రి భుట్టోను కూడా నమస్కారంతో స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి ఫోటో కూడా దిగారు. ఆ తర్వాత వేదిక వద్దకు వెళ్లండంటూ భుట్టోను జైశంకర్ పంపతున్న దృశ్యాలు నెట్టింట్లో వైరల్గా మారింది. 🇷🇺 🇮🇳 WATCH: India's External Affairs Minister S. Jaishankar welcomes Russian Foreign Minister Sergey Lavrov to the #SCO2023 Council of Foreign Ministers' meeting in #Goa.#India #Russia pic.twitter.com/9Z7mw9bCu9 — Sputnik India (@Sputnik_India) May 5, 2023 అనంతరం షాంఘై సదస్సులో పాక్ మంత్రి సమక్షంలోనే విదేశాంగమంత్రి జై శంకర్ ఉగ్రవాద ముప్పు, సీమాంతర ఉగ్రవాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద ముప్పు నిరాటంకంగా కొనసాగుతోందని దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించకూడదని అన్నారు. సరిహద్దు తీవ్రవాదంతో సహా దాని అన్ని రకాలైన ఉగ్రవాదాన్ని పాతరేయాలని పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎస్సీఓ ఆదేశాలలో ముఖ్యమైనదని, దీనిపై కలిసి కట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచారు. చదవండి: ఘోర ప్రమాదం.. ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి One of the best Foreign Ministers of India🇮🇳 Mr. S Jaishankar 🔥🔥 pic.twitter.com/HjdEe0nDfR — kanishka 🇮🇳 (@KanishkaDadhich) May 5, 2023 కాగా గత 12 ఏళ్లలో తర్వాత భారత్ గడ్డపై పాక్ మంత్రి అడుగుపెట్టిన వ్యక్తి బుట్టోనే కావడం విశేషం. షాంఘై రెండురోజుల పర్యటన నిమిత్తం పాక్ మంత్రి బుట్టో గురువారమే గోవా చేరుకున్నారు. ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అతిథులకు జైశంకర్ గురువారం రాత్రి ప్రత్యేక విందు ఇచ్చారు. .బెనాలిమ్లోని సముద్ర తీరంలో ఉన్న తాజ్ రిసార్ట్లో ఏర్పాటు చేసిన ఈ డిన్నర్కు వివిదే విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. పాక్ మంత్రి బిలావల్ భుట్టోకూడా ఈ విందుకు వచ్చారు. Swag mera desi hai 🔥😎😉 (SCO Summit, Goa)#SJaishankar ji pic.twitter.com/MhL1vLdQxp — Stranger (@amarDgreat) May 5, 2023 అయితే, విందులో బిలావల్, జైశంకర్ మాట్లాడుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ.. వీరిద్దరూ షేక్హ్యండ్ ఇచ్చుకొని పలకరించుకున్నారని విశ్వసనీయ వర్గాల త్వారా తెలిసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే భారత ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి ప్రకటనా రాలేదు. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. మరోవైపుతే భారత్- పాక్ విదేశాంగ మంత్రుల మధ్య ద్వైపాక్షిక చర్చ ఉంటుందా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. చదవండి: మణిపూర్: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి.. హెల్త్ కండిషన్ సీరియస్ -
చైనా, పాక్లకు ఘాటు హెచ్చరికలు
ఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలను ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు. భారత్ కు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి సరిహద్దు ఉగ్రవాదంలో పాలుపంచుకుంటున్న శక్తులకు ఇప్పుడున్నది మరో భారత్ అని తెలుస్తుందని, చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉగాండాలో భారతీయ సమాజంతో మాట్లాడుతూ.. మన దేశం కొత్త భారతదేశంగా రూపాంతరం చెందుతోంది. పాక్, చైనాల నుంచి దేశ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను అణచివేసే శక్తి ఈ నవ భారతావనికి ఉంది. యూరీ, బాలాకోట్ ఉదంతాలు ఈ విషయాన్ని చాటిచెబుతాయి. దశాబ్దాల తరబడి సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ సహించింది. ఈ నూతన భారతదేశంతో ఇక వారి ఆటలు సాగవన్న విషయం తెలిసి వస్తుంది అని జైశంకర్ పేర్కొన్నారు. గత మూడేళ్లుగా చైనా సరిహద్దు ఒప్పందాల అతిక్రమణలకు పాల్పడుతోందని, భారీగా దళాలను రంగంలోకి దింపుతోందని జైశంకర్ ఆరోపించారు. కానీ ఇవాళ భారత సైన్యం క్లిష్ట పరిస్థితుల్లో సైతం, అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రాల్లోనూ సన్నద్ధత చాటుతోందన్నారు. గతంలో మాదిరి కాదు.. ఇప్పుడు భారత సైనికులకు ఇప్పుడు పూర్తి మద్దతు ఉంది. వారి వద్ద సరైన ఆయుధాలు ఉన్నాయి. తగిన మౌలిక సదుపాయాలు, వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి అని జైశంకర్ స్పష్టం చేశారు. స్వీయ ప్రయోజనాలకు భంగం కలిగితే ఇప్పటి భారతదేశం ఎంతమాత్రం ఉపేక్షించదన్న విషయాన్ని తక్కిన ప్రపంచం గుర్తించాలని అన్నారు. ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలి? ఎవరి నుంచి చమురు కోనుగోలు చేయకూడదు? వంటి అంశాలను ఇప్పుడు మనకు ఎవరూ నిర్దేశించలేరని, భారత్ ను ఒత్తిడికి గురిచేసే శక్తులేవీ లేవని జై శంకర్ ఉద్ఘాటించారు.ఇవాళ భారత్ ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా నిలబడిందని తెలిపారు. -
ఆ దేశాలకు అదోక చెడ్డ అలవాటు!పశ్చిమ దేశాలపై జైశంకర్ ఫైర్
రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంలో అమెరికా, జర్మనీ స్పందించడాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ విమర్శించారు. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం పశ్చిమ దేశాలకు ఉన్న అదొక చెడ్డ అలవాటుగా అభివర్ణించారు. అది తమకు దేవుడిచ్చిన హక్కుల పశ్చిమ దేశాలు భావిస్తున్నాయంటూ చురకలింటించారు. ఈ మేరకు జైశంకర్ బెంగళూరులోని సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని..పాశ్చాత్య దేశాల జోక్యం గురించి, ఉచిత పథకాల గురించి మాట్లాడారు. పాశ్చాత్య దేశాల తీరు గురించి మాట్లాడుతూ..నేను మీకు వాస్తవాలు గురించి చెప్పదలుచుకున్నాను. మన భారతదేశంపై పాశ్చాత్యులు వ్యాఖ్యానించడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది..ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసకోవడాన్ని దేవుడిచ్చిన హక్కులా భావిస్తూ..ఇలా చేస్తూ ఉంటే ఇతరులు కూడా ఇలానే చేయడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత వారి విషయాల్లో జోక్యం ప్రారంభమవుతుంది. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో వారు అనుభవపూర్వకంగానే తెలుసుకోగలరు. రెండోది..భారత్లో సమస్యలున్నాయని ఇతరు దేశాలను ఆహ్వానిస్తున్నాం. ఒకరకంగా మట్లాడేందుకు అవకాశం ఇస్తున్నాం. ముందు సమస్యలున్నాయని ప్రపంచానికి మట్లాడమని ఉదారంగా ఆహ్వానించడం మానేయాలి. అయినా మీరు(రాహుల్ని ఉంద్దేశిస్తూ) ఎందుకు ముందు మాట్లాడటం లేదు. దీని గురించి ఏమైనా చేయొచ్చు కదా. మన సమస్యల్లోకి ఇతరులను ఎందుకు లాగడం. మనం అలా అవకాశం ఇస్తే కచ్చితంగా వారు స్పందిస్తారు. నిజానికి ఇక్కడ సమస్య వాళ్లు కాదు, మనం కూడా. ముందు రెండిటిని సరిచేయాల్సిన అవసరం ఉంది అని శంకర్ అన్నారు. అదే క్రమంలో రాజకీయ పార్టీ ఉచిత పథకాల గురించి ప్రస్తావిస్తూ..ఈ సంస్కృతి ప్రస్తావనపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. వనరులు పెంచే బాధ్యత తమ వద్ద లేదు కాబట్టే వాళ్లు అలా చేస్తున్నారు. ఇలాంటి ఉచిత పథకాలతో దేశాన్ని నడపటం సాధ్యం కాదు. ఉచితాలకు ఆధారం ఎవరైనా దాని కోసం చెల్లించుండాలి లేదా దేనినైనా తీసేస్తుండాలి అని అర్థం. ఈ ఉచిత పథకాలతో ప్రజాధరణ పొందడం సులువైన మార్గం కావచ్చు కానీ ఇది ముమ్మాటికీ బాధ్యతరహితమైన మార్గమే అని నొక్కి చెప్పారు జై శంకర్. (చదవండి: ఔను! మేము అధికారం కోసమే కలిశాం: బీజేపీ పై ఉద్ధవ్ థాకరే ఫైర్) -
ఉగ్రవాదంపై ‘క్వాడ్’ కార్యాచరణ బృందం
న్యూఢిల్లీ: ఆధునిక యుగంలో కొత్త రూపు సంతరించుకుంటున్న ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని కఠినంగా అణచివేయడానికి చేపట్టాల్సిన చర్యల కోసం ‘వర్కింగ్ గ్రూప్ ఆఫ్ కౌంటర్–టెర్రరిజం’ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ‘క్వాడ్’ దేశాల విదేశాంగ మంత్రులు ప్రకటించారు. ‘క్వాడ్’ కూటమిలో భాగమైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు ఎస్.జైశంకర్, ఆంటోనీ బ్లింకెన్, యోషిమస హయషీ, పెన్నీ వాంగ్ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రపంచమంతటా ఉగ్రవాద భూతం విస్తరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్ర మూకల ఆటకట్టించడానికి నాలుగు దేశాల కార్యాచరణ బృందం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. చట్టబద్ధ పాలన, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, శాంతియుతంగా వివాదాల పరిష్కారానికి మద్దతు కొనసాగుతుందని తేల్చిచెప్పారు. జీ7 కూటమికి జపాన్, జీ20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తుండడంతోపాటు ఈ ఏడాది ఆసియా–పసిఫిక్ ఎకనామిక్ కో–ఆపరేషన్(ఏపీఈసీ)కి అమెరికా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ‘క్వాడ్’ అజెండా అమలు కోసం సన్నిహితంగా కలిసి పనిచేయాలని తీర్మానించుకున్నట్లు వివరించారు. అనంతరం క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ఢిల్లీలో ‘రైజినా డైలాగ్’లో పాల్గొన్నారు. -
సరిహద్దులో శాంతిపైనే చర్చ
న్యూఢిల్లీ: జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం కోసం ఢిల్లీకి చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. ఇరుదేశాల సరిహద్దు వెంట బలగాల మొహరింపు, ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి నెలకొల్పడంపైనే చర్చలో ప్రధానంగా దృష్టిపెట్టినట్లు జైశంకర్ గురువారం చెప్పారు. ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సవాళ్లుగా నిలుస్తున్న సమస్యలు భేటీలో చర్చకొచ్చినట్లు ఆయన ఆ తర్వాత ట్వీట్చేశారు. డిసెంబర్లో చైనా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న క్విన్తో జైశంకర్ భేటీ కావడం ఇదే తొలిసారి. జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం ఎజెండాపైనా క్విన్తో మాట్లాడారు. గతంలో చివరిసారిగా నాటి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో బాలీలో జీ20 సదస్సు సందర్భంగా జైశంకర్ మాట్లాడారు. తూర్పు లద్దాఖ్లో ప్రతిష్టంభనను తొలగించాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. -
ఆయన వెరీ డేంజర్: కేంద్రమంత్రి జైశంకర్
ఢిల్లీ: మెల్బోర్న్ హంగేరియన్-అమెరికన్ బిలియనీర్, ప్రముఖ ఇన్వెస్టర్ జార్జ్ సోరస్పై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీపై 92 ఏళ్ల సోరస్ చేసిన విమర్శలను తిప్పికొట్టారాయన. నిన్న(శుక్రవారం) మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సైతం ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సోరస్కు వయసైపోయింది. ఆయనవి మూర్ఖమైన అభిప్రాయాలు అని జైశంకర్ పేర్కొన్నారు. న్యూయార్క్లో కూర్చుని ప్రపంచం మొత్తం ఎలా పని చేయాలో తానే నిర్ణయించాలని సోరస్ అనుకుంటున్నారు. ఆయన వయసైపోయిన వ్యక్తి. ధనికుడు. నచ్చిన అంశాలపై తన అభిప్రాయాలను చెప్తుంటాడు. అంతకు మించి ఆయనొక ప్రమాదకరమైన వ్యక్తి అని జైశంకర్ అభివర్ణించారు. తనకు నచ్చిన వ్యక్తి ఎన్నికల్లో గెలిస్తే అది మంచిదని సోరస్ భావిస్తాడు. అదే ఫలితం మరోలా వస్తే గనుక.. ప్రజాస్వామ్యంలో తప్పులు వెతుకుతాడు అంటూ జైశంకర్, సోరస్ గురించి వ్యాఖ్యానించారు. వలసవాదం నుంచి వెలుగులోకి వచ్చిన భారత్కు.. బయటి నుంచి జోక్యాలతో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో బాగా తెలుసని జైశంకర్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా మంత్రి క్రిస్ బ్రౌన్తో చర్చ సందర్భంగా.. జైశంకర్ పై వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. PM మోదీ ప్రజాస్వామ్యవాది కాదని, ముస్లింలపై హింసను ప్రేరేపించడం వల్లే ఆయన స్థాయి పెరిగిందంటూ సోరస్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారమే రేపాయి. హిండెన్బర్గ్-అదానీ వ్యవహారంపైనా విదేశీ పెట్టుబడిదారులకు, భారత్లోని విపక్షాలకు మోదీ సమాధానం చెప్పాల్సిందని సోరస్, మ్యూనిచ్(జర్మనీ) సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: సోరస్ గురించి తెలుసా? ఆయనో ఆర్థిక నేరగాడు! -
ఉగ్రవాదాన్ని విస్తరిస్తున్న పాకిస్తాన్ను ఇంకా ఏమనాలి?
