Singur Dam
-
కాళేశ్వరంతో సస్యశ్యామలం...
సాక్షి, కామారెడ్డి: ‘ఉమ్మడి రాష్ట్రంలో నిజాంసాగర్ ఆయకట్టు కోసం సింగూరు జలాలు వదలాలంటూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఎన్నో ఆందోళనలు జరిగేవి. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు రోజుల తరబడి దీక్షలు చేస్తేగానీ నీళ్లు వదిలే పరిస్థితి ఉండేది కాదు. ఆ దీక్షలు చూశా. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సింగూరు సమస్య కూడా ఒక కారణమే. కానీ ఇప్పుడు ఏడాది పొడవునా నిజాంసాగర్ నిండు కుండనే. నిరంతరం నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇది సాధ్యమైంది. రాష్ట్రం సాధించుకున్నాక కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్కు నీటిని తెచ్చుకుంటున్నాం..’అని సీఎం చంద్రశేఖర్రావు చెప్పారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ (తిమ్మాపూర్)లోని తెలంగాణ తిరుమల దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన కల్యాణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సీఎం తన సతీమణి శోభతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలు, భక్తులు అందించిన రెండు కిలోల స్వర్ణకిరీటాన్ని స్వామివారికి ముఖ్యమంత్రి దంపతులు సమర్పించారు. అనంతరం స్పీకర్ అధ్యక్షతన అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. నాడు పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు.. ‘తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నపుడు మంజీర నదిపై దేవునూరు వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలని తలపెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక దాని సామర్థ్యాన్ని 30 టీఎంసీలకు కుదించి సింగూరు ప్రాజెక్టును కట్టారు. నాడు మెదక్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న సింగూరు ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ఈ ప్రాజెక్టుతో తమకే ఎక్కువ లాభం జరుగుతుందనే ఉద్దేశంతో నిజామాబాద్ ప్రజలు ఎక్కువగా తరలివచ్చారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు సింగూరు నుంచి హైదరాబాద్కు మంచినీళ్లు అందించే పేరుతో నిజామాబాద్లో పంటలు ఎండుతున్నా సాగునీరు అందించలేదు. సింగూరు నీటి కోసం ఎమ్మెల్యేలు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. పంటలను కాపాడుకునేందుకు రోజుల తరబడి దీక్షలు చేసేవారు. సింగూరు మీదనే ఆధారపడిన ఘనపూర్ ఆనకట్ట ఆయకట్టుకు కూడా నీళ్లివ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇలాంటి సమస్యలను చూసి చాలామంది పెద్దలతో చర్చించినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ముఖ్యమంత్రులతో మాట్లాడినా పట్టించుకోలేదు. పైగా తృణీకార భావంతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేపట్టడానికి నన్ను ప్రేరేపించిన ప్రధాన అంశాల్లో సింగూరు సమస్య ఒకటి..’అని సీఎం చెప్పారు. శ్రీనివాస్రెడ్డి ఎన్నో దీక్షలు చేశారు.. ‘సింగూరు నీళ్ల కోసం పోచారం శ్రీనివాస్రెడ్డి ఎన్నోసార్లు దీక్షలు చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అప్పట్లో బోధన్ సబ్ కలెక్టర్గా ఉన్నారు. ఆయన బాన్సువాడ మీదుగా వెళ్తుంటే బతికున్నపుడు మంచినీళ్లు ఇచ్చి, గంజి పోసైనా సరే బతకనియ్యండి గానీ, చచ్చిపోయాక బిర్యానీ పెట్టినా లాభం లేదు అని పోచారం చెప్పారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాతో కలిసి ఉద్యమంలోకి వచ్చాక, ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళుతుంటే రోడ్డు మీద కలిసిన లంబాడా బిడ్డలు పోచారం సార్ గెలుస్తాడని ముందే చెప్పారు. పోచారం అంటే ఈ ప్రాంత ప్రజలకు అంత అభిమానం. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ఇక్కడి మంచి చెడులు తెలిసిన వ్యక్తిగా పోచారం శ్రీనివాస్రెడ్డి నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఈ వయసులో హోదాను సైతం పక్కనబెట్టి నియోజకవర్గంలో చిన్న పిల్లవాడిలా తిరుగుతూ ప్రజల కష్ట సుఖాల్లో భాగమవుతున్నారు. బాన్సువాడ మెటర్నిటీ ఆస్పత్రికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందంటే దానిపై పోచారం పర్యవేక్షణ ఎంత ఉందో అర్థమవుతోంది..’అని కేసీఆర్ అన్నారు. ఈ ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకున్నా.. బాన్సువాడ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందంటూ.. తన ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి నియోజకవర్గానికి రూ.50 కోట్లు, ఆలయానికి రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. పోచారం శ్రీనివాస్రెడ్డి తన మిత్రులతో కలిసి ఈ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేశారంటూ అభినందించారు. స్వామి కరుణ, దయ యావత్ తెలంగాణ ప్రజల మీద ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. పచ్చని పంటలతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా వర్ధిల్లాలని వేడుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, సురేశ్రెడ్డి, జోగినపల్లి సంతోష్కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేను కూడా ముసలోణ్ణి అవుతున్నా.. ‘నేను కూడా ముసలోణ్ణి అవుతున్నా. 69 ఏళ్లు వచ్చినయి. నా కన్నా వయస్సులో పెద్దవాడైనా నేనున్నన్ని రోజులు పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడ ప్రజలకు సేవ చేస్తాడు. ఆయన మాటే బ్రహ్మాస్త్రం. శ్రీనివాస్రెడ్డి ఫోన్ చేస్తే చీఫ్ సెక్రెటరీ అయినా, సీఎం అయినా మాట్లాడతారు. ఏ పని అయినా అవుతది..’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
సింగూరుకు జల గండం
సాక్షి, పుల్కల్/ మెదక్ : రెండు సంవత్సరాల కిందటి వరకు సింగూర్ నీటిని జంట నగరాల తాగునీటి అవసరాలకు వినియోగించేవారు. కానీ 2018 నుంచి సింగూర్ నీటిని పూర్తిగా సాగు, తాగు నీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాతం నుంచి చుక్క నీరు రావడం లేదు. ఫలితంగా నిజామాబాద్, కామారెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 960 గ్రామాలతో పాటు ఐదు మున్సిపాలిటీలు, రెండు గ్రేటర్ హైదరాబాద్లోని డివిజన్లకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేయడం కోసం పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టు ఎడుమ, కుడి వైపులా పంప్ హౌస్ల నిర్మాణం చేశారు. ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో గత మార్చి నుంచి అధికారులు నీటిని అదా చేస్తు వచ్చారు. జూన్, ఆగస్టు మాసం వరకు ప్రాజెక్టులోకి నీరు వస్తుందనే ధీమాతో ప్రతీ రోజు 100 మీలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా 50 మిలియన్ లీటర్ల నీటిని మే మాసం వరకు సరఫరా చేస్తూ వచ్చారు. ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోవడంతో పంపింగ్ను సైతం నిలిపివేశారు. దాదాపుగా మూడు నెలలు కావస్తున్నా 960 గ్రామాలకు పూర్తిగా తాగునీటి సరాఫరా నిలిచిపోయింది. వర్షంపైనే ఆధారం.. ప్రస్తుత పరిస్థితిలో సింగూర్ ప్రాజెక్టులోకి నీరు వస్తే గాని తాగునీరు సరఫరా అయ్యేలా లేదు. ఇందుకు ప్రస్తుతం ప్రాజెక్టులో ఆర టీఎంసీ నీరు కూడా లేదు. 30 టీఎంసీల సామర్థ్యంగల ప్రాజెక్టులో కేవలం ఆర టీఎంసీ నీరు ఉంది. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఇంత వరకు భారీ వర్షాలు లేని కారణంగా చుక్క నీరు కూడా రాలేదు. ఫలితంగా సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా వర్షం వల్ల వచ్చే వరదపైనే అధారపడింది. నీరు వస్తుంది సింగూర్ ప్రాజెక్టులోకి ఈ సీజన్లో తప్పకుండా వరదలు వస్తాయి. ప్రతీ యేడు ఆగస్టు, సెప్టెంబర్లోనే అధికంగా వరదలు వచ్చి ప్రాజెక్టు నిండేది. ప్రాజెక్టులో 29.99 టీఎంసీలు నిల్వ చేసి దిగువకు మిగతా నీటిని వదలడం జరిగింది. ఈ సారి అలాగే వస్తుందనే నమ్మకం ఉంది. –బాలగణేష్, డిప్యూటీ ఇంజనీర్ సింగూరు తాగునీటి సమస్యకు పరిష్కారం సింగూర్ ప్రాజెక్టులో నీటిì లభ్యత లేని కాకరణంగా మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇందుకు గ్రామాలలో నెలకొన్నా నీటి సమస్యను అధికమించేందుకు వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకోవాలని సర్పంచ్లకు సూచించాం. నెలకు రూ.4 వేలు బోర్కు ఇవ్వడంతో పాటు రవాణా చార్జీలు సైతం చెల్లిస్తున్నాం. –రఘువీర్, ఎస్ఈ, వాటర్ గ్రిడ్ -
సీఎం కేసీఆర్కు జగ్గారెడ్డి లేఖ
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. తీవ్ర నీటి సమస్యతో సంగారెడ్డి పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. సంగారెడ్డితో పాటు హైదరాబాద్ జంట నగరాల నీటి అవసరాలను తీర్చే సింగూరు జలాశయం పూర్తిగా ఎండిపోవడంతో.. ఈ కొరత ఏర్పడిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను సింగూరు డ్యాంకు తరలించి నీటి సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన రాసిన లేఖలో పూర్తి వివరాలను పొందుపరిచారు. కాగా మంజీర నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో దానిపై నిర్మించిన సింగూరు డ్యాం పూర్తిగా ఎండిపోయిన విషయం తెలిసిందే. -
‘సింగూరు కోసం 18 నుంచి రిలే దీక్ష’
సాక్షి, హైదరాబాద్: సింగూరు జలాల కోసం ఈ నెల 18 నుంచి తాను, తన భార్య రిలే నిరాహార దీక్ష చేపడతామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. దీక్షను అడ్డుకుంటే తలెత్తే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జీవో లేకుం డా సింగూరు జలాలను తరలించడం అక్రమం కాదా అని ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించాలని కోరారు. సింగూరు జలాల తరలింపు వల్ల సంగారెడ్డికి తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందన్నారు. -
సింగూరుకు ఇక సెలవు..!
సాక్షి, హైదరాబాద్: గోదావరి రింగ్మెయిన్–3 పనుల పూర్తితో గ్రేటర్ హైదరాబాద్కు సింగూరు, మంజీరా జలాశయాల నీటితరలింపునకు శాశ్వతంగా సెలవు ప్రకటించాల్సిందేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నగర శివార్లలోని ఘన్పూర్ నుంచి పటాన్చెరు వరకు 43 కి.మీ. మార్గంలో రింగ్మెయిన్ పనులు పూర్తికావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే మెదక్, నర్సాపూర్ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి కావడంతో అక్కడి తాగునీటి అవసరాలకు నిత్యం 40 మిలియన్ గ్యాలన్ల తాగునీరు అవసరమవుతుందని, గ్రేటర్ తాగునీటి అవసరాలకు సింగూరు, మంజీరా జలాలు మినహా ఇతర ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందేనని ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి అధికారులు, రాజకీయ నేతల నుంచి ఒత్తిడులు తీవ్రం కావడంతో జలమండలి అప్రమత్తమైంది. ఇప్పటికే రూ.398 కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన గోదావరి రింగ్మెయిన్–3 పనుల్లో గౌడవెల్లి ప్రాంతంలో బాక్స్ కల్వర్టు ఏర్పాటు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ పైప్లైన్పై వాల్వ్ల ఏర్పాటు వంటి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ఈ వారంలో ట్రయల్రన్ నిర్వహించేందుకు జలమండలి సన్నద్ధమవుతోంది. గ్రేటర్ దాహార్తిని తీర్చిన సింగూరు, మంజీరా జలాలు భాగ్యనగరానికి జంట జలాశయాలు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ల తరవాత 70వ దశకం నుంచి సింగూరు, మంజీరా జలాల తరలింపు ప్రక్రియ మొదలైంది. నాటి నుంచి నేటి వరకు పటాన్చెరు, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాలకు ఈ జలాలే దాహార్తిని తీర్చేవి. అయితే, గోదావరి మొదటిదశ పథకం పూర్తితో సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నిత్యం 40 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని నగరానికి తరలించినప్పటికీ ఇందులో సింహభాగం పటాన్చెరు, సంగారెడ్డి ప్రాంతాలతోపాటు ఇక్కడున్న పలు ప్రతిష్టాత్మక సంస్థలు, కంపెనీలకు తాగునీటిని సరఫరా చేసేవారు. ఏడాదిగా నగర తాగునీటి అవసరాలకు నిత్యం సుమారు 10 మిలియన్ గ్యాలన్ల సింగూరు, మంజీరా జలాలను మాత్రమే సరఫరా చేసినట్లు జలమండలి వర్గాలు పేర్కొంటున్నాయి. రింగ్మెయిన్ పైప్లైన్–3 పూర్తితో ఇక నుంచి సింగూరు జలాలు నిలిచిపోయినప్పటికీ కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరు తదితర ప్రాంతాలకు గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని జలమండలి స్పష్టం చేసింది. ఈ వారంలో ట్రయల్రన్ పూర్తి చేసి ఫిబ్రవరి మొదటివారం నుంచి గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని తెలిపింది. కృష్ణా, గోదావరి జలాలే ఆధారం... జంట జలాశయాల నీటిని నగర తాగునీటి అవసరాలకు సేకరించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించడం, త్వరలో సింగూ రు, మంజీరా జలాల సరఫరా నిలిచిపోనుండటంతో భాగ్యనగరానికి కృష్ణా, గోదావరి జలాలే ఆధారం కానున్నా యి. ప్రస్తుతానికి కృష్ణా మూడు దశల ద్వారా నిత్యం 270 మిలియన్ గ్యాల న్లు, గోదావరి మొదటిదశ ద్వారా మరో 130 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. రింగ్మెయిన్–3 పనుల పూర్తితో అదనంగా మరో 60 ఎంజీడీల గోదావరి జలాలను సిటీకి తరలించనున్నారు. దీంతో నిత్యం నగరానికి 460 మిలియ న్ గ్యాలన్ల జలాలను సరఫరా చేయనున్నారు. ఈ నీటిని నగరంలోని 9.60 లక్షల నల్లాలకు కొరత లేకుండా సరఫ రా చేయనున్నట్లు జలమండలి అధికా రులు చెబుతున్నారు. -
సింగూర్ సిగలో ఆందోల్
సాక్షి, జోగిపేట(అందోల్): రాష్ట్ర రాజకీయాల్లో ‘అందోల్’ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి గెలుపొందిన మెజార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కాగా దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. రాజనర్సింహ కుటుంబ సభ్యులు అత్యధికంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 19?52లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 2014 వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాజనర్సింహ మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. నియోజకవర్గ చరిత్ర 1952లో అందోల్ నియోజకవర్గం ఏర్పడింది. 2009వ సంవత్సరం వరకు అందోల్, పుల్కల్, మునిపల్లి, సదాశివపేట, పుల్కల్, రేగోడ్, అల్లాదుర్గం మండలాలు మాత్రమే ఉన్నాయి. పునర్విభజన అనంతరం సదాశివపేట మండలం సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోకి వెళ్లగా, అందోల్ నియోజకవర్గం పరిధిలోకి కొత్తగా రాయికోడ్, టేక్మాల్ మండలాలు చేర్చారు. 1952 నుంచి 67వ సంవత్సరం వరకు జనరల్ క్యాటగిరీ కాగా, 1967 నుంచి ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు. రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 12 సార్లు జరిగిన ఎన్నికల్లో రాజనర్సింహ కుటుంబ సభ్యులే ఆరుసార్లు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, టీడీపీల మధ్యే పోటీ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీల మధ్యే ఎక్కువసార్లు పోటీ జరిగింది. 1967, 1972, 1978లో స్వతంత్ర, జనతాపార్టీ అభ్యు›ర్థులు పోటీలో ఉండగా, 1983 నుంచి 2009 వరకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. 2014వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ తరఫున బాబూమోహన్ పోటీ చేసి గెలుపొందారు. నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థి, నాలుగు సార్లు టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు మాజీ మంత్రి గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి జనతాపార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జోగిపేట ఎమ్మెల్యేలు బస్వమాణయ్య, లక్ష్మారెడ్డి 1952లో ఏర్పడిన నియోజకవర్గంలో ఒక్కసారి మాత్రమే జోగిపేటకు చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఓపెన్ క్యాటగిరీ ఉన్న సమయంలో వైశ్యుడైన బస్వమాణయ్య 1957వ సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జోగిపేటకు చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భాలు లేవు. 1967 నుంచి రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడడంతో ఇక్కడ పోటీ చేసే అవకాశం లేకపోవడంతో జోగిపేట పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శేరి లక్ష్మారెడ్డి మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రిజర్వుడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ప్రధాన పార్టీలు స్థానికులకు అవకాశం కల్పించలేదు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజనర్సింహ అందోల్ రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లోనే రాజనర్సింహ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సికింద్రాబాద్లో కార్పొరేటర్గా ఉన్న రాజనర్సింహను కాంగ్రెస్ పార్టీ అందోల్లో పోటీ చేయించింది. 1967, 1972, 1978లలో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1983లో స్థానిక రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ టికెట్ రాజనర్సింహకు కాకుండా సంగారెడ్డికి చెందిన హెచ్.లక్ష్మణ్జీకి ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా రాజనర్సింహ ఓటమి చెందారు. ఇదే సంవత్సరంలో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఎన్నికైన లక్ష్మణ్జీ 1983లో ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి పట్టణానికి చెందిన హట్కర్ లక్ష్మణ్ జీ గెలుపొందడం సంచలనం కలిగించింది. అప్పట్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అందోల్లో టీడీపీ తరఫున పటాన్చెరుకు చెందిన డాక్టర్ యాదయ్య ఓటమి చెందారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా లక్ష్మణ్ గెలుపొంది ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రజల జీవన స్థితిగతులు ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం. 80 శాతానికి పైగా వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగాలపై జీవిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని పుల్కల్ మండలం సింగూరులో ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా అందోలు, పుల్కల్ మండలాలకు 40వేల ఎకరాలకు సాగునీరును అందిస్తారు. కేవలం హైద్రాబాద్ జంట నగరాలకు త్రాగునీటిని, నిజాంసాగర్, ఘనపూర్ ఆయకట్టుకు సేద్యానికి నీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అయితే 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి సీఎంగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కాలువల నిర్మాణం, భూసేకరణకు రూ.89.98 కోట్లు మంజూరు చేసి స్వయంగా పనులకు శంకుస్థాపన చేసారు. ఆ కళ 2016–17 సంవత్సరంలో సాకారమైంది. నియోజకవర్గంలో పెద్దగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలసవెళ్లాల్సిన పరిస్థితి. ‘అందోల్’ రెడ్డిరాజుల కోట జోగిపేట(అందోల్): మెతుకు రాష్ట్రానికి అందోల్ ముఖ్య పట్టణంగా ఉండేది. రెడ్డిరాజుల కాలంలో శంకరమ్మ, సదాశివరెడ్డి, అల్లమరెడ్డి, సూర్యప్రతాపరెడ్డిలు పరిపాలించేవారు. వీరి రాజ్యంపై నిజాం దండయాత్రకు వచ్చినప్పుడు కప్పం కడతాం అన్న ఒప్పందాన్ని వారితో కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో రెడ్డిరాజులే స్వతంత్రంగా పరిపాలించుకునేందుకు వీలు కలిగింది. అప్పట్లో అందోలులో మూడు గౌనిలు, 36 బురుజులు, ఆరు చిన్న దొడ్డీలు, ఒక సొరంగమార్గం నిర్మించుకున్నారు. రెడ్డి రాజులు కలబ్గూరులో కాశీ విశ్వనాథ ఆలయం, అందోల్లో రంగనాథ ఆలయం, రంగంపేటలోనూ రంగనాథ ఆలయాలను నిర్మించి ఆస్థానాలు ఏర్పరచుకున్నారు. అందోల్లో ఇప్పటికి బురుజులు చెక్కు చెదరలేదు. శత్రువులను ఎదుర్కొనేందుకు వీలుగా కోటల నిర్మాణం చేపట్టారు. అప్పట్లో రెడ్డిరాజుల వంశీయురాలైన శంకరమ్మకు శార్దూలం అనే బిరుదు కూడా అప్పట్లో నామకరణం చేశారు. మంజీర నది పరివాహక ప్రాంతం ఒడ్డున రెడ్డి రాజులు విహర యాత్రకు వెళుతున్న సమయంలో ఆ ప్రదేశం నచ్చి అక్కడే ఉండి పోవడానికి నిశ్చయించుకొని ‘అందోల్’ నుంచే తన పరిపాలనను సాగించారు. -
దుర్గమ్మా.. సింగూరు నీరు విడిపించమ్మా..
