secret
-
మూడు పూటలా భోజనం, నడకతో ఏకంగా 124 ఏళ్లు..!
అత్యంత కాలం బతికిన శతాధిక వృద్ధులను చూస్తే..వారి ఆరోగ్య రహస్యం ఏంటని కుతూహలంగా ఉంటుంది. వారి దీర్ఘాయువుకి కారణం.. క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని క్లియర్గా స్పష్టమవుతోంది. ఇంతవరకు జపాన్, బ్రెజిల్లోని శతాధిక వృద్ధ మహిళలు, వారి హెల్త్ సీక్రెట్ల గురించి విన్నాం. ఇప్పుడు వారందర్నీ వెనక్కినెట్టి అత్యంత శతాధిక వృద్ధురాలికి నిలిచి ఆశ్చర్యపరుస్తోంది ఈ చైనా బామ్మ. అయితే ఈ బామ్మ ఇప్పటికీ తన పనులను తానే చేసుకుంటోందట. మిగతా శతాధిక వృద్ధ బామ్మల మాదిరిగా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో జాయిన్ అవ్వకపోవడం విశేషం. అయితే ఈ బామ్మ ఆరోగ్య రహస్యం ఏంటో తెలిస్తే విస్తుపోవడం ఖాయం. ఆ బామ్మ ఎవరంటే..చైనా(China)కు చెందిన క్వి చైషి(Qiu Chaishi) అనే బామ్మ. ఆమె వలసవాద సెమీ ఫ్యూడల్ పాలనకు గుర్తుగా నాటి క్వింగ్ రాజవంశ పాలకుల హయాంలో 1901లో జన్మించింది. జనవరి 1న 124వ పుట్టిన రోజున జరుపుకుంది. అప్పుడే రుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ఉన్న నాన్చాంగ్ నగరం అత్యంత శతాధిక వృద్ధులలో ఆమె కూడా ఒకరిగా క్విచైషి బామ్మను గుర్తించింది.ఆమెకు ఏకంగా 60 ఏళ్ల వయసున్న మనవరాలు ఉంది. తన తరంలోని అత్యంత చిన్న కుటుంబ సభ్యురాలు వయసు ఎనిమిది నెలల చిన్నారి అట. ఇక ఆమె సుదీర్ఠకాల ఆరోగ్యం రహస్యం ఏంటంటే..హెల్త్ సీక్రెట్..తన సుదీర్ఘకాల(Longevity) జీవన రహస్యం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అని నమ్మకంగా చెబుతోంది. రోజూ మూడుపూటల భోజనం(Lard Rice) చేస్తుందట. అయితే భోజనం తర్వాత నడక(Walks) తప్పనిసరి అని చెబుతోంది క్విచైషి. అలాగే రాత్రి 8 కల్లా నిద్రపోతుందట. ఇప్పటకీ తన పనులన్నీ చకచక చేసుకుంటుందట. తల దువ్వుకోవడం దగ్గర నుంచి స్టవ్ వెలిగించడం, పెంపుడు జంతువులను పెంచడం, మెట్లు ఎక్కడం తదితర అన్ని పనులను సునాయాసంగా చేసేస్తుందట. తనకు ఇష్టమైన వంటకాల గురించి కూడా షేర్ చేసుకుంది. ఆమెకు గుమ్మడికాయ, శీతాకాలపు పుచ్చకాయ, మొక్కజొన్న పిండితో చేసే గంజి, పందికొవ్వు అంటే మహా ఇష్టమట. కానీ పంది కొవ్వుని మాత్రం వైద్యుల సలహా మేరకు మితంగా తీసుకుంటున్నట్లు తెలిపింది. నిజంగా ఈ బామ్మ ఆరోగ్యపు అలవాట్లు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఈ బామ్మ మాములు గ్రేట్ కాదు, అంతకు మించి అని ప్రశంసించకుండా ఉండలేం కదా..!.(చదవండి: ఇంతలా 'కృతజ్ఞత' చూపించడం అందరి వల్ల కాదేమో..!) -
బర్గర్లు టేస్టీగా ఉండటానికి కారణం ఇదా..!
అమెరికాలోని ఓ రెస్టరెంట్ వందేళ్లుగా ఒకే వంటనూనెను మళ్లీ మళ్లీ వాడి బర్గర్స్ను తయారుచేస్తోంది. పైగా ఇదే తమ అసలు రహస్యమంటూ ప్రచారం కూడా చేస్తోంది. అమెరికాలోని మెంఫిస్ పట్టణంలో ‘డయ్యర్స్ బర్గర్స్’ రెస్టరెంట్ రుచికరమైన బర్గర్స్కు ఫేమస్. 1912లో ఎల్మెర్ డాక్ దీనిని స్థాపించాడు. ఒకరోజు అతను పాన్లోని నూనెను మార్చడం మర్చిపోయి, తర్వాతి రోజు అలాగే బర్గర్ తయారు చేశాడు. ఆ బర్గర్ తీసుకున్న వ్యక్తి ‘నా జీవితంలో నేను తిన్న రుచికరమైన బర్గర్ ఇదే!’ అని చెప్పడంతో డాక్ అప్పటి నుంచి ఆ నూనెను మార్చలేదు. అవసరానికి తగ్గట్టుగా దానికి మరింత నూనెను కలుపుతూ అలాగే వాడుతున్నాడు. గత వందేళ్లుగా ఇలాగే చేస్తున్నట్లు ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో డాక్ కుమారుడు రాబర్ట్ చెప్పాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్గా మారింది. కొంతమంది ఇదంతా అబద్ధమని, అసలు రహస్య పదార్థం వేరే ఉందని చెబుతుంటే, మరికొందరు దీనిని నమ్మి, బర్గర్ను ప్యాక్ చేయడానికి ముందు ఆ నూనెలో మరోసారి ముంచి డబుల్ డిప్ బర్గన్ను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. ఏది ఏమైనా డయ్యర్స్ బర్గర్స్ ఎంతో రుచికరంగా ఉంటాయని అక్కడి వారందరూ ఒప్పుకుంటారు.(చదవండి: కృత్రిమ మేధాజాలం వంటింట్లో మయాజాలం -
శిఖర్ ధావన్ ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే కంగుతినాల్సిందే..!
భారత మాజీ క్రికెటర్, ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ మైదానంలో అడుపెడితో ధనాధన్ సిక్సర్ల వర్షం కురవాల్సిందే. ధావన్ పరుగుల విధ్వంసానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అంతలా తన ఆటతో కట్టిపడేసే ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్తో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం నేపాల్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఇంతలా శక్తిమంతంగా ఆడలాంటే అంతే స్థాయిలో బాడీని, ఆరోగ్యాన్ని ఫిట్గా ఉంచుకోవాలి. అందుకోసం ధావన్ ఎలాంటి వర్కౌట్లు, డైట్ తీసుకుంటారో తెలుసా..!.శిఖర్ ధావన్ వారంలో రెండు నుంచి మూడు కఠినమైన జిమ్ సెషన్లు తప్పనిసరిగా చేస్తాడు. వాటిలో కార్డియో వర్కౌట్లు కూడా ఉంటాయట. అంతేగాదు ఓ ఇంటర్వ్యూలో ప్రాథమిక వ్యాయామానికి ముందు బాడీ చురుకుగా ఉండేలో గ్లూట్ వ్యాయమాలు, మొబిలిటీ ట్రైనింగ్, స్ట్రెచింగ్ వంటివి చేస్తానని చెప్పుకొచ్చాడు. ధావన్ యోగా ప్రేమికుడు కూడా. యోగాసనాలు రోజువారీ దినచర్యలో కచ్చితంగా ఉంటాయి. అయితే ధావన్ ఎక్కువగా రన్నింగ్ ఎక్సర్సైజుని ఎంజాయ్ చేస్తానని చెబుతున్నారు. ఇది శరీరం అంతటా రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తుందట. ఏదైన వర్కౌట్లు చేయడానికి ముందు కనీసం 30 నిమిషాలు శరీరం వేడెక్కేలా రన్నింగ్ లేదా జాగింగ్ చేయాలని సూచిస్తున్నాడు ధావన్. చివరిగా మానసిక ఆరోగ్యం కోసం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, సూర్యనమస్కారాలు కూడా చేస్తానని అంటున్నారు ధావన్. డైట్..గబ్బర్గా పిలిచే ధావన్ ఎక్కువగా కాల్చిన చికెన్, బంగాళదుంపలు, సాల్మన్, బ్రోకలీ తదితర కూరగాయాలను ఇష్టంగా తింటారు. వీటితోపాటు ఆలూ పరాటాలు, దోసెలు, చికెన్ కర్రీ వంటివి కూడా తింటానని చెబుతున్నారు. ఈ ఫుడ్ తనకు కఠినమైన వ్యాయామాల సమయంలో హెల్ప్ అవుతుందని చెబుతున్నాడుప్రోటీన్ రిచ్ డైట్కి ప్రాధాన్యత ఇవ్వనని చెబుతున్నారు. శక్తి కోసం పిండి పదార్థాలు తప్పనసరి అని వాదించారు కూడా. తాను ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు కలిగిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటానని చెప్పారు.అథ్లెట్లకు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం అవసరమనే అపోహ ప్రజల్లో ఉంది. కానీ "శక్తిని పెంచడానికి కార్బోహైడ్రేట్లే ప్రధానమని నమ్ముతా అని చెప్పారు ధావన్.(చదవండి: స్నానం చేయడం పాత ట్రెండ్! ఇలా మూడ్ని బట్టి..) -
పుట్టిన రోజు వేడుకలకూ నోచుకోలేదు
ఈ ఫొటో చూస్తే మీకేమనిపిస్తోంది? ఏదో హెయిరాయిల్ ప్రకటనలా ఉంది కదా! కానీ నిజానికి అదో బర్త్డే పార్టీ. అత్యంత రహస్యంగా చేసుకున్న పార్టీ. అందులో పాల్గొన్న అమ్మాయిలంతా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ముఖాలు కనబడకుండా జాగ్రత్త పడ్డారు. బర్త్డే పార్టీ అంత రహస్యంగా చేసుకోవడమెందుకు? వేరే ఏ దేశంలోనైనా అవసరం లేదు. కానీ ఆఫ్గానిస్తాన్లో మాత్రం అది అత్యవసరం! తాలిబన్ల పాలనలో అక్కడి మహిళలు, బాలికల దుస్థితికి అద్దం పడుతున్న ఈ ఫొటోను ఇరాన్–కెనడియన్ ఫొటో జర్నలిస్ట్ కియానా హయేరి తీశారు. ఇలాంటి చిత్రాల సమాహారాన్ని ‘నో విమెన్స్ లాండ్’ పేరిట ఈ నెల పారిస్లో ప్రదర్శించనున్నారు.ఏడు ప్రావిన్సులు తిరిగి... ఫ్రెంచ్ పరిశోధకురాలు మెలిస్సా కార్నెట్తో హయేరి 2018 నుంచి కలిసి పని చేస్తున్నారు. వారు కొన్నేళ్లుగా అఫ్గాన్లోనే ఉంటున్నారు. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్ను వీడటం, దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం వంటి పరిణామాలకు వాళ్లు ప్రత్యక్ష సాక్షులు. నానాటికీ దిగజారుతున్న పరిస్థితులు వారిని భయపెట్టాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని కల్లబొల్లి ప్రతిజ్ఞలు చేసిన తాలిబన్లు చివరికి వాళ్లకు అసలు ప్రజా జీవితమే లేకుండా చేశారు. ప్రాథమిక హక్కులతో సహా సర్వం కాలరాశారు. మహిళల గొంతు వినపడటమే నిషేధం. ముసుగు లేకుండా, మగ తోడు లేకుండా గడప దాటడానికి లేదు! బాలికల చదువుకు పాఠశాల స్థాయితోనే మంగళం పాడారు. బహిరంగ ప్రదేశాల్లో సంగీతం, నృత్యం నిషేధం. అఫ్గాన్ మహిళల దుస్థితిని బయటి ప్రపంచానికి చూపేందుకు హయేరి, కార్నెట్ ఏడు ప్రావిన్సుల్లో పర్యటించారు. ఎంతోమంది మహిళలను కలిశారు.ఆశలకు ప్రతీకలు కూడా... ఎంతసేపు అణచివేత గురించే ఎందుకు చెప్పాలి? అందుకే అఫ్గాన్ బాలికలు, మహిళలకు భవిష్యత్తు మీదున్న ఆశను కూడా హయేరి, కార్నెట్ ఫొటోల్లో బందించారు. తమ చీకటి జీవితాల్లో వెలుగులు నింపే వేడుకలను వాళ్లు జరుపుకొంటున్నారో చెబుతున్నారు. ప్రస్తుతం అఫ్గాన్లో బాలికలు, స్త్రీలకు సంబంధించి చిన్న వేడుక అయినా అది నేరుగా తాలిబన్ ప్రభుత్వాన్ని ధిక్కరించడమే. అందుకే బాలికలు పుట్టిన రోజులు, పెళ్లిళ్ల వంటి వేడుకల్లో స్నేహితులను కలుస్తున్నారు. వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది ప్రమాదాలు తెచ్చి పెడుతుందని తెలిసీ రిస్క్ చేస్తున్నారు. మహిళలు గుర్తింపుకే నోచుకోని చోట ఇలాంటి చిన్న వేడుకైనా పెద్ద ప్రతిఘటనే! చిరునవ్వులు చిదిమేస్తున్న కాలంలో ఆనందాన్ని ప్రదర్శించడం కూడా తిరుగుబాటే. అందుకే నిరసనను వ్యక్తం చేసే ఏ అవకాశాన్నీ మహిళలు వదులుకోవడం లేదంటున్నారు. హయేరి, కార్నెట్.తాలిబన్లలోనూ విభేదాలు!మహిళలను తీవ్రంగా అణచివేయడంపై తాలిబన్లలోనే వ్యతిరేకత పెరుగుతోంది! అతివాది అయిన దేశాధినేత షేక్ హైబతుల్లా అఖుందా జాదా నిర్ణయాలను తాలిబన్లలోనే ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ వంటివాళ్లు బాలికలు, యువతుల విద్య కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఆరో తరగతి తర్వాత కూడా విద్యను అందించే అండర్ గ్రౌండ్ పాఠశాలలపై తాలిబన్లలోని కొన్ని విభాగాలు దృష్టి సారించినట్టు కార్నెట్ పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లక్షలు కొట్టేసి.. ఏం చేయాలో తెలియక అక్కడ పెట్టాడు.. చివరికి
భువనేశ్వర్: దొంగిలించిన సొమ్మును ఏం చేయాలో తెలీక ఇంటి వెనుక గత్తం కింద దాచిపెట్టాడో ప్రబుద్ధుడు. పోలీసులు గుట్టు రట్టు చేయడంతో పరారైపోయాడు. హైదరాబాద్ వ్యవసాయ పరిశ్రమలో పని చేస్తున్న సిబ్బంది సొమ్మును దొంగిలించి దాచాడు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందం రాష్ట్రానికి విచ్చేసి ఈ దోపిడీ గుట్టు రట్టు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..బాలాసోర్ జిల్లా బొడొమొందారుణి గ్రామానికి చెందిన గోపాల్ బెహరా అనే వ్యక్తి హైదరాబాద్లో ఓ కంపెనీలో పని చేస్తున్న సిబ్బంది నుంచి రూ. 21 లక్షలు దోచుకున్నాడు. దోచుకున్న నగదుని బావమరిది ద్వారా స్వస్థలానికి సురక్షితంగా తరలించాడు. నిందితుని అత్తమామలు ఈ సొమ్ముని సంచిలో పదిల పరచి ఇంటి పెరట గత్తం కుప్ప కింద దాచి పెట్టారు.గోపాల్ బెహరా గత పదేళ్లుగా ఈ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ అనుభవంతో లాకరు రహస్య నంబరు వగైరా అనుబంధ సమాచారం గుట్టుగా తెలుసుకుని భారీ మొత్తాన్ని కాజేశాడు. కాజేసిన సొమ్ముని బావమరిది ద్వారా జలేశ్వర్లో అత్త వారింటికి తరలించాడు. కంపెనీలో నగదు గల్లంతు విషయమై దాఖలైన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ దర్యాప్తు బృందం రాష్ట్రానికి చేరింది. స్థానిక కొమొర్దా ఠాణా పోలీసుల సహకారంతో నిందితుని అత్త వారింటికి చేరి గాలింపు, తనిఖీలు చేపట్టింది. దర్యాప్తులో ఇంటి పెరట్లో గత్తం కుప్ప కింద దోచుకున్న సొమ్ము పాతిపెట్టినట్లు గుర్తించారు. గత్తం కుప్ప తవ్వడంతో వాస్తవం తేలింది. మరో వైపు ప్రధాన నిందితుడు, అతని మామ ఉమాకాంత బెహరా పరారీలో ఉన్నాడు. అతని బావమరిది రబీంద్ర బెహరాని దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. నిందితుని అత్త బాసంతి బెహరాని కూడా ప్రశ్నిస్తున్నారు. గత్తం తవ్వడంతో రూ. 15 లక్షలు మాత్రమే బయటపడినట్లు దర్యాప్తు బృందం వివరించింది. ఈ నెల 11న హైదరాబాదు వ్యవసాయ కంపెనీలో రూ. 21 లక్షల చోరీకి గురైంది. దీని ఆధారంగా దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఇక్కడ దొరికిన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొమ్ము కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఫోను సంభాషణ వివరాలు ఆధారంగా దోపిడీ నుంచి తరలింపు వరకు జరిగిన ప్రక్రియ గుట్టు రట్టుకు దర్యాప్తు బృందం వ్యూహ రచన చేసింది. కేసు విచారణ, దర్యాప్తు కొనసాగుతుంది.ఇవీ చదవండి : 50లో కూడా శిల్పం లాంటి బాడీ...ఇదిగో సింపుల్ వర్కౌట్గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్ చెబితే ‘ఏప్రిల్ పూల్’ అనుకుంది..చివరికి! -
సెన్సేషనల్ స్టార్ బ్యూటీ సీక్రెట్స్ : మేక పెరుగు, నెయ్యి, జ్యూస్లు
ఆర్ట్ కలెక్టర్, దాత సోషల్ మీడియా సెన్సేషన్, రియాలిటీ టీవీ స్టార్ షాలిని పాసి 'ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్' సిరీస్తో మరింత పాపులర్ అయిపోయింది. ఆమె అదిరిపోయే పంచ్ డైలాగులు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు 49 ఏళ్ల వయసులో ఇంత అందంగానా? శిల్పం లాంటి ఆకృతి, మెరిసే చర్మం కోసం, ఆమె ఏమి తింటుంది అనేది చర్చకు తెరతీసింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన ఆహార నియమాలు, సౌందర్య రహస్యాలను బహిర్గతం చేసింది. షాలిని రోజువారీ ఆహారంలో ఎటువంటి ఘనమైన ఆహారం తీసుకోదట. సెలెరీ (ఆకుకూరలు)జ్యూస్, కూరగాయలతో చేసిన జ్యూస్లు, నెయ్యి, మేక పెరుగు ఖచ్చితంగా తీసుకుంటానని తాగా వెల్లడించింది. ప్రధానంగాకొంచెం వింతగా అనిపించినా తాను మేక పెరుగును ఎక్కువగా తీసుకుంటానని చెప్పింది. మేక పెరుగుతో ఎముకలు ,దంతాలు బలంగా ఉంటాయని వివరించింది. డైట్ మాత్రమే కాదు, రోజుకు రెండు గంటల వ్యాయామం తప్పకుండా చేస్తుందట.షానిలి డైట్ సీక్రెట్, ఆమె మాటల్లో ఉదయం ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటా.తర్వాత ఉసిరి అల్లం కలిపిన బీట్రూట్ రసం.డైట్లో హెర్బల్ లిక్విడ్లు, కూరగాయలజ్యూస్లు ఎక్కువ భాగం ఉంటాయి. రెండు గిన్నెల మొలకలను నమలడం కష్టం. అదే జ్యూస్ అయితే సులభంగా తాగవచ్చు. సెలెరీ జ్యూస్, రెడ్ జ్యూస్, స్ప్రౌట్ జ్యూస్, మిరియాలతో చేసే క్యాప్సికమ్ జ్యూస్ ఇలా చాలా ఉంటాయి.సాయంత్రం ఆహారంలో ప్రతిదీ సూప్ రూపంలో ఉంటుంది. వడకట్టకుండా, చిక్కగా ఉండే కూరగాయలను జ్యూస్లను తాగుతాను. ఇంకా బచ్చలికూర, బ్రోకలీ సూప్, టొమాటో, బెండ, తామర కాండం, బఠానీలు ఇలా ఏదైనా జ్యూస్ రూపంలోనే.సాయంత్రం 6 గంటల వరకు పచ్చి ఆహారం మాత్రమే .. రాత్రి 7 గంటలకు భోజనం. అదీ కూడా 'ఘర్ కా ఖానా (ఇంట్లో వండిన ఆహారం)'ఉండేలా చూసుకుంటా. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడే సహజమైన వాటిని మాత్రమే తీసుకుంటాను.డిన్నర్లో అవకాడో, రాగి లేదా జొన్న పిండితో చేసిన దోసలు తింటానుఇక గుడికి వెళ్లని రోజుల్లో ప్రోటీన్ కోసం గుడ్డు, చేపలు లేదా చికెన్ తీసుకుంటా.సాయంత్రం 4 నుండి 6 వరకు నా వర్కౌట్ సమయం. కండరాలకు బలం చేకూర్చే పైలేట్స్ , డ్యాన్స్ చేస్తాను. ఆ సమయంలో నన్ను డిస్టర్బ్ చేయకూడదు. (ఫ్యాషన్తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!) -
మిల్కీ బ్యూటీ డైట్ సీక్రెట్ ఇదే!.. మెరిసే చర్మం కోసం..