వియన్నా: భారత్లోకి ఉగ్రవాదులను ఎగ దోస్తూ, ఉగ్రవాదాన్ని విస్తరింపజేస్తున్న పాకిస్తాన్పై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమర్థించుకున్నారు. ఆస్ట్రియా జాతీయ వార్తాప్రసార సంస్థ ఓఆర్ఎఫ్కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ పలు అంశాలు మాట్లాడారు. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రస్థానం పాక్లో ఉందని మీరు చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో ఒక భారతీయ దౌత్యవేత్త హోదాలో సమర్థించుకుంటారా అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు జైశంకర్ బదులిచ్చారు ‘భారత పార్లమెంట్పై దాడి, ముంబై వంటి నగరాల్లో దాడి చేసి భారతీయులను, విదేశీ పర్యాటకులను చంపి, రోజూ సరిహద్దు గుండా ఉగ్రవాదుల చొరబాట్లకు ప్రయత్నించే పాక్నుద్దేశించి ఇంకా ఏమనాలి? ఇంకాస్త పరుష పదం వాడితే బాగుండేది. ఉగ్రవాదానికి కేంద్రస్థానం అనే పదం మంచిదే’ అని వ్యాఖ్యానించారు. ‘పట్టపగలే నగరాల్లో ఉగ్రవాదులకు సైన్యం తరహాలో యుద్ధతంత్రాలు నేర్పిస్తున్నారు. ఈ విపరీతాలను యూరప్ దేశాలు ఎందుకు నిలదీయవు? భారత్, పాక్ మధ్య మళ్లీ యుద్ధం వస్తుందేమోననే భయం ప్రపంచానికి ఉంటే ముందుగా ఉగ్రవాదంపై ప్రపంచదేశాలు దృష్టిపెట్టాలి’ అని హితవు పలికారు. ఇదీ చదవండి: వీడియో: అన్నా చెల్లెలి అనురాగం.. చెల్లిపై ఉప్పోంగిన ఆప్యాయతతో.. -
జవాన్లకు ఆ పదం ఉపయోగించకూడదు! రాహల్కు కౌంటర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత జవాన్లపై చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మన జవాన్లకు పిటై అనే పదాన్ని ఉపయోగించకూడదంటూ రాహుల్పై విరుచుకుపడ్డారు. "వారంతా అరుణాచల్ప్రదేశ్లో యాంగ్సేలో సుమారు 13 వేల అడుగుల ఎత్తులో నిలబడి పహారా కాస్తున్నారని అన్నారు. అలాంటి వారిని మనం గౌరవించాలి. వారి పట్ల అలాంటి పదాలను ఉపయోగించడం సరికాదు". అని జైశంకర్ లోక్సభలో అన్నారు. ఈ మేరకు విదేశాంగమంత్రి జై శంకర్ సోమవారం లోక్సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం చైనా పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే.. భారత సైన్యాన్ని సరిహద్దులకు ఎవరూ పంపారు. ఈ ఘర్షణలను తలెత్తకుండా ఉండేలా చైనాపై ఎందుకు ఒత్తిడి చేస్తున్నాం. ఇరు దేశాల సంబంధాలు మాములుగా లేవని బహిరంగంగా ఎందుకు చెబుతున్నాం అని గట్టిగా ప్రశ్నించారు. రాజకీయంగా విభేదాలు వచ్చినా, విమర్శలు వచ్చినా మాకెలాంటి ఇబ్బంది లేదని తెగేసి చెప్పారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్ అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత రాహుల్ రాజస్తాన్లోని జైపూర్లో భారత్ జోడో యాత్ర సందర్భంగా విలేకరుల సమావేశాంలో భారత్ చైనా ఘర్షణలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజింగ్ యుద్ధానికి రెడీ అవుతుంటే మోదీ పాలన నిద్రపోతుందంటూ ఎద్దేవా చేశారు. మన భూమిని చైనా లాక్కుందని, చైనా సైనికులు భారత ఆర్మీ సిబ్బందిని కొడుతున్నారంటూ వ్యాఖ్యలు చూశారు. దీంతో బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. (చదవండి: షాకింగ్ ఘటన: దొంగతనం చేశాడని..కదులుతున్న రైలు నుంచి తోసేసి..) -
ముంబై ఉగ్రదాడులకు 14 ఏళ్లు.. ట్వీట్తో జైశంకర్ నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ: 26/11 ముుంబై ఉగ్రదాడులు జరిగి ఈరోజుతో 14 ఏళ్లు అవుతోంది. భారత దేశ చరిత్రలోనే చీకటి రోజుగా చెప్పే ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది, పౌరులకు నివాళులు అర్పించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. Terrorism threatens humanity. Today, on 26/11, the world joins India in remembering its victims. Those who planned and oversaw this attack must be brought to justice. We owe this to every victim of terrorism around the world. pic.twitter.com/eAQsVQOWFe — Dr. S. Jaishankar (@DrSJaishankar) November 26, 2022 ఉగ్రవాదం మానవాళికి ముప్పు. నేడు 26/11 ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని భారత్తో పాటు యావత్ ప్రపంచం స్మరించుకుంటోంది. ఈ ఘటనకు బాధ్యులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడుల్లో ప్రాణాలు కల్పోయిన వారికి భారత్ సంఘీభావం తెలుపుతోంది. అని జైశంకర్ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ముంబై ఉగ్రదాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలిపారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. On the anniversary of 26/11 Mumbai terror attacks, the nation remembers with gratitude all those we lost. We share the enduring pain of their loved ones and families. Nation pays homage to the security personnel who fought valiantly and made supreme sacrifice in the line of duty. — President of India (@rashtrapatibhvn) November 26, 2022 14 ఏళ్ల క్రితం 2008లో ఇదే రోజున లష్కరే తోయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి సముద్రమార్గం ద్వారా ముంబై వచ్చి ప్రముఖ హోటల్లో చొరబడ్డారు. కన్పించిన వారిపై కాల్పులకు తెగబడి మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో18 మంది భద్రతా సిబ్బంది సహా మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: మహిళలపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు.. -
7న రష్యాకు జై శంకర్
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఈ నెల 7, 8వ తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో మాస్కోలో భేటీ అవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం చెప్పారు. ఫిబ్రవరిలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక వీరిద్దరు నాలుగుసార్లు సమావేశమయ్యారు. అమెరికా, పశ్చిమదేశాలు రష్యాపై అన్ని రకాలుగా తీవ్ర ఆంక్షలు విధించాయి. ఆయా దేశాల అభ్యంతరాలను సైతం లెక్క చేయకుండా భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను ఇటీవలి కాలంలో పెంచింది. -
‘26/11’ కుట్రదారులు ఇంకా బయటే...
ముంబై: ముంబైలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడుల కుట్రధారులు, పాత్రధారులు ఇప్పటికీ రక్షణ పొందుతూనే ఉన్నారు. నిక్షేపంగా తిరుగుతున్నారు. వారికి ఏ శిక్షలూ పడడం లేదు’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు విస్తరించిందని, దానితో నష్టాల గురించి ఇతరుల కంటే భారత్కే ఎక్కువగా తెలుసని అన్నారు. ‘ఉగ్రవాద కార్యకలాపాలకు నూతన సాంకేతికను వాడుకోకుండా నిరోధించడం’ అనే అంశంపై 26/11 దాడులకు సాక్షిగా నిలిచిన ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడారు. దాడుల మృతులకు గబాన్ దేశ విదేశాంగ మంత్రి, యూఎన్ఎస్సీ అధ్యక్షుడు మైఖేల్ మౌసా–అడామో తదితరులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరో దేశం నుంచి వచ్చిన ముష్కరులు మారణహోమం సృష్టించారని పాకిస్తాన్పై ధ్వజమెత్తారు. కరడుగట్టిన ఉగ్రవాదుల విషయంలో రాజకీయ కారణాల వల్ల ఐరాస భద్రతా మండలి చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. పాక్ ఉగ్రవాదులపై ఆంక్షలు విధించకుండా చైనా çఅడ్డుకుంటోందని విమర్శించారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలంటే ఆ సంస్థలకు నిధులందకుండా చేయాలని సూచించారు. అలా చేస్తే వారి వెన్ను విరిచినట్లేనని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం ఉమ్మడిగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. -
‘డర్టీ బాంబ్’ ఆందోళనల వేళ రష్యాకు జైశంకర్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. అణ్యవాయుధాల వినియోగం ఆందోళనకు నెలకొన్న వేళ రష్యా పర్యటన చేపట్టనున్నారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. నవంబర్ 8న మాస్కో పర్యటనకు వెళ్లనున్నారని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ టూర్లో రష్యా విదేశాంగ మంత్రి సర్గే లావ్రోవ్తో సమావేశం కానున్నారు. జైశంకర్ పర్యటనలో ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వంటి అంశాలపై చర్చించనున్నట్లు రష్యా తెలిపింది. డర్టీ బాంబు వినియోగంపై రష్యా, ఉక్రెయిన్లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో జైశంకర్ మాస్కో పర్యటన చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం రష్యా రక్షణ మంత్రి సర్గీ షోయ్గూతో మాట్లాడిన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. అణ్వాయుధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని సూచించారు. ఇదీ చదవండి: రష్యా ఆరోపణ.. భద్రతా మండలికి డర్టీ బాంబ్ పంచాయితీ! ఖేర్సన్ ఖాళీ!! -
‘అత్యంత క్లిష్ట దశలో భారత్-చైనా సంబంధాలు’
బ్యాంకాక్: సరిహద్దుల్లో చైనా చేస్తున్న దుశ్చర్యలను ఖండించారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ప్రస్తుతం భారత్-చైనా సంబంధాలు అత్యంత క్లిష్ట దశలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రెండు పొరుగు దేశాలు కలిసి పని చేస్తేనే ఆసియా అభివృద్ధి పథంలో వెళ్తుందని సూచించారు. బ్యాంకాక్ చులలాంగ్కోర్న్ యూనివర్సిటిలో ఇండో-పసిఫిక్లో భారత్ విజన్పై మాట్లాడిన తర్వాత ఎదురైన ప్రశ్నలకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు జైశంకర్. ‘సరిహద్దులో డ్రాగన్ చేసిన పనికి ప్రస్తుతం భారత్-చైనా సంబంధాలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. భారత్, చైనా కలసి నడిచేందుకు ఒక్క శ్రీలంక మాత్రమే కాదు, చాలా కారణాలున్నాయని నేను భావిస్తున్నా. అయితే, అది భారత్, చైనా వ్యక్తిగత నిర్ణయం. చైనా వైపు సానుకూల స్పందన ఉంటుందని మాకు నమ్మకం ఉంది. శ్రీలంకకు అన్ని విధాలా భారత్ సాయం చేసింది. ఈ ఏడాదిలోనే 3.8 బిలియన్ డాలర్ల సాయం అందించింది. ఐఎంఎఫ్ వద్ద శ్రీలంకకు అవసరమైన మద్దతును ఇస్తాం.’ అని తెలిపారు విదేశాంగ మంత్రి జైశంకర్. రోహింగ్యాల సమస్యపై అడిగిన ప్రశ్నకు.. బంగ్లాదేశ్తో చర్చిస్తున్నామని సమాధానమిచ్చారు మంత్రి జైశంకర్. వారిని తిరిగి స్వదేశానికి పంపించటమే ప్రధాన అంశమని, ఆ విషయంలో బంగ్లాదేశ్కు మద్దతు ఇస్తామన్నారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు దిగుమతులపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు జైశంకర్. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నది ఒక్క భారత్ మాత్రమే కాదన్నారు. పలు ఐరోపా దేశాలు సైతం చమురు దిగుమతలు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. ఇదీ చదవండి: అమెరికాలో సెటిల్ కావడానికి ప్లాన్ చేసిన గొటబయా రాజపక్స! -
‘లంక రేవు’ను పర్యవేక్షిస్తున్నాం: జైశంకర్
