Section 144
-
తాడిపత్రిలో టెన్షన్.. కేతిరెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అనంతరం, తాడిపత్రి నియోజకవర్గంలోకి కేతిరెడ్డి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు. తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.తాడిపత్రిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం ఉదమయే కేతిరెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని గృహ నిర్బంధంలోనే ఉంచారు. అనంతరం, కేతిరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు.ఇదిలా ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ వర్గీయులు రెచ్చిపోతున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ఏడు నెలలుగా అడ్డంకులు సృష్టిస్తూన ఉన్నారు. జేసీ కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేసీ, పోలీసుల తీరుపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం తాడిపత్రిలోకి ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ ప్రశ్నించారు. దీంతో, తిమ్మంపల్లి గ్రామంలో పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
HYD Alert: మియాపూర్, చందానగర్ పరిధిలో 144 సెక్షన్ విధింపు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్, చందానగర్ పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్మిగూడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.కాగా, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదివారం ఉదయం మియాపూర్లో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదీనాగూడ సర్వే నెంబర్ 100, 101లో శాంతి భద్రతలను పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నాం. మియాపూర్, చందానగర్ పరిధిలో ఈరోజు నుంచి జూన్ 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్మిగుడి ఉన్న చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రభుత్వ స్థలాలలో ఇల్లు ఇస్తామని మభ్యపెట్టి ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొంతమందిపైన కేసులు నమోదు చేశాం. మరికొంత మందిని గుర్తించి కేసులు పెడతాము అని చెప్పారు. ఇదిలా ఉండగా.. మియాపూర్లో ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసుల కేసులు నమోదు చేశారు. సంగీత, సీత అనే మహిళలు చాలా మంది మహిళలను రెచ్చగొట్టారని తెలిపారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా స్థానిక ఫంక్షన్ హాల్స్లో మీటింగ్ ఏర్పాటు చేసి పేదలను రెచ్చగొట్టారని అన్నారు. పేదలను రెచ్చగొట్టిన పది మందిపై కేసులు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. The people of Miyapur came to take over the lands campaigned on social media in Hyderabad saying come and take over the lands.#Hyderabad #Miyapur pic.twitter.com/z29xhzJWvX— ఉత్తరతెలంగాణ నౌ (@UttaraTGNow) June 23, 2024 -
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ ఎత్తివేత
-
విజయనగరం జిల్లాలో 144 సెక్షన్
-
అన్సారీ అంత్యక్రియలు పూర్తి
లక్నో: గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు శనివారం యూపీలోని గాజీపూర్లో ముగిశాయి. వేలాది మంది అన్సారీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశారు. కొందరు శ్మశాన వాటికలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. అన్సారీ సోదరుడు, ఎంపీ అఫ్జల్ అన్సారీ, ఘాజీపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆర్యక అఖౌరీ మధ్య ఈ సందర్భంగా కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. -
అక్కడ మే 17 వరకు 144 సెక్షన్.. ఎందుకంటే..
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మే 17 వరకు లక్నోలో 144 సెక్షన్ విధించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు, హోలీ, రంజాన్తో సహా ముఖ్యమైన, మతపరమైన పండుగల దృష్ట్యా లక్నో నగరంలో 144 సెక్షన్ విధించినట్లు లా అండ్ ఆర్డర్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఉపేంద్ర కుమార్ అగర్వాల్ తెలియజేశారు. లక్నో లోక్సభ నియోజకవర్గానికి ఐదో దశలో మే 20న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంమీద లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. పోలీసుల నిషేదాజ్ఞల ప్రకారం.. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటానికి వీల్లేదు. పాదయాత్రలు నిర్వహించడం, బాణాసంచా కాల్చడంపై నిషేధం. అలాగే లౌడ్ స్పీకర్లు, మ్యూజిక్ బ్యాండ్ల వినియోంగంపై నిషేధం ఉంటుంది. ముందస్తు అనుమతి లేకుండా సామాజిక కార్యక్రమాలు, నిరసనలు లేదా నిరాహార దీక్షలు చేపట్టడానికి అనుమతి లేదు. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రవిదాస్ మెహ్రోత్రాపై బీజేపీ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను రంగంలోకి దింపింది. రాజ్నాథ్ 2014, 2019 ఎన్నికల్లో లక్నో స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1991 నుంచి ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంది. -
జన్వాడలో ఉద్రిక్తత: 144 సెక్షన్.. 21 మంది అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని జన్వాడ చర్చ్పై దాడి కేసులో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేసినట్టు మొకిలా పోలీసులు తెలిపారు. కాగా, వివరాల ప్రకారం.. జన్వాడలో రోడ్ వైడ్నింగ్ చేయాలని ఒక వర్గం పట్టుబట్టింది. ఈ క్రమంలో పంచాయతీరాజ్ అధికారులు దీనికి ఒప్పుకోకపోవడంతో అక్కడున్న చర్చ్పై వారంతా దాడికి పాల్పడ్డారు. కాగా, చర్చ్ కూల్చివేతను మరో వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో దాదాపు 200 మంది పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేప్టటారు. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ తెలిపారు. అలాగే, జాన్వాడలో 144 సెక్షన్ కొనసాగుతోందన్నారు. ఈనెల 21వ తేదీ వరకు జన్వాడలో ఆంక్షలు అమలులో ఉంటాయని హెచ్చరించారు. -
Delhi Chalo: హస్తినలో హైటెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: పలు డిమాండ్ల సాధనతో మంగళవారం దేశ రాజధానిలో నిరసనకు సిద్ధమైన అన్నదాతల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధం అయ్యారు. ఉదయం నుంచే బారికేడ్లతో ఎక్కడికక్కడ సరిహద్దుల వద్ద నిలబడ్డారు. దీంతో అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు నెల రోజులపాటు ఢిల్లీలో సభలు, ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, నగరంలోకి ట్రాక్టర్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు పోలీసులు తేల్చి చెప్పారు. ఢిల్లీలో నెల రోజులపాటు 144 సెక్షన్ అమలవుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. నేటి నుంచి వచ్చే నెల 12వ తేదీ దాకా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జనం గుంపులుగా గుమికూడవద్దని పేర్కొన్నారు. రైతు సంఘాల ‘చలో ఢిల్లీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. రోడ్లను దిగ్బంధించడం, ప్రయాణికుల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిటీలో ట్రాక్టర్ల ర్యాలీలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. నగర పరిధిలో అనుమానిత వస్తువులు, పేలుడు పదార్థాలు, బాణాసంచా, ఇతర అనుమతి లేని ఆయుధాలు, ప్రమాదకరమైన రసాయనాలు, పెట్రోల్, సోడా సీసాలు రవాణా చేయడంపైనా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. #WATCH | Ambala, Haryana: Security heightened at the Shambhu border in view of the march declared by farmers towards Delhi today. pic.twitter.com/AwRAHprtgC — ANI (@ANI) February 13, 2024 రెచ్చగొట్టే నినాదాలు, ప్రసంగాలు, సోషల్ మీడియాలో అనుచిత మెసేజ్లు పంపడంపైనా నిషేధం ఉందన్నారు. భూసేకరణలో తీసుకున్న భూములకు పరిహారం పెంచడం, పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకురావడంతోపాటుఇతర డిమాండ్ల సాధన కోసం రైతులు మంగళవారం తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గత అనుభవాల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. రోడ్లపై బారికేడ్లు.. కొయ్యముక్కలు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాతోపాటు పలు రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. 13వ తేదీన పార్లమెంట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 2 వేలకు పైగా ట్రాక్టర్లతో ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. నిరసనకారులను ∙అడ్డుకోవడానికి వివిధ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సరిహద్దుల్లో రోడ్లపై మేకుల్లాంటి పదునైన కొయ్యముక్కలు బిగించారు. #WATCH | Delhi: Security heightened at Delhi borders in view of the march declared by farmers towards the National Capital today. (Visuals from Gazipur Border) pic.twitter.com/XeKWMWi1S9 — ANI (@ANI) February 13, 2024 రైతు సంఘాలతో మంత్రుల చర్చలు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా సోమవారం చండీగఢ్లో రైతు సంఘాల నేతలతో రెండో దశ చర్చలు ప్రారంభించారు. సంయుక్త కిసాన్ మోర్చా నేత జగజీత్ దలీవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వన్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. రైతుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందని, చలో డిల్లీ కార్యక్రమాన్ని విరమించుకోవాలని మంత్రులు కోరారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 2020–2021 కాలంలో చేపట్టిన రైతుల ఉద్యమం సందర్భంగా వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునేందుకు ఒప్పుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు -
తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్
-
#KhaidiNo7691 : ఏపీ వ్యాప్తంగా టీడీపీ బంద్ విఫలం
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు విఫలమైంది. యధావిధిగా ప్రజా జీవనం కొనసాగింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్.. రిమాండ్ మీద రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం తెలిసిందే. ఈ పరిణామాలను నిరసిస్తూ.. టీడీపీ, అనధికారిక మిత్రపక్షం జనసేన పార్టీలు ఇవాళ(సోమవారం) ఏపీ వ్యాప్తంగా బంద్కు పిలుపు ఇచ్చాయి. అయితే చంద్రబాబు అరెస్ట్లాగానే.. ఈ బంద్ పిలుపును కూడా ఏపీ ప్రజలు అసలు పట్టించుకోలేదు. చంద్రబాబు అరెస్ట్పై ఏపీ జనం నుంచి స్పందన కరువైంది. బంద్కు మద్దతుగా వ్యాపార, విద్యా సంస్థల నుండి ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. సోమవారం వేకువ జాము నుంచే ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్స్ రోజూ వారిలాగే నడుస్తున్నాయి. అదే విధంగా.. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. విద్యాసంస్థలు సైతం మాములుగానే నడుస్తున్నాయి. అదే సమయంలో.. తెలుగు తమ్ముళ్లు రోడ్లపైన కనిపించ లేదు. ఇంకోవైపు ఇరు పార్టీల ముఖ్య నేతలు దాదాపుగా ఈ బంద్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొందరు కార్యకర్తలు మాత్రం రోడ్డెక్కి హడావిడి చేస్తున్నారు. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు అతి చేష్టలకు దిగగా.. అరెస్టుల పర్వం కొనసాగింది. టీడీపీ సంగతి ఏమోగానీ.. జనసేన కార్యకర్తలు బంద్ను అసలు పట్టించుకోలేదు. విజయవాడ: నగరంలో బంద్ ప్రభావం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సులు యధాతధంగా తిరుగుతున్నాయి. అయితే ముందస్తు జాగ్రత్తగా.. పండిట్ నెహ్రూబస్ స్టేషన్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి.. రాజమండ్రి నగరంలో బంద్ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. రాజమండ్రిలో ఉదయాన్నే దుకాణాలు షాపులు తెరుచుకున్నాయి. బస్సులు యధావిధిగా తిరుగుతున్నాయి. ప్రజల రోజు వారి కార్యకలాపాలు మాములుగానే కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ బంద్కు బీజేపీ దూరంగా ఉన్న సంగతీ తెలిసిందే. ఏపీలో 144 సెక్షన్ విధింపు ఇదిలా ఉంటే.. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు విధ్వంసానికి తెగబడే అవకాశాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అల్లర్లు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. జిల్లాలో సెక్షన్30 అమలు టీడీపీ అధినేత చంద్రబాబును రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకువస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దీని ప్రకారం జిల్లాలో ఎటువంటి ధర్నాలు, నిరసనలకు అనుమతి లేదు. ఈ నిబంధనలు 10వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ నెలాఖరు వరకూ అమలులో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించనున్నామని తెలిపారు. కాగా, జిల్లా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా విస్తృతంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ వాహ నాలతో ప్రత్యేక పోలీసు బృందాలతో పాటు, స్పెషల్ పార్టీ పోలీసులను నియమించారు. విజయనగరం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి ఇచ్చిన బంద్ పిలుపునకు స్పందన కొరవడింది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు కొందరు టిడిపి కార్యకర్తలు చేరుకొని బస్సులను ఆపాలని ప్రయత్నించారు. బంద్కు అనుమతి లేకపోవడంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి బస్సులు రాకపోకలకు ఆటంకం లేకుండా నియంత్రించారు. ఈ చర్యలతో బస్సు ప్రయాణికుల కు ఎక్కడా అసౌకర్యం కలగలేదు. బస్ లు యధావిధిగా గా నడుస్తున్నాయి. చిత్తూరు: చిత్తూరు జిల్లాలో టీడీపీ బంద్ ప్రభావం కనిపించడం లేదు. బస్సులు యధావిధిగా తిరుగుతుండగా.. వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. రోడ్డు మీద కొందరు టీడీపీ కార్యకర్తలు జెండాలతో హడావిడి చేస్తున్నా.. అవేం పట్టించుకోని జనాలు తమ పనులు తాము చేసుకుంటున్నారు. కుప్పంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఓవరాక్షన్ టీడీపీ బంద్ పిలుపులో భాగంగా.. కుప్పంలో టీడీపీ శ్రేణులు బస్సు అద్దాలు ధ్వంసం చేశాయి. ఆ సమయంలో అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా.. ఎమ్మెల్సీ శ్రీకాంత్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి: జిల్లాలో బంద్ ప్రభావం కనిపించడం లేదు. బస్సుల రాకపోకలు యధావిదిగా కనిపిస్తున్నాయి. పాయకరావుపేట ఎలమంచిలి అనకాపల్లి చోడవరం మాడుగుల పట్టణాల్లో తెరుచుకున్న దుఖానాలు.. యధావిధిగా జనజీవనం నడుస్తోంది. తిరుపతి: శ్రీకాళహస్తి లో టిడిపి బంద్ ప్రభావం కనిపించడం లేదు. ఉదయం నుంచే వ్యాపార సముదాయాలు, మార్కెట్లు యధావిధిగా తెరచుకున్నాయి. ప్రజాజీవనం యధాతధంగా నడుస్తోంది. పలాసలో బందు విఫలం చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకిస్తూ,టీడీపీ పార్టీ సోమవారం చేపట్టిన బంద్ శ్రీకాకుళంలో పూర్తిగా విఫలమైంది. జన జీవనం యధావిధిగా కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులను ఆపడానికి ప్రయత్నించిన టీడీపీ క్యాడరును అరెస్టు చేసి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు. -
ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. ఆల్టైమ్ రికార్డు
న్యూఢిల్లీ: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో యమునా నది మరింత ఉధృతరూపం దాల్చింది. నదిలో నీటిమట్టం గురువారం ఉదయం నాటికి 208.46 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్టైమ్ రికార్డు. 1978లో 207.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఉదయం 10 గంటల తర్వాత యమునా నీటి ప్రవాహం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, దీనిని ‘తీవ్ర పరిస్థితి’గా కేంద్ర జల సంఘం పేర్కొంది. ఇక నది నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం సూచించింది. బుధవారం నది సమీపంలోని ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వ అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 అమిత్ షాకు కేజ్రివాల్ లేఖ ఢిల్లీలో వరద ఉధృతి పెరుగుతోందని, యమునలో నీటిమట్టం మరింత పెరగకుండా చర్యలు తీసుకొనే విషయంలో సహకారం అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో భీకర వరదలు రావడం ప్రపంచానికి మంచి సందేశం కాదని చెప్పారు. జి–20 సదస్సుకు త్వరలో ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతోందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర హోంశామంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హరియాణాలోని హత్రీకుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గిస్తే ఢిల్లీలో వరదలు తగ్గుముఖం పడతాయని సూచించారు. ఢిల్లీ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. యుమునా నదిలో నీటిమట్టం 207.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసిందని తెలిపారు. అదే జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని కేజ్రివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న జల ప్రవాహమే ఇందుకు కారణమని ఆయన ట్వీట్ చేశారు. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 హిమాచల్లో 88 మంది మృతి హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నంకల్లా రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 88కి చేరింది. మరో 16 మంది గల్లంతయ్యారు. 100 మంది క్షతగాత్రులయ్యారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పశువుల కొట్టాలు కూలిపోయాయి. #WATCH | Traffic affected after GT Karnal road in Delhi gets flooded after rise in water level of Yamuna River pic.twitter.com/hoaKTR2ZCr — ANI (@ANI) July 13, 2023 మరోవైపు పంజాబ్, హరియాణాలో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 18కు చేరుకుంది. హరియాణాలో చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. పంజాబ్లో 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో వర్షాల కారణంగా గత 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హిమాచల్లోని మండీలో పూర్తిగా ధ్వంసమైన వంతెన -
బళ్లారిలో 144 సెక్షన్...
-
బీహార్లో హైటెన్షన్.. ఒకరు మృతి, 80 మంది అరెస్ట్
పాట్నా: శ్రీరామనవమి సందర్భంగా బీహార్లో రాజుకున్న ఘర్షణ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా నలంద జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఓ వ్యక్తి మృతిచెందడంతో పోలీసులు 80 మందిని అరెస్ట్ చేశారు. అలాగే, పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇక, అల్లర్ల కారణంగా బీహార్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయ్యింది. వివరాల ప్రకారం.. బీహార్లోని ససారంలో శనివారం సాయంత్రం బాంబ్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ పేలుడుపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఫొరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంపై ససారం డీఎం ధర్మేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రోహ్తాస్లోని ఓ గుడిసెలో బాంబు పేలినట్టు తమకు సమాచారం అందిందని, వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిందని అన్నారు. ఇది మతపరమైన సంఘటనగా కనిపించడం లేదని ప్రాథమికంగా తెలుస్తోందని చెప్పారు. Bihar | It has been found that 6 persons were injured during the handling of illegal explosives at a private property in Rohtas; a team of forensic experts is conducting an investigation at the spot. Two persons arrested: Rohtas Police pic.twitter.com/5CLihSFYmh — ANI (@ANI) April 2, 2023 మరోవైపు, నలందాలోని బీహార్షరీఫ్లో శనివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పహర్పూర్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముఖేష్ కుమార్ అనే బాధితుడు మరణించాడని పోలీసులు తెలిపారు. ఇక శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఉద్రిక్తతలు చెలరేగడంతో నలందాలో 80 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పారామిలటరీ బలగాలను మోహరించారు. ఇక, ఆదివారం కూడా స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదిలా ఉండగా.. మార్చి 31న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ పర్యటనకు రావాల్సి ఉంది. అయితే ఈ అల్లర్ల వల్ల ఆయా ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో అమిత్ షా పర్యటన రద్దయ్యింది. #WATCH | Police personnel deployed in Biharsharif, Nalanda as Section 144 is imposed in the city after a fresh clash erupted last night following violence during Ram Navami festivities#Bihar pic.twitter.com/Th9zffoJFt — ANI (@ANI) April 2, 2023 -
అదానీపై విచారణ డిమాండ్తో... ఈడీ ఆఫీసుకు విపక్షాల ర్యాలీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు అవకతవకలపై ఈడీతో లోతుగా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ విపక్ష పార్టీలు సమైక్యంగా కదం తొక్కాయి. ఈ ఉదంతంపై ఈడీకి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు 18 విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో పార్లమెంటు భవనం నుంచి ఈడీ ప్రధాన కార్యాలయం వైపు ర్యాలీగా బయల్దేరారు. ఈడీ కార్యాలయానికి వెళ్తున్న ఎంపీలను మార్గమధ్యంలోనే విజయ్ చౌక్ సమీపంలో పోలీసులు అడ్డుకుని ముందుకు వెళ్లకుండా నిలువరించారు. బారికేడ్లతో రోడ్లను మూసేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ర్యాలీని అనుమతించబోమని చెప్పారు. దీనిపై నేతలంతా మండిపడ్డారు. అదానీపై విచారణ కోరుతూ ఈడీకి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తే మోదీ సర్కారు నిరంకుశంగా అడ్డుకుందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. దాదాపు 200 మంది ఎంపీల శాంతియుత ర్యాలీని అమానుషంగా అడ్డుకున్నారంటూ దుయ్యబట్టారు. అనంతరం ఎంపీలంతా పార్లమెంటు ప్రాంగణానికి వెనుదిరిగారు. ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు పాల్గొనకపోవడం విశేషం. అంతకుముందు తృణమూల్ విడిగా ఎల్పీజీ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ధర్నా చేసింది. -
శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ జాషువా
-
గన్నవరంలో 144 సెక్షన్.. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు:ఎస్పీ జాషువా
సాక్షి, కృష్ణా: గన్నవరం నియోజకవర్గ పరిధిలో సోమవారం టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణులు మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఇవాళ టీడీపీ తలపెట్టిన చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జూషువా తెలిపారు. టీడీపీ నాయకుడు పట్టాభి.. విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడికి పురి గొల్పడం, బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. ఈ ఘటనలో గన్నవరం సీఐ కనకారావు తలకు బలమైన గాయమైందని పేర్కొన్నారు. 'పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం. సుమోటోగా రియటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదు. గన్నవరం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చెక్ పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేశాం. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని ఎస్పీ జాషువా ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. చదవండి: గన్నవరం రణరంగం.. ఎమ్మెల్యే వంశీపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన టీడీపీ నేతలు -
మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్రం నిషేధించిన మోదీ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థులు ప్రయత్నించడం టెన్షన్ వాతావరణానికి దారితీసింది. ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం, పోలీసు అధికారులు నిరాకరించారు. అయినా ఎన్ఎస్యూఐకి చెందిన విద్యార్థులు దీన్ని స్క్రీనింగ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో క్యాంపస్కు కరెంట్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. ఫలితంగా విద్యార్థులు యూనివర్సిటీ బయట ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా యువత భారీగా తరలివచ్చారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. 24 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. తాము స్కీనింగ్కు ఏర్పాట్లు చేశామని, ల్యాప్టాప్లు, ప్రొజెక్టర్లను ధ్వసం చేశారని విద్యార్థులు ఆరోపించారు. Students gathered for screening of BBC’s documentary, India: The Modi Question, at Arts Faculty, DU were stopped by police and security personnel.#BBC #BBCDocumentary #IndiaTheModiQuestion #DU #ArtsFaculty #NorthCampus #DelhiUniversity pic.twitter.com/WwJQEGebS3 — Chirag Jha (@iChiragJha) January 27, 2023 అటు అంబేడ్కర్ యూనివర్సిటీలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థులు విఫలయత్నం చేశారు. దీనికి కూడా కరెంటు సరఫరా నిలిపివేశారు. ఫలితంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ రెండు యూనివర్సిటీల్లో ఎలాంటి వీడియోలు ప్రదర్శించడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. అయినా వారు మెబైల్ ఫోన్లలో చూడాలనుకుంటే వారి విచక్షణకే వదిలేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2002లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లపై బీబీసీ రెండు వీడియోల డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఇది దురుద్ధేశపూర్వకంగా ఉందని కేంద్రం బ్యాన్ చేసింది. యూట్యూబ్, ట్విట్టర్లో ఈ వీడియో లింకులను బ్లాక్ చేసింది. అయినా కొన్ని యూనివర్సిటీల్లోని విద్యార్థులు ఈ డాక్యుమెంటరినీ ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ జేఎన్టీయూ యూనివర్సిటీలో కూడా విద్యార్థులు ఈ వీడియో స్క్రీనింగ్కు ప్రయత్నించగా.. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. చదవండి: రాహల్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్! కేవలం కిలోమీటర్ తర్వాతే.. -
Macherla: 144 సెక్షన్ గడువు పొడిగింపు
మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో శాంతిభద్రతల దృష్ట్యా ఈనెల 22వ తేదీ వరకు 144 సెక్షన్ను పొడిగించినట్లు అర్బన్ సీఐ టి బాలకృష్ణ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 16వ తేదీన పట్టణంలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో విధించిన 144 సెక్షన్ పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, బహిరంగసభలు నిర్వహించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి 144 సెక్షన్కు అనుగుణంగా నిబంధనలు పాటించాలని సీఐ కోరారు. రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. (క్లిక్ చేయండి: ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్) -
‘మహా’మేళాకు కర్ణాటక నో.. ఉద్రిక్తత, 144 సెక్షన్ విధింపు
బెళగావి: హద్దుల పంచాయితీతో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తారస్థాయికి చేరుకుంది. ‘మహా’ మేళ నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవటంపై బెళగావి సమీపంలో సోమవారం వందల మంది ఆందోళన చేపట్టారు. కొగ్నోలి టోల్ ప్లాజా వద్దకు ‘మహారాష్ట్ర ఏకీకరణన్ సమితి’(ఎంఈఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేతలు, కార్యకర్తలు వందల మంది చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బెళగావి ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున బెళగావిలో ప్రతిఏటా సమావేశం నిర్వహిస్తుంది మహారాష్ట్ర ఏకీకరణన్ సమితి. గత ఐదేళ్లుగా సరిహద్దు వివాదంపై ఆందోళనలు చేస్తోంది ఎంఈఏస్. ఈ ఏడాది కూడా శీతాకాల సమావేశల తొలిరోజున భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే బెళగావి జిల్లా ప్రధాన కేంద్రంలోని తిలక్వాడీ ప్రాంతంలో ఉన్న వ్యాక్సిన్ డిపో గ్రౌండ్ వద్ద ఎంఈఎస్ ఆందోళనకు దిగింది. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందల మంది ఎంఈఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తిలక్వాడీ రోడ్డులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. అయినప్పటికీ మహారాష్ట్ర వికాస్ అకాడీ(ఎంవీఏ) కార్యకర్తలు బెళగావిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. 5వేల మంది పోలీసులు.. బెళగావిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు 5,000 మంది పోలీసులను మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు ఎస్పీలు, 11 మంది ఏఎస్పీలు, 43 మంది డిప్యూటీ ఎస్పీలు, 95 మంది ఇన్స్పెక్టర్లు, 241 మంది ఎస్సైలు ఆందోళనల ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. Belagavi, Karnataka | Members of Maharashtra Ekikaran Samiti and NCP stage protest near Kognoli Toll Plaza near Karnataka-Maharashtra border over inter-state border issue pic.twitter.com/XaPJwEbBKv — ANI (@ANI) December 19, 2022 ఇదీ చదవండి: అసెంబ్లీలో వీర్ సావర్కర్ చిత్రపటంపై రగడ.. నిరసనకు దిగిన ప్రతిపక్షం -
Hyderabad: కమాండ్ కంట్రల్ సెంటర్ వద్ద సరికొత్త బారికేడింగ్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం కొనసాగుతున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే వివిధ రాజకీయ పార్టీల ధర్నాలు, ఆందోళనలు కొనసాగే అవకాశాన్ని గుర్తించిన అధికారులు పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద ఎలాంటి ఆందోళనలకు తావు లేకుండా, ఎవరూ లోనికి దూసుకురాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. శనివారం బీజేపీ కార్యకర్తలు, నేతలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి యత్నించగా వారిని సమీపంలోనే పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పక్కా ప్రణాళికతో కమాండ్ కంట్రల్ సెంటర్ వద్దకు రాకుండానే వారిని నియంత్రించారు. ఇందుకోసం సరికొత్త బారికేడింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా పికెటింగ్లు కూడా ఏర్పాటు చేస్తూ అక్కడ కూడా ఆధునిక బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆందోళనకారులు ముందుకు రాకుండా నిరోధించేందుకు ఈ కొత్త బారికేడింగ్ సిస్టమ్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. సీబీఆర్టీ పరీక్ష నేపథ్యంలో 144 సెక్షన్ అమలు హిమాయత్నగర్: సీబీఆర్టీ పరీక్షల నేపథ్యంలో 144 సెక్షన్ను విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సీబీఆర్టీ పరీక్ష కేంద్రాల వద్ద సుమారు 500 అడుగుల మేర నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తప్పవంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా ఆయా పోలీసు స్టేషన్ల సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం 6 గంటల పాటు, మంగళవారం 6 గంటల పాటు ట్విన్ సిటీస్లో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సెంటర్స్లో సీబీఆర్టీ ఎగ్జామ్ జరుగుతున్నట్లు తెలిపారు. పరీక్షకు ఏవిధమైన ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: డీఏవీ స్కూల్ ఉదంతం నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లపై ప్రత్యేక నజర్) -
ముంబైలో ఈనెల 16 నుంచి మీటింగ్లు, ఊరేగింపులు నిషేధం.. ఎందుకో తెలుసా?