పాపన్నపేట(మెదక్): సింగూరు నీరు ఘనపురం ప్రాజెక్టుకు విడిపించేలా పాలకుల మనసు మార్చాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఏడుపాయల దుర్గమ్మకు శనివారం వినతిపత్రం సమర్పించారు. సాగునీటి సాధనే ధ్యేయంగా మెదక్ మాజీ ఎమ్మెలే శశిధర్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు ఘనపురం ఆనకట్టపై వంటావార్పు నిర్వహించి అక్కడే భోజనాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం గత నాలుగేళ్లలో రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. 30 వేల ఎకరాల రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి 15టీఎంసీల సింగూరు నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వదిలి, ఈ రోజు ఘనపురం రైతుల పంటలు ఎండబెడుతున్నారని ఆరోపించారు. 1992లో ఘనపురం ప్రాజెక్టుకు ప్రతి యేటా 4.06 టీఎంసిల నీరు విడుదల చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ జారీ చేయించిందని తెలిపారు. ఖరీఫ్ పై ఆశతో వరితుకాలు వేసుకున్న రైతుల పొలం మడులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ నాయకులు రైతుల బాధలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా 0.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పంచాయతీ రాజ్ సెల్ కన్వీనర్ మల్లప్ప మాట్లాడుతూ సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు నీరు విడిపించాల్సిన బాధ్యత ఎమ్మేల్యేదే నన్నారు. ఈ ధర్నాలో మండల కాంగ్రెస్ అ«ధ్యక్షుడు అమృత్రావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంతప్ప, ఏడుపాయల మాజీ చైర్మన్లు గోపాల్రెడ్డి, నర్సింలుగౌడ్, కాంగ్రెస్ నాయకులు ఉపేందర్రెడ్డి, భూపతి, శ్యాంసుందర్అబ్లాపూర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు. -
‘జల’ రాజకీయం
జిల్లాలో రాజకీయాలు అప్పుడే వేడిని పుట్టిస్తున్నాయి. దీంతో రేపో మాపో ఎన్నికలు ఉన్నాయా? అన్న అనుమానం సామాన్యుడికి కలుగుతోంది. నువ్వంటే నువ్వే అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు, ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో పడేయాలని అధికార పక్షం తార స్థాయిలో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో ‘జల’ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుగానే దూసుకెళ్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. రాజకీయంగా ఉపయోగపడే చిన్న అవకాశాన్ని సైతం అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ‘సింగూరు’ జలాల అంశం తెరపైకి రావడంతో ప్రతిపక్ష పార్టీలు ఇదే అంశంపై పోరుకు సిద్ధం అవుతున్నాయి. సాక్షి, మెదక్: జిల్లాలో ఏకైక సాగునీటి ప్రాజెక్టు ఘనపురం. వర్షాభావం కారణంగా ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఎండిపోయింది. దీంతో ప్రాజెక్టు కింద వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీనికి తోడు రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు తక్షణం 0.5 టీఎంసీ జలాలు వదిలితే పంటలు బతికి రైతులకు మేలు జరుగుతుంది. అయితే ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టులో సైతం జలాలు నిండుకున్నాయి. సింగూరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.5 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. వర్షాభావానికి తోడు సింగూరు ప్రాజెక్టు ఎగువ నుంచి నీళ్లు రాకపోవటంతో నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. దీని కారణంగా దిగువ ఉన్న ఘనపురం ప్రాజెక్టు ప్రస్తు తం నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని అధికారులు చె బుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం జారీ చేసిన జీఓ 885 కూడా నీటి విడుదలకు అడ్డంకిగా మా రుతోంది. సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం 16.5 టీఎంసీ దాటినప్పుడే సాగునీరు వదలాలని ఈ జీఓ చెబుతుంది. సింగూరు ప్రాజెక్టు నీటి మ ట్టం 16.5 చేరుకోవాలంటే భారీ వర్షాలు, వరదలు వస్తే తప్ప నిండని పరిస్థితి. ఇదిలా ఉంటే ఘనపురం ప్రాజెక్టు కింద రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వర్షాలు లేక, ప్రాజెక్టులో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు తక్షణం సింగూరు నుంచి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గత ఏడాది సింగూరు ప్రాజెక్టు నుంచి ఎన్నడూ లేని విధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సింగూరు నుం చి 7 టీఎంసీ నీటిని తరలించారు. ఆ ఏడు టీఎం సీల నీటిని ఎస్ఆర్ఎస్పీకి తరలించకపోయి ఉంటే ప్రస్తుతం సింగూరు నుంచి ఆ నీటిని ఘనపురం ప్రాజెక్టుకు విడుదల చేసే అవకాశం ఉండేదని త ద్వారా రైతులకు మేలు జరిగేదని పలు రాజకీయ పార్టీల వాదన. ఇదే విషయమై రైతుల పక్షాన ఆందోళనలు చేపట్టేందుకు సిద్దం అవుతున్నాయి. ప్రతిపక్షాల ‘పోరు’ బావుట ఎస్ఆర్ఎస్పీకి సింగూరు నీటిని తరలించడాన్ని నిరసిస్తూ, పంటల రక్షణ కోసం ప్రసుత్తం ఘనపురం ప్రాజెక్టుకు సింగూరు నుంచి 0.5 టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలు పోరాటం చేసేందుక సిద్ధం అవుతున్నాయి. ఇదివరకే కాంగ్రెస్ పార్టీ జూలై 30న ‘జలదీక్ష’ పేరిట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. త్వరలో ఘనపురం ప్రాజె క్టు పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టడంతోపాటు రైతులతో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సన్నద్ధం అవుతోంది. స్థానికంగాను టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకుగాను త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరెడ్డి ఆధ్యర్యంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డితో కలిసి పాదయ్రాత , మహాధర్నా నిర్వహించేందుకు ఎర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి రైతుల పక్షాన కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. జీవో 885ని రద్దు చేయడంతోపాటు ప్రస్తుతం ఘనపురం ప్రాజెక్టు కింద ఉన్న పంటలను రక్షించుకునేందుకుగాను సింగూరు నుంచి 0.5 టీఎంసీ నీటిని విడుదల చేయించేలా కోర్టును కోరనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ సైతం సింగూరు జలాలపై ఆందోళన సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షులు డా.లక్ష్మణ్ ఇతర నాయకులను తీసుకువచ్చి ఘనపురం రైతులతో మాట్లాడించటంతోపాటు రైతుల పక్షాన ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీపీఎం సైతం రైతు సంఘాలతో కలిసి సోమవారం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జన సమితి పార్టీలు సైతం సింగూరు జలాల విషయమై ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాల ఎత్తులకు ఎలా తిప్పికొడుతుందో వేచి చూడాలి. -
ఆ హక్కు కేసీఆర్, హరీష్కు ఎవరిచ్చారు
సాక్షి, సంగారెడ్డి జిల్లా : సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని శ్రీరాంసాగర్కు తీసుకుపోయే హక్కు కేసీఆర్కు, హరీష్కు ఎవరిచ్చారని శాసన మండలి ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రశ్నించారు. జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ..వర్షాలు లేటైతే సింగూరు ఆయకట్టు కింద ఉన్న జిల్లాల రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సునామీ రాబోతుందని, కాంగ్రెస్ విజయం తథ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తు రూ.2 లక్షల రుణ మాఫీ తప్పక చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రపతి భవన్లో ఇఫ్తార్, క్రిస్మస్ వేడుకలను రద్దు చేసుకోవాలన్న రాష్ట్రపతి నిర్ణయాన్ని షబ్బీర్ అలీ తప్పుపట్టారు. రాష్ట్రపతి నిర్ణయానికి నిరసనగా గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు తాను హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు, రీ నోటిఫికేషన్లు తప్ప రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చింది లేదని, రైతు బంధు పథకం ద్వారా సామాన్య రైతుల కంటే భూస్వాములకు మాత్రమే లబ్ది జరిగిందని తీవ్రంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. స్తోమత ఉన్న రైతులకు, సాగు చేయని భూస్వాములకు లబ్ది జరిగితే ఫలితం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం రాష్ట్రానికి మంజూరైన నిధులను కూడా దారి మళ్లించారని, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. -
మిషన్ లీకేజీ!
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో లోపాలు బయటపడుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రధాన పైపులైన్లకు నీటిని సరఫరాచేస్తూ ట్రయల్రన్ చేస్తుండగా.. నిత్యం ఎక్కడోచోట పైపులైన్ల జాయింట్లు, ఎయిర్వాల్వ్లు ఊడిపోతున్నాయి. మిషన్ భగీరథ పనులతో పాటు, లీకేజీలతో రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, నిజాంసాగర్: మిషన్ భగీరథ పథకంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టునుంచి జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్ నియోజవర్గాలకు ఇంటింటికి తాగునీటిని అందించడానికి పనులు చేపట్టారు. రెండేళ్లుగా పనులు కొనసాగుతున్నాయి. జూన్ నెలాఖరు నాటికి ఇంటింటికి తాగునీరందిస్తామని ముఖ్యమంత్రితో పా టు మంత్రులు పేర్కొంటున్నారు. ప్రధాన పైప్ౖ లెన్ పనులు పూర్తవడంతోపాటు బీపీటీ ట్యాం కు నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. దీంతో సింగూరు జలాశయం నుంచి ప్రధాన పైపుౖ లెన్లు, బీపీటీ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తూ ట్రయల్రన్ చేస్తున్నారు. ఇరవై రోజుల నుంచి నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, పెద్దకొడప్గల్, బిచ్కుంద, జుక్కల్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని మండలాల్లో ట్రయల్రన్ నిర్వహిస్తున్నారు. కాగా నాందేడ్– సంగారెడ్డి, బోధన్– హైదరాబాద్, నిజాంసాగర్ –ఎల్లారెడ్డి ప్రధాన రోడ్డు మార్గాల గుండా వేసిన పైపులైన్లకు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. ప్రధాన పైపులైన్ల ద్వారా మంజీరా జలాలు రోడ్లపైకి వస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పైపులైన్లకు లీకేజీలు మిషన్ భగీరథ ట్రయల్రన్ నిర్వహిస్తుండడంతో పైపులైన్ల పనుల్లో లోపాలు బట్టబయలు అవుతున్నాయి. పది రోజుల క్రితం నిజాంసాగర్ మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద ప్రధాన పైపులైన్ జాయింట్ ఊడిపోవడంతో సింగూరు జలాలు వృథా అయ్యాయి. వారం క్రి తం బాన్సువాడ మండలంలో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి చేతుల మీదుగా మిషన్ భగీరథ నీటికి ట్రయల్రన్ నిర్వహించారు. రాత్రి వేళ మండలంలోని తున్కిపల్లి తండా వద్ద కట్వాల్ మూసుకుపోవడంతో వేలక్యూసెక్కుల నీరు రోడ్డుపైకి వచ్చింది. ప్రధాన పైపులైన్ ద్వారా నీరు బయటకు రావడంతో నీటి ప్రవాహ ఉధృతికి బోధన్– హైదరాబాద్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అర్థరాత్రి వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సుమారు 2 గం టల పాటు ట్రాఫిక్ స్తంభించింది. నీటి సరఫరా ను నిలిపివేసి, కోతకు గురైన రోడ్డుకు తాత్కా లిక మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించారు. నీటి ఉధృతికి సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది. పంటపొలాలు నీట మునిగి అన్న దాతలకు నష్టం వాటిల్లింది. ఈ సంఘటనను మరువకముందే తున్కిపల్లి తండా వద్ద మరో సారి గురువారం ఉదయం పైపులైన్ల ద్వారా నీరు రోడ్డుపైకి వచ్చింది. వందల క్యూసెక్కుల నీరు పైపులైన్ల ద్వారా రోడ్డుపైకి రావడంతో తండా వాసులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తండా వద్ద నిర్మిస్తున్న బీపీటీ ట్యాంకు పనులు పూర్తికాక పోవడంతో ప్రధాన పైపులైన్ కనెక్షన్ పూర్తి కాలేదు. దీంతో బాన్సువాడకు వెళ్లే ప్రధాన పైపులైన్ ద్వారా మంజీరా జలాలు వృథా అవుతూ, రోడ్డుపైనుం చి పారుతున్నాయి. తండా వద్ద కట్వాల్ ఆన్ఆఫ్ చేయడంతో నిర్లక్ష్యం వల్ల సింగూరు జలా లు వృథా అవుతున్నాయి. గుట్టపై నుంచి జలా లు పారడంతో మట్టి, మొరం రోడ్డుపైకి కొట్టుకు వచ్చింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీటి వృథాను అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘సింగూరు’పై పెరుగుతున్న ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: జంట నగరాలు, ఉమ్మడి మెదక్ జిల్లా తాగు, సాగు అవసరాలను తీరుస్తున్న సింగూరుపై నీటి అవసరాల పరంగా ఒత్తిడి పెరుగుతోంది. ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న వాటాలకు మించి అవసరాలు పెరుగుతుండటం కొంత ఆందోళనను కలిగిస్తోంది. జంట నగరాలకు కృష్ణాజలాలు అందని సమయంలో సింగూరు వైపే చూడాల్సి వస్తున్న నేపథ్యంలో కొత్తగా జహీరాబాద్లో చేపట్టిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు కొత్తగా 1.42 టీఎంసీల కేటాయింపులు కోరుతూ ప్రతిపాదనలు రావడం ఒత్తిడిని పెంచేలా ఉంది. నిజానికి సింగూరు ప్రాజెక్టు సామ ర్థ్యానికి అనుగుణంగా మొత్తంగా 29.91 టీఎంసీల మేర వాటాలున్నాయి. ఇందులో హైదరాబాద్ తాగునీటికి 6.96 టీఎంసీల కేటాయింపు ఉండగా, దిగువన ఉన్న ఘణపురం ఆయకట్టుకు 4, నిజాంసాగర్ ఆయకట్టుకు 8.35 టీఎంసీలు, సింగూరు కాల్వలకు 2 టీఎంసీలు కేటాయింపు ఉండ గా, మిగతా నీటిని ఆవిరి నష్టాలుగా లెక్కగట్టారు. అయితే ఇటీవల వాటా నీటిని పునఃసమీక్షించారు. దాన్ని బట్టి మిషన్ భగీరథకు 5.45 టీఎంసీ, హైదరాబాద్ తాగునీటికి 2.80, ఘణపురం 4.06, నిజాంసాగర్ అవసరాలకు 6.35, సింగూరు కాల్వలకు 4, ఆవిరి నష్టాలు 7.24 టీఎం సీలు కేటాయించారు. వాటా మేరకు కేటాయింపులు పూర్తవగా ప్రస్తుతం భగీరథ అవసరాలను కొత్తగా 5.7 టీఎంసీలుగా లెక్కగట్టారు. దీనికి తోడు నిజాంసాగర్ కింద ఉన్న 2లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి విడుదలకై ప్రతిసారీ సింగూరుపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఏకంగా సింగూరు నుంచి ఎస్సారెస్పీకి నీటి తరలింపు జరిగింది. ఈ నేపథ్యంలో నిమ్జ్కు ఏటా 1.42 టీఎంసీల కేటాయించాలని ప్రతిపాదన వచ్చింది. ఇది ఓకే అయితే ఈ నీటిని ఎలా సర్దుతారన్నది ప్రశ్నగా ఉంది. -
విష ప్రచారం నమ్మొద్దు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా సాగు, తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని నిల్వ చేస్తూనే.. ఇతర ప్రాంతాలకు సింగూరు జలాలను విడుదల చేస్తున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు స్పష్టం చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని తరలించుకుపోతున్నారనే కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంల విష ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై విపక్షాల విమర్శల నేపథ్యంలో హరీశ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సింగూరు, ఘణపురం ఆయకట్టు రైతాంగం సాగు నీటి అవసరాలతో పాటు, జంట నగరాల తాగునీటి అవసరాల కోసం సింగూరు ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరునిల్వ ఉంటుందని పేర్కొన్నారు. యాసంగిలో ఘణపురం ఆయకట్టు కోసం 4, సింగూరు ఆయకట్టుకు 2 టీఎంసీలతోపాటు తాగునీటి అవసరాలకు 2.50 టీఎంసీలు కేటా యించామని తెలిపారు. దీంతోపాటు ప్రాజెక్టులో మరో 7.50 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని మంత్రి పేర్కొ న్నారు. ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు పంటలకు సాగునీరందిం చిన ఘనత తమకే దక్కుతుందని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే సింగూరు కాలువలు, లిఫ్ట్ పనులు శరవేగంగా పూర్తి చేసి.. వరుసగా మూడో పంటకు 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. విపక్షాలకు విమర్శించే హక్కు లేదు.. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. గతంలో సింగూరు నుంచి నీటి విడుదల కోసం ఘణపురం ఆయకట్టు రైతులు హైదరాబాద్లో ఆందోళనలు చేసిన విషయా న్ని గుర్తు చేశారు. సింగూరు జలాలను ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం చేయాలని, లేదంటే పైపులైన్లు బద్దలు కొడతామంటూ ప్రకటించిన బీజేపీ ఆ తర్వాత ఎందుకు ఉద్యమించలేదని ప్రశ్నిం చారు. సింగూరుపై విపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని, ప్రజలు ఆందోళనకు గురికా వద్దని హరీశ్ కోరారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఏనాడూ రైతుల ప్రయోజనాలు పట్టించుకోలేదని విమర్శించారు. -
సింగూరు జలాలపై రగడ
సంగారెడ్డి టౌన్: సింగూరు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదలను నిరసిస్తూ సోమవారం సంగారెడ్డి జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. కాంగ్రెస్, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో వేర్వేరుగా ‘చలో కలెక్టరేట్’కార్యక్రమం నిర్వహించగా.. బీజేపీ ఆధ్వర్యంలో సింగూరు ప్రాజెక్టు ముట్టడికి యత్నించారు. దీంతో సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగులుకుంది. కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా కమిటీ పిలుపు మేరకు ‘చలో కలెక్టరేట్’ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందో ళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయ త్నించడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు, కార్యకర్తలకు మధ్వ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని ఇంద్రకరణ్ పోలీస్స్టేషన్కు తరలించారు. సింగూరు జలాలను తరలించడం జల దోపిడీయేనని కాంగ్రెస్ ఉమ్మడి మెదక్ జిల్లా అ«ధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు రాజకీయ భిక్ష పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో వారికి ప్రజ లే బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. మరోవైపు బీజేపీ ఆధ్వ ర్యంలో సింగూరు ముట్టడికి యత్నించారు. సీఎం కేసీఆర్, హరీశ్లపై ఎమ్మెల్యేలు, ఎంపీ లు ఒత్తిడి తేవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సింగూరు నీటి తరలింపుపై ఎంపీ లు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని సీపీఎం జిల్లా నేతలు నిలదీశారు. -
సింగూరు నుంచి ఎస్సారెస్పీకి 15 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్కు 15 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిగువన ఎస్సారెస్పీతోపాటు నిజాంసాగర్ కింద తాగు, సాగు అవసరాల కోసం వెంటనే నీటిని విడుదల చేయాలని గురువారం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు వీలైనంత త్వరగా సింగూరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది యాసంగిలో సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీల కింద నీటి అవసరాలపై ప్రభుత్వం ఇప్పటికే లెక్కలు సిద్ధం చేసింది. మిషన్ భగీరథ అవసరాలు, నీటి సరఫరా, ఆవిరి నష్టాలు, కనీస మట్టాలకు పైన ఉండే లభ్యత నీటితో ఎంతమేర సాగుకు నీరు ఇవ్వవచ్చన్న అంశాలపై యాసంగి ప్రణాళిక ఖరారు చేశారు. ఎస్సారెస్పీలో లోటుతో.. ఎస్సారెస్పీ నీటినిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 54.36 టీఎంసీలు ఉన్నాయి. మిగతా 35.35 టీఎంసీల లోటు ఉంది. అయితే ఇక్కడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని సింగూరు నుంచి 15 టీఎంసీల మేర విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో ఐదు టీఎంసీల మేర నిజాంసాగర్లో నిల్వ చేసి.. మిగతా 10 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలిస్తారు. దీంతో ఎస్సారెస్పీలో లభ్యత జలాలు 64.36 టీఎంసీలకు చేరుతాయి. ఇక ఎస్సారెస్పీ నుంచి లోయర్మానేర్ డ్యామ్ (ఎల్ఎండీ)కు కాకతీయ కెనాల్ ద్వారా 15 టీఎంసీలు విడుదల చేయాలని, మిషన్ భగీరథ అవసరాలకు 12.6 టీఎంసీలను వినియోగించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మొత్తంగా ఎస్సారెస్పీలో సుమారుగా 38.41 టీఎంసీల నీరు మిగులుతుంది. ఈ నీటినీ ఆన్అండ్ఆఫ్ పద్ధతిన 5.60 లక్షల ఎకరాలకు అందిస్తారు. ఇందులో ఎల్ఎండీ ఎగువన 4 లక్షల ఎకరాలు, ఎల్ఎండీ దిగువన 1.60 లక్షల ఎకరాలకు సాగు నీరందనుంది. సింగూరు కింద 1.5 లక్షల ఎకరాలకు శ్రీరాంసాగర్కు తరలించే 15 టీఎంసీలుపోగా.. సింగూరులో సుమారు 14.5 టీఎంసీల నీరు ఉంటుంది. ఇందులో 5.7 టీఎంసీలను తాగు అవసరాలకు కేటాయించి, మరో టీఎంసీలతో ప్రాజెక్టు కింది 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశముంది. ఇక నిజాంసాగర్లో ప్రస్తుతం 12.93 టీఎంసీల నీరుండగా.. సింగూరు నుంచి వచ్చే 5 టీఎంసీలతో కలసి 18 టీఎంసీల లభ్యత ఉండనుంది. ఇందులో తాగునీటికి 3 టీఎంసీలు పక్కనపెట్టి.. మిగతా 15 టీఎంసీలతో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశముంది. -
సింగూరు నుంచి రెండో పంటకూ నీరు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సింగూరు ద్వారా రెండో పంటకు అవసరమైన నీరు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 29 టీఎంసీల నీటినిల్వ ఉంది. మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్రావు శనివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలసి ఈ నీటిని నిజాంసాగర్కు విడుదల చేసి రెండో పంటకు నీరందించాలని కోరారు. సింగూరు నుంచి నీరు విడుదల చేయడం ద్వారా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఆందోల్ నియోజకవర్గాల పరిధిలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో రెండో పంట పండించుకునే అవకాశం ఉందని వీరు ముఖ్యమంత్రికి తెలిపారు. రెండో పంట పండించుకోవడం ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ కల నెరవేరే అవకాశం వచ్చిందని విన్నవించారు. కాల్వలు కూడా సిద్ధంగా ఉన్నందున సింగూరు నుంచి నిజాంసాగర్కు 9 టీఎంసీల నీరు వదిలితే, ఇప్పటికే నిజాంసాగర్లో ఉన్న 3 టీఎంసీలతో కలిపి నీటి నిల్వలు 12 టీఎంసీలకు చేరుకుంటాయని పోచారం చెప్పారు. ఆ నీటిని పొదుపుగా వాడుకుని నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న లక్షా 20వేల ఎకరాల్లో రెండో పంట సాగుచేసుకుంటారని ఆయన వివరించారు. అదే విధంగా సింగూరు నీటితో ఘణపురం ఆనకట్టను నింపుకుని 30వేల ఎకరాలకు, ఆందోల్ ఎత్తిపోతల పథకం ద్వారా మరో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని హరీశ్రావు తెలియజేశారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అవకాశం వదులుకోవద్దు.. సమైక్య రాష్ట్రంలో రైతులు మొదటి పంట పండించుకోవడానికే నీళ్లు లేక అవస్థలు పడ్డారని, ఇప్పుడు రెండో పంట పండించుకునే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోను వదులు కోవద్దని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సింగూరు నుంచి నిజాంసాగర్కు 9 టీఎంసీల నీరు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, శనివారం సాయంత్రం నుంచే నీటిని విడుదల చేస్తామని మంత్రి హరీశ్రావు చెప్పారు. ఈనీటిని విడుదల చేస్తున్న సందర్భంలోనే సింగూరు వద్ద జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని జెన్కో సీఎండీ ప్రభాకర్రావును సీఎం ఆదేశించారు. సింగూరు వద్ద 15 మెగావాట్ల యూనిట్తో పూర్తి స్థాయి జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తామని ప్రభాకర్ రావు వెల్లడించారు. తెలంగాణ వస్తే రెండో పంటకు కూడా నీరు ఇచ్చుకునే విధంగా నీటి పారుదల వ్యవస్థను మార్చుకుంటామనే మాట నిజమవుతోందని, పాత నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోని రైతుల చిరకాల వాంఛ అయిన రెండో పంటకు నీరందే స్వప్నం నెరవేరబోతోందని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. -
గ్రేటర్కు సింగూరు, మంజీరా నీళ్లు
వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సింగూరు, మంజీరా జలాలను తరలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. నాగార్జునసాగర్లో నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు మంచి నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు సమీక్ష జరిపారు. సింగూరు, మంజీరా జలాశయాల నుంచి హైదరాబాద్కు నిత్యం 90 మిలియన్ గ్యాలన్ల నీటిని వదలాలని, నాగార్జున సాగర్ నుంచి అక్కంపల్లి ద్వారా ఉదయ సముద్రానికి వారం రోజులపాటు 90 మిలియన్ గ్యాలన్ల చొప్పున నీరు వదిలి నల్లగొండ జిల్లాకు తాగునీరివ్వాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు, ఈఎన్సీ మురళీధర్ రావును ఆదేశించారు. మంగళవారం రాత్రి నుంచే నీటి విడుదల జరగాలని సూచించారు. కృష్ణా నదిలో ఈసారి ఆశించిన స్థాయిలో వరద రాలేదని, నాగార్జున సాగర్లో నీరు డెడ్ స్టోరేజీ కంటే తక్కువగా ఉందని, ఈ నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కృష్ణా నది నీళ్లపై ఆధారపడిన హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు మంచి నీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. -
‘కాళేశ్వరం’లో మరో మార్పు!