బ్యాంకాక్: శ్రీలంక పోర్టు హంబన్టొటలో చైనా నిఘా నౌక యువాన్ వాంగ్ 5 రావడంతో భారత్ భద్రతకు భంగం వాటిల్లే పరిణామమేదైనా జరుగుతుందేమోనని పర్యవేక్షిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ చెప్పారు. భారత్ థాయ్లాండ్ జాయింట్ కమిషన్ భేటీ సందర్భంగా జైశంకర్ మాట్లాడారు. మా పొరుగు దేశంలో జరిగే ఎలాంటి పరిణామాలైననా గమనిస్తూ ఉంటామని చెప్పారు. చైనాకు చెందిన హైటెక్ నౌక యువాన్ వాంగ్ 5 శాంతి, స్నేహ సంబంధాల మిషన్ అని ఆ నౌక కెప్టెన్ జాంగ్ హాంగ్వాంగ్ పేర్కొన్నారు. భారత్ అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతర్ చేస్తూ చైనా హైటెక్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్టొట రేవు పట్టణంలోకి మంగళవారం ఉదయం ప్రవేశించింది. ఈ విషయాన్ని పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధనం నింపుకోవడానికే ఈ రేపులో ఆగినట్టుగా చైనా బయటకి చెబుతున్నప్పటికీ మన దేశ రక్షణ కార్యకలాపాలపై నిఘా వేయడం కోసమే డ్రాగన్ ఈ నౌకను పంపినట్టుగా అనుమానాలు వెలువడుతున్నాయి. ఇదీ చదవండి: భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక -
దేశం కోసం.. ప్రజల కోసం ఆ పని: విదేశాంగ మంత్రి
బ్యాంకాక్/ఢిల్లీ: రష్యాతో భారత్ చమురు వాణిజ్యంపై అమెరికా చల్లబడినట్లుగానే అనిపిస్తోంది. ఉక్రెయిన్ యుద్దం తర్వాత అగ్రరాజ్యంతో పాటు చాలా పాశ్చాత్య దేశాలు భారత్ మీద మండిపడ్డాయి. అయినప్పటికీ భారత్ మాత్రం తగ్గేదేలే అన్నచందాన ముందుకు వెళ్తోంది. ఏప్రిల్ నుంచి గరిష్ఠ స్థాయిలో చమురు వాణిజ్యం జరుగుతోంది ఇరు దేశాల మధ్య. ఈ తరుణంలో రష్యాతో ఒప్పందం కొనసాగించాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న మరోసారి ఎదురైంది భారత్కు. మంగళవారం బ్యాంకాక్లో ఓ కార్యక్రమానికి హాజరైన భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. భారతీయులు చమురుకు అధిక ధరలు చెల్లించలేరని, అందుకే రష్యాతో ముడి చమురు ఒప్పందాలను కొనసాగిస్తున్నామని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం మేలిరకమైంది. భారత ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రతీ దేశం అధిక ఇంధన ధరలను తగ్గించడానికి సాధ్యమైనంత మేరకు.. ఉత్తమమైన ఒప్పందాలపై వైపు మొగ్గు చూపిస్తుంది. అలాగే భారత్ కూడా అదే పని చేసింది. ప్రస్తుతం ఆయిల్, గ్యాస్ ధరలు అధికంగా ఉన్నాయి. సంప్రదాయ పంపిణీదారులంతా యూరప్కు తరలిస్తున్నారు. అలాంటప్పుడు భారత్ ముందర ఇంతకన్నా మార్గం మరొకటి లేదని ఆయన నొక్కి చెప్పారు. నైతిక బాధ్యతగా పౌరుల గురించి ఆలోచించే తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని తేల్చి చెప్పారాయన. అంతేకాదు ఈ విషయం అమెరికాకు కూడా అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. రష్యాతో భారత్ చమురు వాణిజ్యంలో మొదటి నుంచి అమెరికా అభ్యంతరాలు చెబుతూ వస్తోంది. అయితే.. ఈ ఏప్రిల్లో అమెరికా, భారత్ మధ్య జరిగిన 2+2 స్థాయి సమావేశంలో.. రష్యాతో వాణిజ్యం గురించి అమెరికా నిలదీయడంతో.. భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇదీ చదవండి: హైదరాబాద్-బెంగళూరు మధ్య జర్నీ రెండున్నర గంటలే!! -
'గడ్డుకాలం ఎదుర్కొంటున్న లంకకు సాయం చేస్తాం'
న్యూఢిల్లీ: రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది శ్రీలంక. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ స్పందించారు. పొరుగు దేశంతో భారత్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీలంకకు సాయం అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు కూడా తన వంతు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం శరణార్థ సంక్షోభం లేదని జైశంకర్ పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు శ్రీలంక ప్రయత్నిస్తోంది, ఏం జరుగుతుందో వేచి చూడాలని పేర్కొన్నారు. భారత్ నుంచి మాత్రం అవసరమైన సాయం అందుతుందని స్పష్టం చేశారు. సంక్షోభంతో అత్యంత దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది శ్రీలంక. ఆహారం, ఇంధనం, ఆర్థిక సంక్షోభానికి కారణం అధ్యక్షుడు గొటబయ రాజపక్సే అని, ఆయనే ప్రస్తుత పరిస్థితికి బాధ్యత తీసుకోవాలంటూ లక్షల మంది నిరసనకారులు శనివారం అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. ఒకప్పుడు సుసంపన్నంగా ఉన్న తమను దారుణమైన పరిస్థితిలోకి నెట్టారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రధాని విక్రమసింఘే ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. జనాగ్రహం చూసి ఆయన ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో శ్రీలంకలో అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి:అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
భారత్పై అమెరికా వ్యాఖ్యలు.. జై శంకర్ గట్టి కౌంటర్
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సాగిన చర్చల్లో మానవ హక్కుల అంశం ప్రస్తావనకు రాలేదని భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా భారత్పై అమెరికా చేసిన వ్యాఖ్యలపై జైశంకర్ తీవ్రంగా స్పందించారు. అమెరికా, భారత్ మధ్య జరిగిన 2+2 స్థాయి సమావేశంలో మానవ హక్కుల అంశం చర్చించాల్సిన విషయం కాదని అన్నారు. అయితే చర్చ జరిగినప్పుడల్లా వాటి గురించి మాట్లాడేందుకు తాము వెనకాడబోమని, తప్పకుండా మాట్లాడతామని స్పష్టం చేశారు. ‘ప్రతి ఒక్కరికి భారత్పై ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండేందుకు అర్హులు. అలాగే మాకు కూడా వారిపై అభిప్రాయాలు ఉంటాయి. అమెరికాతో సహా ఇతర దేశాల మానవ హక్కుల పరిస్థితిపై కూడా మాకు అభిప్రాయాలు ఉంటాయి. ఈ విషయంపై చర్చించాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మా అభిప్రాయాలు చెబుతాం’ అని గట్టి కౌంటర్ ఇచ్చారు. చదవండి: ఆహారం ‘వృథా’లో టాప్ టెన్ దేశాలివే.. కాగా భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. ఇటీవలపరిస్థితులు గమనిస్తుంటే కొంతమంది పోలీసులు, అధికారులు, ప్రభుత్వాల వల్ల మానవ హక్కుల ఉల్లంఘణ పెరిగిందని వ్యాఖ్యనించారు. వీటికి ముగింపు పలికే వరకు ఈ అంశంపై నిరంతరం భారత్తో సంప్రదింపులు జరుపుతుంటామన్నారు. పర్యటన ముగింపు సందర్భంగా అమెరికాలో భారతీయ పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుత సమావేశంలో మానవ హక్కుల అంశం చర్చకు రాలేదని జై శంకర్ తెలిపారు. గతంలో ప్రస్తావనకు వచ్చిందని, దానిపై చర్చించి, సమాధానం కూడా చెప్పినట్లు గుర్తుచేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాజకీయ సైనిక వ్యవహారాలపై చర్చించినట్లు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఆహర భద్రత, శ్రీలంక సంక్షోభం, పాకిస్తాన్ వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు వెల్లడించారు. చదవండి: రష్యాది నరమేధమే: బైడెన్ -
కశ్మీర్పై చైనా వివాదాస్పద వ్యాఖ్యలు.. రెండు రోజులకే జై శంకర్తో భేటీ
న్యూఢిల్లీ: చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ శుక్రవారం విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్తో భేటీ అయ్యారు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగిన ఈ సమావేశంలో.. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా పాకిస్థాన్ పర్యటన ముగించుకొని గురువారం సాయంత్రం వాంగ్ యీ ఢిల్లీ చేరుకున్నారు. జైశంకర్తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్తోనూ సమావేశం అయ్యారు. అయితే పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో కశ్మీర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాంగ్ యూ.. తాజాగా భారత్లో పర్యటించడం గమనార్హం. గల్వాన్ ఘటన తర్వాత సీనియర్ స్థాయి చైనా నేత భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. వాంగ్ యూ, జైశంకర్ భేటీలో ఇరు దేశాల సరిహద్దు సమస్యలు.. ఉక్రెయిన్పై రష్యా దాడిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.. అదే విధంగా ఆప్గనిస్తాన్లోని పరిస్థితిపై కూడా వారు చర్చించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగాం ఢిల్లీకి రాకముందు వాంగ్ యి తన మూడు రోజుల పాకిస్తాన్ పర్యటన తర్వాత అప్ఘనిస్తాన్లోని కాబూల్లో పర్యటించారు. దవండి: రాజ్యసభ ఎన్నికల్లో ‘ఆప్’ విజయం.. ఎంపీలుగా హర్భజన్, అశోక్ మిట్టల్... కాగా ఇస్లామాబాద్లో మంగళవారం పాకిస్తాన్లోని ఇస్లామిక్ సహకార సంస్థ సదస్సులో ప్రసంగించిన వాంగ్ యీ జమ్మూకశ్మీర్ గురించి ప్రస్తావించారు. కశ్మీర్ విషయాన్ని ఓఐసీ సదస్సలు పలు ఇస్లామిక్ మిత్ర దేశాలు ప్రస్తావించాయని, చైనా కూడా అదే కోరుకుంటుందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన విషయాలు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారాలని, చైనాతో సహా ఇతర దేశాలకు మాట్లాడే హక్కు లేదని పేర్కొంది. భారత్ తమ అంతర్గత సమస్యలపై ఇతరుల జోక్యం కోరదని గ్రహించాలని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: foreign-minister -
చైనాతో అత్యంత క్లిష్టంగా సంబంధాలు
మ్యూనిక్: చైనాతో భారత సంబంధాలు ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించవద్దన్న ఒప్పందాలను చైనా ఉల్లంఘించడంతో పరిస్థితి మరింత విషమించిందన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి సరిహద్దుల్లోని పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. జర్మనీలోని మ్యూనిక్లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (ఎంఎస్సీ)లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు 45 ఏళ్ల పాటు శాంతియుతంగానే ఉన్నాయని గుర్తు చేశారు. చైనా వంటి ఒక పెద్ద దేశం ఒప్పందాలను ఉల్లంఘిస్తే అది అంతర్జాతీయ సమాజమంతా ఆందోళన చెందాల్సిన విషయమేనన్నారు. సుదూరాల్లోని చిన్న దేశాలకు భారీగా అప్పులిచ్చి అక్కడి వ్యూహాత్మక ప్రాంతాలను చైనా తన అదుపులోకి తెచ్చుకుంటున్న తీరు ఆందోళనకరమని జై శంకర్ అన్నారు. అనుసంధానం ముసుగులో చేస్తున్న ఇలాంటి పనులు ఇతర దేశాల సార్వభౌమత్వానికి ముప్పని అభిప్రాయపడ్డారు. క్వాడ్ను ఆసియా నాటో అనడం సరికాదని స్పష్టం చేశారు. -
కెనడా-అమెరికా సరిహద్దులో నలుగురు భారతీయుల మృతి
న్యూఢిల్లీ: భారత దేశానికి చెందిన నలుగురు వ్కక్తులు కెనడా-అమెరికా సరిహద్దు ప్రాంతంలో మృతి చెందినట్లు ఆ దేశాల సరిహద్దు అధికారులు గుర్తించారు. వెంటనే భారత విదేశాంగ శాఖకు సమాచారం అందించారు. ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో పసిపాప కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించిన జైశంకర్ ఆయాదేశాల్లో ఉన్నటువంటి భారత రాయబారులను అప్రమత్తం చేశారు. మృతి చెందిన వారిని గుర్తించాలని.. అదే విధంగా ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. Shocked by the report that 4 Indian nationals, including an infant, have lost their lives at the Canada-US border. Have asked our Ambassadors in the US and Canada to urgently respond to the situation: EAM Dr S Jaishankar (File photo) pic.twitter.com/b5jddAqg4v — ANI (@ANI) January 21, 2022 చదవండి: ఇక నుంచి కరోనాను నిమిషాల్లో గుర్తించవచ్చు.. ఎలాగంటారా.. -
17న ‘షాంఘై’ భేటీలో మోదీ ప్రసంగం