టాలీవుడ్ నటి తమన్నా భాటియా హ్యాపీ డేస్ మూవీతో ఎంట్రీ ఇచ్చి.. వరుస హిట్ సినిమాలతో మంచి సక్సెస్ని అందుకుంది. మిల్కీ బ్యూటీ, తన అందం, నటనతో విమర్శకుల ప్రశంసలందుకోవడమే గాక ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించింది. కళ్లు తిప్పుకోలేని అందం, ఆహార్యం ఆమె సొంతం. అంతేగాదు యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామరస్గా ఉంటుంది. ఇప్పటికి అలానే చెక్కిన శిల్పంలా అందంగా ఉంటుంది. అంతలా బాడీ మెయింటైన్ చేసేందుకు ఆమె ఎలాంటి డైట్ ఫాలో అవుతుందోనని కుతూహలంగా ఉంటారు అభిమానులు. అయితే తమన్నా మాత్రం ఫిట్నెస్ అనేది రోజు బ్రెష్ చేయడం మాదిరిగా శరీరానికి సంబంధించిన ఓ దినచర్య. అందుకోసం తాను ఎలాంటి డైట్లు ఫాలో అవ్వనని, తనకు వాటిపై నమ్మకం లేదని అంటోంది. మరీ అంతలా నాజుకైన శరీరం ఎలా మెయింటైన్ చేస్తుందంటే..తమన్నా నాజూకైన శరీరాకృతి పరంగా ఎన్నో ప్రశంసలందుకుంటుంది. ఫిట్గా ఉండేందుకు మెరిసే చర్మం కోసం ఎలాంటి ఫుడ్ తింటుందంటే..బ్రేక్ఫాస్ట్లో తప్పనిసరి అవి..గ్లూటెన్ ఫ్రీ గ్రానోలా, ఖర్జూరాలు, బాదంపాలు, అరటి పండు, గింజలు, కొన్ని బెర్రీలు ఉంటాయి. శక్తి బూస్ట్ కోసం తేలికపాటి అల్పాహారంతో డైట్ ప్రారంభిస్తుంది. ప్రోటీన్ కోసం గుడ్లను తింటుంది. అంతేగాదు మరింత హెల్తీగా ఉండేందుకు ఉల్లిపాయలు, టొమాటోలు, బచ్చలికూరతో చేసి ఆమ్లేట్లు తీసుకుంటుందట. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) లంచ్ వద్దకు వస్తే సాధారణ భోజనం, పప్పు, అన్నం, పచ్చికూరగాయలే తింటుంది. ఇలాంటి భోజనం సంతృప్తినిస్తుందని అంటోంది. షూటింగ్లో ఉన్న రోజుల్లో లేదా బయటకు వెళ్లే రోజుల్లో ఇడ్లీ, సాంబార్ లేదా రసం, దోస వంటి దక్షిణ భారత ఆహారాన్నే ఎంచుకుంటానంటోంది. డిన్నర్ చాలావరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల్లోపు తినేలా చూసుకుంటుందట. దీంతోపాటు కొన్ని గింజలను తింటానని చెబుతోంది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) అంతేగాదు తాను ఎక్కువగా సాయంత్రం సమయాల్లో జిమ్ చేస్తానని అంటోంది. ఆ టైంలో తప్పనిసరిగా గుడ్లు, కూరగాయలతో కూడిన ప్రోటీన్ రిచ్ డిన్నర్కి ప్రాధాన్యత ఇస్తుందట. జిమ్ ఎక్కువ చేస్తే తాను తీసుకునే భోజనం క్వాంటిటీని కూడా పెంచుతానని చెబుతోంది. ఇక మెరిసే చర్మం కోసం హైడ్రేటెడ్గా ఉండేలా ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతానని అంటోంది. (చదవండి: కళ ద్వారా ఆరోగ్య అక్ష్యరాస్యత..!) -
పుతిన్తో ట్రంప్ రహస్య స్నేహం.. పదవి నుంచి దిగిపోయాక ఆరుసార్లు ఫోన్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యా అధినేత పుతిన్ కోసం కోవిడ్–19 టెస్టింగ్ కిట్లు రహస్యంగా అందజేశారా? పుతిన్ వీటిని వ్యక్తిగతంగా వాడుకున్నారా? పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా పుతిన్తో ట్రంప్ రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగించారా? అవుననే చెబుతోంది ఓ పుస్తకం. వాటర్గేట్ కుంభకోణంపై వార్తలు రాసిన విలేకరి బాబ్ వుడ్వర్డ్ రచించిన ‘వార్’అనే పుస్తకంలో ఈ సంచలన విషయాలు ప్రస్తావించారు. ఈ పుస్తకం ఈ నెల 15న విడుదల కానుంది. ఇందులోని కొన్ని ముఖ్య అంశాలను అమెరికా పత్రికలు బయటపెట్టాయి. ట్రంప్ 2021లో అధికారం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్, పుతిన్ కనీసం ఆరుసార్లు ఫోన్లో సీక్రెట్గా మాట్లాడుకున్నారని ట్రంప్ సహాయకుడు చెప్పినట్లు పుస్తకాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం అమెరికాలో సంచలనాత్మకంగా మారింది. ఇదిలా ఉండగా, వార్ పుస్తకంలోని అంశాలను ట్రంప్ ప్రచార బృందం ఖండించింది. అదొక చెత్త పుస్తకం, అందులోని కాగితాలు టాయిలెట్ టిష్యూగా వాడుకోవడానికి పనికొస్తాయని ఎద్దేవా చేసింది. ట్రంప్ సైతం స్పందించారు. కథలు చెప్పడంతో దిట్ట అయిన బాబ్ వుడ్వర్డ్ చెప్పే పనికిమాలిన విషయాలు నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. అతడొక చెడ్డవ్యక్తి అని విమర్శించారు. తాజా వివాదంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ కూడా స్పందించింది. ‘వార్’పుస్తకంలో ప్రస్తావించిన వాటిలో ఏమాత్రం వాస్తవం లేవని, అవన్నీ అభూత కల్పనలు అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తేలి్చచెప్పారు. -
ఎన్నికల వేళ ట్విస్ట్.. పుతిన్కు ట్రంప్ సీక్రెట్ కాల్స్?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గత అధ్యక్ష ఎన్నికల ఓటమిచెంది పదవి నుంచి దిగిపోయిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పలు ప్రైవేట్ ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారని వచ్చిన ఆరోపణలను బుధవారం క్రెమ్లిన్ ఖండించింది. ఇటీవల బాబ్ వుడ్వార్డ్ తాను రాసిన ‘వార్’ అనే పుస్తకంలో ట్రంప్,పుతిన్ రహస్య ఫోన్ కాల్స్ విషయాలను ప్రస్తావించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్, పుతిన్ ఫోన్ సంభాషణ తీవ్ర సంచలనంగా మారింది. అయితే.. తాజాగా ఈ ఆరోపణలపై రష్యా స్పందించింది. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉన్నప్పుడు కోవిడ్ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉందని క్రెమ్లిన్ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.#BREAKING : Kremlin denies calls between Trump and Putin The Russian Presidential spokesman, Dmitry Peskov, has denied information alleging that former US President Donald Trump had spoken on the phone with Russian President Vladimir Putin seven times after the former left… pic.twitter.com/8rbppPeRgD— upuknews (@upuknews1) October 9, 2024 అయితే ఆ సమయంలో తాము కోవిడ్ -19 పరీక్ష పరికరాలను అమెరికాకు పంపినట్లు ధృవీకరించారు. కానీ, ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇరు నేతలు చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని పుస్తకంలోని వాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. బాబ్ వుడ్వార్డ్ తన పుస్తకంలో చేసిన ఆరోపణలను ‘నిజం కాదు’ అని కొట్టిపారేశారు.బాబ్ వుడ్వార్డ్ తాను రాసిన ‘వార్’ అనే పుస్తకం వారం రోజులల్లో మార్కెట్లోకి విడుదల కానుంది. అయితే అంతకంటే ముందే కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. 2024 ప్రారంభంలో ట్రంప్ తన ఫ్లోరిడా రిసార్ట్ మార్-ఎ-లాగోలో ఉన్నప్పుడు పుతిన్తో.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రైవేట్ కాల్ను ఏర్పాటు చేశారు. ఇరు నేతల మధ్య ఇలాంటి ఫోన్ సంభాషణ కేవలం ఒక్కసారి మాత్రమే జరగలేదని ఆ పుస్తకంలో బాబ్ వుడ్వార్డ్ ప్రస్తావించటం చర్చనీయాంశంగా మారింది.చదవండి: హెజ్బొల్లా చితికి పోయింది: అమెరికా -
80/20 నా డైట్ సీక్రెట్
నటి మసాబా గుప్తా జిహ్వచాపల్యం, తిండి పుష్టి గురించి అందరికీ తెలిసిందే! ఇంట్లో తయారు చేసే రకరకాల చిరుతిళ్లు అంటే ఆమెకు మహా మక్కువ. నోరూరించే రకరకాల తినుబండారాలకు నో చెప్పలేని బలహీనత ఆమెది. అయితే వాసికీ, రాశికీ మధ్య సమతూకాన్ని పాటించడం ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో అనిపిస్తుంది. డైట్ విషయంలో తాను 80/20 సూత్రాన్ని పాటిస్తానని చెప్పిన మసాబా గుప్తా ఇన్స్టాగ్రామ్లో కరోసెల్ అనే క్యాప్షన్ కింద తన రోజువారీ డైట్ గురించిన వివరాలు ఇలా పంచుకుంది. ‘‘80/20 రూల్ అనేది నా పాలిట బంగారం లాంటిది. ఇక్కడ 80 అనేది ప్రోటీన్లతో కూడిన బలవర్థకమైన ఆహారాన్ని సూచిస్తే, 20 నాకు నచ్చిన ఆహారాన్ని సూచిస్తుంది. (పేస్ట్రీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా బర్గర్లను సూచిస్తూ ఇమోజీలు పెట్టింది) వారంలో ఆరు రోజులూ నేను నా శరీరానికి ఏది అవసరమో అది ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తాను. ఒకరోజు మాత్రం నా నాలుక ఏది కోరిందో అది తీసుకోవడానికే ప్రయత్నిస్తాను’’ అని చెప్పింది. తాను రోజువారీ తీసుకునే డైట్ గురించిన వివరాలు ఇలా పంచుకుంది మసాబా. ‘‘ఉదయం ఆరున్నరకు టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ సోంపు గింజలను బాగా నమిలి తిని గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగుతాను. నా దృష్టిలో ఇది అమృత జలం. తొమ్మిది గంటలకు పెద్ద కప్పు నిండా ముసేలీ, బెర్రీలు. దాంతోపాటు వీలయితే అత్తిపళ్లు (రాస్బెర్రీ), నేరేడు పళ్లు. వర్క్ అవుట్స్ చేసిన తర్వాత పెద్ద గ్లాసు నిండా ప్రోటీన్ షేక్ తీసుకుంటాను. నానబెట్టిన ఐదు బాదం, ఐదు వాల్నట్స్ తీసుకుంటా. మధ్య మధ్యలో చల్లటి మజ్జిగ పిప్ చేస్తుంటా. ఒంటిగంటకు ఆలూ లేదా బెండకాయ ఫ్రై, చికెన్ కర్రీ, రైస్, స్ప్రౌట్స్తో చేసిన సలాడ్తో సంతృప్తికరమైన లంచ్ చేస్తాను. 5 గంటలకు చికెన్ లేదా చీజ్, కూరగాయలతో టాపింగ్ చేసిన హోల్ వీట్ లేదా మల్టిగ్రెయిన్స్తో చేసిన పిజ్జా.. రెండు ఉడకబెట్టిన గుడ్లు, కొద్దిగా చికెన్ గ్రేవీతో ఏడింటికల్లా డిన్నర్ ఫినిష్ చేస్తాను. మొత్తం మీద నా డైట్లో కార్బ్స్ కంటే ్రపోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను’’ అంటూ ఆమె చేసిన పోస్టింగ్కు చాలా లైకులు వచ్చాయి. -
ఏడుపదుల వయసులోనూ చలాకీగా మోదీ.. అలా ఎలా?
మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుర్రాడిలా చురుకుగా ఉంటారు. మంచి యాక్టివ్గా కనిపించే ఆయనకు 74 ఏళ్లు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సాధారణంగా ఏడు పదుల వయసులో వణుకుతూ..తడబడుతూ ఉంటారు. కానీ మన మోదీ మాత్రం పాతికేళ్ల కుర్రాడి మాదిరిగా వేగంగా కదులుతూ పనులు చేస్తారు. ఆ వయసు వారికి వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఆయన ఫిట్నెస్ పరంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య పరంగా యువతకు ఆదర్శం ఆయన. ఇంతలా చురుగ్గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరించే ఐదు ఆరోగ్య రహస్యల గురించి సవివరంగా చూద్దామా..!యోగా..యోగాతో రోజుని ప్రారంభిస్తారు మోదీ. పంచతత్త్వ యోగాసెషన్తో అతని రోజు త్వరగా ప్రారంభమవుతుందట. ఆయన ప్రకృతిలోని ఐదు అంశాలతో ముడిపడి ఉన్న అనేక ఆసనాలను వేస్తారు. ప్రతిరోజూ సుమారు 40 నిమిషాల పాటు సూర్య నమస్కారం, ధ్యానం, ప్రాణాయామం, యోగా నిద్ర తదితరాలు తప్పనిసరి. ఇక్కడ యోగా మనస్సుని, శరీరాన్ని సమతుల్యం చేస్తుంది, పైగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ఉపకరిస్తుంది. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) యోగా నిద్ర లేదా సమాధి స్థితి..ప్రధానిగా ఆయనకు ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందువల్ల కంటినిండా నిద్ర అనేది కాస్త కష్టమనే చెప్పాలి. ఇది ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిస్తుందో మనకు తెలిసిందే. అందుకోసం మోదీ యోగా నిద్ర లేదా సమాధి స్థితిలో గడుపుతుంటారు. ఇది నిద్రలేమితో పోరాడటానికి, శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడానికి ఉపకరిస్తుంది. ఇద తనకు మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు, శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు ఉపయోగపడుతుందని పలు ఇంటర్యూలలో మోదీ చెప్పుకొచ్చారు కూడా. తప్పనిసరిగా వాకింగ్..ఎంత బిజీ షెడ్యూల్లో కూడా తప్పనిసరిగా వాకింగ్ చేస్తారు. అక్కడ ఉన్న వెసులబాటు రీత్యా సమయం తీసుకుని మరీ నడకకు ప్రాధాన్యత ఇస్తారు మోదీ. తాను ఎక్కువగా ప్రకృతిని ప్రేమిస్తానని, అక్కడ కాసేపు గడపడం తనకెంతో ఆహ్లాదాన్ని ఇస్తుందని చెబుతుంటారు. అందుకోసమైనా ఆపేదే లేదని చెబుతుంటారు. పచ్చగడ్డిపై నడుస్తూ ప్రకృతితో మమేకమవ్వడం తెలియని రిఫ్రెష్ని ఇస్తుందని అంటారు మోదీ.అల్పాహరం, భోజనంగా..ప్రధాని మోదీ శాకాహారి. ఆయన నవరాత్రుల తొమ్మిది రోజులు ఉపవాసాలు పాటిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఆఖరికీ విదేశాల్లో ఉన్నా కూడా నియమం తప్పరు. అంతేగాదు కచ్చితంగా ప్రతిరోజు తొమ్మిది కల్లా అల్పాహారం తీసుకుంటానని చాలసార్లు చెప్పారు. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించేందుకు ఆయా కాలానుగుణ పండ్లను కూరగాయాలను, తృణధాన్యాలను అస్సలు మిస్కాకుండా చూసుకుంటానని సోషల్ మీడియా పలుసార్లు వెల్లడించారు. అంతేగాదు ఒకసారి ఫిట్ ఇండియా ఉద్యమంలోతాను ములక్కాయతో కూడిన పరాఠాను తినేందుకు ఇష్టపడతానని అన్నారు. అలాగే మిల్లెట్లు, కాయధాన్యాలు, భారతీయ మసాలాలతో చేసే గుజరాతీ వాఘరేలీ ఖిచ్డీ వంటివి ఇష్టంగా తింటానని చెప్పారు. ఆయర్వేదానికే ప్రాధాన్యత..మోదీకి ఆయుర్వేదంపై ప్రగాఢ నమ్మకం ఉంది. జలుబు, దగ్గు,లేదా కాలనుగుణ అలెర్జీలు వంటి ఏ అనారోగ్య సమస్యకైనా ఆయుర్వేదాన్నే ఆశ్రయిస్తారు. అలాగే ఆహారంలో సహజసిద్ధమైన నూనెలకే ప్రాధాన్యత ఇస్తారు. అందువల్లే తాను ఇంతలా ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉండగలుగుతున్నానని అన్నారు. ఈ విధానాలను పాటించడం వల్లే అలసటకు ఆస్కారం లేకుండా చురుగ్గా ఉండటమే గాక దాదాపు 130 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా సమర్థవంతంగా పనులు చేయగలుగుతున్నానని సగర్వంగా చెప్పారు మోదీ. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) (చదవండి: రోగి భద్రతకు కావాల్సింది భరోసా..!) -
ఆదిమూలం కేసు: అజ్ఞాతంలోకి వరలక్ష్మి.. టీడీపీ నేతల రహస్య మంతనాలు!
సాక్షి, చిత్తూరు జిల్లా: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధితురాలు వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లింది. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కేసు దర్యాప్తునకు అవసరమైన ఆరు రకాల పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరణ పూర్తయిన తర్వాత వరలక్ష్మి నిన్న(గురువారం) డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తాళం వేసుకొని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.వరలక్ష్మి జాడ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆదిమూలం-వరలక్ష్మిల మధ్య రాజీ కుదుర్చేందుకు టీడీపీ నాయకులు రహస్య మంతనాలు జరుపుతుండగా, ఈ క్రమంలోనే వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు, ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలుమరోవైపు, ఈ కేసులో హైడ్రామా నడుస్తోంది. మొక్కుబడిగా ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయగా.. విమర్శల నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. తాజా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. కోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.కాగా, బాధితురాలి ఆరోపణల మేరకు తిరుపతి భీమా ప్యారడైజ్లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూములు సీజ్, సీసీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకుని అశ్లీల వీడియోను ఫారెన్సీక్ ల్యాబ్కు పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో శాసనసభ స్పీకర్ అనుమతి తీసుకొని ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. -
నా ఫిట్నెస్ రహస్యం ఇదే!
