Sunny Deol
-
వేసవిలో జాట్
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్(Sunny Deol) హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన హిందీ చిత్రం ‘జాట్’. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇతర పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.ఈ చిత్రాన్ని వేసవిలో ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించి, కొత్త పోస్టర్ విడుదల చేశారు. ‘‘భారీ యాక్షన్ మూవీగా ‘జాట్’ రూపొందింది. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో ప్రదర్శితమైన ‘జాట్’ టీజర్కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: రిషి పంజాబీ, సీఈఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: బాబా సాయికుమార్ మామిడిపల్లి, జయ ప్రకాశ్ రావు (జేపీ). -
అతను రాక్షసుడా?
‘అతను రాక్షసుడా?.., కాదు... రాక్షసుడు కాదు.., అయితే అతను దేవుడే...’ అనే అర్థం వచ్చే హిందీ సంభాషణలతో హిందీ చిత్రం ‘జాట్’ ట్రైలర్ విడుదలైంది. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ఇది. శుక్రవారం ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఈ యాక్షన్ ΄్యాక్డ్ టీజర్లో విలన్లను రఫ్ఫాడించారు సన్నీ డియోల్. ఆయన పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో టీజర్ స్పష్టం చేస్తోంది. సన్నీ డియోల్, రణదీప్ హుడా తదితరులతో ఈ టీజర్ సాగుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ చిత్రం విడుదల కానుంది. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా తది తరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషి పంజాబీ. -
టాలీవుడ్ డైరెక్టర్ యాక్షన్ మూవీ.. సన్నీ డియోల్ యాక్టింగ్ చూశారా?
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటిస్తోన్న తాజా చిత్రం జాట్. ఈ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంలో రెజీనా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ పాన్ ఇండియా మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.(ఇది చదవండి: ఓటీటీలో కంగువా.. అనుకున్న తేదీకంటే ముందే స్ట్రీమింగ్)టీజర్ చూస్తే ఈ మూవీని ఫుల్ యాక్షన్ కథాంశంగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, స్వరూప ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. शैतान नहीं, भगवान नहीं जाट हैं वो 💥💥💥Action Superstar @iamsunnydeol in and as #JAAT 🔥🔥 🔥 #JaatTeaser out now ❤️🔥▶️ https://t.co/3WmWn7VEEhMASS FEAST loading in cinemas April 2025. 🙌 Produced by @MythriOfficial & @peoplemediafcy A @MusicThaman Mass Beat 🔥🔥… pic.twitter.com/77fPDP2mWl— Gopichandh Malineni (@megopichand) December 6, 2024 -
రెండు భాగాలుగా 'రామాయణ'.. విడుదలపై ప్రకటన
భారత ఇతిహాసాలను వెండితెరపై చూపించాలంటే పెద్ద సాహసమేనని చెప్పాలి. ఈ క్రమంలో వచ్చిన చిత్రాలు ఇప్పటకే చాలావరకు విజయాన్ని అందుకున్నాయి. బాలీవుడ్ తెరకెక్కిస్తున్న 'రామాయణ' గురించి ఒక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం గురించి ఇప్పటికే కన్నడ స్టార్ యశ్ పలు విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడు పోస్టర్స్ విడుదల చేస్తూ విడుదల తేదీలను కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్బీర్కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్సింగ్ కనిపించనున్నట్లు ప్రచారం ఉంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల చేస్తున్నట్లు పోస్టర్స్ను కూడా పంచుకున్నారు.ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్బీర్ ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ విషయంపై ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణతో పాటు డైట్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలిపారు. రాముడి పాత్రలో నటిస్తుండటం వల్ల తాను మద్యపానం మానేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి కూడా పలు విషయాలను పంచుకున్నారు. సీతమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కడం తన అదృష్టమని సాయిపల్లవి పేర్కొన్నారు. ఒక నటిగా కాకుండా భక్తురాలిగా నటిస్తున్నట్లు తెలిపారు. -
బాలీవుడ్ హీరో తెలుగు సినిమా.. 100 కేజీల కేక్తో బర్త్ డే సెలబ్రేషన్స్! (ఫొటోలు)
-
పవర్ఫుల్ యాక్షన్
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘జాత్’ అనే టైటిల్ ఖరారైంది. ఈ పవర్ఫుల్ యాక్షన్ ఫ్యాక్డ్ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం (అక్టోబరు 19) సన్నీ డియోల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘జాత్’ టైటిల్ను ప్రకటించి, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
గ్యాప్ ఇవ్వలా... వచ్చింది
నచ్చిన కథ దొరక్క కొందరు, చేసే పాత్రకు తగ్గట్టు మేకోవర్ అవ్వాలని మరికొందరు, వ్యక్తిగత జీవితంతో ఇంకొందరు... ఇలా కారణాలు ఏమైనా యాక్టర్స్ కెరీర్లో కొన్నిసార్లు గ్యాప్లు వస్తుంటాయి. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ గ్యాప్ను ఫిల్ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి గ్యాప్ల కారణంగా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్పై కనిపించకుండా ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’ అంటున్న కొందరు బాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం.స్పీడ్ బ్రేకర్ గత ఏడాది బాక్సాఫీస్ను ఓ ఊపు ఊపేశారు షారుక్ ఖాన్. 2023లో షారుక్ ఖాన్ హీరోగా చేసిన ‘పఠాన్, జవాన్’ రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను అధిగమించగా, ‘డంకీ’ రూ. 450 కోట్ల కలెక్షన్స్ను సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఈ మూడు చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత ఏడాది రూ. 2,500 కోట్ల కలెక్షన్స్ పైగా రాబట్టగలిగారు షారుక్. కానీ ఈ ఏడాది షారుక్ జోరుకు స్పీడ్ బ్రేకర్ పడింది. 2024లో సిల్వర్ స్క్రీన్ని మిస్ చేసుకున్నారు షారుక్. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో షారుక్ తనయ సుహానా ఖాన్ మరో లీడ్ రోల్లో నటిస్తారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఇంకా ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లలేదు. ‘కింగ్’ 2025 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ది బుల్ మిస్ అయ్యాడు ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3’... ఈ రెండు సినిమాలతో సల్మాన్ ఖాన్ గత ఏడాది వెండితెరపై కనిపించారు. ఇదే జోష్లో ఈ ఏడాది ఈద్కు సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ కుదర్లేదు. ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్తో సల్మాన్ ఖాన్ చేయాల్సిన ‘ది బుల్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా సరైన సమయంలో సెట్స్ పైకి వెళ్లలేదు. దాంతో ఈ ఏడాది సల్మాన్ ఖాన్ వెండితెరపై కనిపించలేకపోయారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్తో సల్మాన్ ఖాన్ ‘సికందర్’ అనే యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ కానున్నట్లు యూనిట్ ప్రకటించింది. మరోవైపు దర్శకుడు విష్ణువర్ధన్తో సల్మాన్ చేయనున్న చిత్రం కూడా 2025లోనే రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. సో.. వచ్చే ఏడాది రెండుసార్లు సల్మాన్ తెరపై కనిపిస్తారని ఊహించవచ్చు. రెండేళ్లు పూర్తయినా... రెండేళ్లు దాటిపోయింది ఆమిర్ ఖాన్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్పై కనిపించి. 2022లో చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా (హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్) తర్వాత ఆమిర్ వెంటనే మరో సినిమా ఒప్పుకోలేదు. మరోవైపు తన కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి పనులతో కొన్నాళ్లు ఆమిర్ ఖాన్ బిజీ అయ్యారు. దాంతో ఆయన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ లేట్గా సెట్స్పైకి వెళ్లింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా వేశారని సమాచారం. భారీ చిత్రంతో... ‘యానిమల్’ సినిమాతో గత ఏడాది బ్లాక్బస్టర్ అందుకున్నారు రణ్బీర్ కపూర్. అయితే గత ఏడాది ‘తు ఝూతీ మై మక్కర్’ చిత్రంతో ఓ ఫ్లాప్ కూడా అందుకున్నారు ఈ హీరో. ఇక ఈ ఏడాది థియేటర్స్లో కనిపించకుండా బ్రేక్ తీసుకున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘రామాయణ్’ సినిమాతో ప్రస్తుతం రణ్బీర్ కపూర్ బిజీగా ఉన్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, యశ్ వంటి స్టార్స్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఇది భారీ చిత్రం కాబట్టి షూట్కి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ఈ ఏడాది తెరపై కనిపించలేదు రణ్బీర్. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోందని, తొలి భాగం 2025లో రిలీజ్ అవుతుందని సమాచారం. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్బీర్ హీరోగా నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ 2026లో విడుదల కానుంది. పర్సనల్ టైమ్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం గత ఏడాది జూలైలో రిలీజ్ అయింది. అయితే వెంటనే మరో మూవీకి సైన్ చేయలేదు రణ్వీర్. ఫిబ్రవరి చివర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్ వెల్లడించారు. సో... పర్సనల్ లైఫ్కు రణ్వీర్ టైమ్ కేటాయించారు. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. కానీ ఈ చిత్రం 2025లోనే రిలీజ్ అవుతుంది. కాగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సింగమ్ ఎగైన్’ సినిమాలో మాత్రం రణ్వీర్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. ఇక దీపికా పదుకోన్ ఈ ఏడాది సెప్టెంబరులో ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే,. బిజీ బిజీ... కానీ! ‘గదర్ 2’తో బ్లాక్బస్టర్ హిట్ సాధించి, మళ్లీ ఫామ్లోకి వచ్చారు సీనియర్ హీరో సన్నీ డియోల్. 2023లో రిలీజైన ‘గదర్ 2’ సక్సెస్తో సన్నీ డియోల్కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ‘బోర్డర్ 2, లాహోర్ 1947, రామాయణ్’ (కీలక పాత్రధారి)లతో పాటు తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీ. ఈ సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే ఆరంభమైంది. కానీ ఈ ఏడాది సన్నీ థియేటర్స్లోకి వచ్చే చాన్సెస్ కనిపించడం లేదు. అయితే 2025లో ఆయన మూడు చిత్రాలతో కనిపించే అవకాశం ఉంది. -
Bollywood Stars: అక్కడ హీరో.. ఇక్కడ విలన్
బాలీవుడ్ నుంచి ఎక్కువగా హీరోయిన్లు టాలీవుడ్కి వస్తుంటారు. ఈసారి పలువురు నటులు తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ ఏడాది ఇప్పటికే కొందరు నటులు, నటీమణులు కనిపించగా... త్వరలో రానున్న బాలీవుడ్ స్టార్స్ గురించి తెలుసుకుందాం. కన్నప్పతో ఎంట్రీబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిందీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకెళుతున్నారు. ఆయన తొలిసారి తెలుగులో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘కన్నప్ప’. హీరో మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ మూవీకి ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో పలు భాషలకు చెందిన స్టార్ హీరోలు, ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ప్రభాస్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, మధుబాల, ప్రీతీ ముకుందన్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ‘కన్నప్ప’ చిత్రంలో అక్షయ్ కుమార్ కీలకమైన అతిథి పాత్రలో నటించారు. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కోసం హైదరాబాద్కి వచ్చి, తన పాత్ర షూటింగ్ని అక్షయ్ కుమార్ పూర్తి చేసి వెళ్లారు. అక్షయ్ వంటి స్టార్ హీరో ‘కన్నప్ప’లో భాగస్వామ్యం కావడంతో ఈ సినిమాపై బాలీవుడ్లోనూ ఆసక్తి నెలకొంది. అయితే అక్షయ్ కుమార్ ఏ పాత్రలో నటించారు? అనే విషయాన్ని చిత్రయూనిట్ ఇప్పటి వరకూ స్పష్టం చేయలేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతోన్న ‘కన్నప్ప’ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓమీ భాయ్బాలీవుడ్ సీరియల్ కిస్సర్గా పేరు తెచ్చుకున్నారు ఇమ్రాన్ హష్మీ. హీరోయిన్లతో ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న ఆయన తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు ఇమ్రాన్ హష్మీ. మార్చిలో ఇమ్రాన్ హష్మీ పుట్టినరోజుని పురస్కరించుకుని, ఈ చిత్రంలో ఆయన చేస్తున్న ఓమీ భాయ్ పాత్రని పరిచయం చేస్తూ, ఫస్ట్ లుక్ని విడుదల చేసింది చిత్రబృందం. తన లుక్పై ఇమ్రాన్ హష్మీ ‘ఓజీ’ సినిమాలోని ఓ డైలాగ్తో స్పందించారు. ‘గంభీరా... నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా. ్ర΄ామిస్... ఇద్దరిలో ఒకరి తలే మిగులుతుంది’ అంటూ ట్వీట్ చేశారాయన. ఇక గూఢచారితోనూ తెరపై కనిపించనున్నారు ఇమ్రాన్. అడివి శేష్ నటించిన హిట్ మూవీ ‘గూఢచారి’ (2018)కి సీక్వెల్గా రూపొందుతోన్న చిత్రం ‘జీ 2’ (గూఢచారి 2). వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అనీల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోనూ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న రెండో తెలుగు చిత్రం ‘జీ 2’. ఈ మూవీలో ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారు? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కానుందని టాక్. దేవరతో జోడీఅతిలోక సుందరి శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండి΄ోయే ΄ాత్రలు చేశారు. ఆమె కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నారు. అయితే ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందని శ్రీదేవి అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. వారి నిరీక్షణ ఫలించనుంది. ‘దేవర’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నారు జాన్వీ కపూర్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు..’పాటలో జాన్వీ కపూర్ ఫుల్ గ్లామరస్గా కనిపించడంతో ఈ సాంగ్ ఇప్పటికే ఫుల్ ట్రెండింగ్లో ఉంది. మరి సినిమా విడుదల తర్వాత జాన్వీకి ఎంతమంది ఫ్యాన్స్ అవుతారో వేచి చూడాలి. కాగా ‘దేవర’ తొలి భాగం సెప్టెంబరు 27న విడుదల కానుంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే జాన్వీకి మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వెండితెరపై చిరంజీవి–శ్రీదేవిలది సూపర్ జోడీ. వారి వారసులు రామ్ చరణ్– జాన్వీ కపూర్ తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు ఇది రెండవ చిత్రం. ఒకప్పటి హిట్ జోడీ అయిన చిరంజీవి–శ్రీదేవిల వారసులు రామ్చరణ్–జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ ΄ాన్ ఇండియా సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో, సినీ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. వీరమల్లుతో పోరాటం గత కొన్నేళ్లుగా బాబీ డియోల్ కెరీర్ ఆశాజనకంగా సాగడం లేదు. అయితే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ (2023) సినిమా తర్వాత ఈ బాలీవుడ్ నటుడి క్రేజ్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ సినిమాలో ఆయన నటించిన విలన్ పాత్రకి అద్భుతమైన పేరు రావడంతో విపరీతమైన డిమాండ్ పెరిగింది. హిందీలోనే కాదు.. తెలుగు, తమిళ భాషల నుంచి కూడా అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నాయి. ఆయన నటిస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘హరి హర వీరమల్లు’. పవన్ కల్యాణ్, నిధీ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ మూవీ ప్రారంభమైంది. అయితే ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతుండటంతో ఆయన తప్పుకున్నారట. దీంతో నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారని సమాచారం. ఏఎమ్ రత్నం, ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుందని టాక్. ఇదిలా ఉంటే బాలకృష్ణ హీరోగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ‘ఎన్బీకే 109’ (వర్కింగ్ టైటిల్) సినిమాలోనూ బాబీ డియోల్ నటిస్తున్నారు.బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ప్రస్తుతం తెలుగు సినిమాలపై దృష్టి పెట్టారు. 1998లో విడుదలైన హీరో నాగార్జున ‘చంద్రలేఖ’ సినిమాలో తొలిసారి అతిథి పాత్రలో కనిపించారు సంజయ్ దత్. దాదాపు ఇరవైఆరేళ్ల తర్వాత ఆయన పూర్తి స్థాయిలో నటించిన తెలుగు సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలైంది. విలన్ బిగ్ బుల్ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు సంజయ్ దత్. ఆయన నటిస్తున్న మరో తెలుగు చిత్రం ‘రాజా సాబ్’. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోనూ ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ఆదిపురుష్’ (తెలుగు–హిందీ) సినిమాతో తెలుగులో పరిచయమైన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి భాగం జూన్ 27న విడుదలైంది. ఈ సినిమా రెండో భాగంలోనూ దీపిక నటించనున్నారు. వెర్సటైల్ యాక్టర్గా పేరొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఈ ఏడాది ‘సైంధవ్’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమయ్యారు. వికాస్ మాలిక్గా విలన్ పాత్రలో తనదైన శైలిలో అలరించారాయన. ఇలా ఈ ఏడాది ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ తెలుగుకి పరిచయం కాగా... మరెందరో రానున్నారు. -
Border 2: ఇరవయ్యేడేళ్ల తర్వాత...