న్యూఢిల్లీ: తజకిస్తాన్ రాజధాని దుషాంబేలో 17న ప్రారంభంకానున్న వార్షిక షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ(వర్చువల్) పద్ధతిలో ప్రసంగించనున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ నేరుగా దుషాంబేకు వెళ్లి అక్కడ జరుగుతున్న ఎస్సీవో సదస్సులో పాల్గొని భారత అభిప్రాయాలను పంచుకోనున్నారు. అఫ్గాన్ సంక్షోభం కారణంగా తలెత్తే పరిణామాలపై సదస్సులో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలి రహ్మాన్ అధ్యక్షత ప్రారంభమయ్యే 21వ ఎస్సీవో సదస్సులో సభ్య దేశాల అగ్రనేతలు నేరుగా, వర్చువల్ పద్ధతిలో ప్రసంగించనున్నారు. భారత ప్రతినిధి బృందం తరఫున ప్రధాని మోదీ సదస్సు ప్లీనరీ సెషన్లో ప్రసంగించనున్నారు’ అని భారత విదేశాంగ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈసారి సమావేశాల్లో ఎస్సీవో సభ్య దేశాల నేతలు, పరిశీలక దేశాలు, ఎస్సీవో ప్రధాన కార్యదర్శి, ఎస్సీవో ప్రాంత ఉగ్రవ్యతిరేక విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్య అతిథులు పాల్గొననున్నారు. వర్చువల్ పద్ధతిలో సదస్సు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎస్సీవోలో పూర్తి స్థాయి సభ్య దేశం హోదా సంపాదించాక భారత్ ఈ సదస్సులో పాల్గొనడం ఇది నాలుగోసారి. ‘ఎస్సీవో 20వ వార్షికోత్సవం సందర్భంగా గత రెండు దశాబ్దాల్లో సాధించిన ప్రగతిపై సమీక్ష జరిగే అవకాశముంది. భవిష్యత్తులో దేశాల సహకారంపైనా చర్చ జరగొచ్చు’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరాన్, తజకిస్తాన్, ముఖ్య దేశాల విదేశాంగ మంత్రులతో జై శంకర్ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. చైనా, రష్యా, పాక్ విదేశాంగ మంత్రులు సదస్సుకు హాజరుకానున్నారు. నాటో తరహాలో ఎనిమిది దేశాల కూటమిగా ఎస్సీవో ఆవిర్భవించింది. 2017 నుంచి భారత్, పాక్లు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులు సంయుక్తంగా 2001లో షాంఘైలో ఎస్సీవోను స్థాపించారు. భద్రతాపరమైన అంతర్జాతీయ సహకారం కోసం ఎస్సీవోతో, రక్షణ అంశాల్లో ఉమ్మడి పోరు కోసం యాంటీ–టెర్రరిజం స్ట్రక్చర్(ర్యాట్స్)లతో భారత్ కలిసి పనిచేస్తోంది. ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ చర్చ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్తో ప్రధాని మోదీ బుధవారం మాట్లాడారు. భారత్–ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మ భాగస్వామ్యంలో పురోగతిపై నేతలిద్దరూ చర్చించారు. ‘త్వరలో జరగబోయే ‘క్వాడ్’ సదస్సు గురించీ చర్చించాము’ అని ఆ తర్వాత మోదీ ట్వీట్చేశారు. -
బంగ్లాదేశ్ సమాచార ప్రసార శాఖ మంత్రితో జైశంకర్ భేటీ
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారత్ అధికారిక పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ సమాచార ప్రసార శాఖ మంత్రి హసన్ మహమూద్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. 'బంగ్లాదేశ్ సమాచార ప్రసార శాఖా మంత్రి హసన్ మహమూద్ని కలిసినందకు చాలా సంతోషంగా ఉంది. ఈ ద్వైపాక్షిక సహకారం ఇరుదేశాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది' అంటూ జైశంకర్ ట్వీట్ చేశారు. (చదవండి: ‘భారత్ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం’) Glad to meet Bangladesh Information and Broadcasting Minister, Hasan Mahmud. Our bilateral cooperation is progressing steadily across all domains. Discussed media and public perceptions in that regard. pic.twitter.com/CfaKun1D0t — Dr. S. Jaishankar (@DrSJaishankar) September 7, 2021 -
ఖతార్ విదేశాంగ మంత్రితో ఎస్. జైశంకర్ చర్చలు
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ శుక్రవారం ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్–థానీతో శుక్రవారం సమావేశమయ్యారు. ఖతార్ రాజధాని దోహాలో ఈ భేటీ జరిగింది. అఫ్గానిస్తాన్లో తాలిబన్ల దుశ్చర్యలు, తాజా పరిణామాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ఈ విషయాన్ని జైశంకర్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. నాలుగు రోజుల అమెరికా పర్యటనను ముగించుకొని భారత్కు తిరుగు ప్రయాణమైన ఆయన ఖతార్లో ఆగారు. కాబూల్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విమానం అఫ్గాన్లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత అక్కడే చిక్కుకుపోయిన భారతీయులను దేశానికి తీసుకురావడమే లక్ష్యంగా భారత వాయు సేనకు చెందిన సీ–17 విమానం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. కాబూల్కు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా మారిన వెంటనే అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. సీ–17 ద్వారా 250 మంది భారతీయులను వెనక్కు తీసుకురావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద 400 మంది భారతీయులు అక్కడ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
అఫ్గాన్ అధ్యక్షుడితో జై శంకర్ భేటీ
న్యూఢిల్లీ: విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ గురువారం అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో తాష్కెంట్లో భేటీ అయ్యారు. దేశం నుంచి అమెరికా బలగాల నిష్క్రమణ అనంతరం వేగంగా మారుతున్న పరిస్థితులపై వారిద్దరూ చర్చించారు. అఫ్గానిస్తాన్ అభివృద్ధి, శాంతి, సుస్థిరతకు భారత్ తోడ్పాటు కొనసాగుతుందని ఈ సందర్భంగా జై శంకర్ భరోసా ఇచ్చారు. తజికిస్తాన్ రాజధాని దుషాంబేలో రెండు రోజులపాటు జరిగిన షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరిగిన కనెక్టివిటీ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అష్రాఫ్ ఘనీతో సమావేశమయ్యారు. ఎస్సీవో సమావేశాల్లో రష్యా, చైనా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ తదితర దేవాల విదేశాంగ మంత్రులు పాలుపంచుకున్నారు. Pleased to call on President @ashrafghani. Discussed the current situation in and around Afghanistan. Reiterated our support for peace, stability and development of Afghanistan. pic.twitter.com/heTlL9KwaQ — Dr. S. Jaishankar (@DrSJaishankar) July 15, 2021 -
‘భారత్ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం’
వాషింగ్టన్: కోవిడ్ వ్యాప్తి చెందుతున్న తొలి రోజుల్లో అమెరికాకు భారత్ బాసటగా నిలిచిందని, ఈ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ తెలిపారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఎస్ జైశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రిని కలిశారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశాన్ని పర్యటించిన తొలి భారతీయ విదేశాంగా మంత్రి ఎస్ జైశంకర్. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మేము ఐక్యంగా ఉన్నామని బ్లింకన్ అన్నారు. యుఎస్, భారతదేశం మధ్య భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది, ప్రస్తుతం అది మరింత ముందుకు వెళ్తుందన్నారు. అంతకుముందు, జైశంకర్ యుఎస్ రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ భాగస్వామ్యాన్ని మరింతగా అభివృద్ధి చేయడం గురించి చర్చించారు. మా వ్యూహాత్మక ,రక్షణ భాగస్వామ్యాన్ని మరింత అభివృద్ధి చేయడం గురించి సమగ్ర సంభాషణ జరిగిందని సమావేశం తరువాత ట్వీట్ చేస్తూ, వారితో కలిసి ఉన్న ఫోటోను జైశంకర్ పంచుకున్నారు. A warm meeting with US @SecDef Lloyd Austin. A comprehensive conversation about further developing our strategic and defence partnership. Exchanged views on contemporary security challenges. Expressed appreciation of the US military role in responding to the Covid situation. pic.twitter.com/ea0iBezGQZ — Dr. S. Jaishankar (@DrSJaishankar) May 28, 2021 చదవండి: రండి.. వ్యాక్సిన్ వేసుకోండి.. 840 కోట్ల ప్రైజ్మనీ గెలుచుకోండి -
ఫెడెక్స్ మాజీ ఉద్యోగి ఘాతుకం, నలుగురు భారతీయులు బలి
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలోని ఇండియానాపొలిస్ నగరంలో చోటు చేసుకున్న కాల్పుల్లో చనిపోయిన వారిలో నలుగురు భారతీయులు ఉండటం విషాదాన్ని నింపింది. ఈ కాల్పుల ఘటనపై విదేశీ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికాలోని ఇండియానా పోలిస్లోని స్థానిక అధికారులకు, సిక్కు సంఘ నాయకులకు భారతదేశం అన్ని విధాలా సహాయం చేస్తుందని వెల్లడించారు. నలుగురు సిక్కులు ప్రాణాలు కోల్పోవడంపై సిక్కు సంఘం కూడా స్పందించింది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. అటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 4 గురు సిక్కులతో సహా 8 మందిని బలితీసుకున్న ఈ కాల్పుల సంఘటన తనను షాక్కు గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి పోలీసులు వెల్లడించారు. ఎనిమిది మంది మృతుల్లో నలుగురు సిక్కులున్నారని తెలిపారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 19 ఏళ్ల బ్రాండన్ స్కాట్ హోల్ ఈ దారుణానికి పాల్పడ్డాడని, ఇతను ఫెడెక్స్ మాజీ ఉద్యోగి అని పేర్కొన్నారు. (అమెరికాలో మరోసారి భారీ కాల్పులు: దుండగుడి ఆత్మహత్య) ఇండియానాపోలిస్ మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం వెల్లడించిన భారతీయ బాధితుల పేర్లు అమర్ జీత్ జోహాల్ (66) జస్వీందర్ కౌర్ (64) అమర్ జీత్ షెఖాన్ (48) జస్వీందర్ సింగ్ (68) కాగా ఇండియానాపొలిస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఫెడెక్స్ గిడ్డంగి వద్ద గురువారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఎనిమిది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని బ్రాండన్ స్కాట్గా పోలీసులు గుర్తించారు. గత ఏడాది వరకు ఫెడెక్స్ లో పనిచేసిన బ్రాండన్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, తర్వాత ఆత్మహత్యకు పాలడ్పాడని అక్కడి పోలీసు అధికారి క్రెయిగ్ మెక్ కార్ట్ చెప్పారు. అతడు గత ఏడాది వరకు పనిచేశాడని చెప్పారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. Deeply shocked by shooting at FedEx facility in Indianapolis. Victims include persons of Indian American Sikh community. Our Consulate General in Chicago in touch with Mayor & local authorities in Indianapolis as well as community leaders. Will render all possible assistance: EAM pic.twitter.com/ONhvrdLQHD — ANI (@ANI) April 17, 2021 -
కేంద్ర మంత్రి జై శంకర్కు మాతృ వియోగం
న్యూఢిల్లీ : భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సులోచనా సుబ్రమణ్యం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జై శంకర్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘‘మా అమ్మ సులోచనా సుబ్రమణ్యం ఈ రోజు (శనివారం) కన్నుమూశారని తెలియజేయటానికి ఎంతగానో చింతిస్తున్నా. అమ్మ శ్రేయోభిలాషులు, స్నేహితులు ఆమెను వారి ఆలోచనల్లో ఉంచుకోవాలని కోరుకుంటున్నా. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. కాగా, పలువురు ప్రముఖులు ట్విటర్ వేదికగా జై శంకర్కు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. చదవండి : ‘ఎంపికైనా ఉద్యోగాలు ఇవ్వడం లేదు’ -
ఇదే చైనా కుటిల నీతి..