సింగూరు నీటి తరలింపుపై తెరపైకి కొత్త ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మరో భారీ మార్పు దిశగా కసరత్తు జరుగుతోంది. సింగూరు ప్రాజెక్టు నీటి తరలింపు మార్గాలపై కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికే నిర్ణయించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి నేరుగా సింగూ రుకు నీటిని తరలించకుండా కొత్తగా సామ ర్థ్యం పెంచనున్న కొండపోచమ్మ రిజ ర్వాయర్ ద్వారా సింగూరుకు నీటిని తరలించేందుకు సాధ్యాసాధ్యాలపై అన్వేషణ సాగుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్రావు మంగళవారం ప్రగతి భవన్లో నీటిపారుద లశాఖ మంత్రి హరీశ్రావు, ఇంజనీర్లతో గూగుల్ మ్యాపుల ద్వారా సమీక్షించారు. ఏ మార్గంతో ఎంతెంత... స్థిరీకరణ కింద నిర్ణయించిన ఆయకట్టుకు నీరివ్వాలంటే సింగూరు, నిజాం సాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను సైతం కాళేశ్వరం నీటితో నింపేలా ప్రణాళిక వేశారు. మల్లన్నసాగర్కు వచ్చే నీటిని గ్రావిటీ పద్ధతిన సింగూరుకు తరలించి అటు నుంచి శ్రీరాంసా గర్ వరకు తరలించేలా ప్రణాళిక రచించారు. మల్లన్నసాగర్లో నీటిని తీసుకునే లెవల్ 557 మీటర్లు ఉండగా సింగూరు లెవల్ 530 మీట ర్లుగా ఉంది. అయితే పూర్తిగా గ్రావిటీ పద్ధతిన నీటిని తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో మధ్యన 30 మీటర్ల లిఫ్టును ఏర్పాటు చేసి నీటిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూరుకు పంపాలనేది ఉద్దేశం. దీనిపై వ్యాప్కోస్ నుంచి డీపీఆర్ నివేదిక అందాల్సి ఉంది. ఈలోగా ప్రభుత్వం కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 7 టీఎంసీల నుంచి 21 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించింది. దీంతో 627 మీటర్ల లెవల్ నుంచి 530 మీటర్ల లెవల్ ఉన్న సింగూరుకు పూర్తి గ్రావిటీ ద్వారా నీటిని తరలించవచ్చన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. ఈ విధానం ద్వారా మరింత ఆయక ట్టుకు నీరందించవచ్చని చెబుతున్నారు. గూగుల్ మ్యాప్ల ద్వారా సీఎం సమీక్ష సింగూరుకు కాళేశ్వరం జలాల తరలింపుపై సీఎం కేసీఆర్ మంగళవారం గూగుల్ మ్యాప్ల సాయంతో సుదీర్ఘంగా సమీక్షించారు. కొండపోచమ్మ నుంచి సింగూరుకు నీటిని తరలిస్తే ఎలాంటి లాభం ఉంటుంది, ఉన్న అడ్డంకులు ఏమిటన్న దానిపై చర్చించారు. ప్రాథ మికంగా తెలిసిన సమాచారం మేరకు ఈ డిజైన్ ద్వారా ఔటర్ రింగురోడ్డు మార్గం లో రెండు చోట్ల, ముంబై హైవేపై మరో రెండు చోట్ల క్రాసిం గ్లు ఉంటాయని, పటాన్చెరు వద్ద ఉన్న ఇక్రిశాట్ను సైతం దాటాల్సి ఉంటుందని అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై ముఖ్య మంత్రి ఎలాంటి సూచనలు చేశారన్నది తెలియ రాలేదు. -
నల్లరేగడి నవ్వింది!
సింగూరు కింద తొలిసారి ధాన్యం సిరులు - 30 వేల ఎకరాల్లో పసిడి పంటలు - యాసంగిలో ఊహించని స్థాయిలో దిగుబడి - ఆనందం వ్యక్తం చేస్తున్న రైతన్నలు - పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి హరీశ్ - స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి సింగూరు కింద నీళ్లందినట్టు వెల్లడి - వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తామని స్పష్టీకరణ సింగూరు ప్రాంతం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆ భూములన్నీ ఇన్నాళ్లూ వట్టిపోయాయి.. నీళ్లు లేక నోళ్లెళ్లబెట్టాయి.. తుప్పలు, ముళ్ల పొదలతో నిండిపోయాయి.. మూడు దశాబ్దాలుగా చుక్కనీటికి నోచుకోలేక బీళ్లుగా పడి ఉన్నాయి.. కానీ ఇప్పుడు ఆ భూముల్లో పసిడి పంట పండింది.. రైతుల ముఖాల్లో ఆనందం తొణికిసలాడింది! ఇన్నాళ్లూ కోటి జనాభా ఉన్న జంట నగరాల దాహార్తిని తీర్చిన సింగూరు.. చరిత్రలో తొలిసారి ప్రాజెక్టు కింది గ్రామాల పంటలకు ప్రాణం పోసింది. గతేడాది వర్షాలతో మంజీరా పరవళ్లు తొక్కడం, అప్పటికే సిద్ధం చేసిన సింగూరు కాల్వల ద్వారా నీటి విడుదల జరగడంతో తొలిసారి 30 వేల ఎకరాలకు నీటి పారుదల శాఖ నీళ్లందించింది. ఈ ప్రాజెక్టు పరిధిలో తొలిసారి సాగు చేసిన పంటలు కోతకు రావడంతో కాల్వల పరిధిలోని గ్రామాల్లో నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు బుధవారం పర్యటించారు. రైతులతో ముఖాముఖి భేటీలు నిర్వహించారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు..? ఉమ్మడి మెదక్ జిల్లాలో 1976లో నిర్మించిన సింగూరు ప్రాజెక్టు తొలి నుంచి తాగునీటి ప్రాజెక్టుగానే ఉంది. 30 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని చేపట్టగా 11.59 టీఎంసీలను పూడిక, ఆవిరి నష్టాలకు కేటాయించి, మిగిలిన 18.41 టీఎంసీల్లో 8.35 టీఎంసీలు నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు, 4 టీఎంసీలు జంట నగరాల తాగునీటికి, మరో 4.06 టీఎంసీలను ఘణపూర్ ఆయకట్టు స్థిరీకరణకు కేటాయించారు. సింగూరు ప్రాజెక్టు కోసం 32,892 ఎకరాల భూమిచ్చి,. 68 గ్రామాలు ముంపులో పోయినా, ఏనాడూ పరీవాహక ప్రాంతాల పొలాలకు నీళ్లందలేదు. ప్రాజెక్టు నుంచి సాగునీటి అవసరాల కోసం దశాబ్దాలుగా ఆందోళనలు జరగడంతో 2006లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 జూన్ 7న రూ.88.99 కోట్ల అంచనా వ్యయంతో కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆయన తదనంతరం ఆ నిర్మాణాలు ఆగిపోయాయి. మళ్లీ తెలంగాణ ఏర్పాటుతో ఆ నిర్మాణాలు మొదలయ్యాయి. కాల్వల నిర్మాణానికి రూ.88.99 కోట్లు, ఎత్తిపోతలకు రూ.32.68 కోట్లు.. మొత్తంగా 121.67 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. కాల్వలకు రూ.34.02 కోట్లు, లిఫ్ట్కు రూ.15.80 కోట్లు విడుదల చేశారు. దీంతో కాలువలకు సంబంధించి 80.6 శాతం, లిఫ్ట్ పనులు వంద శాతం పూర్తయ్యాయి. 2017–18 బడ్జెట్లో సింగూరు కాల్వల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.49.50 కోట్లు కేటాయించింది. నిధుల విడుదలతో పనుల్లో వేగం పెరిగి కాల్వల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. ఇకపై పూర్తి ఆయకట్టుకు నీళ్లు.. ప్రాజెక్టు కింద నాలుగు మండలాల్లోని 44 గ్రామాల పరిధిలో 40 వేల ఆయకట్టుకు నీరదించడం లక్ష్యం కాగా.. యాసంగిలో 30,116 ఎకరాలకు నీటిని విడుదల చేశారు. అలాగే 72 చెరువులను నింపి, 9,076 ఎకరాలను స్థిరీకరించారు. ఇకపై పూర్తి ఆయకట్టుకు నీరందించనున్నారు. బుధవారం కాల్వల పరిధిలో మంత్రి హరీశ్రావు పర్యటించారు. ఆందోల్, ముదుమాణిక్యం, పోతిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో పంటల దిగుబడులు, ధాన్యం రాశులను పరిశీలించారు. రైతుల పొలాల వద్దే వారి అనుభవాలను తెలుసుకున్నారు. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పల వద్ద ఆగుతూ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యం దిగుబడులపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కోటి ఎకరాల కలలో భాగమే..: మంత్రి హరీశ్ రైతులతో ముఖాముఖీ సందర్భంగా మంత్రి వివిధ గ్రామాల్లో ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి మెదక్ జిల్లాలో సింగూరు కాల్వల కింది ఆయకట్టుకు నీరందించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి ఎకరాల కలలో భాగమే సింగూరు కింద కాల్వలకు నీళ్లని పేర్కొన్నారు. ‘‘పూర్వ మెదక్ జిల్లాలో నిజాం హయాం తర్వాత ఒక్క కొత్త ఎకరాకు నీళ్లు పారకపోగా.. ఉన్న ఘణపూర్ ఆయకట్టు కింద 12 వేల ఎకరాల ఆయకట్టు తగ్గింది. కానీ తెలంగాణ ప్రభుత్వం సింగూరు కాల్వలకు రూ.60 కోట్ల మేర ఖర్చు చేసి ఈ ఏడాది 30 వేల ఎకరాలకు నీళ్లిచ్చింది. మరో 10 వేల ఎకరాలకు ఈ ఖరీఫ్లో నీళ్లివ్వనుంది. మరో 121 చెరువులను నింపి మరో 10 వేల ఎకరాలను స్థిరీకరించనుంది. గతంలో సింగూరు గ్రామాల్లో ఉన్న ముళ్ల పొదలన్నీ ఇప్పుడు పంట పొలాలయ్యాయి..’’ అని హరీశ్ అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే బడ్జెట్లో 40 శాతానికి పైగా నిధులు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకి వెచ్చిస్తోందని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేదని, కరెంట్ కోతలు లేవని, కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పోయాయని అన్నారు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా 60 లక్షల టన్నుల పంట దిగుబడి వచ్చిందని చెప్పారు. పత్తి మద్దతు ధర రూ.4,160 ఉంటే ప్రస్తుతం మార్కెట్లో రూ.5 వేలకు పైగా ఉందని, పల్లికాయ ధర సైతం రూ.4,220 నుంచి రూ.5 వేలు దాటిందని, మొక్కజొన్న, కందులకు అదే మాదిరి మద్దతు ధర లభిస్తోందన్నారు. వచ్చే ఏడాది మే నుంచి రైతులకు పట్నం, పరిశ్రమలకు ఇస్తున్న మాదిరే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ రానే రాదని, ఇప్పుడు మాత్రం పొమ్మన్నా పోదని అన్నారు. ఎకరాకు రూ.4 వేల చొప్పున రాష్ట్రంలోని రైతులందరికీS వచ్చే ఏడాది మే నుంచి రూ.6 వేల కోట్ల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఇంత పంట పుట్టినప్పట్నుంచీ చూడలేదు సింగూరు కింద ఇన్ని నీళ్లు ఎన్నడూ చూడలే. నేను పుట్టినప్పట్నుంచీ చూడనంత పంట పడింది. ఇంతకుముందు గొర్లు కాసేవాణ్ణి. ఇప్పుడు నాకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తున్నా. మంత్రి చెప్పి నట్లు పెట్టుబడికి సాయపడితే ఇక పట్నం దిక్కు చూసే గోసుండదు.. – చెన్నయ్య, రైతు, ఆందోల్ మళ్లీ వస్తే గొర్రె కూర పెడతా నాకు రెండెకరాలుంది. నాలుగేళ్లు పట్నంల కూరగాయలమ్మిన. నీళ్లు వచ్చినయని వచ్చి పంటల సాగు చేసిన. మంచి పంట వచ్చింది. వానాకాలానికి తయారుగా ఉన్నా. మంత్రి ముందస్తడని తెలిస్తే గొర్రె కోసెటొళ్లం. మళ్లొస్తే కచ్చితంగా గొర్రె కూర పెడతం.. – కొత్తగొల్ల శ్రీనివాస్, రైతు, ఆందోల్ ఇంత పంట జిందగీల చూస్తమనుకోలే.. నాకు 63 ఏళ్లు. ఇంతవరకు యాసంగిల ఇంత పంట చూడలే. జిందగీల చూస్తమనుకోలే. సింగూరు కాల్వలతో బంగారం లాంటి పంట పడింది. పెట్టుబడికి సైతం సాయం చేస్తామంటే ఇంకా పంటలు పండిస్తం. – బాల్రెడ్డి, రైతు, ముదుమాణిక్యం -
అవసరమైన సిబ్బంది వివరాలివ్వండి...
జూరాల, సింగూరు భద్రతపై కదిలిన నీటిపారుదల శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగు, తాగు నీటి ప్రాజెక్టులైన జూరాల, సింగూరు డ్యామ్ల నిర్వహణ విషయంలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ ఫిబ్రవరి 20న ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనంపై ఆ శాఖ అధికారులు స్పందించారు. ఈ డ్యామ్ల భద్రతకు పెద్దపీట వేయాల్సిన నీటి పారుదల శాఖ అధికారులు వాటి నిర్వహణ, అందుకు తీసుకోవా ల్సిన చర్యల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అంశంపై ఈఎన్సీ మురళీధర్ సోమవారం సంబంధిత వెకానికల్ అండ్ వర్క్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వివరణ కోరారు. ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుతం ఉన్న గేట్లు, క్రేన్స్, జనరేటర్ల వివరాలు అడిగారు. గ్రీజింగ్, వెల్డింగ్, గేట్ల నిర్వహణకు అవసరమైన సిబ్బంది గురించి కూడా వివరాలు కోరినట్లు నీటి పారుదల శాఖ వర్గాల ద్వారా తెలిసింది. కాగా జూరాల పరిధిలో వర్క్ ఇన్స్పెక్టర్, గేటు ఆపరేట్లర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, వాచ్మెన్లు, ఆపరేటర్లు కలిపి మొత్తంగా 19మంది వరకు అవసరం ఉండగా.. ప్రస్తుతం ఒక్క ఉద్యోగి కూడా అక్కడ లేడు. సింగూరు పరిధిలోనూ 13 మంది సిబ్బంది అవసరం ఉండగా ఒక హెల్పర్, ఇద్దరు వాచ్మెన్లు మాత్రమే ఉన్నారు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ నీటిపారుదల శాఖ దృష్టికి తెచ్చింది. -
వరదొస్తే వణుకే!
గాల్లో దీపంలా డ్యామ్ల భద్రత ⇒ అధ్వానంగా జూరాల, సింగూరు జలాశయాల నిర్వహణ ⇒ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు కనీస సిబ్బంది కరువు ⇒ ఆకస్మిక వరదొచ్చినా.. ఆపదొచ్చినా రిటైర్డ్ సిబ్బందే దిక్కు ⇒ మొన్నటి వరద సమయంలో నానా తిప్పలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన జలాశయాల భద్రత గాల్లో దీపంలా మారింది. సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్న డ్యామ్ల భద్రతకు పెద్దపీట వేయాల్సిన నీటి పారుదల శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా జూరాల, సింగూరు డ్యామ్ల నిర్వహణ ప్రమాదకరంగా మారిందని, వీటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)లకు తగిన సిబ్బందిని నియమించాలని పలు కమిటీలు సూచించినా.. అదేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గతేడాది సెప్టెంబర్లో కురిసిన వర్షాలతో జూరాల, సింగూరు డ్యామ్లకు భారీగా వరద వచ్చిన సందర్భాల్లో వాటి నిర్వహణపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. జూరాల.. స్పిల్వే రోడ్డుకు ప్రత్యామ్నాయమేది? జూరాల ప్రాజెక్టును 1995లో 1.04 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో నిర్మించారు. 12.50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యంతో 927 మీటర్ల పొడవుతో స్పిల్వేలు నిర్మించారు. 62 రేడియల్ క్రస్ట్ గేట్లు ఉన్నాయి. స్పిల్వే పై ఉన్న బ్రిడ్జి మీదుగా ఆత్మకూరు, గద్వాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. కార్లు, బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలు బ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. 2012లో డ్యామ్ భద్రతను పర్యవేక్షించిన ప్రత్యేక బృందం.. వాహనాల రాకపోకలతో భవిష్యత్లో డ్యామ్ నిర్మాణానికి పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. డ్యామ్ గేట్లను తెరవడానికి, సరి చేయడానికి ఉపయోగించే క్రేన్ వ్యవస్థకు ఈ వాహనాల రాకపోకలతో ప్రమాదం ఉందని, క్రేన్ మార్గం దెబ్బతింటే దాన్ని ఆపరేట్ చేయడం సులువు కాదని తెలిపింది. ప్రాజెక్టుకు వరదలు సంభవించిన సమయంలో గేట్ల నిర్వహణ మరీ ప్రమాదకరంగా ఉంటోందని తెలిపింది. గతేడాది సెప్టెంబర్ 25న ఏకంగా 19.82 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీన్ని కట్టడి చేసేందుకు అధికారాలు నానా తంటాలు పడాల్సి వచ్చింది. స్పిల్వే డ్యామ్పై వాహనాలు వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా డౌన్ స్ట్రీమ్లో రోడ్డు బ్రిడ్జి కట్టాలని పలు కమిటీలు సూచనలు చేసినా అది సాధ్యం కాలేదు. ఇక స్పిల్వే ఓఅండ్ఎంల కోసం వర్క్ ఇన్స్పెక్టర్, గేటు ఆపరేటర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రిషియన్లు, వాచ్మెన్లు, ఆపరేటర్లు కలిపి మొత్తంగా 19 మంది వరకు కావాల్సి ఉండగా... ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. గతేడాది వరద సమయంలో గేట్ల నిర్వహణ కోసం రిటైర్డ్ సిబ్బంది సేవలను వినియోగించుకున్నారు. సమయానికి తెరుచుకోని సింగూరు గేట్లు సింగూరు ప్రాజెక్టు 1989లో 29.91 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ప్రాజెక్టు స్పిల్వే 327 మీటర్లు కాగా.. 17 క్రస్ట్ గేట్లున్నాయి. 8.19 లక్షల క్యూసెక్కుల వరదను డిశ్చార్జి చేసే సామర్థ్యం ఉంది. గతేడాది సెప్టెంబర్లో ఇక్కడ 20 రోజుల్లోనే 75 టీఎంసీల మేర వరద వచ్చింది. ఈ సమయంలో ప్రాజెక్టు ప్రొటోకాల్ ప్రకారం మధ్య గేట్లు మొదట తెరవాల్సి ఉండగా.. అవి తెరుచుకోలేదు. దీంతో ఇతర గేట్లను తెరిచి నీటిని దిగువకు వదలాల్సి వచ్చింది. ప్రాజెక్టు గేట్ల ఓఅండ్ఎంను పూర్తిగా గాలికి వదిలే యడం.. రోప్ వైర్ల నిర్వహణను గాలికొదిలేయడమే దీనికి కారణమని తేల్చారు. ప్రాజెక్టు పరిధిలో 13 మంది సిబ్బంది కావాల్సి ఉండగా.. కేవలం ఒక హెల్పర్, ఇద్దరు వాచ్మెన్లతో నెట్టుకొస్తు న్నారు. నైపుణ్యం గల సిబ్బంది లేకుండా వరద, నీటి మట్టాల నిర్వహణ ఎలా చేపడతా రని, ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా అని నిపుణుల కమిటీ అప్పట్లోనే ప్రశ్నించింది. -
దొరకని యువకుల ఆచూకీ
సూరారం: సింగూరు జలాశయంలో గల్లంతైన ఇద్దరు యువకుల జాడ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనతో కుత్బుల్లాపూర్ సర్కిల్ నెహ్రునగర్లో విషాద చాయలు నెలకొన్నాయి. గల్లంతైన వారిలో అబ్దుల్ రజాక్, తస్లిమా బేగం కుమారుడు అబ్దుల్ ఆసిఫ్ (19) ప్రైవేట్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు, మహబూబ్, షమీమ్ బేగం కుమారుడు మోసిన్ (21) పెయింటర్గా జీవనం సాగిస్తున్నారు. సమీప బంధువులైన వీరు గురువారం స్నేహితులతో కలిసి సింగూరు డ్యామ్కు వెళ్లారు.డ్యామ్లో ఈత కొట్టేందుకు వెళుతూ వెళుతూ ఆసిఫ్ కింద పడటంతో అతడి వెనకే వస్తున్న మోసిన్ అతన్ని పట్టుకునే క్రమంలో ఇద్దరు నీటిలో పడి గల్లంతయ్యారు. డ్యామ్ అధికారులు గజ ఈతగాళ్లను సహాయంతో శుక్రవారం సాయంత్రం వరకు గాలింపు చేపట్టినా ఫలితం కనిపించలేదు. స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సింగూరు డ్యామ్ ఏరియా పోలీసులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
డ్యాంలో ఈతకెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు
సంగారెడ్డి: సింగూరు డ్యాంలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. కుత్బుల్లాపూర్కు చెందిన ఇద్దరు స్నేహితులు గురువారం ఈత కొట్టడానికి సింగూరు డ్యాంకు వెళ్లారు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. -
సింగూరు వరదలో చిక్కుకున్న కార్మికులు
గేట్లు మూసి.. బయటకు తీసుకొచ్చిన అధికారులు పుల్కల్: పైప్లైన్ మరమ్మతుల కోసం వెళ్లి సింగూరు వరదల్లో ‘సత్యసాయి’ కార్మికులు చిక్కుకుపోయారు. ఎట్టకేలకు అధికారులు మంగళవారం సాయంత్రం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండలం పోచారం శివారులో జరిగింది. సత్యసాయి నీటి పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఎం.అంజయ్య, జి.లింగం, సురేశ్ మంగళవారం ఉదయం సింగూర్ వరదనీటి ప్రవాహం తగ్గడంతో పైప్హౌస్ (ఇన్ టేక్ వెల్) పరిశీలనకు వెళ్లారు. దెబ్బతిన్న పైపులకు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా సింగూర్ వరదనీరు పంప్హౌస్ చుట్టూ చేరింది. ఇది గమనించిన కార్మికులు తహసీల్దార్, ఎస్సైకు ఫోన్ ద్వారా తెలిపారు. తహసీల్దార్ శివరాం, వీఆర్వో, పోలీసులు అక్కడికి చేరుకొని కార్మికులను రక్షించే ప్రయత్నాలు చేపట్టారు. నీటి విడుదలను కొంతసేపు నిలిపివేయాలని ప్రాజెక్టు ఏఈ రాములుతోపాటు వారు డీఈని కోరారు. అరుుతే ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి ఎక్కువున్నందున గేట్లు నిలిపివేస్తే ప్రమాదం జరగొచ్చని ప్రాజెక్టు అధికారులు తహసీల్దార్కు తెలిపారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలియడంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఫలితంగా మంగళవారం సాయంత్రానికి గేట్లు మూసివేసి కార్మికులను బయటకు తీసుకొచ్చారు. కాగా, ఎగువ ప్రాంతం నుంచి అధికంగా వరదనీరు రావడంతో 15 రోజులుగా ప్రాజెక్టు నుంచి నిర్విరామంగా వరదనీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం 62 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, అదే మట్టంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లుగా ఈఈ రాములు తెలిపారు. ముందే ఆదేశాలు జారీ ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీటిని 15 రోజులుగా వదలక తప్పదని ఈఈ రాములు తెలిపారు. ఈ విషయం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పాటు గ్రామాల్లో దండోరా వేయించి మంజీరా నది నీటి ప్రవాహ ప్రాంతానికి వెళ్లొద్దని సూచించామన్నారు. అయినప్పటికీ సత్యసాయి కార్మికులు మంగళవారం పంప్హౌస్ వద్దకు వెళ్లారని ఈఈ రాములు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం నుంచి ఆరు గేట్ల ద్వారా 63 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశామని, మధ్యాహ్నం తర్వాత కార్మికులను బయటికి తీసుకువచ్చేందుకు 4 గేట్లను మూసివేశామని ఈఈ రాములు తెలిపారు. -
సింగూరులో సందడే..సందడి
ప్రాజెక్టుకు పెరిగిన సందర్శకుల తాకిడి మూడు గేట్ల ద్వారా మంజీరలోకి నీరు జోగిపేట: సింగూరు ప్రాజెక్టులో వరదనీరు భారీగా చేరుతుండడంతో ఆ నీటి తాకిడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో ఇరిగేషన్ అధికారులు మంజీర నదిలోకి మూడు గేట్ల ద్వారా నీరు దిగువకు వదులుతున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది ప్రాజెక్టుకు తరలివచ్చారు. కార్లు, వ్యాన్లు, ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో సింగూరుకు తరలివస్తున్నారు. అన్ని దారులు సింగూరు వైపే మళ్లుతున్నాయి. ఆదివారం కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, జోగిపేట, మెదక్, జహీరాబాద్తో పాటు పుల్కల్ మండలం చుట్టు ప్రక్కల ప్రాంతాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండు కి.మీ దూరం నుండే పర్యాటకులు బారులు తీరి కనిపించారు. ప్రాజెక్టు పైకి వాహనాలను పోలీసులు అనుమతించడంలేదు. ప్రత్యేకంగా చెక్పోస్టును కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు ప్రాజెక్టుపైకి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించకపోవడంతో పర్యాటకులు అసంతృప్తిని వ్యక్తం చేసారు. కొందరు గోల చేయడంతో వారిని ఆపడం పోలీసుల వశం కాకపోవడంతో చివరికి వదిలిపెట్టారు. సెల్ఫీల జోరు ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన పర్యాటకులు నీళ్లు కనిపించేలా ఫోటోలు దిగడంలో పోటీలు పడడం కనిపించింది. సెల్ఫీలకైతే అంతే లేకుండా పోయింది. కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి వీక్షిస్తున్నారు. పార్కు నిండా పర్యాటకులే.. ప్రాజెక్టు క్రింది భాగంలో ఉన్న చిల్ర్డన్స్పార్కు పర్యాటకులతో నిండిపోయింది. ప్రాజెక్టును చూడడానికి వచ్చిన వారంతా వెంట క్యారేజ్లు తెచ్చుకుంటున్నారు. పార్కులో కూర్చొని భోజనాలు చేసారు. -
ప్రమాదపు అంచుల్లో..