ఇరవయ్యేడేళ్ల తర్వాత హిందీ హిట్ ఫిల్మ్ ‘బోర్డర్’కు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు సన్నీ డియోల్. ఆయన హీరోగా జేపీ దత్తా దర్శకత్వంలో 1997లో వచ్చిన చిత్రం ‘బోర్డర్’. 1997 జూన్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్గా నిలిచింది. కాగా ‘బోర్డర్’ చిత్రం విడుదలై గురువారం (జూన్ 13) నాటికి సరిగ్గా 27 సంవత్సరాలు. ఈ సందర్భంగా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ ‘బోర్డర్’కు దర్శకత్వం వహించిన జేపీ దత్తాకు బదులుగా దర్శకుడు అనురాగ్ సింగ్ సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి 27 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ వార్ ఫిల్మ్’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు సన్నీ డియోల్. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘బోర్డర్’ చిత్రం 1971లో జరిగిన ఇండియా–΄ాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. ఈ చిత్రం సీక్వెల్ కథపై స్పష్టత రావాల్సి ఉంది. -
Border 2 : పాతికేళ్ల తర్వాత వచ్చేస్తున్న సీక్వెల్
సన్నీ డియోల్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అక్షయ్ ఖన్నా తదితరులు లీడ్ రోల్స్లో నటించిన సూపర్ హిట్ హిందీ ఫిల్మ్ ‘బోర్డర్’ని అంత సులువుగా మరచిపోలేం. 1997లో విడుదలైన ఈ సినిమా 1971లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. పాతికేళ్ల తర్వాత ‘బోర్డర్’ సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగంలో నటించిన సన్నీ డియోల్ సీక్వెల్లోనూ హీరోగా నటిస్తారు. యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మరో లీడ్ రోల్ చేస్తారు. కాగా ‘బోర్డర్’ సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి ప్రకాశ్ దత్తా ‘బోర్డర్ 2’కు ఓ నిర్మాతగా ఉండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాను 2026 జనవరి 23న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. భారతదేశ సైనికుల త్యాగాలు, గొప్పతనం గురించి తెలిపేలా ఉండే ఈ సినిమాను రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) సందర్భంగా విడుదల చేస్తే బాగుంటుందని, జనవరి 23 పర్ఫెక్ట్ డేట్ అని యూనిట్ భావించిందట. ఇక ఈ సీక్వెల్లో వచ్చే వార్ యాక్షన్ సీక్వెన్స్లు ఆడియన్స్కు విజువల్ ఫీస్ట్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. -
సన్నీ సీటును ఆక్రమించిన దినేష్ ఎవరు?
2024 లోక్సభ ఎన్నికల ప్రకియ ఊపందుకుంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా బీజేపీ తన ఎనిమిదవ జాబితాలో మొత్తం 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో పంజాబ్లోని గురుదాస్పూర్ లోక్సభ స్థానానికి సన్నీ డియోల్ స్థానంలో దినేష్ సింగ్ బబ్బుకు టిక్కెట్ ఇచ్చింది. అప్పటి నుంచి దినేష్ సింగ్ బబ్బు పేరు వార్తల్లో నిలుస్తోంది. బీజేపీ నేత దినేష్ సింగ్ బబ్బు(62) పంజాబ్లోని సుజన్పూర్ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో పంజాబ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు. 2007, 2012, 2017లో వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అయితే 2022లో సుజన్పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ పూరి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీ ఆయనకు గురుదాస్పూర్ లోక్సభ స్థానాన్ని అప్పగించింది. దినేష్ సింగ్ బబ్బు అండర్ గ్రాడ్యుయేట్. పఠాన్కోట్లోని భంగోల్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన తన రాజకీయ జీవితాన్ని భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ప్రారంభించారు. కాగా గురుదాస్పూర్ చాలా కాలంగా బీజేపీకి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాకర్పై బీజేపీ అభ్యర్థి సన్నీడియోల్ 82,459 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే సన్నీ డియోల్ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేరనే ఆరోపణలు వినిపించాయి. ఈసారి కూడా విజయాన్ని నిలబెట్టుకోవాలని భావించిన బీజేపీ దినేష్ సింగ్ బబ్బుకు టిక్కెట్ ఇచ్చింది. -
బీజేపీ 8వ జాబితా రిలీజ్.. ప్రముఖ బాలీవుడ్ హీరోకు నో టికెట్
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల 8వ జాబితాను బీజేపీ శనివారం(మార్చ్ 30) సాయంత్రం విడుదల చేసింది. ఒడిషా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 11 సీట్లకు ఈ జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, బ్లాక్ బస్టర్ గదర్ హీరో సన్నీ డియోల్కు పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. సన్నీ డియోల్ స్థానంలో గురుదాస్పూర్ నుంచి దినేష్సింగ్ బాబును బరిలోకి దింపింది. పార్లమెంటుకు సరిగా హాజరు కాకపోవడం వల్లే సన్నీ డియోల్కు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపలేదని సమాచారం. మాజీ సీఎం అమరేందర్సింగ్ భార్య ప్రణీత్ కౌర్కు పార్టీలో చేరిన కొద్ది రోజులకే పటియాల నుంచి టికెట్ ఇచ్చారు. అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్జిత్సింగ్ సంధుకు అమృత్సర్ నుంచి అవకాశం కల్పించారు. ఆమ్ఆద్మీ పార్టీ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన సుశీల్కుమార్ రింకూను జలంధర్ నుంచి బరిలోకి దింపారు. ఒడిషాలో ఇటీవలే రాష్ట్రంలో అధికార బీజేడీ నుంచి బీజేపీలో చేరిన మోస్ట్ సీనియర్ ఎంపీ భర్తృహరి మెహతాబ్కు కటక్ నుంచి టికెట్ ఇచ్చారు. ఇదీ చదవండి.. బీజేపీ వాషింగ్మెషిన్ను ప్రదర్శించిన తృణమూల్ నేతలు -
లోక్ సభలో నోరు మెదపని ఎంపీలు వీరే..
దేశంలోని ఓటర్లు తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని ఎంపీలను పార్లమెంట్కు పంపిస్తారు. అయితే దీనికి విరుద్దంగా ప్రవర్తించిన ఎంపీలు కూడా ఉన్నారు. ఎంపీల ఐదేళ్ల పదవీకాలం ముగియనుండడంతో త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. 17వ లోక్సభలో వివిధ పార్టీలకు చెందిన తొమ్మిది మంది ఎంపీలు తమ పదవీ కాలంలో ఒక్కసారి కూడా సభలో మాట్లాడనేలేదు. లోక్సభ సెక్రటేరియట్ నుండి అందిన సమాచారం ప్రకారం ఈ ఎంపీలలో అమితమైన ప్రజాదరణ పొందినవారు కూడా ఉన్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సన్నీ డియోల్, శతృఘ్న సిన్హా సభలో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మరోవైపు పార్లమెంటు కార్యకలాపాల్లో పాల్గొనని నేతల వర్గంలో శత్రుఘ్న సిన్హా చేరారు. శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ. గతంలో శత్రుఘ్న సిన్హా పట్నా సాహిబ్ లోక్సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ పార్లమెంటులో ఒక్కసారి కూడా ఎటువంటి అంశాన్ని లేవనెత్తలేదు. అదేవిధంగా కర్ణాటకలోని బీజాపూర్ స్థానానికి చెందిన బీజేపీ ఎంపి రమేష్ చంద్రప్ప జిగజినాగి కూడా ఎప్పుడూ సభలో మాట్లాడలేదు. ఉత్తరప్రదేశ్లోని ఘోసీ నియోజకవర్గం ఎంపీ అతుల్ రాయ్ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. -
లోహ్రీ రోజు దానం చేయాలి : అమితాబ్
సంక్రాంతి పండగ సంబరాలు ఆరంభమయ్యాయి. కొందరు బాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ లోహ్రీ (భోగి పండగ) శుభాకాంక్షలు. లోహ్రీ అంటే నాకు చాలా విషయాలు గుర్తుకొస్తాయి. లోహ్రీ రోజు జానపద కళాకారులు ‘లోహ్రీ దా టక్కా దే, రబ్ యానూ బచ్చా దే’ అంటూ పాటలు పాడుకుంటూ ఇంటింటికీ వచ్చినప్పుడు వారికి దానం ఇవ్వడం ఆనవాయితీ. నా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలా పండగ తాలూకు విషయాలు చెప్పేవారు’’ అని సోషల్ మీడియా ద్వారా అమితాబ్ బచ్చన్ షేర్ చేశారు. T 4889 - Happy Lohri .. 'लोहड़ी दा टक्का दे, रभ थानू बच्चा दे ' ... 😁 this is how the chanting went when they came to homes and families to collect donations on the occasion of Lohri .. Maa used to tell us these stories .. pic.twitter.com/t9rVu8Kb2j — Amitabh Bachchan (@SrBachchan) January 13, 2024 ‘‘లోహ్రీ తాలూకు వెచ్చదనాన్ని, పండగ సందర్భంగా మా అమ్మగారు చేసిన స్వీట్స్ని తలుచుకుంటున్నాను. ఇరుగు పొరుగుతో పంచుకున్న నవ్వులతో నా మనసు నిండిపోయేది. నేటి బిజీ జీవితంలో అప్పటి ఆనందకర సాధారణ రోజులను తలచుకుని, ఆనందిస్తున్నాను. అందరి జీవితాల్లో లోహ్రీ ఆనందం నింపాలని కోరుకుంటున్నా’’ అని సన్నీ డియోల్ పేర్కొన్నారు. ఇంకా అక్షయ్ కుమార్, సంజయ్ దత్, విక్కీ కౌశల్, ఇషా డియోల్, నేహా ధూపియా వంటి తారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
ఆ ఎంపీ అదృశ్యం అంటూ పోస్టర్లు.. ఆచూకీ చెబితే రూ. 50 వేలు!
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే పంజాబ్లో ఆయన అదృశ్యం అయ్యారంటూ పోస్టర్లు వెలిశాయి. అంతే కాదు సన్నీ డియోల్ ఆచూకీ చెప్పినవారికి రూ.50 వేలు రివార్డు కూడా ప్రకటించారు. సన్నీ డియోల్ అదృశ్యమయ్యారంటూ పోస్టర్లు వేయడం ఇదేమీ మొదటిసారి కాదు. నిజానికి సన్నీ డియోల్ గురుదాస్పూర్-పఠాన్కోట్ లోక్సభ స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ. సన్నీడియోల్ ఎంపీ అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పఠాన్కోట్ జిల్లాలోని హల్కా భోవాకు చెందిన జనం సర్నా బస్టాండ్లో సన్నీ డియోల్ అదృశ్యంపై పోస్టర్లపై అతికించి, అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జిల్లాలోని హల్కా, పఠాన్కోట్, సుజన్పూర్లలో సన్నీ డియోల్ అదృశ్యానికి సంబంధించిన పోస్టర్లు కనిపించాయి. ఇంత జరుగుతున్నా సదరు ఎంపీ స్థానికుల బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన తన లోక్సభ నియోజకవర్గానికి ఎప్పుడూ రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో నిరసనకు దిగిన జనం బస్సులకు ఈ పోస్టర్లను అతికించారు. ఎంపీగా ఎన్నికయిన తర్వాత సన్నీ డియోల్ తన లోక్సభ నియోజకవర్గానికి ఏనాడూ రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారికి 2024 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా టిక్కెట్లు ఇవ్వకూడదని వారు కోరుతున్నారు. ప్రజలను మోసం చేయడంలో సన్నీ డియోల్ విజయం సాధించారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ సన్నీడియోల్ ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డు ఇస్తామని నిరసనకారులు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో చలి విజృంభణ.. కశ్మీర్లో జీరోకు దిగువన ఉష్ణోగ్రతలు! -
రోడ్డుపై తాగి వీరంగం సృష్టించిన బాలీవుడ్ స్టార్? వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ నడిరోడ్డుపై తాగి తూగుతున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. పూటుగా తాగడమే కాకుండా పబ్లిక్లో ఇలా వీరంగం సృష్టిస్తున్నాడేంటని నెటిజన్లు సన్నీని తిట్టిపోస్తున్నారు. పేరుకే సెలబ్రిటీ.. కానీ చేసే పనులు ఇలా ఉంటాయని విమర్శిస్తున్నారు. దీంతో ఈ ట్రోలింగ్కు చెక్ పెడుతూ ఈ వైరల్ వీడియో వెనుక అసలు రహస్యాన్ని బయటపెట్టాడు నటుడు. ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒరిజినల్ వీడియో షేర్ చేశాడు. ఇందులో కెమెరాలు పట్టుకుని నడుస్తుండగా వాటి ముందు సన్నీ తాగి తూలుతున్నట్లుగా నటిస్తున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి.. టాక్సీని ముందుకు రమ్మనండి అని చెప్పడంతో కారు నడిపే వ్యక్తి సన్నీదగ్గరకు పోనిచ్చాడు. అంటే సినిమా చిత్రీకరణలో భాగంగా సన్నీ డియోల్ ఇలా ప్రవర్తించాడన్నమాట. ఇప్పటికైనా పుకార్లకు చెక్ పడుతుందని ఆశిస్తున్నానంటూ సదరు వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు నటుడు. ఇది చూసిన అభిమానులు.. నిన్ను ద్వేషించేవాళ్లు కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు. వాటినేమీ పట్టించుకోవద్దు, ఆల్ ద బెస్ట్ అని కామెంట్లు చేస్తున్నారు. మీ డైహార్డ్ ఫ్యాన్గా మీరేంటో నాకు తెలుసు.. మీకు మద్యం తాగే అలవాటు లేదు. ఒకవేళ డ్రింక్ చేసినా ఇలా చీప్గా ప్రవర్తించరు. మీ నెక్స్ట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నా అని ఓ అభిమాని రాసుకొచ్చాడు. మరికొందరేమో ప్రమోషనల్ స్ట్రాటజనీ బాగుంది అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. కాగా సన్నీ డియోల్ హీరోగా గదర్ 2 సినిమా చేశాడు. ఈ మూవీ రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఇతడు బాప్, లాహోర్ 1947, సూర్య సినిమాలు చేస్తున్నాడు. Ye bjp MP Sunny Deol kaha ghum raha raat ko? Lagta hai jada daaru pee liya kya?#SunnyDeolpic.twitter.com/oHCyuqcq47 — Pawan Shukla (@Shukla8175) December 5, 2023 Afwaahon ka ‘Safar’ bas yahin tak 🙏🙏#Shooting #BTS pic.twitter.com/MS6kSUAKzL — Sunny Deol (@iamsunnydeol) December 6, 2023 చదవండి: తెలుగింటి హీరోయిన్.. అందంగా లేదని వెక్కిరించినవాళ్లే కుళ్లుకున్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న.. -
సన్నీడియోల్పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు!