సాక్షి, ముంబై: ముంబైలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ముంబై, తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది. దీంతో ముంబైకర్లు ఒకచోట నలుగురి కంటే ఎక్కువ మంది కలిసి గుంపుగా ఉండరాదు. గుంపులుగా ఉంటే పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీనికి తోడు శివసేనకు అసలు వారసులం మేమేనని, మాకే సంఖ్యా బలం ఎక్కువ ఉందని, అందుకు పార్టీ గుర్తు విల్లు–బాణం (ధనుశ్య–బాణ్) తమకే దక్కాలని ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, అటు ఏక్నాథ్ శిందే వర్గం మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం తాజాగా ఉండగానే రమేశ్ లట్కే మృతితో ఖాళీ అయిన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గంలో నవంబర్ మూడో తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో కూడా శిందే వర్గం తలదూర్చనుంది. ఠాక్రే వర్గం, శిందే వర్గం పరస్పరంగా ఎదురుపడితే ఘర్షణ జరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంది. పోటాపోటీగా ఇరువర్గాలు... ఈ నెల 24 నుంచి దీపావళి పర్వదిన వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రజలకు కానుకలు, నూతన సంవత్సర క్యాలండర్లు పంపిణీ చేయడం లాంటి పనులతో వారితో సత్సంబంధాలు పెంచుకునే ప్రయత్నాలు ఇరు పార్టీలూ పోటాపోటీగా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో ప్రజావ్యవస్ధలో నెలకొన్న ప్రశాంతతను దెబ్బతీసి ప్రాణ, ఆస్తి నష్టం జరిగేలా కొన్ని ఆసాంఘిక దుష్టశక్తులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం పోలీసులకు అందింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా నగరం, ఉప నగరాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని ముంబై పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి 15 రోజులపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నియమాలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని ముంబై డిప్యూటీ పోలీసు కమిషనర్ సంజయ్ లాట్కర్ స్పష్టం చేశారు. చదవండి: కారులో ప్రయాణిస్తే అది తప్పనిసరి.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్! నిబంధనల్లో భాగంగా నగరంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నలుగురికంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడరాదు. అదేవిధంగా నగరంలో ఎలాంటి ఊరేగింపులు, లౌడ్స్పీకర్లు, బ్యాండ్, ఇతర వాయిద్యాలు వినియోగించకూడదు. బాణసంచా పేల్చడం లాంటి పనులపై సైతం నిషేధం వి«ధించినట్లు సంజయ్ తెలిపారు. పరిస్ధితులు ఇలాగే ఉంటే ఉంటే గడువు ముగిసిన తరువాత కూడా వీటిపై నిఘా ఉంటుందని హెచ్చరించారు. నియమాలు ఉల్లంఘించే వారికి జరిమానా లేదా జైలు శిక్ష, వాయిద్య సామాగ్రి జప్తు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా దీపావళి పర్వదినం సందర్భంగా అనేక మంది భవనాల టెర్రస్ల పైనుంచి, సముద్ర తీరాల నుంచి ఆకాశంలోకి పెద్ద సంఖ్యలో కందిళ్లను (చుక్కలను) ఎగురవేస్తారు. వీటిపై కూడా నిషేధం విధించినట్లు ఆయన తెలిపారు. టపాసులు, దీపెంతలు, విద్యుత్ తోరణాలు తదితర ప్రమాదకర చైనా తయారీ వస్తువులు, కందిళ్లు నిల్వచేసే వ్యాపారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. 144 సెక్షన్ అమలు ఉన్న రోజుల్లో వివాహాలు, ఇతర శుభకార్యాలు, అంత్యక్రియల శోక సభలు, అలాగే కార్యాలయాలు, క్లబ్బులు, సొసైటీ ఆవరణలో, నాట్యగృహాలు, హాలులో, ఫ్యాక్టరీలు, షాపులు, సాధారణ వ్యాపారులు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్ధల్లో జరిగే సభలు, సమావేశాలకు మినహాయింపు ఉంటుందన్నారు. అయితే ముందస్తుగా స్ధానిక పోలీసు స్టేసన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పోలీసు కమిషనర్ సంజయ్ లాట్కర్ స్పష్టం చేశారు. -
కర్ణాటకలో ముసుగు దుండగుల దాడి కలకలం
బెంగళూరు: కర్ణాటకలో గుంపు హత్య కలకలం రేగింది. గురువారం సాయంత్రం మంగళూరు సురత్కల్లోలో నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ బాధితుడు చికిత్స పొందుతూ.. కన్నుమూశాడు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దాడి ఘటన రికార్డు అయ్యింది. కారులో వచ్చిన దుండగులు.. అప్పుడే ఓ బట్టల దుకాణం నుంచి బయటకు వచ్చిన బాధితుడి వైపు దూసుకొచ్చారు. భయంతో అతను పరుగులు తీసే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కర్రలతో, కత్తులతో దాడికి పాల్పడ్డారు. అనంతరం వాళ్లు పారిపోగా.. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తొలుత పోలీసులు వెల్లడించారు. ఆపై అతను మరణించినట్లు తెలుస్తోంది. Karnataka | Last rites of man hacked to death by an unidentified group yesterday being performed in Surathkal near Mangaluru pic.twitter.com/40mIW4SleD — ANI (@ANI) July 29, 2022 ఘటన తర్వాత సురత్కల్ను తమ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు నగర కమిషనర్. 144 సెక్షన్ విధించి.. జనాల్ని గుమిగూడకుండా చూస్తున్నారు పోలీసులు. దాడికి గల కారణాల గురించి తెలియాల్సి ఉంది. బాధితుడిని 25 ఏళ్ల ఫాజిల్గా గుర్తించారు. దీంతో మత కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేవైఎం నేత ప్రవీణ్ నెట్టారు హత్య దక్షిణ కన్నడ జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కూడా. ఇదీ చదవండి: ఘోరం.. కుప్పకూలిన మిగ్–21.. ఇద్దరు పైలట్ల దుర్మరణం -
ఉదయ్పూర్ హత్య: రాజస్థాన్లో నెలపాటు 144 సెక్షన్
జైపూర్: మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే కన్హయ్య లాల్ అనే వ్యక్తిపై.. అతని దుకాణంలోనే ఘాతుకానికి పాల్పడ్డారు. అచ్చం ఉగ్ర సంస్థ ఐసిస్ దుండగులను తలపించేలా గొంతు కోసి క్రూరంగా పొట్టన పెట్టుకున్నారు. పైగా దాన్ని రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ మాల్దాస్లో మంగళవారం జరిగిన ఈ దారుణం.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బీజేపీ సస్పెండ్ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామంటూ హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలాగే చంపుతామని హెచ్చరించారు. ప్రవక్త వివాదం తాలూకు జ్వాలను రగిలించింది ఆయనేనని ఆరోపించారు. హత్యకు వాడిన కత్తిని చూపిస్తూ, ‘ఇది మోదీ(ప్రధానిని ఉద్దేశిస్తూ) మెడ దాకా కూడా చేరుతుంది’ అంటూ బెదిరించారు. నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్గా గుర్తించారు. రియాజ్ గొంతు కోయగా.. గౌస్ ఆ ఉదంతం అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. మరోవైపు సీఎం అశోక్గెహ్లాట్ సహా పోలీస్ శాఖ నిందితుల వీడియోలను వైరల్ చేయొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ కోరుతున్నారు. ఈ ఉదంతంపై నిరసనలు, మతపరమైన ఉద్రిక్తతలతో ఉదయ్పూర్తో పాటు రాజస్తాన్ అంతా అట్టుడికింది. పలు ప్రాంతాల్లో ఆస్తుల ధ్వంసం, వాహనాలకు నిప్పంటించడం లాంటి ఘటనలు జరిగాయి. ఉద్రిక్తతలు పెరగడంతో నగరంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. బుధవారం మొత్తం ఇంటర్నెట్ పని చేయదని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నెలపాటు 144 సెక్షన్ విధించారు. ఘటనకు సంబంధించిన వీడియో సర్క్యులేట్ కాకుండా చూస్తున్నారు. సంయమనం పాటించాలంటూ సీఎం అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. ఉదయ్పూర్కు కేంద్ర హోం శాఖ హుటాహుటిన ఎన్ఐఏ బృందాన్ని పంపింది. కస్టమర్లలా వచ్చి... మృతుడు కన్హయ్యా లాల్ ఉదయ్పూర్లో టైలర్. హంతకులు రియాజ్ అక్తరీ, మహ్మద్ గౌస్ బట్టలు కుట్టించుకునే సాకుతో మంగళవారం మధ్యాహ్నం మాల్దాస్లోని దాన్ మండీలో ఉన్న అతని దుకాణంలోకి ప్రవేశించారు. కొలతలు తీసుకుంటుండగా రియాజ్ కత్తి తీసి కన్హయ్య మెడపై వేట్లు వేశాడు. దీన్నంతా గౌస్ తన మొబైల్లో వీడియో తీశాడు. వెంటనే ఇద్దరూ అక్కణ్నుంచి పారిపోయారు. ఈ దారుణంపై స్థానిక దుకాణదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసనగా వారంతా దుకాణాలు మూసేశారు. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. మృతుని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే యూఐటీ ప్రకారం.. కన్హయ్య లాల్ ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఐదు లక్షల నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెప్తున్నారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతుగా కన్హయ్య ఎనిమిదేళ్ల కుమారుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా దాన్ని కన్హయ్య సమర్థించినట్టు చెబుతున్నారు. ఈ ఉదంతంలో ఆయనను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. కన్హయ్యను చంపుతామంటూ జూన్ 17న తీసిన వీడియోను కూడా హంతకులు మంగళవారమే సోషల్ మీడియాలో పెట్టారు. తమ వర్గం వారు ఇలాంటి దాడులను ఉధృతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. అక్తర్ స్థానిక మసీదులో పని చేస్తుండగా.. గౌస్ కిరాణా దుకాణం నడుపుతున్నట్టు పోలీసులు చెప్పారు. ఇది పక్కా పథకం ప్రకారం చేసిన హత్యేనని ఉదయ్పూర్ ఎస్పీ మనోజ్కుమార్ చెప్పారు. రక్షణ కోరినా పట్టించుకోలేదు.. మృతుడు పోలీసు రక్షణ కోరినా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని బీజేపీ ఆరోపించింది. రాజస్తాన్లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సతీశ్ పునియా ఆరోపించారు. ‘‘హంతకులు కత్తులు చేతబట్టి నేరుగా ప్రధానినే చంపుతామని బెదిరిస్తూ వీడియోలు పోస్టు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పెను సవాలు’’ అని వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్కుమార్ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మొదలుకుని పలువురు నేతలు హత్యను ఖండించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంబంధిత వార్త: షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే.. -
బెంగాల్లో మళ్లీ హింస
కోల్కతా/లక్నో/రాంచీ: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలతో రగిలిన కార్చిచ్చు దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో పాంచ్లా బజార్లో రెండో రోజు శనివారం కూడా హింస చోటుచేసుకుంది. ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. ఇళ్లకు నిప్పు పెట్టారు. బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దాడిలో పోలీసులు గాయపడ్డారు. బాష్పవాయువు ప్రయోగించి జనాన్ని చెదరగొట్టారు. హౌరా, ముర్షిదాబాద్ జిల్లాల్లో పలుచోట్ల ఇంటర్నెట్ సేవలు ఈ నెల 14వ తేదీ దాకా నిలిపేశారు. పలు ప్రాంతాల్లో 15వ తేదీ దాకా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ సుకాంత మజుందార్ను 144 సెక్షన్ అమల్లో ఉన్న హౌరా జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బెంగాల్ జమ్మూ కశ్మీర్లా మారుతోందని సుకాంత ఆరోపించారు. శుక్రవారం నిరసనల్లో బాలులను భాగస్వాములను చేశారన్న అభియోగాలపై ఫిర్జాదా ఆఫ్ ఫర్ఫురా షరీఫ్కు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ షోకాజులిచ్చింది. బెంగాల్లో శాంతిభద్రతలు దిగజారుతున్నాయంటూ గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆదేశించారు. నిందితుల పట్ల ఔదార్యం చూపుతుండడం దురదృష్టకరమంటూ ట్వీట్ చేశారు. యూపీలో 255 మంది అరెస్టు యూపీలో శుక్రవారం హింసాత్మక ఘటనలకు సంబంధించి 255 మందిని జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అరెస్టు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ప్రయాగ్రాజ్లో పోలీసులపై రాళ్ల దాడికి చిన్నపిల్లలను దుండగులు నియోగించినట్లు గుర్తించారు. కారకులపై 29 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు చెప్పారు. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ తల నరికేస్తున్నట్టు వీడియో రూపొందించి యూట్యూబ్లో పెట్టిన జమ్మూ కశ్మీర్కు చెందిన ఫైజల్ వనీ అనే యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోయలో పలుచోట్ల కర్ఫ్యూ కొనసాగుతోంది. ఢిల్లీలో జామా మసీదు బయట ప్రదర్శనల ఉదంతానికి సంబంధించి కేసు నమోదైంది. ప్రతి మసీదు, మదర్సా లోపల, బయట హై క్వాలిటీతో కూడిన సీసీ కెమెరాలు పెట్టాలని వీహెచ్పీ డిమాండ్ చేసింది. ఆందోళనకారులు ఏయే ప్రార్థనా స్థలాల్లో నుంచి బయటికొచ్చి గొడవకు దిగారో అవే ఈ విధ్వంసానికి బాధ్యత వహించాలని వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ డిమాండ్ చేశారు. భారత్లో పాలన రాజ్యాంగం ప్రకారం నడుస్తుందే తప్ప షరియా ప్రకారం కాదని విధ్వంసకులు తెలుసుకోవాలన్నారు. నుపుర్ శర్మకు బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మద్దతుగా నిలిచారు. ఆలయంపైకి పెట్రోల్ బాంబులు జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శుక్రవారం నిరసనల్లో పోలీసుల కాల్పుల్లో గాయపడిన ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. వారు బులెట్ గాయాలతో చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఈ హింసకు నిరసనగా హిందూ సంఘాలు శనివారం రాంచీ బంద్కు పిలుపునిచ్చాయి. దాంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హింసకు కారకులపై కేసులు పెట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నామరు. నగరంలో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. రాంచీలోని ఓ ఆలయంలో పూజారి, ఆయన కుటుంబం ప్రాంగణంలో నిద్రిస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో శుక్రవారం జరిగిన నిరసనలకు సంబంధించి 100 మందికిపైగా వ్యక్తులపై కేసులు పెట్టారు. విమర్శకు ఎవరూ అతీతులు కారు: తస్లీమా న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మతోన్మాదుల ఆగడాలను చూస్తే దిగ్బ్రాంతి కలుగుతోందని బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. వాటిని చూస్తే మహ్మద్ ప్రవక్త దిగ్భ్రాంతికి గురయ్యేవారని అభిప్రాయపడ్డారు. ‘‘విమర్శలకు ఎవరూ అతీతులు కాదు. ఏ మనిషీ, మత గురువూ, మత బోధకుడూ, ప్రవక్తా, దేవుడూ... ఎవరూ అతీతులు కారు. ప్రపంచాన్ని మరింత ఉత్తమంగా మార్చాలంటే సూక్ష్మ పరిశీలన, విమర్శ అవసరం’’ అని కామెంట్ చేశారు. -
కర్ణాటకలో అల్లర్లు.. సోషల్ మీడియా పోస్టుతో రగడ
హుబ్బళ్లి: కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక సోషల్ మీడియా పోస్టు భారీ విధ్వంసానికి కారణమైంది. కోపోద్రిక్తులైన ఒక వర్గం విధ్వంసానికి పాల్పడడంతో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆస్పత్రి, ఆలయం కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది. ‘నగరంలో ఈ నెల 20 దాకా 144 సెక్షన్ విధించాం. 40 మందికిపైగా అరెస్టు చేశాం. 12 మంది పోలీసులు గాయపడ్డారు’ అని హుబ్బళ్లి–ధార్వాడ్ పోలీసు కమిషనర్ లభురామ్ చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు పెట్టిన పోస్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరికొందరు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై ఒకరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. అయితే ఇంతటితో తృప్తిపడని కొందరు ప్రజలు పోలీసు స్టేషన్ వద్ద గుమిగూడారని, వారిని చెదరగొట్టడం జరిగిందని వివరించారు. అనంతరం అర్థరాత్రి సమయంలో మరలా చాలామంది గుమిగూడడంతో వారి నాయకులను పిలిపించి సదరు కేసులో తీసుకున్న చర్యలను వివరించామన్నారు. అయితే ఎంత నచ్చజెప్పినా వినకుండా ఈ మూక విధ్వంసానికి పాల్పడిందని లభురామ్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అన్నారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భారీగా రాళ్లు పడి ఉండడాన్ని గమనించిన పోలీసులు ముందుగానే ట్రక్కు నిండా రాళ్లు, ఇటుకలు తెప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్లాన్ ప్రకారమే హుబ్బళ్లిలో దాడి ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే చేశారని కర్ణాటక సీఎం బొమ్మై అభిప్రాయపడ్డారు. ఇలాంటివి సహించబోమని దీని వెనకున్నవారు గ్రహించాలని హెచ్చరించారు. దాడుల వెనక ఉన్నవారందరినీ అరెస్టు చేస్తామన్నారు. ఈ ఘటనకు రాజకీయ రంగు పులుమవద్దని ప్రజలను కోరారు. స్టేషన్ ముందు ఒక్కమారుగా భారీగా జనాలు మూగారంటే అది ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిన ఘటనగా భావించాలన్నారు. గాయపడిన పోలీసుల్లో ఒకరి పరిస్థితి సీరియస్గా ఉందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర చెప్పారు. ఘటనకు సంబంధించి కొందరిని అరెస్టు చేశామని, దేవర జీవనహళ్లి, కడుగొండహళ్లి లాంటి చోట్ల జరిగిన విధ్వంసాన్ని ఇక్కడా చేయాలని కొందరు భావించారని చెప్పారు. విధ్వంసకారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంఎల్ఏలు డిమాండ్ చేశారు. ఘటనను మాజీ సీఎం కుమారస్వామి ఖండించారు. రాష్ట్రంలో మతవిద్వేషాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. -
గద్వాల జిల్లా ఇర్కిచేడులో 144 సెక్షన్
గద్వాల రూరల్/ కేటీదొడ్డి: బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై రాజుకున్న వివాదం.. చివరికి విగ్రహానికి నిప్పుపెట్టడంతో పాటు ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. దీంతో గ్రామంలో ఏప్రిల్ 6 వరకు 144 సెక్షన్ను విధించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఇర్కిచేడులో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు ఒక వర్గం వారు నిర్ణయించి తహసీల్దార్ వద్ద అనుమతి పొందారు. సదరు స్థలం అప్పటికే నీలమ్మ అనే మహిళ కబ్జాలో ఉంది. గురువారం ఆ స్థలంలో విగ్రహాన్ని పెట్టేందుకు యత్నించగా నీలమ్మ, ఆమె కుటుంబీకులు ఆత్మహత్య చేసుకుంటామని అడ్డుకున్నారు. దీంతో విగ్రహాన్ని రోడ్డు మధ్యలో పెట్టేందుకు యత్నించగా గ్రామానికి చెందిన మరోవర్గం వారు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటికే ఆత్మహత్య చేసుకుంటానని వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసాలను విగ్రహం పరిసర ప్రాంతంలో పడేశారు. పోలీసులు అక్కడి నుంచి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయగా గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసిన చోట నిప్పు అంటించారు. దీంతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి, ఎస్సై కురుమయ్య కాలికి అంటుకున్నాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి విగ్రహాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. విషయం తెలుసుకొని కర్ణాటకలోని రాయచూరు, ఇర్కిచేడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంబేడ్కర్వాదులు భారీ సంఖ్యలో గ్రామానికి చేరుకోవడంతో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎస్పీ రంజన్ రతన్కుమార్ ఇర్కిచేడును సందర్శించి ఏప్రిల్ 6 వరకు గ్రామంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. -
శివాజీ విగ్రహం ఏర్పాటుతో వివాదం
బోధన్టౌన్ (బోధన్)/నిజామాబాద్ సిటీ/సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్లో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ పార్టీ రాత్రికి రాత్రే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఘర్షణకు కారణమైంది. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం రాళ్ల దాడికి దారి తీసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. వివాదం మొదలైంది ఇలా.. బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం రాత్రి ఓ పార్టీ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన ఓ వర్గం వారు.. విగ్రహాన్ని తొలగించాలంటూ అంబేడ్కర్ చౌరస్తాలో బైఠాయించారు. దీంతో మరో వర్గం వారు కూడా వందలాదిగా అక్కడికి వచ్చారు. విగ్రహం ఏర్పాటుకు మున్సిపల్ తీర్మానం ఉందని, విగ్రహాన్ని తొలగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇరు వర్గాలు ఎదురెదురుగా టెంట్లు వేసుకుని ఆందోళనకు దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏసీ పీ రామారావు ఇరువర్గాలను సముదాయించేందు కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నినాదా లు చేస్తూ ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. లాఠీలు ఝళిపించిన పోలీసులు.. ప్రత్యేక బలగాలతో అక్కడకు చేరుకున్న నిజామాబాద్ పోలీసు కమిషనర్ నాగరాజు.. విగ్రహ ఏర్పాటుతో ఉద్రిక్తతలకు తావివ్వొద్దని, ఏదైనా న్యాయపరంగా చూసుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. దీంతో ఓ వర్గం వారు అక్కడి నుంచి వెళ్లిపోయి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. మరోవైపు విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, అప్పటివరకూ విగ్రహాన్ని తొలగించక తప్పదని సీపీ.. దాన్ని ఏర్పాటు చేసిన నేతలకు స్పష్టం చేశారు. అక్కడి నుంచి వెళ్లి పోవాలని సూచించగా నాయకులు నిరాకరించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు వేసుకున్న టెంట్ను పోలీసులు తొలగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. సీపీ లాఠీచార్జికి ఆదేశించడంతో ప్రత్యేక బలగాలు లాఠీలు ఝళిపించాయి. బాష్పవాయువును ప్రయోగించారు. పోలీసుల దెబ్బలకు ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోగా అతడిని ఆస్పత్రికి తరలించారు. బోధన్ ఠాణా ఎదుట బైఠాయించిన వారిపైనా పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఈ సంఘటనపై బీజేపీ సోమవారం బోధన్ బంద్ కు పిలుపునిచ్చింది. బోధన్లో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు ఆదివారం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ రాశారు. బోధన్ ఘటనపై హోంమంత్రి ఆరా బోధన్ ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ ఆరా తీశారు. డీజీపీ, నిజామాబాద్ పోలీ సు కమిషనర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితి అదుపులో ఉందని, కమిషనర్, ఇతర పోలీసు అధికారులు బోధన్లోనే ఉండి పరిస్థితులు సమీక్షిస్తున్నారని హోం మంత్రికి డీజీపీ వివరించారు. ప్రజలు సంయమనం పాటించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. -
హిజాబ్ వివాదం.. కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కోర్టు మధ్యంతర ఆదేశాలతో రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు తెరుచుకున్నప్పటికీ పలు చోట్ల హిజాబ్ తీసేందుకు విద్యార్థినులు నిరాకరిస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో నిషేధాజ్ఞలను ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. హిజాబ్ వివాదం కారణంగా ప్రభుత్వం నగరంలోని అన్ని పాఠశాలల వద్ద 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అనేక పట్టణాలు, విద్యాసంస్థల వద్ద పోలీసులు మోహరించారు. ఇదిలా ఉండగా హిజాబ్ వివాదం నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలను నిషేధించారు. ఫంక్షన్ హాల్స్, బహిరంగ ప్రదేశాల్లో జరిగే వివాహాల్లో 200-300 మంది హాజరయ్యేందుకే అనుమతించారు. మరోవైపు క్రీడా మైదానాల్లో వాటి సామర్థ్యంలో 50 శాతానికి మించి ప్రేక్షకులు హాజరు కాకుడదని పేర్కొన్నారు. -