పుల్కల్: ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కొంతసేపైతే కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ చివరి నిమిషంలో ట్రాక్టర్ ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఆ ప్రమాదం తప్పిపోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. సింగూర్ ప్రాజెక్టు 9 గేట్ల ద్వారా శనివారం మధ్యాహ్నం నీటిని విడుదల చేశారు. దీంతో ఉధృత్తగా ప్రవహిస్తున్న నీరు రోడ్డుపైకి వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో సుమారు 15 నుంచి 20 మందిని తీసుకొని మలపాడ్ వైపు నుంచి సింగూర్ వైపు ఒక ట్రాక్టర్ వస్తోంది. రోడ్డు మధ్యలోకి రాగానే నీరు ట్రాక్టర్ ఇంజన్ మునిగిపోయే వరకు చేరింది. అప్పటికే పోలీసులు రావద్దు అని అరుస్తున్నా ట్రాక్టర్ డ్రైవర్ ముందుకు వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ నీటి ఉధృతి పెరగడంతో వెనక్కి వెళ్లాడు. -
వరద దెబ్బకు ఏడుపాయల విలవిల
కూలిపోయిన బ్రిడ్జి.. పడి పోయిన గ్రిల్లింగ్ కొట్టుకుపోయిన హుండీలు..కూలిన స్తంభాలు వనదుర్గా ఆలయం అస్తవ్యస్తం సుమారు రూ.15 లక్షల నష్టం దెబ్బతిన్న ప్రదేశాన్ని పరిశీలించిన డీఎస్పీ, ఈఓ పాపన్నపేట:వరద ఉధృతికి ఏడుపాయల విలవిల్లాడింది. ఆలయం అంతా అస్తవ్యస్తంగా మారింది. కూలిపోయిన బ్రిడ్జి.. పడిపోయిన గ్రిల్లింగ్..కొట్టుకుపోయిన హుండీలు..కుప్పకూలిన క్యూలైన్లు..నేలకూలిన విద్యుత్ స్తంభాలు..విరిగిన ఫ్యాన్లు.. వారం రోజుల పాటు మంజీరా వరదల్లో మునిగి శుక్రవారం వెలుగు చూసిన ఏడుపాయల ఆలయ పరిస్థితి ఇది. ఈ వరదల విలయంలో దాదాపు రూ 15 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలో తేలిందని ఈఓ వెంకటకిషన్రావు తెలిపారు.అనంతరం మెదక్ డీఎస్పీ నాగరాజు, మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, పాపన్నపేట ఎస్ఐ సందీప్రెడ్డి ఏడుపాయల్లోని పరిస్థితులను పరిశీలించారు. ఇటీవల ఎడతెరిపి లేనివర్షాలు పడటం..అదే సమయంలో సింగూరు నుంచి నీరు సుమారు 1.60 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో మంజీరమ్మ మహోగ్రరూపందాల్చి ఘనపురం ఆనకట్టపై నుంచి 6 ఫీట్ల ఎత్తున పొంగిపొర్లింది. దిగువన ఉన్న ఏడుపాయల దుర్గమ్మ ఆలయాన్ని ముంచెత్తింది. దీంతో ఆలయం సుమారు 75 శాతం వరదల్లో మునిగి పోయింది. వరద తాకిడికి ఆలయం ముందు ఉన్న బ్రిడ్జి కూలిపోయింది.క్యూలైన్లు కుప్ప కూలాయి. ఆలయంలో చుట్టూర ఉన్న గ్రిల్లింగ్ కొట్టుకు పోయింది.అమ్మవారి హుండీలు కొట్టుకుపోయాయి. ఆలయంమధ్యలో ఉన్న గ్రానైట్రాళ్లు అడ్రస్ లేకుండా పోయాయి.ఆలయం గ్రిల్లింగ్ చుట్టు గడ్డి పేరుకు పోయింది.కాగా అమ్మవారి విగ్రహానికి మాత్రం ఎలాంటి నష్టం జరుగలేదు. సుమారు రూ15 లక్షల ఆస్తినష్టం వరదల వల్ల సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం జరిగిందని ఈఓ వెంకటకిషన్రావు తెలిపారు.శుక్రవారం ఆయన మెదక్ డీఎస్పీ నాగరాజు, సీఐ రామకృష్ణ, ఎస్ఐ సందీప్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలను సందర్శించి నష్టాన్ని అంచనావేశారు. నిధుల మంజూరుకు డిప్యుటీ స్పీకర్ హామీ వరదల వల్ల దెబ్బతిన్న దుర్గమ్మ ఆలయానికి మరమ్మతులు చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరి చేయడానికి డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి హామీ ఇచ్చినట్లు ఈఓ వెంకటకిషన్రావు తెలిపారు. నీటి ప్రవాహం తగ్గాకే ఆలయానికి అనుమతి ఏడుపాయల ఆలయం ముందు పూర్తి నీటి ప్రవాహం తగ్గాకే భక్తులకు అనుమతి ఇస్తామని మెదక్ డీఎస్పీ నాగరాజు తెలిపారు.అంతలోగా ఆలయ మరమ్మతులు జరుగుతాయన్నారు. \ -
అమ్మో ఇన్ని నీళ్లా..?
సింగూరు నీరు చూసి ఆశ్చర్యపోయిన మంత్రి హరీశ్రావు జోగిపేట: సింగూరు ప్రాజెక్టులో నీటి ప్రవాహాన్ని పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్రీ నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్రావు నిండుకుండలా కనిపించిన సింగూరును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి హరీశ్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింతా ప్రభాకర్తో కలిసి సింగూరు ప్రాజెక్టును సందర్శించారు. మంత్రి తన వాహనం దిగుతూనే ప్రాజెక్టు రీడింగ్ ఉండే ప్రదేశంలోని మెట్ల వద్దకు వెళ్లి ఆశ్చర్యపోతూ అలాగే నిలబడి పోయారు. కొన్ని నిమిషాల పాటు దూరంగా ఉన్న నీటిని పరిశీలిస్తూ ఉండిపోయారు. నెల రోజుల కింద వచ్చినప్పుడు ప్రాజెక్టులో నీళ్లే లేవని , ఇప్పుడేమో ఇన్ని నీళ్లు వచ్చాయని, వీటిని చూస్తుంటే ఒక్క బొట్టు కూడా బయటకు పంపకూడదనిపిస్తోందని నవ్వుతూ అన్నారు. దేవుడు కరుణించడం వల్ల 15 రోజుల్లో ప్రాజెక్టు నిండిపోయిందని నిండిపోవడమే కాకుండా 41 టీఎంసీల నీరు మంజీర నదిలోకి వృధాగా పోయిందని మంత్రి అన్నారు. ప్రాజెక్టులో నీరు ఎండిపోయిన విషయాన్ని ఎమ్మెల్యే బాబూమోహన్ మంత్రి దృష్టికి తీసుకుపోయారు. మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, డిప్యూటీ స్పీకర్లు ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించారు. ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి కూడా నీటిని చూసి అనందం వ్యక్తం చేశారు. -
సందర్శనకు అనుమతివ్వం
సింగూర్ ప్రాజెక్టుకు రెండోరోజు పోటెత్తిన జనం మూడు చెక్పోస్టులు ఏర్పాటుచేసిన పోలీసులు సీఐతో సహా నలుగురు ఎస్సైలు రంగంలోకి.. పుల్కల్: వరదల నేపథ్యంలో సింగూర్కు సందర్శకులు రావొద్దని పోలీసులు ముందే హెచ్చరించినా.. ప్రాజెక్టుకు జన తాకడీ తగ్గడం లేదు. ఆదివారం సెలవు కావడంతో హైదరాబాద్తో పాటు సంగారెడ్డి, జోగిపేట పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు చూసేందుకు తరలివచ్చారు. దీంతో ప్రాజెక్టు నుంచి సింగూర్ గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో కలెక్టర్ రోనాల్డ్రోస్ తిరుగుప్రయాణంలో రోడ్ క్లియరెన్స్కు పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సందర్శకులను నివారించేందుకు కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు తాడ్దాన్పల్లి చౌరస్తా వద్ద సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో.. పెద్దరెడ్డిపేట చౌరస్తా వద్ద శంకరంపేట ఎస్సై విజయరావు, టేక్మాల్ ఎస్సై ఎల్లాగౌడ్ పర్యవేక్షణలో మరొక చెక్పోస్టు ఏర్పాటుచేశారు. అల్లాదుర్గం ఎస్సై గౌస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. సోమవారం నుంచి సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లో ప్రాజక్టు పరిసరాల వద్దకు అనుమతించేది లేదని జోగిపేట సీఐ వెంకటయ్య హెచ్చరించారు. స్థానిక ఎస్సై సింగూర్ గ్రామం నుంచి ప్రాజెక్టు వరకు ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా పర్యవేక్షించారు. కాగా, మధ్యాహ్నం పోలీసులు భోజనం చేస్తుండగా.. సందర్శకులు ఒక్కసారిగా ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టును సందర్శించిన సంగారెడ్డి ఎమ్మెల్యే, చైర్పర్సన్ సింగూర్ ప్రాజెక్టును ఆదివారం సాయంత్రం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్తో పాటు సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి సందర్శించారు. ఇన్ప్లో వివరాలను ఎమ్మెల్యే ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
సింగూర్కు సందర్శకులు రావొద్దు
పుల్కల్: సింగూర్ ప్రాజెక్టును చూసేందుకు వచ్చే వారు మరో మూడు రోజుల వరకు ఇటు వైపు రావొద్దని ఎస్ఐ సత్యానారాయణ సూచించారు. సదాశివపేట-సింగూర్ రోడ్డుతో పాటు అత్మకూర్- బొబ్బిలిగామ, సింగూర్-మాలపాహడ్ రహదారులు పూర్తిగా తెగిపోయి ప్రమాద కరంగా ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉందన్నారు. వర్షాలు తగ్గే వరకు ఇటు వైపు రావొద్దని కోరారు. -
పరవళ్లు తొక్కుతున్న మంజీర
9 గేట్ల ఎత్తివేత.. 1.60 లక్ష్యల క్యూసెక్కుల నీరు విడదల అదే మట్టంతో ఇన్ఫ్లో.. పరిశీలించిన ఎస్పీ, ఎమ్మెల్యే పుల్కల్: మంజీర తీరం పరవళ్లు తొక్కుతుంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా నీటి ప్రవాహం రావడంతో అ«ధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాతంలోని పంట పొలాలు పూర్తిగా జలమయమయ్యాయి. శనివారం ప్రాజెక్టు నుంచి 9 గేట్లను ఎత్తి దిగువకు 1.60 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. శనివారం రాత్రి వరకు నీటి ఇన్ఫ్లో 1.60 లక్షలకు పెరిగే అవకాశం ఉండటంతో ముందుగానే నీటిని వదిలారు. కాగా శనివారం సింగూర్ ప్రాజెక్టును ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ టి. పద్మారావులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబూమోహన్ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పోచారం శివారుతో పాటు ప్రాజెక్టు కింద ఉన్న సింగూర్, లింగంపల్లి, ఇసోజీపేట, మిన్పూర్, కొడూర్, గంగోజీపేట, శివంపేట, వెండికొల్, కోర్పోల్ గ్రామా శివార్లలోని వందల ఎకరాల పంటలన వరదలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి నుంచి ఉదయం వరకు 6 గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు ఉదయం వరకు ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో ఒకేసారి లక్షా 40 వేలకు పెరగడంతో ఇరిగేష్న్ ఎస్ఈ పద్మారావు అదనంగా మరో రెండు గేట్ల ద్వారా 1.60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శనివారం రాత్రికి ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అ«ధికారులు తెలిపారు. ప్రాజెక్టును సందర్శించిన ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి శనివారం మధ్యాహ్నం సింగూర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద సందర్శకులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తగా పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. సింగూర్ను చూసేందుకు వచ్చే సందర్శకులు కూడా జాగ్రతలు పాటించాలని సూచించారు. ప్రాజెక్టు వద్ద గంగమ్మకు ఎమ్మెల్యే పూజలు సింగూకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో ఎమ్మెల్యే బాబుమోహన్ శనివారం గంగమ్మకు పూజలు చేశారు. అయనతో పాటు మాజీ ఎంనీ మాణిక్రెడ్డి, తహసీల్దార్ శివారం పాల్గొన్నారు. -
సింగూరు పారాలే.. సిరులు పండాలే!
దివంగత నేత వైఎస్ హయాంలో 50 శాతం ప్రాజెక్టు పూర్తి రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేసిన కేసీఆర్ సర్కార్ 40 వేల ఎకరాలకు సాగు నీరు.. నేడు ప్రారంభం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మూడు దశాబ్దాల మెతుకుసీమ రైతాంగం ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. వైఎస్ఆర్ జలయజ్ఞంతో పునాదులు వేసుకున్న సింగూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నేడు 40 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వబోతోంది. శుక్రవారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు మెదక్ జిల్లా సింగూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒకేసారి 4 పంపులు ప్రారంభించి 450 క్యుసెక్కుల సాగు జలాలను వదిలి దిగువన 47 చెరువులను నింపుతారు. అక్కడి నుంచి పొలాలకు విడుదల చేస్తారు. 2005లో వైఎస్ఆర్ అంకురార్పణ 2005లో వైఎస్ఆర్ సింగూర్ ఎత్తిపోతల పథకానికి బీజం వేశారు. 139 ఉత్తర్వుల ద్వారా రూ.89.98 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్థారిస్తూ జీఓ నెంబర్ 136 జారీ చేశారు. 2006 జూన్ 7 తేదిన కాల్వల నిర్మాణానికి వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల ప్రాజెక్టు కుడి కాల్వ కింద సదాశివపేట, మునిపల్లి, సంగారెడ్డి మండలాలకు 2500 ఎకరాలు, ఎడమ కాల్వ ద్వారా అందోల్, పుల్కల్, రేగోడ్ మండలాల్లో 37,500 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. మొదటి విడత కింద రూ.35 కోట్లు వైఎస్ఆర్ విడుదల చేశారు. ఆయన హయాంలోనే దాదాపు 50 శాతం పనులు పూర్తి అయ్యాయి. వైఎస్ఆర్ మరణం తర్వాత మూడేళ్ల వరకు ప్రాజెక్టు గురించి ఎవరూ పట్టించుకోలేదు. 2012లో అప్పటి ప్రభుత్వం రూ.16.50 కోట్లు కేటాయించింది. కానీ, వాటిలో రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తిరిగి అవే ని«ధులను 2014 బడ్జెట్లో కేటాయించారు. ఈ నిధులు వినియోగించి ఎడమకాల్వ లిఫ్ట్ పనులు అసంపూర్తిగా ఉన్న సమయంలోనే సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ట్రయల్రన్ నిర్వహించింది. అప్పటి ఉప-ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ 2014, ఫిబ్రవరిలో సింగూరు తూముల నీళ్లు వదిలారు. కొద్దిపాటి జల ఉధృతికే తట్టుకోలేక కాల్వలు తెగిపోయాయి. దీంతో అధికారులు శాశ్వతంగా గేట్లు మూసివేశారు. 24 కి.మీ.ల ట్రయల్రన్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.50 కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. గతంలో ట్రయల్రన్ నిర్వహించిన సమయంలో కొట్టుకపోయిన 24 కిలోమీటర్ల మేర కాల్వలను కట్టుదిట్టం చేశారు. గతంలో పూర్తి చేయకుండా వదిలేసిన 60 కిలోమీటర్ల ప్రధాన కాల్వని పూర్తిచేసి.. పిల్ల కాల్వలను అనుసంధానం చేశారు. మలి విడత పనులు ప్రారంభించిన నాటి నుంచి పూర్తి అయ్యే వరకు మంత్రి హరీశ్రావు పర్యవేక్షించారు. శుక్రవారం 4 పంపుల ద్వారా 450 క్యూసెక్కుల జలాలను దిగువకు వదలనున్నారు. ఈ నీళ్లతో ముందుగా ఆందోల్ పెద్ద చెరువును నింపుతారు. అక్కడి నుంచి గొలుసుకట్టు చెరువులను నింపుతారు. హైదరాబాద్కు నీళ్లు నిలిపివేత మిషన్ భగీరథ జలాలు, కృష్ణా బేసిన్ నుంచి హైదరాబాద్కు అందుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సింగూరు నుంచి హైదరాబాద్కు మంచినీటి సరఫరా నిలిపివేసింది. దీంతో ప్రాజెక్టులో 9 టీఎంసీల జలాలలు మిగులుతాయి. మరోవైపు గజ్వేల్, దుబ్బాక ప్రాంతానికి కూడా మిషన్ భగీరథ జలాలు వస్తుండటంతో ఇక్కడ మరో టీఎంసీలు మిగిలే అవకాశం ఉంది. ఈ మొత్తం జలాలను మెతుకుసీమ రైతాంగం సాగు అవసరాలకే వినియోగిస్తామని నీటిపారదల శాఖ అధికారులు చెప్పారు. -
సాగుకు ఊపిరి
సింగూర్లో పెరిగిన నీటి మట్టం 16 టీఎంసీలకు చేరిన వరద నీరు పుల్కల్: ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సింగూర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఇప్పటికే 16 టీఎంసీలకు నీరు చేరింది. ఆగస్టు 30 నాటికి కేవలం 4 టీఎంసీలు ఉండగా.. సెప్టెంబర్ 30 నాటికి 9 టీఎంసీలకు చేరింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈనెల 13 నుంచి 15వ తేది వరకు వచ్చింది. ఇంకా పది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మరో 10 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ ఈఈ రాములు తెలిపారు. ఊపందుకున్న వ్యాపారం రెండు నెలల క్రితం వరకు పూర్తిగా అడుగంటిన సింగూర్ ప్రాజెక్టు ప్రస్తుతం కళకళలాడుతోంది. దీంతో బోటింగ్ చేసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రాజెక్టు పరిధిలో మూతపడిన వ్యాపారాలు సైతం ఊపందుకుంటున్నాయి. ప్రభుత్వం అనుకుంటే సాగుకు నీరు సింగూర్ ప్రాజెక్టు నుంచి మండల పరిధిలో సాగుకు నీరు అందించే స్థాయికి వరద చేరింది. అయితే, ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గత ఆగస్టు 15 నుంచే సింగూర్ ప్రాజెక్టు ద్వారా పంటల సాగుకు నీరు ఇస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కాల్వ పనులు పూర్తి చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులను పరుగులు పెట్టించాలి. అంతేకాకుండా ఆర్డీఓ పర్యవేక్షణలో కాల్వల పరిధిలోని భూసమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈక్రమంలో ఎత్తిపోతల పథకం వద్ద మినహా.. దాదాపుగా పనులు పూర్తయ్యాయి. కనీసం పదివేల ఎకరాలకు నీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఎస్ఈ మదుసుధన్ ‘సాక్షి’కి తెలిపారు. -
‘సింగూరు’ కళకళ...‘సాగర్’ వెలవెల
సింగూర్ ప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల ఇన్ప్లో డెడ్స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు తప్ప మిగితా ప్రధాన జలాశయాలు వరదనీటì తో కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్టులోకి శుక్రవారం 21 వేల క్యూ సెక్కుల వరద నీ రు వచ్చిచేరుతోంది. నాలుగు రోజుల నుంచి కుండపోతగా కురిసిన వర్షాలకు వరదనీటి ఉధృతి మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో సింగూరు జలాశయంలో జళకళ సంతరించు కుంటోంది. డెడ్స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూరు ప్రాజెక్టు నీటి మట్టం డెడ్స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరింది. వేసవి కాలం ముగింపు, వర్షాకాలం ఆరంభం నాటికి సింగూరు ప్రాజెక్టులో 1.5 టీఎంసీలతో డెడ్స్టోరేజీ నీరు నిల్వ ఉంది. కాగా ఇటీవల వర్షాకాలంలో కురిసిన వర్షానికి సింగూరు ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 7.5 టీఎంసీల నీరు వచ్చిచేరింది. ప్రస్తుతం 21 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం మరింత పెరగ నుంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్తాయి నీటిమట్టం 525.2 మీటర్లకు గాను 29 టీఎంసీలకు గాను ప్రస్తుతం 517.5 మీటర్లతో 8.5 టీఎంసీల నీరు చేరింది. ‘సాగర్’ వెల వెల జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు చేరకపోవడంతో డెడ్స్టోరేజీతో వెలవెలబోయింది. ప్రాజెక్టుకు ఎగువన క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నా వాగులు, వంకల్లో నీటి నిల్వలు చేరుకున్నాయి. కాగా ప్రాజెక్టులోకి స్వల్పంగా వరదనీరు వస్తున్నా డెడ్ స్టోరేజీకి దిగువన పడిపోయిన నీటిమట్టం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రాజెక్టు ఎగువన మెదక్ జిల్లాలోని పాపన్నపేట, శంకరంపేట, మండలాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి చేరుతున్న తరుణంలో వర్షాలు నిలిచిపోవ డంతో వరదలకు బ్రేకులు పడ్డాయి. -
‘సింగూరు’ కళకళ...‘సాగర్’ వెలవెల
సింగూర్ ప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల ఇన్ప్లో డెడ్స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు తప్ప మిగితా ప్రధాన జలాశయాలు వరదనీటì తో కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్టులోకి శుక్రవారం 21 వేల క్యూ సెక్కుల వరద నీ రు వచ్చిచేరుతోంది. నాలుగు రోజుల నుంచి కుండపోతగా కురిసిన వర్షాలకు వరదనీటి ఉధృతి మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో సింగూరు జలాశయంలో జళకళ సంతరించు కుంటోంది. డెడ్స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరిన నీటిమట్టం నిజాంసాగర్ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూరు ప్రాజెక్టు నీటి మట్టం డెడ్స్టోరేజీ నుంచి 8.5 టీఎంసీలకు చేరింది. వేసవి కాలం ముగింపు, వర్షాకాలం ఆరంభం నాటికి సింగూరు ప్రాజెక్టులో 1.5 టీఎంసీలతో డెడ్స్టోరేజీ నీరు నిల్వ ఉంది. కాగా ఇటీవల వర్షాకాలంలో కురిసిన వర్షానికి సింగూరు ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 7.5 టీఎంసీల నీరు వచ్చిచేరింది. ప్రస్తుతం 21 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం మరింత పెరగ నుంది. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్తాయి నీటిమట్టం 525.2 మీటర్లకు గాను 29 టీఎంసీలకు గాను ప్రస్తుతం 517.5 మీటర్లతో 8.5 టీఎంసీల నీరు చేరింది. ‘సాగర్’ వెల వెల జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు చేరకపోవడంతో డెడ్స్టోరేజీతో వెలవెలబోయింది. ప్రాజెక్టుకు ఎగువన క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నా వాగులు, వంకల్లో నీటి నిల్వలు చేరుకున్నాయి. కాగా ప్రాజెక్టులోకి స్వల్పంగా వరదనీరు వస్తున్నా డెడ్ స్టోరేజీకి దిగువన పడిపోయిన నీటిమట్టం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రాజెక్టు ఎగువన మెదక్ జిల్లాలోని పాపన్నపేట, శంకరంపేట, మండలాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి చేరుతున్న తరుణంలో వర్షాలు నిలిచిపోవ డంతో వరదలకు బ్రేకులు పడ్డాయి. -