చండీగఢ్: గదర్-2 హీరో సన్నీడియోల్పై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫైరయ్యారు. పంజాబ్లోని గురుదాస్పూర్ పర్యటన సందర్భంగా కేజ్రీవాల్ సన్నీడియోల్పై విమర్శల దాడి చేశారు. గురుదాస్పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న సన్నీడియోల్ ఎప్పుడైనా మీకు మొహం చూపించారా అని ప్రజలను ప్రశ్నించారు. ఓటు వేసిన వారిని సన్నీడియోల్ మోసం చేశారని విమర్శించారు. ‘సన్నీ డియోల్ను మీరు గెలిపించారు. గెలిచినప్పటి నుంచి నియోజకవర్గానికి అతడు మళ్లీ ఎప్పుడైనా వచ్చాడా? అతని ముఖాన్ని మీరేప్పుడైనా మళ్లీ చూశారా?. పెద్ద హీరో అనుకుని మనం అతనికి ఓట్లేశాం. అలాంటి పెద్దవాళ్లను ఎన్నుకుంటే వాళ్లేం చేయరు. అందుకే సామాన్యుడిని(ఆమ్ఆద్మీ)ని గెలిపించాలి. ఆమ్ ఆద్మీ అయితే మీరెప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు’ అని కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్లో ప్రతిపక్షాలపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆపార్టీలకు ఆప్ ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప వేరే ఏం పనిలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఖాళీ చేసిన ఖజానాను ఏడాదిన్నరలో ఆప్ ప్రభుత్వం నింపిందన్నారు. ప్రజలకు ఉచిత విద్యుత్ లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని తెలిపారు. ఇదీచదవండి.. ‘24 గంటలు ఆగండి.. పూర్తి మెజార్టీ మాదే’ -
కథ సెట్.. కాంబో రిపీట్
ఒక హీరో... ఒక డైరెక్టర్... వీరి కాంబినేషన్లో ఓ బ్లాక్బస్టర్... ఇది చాలు... ప్రేక్షకులు ఆ కాంబో రిపీట్ కావాలని కోరుకోవడానికి. అయితే కారణాలేమైనా కొన్ని హిట్ కాంబినేషన్స్ రిపీట్ కావడానికి ఇరవయ్యేళ్లకు పైగా పట్టింది.ఇప్పుడు కథ సెట్ అయింది.. కాంబో రిపీట్ అవుతోంది. రిపీట్ అవుతున్న ఆ హిట్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. బిగిన్ ది బిగిన్ కమల్హాసన్ కెరీర్లో ‘నాయగన్’ (1987) బ్లాక్బస్టర్ ఫిల్మ్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా విడుదలైంది. ఇంతటి బ్లాక్బస్టర్ ఫిల్మ్ ఇచ్చిన కమల్–మణిరత్నం కాంబోలో మరో సినిమా ప్రకటన రావడానికి మూడు దశాబ్దాలకు పైగా సమయం గడిచిపోయింది. ముప్పైఐదేళ్ల తర్వాత.. అంటే గత ఏడాది నవంబరులో తన పుట్టినరోజు సందర్భంగా మణిరత్నంతో సినిమాను ప్రకటించారు కమల్. మణిరత్నం, కమల్హాసన్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటుడిగా కమల్ కెరీర్లో 234వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంబోత్సవాన్ని నిర్వ హించి, బిగిన్ ది బిగిన్ అంటూ వీడియోను షేర్ చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్, త్రిష, ‘జయం’ రవి ఈ చిత్రంలో కీ రోల్స్ చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. మరోవైపు ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం కూడా కమల్హాసన్ కెరీర్లో ఓ బ్లాక్బస్టర్. ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ తర్వాత కమల్, శంకర్ల కాంబినేషన్లోపాతికేళ్లకు ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. లక్నో టు లాహోర్ దాదాపు పాతికేళ్ల క్రితం బాలీవుడ్లో హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్ అంటే సెన్సేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఘాయల్’ (1990) సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఆ ఏడాది బాక్సాఫీస్ టాప్ కలెక్షన్స్ సాధించిన మొదటి ఐదు చిత్రాల్లో ‘ఘాయల్’కు చోటు దక్కడం అనేది ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు . ఆ తర్వాత ‘దామిని’ (1993) చిత్రం కోసం సన్నీడియోల్, రాజ్కుమార్ సంతోషిలు కలిసి పని చేశారు. కానీ ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. మీనాక్షీ శేషాద్రి మెయిన్ లీడ్ రోల్ చేయగా, సన్నీ డియోల్, రిషీ కపూర్, అమ్రిష్ పూరి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం కూడా సూపర్హిట్. ఇక ముచ్చటగా మూడోసారి సన్నీ డియోల్, రాజ్కుమార్ సంతోషిలు కలిసి చేసిన చిత్రం ‘ఘాతక్’. ‘దామిని’ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, మీనాక్షీ చౌదరి, ఓమ్ పురి ఈ సినిమాలో కూడా నటించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఇలా మూడు వరుస హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో కానీ సన్నీ డియోల్, రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్లో ఈ సినిమా తర్వాత మరో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. సన్నీ డియోల్, రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్లో ‘లాహోర్ 1947’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను హీరో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. భారతదేశం,పాకిస్తాన్ విభజన నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, లక్నో నుంచి లాహోర్కు వలస వెళ్లిన ఓ ముస్లిం కుటుంబం కథే ఈ చిత్రం అని టాక్. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. మరోవైపు హీరోగా ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్ కూడా రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయట. ఇదే నిజమైతే... 1994లో వచ్చిన ‘అందాజ్ అ΄్నా అ΄్నా’ తర్వాత ఆమిర్, రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్లో వచ్చే చిత్రం ఇదే అవుతుంది. అంటే.. 30 ఏళ్లకు ఆమిర్, రాజ్కుమార్ కలిసి సినిమా చేసినట్లవుతుంది. ఎప్పటికీ హీరోయే! జాకీ ష్రాఫ్ను ‘హీరో’ను చేసింది దర్శకుడు సుభాష్ ఘయ్. జాకీ ష్రాఫ్, సుభాష్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘హీరో’ (1983) సూపర్ హిట్గా నిలిచింది. హీరోగా జాకీకి ఇదే తొలి సినిమా. ‘హీరో’ సూపర్హిట్ అయినప్పటికీ వీరి కాంబోలో తర్వాతి చిత్రం ‘యాదేం’ (2001) తెరకెక్కడానికి 18 ఏళ్లు పట్టింది. జాకీ ష్రాఫ్తోపాటు హృతిక్ రోషన్ కూడా ఓ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు జాకీ ష్రాఫ్ హీరోగా ‘వన్స్ ఏ హీరో.. ఆల్వేస్ ఏ హీరో’ అంటూ తాజా చిత్రాన్ని ప్రకటించారు సుభాష్. ఇలా ఇరవై, ముప్పైఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి. -
బాలీవుడ్లో ఆ సత్తా ఎవరికీ లేదు.. సౌత్లో అతనొక్కడే: ఎన్టీఆర్పై గదర్ డైరెక్టర్
సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన గదర్ 2 భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల మార్కును దాటే దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం 2001 బ్లాక్బస్టర్ గదర్: ఏక్ ప్రేమ్ కథకు ఆధ్యాత్మిక సీక్వెల్గా పనిచేస్తుంది. తారా సింగ్ మరియు సకీనా వంటి వారి ప్రియమైన పాత్రలలో సన్నీ మరియు అమీషా తిరిగి రావడాన్ని ఆస్వాదిస్తూ ప్రేక్షకులు ఈ చిత్రం ద్వారా లోతుగా హత్తుకున్నారు. 22 సంవత్సరాల తర్వాత కూడా హృదయాలను దోచుకునే వారి కెమిస్ట్రీపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు, ఇది ఇప్పటికీ ప్రేక్షకులతో ప్రతిధ్వనిస్తుంది. అసలు గదర్ నేటి కాలంలో రూపొందితే తారా సింగ్ పాత్రలో ఎవరిని తీసుకుంటారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు అనిల్ శర్మను అడిగారు. ప్రస్తుత తరం నుండి ఆ ఐకానిక్ క్యారెక్టర్లోకి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అడుగు పెట్టగలడని తన అభిప్రాయం అని ఆయన వెల్లడించారు. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్! ) అనిల్ శర్మ మాట్లాడుతూ.. ' ప్రస్తుత హీరోల్లో ఆ పాత్రకు సరిపోయే వారు ఎవరూ కనిపించలేదు. ముంబయిలో అయితే ఎవరూ లేరు. సౌత్లో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పాత్రకు సరిపోతాడు. అతనైతేనే ఈ పాత్రను చేయగలడు. అతనికి ఏ పాత్రలోనైనా చేయగల సత్తా ఉంది.' అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇది విన్న జూనియర్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. అభిమానుల స్పందన త్వరలోనే ఎన్టీఆర్ దేవరతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను అలరిస్తాడని అంటున్నారు. తారక్ మాత్రమే అత్యంత పర్ఫెక్ట్గా ఎలాంటి పాత్రనైనా చేయగలడంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. కాగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర ఏప్రిల్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. (ఇది చదవండి: గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ ఫ్రీ టికెట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన షారుక్! ) -
ఓటీటీలోకి బ్లాక్బస్టర్ మూవీ.. కానీ అదే ట్విస్ట్!
ఓటీటీల్లో భాషతో సంబంధం లేకుండా అందరూ సినిమాలు తెగ చూసేస్తున్నారు. దీనితోపాటు ప్రతివారం థియేటర్లలో కొత్త మూవీస్ రిలీజ్ కావడం లేటు.. వాటి టాక్ ఏంటి? ఒకవేళ బాగోలేకపోతే ఓటీటీల్లోకి ఎప్పుడొస్తాయి అని మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం థియేటర్లలో వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఓ మూవీ ఓటీటీ రిలీజ్పై ఇప్పుడు స్వయంగా దర్శకుడే క్లారిటీ ఇచ్చేశాడు. అది కాస్త కన్ఫ్యూజ్ చేస్తోంది. సినిమా టాక్ ఏంటి? 2001లో 'గదర్' సినిమా రిలీజ్ అద్భుతమైన టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ సాధించింది. దానికి 22 ఏళ్ల సీక్వెల్ తీసి, ఈ మధ్యే రిలీజ్ చేయగా ఇప్పుడు కూడా బ్లాక్బస్టర్ టాక్ వచ్చింది. ఇప్పటివరకైతే దాదాపు రూ.450 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. కెరీర్ అయిపోయిందనుకున్న సన్నీ డియోల్ కి ఈ సినిమా మంచి జోష్ తీసుకొచ్చింది. నార్త్ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఎగబడి మరీ చూస్తుండటం విశేషం. (ఇదీ చదవండి: 'జైలర్'ని కోర్టు మెట్లు ఎక్కించిన ఆర్సీబీ) ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు అనిల్ శర్మ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. అలానే ఓటీటీ రిలీజ్ గురించి స్పందించారు. 'ప్రస్తుతం ప్రేక్షకులు 'గదర్ 2'ని థియేటర్లలో చూసేందుకు ఇష్టపడుతున్నారు. నాకు తెలిసినంతవరకు మరో ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుందని అనుకుంటున్నాను' అని అనిల్ శర్మ చెప్పుకొచ్చాడు. ఆరు నెలలు.. కుదరదేమో? అయితే 'గదర్ 2' హిట్ అయిన ఆనందంలో ఉన్న దర్శకుడు అనిల్ శర్మ.. ఓటీటీ రిలీజ్ ఆరు నెలల తర్వాత అన్నాడు. కానీ అన్ని నెలలు ఎవరూ వెయిట్ చేయరు. అలానే డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న జీ5.. అంతకాలం అస్సలు సినిమాని దాచిపెట్టుకోదు కదా. దీన్నిబట్టి చూస్తుంటే.. ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. 5-6 వారాల తర్వాత అనుకున్నాసరే సెప్టెంబరు చివరికల్లా 'గదర్ 2' ఓటీటీలోకి వచ్చేయొచ్చు. (ఇదీ చదవండి: మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?) -
బాలీవుడ్ హీరో విల్లా వేలానికి నోటీసులు.. అంతలోనే ట్విస్ట్
బీజేపీ ఎంపీ, సినీ నటుడు సన్నీడియోల్కు చెందిన బంగ్లా వేలం నోటీసును ఉపసంహరించుకోవడం కలకలం రేపుతోంది. ఈ మేరకు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది."అజయ్ సింగ్ డియోల్ అలియాస్ సన్నీ డియోల్కు సంబంధించి అమ్మకపు వేలం నోటీసుకు సంబంధించి ఇ-వేలంకు సంబంధించిన కొరిజెండం సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించబడింది" అని బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. (అప్పుడు ఆఫీసు బోయ్..ఇపుడు ఎవ్వరూ ఊహించని శిఖరాలకు!) తాజా పరిణామంపై విమర్శలకు తావిచ్చింది. దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ (ట్విటర్)లో విస్మయాన్ని వ్యక్తం చేశారు. వేలం నోటీసు జారీ చేసిన 24 గంటలలోపు దాన్ని విత్డ్రా చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. బీవోబీ ప్రకటించిన టెక్నికల్ కారణాలను ఎవరు లేవనెత్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఎస్డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్ మంత్ నుంచే ఆదాయం పొందొచ్చా? ) Yesterday afternoon the nation got to know that Bank of Baroda had put up the Juhu residence of BJP MP Sunny Deol for e-auction since he has not paid up Rs 56 crore owed to the Bank. This morning, in less than 24 hours, the nation has got to know that the Bank of Baroda has… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 21, 2023 బ్యాంకును సంప్రదించారంటున్న బీవోబీ జుహు బంగ్లాను వేలనోటీసుల నేపథ్యంలో రుణగ్రహీత (సన్నీ డియోల్), బకాయలను చెల్లించేందుకు తమను సంప్రదించినట్లు బరోడాకు చెందిన బీవోబీ బ్యాంకు తన ప్రకటనలో వెల్లడించింది. నోటీసులోని మొత్తం బకాయిలు రికవరీ చేయాల్సిన బకాయిల ఖచ్చితమైన పరిమాణాన్ని పేర్కొనలేదని బ్యాంక్ తెలిపింది.అలాగే ప్రాపర్టీ సంకేత స్వాధీనత ఆధారంగా నోటీసు లిచ్చామని, "...సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్ఫోర్స్మెంట్) రూల్స్ 2002లోని రూల్ 8(6) ప్రకారం ఆస్తిని స్వాధీనం చేసుకోవడం ఆధారంగా విక్రయ నోటీసు అందించినట్టు వివరణ ఇచ్చింది. pic.twitter.com/L4BdXxeuyN — Bank of Baroda (@bankofbaroda) August 21, 2023 కాగా మధ్యప్రదేశ్లో గురుదాస్ ఎంపీ సన్నీడియోల్. 2016లో ఒక సినిమా కోసం రుణం తీసుకున్నాడు. చెల్లింపులు చేయకపోవడంతో ఈ బకాయి రూ. 56 కోట్లుకు చేరింది. గత ఏడాది డిసెంబర్ నుంచి మొండి బకాయిల జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిని సెప్టెంబరు 25న ఈ-వేలం వేయనున్నట్టు, ఈ వేలంలో పాల్గొనేందుకు సెప్టెంబరు 22 లోపు దరఖాస్తు చేయాల్సిందిగా బ్యాంకు అధికారులు తొలుత ప్రకటించారు. ఈ ఆస్తికి బ్యాంకు 51.43 కోట్లు రిజర్వ్ ప్రైస్గా నిర్ణయించారు. జుహులోని గాంధీగ్రామ్ రోడ్లో సన్నీ విల్లా, సినీ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ‘సన్నీ సూపర్ సౌండ్’ కూడా ఉన్న 599.44 చదరపు మీటర్ల ఆస్తిని కూడా వేలం వేయడానికి బ్యాంకు సిద్ధపడింది. సన్నీ సౌండ్స్ డియోల్స్ యాజమాన్యంలోని కంపెనీ, లోన్కు సంబంధించిన కార్పొరేట్ గ్యారెంటర్. సన్నీ డియోల్ తండ్రి, బాలీవుడ్ హీరో నటుడు, బీజేపీ మాజీ ఎంపీ, తండ్రి ధర్మేంద్ర వ్యక్తిగత హామీదారు. ధర్మేంద్ర భార్య, నటి హేమామాలిని కూడా బీజేపీ ఎంపీ కావడం గమనార్హం. -
Ameesha Patel: గదర్ 2 సినిమాతో రూ.300 కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్ (ఫోటోలు)
-
అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!
బాలీవుడ్ చాలారోజుల తర్వాత మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఈ మధ్య థియేటర్లలో రిలీజైన 'గదర్ 2' సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తుండటమే దీనికి కారణం. కెరీర్ ఇక అయిపోయిందనకున్న టైంలో సన్నీ డియోల్ ఈ సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. అలాంటిది ఈ హీరో ఇప్పుడు కోట్ల రూపాయల అప్పు చేసి ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. అతడి ఖరీదైన విల్లాని వేలానికి రావడంతో ఈ విషయం బయటపడింది. ఏం జరిగింది? ముంబయి జుహూ ప్రాంతంలో గాంధీగ్రామ్ రోడ్లో సన్నీ డియోల్ కి ఒక విల్లా ఉంది. అయితే దీనిని గ్యారంటీగా పెట్టి, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.56 కోట్లు లోన్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు దాన్ని చెల్లించే విషయంలో మాత్రం మొహం చాటేశాడు. బ్యాంక్ నోటీసులు పంపినా సరే స్పందించలేదు. దీంతో ఏకంగా ఆదివారం (ఆగస్టు 20) ఓ ప్రముఖ పేపర్లో విల్లాని వేలం వేస్తున్నట్లు సదరు బ్యాంక్ ప్రకటన జారీ చేసింది. డబ్బుల్లేవా? బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర వారసుడు అయిన సన్నీ డియోల్.. ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచి ఉన్నాడు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు. అయితే కొన్నాళ్ల నుంచి ఇతడికి సరైన హిట్ అనేది లేదు. దీంతో అందరూ ఇతడి గురించి మర్చిపోయారు. ప్రస్తుతం 'గదర్ 2'తో వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాడు. ఇలాంటి హీరో లోన్ తీసుకుని కట్టకపోవడం ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే అప్పు తీర్చకపోవడం అనేది ఇతడికి పెద్ద సమస్య కాదు. తలుచుకుంటే ఆ మొత్తాన్ని బ్యాంక్లో తీర్చేయొచ్చు. కానీ సన్నీ డియోల్ ఎందుకలా చేస్తున్నాడనే విషయం ప్రస్తుతం అయితే బయటకు రాలేదు. చూడాలి మరి ఈ వేలంలో ఏం జరుగుతుందనేది? (ఇదీ చదవండి: ఆ ఇల్లు వల్లే ధనుష్-ఐశ్వర్య విడిపోయారా..?) -
మీరేమి బాడీ బిల్డర్లు కాదు.. యంగ్ హీరోలపై సన్నీ సెటైర్లు!