హిజాబ్ వ్యవహారం: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: హిజాబ్ ఆందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో 144 సెక్షన్ విధించినట్లు పేర్కొంది. రేపు(సోమవారం) నుంచి ఈ నెల 19 వరకు ఉడిపిలో 144 సెక్షన్ అమలు కానుంది. ఇప్పటికే ప్రభుత్వం విద్యాసంస్థల సెలవులను ఈ నెల16 వరకు పొడగించిన విషయం తెలిసిందే. ఉడిపి డిప్యూటీ కమిషనర్ కూర్మారావు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని ఉన్నత పాఠశాలల వద్ద 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ ప్రకారం నిషేధాజ్ఞలు కొనసాగుతాయని తెలిపారు. -
ఆత్మకూరులో నిషేధాజ్ఞలు
ఆత్మకూరు/కర్నూలు కల్చరల్: కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిషేధాజ్ఞలు విధించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తహసీల్దార్ ప్రకాశ్బాబు ప్రకటించారు. ఓ స్థలంలో చేపట్టిన నిర్మాణం విషయమై శనివారం రెండువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. చాలా దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. నంద్యాల టర్నింగ్, కొత్తపేట, మెయిన్బజార్, కప్పలకుంట్ల, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, కర్నూలు–గుంటూరు రహదారి వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసు పికెటింగ్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు యథావిధిగా తిరుగుతున్నాయి. బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ఎక్కడకు తరలించారో చెప్పడం లేదు. జిల్లా ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి ఆత్మకూరులోనే మకాం వేసి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. హోంమంత్రి స్పందించరేం ఆత్మకూరు ఘటనపై రాష్ట్ర హోంమంత్రి ఎందుకు స్పందించలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకుల అక్రమ అరెస్ట్లను ఖండించారు. నిషేధిత సంస్థ పీఎఫ్ఐ అమాయకులను పావులుగా ఉపయోగించుకుని దాడులకు తెగబడుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్రెడ్డిపై హత్యాయత్నం చేశారని, ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదన్నారు. దాడిలో గాయపడ్డ ఆయనకు మెరుగైన వైద్యం అందించి, మీడియాకు చూపాలని డిమాండ్ చేశారు. బాధితులపై అక్రమ కేసులు పెడితే బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు. ఆత్మకూరు ఘటన వ్యూహాత్మకంగా కుట్ర కోణంలో జరిగిందన్నారు. పాశవిక దాడిపై ఉగ్రవాద కోణంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. -
ఇద్దరు రాజకీయ నేతల దారుణ హత్య.. 144 సెక్షన్ విధింపు
తిరువనంతపురం: కేరళలోని అలప్పుజ జిల్లాలో ఇద్దరు రాజకీయ నేతలు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా సెక్రటరీ రంజిత్ శ్రీనివాసన్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ)నేత కేఎస్ షాన్ను గుర్తుతెలియని దుండగులు ఆదివారం ఉదయం చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎ.అలెగ్జాండర్ అలప్పుజ జిల్లాలో 144 సెక్షన్ను విధించారు. బీజేపీ నేత శ్రీనివాసన్(40)ను తన ఇంటిలోనే గుర్తుతెలియని దుండగులు దాడిచేసి చంపారు. ఆయన 2016 ఎన్నికల్లో అలప్పుజ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత కె.ఎస్ షాన్ను కూడా గుర్తుతెలియని ముఠా చేతిలో హత్య గురయ్యారు. ఈ ఘటనపై ఎస్డీపీఐ స్పందిస్తూ.. తమ నాయకుడి హత్య వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రమేయం ఉందని ఆరోపించింది. చదవండి: కోతి వర్సెస్ కుక్క! సోషల్ మీడియాలో రచ్చ రచ్చ! ఇద్దరు రాజకీయ నేతల హత్యలపై కేరళ సీఎం పినరయ్ విజయన్ స్పందిస్తూ.. హత్యలపై వేగంగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. సమాజంలో గందరగోళం సృష్టించే ఈ చర్యలను ఖండిస్తున్నానని తెలిపారు. శ్రీనివాసన్ మృతిపై కేంద్ర మంత్రి వి.మురళీధరన్ మాట్లాడుతూ.. తమ పార్టీ నేతను ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల గ్రూప్ హత్య చేసిందని ఆరోపించారు. శ్రీనివాసన్ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు చేసి నేరస్తులను శిక్షించాలని తెలిపారు. రెండు పార్టీల సంబంధించిన నేతలు హత్యకు గురికావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Kerala: I've been told that State Secy of BJP OBC Morcha was stabbed to death, this morning. This is the handy work of Islamic terrorist group is the info coming from Alleppey (Alappuzha). I demand the State govt to take strict action against perpetrators:Union Min V Muralidharan https://t.co/VRuiureFOH pic.twitter.com/BW8Z9riTjR — ANI (@ANI) December 19, 2021 -
నేడే భవానీపూర్ ఉప ఎన్నిక
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. పోలింగ్ బూత్ల నుంచి 200 మీటర్ల వరకు సెక్షన్ 144 నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణ కోల్కతాలోని భవానీపూర్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ బరిలో ఉంటే, బీజేపీ ప్రియాంక టైబ్రెవాల్ను బరిలో దింపింది. ఇక సీపీఐ(ఎం) తరపున స్రిజిబ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని 97 పోలింగ్ కేంద్రాల్లోని 287 బూత్ల లోపల సెంట్రల్ పారా మిలటరీకి చెందిన ముగ్గురేసి జవాన్లను మోహరించారు. ఇక పోలింగ్ బూత్ వెలుపల భద్రత కోసం కోల్కతాకు చెందిన పోలీసు అధికారులు పహారా కాస్తారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో అయిదుగురికి మించి గుమిగూడడాన్ని నిషేధించారు. -
కర్నాల్లో నిషేధాజ్ఞలు మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేత
కర్నాల్(హరియాణా): హరియాణాలోని కర్నాల్లో మినీ సెక్రటేరియట్ను ముట్టడిస్తామన్న రైతు సంఘాల పిలుపు నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం నిర్వహిం చతలపెట్టిన రైతు ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో 144వ సెక్షన్ అమల్లోకి తెచ్చినట్లు జిల్లా అధికార యంత్రాంగం సోమవారం ప్రకటించింది. మొబైల్ ఇంటర్నెట్నూ నిలిపేశారు. కర్నాల్లో నలుగురుకి మించి వ్యక్తులు గుమిగూడటం కుదరదంటూ నిషేధాజ్ఞలు జారీచేసింది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ముందస్తు చర్యగా ఆంక్షలు అమల్లోకి తెచ్చామని అదనపు డీజీపీ(లా అండ్ ఆర్డర్) నవ్దీప్ సింగ్ చెప్పారు. రైతు ఆందోళన సందర్భంగా తప్పుడు వార్తలు, పుకార్లను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేయకుండా ఆపేందుకు కర్నాల్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఎంఎస్, మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మంగళవారం అర్ధరాత్రి వరకు సేవలను స్తంభింపజేస్తారు. పొరుగున ఉన్న కురుక్షేత్ర, కైథాల్, జింద్, పానిపట్ జిల్లాల్లోనూ ఈ సేవలనుæ నిలిపేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలనూ రప్పించారు. గత నెల 28న కర్నాల్లో బీజేపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు బయల్దేరిన రైతులు.. జాతీయరహదారి వెంట ట్రాఫిక్కు అంతరాయం కల్గిస్తున్నారంటూ వారిపై పోలీసులు లాఠీచార్జికి దిగారు. ఈ ఘటనలో 10 మందికిపైగా రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక రైతు మరణించారు. లాఠీచార్జి కారణంగా ఆయన మరణించారని రైతు సంఘాలు చెబుతుండగా, గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. లాఠీ చార్జిని నిరసిస్తూ మినీ–సెక్రటేరియట్ను ముట్టడి స్తామని సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రకటించడం తెల్సిందే. ముందుగా కర్నాల్లో భారీస్థాయిలో పంచాయత్ను నిర్వహిస్తామని, తర్వాత మినీ– సెక్రటేరియట్ వద్ద ఆందోళన కొనసాగిస్తామని హరియాణా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నామ్ చెప్పారు. -
కర్ఫ్యూ సడలింపు వేళల్లో సెక్షన్ 144
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కర్ఫ్యూను మరింత కట్టుదిట్టంగా అమలు చేసి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కర్ఫ్యూ సడలింపు సమయంలో(ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు) సెక్షన్ 144ను పటిష్టంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 10 వరకు కర్ఫ్యూ యథాతథంగా అమలు జరుగుతుందని, కర్ఫ్యూ సడలింపు వేళల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షాపులు, బజార్లు, రోడ్లపైన ప్రజలు గుమికూడవద్దని స్పష్టం చేశారు. కాగా, చేపల మార్కెట్లు, చికెన్ మార్కెట్లతో పాటు నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం షాపులకు వెళ్లే వారంతా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. -
Noida: జూన్ 30 వరకు సెక్షన్ 144.. నూతన మార్గదర్శకాలివే!
లక్నో: దేశమంతటా కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు మహమ్మారి కట్టడికై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. నైట్ కర్ఫ్యూ, లాక్డౌన్ లాంటి ఆంక్షలు విధించి కరోనా కట్టడికి నిరంతరం శ్రమిస్తున్నాయి. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపోవడంతో మళ్లీ వాటి గడువును పెంచుతున్నాయి. తాజాగా కరోనావైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఉత్తర ప్రదేశ్లోని నోయిడాలో జూన్ 30 వరకు 144 విధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. మరోవైపు నోయిడాలో కోవిడ్ కేసుల సంఖ్య 62,356కు పెరిగింది. ప్రస్తుతం 1,073 యాక్టివ్ కేసులున్నాయి. చదవండి: మద్యం హోం డెలివరీకి ఢిల్లీ ప్రభుత్వం అనుమతి కొత్త మార్గదర్శకాలు ఇలా... 1. వైద్య, అవసరమైన సేవలు మినహా అన్ని కార్యకలాపాలు కంటైన్మెంట్ జోన్లలో నిషేధం 2. ముందస్తు అనుమతి లేకుండా అన్ని సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, వినోద కార్యక్రమాలు బంద్. 3. క్రీడా కార్యక్రమాలు, ఉత్సవాలు కూడా నిషేధం 4. పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు మూసివేసి ఉంటాయి. 5. కోచింగ్ సెంటర్లు, సినిమా హాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, క్లబ్బులు, షాపింగ్ మాల్స్ అన్ని మూసివేత 6. వివాహ కార్యక్రమానికి 25 మందికి మించకూడదు. 7 దహన సంస్కారాల కోసం 20 మందికి మించకూడదు. 8. రెస్టారెంట్లు అన్ని మూసివేత. అయితే హోమ్ డెలివరీ సేవలకు అనుమతి 9. ప్రజా రవాణా (మెట్రోలు, బస్సులు, క్యాబ్లు మొదలైనవి) 50 శాతం వరకు ఆక్యుపెన్సీతో పనిచేస్తాయి. 10. తగిన ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రజా నిరసనలకు అనుమతి లేదు. 11. బహిరంగ ప్రదేశాల్లో మద్యం,ఇతర పదార్థాల వినియోగం అనుమతి లేదు.. -
కరోనా విలయం: కర్ణాటక కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కరోనా కేసులు రోజుకు 20 వేలను తాకుతుండడంతో ప్రభుత్వం లాక్డౌన్ అనకుండానే అటువంటి చర్యలను ముమ్మరం చేసింది. ఒకరకంగా హాఫ్ లాక్డౌన్ను అమలు చేస్తోంది. గురువారం బెంగళూరుతో పాటు కర్ణాటక రాష్ట్రమంతటా 144వ సెక్షన్ను విధించింది. ప్రజలు గుంపులుగా తిరగరాదని, పని లేకుండా బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. బట్టలషాపులు, మాల్స్, థియేటర్లు, కిరాణా షాపులను, బేకరీలను కూడా మూసేయించారు. బస్సులు, రవాణా వ్యవస్థను మినహాయించారు. ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ, శని–ఆదివారాల్లో పూర్తి లాక్డౌన్ను ప్రకటించడం తెలిసిందే. ఈ నిషేధాజ్ఞలు మే 4వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ప్రభు త్వం ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు చూపాల్సిందే. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలను ముమ్మరం చేశారు. కరోనా నుంచి కోలుకున్న సీఎం యడ్డి సాక్షి, బెంగళూరు: కరోనా బారిన పడిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కోలుకున్నారు. ఈ నెల 16న ఆయనకు పాజిటివ్ అని తేలగా, అప్పటినుంచి బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయనకు గురువారం పరీక్షల్లో నెగిటివ్ రావడంతో డిశ్చార్జి అయ్యారు. అక్కడి నుంచి అధికారిక నివాసమైన కావేరి బంగ్లాకు చేరుకున్నారు. తనకు విశ్రాంతి అవసరం లేదని, అధికారిక సమావేశాలను నిర్వహిస్తానని తెలిపారు. కరోనా వ్యాపిస్తోందని, ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు. ఆయన కరోనాకు గురై కోలువడం ఇది రెండవసారి. చదవండి: కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి తమ్ముడి వరుస అబ్బాయితో గర్భం.. కుటుంబీకులే ప్రసవం! -
మహారాష్ట్రలో మినీ లాక్డౌన్
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మినీ లాక్ డౌన్ (పాక్షిక లాక్ డౌన్)ను ప్రకటించింది. ఉదయం సెక్షన్ 144, నైట్ కర్ఫ్యూతోపాటు వీకెండ్లో అంటే వచ్చే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు వరకు (శని, ఆది) సంపూర్ణ లాక్డౌన్ ఉండనుంది. అత్యవసర సేవలను ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. ఆంక్షలు సోమవారం ఉదయం అమల్లోకొస్తాయి. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. మినీ లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు. ప్రజలందరూ సహకరించాలని ప్రతిపక్ష నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఈ నియమాలను అమలు చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుందని దీంతో లాక్డౌన్ పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ విషయంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి అనేక మంది నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, పత్రిక యాజమాన్యం, సంపాదకులతోపాటు దాదాపు అన్ని రంగాల వారితోపాటు ప్రతిపక్ష నాయకులతో చర్చలు జరిపారు. ఇలా అందరితో చర్చలు జరిపిన అనంతరం ఆదివారం మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. పాక్షిక లాక్డౌన్ అమలు చేయాలని ఈ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనాకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా శనివారం 49447 కరోనా కేసులు నమోదుకాగా ఈ సంఖ్య ఆదివారం 57 వేలు దాటింది. మినీలాక్ డౌన్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేయాలి. ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుంచి (వర్క్ ఫ్రం హోం) పనులు చేయాలి. హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, «ధార్మిక, దర్శనీయ స్థలాలు, మైదానాలు, జిమ్లు, సెలూన్లు మూసి వేయనున్నారు. హోటళ్లు పార్సిల్ సేవలు కొనసాగించవచ్చు. రైళ్లు, విమాన సేవలు యథావిధిగా కొనసాగుతాయి. -
అట్రాసిటీ కేసు: జేసీ బ్రదర్స్ హైడ్రామా
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైడ్రామా మొదలు పెట్టారు. సోదరుడు ప్రభాకర్ రెడ్డితో కలిసి ఈనెల నాలుగో తేదిన తాడిపత్రిలో ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే తాడిపత్రిలో 144 సెక్షన్ విధించడంతో పోలీస్ యాక్ట్ 30 అములులోకి వచ్చింది. దీంతో ఏ కార్యక్రమానికైనా పోలీసుల అనుమతి తప్పనిసరి. అయితే పోలీసులను రెచ్చగొట్టేందుకు జేసీ బ్రదర్స్ దీక్షకు సిద్ధమయ్యారు. తమపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదంటూ జేసీ బ్రదర్స్ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఇద్దరు దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆస్మిత్ రెడ్డిలపై ట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసుల నుంచి తప్పించుకునేందుకే జేసీ బ్రదర్స్ దీక్ష పేరుతో డ్రామాలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. చదవండి: తాడిపత్రిలో 144 సెక్షన్ : ఎస్పీ -
దేశంపై మళ్లీ కరోనా పడగ
న్యూఢిల్లీ: చలికాలం వణికిస్తున్న కొద్దీ కరోనా కూడా విజృంభిస్తోంది. ప్రధానంగా ఉత్తర, మధ్య భారతంలోని పలు రాష్ట్రాల్లో పడగ విప్పింది. రోజు రోజుకీ కేసులు ఎక్కువ అయిపోతూ ఉండడంతో నిబంధనల చట్రంలోకి ఒక్కో రాష్ట్రం వెళ్లిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, హరియాణా వంటి రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఈ రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ మొదలైందన్న ఆందోళన నెలకొంది. హరియాణాలో మొదటిసారిగా రోజుకి 3 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ నెలాఖరువరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మధ్యప్రదేశ్లో అయిదు జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు. భోపాల్, ఇండోర్, గ్వాలియర్, రాట్లామ్, విదిశ జిల్లాల్లో కోవిడ్–19 రేటు 5% కంటే ఎక్కువ పెరిగిపోయింది. దీంతో కర్ఫ్యూ విధించక తప్పడం లేదని సీఎం చెప్పారు. గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, వడోదరా, రాజ్కోట్లో నిరవధికంగా రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. రాజస్తాన్లో రోజుకి సగటున 3 వేల కేసులు నమోదవడంతో 33 జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఉత్తరప్రదేశ్లో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్లు కదిలి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మహారాష్ట్రలో 9,10 తరగతులకు తిరిగి పాఠశాలలను తీయాలని భావించినప్పటికీ, మళ్లీ కేసులు పెరిగిపోతూ ఉండడంతో ఈ ఏడాది చివరి వరకు పాఠశాలలను మూసివేస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ఒకే రోజు 7,500 కేసులు దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల్లో 7,500 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో కరోనా కట్టడికి కేజ్రీవాల్ సర్కార్ పలు చర్యలు తీసుకున్నప్పటికీ కేంద్రం కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. డిసెంబర్లో కేసులు మరింతగా పెరిగిపోతాయని అంచనాలున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచిన కేంద్రం నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తోంది. దీపావళి తర్వాత పెరిగిపోతున్న కేసులు ఆరు నెలల కాలంలో భారత్లో రోజు వారీ కేసులు అత్యధిక స్థాయికి చేరుకొని మళ్లీ తగ్గినట్టే తగ్గి పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్ 10న ఇంచుమించుగా లక్ష వరకు రోజువారీ కేసులు (99,181 కేసులు నమోదు) చేరుకున్నాయి. అక్టోబర్ చివరి వారం నుంచి తగ్గు ముఖం పట్టిన కేసులు, మళ్లీ ఇప్పుడు పెరిగిపోతూ ఉండడంతో సెకండ్ వేవ్ మొదలైందనే భావించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 13 కోట్లు దాటిన కరోనా పరీక్షలు సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ మహమ్మారి కరోనాకు వ్యతిరేక పోరాటంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటి వరకూ 13,06,57,808 పరీక్షలు చేశారు. వీటిలో చివరి కోటి పరీక్షలను 10 రోజుల వ్యవధిలో నిర్వహించడం గమనార్హం. యూరప్, అమెరికన్ దేశాల్లో రోజువారీ కేసులు పెరుగుతున్న సమయంలో, మనదేశంలో కరోనా కట్టడికి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించాయి. అయితే 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే తక్కువ పరీక్షలను నిర్వహించాయి. ఈ రాష్ట్రాల్లో పరీక్ష స్థాయిలను పెంచాలని కేంద్రం సూచించింది. 33 మంది అధికారులకు కరోనా ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పొందుతున్న 428 మంది ఆఫీసర్ ట్రైనీలలో 33 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అకాడమీలోని పలు డిపార్ట్మెంట్లను ముందు జాగ్రత్తగా మూసివేసిట్లు అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 30 వరకూ క్లాసులను ఆన్లైన్ ద్వారా బోధించనున్నట్లు తెలిపారు. కొత్త కేసులు.. 46 వేలు దేశంలో గత 24 గంటల్లో 46,232 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90.50 లక్షలకు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 564 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,32,726కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శనివారానికి 84.78 లక్షలకు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.67 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,39,747గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.86 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.46గా ఉంది. ఈ నెల 20 వరకూ 13.06 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం 10,66,022 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. -
కరోనా: రాజస్థాన్ కీలక నిర్ణయం
జైపూర్: కోవిడ్ కేసుల నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్లో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుండటంతో.. కరోనా కట్టడికి నిబంధలను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (చదవండి: ప్రభుత్వ నిర్ణయంతో వణికిపోతున్న టీచర్లు!) భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 45,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం మొత్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 లక్షల 04 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 584 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,32,162కు చేరింది. (చదవండి: కరోనా టీకా ధర ప్రకటించిన సీరం) అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్ణయంతో ఢిల్లీలోని ప్రైమరీ స్కూళ్ల టీచర్లు వణికిపోతున్నారు. కరోనాకు నెలవైన ప్రాంతాల్లో సర్వే విధులు నిర్వర్తించాలని సర్కార్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. కోవిడ్ కేసులతో హాట్స్పాట్లు ఉన్న చోట పీపీఈ కిట్లు కూడా లేకుండా ఎలా పనిచేస్తామని వాపోతున్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో తగ్గినట్టే కనిపించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఇంటింటి సర్వే చేసి బాధితుల వివరాలు కనుక్కొని వృద్ధులు, గర్భిణీ మహిళలకు సంరక్షణకు చర్యలు చేపట్టాలని ఢిల్లీ ప్రభుత్వం భావించింది. -
ఢిల్లీలో నిషేధాజ్ఞలు : 144 సెక్షన్ విధింపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్ విధిస్తూ ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ 144 ప్రకారం ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడడానికి వీల్లేదని, ఇండియా గేటు వద్ద ప్రజలను అనుమతించమని తెలిపారు. ఢిల్లీ వ్యాప్తంగా నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు. ఇండియా గేట్ చుట్టూ ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదని ఢిల్లీ డీసీపీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా ఇండియా గేటు వద్ద సాయుధ పోలీసులు పహరా కాస్తున్నారు. యూపీ హథ్రాస్ జిల్లాలో సామూహిక హత్యాచార ఘటనపై కాంగ్రెస్ నిరసనల మధ్య ఈ ప్రకటన వెలువడింది. ముఖ్యంగా బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి వెళుతుండగా మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఇండియా గేట్, శాస్త్రి భవన్ సమీపంలో నిరసన ప్రదర్శన అనంతరం ఈ ప్రకటన వచ్చింది గత నెల 28వ తేదీన 20 మంది పంజాబ్ యూత్ కాంగ్రెస్ సభ్యులు ఇండియా గేటు వద్ద కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ట్రాక్టరును దహనం చేసి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!) -
దయచేసి నాగార్జున సాగర్ రావొద్దు..