పెరుగుతున్న ‘సింగూర్’ మట్టం
ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ రోనాల్డ్రోస్ పుల్కల్: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగూర్ ప్రాజెక్టులోకి భారగా వరదనీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాజెక్టులోకి 3 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 30 టీఎంసీలు కాగా.. సాంకేతిక కారణాల దృష్ట్యా 29 టీఎంసీలే నిల్వ చేస్తున్నారు. గత ఏడాది ఇదే రోజున 12.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుతం 9.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ఽఫ్లో 19 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని ఈఈ రాములు తెలిపారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటన భారీగా వరద నీరు చేరుతున్న సింగూర్ ప్రాజెక్టును కలెక్టర్ రోనాల్డ్రోస్ శుక్రవారం సాయంత్రం ఇరిగేషన్శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్లో 9.5 టీఎంసీల నీరు ఉందని కలెక్టర్కు ఇరిగేషన్ ఎస్ఈ పద్మారావు తెలిపారు. అక్కడి నుంచి కొండపూర్ మండలం మల్కపూర్ చెరువును కలెక్టర్ పరిశీలించారు. చెరువులో నాలుగురోజులుగా కురుస్తున్న వర్షంతో 10 అడుగుల నీరు వచ్చి చేరిందని కలెక్టర్ అధికారులు వివరించారు. -
సింగూరు జలాలు.. వైఎస్ఆర్ పుణ్యమే
2006లో కాలువ పనులకు శంకుస్థాపన రూ.89.98 కోట్లు కేటాయించిన ఘనత జోగిపేట: సింగూరు జలాలను కాలువల ద్వారా వేలాది ఎకరాలకు అందించేందుకు, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకుగాను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారు. రూ.89.98 కోట్లు మంజూరు చేయించారు. 2006 జూన్ 7న పుల్కల్ మండలం సింగూరుకు స్వయంగా వచ్చి పనులకు శంకుస్థాపన చేశారు. కాలువల నిర్మాణం ద్వారా 40 వేల ఎకరాలకు నీరు అందించేందుకు పథకాన్ని అప్పట్లో రూపొందించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో పనుల్లో జాప్యం జరిగింది. 2013లో సింగూరు ద్వారా అందోలు పెద్ద చెరువులోకి సింగూరు నీటిని తరలించడంతో సుమారు 20 గ్రామాల చెరువులకు నీరు చేరింది. దీనివల్ల వందల ఎకరాల్లో రైతులు రెండు పంటలు పండించుకుంటున్నారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా అందోలు నియోజకవర్గానికి నీరందించాలన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం ఇప్పుడిప్పుడే నెరవేరుతుంది. ఈ ప్రాంత రైతులు ఇప్పటికీ రాజన్నను గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్ వల్లే సాధ్యమైంది సింగూరు ప్రాజెక్టు ద్వారా సేద్యానికి నీరందిస్తామని దాదాపు 30 ఏళ్లుగా ఎంతో మంది సీఎంలు హామీ ఇచ్చారు. ప్రతి ఎన్నికల్లోనూ ఇదే విషయాన్ని చెప్పేవారు. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలను చేపట్టిన ఏడాది తర్వాత కాలువల నిర్మాణానికి రూ.89.98 కోట్లు మంజూరు చేశారు. స్వయంగా వచ్చి పనులు కూడా ప్రారంభించారు. ఆయన తర్వాత వచ్చిన వారు కాలువల పనులను పూర్తి చేయలేకపోయారు. సింగూరు నీటిపైనే ఈ ప్రాంత రైతులు ఆధార పడి ఉన్నారు. అటువంటి మహానేతను పోలిన నాయకులు భవిష్యత్తులో వచ్చే పరిస్థితిలేదు. ఆయనే బతికి ఉంటే ఇప్పటికే కాలువల పని పూర్తయ్యేది. - ముస్లాపురం భాగయ్య, రైతు, పోసానిపేట, మం: అందోల్ -
నీళ్లు తక్షణమే విడుదల చేయాలి
మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి మెదక్: మలివిడతగా సింగూర్ జలాలను విడుదల చేసి ఘణాపూర్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పలువురు కాంగ్రెస్నాయకులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి ఆర్డీఓ మెంచు నగేష్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడతగా సింగూర్ జలాలు విడుదల చేసినప్పటికీ అవి మధ్యలోనే ఆగిపోయాయని, మళ్లీ వెంటనే నీరు విడుదల చేస్తే పంట పొలాలకు చేరుకుంటాయన్నారు. 2004లో సింగూర్ ప్రాజెక్ట్లో కేవలం 5టీఎంసీల నీరునప్పటికీ ఘనపురం ఆయకట్టుకు నీరు వదలడం జరిగిందన్నారు. ప్రస్తుతం 6టీఎంసీల నీరున్నా ప్రాజెక్ట్కు వదలడంతో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే మెదక్ జిల్లాకేంద్రాన్ని నర్సాపూర్, నారాయణఖేడ్, ఆందోల్ పూర్తి నియోజకవర్గాలతోపాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డి మండలాన్ని కలపాలని డిమాండ్ చేశారు. 18మండలాలతో రెవెన్యూ డివిజన్గా ఉన్న మెదక్ను 14 మండలాలకే జిల్లాకేంద్రం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు మామిళ్ల ఆంజనేయులు, సురేందర్గౌడ్, మధుసూదన్రావు, తోట అశోక్, శంకర్, అమృతరావు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
12వారాల్లో ఆ రైతులకు భూములు వాపస్!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో పెనురాజకీయ దుమారం సృష్టించిన టాటా నానో ఫ్యాక్టరీకి భూముల కేటాయింపు వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సింగూర్లో నానో ఫ్యాక్టరీకి వెయ్యి ఎకరాల వ్యవసాయ భూమి కేటాయిస్తూ చేసుకున్న ఒప్పందాన్ని కొట్టివేసింది. భూములు కోల్పోయిన బాధిత రైతులకు 12వారాల్లోగా వారి భూములు వారికి తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది. 2006లో బెంగాల్లోని అప్పటి వామపక్ష ప్రభుత్వం టాటా మోటార్స్కు వెయ్యి ఎకరాల భూమిని కేటాయించింది. అయితే, వ్యవసాయ భూములను కంపెనీకి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరి అయిన లెఫ్ట్ సర్కార్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న మమతా బెనర్జీ అధికార పీఠాన్ని చేపట్టి ఇప్పటివరకు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నానో ప్లాంటు బెంగాల్ నుంచి గుజరాత్కు తరలిపోయింది. తీర్పు సందర్భంగా అప్పటి లెఫ్ట్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చట్టంలో లోపాల వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించింది. కచ్చితంగా రాష్ట్రంలోకి ఈ ప్రాజెక్టు రావాలని లెఫ్ట్ ప్రభుత్వం మంకుపట్టు పట్టినట్టు కనిపిస్తున్నదని, ప్రైవేటు కంపెనీ సూచన మేరకు నచ్చినచోట భూముల సేకరణ చేపట్టడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పుతో సింగూరులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ వీధుల్లో పటాకులు కాలుస్తూ సంబురాలు జరుపుకొన్నారు. -
72 ఊళ్ల త్యాగం.. సింగూరు జలం
మెతుకు సీమ కన్నీరు.. హైదరాబాద్కు తాగునీరు ప్రాజెక్టు కింద 72 గ్రామాల మునక భూములు కోల్పోయిన 42 వేల మంది రైతులు అప్పట్లో ఎకరానికి రూ. 12,500 ఇళ్లకు రూ. 2వేల చొప్పున పరిహారం కోర్టులో సవాల్ చేసిన బాధితులు నేటికీ కోర్టు చుట్టూ ప్రదక్షిణలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:సింగూరు.. పరిహారం నేటికీ అందలేదు.. నాడు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు పరిహారం కోసం ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. భూసేకరణ దశలో తాతలు, ప్రాజెక్టు పూర్తి అయ్యాక తండ్రులు, తాజాగా కొడుకులు తిరుగుతున్నారు. జిల్లాకు గుక్కెడు నీళ్లివ్వని సింగూరు జలాశయంలో 72 ఊర్లు మునిగిపోయాయి. 42 వేల రైతాంగం తమ బతుకును త్యాగం చేశారు. ఈనేపధ్యంలోనే తాజాగా మల్లన్నసాగర్ తెరమీదకు వచ్చింది. సింగూరు అనుభవంతోనే మల్లన్నసాగర్ రైతాంగం భయపడుతోంది.. 25 టీఎంసీల సామర్థ్యం ఉన్న సింగూరు ప్రాజెక్టు 1976 ఫిబ్రవరి 15న కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డి.దేవ్రాజ్ శంకుస్థాపన చేశారు. 1986లో ప్రాజెక్టు పూర్తయ్యింది. మొదట 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు తరువాత మరో 5 టీఎంసీలకు అదనంగా పెంచారు. నిజానికి బీదర్ సమీపంలో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును అప్పటి కర్ణాటక అభ్యంతరం చెప్పటంతో సింగూరు వద్ద కట్టాలని నిర్ణయించారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా నిర్మించిన సింగూరు ప్రాజెక్టు కింద పుల్కల్, మునిపల్లి, ఝరాసంఘం, రాయికోడ్, న్యాల్కల్, మనూర్, న్యాల్కల్ మండలాల పరిధిలోని 49 గ్రామాలు పూర్తిగా, 23 గ్రామాలు పాక్షికంగా మునిగిపోయాయి. 42 వేల మంది రైతుల వద్ద నుంచి 37, 478 వేల ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించింది. మొదట 36 వేల ఎకరాలు సరిపోతాయని అంచనా వేసిన ప్రభుత్వం ఆ తరువాత మరో 1023 ఎకరాల తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రారంభం సమయంలో మెదక్ జిల్లాలో 40 వేల ఎకరాలకు సాగు నీళ్లు అందిస్తామని మాటిచ్చారు. అప్పట్లో ఎకరా భూమికి రూ.12,500 చొప్పున, ఇళ్లకు రూ 2000 నుంచి 3000 చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించింది. భూములు ఇవ్వబోమని ఎదరుతిరిగిన రైతులను బలవంతంగా ఈడ్చి వేసిందని, పోలీసులను పెట్టి కొట్టి బయటికి పంపారని అప్పటి ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. చెల్లించిన పరిహారానికి సంతృప్తి చెందని రైతులు తాము విలువైన భూములను కోల్పోయినందున అదనంగా చెల్లించాలని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టుకు తీర్పు వస్తే రైతులకు నష్టపరిహారం ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుందని భయపడిన ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనికి కూడా అంగీకరించలేదు. కనీసం ప్రస్తుతం నడుస్తున్న మార్కెట్ ధర ప్రకారమైన భూముల ధర కట్టివ్వాలని న్యాల్కల్, పుల్కల్ , మునిపల్లి, మండలాలకు చెందిన రైతులు ప్రస్తుతం నడుస్తున్న రేట్ల ప్రకారం విలువ చెల్లించాలని 5 సంవత్సరాల క్రితం రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇంకా కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కోర్టులో కేసు కొనసాగుతోంది. సింగూరు భయపెడుతోంది..... గోదావరి నదిపై కాళేశ్వరం కింద 50 టీఎంసీలతో నిర్మస్తున్న కొమరవెల్లి మలన్నసాగర్ కింద 5 గ్రామాలు పూర్తిగా 4 గ్రామాలు పాక్షికంగా మునిగిపోతున్నాయి. ప్రభుత్వం మొత్తం 20 వేల ఎకరాలను సేకరించే పనిలో పడింది. కానీ సింగూరు రైతుల అనుభవమే ఇప్పుడు మలన్నసాగర్ రైతాంగాన్ని భయపెడుతోంది. ముంపు గ్రామాల ప్రజలు తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని చెప్తున్నారు. మెరుగైన ప్యాకేజీ కోసమే తమ పోరాటం అంటున్నారు. చట్టాలు, ఉత్తర్వులతో తమకు పనిలేదని మంత్రి హరీశ్రావు మాట ఇస్తే చాలని చెప్తున్నారు. సింగూరు రైతుల మాదిరిగా తరాలతరబడి కోర్టుల చుట్టూ తిప్ప వద్దని వారు కోరుతున్నారు. ఒట్టేసి చెప్తున్నా.. రైతుల త్యాగానికి దండం పెడుతున్నా.. ముంపు ప్రజలకు ఏమిచ్చినా తక్కువే. వాళ్లను కడుపుల పెట్టుకొని చూసుకుంటా. సింగూరు ప్రాజెక్టు అనుభవాన్ని చూసి రైతులు భయపడటం సహజమే. 72 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 42 వేల మంది రైతులు భూములు కోల్పోయారు. కానీ రైతులకు ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. భూములు కోల్పోయిన వాళ్లంతా నష్టపరిహారం కోసం కోర్టు చుట్టూ తిరిగుతున్నారు. చట్టాలు, జీవోలు ఏం చెప్పినా సర్వం కోల్పోతున్న నిర్వాసితుల పట్ల ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఆలోచన చేసి వారికి అండగా నిలబడాలి. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టకుంటా. ఊరును పోలిన ఊరును కట్టిస్తా, ప్రాజెక్టు నిర్మాణంతో పాటే ఊళ్ల నిర్మాణం చేస్తాం. . ఎకరానికి దాదాపు రూ. 6 లక్షలు ఇస్తున్నాం. బోరు, చెట్టు, బావికి పైపు లైన్లు ఇలా ఏమి ఉంటే వాటికి కూడా అదనంగా నష్టపరిహారం కట్టిస్తున్నాం.. ఈ డబ్బు కూడా రైతులు భూములు రిజిసే్ట్రష¯ŒS చేసిన 15 నుంచి 20 రోజుల్లోనే డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ఇళ్లు కోల్పోతున్న వారికి రూ 5 .4 లక్షల నష్టపరిహారంతో(డబుల్ బెడ్రూంకు అయ్యే ఖర్చు) పాటు, కొత్త ఇళ్లు కట్టుకోవడానికి మరో రూ 5.4 లక్షల ఆర్థిక సహకారం అందిస్తున్నాం. మల్లన్న సాగర్లో చేపలు పట్టే హక్కులు ముంపు గ్రామాలకే ఇస్తాం. – హరీశ్రావు, భారీనీటి పారుదలశాఖ మంత్రి -
నాణ్యత నవ్వులపాలు!
మంత్రి పర్యవేక్షిస్తున్నా నాసిరకం పనులే కూలుతున్న సింగూర్ వరద కాల్వలు పుల్కల్: ఎలాగైనా సింగూర్ వరద కాల్వ పనులను ఈసారి పూర్తి చేయాలనే ఉద్దేశంతో స్వయంగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాల్వ పనుల ప్రగతి నివేదికను వాట్సాప్ ద్వారా తనకు ఎప్పటికప్పుడు మెసేజ్ చేయాలని ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ మధుసూదన్ రావుతో పాటు ఎస్ఈ సురేందర్ను ఆదేశించారు. అందుకు అనుగుణంగానే ఇరిగేషన్ శాఖ అధికారులు సింగూర్ వరద కాల్వ పనులను వేగవంతం చేయడంతోపాటు పర్యవేక్షిస్తున్నారు. కానీ అధికారులు వాహనాలు వెళ్లే ప్రాంతాల్లోనే జరుగుతున్న పనులను పరిశీలిస్తున్నారు. అటవీ ప్రాంతంతోపాటు పంట పొలాల్లో జరిగే పనులను మాత్రం అధికారులు పర్యవేక్షించలేకపోతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా స్ట్రక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇదేం క్యూరింగ్? సీసీ పనులు చేసిన ప్రతి చోటా కచ్చితంగా నీటితో క్యూరింగ్ చేయాలనే ఆదేశాలు ఉన్నా నీరు అందుబాటులో లేదనే సాకుతో నీరు పోయకుండానే వదిలేస్తున్నారు. దీంతో నిర్మించిన వెంటనే మట్టికుప్పల్లా విరిగిపోతున్నాయి. దీనికి పుల్కల్ మండల పరిధిలోని గొంగ్లూర్ శివారులో గతవారం నిర్మించిన కల్వర్టు నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ కల్వర్టును నాసిరకంగా నిర్మించడంతో అప్పుడే కూలిపోయింది. అదే కల్వర్టుకు కింది భాగంతోపాటు పైవరకూ పూర్తిగా బీటలు వారిన ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. ఇలా పుల్కల్ శివారులోని చిట్టెం చెరువు సమీపంలో ఇసుకతో కాకుండా రాతి పౌడర్తో నిర్మించడంతో పగుళ్లు వచ్చి పెచ్చులూడుతున్నాయి. పట్టించుకోని అధికారులు సింగూర్ వరద కాల్వలను కాంట్రాక్టర్లు నాసిరకంగా నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ప్రతి సందర్భంలో సింగూర్ వరద కాల్వల నిర్మాణంలో నిర్లక్ష్యం చేసినా, నాసిరకంగా పనులు చేసి నిర్మించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించినా అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై సింగూర్ డిప్యూటీ ఇంజనీర్ జగన్నాథంను వివరణ కోరగా కల్వర్టులు నాసిరకంగా నిర్మించడ వల్ల కూలడం లేదని, నీరు లేకపోవడంతో క్యూరింగ్ చేయడం లేదని, అందుకే ఎండ తీవ్రతకు బీటలు వారుతున్నాయని వివరణ ఇచ్చారు. అడవుల్లో నీరు అందుబాటులో లేనందునే క్యూరింగ్ చేయడం లేదని చెబుతున్న మాటలనుబట్టి కాంట్రాక్టర్లతో అధికారులు ఎలా కుమ్మక్కయ్యారో అర్థం చేసుకోవచ్చు. -
డేంజర్లో ‘సింగూరు’ డ్యామేజీ!
♦ రిజర్వాయర్ ఎండిపోవడంతో పగుళ్లు ♦ యుద్ధప్రాతిపదికన డ్యామ్ పటిష్టతను ♦ నిర్ధారించాలంటూ గేట్కు లేఖ ♦ మార్చిలో సింగూరు రానున్న నిపుణులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సింగూరు డ్యామ్కు ప్రమాదం పొంచి ఉంది. రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడంతో డ్యాంకు పగుళ్లు ఏర్పడి, నైబారే ప్రమాదం ఉందని సాగునీటి శాఖ అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం కేవలం 0.07 టీఎంసీల నీళ్లు మాత్రమే సింగూరులో ఉన్నాయి. డ్యాం పునాదుల వరకు నీళ్లు ఎండిపోయి సిమెంట్స్ బెడ్స్ బయటికి తేలాయి. పునాదుల వద్ద నీళ్లు లేకపోవడంతో మట్టి ఎండిపోయి క్రమంగా అది రాలిపోవడంతో రంధ్రాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. నీటి ప్రవాహం వచ్చినప్పుడు ఈ రంధ్రాల గుంగా నీళ్లు బయటికి కారిపోయి.. క్రమంగా పెద్ద పగుళ్లుగా మారి డ్యాం ఉనికిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోనళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన డ్యాం మరమ్మతు పనులను చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులు గేట్కు లేఖ రాశారు. 1977-78లో సింగూరు రిజర్వాయర్ రూపుదిద్దుకుంది. 30 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ఇప్పటి వరకు ఎండిపోలేదు. కనిష్ట నీటి మట్టం 10 టీఎంసీలు (డెడ్ స్టోరేజ్). గత ఏడాది ఫిబ్రవరి 19న డ్యాంలో 9 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి చుక్క నీరు కూడా చేరలేదు. ఉన్న నీటినే తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలోనే నీ టి నిల్వలు 0.09 టీఎంసీలకు చేరటం తో ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు నీటి సరఫరాను నిలిపివేశారు. కేవలం మెదక్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకే నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయింది. గుంతల్లో మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఏళ్ల తరబడి నీటి అలల తాకిడికి ప్రాజెక్టు పునాదుల వద్ద చిన్న చిన్న రంధ్రాలు పడతాయి. అయితే ఈ రంధ్రాల్లో వెంటనే ఒండ్రు మట్టి చేరిపోతుంది కాబట్టి డ్యాంకు ఎటాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అధికారులు డ్యాం పునాదుల వద్ద నిరంత రం నీళ్లు ఉండేటట్లు జాగ్రత్త పడతారు. ప్రస్తుతం నీళ్లు లేకపోవడంతో మట్టి ఎండిపోయింది. ఈ నేపధ్యంలో రంధ్రాల్లోని మట్టి రాలిపోతున్నట్లు, అక్కడక్కడ సిమెంటు గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. పటిష్టతపై లేఖ రాశాం.. ఇరిగేషన్ డిప్యూటీ ఇఇ జగన్నాథం: ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 0.07 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. నీళ్లు లేకపోవడం వల్ల ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయిన నేపథ్యంలో ప్రాజెక్టు పటిష్టతను పరిశీలించాలని కోరుతూ గేట్ డివిజన్ జనరల్ సూపరింటెండెంట్ గోవింద్కు లేఖ రాశాం. మార్చి తర్వాత హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా యంత్రాలను తెప్పించి, వాటి సహాయంతో ప్రాజెక్టు గేట్లు ఇతర నిర్మాణాల పటిష్టతను పశీలించి నివేదిక రూపొందిస్తారు. అవసరం అనుకుంటే గేట్లు, డ్యాంకు మరమ్మతు చేస్తారు. -
ఈ బురదనీళ్లు తాగలేం..