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా వ్యూహాలు, ఆక్రమిత ప్రాంతాల్లో చైనా ఏ విధంగా వ్యవహరిస్తుంది వంటి అంశాల గురించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆక్రమిత ప్రాంతాల్లో చైనా పాటించే విధనాలు ఏంటో చూడండి. ప్రపంచంలో ప్రతి దానికి చైనా తన సొంత పేర్లు పెడుతుంది. భూమి కానీ.. మనుషులు కానీ ఏదైనా సరే. బలవంతంగా ఆక్రమించిన ప్రాంతంలో మనుషులను తన డిక్షన్లోకి మార్చుకుంటుంది డ్రాగన్ దేశం. దానిలో భాగంగానే ముస్లింలను చైనా సంస్కృతిలో కలపడానికి గాను ఇస్లామిక్ పేర్ల మీద నిషేధం విధించింది. అంతేకాక వారికి సంబంధించిన మత గ్రంథాలను తనకు అనుకూలంగా మార్చుకుంది చైనా. ఆఖరికి మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని సైతం వదలలేదు. అక్కడి మీడియా, ప్రెస్ నోట్లలో వారి పేర్లను చైనీస్లోకి అనువాదం చేసి సు జీషెంగ్, టాంగ్నాడే తెలాంగ్పు అని పేర్కొంటుంది. విషయాలను స్వంతం చేసుకోవడమే ఇక్కడ దాని ప్రధాన ఆలోచన. (చదవండి: వెయ్యి మందికి పైగా చైనీయుల వీసాలు రద్దు!) ఇక చైనా తాను ఆక్రమించిన ప్రాంతాల చరిత్రను మార్చడానికి వాటికి కొత్త పేర్లను పెడతుంది. 1950-60 మధ్య టిబెట్ విషయంలో ఇదే జరిగింది. దాని పేరును జిజాంగ్(వెస్ట్రన్ త్సాంగ్)గా మార్చగా.. తూర్పు తుర్కెస్తాన్ పేరును జిన్జియాంగ్గా మార్చింది. జిజాంగ్ అంటే పాశ్యాత్య ధూళి అని అర్థం. టిబెట్లను అవమానించే ఉద్దేశంతో చైనా ఈ పేరు పెట్టింది. పేరు మార్చడం పూర్తయ్యాక ఆ ప్రాంతానికి సంబంధించి అసంబద్ధమైన వాదనలను తెర మీదకు తెస్తుంది. టిబెట్ విషయంలో ఇదే జరగింది. టిబెటన్ బౌద్ధమతం ఇన్నర్ మంగోలియాలో ఉద్భవించింది అనే హాస్యాస్పదమైన వాదనను తెరమీదకు తెచ్చింది. ఇక్కడ చైనా ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. టిబెటన్ల మీద భారతీయ ప్రభావాన్ని దూరం చేయడం. ఇస్లామిక్ పేర్లను నిషేధించడం ముస్లిం ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించిన చైనా అక్కడి వారిని పూర్తిగా తనలో కలుపుకుంటుంది. దానిలో భాగంగానే ఇస్లామిక్ పేర్లను నిషేధిస్తుంది. ప్రస్తుతం జిన్జియాంగ్గా పిలువబడే తూర్పు తుర్కెస్తాన్లోని చురుకైన ప్రాంతాల్లో నుంచి ఇస్లాం ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించడానికి చైనా దేశంలో 29 ఇస్లామిక్ పేర్లను నిషేధించింది. ఫలితంగా ఇక్కడి ప్రజలు ఈ పేర్లతో జననమరణాలను రిజిస్టర్ చేయడం.. పూర్వీకుల ఆస్తులను సొంతం చేసుకోవడం అసాధ్యం. అంతేకాక ఈ పేరు ఉంటే పాఠశాలలు మొదలు.. యూనివర్సిటీల వరకు ఎక్కడా ప్రవేశం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభించవు. ఇక్కడ చైనా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఉయ్ఘర్ సమాజాన్ని పూర్తిగా లొంగదీసుకుని తనలో కలుపుకోవడమే. (చదవండి: ముదురుతున్న వివాదం) ఇంటర్నెట్ని ప్రభావవంతంగా వాడటం చైనా జనాభా 1.42 బిలియన్లు. ప్రపంచ మొత్తం జనాభాలో ఐదొంతుల మంది ఇక్కడే ఉన్నారు. ప్రజలను ప్రభావితం చేయగల శక్తి ఇంటర్నెట్కి ఉందని అర్థం చేసుకున్న చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(సీసీపీ) ఇంటర్నెట్ని చాలా జాగ్రత్తగా వినియోగిస్తుంది. చైనా విదేశాంగ విధానాలకు అనుగుణంగా దేశీయ, ప్రపంచ రంగాలపై అభిప్రాయాలను ప్రభావితం చేయడానికి షాంఘై యూనిట్ 61398 వంటి పీఎల్ఏ సైబర్ క్రైమ్ బ్రిగేడ్ను సీసీపీ చాలా సమర్థవంతంగా ఉపయోగిస్తుంది. గ్రంథాలు, పుస్తకాలను అనువదించడం టిబెటన్ జనాభాను చైనీస్ భాషలో చదవమని బలవంతం చేయడానికి చైనా వేదాంత సంస్థలలోని అన్ని బౌద్ధ గ్రంథాలను అనువదించడం ప్రారంభించింది. ఫిబ్రవరి 2018 లో లాసా జోఖాంగ్ ఆలయాన్ని తగలబెట్టడం.. టిబెటన్ బౌద్ధమతంలో అత్యంత పవిత్రమైన, గౌరవనీయమైన ప్రదేశాలలో పాత బౌద్ధ గ్రంధాలన్నింటినీ తగలబెట్టే ప్రయత్నం చేసింది. వీటిని నాశనం చేసి చైనీస్ భాషలో కొత్త పుస్తకాలు ప్రచురించింది. ఇక్కడ దాని ప్రధాన ఉద్దేశం ఇక మీదట ఆక్రమిత టిబెట్లోని కొత్త తరం సన్యాసులు బీజింగ్కు దగ్గరగా ఉండటమే కాక వారి మీద సీసీపీ ప్రభావంతో ఉంటుంది. ఇటువంటి చర్యలతో, చైనా అది ఆక్రమించిన కమ్యూనిటీలు, భూముల గుర్తింపును పూర్తిగా మార్చివేస్తోంది. దీనిలో భాగంగా హాన్ సమాజం, మధ్య సామ్రాజ్యం జాంగ్గువో మినహా అన్నింటినీ తుడిచివేసింది. -
నాకైతే సంబంధం లేదు: సుబ్రహ్మణ్యస్వామి
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రష్యా పర్యటనపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అసహనం వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా డిఫెన్స్ మినిస్టర్ వెయి ఫెంఘెతో భేటీ అయిన తర్వాత మళ్లీ జైశంకర్ మాస్కో వెళ్లడం ఎందుకు అని ప్రశ్నించారు. విదేశాంగ విధాన పరంగా.. ఈ ఏడాది మే 5 తర్వాత భారత్, చైనాతో పరిష్కరించుకోవాల్సిన సమస్యలేవీ లేవని, అలాంటప్పుడు ఆ దేశ విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ అనవసరం అన్నారు. ఇలాంటి విషయాలు ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను పలుచన చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే స్పందించి భారత విదేశాంగ మంత్రి రష్యా పర్యటనను రద్దు చేయాల్సిందిగా ట్విటర్ వేదికగా విజ్జప్తి చేశారు.(చదవండి: ఎల్ఏసీని గౌరవించాలి) కాగా జూన్లో గల్వాన్లోయలో చైనా ఆర్మీ ఘాతుకానికి కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరులైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోగా.. దౌత్య, మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. అయినప్పటికీ డ్రాగన్ దేశం తన వైఖరి మార్చుకోలేదు. వివిధ స్థాయి చర్చల్లో కుదిరిన బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో ఇటీవల మరోసారి వాస్తవాధీన రేఖ( ఎల్ఏసీ) వెంబడి ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ క్రమంలో శుక్రవారం మాస్కోలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు సందర్భంగా రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి వెయి ఫెంఘెతో దాదాపు రెండు గంటల 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఎల్ఏసీను చైనా గౌరవించాలని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు మానుకోవాలని స్పష్టంచేశారు. భారత్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు కట్టుబడి ఉందని.. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పర్యటనకై జైశకంర్ మంగళవారం రష్యాకు బయల్దేరనున్నారు. ఈ సందర్భంగా డ్రాగన్ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం. నాకైతే సంబంధం లేదు.. బీజేపీ ఐటీ సెల్ విభాగం పనితీరుపై ఆ పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో పనిచేసే కొంతమంది సభ్యులు నకిలీ ఐడీలతో సోషల్ మీడియా వేదికగా తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై తన ఫాలోవర్లు గుర్రుగా ఉన్నారని, కాబట్టి వారు ఎదురుదాడికి దిగే అవకాశం ఉందని, అందుకు తాను బాధ్యత వహించబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు.. ‘‘బీజేపీ ఐటీ సెల్ దుర్మార్గంగా తయారైంది. అందులోని కొంత మంది సభ్యులు ఫేక్ ఐడీలతో నకిలీ ట్వీట్లతో నాపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. ఒకవేళ నా ఫాలోవర్లు అదే రీతిలో బదులిస్తే అందుకు నేను బాధ్యత వహించను. బీజేపీ ఐటీ సెల్ తీరుకు పార్టీ ఎలాగైతే బాధ్యత వహించదో.. అచ్చంగా అలాగే’’ అంటూ ట్విటర్ వేదికగా విమర్శలు సంధించారు. ‘‘మాది మర్యాద పురుషోత్తముల పార్టీ. రావణ, దుశ్శాసన ఇక్కడ లేరు. ఇటువంటి విషయాలను నేను పెద్దగా పట్టించుకోను గానీ.. గొడవలు సృష్టించే వాళ్లను బీజేపీ.. పదవి నుంచి తీసేయాలి’’ అంటూ మరో ట్వీట్లో ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై విరుచుకుపడ్డారు. అయితే ఇందుకు గల మూలకారణం గురించి మాత్రం సుబ్రహ్మణ్యస్వామి ప్రస్తావించలేదు. The BJP IT cell has gone rogue. Some of its members are putting out fake ID tweets to make personal attacks on me. If my angered followers make counter personal attacks I cannot be held resonsible just as BJP cannot be held respinsible for the rogue IT cell of the party— Subramanian Swamy (@Swamy39) September 7, 2020 -
45 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే ప్రాణనష్టం
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. గత 45 ఏళ్లలో ఇంత తీవ్రమైన పరిస్థితిని ఇంతవరకు ఎప్పుడు చూడలేదని తెలిపారు. 1962 ఇండో-చైనా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్ల వెబ్సైట్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘1962 యుద్ధం తర్వాత ఎల్ఏసీ వెంబడి ఇంతటి ఉద్రిక్తతను గతంలో ఎన్నడూ చూడలేదు. 45 సంవత్సాల తర్వాత ఈ ఏడాది సరిహద్దులో సైనిక ప్రాణనష్టం జరిగింది. ఎల్ఏసీ వెంట ఇంత భారీ ఎత్తున దళాలు మోహరించడం 45 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం’ అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతితో పాటు పొరుగు దేశాలతో మంచి సంబంధాలే భారత్కు ముఖ్యమని ఇప్పటికే చైనాకు స్పష్టంగా తెలిజశామన్నారు. గతంలో ఇరుదేశాల మధ్య తలెత్తిన సరిహద్దు సమస్యలను దౌత్యంపరంగానే పరిష్కరించుకున్నామన్నారు. ఇప్పుడు కూడా భారత్ శాంతియుతంగానే వ్యవహరిస్తుందని.. సరిహద్దులో యథాతథ స్థితి పునరుద్దరణ కోసం కృషి చేస్తోందన్నారు జైశంకర్. (చదవండి: సాయుధులుగానే ఉన్నారు) అయితే ఇది ఏకపక్షంగా సాధ్యం కాదని.. చైనా కూడా సహకరించాలన్నారు జైశంకర్. ఇరు దేశాల చర్చల ద్వారా ఒక పరిష్కారానికి రావాలని కోరారు. ఎల్ఏసీ వెంట అతిక్రమణలు, దళాల మోహరింపు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అతిక్రమణలను నిరోధించేందుకు రక్షణ దళాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. వీటిని నిరోధించడానికి ప్రభుత్వం శాంతియుత పరిష్కారం కోరుతోంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నుంచి భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదంకొనసాగుతుంది. ఇక జూన్ 15న చైనా- భారత్ సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులను డ్రాగాన్ దేశం పొట్టనపెట్టుకుంది. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్, జాతీయ సలహాదారు అజిత్ దోవల్ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. -