గదర్- 2 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్. ఈ చిత్రంలో అమీషా పటేల్ హీరోయిన్గా నటించింది. అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. అనిల్ శర్మ తనయుడు ఉత్కర్ష్ శర్మ కూడా కీలక పాత్రలో కనిపించారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో సన్నీడియోల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కొత్త తరం నటీనటులను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. పరిశ్రమకు నటులు కావాలని.. బాడీబిల్డర్లు అవసరం లేదని చురలకలంచటించారు. గదర్ -2 సక్సెస్ కావడంతో సన్నీ నేటి యువ హీరోలకు ఓ సలహా ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యువనటులు బాడీబిల్డింగ్పై మాత్రమే దృష్టి పెట్టకుండా.. నటనపైనా దృష్టి పెడితే బాగుంటుందని సూచించాడు. సన్నీ మాట్లాడుతూ.. "బాడీబిల్డింగ్, డ్యాన్స్ చేయడం మానేయండి. నటనపైనే దృష్టి పెట్టండి. మీలో ఉన్న ప్రతిభను ముందుకు తీసుకెళ్లండి. ఎందుకంటే మనకు కావల్సింది అదే. మీరేమి బాడీ బిల్డర్లు కాదు. మీరు ఫిట్గా, దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. సంగీతం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. మీరందరూ నా పాత చిత్రాలను చూశారని తెలుసు. అంతకుముందు చాలా మంది నటీనటులు ఉన్నారు. ఇప్పడున్న చాలా మంది కొత్తవారు గొప్పగానే పని చేస్తున్నారు. మీరు కేవలం కండలు తిరిగిన వ్యక్తుల కంటే.. ప్రేక్షకులు మిమ్మల్ని హీరోలుగానే చూసేలా ఉండండి.' అంటూ సలహా ఇచ్చాడు. గదర్ -2 గురించి సన్నీ మాట్లాడుతూ.. 'ఇది చాలా పాత చిత్రంలా అనిపిస్తుంది. కానీ మేము ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా తెరకెక్కించాం. ఫిల్మ్ మేకింగ్ ఎలా అభివృద్ధి చెందిందని సన్నీని ప్రశ్నించగా.. సినిమా తీసే విధానం మారలేదు.. సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. అది మరింత వేగంగా విస్తరించింది.అయినప్పటికీ మన సంస్కృతి, విలువలు, చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉంటాయి.' అని అన్నారు. కాగా.. గదర్- 2 అనేది 2001లో విడుదలైన గదర్: ఏక్ ప్రేమ్ కథా చిత్రానికి సీక్వెల్గా రూపొందించారు. -
నా సినిమాలపై విషప్రచారం.. మాఫియా పనే అంటూ కంగనా ఫైర్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చంద్రముఖి-2, ఎమర్జెన్సీ, తేజస్ చిత్రాల్లో నటిస్తోంది. అయితే బీ టౌన్లో ఎప్పుడు ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది కంగనా. తాజాగా మరోసారి ఫైర్ బ్రాండ్గా పేరున్న కంగనా విమర్శలతో వార్తల్లో నిలిచింది. తన సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. దేవుడా అలాంటి వారి ఆత్మకు శాంతి కలిగించు వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది. దీని వెనుక ఓ మాఫియా ముఠా ఉందంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో రాసుకొచ్చింది. (ఇది చదవండి: అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!) తన సినిమాలపై వ్యతిరేక ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నా సినిమాల్లో రూ.150 కోట్లు వసూళ్లు సాధించిన చిత్రాలను ఫ్లాప్స్ అంటూ విషప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించింది. ప్రతిరోజూ 10-15 కథనాలు నా చిత్రాలు ఫ్లాప్స్ అంటూ రాస్తున్నారు. ఇతరుల పట్ల ఇలాంటి నీచమైన ఆలోచనలు ఎలా వస్తాయంటూ నిలదీస్తోంది. వీటి కోసం పగలు, రాత్రి ప్లాన్ చేసి.. ఇతరులను చెడుగా చూపించడానికి వారు స్వంత డబ్బును ఖర్చు చేస్తున్నారంటూ కంగనా తీవ్ర ఆరోపణలు చేసింది. గతంలో 2015లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, సన్నీ డియోల్ నటించిన చిత్రం ఐ లవ్ న్యూ ఇయర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ చిత్ర తర్వాత కంగనా కెరీర్ ముగిసిపోయిందనే పెద్దఎత్తున వార్తలొచ్చాయి. అయితే కంగనా ఆ ఆరోపణలను ఖండించింది. తాజాగా సన్నీ డియోల్ నటించిన గదర్- 2 చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని కంగనా ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేకాదు సన్నీ డియోల్కు నేను ఓ పెద్ద ఫ్యాన్ను అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతంలో తనపై గూఢచర్య చేస్తున్నారని ఆలియాభట్, రణ్బీర్ కపూర్ను ఉద్దేశించి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నాకు నత్తి.. ఏం మాట్లాడినా ఎగతాళి చేశారు: హృతిక్ రోషన్) -
ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తనయుడు, నటుడు కరణ్ డియోల్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రేయసి దృష ఆచార్యతో ఏడడుగులు నడిచాడు. జూన్ 18న ఇరు కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి శ్రీకారం చుట్టే వివాహ వేడుక కోసం సుందరంగా ముస్తాబైందీ కొత్త జంట. నూతన వధువు ఎరుపు లెహంగాలో మెరిసిపోగా, వరుడు కరణ్ డియోల్ షేర్వానీ ధరించాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆదివారం రాత్రి సినీప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు. ఇకపోతే కరణ్ డియోల్.. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుక సైతం ఘనంగా జరిగింది. బరాత్ వేడుకలో కరణ్ తండ్రి సన్నీ డియోల్తో పాటు బాబీ, అభయ్ డియోల్, తాతయ్య ధర్మేంద్ర కూడా స్టెప్పులేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: హఠాత్తుగా ఎందుకంత కోపం?: ఆదిపురుష్ రచయిత -
నిన్న తిరుమల, నేడు గురుద్వార్.. మీరు మారరా?
బాలీవుడ్లో సన్నీడియోల్, అమీషా పటేల్ నటిస్తున్న 'గదర్-2' వివాదానికి దారి తీసింది. ఈ సినిమాలో సిక్కుల పవిత్ర స్థలం అయిన గురుద్వారాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఆ సీన్లలో ముద్దు సన్నివేశాలతో పాటు కౌగిలింతలకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ సంఘటన వల్ల గురుద్వారా నిర్వాహకులతో పాటు సిక్కు మతస్థులు చిత్ర యూనిట్పై ఫైర్ అవుతున్నారు. దేవుడిని నమస్కరించే సీన్ షూట్ చేస్తామని చెప్పి అనుమతులు తీసుకున్నారని గురుద్వారా మేనేజర్ సత్బీర్ సింగ్, సెక్రటరీ శివ కన్వర్ సింగ్ తెలిపారు. (ఇదీ చదవండి: కుటుంబ పోషణ భారమై డ్రైవర్గా మారిన హీరో? నిజమేంటంటే?) కొన్నిరోజుల క్రితం తిరుపతిలో కృతిసనన్ చెంపపై ఓం రౌత్ ముద్దు పెట్టడం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరిచిపోక ముందే ఇదే తరహాలో మరోకటి జరగడంతో ఛీ.. ఛీ దేవాలయాల్లో ఇవేం పనులు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. కనీసం వారు క్షమాపణలు చెబితే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు. ఇక పోతే, తెలుగులో అమీషా పటేల్ పవన్ సరసన 'బద్రి'తో మెప్పించింది. ఆ తరువాత మహేష్తో నాని, ఎన్టీఆర్తో నరసింహుడులో నటించిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) -
రివ్యూయర్లూ.. బహుపరాక్, తప్పుడు రివ్యూ రాస్తే మరణమే..!
సినిమా రిలీజైతే సమీక్షకులు స్టార్లు ఇస్తారు. కాని ఒక సీరియల్ కిల్లర్ బయల్దేరి ఆ రివ్యూలు రాసే వారిని హత్య చేసి వారి నుదుటిన స్టార్లు ఇస్తుంటే? మనం నమ్మినా నమ్మకపోయినా ‘రివ్యూల మాఫియా’ ఒకటి ఉంది.మంచి సినిమాలు చెత్త రివ్యూలను పొందితే ఆ దర్శకుడికి ఎంత బాధ? అలాంటి వాడు సీరియల్ కిల్లర్గా మారితే? ఊహ కొంచెం అతిగా ఉన్నా దర్శకుడు బాల్కి ఈ సినిమా తీశాడు.సన్నిడియోల్, పూజా భట్, దుల్కర్ సల్మాన్ నటించారు.వచ్చే వారమే ‘చుప్’ విడుదల.రివ్యూయర్లూ... బహుపరాక్! అన్నట్టు నాడు ‘కాగజ్ కే ఫూల్’ సినిమా మీద చెత్త రివ్యూలు రాయడం వల్ల సినిమాలే మానుకున్న గురుదత్కు ఈ సినిమా నివాళి. బహుశా ఈ సినిమా రివ్యూయర్ల బాధితులందరి ఒక సృజనాత్మక ప్రతీకారం. కష్టపడి నెలల తరబడి సినిమా తీస్తే, రెండు గంటల పాటు హాల్లో చూసి ఆ వెంటనే తీర్పులు చెప్పేసి ‘సినిమా చూద్దామనుకునేవాళ్లను’ ఇన్ఫ్లూయెన్స్ చేసే రివ్యూయర్ల మీద బదులు తీర్చుకుందామని ఎవరైనా అనుకుని ఉంటే, కనీసం ఊహల వరకు వారిని సంతృప్తిపరిచే పని దర్శకుడు బాల్కి నెత్తికెత్తుకున్నాడు. బాల్కి అంటే ‘చీనీ కమ్’, ‘పా’, ‘పాడ్మేన్’ వంటి సినిమాల దర్శకుడు. ఇప్పుడు ‘చుప్’ సినిమా తీశాడు. సెప్టెంబర్ 23 విడుదల. సన్ని డియోల్, పూజా భట్ వంటి సీనియర్లు, దుల్కర్ సల్మాన్ వంటి యువ స్టార్లు ఈ సినిమాలో ఉన్నారు. ఇది ‘సైకలాజికల్ థ్రిల్లర్’. ‘రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. ఇక్కడ ఆర్టిస్ట్ అంటే కళాకారుడు అని అర్థం. యూట్యూబ్లో ఉన్న ట్రైలర్లో సీరియల్ హంతకుడు రివ్యూయర్లను చంపడం, వారి నుదుటి మీద స్టార్లు ఇవ్వడం కనిపిస్తుంది. ఆ సీరియల్ కిల్లర్ పాత్రను పోషించిందెవరో ఇప్పటికి సస్పెన్స్. సన్ని డియోల్ మాత్రం పోలీస్ ఆఫీసర్గా చేశాడు. పూజా భట్ నిర్మాతగానో అలాంటి పాత్రగానో కనిపిస్తోంది. దుల్కర్ పాత్ర ఏమిటనేది తెలియడం లేదు. రివ్యూయర్ను చంపుతున్న సీరియల్ కిల్లర్ ‘స్టార్లు ఇవ్వడం కాదు. సినిమాను ప్రేక్షకులు అర్థం చేసుకోవడంలో సాయం చేయ్. అంతే తప్ప నోటికొచ్చినట్టు రాయడం కాదు’ అంటుంటాడు. అంటే ఇదంతా అరాకొరా జ్ఞానంతో రివ్యూలు రాసేవారి భరతం పట్టడం అన్నమాట. ఊరికే ఉండాలా? సినిమా ఎలా ఉన్నా ఊరికే (చుప్) ఉండాలా? అలా ఉండాల్సిన పని లేదు. కాని ఒక సినిమాను సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా వ్యాఖ్యానం చేస్తున్నామా? సినిమాకు మేలు చేసేలా వ్యాఖ్యానం ఉందా... కళాకారుల కళను ఎద్దేవా చేసేలా ఉందా? అనాలోచితంగా వ్యాఖ్యలు చేస్తే అవి సినిమాను దెబ్బ తీస్తే బాధ్యులు ఎవరు? విమర్శ కూడా సినిమా తీసిన వారిని ఆలోచింప చేసేలా ఉండాలి కాని బాధ పెట్టేలా ఉండొచ్చా? మాటలు పెట్టే బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఎవరైనా అంచనా కట్టగలరా? మాటలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అందుకే ‘తెలిస్తే మాట్లాడండి. లేకుంటే నోర్మూసుకొని ఉండండి’ అనే అర్థంలో బాల్కి ఈ సినిమా తీశాడు. ట్రైలర్కి ఒక రివ్యూయర్ (లంచం తీసుకుని) చెత్త సినిమాకు నాలుగు స్టార్లు ఇస్తే అలాంటి వాణ్ణి కూడా సీరియల్ కిల్లర్ చంపుతూ కనపడతాడు. అంటే బాగున్న సినిమాను చెత్త అన్నా, చెత్త సినిమాను బాగుంది అన్నా ఈ సీరియల్ కిల్లర్ బయలుదేరుతాడన్నమాట. సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ రివ్యూయర్ అవతారం ఎత్తుతున్నారు. సినిమా వాళ్లు చికాకు పడుతున్నారు. ‘చుప్’ చూశాక వీరంతా ఏమంటారో... ప్రేక్షకులు ఏ తీర్పు ఇస్తారో చూడాలి. గురుదత్ బాధకు జవాబు దర్శకుడు బాల్కి నాటి గొప్ప దర్శకుడు గురుదత్కు అభిమాని కావచ్చు. గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్’ (1959) బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. అది మన దేశంలో తొలి సినిమాస్కోప్ చిత్రం. అంతే కాదు గురుదత్ తన మేధను, డబ్బును, గొప్ప సంగీతాన్ని, కళాత్మక విలువలను పెట్టి తీసిన చిత్రం. కాని రిలీజైనప్పుడు విమర్శకులు ఘోరంగా చీల్చి చెండాడారు ఆ సినిమాను. దాంతో ప్రేక్షకులు కూడా సినిమాను అర్థం చేసుకోలేక రిజెక్ట్ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గురుదత్ను ఈ ఫలితం చావుదెబ్బ తీసింది. ఆ తర్వాత అతను జడిసి మరే సినిమాకూ దర్శకత్వం వహించలేదు. కుంగిపోయాడు కూడా. కాని ఆశ్చర్యం ఏమిటంటే కాలం గడిచే కొద్దీ ‘కాగజ్ కే ఫూల్’ క్లాసిక్గా నిలిచింది. దేశంలో తయారైన గొప్ప సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తన కాలం కంటే ముందు తీసిన సినిమాగా సినిమా పండితులు వ్యాఖ్యానిస్తారు. ప్రపంచ దేశాల్లో సినిమా విద్య అభ్యసించేవారికి అది సిలబస్గా ఉంది. బాల్కీ అభ్యంతరం అంతా ఇక్కడే ఉంది. ‘కాగజ్ కే ఫూల్ రిలీజైనప్పుడు విమర్శకులు కొంచెం ఓర్పు, సహనం వహించి అర్థం చేసుకుని ఉంటే గురుదత్కు ఆ బాధ, సినిమాకు ఆ ఫలితం తప్పేవి’ అంటాడు. ఆ సినిమాను చంపిన రివ్యూయర్లపై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికన్నట్టుగా ‘చుప్’ తీశాడు. గురుదత్ సినిమాల్లోని పాటలే ఈ సినిమాలో వాడాడు. -
వెండితెరపైకి స్టార్ కిడ్స్.. హీరో, హీరోయిన్, డైరెక్టర్గా
Paloma Dhillon Rajveer Deol Debut In Rajshri Productions: బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసులు వెండితెరపై ఎంట్రీ ఇవ్వడం సాధారణమే. ఇటీవలే బాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ వారసులు అగస్త్యా నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (బోనీ కపూర్-దివంగత నటి శ్రీదేవిల చిన్న కుమార్తె), సుహానా ఖాన్ (షారుక్ ఖాన్ కుమార్తె) నటిస్తున్న తొలి వెబ్ ఫిల్మ్ ‘ద ఆర్చీస్’ పోస్టర్ విడుదలైంది. తాజాగా మరో స్టార్ హీరో తనయుడు, నటి కుమార్తె వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ కుమారుడు రాజ్వీర్ డియోల్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్గా ప్రముఖ నటి పూనమ్ దిల్లాన్, నిర్మాత అశోక్ థకేరియా కుమార్తె పలోమా దిల్లాన్ తెరంగేట్రం చేయనుంది. వీరిద్దరికి ఇదే డెబ్యూ మూవీ కానుంది. అంతేకాకుండా ఈ చిత్రంతో డైరెక్టర్ సూరజ్ బర్జాత్యా కుమారుడు అవినీష్ ఎస్ బర్జాత్యా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. రాజశ్రీ ప్రొడక్షన్లో 59వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జులైలో ప్రారంభం కానుంది. కాగా మోడ్రన్ సంబంధాలను చూపిస్తూ లావిష్ డెస్టినేషన్ వెడ్డింగ్ కథతో రానుంది ఈ మూవీ. చదవండి: బాలీవుడ్ బిగ్ స్టార్స్ వారసులంతా ఒకే ఫ్రేమ్లో.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సన్నీ డియోల్ తనయుడికి నిశ్చితార్థమంటూ వార్తలు.. ఇదిగో క్లారిటీ
Karan Deol Engaged To Bimal Roy Great Granddaughter Here is The Truth: సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ ప్రస్తుతం వార్తల్లో ప్రధానాంశంగా మారాడు. హిందీ పరిశ్రమతోపాటు సోషల్ మీడియాలో అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించి చర్చ నడుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ బిమల్ రాయ్ మునిమనువరాలు ద్రిశాతో కరణ్ డియోల్కు ఎంగేజ్మెంట్ జరిగిందని బాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని బీటౌన్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలను కరణ్ డియోల్ బృందం కొట్టిపారేసింది. కరణ్ డియోల్కు నిశ్చితార్థం జరిగిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. 'కరణ్ డియోల్, ద్రిశలు ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందని వస్తున్న వార్తలు అవాస్తవం.' అని పేర్కొంది. కాగా 'పల్ పల్ దిల్ కే పాస్' మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు కరణ్ డియోల్. త్వరలో అనిల్ శర్మ దర్శకత్వంలో వస్తున్న 'అప్నే 2' చిత్రంలో అతని తండ్రి సన్నీ డియోల్తోపాటు ధర్మేంద్ర, బాబీ డియోల్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఇంతుకుముందు 2013లో వచ్చిన 'యమ్లా పగ్లా దివానా 2'లో సన్నీ, బాబీ, ధర్మేంద్ర ముగ్గురు నటించారు. ఈ మూవీకి రెండో యూనిట్ డైరెక్టర్గా కరణ్ డియోల్ పనిచేశాడు. చదవండి: బాలీవుడ్పై మరోసారి ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. హాట్టాపిక్గా మారిన సల్మాన్ ఖాన్ తమ్ముడి విడాకులు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బాల్కీ ప్రయోగం..సన్నీ డియోల్, దుల్కర్ సల్మాన్తో థ్రిల్లర్ మూవీ
చీనీ కమ్, పా, ప్యాడ్ మ్యాన్... ఇలా బాలీవుడ్ దర్శకుడు ఆర్. బాల్కీ తెరకెక్కించినవన్నీ విభిన్న చిత్రాలే. హిందీ సినిమా ఒక రూట్లో వెళుతుంటే బాల్కీ వేరే రూట్లో వెళ్లి సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు చార్ (నాలుగు) జోర్ చూపించడానికి రెడీ అయ్యారు. సన్నీ డియోల్, దుల్కర్ సల్మాన్, పూజా భట్, శ్రేయా ధన్వంతరి ఈ నలుగురూ ప్రధాన తారాగణంగా బాల్కీ ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కించనున్నారు. ‘‘సన్నీ డియోల్ లాంటి అద్భుత నటుడితో ఓ కొత్త అడ్వంచర్ మూవీ చేయడం ఆనందంగా ఉంది. ఆయన సినిమా కెరీర్లో ఇది ఓ కొత్త కోణం చూపించే సినిమా అవుతుంది. అలాగే ఇండియన్ సినిమాలో ఉన్న చార్మింగ్ యాక్టర్స్లో దుల్కర్తో సినిమా చేయడం ఓ ఆనందం. విలక్షణ నటి పూజా భట్ ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోరు. ఆమె ఈ సినిమా ఒప్పుకోవడం ఓ మంచి విషయం. ఇక, ‘స్కామ్ 1992’లో అద్భుతంగా నటించిన శ్రేయా ధన్వంతరి ఈ సినిమాలో భాగం కావడం మరో మంచి విషయం’’ అని బాల్కీ అన్నారు. త్వరలో షూటింగ్ ఆరంభం కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
లగాన్ వర్సెస్ గదర్: రెండూ గొప్ప సినిమాలే!
భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం ‘లగాన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇండియా’. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డుకి నామినేషన్ ఎంట్రీకి వెళ్లడంతో పాటు ఎనిమిది జాతీయ అవార్డులు సాధించిన చిత్రం ‘లగాన్’. ఆమిర్ ఖాన్ హీరోగా నటించడమే కాదు.. నిర్మాతగా మారి, నిర్మించిన తొలి చిత్రం ఇది. అశుతోష్ గోవారీకర్ దర్శ కత్వం వహించిన ఈ చిత్రం విడుదలై జూన్ 15కి 20 ఏళ్లయింది. ఈ చిత్రంతో పాటు సన్నీ డియోల్ నటించిన ‘గదర్: ఏక్ ప్రేమ్కథ’ కూడా విడుదలై 20 ఏళ్లయింది. ఈ చిత్రాన్ని అనిల్ శర్మ డైరెక్ట్ చేశారు. రెండు సినిమాలు ఒకే రోజున విడుదలైనప్పుడు పోలికలు సహజం. ఎక్కువ తక్కువలు ఉండటమూ సహజమే. ‘గదర్’కి జాతీయ అవార్డులు రాకపోయినా మంచి సినిమా అనిపించుకుని, మంచి విజయాన్ని అందుకుంది. ఇక 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘లగాన్’ 20 ఇయర్స్ సెలబ్రేషన్స్లో పాల్గొనవలసిందిగా చిత్రబృందం ఇచ్చిన పిలుపుకు నెటిజన్లు పాజిటివ్గా స్పందించారు. ‘మై లగాన్ స్టోరీ’ అంటూ ‘లగాన్’ సినిమా గురించిన తమ అభిప్రాయాలను, అనుభూతులను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు ‘‘లగాన్’ చిత్రం విడుదలైన రోజునే (జూన్ 15, 2001) ‘గదర్’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గదర్’ కూడా మంచి సినిమాయే. వసూళ్ల పరంగా కూడా మంచి విజయం సాధించింది. కేవలం ‘లగాన్’ సినిమా గురించే ప్రస్తావించడం సరైంది కాదు. ‘గదర్’ సినిమాను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అన్నట్లుగా కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇలా ఇరవై ఏళ్ళ క్రితం ‘లగాన్’, ‘గదర్’ సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీపడితే తాజాగా ఈ రెండు సినిమాల అభిమానులు సోషల్ మీడియాలో ‘లగాన్ వర్సెస్ గదర్’ అనే విధంగా కామెంట్లు విసురుకోవడం విశేషం. ఆ సంగతలా ఉంచితే... ‘లగాన్’ చిత్రబృందం రీ యూనియన్కు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రంగం సిద్ధం చేస్తోంది. ‘ఛలే ఛలో లగాన్: వన్స్ అపాన్ యాన్ ఇంపాజిబుల్ డ్రీమ్’ అనే టైటిల్తో జరగనున్న ఈ రీ యూనియన్ స్పెషల్ నెట్ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ చానెల్లో ప్రసారం కానుంది. ‘లగాన్’ గురించి ఆమిర్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ..‘‘ఈ చిత్రప్రయాణంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. ‘లగాన్’ నాకు అద్భుతమైన జర్నీ. నా జీవితానికి కొత్త స్నేహితులను, బంధాలను ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాతో పాటు ఈ బంధాలు కూడా ఇరవై ఏళ్ళ నుంచి నా జీవితంలో కొనసాగుతూనే ఉన్నాయి. ‘లగాన్’ గ్యాంగ్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ‘‘ప్రజలందరూ కలిసి కష్టాలపై సమష్టిగా పోరాడే తత్వమే ‘లగాన్’ చిత్రానికి ప్రేరణ’’ అన్నారు దర్శకులు అశుతోష్. ‘‘ఇండియన్ సినిమా చరిత్రలో ‘లగాన్’ ఒక ఐకానిక్ మూవీ. భారతీయ కథలను విశ్వ వేదికపై నిలిపిన చిత్రం ఇది. ‘లగాన్’ 20 ఏళ్ళ సెలబ్రేషన్స్ చేస్తున్నందుకు గౌరవంగా ఫీల్ అవుతున్నాం’’ అన్నారు నెట్ఫ్లిక్స్ ప్రతినిధి షెర్గిల్. ‘గదర్’ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘‘మేం ఒక సినిమా చేశాం. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్స్లో ఓ వేడుకలా చూశారు. ఈ హిస్టారిక్ ఫిల్మ్తో అసోసియేట్ ఉన్న అందరికీ ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు సన్నీ డియోల్. చదవండి: ఒంటినిండా బురదతో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? -
Dimple Kapadia: భర్తతో విడిపోయినా విడాకులివ్వలేదు, ఎందుకంటే..
Happy Birthday Dimple kapadia: డింపుల్ కపాడియా… ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారులకు నిద్రలేకుండా చేసిన బ్యూటీ. అప్పటి డింపుల్ అందాలను తలచుకొని ఈ నాటికీ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ దర్శకత్వంలో రిషీ కపూర్ను హీరోగా తెరకెక్కించిన ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్కు పరిచయం అయిన డింపుల్.. తొలి మూవీతోనే హిట్ కొట్టి ఓవర్ నైట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయింది. అంతేగా కాదు ఉత్తమనటిగా ‘ఫిలిమ్ ఫేర్’ అవార్డును ఎగరేసుకు పోయింది. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఆతర్వాత ‘రుడాలి’లో తన నటవిశ్వరూపం చూపించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగానూ డింపుల్ నిలచింది. ఇదిలా ఉంటే ‘బాబీ’ సినిమా విడుదల కాకముందే, డింపుల్ గురించి బాలీవుడ్లో చర్చలు మొదలయ్యాయి. ఆమె అందం, నటన గురించి బాలీవుడ్ పెద్దలంతా చర్చించుకున్నారు. ఆ విషయం ఆ నోటా, ఈ నోటా ఆ నాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాను చేరింది. అతను తొలి చూపులోనే డింపుల్తో ప్రేమలో పడిపోయాడు. ఇక సూపర్ స్టార్ రాజేశ్ను చూశాక, డింపుల్ కూడా ఇష్టపడింది. దీంతో తనకంటే వయసులో 15 ఏళ్ళు పెద్దవాడయినా, రాజేశ్ ఖన్నాను వివాహమాడటానికి అంగీకరించింది డింపుల్. ‘బాబీ’ రిలీజ్ కు కొన్ని నెలల ముందే(1973) రాజేశ్, డింపుల్ పెళ్ళాడారు. పెళ్ళయ్యాక డింపుల్ సినిమాలకు దూరంగా ఉంది. ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా పుట్టిన తరువాత కూడా రాజేశ్, డింపుల్ మధ్య అన్యోన్యబంధమే ఉందని చెప్పవచ్చు. కారణం ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత రాజేశ్, డింపుల్ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దాంతో పరస్పర అంగీకారంతోనే విడిపోయారు. రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా విభేదించి విడిపోయినా, ఏ నాడూ ఒకరి ఇష్టాలకు మరొకరు అడ్డుగా నిలువలేదు. పిల్లల కోసం ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోలేదు. పార్టీల్లో కలుసుకున్నప్పుడు ఫ్రెండ్స్ లా మాట్లాడుకొనేవారు. రాజేశ్ ఖన్నా ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, ఆయన తరపున ప్రచారం కూడా చేసింది డింపుల్. ఈ ఎన్నికలో రాజేశ్ ఖన్నా విజయం సాధించారు. అందుకే విడాకులు ఇవ్వలేదు రాజేశ్ ఖన్నాతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న డింపుల్కూ సన్నీ డియోల్ మంచి సోల్మేట్ అయ్యాడు. కష్టకాలంలోఆమెకు అండగా నిలబడ్డాడు.వారిద్దరి ప్రేమకథ చిత్రసీమలో భలేగా చక్కర్లు కొట్టింది. వారి లవ్ ఎఫైర్ ను క్యాష్ చేసుకొనేందుకు నిర్మాతలు, దర్శకులు కూడా సన్నీ, డింపుల్ జోడీని ఎంచుకొనేవారు. అయితే వీరిద్దరు ప్రేమ గురించి తెలిసి సన్నీ భార్య పూజ అప్పట్లో గొడవ కూడా చేసింది. దీంతో ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందిగా సన్నీని కోరిందట డింపుల్. కానీ సన్నీ మాత్రం భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఇష్టపడలేదట. సన్నీ నిర్ణయంపట్ల కలత చెందిన డింపుల్... రాజేశ్కి విడాకులు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకుందట. సన్నీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. చివరి దాకా భార్యగా రాజేశ్ కు సపర్యలు చేసింది డింపుల్. -
మౌనం వీడిన సన్నిడియోల్..
న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసనలు పన్నెండు రోజులకు చేరిన నేపథ్యంలో గుర్దాస్పూర్ బీజేపీ ఎంపీ నటుడు సన్ని డియోల్ మౌనం వీడారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్లో స్పందించారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ వారి శ్రేయస్సు కోసం పాటుపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతగానో మేలు చేకూర్చేవని ట్వీట్ చేశారు. బిల్లుల సమస్య కేంద్ర ప్రభుత్వం రైతులకి సంబంధించిదని వారి మధ్య ఎవరూ జోక్యం చేసుకోవద్దని కోరారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, కాని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం రైతుల గురించి ఆలోచించకుండా సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వెన్నంటి ఉన్నకార్యకర్త దీప్ సిద్దూ ప్రస్తుతం తనతో లేడని, నిరసనలకు అనుకూలంగా ఖలీస్తాన్ను సాకుగా చూపిస్తూ అతను మాట్లాడిన వ్యాఖ్యలకు తనకెలాంటి సంబంధం లేదని సన్ని స్పష్టం చేశారు. తానెప్పుడు రైతు పక్షపాతినేనని, రైతుల క్షేమం కోసం తమ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని.. రైతులతో చర్చల తర్వాత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు బిల్లులకు వ్యతిరేకంగా నవబంర్ 26 నుంచి రాజధాని దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 8 న భారత్ బంద్కి పిలుపునిచ్చారు. ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంబను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదిన రైతు సంఘాల నాయకులతో మరోసారి చర్చలు జరపనుంది. -
సన్నీ డియోల్కు కరోనా
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘‘కరోనా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటున్నాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసినవాళ్లందరూ టెస్ట్ చేయించుకోండి. ఐసోలేషన్లో ఉండండి’’ అన్నారు సన్నీ. సినిమాల విషయానికి వస్తే.. ‘అప్నే 2’లో నటించనున్నారాయన. తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీ డియోల్, అలానే కుమారుడు కరణ్ డియోల్తో కలసి ఈ సినిమాలో నటించనున్నారు సన్నీ. -
నటుడు, ఎంపీ సన్నీడియోల్కు కరోనా
సిమ్లా : బాలీవుడ్ ప్రముఖ నటుడు, గురుదాస్పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శి అమితాబ్ అవస్థీ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మనాలీలోనే చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా గత రెండు, మూడు రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరుతూ సన్నీడియోల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. (కరోనాతో మరో ఎంపీ కన్నుమూత ) 64 ఏళ్ల సన్నీడియోల్ ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకునేందుకు కుల్లూ జిల్లాలోని మనాలీ సమీపంలోని ఫాం హౌస్లోనే ఉంటున్నారు. ఈ నేపధ్యంలో తన స్నేహితులతో కలిసి తిరిగి ముంబై వెళ్లాలనుకున్నారని, ఈ క్రమంలో చేసిన పరీక్షలో సన్నాడియోల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గతేడాది పంజాబ్ గురుదాస్పూర్ నుంచి ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా తొలిసారి పోటీచేసిన సన్నిడియోల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే సన్నీడియోల్ తండ్రి ధర్మేంద్ర గతంలో బీజేపీ ఎంపీగా పనిచేశారు. (శాసన మండలికి ఊర్మిళ?) -
మళ్లీ వస్తున్నాం
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, ఆయన కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోల్ కలసి స్క్రీన్ మీద నవ్వులు పండించిన చిత్రం ‘అప్నే’. ధర్మేంద్ర, సన్నీ, బాబీ, కత్రీనా కైఫ్, శిల్పా శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 2007లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ మ్యాజిక్ను మళ్లీ రిపీట్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘అప్నే’కు సీక్వెల్గా ‘అప్నే 2’ను తెరకెక్కించే పనిలో ఉన్నట్టు ఆదివారం ప్రకటించారు ధర్మేంద్ర. ‘మీ అందరికీ ‘అప్నే 2’ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ∙సన్నీ డియోల్, ధర్మేంద్ర, బాబీ డియోల్ -
‘పాకిస్తాన్కు నేను కాకపోతే ఇంకెవరు వెళ్తారు’
చంఢీగడ్ : కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవంలో బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ పాల్గొంటారని పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈసందర్భంగా సన్నీ డియోల్.. ‘నేను కాకపోతే.. ఇంకెవరు వెళ్తారు. నేను తప్పకుండా వెళ్తా’అని మీడియాతో అన్నారు. పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి ఎంపీగా ఎన్నికైన సన్నీ అక్కడి గురుద్వారలో పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం గమనార్హం. కర్తార్పూర్ కారిడార్ శనివారం (నవబంర్ 9) ప్రారంభం కానుంది. (చదవండి : సిద్ధూకు పాక్ వీసా మంజూరు) ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్సింగ్, కేంద్ర మంత్రులు హరదీప్ పూరి, హర్సిమ్రత్కౌర్ బాదల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవజోత్ సింగ్ సిద్ధూకు విదేశీ వ్యవహారాలశాఖ అనుమతినిచ్చింది. భారత్ నుంచి 550 మంది సిక్కు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దాయాది దేశానికి వెళ్తున్నారు. పాకిస్తాన్లోని రావి నది ఒడ్డున కర్తార్పూర్లోని గురుద్వార దర్బార్ సాహిబ్ను సిక్కులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ అక్కడ 18 ఏళ్లపాటు గడిపారు. (చదవండి : ‘కర్తార్పూర్’పై పాక్ వేర్వేరు ప్రకటనలు) ప్రతియేడు పెద్ద సంఖ్యలో సిక్కులు కర్తార్పూర్ గురుద్వారను సందర్శిస్తారు. గురునానక్ దేవ్ దైవైక్యం పొందిన గురుదాస్పూర్ గురుద్వార.. గురుద్వార దర్బార్ సాహిబ్ను కలుపుతూ నిర్మించిందే కర్తార్పూర్ కారిడార్. సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి (నవంబర్ 12) వేడుకలను జరుపుకోవడానికి సిక్కులకు అవకాశం కల్పించడం కోసమే 9వ తేదీన కారిడార్ను ప్రారంభించినున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే. -
సన్నీ ఫోన్ నంబరు ఎంత పనిచేసింది!