- గోదావరి జలాలపై పలు కాలనీల ప్రజల గగ్గోలు - నగరంలోని పలు కాలనీలకు గోదావరి జలాలు సరఫరా - నల్లాల్లో వస్తున్న బురద, మట్టితో కూడిన నీరు - కలుషిత నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్న జనం - కాంట్రాక్టరు నిర్లక్ష్యం.. అసంపూర్తిగా మల్లారం ఫిల్టర్బెడ్స్? - ప్లాంట్ల నుంచి ఫిల్టర్ నీళ్ల కొనుగోలుతో జనం జేబులకు చిల్లు - నీటి నాణ్యత సరిగాలేక సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో నిలిచిన ఆపరేషన్లు.. రోగుల ఆందోళన సాక్షి, హైదరాబాద్ నల్లా నీరు బురదమయంగా ఉంటోంది. విధిలేక ఫిల్టర్ ప్లాంట్లు విక్రయిస్తున్న నీటిని కొనుగోలు చేస్తున్నాం. డిమాండ్ అధికంగా ఉండడంతో ప్లాంట్ల నిర్వాహకులు 20 లీటర్ల నీటి క్యాన్ ధరను రూ.30 నుంచి రూ.40కి పెంచేశారు. తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నాం. - శారద, కూకట్పల్లి గోదావరి జలాలు బురదతో వస్తున్నాయి. ఈ నీటిని కాచి చల్లార్చి తాగాలని అధికారులు చెపుతున్నా.. ఎటువంటి ఉపయోగం ఉండటం లేదు. ఈ నీటిని తాగడం వల్ల చిన్నా, పెద్దా అంతా గొంతు నొప్పి, జలుబుతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాం. - లక్ష్మి, కుత్బుల్లాపూర్ గోదావరి బురద జలాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు నిదర్శనం వీరి మాటలు. నల్లాల్లో నిత్యం బురద, మట్టి కలసిన నీళ్లు సరఫరా అవుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఫిల్టర్ ప్లాంట్లు విక్రయిస్తున్న నీటిని కొనుగోలు చేయాలంటే జనం జేబులు గుల్లవుతున్నాయి. సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నీటిసరఫరా నిలిచిపోవడంతో నగర శివార్లలోని ఘన్పూర్ రిజర్వాయర్కు 56 మిలియన్ గ్యాలన్ల గోదావరి జలాలను తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఈ నీటిని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సనత్నగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని పలు కాలనీలు, బస్తీలకు అరకొర నీటి సరఫరాతోపాటు బురద, మట్టి రే ణువులు కలసిన జలాలు సరఫరా అవుతుండటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. బురద నీటి కారణంగా ఫిల్టర్నీటిని కొనుగోలు చేయాలన్నా.. నలుగురు సభ్యులున్న ఒక్కో కుటుంబం రోజుకు రూ.100 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అటు కుత్బుల్లాపూర్లో గోదావరి జలాలు సరఫరా అయి పక్షం రోజులు గడిచినా బురద నీళ్లే దిక్కయ్యాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు ఈ నీటిని తాగి అనారోగ్యాల బారినపడుతున్నారు. గోదావరి రింగ్ మెయిన్-1 పైపులైన్లను శుద్ధి చేసి మూడు రోజుల్లో స్వచ్ఛమైన నీటిని అందిస్తామని జలమండలి అధికారులు ప్రకటించినా.. ఆచరణలో విఫలమయ్యారు. కాంట్రాక్టరు నిర్లక్ష్యమే కారణం.. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివార్లలోని ఘన్పూర్ వరకు మొత్తం 186 కి.మీ మార్గంలో గోదావరి పైప్లైన్ పనులు పూర్తయ్యాయి. గోదావరి జలాలను శుద్ధి చేసేందుకు మల్లారం(కరీంనగర్ జిల్లా)లో ఉన్న నీటిశుద్ధి కేంద్రంలో 52 ఫిల్టర్బెడ్స్ ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం ఇందులో 17 మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. వీటిపైనే రోజువారీగా నగరానికి తరలిస్తున్న 56 ఎంజీడీల గోదావరి రావాటర్ను అరకొరగా శుద్ధి చేస్తున్నారు. దీంతో గోదావరి జలాల్లోని బురద, మట్టి రేణువులు, చెత్తాచెదారం పూర్తిస్థాయిలో తొలగడం లేదని తెలిసింది. 52 ఫిల్టర్బెడ్స్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసే విషయంలో సదరు కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇవి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే వరకు బురదనీళ్లతో జనానికి అవస్థలు తప్పే పరిస్థితి కనిపించడంలేదు. మరోవైపు బురద, మట్టి ఎక్కువ శాతం ఉండడంతో ఇళ్లల్లోని వాటర్ ఫిల్టర్లు చెడిపోతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం నగరానికి నీటి సరఫరా ఇలా.. నగరానికి రోజువారీగా ఉస్మాన్సాగర్(గండిపేట్) నుంచి 3.50 ఎంజీడీలు, హిమాయత్సాగర్ నుంచి 5.50 ఎంజీడీలు, కృష్ణా మూడు దశల నుంచి 259.35 ఎంజీడీలు, గోదావరి నుంచి 56 ఎంజీడీలు.. మొత్తంగా 324.35 ఎంజీడీల నీటిని నగరంలోని 8.64 లక్షల నల్లాలకు జలమండలి సరఫరా చేస్తోంది. సరోజినిదేవి ఆస్పత్రిలో నిలిచిన ఆపరేషన్లు హైదరాబాద్: సరోజిదేవి కంటి ఆస్పత్రికి నీటి సరఫరా బంద్ కావడంతో మూడు రోజులుగా శస్త్రచికిత్సలను నిలిపేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొందరు రోగులు శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో ప్రతి రోజూ 50 నుండి 60 మంది రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు. మూడు రోజుల నుంచి శస్త్రచికిత్సలు ఆగిపోవడంతో ఆపరేషన్లు చేయాల్సిన రోగుల సంఖ్య మూడు వందలకు చేరుకుంది. ఆస్పత్రిలో చేరిన రోగులకు శస్త్రచికిత్సలు చేయకపోవడంతో ఆపరేషన్లు చేసేటప్పుడు వేసే దుస్తులతోనే కొందరు రోగులు ఇంటిదారి పట్టారు. కాగా, ఆస్పత్రికి మూడు రోజులుగా నాణ్యత సరిగా లేని నీరు సరఫరా అవడంతో కాటరాక్ట్ ఆపరేషన్ల కోసం నగరంలోని నలు మూలల నుంచి వచ్చిన వారిని వెనక్కి పంపిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ వినోద్ ‘సాక్షి’కి తెలిపారు. అత్యవసర ఆపరేషన్ల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు మాత్రం ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. నాలుగు కనెక్షన్ల ద్వారా ఆస్పత్రికి సరఫరా అవుతున్న నీటి నాణ్యతను తెలుసుకునేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్కు నీటి నమూనాలు పంపించామని తెలిపారు. వారం తర్వాత రమ్మన్నారు.. ‘కనులు మసకబారడంతో గత నెలలో సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో చూపించుకున్నాను. ఈ నెల 9న శస్త్రచికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాను. దవాఖానాలో నీటి సమస్య ఏర్పడటంతో వారం తర్వాత రమ్మని డాక్టర్లు చెప్పడంతో ఇంటికి వెళ్తున్నా.’ - ఆషాం అలీ, అంబర్పేట -
సింగూరు వట్టిపోతోంది!
డెడ్ స్టోరేజీకి నీరు - 50 రోజులకు మించి నీటి సరఫరా కష్టమే - ప్రస్తుత నీటిమట్టం 1.8 టీఎంసీలే - వర్షాలు పడకుంటే ఇబ్బందే.. పుల్కల్: జిల్లాతోపాటు, జంటనగరాల తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన జలాశయమైన సింగూరులో పూర్తి స్థాయిలో నీటి మట్టం పడిపోయింది. ఈ నెలలో వర్షాలు కురవకుంటే జంటనగరాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోతుంది. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో సింగూర్ ప్రాజెక్ట్లోకి చుక్కనీరు చేరలేదు. గతేడాది ఇదే సమయంలో 11 టీఎమ్సీల నీటి నిల్వ ఉంది. ఈసారి (513.82 మీటర్లు) దారుణంగా 1.8 టీఎంసీలకు పడిపోయింది. జంట నగరాలతో పాటు సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు, గజ్వేల్, జోగిపేట, నర్సాపూర్, దుబ్బాక నియోజకవర్గాలకు ఇక్కడి నుంచే సత్యసాయి నీటి పథకం ద్వారా నీరు సరఫరా అవుతుంది. ప్రధానంగా సింగూరు దిగువన ఉన్న మంజీరా బ్యారేజ్లో ఇప్పటికే పూర్తిగా నీటి మట్టం తగ్గిపోయింది. దీంతో విడతల వారీగా సింగూర్ నుంచి ఆరు నెలలుగా మూడు టీఎంసీల నీటిని విడుదల చేశారు. కేవలం తాగు నీటి అవసరాలకు ఉపయోగించినా... సింగూర్ నీరు మరో యాభై రోజుల కంటే ఎక్కువ సరిపోవని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. మంజీరాలోకి కొత్త నీరు మనూరు: ఎగువనున్న కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా మంజీరా నదిలోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇన్నాళ్లు ఎండిపోయిన మంజీరా నదికి జీవం పోసినట్లు అవుతుందని పరీవాహక ప్రజలు అంటున్నారు. రెండు రోజులగా కురుస్తున్న వర్షాల వల్ల నదిలోని గుంతల్లో నీరు చేరిందని స్థానికులు తెలిపారు. పశువులకు కొంతమేర తాగునీటి సమస్య తీరిందని, భారీ వర్షం పడితే తప్ప మంజీరాకు పూర్వ వైభవం రాదంటున్నారు. గౌడ్గాం జన్వాడ నుంచి తోర్నాల్ వరకు మంజీరా పూర్తిగా అడుగంటింది. ఇరవయ్యేళ్లలా మంజీరా ఇంతలా ఎండి పోవడం ఇదే తొలిసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సింగూరుపైనే ఆశలు
జోగిపేట: సింగూరు.. జిల్లాలోనే పెద్ద ప్రాజెక్టు. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే జలాశయం. అంతేకాదు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యం గలసాగునీటి వనరు. దీన్ని గుర్తించే 2006 జూన్ 7న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 2 టీఎంసీల నీటిని సాగుకు మళ్లించి ఈ ప్రాంత రైతుల కష్టాలు తీర్చాలని భావించారు. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించారు. అయితే వైఎస్సార్ అకాల మరణానంతరం ఈ ప్రాజెక్టుపై ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో సింగూరు నీరు రైతన్నలను ఊరిస్తూనే ఉంది. కానీ జిల్లా రైతుల సాగునీటి కష్టాలు బాగా తెలిసి మంత్రి హరీష్రావు సింగూరుపై ప్రత్యేక దృష్టి సారించారు. బడ్జెట్లో నిధులు కేటాయించేలా చూడడంతో పాటు ఈ డిసెంబర్లో 10 వేల ఎకరాలను సింగూరు నీటితో తడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లిఫ్ట్ ద్వారా నీరందించేందుకు కసరత్తు ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత నీటి మట్టంగా 518.891 మీటర్లు ఉన్నట్టు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిర్ధారించారు. అందువల్ల ప్రస్తుతం ఈ నీళ్లను నేరుగా గేట్లు తెరిచి పంట పొలాలకు పంపించడం వీలుకాదు. కాబట్టి ప్రత్యేకంగా మోటార్లను ఏర్పాటు చేసి లిఫ్ట్ ద్వారా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇరిగేషన్ ఈఈ ఆత్మరాం ‘సాక్షి’కి తెలిపారు. లిఫ్ట్ వద్ద మోటార్ల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, రూఫ్షెడ్ వంటి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇరిగేషన్ శాఖ ఎస్ఈ శైలేంద్ర పనులను పరిశీలించారు. ఏదైనా సరే డిసెంబర్ మొదటి వారం వరకు 10 వేల ఎకరాలను సింగూరు నీరందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్లో రూ.13 కోట్లు తెలంగాణ రాష్ర్టం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సింగూరు ప్రాజెక్టుకు రూ.13 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రైతులకు బకాయిగా ఉన్న రూ.5 కోట్ల పరిహారం పంపిణీ చేయనున్నారు. ఇక మిగిలిన నిధులతో కాల్వల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. మంత్రి హరీష్రావు ప్రత్యేక చొరవ జిల్లాలోనే పెద్ద ప్రాజెక్టుగా ఉన్న ‘సింగూరు’ ద్వారా రైతులకు సాగునీరందించే విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారి జూలై 21నమంత్రి హరీష్రావు, స్థానిక శాసనసభ్యుడు పి.బాబూమోహన్తో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. అక్కడే ఇరిగేషన్ శాఖ రాష్ట్రఅధికారులతో సమావేశమై రబీలో 10 వేల ఎకరాలకు, వచ్చే ఖరీఫ్ నాటికి 40వేల ఎకరాలకు సింగూరు నీరందిస్తామని ప్రకటించారు. -
మంజీర.. ప్రాణాధార
మెతుకుసీమలో పరవళ్లు తొక్కుతూ.. పచ్చని పంటలకు ఊపిరి పోస్తున్న మంజీర.. ఇక ఇంటి తలుపు తడుతూ.. ప్రతిఒక్కరి గొంతూ తడిపే ప్రాణాధారంగా మారనుంది. రూ.5,400 కోట్ల అంచనా వ్యయంతో జిల్లాలో 447 కి.మీ. మేర పైప్లైన్ వేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు బృహత్ ప్రణాళిక ను సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ గ్రిడ్ సర్వే కోసం మంగళవారం రూ.105 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. * తీరనున్న జిల్లావాసుల దాహార్తి * ఇక ఇంటింటికీ సరఫరా.. * 447 కిలోమీటర్ల మేర పైప్లైన్లు * రూ. 5,400 కోట్ల అంచనా వ్యయం * అధికారుల బృహత్ ప్రణాళిక మెదక్: జిల్లాలో సుమారు 95 కిలోమీటర్ల మేర మంజీర నది ప్రవహిస్తున్నా గొంతెండుతున్న పల్లెలెన్నో ఉన్నాయి. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఫ్లోరైడ్ నీటినే తాగుతూ వేలాది మంది అభాగ్యులు వికలాంగులుగా మారుతున్నారు. మూడు పదుల వయస్సులోనే ముదుసలి వారిగా కనిపిస్తూ జీవచ్ఛవాలుగా బతుకీడుస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మంజీర నది, సింగూరు ప్రాజెక్టు జలవనరుల్లో మూడు గ్రిడ్లను ఏర్పాటు చేసి 447 కిలోమీటర్ల మేర 2,456 గ్రామాలకు తాగు నీరందించే పథకాన్ని రూపొందించారు. సింగూరు నుంచి ప్రతియేటా 8.8 టీఎంసీల నీటితో గ్రామీణులు ఒక్కొక్కరికి ఒక్కరోజుకు వంద లీటర్లు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఉండే ప్రజలకు 135 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ లెక్కన మెదక్, గజ్వేల్, సంగారెడ్డి వాటర్ గ్రిడ్లను విభజించనున్నారు. మెదక్ గ్రిడ్లో నారాయణ్ఖేడ్, అందోల్, దుబ్బాక నియోజకవర్గాలకు 201 కిలోమీటర్ల పైప్లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గానూ రాయికోడ్ మండలం రాయిపల్లి నుంచి సింగూరు బ్యాక్ వాటర్ను తీసుకుంటారు. అలాగే పుల్కల్ మండలం చక్రియాల్ శివారులోని మంజీరా ప్రాజెక్టు నుంచి గజ్వేల్ గ్రిడ్ పరిధిలోని నర్సాపూర్, గజ్వేల్ నియోజకవర్గాలకు తాగునీరందిస్తారు. ఇందుకోసం 96 కిలో మీటర్ల పైప్లైన్ వేస్తారు. ఇక సదాశివపేట మండలం ఎంఆర్ఎఫ్ వద్ద సింగూర్ ప్రాజెక్ట్ నుంచి సంగారెడ్డి గ్రిడ్ను ఏర్పాటు చేసి కుడి పైప్లైన్ ద్వారా జహీరాబాద్కు, ఎడమ పైప్లైన్ ద్వారా సదాశివపేట, సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లోని 150 కిలో మీటర్ల మేర పైప్లైన్ వేసి నీరందిస్తారు. మెదక్ గ్రిడ్ స్వరూపం.. మెదక్ గ్రిడ్ ద్వారా ప్రతిరోజూ 280 మిలియన్ లీటర్ల తాగునీరందిస్తారు. రాయిపల్లి బ్రిడ్జి వద్ద సింగూరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఈ గ్రిడ్ నిర్మించనున్నారు. దీని పక్కనే ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి వట్పల్లి గుట్ట మీద ఓహెచ్బీఆర్ ఏర్పాటు చేసి నీటిని పంపిణీ చేస్తారు. నారాయణఖేడ్, వట్పల్లి, టేక్మాల్, పాపన్నపేట మండలం కొత్తపల్లిలో సంపులు ఏర్పాటు చేస్తారు. మెదక్ వెల్కం బోర్డు నుంచి రాజ్పల్లి, చిన్నశంకరంపేట వరకు మరో లైన్ వేస్తారు. మెదక్ పట్టణంలో ఒక సంపు ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి శమ్నాపూర్కు పైప్లైన్ వేస్తారు. అనంతరం అక్కన్నపేట గుట్టమీద ఓహెచ్బీ ఆర్ ట్యాంక్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి దుబ్బాక నియోజకవర్గంలోని తిమ్మాపూర్, సిద్దిపేటలోని ఇర్కోడ్, సిద్దిపేట మున్సిపాలిటీల నుంచి చేర్యాల వరకు ఈ పైప్లైన్ కొనసాగుతుంది. ఇందుకో సం ప్లానింగ్ తయారు చేస్తున్నట్లు మెదక్ ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సురేష్ తెలిపారు. -
ఘనపురం చేరిన సింగూరు నీరు
పాపన్నపేట: సింగూరు నుంచి బుధవారం సాయంత్రం విడుదల చేసిన 0.25 టీఎంసీల నీరు శుక్రవారం ఘనపురం ప్రాజెక్టు చేరింది. ఎండి పోతున్న పంటలకు ప్రాణం పోసింది. ఘనపురం ప్రాజెక్టు కింద ఖరీఫ్ సీజన్లో రైతన్నలు సుమారు 20 వేల ఎకరాల్లో వరిపంట వేశారు. అయితే ఇప్పటి వరకు సింగూరు నుంచి 0.25 టీఎంసీల చొప్పున రెండు సార్లు నీటిని విడుదల చేశారు. గత 15 రోజుల నుంచి కరెంట్ కోతలు తీవ్రం కావడంతో రోజుకు రెండు మడులు కూడా తడవని పరిస్థితి నెలకొంది. తుఫాన్ ఫలితంగా వర్షాలు పడతాయని రైతులు ఆశించినప్పటికీ వాన జాడే కరువైంది. చాలా చోట్ల వరి పంటలు ఎండి పోయాయి. దీంతో స్పందించిన డిప్యుటి స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి 0.25 నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం 0.1 టీఎంసీ నీరు ఘనపురం చేరిందని, మరో 0.1 టీఎంసీ వచ్చే ఘనపురంలో చేరుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
పట్టాలి అరక.. దున్నాలి మెరక
వానలు లేవు. ఎండలు మండుతున్నయి. పంటలు మాడిపోయినయి. కరువు తరుముకొస్తోంది. తీరని దుఃఖంతో కొందరు రైతులు ఎండిన పంటలకు నిప్పు పెట్టిండ్రు. ధైర్యం సడలని మరి కొందరు రైతులు నిజాంసాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో ‘నాగేటి సాల్లల్లో నా తెలంగాణ.. నా తెలంగాణ’ అంటూ పంటల సాగుకు సమాయత్తమవుతుండ్రు. మనసుంటే మార్గం లేదని నిరూపిస్తుండ్రు. ఆశల వేటను ఆనందంగా సాగిస్తుండ్రు. సింగూరుతో ప్రమాదముందని తెలిసినా వారు ముందుకే ‘సాగు’తుండ్రు. - నిజాంసాగర్ క్యాచ్మెంట్ ఏరియా * శిఖం భూములలో నాగేటి సాళ్లు * దుక్కులు దున్నుతున్న రైతన్నలు * శనగ, మొక్కజొన్న విత్తుతున్నరు * ఊరును విడిచి, పట్టాభూములు వదిలి * ఆశల సాగుకు అన్నదాత అడుగులు నిజాంసాగర్: ఉన్న ఊరు.. పట్టా భూములను వదిలి శిఖం భూములలో అన్నదాతలు పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. వానలు ఆశిం చిన మేరకు కురవకపోవడంతో.. నీళ్లులేక నల్ల రేగడి మట్టి తేలిన నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖం భూములలో ఆరుతడి పంటలను వే స్తున్నారు. వారం రోజుల నుంచి ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాల లో నాగటి సాల్లు జోరందుకున్నాయి. అరక చేతపట్టిన రైతన్నలు శిఖం భూముల్లో శనగ, జొన్న విత్తనాలు చల్లుతున్నారు. మంజీరా నదిపై ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు ప్ర స్తుతం నీళ్లులేక బోసి పోయి ఉన్నా, పచ్చని పంటల సాగుకు నిలయం కానుంది. నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన రైతులు ఇక్కడ శనగ, జొన్న పంటలను సాగు చేస్తున్నారు. వేల ఎకరాలలో నీటి నిల్వ సామర్థ్యంతో విస్తరించిన ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా అపరాల సాగుకు దోహదపడుతోంది. ఖరీఫ్ సీజన్లో వానలు కురవక పోవడంతో ఖరీఫ్ పంటలను నష్టపోయిన రైతులు రబీ పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. ఉపాధి కోసం అన్వేషిస్తున్న రైతులు పట్టాభూములలో పంటలు వేయలేక శిఖం భూములను ఆశ్రయించారు. మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, కల్హేర్, శంకరంపేట, పాపన్నపేట మండలాలకు చెందిన వందలాది మంది రైతులు శిఖం భూములలో పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్ మండలాలకు చెందిన రైతులు ప్రాజెక్టులో శనగ, జొన్న పంటల సాగుకు సమాయత్తమయ్యారు. ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు శిఖం భూములలో హద్దులను ఏర్పాటు చేసుకున్నారు. నాగళ్లు, ట్రాక్టర్ల ద్వారా భూములను దుక్కి చేసి శనగ, జొన్న విత్తనాలను విత్తుకుంటున్నారు. ప్రాజెక్టు పరిధిలోని సుమా రు 300 ఎకరాలలో పంటలను సాగు చేస్తున్నారు. సింగూరు నీరొస్తే మునిగినట్టే... నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో శిఖం భూములలో రైతులు పండిస్తున్న శనగ, జొన్న పంటలకు సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రమాదం కూడా పొంచి ఉంది.సాగర్ ఆయకట్టు కింద పండిస్తున్న పంటల కోసం, ఒక వేళ సింగూరు ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్కు నీటి విడుదల చేస్తే శిఖం భూములు మునిగిపోతాయి. రైతన్నలు ఆశతో సాగు చేస్తున్న పంటలు సైతం నీటి పాలవుతాయి. అయినా కుటుం బపోషణ కోసం ధైర్యం చేసి వేల రూపాయలు ఖర్చు చేస్తూ పంటలను సాగు చేస్తున్నారు. కరువును జయించేందుకు కర్షకులు పడరాని పాట్లు పడుతున్నారు. -