జైశంకర్తో మైక్ పాంపియో ఫోన్ సంభాషణ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఇండో- పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, భద్రతకై భారత్- అమెరికా కలిసి పనిచేస్తాయని ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్తో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఫోన్లో సంభాషించారు. ఇందులో భాగంగా మహమ్మారి కోవిడ్-19 కట్టడికై తీసుకోవాల్సిన చర్యలు, అంతర్జాతీయ సమాజంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు(ప్రపంచంపై కరోనా ప్రభావం, అఫ్గనిస్తాన్లో తాలిబన్ల బాంబు దాడులు), ద్వైపాక్షిక, బహుళ పాక్షిక సంబంధాలు తదితర అంశాల గురించి చర్చించారు.(ఒక్క రోజే 2 వేలకు పైగా మరణాలు) ఈ క్రమంలో వచ్చే ఏడాది ఇరు వర్గాల మధ్య 2+2 చర్చలు జరిపే అవకాశాలను పరిశీలించారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కేల్ బ్రౌన్ గురువారం ఓ ప్రకటనలో చర్చలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కాగా 2018 సెప్టెంబరులో న్యూఢిల్లీలో ఇరు దేశాల మధ్య 2+2 చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఇక భారత్- చైనా సరిహద్దుల్లో డ్రాగన్ కవ్వింపు చర్యలు, ఆసియా- పసిఫిక్ ప్రాంతంపై ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న వైఖరి, అమెరికా సహా ఇతర ప్రపంచ దేశాలపై కరోనా ప్రభావం తదితర అంశాల్లో చైనాపై అగ్రరాజ్యం గుర్రుగా ఉన్న నేపథ్యంలో వీరిరువురి చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. (భారత్- అమెరికాల బంధం మరింత బలపడాలి) కాగా సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తూ, ఇండో- పసిఫిక్ ప్రాదేశిక జలాల విషయంలో చట్టవ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న చైనాకు అడ్డుకట్ట వేసేందుకు భారత్- అమెరికా మధ్య బంధం మరింత బలపడాలని అగ్రరాజ్య చట్టసభ ప్రతినిధులు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. సార్వభౌమత్వం, సమగ్రతలను కాపాడుకునే క్రమంలో అమెరికా భారత్కు అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాగా దక్షిణ చైనా సముద్ర పరిసరాల్లో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వలపై కన్నేసిన చైనా ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు సదరు ప్రాదేశిక జలాల్లోని చమురు నిల్వలపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం వ్యక్తం చేయడం సహా.. ఈ సహజ నిల్వలపై హక్కు ఉందని వాదిస్తున్నాయి. -
రాజకీయాలు పక్కన పెట్టాలి: జైశంకర్
న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో ఓ వైపు కరోనా మహమ్మారి.. మరోవైపు తప్పుడు వార్తల ప్రచారం ప్రపంచంపై దాడి చేస్తోందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలు పరస్పర విశ్వాసం కలిగి ఉండి.. సహాయసహకారాలు అందించుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన ‘అలయన్స్ ఆఫ్ మల్టీలాటరలిజం’(బహుశజాతి కూటమి) వర్చువల్ మీటింగ్లో జై శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. 4 లక్షల మందికి పైగా ప్రాణాలు బలితీసుకుంది. (భారత్ గట్టిగా పోరాడుతోంది: మోదీ) అంతేకాదు మన జీవన విధానం, ఉపాధి, ప్రయాణాలు ఇలా అన్నింటి మీద తీవ్ర ప్రభావం చూపింది. మానవ సహజ, స్వభావసిద్ధమైన జీవన గమనాన్ని మార్చింది. పక్కవారిని చూస్తేనే భయపడే పరిస్థితులు తీసుకువచ్చింది. ఇక ఇందుకు అసత్య వార్తల ప్రచారం కూడా తోడైంది. వదంతుల వల్ల అనేక దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేడు పాండెమిక్(మహమ్మారి కరోనా వల్ల తలెత్తిన ఆరోగ్య సంక్షోభం), ఇన్ఫోడెమిక్(సమాచార లోపం) ఈ రెండు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాళ్లుగా నిలిచాయి’’ అని పేర్కొన్నారు. కాబట్టి రాజకీయాలు, విమర్శలు పక్కన పెట్టి పరస్పరం సహకరించుకుంటూ.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మెలగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. (భారత్లో 5లక్షలు దాటిన కరోనా కేసులు) అదే విధంగా.. అంటువ్యాధి ప్రబలడానికి గల కారణాలను విశ్లేషించి.. ఆరోగ్య విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావడం ద్వారా దానిని కట్టడి చేసే మార్గాలు అన్వేషించాలని పేర్కొన్నారు. తద్వారా భవిష్యత్తులో మహమ్మారిని సంయుక్తంగా, మరింత సమర్థవంతంగా అరికట్టగలమన్నారు. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో ఈ మేరకు ప్రతిపాదించిన లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా ప్రపంచ శాంతి స్థాపన, స్థిరత్వం పెంపొందించే ఉద్దేశంతో ఫ్రెంచి, జర్మనీ విదేశాంగ మంత్రులు ‘అలియన్స్ ఫర్ మల్టీలాటరలిజం’(అనధికార నెట్వర్క్)ను ప్రారంభించారు. -
మన సరిహద్దు క్షేమం
న్యూఢిల్లీ: మన భూభాగంలోకి ఎవరూ రాలేదని, సరిహద్దు క్షేమమని, మన ఆర్మీ పోస్ట్లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చైనా సాగించిన దురాగతానికి యావద్దేశం గాయపడిందని, ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్ శాంతిని, స్నేహ సంబంధాలనే కోరుకుంటుందని, అదే సమయంలో, దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదని, అదే మనకు సర్వోన్నతమని స్పష్టం చేశారు. సరిహద్దులను కాపాడే విషయంలో సైన్యం సమర్ధంగా వ్యవహరిస్తోందన్నారు. అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. వాస్తవాధీన రేఖకు సంబంధించి భారత్ విధానాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనాకు స్పష్టం చేశామని ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలతో పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్లో చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు అమరులై, చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని∙మోదీ శుక్రవారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని భేటీలో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాయి. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర ప్రధాన పార్టీల అగ్రనేతలు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాల్వన్ లోయలో జూన్ 15 రాత్రి చైనా సైనికులతో చోటు చేసుకున్న ఘర్షణ తదనంతర పరిణామాలను, ప్రస్తుత పరిస్థితిని మంత్రులు రాజ్నాథ్ సింగ్, జై శంకర్ పార్టీల నేతలకు వివరించారు. చైనాతో వ్యవహరించాల్సిన తీరుపై దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ భేటీలో వివిధ పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొదట, చైనాతో సరిహద్దు ఘర్షణల్లో అమరులైన 20 మంది వీర జవాన్లకు ప్రధాని, మంత్రులు, పార్టీల నేతలు 2 నిమిషాల పాటు మౌనం పాటించి, నివాళులర్పించారు. జవాన్ల త్యాగం వృధా కాబోదని ప్రధాని పునరుద్ఘాటించారు. భారత్ వైపు చూసే ధైర్యం చేసినవారికి మన వీర జవాన్లు తగిన గుణపాఠం చెప్పారని ప్రధాని వ్యాఖ్యానించారు. గాల్వన్ లోయ, ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతాల్లోని భారత భూభాగాల్లోకి చైనా సైనికులు చొచ్చుకువచ్చారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని వివరణ ఇచ్చారు. మన భూభాగంలో ఒక అంగుళాన్నైనా ఎవరూ ఆక్రమించుకునే ధైర్యం చేయలేనంత స్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందించుకున్నామన్నారు. ఈ భేటీలో ఎన్సీపీ నేత శరద్పవార్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కే చంద్ర శేఖర రావు, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ, డీఎంకే నేత స్టాలిన్, బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, సీపీఎం నేత సీతారాం యేచూరి పాల్గొన్నారు. చైనా పెట్టుబడులు వద్దు: మమత భారత్లోని మౌలిక వసతుల రంగంలో చైనా పెట్టుబడులను అంగీకరించవద్దని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సూచించారు. ఈ సంక్షోభ సమయంలో తమ పార్టీ కేంద్రానికి మద్దతుగా నిలుస్తుందన్నారు. కమిటీ ఏర్పాటు చేస్తారా?: యేచూరి చైనాతో సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడ్డానికి, 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడానికి నిఘా వైఫల్యం కారణమా అని తేల్చేందుకు ఏదైనా కమిటీని నియమిస్తారా? అని సీపీఎం నేత సీతారాం యేచూరి ప్రశ్నించారు. గతంలో కార్గిల్ వార్ అనంతరం.. వైఫల్యాలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రధాని వాజ్పేయి ఒక కమిటీ వేసిన విషయాన్ని యేచూరి గుర్తు చేశారు. మీ సైనికులెవరూ మా ఆధీనంలో లేరు:చైనా బీజింగ్: భారతీయు సైనికులు ఎవరూ ‘ప్రస్తుతం‘తమ ఆధీనంలో లేరని చైనా శుక్రవారం స్పష్టం చేసింది. తూర్పు లడాఖ్ సరిహద్దుల్లో జూన్ 15న భారత్ చైనాల మధ్య ఘర్షణలో పొరుగుదేశం మన సైనికులను బందీలుగా చేసి తీసుకెళ్లిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ మీడియాకు ఈ విషయం తెలిపారు. నిఘా వైఫల్యమా?: సోనియా సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల్లో 20 మంది భారత జవాన్ల మృతికి నిఘా వైఫల్యం కారణమా? అని సోనియాగాంధీ ప్రశ్నించారు. గాల్వన్ లోయలో యథాతథ స్థితి నెలకొంటుందని, చైనా వెనక్కు వెళ్తుందని హామీ ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరారు. భేటీ ప్రారంభంలో సోనియా పలు ప్రశ్నలను సంధించారు. చైనా దళాలు తూర్పు లద్దాఖ్లో భారత భూభాగంలోకి వచ్చాయా? వస్తే ఎప్పుడు వచ్చాయి? ఆ ప్రాంతంలో చైనా దళాల అసాధారణ కదలికలపై మన నిఘా సంస్థలు సమాచారం ఇవ్వలేదా? అని ఆమె ప్రశ్నించారు. తదుపరి కార్యాచరణ ఏమిటన్నారు. సైనికుల మధ్య ఘర్షణలు ప్రారంభమైన మే 5 నుంచి జూన్ 6 వరకు విలువైన కాలాన్ని ప్రభుత్వం వృధా చేసిందని ఆరోపించారు. మమ్మల్ని ఆహ్వానించరా? ఈ భేటీకి ఆహ్వానించకపోవడంపై ఆప్, ఆర్జేడీ, ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరాయి. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్యాదవ్, ఆయన కూతురు మీసాభారతి, ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. బిహార్లో తమది ప్రధాన ప్రతిపక్షమని, ఈ భేటీకి ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. అయితే, అన్ని గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, లోక్సభలో ఐదుగురు, లేదా ఆపై ఎంపీలున్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు, కేబినెట్లో మంత్రులున్న పార్టీలను మాత్రమే భేటీకి ఆహ్వనించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లేహ్లో ఐఏఎఫ్ చీఫ్ భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో.. భారత వైమానిక దళాధిపతి చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా లేహ్, శ్రీనగర్ల్లో పర్యటించారు. ఎయిర్ఫోర్స్ సన్నద్ధతను పరిశీలించారు. -
సాయుధులుగానే ఉన్నారు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లో గస్తీ విధుల్లో ఉన్న భారతీయ సైనికుల వెంట ఆయుధాలు కూడా ఉంటాయని, వారు తమ పోస్ట్ను వదిలి బయటకు వెళ్లే ప్రతీసారి ఆయుధాలను కూడా తీసుకునే వెళ్తారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం స్పష్టం చేశారు. ‘ఆయుధాలు ఇవ్వకుండా సైనికులను మృత్యుఒడికి పంపిస్తారా?’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానమిచ్చారు. ‘1996లో, 2005లో భారత్, చైనాల మధ్య కుదిరిన రెండు ద్వైపాక్షిక ఒప్పందాల్లోని నిబంధనల ప్రకారం.. రెండు దేశాల సరిహద్దు గస్తీ బృందాలు ఆయుధాలను ఉపయోగించకూడదు’ అని జై శంకర్ వివరించారు. సోమవారం రాత్రి గాల్వన్ లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణల సమయంలోనూ.. విధుల్లో ఉన్న భారతీయ సైనికులు సాయుధులుగానే ఉన్నారని తెలిపారు. ‘నిరాయుధులైన భారతీయ సైనికుల ప్రాణాలు తీసి చైనా పెద్ద నేరం చేసింది. ఆ సైనికులను నిరాయుధులుగా ప్రమాద ప్రాంతానికి ఎవరు, ఎందుకు పంపించారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అని రాహుల్ గాంధీ ఒక వీడియో సందేశంలో ప్రశ్నించారు. భారతీయ సైనికుల త్యాగంపై రెండు రోజుల తరువాత రక్షణమంత్రి రాజ్నాథ్ స్పందించారని రాహుల్ విమర్శించారు. అది కూడా, తన నివాళి ట్వీట్లో చైనా పేరును ప్రస్తావించకుండా, భారత సైన్యాన్ని రాజ్నాథ్ అవమానించారని ఆరోపించారు. భారత సైనికులు చనిపోవడం చాలా బాధాకరం. విధుల్లో భాగంగా మన సైనికులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరులయ్యారు’ అని బుధవారం ఉదయం రాజ్నాథ్ ట్వీట్ చేశారు. -
సరిహద్దు ఘర్షణ : రాజ్నాథ్ మళ్లీ కీలక భేటీ