మనిషికి ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఇది సినీ తారలకు మరీ ముఖ్యం. అందుకు వ్యాయామం వంటి కసరత్తులతో పాటు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. కొందరు అందుబాటులో ఉన్నవి కదా అని అన్నీ తినేస్తుంటారు. దీంతో భారీ కాయంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కాగా చాలా మంది కథానాయికలు వయసు పరంగా 40లో పడినా చాలా ఫిట్నెస్గా, ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఒకరు అగ్రనటి నయనతార. జవాన్ చిత్రంలో ఇండియన్ స్టార్ హీరోయిన్గా మారిన ఈమె ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు రూ. 10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ తరగని అందాలతో నిగ నిగలాడుతున్న ఈ భామ ఫిట్నెస్ రహస్యమేమిటో? అని చాలా మంది ఆశ్యర్యపోతుంటారు. ఆ రహస్యాన్ని నయనతారనే ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. అందులో డైట్ అంటే ఇష్టమైన వన్నీ భుజించకూడదని, తాను ఇంతకు ముందు వరకూ భావించానన్నారు. అయితే అది కరెక్ట్ కాదని తన వైద్యురాలి ద్వారా తెలుసుకున్నానన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే మంచి పోషకాహారాలను ఇంట్లోనే తయారు చేయించుకుని, భుజిస్తున్నానని చెప్పారు. వాటిని ఆస్వాదిస్తూ తినడంతో జంక్ పదార్థాలపై కోరిక పుట్టడం లేదన్నారు. అలా తన ఆహారపు అలవాట్లే మారిపోయాయని పేర్కొన్నారు. మన లైఫ్ స్టైల్ బట్టే మన జీవన విధానం ఉంటుందని నయనతార అన్నారు. కాగా ప్రస్తుతం ఈ లేడీ సూపర్స్టార్ తమిళం, మలయాళం భాషల్లో నటిస్తూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరో పక్క నిర్మాతగా, వ్యాపారవేత్తగా, వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ పలు విధాలుగా సంపాదిస్తున్నారు. -
మరికొద్ది గంటల్లో తెరుచుకోనున్న పూరీ రత్నభాండాగారం
దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది రేపే తెరుచుకోనుంది.ఈ రత్న భాండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తోంది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని.. వీటి విలువ వెలకట్టలేనిదని అంచనాలున్నాయి.ఆదివారం పూరీలోని ప్రముఖ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని తెరవనున్నారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. అక్కడ ఉంచిన విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు.46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా.. సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. అయితే.. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భండారంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సేవకుడు హరేకృష్ణ మహాపాత్ర అంటున్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు కూడా.👉పూరీ జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. 👉అయితే.. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. అయితే.. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో.. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.👉భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రబీంద్ర నారాయణ్ మిశ్రా వెల్లడించారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటిని పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ.. ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు.👉ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే.. హైకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ రఘుబీర్ దాస్ కమిషన్ బృందం భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందం.. పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. 👉జగన్నాథుని రత్న భాండాగారాన్ని గురించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి పూరీ కలెక్టర్ చార్లెస్ గోమ్స్ నివేదికలో వచ్చింది. ఆ సమయంలో రత్న భాండాగారంలో రత్నాలు పొదిగిన బంగారు, వెండి ఆభరణాలు, 128 బంగారు నాణేలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాల వస్త్రాలు లభించాయి. 👉కాగా, 1978లో జగన్నాథ ఆలయంలోని రత్నాల దుకాణాన్ని తెరిచినప్పుడు అక్కడ 454 బంగారు ఆభరణాలు, 293 వెండి వస్తువులు లభించాయి. 1982 – 1985 సంవత్సరాలలో రత్న భండాగారం తెరచుకుంది. కానీ అప్పటికి విషయాలు లెక్కించలేదు.👉జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా మాట్లాడుతూ.. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం, 12,831 భరీల బంగారం (ఒక భరీ సుమారు 12 గ్రాములతో సమానం), 22,153 భరీల వెండితోపాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. ఎంతో విలువైన రాళ్లతో కూడిన 22,153 భరీల వెండి కూడా నిపుణులు గుర్తించారు. వీటితోపాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి. అయితే, పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను కొలవలేకపోయినందున వాటిని ఈ జాబితాలో పొందుపరచలేదని చెప్పారు.👉రఘుబీర్ కమిటీ నివేదికపై జులై 10లోగా స్పందన తెలియజేయాలంటూ ఒడిశా హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాళాలు ఎలా మాయమయ్యాయని.. డూప్లికేట్ తాళాలతో వాటిని తెరవాల్సిందేనని విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. రాజకీయం చేయొద్దని బీజేడీ కోరినా.. బీజేపీ, కాంగ్రెస్లు వెనక్కి తగ్గలేదు. అయితే ఈలోపే ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ.. ఎన్నికల హామీ మేరకు రత్న భాండాగారం తెరిపించేందుకు సిద్ధమైంది.👉ఒడిశా పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారాన్ని తెరిపించి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రథ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో.. ఈ నెల 14న(ఆదివారం) రత్న భాండాగారం రహస్య గదిని తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి ఆ కమిటీ సిఫార్సు చేసింది.👉జగన్నాథ ఆలయంలోని రత్నాల భాండాగారాన్ని తెరిచే బాధ్యతను బిశ్వనాథ్ కమిటీనే తీసుకుంది. ఆయన నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీకి ఈ బాధ్యతను అప్పజెప్పారు. ఈ కమిటీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఉంచిన వస్తువులను లెక్కించి వాటిపై నివేదికను రూపొందిస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో.. రత్న భాండాగారం తెరిచి అక్కడున్న వస్తువులను లెక్కిస్తారని తెలుస్తోంది. -
60లలో యవ్వనంగా కనిపించేలా చేసే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..!
వృధాప్యం అనేది సర్వసాధారణం. వయసు గడిచేకొద్ది ఎవ్వరైనా ఈ స్టేజ్కి రావాల్సిందే. అందుకోసం మార్కెట్లో లభించే వేల ఖరీదు చేసే కాస్మెటిక్స్కి డబ్బులు తగలేస్తుంటారు. పలు వర్కౌట్లని, డైట్లని నానాతంటాలు పడుతుంటారు. అయితే అవేమీ లేకుండానే, ఎలాంటి కష్టం లేకుండా తన తల్లి 60లలో కూడా యంగ్గా కనిపిస్తోందని చెబుతున్నాడు డిజిటల్ క్రియేటర్. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో కూడా షేర్ చేసుకున్నాడు. అదెంటో చూద్దామా..వృద్ధాప్యాన్ని ఆపడం అంత ఈజీకాదు కానీ నియంత్రించొచ్చు. అది కూడా సహజమైన వాటితోనే చెయ్యొచ్చట. వయసు రీత్యా చర్మం పలు మార్పులకు లోనవ్వుతుంది. ఆ మార్పులను నియంత్రించగలిగితే నిగనిగలాడే కాంతివంతమైన చర్మం మన సొంతం అవుతుందట. అందుకు నిద ర్శనం తన తల్లేనని డిజి టల్ క్రియేటర్ రోహిత్ బోస్ చెబుతున్నాడు. ఆమె 64 ఏళ్ల వయసులో కూడా యంగ్గా ఉంటుందని, అలా అని బోటాక్స్ ట్రీట్మెంట్, జిమ్ వంటి వర్కౌట్లు ఏమి చెయ్యదని చెబుతున్నాడు. అందుకోసం ఆరోగ్యకరమైన ఫుడ్స్ అంటూ ప్రత్యేకంగా ఏమి తీసుకోదని కూడా తెలిపారు. అయినా ఇంతలా ఆమె అందంగా కనిపించడానికి ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్సేనని చెప్పుకొచ్చారు. అవేంటంటే..బొప్పాయి: విటమిన్లు ఏ, సీ, ఈ, కే పుష్కలంగా ఉంటాయి. ముఖంపై గీతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అవిసె గింజలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్తో నిండిన అవిసె గింజలు చర్మాన్ని ఆర్ద్రీకరణ, స్థితిస్థాపకతకు మద్దతునిస్తాయి. దీంతో చర్మం బొద్దుగా, మృదువుగా ఉంచుతాయి.గుమ్మడి గింజలు: జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న గుమ్మడికాయ గింజలు కణాల పునరుద్ధరణను ప్రోత్సహిస్తాయి, పైగా వృద్ధాప్యంతో పోరాడుతాయి.కొబ్బరి నీరు: ఈ సహజ హైడ్రేటర్ సైటోకినిన్లతో నిండి ఉంటుంది. ఇది కణాల పెరుగుదల, వృద్ధాప్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని తాజాగా హైడ్రేట్గా ఉంచుతుంది.అల్లం: యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన అల్లం చర్మపు రంగును సమంగా ఉంచడంలో సహాయపడటమే గాక వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది.పసుపు: పసుపులోని కర్కుమిన్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యగా ముడతలు తగ్గించి,యవ్వనపు ఛాయను ప్రోత్సహిస్తుంది.వైద్యులు సైతం ఇలాంటి ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు. బొప్పాయి చర్మానికి, ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇక అవిసెగింజలు చర్మాన్ని కోమలంగా ఉంచడంలోనూ, జీర్ణక్రియకు మంచిదని చెబుతున్నారు. ఈ ఆహారాలు స్కిన్ టోన్ని మంచిగా ఉంచినప్పటికీ వ్యాయామాలు కూడా చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెబుతున్నారు. (చదవండి: పాత జీన్స్ ప్యాంటులతో స్లీపింగ్ బ్యాగ్లు..ఒక్కో జీన్స్కి ఏకంగా..!) -
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ రౌడీ హీరోగా పేరుగాంచిన విజయ్ దేవకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడటానికి మంచి స్టైయిలిష్ లుక్తో కండలు తిరిగిన బాడీతో మంచి ఫిట్నెస్గా ఉంటాడు. అమ్మాయిల కలల రాకుమారుడిలా క్రేజీ లుక్తో ఎట్రాక్ట్ చేస్తుంటాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ రౌడీ హీరో పిట్ నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందామా..!వర్కౌట్లు..కండలు తిరిగిన టోన్డ్ ఫిజిక్ని మెయింటెయిన్ చేసేందుకు తీవ్రమైన వ్యాయామాలు చేస్తుంటారు. ముఖ్యంగా అధిక బరువులు, కార్డియో ఫంక్షన్లకు సంబంధించిన వ్యాయామాలు ఎక్కువగా చేస్తుంటాయడు. ప్రతిరోజు కనీసం రెండు గంటలు వర్కౌట్లకు కేటాయిస్తాడు. ముఖ్యంగా మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉండేలా యోగా, మెడిటేషన్ వంటివి తప్పనిసరి. డైట్ ప్లాన్..విజయ్ చాలా స్ట్రిక్ట్ డైట్ ప్లాన్ని ఫాలో అవుతాడు. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాడు. ముఖ్యంగా జీవక్రియను చురుకుగా ఉంచేందుకు అతిగా తినకుండా ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు. ముఖ్యంగా రోజంతా చిన్న చిన్నగానే భోజనం తీసుకుంటాడు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడు. హైడ్రేటెడ్గా ఉండటానికి పుష్కలంగా నీరు తాగుతుంటాడు.ఇక్కడ విజయ్ దేవరకొండలా పిట్గా ఉండాలంటే మంచి ఫిజిక్, తీవ్రమైన వర్కౌట్లు, స్ట్రిక్ట్ డైట్ ప్లాన్లు అవసరం అనేది గ్రహించాలి. అలా అని ఎలా పడితే అలా చేసేయ్యకూడదు. ఫిట్నెస్ కోచ్లు, ఆరోగ్య నిపుణులు పర్యవేక్షణలో సలహాలు, సూచనలతో సరైన విధంగా వర్కౌట్లు చేయాల్సి ఉంటుంది. అలాగే అందుకు తగ్గట్టుగా తీసుకునే డైట్ కూడా నిపుణుల సలహాలు మేరకు తీసుకోవాలినేది గ్రహించాలి. అందరికి ఒకలాంటి డైట్ప్లాన్లు వర్కౌట్లు సరిపోవు. ఇక్కడ ఆయా వ్యక్తుల ఆరోగ్య చరిత్ర, ఫేస్ చేసే హెల్త్ సమస్యలు తదితరాలను పరిగణలోనికి తీసుకుని ఎలాంటి వర్కౌట్ సెషన్లు మంచివి, ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచిది అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాటన్నింటిని పరిగనలోనికి తీసుకుని ఫాలో అవ్వడం మంచిది. (చదవండి: భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!) -
సిక్సర్ల బ్యాటర్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
ప్రముఖ స్టార్ క్రికెటర్ రోహిత్ గురునాథ్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలోకి బ్యాట్తో దిగడంతోనే ప్రత్యర్థులను మట్టికరిపించేలా సిక్స్ర్లతో చెలరేగిపోతాడు. విధ్వంసకర బ్యాట్సమెన్గా ఈ హిట్మ్యాన్కి పేరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. అంతేగాదు రోహిత్ టీమిండియా జట్టు కెప్టెన్గా మూడు ఫార్మాట్లలో ఆడి తొలి సిరీస్ల్లోనే ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అలాంటి విధ్వంసకర బ్యాట్సమెన్ రోహిత్ ఫిట్నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందామా..! క్రీడాకారులు మంచి ఆటతీరుని కనబర్చాలంటే ఫిట్గా ఉండాల్సిందే. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తేనే మంచి ఆట తీరుని కనబర్చగలరు. మరి ఈ దిగ్గజ ఆటగాడు రోహిత్ ఫిట్నెస్ సీక్రెట్, ఫాలో అయ్యే డైట్ ఏంటో సవివరంగా చూద్దామా..! డైట్.. రోహిత్ పోషకాహారంతో కూడిన ఆరోగ్యకరమైన డైట్ని ఫాలో అవ్వుతాడు. తన డైట్లో తప్పనిసరిగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అల్పాహరంలో రోహిత్ తప్పనిసరిగా గుడ్లు, ఓట్స్, పండ్లను తింటాడు. సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాడు. మధ్యాహ్నాం లంచ్లో తప్పనిసరిగా బ్రౌన్ రైస్, చికెన్, కూరగాయాలు తీసుకుంటాడు. రాత్రిపూట తప్పనిసరిగా కాల్చిన చేపలు, సలాడ్, ఉడికించిన కూరగాయాలు తీసుకుంటాడు వర్కౌట్లు.. ఫిట్గా ఉండేలా శరీరంలో చెడు కొలస్ట్రాల్ చేరకుండా జాగ్రత్త పడతాడు. అలాగే ఇన్సులిన్ స్థాయిలు సమంగా ఉండేలా డైలీ శరీరానికి కావాల్సిన వర్కౌట్లు చేస్తుంటాడు. ఎక్కువ సమయం తన ట్రైనర్తో కలిసి వ్యాయామ శాలలో గడుపుతాడు. కోర్ వర్కౌట్లపై దృష్టిపెడతాడు. ఇది కండరాల స్థాయిని మెరుగుపరుస్తుంది. బరువుని అదుపులో ఉంచుతుంది. నిజానికి రోహిత్ కెరియర్ ప్రారంభంలో ఫిట్నెస్లో అంత ప్రావీణ్యం పొందలేదు. రానురాను ఆటను మెరుగుపరచుకునే క్రమంలో తన ఫిట్నెస్పై దృష్టిసారించడం ప్రారంభించినట్లు ఓ ఇంటర్యూలో వెల్లడించారు. ఇక రోహిత్ శాకాహార కుటుంబంలో జన్మించినప్పటికీ ఫిట్నెస్గా ఉండి మెరుగ్గా ఆడేందుకు నాన్వెజ్ తీసుకోక తప్పలేదు. (చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే డైట్ ఇదే!) -
సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి త్రీ సీక్రెట్స్ ఇవే!
చాలా మంది వృద్ధులు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించిన పలు ఘటనలను చూశాం. వాళ్లు అంతకాలం ఎలా జీవించారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి మరీ అంతకాలం ఎలా జీవించారని కూడా అనుకుంటాం. అందకు రహస్యలివే అంటూ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఓ వీడియోని షేర్ చేశారు. ఆయన ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గ్ ఉంటూ మంచి మంచి వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అలానే ఈసారి ఆరోగ్యగానికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ డాక్టర్ సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవిత రహాస్యలను వెల్లడించారు. ఆ వీడియోలో డాక్టర్ నిషిత్ చోక్సీ అనే వ్యక్తి 90 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు గల రోగులతో సంభాషణ ద్వారా తాను తెలుసుకున్న విషయాలను గురించి చెప్పుకొచ్చారు. దాదాపు తన పేషంట్లలో చాలామంది సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి సంతోషం, సంతృప్తి ప్రాముఖ్యతల గురించి నొక్కి చెప్పినట్లు తెలిపారు. వాళ్లందరూ చెప్పిన మరో కామన్ పాయింట్ వ్యాయామం అని అన్నారు. చక్కటి వ్యాయామం దీర్ఘాయువుని నిర్ణయిస్తుందని వారంతా చెప్పినట్లు తెలిపారు. తన పేషంట్లలో కొంతమంది వృద్ధులు కర్ర లేకుండా నడవగలరని, కొందరూ అసలు కళ్లద్దాలు ఉపయోగించకుండా పుస్తకాలు, పేపర్లు చదవగలరని చెప్పుకొచ్చారు. వారిలో చాలామంది తమ పనులను వారే స్వయంగా చేసుకుంటారు. అంతేగాదు చాలామంది మోతాదుకు మించి తిని ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారని అన్నారు. ఓ వయసు వచ్చాక మితంగా తినాలని, అలాగే ఎక్కువ ఒత్తిడిగా ఉన్న సమయంలో మనం తీసుకునే ఆహారంలో తేడాలు ఉంటాయని కూడా చెప్పారన్నారు. "ఎందుకంటే.. ఒత్తిడిగా ఉంటే కొందరు తినరు, మరికొందరూ అతిగా తింటారు. ఇవి రెండూ కూడా ప్రమాదమే. పిడుగు వచ్చి మీద పడిపోయేంత సమస్య అయినా.. తాపీగా జరేది జరగక మానదు..నా చేతిలో ఏమిలేదు అనేది సత్యాన్ని గట్టిగా విశ్వసించాలి. అప్పుడూ ఎంతటి ఒత్తడి అయినా తట్టుకుంటారు, నిదానంగా తినేందుకు యత్నిస్తారు. అప్పుడు రక్తపోటు పెరగదు. కాబట్టి జీవితంలో సంతోషం, సంతృప్తికి ప్రాధాన్యత ఇస్తూ వీలైనంతలో వ్యాయామం చేయండి చాలు. ఈ మూడే సుదీర్ఘ కాలం ఆరోగ్యంగా జీవించడానికి కీలకమైనవని డాక్టర్ నిషిత్ అన్నారు. అందుకు సంబంధించిన వీడియోకి "సుదీర్ఘ జీవితానికి రహస్యాలు" అనే క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేశారు హర్ష గోయెంకా. ఈ వీడియోని చూసిన నెటిజన్లు..ఆ వైద్యుడు చెప్పిన వాటితో ఏకీభవిస్తూ ఆరోగ్యమే అసలైన సంపద అంటూ పోస్టులు పెట్టారు. అలాగే మెదడు షార్ప్గా ఉండేలా పజిల్స్ లేదా కొత్త భాషను నేర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటే కూడా ఆరోగ్యంగా ఉంటామని పోస్టుల్లో పేర్కొన్నారు. Simple secrets to long life… pic.twitter.com/nuVzuGGR2C — Harsh Goenka (@hvgoenka) March 27, 2024 (చదవండి: అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!) -
రహస్య ప్రాజెక్ట్.. ఫేస్బుక్పై సంచలన ఆరోపణలు
Facebook Secret Project: మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని ఫేస్బుక్పై సంచలన ఆరోపణలకు సంబంధిచిన పత్రాలు బయటకొచ్చాయి. స్నాప్చాట్, యూట్యూబ్, అమెజాన్ వంటి ప్రత్యర్థి ప్లాట్ఫామ్ల యూజర్లపై ఫేస్బుక్ స్నూపింగ్ (అనైతిక విశ్లేషణ) చేసినట్లు ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు కొత్త పత్రాలను విడుదల చేసింది. ‘టెక్ క్రంచ్’ కథనం ప్రకారం.. స్నాప్చాట్ (Snapchat) యాప్కి, తమ సర్వర్లకు మధ్య నెట్వర్క్ ట్రాఫిక్ను అడ్డగించడానికి, డీక్రిప్ట్ చేయడానికి ఫేస్బుక్ 2016లో 'ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్' అనే రహస్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోర్టు పత్రాల ప్రకారం.. యూజర్ బిహేవియర్ను అర్థం చేసుకోవడానికి, స్నాప్చాట్పై ప్రయోజనాన్ని పొందేందుకు ఫేస్బుక్ ఈ చొరవను రూపొందించింది. ఈ పత్రాల్లో రహస్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించిన ఫేస్బుక్ అంతర్గత ఈమెయిల్లు కూడా ఉన్నాయి. 2016 జూన్ 9 నాటి అంతర్గత ఈమెయిల్లో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ స్నాప్చాట్లో ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ దానిలో విశ్లేషణలను పొందాలని ఉద్యోగులను ఆదేశించినట్లుగా ఉంది. దీంతో నిర్దిష్ట సబ్డొమైన్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగించడానికి 2013లో ఫేస్బుక్ ద్వారా పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ‘ఒనావో’ను ఉపయోగించాలని ఫేస్బుక్ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఒక నెల తర్వాత, వారు ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫారమ్లలో ఇన్స్టాల్ చేయగల ప్రతిపాదన కిట్లను అందించారు. ఈ ప్రాజెక్ట్ను అమెజాన్, యూట్యూబ్ యూజర్ల డేటా కోసం విస్తరించారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ల బృందంతో పాటు దాదాపు 41 మంది న్యాయవాదులు ప్రాజెక్ట్ ఘోస్ట్బస్టర్స్లో పనిచేశారు. ఓనావోను ఉపయోగించడానికి ఫేస్బుక్ టీనేజర్లకు రహస్యంగా డబ్బు చెల్లిస్తోందని దర్యాప్తులో వెల్లడైన తర్వాత, ఫేస్బుక్ 2019లో ఒనావోను మూసివేసింది. -
సీక్రెట్గా వివాహం చేసుకున్నారా?