నట్టింట్లోకి నల్లా
సాక్షి, సంగారెడ్డి : గుక్కనీటికోసం తండ్లాడుతున్న మెతుకుసీమ వాసుల కష్టాలు తీర్చేందుకు సర్కార్ సన్నద్ధమైంది. ప్రతి పల్లెకు రక్షిత మంచినీరు అందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు వీలుగా జిల్లా వాటర్గ్రిడ్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్ ప్రకాశ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో తయారవుతున్న జిల్లా వాటర్గ్రిడ్ డీపీఆర్ (డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) మరో వారంరోజుల్లో సిద్ధం కానుంది. ప్రతి వ్యక్తికి రోజుకు 100 నుంచి 70 లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు వీలుగా సుమారు రూ.3,500 కోట్ల వ్యయంతో జిల్లా వాటర్ గ్రిడ్ ప్రణాళికను అధికారులు రూపొందిస్తున్నారు. మెదక్ జిల్లాలోని పది నియోజవకర్గాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాలకు సైతం తాగునీటి సరఫరా అందించేందుకు వీలుగా వాటర్గ్రిడ్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మొత్తం మూడు దశల్లో వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. వాటర్గ్రిడ్ కోసం సింగూరు నుంచి సుమారు 9 టీఎంసీల మంజీర జలాలు అవసరమవుతాయని అంచనా. సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా జలాల కేటాయింపుపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు త్వరలో నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావటం, భారీనీటిపారుదల శాఖా మంత్రి హరీష్రావు సైతం మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో వాటర్గ్రిడ్కు మంజీర జలాల కేటాయింపులో సమస్యలు తలెత్తకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. మూడు దశల్లో వాటర్గ్రిడ్ జిల్లాలో మూడు దశల్లో వాటర్గ్రిడ్ ఏర్పాటు కానుంది. మొదట మెయిన్ గ్రిడ్ ఆ తర్వాత మండలాల్లో సబ్గ్రిడ్ను ఏర్పాటు చేస్తారు. సబ్గ్రిడ్ నుంచి గ్రామాలకు పైప్లైన్లు వేసి ఆతర్వాత పల్లెల్లో ఇంటింటికి తాగునీటి కనెక్షన్లు ఇస్తారు. వాటర్గ్రిడ్ ద్వారా జిల్లాలోని 2,456 గ్రామాలు, ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు తాగునీటిని సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 28 తాగునీటి పథకాల ద్వారా 822 గ్రామాల్లోని 10.71 లక్షలకుపైగా జనాభాకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. మరో 842 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ పథకాలను సిద్ధం చేస్తోంది. ఇంకా 792 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న తాగునీటి పథకాలు, నిర్మాణంలో ఉన్న పథకాలతోపాటు మొత్తం జిల్లాలోని 2,456 గ్రామాల్లోని 26.95 లక్షల మంది జనాభాకు వాటర్గ్రిడ్ ద్వారా రక్షిత మంచినీటి సరఫరా చేయనున్నారు. ప్రత్యేక అధికార వ్యవస్థ జిల్లా వాటర్గ్రిడ్ నిర్మాణం, నిర్వహణ నిర్వహణ పనుల కోసం ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజనీరును నియమించటంతోపాటు ఐదుగురు ఈఈలు, రెండు మండలాలకు ఒకరు చొప్పున డిప్యూటీ డీఈలు మండలానికి ఒకరు చొప్పున ఏఈ, ఇద్దరు వర్క్ఇన్స్పెక్టర్లు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి సూచించనున్నారు. -
ఘనపురానికి సింగూరు నీరు
మెదక్: సింగూర్ నీటికోసం ఘనపురం రైతులు గతంలోలాగా ఆందోళన బాట పట్టలేదు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగలేదు. నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు. కానీ సింగూరు నీరు మంజీరకు చేరుతోంది. ఆయకట్టు రైతుల మోములో ఆనందం కనిపిస్తోంది. రైతుల సాగునీటికష్టాలు ముందుగానే ఊహించిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఘనపురం రైతుల గోడును ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావుల దృష్టికి తీసుకెళ్లారు. వారం రోజులుగా సాగునీటి విడుదల కోసం తీవ్రంగా కృషి చేశారు. ఫలితంగా బుధవారం సాయంత్రం సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 0.25 టీఎంసీ నీటిని మంజీరకు వదిలారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ ఈఈ జ్ఞానేశ్వర్ ధ్రువీకరించారు. సాగునీటి కోసం ఏటా పోరాటమే 1905లో నిర్మించిన ఘనపురం ప్రాజెక్ట్ కింద సుమారు 30 వేల ఎకరాల సాగుభూమి ఉంది. ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్ట్ నుంచి న్యాయంగా 4 టీఎంసీల నీరు రావాలి. అయితే శాశ్వత జీఓ లేకపోవడంతో ప్రతి సంవత్సరం పంట పొలాల అవసరాలకనుగుణంగా రైతన్నలు సాగునీటి కోసం పోరుబాట పట్టాల్సి వచ్చేది. ఈ ఏడు ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఎట్టకేలకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి కృషితో ఆగస్టు నెలలో 0.3 టీఎంసీల నీరు విడుదలైంది. అయినప్పటికీ ఘనపురం ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండలేదు. ఉన్న నీటికి వరదనీరు, వర్షాలు తోడు కావడంతో సుమారు 20 వేల ఎకరాల్లో రైతన్నలు వరి పంటలు వేశారు. ఆగస్టు మధ్యలో కురిసిన అడపా దడపా వర్షాలతో వరి పంటలు ఇంతకాలం గట్టెక్కాయి. చాలాచోట్ల వరి పంట నిండు పొట్టతో ఉండగా, మరికొన్ని చోట్ల ఈనుతోంది. ఇంకొన్ని చోట్ల రెండో కలుపు దశలో ఉన్నాయి. అయితే వారంరోజులుగా పంటలకు నీరందని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు ప్రతి నీటిబొట్టుకోసం రాత్రింబవళ్లు పంట పొలాల వద్దే జాగరణ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఎట్టకేలకు అధికారులు బుధవారం సాయంత్రం సింగూర్ నుంచి 0.25 టీఎంసీ నీటిని మంజీర బ్యారేజీలోకి వదిలారు. అక్కడి నుంచికూడా నేడో, రేపో ఘనపురం ఆనకట్టకు నీరు విడుదల చేసే ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు. ఇరిగేషన్ ఈఈ ఇచ్చిన ఉత్తర్వులు, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు చేరగానే ఈ నీరు విడుదలవుతుందని తెలిపారు. కాగా ప్రస్తుతం విడుదల చేసిన నీటికితోడు మరో 0.5 టీఎంసీ నీరు విడుదల చేస్తే ఖరీఫ్ గట్టెక్కుతామని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
వరినారుకు ఊపిరి
మెదక్: వాడుముఖం పట్టిన వరినారుకు సింగూర్ నీళ్లు ఊపిరి పోశాయి. కలబ్గూర్ డ్యాం నుంచి శనివారం సాయంత్రం విడుదల చేసిన 0.25 టీఎంసీల నీరు మంగళవారం ఘనపురం ఆనకట్టకు చేరుకుంది. ఘనపురం ఆనకట్ట ఎత్తు 8 అడుగులు కాగా, మంగళవారం సాయంత్రానికి 6.5 అడుగుల మేర నీరు చేరింది. జెడ్పీ చైర్పర్సన్రాజమణి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్రెడ్డి, ఆర్డీఓ వనజాదేవిలు ఎం.ఎన్.కెనాల్కు, వర్క్ ఇన్స్పెక్టర్ శంకర్, ఆయకట్టు టీసీ బాబార్ పటేల్ ఎఫ్ఎన్ కెనాళ్లకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడు ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురవక పోవడంతో ఘనపురం ఆయకట్టు పరిధిలోని 30 వేల ఎకరాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో వరినార్లు వేసుకున్న కొంతమంది రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి చొరవతో మంత్రి హరీష్రావు ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి సింగూర్ నుండి 0.25 టీఎంసీల నీటిని ఘనపురం ఆనకట్టకు విడుదల చేయించారు. ఈ మేరకు మంగళవారం ఘనపురం ఆనకట్టలోకి 6.5 అడుగుల నీరొచ్చింది. అయితే మంగళవారం రాత్రిలోగా నీటిమట్టం మరింత పెరగవచ్చని ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ సురేష్బాబు తెలిపారు. ఆనకట్ట పొంగిపొర్లితే ఆనకట్ట రైతులకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇరిగేషన్ అధికారులు ఫతేనహర్, మహబూబ్నహర్ కెనాళ్లకు నీటిని విడుదల చేశారు. నీరు విడుదలైనా..నిరాశే ఖరీఫ్ కాలం కరిగి పోతున్నా, ఇంతవరకు ఆశించిన వర్షాలు పడలేదు. మరోవైపు ధైర్యం చేసి వరి తుకాలు వేసిన రైతులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. దీంతో సింగూరు నీరు విడుదల చేయాలని ఘనపురం ఆయకట్ట రైతులు విజ్ఞప్తి చేశారు. కానీ ఇపుడు వరి తుకాలకు నీరు విడుదల చేస్తే, తర్వాత వర్షాలు పడక పోతే పరిస్థితి ఏంటన్న ఉద్దేశంతో అధికారులు సందిగ్ధంలో పడిపోయారు. ఇదే సమయంలో డిప్యూటీ స్పీకర్, మంత్రి హరీష్ చొరవ చూపడంతో సింగూరు నుంచి నీరు విడుదలైంది. ఈ నీటితో ఘనపురం ప్రాజెక్టు ఎగువన ఉన్న రైతులకు అందరి కన్నా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. మంజీరా నదిలో ఉన్న మడుగులు నిండటం ద్వారా అక్కడి రైతులు ఖరీఫ్ గట్టెక్కే పరిస్థితి ఏర్పడింది. కానీ ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాళ్ల పరిధిలోని చివరి ఆయకట్టు దారులకు మాత్రం నీరందని పరిస్థితి నెలకొంది. అలాగే ప్రాజెక్టు దిగువన ఉన్న రైతులకు కూడా ఎలాంటి ప్రయోజనం కలగటం లేదు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో 11.87 టీఎంసీల నీరుంది. గత ఏడు ఈ సమయానికి కేవలం 3.2 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుత నీటితో కొంత మేర వరి నాట్లు పూర్తవుతాయని, అవసరమైతే మరో మారు సింగూరు నుంచి నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. -
సింగూరు నీటి కోసం ఎదురుచూపులు
పాపన్నపేట: సింగూరు నీటి కోసం ఘనపురం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రాజెక్టు నుంచి నీరు వదిలి నాలుగు రోజులైనా.. ఇప్పటికీ నీటి జాడలేక పోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. గత బుధవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి సింగూరు నుంచి 0.25 టీఎంసీల నీటిని వదిలారు. అయితే ఆ నీరు దిగువన ఉన్న కలబ్గూర్ డ్యాంలో నిల్వ ఉండిపోయాయి. ఈ మేరకు శనివారం రాత్రి ఇరిగేషన్ అధికారులు 0.25 టీఎంసీ నీటిని దిగువకు వదిలినట్లు తెలిసింది. అయితే ఈనీరు 24గంటల తరువాతే ఘనపురం ఆనకట్టను చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ డిప్యూటీఈఈ సురేష్బాబు తెలిపారు. నాలుగు రోజులుగా చినుకులు జాడలేక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పాపన్నపేట మండలంలో జోరుగా వరినాట్లు కొనసాగుతున్నాయి. సింగూరు నీటిపై ఆశతో ఘనపురం ఆయకట్టు పరిధిలోని రైతులు సైతం వరినాట్లకు సన్నద్ధమయ్యారు. దీంతో సింగూరు నీరు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా నాట్లు వేస్తేనే పంట దిగుబడి ఆశించినస్థాయిలో వస్తుందని, ఆలస్యమైతే దిగుబడి తగ్గిపోతుందని దిగాలుప డుతున్నారు. -
‘మంజీరా’లో సింగూరు నీటి నిల్వలు
నిజాంసాగర్, న్యూస్లైన్: మెదక్ జిల్లాలోని సింగూరు జలాశయం నుంచి విడుదల చేసిన జలాలు మంజీరా నదిలో నిల్వలున్నాయి. నిజాంసాగ ర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలను గట్టెక్కించడానికి సిం గూరు ప్రాజెక్టు నుంచి నాలుగు టీఎంసీల నీటి విడుదలకు ప్రభుత్వం అనుమతిని చ్చింది. దీంతో సింగూరు జలాశయం నుంచి గత నెల 26న టర్బయిన్ల ద్వారా 28న వరదగేట్ ద్వారా 9,000 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువనకు వదిలారు. ఐదు రోజుల పాటు సింగూరు జలాశయం ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్టు కోసం నాలుగు టీఎంసీల నీటిని వదిలారు. ఈ నెల ఒకటి వరకు నీటివిడుదల పూర్తవడంతో వరదగేటు, టర్బయిన్ల ద్వారా నీటిని నిలిపివేశారు. ప్రస్తుతం సింగూరు జలాశయంలో 520.780 మీటర్లతో 17.492 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మట్టి దిబ్బలతో ప్రవాహానికి బ్రేకులు సింగూరు జలాశయం నుంచి వదిలిన జలాలు మంజీరా నదిలో నిల్వలున్నాయి. సింగూరు ప్రాజెక్టు- నిజాంసాగర్ ప్రాజెకు మధ్య సుమా రు 95 కిలోమీటర్ల దూరం ఉంది. సింగూరు జలాశయం నుంచి వదిలిన జలాలు మంజీరా నదిలో ప్రవహిస్తుంటాయి. మంజీరా నదిలో మట్టిదిబ్బ లు, తుమ్మపొదలు, గుంతలు ఎక్కువగా ఉండటంతో నీటిప్రవాహానికి బ్రే కులు పడుతున్నాయి.దీంతో మంజీరా నదిలో నీటినిల్వలు అధికంగా పేరుకుపోతున్నాయి. దానికి తోడు మంజీర నది పై భాగంలో రైతులు వ్యవసాయ పంపుసెట్లను ఏర్పాటు చేసుకొని నదినీటి ద్వారా పంటలు పండించుకుంటున్నారు. ఇందుకు కోసం మంజీరా నదిలో నీరు నిల్వ ఉండేలా వారు గుంతలను తీసుకున్నారు. దీంతో మంజీరా నది నీటి ద్వారా వందల పంపుసెట్లు వేల ఎకరాల పంటలకు నీరందిస్తున్నాయి. ‘సాగర్’లో చేరింది 2.77 టీఎంసీల నీరు సింగూరు జలాశయం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయగా ఇప్పటివరకు 2.77 టీఎంసీలు వచ్చి చేరింది. రెండు ప్రాజెక్టుల మధ్య ఉన్న మంజీరా నదిలో సుమారు 1.2 టీఎంసీల నీ రు నిల్వ ఉంది. సింగూరు జలాశయం నుంచి నాలుగు టీంసీలకు వదిలినా పూర్తిస్థాయిలో నీరు చేరకపోవడంతో ఆయకట్టు ప్రాంత రైతులు ఆం దోళన చెందుతున్నారు. మంజీరా నది ప్రాం తంలో ఉన్న దిబ్బలు, ముళ్లపొదలను తొలగించాలని జిల్లా యంత్రాంగాన్ని స్థానిక రైతాంగం కోరినా పట్టించుకున్న దాఖలాలు లేవు. వర్షాకాలంలో వరదలు వచ్చిన సమ యంలో మంజీరా నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న పంటపొలాల్లోకి నీరు వచ్చిచేరడంతో పంటలను రైతులు నష్టపోతున్నారు. అంతేకాకుండా సింగూరు జలాశయం నుంచి నీటిని వదిలిన ప్రతిసారి పూర్తిస్థాయిలో నీరు చేరకపోవడంతో ఆయకట్టు ప్రాంత రైతులు సాగు జలాలను నష్టపోతున్నారు. -
సింగూరు జలాల విడుదల
నిజాంసాగర్, న్యూస్లైన్ : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మెదక్ జిల్లాలోని సింగూరు జలాశయం నుంచి టర్బయిన్ గేట్ ద్వారా శనివారం ఉదయం 1,360 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వరద గేట్ల ద్వారా 10 వేల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేయనున్నారు. ఏడుపాయల దుర్గామాత ఉత్సవాలు, ఘనపూర్ ఆనకట్ట అవసరాల కోసం సింగూరు జలాశయం ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు టర్బయిన్ గేట్ ద్వారా వదులుతున్న నీరు మంజీర నదిలో ప్రవహిస్తోంది. అందులో భాగంగానే నిజాంసాగర్ ప్రాజెక్టుకు 7 టీఎంసీల నీటిని సింగూరు జలాశయం వరద గేట్ల ద్వారా వదలనున్నట్లు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు, ఆయకట్టు పంటల అవసరాల కోసం సింగూరు జలాశయం నుంచి నీటి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రి సుదర్శన్రెడ్డి ఒప్పించారు. ప్రభుత్వం మెమో విడుదల చేసి పదిహేను రోజులైనా సింగూరు ప్రాజెక్టు అధికారులు మాత్రం జలాశయం నుంచి నీటిని విడుదల చేయలేదు. మరోసారి జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఎట్టకేలకు జలాలు విడుదలకానున్నాయి. సింగూరు ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయనుండటంతో మంజీర పరీవాహక ప్రాంతానికి రైతులు,పశువుల కాపరులు వెళ్లవద్దని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం సింగూరు జలాశయంలో 522.339 మీటర్లతో 23.277 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1,398.88 అడుగులతో 10.189 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
సింగూరు నుంచి సాగర్కు నీరు
రెంజల్, న్యూస్లైన్ : సింగూరు ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీల నీటిని నిజాంసాగర్కు విడుదల చేయనున్నట్లు భారీ నీటి పారుదల మంత్రి పి సుదర్శన్రెడ్డి వెల్లడించారు. సాగర్ ఆయకట్టు కింద వేసిన పంటలకు చివరి వరకు సాగు నీరందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చివరి ఆయకట్టు గ్రామాలకు నీరందని పక్షంలో త్రీఫేస్ కరెంట్ను 7 గంటల పాటు నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తామన్నారు. రెంజల్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాం జలి ఘటించారు. గ్రామంలో మంచినీటి ట్యాంకు పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడు తూ మార్చి వరకు పంటలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. రైతులు పంటల మార్పిడి విధానం పాటించాలని, తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే ఆరుతడి పం టలను సాగుచేయాలని సూచించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోందన్నారు. గతంలో టీడీపీతో పాటు కాంగ్రెస్కు చెందిన సీమాంధ్రులు అసెంబ్లీలో తీవ్రంగా వ్యతిరేకించడంతో తెలంగాణపై నిర్ణయంలో జాప్యం జరిగిందన్నారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు, సీమాం ధ్రలో 25 పార్లమెంటు స్థానాలున్నా... ఓట్లు, సీట్ల కోసం కాకుండా ఇక్కడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఇచ్చిందన్నారు. చదువుకునే రోజుల్లో తాను సైతం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెల్లినట్లు మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని పార్టీల నేతలను కలిసి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదన్నారు. ప్రజల మనిషినే ఎన్నుకోండి.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడి వారి బాగోగులు పట్టించుకునే వారినే గుర్తించి ఎన్నుకునాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు వచ్చే దిగుమతిదారులను ప్రజలు నిరాకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతో పాటు తాను కూడా సమస్యలు పరిష్కరించలేదని భావిస్తే ఆలోచించి ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు సవిత, జావీద్, ఖలీంబేగ్, తెలంగాణ శంకర్, రమేష్, లక్ష్మణ్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం, విం డో చెర్మైన్లు సాయరెడ్డి, అహ్మద్బేగ్, నాయకులు మొబిన్ఖాన్, భూమన్న, మోహన్, ఎఖార్, హాజీఖాన్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
సింగూరు ఎత్తిపోతలలో మరో మాయ!