ఢిల్లీ : లడక్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్- చైనా ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ఇప్పటివరకు కల్నల్ సహా 20 మంది భారత సైనికులు మరణించగా, తాజాగా మరో నలుగురి జవాన్ల పరిస్థితి విషమంగా మారడంతో భారత్- చైనా సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా దేశ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా అంతకముందు రాజ్నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతోఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్యాంగ్యాంగ్ సొ, దెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ, గాల్వన్ లోయ ప్రాంతాల్లో భారత బలగాల సంఖ్యను భారీగా పెంచాలని భేటీలో నిర్ణయించినట్లు సమాచారం.(విషం చిమ్మిన చైనా..) కాగా రాజ్నాథ్ మరోసారి విదేశాంగ మంత్రి జై శంకర్, త్రివిద దళాల అధిపతులతో పాటు హోం మంత్రితో జరగనున్న కీలక భేటీలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సరిహద్దులో జరిగిన ఘర్షణలో మృతుల వివరాలను అధికారికంగా ప్రకటించడంతో పాటు తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గాల్వన్ లోయ ప్రాంతంలో తలెత్తిన ఘర్షణపై మధ్యాహ్నం కీలక సమావేశం జరగనుంది. గాల్వన్ లోయ ప్రాంతంలో తలెత్తిన ఘర్షణతో పాటు వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుత పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. మరోవైపు హోం మంత్రి అమిత్ షా కూడా ప్రధాని మోదీతో సమావేశమై చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై చర్చించారు. (ఇప్పటి వరకు జరిగింది చాలు..) (సరిహద్దు ఘర్షణ: నలుగురు సైనికుల పరిస్థితి ఆందోళనకరం) -
ప్రధానితో విదేశాంగ మంత్రి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : లడఖ్ ప్రాంతంలో భారత్-చైనా సేనల ఘర్షణ నేపథ్యంలో అక్కడి పరిస్ధితిని వివరించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధానితో జరిగిన సమావేశంలో ఆర్మీ చీఫ్ ఎంఎం నరవనే, సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్లు పాల్గొన్నారు. ప్రధానితో భేటీకి ముందు జైశంకర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో ఆయనను కలుసుకుని సరిహద్దు వివాదంపై సంప్రదింపులు జరిపారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు డ్రాగన్ దూకుడు కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై వారు సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు ప్రధాని మోదీ నేతృత్వంలో దేశ భౌగోళిక సమగ్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని బీజేపీ చీఫ్ జేడీ నడ్డా పేర్కొన్నారు. భారత్ ఇప్పుడు బలమైన రాజకీయ సంకల్పంతో ఉందని, ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు మన సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని అన్నారు. కాగా గాల్వన్ లోయలో సోమవారం రాత్రి భారత్, చైనా సేనల మధ్య జరిగిన ఘర్షణలో ఓ కల్నల్తో పాటు ఇద్దరు భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. చదవండి : 50 శాతానికి పైగా రికవరీ రేటు : మోదీ -
ఎక్కడి కేరళ.. ఎక్కడి అస్సాం
తిరువనంతపురం: కరోనా వైరస్ మనుషుల ప్రాణాలు.. తీయడమే కాదు.. మనలో మాయమవుతున్న మానవత్వాన్ని తట్టి లేపుతుంది. ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికి.. బాధితులను ఆదుకోవడానికి ఎందరో ముందుకు వస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో మరణించిన కన్నబిడ్డను స్వదేశం తీసుకెళ్లి.. సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నారు తల్లిదండ్రులు. కానీ లాక్డౌన్ వల్ల వారికి ఆ అవకాశం లభించలేదు. అన్ని ప్రయత్నాలు విఫలమై.. ఆశలు వదులుకున్న వేళ ఓ అపన్న హస్తం వారిని ఆదుకుంది. కనీసం ముఖ పరిచయం కూడా లేని ఓ వ్యక్తి వారికి సాయం చేసి.. ఇండియాకు వెళ్లే ఏర్పాట్లు చేశాడు. ఆ వివరాలు.. కేరళ పాలక్కడ్కు చెందిన కృష్ణదాస్ కుటుంబం ఏడేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని షార్జా వెళ్లారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం వారి 4 ఏళ్ల కుమారుడు వైష్ణవ్ కృష్ణదాస్కు ల్యూకేమియా అని.. అది కూడా ఆఖరి దశ అని తెలిసింది. వ్యాధి బయటపడిన 15 రోజుల్లోనే వైష్ణవ్ మరణించాడు. అల్లారుముద్దుగా పెంచిన కుమారుడు అర్థాంతరంగా మరణించడంతో ఆ తల్లిదండ్రులు కృంగి పోయారు. చనిపోయిన కొడుకును బతికించుకోలేము.. కనీసం అంత్యక్రియలైన స్వదేశంలో.. మతాచారం ప్రకారం నిర్వహించాలనుకున్నారు కృష్ణదాస్ దంపతులు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాచడంతో దేశాలన్ని లాక్డౌన్ను పాటిస్తున్నాయి. దాంతో ఏం చేయాలో పాలు పోలేదు. తమ సమస్య గురించి కాన్సులేట్ అధికారులతో చెప్పుకున్నారు. కానీ వారు కూడా ఏం చేయలేకపోయారు.(111 మందిని కలిసిన కరోనా పేషెంట్) అయితే ఇదే సమయంలో విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్’ విమానాలను నడుపుతుంది. దాంతో వాటిల్లో ప్రయాణించేందుకు ప్రయత్నించాడు కృష్ణదాస్ దంపతులు. కానీ అవి చాలా పరిమిత సంఖ్యలో ఉండటం.. జనాలు ఎక్కువ ఉంటడంతో కృష్ణదాస్ కుటుంబానికి అవకాశం లభించలేదు. దాంతో చేసేదేం లేక దేవుడి మీదే భారం వేసి కుమారుడు మృతదేహాన్ని అల్ ఐన్ లోని అల్ తవాం హాస్పిటల్ మార్చురీలో భద్రపర్చారు. అయితే దేవుడు వారి మొర ఆలకించాడో ఏమో.. సాయం లభించింది. అది కూడా తమకు ఏ మాత్రం పరిచయం లేని ఓ వ్యక్తి నుంచి. అవును కేరళకు చెందిన కృష్ణదాస్కు సాయం చేసింది అస్సాం దిబ్రుగఢ్ ప్రాంతానికి చెందిన భాస్కర్ పపుకోన్ గోగోయ్ అనే వైద్యుడు.(సాంత్వననిచ్చే కోవిడ్ సాథీ) (వైద్యుడు, సామాజిక కార్యకర్త భాస్కర్ పపుకోన్ గోగోయ్) వైద్యుడు, సామాజిక కార్యకర్త అయిన గోగోయ్ సోషల్ మీడియా ద్వారా కృష్ణదాస్ సమస్య గురించి తెలుసుకున్నాడు. వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా గోగోయ్ మాట్లాడుతూ.. ‘కృష్ణదాస్ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టం నన్ను కలచివేసింది. వారికి నా వంతు సాయం చేయాలనుకున్నాను. కృష్ణదాస్ సమస్య గురించి యూఏఈలోని ఒక ముఖ్యమైన వార్త పత్రికలో కూడా వచ్చింది. యూఏఈలోని మిత్రుల ద్వారా ఆ కథనం రాసిన రిపోర్టరును సంప్రదించి.. కృష్ణదాస్ కుటుంబ పూర్తి వివరాలు తెలుసుకోగలిగాను. ఆ తర్వాత మే 13న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ను కలిసి, సమస్యను వివరించాను. ఆయన వెంటనే స్పందించారు. మరుసటి రోజే కృష్ణదాస్ కుటుంబాన్ని ఇండియా రప్పించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు’ అని తెలిపాడు గోగోయ్.(ప్రైవేట్లోనూ కరోనా) ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ.. ‘గోగోయ్ స్పందిచకపోయి ఉంటే.. మేము ఇండియాకు తిరిగి వచ్చే వారం కాదు. ఆయన రుణం ఎప్పటికి తీర్చుకోలేము’ అన్నారు. ఎక్కడి కేరళ... ఎక్కడి యూఏఈ.. ఎక్కడి అస్సాం. వీరిని కలిపింది మాత్రం మానవత్వం అంటున్నారు ఇది విన్నవారు. -
కోవిడ్: ఇరాన్ నుంచి 58 మంది వచ్చేశారు!
న్యూఢిల్లీ: ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఇరాన్లో ఉండిపోయిన భారత యాత్రికులను సురక్షితంగా దేశానికి తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేశామని విదేశాంగ శాఖా మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. మొదటి విడతలో భాగంగా 58 మంది భారతీయులను తీసుకువచ్చేందుకు వైమానిక దళ(ఐఏఎఫ్ సీ-17) విమానం టెహ్రాన్ నుంచి బయల్దేరిందని పేర్కొన్నారు. కొన్ని గంటల్లోనే ఈ విమానం ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్బేస్లో ల్యాండ్ కానుందని వెల్లడించారు. అదే విధంగా ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహకరిస్తున్న ఎంబసీ అధికారులు, వైద్య సిబ్బందికి జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. కఠిన పరిస్థితుల్లో తమకు చేదోడువాదోడుగా నిలుస్తున్నందుకు ఇరాన్ అధికారులను ప్రశంసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాజా సమాచారం ప్రకారం... 58 మంది భారతీయులతో భారత వైమానిక దళం హిండన్ ఎయిర్బేస్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. వైద్యపరీక్షలు నిర్వహించి వారిని స్వదేశానికి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు.(‘కోవిడ్’పై ట్రంప్ ట్వీట్.. కీలక నిర్ణయం!) కాగా చైనాలో పుట్టి ప్రపంచమంతా విస్తరిస్తున్న కరోనా ధాటికి 95కు పైగా దేశాలు విలవిల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 3800 మందికి పైగా మృత్యువాత పడగా.. లక్షలాది మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఇక ఇరాన్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 7161కి చేరుకుంది. కరోనా కారణంగా సోమవారం 43 మంది మరణించగా ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 237గా ఉంది. రాజధాని టెహ్రాన్లో మొత్తం 1945 కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్కు వెళ్లిన భారత యాత్రికుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. (ఇప్పటివరకు 3,800 మంది మృతి) First batch of 58 Indian pilgrims being brought back from #Iran. IAF C-17 taken off from Tehran and expected to land soon in Hindon. pic.twitter.com/IqZ8NUK1M6 — Dr. S. Jaishankar (@DrSJaishankar) March 10, 2020 -
ఏ దేశమూ అందరినీ ఆహ్వానించదు
న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఏ దేశమూ అందరినీ ఆహ్వానించదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్లో సీఏఏ వ్యతిరేక వాదనలపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘ఏ దేశానికీ చెందని వారిని పౌరులుగా గుర్తించేందుకు ఈ చట్టం చేశాం. దేశం ఎదుర్కొంటున్న శరణార్థుల సమస్యను పరిష్కరించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పౌరసత్వంపై దేశానికో నిర్వచనం, విధానం ఉంటాయి. ప్రపంచంలో అందరినీ స్వాగతించే దేశమేదైనా ఉంటే చూపండి. అలా ఎవరూ చూపలేరు. అమెరికాను చూడండి. యూరోపియన్లను చూడండి. యూరప్లో అయితే ఒక్కో దేశానికీ ఒక్కో విధానం ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. సీఏఏ విషయంలో భారత్ ప్రపంచాన్ని ఒప్పించలేకపోయిందా అన్న ప్రశ్నకు ఆయన.. బ్రస్సెల్స్లో 27 దేశాల మంత్రులతో జరిగిన సమావేశంలో సీఏఏపై వాస్తవాలను వివరించానన్నారు. ఈ విషయంలో భారత్ తన స్నేహితులను కోల్పోతుందా అన్న ప్రశ్నపై.. వాస్తవ మిత్రులెవరో కూడా ఇప్పుడే తెలిసే అవకాశం ఉంది కదా? అని ప్రశ్నించారు. ‘ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం భారత్. మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. గతంలో మాదిరిగా నేడు రక్షణాత్మకంగా వ్యవహరించ లేదు. ప్రతి ఒక్కరితోనూ సంబంధాలు కలిగి ఉండాలి. ప్రతి సమస్యకూ పరిష్కారం కనుగొనాల్సిందే. భారత్లో జరుగుతున్న పరిణామాలను కొందరు అంగీకరించవచ్చు. మరికొందరు అంగీకరించక పోవచ్చు. ఈ రెంటినీ ఒకే గాటన కట్టలేం. ఇందుకు తగినట్లుగా ఆయా దేశాలతో మనం వ్యవహారం సాగించాల్సి ఉంది’అని తెలిపారు. కశ్మీర్లో పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యూఎన్హెచ్ఆర్సీ) డైరెక్టర్ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఆయన స్పందిస్తూ.. గతంలోనూ యూఎన్హెచ్ఆర్సీ ఇటువంటి తప్పుడు అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. కశ్మీర్లో పొరుగుదేశం ప్రేరేపిస్తున్న సీమాంతర ఉగ్రవాదంపై యూఎన్హెచ్ఆర్సీ ఏమీ చేయలేకపోయింది’ అని పేర్కొన్నారు. -
అప్పట్లో తుక్డే-తుక్డే గ్యాంగ్ లేదు: కేంద్ర మంత్రి