ముంబై: ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టు తయారైంది ముంబై వాసి ప్రశాంత్ మిశ్రా పరిస్థితి. అధికారులు చేసిన పొరపాటు అతడికి పెద్ద చికాకు తెచ్చిపెట్టింది. లోక్సభ వెబ్సైట్లో పొరపాటున అతడి మొబైల్ నంబరు పెట్టడంతో నిరాంతరాయంగా ఫోన్ కాల్స్, మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ గురుదాస్పూర్ ఎంపీ, నటుడు సన్నీ డియోల్కు వెళ్లాల్సినవి. లోక్సభ వెబ్సైట్లో సన్నీ డియోల్ నంబరుకు బదులుగా ప్రశాంత్ మిశ్రా ఫోన్ నంబరు పెట్టారు. దీంతో అతడి ఫోన్కు రకరకాల ఫిర్యాదులు, అభ్యర్థనలతో ఫోన్లు, వాట్సప్, టెక్ట్స్ మెసేజ్లు వస్తున్నాయి. సన్నీ డియోల్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ముంబైలో ఉంటున్నారని గురుదాస్పూర్ వాసుల నుంచి ఫిర్యాదు వెల్లువెత్తాయి. సన్నీడియోల్ను తమ ఎంపీగా ఎన్నుకుని తప్పు చేశామని చాలా మంది వాపోయారు. సన్నీడియోల్ను కలవాలని ఆయన అభిమానులు చాలా మంది తనకు ఫోన్లు చేస్తున్నారని ప్రశాంత్ మిశ్రా వాపోయాడు. గతేడాదే ఈ ఫోన్ నంబరు తీసుకున్నానని, లోక్సభ వెబ్సైట్లో పొరపాటుగా తన నంబరు పెట్టడంతో వేలాదిగా ఫోన్లు వస్తున్నాయని తెలిపాడు. తన నంబరును లోక్సభ వెబ్సైట్ నుంచి తొలగించాలని కోరుకుంటున్నాడు. సన్నీ డియోల్ ఫోన్ నంబరును లోక్సభ వెబ్సైట్లో అప్డేట్ చేశారని ఆయన వ్యక్తిగత సహాయకుడు నిరంజన్ విద్యాసాగర్ తెలిపారు. పొరపాటుగా పెట్టిన ప్రశాంత్ నంబరును అధికారులు తొలగిచారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి బీజేపీ ఎంపీగా సన్నీ డియోల్ గెలిచిన సంగతి తెలిసిందే. -
ఒక సినిమా.. రెండు రీమిక్స్లు
పాపులర్ పాటల్ని రీమిక్స్ చేసే ట్రెండ్ను కొనసాగిస్తూనే ఉంది బాలీవుడ్. పాత పాటలకి ట్రెండీ టచ్ ఇచ్చి సినిమాకు కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంటోంది. లేటెస్ట్గా రెండు పాత పాటల్ని ఒకే సినిమాలో రీమిక్స్ చేయాలనుకుంటున్నారు. జాన్ అబ్రహాం, ఇలియానా, అనిల్ కపూర్ నటించిన చిత్రం ‘పాగల్ పంతీ’. అనీజ్ బజ్మీ దర్శకుడు. ఈ సినిమా కోసం సన్నీ డియోల్, శ్రీదేవి నటించిన ‘చాల్బాజ్’లోని ‘తేరా బీమార్ మేరా దిల్..’ పాటను రీమిక్స్ చేశారట. మరో పాట ఏంటనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఒరిజినల్ పాటలో సన్ని, శ్రీదేవి కెమిస్ట్రీ హైలెట్గా నిలిచినట్టు, జాన్, ఇలియానా కెమిస్ట్రీ కూడా ఈ సినిమాలో ఓ హెలైట్ అవుతుందట. నవంబర్ 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. -
రూల్స్ బ్రేక్ చేసిన సన్నీడియోల్
చంఢీఘర్: గురుదాస్పూర్ లోక్సభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు, నటుడు సన్నీ డియోల్ ఎన్నికల వ్యయ పరిమితి రూ.70 లక్షలకు మించి ఖర్చు చేసినట్లు తేలిందని ఎన్నికల అధికారి తెలిపారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రూ. 78,51,592 ఖర్చు చేశారు. నిబంధనల ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గానికి రూ. 70లక్షల వరకు వ్యయపరిమితి ఉంటుంది. చట్టబద్ధమైన పరిమితి కంటే రూ. 8.51 లక్షలు అధికంగా ఖర్చు చేసినట్లు గురుదాస్పూర్ జిల్లా ఎన్నికల కార్యాలయం పోల్ ఖర్చుల తుది నివేదికను భారత ఎన్నికల సంఘానికి పంపినట్లు జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. నివేదిక ప్రకారం లోక్సభ ఎన్నికల్లో సన్నీ డియోల్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జఖర్ ఎన్నికల ఖర్చు రూ. 61,36,058గా నిర్ణీత పరిమితిలో ఉంది. ఎన్నికల వ్యయ పరిమితిపై వివరణ ఇవ్వాలంటూ గత నెలలో గురుదాస్పూర్ జిల్లా ఎన్నికల అధికారి ఎంపీ డియోల్కు నోటీస్ పంపారు. కాగా పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రతిపక్షం సన్నీ డియోల్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తన పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి, ముఖ్యమైన విషయాలను సంబంధిత అధికారులతో చర్చించడానికి ఎంపీ సన్నీ డియోల్ ఓ ప్రతినిధిని నియమించుకున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా వివిధ వర్గాల నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. సన్నీ డియోల్ ఈ ఎన్నికల్లో 82,459 ఓట్ల తేడాతో సునీల్ జఖర్ను ఓడించారు. -
సన్నీ డియోల్ చర్యపై విమర్శల వర్షం..!
చంఢీగడ్ : ప్రముఖ నటుడు, గురుదాస్పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ ఓ ప్రతినిధిని నియమించుకున్నారు. నియోజకవర్గంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాల్లో తన బదులు గురుప్రీత్సింగ్ పల్హేరీ హాజరవుతారని ఒక లేఖ విడుదల చేశారు. ఈ వ్యవహారంలపై కాంగ్రెస్ పార్టీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ప్రజాప్రతినిధిగా సేవలందించాల్సిందిపోయి తనకు ప్రతినిధిగా మరో వ్యక్తిని నియమిస్తారా అని కాంగ్రెస్ నేత సుఖ్జీందర్సింగ్ రంధ్వా ప్రశ్నించారు. ఓటర్లను సన్నీ దారుణంగా మోసం చేశాడని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు తన బదులు మరొకరిని ఆశ్రయించాలని కోరడం విడ్డూరంగా ఉందని చురకలంటించారు. ఓటర్లు సన్నీని నాయకుడిగా ఎన్నుకున్నారని అతని ప్రతినిధిని కాదని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో సైతం సన్నీ చర్యపై ట్రోలింగ్ కొనసాగుతోంది. ‘నా ప్రతినిధిగా మొహాలీ జిల్లాకు చెందిన గురుప్రీత్సింగ్ పల్హేరీని నియమించుకున్నాను. నా పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటాడు. ఏవైనా కార్యక్రమాలకు నేను హాజరు కాలేనప్పుడు ఆయనే చూసుకుంటారు. సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటారు’ అని సన్నీ ఒక లెటర్లో పేర్కొన్నారు. కాగా, తన నియామకంపై వస్తున్న విమర్శలపై గురుప్రీత్ స్పందించారు. నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు సేవలందించాలనే సదుద్దేశంతోనే ఎంపీ సన్నీ డియోల్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇదిలాఉండగా.. తాజా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జక్కర్పై ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. ముంబైలో నివాసముండే సన్నీ.. లోక్సభ సమావేశాలకు అక్కడినుంచే వచ్చి వెళ్తున్నారు. -
గురుదాస్పూర్ ‘బోర్డర్’ వార్!
సరిహద్దుల్లో దేశభద్రతకోసం సాహసోపేతంగా పోరాడిన సినీ హీరో ఇప్పుడు రాజకీయ బరిలో నిజమైన సమరాన్ని ఎదుర్కోబోతున్నారు. ‘బోర్డర్’, ‘గదర్ –ఏక్ ప్రేమ్కథా’ లాంటి చిత్రాల హీరో సన్నీదేవల్ను ఓటర్లు గెలిపిస్తారా? అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో పంజాబ్లోని గురుదాస్పూర్లో నాలుగు సార్లు విజయం సాధించిన మరో బాలీవుడ్ నటుడు వినోద్ఖన్నా మరణంతో 2017లో జరిగిన ఉప ఎన్నికలో ఈ సీటుని బీజేపీ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ మాజీ స్పీకర్ బలరాం జాఖఢ్ కొడుకు సునీల్ జాఖఢ్ 1,90,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్కి చెక్పెట్టేందుకు బీజేపీ సినీరంగ ప్రముఖుడైన 62 ఏళ్ళ సన్నీదేవల్ను బరిలోకి దింపింది. బీజేపీ టికెట్పై పోటీచేసిన వినోద్ ఖన్నాను అభివృద్ధి ఎజెండా నాలుగుసార్లు ఈ స్థానంలో గెలుపుని ప్రసాదించింది. ఈ ప్రాంతంలో విస్తృతంగా వంతెన నిర్మాణాలు చేపట్టడంతో వినోద్కి ‘పూలోంకా బాద్షా’ అనే పేరు తెచ్చిపెట్టింది. బీజేపీ తన పూర్వ వైభవం సంపాదించేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. అయితే గురుదాస్పూర్ లోక్సభ స్థానంలో జాట్ల జనాభా ఎక్కువ. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖడ్, అటు బీజేపీ సినీదిగ్గజం ధర్మేంద్ర కొడుకు సన్నీదేవల్ ఇరువురూ జాట్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారనేది 23 వరకు వేచి చూడాల్సి ఉంది. గురుదాస్పూర్లో తనను తాను దేశభక్తుడిగా ప్రచారం చేసుకునే సన్నీదేవల్పై బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. రాజకీయ నేతగా మారిన సన్నీదేవల్ ఇటీవలే బీజేపీలో చేరి ప్రస్తుతం విరామం లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. సమయం అతి తక్కువగా ఉండడంతో మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయడం అంత సులువైన విషయమేమీ కాదని భావిస్తున్నారు. అందుకే ప్రతిరోజూ 12 గంటలపాటు నిర్విరామంగా రోడ్షోలు నిర్వహిస్తున్నారు. సన్నీదేవల్ బీజేపీ జాతీయవాదాన్ని సినిమాఫక్కీలో ప్రచారంచేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. సన్నీ సందర్భోచిత సినీడైలాగులతో ఓటర్లును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 1993లో యువతరాన్ని ఉర్రూతలూగించిన ‘దామిని’ సినిమాలోని ‘ఏ ఢాయీ కిలోకా హాత్’ డైలాగులనీ, ‘గదర్’ సినిమాలోని ‘ఏ హిందుస్థాన్ జిందాబాద్ హై, జిందాబాద్ రహేగా’’ అనే డైలాగునీ అదే సినీఫక్కీలో వినిపిస్తోన్న సన్నీదేవల్ ప్రచారాన్ని ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు. చివరకు నరేంద్రమోదీ కూడా సన్నీదేవల్ ఫొటోతో ‘‘హిందుస్థాన్ జిందాబాద్...’’ అంటూ ట్వీట్ చేయడం విశేషం. అలాగే సన్నీదేవల్ తండ్రి ధర్మేంద్ర ప్రచారం సైతం బీజేపీకి అనుకూలిస్తుందని భావిస్తున్నారు. అయితే స్థానికేతరుడంటూ ప్రత్యర్థుల విమర్శలనెదుర్కొంటున్న సన్నీదేవల్కి స్థానిక సమస్యలు తెలియకపోవడం వల్ల సినీ డైలాగులు తప్ప ప్రజాసమస్యల ప్రస్తావన ఆయన ప్రచారంలో కొరవడిందన్న విమర్శలు వెంటాడుతున్నాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, రైతాంగానికి రుణమాఫీ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ప్రధానంగా చెరకు రైతులకు గత పంటలకాలంలో చెల్లించాల్సిన 85 కోట్లరూపాయల చక్కెర మిల్లుల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘‘ బీజేపీ జాతీయవాదం తమకు ఉపాధి కల్పించలేదు. కానీ కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం, అభివృద్ధీ ఆ పని చేయగలుగుతుంది’’ అని 2017లో ఉపాధి కోల్పోయిన స్థానిక యువకుడు జగ్రాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. సిట్టింగ్ ఎంపీ సునీల్ జాఖడ్పై ఈ ప్రాంత ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారన్న విమర్శలున్నాయి. దానికి తోడు స్థానికంగా అక్రమ మైనింగ్ ఆరోపణలు సైతం ఆయన ఎదుర్కొంటుండడం సన్నీదేవల్కి కలిసొచ్చే అంశమని విశ్లేషకుల అంచనా. -
కొంత మంది నేతలకు ‘అజ్ఞానమే వరం’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ‘వారి అజ్ఞానమే వారికి వరం’ అనుకుంటా! పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలివుడ్ నటుడు సన్నీడియోల్ను బాలకోట్లో భారత వైమానిక దళం జరిపిన దాడుల గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, తనకేమీ తెలియదని చెప్పారు. భారత్–పాక్ సంబంధాల గురించి ప్రశ్నించగా అది అంతకంటే తెలియదని అన్నారు. హరియాణలోని లాడ్వా నుంచి పోటీ చేస్తున్న తన కుమారుడి తరఫున ప్రచారానికి వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌధురి బీరేంద్ర సింగ్ను స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న నీరు, విద్యుత్ సమస్యల గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ‘నేనెవరో తెలుసా? కేంద్ర మంత్రిని, నన్ను పట్టుకొని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా?’ అంటూ ఆయన విసుక్కున్నారు. మిగతా వారిలాగా ఆయన తనకు తెలియదంటూ సమాధానం ఇవ్వలేదు. ఇక ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ సినీ నటి జయప్రదను కొంత మంది రాజకీయ నాయకులు చేస్తున్న మహిళా విద్వేషక విమర్శల గురించి ప్రశ్నించగా తనకు తెలియదంటూ జయప్రద చెప్పడం ఆమె చుట్టూ చేరిన వారిని కూడా ఆశ్చర్యపరిచింది. ఆమెకు వ్యతిరేకంగా అలాంటి వ్యాఖ్యలు చేసన ఆజం ఖాన్ గురించి అప్పుడే మరచిపోయినట్లున్నారు. లేదంటే ముస్లిం ఓట్లు పోతాయని అలా సమాధానం ఇచ్చారా? అన్నది ఆమెకే తెలియాలి. ఇక తృణమూల్ ఎంపీ మూన్మూన్ సేన్ను, పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్లో జరిగిన ఎన్నికల హింస గురించి అడగ్గా తనకేమి తెలియదని అన్నారు. అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి బాబుల్ సుప్రియో వర్గం, తృణమూల్ కార్యకర్త మధ్య జరిగిన హింసాకాండలో ఆయన కారు ధ్వంసంకాగా, పలువురు గాయపడ్డారు. ఇది గెలవకుముందు అభ్యర్థుల పరిస్థితి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని వాటి ఫుల్ఫామ్లు అడుగుతుంటే తెలియదని చెబుతూ ఆశ్చర్యపరుస్తున్న నాయకులూ ఉన్నారు. -
‘ఆ నటులంతా కేవలం షో పీసులే’