హీరోయిన్ తాప్సీ సీక్రెట్గా వివాహం చేసుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ రిలేషన్ షిప్లో ఉన్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మథియాస్, తాప్సీ వివాహం చేసుకున్నట్లుగా గతంలో కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను తాప్సీ ఖండించారు. అయితే తాజాగా మథియాస్, తాప్సీల వివాహం తెరపైకి వచ్చింది. అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో మథియాస్, తాప్సీ వివాహబంధంతో ఒక్కటయ్యారని బాలీవుడ్ సమాచారం. వీరి పెళ్లి వేడుకలు ఈ నెల 20నే మొదలయ్యాయని, 23న వివాహం జరిగిందని టాక్. తాప్సీ మెయిన్ లీడ్గా నటించిన సినిమాలతో అసోసియేట్ అయిన కనికా థిల్లాన్ తో పాటు కొందరు బాలీవుడ్ నటీనటులు తాము ఓ పెళ్లి వేడుకలో పాల్గొంటున్నామన్నట్లుగా సోషల్ మీడియాలో హింట్ ఇచ్చారు. దీంతో వీరు హాజరైంది తాప్సీ వివాహానికే అనే ప్రచారం జరుగుతోంది. మరి.. తాప్సీ, మథియాస్ పెళ్లి జరిగిందా అనే విషయంపై ఆ ఇద్దరే క్లారిటీ ఇవ్వాలి. -
Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో
సినిమాలు పాత కథలను తవ్వి పోస్తున్నాయి. చరిత్ర గతిని వెండి తెర మీద పునఃసృష్టిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో ఘట్టాలు. ఎందరో త్యాగమూర్తులు. కాని పురుషుల బయోపిక్లు వచ్చినట్టుగా స్త్రీలవి రాలేదు. తాజాగా విడుదలైన ‘అయ్ వతన్ మేరే వతన్’ సినిమా నాటి వీర వనిత ఉషా మెహతా జీవితాన్ని చూపింది. బ్రిటిష్కు వ్యతిరేకంగా సీక్రెట్ రేడియో నడిపిన ఉషా మెహతా ఎవరు? ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో కాలింగ్ ఆన్ 42.34 మీటర్స్ సమ్వేర్ ఇన్ ఇండియా’... ఈ అనౌన్స్మెంట్ బ్రిటిష్ వారిని గడగడలాడించింది. మునికాళ్ల మీద పరిగెత్తిచ్చింది. ఒక బుల్లి రహస్య రేడియో స్టేషన్ని, దాని నిర్వాహకులను అరెస్ట్ చేయడానికి పిచ్చెక్కినట్టు తిరిగేలా చేసింది. మూడు నెలల పాటు బ్రిటిష్వారిని ముప్పుతిప్పలు పెట్టిన ఆ రేడియో నిర్వాహకురాలి పేరు ఉషా మెహతా. గాంధీ పిలుపు విని... ఉషా మెహతా గుజరాత్లోని సూరత్ సమీపంలో ఉన్న సారస్ అనే ఊళ్లో 1920లో జన్మించింది. ఐదేళ్ల వయసులో గాంధీజీని అహ్మదాబాద్లో చూసింది. 8 ఏళ్ల వయసులో వాళ్ల ఊరి దగ్గర గాంధీజీ చరఖా కార్యక్రమం నిర్వహిస్తే ఉషా పాల్గొని కొద్దిసేపు చరఖా తిప్పింది. బాల్యంలోనే గాంధీజీ మీద గొప్ప భక్తి పెంచుకున్న ఉషా 12 ఏళ్ల వయసులో తండ్రి వృత్తిరీత్యా బొంబాయికి మారడంతో తన దేశభక్తిని చాటుకునే అవకాశం పొందింది. డూ ఆర్ డై 1942 ఆగస్టు 8న బొంబాయిలో గాంధీజీ క్విట్ ఇండియా పిలుపునిచ్చారు. ‘డూ ఆర్ డై’ లేదా ‘కరో యా మరో’ నినాదాలు మిన్నంటాయి. ‘ఇక భారత ప్రజలు నాయకుల కోసం ఎదురు చూడొద్దు. ప్రజలే నాయకులు’ అని గాంధీజీ పిలుపునిచ్చారు. 22 ఏళ్ల ఉషా మెహతా తన స్నేహితులైన విఠల్ దాస్ ఖాకడ్, చంద్రకాంత్ ఝావేరీ, బాబూభాయ్ ఠక్కర్లతో కలిసి ఆ మీటింగ్కు వెళ్లింది. ఉత్తేజితురాలైంది. అప్పటికే స్వతంత్రోద్యమ వార్తల మీద బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉద్యమం ఉధృతం కావాలంటే రేడియో మాధ్యమం ద్వారా వార్తలు అందించాల్సిన అవసరం ఉందని ఉషా మెహతా తన స్నేహితులతో చెప్పింది. దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలని పిలుపునిచ్చింది. రహస్య కాంగ్రెస్ రేడియో బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జిగా పని చేస్తున్న తండ్రి నివారించినా వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఉషా బొంబాయిలో షికాగో రేడియో ట్రాన్స్మిషన్ను చూస్తున్న మరో మిత్రుడు మోత్వాని సహాయంతో సొంత ట్రాన్స్మిటర్ను సంపాదించింది. మిత్రులతో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని రేడియో స్టేషన్గా మలిచింది. ఆగస్టు 27, 1942న మొదటి చరిత్రాత్మక ప్రసారాన్ని సొంత గొంతుతో చేసింది. ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో 42.34 మీటర్స్ సమ్వేర్ ఇన్ ఇండియా’... అంటూ స్వాతంత్రోద్యమ వార్తలు వినిపించింది. ఆ క్షణం నుంచి ఆ రహస్య రేడియో కోసం బ్రిటిష్ అధికారులు, పోలీసులు కంటి మీద కునుకు లేకుండా వెతకసాగారు. ప్రసారాలు బొంబాయి నుంచే నిర్వహిస్తున్నా దేశంలో ఎక్కడి నుంచి అవుతున్నాయో తెలియక గింజుకున్నారు. మూడు నెలలు రహస్య రేడియో ప్రసారాలు మూడు నెలలు సాగాయి. కాని పరికరాలు సమకూర్చిన మోత్వాని లొంగిపోయి రేడియో స్టేషన్ చిరునామా చెప్పేశాడు. నవంబర్ 12, 1942న పోలీసులు దాడి చేసి ఉషా మెహతాను అరెస్ట్ చేశారు. ఆరు నెలల పాటు ఆమెను ఇంటరాగేట్ చేశారు. 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉషా ఏ మాత్రం జంకలేదు. 1946 నాటి మధ్యంతర ప్రభుత్వ హయాంలో మురార్జీ దేశాయ్ హోమ్ మినస్టర్గా ఉండగా ఆమె విడుదల జరిగింది. కాని జైలు జీవితం ఆమె ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసింది. బయటకు వచ్చాక ఆమె చదువు కొనసాగించి ముంబై యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి 1980లో రిటైర్ అయ్యింది. గాంధీజీ భావజాలాన్ని ప్రచారం చేస్తూ 2000 సంవత్సరంలో తుది శ్వాస విడిచింది. ఉషా మెహతా జీవితం ఆధారంగా నిర్మించిన బయోపిక్ ‘అయ్ వతన్ మేరే వతన్’ అమేజాన్లో మార్చి 21న విడుదలైంది. -
93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!
ఓ వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా దేహ ధారుడ్యంతో పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఉన్నారు. అతడి శరీరాకృతిని చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. ఇంత అద్భుతమైన ఫిట్నెస్కి గల కారణాలేంటని అధ్యయనం చేసే పనిలో పడ్డారు పరిశోధకులు. ఐరిష్కి చెందిన 93 ఏళ్ల రిచర్డ్ మెర్గాన్ అనే వ్యక్తి చూడటాని 40 ఏళ్ల వ్యక్తిలా చురుగ్గా ఉన్నాడు. పైగా 70 ఏళ్ల వయసులో రోయింగ్(పడవ రేస్)ను ప్రారంభించినప్పటికీ నాలుగుసార్లు చాంపియన్గా నిలిచి ఆశ్చర్యపరిచాడు. అతడిని చూస్తే యువకుడి మాదిరిగా మంచి శరీరాకృతితో ఉంటాడు. శాస్త్రవేత్తలు సైతం అతడి హృదయ స్పందన రేటుని చూసి ఆశ్చర్యపోతున్నారు. మోర్గాన్ ఫిట్నెస్ ప్రయాణం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై పరిశోధకులు అధ్యయనం చేయడంతో ఒక్కసారిగా అతను వార్తల్లో నిలిచాడు. అంతేగాదు అతని శరీరంలోని 80% కండర ద్రవ్యరాశి, గుండె పనితీరుని ఆశ్చర్యపోతున్నారు. అచ్చం 40 ఏళ్ల వ్యక్తిని పోలి ఉందని చెప్పారు. అతను మనందరికీ ప్రేరణ అని చెబుతున్నారు. అతని జీవన శైలి, ఆహార పద్ధతులు, చేసే వ్యాయమాలు తదితరాలను పరిశీలించింది పరిశోధకుల బృందం. అంతేగాదు అతడి శారీరక పనితీరు, పోషకాహారం తీసుకోవడం తదితరాలను బయో ఎలక్ట్రిక్ ఇంపెడెన్స్ ద్వారా అంచనా వేసింది. ఇక అతను ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డయాక్సైడ్ వదలడం, హృదయ స్పందన రేటు, తదితర వాటిని రోయింగ్ ఎర్గోమీటర్తో కొలిచారు. అందుకు సంబంధించిన అధ్యయనం గురించి గత నెలలో జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీలో ప్రచురితమయ్యింది. ఇక మోర్గాన్ తాను 73 ఏళ్ల వయసులో వ్యాయామం ప్రారంభించానని, ఆ తర్వాత రోయింగ్ క్రీడలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చానని చెప్పుకొచ్చారు. తనకు వ్యాయామం చేయడంలో ఆనందం ఉందని తెలిశాక ఇక ఆపలేదని, అదే ఈ రోయింగ్ క్రీడో పాల్గొనేలా చేసిందని చెప్పారు మోర్గాన్. వ్యాయామం మంచి ఫిట్నెస్గా ఉండేలా చేయడమే గాక సర్వసాధారణంగా వయసు రీత్యా వచ్చే శరీరంలోని వృద్ధాప్య ప్రభావాలను అరికడుతుందని మోర్గాన్పై జరిపిన పరిశోధనలో తేలిందని చెబుతున్నారు పరిశోధకులు. ఇక అతను మంచి ఫిట్నెస్లో.. వ్యాయామం స్కిప్ చేయకపోవడం, బరువుకి సంబంధించిన వ్యాయామాలు, ప్రోటీన్ ఆహారం తదితరాలు తన రోజూ వారీ జీవశైలిలో ఉండే ప్రాథమిక మూల స్థంభాలని చెప్పారు పరిశోధకులు. ఇంకేందుకు ఆలస్యం వయసుతో సంబంధం లేకుండా చక్కగా మంచి వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా ఉండటమే గాక వృధాప్య ప్రభావం పడకుండా చూసుకోండి. (చదవండి: ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్మెంట్ని ఫ్రాన్స్ అధ్యక్షుడికి చూపించిన ప్రధాని మోదీ!) -
‘శామ్ అవుట్’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్ వాట్సాప్ చాట్
చాట్ జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్మన్ తొలగింపు వ్యవహారం టెక్ ప్రపంచంలో అలజడి సృష్టించింది. ఈ ఉదంతం మార్క్ జుకర్బర్గ్, డ్రూ హ్యూస్టన్లతో సహా 100 మందికి పైగా సిలికాన్ వ్యాలీ సీఈవోలు ఉన్న ప్రైవేటు వాట్సాప్ చాట్ గ్రూప్లో హల్చల్ చేసింది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓపెన్ఏఐ సీఈఓ పదవి నుంచి శామ్ ఆల్ట్మన్ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో ఆల్ట్మన్ను తిరిగి వెనక్కి తీసుకున్నారు ఆ సంస్థ బోర్డ్ సభ్యులు. అయితే ఆల్ట్మన్ అనూహ్య తొలగింపు ఉదంతం.. మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, డ్రాప్బాక్స్ సీఈవో డ్రూ హ్యూస్టన్తో సహా యూఎస్లోని పలు అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల సీఈవోలను దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన ఓ కథనం ప్రకారం.. నవంబర్ 17న ఆల్ట్మన్ను ఓపెన్ఏఐ తొలగించినట్లు వార్తలు వెలువడినప్పుడు, సిలికాన్ వ్యాలీ కంపెనీలకు చెందిన 100 మందికి పైగా చీఫ్ ఎగ్జిక్యూటివ్లతో కూడిన ఈ ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్లో ఒక సందేశం వచ్చింది. ఇంతకీ ఏంటది? సీఈవోల వాట్సాప్ గ్రూప్లో ఆ రోజు "శామ్ అవుట్" అని ఓ సందేశం వచ్చింది. దీనిపై గ్రూప్ సభ్యులు వెంటనే స్పందించారు. శామ్ ఏమి చేశాడు.. అంటూ రకరకాల ప్రశ్నలు వచ్చాయి. ఉన్నంటుండి తొలగించడానికి శామ్ ఆల్ట్మన్ చేసిన తప్పేంటి అనేదానికిపై అనేక ఊహాగానాలు బయలుదేరాయి. సత్య నాదెళ్లకు అర్జెంట్ కాల్! ఓపెన్ఏఐ సంస్థకు అతిపెద్ద పెట్టుబడిదారైన మైక్రోసాఫ్ట్లో కూడా దీనిపై అలజడి చలరేగింది. మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కెవిన్ స్కాట్కి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటి నుంచి కాల్ వచ్చినట్లు వాట్సాప్ చాట్లో ఉంది. ఆల్ట్మన్ను తొలగించినట్లు ఓపెన్ఏఐ బోర్డు ప్రకటించబోతోందని, తానే తాత్కాలిక చీఫ్గా ఉండనున్నట్లు ఆ కాల్లో ఆమె స్కాట్తో చెప్పినట్లు సందేశంలో పేర్కొన్నారు. దీంతో స్కాట్ వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు అర్జెంట్ కాల్ చేశారట. ఆ సమయంలో ఆయన రెడ్మండ్లోని మైక్రోసాఫ్ట్ హెడ్క్వార్టర్స్లో టాప్ ఎగ్జిక్యూటివ్లతో సమావేశంలో ఉన్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిన సత్య నాదెళ్ల తక్షణమే ఓపెన్ఏఐ సీటీవో మీరా మురాటికి ఫోన్ చేసి బోర్డు నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని ఆరా తీసినట్లు వాట్సాప్ సందేశాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆమె నుంచి సమాధానం లేదు. దీంతో ఆయన ఓపెన్ఏఐ ప్రధాన స్వతంత్ర డైరెక్టర్ డీఏంజెలోకి కాల్ చేసి ఏం జరిగిందని అడిగినా కారణం తెలియరాలేదు. అయితే తమతో ఆల్ట్మన్ సమన్వయం సక్రమంగా లేదని మాత్రమే బోర్డు చెప్పినట్లు వాట్సాప్ సందేశాల సారాంశం. -
సాయి పల్లవికి పెళ్లి అయిపోయిందా!..క్లారిటీ ఇదే..
-
శిల్పంలా ఉండే శృతి హాసన్ బ్యూటీ సీక్రెట్ ఇదేనా!
కమలహాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనాతి కాలంతో మంచి హిరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి నూటికి నూరు మార్కులు కొట్టేసింది. ఉత్తమ నటి, సైమా వంటి ప్రతిష్టాత్మక అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. చక్కటి ముఖ సౌందర్యంతో చూడచక్కని రూపంలో ఉండే శృతి తన గ్లామర్ కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందట. ఎక్కువగా సహజసిద్ధమైన నూనెలనే వాడతానని చెబుతోంది. తన మృదువైన చర్మం కోసం ఏం చేస్తుందో వెల్లడించింది కూడా. ఇంతకీ ఆమె అందమైన చర్మం వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..అలోవెరా.. బంగాళదుంప.. ఈ రెండే నా బ్యూటీ సీక్రెట్స్! మృదువైన చర్మం కోసం వీలైనప్పుడల్లా అలోవెరా జెల్తో ఫేస్ మాస్క్ వేసుకుంటాను. ట్యాన్ లైన్స్ పోగొట్టుకోవడానికి బంగాళదుంప జ్యూస్ని మొహానికి అప్లయ్ చేసి.. అది మొత్తం ఆరిపోయాక చన్నీళ్లతో కడిగేసుకుంటే.. ట్యాన్ అంతా పోయి ఈవెన్ టోన్ వచ్చేస్తుంది. (చదవండి: చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే..ఇలా చేయండి!) -
చైనా కంపెనీ సీక్రెట్ ఆపరేషన్.. రహస్యంగా చిప్ల తయారీ!
అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీ హువాయి టెక్నాలజీస్ ( Huawei Technologies ) చైనా అంతటా రహస్యంగా సెమీకండక్టర్ తయారీ కేంద్రాలను నిర్మిస్తున్నట్లుగా వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న సెమీకండక్టర్ అసోసియేషన్ హెచ్చరించినట్లు బ్లూమ్బెర్గ్ న్యూస్ తాజాగా నివేదించింది. ఈ చైనీస్ టెక్ దిగ్గజం ఏడాది క్రితమే చిప్ల ఉత్పత్తి చేపట్టిందని, ఇందు కోసం ఆ దేశ ప్రభుత్వం నుంచి 30 బిలియన్ డాలర్ల నిధులను సైతం పొందిందని సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెబుతోంది. దేశంలో ఇప్పటికే రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసిన హువాయి మరో మూడు ప్లాంట్లను నిర్మిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. భద్రతాపరమైన సమస్యల కారణంగా 2019లో యూఎస్ వాణిజ్య విభాగం తమ ఎగుమతి నియంత్రణ జాబితాలో హువాయి కంపెనీని చేర్చింది. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెప్పినట్లుగా ఇతర కంపెనీల పేర్లతో హువాయి తయారీ కేంద్రాలను నిర్మిస్తుంటే యూఎస్ ఆంక్షలను అధిగమించి అమెరికన్ చిప్ తయారీ పరికరాలను పరోక్షంగా కొనుగోలు చేస్తుండవచ్చని బ్లూమ్బెర్గ్ రిపోర్ట్ పేర్కొంది. యూఎస్లో హువాయి కంపెనీని ట్రేడ్ బ్లాక్లిస్ట్లో చేర్చారు. దీంతో ఆ కంపెనీకి ఇక్కడి కంపెనీలు విడిభాగాలు, సాంకేతికతను అందించేందుకు వీలు లేదు. సెమీకండక్టర్ చిప్లను తయారు చేయకుండా హువాయి కంపెనీ కట్టడి చేసేందుకు యూఎస్ అధికారులు నియంత్రణలను కఠినతరం చేస్తున్నారు. ఇదీ చదవండి: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి.. -
వన్నె తరగని నయన తార బ్యూటీ రహస్యం ఇదే..ఆ క్రీమ్ లేకుండా..
దక్షిణాది అగ్రకథనాయికగా ఇప్పటికీ చెలమణి అవుతున్న మళయాళి కుట్టి నయనతార. ఆమె తెలుగు, తమిళ, కన్నడ అగ్రకథనాయకుల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో కుర్రాళ్ల కలల రాణిగా మంచి క్రేజీ స్టార్గా వెలుగొందుతోంది. అందంలోనూ, అభినయంలోనూ తనకు తానే సాటి అని పేరుతెచ్చుకుంది. ఆమె డైరెక్టర్ విఘ్నేశ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పైగా ఇద్దరు పిల్లలు(సరోగసి విధానం) తల్లి కూడా. నాలుగు పదుల వయసుకు దగ్గరవ్వుతున్న ఏమాత్రం వన్నెతరగని అందంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె ఇప్పటికీ అందంగా ఉండటం వెనుక దాగున్న రహస్యం ఏంటీ?..ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఇప్పుడూ చూద్దాం. ఆమె ఎక్కువగా ఆయుర్వేదిక్ బ్యూటీ ప్రొడక్ట్స్నే ప్రిఫర్ చేస్తుందట. బాడీ డ్రీహైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు ఎక్కువగా మచినీళ్లు తాగుతుందట. అలాగే బయటకు వెళ్లితే కంప్లసరి సన్స్క్రీన్ లోషన్ రాసుకుంటుందట. అస్సలు అది లేకుండా గడప కూడా దాటనని చెబుతున్నారు నయన్. అంతేకాదు మాయిశ్చరైజర్ని తప్పనిసరిగా వాడతారు. అది ఆమె చర్మాన్ని అందంగా మృదువుగా ఉండేలా చేస్తుంది. ఆమె ఎప్పుడూ విటమిన్ సీ ఎక్కువగా ఉండే.. పండ్లు, పండ్ల రసాలు ప్రతిరోజూ మర్చిపోకుండా తీసుకుంటుందట. వాటి వల్ల.. ఆమె చర్మం మృదువుగా , అందంగా మెరిసేలా చేయడంలో సహాయం చేస్తుందని చెబుతోంది నయన తార. (చదవండి: కీర్తీ సురేష్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
200 ఏళ్ల నేలమాళిగలోకి దూరిన అమ్మాయిలు.. లోపల ఏముందో చూసి..