న్యూ ఢిల్లీ : తను జవహార్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో(జేఎన్యూ) చదువుకునే రోజుల్లో తుక్డే- తుక్డే గ్యాంగ్ను చూడలేదని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం వ్యాఖ్యానించారు. తుక్డే-తుక్డే అనే పదం సాధారణంగా ప్రతిపక్షాలపై దాడి చేయడానికి బీజేపీ, రైట్ వింగ్ సభ్యులు తరచూ ఉపయోగించే పదం. ముఖ్యంగా లెఫ్ట్ వింగ్ వారిని, వారికి మద్దతు ఇచ్చే వారిని ఈ పేరుతో విమర్శిస్తారు. ఆదివారం జేఎన్యూలో చోటుచేసుకున్న హింసాత్మక దాడిని ఉద్ధేశించి కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా జై శంకర్ జేఎన్యూ పూర్వ విద్యార్ధి. (జేఎన్యూ హింస : వారి పాత్రే కీలకం..) సోమవారం ఢిల్లీలో పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ఆర్టికల్ 370, పౌరసత్వ సవరణ చట్టం, వివాదాస్పద ఆయోద్య తీర్పు వంటి అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. అలాగే ప్రస్తుతం యూనివర్సిటీలో పరిస్థితిని గురించి అడిగినప్పుడు.. తాను జేఎన్యూలో చదువుకున్నప్పుడు తుక్డే తుక్డే గ్యాంగ్ను చూడలేదని సమాధానమిచ్చారు. అంటే లెఫ్ట్ వింగ్ వారిని ఉద్ధేశించి మంత్రి ఇలా బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీనే కుట్రపూరింతంగా జేఎన్యూలో దాడికి పాల్పడిందని వామపక్ష విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూండగా.. జేఎన్ఎస్యూ విద్యార్థి సభ్యులే తమపై దాడికి దిగారని ఏబీవీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా జేఎన్యూలో దాడికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించామని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. చదవండి: జేఎన్యూపై దాడి చేసింది వీరేనా! -
‘హ్యాట్సాఫ్ గంభీర్.. నువ్వేంటో మరోసారి నిరూపించావ్’
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత లోక్సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పాకిస్థాన్కు చెందిన ఓ చిన్నారి శస్త్రచికిత్స కోసం భారత్ రావడానికి వీసా వచ్చేలా చేశారు. పాక్కు చెందిన ఉమామియా అలీ అనే ఆరేళ్ల చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆ చిన్నారి కుటుంబం చికిత్స కోసం భారత్కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని గంభీర్ తెలుసుకున్నాడు. దీంతో ఆ చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులు భారత్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ను గంభీర్ కోరారు. గంభీర్ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి స్పందించారు. చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులకు వీసాలు జారీ చేయాలని పాక్లోని భారత హై కమిషన్కు సూచించారు. అనంతరం వారికి వీసాలు జారీ చేసినట్లు గంభీర్కు లేఖ రాశారు. ఆ లేఖను గంభీర్ తన ట్విటర్లో పోస్ట్ చేస్తూ ‘అవతలి వైపు నుంచి ఓ పసి హృదయం మనల్ని సంప్రదించినప్పుడు మన కట్టుబాట్లు, హద్దులు పక్కన పెట్టేలా చేస్తుంది. పాక్ చిన్నారి భారత్కు రావడమనేది ఒక బిడ్డ తన పుట్టింటికి వచ్చినట్లు అనిపిస్తోంది. భారత్కు వస్తున్న పాక్ చిన్నారికి స్వాగతం.’అని పేర్కొన్నారు. తన విజ్ఞప్తికి వేగంగా స్పందించి వారికి వీసా వచ్చేలా చేసిన విదేశాంగ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ‘ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి నేను వ్యతిరేకినని కానీ పాకిస్తాన్ ప్రజలపై కాదు. ఇంకా లోకం అంటే తెలియని చిన్నారి భారత్లో వైద్యం అందుకుని ప్రాణాలు దక్కించుకుంటే అంతకంటే ఆనందమేముంటుంది’అని మరొక ట్వీట్ చేశారు. ఇక పాక్ చిన్నారి వైద్యం కోసం చొరవ తీసుకుని వీసా వచ్చేలా చేసిన గంభీర్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘క్రికెటర్గానే కాదు.. గొప్ప మానవతావదిగా మరోసారి నిరూపించుకున్నావ్’, ‘హ్యాట్సాఫ్ గంభీర్.. నువ్వేంటో మరోసారి ప్రపంచానికి తెలిసేలా చేశావ్’అంటూ నెటిజన్లు గంభీర్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. उस पार से एक नन्हे दिल ने दस्तक दी, इस पार दिल ने सब सरहदें मिटा दी। उन नन्हे कदमों के साथ बहती हुई मीठी हवा भी आई है, कभी-कभी ऐसा भी लगता है जैसे बेटी घर आई है। Thank u @DrSJaishankar 4 granting visa to Pakistani girl& her parents for her heart surgery @narendramodi @AmitShah pic.twitter.com/zuquO2hnMv — Gautam Gambhir (@GautamGambhir) October 19, 2019 -
రాత్రి ఉగ్రవాదం.. పొద్దున క్రికెట్ ఇక కుదరదు!
న్యూఢిల్లీ: దాయాది పాకిస్థాన్ భారత్కు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందని, ఉగ్రవాదాన్ని విడనాడేవరకు ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు. న్యూయార్క్లో గురువారం జీ4 (భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విదేశంగ మంత్రుల కౌన్సిల్ సదస్సులో జైశంకర్ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదం ఉంది. కానీ బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా ఒక దేశం పొరుగు దేశానికి వ్యతిరేకంగా పెద్దస్థాయిలో ఉగ్రవాద పరిశ్రమను తెరువడం ప్రపంచంలో ఎక్కడ చూసి ఉండరు. పాకిస్థాన్తో చర్చలు జరపడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, టెర్రరిస్తాన్తో మళ్లీ చర్చలు జరపాలనుకోవడమే సమస్య. పొరుగు దేశంతో చర్చించాలని ప్రతి దేశం కోరుకుంటుంది. కానీ ఉగ్రవాదం ఒక విధానంగా ఉన్న దేశంతో చర్చలు ఎలా జరపాలి?’అని పేర్కొన్నారు. భారత్లో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రస్తావిస్తూ.. క్రికెట్, ఉగ్రవాదం కలిసి సాగబోదని, ఉదయం క్రికెట్ ఆడి.. రాత్రి ఉగ్రవాద దాడులు చేస్తామంటే ఎంతమాత్రం కుదరబోదని జైశంకర్ తేల్చిచెప్పారు. ‘భారత్ ప్రజాస్వామిక దేశం. ఉగ్రవాదం, క్రికెట్ కలిసి సాగడాన్ని ప్రజలు ఎంతమాత్రం ఆమోదించబోరు. ఉగ్ర దాడుల తెల్లారి టీ బ్రేక్ తీసుకొని.. ఆ మరునాడు క్రికెట్ ఆడలేము’ అని ఆయన అన్నారు. రాత్రి ఉగ్రవాదం, పొద్దున్న క్రికెట్ అన్న విధానం ఇక నడవబోదని స్పష్టం చేశారు. -
పీవోకే భారత్దే.. పాక్ తీవ్ర స్పందన
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, ఏదో ఒకరోజున దానిని దేశ భౌగోళిక అధికార పరిధిలోకి తీసుకొచ్చేస్తామని భారత్ చేసిన వ్యాఖ్యలపై దాయాది పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. భారత్ దుందుడుకుగా చేస్తున్న వ్యాఖ్యలను అంతర్జాతీయ సమాజం సీరియస్గా పరిగణించాలని కోరింది. బాధ్యతారాహిత్యంగా, అసంబద్ధంగా భారత్ ప్రకటనలు చేస్తోందని, దీనితో దాయాదుల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయి.. ఉపఖండంలో శాంతిభద్రతలు ప్రమాదంలో పడే అవకాశముందని పాక్ చెప్పుకొచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, ఏదో ఒకరోజున దానిని దేశ భౌగోళిక అధికార పరిధిలోకి తీసుకొచ్చేస్తామని విదేశాంగమంత్రి ఎస్ జయశంకర్ మంగళవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. కశ్మీర్ అంశంపై ప్రజలు ఏమంటారోనని ఎక్కువగా దిగులు చెందాల్సిన అవసరంలేదని, కశ్మీర్ అనేది భారత్ అంతర్గత సమస్య అని, త్వరలోనే సద్దుమణుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
పీవోకే భారత్లో భాగమే
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో అంతర్భాగమేనని, దానిపై ఎప్పటిౖకైనా భౌతిక అధికార పరిధి కలిగి ఉండాలని కేంద్రం భావిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ అన్నారు. కశ్మీర్ అంశంపై ప్రజలు ఏమంటారోనని ఎక్కువగా దిగులు చెందాల్సిన అవసరంలేదని ఆయన స్పష్టంచేశారు. కశ్మీర్ అనేది భారత్ అంతర్గత సమస్య అని, త్వరలోనే సద్దుమణుగుతుందని ధీమా వ్యక్తంచేశారు. ఇక భారత్ పొరుగు దేశం నుంచి ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటిని సాధారణ స్థితికి తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సరిహద్దు ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టంచేశారు. భారత్–అమెరికాల మధ్య సంబంధాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలిపారు. వాణిజ్య వ్యవహారాలు సాధారణ స్థితిలో ఉన్నాయన్నారు. పాత మార్గాల్లోనే మళ్లీ కొత్తగా శ్రీనగర్: కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు అనంతరం పాక్ సైన్యం దొంగచాటు మార్గాల గుండా 60 మంది ఉగ్రవాదులను దేశంలోకి పంపించిందని అధికారులు వెల్లడించారు. ఎత్తైన పర్వత ప్రాంతాలైన ఉత్తర కశ్మీర్లోని గురెజ్, మచిల్, గుల్మార్గ్, జమ్మూలోని పూంఛ్, రాజౌరీ సెక్టార్ల గుండానే చొరబాట్లు ఎక్కువగా జరిగినట్లు నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి అంచనాకు వచ్చామన్నారు. ఉగ్రవాదులు గతంలో ఈ మార్గాల ద్వారానే దేశంలోకి ప్రవేశించేవారని తెలిపారు. అయితే, చొరబాట్లపై సైన్యం ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈ అనుమానాల నేపథ్యంలోనే భద్రతా బలగాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. -
‘మీ అవసరం లేదు.. పాక్తోనే తేల్చుకుంటాం’
న్యూఢిల్లీ : కశ్మీర్ అంశంపై భారత ప్రధాని మోదీ తన సాయం కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో కశ్మీర్ అంశంపై ఎలా ముందుకెళ్తారో భారత్, పాకిస్తాన్ ఇష్టమని గురువారం పేర్కొన్నారు. అయితే, కశ్మీర్ అంశంపై ఒకవేళ సాయం కోరితే మాత్రం తప్పకుండా ముందుకొస్తానని మరోసారి స్పష్టం చేశారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కశ్మీర్ అంశంపై ఇతరుల జోక్యం అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈమేరకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోతో జరిగిన భేటీలో ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. భారత్, పాక్ ద్వైపాక్షిక చర్చల్లో ఇతరుల మధ్యవర్తిత్వం అనుమతించబోమని తేల్చి చెప్పారు. కశ్మీర్ విషయంలో ఎలాంటి చర్చలైనా కేవలం పాకిస్తాన్తో మాత్రమే ఉంటాయని ట్విటర్లో వెల్లడించారు. (చదవండి : కశ్మీర్పై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన భారత్) -
విదేశీ జైళ్లల్లో అత్యధికంగా భారతీయులే!
న్యూఢిల్లీ : సౌదీ అరేబియాలో జైలు శిక్ష అనుభవిస్తున్న విదేశీయులలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. ఈ ఏడాది మే 31 నాటికి సౌదీలోని భారతీయ ఖైదీలు 6శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ జాబితాలో సౌదీ తర్వాత యుఏఈ, నేపాల్లో అత్యధిక మంది భారతీయులు అక్కడి జైళ్లలో బంధీలుగా ఉన్నారన్నారు. సౌదీ అరేబియాలో మొత్తంగా 1,811, యుఏఈలో 1,392, నేపాల్లో 1,160 మంది భారతీయులు జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు. ఇక అమెరికా జైళ్లలో 689, పాకిస్తాన్లో 48 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారన్నారు. పాకిస్తాన్ జైళ్లలో గత ఏడాది 471 మంది భారతీయులు ఉండగా.. ఈ ఏడాది వారి సంఖ్య బాగా తగ్గిందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాగా బుధవారం లోక్సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ గణాంకాలు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. విదేశాల్లోని చట్టాలపై సరైన అవగాహన లేకుండా అక్కడికి వెళ్తున్న కారణంగా అత్యధిక మంది ఇబ్బందుల్లో పడుతున్నారని పేర్కొంది. ఈ క్రమంలో జైళ్లలో మగ్గాల్సి వస్తుందని.. అయితే విదేశాల్లో పని చేయాలనుకునే కార్మికులు స్థానిక కాన్సులేట్ సేవలలో ముందుగానే తమ పేరును నమోదు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని తెలిపింది. కాగా సాధారణంగా తమ దేశంలో ఉన్న ఖైదీల విషయంలో చాలా మటుకు దేశాలు వివరాలు ప్రకటించడంలో గోప్యత పాటిస్తాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దాయాది దేశాల్లో బంధీలుగా ఉన్న పౌరుల వివరాలు.. అనేక వేధింపుల తరువాత బహిర్గతమవుతాయన్న అంశం విదితమే.