చండీగఢ్ : బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ అభ్యర్థి సన్నీ డియోల్పై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ విమర్శలు గుప్పించారు. సన్నీకి పరిఙ్ఞానం లేదని, ఆయనో షో పీస్ అంటూ మండిపడ్డారు. సన్నీ డియోల్ పంజాబ్లోని గురదాస్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన..‘ రాజకీయాలకు మాత్రమే నేను కొత్త. ప్రజాసేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా. బాలాకోట్లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడుల గురించి నాకు ఎక్కువగా తెలియకపోవచ్చు. అదేవిధంగా పాకిస్తాన్తో భారత్కు ఉన్న దౌత్యపరమైన సంబంధాల గురించి అంతగా అవగాహన లేకపోవచ్చు. ఒకవేళ నేను గెలిస్తే ఇటువంటి విషయాలపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటా. ప్రస్తుతానికైతే వీటిపై నాకు పూర్తి అవగాహన లేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సన్నీ వ్యాఖ్యలపై స్పందించిన అమరీందర్ సింగ్.. ప్రధాని నరేంద్ర మోదీ, సన్నీ డియోల్, అతడి మారుతల్లి, బీజేపీ ఎంపీ హేమమాలిని లక్ష్యంగా విమర్శలు సంధించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ బాలాకోట్లో దాడులు చేశామంటూ మోదీ క్రెడిట్ కొట్టేయాలని చూస్తుంటే.. ఈ వ్యక్తి(సన్నీ)కి పాపం కనీసం అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదట. జాతీయ భద్రతపై దృష్టి సారించాం అంటూ బీజేపీ పదే పదే చెబుతుంది. అయితే సన్నీ మాటలు వింటుంటే ఆ పార్టీ అభ్యర్థుల ఆలోచనా సామర్థ్యం ఏమిటో అర్థమవుతోంది. ఇక బీజేపీ ఎంపీ హేమమాలిని ఐదేళ్లుగా మథురకు ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కానీ ఒక్కరోజు ప్రజల తరఫున లోక్సభలో తన గొంతు వినిపించలేదు. ఇటువంటి నటులంతా కేవలం షోపీసులే’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చదవండి : బాలాకోట్ ఎటాక్ : న్యూ ట్విస్ట్ కాగా సార్వత్రిక ఎన్నికల వేళ పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై జరిపిన మెరుపు దాడుల బీజేపీ నాయకులు ప్రచారాస్త్రంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు మాత్రం బాల్కోట్ ఉదంతంపై విమర్శలు గుప్పిస్తూ, ఆధారాలు చూపాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటలీ జర్నలిస్ట్ ఫ్రాన్సెస్కా మెరినో.. భారత వైమానిక దళం జరిపిన దాడిలో 130-170 మంది వరకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చనిపోయారంటూ వివరణాత్మక కథనం వెలువరించి సంచలనం రేపారు. పాకిస్తాన్ ఈ విషయంలో వాస్తవాలను దాచిపెట్టి ప్రపంచాన్ని మోసం చేయాలని చూస్తోందని ఆమె మండిపడ్డారు. ఖాళీ ప్రదేశంలో దాడి చేసినట్లు పాకిస్తాన్ పేర్కొందనీ, ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని తన కథనంలో మెరినో ఆరోపించారు. -
‘బాలాకోట్ వైమానిక దాడుల గురించి తెలియదు’
చంఢీగడ్ : బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు సన్నీ డియోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన బాలాకోట్ ఉగ్రదాడుల గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సన్నీ డియోల్ పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సన్నీ డియోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలకోట్లో భారత వాయుసేన జరిపిన వైమానిక దాడుల గురించి తనకు ఎక్కువగా తెలియదన్నారు. అంతేకాక భారత్ - పాక్ మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులు గురించి కూడా తనకు అంతగా అవగాహన లేదన్నారు. కానీ ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. దేశానికి సేవ చేయాలని భావిస్తున్నట్లు సన్నీ డియోల్ తెలిపారు. గురుదాస్పూర్ నుంచి మీరు విజయం సాధిస్తారా అని ప్రశ్నించగా.. ఏమో.. ప్రస్తుతానికి ఏం చెప్పలేనన్నారు సన్నీ డియోల్. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మీద ప్రశంసల వర్షం కురిపించారు సన్నీ డియోల్. గత ఐదేళ్లుగా నరేంద్ర మోదీ దేశానికి చాలా సేవ చేశారని పొగిడారు. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తాను మోదీ ప్రజాదరణ మీద ఆధారపడనని స్పష్టం చేశారు సన్నీ డియోల్. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే.. తాను కూడా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటానని సన్నీ డియోల్ పేర్కొన్నారు. -
‘సన్నీ లియోన్ అయినా మా ముందు నిలువలేరు’
చండీగఢ్ : పంజాబ్లో బీజేపీకి సరైన అభ్యర్ధులు దొరకలేదని హోషియార్పూర్ కాంగ్రెస్ అభ్యర్ధి రాజ్ కుమార్ చబ్బేవాల్ విమర్శించారు. పంజాబ్లో మూడు స్ధానాలకు కాషాయ పార్టీకి అభ్యర్ధులే కనిపించకపోవడంతో గురుదాస్పూర్ నుంచి సన్నీ డియోల్ను బరిలో దింపారని అన్నారు. బీజేపీ సన్నీడియోల్ను తెచ్చినా, సన్నీ లియోన్ను తీసుకువచ్చినా కాంగ్రెస్ పెనుతుఫాన్ ముందు నిలవలేరని ధీమా వ్యక్తం చేశారు. మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన ఆరోపించారు. కాగా పంజాబ్లో లోక్సభ ఎన్నికల తుది విడత పోరులో భాగంగా మే 19న పోలింగ్ జరగనుంది. -
సన్నీడియోల్ @ 87 కోట్లు
చండీగఢ్/గురుదాస్పూర్: గదర్, ఘాయల్, బోర్డర్ చిత్రాలతో బాలీవుడ్ సినిమాలలో తనదైన ముద్ర వేసిన నటుడు, దర్శకుడు, నిర్మాత సన్నీడియోల్ సోమవారం గురుదాస్పూర్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలతోపాటు ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ను సమర్పించారు. తన పేరుమీద, తన భార్య పేరు ఉన్న మొత్తం ఆస్తులను రూ. 87.18 కోట్లుగా ప్రకటించారు. రూ. 60.46 కోట్ల చరాస్తులు, రూ. 21కోట్ల స్థిరాస్తులను ఆయన చూపించారు. 2017–18లో ఆదాయాన్ని రూ. 63,82 లక్షలు, 2016–17లో వార్షికాదాయం 96.29 లక్షలు, 2015–16లో వార్షికాదాయం రూ. 2.25 కోట్లుగా ప్రకటించారు. తన బ్యాంకు ఖాతాలో రూ. 26 లక్షలు ఉన్నాయని, తన భార్య లిండా డియోల్ బ్యాంకు ఖాతాలో రూ. 16 లక్షల నగదు ఉందని తెలిపారు. -
గురుదాస్పూర్లో సన్నీ డియోల్ నామినేషన్
చండీగఢ్ : బాలీవుడ్ నటుడు, ఇటీవల బీజేపీలో చేరిన సన్నీ డియోల్ సోమవారం ఆ పార్టీ తరపున పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతకుముందు సన్నీ డియోల్ పార్టీ నేతలు వెంటరాగా అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో ప్రార్ధనలు చేశారు. దుర్గా మాత ఆలయంలోనూ ఆయన పూజలు చేశారు. సన్నీ డియోల్ ఈనెల 23న ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ల సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ దేశానికి ఎంతో సేవ చేశారని, మరో ఐదేళ్లు ఆయనే ప్రధానిగా ఉండాలన్నది తన కోరికని, మన యువతకు మోదీజీ వంటి వ్యక్తుల అవసరం ఎంతైనా ఉందని పార్టీలో చేరిన అనంతరం సన్నీ డియోల్ వ్యాఖ్యానించారు. తన తండ్రి ధర్మేంద్ర అటల్జీతో పనిచేసినట్టుగానే మోదీకి మద్దతుగా తాను ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. కాగా గురుదాస్పూర్ నుంచి అంతకుముందు బీజేపీ తరపున వినోద్ ఖన్నా ప్రాతినిధ్యం వహించారు. వినోద్ ఖన్నా భార్య కవితా ఖన్నాకు బీజేపీ టికెట్ ఖాయమవగా, చివరినిమిషంలో సన్నీ డియోల్ అభ్యర్థిత్వానికి కాషాయ పార్టీ మొగ్గుచూపింది. -
ప్రధానితో సన్నీ డియోల్ భేటీ
న్యూఢిల్లీ: పంజాబ్లోని గురుదాస్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటుడు సన్నీ డియోల్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. డియోల్తో కలిసి ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేశారు. ‘డియోల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. అతనిలోని వినయం, భారతదేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై అతనికి ఉన్న లోతైన అవగాహన నన్ను ఆకర్షించాయి. గురుదాస్పూర్లో డియోల్ విజయానికి మేమంతా కృషి చేస్తున్నాం’అని ట్వీట్లో తెలిపారు. అలాగే డియోల్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘గదర్’లోని ‘హిందుస్తాన్ జిందాబాద్ హై.. థా.. ఔర్ రహేగా’అనే డైలాగ్ను కూడా జతచేశారు. దీనికి తామిద్దరం కట్టుబడి ఉన్నామని తెలిపారు. కాగా, దక్షిణ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లుగా ఎంపికైన సునీతా కంగ్రా, అవతార్ సింగ్, అంజూ కమల్కాంత్లు కూడా ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని వారికి అభినందనలు తెలిపారు. ఢిల్లీని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కాగా, ప్రముఖ నటుడు ధర్మేంద్ర కుమారుడైన డియోల్ ఇటీవల బీజేపీలో చేరారు. గురుదాస్పూర్ నుంచి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జఖార్పై ఆయన పోటీ చేయనున్నారు. -
టికెట్ ఇవ్వకున్నా.. ఆయనకే నా సపోర్టు!
న్యూఢిల్లీ : తనకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ బీజేపీకి తన మద్దతు ఉంటుందని దివంగత ఎంపీ, నటుడు వినోద్ ఖన్నా భార్య కవితా ఖన్నా స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా పంజాబ్లోని గురుదాస్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమె భావించిన సంగతి తెలిసిందే. మొదట ఆమెకు టికెట్ కేటాయించేందుకు బీజేపీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేసింది. కానీ చివరి నిమిషంలో.. పార్టీలో చేరిన సీనియర్ నటుడు సన్నీ డియోల్ను బరిలో దించడంతో కవిత తీవ్ర నిరాశకు లోనయ్యారు. నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అధిష్టానం ఇలా వ్యవహరించడం తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన కవితా ఖన్నా.. ‘ ఈ విషయాన్ని వివాదంగా మార్చదలచుకోలేదు. పార్టీ కోసం త్యాగం చేయాలని నిర్ణయించుకున్నా. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీకే నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే నా విషయంలో జరిగిన తప్పు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా. ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేసుకున్న తర్వాత టికెట్ను వేరే వాళ్లకు కేటాయించారు. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. తిరస్కారభావంతో కుంగిపోయాను. ఆ సమయంలో తమ పార్టీలో చేరాల్సిందిగా ఎంతోమంది నన్ను సంప్రదించారు. కానీ నేనలా చేయలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినా నేను కచ్చితంగా గెలిచి తీరతాను. అయితే నా వ్యక్తిగత ప్రయోజనాల కన్నా, పార్టీ, జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చి... గురుదాస్పూర్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నా’ అని పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ వినోద్ ఖన్నా లోక్సభ ఎంపీగా గురుదాస్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. బీజేపీ టికెట్పై నాలుగు పర్యాయాలు(1998.99, 2004, 2014) గెలిచిన ఆయన ఏప్రిల్ 2017న మరణించారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జకార్ గెలుపొందారు. ఇక లోక్సభ చివరి దశ ఎన్నికల్లో భాగంగా మే19న పంజాబ్లో పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. -
‘ఆయన సినిమాలోనే సైనికుడు’
చండీగఢ్ : గురుదాస్పూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేయనున్న బాలీవుడ్ నటుడు, ఇటీవలే కాషాయ తీర్ధం పుచ్చుకున్న సన్నీ డియోల్పై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విమర్శలు గుప్పించారు. సన్నీ డియోల్ కేవలం తెరపైనే సైనికుడిగా నటించారని, తాను నిజమైన సైనికుడినని కెప్టెన్ సింగ్ చెప్పుకొచ్చారు. సన్నీ డియోల్ రాకతో గురుదాస్పూర్లో తమ పార్టీ అభ్యర్ధి సునీల్ జక్కర్కు ఎలాంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సన్నీ డియోల్కు ఎలాంటి పట్టూ లేదని, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడి ప్రజల కోసం పనిచేశాడని అన్నారు. సన్నీ డియోల్ తెరపైన సైనికుడు మాత్రమేనని 1997లో ఆయన నటించిన బోర్డర్ మూవీలోని సైనికుడి పాత్రను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను నిజమైన సైనికుడినని 1965 ఇండో-పాక్ యుద్ధంలో కెప్టెన్గా వ్యవహరించిన అమరీందర్ సింగ్ చెప్పుకున్నారు. సన్నీ డియోల్కు ఓటమి తప్పదని పంజాబ్లో అన్ని స్ధానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని, తదుపరి ప్రధానిగా రాహుల్ బాధ్యతలు చేపడతారని కెప్టెన్ సింగ్ జోస్యం చెప్పారు. -
బీజేపీలో చేరిన ప్రముఖ గాయకుడు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు పలువురు క్యూ కడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ బీజేపీలో చేరగా తాజాగా ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ దలేర్ మెహందీ శుక్రవారం కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి విజయ్ గోయల్, సింగర్ హన్స్ రాజ్ ఆధ్వర్యంలో దలేర్ మెహందీ ఇవాళ బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ బీజేపీ చీప్ మనోజ్ తివారీ, గౌతమ్ గంభీర్ హాజరు అయ్యారు. -
సన్నీ డియోల్పై ట్వీట్ల మోత
సాక్షి, న్యూఢిల్లీ : ‘బోర్డర్’ బాలీవుడ్ చిత్రం ద్వారా ప్రేక్షకులకు కించిత్తు దేశభక్తి, కించిత్తు జాతీయవాదాన్ని పంచిన బాలివుడ్ నటుడు సన్నీ డియోల్ మంగళవారం నాడు బీజేపీలో చేరారని తెలియగానే వరుస ట్వీట్లతో ట్విటర్ ఉరకలెత్తింది. 2001లో వచ్చిన చిత్రం ‘గదర్: ఏక్ ప్రేమ్ కథా’ చిత్రంలో తన పాకిస్థానీ భార్యను తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్లిన సన్నీ పాక్ స్థానికులతో పోరాడాల్సి రావడం, ఆవేశంతో రోడ్డు పక్కనున్న బోరింగ్ పంపు హాండిల్ ఊడపీకి వారిని తుక్కుతుక్కు కొట్టడం తెల్సిందే. ఈనేపథ్యంలో సన్నీ డియోల్ బీజేపీలో చేరారని తెలియగానీ పాకిస్థాన్లో బోరింగ్ పంపులకు గొలుసులతో తాళాలు వేస్తున్నట్లు ప్రతీకాత్మక చిత్రాన్ని ట్వీట్ చేశారు. బోరింగ్ హాండిల్ను పట్టుకున్న సన్నీ డియోల్ ఫొటోను ట్వీట్ చేస్తూ ‘పాకిస్థాన్పైకి మరో సర్జికల్ స్టైక్స్కు వెళుతున్న సన్నీ’ అంటూ కామెంట్ చేశారు. మరోసారి పాకిస్థాన్ ఎఫ్ 16 యుద్ధ విమానం రానియ్యి, దాని సంగతి చెబుతా అన్నట్లు భుజం మీద శతఘ్ని ఎక్కు పెట్టిన సినిమా స్టిల్ను మరొకరు పోస్ట్ చేశారు. వాటర్ మినిస్టర్ ఇక సన్నీయేనంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. కాంగ్రెస్ హస్తంకన్నా సన్నీ హస్తం బలమైనదని ఒకరు, సన్నీ బీజేపీలో చేరడం వల్ల పార్టీ రెండుంబావు కిలోల బరువు పెరిగినట్లు మరొకరు కామెంట్ చేశారు. ఈ కామెంట్ అర్థం కావాలంటే సన్నీకి నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టిన 1993 నాటి ‘దామిని’ చిత్రం దశ్యంలోకి వెళ్లాల్సిందే. ‘జబ్ యే దాయి కిలోకా హాత్ కిసీ పే పడ్తా హై, తో ఆద్మీ హుడతా నహీ, ఉడ్ జాతా హై (ఈ రెండుంబావు కిలోల చేయి దెబ్బ పడిందంటే ఎవరైనా సరే మళ్లీ లేవడు. పోతాడు)’ అంటూ అమ్రేష్ పురిని ఉద్దేశించి పవర్ ఫుల్ డైలాగ్ విసురుతారు. సన్నీ డియోల్ ‘బోర్డర్’ చిత్రం ద్వారా దేశభక్తిని, జాతీయవాదం స్ఫూర్తిని కలిగించారని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఆమె, కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయల్ సమక్షంలోనే సన్నీ డియోల్ బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. -