ఒక యువతికి తమ ఇంటి కింది భాగంలో ఒక రహస్య గది కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులకు, అధ్యాపకులకు తెలిపింది. దీంతో వీరంతా ఆ గదిలోనికి వెళ్లి, లోపల ఏముందో చూసే ప్రయత్నం చేశారు. ఆ గది 1800 శతాబ్దం నాటిదని గుర్తించారు. ఈ ఉదంతం బ్రిటన్లోని నాటింగ్హామ్లో చోటుచేసుకుంది. ది సన్ రిపోర్టును అనుసరించి ఈ నేలమాళిగ 200 ఏళ్ల క్రితం నాటిది. అమ్మాయిలంతా దానిలోనికి వెళ్లి చూడగా వారికి అక్కడ ఒక ఫ్లోర్ కనిపించింది. అక్కడ నాలుగు మూలలా బెంచీలు కనిపించాయి. అలాగే పలు అల్మరాలు కూడా ఉన్నాయి. అది వారికి ఒక స్టోర్ రూమ్ మాదిరిగా కనిపించింది. ఆ యువతి కుటుంబం ఈ ఇంటిలోకి షిష్ట్ అయ్యే సమయంలో వారికి ఈ సంగతి తెలియదు. నాటింగ్హామ్ ట్రెంట్ యూనివర్శిటీ జర్నలిజం విద్యార్థి స్టెఫానీ బెన్నెట్.. కొద్దిపాటి భయాందోళనల వాతావరణం మధ్య తన ఈ నూతన ఆవిష్కరణ ఎలా జరిగిందో మీడియాకు తెలియజేసింది.. ‘అదేమీ పెద్ద గది కాదు. 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కలిగివుంది. ఈ ఆవిష్కరణ ఎంతో ఆసక్తికరంగా సాగింది. లోపల ఏముందో చూడాలనే ఆసక్తితో తామంతా ఒకేసారి ఆ గదిలోనికి ప్రవేశించాం. అయితే ఆ గదిని ఎందుకు వినియోగించేవారో కనుగొనలేకపోయాం’ అని పేర్కొంది. ఈ యువతుల బృందం ఈ విషయాన్ని స్థానిక పురాతత్వ శాస్త్రవేత్తలకు తెలియజేసింది. వారు వెంటనే గుహను సందర్శించారు. అది రెండు శతాబ్ధాల క్రితం నిర్మితమయినదని తెలిపారు. నాటింగ్హామ్ సిటీ కౌన్సిల్ యాక్టింగ్ ఆర్కియాలజిస్ట్ స్కాట్ లోమాక్స్ మాట్లాడుతూ ఆ గుహ ఒక నేలమాళిగ అని తెలిపారు. దానిపైన భవనం నిర్మితమవడాన్ని గమనిస్తే అది 19వ శతాబ్దం నాటిదిగా తెలుస్తున్నదన్నారు. ఈ నేలమాళిక అనేక పురాతన విశేషాలను తెలియజేస్తుందన్నారు. ఇది కూడా చదవండి: ‘ఆరోపణలతో పెరుగుతున్న ఆదరణ’.. ట్రంప్ మరో వింత వ్యాఖ్యానం! -
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్.. కర్లీ హెయిర్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
సినిమాల తోపాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే హిరోయిన్లో ఒకరు అనుపమ పరేమశ్వరన్. ప్రస్తుతం అనుపమ డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో పాటు సైరన్ (తమిళ్) సినిమా తోపాటు ఒక మలయాళ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. తన కర్లీ హెయిర్తో కుర్రకారుకి కునుకు లేకుండా చేసే ఈ మలయాళం భామ తన అందమైన శిరోజాల వెనుక దాగి ఉన్న బ్యూటీ సీక్రేట్ని షేర్ చేసుకుంది. ఈ మేరకు అనుమ మాట్లాడుతూ..ఉంగరాల జుట్టును మేనేజ్ చేయడం చాలా కష్టం కదా.. మరి మీరెలా మేనేజ్ చేస్తుంటారు అని చాలామంది అడుగుతుంటారు నన్ను! నిజమే కర్లీ హెయిర్ని మేనేజ్ చేయడం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడతాను. వీలైనప్పుడల్లా స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో తలను మసాజ్ చేసుకుంటాను. గ్లోయింగ్ స్కిన్ విషయానికి వస్తే.. రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలిపి ముఖానికి అప్లయ్ చేసి.. సున్నితంగా మసాజ్ చేసుకుంటాను. అలా ఒక పదిహేను నిమిషాలు ఉంచేసి.. ముఖం కడుక్కుంటాను.’ – అనుపమ పరమేశ్వరన్ (చదవండి: ఏజెంట్ బ్యూటీ ధరించిన డ్రస్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే!) -
ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్!
బాలీవుడ్ భామ కృతి సనన్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. దిల్లీకి చెందిన ముద్దుగుమ్మ ఆదిపురుష్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఆదిపురుష్ జూన్ 16 రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ భామకు నిరాశే ఎదురైంది. అంతకుముందే మహేశ్ బాబు సరసన నేనొక్కడినే చిత్రంలో నటించింది. అంతే కాకుండా ఈ ఏడాది అల వైకుంఠపురములో రీమేక్గా వచ్చిన షెహజాదా చిత్రంలో కార్తీక్ ఆర్యన్ సరసన కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఘనపత్ పార్ట్-1లో నటించనుంది. (ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్ 2' ఓటీటీ డేట్ వచ్చేసింది, ఎప్పటినుంచంటే?) తాజాగా కృతి సనన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈనెల 27న తన బర్త్ డే సందర్బంగా ఓ సీక్రెట్ను రివీల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదేంటో అభిమానులు గెస్ చేయండి అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఆ వీడియోలో హెచ్ లెటర్తో మొదలవుతుందని క్లూ ఇచ్చేసింది భామ. అయితే ఇది చూసిన అభిమానులు బ్యూటీకి సంబంధించి యాడ్ గురించేనా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఎవరా లక్కీ గాయ్.. అంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు ఫ్యాన్స్ ఏకంగా ఎవరినైనా పెళ్లి చేసుకుంటున్నావా?.. లేకపోతే ప్రభాస్ అన్నను పెళ్లి చేసుకోవచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు. కొందరు నెటిజన్స్ అయితే కొత్త మూవీ గురించి అప్డేట్ ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా కృతి సనన్ తన పుట్టిన రోజు అభిమానులకు ఓ సీక్రెట్ రివీల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కృతి సనన్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. (ఇది చదవండి: నిహారికతో విడాకులు.. తొలిసారి పోస్ట్ చేసిన చైతన్య!) I’m gonna be sharing my birthday with someone special! 🥹 I've kept this secret from you guys for too long! It's been a year and I can't wait for you all to see what I've been working on. Any Guesses??#StayTuned pic.twitter.com/MbPzA15hve — Kriti Sanon (@kritisanon) July 26, 2023 -
200 ఏళ్లనాటి ఫార్మ్హౌస్లో రహస్య భూగృహం.. లోపల ఏముందో చూసేసరికి..
ఒక్కోసారి కొన్ని దశాబ్ధాల పురాతన గృహాలలో అనుకోని విధంగా ఏవైనా లభిస్తే మన ఆశ్చర్యానికి అవధులు ఉండవు. యూకేలోని ఒక టిక్టాకర్ తన తల్లిదండ్రులకు సంబంధించిన 200 ఏళ్ల క్రితం నాటి పురాతన ఫార్మ్హౌస్లోని ఫ్లోర్బోర్డ్ కింద కనిపించిన ఆనవాళ్లు చూసి తెగ ఆశ్చర్యపోయింది. ఇటువంటిది ఒకటి ఉందని ఆమెకు బాల్యంలో ఎప్పుడూ తెలియలేదు. ఇంటి రెనోవేషన్ సందర్భంగా ఆ ఇంటిలో ఒక భూగృహం ఉందని ఆమెకు తెలిసింది. దశాబ్ధాల తరబడి రహస్యంగా.. జెనిఫర్ మల్లాఘన్ ఇటీవల తమ చారిత్రాత్మక పురాతన ఇంటికి సంబంధించిన ఒక వీడియోను టిక్టాక్లో షేర్ చేసింది. ఈ ఇంటిలో తన తల్లిదండ్రులు 6 దశాబ్ధాల పాటు ఉన్నారని, అయితే తనకు ఈ ఇంటిలో భూగృహం ఉందన్న సంగతి ఇన్నాళ్లలో తెలియలేదన్నారు. జెనీఫర్ ఈ వీడియో కాప్షన్లో ‘ఈ భూగృహం ఏళ్ల తరబడి రహస్యంగానే ఉంది’ అని పేర్కొన్నారు. 44 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తవ్వకాల మధ్య నిలుచుని, చేతులతో ఒక పరికరం పట్టుకుని, కంపార్ట్మెంట్ను తెరిచే ప్రయత్నం చేస్తుంటాడు. లోపల చీకటిగా ఉంటూ, ఆ గది భయం గొలిపేదిగా కనిపిస్తుంది. గది తెరుచుకున్నా.. మల్లాఘన్ మాట్లాడుతూ భయపెడుతున్న ఆ గదిలో ఎటువంటి సామాను లేదని తెలిపింది. విలువైన ఖజానా అంతకన్నా లేదని పేర్కొంది. ఈ వీడియో చూసిన ఒక యూజర్ ఈ గదిని రెనోవేషన్ చేస్తారా? అని అడగగా, దానికి జవాబుగా ఆమె ఆ గది రెనోవేషన్ చేయబోమని, దానిలో ఏముందో చూడాలని అనుకున్నామని తెలిపింది. గతంలోనూ బయల్పడిన భూగృహాలు ఈ విధంగా భూగృహం బయటపడటం ఇదేమీ తొలిసారి కాదు. గత నెలలోనే ఒక రెడిట్ యూజర్ తమ కొత్త ఇంటిలో హిడెన్ రూమ్లో కొన్ని ప్రైవేట్ వస్తువులు లభ్యమయ్యాయని తెలిపారు. 1970-1980ల మధ్యకాలం నాటి ఈ గదిలో కొన్ని పురాతన వస్తువులతో పాటు ఒక బీరుబాటిల్ కూడా దొరికిందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోని ఆ ముగ్గురు పాస్పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారెవరో తెలిస్తే.. -
సురోవికిన్ కూడా వాగ్నర్ సభ్యుడే
న్యూయార్క్: రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ఘటన అక్కడి మిలటరీలో లుకలుకలను ఒకటొకటిగా బయట పెడుతోంది. తాజాగా, రష్యా టాప్ మిలటరీ కమాండర్ జనరల్ సెర్గెయ్ సురోవికిన్ వాగ్నర్ గ్రూప్లో రహస్య వీఐపీ సభ్యుడని తెలిపే కొన్ని పత్రాలు దొరికినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. వాగ్నర్ వీఐపీ సభ్యుడిగా సురోవికిన్ పేరు 2018లో నమోదైనట్లు అందులో తెలిపింది. ఆయనతోపాటు మరో 30 మంది రష్యా సీనియర్ మిలటరీ, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వాగ్నర్ వీఐపీ సభ్యులని పేర్కొంది. వాగ్నర్ సభ్యుడిగా సురోవికిన్ ఉన్నారనేందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేనప్పటికీ, రష్యా సైనిక బలగాల్లోని చాలా మంది సీనియర్ అధికారులు వాగ్నర్ గ్రూప్తో దగ్గరి సంబంధాలు సాగించేందుకు అవకాశం ఉందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్లే వాగ్నర్ కిరాయి సైనికులు రొస్తోవ్లోని కీలక మిలటరీ బేస్నుæ శ్రమ లేకుండా స్వాధీనం చేసుకోగలిగారన్న అనుమానా లున్నాయి. తిరుగుబాటు అనంతరం సురోవికిన్ కనిపించకుండా పోయారు. ప్రిగోజిన్ తిరుగుబాటు విషయం ఆయనకు తెలుసునంటూ న్యూయార్క్టైమ్స్ కథనం పేర్కొంది. ప్రిగోజిన్ను తిరుగుబాటు ఆపేయాలంటూ విడుదల చేసిన వీడియోలో సురోవికిన్ తడబడుతూ మాట్లాడుతున్నట్లు కనిపించారు. దీంతో, ఆయన మానసిక ఆరోగ్యంపైనా అనుమానాలున్నాయి. జనర ల్ ఆర్మగెడ్డాన్గా పిలుచుకునే సురోవికిన్ అధ్యక్షుడు పుతిన్కు నిన్నటిదాకా నమ్మినబంటు. తాజా పరిణామాలతోనూ ఆయన్ను పుతిన్ నమ్ముతారా అన్నది తేలాల్సి ఉంది. -
బెడ్ రూమ్ నుంచి బాత్రూమ్ వరకు.. ఆ రహస్య పత్రాల్లో ఏముందంటే..?
మయామి: అమెరికా రహస్య పత్రాల కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై నమోదైన నేరాభియోగాల్లో ఎన్నో ఊహకందని అంశాలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ తనతో పాటు గుట్టలు గుట్టలుగా రహస్య పత్రాలను కార్డ్బోర్డ్ బాక్సుల్లో ఉంచి ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో ఎస్టేట్లో ఉంచారు. ఆ ఎస్టేట్లో ఆయన ఆ పత్రాలను ఉంచని స్థలమే లేదంటే అతిశయోక్తి కాదు. బెడ్ రూమ్, బాల్రూమ్ (డ్యాన్స్లు చేసే గది), బాత్రూమ్, ఆఫీసు రూమ్, స్టోరేజీ రూమ్ ఇలా ప్రతీ చోటా దాచి ఉంచారు. చివరికి టాయిలెట్లో షవర్పైన, సీలింగ్లో ఆ బాక్సుల్ని ఉంచడం ఫొటోల్లో కనిపించింది. కీలకమైన పత్రాలను కూడా ట్రంప్ నిర్లక్ష్యంగా నేలపై పడేశారని అభియోగాల్లో వివరించారు. మొత్తం 13 వేలకు పైగా రహస్య పత్రాలు ట్రంప్ ఎస్టేట్లో లభిస్తే, అందులో 300 పత్రాలు అత్యంత రహస్యమైనవి ఉన్నాయి. ప్రాసిక్యూషన్ ట్రంప్పై 37 అభియోగాలను నమోదు చేసింది. కీలక సమాచారం.. ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య ప్రాంతాల్లో దేశ భద్రత, సైనిక వ్యవస్థకి సంబంధించిన కీలక సమాచారం ఉంది. అమెరికా అణు కార్యక్రమాలు, అమెరికా, ఇతర దేశాలకు సంబంధించిన ఆయుధ సంపత్తి, అమెరికా దాని మిత్రదేశాలకు పొంచి ఉన్న మిలటరీ ముప్పు, ప్రతీకారంగా చేయబోయే ఎదురు దాడులకు సంబంధించిన వ్యూహరచనలు వంటివి ఉన్నాయి. ట్రంప్ శ్వేతసౌధం ఖాళీ చేసి వెళ్లిన తర్వాత ఏడాది పాటు ఆ పత్రాలన్నీ ఎస్టేట్లోనే ఉన్నాయని, రోజూ వేలాది మంది అతిథులు వచ్చే ఆ ఎస్టేట్లో ప్రభుత్వ రహస్యాలు ఎన్ని బయటకు పొక్కాయోనని ప్రాసిక్యూటర్ ఆందోళన వ్యక్తం చేశారు. వైట్ హౌస్ ఖాళీ చేసే సమయంలో ట్రంపే ఆ పత్రాలన్నీ బాక్సుల్లో సర్దినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నారా ? ఒక ప్రైవేటు పార్టీలో ట్రంప్ రహస్య పత్రాల్లోని సమాచారాన్ని కూడా పంచుకున్నట్టుగా అభియోగాల్లో పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా దాడికి సన్నాహాలు చేస్తోందంటూ సున్నితమైన సమాచారాన్ని ట్రంప్ తన పొలిటికల్ యాక్షన్ కమిటీలో ఉన్న వ్యక్తులతో 2021లో జరిగిన ఒక పార్టీలో పంచుకున్నట్టుగా అభియోగాల్లో పేర్కొన్నారు. అదే ఏడాది సెప్టెంబర్లో అమెరికా మిలటరీ ఆపరేషన్ చేపట్టాలనుకుంటున్న ఒక దేశం మ్యాప్ను చూపిస్తూ ఏదో మామూలు సమాచారమంటూ షేర్ చేసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఆడియో సంభాషణలతో బిగుస్తున్న ఉచ్చు? ట్రంప్పై నమోదైన అభియోగాలతో పాటు సాక్ష్యాల కింద వీడియోలు, ట్రంప్ అనుచరులతో మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఫోన్ మెసేజ్లు ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించింది. ఆ ఆడియో టేపుల్లో ట్రంప్ ‘‘ఆ బాక్సుల్ని ఎవరూ చూడొద్దు. అసలు ఇక్కడ ఏమీ లేవని వారికి చెబితే సరి. వారి ప్రశ్నలకు బదులివ్వకపోతే ఇంకా మేలు. వారితో ఆడుకోవడం మంచిది కాదు’’ వంటివి ఉన్నాయి. -
ఏ మి టీ రహస్య పత్రాల కేసు..?