సాక్షి, నల్గొండ: నాగార్జున సాగర్కు వరద ఉధృతి కొనసాగడంతో డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. కరోనా నేపథ్యంలో ఆ సుందర దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు ఎవరూ నాగార్జున సాగర్కు రాకూడదని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నాగార్జున సాగర్ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పర్యాటకులు నాగార్జున సాగర్కు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. జలాశయం పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. (పులిచింతలకు భారీగా పెరుగుతున్న వరద) ప్రస్తుతం సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో కృష్ణా నదిపై నర్మించిన ఆనకట్టలన్నీ నిండుకుండలా తలపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఆ వరద జలాలన్నీ నాగార్జున సాగర్కు చేరుకుంటున్నాయి. -
కోవిడ్-19 కలకలం : అమల్లోకి 144 సెక్షన్
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా హాట్స్పాట్గా మారడంతో నిబంధనలను కఠినతరం చేశారు. మహమ్మారి కట్టడికి ముంబై పోలీసులు బుధవారం బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటాన్ని నిషేధిస్తూ 144 సెక్షన్ విధించారు. అత్యవసర పనులు మినహా ఇతర కార్యకలాపాలకు ప్రజలను అనుమతించబోమని ఈ నిషేధాజ్ఞలు జూన్ 15 వరకూ కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. కాగా ముంబై మహానగరంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో లాక్డౌన్ను జులై 31వరకూ పొడిగించినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి : ముంబైలో లాల్బగ్చా గణేశ్ ఉత్సవాలు రద్దు -
ఛత్తీస్గడ్లో మరో మూడు నెలల పాటు..
రాయ్పూర్ : దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలకు మరిన్ని సడలింపులు ఇచ్చిన వేళ..ఛత్తీస్గడ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలల పాటు రాష్ర్టవ్యాప్తంగా సీఆర్పీసీ సెక్షన్ 144 కింద ఆంక్షలు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం..ఒకే ప్రాంతంలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ గుమిగూడరాదు. రూల్ అతిక్రమిస్తే జరిమానా లేదా జైలు శిక్షకు గురవుతారు. కరోనా ఇంకా అదుపులోకి రాలేదని, ఈ నేపథ్యంలో ఆంక్షలు సడలిస్తే మరింత ప్రబలే అవకాశం ఉన్నందున రాష్ర్టవ్యాప్తంగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపింది. ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపినట్లు ప్రజా సంబంధాల శాఖ అధికారి తెలిపారు. అదే విధంగా మే 31 వరకు రాష్ర్టంలో రెస్టారెంట్లు, హోటళ్లు, బార్లు, స్టేడియంలకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక రాష్ర్టంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 92కాగా, ప్రస్తుతం 33 యాక్టివ్ కేసులున్నాయి. ఇక లాక్డౌన్ 4.0 లో రెడ్, గ్రీన్, ఆరెంజ్ నోన్ల వారీగా కొన్ని కార్యకలాపాలకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. (8 కేటగిరీల వారికే కరోనా టెస్టులు ) -
స్థానిక భాగస్వామ్యం పెంచండి
న్యూఢిల్లీ: పట్టణ నివాస ప్రాంతాల్లో కోవిడ్–19 కేసులు ఎక్కువ సంఖ్యలో బయటపడుతుండటంతో కేంద్రం మరిన్ని వనరులను ఉపయోగించుకునేందుకు యోచిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు స్థానికులతో సన్నిహితంగా ఉండే రాజకీయ, మత నాయకుల సేవలను ఉపయోగించుకోవాలని రాష్ట్రాలను కోరింది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేలా ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను వీరికి అప్పగించాలంది. అదేవిధంగా, ‘పట్టణ ప్రాంతాల్లో ‘సంఘటన ప్రతిస్పందన వ్యవస్థ’ను ఏర్పాటు చేసి, సమర్థుడైన వ్యక్తిని ‘ఇన్సిడెంట్ కమాండర్’గా నియమించాలి. ఈ కమాండర్ కరోనా సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్కు సమాచారం అందించడంతోపాటు ఆయా కంటైన్మెంట్లలో ప్రణాళిక, నిర్వహణ, రవాణా, ఆర్థిక వ్యవహారాలను అమలు చేస్తుంటారు. ఇన్సిడెంట్ కమాండర్ నేతృత్వంలో ఏర్పాటయ్యే సమన్వయ కమిటీలో ఆరోగ్య, మహిళాశిశు సంక్షేమ శాఖల అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, ఇప్పటికే ఆ ప్రాంతంలో సేవలందిస్తున్న ఎన్జీవోలు సభ్యులుగా ఉంటారు’ అని పేర్కొంది. ‘ప్రజలు తమ నివాస ప్రాంతాలకే పరిమితమయ్యేందుకు సెక్షన్–144 అమలు చేయడంతోపాటు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇంటింటికీ వెళ్లి పరిశీలించాలి. ఇతర ప్రాంతాల నుంచి కంటైన్మెంట్లలోకి రాకపోకలను పూర్తిగా నిషేధించాలి. వీటిని ఎంత కచ్చితంగా అమలు చేస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి’అని తెలిపింది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 80 శాతం వరకు ఏపీ, తెలంగాణల్లోని కర్నూలు, గ్రేటర్ హైదరాబాద్లతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 30 మున్సిపాలిటీల్లోనే ఉన్న విషయం తెలిసిందే. -
కరోనా అలర్ట్ : 30 వరకూ 144 సెక్షన్
సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి కరోనా వైరస్ కేసులు విస్తృతంగా వ్యాప్తి చెందడంతో నోయిడా ప్రాంతంలో ఏప్రిల్ 30 వరకూ 144 సెక్షన్ విధిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈనెల 14తో దేశవ్యాప్త లాక్డౌన్ ముగిసినా నోయిడాలో నిషేదాజ్ఞలు కొనసాగుతాయి. మరోవైపు దేశమంతటా లాక్డౌన్ అమలవుతున్నా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3000 దాటగా మృతుల సంఖ్య 75కు పెరిగింది. 212 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నా రోజురోజుకూ ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక కరోనా పాజిటివ్ కేసులను పరిశీలిస్తే పలు దేశాల్లో వయసు మళ్లిన వారిలోనే ఎక్కువగా వైరస్ ప్రభావం కనిపిస్తుండగా భారత్లో మాత్రం 80 శాతం రోగులు 60 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. 60 ఏళ్లు దాటిన వారిలో వైరస్ బారిన పడినవారి సంఖ్య కేవలం 16.69 శాతమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఇక వైరస్ కారణంగా మరణించే వారిలో మధుమేహం, హైపర్టెన్షన్, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు అధికంగా ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 11,97,405కు చేరగా 64,606 మంది మరణించారని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. చదవండి : రండి దీపాలు వెలిగిద్దాం: ఏపీ గవర్నర్ -
కరోనా ఎఫెక్ట్: ఢిల్లీలో 144 సెక్షన్ విధింపు
సాక్షి, ఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రాత్రి 9 గంటల నుంచి మార్చి 31 అర్ధ రాత్రి వరకు ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. సభలు, సమావేశాలు, గుంపులుగా తిరగడంపై ఆంక్షలు విధించారు. ప్రజా ఆరోగ్యం, భద్రత దృష్ణా చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారత్లో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వరకు అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం రోజున దాదాపు 3,700 సర్వీసులను రైల్వే శాఖ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 341గా నమోదు కాగా, మృతుల సంఖ్య 6 కి చేరింది. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు విశేషమైన స్పందన లభిస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రధాన నగరాలన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. -
కుదుటపడుతున్న ఢిల్లీ
న్యూఢిల్లీ: మత ఘర్షణలు చోటుచేసుకున్న ఈశాన్య ఢిల్లీలో ప్రశాంతత నెలకొంటోంది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ గడిచిన మూడు రోజులుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు. వదంతులను పట్టించు కోవద్దని, అటువంటి వాటిపై తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఆదివారం అల్లర్ల ప్రభావిత బ్రహ్మపురిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఘర్షణలకు సంబంధించి 903 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 254 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి అదుపులోకి తీసుకున్న వారి వివరాలను వెల్లడించాలని హక్కుల కార్యకర్తలు పోలీసులను కోరారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసనలకు కేంద్ర బిందువు షహీన్బాగ్లో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ఆదివారం ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. కాగా, ఖ్యాలా–రఘుబిర్ నగర్–తిలక్ నగర్ ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగనున్నాయంటూ ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. అయితే అవి కేవలం వదంతులేనని ఢిల్లీ పశ్చిమ డీసీపీ దీపక్ పురోహిత్ చెప్పారు. -
ఐదో రోజూ 144 సెక్షన్... ‘అంతా ప్రశాంతం’
సాక్షి, నిర్మల్ : జిల్లాలోని భైంసాలో 144 సెక్షన్ ఐదో రోజు కొనసాగుతోంది. గత ఆదివారం పట్టణంలోని కోర్వాగల్లీలో ఇరు వర్గాల ఘర్షణ రాళ్లదాడికి దారితీయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ శుక్రవారం కావడంతో అన్ని ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి నిర్మల్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారానికి ప్రత్యేక అనుమతులు లభించినట్టు తెలిసింది. (చదవండి : ఎప్పుడేం జరుగుతుందో..?) అంతా ప్రశాంతంగా ఉంది : హోంమంత్రి భైంసాలో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఎలాంటి ఆందోళనలు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. భైంసాలో పరిస్థితులు బాగోలేవనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి తప్ప అక్కడ ఎలాంటి అలజడి లేదని పేర్కొన్నారు. ఇక కేసులు ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల్ని డిపార్ట్మెంట్లో చేర్చుకోబోమని హోంమంత్రి స్పష్టం చేశారు. 300 మంది కానిస్టేబుల్ అభ్యర్థులపై ఉన్న కేసులపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. అన్ని విధాలుగా విచారణ చేసిన అనంతరమే వారిని పోలీసు శాఖలో జాయిన్ చేసుకుంటామని పేర్కొన్నారు. (చదవండి : భైంసాలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి) (చదవండి : ‘ప్రజలు రజాకార్ల పాలన చూడాల్సి వస్తుంది’) (చదవండి : భైంసా ప్రశాంతం) -
ఆందోళనలు.. అరెస్ట్లు
న్యూఢిల్లీ: ‘పౌర’ ఆగ్రహం తీవ్రమవుతోంది. ఆందోళనలపై ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. పలు పట్టణాలు, విశ్వవిద్యాలయాల్లో వామపక్ష పార్టీలు, వామపక్ష విద్యార్థి సంఘాలు భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. యూపీ, బిహార్ల్లో ఆందోళనలు హింసాత్మకమయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఆందోళన ల్లో పాల్గొన్న లెఫ్ట్ నేతలు సీతారాం ఏచూరి, డీ రాజా, నీలోత్పల్ బసు, బృందా కారత్, స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా ఆందోళనకారులను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. ఢిల్లీలోని ఎర్రకోట సహా పలు ప్రాంతాల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ను, మొబైల్ సేవలను నిలిపేశారు. సీఏఏ వ్యతిరేక నిరసనల కేంద్రంగా నిలిచిన అస్సాం, మేఘాలయ, త్రిపురల్లో శాంతియుత నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. కేరళ, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. మరోవైపు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తో పాటు జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)ని దేశవ్యాప్తంగా అమలు చేయడం తథ్యమని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఢిల్లీలో.. 144 సెక్షన్ విధించినప్పటికీ నిరసనకారులు వెనక్కుతగ్గలేదు. వేలాదిగా ఎర్రకోట, జంతర్మంతర్, మండిహౌజ్ తదితర ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. 1975 నాటి ఎమర్జెన్సీ కన్నా పరిస్థితి దారుణంగా ఉందని మండిహౌజ్ వద్ద ఆందోళనల్లో పాల్గొని అరెస్టైన సీపీఎం నేత ఏచూరి అన్నారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో మునుపెన్నడూ లేని విధంగా కొన్ని గంటల పాటు కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ సహా అన్ని మొబైల్ సేవలను నిలిపేశారు. ‘నిర్భయ’ ఆందోళనలు, అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమ సమయంలోనూ పోలీసులు ఇంతటి చర్య తీసుకోలేదు. ఉత్తరప్రదేశ్లో.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో రణరంగమైంది. నగరవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఒక పోలీస్ ఔట్పోస్ట్ వెలుపల వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ను ప్రయోగించారు. సంబల్ ప్రాంతంలో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సును తగలపెట్టారు. బిహార్లో.. వామపక్ష విద్యార్థులు రోడ్లను, రైల్వే ట్రాక్లను నిర్బంధించి నిరసన తెలిపారు. పట్నాలో మాజీ ఎంపీ పప్పు యాదవ్ నేతృత్వంలోని జన అధికార పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్లపై టైర్లను తగలబెట్టి వాహనాలను అడ్డుకున్నారు. జహానాబాద్లో సీపీఐఎంఎల్ కార్యకర్తలు రోడ్ రోకో నిర్వహించారు. మహారాష్ట్రలో.. ముంబైలోని క్రాంతి మైదాన్లో కాంగ్రెస్, ఎన్సీపీ, పలు ఇతర పార్టీలు ‘హమ్ భారత్ కే లోగ్’ పేరుతో ఫ్రంట్ను ఏర్పాటు చేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో వేలాదిగా పార్టీల కార్యకర్తలు, విద్యార్థులు, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఇదే మైదానం నుంచి 1942లో మహాత్మాగాంధీ క్విట్ ఇండియా’ నినాదం ఇచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న 94 ఏళ్ల జీజీ పారిఖ్ సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలోనూ పాల్గొని చరిత్ర సృష్టించారు. పశ్చిమబెంగాల్లో.. కోల్కతాలో వరుసగా నాలుగోరోజు ముఖ్యమంత్రి మమత బెనర్జీ సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో స్వయంగా పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై దేశవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని మోదీ సర్కారును సవాలు చేశారు. ఈ రెఫరండంలో ఓడిపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఇద్దరి మృతి మంగళూరులో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు. మంగళూరు నార్త్ పోలీస్ స్టేషన్ను ముట్టడించి, పోలీసులపై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారని, వారిని అడ్డుకునే ప్రయత్నంలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని పోలీస్ అధికారులు తెలిపారు. బెంగళూరు, హుబ్బలి, కలబుర్గి, హాసన్, మైసూర్, బళ్లారిల్లో విపక్షాలు, ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బెంగళూరులో ఆందోళనల్లో పాల్గొన్న రామచంద్ర గుహను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుత నిరసనలకు కూడా అనుమతించకపోవడం అప్రజాస్వామికమని గుహ విమర్శించారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద అప్రమత్తంగా ఉన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సభ్యులు గుహ అరెస్ట్ దృశ్యం -
అయోధ్యలో పటిష్ట భద్రత
అయోధ్య: బాబ్రీ మసీదు కూల్చివేత దినం (డిసెంబర్ 6) సమీపిస్తుండటంతో అయోధ్యలో భద్రత పెంచారు. శాంతి, సహనం, సౌభ్రాతృత్వాన్ని ప్రజలు ప్రదర్శిస్తారని భావిస్తున్నట్లు అయోధ్య డిప్యూటీ కలెక్టర్ అనూజ్ ఝా చెప్పారు. బాబ్రీ మసీదు కూల్చివేత దినం రోజున కొందరు ఉత్సవాలు జరుపుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అయోధ్యను నాలుగు విభాగాలుగా విభజించి భద్రతా బలగాలను మోహరించారు. పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయోధ్య జిల్లాలో డిసెంబర్ 28 వరకూ 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. -
నేడు బస్ భవన్,డిపోల వద్ద 144 సెక్షన్
-
నేడు డిపోల వద్ద 144 సెక్షన్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల జేఏసీ శనివారం తలపెట్టిన బస్రోకోకు ఎలాంటి అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నగరంలోని బస్ భవన్తో పాటు డిపోల వద్ద 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఇది శనివారం తెల్లవారుజామున 3గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3గంటల వరకు వర్తిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రూపులుగా ఏర్పడి ఆందోళన చేయొద్దని, బస్సుల రాకపోకలు అడ్డుకుంటే ఉపేక్షించబోమన్నారు. నగరంలో ఇలాంటి చర్యల వల్ల విద్య, వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులు కలుగుతాయని, నిబంధనలు పాటించాలని సూచించారు. -
బలగాల రక్షణలో ప్రశాంతంగా...
న్యూఢిల్లీ: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది. అయోధ్య విషయంలో గతంలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు భారీ స్థాయిలో బలగాలను మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. డ్రోన్ల ద్వారా, సీసీ ఫుటేజీల ద్వారా ఆయా ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. హోంమంత్రి అమిత్షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం సెక్రటరీ అజిత్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్లతో సమావేశమై పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సుప్రీంకోర్టు వద్ద.. తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు వద్ద భారీగా బలగాలను మోహరించారు. కోర్టు ఆవరణలోకి ప్రవేశించే వాహనాలను, వ్యక్తులను బారికేడ్లతో అడ్డుకొని, క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాకే లోపలికి పంపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సహా ధర్మాసనంలోని మిగతా న్యాయమూర్తుల నివాసాల వద్ద కూడా బలగాలను మోహరించారు. రామ జన్మభూమి అయోధ్యలో... అయోధ్యతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బలగాలను మోహరించి పరిస్థితులను ప్రభుత్వం పర్యవేక్షించింది. రాష్ట్రంలో మొత్తం 112 ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసి జిల్లాలను జోన్ల లెక్కన విభజించి సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను పరిశీలించారు. 31 జిల్లాల్లోని అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గొడవలు చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు. అనుకోని ఘటనలు ఎదురైతే తక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాలో తాత్కాలిక కారాగారాలను ఏర్పాటు చేసింది. సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. అయోధ్య భూమి ప్రాంతంలో సంచరించే వారిని తనిఖీ చేశారు. దేశ రాజధానిలో.. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ దృష్ట్యా పలు నిబంధనలను విధించనున్నట్లు పోలీసులు శనివారం ఉదయమే ప్రకటించారు. కోర్టు తీర్పును స్వాగతించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అసత్య వార్తలు ప్రచారం చేసినందుకుగానూ నోయిడాలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత ఢిల్లీ, జామా మసీదు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఆర్థిక రాజధాని ముంబైలో.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. దాదాపు 40 వేల మంది పోలీసులు గస్తీ కాశారు. శనివారం ఉదయం 11 నుంచి 24 గంటల పాటు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థలను మూసేశారు. -
అయోధ్యలో నిశ్శబ్దం
అయోధ్య: అయోధ్య వివాదంపై త్వరలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో మరికొన్ని కీలక పరిణామాలు సంభవించాయి. రామాలయ నిర్మాణం కోసం 1990 నుంచి అయోధ్యలో రాతి శిల్పాలను చెక్కిస్తున్న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) మొదటిసారిగా ఆ పనులను నిలిపివేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది. ఫైజాబాద్ జిల్లాకు 40 కంపెనీల పారా మిలటరీ బలగాలను తరలించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 28వ తేదీ వరకు అయోధ్యలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించింది. ఇలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పుపై అయోధ్య వాసులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలతో అంతా సవ్యంగానే జరిగిపోతుందని, 1992 నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశం ఉండదని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలోని రామమందిర్ కార్యశాలలో ఆలయం కోసం 1990 నుంచి రాతి చెక్కడం పనులు సాగిస్తున్న వీహెచ్పీ మొట్టమొదటి సారిగా పనులను నిలిపివేసింది. బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం నిర్మించాలని వీహెచ్పీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం, యూపీలో ప్రభుత్వాలు మారినా..1992లో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ తదితర హిందుత్వ సంస్థలపై 6 నెలలపాటు నిషేధం విధించినప్పుడు కూడా ఈ పనులు ఆగలేదు. తాజాగా, సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న దృష్ట్యా తమ నాయకత్వం పనులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుందని వీహెచ్పీ ప్రతినిధి శరత్ శర్మ తెలిపారు. ప్రతిపాదిత రామాలయం మొదటి అంతస్తుకు సరిపడా 1.25 లక్షల ఘనపుటడుగుల రాతి చెక్కడం పనులు ఇప్పటి వరకు పూర్తయ్యాయని ఆయన అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు సుప్రీంకోర్టు తీర్పును పురస్కరించుకుని సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని, అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. అదేవిధంగా, యూపీ ప్రభుత్వం కూడా సుప్రీం తీర్పు అనంతరం ఉత్సవాలు జరుపుకోవడం, నిరసన తెలపడం వంటి వాటిపై నిషేధం విధించింది. డిసెంబర్ 28వ తేదీ వరకు అయోధ్యలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించింది. ఫైజాబాద్ జిల్లా నాలుగు భద్రతా జోన్లను ఏర్పాటు చేసిన కేంద్రం 40 కంపెనీల పారా మిలటరీ బలగాలను తరలించింది. సామాజిక మాధ్యమాల్లో రామ జన్మభూమి తీర్పునకు సంబంధించి వ్యాఖ్యలపై నిషేధం విధించింది. రైల్వే శాఖ కూడా రైల్వే భద్రతా దళం(ఆర్పీఎఫ్) సెలవులను రద్దు చేసింది. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. -
అయోధ్యలో 144 సెక్షన్
అయోధ్య: త్వరలో ‘రామ మందిరం– బాబ్రీమసీదు’ కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య జిల్లాలో సెక్షన్ 144ని విధించారు. ఇది డిసెంబర్ 10 వరకు అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అయోధ్య కేసును సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్ట్ 6వ తేదీ నుంచి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో వాదనలు 17వ తేదీతో ముగియనున్నా యి. సెక్షన్ 144 అమల్లో ఉన్న సమయంలో నలుగురికి మించి ఒకే చోట గుమికూడరాదు. -
బస్టాండ్ల వద్ద 144 సెక్షన్
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని అన్ని బస్డిపోలు, బస్టాండ్ల వద్ద 144 సెక్షన్ను అమలు చేయాలని కలెక్టర్ సత్యనారాయణ ఆర్డీవోలను ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. ఆర్టీసీ స మ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లుగా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయించాలన్నారు. ప్రైవేట్ బస్సులు, స్కూల్బస్సులు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లను అందుబాటులో ఉంచాలన్నారు. బస్సుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఎస్పీ శ్వేత అధికారులకు సూచించారు. కంట్రోల్ రూంతో అనుసంధానం కలిగి ఉండాలన్నారు. సమ్మె నేపథ్యంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఆయా నంబర్లకు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. వీసీలో జేసీ యాదిరెడ్డి, ఆర్టీఏ వాణి, డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎంవీఐ శ్రీనివాసరావు, కామారెడ్డి బస్డిపో డివిజనల్ మేనేజర్ గణపతిరాజు తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్స్ వివరాలు.. జిల్లా పోలీసు కంట్రోల్రూం, ఎస్పీ కార్యాలయం ఫోన్ నంబర్లు : 9490617633, 08468–226633 కామారెడ్డి బస్ డిపో కంట్రోల్ రూం నంబర్ : 08468–220281 బాన్సువాడ బస్డిపో కంట్రోల్ రూం నంబర్ : 8985061830 కామారెడ్డి ఆర్డీవో : 9491036892 బాన్సువాడ ఆర్డీవో : 9492022593 కామారెడ్డి డీఎస్పీ : 9440795426 బాన్సువాడ డీఎస్పీ : 9490617639 ఆర్టీఏ నంబర్ : 9618430721 -
చంద్రబాబుకు షాకిచ్చిన కార్యకర్తలు
సాక్షి, గుంటూరు: పల్నాడు ప్రాంతంలో ప్రశాంతను చెదరగొట్టి చిచ్చు రగిల్చేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తామకెలాంటి సమస్యలను లేవని అక్కడి ప్రజానీకం చెబుతున్నా.. కేవలం కుట్రపూరితంగా టీడీపీ నేతలు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో పోలీసులు అధికారులు 144 సెక్షన్ అమలు చేశారు. తమ అనుమతి లేకుండా ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలు చేయవద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీచేశారు. శాంతి భద్రతల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమకు సహకరించాలని ఆయన కోరారు. పల్నాడులో ఎటువంటి అవాంచనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని డీజీపీ తెలిపారు. సొంత గ్రామాలకు కార్యకర్తలు మరోవైపు గుంటూరు జిల్లా ఆత్మకూరు వాతావరణం ప్రశాంతంగానే ఉందని డీఎస్పీ హరి తెలిపారు. గతంలో ఒకే కుంటుంబానికి చెందిన ఎస్సీల మధ్య గొడవలు జరిగాయని, అవన్ని కేవలం కుటుంబ వివాదాలే అని తేల్చిచెప్పారు. వారి కుటుంబ గొడవలతో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. పోలీసుల ప్రకటనతో టీడీపీ పునరావాస ఉన్న పార్టీ కార్యకర్తలు చిన్నగా జారుకుంటున్నారు. తమను అడ్డంపెట్టకుని నేతలు రాజకీయం చేస్తున్నారని గమనించిన క్యాడర్.. తమ సొంత గ్రామాలకు తరలివెళ్లిపోతున్నారు. తమ కుటుంబ సమస్యలను రాజకీయ పార్టీల అవసరాలకు వాడుకుంటున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల వైఖరితో టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. నిన్నటి వరకూ అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, కే–ట్యాక్సులతో అట్టుడికిన పల్నాడు ప్రాంతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రశాంతంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్రపూరితంగా ప్రశాంత పల్నాడులో చిచ్చుపెట్టే చర్యలు చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు వారికి వంతపాడుతూ నీచ రాజకీయాలకు తెరదీశారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం, టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, జి.వి.ఆంజనేయులు పల్నాడులో సాగించిన ఫ్యాక్షన్ రాజకీయాలను విస్మరించి, ఇప్పుడు ఏదో జరిగిపోతోందంటూ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ దిగజారుడు రాజకీయాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. యరపతి నేని శ్రీనివాసరావు, కోడెల కుటుంబం పాల్పడిన అక్రమాలు, దౌర్జన్యాలతో నష్టపోయిన బాధితులతో గుంటూరులోని పార్టీ కార్యాలయం నుంచి ఆత్మకూరు వెళ్లేందుకు నిర్ణయించారు. (చదవండి: పల్నాట కపట నాటకం!) -
పల్నాడులో 144 సెక్షన్ : డీజీపీ
సాక్షి, అమరావతి : పల్నాడులో 144,30 సెక్షన్ విధించామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమన్నారు. శాంతి భద్రతల విషయంలో అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు. వినాయక నిమజ్జనం, మొహరం పండుగల నేపథ్యంలో ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడులో ఎటువంటి అవాంచనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని డీజీపీ తెలిపారు. కాగా, తమ శ్రేణులపై దాడులు చేస్తున్నారంటూ టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు ఒకరి ఒకరు పోటీగా బాధితుల కోసం పల్నాడులో పునరావాస శిబిరాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆత్మకూరులో ప్రశాంత వాతావరణం : గురజాల డీఎస్పీ ఆత్మకూరులో ప్రశాంత వాతావరణం నెలకొందని గురజాల డీఎస్పీ శ్రీహరి అన్నారు. గతంలో ఒకే కుటుంబానికి చెందిన ఎస్సీల మధ్య గొడవలు జరిగాయని, అవన్ని కుటుంబ వివాదాలే అన్నారు. వాటితో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసుల చొరవతో వారంతా కలిసిపోయారని, ఇప్పడు గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొందని శ్రీహరి తెలిపారు. ఐజీని కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రేపటి ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ను కలిశారు. టీడీపీ బాధితులకు న్యాయం చేసేందుకు చేపట్టబోయే ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐజీని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, బొల్లా బ్రాహ్మనాయుడు, ఎంపీలు నందిగం సురేష్, లావు శ్రీకృష్ణ దేవరాయలు, పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం తదితరులు ఉన్నారు. -
ప్రార్థనలు.. ప్రశాంతం!