జోగిపేట, న్యూస్లైన్: ‘సింగూరు ఎత్తిపోతల’పై మరో మాయ జరుగుతోంది. కాల్వల తవ్వకాలు, నిర్మాణంలో మాస్టర్ ప్లాన్ను పక్కన పెట్టి పాత కాల్వల గుండా, పంట పొలాల మీద నుంచి అడ్డుగోలుగా నీళ్లు పారిస్తున్నారు. నీళ్లును ఆందోల్ పెద్ద చెరువుకు తరలించాలనే ఏకైక లక్ష్యంతో అధికారులు, కాంట్రాక్టర్లు తాత్కాలిక కాల్వలు ఏర్పాటు చేసి నీళ్లు పారించే కార్యక్రమాన్ని ‘మమ’ అనిపించారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ వారం రోజుల కిందట ఆర్భాటంగా ప్రారంభించిన సింగూరు జలాల ట్రయల్న్ ్రవికటించి పంట పొలాల మీదకు నీళ్లు మళ్లిన విషయం తెలిసిందే. మూడు గేట్లను అడుగు లోతుకు లేపి నీళ్లు వదలటంతో ఆ వేగానికి తట్టుకోలేక అసంపూర్తిగా కట్టిన కాల్వలు ఎక్కడికక్కడా తెగిపోయాయి. పాలకుల ఆతృతను రైతులు, ప్రతిపక్షాలు విమర్శించారు. పోయిన పరువు నిలబెట్టుకోవడం కోసం అటు పాలకులు, ఇటు అధికారులు, కాంట్రాక్టర్లు మూడు రోజులుగా కాల్వల వెంట తిరిగి వాటి నాణ్యత పరిశీలించారు. కాల్వ గుండా నీళ్లు పారించడం సాధ్యం కాదని నిర్ధారించుకున్న తరువాత ప్రాజెక్టు కాల్వ మాస్టర్ ప్లాన్ను పక్కన పడేశారు. డాకూర్, మాసానిపల్లి గ్రామాల మధ్యన ఉన్న కట్టుకాలువను తవ్వేశారు. ఇవి నిజాం కాలం నాటి కట్టు కాల్వలు. రైతుల పొలాల్లోంచి మట్టి తోడి గట్టుపోసి తాత్కాలికంగా కొత్త కాల్వలు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నుంచి నీటి వేగాన్ని పూర్తిగా తగ్గించి కొద్దికొద్దిగా కాల్వలకు నీళ్లు వదిలారు. ఈ ప్రయత్నం కూడా వికటించింది. ఆందోల్ చెరువకు వెళ్లాల్సిన నీళ్లు డాకూర్ చెరువులోకి వెళ్లాయి. ఓ రాత్రంతా నీళ్లు చెరువులోకి పారాయి. నిజాం కాలం నాటి కట్టుకాల్వను తవ్వేయడాన్ని మాసానిపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖ అధికాారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో భయపడిన నీటిపారుదల శాఖ అధికారులు అఘమేఘాల మీద డాకూరు చెరువుకు వెళ్లే కాల్వను మూసి వేశారు. చెరవు నిండగానే తవ్విన కాలువను పూడ్చివేస్తామనే షరతు మీద తాత్కాలికంగా ఓ కాల్వను తవ్వేసి దాని ద్వారా మాసానిపల్లికి చెందిన కాల్వల మీదుగా అందోల్ చెరువులోకి నీరును పారించారు. వాస్తవానికి 3 రోజుల్లోనే ఆందోల్ చెరువు నిండి అలుగు పోస్తుందని వేదిక మీద నుంచి డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఆందోల్ మండలంలో మూడు చెరువులు, పొల్కల్ మండలంలో 5 చెరువు నింపుతామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం గేట్లను కొద్దిగా మాత్రమే తెరిచి పోట్టారు. తాత్వాలికంగా కట్టిన కాల్వలకు ఏమాత్రం ఒత్తిడి లేకుండా నీటి ప్రవాహం సాగేటట్టు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం సాగుతున్న ప్రవాహ వేగాన్ని పట్టి చూస్తే పెద్ద చెరువు నిండటానికి కనీసం 10 రోజుల వరకు పట్టే అవకాశం ఉంది. మిగిలిన చెరువులు ఎప్పడు నింపుతారో..! ఇంకెన్ని తిప్పలు పెడతారో అధికారులకే తెలియాలి. -
ఒక్కరోజు ముచ్చటే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డిప్యూటీ సీఎం అట్టహాసంగా ప్రారంభించిన సింగూరు ఎత్తిపోతల పథకం ఒక్కరోజు ముచ్చటగా మిగిలిపోయింది. సిరులు పండించాల్సిన సింగూరు నీరు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. సాక్షి చెప్పినట్టుగానే అసంపూర్తిగా నిర్మించిన కాల్వలు నీటి ప్రవాహ ఉధృతికి తట్టుకోలేక ఎక్కడికక్కడ తెగిపోయాయి. దీంతో నీటి ప్రవాహ దిశ మారి పంట పొలాలు నీటమునిగాయి. నీటి ప్రవాహ దిశను ఆందోల్ చెరువు వైపునకు మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అధికారులు గేట్లు మూసివేశారు. ఎక్కడిక్కడ తెగిపోయిన కాల్వలు డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహ గురువారం మధ్యాహ్నం సింగూరు జలాల ట్రయల్న్న్రు ప్రారంభించగా, అధికారులు ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాల్వ గుండా అందోల్ చెరువుకు నీళ్లు వదిలారు. 12 గంటల పాటు పారిన నీరు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందోల్ మండలం మాసానిపల్లి వరకు చేరింది. అయితే మాసానిపల్లి నుంచి ప్రధాన కాల్వ లేకపోవడం తో అధికారులు పిల్ల కాల్వల్లోకి సింగూరు నీటిని మళ్లిం చారు. ఈ పిల్ల కాల్వలు కూడా అసంపూర్తిగానే ఉండటంతో నీటి ప్రవాహ ఉధృతి తట్టుకోలేక కాల్వలు ఎక్కడికక్కడ తెగిపోయాయి. నీళ్లు పంట పొలాలు, బీడు భూముల్లోకి ప్రవహించాయి. గురువారం రాత్రంతా సింగూరు జలం వృథాగానే పోయింది. శుక్రవారం ఉదయం గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం చేరవేశారు. వెంటనే రంగప్రవేశం చేసిన కాంట్రాక్టర్లు కాల్వలకు మరమ్మతులు చేసే ప్రయత్నం చేశారు. జేసీబీలను తెప్పించి కాల్వల మధ్యలో నిర్మించిన సిమెంట్ దిమ్మెలను ధ్వంసం చేశారు. అనంతరం కట్టలు తెగిపోయిన చోట మట్టితో పూడ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో నీరు మాసానిపల్లికిచెందిన కొమరయ్య అనే రైతు వరి పొలం మీదగా పారి డాకూరు కట్టు కాల్వల్లోకి మళ్లింది. దీంతో కొరమయ్యకు చెందిన 4 ఎకరాల వరిపంట పూర్తిగా నీట మునిగింది. మరోవైపు డాకూరుకుకట్టుకాల్వలోకి భారీగా నీరు చేరడంతో ఆప్రాంతంలోని కాల్వకు పలుచోట్ల గండిపడింది. గేట్లు మూసివేత అందోల్ పెద్ద చెరువు వైపు వెళ్లాల్సిన సింగూరు నీరు దిశ మారి పంటపొలాల మీద ప్రవహిస్తుండటంతో ఏం చేయాలో తోచక అధికారులు తలపట్టుకున్నారు. ప్రవాహ ఉధృతి ఇలాగే కొనసాగితే సమీప గ్రామాలు నీటమునగడం ఖాయమని నిర్ధారించుకున్న ఆధికారులు ముందు జాగ్రత్త చర్యగా సింగూరు గేట్లు మూసివేశారు. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీడు భూములను సస్యశ్యామలం చేస్తుందనుకున్న సింగూరు జలం రైతన్నల రెక్కల కష్టాన్ని వృథా చేసింది. కాల్వల నిర్మాణం పనులు పూర్తి కాకముందే నీళ్లు వదలటం వల్లే ఈ పరిస్థితి తె లెత్తింది. దీంతో ‘సింగూరు’ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం మరో ఏడాది గడిస్తే తప్ప రైతన్నలకు సింగూరు నుంచి నీళ్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది. -
సాకారం కాబోతోన్న స్వప్నం
జోగిపేట, న్యూస్లైన్: అందోల్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. సింగూరు జలాలను సాగుకు అందించేందుకు రంగం సిద్ధమైంది. గురువారం ‘సింగూరు’ ట్ర యల్న్న్రు డిప్యూటీ సీఎం ప్రారంభించనుండడంతో ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు సాగునీటికి ఇబ్బందులుండవనీ, సింగూరు జలాలలో ప్రాంతం సస్యశ్యామలం అవడం ఖాయమంటున్నారు. పోరాటాలతో దక్కిన ‘సింగూరు’ సింగూరు జలాలను సాగుకు మళ్లించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. మాజీ మంత్రి సి.రాజనర్సింహ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నిరాహారదీక్షలు జరిగాయి. అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సింగూరుపై ఎత్తిపోతల పథకాలను చేపడతామని హమీలిచ్చి నిర్లక్ష్యం చేసింది. అయితే 2003 సంవత్సరంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం సి.దామోదర్ రాజనర్సింహ నాయకత్వంలో రైతులు జోగిపేటలోని తహశీల్దారు కార్యాలయం ఎదుట 102 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ దీక్షలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం బహిరంగసభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సేద్యానికి సింగూరు జలాలందిస్తామని వైఎస్ హమీ ఇచ్చారు. ఈ హామీ మేరకు 2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2005 సంవత్సరంలోనే సింగూరు జలాలను 40 వేల ఎకరాలకు అందించేందుకు గాను రూ. 89.98 కోట్ల నిధులు మంజూరు చేసింది. సింగూరు కాలువ పనులను ముఖ్యమంత్రి హోదాలో వైఎస్.రాజశేఖర్రెడ్డి సింగూరులోనే ప్రారంభించారు. వివిధ కారణాల వల్ల కాల్వల నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయారు. ఖరీఫ్ సీజన్లో అందోల్ పెద్ద చెరువులోకి నీరును అందించాలన్న పట్టుదలతో డిప్యూటీ సీఎం పనులను వేగవంతం చేయించారు. సింగూరు ఎడమ కాల్వ ద్వారా ఇటిక్యాల, డాకూర్, మాసానిపల్లి శివార్లలోని కాల్వల ద్వారా నీటిని అందోల్ పెద్ద చెరువులోకి తరలించే కార్యక్రమంలో భా గంగా ఈనెల 13న సింగూరు ప్రాజెక్టు వద్ద ట్రయల్న్ ్రకార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కార్, ఎమ్మెల్సీ భూపాల్రెడ్డితోపాటు జిల్లా యంత్రాంగం, భారీ సంఖ్యలో రైతులు హాజరుకానున్నారు. రైతుల్లో ఆనందం అందోల్ చెరువులోకి సింగూరు నీరు వస్తుందని తెలుసుకున్న స్థానిక రైతుల్లో అనందం వ్యక్తమవుతోంది. చెరువులోకి నీరు వస్తే తమ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని వారంటున్నారు. సింగూరు నీటితో పుల్కల్, అందోల్ మండలాల్లోని పొలాలకు నీరందే అవకాశం ఉంది. -
మంజీర ఉరకలు!
‘సింగూర్ కాల్వల’ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ వచ్చే నెల 2న ముహూర్తం 0.15 టీఎంసీల నీరుకేటాయింపు ఖరీఫ్లో ఆయకట్టుకు సాగునీరు సన్నాహాలు చేస్తున్న అధికారులు మిగులు పనులతోనే దిగులు సాక్షి, సంగారెడ్డి: మంజీర ఉరకలెత్తనుంది. బిరబిర పరుగెత్తనుంది. మెతుకు సీమ రైతుల హృదయాల్లో ఆనందపు పరవళ్లు తొక్కనుంది. వచ్చే ఖరీఫ్ నుంచి సింగూర్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగు నీటి సరఫరా కోసం జరుగుతున్న సన్నాహాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. సింగూర్ ప్రాజెక్టు నుంచి కాల్వలకు ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేసి పరీక్షించడానికి వచ్చేనెల 2న ట్రయల్ రన్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సింగూర్ కాల్వలు, ఎత్తిపోతల ప్రాజెక్టుల మిగులు పనులు ఖరీఫ్లోగా పూర్తి అయితే మెతుకు సీమ రైతుల దశాబ్దాల కల సాకారం కానుంది. ట్రయల్ రన్లో భాగంగా కుడి ప్రధాన కాల్వకు 0.15 టీఎంసీల నీటిని విడుదలకు ప్రభుత్వం అనుమతించింది. విడుదల చేసిన నీళ్లు వృథా కాకుండా మాసన్పల్లి కుంటకు మళ్లించి అక్కడి నుంచి అందోల్ చెరువుకు తరలించనున్నారు. మార్గమధ్యంలో సింగూర్, మునిమాణిక్యం చెరువులను నింపనున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా ట్రయల్ రన్ నిర్వహించడానికి నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రాజెక్టు తూములకు మరమ్మతులు చేసి ట్రయల్ రన్కు సర్వం సిద్ధం చేశారు. మిగులు పనులతోనే దిగులు సింగూర్ కాల్వలకు ట్రయల్ రన్ ఊరిస్తున్నా, మిగులు పనులు ఆందోళన కలిగిస్తున్నాయి. అందోల్ నియోజకవర్గం పరిధిలోని 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి జలయజ్ఞం కింద సుమారు రూ.58 కోట్ల వ్యయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎం.బాగారెడ్డి సింగూరు కాల్వల పథకం నిర్మాణాన్ని చేపట్టింది. ఖరీఫ్లో 2 టీఎంసీల నీటిని 120 రోజుల పాటు కాల్వలకు విడుదల చేసి ఆయకట్టుకు సరఫరా చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ‘మహాలక్ష్మీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్’ అనే నిర్మాణ సంస్థతో 2006 మే 6న ఒప్పొందం జరిగింది. ఈ ఒప్పొందం ప్రకారం 2008 మే 7తో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా..ఆలోగా కేవలం 10 శాతం పనులే పూర్తయ్యాయి. నాలుగు పర్యాయాలు గడువు పెంచినా ఇంకా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు. మే 07 నుంచి 2013 నవంబర్ 06తో నాలుగోసారి పెంచిన గడువు సైతం తీరిపోయింది. ప్రాజెక్టు కింద ప్రధానంగా కుడి ప్రధాన కాల్వ, ఎడమ ప్రధాన కాల్వ, ప్రధాన బ్రాంచీ కాల్వ పేరుతో మొత్తం 60.75 కి.మీల పొడవున మూడు కాల్వల తవ్వకాలు జరపాల్సి ఉండగా 58.45 కి.మీల మేర పని పూర్తయింది. 8 డిస్ట్రిబ్యూటరీ కాల్వల తవ్వకాలు పూర్తికాగా మిగిలిన పనులు అసంపూర్తిగానే మిగిలి పోయాయి. ఇక కాల్వలపై నిర్మించే రోడ్డు బ్రిడ్జీలు, అండర్ టన్నెళ్లు తదితర నిర్మాణా(స్ట్రక్చర్లు)ల్లో సైతం పురోగతి లేదు. ఇప్పటి వరకు దాదాపు రూ.30 కోట్ల ఖర్చుతో 55 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. వచ్చే జూన్లోగా శరవేగంగా మిగులు పనులు పూర్తిచేస్తేనే ఖరీఫ్లో ఆయకట్టుకు నీటి విడుదల సాకారం కానుంది. -
సింగూరు బిరబిర ఘనపురం గలగల
పాపన్నపేట, న్యూస్లైన్: సింగూరు నుంచి నీరు విడుదల కావడంతో ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. వరి నాట్లకోసం ఎదురు చూస్తున్న రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రబీపంటల కోసం మంజీరా బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 6,340 క్యూసెక్కుల నీటిని వదిలారు. మొదటి విడతగా 0.3 టీఎంసీల నీటిని 13.30 గంటలపాటు ఏకధాటిగా వదిలారు. మంగళవారం ఉదయానికి ఆ నీరు ఘనపురం ఆనకట్టకు చేరుకుంది. మధ్యాహ్నం నుంచి ఆనకట్ట పొంగిపొర్లుతోంది. మరోవైపు మహబూబ్ నహర్, ఫతేనహర్ కెనాళ్ల నుంచి నీటిని వదిలారు. దీంతో రైతులు వరినాట్లు ముమ్మరం చేశారు. మరో 5 విడతలపాటు మొత్తం 1.9 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. కాగా ఘనపురం ఆనకట్ట పరిధి కింద మొత్తం 21వేల ఎకరాలు సాగు భూమి ఉంది. సింగూరు నీటి విడుదలతో సుమారు 15వేల ఎకరాలకు ప్రయోజనం చేకూరనుంది. కాగా చివరి ఆయకట్టు కాలువలు శిథిలంకావడంతో ఆ ప్రాంతానికి నీరు చేరే అవకాశం లేదు. జైకా పనులు పూర్తయితే.. తమకు కూడా సాగు నీరు అందేందని చివరి ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి జైకా పనులు సత్వరం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎంఎన్ కెనాల్కు సాగునీరు విడుదల కొల్చారం: సింగూరు నీరు రావడంతో మండల పరిధిలోని మహబూబ్ నహర్(ఎంఎన్) కెనాల్కు సాగునీటిని విడుదల చేశారు. దీంతో చిన్నఘణాపూర్, పొతంశెట్టిపల్లి, కిష్టాపూర్,రాం పూర్ గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలతో ఘనపురం ఆనకట్టకు పెద్ద ఎత్తున వరదనీరు చేరుకోవడంతో ఆ నీటితోనే రైతులు పంటలు సాగుచేసుకున్నారు. అప్పట్లో సింగూర్ ప్రాజెక్ట్నుంచి చుక్కనీరు విడుదల కాలేదు. కాగా రబీ పంటలకు సాగునీరు అవసరం కావడంతో ప్రభుత్వ జీఓ ప్రకారం సాగునీరు విడుదల చేస్తున్నారు. మంగళవారంస్థానిక నాయకులు మెదక్ సీడీసీ చైర్మన్ నరేందర్రెడ్డి, జిల్లా ఆప్కో డెరైక్టర్ రమేష్, ఏడుపాయల దేవస్థానం డెరైక్టర్లు యాదయ్య, సంగమేశ్వర్, ఎంఎన్ కెనాల్ చైర్మన్ నారాయణ, మండల కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డిలు ఘణాపురం ఆనకట్ట నుంచి ఎంఎన్ కెనాల్కు సాగునీటిని విడుదల చేశారు. దీంతో వరినాట్లు ముమ్మరం కానున్నాయి. -
‘రాజనర్సింహా’ఎప్పటికయ్యేనో?
జోగిపేట, న్యూస్లైన్: అందోల్ నియోజకవర్గం పరిధిలో 40 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు చేపట్టిన ‘రాజనర్సింహ ఎత్తిపోతల పథకం’ పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో రైతుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. 2006లో దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు వద్ద కాల్వల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. కాల్వల నిర్మాణం, భూసేకరణలకు గాను ప్రభుత్వం రూ.89.98 కోట్లను మంజూరు చేసింది. అయితే నీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకం తప్పనిసరి అని భావించి 2009లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2010-11లో ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రభుత్వం రూ.19 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను రెండేళ్లలోగా పూర్తి చేసేందుకుగాను ప్రభుత్వంతో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. నిధుల మంజూరులో జాప్యం జరగడంతో ప్రధాన కాంట్రాక్టర్ సంవత్సరం క్రితం సబ్కాంట్రాక్టర్కు అప్పగించారు.అప్పటి నుంచి ప్రస్తుతం పనులు కొనసా..గుతునే ఉన్నాయి. ఏడాదిలోగా పనులు పూర్తవుతాయని పలుసార్లు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ స్వయంగా ప్రకటించినా ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చడంలేదు. ఈ పథకానికి డిప్యూటీ సీఎం తండ్రి స్వర్గీయ మాజీ మంత్రి రాజనర్సింహ ఎత్తిపోతల పథకంగా నామకరణం చేశారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల మధ్య విభేదాలు నెలకొనడం వల్లే నిధుల మంజూరులో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా పంప్హౌస్, కెనాల్, డెలివరీ స్లంప్, ఎలక్ట్రిక్, ప్యానెల్ గదులు, నిర్మాణాలకు సంబంధించి ఫినిషింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులను రూ.12 కోట్లతో చేపడుతున్నారు. డిప్యూటీ సీఎంకు ప్రతిష్టాత్మకం సింగూరు జలాలను సేద్యానికి అందించే విషయంలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. డిసెంబర్లోగా పనులు పూర్తి చేయించాలన్న పట్టుదలతో ఉన్నప్పటికీ సాధ్యపడలేదు. ఇప్పటికే నీరందిస్తామని పలుసార్లు డిప్యూటీ సీఎం ప్రకటనలు చేశారు. అయినా అందించ లేకపోయారు. పనులను త్వరగా పూర్తి చేయించేందుకు అధికారులు, కాంట్రాక్టర్లపై డిప్యూటీ సీఎం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గం పరిధిలో 40 వేల ఎకరాలకు గాను ప్రాజె క్టు నుంచి 2టీఎంసీల నీటిని సేద్యానికి అందించాల్సి ఉంది. అయితే ఈ నీటిని కాల్వల నిర్మాణం ద్వారా అందిస్తారు. పూర్తి స్థాయిలో కాల్వల నిర్మాణం జరగలేదు. -
‘సింగూరు’తోనే.. సిరులు!
మెదక్, న్యూస్లైన్: రబీలోనైనా సింగూరు నీరు పూర్తిస్థాయిలో అందుతాయన్న ఆశలో ఘనపురం ఆయకట్టు రైతులు ఉన్నారు. తుపాన్ల తాకిడి.. కరెంట్ కోతలు.. పెరిగిన ధరల మధ్య రాత్రింబవళ్లు కష్టపడ్డ రైతన్నలు ఎలాగోలా ఖరీఫ్ గట్టెక్కారు. వరికోతలు పూర్తవుతున్న నేపథ్యంలో రబీ కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ యేడు వర్షాలు బాగా పడటంతో సింగూరు, ఘనపురం ప్రాజెక్టులు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. దీంతో ఆయకట్టు రైతాంగమంతా సింగూరు నీటి కోసం ఆశ పడుతోంది. జిల్లాలోని ఏకైక మధ్య తరహ ప్రాజెక్టు అయిన ఘనపురం ఆయకట్టు కింద సుమారు 22 వేల ఎకరాల సాగుభూమి ఉంది. నిబంధనల ప్రకారం సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం ఆయకట్టుకు ఏటా నాలుగు టీఎంసీల నీరు రావాలి. కానీ ఈ యేడు ఇంతవరకు సింగూరు నుంచి నీటి చుక్క కూడా విడుదల కాలేదు. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు పడటంతో సింగూరు ప్రాజెక్టులో 27 టీఎంసీలు అంటే 1,772 అడుగుల నీరు నిలువ ఉంది. అలాగే ఘనపురం ప్రాజెక్టులో సైతం 8 అడుగుల మేర నీరు ఉంది. ప్రస్తుతం ఘనపురంలో ఉన్న నీటితో వరి తుకాలు వేసుకోవచ్చు. అయితే సింగూరు నీరు విడుదల చేసే అవకాశం ఉంటేనే వరి నారు పోసుకునేందుకు సాహసిస్తామని రైతులు చెపుతున్నారు. సుమారు 18 వేల ఎకరాల్లో పంట వేసే అవకాశముందని వారు అంటున్నారు. ఈ లెక్కన చూస్తే సింగూరు నుంచి 7 విడతలుగా 0.3 టీఎంసీల చొప్పున సుమారు 2 టీఎంసీల నీరు విడుదల చేస్తే సరిపోతుందని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్లో వర్షాలు బాగానే కురిసినప్పటికీ తుపాన్ తమను ముంచిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈసారైనా సింగూరు నుంచి నీరు విడుదల చేస్తే కొంతవరకు లాభం చేకూరుతుందని విజ్ఞప్తి చేస్త్తున్నారు. సింగూరు నీరు విడుదల చేసేందుకు శాశ్వత జీఓ లేకపోవడంతో ప్రతి ఏటా ఘనపురం అవసరాల కనుగుణంగా తాత్కాలిక జీఓ అవసరమవుతోంది. జిల్లాలోని మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సింగూరు నీరు విడుదల అయ్యేలా చర్యలు చేపడితే వచ్చే నెల మొదటి వారంలో వరి తుకాలు వేసుకుంటామని చెబుతున్నారు. ఎస్ఈ ఆఫీసుకు నేడు ప్రతిపాదనలు: ఇరిగేషన్ ఈఈ రబీ పంటల కోసం సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు నీరు విడుదల చేయాలంటూ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇరిగేషన్ ఈఈ జ్ఞానేశ్వర్ తెలిపారు. బుధవారం ఎస్ఈ కార్యాలయంలో వాటిని అందజేస్తామన్నారు. నీటి విడుదల కోసం తమ వంతు కృషి చేస్తున్నామన్నారు.