అమెరికా అధ్యక్షుడు ఎవరైనా పదవి దిగిపోయిన వెంటనే తన అధీనంలో ఉన్న ప్రభుత్వ డాక్యుమెంట్లు జాతీయ ఆర్కీవ్స్ అండ్ రికార్డ్స్ ఏజెన్సీ (ఎన్ఏఆర్ఏ)కి అప్పగించాలి. ప్రభుత్వానికి సంబంధించిన ఆ రహస్య పత్రాలన్నీ జాతి సంపదగా భావిస్తారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలైన కొద్ది నెలలకి అంటే 2021 మేలో ఎన్ఏఆర్ఏ ట్రంప్ రహస్య పత్రాలు పూర్తిగా ఇవ్వలేదని తొలిసారిగా బయటపెట్టింది. రెండు డజన్ల బాక్సుల్లో ఉండే పత్రాలు ఇవ్వలేదని పేర్కొంది. దీనిపై విచారణ మొదలై ట్రంప్ అధీనంలో ఉన్న రహస్య పత్రాలన్నీ ఆర్కీవ్స్కు ఇవ్వాలంటూ కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 2021 జనవరిలో అధ్యక్షుడిగా గద్దె దిగిన ట్రంప్ వందలాది పత్రాలను తన అధీనంలోనే ఉంచుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశాలతో ట్రంప్ తరఫు లాయర్లు మరో 30 పత్రాలు అందజేశారు. అంతకు మించి తమ దగ్గర ఏవీ లేవని స్పష్టం చేశారు. 2022 ఆగస్టులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) రంగంలోకి దిగి ఫ్లోరిడాలోని ట్రంప్ ప్రైవేటు ఎస్టేట్ మార్ ఎ లాగోలో సోదాలు చేపడితే 15 బాక్సుల్లో 184 కీలక పత్రాలు లభించాయి. ఇందులో 67 విశ్వసనీయ పత్రాలు, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు లభించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే తరహా రహస్య పత్రాల కేసులో ట్రంప్ హయాంలో ఉపాధ్య’క్షుడిగా వ్యవహరించిన మైక్ పెన్స్, అంతకు ముందు ఉపాధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్పై కేసులు నమోదై ఉన్నాయి. వైట్ హౌస్ నుంచి అత్యంత కీలకమైన డాక్యుమెంట్లను ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే తీసుకువెళ్లారా ? గూఢచర్య చట్ట నిబంధనల్ని ట్రంప్ ఉల్లంఘించారా ? అన్న దిశగా ప్రాసిక్యూషన్ విచారణ సాగిస్తోంది.అయితే శ్వేతసౌధం ఖాళీ చేయడానికి తక్కువ సమయం ఇవ్వడంతో హడావుడిగా తీసుకువెళ్లిన సామాన్లలో పత్రాలు కూడా వచ్చి ఉంటాయని ట్రంప్ కార్యాలయం అప్పట్లో సమర్థించుకుంది. ట్రంప్ ఎదుర్కొంటున్న కేసులు ఇవే..! హష్ మనీ అగ్రరాజ్యం చరిత్రలో నేరాభియోగాలు ఎదుర్కొన్న ఒక మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ హష్ మనీ కేసులో నిలిచారు. 2016 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నప్పుడు తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ నోరు మూయించడానికి 1.30 లక్షల డాలర్లను ముట్టజెప్పినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ట్రంప్ లాయర్ మైఖేల్ కోహెన్ ద్వారా సొమ్ములు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ట్రంప్ మన్హట్టన్ క్రిమినల్ కోర్టుకు ఈ ఏడాది ఏప్రిల్ 4న హాజరయ్యారు. ఎన్నికల్లో అక్రమాలు 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నికల తుది ఫలితాలు ప్రకటించడానికి ముందే జో బైడెన్పై గెలుపు తనదేనంటూ ట్రంప్ ప్రచారం చేయడంపై విచారణ జరుగుతోంది. జార్జియా రాష్ట్ర కార్యదర్శి బ్రాడ్ రాఫెన్స్పెర్గర్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడుతూ జార్జియాలో జరిగిన రీకౌంట్లో తనకు అదనపు ఓట్లు లెక్కించాలంటూ మాట్లాడిన సంభాషణ బయటకు రావడంతో ఈ కేసు నమోదైంది. ఈ ఏడాది జులై–సెప్టెంబర్ మధ్య ఈ కేసులో నేరాభియోగాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. క్యాపిటల్పై దాడి 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ట్రంప్ ఓటమి భారాన్ని తట్టుకోలేక క్యాపిటల్ భవనంపై దాడికి తన అనుచరుల్ని ఉసిగొల్పిన ఘటనకు సంబంధించిన కేసు కూడా పెండింగ్లో ఉంది. కొలంబియా జిల్లా కోర్టులో ట్రంప్పై క్రిమినల్ కేసు నమోదైంది. అదే సమయంలో కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను కాంగ్రెస్ ధ్రువీకరించకుండా అడ్డుకోవాలని అప్పటి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్పై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలపై కూడా కేసు నమోదై ఉంది. అక్రమ వ్యాపారాలు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్లో చేసిన వ్యాపారాల్లో నిబంధనల్ని తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడ్డారని, తన ఆస్తుల్ని కూడా తప్పుడుగా చూపించారంటూ న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ కేసు నమోదు చేశారు. ట్రంప్ న్యూయార్క్ రాష్ట్రంలో వ్యాపార లావాదేవీలు కొనసాగించకుండా నిషేధం విధించాలంటూ ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశంలో ఇప్పటికే ట్రంప్ను అటార్నీ జనరల్ తన కార్యాలయంలోనే కొన్ని గంటలు ప్రశ్నించారు. న్యాయస్థానంలో ఈ కేసు అక్టోబర్లో విచారణకు రానుంది. కాలమిస్ట్పై అత్యాచారం మూడు దశాబ్దాల క్రితం తనపై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో కాలమిస్ట్ జీన్ కరోల్ వేసిన కేసులో డొనాల్డ్ ట్రంప్ను న్యూయార్క్ కోర్టు మే 9న దోషిగా తేల్చింది. 1990లో మన్హటన్లోని ఒక డిపార్ట్మెంట్ స్టోర్లోని డ్రెస్సింగ్ రూమ్లో ట్రంప్ తనపై అత్యాచారం చేశారంటూ 2019లో న్యూయార్క్ కోర్టులో ఆమె పిటిషన్ వేశారు. ఏప్రిల్ 25న దీనిపై విచారణ మొదలైంది. కరోల్ను అబద్ధాల కోరుగా ప్రచారం చేసి ఆమె పరువుని బజారుకి ఈడ్చినందుకు నష్టపరిహారంగా 50 లక్షల డాలర్లు చెల్లించాలంటూ న్యూయార్క్ కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై ట్రంప్ న్యాయనిపుణుల బృందం పై కోర్టుకు వెళ్లనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నా ఏజ్ కనిపించక పోవడానికి సీక్రెట్ ఏంటంటే..!
-
పోన్లేండి సార్.. పోలీస్స్టేషనే కదా!.. అధ్యక్ష భవనం కాదుగా!
పోన్లేండి సార్.. పోలీస్స్టేషనే కదా!.. అధ్యక్ష భవనం కాదుగా! -
విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 వెనుక సూపర్బ్ స్టోరీ
-
భారత్లో మైక్రోసాఫ్ట్ సీక్రెట్ టెస్టింగ్! కోడ్నేమ్ ఏంటో తెలుసా?
సాంకేతిక ప్రపంచంలో చాట్జీపీటీ ఇప్పుడు ఓ సంచలనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టూల్ చాట్ జీపీటీని యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన ఓపెన్ ఏఐ అనే స్టార్టప్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్.. తన సెర్చ్ ఇంజన్ బింగ్ లోనూ చాట్ జీపీటీ తరహా సేవలు యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అయితే మైక్రోసాఫ్ట్ తన బింగ్ ఏఐ చాట్బాట్ ‘సిడ్నీ’ని కొన్నేళ్లుగా భారత్లో సీక్రెట్ టెస్టింగ్ చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఫోరమ్లలో పాత యూజర్ పోస్ట్ల ద్వారా తెలుస్తోంది. ఇలా రహస్యంగా పరీక్షించి, సామర్థ్యాలను మెరుగుపరిచి తాజాగా అందుబాటులోకి తెచ్చింది. మైక్రోసాఫ్ట్ సెర్చ్ఇంజన్ అయిన బింగ్ యూజర్లకు సమాచారం అందించడంలో సహాయకంగా సిడ్నీ చాట్బాట్ను రూపొందించారు. సాధారణ భాషలో యూజర్లు ఇచ్చే కమాండ్లను ఇది అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా సమాచారం అందిస్తుంది. ఈ చాట్బాట్ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు మైక్రోసాఫ్ట్కు భారత్ కీలకమైన టెస్టింగ్ గ్రౌండ్గా ఉపయోగపడింది. (ఇదీ చదవండి: ఇక రావు అనుకున్న రూ.90 లక్షలు.. అద్భుతం చేసిన చాట్జీపీటీ!) మైక్రోసాఫ్ట్ చాట్బాట్ ఫీచర్ ‘సిడ్నీ’ అనేది పాత కోడ్నేమ్ అని, దీన్ని తాము 2020 నుంచి భారత్తో పరీక్షిస్తున్నామని మైక్రోసాఫ్ట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కైట్లిన్ రౌల్స్టన్ ‘వెర్జ్’ అనే సంస్థకు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియలో చాలా మంది నిపుణులు తమకు సహాయపడ్డారని, ఇలాగే సరికొత్త టెక్నిక్లతో యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ రంగలో మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో చాట్బాట్ల రూపకల్పన కీలక అభివృద్ధి. ఈ చాట్బాట్లు ప్రస్తుతం యూజర్లకు అవసరమైన సమాచారాన్ని, సహాయాన్ని క్షణాల్లో అందిస్తూ చాలా ప్రాచుర్యం పొందాయి. మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ చాట్బాట్ను సెర్చ్ఇంజన్ కోసమే ప్రత్యేకంగా రూపొందించినా ప్రస్తుతం స్కైప్ వంటి తమ ఇతర సేవలకూ దీన్ని అనుసంధానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: Google: ఉద్యోగులకే కాదు.. రోబోలకూ లేఆఫ్!) -
వేల కోట్లకు అధిపతి.. విమానంలో దిక్కులేని చావు..
కొంతమంది గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. చాలా మంది ఒకటి రెండు విషయాల్లో రాణిస్తేనే కాలరెగరేస్తారు. చాలా తక్కువ మంది మాత్రం ఇంకా ఏదో సాధించాలని తపిస్తారు ఎంత సాధించినా ఇంకా దాహంతోనే ఉంటారు. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోగలిగిన స్థాయికి ఎదిగి.. దిక్కుమాలిన శవంగా మిగిలి.. మరణానంతరం కోట్లాది డాలర్ల సామాజిక సేవలో చిరంజీవిగా ఉన్న ఓ సంపన్నుడి కథే ఇవ్వాల్టి సీక్రెట్. 1976 ఏప్రిల్ 5 మెక్సికో నుంచి హోస్టన్ వచ్చిన ఓ ప్రయివేట్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఓ గుర్తు తెలీని వ్యక్తి మరణించి ఉన్నాడు. ఏళ్ల తరబడి తైల సంస్కారం లేకుండా పొడుగ్గా పెరిగిన జుట్టు.... అంతే కాలంగా పెరుగుతూ వచ్చిన చేతి.. కాలి గోళ్లు... నెలల తరబడి ఏమీ తినలేదేమో అన్నట్లు చిక్కి శల్యమైన శరీరం. ఆరడుగుల రెండంగుళాల పొడగరి అయినా శరీరంలో మాంసమే లేనట్లు 41కిలోలు మాత్రమే తూగిన మృతదేహం. ఎవరూ బాడీని గుర్తించే పరిస్థితే లేదు. ఎఫ్.బి.ఐ. రంగంలోకి దిగింది. అటాప్సీ చేసిన వైద్యులు కిడ్నీ ఫెయిల్యూర్ కావడం వల్లనే చనిపోయాడని తేల్చారు. మాల్ న్యూట్రిషన్ వల్ల దేహమంతా డొల్లయ్యిందని విశ్లేషించారు. అంత తినడానికి కూడా గతి లేని ఈ మనిషి విమానంలో ఎలా వచ్చాడు? ఈ అనుమానమే ఎఫ్. బి. ఐ. ని మరింత లోతుగా దర్యాప్తుచేసేలా చేసింది. ఇతని ఫింగర్ ప్రింట్స్ సేకరించి ఇన్వెస్టిగేషన్ మొదలెట్టింది. అతనెవరో తెలిశాక అందరూ కళ్లు తేలేశారు. సరైన ఆహారం లేక బక్కచిక్కిన ఈ మనిషి అల్లా టప్పా మనిషి కానే కాదు. మొత్తం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడితను. ఇతనే ద గ్రేట్ హోవర్డ్ రాబర్డ్ హ్యూగ్స్. ఇతని దగ్గరున్న సంపదతో ప్రపంచంలోని కొన్ని దేశాలను కొనేయగలడు. ఇతను కనుసైగ చేస్తే చాలు ఏం కావాలంటే అది వచ్చి ఒళ్లో వాలుతుంది. ఇంతటి రిచెస్ట్ పెర్సన్ కి ఇంత దిక్కులేని చావేంటి? అదే మానవ జీవితంలోని ఐరనీ. అగ్రరాజ్యం అమెరికానే శాసించగల హ్యూగ్స్ మృత దేహాన్ని గ్లెన్ వుడ్ స్మశాన వాటికలో ఖననం చేశారు. మల్టీ బిలియనీర్ అయిన హ్యూగ్స్ ఇక్కడ శాస్వతంగా నిద్రపోతున్నాడు. ఇంతకీ హ్యూగ్స్ ఏం చేసేవాడో అంత గొప్పవాడిగా ఎదిగే క్రమంలో ఎంత కఠోర శ్రమ చేశాడో అతని జీవితంలో ఎన్ని మజిలీలున్నాయో తెలుసుకోవాలంటే అతని ఆటోబయోగ్రఫీని ఓ సారి తెరవాలి. హోవర్డ్ రాబర్డ్ హ్యూగ్స్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అమెరికన్ ఏవియేటర్. విమానంలో అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వీరుడిగా హ్యూగ్స్ రికార్డ్ సృష్టించాడు. కేవలం నాలుగు రోజుల వ్యవథిలోనే లోకాన్ని చుట్టి పారేశాడు. ఆ తర్వాత తన రికార్డును తానే తిరగరాశాడు. ఈ సారి మూడు రోజుల్లోనే ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు. హ్యూగ్స్ అంటే ఇంతేనా అనకండి. ఇంకా చాలా ఉంది. హ్యూగ్స్ మంచి ఏవియేటరే కాదు.....ప్రపంచంలోనే అత్యంత పెద్ద విమాన తయారీ కంపెనీకి ఓనర్ కూడా. ఔను .. అమెరికాలో హ్యూగ్స్ ఎయిర్ లైన్స్ నంబర్ వన్ ప్రయివేట్ కంపెనీ. ఎయిర్ క్రాఫ్ట్ లంటే హ్యూగ్స్ కి ఆరో ప్రాణం. ఆ మాటకొస్తే అసలదే మొదటి ప్రాణం కూడా. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరే కాదు ఎఫిషియంట్ పైలట్ గానూ హ్యూగ్స్ కు పేరుంది. కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ లను అతనే స్వయంగా డిజైన్ చేశాడు. తండ్రి ఇచ్చిన హ్యూగ్స్ టూల్ కంపెనీ ని శాఖోప శాఖలుగా విస్తరించాడు హ్యూగ్స్ జూనియర్. ముందుగా ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీని ఫ్లోట్ చేశాడు. 1932 లో కాలిఫోర్నియాలో ఓ రెంటల్ కార్నర్ లో దీన్ని స్టార్ట్ చేశాడు. కొంత మంది ఆలోచనలు కూడా భారీగానే ఉంటాయి. అందరూ నేలపై చూపులు పెడితే వీళ్లు మాత్రం ఆకాశంలో చుక్కలపైనే దృష్టి సారిస్తారు. 27 ఏళ్ల వయసులో ఓ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీకి ఓనరయ్యాడు. ఏడేళ్లలోనే ఈ సంస్థ నంబర్ వన్ గా అవతరించింది. గంటకు 352కిమీ రికార్డు.. 1939 లో ట్రాన్స్ ఇంటర్నేషనల్ వెస్ట్ ఎయిర్ లైన్స్ -T.W.I. లో మేజర్ షేర్ ను హ్యూగ్స్ కొనుగోలు చేశాడు. అతని దృష్టిలో విమానాల తయారీ..ఎయిర్ లైన్స్ యాక్టివిటీస్ కేవలం వ్యాపారాలు కావు. ఈ రెండూ హ్యూగ్స్ కి ప్రొఫెషనల్ పేషన్సే. T.W.I. పై పూర్తి కంట్రోల్ రావడంతోనే హ్యూగ్స్ వైమానిక రంగానికి రారాజైపోయాడు. అతన్నిలాగే వదిలేస్తే ఇక తమ వ్యాపారాలు మూసుకోవలసిందేనని పాన్ అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థ ఓనర్ ట్రిప్ కు భయం పట్టుకుంది. అతని భయానికి తగ్గట్టే హ్యూగ్స్ ఎయిర్ లైన్స్ లో దూసుకుపోతున్నాడు. స్వతహాగా పైలట్ కూడా అయిన హ్యూగ్స్ H1 రేసర్ టెస్ట్ రన్ లోనే గంటకు 352 కిలోమీటర్ల వేగంతో నడిపి రికార్డు సృష్టించాడు. రాజకీయంగా పాన్ అమెరికన్ ఎయిర్ లైన్స్ వేధింపులు- ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ఘటనలతో హ్యూగ్స్ మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. మానసిక పరిస్థితి దెబ్బతింది. అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అనే మానసిక రుగ్మత మొదలైంది. ఒక్కోసారి ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలిసేది కాదు. ఒకే మాటను అదే పనిగా రిపీట్ చేసేవాడు. ఓ దశలో కొంతకాలం పాటు ఓ గదిలో తలుపులు వేసుకుని ఉండిపోయేవాడు. తాను తీసిన సినిమాలతో పాటు తనకు నచ్చిన సినిమాలను చూస్తూ గడిపేవాడు. ఓ కుర్చీలో నగ్నంగా కూర్చుని పిచ్చిపిచ్చిగా సినిమాలు చూసేవాడు. సన్నిహితుల సమాచారం ప్రకారం ఒక్కోసారి రోజుల తరబడి స్నానం చేసేవాడు కాదు. చాకొలెట్ బార్స్- పాలే ఆహారం. అవిలేకపోతే ఏమీ తినకుండా అలాగే ఉండిపోయేవాడు. కాలిగోళ్లు చేతి గోళ్లు బాగా పెరిగిపోయినా పట్టించుకునేవాడు కాదు. జుట్టు పెరిగిపోయి తైల సంస్కారం లేకుండా రోజుల తరబడి అలాగే ఉండిపోయేవాడు. చూడ్డానికి భయంకరంగా కనిపించేవాడు. హోటల్ బిల్లు రూ.కోట్లు.. అప్పటికే ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకడిగానే ఉన్నాడు. చివరి దశలో మెక్సికోలో ఓ హోటల్లో కాలక్షేపం చేశాడు. ఆ హోటల్ బిల్లే కొన్ని కోట్లు పే చేశాడు. సరిగ్గా తినక పోవడం వల్ల ఒళ్లంతా గుల్లయింది. 42 కిలోల బరువుకు పడిపోయాడు. కిడ్నీలు ఇక పనిచేయలేమని మొరాయించాయి. ఈ టైమ్ లోనే తాను పుట్టిన హోస్టన్ నగరానికి ఓ స్నేహితుని విమానంలో బయలుదేరాడు. చివరికి అందులోనే చివరి శ్వాస విడిచాడు. ఏ విమానాలనైతే జీవితాంతం ప్రేమించాడో ఏ విమానాల తయారీ కోసం తన మేథస్సునూ డబ్బునూ ఖర్చు చేశాడో ఆ విమానంలోనే అంతిమయాత్ర చేశాడు. హ్యూగ్స్ మరణానంతరం అతని విల్లు ప్రకారం ఆస్తిలో 75శాతం మొత్తాన్ని ఈ ఇన్ స్టిట్యూట్ కే అప్పగించారు. ఇప్పటికీ ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద మెడికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ గా ఇది చెలామణీ అవుతోంది. ఈ ఇన్ స్టిట్యూట్ ద్వారా ఇప్పటికీ జన హృదయాల్లో బతికే ఉన్నాడు హ్యూగ్స్. అమెరికాలో హ్యూగ్స్ ను ఇప్పటికీ ఒక ఐకాన్ గానే కొలుస్తారు. మనసున్న మారాజని జనం నీరాజనాలు పడతారు. చచ్చీ కూడా బతికుండడమంటే ఇదే. అందుకే హ్యూగ్స్ ఎప్పటికీ చిరంజీవే. -
బార్పై రైడ్.. సీక్రెట్ రూంలో 17 మంది మహిళలు..
ముంబై: మహారాష్ట్ర ముంబైలోని రెస్టారెంట్ అండ్ బార్పై రైడ్ చేసిన పోలీసులు లోపల చూసి షాక్ అయ్యారు. రహస్యంగా నిర్మించిన ఓ గదిలో 17 మంది మహిళలను చూసి అవాక్కయ్యారు. మరో నలుగురు మహిళలు బార్లో డాన్స్ చేస్తూ కన్పించారు. దహిసార్ ప్రాంతంలో శుక్రవారం ఈ దాడులు చేసిన పోలీసులు మొత్తం 19 మంది కస్టమర్లు, ఐదుగురు సిబ్బందితో పాటు బార్ మేనేజర్ను అరెస్టు చేశారు. సీక్రెట్ రూంలో రహస్యంగా దాచిన 17 మంది మహిళలకు విముక్తి కల్పించారు. ఇలాంటి రైడ్లు చేసినప్పుడు మహిళలను కన్పించకుండా దాచాలనే నిర్వహకులు రహస్యంగా ఓ గదిని నిర్మించి బలవంతంగా వారిని అందులో ఉంచారని అధికారులు తెలిపారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే.. -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: ‘సీక్రెట్’ ఫీచర్ ఒక్కసారే!
సాక్షి, ముంబై: మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరో కొత్త అప్డేట్ తీసుకు రాబోతోంది. నిత్యం సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్పై పరీకక్షిస్తోంది. వ్యూ వన్స్ టెక్ట్స్ ఫీచర్ను పరిచయం చేయనుంది. ఇదీ చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! వాట్సాప్లో మెసేజ్ను ఒకసారి రిసీవర్ ఒకసారే మాత్రమే చూడగలరు. రిసీవర్ చదవిన వెంటనే ఆ మెసేజ్ ఆటో మేటిక్గా డిలీట్ అవుతుందన్న మాట. అటు మెసేజ్ పంపిన వారికి, అందుకున్న వారికి కూడా ఆ మెసేజ్ కనపించదు. తమ వాట్సాప్ చాట్ను ఎవరూ చూడకుండా సీక్రెట్గా ఉండాలనుకునే యూజర్లకు ఇది బాగా ఉపయోగ పడనుంది. (WhatsApp 3D Avatar: వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) వేబేటా ఇన్ఫో ప్రకారం ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. పూర్తిస్థాయిలో యూజర్లందరికీ ఎప్పుడు అందుబాటులోకి తెస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. వాట్సాప్ అధికారికంగా లాంచ్ చేసేవరకు వెయిట్ చేయాల్సిందే. కాగాఇప్పటికే వాట్సాప్లో వన్స్ వ్యూ ఫీచర్.. వీడియోలు, ఫొటోలకు వినియోగంలో ఉంది. వీడియోలు లేదా ఫొటోలకు వన్స్ వ్యూ ఫీచర్ ఆప్షన్ ద్వారా ఒక్కసారి మాత్రమే కనిపించి ఆ తరువాత అదృశ్యమవుతాయి.దీన్ని ఫార్వార్డ్ చేయడం, స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా కుదరదు. ఇదే ఫీచర్ను టెక్ట్స్ ఫార్మాట్ కోసం వ్యూ వన్స్ ఫీచర్ను పరీక్షిస్తుండటం గమనార్హం. -
క్వీన్ ఎలిజబెత్-2 రహస్య లేఖ! తెరిచేది ఎప్పుడంటే..