శ్రీనగర్/న్యూఢిల్లీ/ఐరాస/వాషింగ్టన్: కశ్మీర్లో ప్రార్థనలు చేసుకునేందుకు ప్రభుత్వం శుక్రవారం ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసింది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు శాంతియుతంగా మసీదుల్లో ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోపోర్సహా కొన్నిచోట్ల అల్లరిమూకలు భద్రతాబలగాలపై రాళ్లు విసరగా, వారిని బలగాలు చెదరగొట్టాయి. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఏచూరి, రాజాల అడ్డగింత.. కశ్మీర్లో పర్యటించేందుకు వచ్చిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాలను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో దిగిన వీరిద్దరినీ అధికారులు తిరిగి ఢిల్లీకి విమానంలో పంపించారు. ఈ విషయమై సీతారాం ఏచూరి మాట్లాడుతూ..‘శ్రీనగర్లోకి ఎవ్వరినీ అనుమతించరాదని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను పోలీసులు మాకు చూపించారు. భద్రతా కారణాల రీత్యా ఎవ్వరినీ అక్కడకు తీసుకెళ్లలేమని చెప్పారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ శుక్రవారం కూడా శ్రీనగర్లోని సున్నితమైన ప్రాంతాల్లో తన సహాయకులతో కలిసి పర్యటించారు. పలుచోట్ల కశ్మీరీలతో ముచ్చటించారు. అనంతరం సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులతో ఆయన సమావేశమయ్యారు. సంయమనం పాటించండి: గ్యుటెరస్ జమ్మూకశ్మీర్ విషయంలో భారత్–పాకిస్తాన్లు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ కోరారు. ఐరాస మార్గదర్శకాలకు లోబడి సిమ్లా ఒప్పందం మేరకు ఇరుదేశాలు తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచించారు. కశ్మీర్ సమస్యను మరో పక్షం జోక్యంలేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని 1972లో భారత ప్రధాని ఇందిర, పాక్ అధ్యక్షుడు జుల్ఫీకర్ అలీ భుట్టో ఒప్పందంపై సంతకాలు చేశారు. మా పాలసీ మారలేదు: అమెరికా కశ్మీర్ విషయంలో తమ విధానంలో ఎలాంటి మార్పులేదని అమెరికా తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి భారత్–పాకిస్తాన్లు ప్రత్యక్ష చర్చలు ప్రారంభించడమే మార్గమని పునరుద్ఘాటించింది. కాగా, అమెరికా విదేశాంగ సహాయ మంత్రి జాన్ ఆగస్టు 11–17 మధ్య భూటాన్, భారత్లో పర్యటించనున్నారు. భారత్, పాకిస్తాన్లు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా శుక్రవారం పిలుపునిచ్చింది. పాక్ భయపడుతోంది: విదేశాంగ శాఖ కశ్మీర్లో భారత చర్యలు చూసి పాక్ భయపడుతోందనీ, ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే ఇకపై ప్రజలను తప్పుదోవ పట్టించలేమని పాక్ ఆందో ళన చెందుతోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ అన్నారు. కుల్భూషణ్ జాధవ్ ను భారత రాయబారులు కలిసే అంశంపై తాము పాక్తో మాట్లాడుతున్నామన్నారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్లోని అన్ని పంచాయతీలు, వార్డులు, మొహల్లాల్లోనూ స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహిస్తామని బీజేపీ ప్రకటించింది. ఆగ్రా జైలుకు కశ్మీర్ వేర్పాటువాదులు కశ్మీర్లోని హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మియన్ ఖయ్యూంను పోలీసులు కశ్మీర్ లోయలోని జైలు నుంచి యూపీలోని ఆగ్రాకు తరలించారు. కశ్మీర్లో సమస్యలు సృష్టించగల వ్యక్తులను కేంద్రం ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ఖయ్యూంతోపాటు 25 మంది వేర్పాటువాదులనుఆగ్రాకు తరలించగా, శుక్రవారం మరో 20 మందిని కశ్మీర్ నుంచి ఆగ్రా సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా వారిని పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రముఖ న్యాయవాదిగా పేరున్న ఖయ్యూం, వేర్పాటువాదులకు సంబంధించిన అనేక కేసులను వాదించారు. -
ఈద్ సందర్భంగా కశ్మీర్లో ఆంక్షల సడలింపు
శ్రీనగర్ : ఈద్ పండుగ సందర్భంగా శుక్రవారం ప్రార్థనలకు, వ్యాపారానికి కశ్మీర్లో విధించిన ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐదు రోజులుగా జమ్మూ కశ్మీర్లో కర్ఫ్యూ ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రత్యేక ప్రసంగంలో మాట్లాడుతూ ఈద్ జరుపుకునే ప్రజలు ‘ఇబ్బందులు ఎదుర్కోరు’ అని, త్వరలోనే పరిస్థితి సాధారణమవుతుందని కశ్మీరీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ దిశగా ప్రభుత్వం కశ్మీర్లో సాధారణ పరిస్థితి ఏర్పడటానికి వేగంగా కృషి చేస్తోంది. శ్రీనగర్లోని చరిత్రాత్మక జామామసీదులో కూడా ప్రార్థనలకు అనుమతించారు. బ్యాంకు లావాదేవీలు పరిమిత స్థాయిలో జరుగుతున్నాయి. కూరగాయల దుకాణాలు, మెడికల్ షాపులను వ్యాపారులు తెరుస్తున్నారు. కశ్మీర్ లోయలో ఎవరినీ వేధించకుండా చూసుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ అధికారులను ఆదేశించిన తరువాత ఈ ప్రాంతంలో ఆంక్షలు సడలింపు మరింత వేగమైంది. పండుగ వస్తువులు కోసం దుకాణాల దగ్గరకి ప్రజలు రావాల్సిన అవసరం లేదని, ఇళ్ల దగ్గరకే వివిద వస్తువులు సరఫరా చేయబడతాయని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. అలాగే మార్కెట్లు కూడా ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపారు. కశ్మీర్ అంతటా సెక్షన్ 144 అమలులో ఉన్నా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే మినహాయింపులు ఇచ్చామని పేర్కొన్నారు. -
జమ్మూకశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
-
అర్థరాత్రి అలజడి: కేంద్రం గుప్పిట్లోకి కశ్మీర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఆదివారం అర్ధరాత్రి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకుని, గడప దాటి బయటకు రావద్దని ఆదేశించారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతోపాటు రాత్రిపూట కర్ఫ్యు కూడా విధించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో అక్కడి పరిస్థితినంతా కేంద్రం తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నడమ సోమవారం ఉదయం 9:30 గంటలకు జరగబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కశ్మీర్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేబినెట్ భేటీని ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో ఆర్టికల్ 35ఏ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు లోయకు మరింత అదనపు బలగాలను తరలించారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఓ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘రేపు ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలి. ఈ రాత్రి సుదీర్ఘంగా ఉండబోతోంది’ అని మెహబూబా ట్వీట్ చేశారు. తమను పోలీసులు అరెస్టు చేశారని కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగామి పేర్కొన్నారు. మరోవైపు, జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కశ్మీర్ ఐజీలతో గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆదివారం అర్ధరాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను సోమవారం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్మూ, కశ్మీర్ ప్రజలపై దాడిచేయడమే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటిలో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అధ్యక్షతన ఈ సమావేశానికి కాంగ్రెస్, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జేఅండ్కే మూవ్మెంట్, ఎన్సీ, సీపీఎం నేతలు హాజరయ్యారు. ఈ విషయమై ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ నిబంధనల్ని కాపాడేందుకు, రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలన్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా పోరాడాలని అఖిలపక్ష భేటీలో నిర్ణయించాం. ఆర్టికల్ 35 ఏ, ఆర్టికల్ 370లను రాజ్యాంగవిరుద్ధంగా రద్దు చేయడమంటే జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రజలపై దాడిచేయడమే.’ అని చెప్పారు. -
ఎయిర్ పోర్టు పరిధిలో 144 సెక్షన్
సాక్షి, విజయవాడ: కమిషనరేట్ పరిధిలో గన్నవరం ఎయిర్పోర్టు ఏరియాలో శుక్రవారం నుంచి నవంబర్ 18వ తేదీ వరకు 55 రోజుల పాటు 144వ సెక్షన్ అమలులో ఉంటోందని నగర పోలీసు కమిషనర్ సి.హెచ్.ద్వారకా తిరుమల రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిర్పోర్టు ఏరియాలో 250 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకు మించి ఎక్కువ మంది జనం గుమిగూడరాదని, కర్రలు రాళ్లు వంటి వాటిని పట్టుకుని తిరగరాదని ఆయన పేర్కొన్నారు. -
నేటి నుంచి శబరిమలలో పూజలు
తిరువనంతపురం: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య శబరిమల ఆలయంలో నేటి సాయంత్రం నుంచి పూజలు ప్రారంభం కానున్నాయి. అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆలయం తెరుచుకోవడం ఇది మూడోసారి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష భేటీ విఫలమైంది. కోర్టు ఆదేశాలను అమలు చేయడమే తమ కర్తవ్యమని గట్టిగా చెబుతున్న సీఎం విజయన్.. ప్రత్యేకంగా కొన్ని రోజులు 50 ఏళ్ల లోపు మహిళలను దర్శనానికి అనుమతించాలని యోచిస్తున్నామన్నారు. అయితే, రివ్యూ పిటిషన్లు సుప్రీం ముందుకు విచారణకు వచ్చే జనవరి 22 వరకు ఉత్తర్వుల అమలును ఆపాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను సీఎం ఆమోదించకపోవడంపై కాంగ్రెస్, బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయ్యప్ప దర్శనానికి వస్తున్న తనకు రక్షణ కల్పించాలని రాసిన లేఖకు కేరళ ప్రభుత్వం స్పందించలేదని హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ తెలిపారు. అఖిలపక్షంలో ఏకాభిప్రాయం కరువు శబరిమల ఆలయంలోకి రుతుస్రావం వయస్సులో ఉన్న మహిళలను కూడా అనుమతించాలన్న సెప్టెంబర్ 28వ తేదీ నాటి సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఇప్పటి వరకు రెండుసార్లు ఆలయాన్ని తెరవగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతోపాటు 16 నుంచి ప్రారంభమై రెండు నెలలపాటు కొనసాగే ‘మండల మకరవిలక్కు’ పూజల కోసం ఆలయాన్ని తెరవనుండటంతో కేరళ ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశం బీజేపీ, కాంగ్రెస్ల వాకౌట్తో ఎలాంటి పరిష్కారం చూపకుండానే ముగిసింది. మహిళల ప్రవేశానికి మేం వ్యతిరేకం అఖిలపక్షం అనంతరం ముఖ్యమంత్రి విజయన్.. పండాలం రాచకుటుంబం, శబరిమల ఆలయ ప్రధాన పూజారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. పండాలం రాచకుటుంబం ప్రతినిధి శశికుమార్ వర్మ మాట్లాడుతూ.. సంప్రదాయానికి విరుద్ధంగా ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మేం వ్యతిరేకం. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పులేదు’ అని ప్రకటించారు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నామన్నారు. ప్రధాన పూజారి కందరారు రాజీవరు మాట్లాడుతూ..‘10 నుంచి 50 ఏళ్ల మహిళా భక్తులను శబరిమలకు రావద్దని మాత్రం వేడుకుంటున్నా’ అన్నారు. నేటి సాయంత్రం 5 గంటలకు... శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఇద్దరు ఆలయ ప్రధాన పూజారులు ఎంఎల్ వాసుదేవన్ నంబూద్రి, ఎంఎన్ నారాయణన్ నంబూద్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆలయ ద్వారాలను తెరుస్తారు. అయితే, రాత్రి 9 గంటల వరకే భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. నిషేధాజ్ఞలు అమల్లోకి.. గురువారం అర్ధరాత్రి నుంచి వారంపాటు ఆలయ పరిసరాల్లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని రాష్ట్ర డీజీపీ లోక్నాథ్ బెహరా తెలిపారు. ‘గత సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బేస్ క్యాంప్ నిలక్కల్ మొదలుకొని ఆలయ పరిసర ప్రాంతాల్లో బందోబస్తును రెట్టింపు చేశాం. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున 15వేలకు పైగా సిబ్బందిని వినియోగిస్తున్నాం. రాత్రి ఆలయం మూసివేసిన తర్వాత సన్నిధానంలో ఉండేందుకు భక్తులను అనుమతించబోం’ అని అన్నారు. -
పోలీసుల వలయంలో తాడిపత్రి
అనంతపురం సెంట్రల్: తాడిపత్రిలో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసుశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. రాయలసీమ రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ రంగంలోకి దిగారు. తాడిపత్రి రూరల్ మండలం పొద్దపొలమడ గ్రామంలో పరిస్థితి అదుపుతప్పడం... గొడవలను మరింత రాజేసేలా అక్కడి నాయకులు ప్రవర్తిస్తుండటంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు తాడిపత్రికి చేరుకుంటున్నాయి. రాయలసీమ రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్కుమార్, చిత్తూరు జిల్లా ఎస్పీ ఎస్వి రాజశేఖర్బాబులకు శాంతిభద్రతల బాధ్యతలను చూస్తున్నారు. వీరితో పాటు చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి స్పెషల్పార్టీ బలగాలను రప్పించారు. సోమవారం కడప, కర్నూలు నుంచి కూడా ప్రత్యేక బలగాలు తాడిపత్రికి చేరుకుంటున్నాయి. సెక్షన్ 144, 30 యాక్ట్ శాంతిభద్రతలు చెయ్యి దాటిపోవడంతో తాడిపత్రి మండల పరిధిలో 144 సెక్షన్, 30 యాక్టును అమలు చేస్తున్నారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశాలిచ్చారు. అడుగడుగునా పోలీసుల వైఫల్యం పొద్దపొలమడ గ్రామంలో ప్రబోధానంద ఆశ్రమ భక్తులు, జేసీ వర్గీయుల మధ్య గొడవలు జరగడానికి పోలీసుల వైఫల్యమనే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్యాత్మక గ్రామాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదు.. కానీ పొద్దపొలమడ గ్రామంలో అనుమతివ్వడం.. విగ్రహాల ఊరేగింపు సమయంలోనైనా జాగ్రత్తలు తీసుకోకపోవడం.. జేసీ వర్గీయులు ఆశ్రమంపైకి వెల్లేంత వరకూ పోలీసులు జోక్యం చేసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. -
శంఖవరంలో కొనసాగుతున్న 144 సెక్షన్
తూర్పు గోదావరి, శంఖవరం: శంఖవరం ఎస్సీ పేటలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదంలో బత్తిన నూకరాజు, బత్తిన ప్రసాద్ సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్సీ పేటలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అక్కడ రెవెన్యూ, పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల 144 సెక్షన్ శుక్రవారం కూడా కొనసాగింది. ఇరు వర్గాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘర్షణలు జరగకుండా ఎస్సీ పేటలో ప్రతి వీధిలో పెద్దాపురం డీఎస్పీ సీహెచ్ వెంకట రామారావు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. మృతదేహాలు అప్పగింత.. సజీవదహనమైన మృతులు మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం పోలీసులు స్వగ్రామానికి తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహలను చూసి కుటుంబీకులు, బంధువులు బోరున విలపించారు. కుటుంబ సభ్యులతో దహన సంస్కారాలు చేశారు. గ్రామంలో శాంతి భద్రతలు నిలకడగా ఉండే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎసై.పార్ధసారథి, తహసీల్దార్ ఎం సుజాత వివరించారు. హత్యాకాండకు బాధ్యులైన పదిమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ సీఎచ్వీ రామారావు విలేకర్లకు తెలిపారు. -
మత ఘర్షణల్లో ఇద్దరి మృతి
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. ఈ అల్లర్లను అదుపు చేసేందుకు 144 సెక్షన్ను విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించడంతో గత కొన్నిరోజులుగా స్థానికులు ఆగ్రహంగా ఉన్నారన్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు కార్పొరేషన్ సిబ్బంది మోతీకరంజాలోని ఓ ప్రార్థనాలయంలో ఉన్న అక్రమ నల్లా కనెక్షన్ను తొలగించడంతో వివాదం రాజుకుందన్నారు. తమ కనెక్షన్తో పాటు మరో వర్గానికి చెందిన ప్రార్థనాస్థలంలో ఉన్న అక్రమ నీటి కనెక్షన్ను కూడా తొలగించాలని ఓ వర్గం డిమాండ్ చేయడంతో ఘర్షణ చెలరేగిందన్నారు. దీంతో అల్లర్లు మోతీకరంజా నుంచి గాంధీనగర్, రాజా బజార్, షా గంజ్, సరఫా ప్రాంతాలకు విస్తరించాయన్నారు. ఈ సందర్భంగా రెచ్చిపోయిన ఆందోళనకారులు 100 దుకాణాలకు, 80 వాహనాలకు నిప్పుపెట్టారని వెల్లడించారు. వీరిని అదుపు చేసేందుకు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు(17)చనిపోగా, ఆందోళనకారులు మంట లు అంటించడంతో ఓ షాపులోని 65 ఏళ్ల వృద్ధుడు దుర్మరణం చెందాడని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ సహా 12 మంది పోలీసులు గాయపడినట్లు తెలిపారు. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 37 మంది నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు. -
రైతుల ఆందోళన.. ఆర్మూర్ లో 144 సెక్షన్
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో రైతులు తలపెట్టిన రిలే దీక్షలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మద్దతు ధర కోసం ఎర్రజొన్న, పసుపు రైతులు ఆందోళన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల ఆందోళనతో ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో 48 గంటల పాటు 144 సెక్షన్ విధిస్తూ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది రైతులు గుమిగుడితే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 144 సెక్షన్ నేపథ్యంలో దాదాపు 250 మంది పోలీసులు ఆర్మూర్లో మోహరించారు. -
భగ్గుమన్న ఏజెన్సీ
సాక్షి, ఆదిలాబాద్/ఉట్నూర్/ఉట్నూర్రూరల్/నార్నూర్/ఆసిఫాబాద్: ఆదివాసీలు, లంబాడీల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. శుక్రవారం ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ అల్లకల్లోలంగా మారింది. ఏజెన్సీలోని నార్నూర్ మండలం బేతాల్గూడలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కుమురం భీం విగ్రహానికి చెప్పులదండ వేయడంతో వివాదం రాజుకుంది. విషయం తెలుసుకున్న ఆదివాసీలు.. శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో కుమురం భీం విగ్రహం వద్దకు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కానీ ఈ విషయం వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందడంతో ఏజెన్సీ అట్టుడికిపోయింది. నార్నూర్ మండలం తాడిహత్నూర్లో ఇరువర్గాల వారు రోడ్డుపైకి చేరుకుని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దుకాణాలు మూయించివేశారు. మరోవైపు గంగాపూర్, నార్నూర్, భీంపూర్ తదితర గ్రామాల్లో ఇరువర్గాల వారు కర్రలు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. బేతాల్గూడ ఘటనను నిరసిస్తూ ఆదివాసీలు ఇంద్రవెల్లి మండల కేంద్రంలో సేవాలాల్ జెండాలు ధ్వంసం చేశారు. అటు నార్నూర్ ఎక్స్రోడ్డులో ఉన్న ఆదివాసీ జెండాలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. హస్నాపూర్లో బీభత్సం ఉట్నూర్ మండలం హస్నాపూర్లో ఆదివాసీలు ధర్నా చేస్తుండగా.. అక్కడికి లంబాడీలు చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఆదివాసీలు సోయం జుగాదిరావు, చాకటి బాపురావులకు గాయాలయ్యాయి. దీంతో గొడవలు మరింత ముదిరి ఇరువర్గాలు బీభత్సం సృష్టించాయి. ఉట్నూర్ ఎక్స్రోడ్డు వద్ద పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులు హస్నాపూర్లోని మద్యం దుకాణానికి నిప్పుపెట్టారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అయినా ఇరువర్గాల వారు కర్రలు చేతపట్టుకుని ప్రధాన రహదారుల వెంట బీభత్సం సృష్టించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని నినాదాలు చేస్తూ ఆదివాసీలు ఆందోళనలు నిర్వహించారు. ఉద్రిక్తంగానే పరిస్థితి.. ఇరువర్గాల మధ్య గొడవల సెగ శుక్రవారం రాత్రి సమయానికి మారుమూల గ్రామాలకు కూడా పాకింది. సిర్పూర్ (యూ) మండల కేంద్రంలో లంబాడీలకు చెందిన రామారావు మహరాజ్ విగ్రహాన్ని ఆదివాసీలు ధ్వంసం చేశారు. మండలకేంద్రంలోని లంబాడీలకు చెందిన పలు ఇళ్లపై దాడి చేశారు. దీంతో ఏజెన్సీలో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. ఓ గిరిజన తండాకు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెస్తుండగానే.. మరో తండాలో గొడవలు మొదలయ్యాయన్న సమాచారంతో పోలీసు బలగాలు ఉరుకులు పరుగులు పెట్టాయి. పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. పోలీసు దిగ్బంధంలో ఏజెన్సీ ఆదివాసీలు, లంబాడీల మధ్య ఘర్షణ, ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాల మేరకు.. కరీంనగర్ డీఐజీ సి.రవివర్మ శుక్రవారం సాయంత్రం ఉట్నూర్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు జ్యోతి బుద్ధప్రకాశ్, ఆర్వీ కర్ణన్, రామగుండం, కరీంనగర్ పోలీస్ కమిషనర్లు విక్రంజిత్ దుగ్గల్, కమలాసన్రెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఎస్పీలు కూడా ఉట్నూర్కు చేరుకుని భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గుడిపేట 13వ బెటాలియన్, డిచ్పల్లి 7వ బెటాలియన్ బలగాలు ఉట్నూర్కు చేరుకున్నాయి. నిర్మల్, మంచిర్యాల, డిచ్పల్లి, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం ప్రాంతాల నుంచి పోలీసు సిబ్బందిని రప్పించారు. శుక్రవారం రాత్రికే 600 మందికిపైగా పోలీసు బలగాలు మొహరించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని పోలీసు బలగాలు ఏజెన్సీ ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. మూడు రోజుల పాటు 144 సెక్షన్ ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో మూడు రోజులపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఆదివాసీలు, లంబాడీలు శాంతించాలని విజ్ఞప్తి చేశారు. ఘర్షణలో ప్రమాదం.. ఇద్దరు మృతి హస్నాపూర్లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకుంటున్న సమయంలో రహదారిపై వెళుతున్న ఓ వాహనం నలుగురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో హస్నాపూర్కు చెందిన లంబాడీ యువకుడు రాథోడ్ జితేందర్ (28), జ్ఞానేశ్వర్, జాదవ్మోహన్లతోపాటు ఉట్నూర్కు చెందిన ఎస్కే.ఫారూక్ (45) గాయపడ్డారు. వారిని పోలీసులు వెంటనే ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా.. రాథోడ్ జితేందర్, ఎస్కే.ఫారూక్ మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన వాహనాన్ని గుర్తించలేదు. అయితే రాథోడ్ జితేందర్ను ఆదివాసీలే రాళ్లతో కొట్టి చంపారంటూ లంబాడీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. నేడు బంద్కు ఆదివాసీ సంఘాల పిలుపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం జిల్లాల పరిధిలో శనివారం బంద్కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. కుమురం భీం విగ్రహాన్ని అవమానించడాన్ని ఆదివాసీ హక్కుల పొరాట సమితి, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం, ఆదివాసీ సంక్షేమ పరిషత్ తదితర సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వదంతులను నమ్మొద్దు: డీఐజీ రవివర్మ ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఎవరూ చనిపోలేదని డీఐజీ రవివర్మ పేర్కొన్నారు. ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయని తెలిపారు. దాడులు, మరణాల వదంతులు నమ్మవద్దని, పరిస్థితి చక్కబడేదాకా ఇళ్లు విడిచి బయటికి రావొద్దని గిరిజనులకు సూచించారు. పరిస్థితి అదుపులోనే ఉంది: డీజీపీ సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉందని, భారీగా బలగాలను రంగంలోకి దింపామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. రెండు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను ఆ ప్రాంతాలకు తరలించామని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించేందుకు, అవసరమైన చర్యలు చేపట్టేందుకు ముగ్గురు ఐజీ ర్యాంకు అధికారులు డీఎస్ చౌహాన్, అనిల్కుమార్, వై నాగారెడ్డిలను పంపించామన్నారు. ప్రజాప్రతినిధులు కూడా నిగ్రహం పాటించాలని, సాధారణ పరిస్థితులు నెలకొనేలా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. హింసాత్మక ఘటనలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘర్షణల్లో పలువురు చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని.. వాటిని నమ్మవద్దని సూచించారు. ఈ ఘటనల్లో ఎవరూ మృతి చెందలేదని, నార్నూర్ మండలం హస్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాత్రం ఇద్దరు మాత్రం చనిపోయారని వివరించారు. -
ఉట్నూరు, ఇంద్రవెల్లిల్లో 144 సెక్షన్
-
అట్టుడుకుతున్న దక్షిణ కర్ణాటక
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఎప్పుడూ శాంతియుత పరిస్థితులుండే దక్షిణ ప్రాంతం ఇప్పుడు మత ఉద్రిక్తలతో అట్టుడికిపోతోంది. బంట్వాల్ తాలూకాలో గత 50 రోజుల నుంచి కొనసాగుతున్న నిషేధాజ్ఞలను ఆదివారం నాడు మంగళూరుకు కూడా పొడిగించారు. 144వ సెక్షన్ కింద విధించిన ఈ నిషేధాజ్ఞలు మరో రెండు వారాలపాటు కొనసాగుతాయని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. గత మూడు నెలలుగా కొనసాగుతున్న మత ఉద్రిక్తలలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి. బంట్వాల్లో గత మే 26వ తేదీన ఓ ముస్లిం యువకుడిని కత్తితో పోడవడంతో మత ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీంతో మొదటిసారి బంట్వాల్లో నిషేధాజ్ఞలు విధించారు. జూన్ 21వ తేదీన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఆటో డ్రైవర్ ఆష్రాఫ్ కలాయ్ (35)ని గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు ఆటో నుంచి బయటకులాగి హత్యచేశారు. జూలై 4వ తేదీన శరత్ మడివాలా అనే ఆరెస్సెస్ కార్యకర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి తీవ్రంగా కట్టారు. ఆ తర్వాత మూడు రోజులకు ఆయన గాయాలతో మరణించారు. ఈ మూడు సంఘటనల్లో ప్రతి సంఘటన కూడా మత ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆరెస్సెస్ కార్యకర్త హత్యానంతరం ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. జూలై 8 తేదీన ఆయన నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న హిందువులు రాళ్లు, సీసాలు విసిరారు. ఉత్తరప్రదేశ్లోలాగా కర్ణాటకలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని బీజేపీ, ఆరెస్సెస్ పార్టీలు రాష్ట్రంలో అశాంతి పరిస్థితులు సష్టిస్తున్నాయని కాంగ్రెస్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. అల్లర్లతో సంబంధం ఉన్న ఆరెస్సెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బహిరంగంగా పిలుపునివ్వడం, ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తామంటూ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సవాల్ చేయడం తెల్సిందే. తాను అసలు సిసలైన హిందువునని, తన పేరు సిద్ద రాముడని, బీజేపీ దొంగ హిందూ సిద్ధాంతమని కూడా ముఖ్యమంత్రి విమర్శలు చేశారు. వీరి సవాళ్లు, విమర్శలు ఎలా ఉన్నా అల్లర్లు ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా అల్లర్లకు దారితీసిన ఒక్క సంఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఇంతవరకు ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు. నిందితులపై కేసులు దాఖలు చేయనప్పుడు, అరెస్ట్లు చేయనప్పుడు అల్లర్లు సమసిపోకపోవడమే కాకుండా మరింత పెరుగుతాయి. అల్లర్ల పేరిట సంఘ విద్రోహ శక్తులు మరింత పేట్రేగిపోయే ప్రమాదం ఉంటుంది. మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ నిర్వహించనున్న శాంతి ప్రదర్శనలో పాల్గొనాలంటూ కాంగ్రెస్, బీజేపీలకు జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు కుమార స్వామి పిలుపునిచ్చారు. శాంతి ప్రదర్శనలో పాలక, ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా పాల్గొని తమ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. -
ఉద్రిక్తం.. ఉద్విగ్నం
► గరగపర్రులో కొనసాగుతున్న 144 సెక్షన్ ► తరలివచ్చిన అధికారగణం ► జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడి విచారణ ► నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశం ► నేడు గ్రామానికి వైఎస్సార్ సీపీ బృందం పాలకోడేరు మండలం గరగపర్రులో ఇంకా ఉద్విగ్నం.. ఉద్రిక్తత కొనసాగుతున్నాయి. గ్రామం పోలీసు వలయంలో బందీ అయింది. 144 సెక్షన్ వల్ల గ్రామంలోకి బయట వ్యక్తులను ఎవరినీ రానీకుండా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. పాలకోడేరు : గరగపర్రు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై తలెత్తిన వివాదం నేపథ్యంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురైనట్టు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి దళిత నేతలను అరెస్ట్ చేయడంతో ఆందోళనలు మిన్నంటాయి. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సోమవారం కూడా గ్రామం ఖాకీల వలయంలోనే ఉండాల్సి వచ్చింది. గ్రామంలోకి ఎవరినీ రానీకుండా పోలీసులు ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. సాధారణ ప్రజాజీవనానికీ ఆటంకం కలిగించారు. ప్రతిఒక్కరూ తాము గ్రామస్తులమనే ఆధారం చూపించాల్సిన పరిస్థితి నెలకొంది. అడుగడుగునా నిర్బంధాల వల్ల బయట నుంచి వచ్చిన ప్రజా, దళిత సంఘాల నేతలు అతి కష్టమ్మీద దళితవాడకు చేరుకుని బాధితులకు సంఘీభావం ప్రకటించారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలి : రాములు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు సోమవారం గ్రామానికి వచ్చారు. ఆయనతోపాటు కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ ఎం.రవిప్రకాష్, ఇతర అధికారగణం తరలివచ్చారు. దళితుల సాంఘిక బహిష్కరణ ఘటనపై రాములు బహిరంగ విచారణ చేపట్టారు. బాధితుల నుంచి, వివిధ ప్రజా సంఘాల నుంచి వివరాలను సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో పూర్వ పరిస్థితి నెలకొనే వరకూ బాధితులకు ఉపాధి కల్పించాలని ఆదేశించారు. ముందుగానే ఈ చర్యలు తీసుకుంటే ఇప్పుడీ విపత్కర పరిస్థితులు తలెత్తేవి కావని అభిప్రాయపడ్డారు. దళితులు కౌలు చేస్తున్న భూములను తిరిగి ఇప్పించాలని, వెంటనే పనులు కల్పించాలని, వారికి సరుకులు ఇవ్వని దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు. అంతేగాక దళితులకు దగ్గర్లో ఉండేలా దుకాణాలను ఏర్పాటు చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. శాంతి కమిటీని ఏర్పాటు చేసి ఇరువర్గాల్లో సభ్యులను ఎంపిక చేసి చర్చల ద్వారా న్యాయం చేయాలని కోరారు. దీంతో పోలీసులు కొంత గడువు కావాలని కోరారు. న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. తహసీల్దార్, తదితర అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారని, గ్రామంలో 400 ఎకరాలు ప్రభుత్వ భూములను బడా బాబులు కబ్జా చేశారని పలువురు ఆయన దృష్టికి తీసుకురాగా.. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే వెంటనే చర్యలు చేపడతామని బదులిచ్చారు. నేతల నిర్బంధం గొల్లలకోడేరు వద్ద వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్రాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మానుకొండ ప్రదీప్, లీగల్ సెల్ నాయకులు స్టాలిన్ రాజును పోలీసులు అడ్డుకుని రెండు గంటలపాటు నిర్బంధించారు. వీరు అతికష్టమ్మీద గ్రామానికి చేరుకుని దళితులను పరామర్శించారు. దళిత స్త్రీశక్తి జాతీయ అధ్యక్షురాలు గెడ్డం ఝాన్సీ, ఢిల్లీ నుంచి వచ్చిన దళిత రైట్స్ జాతీయ అధ్యక్షుడు కందుకూరి ఆనందరావు గ్రామంలో పోలీసుల అత్యుత్సాహాన్ని చూసి రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు. ఉత్తరప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, కోల్కతాల నుంచీ దళిత, మానవహక్కుల నేతలు గరగపర్రు తరలివచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపేశారు. ఇదిలా ఉంటే ఏపీ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి సుంకర సీతారాం, ఆపార్టీ జిల్లా నాయకుడు పాలా సత్తిరామరెడ్డి, ఐఏఎస్ ఫోరం కార్యదర్శి సిద్దోజిరావు, సీపీఎం, వివిధ ప్రజాసంఘాల నేతలు బాధిత దళితులను పరామర్శించారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నాడు తుందుర్రు.. నేడు గరగపర్రు.. భీమవరం : అధికారులు, పోలీసుల అత్యుత్సాహం వల్లే గరగపర్రు సమస్య మరింత జఠిలమవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోకి ప్రవేశించాలంటే గ్రామస్తులతో సహా అందరూ ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో గోదావరి ఆక్వా మెగా ఫుడ్పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలని తుందుర్రు, జొన్నలగరువు, కె.బేతపూడితో సహా భీమవరం, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని సుమారు 40 గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనలు చేపట్టిన సమయంలోనూ అధికారులు, పోలీసులు యాజమాన్యానికి కొమ్ముకాస్తూ బాధిత గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. బాధితులను ముప్పుతిప్పలు పెట్టారు. గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా.. లోపలకు రావాలన్నా.. ధ్రువీకరణ చూపించాలని ఆంక్షలు పెట్టారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం రెట్టింపయింది. ఇప్పుడు గరగపర్రు విషయంలోనూ పోలీసులు, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి శనివారమే కలెక్టర్ గ్రామానికి వచ్చి ఇరువర్గాలకూ నచ్చచెప్పారు. అయితే ఆ రోజు అర్ధరాత్రి దళితనేతలను అరెస్ట్ చేయడం, తదనంతరం 144 సెక్షన్ విధించడం బాధితుల్లో ఆగ్రహానికి కారణమైంది. వివాదం చినికిచినికి గాలివాన అయింది. ప్రజాజీవనానికి ఆటంకం కలుగుతోంది. గ్రామంలో పోలీసులు లేకపోతేనే సమస్య త్వరగా పరిష్కారమవుతుందని, ఎక్కువ మంది పోలీసులను మోహరించడం వల్ల ఏదో జరిగిపోతుందన్న ఆందోళన ఇటు బాధితుల్లోనూ, ఇటు మిగిలిన గ్రామస్తుల్లోనూ పెరిగిపోతుందని, దీనివల్ల సమస్య మరింత జఠిలమవుతుందని ఓ పోలీసు అధికారి చెప్పారు. వెంటనే పోలీసు బలగాలను ఉపసంహరించి అధికారులు సావధానంగా ఇరువర్గాలతో చర్చలు జరిపితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
బుద్గాం, గండేర్బాల్ల్లో 144 సెక్షన్
శ్రీనగర్: కశ్మీర్లోయలోని శ్రీనగర్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఘర్షణలు జరిగిన బుద్గాం, గండేర్బాల్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ జిల్లాల్లో 144 సెక్షన్ అమలవుతోంది. ఉప ఎన్నికల ఘర్షణలో 8 మంది యువకులు చనిపోవటాన్ని నిరసిస్తూ వేర్పాటువాదులు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. చాలాచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. దుకాణాలు, పెట్రోల్ స్టేషన్లు, ఇతర వ్యాపార సముదాయాలు తెరవలేదు. అటు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ రద్దీ కనిపించలేదు. కశ్మీర్ యూనివర్సిటీతోపాటు ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సోమవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి. -
టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్
సిటీబ్యూరో: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఈ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధిస్తూన్నట్లు కొత్వాల్ ఎం.మహేందర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14 నుంచి 30 వరకు అమలులో ఉండే వీటి ప్రకారం ఆ ప్రాంతాల్లో నలుగురి కంటే ఎక్కువ మంది ఒక చోట గుమిగూడ కూడదు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి భవనాలకు రెండు కిమీ పరిధిలో నిషేధాజ్ఞలు విధించారు. ఈ నెల 10 నుంచి 16 వరకు ఇవి అమలులో ఉంటాయని కొత్వాల్ తెలిపారు. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి గురువారం పోలింగ్ జరుగనుంది. దీంతో పోలింగ్ స్టేషన్ల వద్ద నిషేధాజ్ఞలు విధించారు. ఈ ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాల వద్ద పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఓటరూ విధిగా క్యూలోనే రావాలని, ఒకరికి కేటాయించిన క్యూలోకి మరొకరిని అనుమతించమని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. -
ఐదుగురు మించి కనిపిస్తే అరెస్ట్
-
ఐదుగురు మించి కనిపిస్తే అరెస్ట్
విశాఖపట్నం: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అడ్డుకోవడం కోసం సిటీ పోలీసులు బుధవారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రత్యేక వ్యూహాలను రూపొందించుకున్నారు. ప్రతి పోలీస్ తమ స్మార్ట్ఫోన్తో ఫొటోలు తీసి పంపాలని, వాటి ద్వారా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవచ్చని సిటీ పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ అధికారులకు, సిబ్బందికి ఆదేశాలిచ్చారు. నగరంలో 144 సెక్షన్ విధించారు. బుధవారం సాయంత్రం 5గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకూ 36 గంటల పాటు నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జాయింట్ పోలీస్ కమిషనర్ ఏఎస్ ఖాన్, లా అండ్ ఆర్డర్ డీసీపీ నవీవ్ గులాటీ ప్రకటించారు. అనుమతి లేకుండా సభలు, ప్రదర్శనలు, ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించకూడదని, కాదని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. మరో వైపు బీచ్ రోడ్లో శాంతి భద్రతల దృష్ట్యా పలు ఆంక్షలను విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు -
తుందుర్రులో 144 సెక్షన్ ఎత్తేయాలి: YSRCP
-
నాగిరెడ్డిపేటలో 144 సెక్షన్ అమలు
నాగిరెడ్డిపేట మండలంలో 144 సెక్షన్ అమలు చేశారు. నాగిరెడ్డిపేట మండలాన్ని కొత్తగా ఏర్పడబోయే కామారెడ్డి జిల్లాలో కలపుతూ ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. దీనికి వ్యతిరేకంగా మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలు నాగిరెడ్డిపేటను మెదక్ జిల్లాలో కలపాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ‘ప్రజాఐక్య వేదిక’ పేరిట జేఏసీగా ఏర్పడి ఆందోళనలు కొనసాగించారు. సోమవారం కూడా నిరసనలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మండలకేంద్రంలో 144 సెక్షన్ అమలుపరిచారు. -
ప్రశాంతంగా రేపల్లె
జాస్మిన్ అనే యువతి మృతితో రెండు రోజులుగా ఉద్రిక్తంగా ఉన్న రేపల్లె పట్టణం మంగళవారం ప్రశాంతంగా ఉంది. అదేవిధంగా, రేపల్లెతోపాటు జాస్మిన్ స్వగ్రామం నిజాంపట్నం మండలం అడవుల దీవి గ్రామంలో పోలీసులు విధించిన 144వ సెక్షన్ కొనసాగుతోంది. జాస్మిన్తో పాటు మృతి చెందిన శ్రీసాయి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం స్వగ్రామం గరువులో నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఢిల్లీ-హర్యానా సరిహద్దులో 144 సెక్షన్
న్యూఢిల్లీ: జాట్ల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లోనూ నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నారు. వాయువ్య, ఆగ్నేయ, నైరుతి ఢిల్లీల్లోని కాలనీలు, గ్రామాల్లో ఈ ఆంక్షలు విధించామని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడత జాట్ల ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని 144 సెక్షన్ విధించినట్టు వెల్లడించారు. శాంతిభద్రతలను ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలిపారు. -
ఎంసెట్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
► 48 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ► అవాంఛనీయ సంఘటనలు ► చోటుచేసుకోకుండా చర్యలు గుణదల : ప్రొఫెషనల్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే శుక్రవారం నిర్వహించే ఎంసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష) కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు కమిషనర్ గౌతం సవాంగ్ చెప్పారు. వన్టౌన్, టూ టౌన్, మాచవరం, సత్యనారాయణపురం, పాయకాపురం, నున్న, పెనమలూరు, సూర్యారావుపేట పరిధిలోని 48 పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్నాహ్నం రెండు గంటల వరకు జరిగే ఇంజినీరింగ్ విభాగానికి, మధ్నాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్ష జరుగుతున్న సమయంలో 250 మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడినా, కర్రలు, రాళ్లు తదితర ఆయుధాలతో సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అమరులారా.. వందనం