సిడ్నీ: క్వీన్ ఎలిజబెత్-2 స్వదస్తూరితో రాసిన ఓ లేఖ గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆ లేఖను ఇంతవరకు ఎవరూ చదివింది లేదు. అలాగే.. భద్రంగా ఓ చోట ఉండిపోయింది. మరి రాణి చనిపోయింది కదా!. అది అలాగే రహస్యంగా ఉండిపోవాల్సిందేనా?.. 1986 నంబర్లో సిడ్నీ(ఆస్ట్రేలియా) ప్రజలను ఉద్దేశించి.. క్వీన్ ఎలిజబెత్-2 ఓ లేఖ రాశారు. దానిని సిడ్నీలోని ఓ చారిత్రక భవనం వ్యాలెట్లో భద్రంగా దాచారు. అయితే.. అందులో ఏముందనే విషయం అది రాసిన రాణివారికి తప్పా ఎవరికీ తెలియదు. మరి ఇప్పుడు ఆమె మరణించడంతో ఆ లెటర్ను బయటకు తీయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. అయితే ఆ లెటర్ను తెరుస్తారట. అది ఇంకా 63 ఏళ్ల తర్వాత. అంటే.. 2085లో. సిడ్నీ లార్డ్ మేయర్ను ఉద్దేశిస్తూ.. ఎలిజబెత్ రాణి 2 ఆ లేఖను ‘‘2085వ సంవత్సరంలో ఓ మంచి ముహూర్తాన ఆ లేఖను తెరవండి అంటూ ఎలిజబెత్ రాణి సంతకం చేశారు. దీంతో ఆమె కోరిక మేరకు అప్పటివరకు గ్లాస్ బాక్స్లో ఉన్న ఆ లేఖను అలాగే ఉంచాలని సిడ్నీ అధికారులు నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో క్వీన్ ఎలిజబెత్-2కు ప్రత్యేక అనుబంధం ఉంది. పదహారుసార్లు ఆమె ఆ దేశాన్ని సందర్శించారు. 1901లో ఆస్ట్రేలియా స్వాతంత్రం ప్రకటించుకుంది. కానీ, పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోకపోవడంతో టెక్నికల్గా ఇంకా బ్రిటన్ రాజరికం కిందే ఉన్నట్లయ్యింది. ఆస్ట్రేలియాకు రాణిగా ఎలిజబెత్-2 కొనసాగారు. 1999లో ఆమెను ఆ దేశ అధినేతగా తొలగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. కానీ, అది వీగిపోయింది. ఇదీ చదవండి: బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువెంతంటే.. -
Sakshi Cartoon: చైనా సరిహద్దుల్లో అమెరికా రహస్య విమానాలు
మనం భారత్ సరిహద్దుల్లో ఇలానే చేస్తుంటే.. వాళ్లు మన సరిహద్దుల్లో అదే పని చేస్తున్నార్సార్! -
తాజ్ మహల్: గదులు తెరిపించాలన్న పిటిషన్ తిరస్కరణ
అలహాబాద్: తాజ్ మహల్లో మూతపడి ఉన్న గదులను తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్) తిరస్కరించింది. 22 గదుల్ని తెరవాల్సిన విషయంలో పిటిషనర్ జోక్యం అనవసరమని గురువారం లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. తాజ్మహల్ చరిత్రను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని, వాస్తవాలను తెలుసుకునే హక్కు ప్రజలకు కూడా ఉంటుందని దాఖలైన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టకుండానే తిరస్కరించింది. అంతేకాదు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వ్యవస్థను అవమానపరిచేలా వ్యవహరించొద్దంటూ పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఈ వ్యవహారాన్ని చరిత్రకారులకు వదిలేయండంటూ తేల్చి చెప్పింది. ‘‘వెళ్లండి. వెళ్లి ఏదైనా పరిశోధనలు చేసుకోండి. ఎంఏలు, పీహెచ్డీలు చేసుకోండి. న్యాయస్థానాల సమయం వృథా చేయొద్దంటూ’’ అంటూ బెంచ్ న్యాయమూర్తులు ఉపాధ్యాయ్, సుభాష్ విద్యార్థిలు పిటిషనర్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యవహారాన్ని సరదాగా నాలుగు గోడల మధ్య కూర్చుని చర్చిస్తే బాగుంటుంది. ఇలా కోర్టు రూమ్లో కాదు అంటూ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారం కాదని, కోర్టు బయట మెథడాలజీ, చరిత్రకారుల ద్వారా తేలాల్సిన విషయం అని బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఆర్టీఐ ద్వారా తెలుసుకోవాలంటూ సూచించింది. సీల్ చేసి ఉన్న గదులను తెరిపించేందుకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలంటూ బీజేపీ యూత్ మీడియా ఇన్ఛార్జి డాక్టర్ రజనీష్ సింగ్ హైకోర్టు లక్నో బెంచ్ ముందు అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు. తాజ్ మహల్ వాస్తవానికి తేజ్ మహాలయా అని.. అది శివుడి ఆలయం అంటూ ఆయన వాదించారు. అంతేకాదు నిజనిర్ధారణ కమిటీ ద్వారా అసలు చరిత్రను వెలుగులోకి తేవాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కూడా కోరారు. మొఘలుల కాలానికి చెందిన తాజ్ మహల్ను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తోంది. ఈ కళాఖండం 1982లో యనెస్కో వరల్డ్ హెరిటేర్ సైట్ గుర్తింపు దక్కించుకుంది కూడా. చదవండి: తాజ్ మహల్ కట్టిన స్థలం మాదే!: బీజేపీ ఎంపీ దియా -
గురక శబ్ధంతో వీడిన వ్యభిచార ముఠా గుట్టు
బెంగళూరు: అప్పట్లో.. రాజులు యుద్ధాల సమయంలో శత్రు రాజ్యాలకు భయపడి రహస్య గదులను ఏర్పాటు చేసుకోవడం గురించి చరిత్రలో చదివి ఉంటాం. సాధారణంగా.. ఐటీ రైడింగ్లకు భయపడి డబ్బును గోడల్లోనో, సీక్రెట్ గదుల్లోనూ, వాటర్ ట్యాంక్ల్లోనో దాచడం చూస్తుంటాం. అలాగే డబ్బు, నగలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు భద్రపరిచే సీక్రెట్ రూమ్ చూసి ఉంటాం. కానీ, టాయిలెట్లో రహస్య గది ఒకటి ఏర్పాటు చేసుకుని.. అందులో గుట్టుగా వ్యభిచారం సాగించే ముఠా ఓ ముఠా వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఈమధ్యకాలంలో ఇతర రాష్ట్రాల వ్యభిచార ముఠాల వ్యవహారాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకర్లు.. పోలీసుల కళ్లు గప్పేలా అతితెలివి ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ హోటల్పై రైడింగ్కు వెళ్లిన పోలీసులు షాక్కు గురయ్యారు. చిత్రదుర్గలోని ఓ చోట వ్యభిచారం చేస్తున్నట్లు పక్కా సమాచారం అందుకుని స్పెషల్ టీం రైడ్కు వెళ్లింది. అయితే ఆ సమయంలో గదుల్లో వెతికినా ఏం కనిపించలేదు. దీంతో పోలీసులు ఘటనా స్థలంలోని బాత్రూమ్ను పరిశీలించగా.. ఒకచోట నుంచి గురక శబ్దం వినిపించింది. శబ్ధం ఎటువైపు వస్తుందోనని పరిశీలించిన ఓ అధికారికి.. టైల్స్ నుంచి రావడం వినిపించింది. అనుమానంతో ఆయన టైల్స్పై చెయ్యి వేయగానే.. అది కాస్త పక్కకు జరిగింది. దీంతో లోపల ఏర్పాటు చేసిన ఒక చిన్న గది బయటపడింది. పోలీసులు గదిని తెరిచి చూడగా.. అందులో ఒక చిన్న సెల్లార్ ఏర్పాటు చేశారు. అలా మొత్తం మూడు వ్యభిచార గృహాలు, ఒక క్లయింట్, ఒక బ్రోకర్ పట్టుబడ్డారు. బయట చూడ్డానికి మామూలు ప్రదేశమే అనిపించినా టాయిలెట్ లోపల ఇలా వ్యభిచార గృహం ఉండడం షాక్ కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. -
లైంగికంగా వేధించారు.. అందుకే 'గే' అయ్యావా అన్నారు..
Lock Upp: Saisha Shinde Reveal Secret Says This Is Why You Are Gay: బాలీవుడ్ వివాస్పద బ్యూటీ కంగనా రనౌత్ ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు హోస్ట్గా సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన రియాలిటీ షో 'లాకప్'కు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ఇటీవలి జడ్జిమెంట్ స్పెషల్ ఎపిసోడ్లో మునావర్ ఫరూఖీ తన లైఫ్ సీక్రెట్ను చెప్పాడు. తన ఆరేళ్ల వయసులో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత కంగనాకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని చెప్పి షాక్కు గురి చేసింది. అయితే వీరి తర్వాత ఎవిక్షన్ నుంచి సేవ్ అయిన సైషా షిండే తను ఎలాంటి వేధింపులను ఎదుర్కుందో లాకప్ వేదికగా తెలియజేసింది. 'ఇది నా మొదటి సీక్రెట్. మీకు (మునావర్ ఫరూఖీ, కంగనా రనౌత్) జరిగిన లైంగిక వేధింపులను మీరు పంచుకోవడం చూశాక, అది విని ప్రజలు ఎలా రియాక్టయ్యారో చూశాక నాకు జరిగింది గుర్తుకు వచ్చింది. నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను. ఈ విషయం చెప్పినప్పుడు కొంతమంది వ్యక్తులు 'ఇందుకేనా నువ్ స్వలింగ సంపర్కురాలివి అయ్యావా (గే)' అని అన్నారు. అలా అన్నాక ఇక ఎవ్వరికీ ఈ విషయం గురించి చెప్పే సాహసం చేయలేదు.' చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్ View this post on Instagram A post shared by S A I S H A S H I N D E (@officialsaishashinde) సైషా తాను స్వప్నిల్ షిండేగా ఉన్న సమయం గురించి పలుసార్లు తెలిపింది. ఆ సమయంలో తనను తాను స్వలింగ సంపర్కాలు (గే) అని నమ్మిందట. సైషాగా మారాలని నిర్ణయించుకునేంత వరకు మానసికంగా ఎలా పోరాడిందో తరచుగా చెప్పేది. దీపికా పదుకొణె, కరీనా కపూర్ ఖాన్, కత్రీనా కైఫ్, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్, సన్నీ లియోన్, తాప్సీ పన్ను, భూమి పడ్నేకర్, హీనా ఖాన్లతో సహా టాప్ ఎ-లిస్ట్ బాలీవుడ్ నటులతో ప్రముఖ డిజైనర్ స్వప్నిల్ షిండేగా పనిచేసింది. చదవండి: పెళ్లయ్యాక పరాయి వ్యక్తిని ముద్దు పెట్టుకున్నా.. భర్తకు చెప్పిన నటి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_921254769.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గ్రహాంతరవాసులు ఉన్నారా ?
-
ఉన్మాద పర్వం
-
చిలకలగుట్ట రహస్యం.. అక్కడికి ఎవ్వరూ పోవద్దు.. పోనివ్వరు
-
సీక్రెట్గా పెళ్లి చేసుకున్న హీరో.. వైరల్ అవుతున్న ఫోటోలు
Dev Mahadev Star Mohit Raina Secretly Marries Aditi : బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా సీక్రెట్గా వివాహం చేసుకున్నాడు. జనవరి1న న్యూ ఇయర్ సందర్భంగా పెళ్లి ఫోటోలు షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. సాధారణంగా సెలబ్రిటీల వివాహం అంటే కొన్ని రోజుల ముందు నుంచే ఆ హడావిడి సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మోహిత్ మాత్రం పెళ్లి తేదీ వరకు తన వివాహాన్ని అత్యంత రహస్యంగా ఉంచాడు. గత కొన్నాళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నా ఆ విషయం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. తాజాగా ప్రియురాలిని సీక్రెట్గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్కి షాకిచ్చాడు. కొత్త ఏడాదిలో కొత్త జీవితం ప్రారంభమవుతుందని, మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేశాడు. ఇక చూడముచ్చటైన ఈ జంటకు సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్న మోహిత్ మహాదేవ్ సీరియల్తో ఎంతో పాపులర్ అయ్యాడు. శివుడి పాత్రలో మోహిత్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 2019లో వచ్చిన యురి..ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలో సైతం కీలక పాత్రలో కనిపించాడు. View this post on Instagram A post shared by Mohit Raina (@merainna) -
రహస్యంగా భర్త రెండో పెళ్లి.. మళ్లీవచ్చి తీసుకెళ్తానని చెప్పి..
పిడుగురాళ్ల (గుంటూరు జిల్లా): తనను మోసం చేసి, తన భర్త వేరే వివాహం చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ పిడుగురాళ్ల పోలీస్స్టేషన్ ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేసింది. బాధితురాలి కథనం మేరకు.. పిడుగురాళ్ల పిల్లలగడ్డకు చెందిన ముజావర్ షాహీనాకు సత్తెనపల్లి మండలం తొండపి గ్రామానికి చెందిన ముజావర్ సైదాతో 2000 సంవత్సరం జూలై 23వ తేదీ వివాహం జరిగింది. చదవండి: దుస్తులు సరిగా కుట్టలేదని హత్య కొంతకాలం తొండపిలో వీరి కాపురం సాఫీగా సాగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. భర్త సైదా తన వద్ద డబ్బులు లేవని చెప్పి భార్య షాహీనా పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మి వ్యాపారం ప్రారంభిస్తానని నమ్మబలికాడు. దీంతో షాహీనా 20 సవర్ల బంగారం, తన పేరు మీద ఉన్న ఎకరం పొలం, ఇల్లు మొత్తం భర్త సైదాకు రాసి ఇచ్చింది. కొంతకాలం తర్వాత భార్యాపిల్లలను ఆమె పుట్టింట్లో వదిలి వ్యాపారం నిమిత్తం వెళ్తున్నానని, మళ్లీవచ్చి తీసుకెళ్తానని చెప్పి సైదా వెళ్లిపోయాడు. అలా రెండేళ్లు గడిచిపోయాయి. చివరకు భర్త ఎక్కడున్నాడో తెలుసుకుందామని తొండపి వెళ్లగా సైదా వేరే పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి 2021 అక్టోబర్ 17వ తేదీ ఆ వివాహం ఆపివేయించానని భార్య షాహీనా తెలిపింది. అయితే గత నెలలో హైదరాబాద్లో మళ్లీ రహస్యంగా వేరే మహిళతో వివాహం చేసుకున్నాడని తెలిసింది. దీంతో తన బంధువులతో కలిసి హైదరాబాద్లో తన భర్త, వేరే మహిళ ఉన్నచోటుకు వెళ్లి ఇద్దరిని పట్టుకోవడం జరిగిందని తెలిపింది. శుక్రవారం తన భర్త రెండో పెళ్లి ఆధారాలతో పట్టణ పోలీస్స్టేషన్ వద్ద న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది. సైదాను షాహీనా బంధువులు పోలీసులకు అప్పగించారు. సీఐ మధుసూదన్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
శాకుంతలాదేవిని మోసం చేసింది ఎవరు?
-
సమర సంతకం
-
జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది..ఇక బయటపెడుతున్నా: సుమ
Anchor Suma Reveals About The Secrets She Hide From Long Time: యాంకర్ సుమ కనకాల..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్లో తనకు ఎవరూ సాటి లేరన్న విధంగా ముందుకు సాగుతుంది. ఆడియో ఫంక్షన్, ఈవెంట్ సహా పలు టీవీ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా తన సొంత యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన సుమ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చాలాకాలంగా దాచిపెట్టిన ఒక విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. చదవండి: 'గుండె తరుక్కుపోతుంది..సమంత ఎలా భరిస్తుందో' 'చాలా ఏళ్ల నుంచి ఒక విషయం దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఇకపై దాన్ని దాచాలనుకోవడం లేదు. నేను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ప్రాబ్లమ్తో బాధపడుతున్నా. అంటే ఏదైనా గాయం అయితే అది మరింత పెద్దదిగా చుట్టుపక్కల వ్యాపిస్తుంది. అంటే చిన్న గాయం కూడా పెద్దదిగా చూపిస్తుందనమాట. దీన్ని పోగొట్టుకోవడానికి చేయాల్సినవి అన్నీ చేసి చూశాను. కానీ ఫలితం లేదు. ఇది నా శరీరంలో భాగమైపోయిందని అర్థమైంది.చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్ గతంలో ఈ ప్రొఫెషనలిజంలోకి వచ్చినప్పడు మేకప్ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటివి తెలియక జరగాల్సిన డ్యామెజ్ జరిపోయింది. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. సాదారణంగా మన బాడీలో ఏదైనా మనకు నచ్చకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని దాచిపెడుతూ వస్తాం. కానీ అది మన శరీరంలోనే ఉంటుంది అని తెలిసినప్పుడు దాన్ని అంగీకరించాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం' అంటూ వీడియోను షేర్ చేసింది. చదవండి: సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ -
ఎవరికీ అంతు చిక్కని యుద్ధ వ్యూహ రచన
-
తనకి తానే దేవుడిగా ప్రకటించుకున్న కిమ్
-
ప్రాణశ్రోత
-
చిత్ర పరిశ్రమపై దావూద్ కి ఆసక్తి తగ్గలేదా?
-
రాక్షసుడు
-
నిజంగా గోపినాథ్ ఓడిపోయారా.. గెలిచారా..?