► ఇంద్రవెల్లి స్తూపం వద్ద ఘన నివాళులు ► ఏ సెక్షన్లు, యూక్టులు లేకుండా.. స్వేచ్ఛగా.. ► దాదాపు 35 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇలా.. ► తరలివచ్చిన పలువురు నేతలు, గిరిజనులు ఇంద్రవెల్లి ఘటన జరిగి 35 ఏళ్లు అయ్యింది.. ఇన్నేళ్ల తర్వాత ఆ అమరవీరులకు స్వేచ్ఛగా నివాళి అర్పించే అవకాశం లభించిం ది. ఎప్పుడూ పోలీసుల బూట్ల చప్పుడు.. మచ్చుకైనా కనిపించ ని ప్రజానీకం.. ఇదీ ఏటా ఇంద్రవెల్లి స్తూపం వద్ద సాక్షాత్కారమ య్యే పరిస్థితి. కానీ.. ఈసారి 144 సెక్షన్, పోలీసు యాక్టు లేకుండాపోయింది ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి పోరుగడ్డ పులకరించింది. 35 ఏళ్ల తర్వాత, స్వరాష్ట్రంలో మొదటిసారిగా 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 లేకుండా బధవారం స్వేచ్ఛగా అమరవీరులకు ఆదివాసీలు ఘనంగా నివాళులర్పించారు. అమరులారా వందనమంటూ ప్రణమిల్లారు. 1981 ఏప్రిల్ 20న జల్...జంగల్...జమీన్ పేరిటి నినాదించి అమరులైన ఆదివాసీ వీరులకు నివాళులు అర్పించడానికి వారి బంధువులు, జిల్లా ఆదివాసీలు 34 ఏళ్లుగా ఎదురు చూసినా ఇంత వరకు ఏ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గతేడాది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడానికి అనుమతి ఇచ్చినా ఆంక్షలు విధించింది. దీంతో ఆదివాసీలు మౌనంగా నివాళులర్పించారు. ఈ ఏడాది ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంతో, పోలీసుల భద్రతతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఆదివాసీలు అత్యంత ఉత్సాహంగా బుధవారం ఉదయం మండంకేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. ఏళ్ల తర్వాత స్తూపానికి రంగులు ముందుగా 1983లో స్తూపానికి పూర్తిస్థాయిలో ఎర్ర రంగు వేసినా, 1986లో గుర్తు తెలియని వ్యక్తులు ఆ స్తూపాన్ని పేల్చివేయడంతో 1987లో ప్రభుత్వ నిధులతో నిర్మించినా రంగులు వేయకుండా వదిలేశారు. పదేళ్ల క్రితం అజ్ఞాత వ్యక్తులు స్తూపానికి కొంత మేరకు రంగులు వేసినా అది అర్ధంతరంగానే మిగిలి ఉంది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని గుర్తించి ఆదివాసీలకు నివాళులర్పించడానికి అనుమతి ఇచ్చినా సమయం సరిపోకపోవడంతో స్తూపానికి పూర్తిస్థాయిలో రంగులు వేయడం వీలు కాలేదు. ఈ ఏడాది ప్రభుత్వం ఆంక్షలు విధించకపోవడంతో ఆదివాసీ గిరిజనులు బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉత్సవంగా స్తూపానికి ఎర్ర రంగులు వేశారు. సంప్రదాయ రీతిలో నివాళులు. అమరవీరులకు నివాళులర్పించడానికి మండలంలోని వారి కుటుంబ సభ్యులతో పాటు ఆదివాసీ గిరిజనులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా ఆనాటి సభకు సారథ్యం వహించిన ఉద్యమ సారధి తుమ్మగూడకు చెందిన తొడసం ఖట్టి స్మారకార్థం సమక్క కూడలి వద్ద ఏర్పాటు చేసిన జెండా గద్దె వద్ద జెండాను ఆవిష్కరించారు. సంప్రదాయ పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అక్కడి నుంచి మండలకేంద్రంలోని ఆదివాసీల ఆరద్యాదైవం ఇంద్రాదేవి ఆలయానికి చేరుకోని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని సంప్రదాయ వాయిద్యాలైన డోల్, పేప్రే, కాళీకోమ్, తుడుంల మోతల మధ్య అత్యంత వైభవంగా అమరవీరుల పేరిట జెండాను ఆవిష్కరించారు. సంప్రదాయ నృత్యం చేశారు. ఇంద్రవెల్లి సర్పంచ్ మెస్రం గాంధారి, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రాయిసెంటర్ జిల్లా సార్మెడి మెస్ర దుర్గు, రాయిసెంటర్ సార్మెడిలు తుమ్రం జుగాదిరావ్, మెస్రం వెంకట్రావ్, మావన హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆత్రం భుజంగ్రావ్, తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అజ్మీర శంకర్నాయక్, ఆదివాసీ గిరిజన నాయకులు కనక తుకారం, కనక లక్కేరావ్, కనక యాదవ్రావ్, వెడ్మ బొజ్జు, ఆత్రం సుగుణ, సెడ్మాకీ సీతారాం, కనక వెంకట్రావ్, సిడాం గంగాధర్, తొడసం నాగోరావ్, సర్పంచ్లు మెస్రం నాగ్నాథ్, జాదవ్ జమునాయక్, మడావి సుంగు పాల్గొన్నారు. 200 మంది పోలీసులతో బందోబస్తు ఉట్నూర్ డీఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 9 మంది డీఎస్పీ మల్లారెడ్డి, ఉట్నూర్, జైనూర్ సీఐలు స్వామి, రవికుమార్, 9 మంది ఎస్సైలతో కూడిన 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది అధికారికంగా.. : ఎమ్మెల్యే వచ్చే ఏడాది ఏప్రిల్ 20న అమరవీరులకు అధికారికంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నివాళులర్పించేందుకు కృషి చేస్తామని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హామీ ఇచ్చారు. బుధవారం ముందుగా అమరవీరుల స్తూపం వద్ద చేరుకుని నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించడానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు. వచ్చే ఏడాది ప్రభుత్వ పరంగా నివాళులు అర్పించడానికి త్వరలోనే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్తో కలిసి ఎంపీ గోడం నగేశ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషిద్ధం. మంగళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. వీటిని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కడా ప్రచారం చేయడం, గుర్తులు, బ్యానర్లు ప్రదర్శించకూడదు. ఈ నాలుగు కేటగిరీలకే అనుమతి పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోకి విధుల్లో ఉండే అధికారులతో పాటు కేవలం నాలుగు కేటగిరీల వారినే అనుమతిస్తారు. ఓటర్లు, ఆ డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. వీరు మినహా ప్రజాప్రతినిధులను సైతం ఈ ప్రాంతంలోకి అనుమతించరు. రెండు వరుసలే... పోలింగ్ కేంద్రం వద్ద క్యూ నిర్వహణకూ పటిష్ట నిబంధనలు ఉన్నాయి. ప్రతి కేంద్రం వద్ద పురుష, స్త్రీ ఓటర్ల కోసం వేర్వేరుగా రెండు క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి మినహా మరో వరుసలో రావడాన్ని నిషేధించారు. అతిక్రమిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. -
శ్రీకాకుళంలో టెన్షన్ టెన్షన్
తెల్లవారుజాము నుంచే పోలీసుల హల్చల్ 144 సెక్షన్ విధింపు పలువురు నాయకుల ముందస్తు అరెస్టు పోలీసుల పహారా మధ్య ఇసుక లోడింగ్ ఘంటసాల మండలం శ్రీకాకుళంలో బుధవారం పోలీసులు అలజడి సృష్టించారు. రెండురోజులుగా ధర్నా చేస్తున్న గ్రామస్తులు నిరాహారదీక్ష తలపెట్టడంతో ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో తెల్లవారుజాముకే పెద్ద సంఖ్యలో పోలీసులు గ్రామానికి చేరుకుని హల్చల్ చేశారు. ఉదయం ఆరు గంటల నుంచే 144 సెక్షన్ విధించారు. పలువురు నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. దీంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు. శ్రీకాకుళం(ఘంటసాల): ఘంటసాల మండలం శ్రీకాకుళంలో బుధవారం పోలీసులు హల్చల్ చేశారు. శ్రీకాకుళం ఇసుకక్వారీలో చోటుచేసుకుంటున్న అక్రమాలు, లారీడ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఆత్మకూరి నవీన్, తమ్మన వెంకటసుబ్బయ్య, రావూరి వెంకటేష్ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్న గ్రామస్తులు బుధవారం నిరాహారదీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెల్లవారుజాము నాలుగు గంటలకే పోలీసులు శ్రీకాకుళంకు చేరుకున్నారు. అవనిగడ్డ, చల్లపల్లి సీఐలు రమణ, చంద్రశేఖర్, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, కోడూరు, నాగాయలంక, కూచిపూడి ఎస్ఐలు శివరామకృష్ణ, వెంకటకుమార్, వై సుధాకర్, ఎ.వెంకటేశ్వరరావు, పి.వెంకటేశ్వరరావు, సురేష్ ఆధ్వర్యంలో సబ్డివిజన్లోని పోలీసులతోపాటు మచిలీపట్నానికి చెందిన 24 మంది ప్రత్యేక బెటాలియన్ గ్రామానికి చేరుకుంది. తెల్లవారుజాము నుంచి పోలీసులు గ్రామంలో హడావుడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. 144సెక్షన్ విధింపు.. గ్రామంలో ఎలాంటి ఆందోళనలు, దీక్షలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆందోళనలు, నిరాహారదీక్షలకు దిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో చాలామంది ప్రజలు ఇళ్లకే పరిమిత మయ్యారు. పోలీసుల పర్యవేక్షణలో ఇసుక లోడింగ్.. గ్రామస్తుల ఆందోళనతో రెండు రోజుల నుంచి నిలిచిపోయిన ఇసుక లోడింగ్ పనులను బుధవారం పోలీసుల పహారా మధ్య కొనసాగించారు. ఇసుక లోడింగ్చేసే ప్రొక్లెయిన్ వద్ద పోలీసులు కాపలా ఉండగా లారీల్లో ఇసుకను లోడింగ్ చేశారు. పలువురు నాయకుల అరెస్ట్.. ఆందోళనలు, దీక్షలు చేయకుండా తెల్లవారు జామునుంచే పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమ, మంగళవారాల్లో ఆందోళనలో పాల్గొన్న నాయకుల ఇళ్లకు వెళ్లి, వారిని అరెస్ట్ చేసేందుకు యత్నించగా అందుబాటులో లేకపోవడంతో వారికోసం గ్రామాన్ని జల్లెడ పట్టారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు సింహాద్రి శ్రీనివాసరావును బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేయగా, పంచాయతీ కార్యాలయం వద్ద ప్రెస్మీట్ పెట్టి మాట్లాడుతున్న సీపీఎం దివి డివిజన్ కార్యదర్శి శీలం నారాయణరావు, మండల కార్యదర్శి కంచర్ల నాగరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈసందర్భంగా శీలం నారాయణరావు మాట్లాడుతూ తప్పతాగి ఇసుకలోడు లారీని నడుపుతూ ముగ్గురి ప్రాణాలను బలిగొన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్న తమను అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా, స్థానిక ఎమ్మెల్యే ఎక్కడున్నారని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయమని ఆందోళన చేస్తుంటే పోలీసుల ద్వారా బలవంతంగా నోళ్లు నొక్కిస్తున్నారని, బ్రిటీష్ వారి హయాంలోనూ ఇలాంటి దుశ్చర్యలు జరగలేదని ఆయన విమర్శించారు. -
స్వైన్ ఫ్లూ అరికట్టేందుకు 144 సెక్షన్!
గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాను గడగడలాడిస్తున్న స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ విచిత్ర ఆదేశాలు జారీచేశారు. రోడ్లపై నలుగురు కలిసి నడవకూడదంటూ ఒక చోట గుమిగూడరాదంటూ భారతీయ శిక్షాస్మృతిలోని 144వ సెక్షన్ కింద జిల్లావ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించారు. ‘గుజరాత్లో, ముఖ్యంగా అహ్మదాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం. ప్రజలు గుంపులు గుంపులుగా సంచరిస్తుండడం వల్ల ముక్కు ద్వారా, మూతి ద్వారా స్వైన్ ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈ కారణంగా ముందస్తు అనుమతి లేకుండా గుంపులుగా ఎవరూ సంచరించకుండా ఇండియన్ పీనల్ కోడ్లోని 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధిస్తున్నాం’ అని మంగళవారం కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. గత జనవరి నెల నుంచి ఇప్పటి వరకు గుజరాత్లో 231 మంది మరణించగా ఒక్క అహ్మదాబాద్ జిల్లాలోనే దాదాపు 50 మంది మరణించారు. గుజరాత్లో ఇప్పటి వరకు 3,527 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్లోనే ఈ వ్యాధి కారణంగా ఎక్కువమంది మరణించారని వైద్యాధికారులు తెలియజేశారు. -
వీడని భయం
శివమొగ్గలో భారీగా బలగాల మొహరింపు బంధువుల ఊళ్లకు పయనమైన నగర ప్రజలు పోలీసుల అదుపులో వంద మంది మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల పరిహారం శివమొగ్గ వాసులను భయం వెన్నాడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఆదివారం తమ బంధువుల ఊళ్లకు పలువురు నగర వాసులు పయనమై వెళ్లారు. కేఎస్ ఆర్టీసీ బస్సుల సంచారం పూర్తిగా నిలిచిపోయింది. ప్రైవేట్ బస్సులపై ప్రయాణికులు ఆధారపడ్డారు. అల్లర్లకు సంబంధించి వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నగరం మొత్తం భారీగా బలగాలను మొహరింపజేశారు. శివమొగ్గ : ఈ నెల 19న శివమొగ్గలో పీఎఫ్ఐ సంస్థ చేపట్టిన ర్యాలీ సందర్భంగా చెలరేగిన ఘర్షణలు మూడు రోజుల పాటు నగరాన్ని కుదిపేశాయి. ఎటు చూసిన విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు భారీ బలగాలను పోలీస్ యం త్రాంగం మొహరింపజేసింది. నగరం మొత్తం ఖాకీల మయమైంది. ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఆందోళనతో పొరుగూళ్లలో ఉన్న తమ బంధువుల ఇళ్లకు చాలా మంది ఆదివారం పయనమై వెళ్లారు. సీఆర్పీఎస్ బల గాలతో పాటు 2500 మంది కానిస్టేబుళ్లు నగరంలో గస్తీ తిరుగుతున్నారు. నగరంలో రద్దీగా ఉండే రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొన్ని ఆటోలు, ప్రైవేట్ బస్సులు మాత్రం రోడ్డుపైకి వచ్చాయి. వ్యాపార కేంద్రాలన్నీ మూతపడ్డాయి. 144 సెక్షన్ను కొనసాగిస్తున్నారు. కాగా, శనివారం రాత్రి కొన్ని దుకాణాలకు నిప్పు పెట్టేందుకు అల్లరిమూకలు విఫలయత్నం చేశాయి. పోలీసుల అదుపులో వంద మంది అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర శాంతిభద్రత విభాగం ఏడీజీపీ షోర్ చంద్ర ఇక్కడే తిష్టవేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొంటోందని అన్నారు. ఇద్దరిని హతమార్చిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. శాంతి భద్రత పర్యవేక్షణలో 24 బెటాలియన్ల కేఎస్ఆర్పీ బలగాలు, ఆరు బెటాలియన్ల సీఆర్పీఎఫ్, 20 బెటాలి యన్ల డీఏఆర్క్యూర్టీ బలగాలతో పాటు 2500 మంది కానిస్టేబుళ్లను నియమించినట్లు తెలిపారు. కాగా, రాష్ట్ర హోం శాఖ సలహాదారుడు కెంపయ్య ఆదివారం ఇక్కడకు వచ్చి పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. కాగా, అల్లర్లలో చిక్కుకుని హత్యకు గురైన విశ్వనాథ్, మంజునాథ్ కుటుంబాల సభ్యులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి కి మ్మనె రత్నాకర్ అన్నారుృ మతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. పది లక్షల చొప్పున పరిహారాన్ని అం దజేయనున్నట్లు చెప్పారు. పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేసిన వారిని శిక్షించాలి పీఎఫ్ఐ సంస్థ సభ్యులు ర్యాలీ నిర్వహిస్తూ పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేయడంతో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని ఈ సందర్భంగా మాజీ డీసీఎం కె.ఎస్.ఈశ్వరప్ప గుర్తు చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకు ముం దు ఆయన రాష్ట్ర హోంశాఖ సలహాదారు కెంపయ్య, ఉ న్నతాధికారులను కలిసి చర్చించారు. పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేయడం సరికాదని హితవు చెప్పడంతో ఓ వర్గం పథకం ప్రకారం దాడులకు పూనుకుం దని అన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతి భద్రత పరిరక్షణలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ఆఖరుకు హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ వచ్చిన సందర్భంగా ఆయనకు భద్రత కల్పించడంలోనూ పోలీసులు విఫలమయ్యారని అసహనం వ్యక్తం చేశారు. ఓ మంత్రిని ప్రజలు ముట్టడిస్తే పోలీసులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారని అన్నారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం ముస్లిం మత పెద్దలతో జిల్లా అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఘటన వివరాలను వారి నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంగా ముస్లిం నేతలతో బీజేపీ నాయకులు బేటీ అయి చర్చించారు. -
లాల్బాగ్లో 144 సెక్షన్ విధింపు
ముంబై: మూడు రోజుల క్రితం రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన లాల్బాగ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నలుగురు కంటే ఎక్కువగా జనం గుమికూడకుండా చూసే ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 17వ తేదీ వరకు అమలులో ఉంటాయని స్థానిక బోయివాడ పోలీసు ఇన్స్పెక్టర్ సునీల్ తోండ్వాల్కర్ చెప్పారు. శాంతి భద్రతలు స్థిరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా చెప్పారు. మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని ఆదివారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం ఇక్కడి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతను సృష్టించింది. జనం రాళ్లు రువ్వుకోవడం, పరస్పరం దాడులకు పాల్పడటంతో ఏడుగురు గాయపడిన సంగతి తెల్సిందే. పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితులు రెండు గంటల్లో అదుపులోకి వచ్చాయి. సోమవారం, మంగళవారం కూడా అక్కడ వాతావరణం ఉద్రిక్తంగానే ఉంది. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నా ఉద్రిక్తంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధించినట్లు మారియా చెప్పారు. వదంతులు నమ్మవద్దని నగర పోలీసు శాఖ ద్వారా పౌరుల మొబైల్ ఫోన్లకు ఎస్సెమ్మెస్లు పంపించారు. కొందరు యువకులు ఆ రోజు రికార్డు చేసిన ఘర్షణ దృశ్యాలను తమ బంధువులకు, మిత్రులకు ఎమ్మెమ్మెస్ చేసినట్టు తెలియవచ్చింది. ఉద్రిక్తతకు దారితీసే ఇలాంటి దృశ్యాలు ఎమ్మెమ్మెస్గాని, ఫేస్బుక్లోగాని, వాట్స్ అప్లోగాని పెట్టవద్దని రాకేశ్ మారియా విజ్ఞప్తి చేశారు. అల్లర్లకు ఆజ్యం పోసే ఇలాంటి దృశ్యాలను అడ్డుకునేందుకు పోలీసు శాఖకు చెందిన సోషల్ మీడియా కూడా ప్రయత్నిస్తోందని కమిషనర్ చెప్పారు. లాల్బాగ్ నుంచి పరేల్లోని తకియా మసీదు ప్రాంతం వరకు మంగళవారం రాత్రంతా మారియా స్వయంగా గస్తీ నిర్వహించారు. రెండు దర్యాప్తు బృందాలు........... లాల్బాగ్ ప్రాంతంలో జరిగిన అల్లర్ల ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి బోయివాడ పోలీసులు ఇప్పటికి 15 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజ్లను, ఫొటోలను, వీడియో క్లిప్పింగులను పరిశీలిస్తున్నట్లు రాకేశ్ మారియా చెప్పారు. రాళ్లు రువ్విన ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇందులో ఒకరు ఇంకా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ప్రశాంతంగానే ఉన్నా కొనసాగుతున్న ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: మతఘర్షణలతో అట్టుడికిపోయిన త్రిలోక్పురిలో 144 సెక్షన్ కింద విధించిన నిషేధాజ్ఞలను బుధవారం ఆరు గంటలపాటు సడలించారు. పరిస్థితి ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిషేధాజ్ఞలను సడలించామని పోలీసు జాయింట్ కమిషనర్ సంజయ్ బేనీవాల్ చెప్పారు. ప్రజలు అవసరమైన సామగ్రి కొనుక్కోవడానికి వీలుగా సోమవారం గంట సేపు, మంగళవారం మూడు గంటల పాటు నిషేధాజ్ఞలను సడలించారు. ఛత్ పూజను దృష్టిలో పెట్టుకుని సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు నిషేధాజ్ఞలను సడలించామని చెప్పారు. ఈ పూజ చేసేవారు సాయంత్రం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవడానికి వీలుగా సడలింపు ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. అక్టోబర్ 23న హిందూ ముస్లింలకు మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు 68 మందిని అరెస్టు చేశారు. తమ వద్ద నున్న ఫొటోలు, వీడియోల ఆధారంగా పోలీసులు ఈ అరెస్టులు చేసినట్లు బేనీవాల్ చెప్పారు. ఐదుగురు ప్రధాన నిందితులలో ఇర్ఫాన్ను మంగళవారం సాయంత్రం అరె స్టు చేశారు. మిగతా నలుగురు మొబిన్, ఆసిఫ్, తారిఖ్, జాఫర్ కోసం గాలింపు కొనసాగుతోంది. 36 బ్లాకులున్న త్రిలోక్పురిలో ఢిల్లీ పోలీసు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర భద్రతా బలగాలకు చెందిన వెయ్యి మంది పోలీసులు, 30కి పైగా పోలీసు వ్యాన్లు, వాటర్ కేనన్లు, అల్లర్ల నియంత్రణ వాహనాలతో పహరా కాస్తున్నారు. నిఘా కోసం పోలీసులు డ్రోన్ని కూడా ఉపయోగిస్తున్నారు. త్రిలోక్పురిలో నిషేధాజ్ఞలు మరికొన్ని రోజులు కొనసాగించాలని పోలీసులు యోచిస్తున్నారు. పరిస్థితి పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నందున్న ఏ క్షణాన్నైనా హింస చెలరేగవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నవరాత్రులను పురస్కరించుకుని బ్లాక్ నంబర్-2లో మాతాకీ చౌకీ ఏర్పాటు చేసిన చోట శుక్రవారం జాగరణ్ నిర్వహించవలసి ఉంద ని, అలాగే నవంబర్ 4న మొహర్రంను పురస్కరించుకుని తాజియాల ఊరేగింపు తీస్తారని, మత సంబంధమైన ఈ రెండు కార్యక్రమాల దృష్ట్యా మరికొన్నాళ్ల పాటు భద్రతను మరింత కట్టుదిట్టంగా ఉంచవలసిన ఆవశ్యకత ఉందని పోలీసులు అంటున్నారు . -
రగిలిన రైతన్న
సీతానగరం/ బొబ్బిలి: ‘‘ఇప్పటివరకూ మమ్మల్నే మోసం చేశారు...ఇప్పుడు అధికారులను కూడా మోసం చేస్తున్నారు..... రైతులను నట్టే ట ముంచిన దొంగోడి ఆస్తులకు కాపలా కాస్తున్నారా... మా ఉసురు ఊరికే పోదు.. ఈ రోజు డబ్బు ఇస్తామని రమ్మని 144వ సెక్షన్ పెట్టి అడ్డగిస్తారా.. చూస్తాం.. రేపు కుటుంబాలతో సహా వస్తాం.. ఏమి చేస్తారో.. తెల్లచొక్కా వేసుకున్నవాళ్లందరినీ నమ్మి, మీరు చెప్పిందల్లా వింటే ఇలా వీధి పాలు చేస్తారా’’ అంటూ అన్నదాత మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశాడు. బిల్లుల కోసం వచ్చిన రైతులు ఆందోళనకు దిగడంతో లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం వద్ద శుక్రవారం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 2న ఫ్యాక్టరీ దగ్గర రైతులు ధర్నా చేసిన సందర్భంగా... 5వ తేదీ నుంచి బిల్లులు ఇస్తామని సబ్ కలెక్టర్ శ్వేతామహంతి, సీఈఓ ఆంజనేయులు ప్రకటించారు. అయితే ఎన్సీఎస్ యాజమాన్యం శుక్రవారం నాటికి బిల్లులు చెల్లించే పరిస్థితి లేకపోవడం, ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలేని పరిస్థితి రావడంతో ఇటు రెవెన్యూ, అటు పోలీసు అధికారులు ఇరకాటంలో పడ్డారు. రైతాంగానికి ఏమి సమాధానం చెప్పాలో తెలీక, బిల్లుల కోసం రైతులు ఎవరూ రావద్దని గ్రామాల్లో దండోరా వేయడమే కాకుండా, రైతులు ఫ్యాక్టరీ వద్దకు రాకుండా ఎక్కడికక్కడ నిర్బంధించారు. అప్పటికే ఏపీ చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ ఆధ్వర్యంలో చాలా మంది రైతులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని ఆందోళన మొదలు పెట్టారు. రెండో తేదీన ఫ్యాక్టరీ లోపలకు రైతులు వెళ్లి కార్యాలయంపై రాళ్లతో దాడి చేయడంతో శుక్రవారం గేటు దాటి లోపలకు ఎవరకూ వెళ్లకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా గేట్లను తోసుకొని లోపలకు వెళ్లడానికి రైతులు, నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే పోలీసులు కూడా అదే స్థాయిలో నిలువరించారు. కొంత మంది నాయకులు, రైతులు గేట్లు దూకి లోపలకు వెళ్లడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తహశీల్దార్ నిర్బంధం రైతులు ఆందోళనను ఉద్ధృతం చేయడంతో సీతానగరం తహశీల్దార్ బి.సత్యనారాయణ సంఘటన స్థలానికి వచ్చి రైతులతో చర్చలు జరపడానికి ప్రయత్నించారు. సబ్ కలెక్టరే బిల్లులు ఇస్తామని ప్రకటించారని, అయినా అమలుకాలేదని, దీనిపై సమాధానం చెప్పాలని రైతులు చుట్టుముట్టారు. ఈ రోజు ఇస్తారా, లేదా, ఎప్పుడిస్తారో చెప్పాలంటే ఘెరావ్ చేసి నిర్బంధించారు. గేటు ముందే తహశీల్దార్ను కూర్చొపెట్టి రైతులంతా ఆయన చుట్టూ కూర్చొని యాజమాన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు అరగంటకు పైగా తహశీల్దార్ను నిర్బంధించడంతో సబ్ కలెక్టరు శ్వేతామహంతి తీవ్రంగా స్పందించారు. పలుమార్లు డీఎస్పీ ఇషాక్ మహమ్మద్తో మాట్లాడి తహశీల్దార్ను బయటకు తీసుకురావాలని సూచించారు. దీంతో పోలీసులు అధికారులు తహశీల్దార్ను బయటకు తీసుకువస్తుండగా, రైతులు ఆయన్ను వెనక్కి లాగడంతో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ తరువాత బొబ్బిలి తహశీల్దార్ మసిలామణి వచ్చి రైతులతో సమావేశమయ్యారు. ఇప్పటికే ఎన్సీఎస్కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టుకలెక్టరు రాజపత్రాన్ని విడుదల చేశారని, వాటిని వెంటనే వేలం వేసి బిల్లులు చెల్లిస్తామని ప్రకటించారు. అయితే రైతులు ఆ మాటలను వినకుండా ఇటువంటివి చాలా సార్లు విన్నామని, మరోసారి మోసపోమని అంటూ అక్కడ నుంచి లేచి వెళ్లిపోయారు. ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటున్నాం ఎన్సీఎస్ యాజమాన్యం మీకు ఇచ్చిన మాటే కాదు.. మాకు ఇచ్చిన మాట కూడా తప్పిందని సబ్ కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వచ్చి ఆమె మాట్లాడారు. ఎన్సీఎస్ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా వాటిని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయని తెలియడంతో కలెక్టరు వాటిపై దృష్టి పెట్టారన్నారు. నెల్లూరులో సుగర్ ఫ్యాక్టరీ ఉందని అక్కడ కూడా బిల్లులు చెల్లించకపోవడంతో ఆ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. స్వాధీనం చేసుకున్న భూములను అమ్మి రైతులు బకాయిలు తీరుస్తామని, అంతవరకూ సహకరించాలని కోరారు. ఎన్సీఎస్ భూముల పరిశీలన లచ్చయ్యపేట చ క్కెర కర్మాగారానికి సంబంధించిన భూములను స్థానిక ఓరియంటల్ బ్యాంకు అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఎన్సీఎస్ భూములను రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయా భూముల వద్ద సీతానగరం తహశీల్దార్ పేరుతో హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఈ నేపథ్యంలో భూములను పరిశీలించిన బ్యాంకు అధికారులు ఫొటోలు, వీడియోలు తీసి ఉన్నతాధికారులకు పంపించారు. నేడు రహదారుల దిగ్బంధం చెరుకు బకాయిలు ఇస్తామని రమ్మనిచెప్పి 144వ సెక్షను విధించి రైతులను రాకుండా అడ్డుకుంటున్నారని ఏపీ చె రకు రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారా యణ అన్నారు. శిబిరం వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.5నుంచి బిల్లులు ఇస్తామని చెప్పి మా ట తప్పి ఇప్పుడేమో అక్టోబరు 16న ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజను దాటి పోతుండడంతో రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారన్నారు. అక్టోబరు నాటికి చెరకు సీజను కూడా మొదలవుతుందన్నారు. బిల్లులు చెల్లించే వరకూ ఉద్యమం చేస్తామన్నా రు. శనివారం ఫ్యాక్టరీ పరిధిలో ఉండే అన్ని రహదారులను నాటుబళ్లతో దిగ్బంధించాలని పిలుపునిచ్చారు. చెల్లని చెక్కు... లచ్చయ్యపేట ఫ్యాక్టరీకి చెరుకు తోలిన పాపానికి చెల్లని చెక్కుతో ఇబ్బందులు పడుతున్నానని బలిజిపేట మండ లం జనార్దనవలస గ్రామానికి చెందిన తోట రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తాను 156 టన్నుల చెరుకును సరఫరా చేస్తే 129 టన్నులకు జూన్ 25న 2 లక్షల 20 వేల రూపాయల చెక్కు ఇచ్చారని, అది ఫ్యాక్టరీ వద్ద ఉండే ఓరియంటెల్ బ్యాంకు వద్దకు తీసుకెళితే ఖాతాలో డబ్బు లేదని తిప్పుతున్నారని అన్నారు. -
అల్లంచర్ల రాజుపాలెం, కొత్తగూడెంలలో 144 సెక్షన్
టి.నరసాపురం : అల్లంచర్లరాజుపాలెం, కొత్తగూడెం గ్రామాల్లో భూవివాదాల కారణంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తహసిల్దార్ ఎల్.దేవకీదేవి ఆదివారం ఆ రెండు గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. శనివారం రాత్రి అల్లంచర్ల రాజుపాలెం, కొత్తగూడెం గ్రామాల్లో 18 మంది రైతులకు చెందిన వ్యవసాయ బోర్లను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి ధ్వంసం చేశారు. గ్రామంలో వివాదంలో ఉన్న భూమిలో అరటి పంటను తరలించకుండా అల్లంచర్ల కొత్తగూడెం గ్రామస్తులు, మహిళలు అడ్డుకోవడం తెలిసిందే. దీంతో శనివారం రాత్రి పలువురు రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్లను వ్యతిరేక వర్గీయులు ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివారం ఉదయం పొలాలకు వెళ్లినప్పుడు బోర్లు ధ్వంసం అయ్యాయని గుర్తించిన రైతులు, స్థానికులు అల్లంచర్ల గ్రామానికి చెందిన రైతు నల్లూరి సత్యనారాయణ, అతని అనుచరులే దీనికి కారకులను భావించి అతని ఇంటిని ముట్టడించారు. మోటార్ సైకిళ్లను ధ్వంసం చేశారు. దీంతో అల్లంచర్ల రాజుపాలెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బాధిత రైతుల నుంచి ఫిర్యాదు తీసుకుని నల్లూరి సత్యనారాయణ, అతని అనుచరులు సుమారు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని చింతలపూడికి తరలించారు. పోలీసులు సత్యనారాయణను జీపులో తరలిస్తుండగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వీరిని నెట్టివేశారు. గ్రామంలో పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు. తహసిల్దార్ ఎల్.దేవకీదేవి బాధిత రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించేందుకు 144వ సెక్షన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగా, అల్లంచర్లరాజుపాలెం గ్రామాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, చింతలపూడి సీఐ ఎం.వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం సీఐ అంబికాప్రసాద్ బందోబస్తు నిర్వహించారు. కొత్త ఎస్పీ కె.రఘురామ్రెడ్డి అల్లంచర్ల, కొత్తగూడెంలలో ధ్వంసం చేసిన బోర్లను పరిశీలించారు. అలాగే అదనపు ఎస్పీ కె.చంద్రశేఖర్ అల్లంచర్ల, కొత్తగూడెం గ్రామంలోని వివాదాస్పద భూములను పరిశీలించారు. -
ఫారెస్టులో 144 సెక్షన్
మహానంది: నల్లమల ఫారెస్టులో 144 సెక్షన్ విధించినట్లు నంద్యాల డీఎఫ్ఓ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. అక్రమంగా అడవిలోకి ప్రవేశిస్తే కేసు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. మహానందిలోని పర్యావరణ కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన నర్సరీని శుక్రవారం డీఎఫ్ఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణాను అరికట్టేందుకు, అటవీ సంపద పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంలో అడవిలో ఆరునెలల పాటు 144 సెక్షన్ విధించామన్నారు. అడవుల్లో వన్యప్రాణుల దాడికి గురైతే గతంలో లాగా ప్రస్తుతం ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదన్నారు. అడవిపై ఆధారపడి జీవించేవారు ప్రత్యామ్నయం చూసుకోవాలని ఆమె సూచించారు. అటవీ ప్రాంతంలో వెదురు మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని, కడప, ప్రొద్దుటూరు పరిధిలో 10 లక్షల మొక్కలు, నంద్యాల డివిజన్ పరిధిలో 5 లక్షల మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నంద్యాల డివిజన్ పరిధిలో 50 హెక్టార్లలో మొక్కలు పెంచుతామన్నారు. అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, భవిష్యత్తు తరాలకు అడవుల ద్వారా ఎన్నోప్రయోజనాలను అందించాల్సిన విషయాన్ని గుర్తుంచుకోవాలని నంద్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శివకుమార్ సూచించారు. ఆమె వెంట ఎఫ్ఆర్ఓ శివకుమార్, డీఆర్ఓ త్యాగరాజు, సిబ్బంది కృష్ణమూర్తి ఉన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా నంద్యాల అర్బన్: ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని నంద్యాల ఇన్చార్జ్ డీఎఫ్ఓ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎర్రచందనం నిల్వలపై దాడులు ముమ్మరం చేశామన్నారు. ఇప్పటికే రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ శాఖల సమన్వయంతో అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు అన్ని విధాల చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అనుమానిత గ్రామాలు, ఇళ్లలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. నిందితులు, స్మగ్లర్లపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బేస్ క్యాంప్, నాకాబందీ, స్ట్రెకింగ్ ఫోర్స్, మొబైల్ పార్టీలు బలోపేతం చేశామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అత్యాధునిక ఆయుధాలను అటవీ శాఖ సమకూర్చుకుంటుందని వెల్లడించారు. ప్రస్తుతం గుండ్ల బ్రహ్మేశ్వరం టైగర్ ఫారెస్ట్పై దృష్టి సారించామన్నారు. డివిజన్లో 10 లక్షల వెదురు మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. -
అల్లర్లపై ఐదు కేసులు నమోదు
అత్తాపూర్, న్యూస్లైన్: సిక్ చావ్నీ అల్లర్ల ఘటనలో ఇరువర్గాలపై సైబరాబాద్ పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. మరోపక్క ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు అల్లర్లు విస్తరించకుండా.. ముఖ్యంగా పాతబస్తీలో అదనపు బలగాలను రంగంలోకి దింపారు. శుక్రవారం ప్రార్ధనలు, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికారులు సిక్ చావ్నీపై ప్రత్యేక దృష్టి సారిం చారు. ప్రజల వెసులుబాటు కోసం గురువారం ఉదయం గంట పాటు కర్ఫ్యూను సడలించారు. ఈ సమయం లో ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ అత్యవసర పనులు చక్కబెట్టుకున్నారు. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కిషన్బాగ్ నుంచి ఎంఎం పహాడీ వరకు చెక్పోస్టులను ఏర్పాటుచేశారు. కిషన్బాగ్, చింతల్మెట్, నందిముస్లాయిగూడ ప్రాంతాల నుంచి సిక్ చావ్నీ హర్షమహల్ వైపు వాహనాల రాకపోకలను నిషేధించారు. కాగా, కర్ఫ్యూ కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం సాహసించడంలేదు. జనం సంచారం లేకపోవడంతో రహదారులన్నీ ఖాళీగా కనిపిం చాయి. పోలీసులు ఎక్కడికక్కడ నిషేధాజ్ఞలు విధించడంతో పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తుండటంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. ముందస్తు చర్యగా దక్షిణ మండల పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో శుక్రవారం 144 సెక్షన్ను విధించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆన ంద్, జాయింట్ పోలీసు కమిషనర్ గం గాధర్, శంషాబాద్, మాదాపూర్ డీసీపీ లు రమేష్నాయుడు, క్రాంతిరాణా టా టా బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. అల్లరి మూకల కోసం గాలింపు... అల్లర్లకు కారణమైన వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. చిన్న చిన్న ఆనవాళ్లను సైతం విడిచి పెట్టడంలేదు. రాళ్లు రువ్విన వారిని పోలీసులు వీడియో ఆధారంగా గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరువర్గాలకు చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రార్ధనలకు గట్టిబందోబస్తు... శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనల సందర్భంగా ఆయా ప్రాంతాలలో గట్టిబందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ కుశాల్కర్ తెలిపారు. ప్రార్ధనలు జరిగే హర్షమహల్, అత్తాపూర్ బడీమసీద్, చోటామసీద్, నౌనెంబర్, ఎంఎం పహాడీ, మహ్మదాబాద్, వాదియా మహ్మద్, చింతల్మెట్, జలాల్బాబానగర్, బాసిత్బాబానగర్ ప్రాంతాలలో పికెట్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే రాంబాగ్, చింతల్మెట్, నందిముస్లాయిగూడ ప్రాంతాలలోని ఆలయాల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతుందన్నారు. ఎక్కడైన అనుమానిత వ్యక్తులు కనిపించినా, అవాంఛనీయ సంఘటనలు జరిగినా.. వెంటనే 100 నెంబర్కు సమాచారం అందించాలని ఇన్స్పెక్టర్ కుషాల్కర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
నేడే ‘పుర’ పోరు
సాక్షి, నల్లగొండ : పురపోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో మొత్తం 210 వార్డులు ఉండగా... భువనగిరి, మిర్యాలగూడలో ఒక్కోటి చొప్పున వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 208 వార్డులకు 1123 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ, కోదాడ మున్సిపాలిటీలు, హుజూర్నగర్, దేవరకొండ నగర పంచాయతీల పరిధిలోని 208 వార్డులకు సంబంధించి 381 పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం 3.96 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 440 ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉం చారు. 46 మంది జోనల్ అధికారులను నియమించారు. ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బంది కాకుండా 2,171 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల్లో విధుల్లో నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక, అత్యంత సామస్యాత్మక కేంద్రాల్లో ఎన్నికల సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా తెలుసుకుంటారు. మొత్తంగా 100 వెబ్కాస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు జరిగేదాకా 144 సెక్షన్.. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు చేపట్టింది. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. పోలింగ్ పూర్తయి ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచేంతరవకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుంది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఎటువంటి వాహనాలనూ అనుమతించరు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆరుగురు డీఎస్పీలు, 33 మంది ఇన్స్పెక్టర్లు, 120 మంది ఎస్ఐలు, ఆర్ఐలతోపాటు ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కలిపి 2500 మంది విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాస్థాయిలో ఎస్పీ, అదనపు ఎస్పీ బందోబస్తును సమీక్షిస్తారు. సెల్ఫోన్ నిషేధం.... పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. పోలింగ్ బూత్లోకి వెళ్లే ముందు ఓటరును తనిఖీ చేయాలని పోలీసుశాఖకు కలెక్టర్ సూచించారు. పోలింగ్ బూత్లోకి సెల్ఫోన్తో వస్తే సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయడమేగాక.. సెల్ఫోన్ను సీజ్ చేస్తామని ఎస్పీ ప్రభాకర్రావు హెచ్చరించారు. ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు విని యోగించుకునేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలిం గ్ కేంద్రాల వద్దకు ఓటర్లను వాహనాల్లో తరలించిన వ్యక్తులపై చర్యలు తప్పవన్నారు. నిర్దేశిత ప్రాంతాల్లో వాహనాలను నిలపాలని చెప్పారు. లాడ్జీలు, ఫంక్షన్హాళ్లలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పిస్తే యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటరు చిటీ లేకున్నా..... ఫొటోతో కూడిన ఓటరు చిటీని ఇప్పటికే ఓటర్లకు అందజేశారు. ఈ బాధ్యతను జిల్లా ఎన్నికల అధికారి ఆయా మున్సిపాలిటీలు, నగరపంచాయతీల కమిషనర్లకు అప్పగించారు. ఒకవేళ ఓటర్లకు చిటీ అందకున్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటరు జాబితాలో పేరు, ఫొటో ఉండి... ఏదేని గుర్తింపు కార్డు తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. -
ప్రచారంపై నిఘా..
ఖమ్మంరూరల్, న్యూస్లైన్: ఎన్నికల నిబంధనలు అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నాయి. ప్రచారంలో పది మందికి మించితే సెక్షన్ 188, 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ కింద కేసుల నమోదు, ఖర్చులపై నిఘా ఏర్పాటు చేసి ఎన్నికల ఖర్చులో జమ చేస్తామని అధికారులు పేర్కొనడంతో హంగూ ఆర్బాటాలకు అభ్యర్థులు దూరంగా ఉంటున్నారు. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వార్డు, ఎంపీటీసీ అభ్యర్థుల ఖర్చు లక్ష రూపాయలకు మించవద్దని, అంతకు మించితే ఆ అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుందని కూడా హెచ్చరించడంతో అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారంలోనే బల నిరూపణ చేసేవారు. రోజు కూలికి కొంతమందిని మాట్లాడుకుని వారితో పాటు అనుచరులను కలిపి వీధుల్లో తిరుగుతూ హంగామా చేసేవారు. ఉదయం నిద్ర లేచింది మొదలు కాఫీ, టిఫిన్ నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, ఆసక్తి ఉన్న వారికి మందు పార్టీలు ఇచ్చేవారు. మరోపక్క ఎక్కడా గోడలు ఖాళీగా ఉంచేవారు కాదు. తమ పేరుతో నినాదాలు రాసి ఓట్లు అభ్యర్థించేవారు. ఆయా ఇళ్ల యజమానులు గోడలు పాడవుతున్నాయని మొత్తుకున్నా పట్టించుకునేవారు కాదు. అడ్డుకుంటే ప్రత్యర్థి వర్గంగా ముద్రవేసి గెలిచిన తర్వాత వేధింపులకు దిగుతారేమోనని ఇళ్ల యజమానులు భయపడేవారు. కానీ ఈసారి ఎన్నికల సంఘం నిబంధనల పుణ్యమాని ఏ వీధిలో కూడా బ్యానర్లు, ఫ్లెక్సీ లు, రాతలు కనిపించకపోవడంతో ప్రజలు సంతోషంగా ఉంటున్నారు. అభ్యర్థుల్లోను లోలోపల సంతోషం... ఎన్నికల సంఘం నిబంధనల పట్ల పలువురు అభ్యర్థులు కూడా లోలోపల ఆనందపడుతున్నారు. డబ్బులు ఉన్న ప్రత్యర్థి ఖర్చుకు వెనుకాడకుండా వేలాది మందిలో ప్రచారం నిర్వహిస్తూ ఆర్భాటం చేస్తుండడంతో తమకు ఇబ్బంది అనిపించినా తప్పని సరిగా ఎంతో కొంత అప్పు చేసి అభ్యర్థులు ఖర్చుచేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఎన్నికల నిబంధనల పుణ్యమాని ప్రచారం సాదాసీదాగా నిర్వహిస్తుండడంతో డబ్బు ఆదా చేసుకుంటున్నారు. ప్రచారంలో హంగూ ఆర్భాటాల కోసం పెట్టే ఖర్చును ఓటర్లకు పంచితే కొన్ని ఓట్లయినా తమకు దక్కుతాయని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సంబరానికి.. నేడే ఆరంభం
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారికి ఏటా నిర్వహించే జాతర మహోత్సవంలో కీలకమైనది తొలేళ్లు ఉత్సవం. సోమవారం తొలేళ్ల ఉత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే ఈ జాతరకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పక్కనే ఉన్న ఒడిశా నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివ స్తారు. తొలేళ్ల ఉత్సవాన్ని ఆలయ సంప్రదాయానికి అనుగుణంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారు లు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా మరునాడు మంగళవారం అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమాను ఉత్సవాన్ని నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఉత్సవ ఏర్పాట్లను కలెక్టర్ కాంతిలాల్దండే, జాయింట్ కలెక్టర్ పి.ఎ.శోభతో పాటు ఇతర అధికారులు ఆదివారం పరిశీలించారు. తొలేళ్ల ఉత్సవంలో భాగంగా మహారాజుల ఆడపడుచైన పైడితల్లమ్మకు రాజవంశీయులు పసుపు కుంకుమ, పట్టు చీర,గాజులను అందచేస్తారు. అమ్మవారికి అందచేసే వస్తువులను రాజవంశీ యులు పల్లకిలో ఉంచి కోటనుంచి మేళతాళా లు, డప్పువాయిద్యాలు, పులివేషాలతో ఊరేగింపుగా మూడులాంతర్ల వద్ద ఉన్న చదురు గుడికి చేరుకుంటారు. అక్కడ వేద పండితుల ఆశీర్వచనాలతో అమ్మవారికి వాటిని అందచేస్తారు. రాత్రి ఘటాలతో ఊరేగింపుగా కోటకు చేరుకుని కోటశక్తికి పూజలు చేస్తారు. తిరిగి ఘటాలతో అమ్మవారి ఆలయానికి వస్తారు. తల్లి ఘటాలుగా వ్యవహరించే వాటిని ఆల యం ఎదురుగా ఎత్తుగా వేసిన బల్లలపై ఉంచుతారు.సిరిమానును అధిరోహించే ఆలయ పూజారి ఆ ఘటాలకెదురుగా నిలబడి పైడితల్ల మ్మ వారి వృత్తాంతాన్ని చెబుతారు.అమ్మవారి ప్రతిరూపంగా భావించే ఆలయపూజారి చేతులమీదుగా విత్తనాలను అందుకునేందుకు పరిసర గ్రామాల నుంచి రైతులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారు. పూజారి చేతులమీదుగా అందుకునే విత్తనాలను వేసి భూమిని దున్నితే పంటలు బాగా పండుతాయ ని రైతుల విశ్వాసం. తొలి విత్తనాన్ని పంటకు ఉపయోగించడం వల్ల దీన్ని తొలేళ్లు ఉత్సవంగా వ్యవహరిస్తున్నారు. తొలేళ్లరోజు చదురుగుడి, వనంగుడిల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తగ్గనున్న ఉత్సవ సందడి? ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తు లు పట్టణానికి తరలివస్తారు. ప్రారంభ ఘట్టా న్ని తిలకించిన అనంతరం పట్టణంలో ఏర్పా టు చేసే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించే భక్తులతో ఆ రాత్రంతా పట్టణంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇది ప్రతి ఏడాదీ ఉత్సవం జరిగే తీరు. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారా యి. పట్టణంలో పక్షం రోజుల క్రితం జరిగిన అల్లర్ల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రస్తుతం 144 సెక్షన్ అమలు చేస్తుండడంతో ఆ సందడి కనిపించదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒక వేళ భక్తులను రాత్రంతా సంచరించేందుకు అనుమతించినా భక్తుల కంటే పోలీసు బలగాలు ఎక్కువ సంఖ్యలో పహారా కాసే పరిస్థితి ఉండడంతో ఈ ఏడాది ఉత్సవ సందడి తగ్గేఅవకాశాలు మెండుగా ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది. వాస్తవానికి గత కొద్ది సంవత్సరాల అధికారుల లెక్కలను పరిశీలిస్తే సుమారు మూడు లక్షల మంది భక్తులు అమ్మవారి జాతరలో పాలుపంచుకున్నారు. అయితే ఈ సంఖ్య గణనీయంగా పడిపోయే ఆస్కారం ఉందని పలువురు అధికారులే చెప్పుకుంటుండడం గమనార్హం. సంగీత కళాశాలలో ఎగ్జిబిషన్ ఏర్పాటు జాతర సందర్భంగా పట్టణానికి వచ్చే భక్తుల సందర్శనార్థం ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా సంగీత కళాశాల ఆవరణలో వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఎగ్జిబిషన్లో సాండ్ కార్విం గ్, ఐస్ కార్వింగ్, వెజిటబుల్ కార్వింగ్లు ప్రత్యేక ఆకర్షణగా సందర్శకులను ఆకట్టుకునే విధంగా నిర్వాహకులు రూపొందిస్తున్నారు. ఈనెల 21, 22, 23 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు భక్తుల సందర్శనకు అనుమతినిచ్చే ఎగ్జిబిషన్కు వ్యవసా య, మత్స్య, పశుసంవర్థక, ఇరిగేషన్, చేనేత జౌళి శాఖల నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. -
మెదక్లో 144 సెక్షన్
మెదక్ టౌన్, న్యూస్లైన్: టీడీపీ మైనార్టీ నాయకుడు బాంబే ఆరీఫ్పై శుక్రవారం రాత్రి జరిగిన దాడి నేపథ్యంలో పోలీసులు శనివారం మెదక్ పట్టణంలో 144 సెక్షన్ విధించారు. మెదక్ డీఎస్పీ గోద్రూ, తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డిల నేతృత్వంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే మెదక్ పట్టణంలో భారీగా పోలీసులను మోహరించారు. ప్రధాన చౌరస్తాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీలు నిర్వహించారు. ఆరీఫ్పై దాడికి నిరసనగా శనివారం పట్టణ బంద్కు పిలుపునిచ్చినప్పటికీ కొందరు వ్యాపారులు మాత్రమే బంద్లో పాల్గొన్నారు. కాగా, పట్టణంలోని ముస్లిం మైనార్టీ యువకులు నిరసన ర్యాలీ నిర్వహించ తలపెట్టగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాడిచేసిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ గోద్రూ తెలిపారు. అతన్ని విచారించి, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. భూ తగాదాలే ఆరీఫ్పై దాడికి కారణమని వెల్లడించారు. గతంలోనే ఇరువర్గాలపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ గోద్రూ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తే ఎంతటి వారైన ఉపేక్షించబోమని హెచ్చరించారు. సీఐలు విజయ్కుమార్, రామకృష్ణ, గంగాధర్, నందీశ్వర్రెడ్డిలతోపాటు ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు గస్తీలో పాల్గొన్నారు.