-
సూసైడ్ ఫారెస్ట్
-
ఉన్మాద పర్వం
-
రహస్యంగా మాల్యా అప్పగింత ప్రక్రియ : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: పరారీలో ఉన్న మాజీ వ్యాపారవేత్త విజయ్మాల్యాను భారత్కు తీసుకొచ్చేందుకు అప్పగించే ప్రక్రియ రహస్యంగా కొనసాగుతోందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. ఈ అంశంలో తాజా పరిస్థితి గురించి తెలియదని.. ఇందులో తాము ఒక పక్షంగా లేమని స్పష్టం చేసింది. అప్పగించే విషయంలో రహస్యంగా కొనసాగుతున్న ప్రక్రియలు ఏంటనేవి తమకు తెలియజేయాలని మాల్యా తరఫు న్యాయవాది అంకుర్సైగల్ను జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అశోక్భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశించింది. మాల్యా న్యాయవాది సైతం ఈప్రక్రియలపై తనకు అవగాహన లేదని చెప్పారు. అప్పగింతకు వ్యతిరేకంగా చేసుకున్న అభ్యర్థనను తిరస్కరించిన విషయమే తనకు తెలుసన్నారు. దీంతో మాల్యా అప్పగింత ప్రక్రియ ముగియనున్న నవంబర్ 2 నాటికి ఈ వివరాలు తెలియజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదిలీ చేయగా.. దీన్ని నేరంగా కోర్టు గతంలో ప్రకటించింది. దీన్ని సమీక్షించాలని కోరుతూ మాల్యా దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్ను కొట్టివేస్తూ అక్టోబర్ 5న తమ ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు లోగడ ఆదేశాలు జారీ చేసింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థ తరఫున తీసుకున్న రూ.9,000 కోట్ల రుణ ఎగవేతకు సంబంధించి మాల్యా కోర్టు కేసును ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్లో తలదాచుకున్నారు. -
లుక్ ట్రిక్
సినిమా మ్యాజిక్కే వేరు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించడం సినిమాకు చాలా మామూలు విషయం. అందుకు తాజా ఉదాహరణ చిరంజీవి లుక్. ఇటీవలే చిరంజీవి గుండుతో ఉన్న లుక్ను ఆన్లైన్లో షేర్ చేసి, అభిమానులను ఆశ్చర్యపరిచారు. తన తదుపరి చిత్రాల్లో ఓ సినిమాకు సంబంధించిన లుక్ అని తెలిపారు. అయితే నిజంగానే చిరు గుండు చేయించుకున్నారని చాలామంది భావించారు. కొంతమంది చేయించుకోలేదన్నారు. ఆ లుక్ కేవలం ట్రిక్ అని మంగళవారం అసలు విషయం బయటపెట్టారు చిరంజీవి. మేకప్ టెక్నిక్తొ ఆ లుక్ ట్రై చేశాం అని, ఆ లుక్ కోసం ఎలా శ్రమించారో ఓ వీడియోను ఆయన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. ‘‘ఎటువంటి లుక్ అయినా సరే నిజమేమో? అని నమ్మించగలిగే సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు. సినిమా మ్యాజిక్కు సెల్యూట్’’ అన్నారు చిరంజీవి. -
దొంగల బండి
-
నియంత
-
బెర్లిన్ వాల్
-
ఏరియా-51
-
వాట్సాప్లో గోప్యతకు మరో ఫీచర్
న్యూఢిల్లీ: యూజర్ల వివరాల గోప్యతకు సంబంధించి మెసేజింగ్ యాప్.. వాట్సాప్ కొత్త అప్డేట్ ప్రవేశపెట్టింది. దీనితో యూజరు అనుమతించిన వారు తప్ప మిగతావారెవరు సదరు యూజరు అనుమతి లేకుండా వారి పేర్లను గ్రూప్స్లో చేర్చే వీలుండదు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం యాప్లో ఉన్న ’నోబడీ’ ఆప్షన్ స్థానంలో ’మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ అనే ఆప్షన్ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. దీనితో గ్రూప్స్లో తనను చేర్చేందుకు ఎవరెవరికి అనుమతి ఇవ్వొచ్చు, ఎవరికి ఇవ్వొద్దు అన్నది యూజరే నిర్ణయించుకోవచ్చని సంస్థ తెలిపింది. యూజరును నేరుగా గ్రూప్లో చేర్చేందుకు తమకు అనుమతి లేకపోతే వ్యక్తిగత చాటింగ్ ద్వారా గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లు .. వారికి ప్రైవేటుగా ఆహ్వానం పంపాల్సి ఉంటుంది. దీనిపై యూజరు నిర్ణయం తీసుకోవచ్చు. పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పెగాసస్ స్పైవేర్ ద్వారా నిఘా పెట్టేందుకు దరిమిలా.. యూజర్ల వివరాల గోప్యత ప్రశ్నార్థకంగా మారిందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాట్సాప్ కొత్త ఫీచర్ ప్రాధాన్యం సంతరించుకుంది. -
నెత్తుటి వారథి
-
గుట్టుగా గెస్ట్లెక్చరర్ల నియామకాలు
నెల్లిమర్ల: జిల్లావ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో ఏడు గురుకులాలను ప్రారంభిస్తున్నట్లు జూలై నెలలోనే ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం భవనాలు అందుబాటులో ఉన్న మూడు ప్రాంతాల్లో ఈ నెలలో పాఠశాలలు ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ పాఠశాలలకు సంబంధించిన గెస్ట్ టీచర్ల నియామకాలను మాత్రం అడ్డదారిలో చేపట్టారు. అధికార టీడీపీ నేతల ఒత్తిడితో ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండానే నియామకాలు చేపట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న సాలూరులో కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే టీచర్లను నియమించారు. సంబంధిత బీసీ సొసైటీ అధికారులు ఈ విషయంలో టీడీపీ నేతలకు సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలేమైందంటే... విజయనగరం, కొత్తవలస, గంట్యాడ, సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి మండలం కారాడ, కురుపాం ప్రాంతాల్లో ఈ విద్యాసంవత్సరంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలలు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తవలస, గంట్యాడ, సాలూరు, పార్వతీపురంలో బాలికలు, విజయనగరం, కారాడ, కురుపాంలో బాలుర పాఠశాలలు ప్రారంభించాలని సంబంధిత అధికారులు ముందుకొచ్చారు. భవనాలు అందుబాటులో ఉన్న గంట్యాడ, కారాడ, సాలూరు ప్రాంతాల్లో ముందుగా ఈ నెలలోనే పాఠశాలలను ఏర్పాటుచేయాలని సన్నాహాలు చేశారు. ఈ పాఠశాలల్లో బోధనకు గెస్ట్ టీచర్లను నియమించేందుకు ప్రకటన ఇవ్వాలి. కానీ అదేమీ లేకుండానే సంబంధిత అధికారులు గెస్ట్ టీచర్ల నియామకాలు చేపట్టేశారు. అధికార టీడీపీ నేతలు చెప్పిన అభ్యర్థుల నుంచి బయోడేటాలు తీసుకుని, వారు సిఫారసు చేసినవారినే ఎంపిక చేశారన్న ఆరోపణలున్నాయి. వందిమంది దరఖాస్తు చేసుకున్నారు గెస్ట్ టీచర్ల కోసం మొత్తం వందమంది అభ్యర్థులు స్వతహాగానే దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. వారిలో 40మంది మాత్రమే ఇంటర్వూ్యలకు హాజరయ్యారని అంటున్నారు. మూడు పాఠశాలలకు సంబంధించి 20మందిని నియమించినట్లు తెలిపారు. అకడమిక్ గైడెన్స్ అధికారితో పాటు గురుకులాల జిల్లా కన్వీనరుతో పాటు ఒక సబ్జెక్ట్ నిపుణుడు కమిటీగా ఏర్పడి టీచర్లను ఎంపికచేసినట్లు చెబుతున్నారు. అయితే ఇదంతా అబద్ధమని, కేవలం టీడీపీ నేతలు చెప్పిన వారినే నియమించినట్లు భోగట్టా. పారదర్శకంగానే నియామకాలు జిల్లాలోని గంట్యాడ, కారాడ, సాలూరులో నెలకొల్పే బీసీ గురుకులాలకు సంబంధించిన గెస్ట్ టీచర్ల నియామకాలను పారదర్శకంగానే చేపట్టాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ప్రకటన ఇవ్వలేదు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా ఇవ్వలేదు. గంటకు రూ. 148లు చొప్పున నెలకు గరిష్టంగా రూ 14,800 గౌరవ వేతనంగా అందజేస్తాం. రెగ్యులర్ టీచర్లను నియమించగానే వీరిని తొలగిస్తాం.–సత్యారావు, జిల్లా గురుకులాల కన్వీనర్ -
అనుమతి పత్రం లేకుండా ఫొటోలు, వీడియో తీయలేరు!
సాక్షి, కామారెడ్డి అర్బన్: పోలింగ్ స్టేషన్లో వీడియోలు, ఫొటోలు తీయడం సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధం అయినప్పటికీ ఎన్నికల పరిశీలకుడి అనుమతితో ప్రతికా సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు వీడియో చిత్రీకరణ, ఫొటోలు తీయడానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఓటరు రహస్యంగా ఓటు వేస్తున్న ఫొటోలు, చిత్రీకరణ చేయడం ఎట్టి పరిస్థితిల్లోనూ నేరంగా పరిగణిస్తారు. ఓటరు రహస్య బ్యాలెట్ పద్ధతికి విఘాతం కలగకుండా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. పత్రికా సిబ్బంది తమ వీడియో, ఫొటోలను అనధికార వ్యక్తులు, మధ్యవర్తుల ద్వారా తీయడం నేరం అవుతుంది. సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల పక్రియను ఎన్నికల అధికారులే స్వయంగా వీడియో చిత్రీకరణ చేస్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా గుర్తింపు పొందిన ఫొటోగ్రాఫర్ స్టేషన్ బయట తమ వంతు కోసం ఎదురు చూస్తున్న ఓటర్లను ఫొటోలు, వీడియో తీయవచ్చు. ఓటింగ్ యంత్రంలో ఓటు వేస్తున్న ఫొటో, వీడియో తీయడం నేరంగా పరిగణిస్తారు. ఎన్నికల సంఘం గుర్తింపు లేకుండా ఎలాంటి వారికి పోలింగ్ స్టేషన్లోని అనుమతి లేదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖ సిబ్బంది అయినా సరే ఎన్నికల సంఘం అనుమతిపత్రం తప్పని సరి. అనుమతి పత్రం లేకుండా అడుగు పెట్టడానికి వీలులేదు. -
‘అలా 308 మంది అమ్మాయిలను పడేశాడు’
కొన్ని రోజుల క్రితం సంజయ్ దత్ ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు 308మంది మహిళలతో సంబంధం ఉందని స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి అందరి మనసుల్లో ఒకటే అనుమానం...ఏం చూసి ఈ ‘ఖల్నాయక్’కు ఇంత మంది అమ్మాయిలు పడిపోయారా అని. అయితే ఈ సందేహాలకు ‘సంజు’ చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హీరానీ సమాధానం చెప్పారు. తనతో పరిచయం అయిన ప్రతి అమ్మాయిని సంజయ్ ఒక సమాధి దగ్గరకు తీసుకెళ్లేవాడు. ఆ సమాధిని తన తల్లిదని చెప్పేవాడు. దాంతో ఆ అమ్మాయి కాస్తా ఎమోషనల్ అయ్యి సంజయ్కు మరింత దగ్గరయ్యేది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆ సమాధి సంజయ్ తల్లిది కాదు.. నకిలీ సమాధి వద్దకు తీసుకెళ్లి వారి సానుభూతి పొందేవాడు’ అని అసలు విషయం బయట పెట్టాడు రాజ్కుమార్ హీరానీ. ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంజు గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన ప్రియురాళ్లకు అబద్దాలు చెప్పడమే కాక తనను వదిలేసిన అమ్మాయిల మీద పగ తీర్చుకోవడానికి కూడా వెనకాడేవాడు కాదంట సంజయ్. ఒకసారి ఓ అమ్మాయి సంజయ్తో బ్రేకప్ చేసుకుందంట. దాంతో ఆగ్రహం చెందిన సంజయ్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఒక కొత్త కారు పార్క్ చేసి ఉంది. సంజయ్ ఆ కారును తీసుకెళ్లి తుక్కుతుక్కు చేశాడంట. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ కారు తన మాజీ ప్రేయురాలి కొత్త ప్రేమికుడిదని. అంతేనా ఈ మున్నాబాయ్ కాలంలో వచ్చిన హీరోయిన్లలో దాదాపు అందరితో సంజయ్ సంబంధాలు నడిపాడంట. వీరిలో కొందరు హీరోయిన్లు సంజయ్ కంటే ముందే ఇండస్ట్రీకి వచ్చారు. ప్రస్తుతం మీడియా రణ్బీర్ కపూర్ను ‘బాలీవుడ్ ప్లేబాయ్’గా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి రణ్బీర్ ‘నేను కేవలం పదిమంది అమ్మాయిలతోనే డేటింగ్ చేసాను. కానీ బాబా(సంజయ్ దత్) కౌంట్ 308’ అన్నాడు. అంతేకాక ప్రతిరోజు షూటింగ్ జరగడానికి ముందు రోజు రాత్రి రణ్బీర్ సంజయ్దత్కు ఫోన్ చేసేవాడంట. తరువాత రోజు షూటింగ్ జరిగే సన్నివేశాల గురించి సంజయ్తో చర్చించే వాడంట. ఆ సమయంలో సంజయ్ మనసు ఎలా ఉండేది...ఆ సంఘటనల గురించి ఎలా స్పందించేవాడని అడిగి తెలుసుకునే వాడినన్నాడు రణ్బీర్. అంతేకాక సంజయ్ డ్రగ్స్కు బానిసయినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉండేదో తెలిపే ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు రణ్బీర్. ‘ఒకానొక సమయంలో బాబా డ్రగ్స్కు తీవ్రంగా బానిసయ్యాడు. ఆ సమయంలో ఒకసారి బాబాకు తన తండ్రి సునిల్ దత్ సాబ్ తల మీద క్యాండిల్ వెలుగుతున్నట్లు అనిపించిందంట. సంజయ్ వెంటనే వెళ్లి ఆ క్యాండిల్ను తొలగించాడంట. సంజయ్ డ్రగ్స్కు ఎంతలా బానిసయ్యడనే విషయం అప్పుడు దత్సాబ్కు అర్థమయ్యింది‘ అని రణ్బీర్ తెలిపాడు. -
నటిని టచ్ చేద్దామని ఆమె గదిలో మూడు రోజులు..
న్యూయార్క్ : ఇప్పటి వరకు పురుషులు స్త్రీలను వేధించడం చూశాం. అయితే, ఓ మహిళ కూడా మరో మహిళను లైంగికంగా వేధిస్తుందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అనుభవం కూడా ఓ ప్రముఖ హాలీవుడ్ నటి ఎదుర్కోవాల్సి వచ్చింది. పమీలా ఆండర్సన్ ప్రముఖ కెనడియన్ అమెరికన్ నటి పైగా మోడల్. ఆమెకు ఓ అతిథి బస గృహం ఉంది. 2001లో ఒకసారి వైద్యం చేయించుకునేందుకు ఆమె తల్లిదండ్రులు వస్తున్నందున వారికోసం ఆ ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లింది. అయితే, తన పడక గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా అందులో ఓ మహిళ తనకు ఇష్టమైన, తాను ధరించే బే వాచ్ స్విమ్ సూట్ను ధరించి కనిపించింది. దాంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే, తనను చూసి భయపడవొద్దని, తాను అల్లరి చేసేందుకు రాలేదని, తాను కేవలం ఆమెను స్పృషించేందుకే వచ్చానంటూ చెప్పింది. టచ్ చేసేందుకు వచ్చినంత మాత్రానా తనను లెస్బియన్ అనుకోవద్దని చెప్పింది. దాంతో ఒక్కసారిగా పమీలాకు చెమటలు పట్టాయి. 'నిన్ను ఓసారి టచ్ చేసి వెళ్లేందుకే నేను ఈ ఇంట్లోకి రహస్యంగా చొరబడ్డాను. మీరు ఒక్కరోజైనా రాకపోతారా అని మీరు ధరించే స్విమ్ సూట్ను వేసుకొని మూడు రోజులుగా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాను' అని ఆమె చెప్పింది. దాంతో అప్పటికే తన ఇద్దరు బిడ్డలతో వచ్చిన పమీలా ఆ కొత్త మహిళ బహుశా ఓ సైకో ఉంటుందని భయపడి తన సెక్యూరిటీని అలర్ట్ చేసింది. దాంతో వారు ఆమెను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే, పోలీసుల విచారణలో కూడా పమీలాకు హానీ చేయడానికి వచ్చినట్లు రుజువు కాలేదు. కేవలం వెర్రి అభిమానంతోనే ఆమె ఇంట్లోకి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ సంఘటన మాత్రం తనను భయపెట్టిందని, ఇప్పటికీ గుర్తొస్తే భయపడుతుంటానని ఓ మీడియాకు ఓ లేఖ ద్వారా ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు. -
కొవ్వు కరిగే చిట్కా చెప్పిన తమన్నా..
-
కొవ్వు కరిగే చిట్కా చెప్పిన తమన్నా..
సాక్షి, హైదరాబాద్ : హీరోయిన్ తమన్నా ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెను మిల్కీబ్యూటీ అనిపిలుస్తారంటే ఆమె అందం ఎంత సుకుమారమో అర్ధమైపోతుంది. బాహుబలిలో సన్నటి మెరుపు తీగలా కనిపించిన ఈ ముద్దు గుమ్మ అదే సమయంలో పూర్తి ఫిట్నెస్తో కనిపిస్తూ యుద్ధ విన్యాసాలు ఎంతో చక్కగా చేసి మెప్పించారు. ఇది చూసిన ఎవరికైనా తమన్నా తన ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటిస్తారని, భారీగా వర్క్వుట్లు కూడా చేస్తారని అందరికీ డౌట్ రావచ్చు.. అయితే ఆరోగ్యవంతమైన, జిమ్లో గడపడం వంటి విషయాలు పక్కనబెడితే ఆమె ఓ కప్పు కాఫీతోనే తన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకుంటారంట. అయితే, మాములు కాఫీ కాదు.. బటర్ కాఫీ.. సాధారణంగా మనం బటర్ మిల్క్ వింటాంగానీ, ఈ బటర్ కాఫీ ఏమిటి అని ప్రశ్నించగా ఇది తన ఆరోగ్య రహస్యం అని చెప్పారు. కాఫీలో బటర్ మిక్స్ చేసి తాగితే కొవ్వుమొత్తం కరిగి పోతుందని, హృదయానికి మంచిదని, రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుందని చెప్పారు. తన రోజును బటర్ కాఫీతోనే ప్రారంభిస్తానంటూ ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. -
‘పద్మావతి’ వాయిదా వెనక సీక్రెట్
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పదమైన సంజయ్ లీలా బన్సాలీ బాలీవుడ్ చిత్రం ‘పద్మావతి’ విడుదలను కొన్ని హిందూ శక్తుల బెదిరింపులకు భయపడి నిరవధికంగా వాయిదా వేయడం పట్ల సోషల్ మీడియాలో ముఖ్యంగా, ట్విట్టర్లో మిశ్రమ స్పందన వస్తోంది. కొత్త మంది దీన్ని హిందూ శక్తుల విజయంగా వ్యాఖ్యానిస్తుండగా, ఎక్కువ మంది ఇది ప్రజాస్వామ్యానికి ఓటమని, ముఖ్యంగా భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతమని వ్యాఖ్యానిస్తున్నారు. భారత యావత్ చలనచిత్ర పరిశ్రమ సంఘటితంగా నిలబడి ఉంటే నేడు ‘పద్మావతి’కి ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇందుకు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వారంతా సిగ్గుతో తలదించుకోవాల్సిందేనని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు. గోవాలో ప్రారంభమవుతున్న అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో ప్రదర్శించే భారతీయ సినిమాల జాబితా నుంచి ఎస్. దుర్గా, న్యూడ్ చిత్రాలను కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు తొలగించడం పట్ల వివాదం రాజకున్న తరుణంలోనే పద్మావతి వివాదం తారాస్థాయికి చేరుకుంది. పద్మావతి సినిమా షూటింగ్ జరుగుతుండగానే అంటే, గత జనవరి నెలలో సినిమాకు వ్యతిరేకంగా కొన్ని హిందూ శక్తులు ఆందోళనలు నిర్వహించాయి. సినిమా షూటింగ్ సెట్లను దగ్ధం చేయడం దగ్గరి నుంచి పద్మావతి దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీని తల నరికిన వాడికి పది కోట్లు హిస్తామని, పద్మావతిగా సినిమాలో నటించిన దీపికా పదుకొణె ముక్కు కోసిన వ్యక్తికి కోటి రూపాయలు, ఆమెను నిలువున తగులబెట్టిన వ్యక్తికి మరో కోటి రూపాయలు ఇస్తామని బెదిరిస్తూ వచ్చాయి. ఓ బీజేపీ ఎమ్మెల్యేనే ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం గమనార్హం. ఇలాంటి బెదిరింపులను సినీ పరిశ్రమ సంఘటితంగా ఎదుర్కోక పోవడం వల్లనే నేడు పద్మావతి సినిమా విడుదలను నిలిపివేయాల్సి వచ్చిందని, ఇది నిజంగా గూండాల విజయమని ఎక్కువ మంది ట్వీట్లు చేస్తున్నారు. ఇంతటి బెదిరింపులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం ఏమిటని, ముఖ్యంగా సినిమా పరిశ్రమ పట్ల ఆసక్తి చూపించే స్మతి ఇరానీ లాంటి వారు కూడా బాలీవుడ్ నటి పదుకొణేను అంతగా బెదిరిస్తున్నా ఎందుకు మాట్లాడడం లేదని ట్వీటర్లు ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓ రాజకీయ పార్టీ లబ్ధి పొందడం కోసమే కొన్ని హిందూ శక్తులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోందని, ఎన్నికల అనంతరం ఆందోళన సద్దుమణుగుతోందని ఆ పార్టీ ప్రభుత్వమే భరోసా ఇవ్వడంతోనే పద్మావతి విడుదలను వాయిదా వేసుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్ జిందా హై’ సినిమా డిసెంబర్ 22వ తేదీన విడుదల కావాల్సి ఉందని, ఆ సమయంలో పద్మావతి విడుదలయితే తమకు ఇబ్బంది అవుతుందని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మావతి స్థానంలో అంటే, డిసెంబర్ ఒకటవ తేదీన ‘టైగర్ జిందా హై’ చిత్రాన్ని విడుదలకు చర్యలు తీసుకోవాలని వారు ఆ సినిమా నిర్మాతలను కోరుతున్నట్లు తెల్సింది. Simply unprecedented.. the inability of our industry to stand together as one has got us here. A film, an artistic work used to the hilt for political gains, for free publicity. All industry ‘leaders’ should hang their heads in shame! #PadmavatiPostPoned — Amul Vikas Mohan (@amul_mohan) 19 November 2017 The real question is: what is the Padmavati row distracting us from? — Tanmay Bhat (@thetanmay) 19 November 2017 Big news from Bollywood with #Padmavati release being postponed; not happening on Dec1. Unfortunate to see all the political issues surrounding the film! The makers have been left with no other go! — Kaushik LM (@LMKMovieManiac) 19 November 2017 -
గిజా పిరమిడ్ రహస్యం ఇదే..!
-
పండే కదా అని తినేస్తే...!
-
డిగ్గీరాజా.. ట్వీట్ గుట్టు