బీజేపీలో చేరిన సీనియర్ నటుడు
న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ మంగళవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పియుష్ గోయల్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. పంజాబ్లోని గురుదాస్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశముందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా సన్నీ డియోల్ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కష్టపడుతున్నారని, మరో ఐదేళ్లు ఆయన ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. యువతకు మోదీ లాంటి నాయకులు చాలా అవసరమని అన్నారు. అజల్బిహారి వాజపేయికి మద్దతు ఇచ్చి ఆయనతో కలిసి తన తండ్రి ధర్మేంద్ర పనిచేశారని, అదేవిధంగా తాను కూడా మోదీకి అండగా ఉంటానని అన్నారు. చేతల ద్వారానే రాజకీయాల్లో తానెంటో నిరూపించుకుంటానని చెప్పారు. గతంలో గురుదాస్పూర్ నుంచి బీజేపీ తరపున వినోద్ ఖన్నా ప్రాతినిథ్యం వహించారు. 2017లో ఆయన మరణించడంతో ఉప ఎన్నిక నిర్వహించగా కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ కుమార్ జాఖర్ గెలుపొందారు. సన్నీ డియోల్ను ఇక్కడి నుంచి పోటీకి దింపి మళ్లీ ఈ స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. శిరోమణి అకాలీదళ్తో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ పంజాబ్లోని 13 స్థానాల్లో 3 సీట్లలో పోటీ చేయనుంది. అమృత్సర్, గురుదాస్పూర్, హోషియాపూర్ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగుతోంది. -
నాన్నకు హ్యాట్సాఫ్
బాలీవుyŠ సూపర్స్టార్ ధర్మేంద్ర అభిమానులకు ఆయన కుమారుడు సన్నీ డియోల్ ఓ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అదేంటంటే... ధర్మేంద్ర జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీని రూపొందించనున్నారు సన్నీ. పంజాబ్ నుంచి ముంబై వచ్చి సినిమాల్లో సూపర్ స్టార్గా ధర్మేంద్ర ఎలా ఎదిగారు? అనే విషయాల్ని ఇందులో ప్రస్తావించనున్నారట. అలాగే ధర్మేంద్ర జీవితం ఆధారంగా ఓ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఇందులో నటుడిగా ఆయన చేరుకున్న మైలు రాళ్లు, జ్ఞాపకాలు, ఆశ్చర్యకర సంఘటనలు షేర్ చేసుకుంటారట. ‘‘నాన్నగారి లైఫ్ గురించి తన ప్రతి అభిమానికి తెలియాలి. అందుకే ఈ డాక్యుమెంటరీ. మా టీమ్ అందరితో నాన్నగారు ప్రయాణిస్తారు. తన ప్రతి జ్ఞాపకాలను చూపిస్తారు. వాటిని షూట్ చేస్తాం. నాన్నగారితో పని చేసిన అందర్నీ ఇంటర్వ్యూ చేయనున్నాం. నాన్నగారి సుదీర్ఘ ప్రయాణం గ్రేట్. నాన్నగారికి హ్యాట్సాఫ్’’ అని పేర్కొన్నారు సన్నీ డియోల్. -
ఎంట్రీ ఈజీ..ఎగ్జిట్ కూడా ఈజీయే
నెపోటిజం (బంధుప్రీతి) అనే టాపిక్ ఏ ఇండస్ట్రీలో అయినా చాలా కామన్. కానీ కేవలం దాని వల్లే ఇండస్ట్రీలో మనం నిలబడం అంటున్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్. తనయుడు కరణ్ డియోల్ను ‘పల్ పల్ దిల్ కే పాస్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు సన్నీ డియోల్ . నెపోటిజమ్ గురించి సన్నీ మాట్లాడుతూ – ‘‘ప్రతిసారి ఇదే కొశ్చన్ను ఎందుకు అడుగుతారో అర్థం కాదు. నెపోటిజమ్ వల్ల వేరే వాళ్లు అవకాశాలు కోల్పోతున్నారనుకోవడం పొరబాటు. ఈరోజు నేనిలా ఉన్నానంటే అది కేవలం మా నాన్న పరిచయం చేయడం వల్లే అనుకోవడం సరి కాదు. ఫస్ట్ సినిమా వరకే బ్యాగ్రౌండ్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మన ప్రతిభ, కష్టం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ రెండూ లేకపోతే ఎంత ఈజీగా ఎంటర్ అయ్యామో అంతే ఈజీగా ఇండస్ట్రీ నుంచి ఎగ్టిట్ అయిపోతాం’’ అన్నారు. -
డేట్ మారింది
ఈ ఏడాది ఆగస్టు 15కు బాక్సాఫీస్ వద్ద అక్షయ్కుమార్ ‘గోల్డ్’, జాన్ అబ్రహాం ‘సత్యమేవ జయతే’, ధర్మేంద్రల ‘యామ్లా పాగ్లా దీవానా ఫిర్ సే’ చిత్రాలు రిలీజ్కు రెడీ అయ్యాయి. కానీ ఇప్పుడు ‘యామ్లా పాగ్లా దీవానా..’ చిత్రబృందం తమ నిర్ణయాన్ని మార్చుకుని సినిమాను ఆగస్టు 31కి వాయిదా వేసుకున్నట్లు బీటౌన్ టాక్. ‘గోల్డ్, సత్యమేవ జయతే’ రెండూ దేశభక్తికి సంబంధించిన చిత్రాలే కావడం ఇందుకు కారణమట. నవనీత్సింగ్ దర్శకత్వంలో తండ్రీకొడుకులు ధర్మేంద్ర, సన్నీ డియోల్, బాబీ డియోల్ ముఖ్య తారలుగా రూపొందిన ‘యామ్లా పాగ్లా దీవానా ఫిర్ సే’ కామెడీ జానర్ మూవీ. రెండు దేశభక్తి చిత్రాలతో కామెడీ జానర్ మూవీ ఎందుకు? అని విడుదలను వాయిదా వేసుకున్నారట. ఈ ప్రాంచైజీలో వచ్చిన తొలిపార్ట్కు సమీర్ కార్నిక్ దర్శకత్వం వహించగా, రెండో పార్ట్కు సంగీత్ శివన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. -
సవతి కొడుకు గురించి హేమ మాలిని
సాక్షి, సినిమా : బాలీవుడ్ లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలియని వారుండరేమో. మొదటి భార్య ప్రకాశ్ కౌర్ ఉండగానే నటి హేమ మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే మతం మారి మరి ఆయన హేమను వివాహం చేసుకున్నారంటూ అప్పట్లో ఆయనపై విమర్శలు వెలువెత్తాయి. అదంతా ట్రాష్ అంటూ వాటిని ధర్మేంద్ర ఖండించారు కూడా. ఇదిలా ఉంటే మొదటి భార్య కుమారులైన సన్నీ, బాబీ డియోల్లు.. హేమ మాలిని-ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ కనిపించరు. అసలు వీరు కలవటం అనేది కూడా చాలా అరుదనే చెప్పుకోవాలి. కానీ, గ్యాప్ గురించి బాలీవుడ్లో కథలు కథలుగా చెప్పుకుంటుంటారు కూడా. అయితే ఫస్ట్ టైమ్ ధర్మేంద్ర మొదటి భార్య పిల్లల గురించి హేమ మాలిని ఓపెన్ అయ్యారు. వారితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె స్వయంగా చెప్పారు. ప్రముఖ రచయిత రాజ్ కమల్ ముఖర్జీ రచించిన ఆమె ఆత్మకథ హేమా మాలిని : బియాండ్ ది డ్రీమ్ గర్ల్ పుసక్త ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మా మధ్య బంధం ఎంతో అందమైంది. ముఖ్యంగా నాకు ఎప్పుడు ఏం సాయం కావాలన్న ధర్మేంద్రతోపాటు సన్నీ కూడా ముందుంటాడు’’ అని ఆమె చెప్పారు. 2005లో రాజస్థాన్లో ఆమెకు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హేమను ముందుగా పరామర్శించటంతోపాటు.. తోడుగా సన్నీ డియోల్ నిలిచాడంట. ఆమె వెంటే ఉండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకున్నాడని ఆమె చెప్పారు. ఇక ఈ పుస్తకావిష్కరణ సభకు సన్నీడియోల్ రాకపోయినప్పటికీ.. రమేష్ సిప్పీ, జూహి చావ్లా,సుభాష్ ఘాయ్, నటి దీపికా పదుకునే, మాలిని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. -
లండన్ వీధుల్లో సీనియర్ నటుల సాన్నిహిత్యం!
బాలీవుడ్ స్టార్స్ సన్నీడియోల్, డింపుల్ కపాడియాలు లండన్ వీధుల్లో షికార్లు చేస్తున్నారు. 80, 90లలో ఐదు సినిమాలో కలిసి నటించిన ఈ జంట చాలా కాలం తరువాత ఇలా కలిసి కనిపించటం బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరి మధ్య అప్పట్లో ఎఫైర్ ఉందనే రూమర్లు వచ్చాయి. ఇప్పుడు వీరు ఇలా సన్నిహితంగా కనిపించడంపై సోషల్మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరు లండన్ వీధుల్లో షికారు చేస్తున్న వీడియో ఒకటి బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'సన్నీడియోల్, డింపుల్ కపాడియాలు కలిసి తన సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు.. వారి జంట ఎంతో అందంగా ఉంది' అంటూ కామెంట్ చేశారు కేఆర్కే. 2015లో రిలీజ్ అయిన వెల్ కం బ్యాక్ సినిమా తరువాత డింపుల్ వెండితెర మీద కనిపించలేదు. సన్నీడియోల్ రీసెంట్ గా పోస్టర్ బాయ్స్ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. బాలీవుడ్ స్టార్ గా ఉండగానే డింపుల్ బాలీవుడ్ లెజండరీ నటుడు రాజేష్ ఖన్నాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. 2012లో రాజేష్ ఖన్నా ఆరోగ్య సమస్యలతో మృతి చెందిన తరువాత కూడా డింపుల్ నటిగా కొనసాగారు. -
లండన్ వీదుల్లో సన్నీ, డింపుల్
-
తెరపైకి హీరో వారసుడు!
ముంబై: బాలీవుడ్ లో మరో వారసుడు తెరంగ్రేటం చేయబోతున్నాడు. సీనియర్ నటుడు సన్నిడియోల్ తన కుమారుడు కరణ్ ను హీరోగా పరిచయం చేయాలని భావిన్నాడు. 30 ఏళ్ల క్రితం తనకు తొలి విజయాన్ని అందించిన 'బెతాబ్' సినిమాను కరణ్ తో రీమేక్ చేయాలని కోరుకుంటున్నాడు. మంచి కథ కోసం చాలా ఆగాడు. చివరకు 'బెతాబ్'కే ఫిక్సయినట్టు తెలుస్తోంది. అమృతా సింగ్, సైఫ్ అలీఖాన్ కూతురు సారాను కరణ్ కు జోడిగా నటింపజేయాలని ప్రయత్నిస్తున్నాడు. తన తొలి సినిమాలో సన్నిడియోల్ మొదటి సినిమాలో అతడి సరసన అమృతా సింగ్ నటించింది. అయితే కరణ్-సారా జోడి కుదిరేట్టు లేదు. ఎందుకంటే ధర్మా ప్రొడక్షన్ లో మొదటి సినిమా చేసేందుకు సారా అంగీకరించింది. కరణ్ జోహర్ నిర్మించనున్న సినిమాతో ఆమె తెరంగ్రేటం చేయనుంది. దీంతో శ్రీదేవి కూతురు జాహ్నవిని సంప్రదించాలని సన్నిడియోల్ భావిస్తున్నాడట. -
విలేకరులపై చిటపటలాడిన హీరోయిన్!
'కల్ హో నా హో' సినిమాతో 16 ఏళ్ల కిందట హృతిక్ రోషన్, అమీషా పటేల్ బాలీవుడ్కు పరిచయమయ్యారు. హీరోగా హృతిక్ తన ప్రస్థానం కొనసాగిస్తుండగా.. 'బద్రి' తార అమీషా మాత్రం కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. దాదాపు మూడేళ్ల తర్వాత 'భయ్యాజీ సూపర్హిట్' సినిమాతో ఆమె వెండితెరను పలుకరించబోతున్నది. తాజాగా 'భయ్యాజీ సూపర్హిట్' చిత్రయూనిట్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన అమీషా విలేకరులపై తీవ్రస్థాయిలో మండిపడిందట. ముంబై మీడియా కథనం ప్రకారం చిటపటలాడుతూ ఈ ప్రెస్మీట్లో పాల్గొన్న అమీషా.. విలేకరులు కుర్చీలలో కూర్చుంటుడగానే 'సైలెన్స్' అంటూ గద్దించింది. మూడేళ్లుగా ఎందుకు సినిమాల్లో నటించడం లేదని ఓ విలేకరి అడుగగా.. 'నన్ను అమీషా అని కాదు.. అమీషాజీ అని పిలువండి' అంటూ గట్టిగా సూచించింది. అదేవిధంగా మీరు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారా? అని అడిగిన విలేకరిపైనా ఆమె ఆగ్రహం ప్రదర్శించింది. మీకు మెదడు ఉందా? అంటూ ఆ విలేకరిపై విరుచుకుపడింది అమీషా. ఈ ప్రెస్మీట్ గురించి చిత్రయూనిట్ ముందుగానే తెలుపలేదట. దీంతో ఈ సినిమాలో నటిస్తున్న మరో నటి ప్రీతి జింతా ప్రెస్మీట్కు డుమ్మ కొట్టగా.. అమీషా తన ఆగ్రహాన్ని విలేకరులపై చూపిందని చిత్రవర్గాలు అంటున్నాయి. సన్నీ డియోల్, అర్షద్ వార్సీ, ప్రీతి జింతా, అమీషా పటేల్, శ్రేయస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'భయ్యాజీ సూపర్హిట్' సినిమాపై ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్లు అయిన అమీషా, ప్రీతి భారీ అంచనాలే పెట్టుకున్నారు. -
రాజమౌళి నెక్ట్స్ సినిమా అదే
ప్రస్తుతం, టాలీవుడ్లోనే కాదు జాతీయ స్థాయిలో టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో వినిపించే తెలుగు దర్శకుడి పేరు రాజమౌళి. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి సొంతం చేసుకున్న రాజమౌళి, ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క లీడ్ రోల్స్లో తెరకెక్కిన బాహుబలి 600 కోట్లకు పైగా వసూళు చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న బాహుబలి 2 కూడా అదే స్థాయి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఇండస్ట్రీ వర్గాలు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రాల తరువాత రాజమౌళి చేయబోయే సినిమా ఏంటి అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. బాహుబలి తరువాత రాజమౌళి ఓ హిందీ సినిమాకు వర్క్ చేయనున్నాడు. కానీ ఈ సినిమాకు రాజమౌళి దర్శకుడు కాదు, కేవలం క్రియేటివ్ డైరెక్టర్గా తన సహాయం అందించనున్నాడు. ఇటీవల ఘాయల్ వన్స్ అగైన్ సినిమాతో నిరాశపరిచిన సన్నీడియోల్ త్వరలో మేరా భారత్ మహాన్ పేరుతో తెరకెక్కనున్న సినిమాలో హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి, బాహుబలి, భజరంగీ బాయిజాన్ లాంటి సక్సెస్ సినిమాల కథా రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసమే రాజమౌళి క్రియేటివ్ డైరెక్టర్గా మారుతున్నాడట. గతంలో విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన రాజన్న సినిమా కోసం కూడా కొన్ని సీన్స్ డైరెక్ట్ చేసిన జక్కన్న ఇప్పుడు మేరా భారత్ మహాన్ సినిమా కోసం మరోసారి తండ్రికి సాయం చేయడానికి రెడీ అవుతున్నాడు. -
అక్టోబర్ 19న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: గుణ్ణం గంగరాజు (దర్శక-నిర్మాత), సన్నీడియోల్ (నటుడు) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యునికి సంబంధించినది. దీనివల్ల వీరికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించి, దానిని ముందకు తీసుకు వెళ్లే చొరవ, తెగువ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహ యోగం, పిల్లలకు ఉద్యోగ, వివాహ ప్రాప్తి జరుగుతుంది. ట్రాన్స్ఫర్లకోసం ఎదురు చూసేవారికి కోరుకున్న చోటికి ట్రాన్స్ఫరవుతుంది. కొత్త వ్యాపారాలు విస్తరించడానికి ఇది అనుకూల సమయం. వీరు పుట్టిన తేదీ 19. ఇది సూర్య, కుజుల కలయిక కావడం వల్ల జీవితంలో పైకి రావాలనే ఆకాంక్ష, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మంచి పేరు, గుర్తింపు వస్తాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం జీవితంలో మైలురాయి వంటిదని చెప్పవచ్చు. హృద్రోగాలు, నేత్రరోగాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగానే తగిన పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,5,6,8; లక్కీ కలర్స్: రెడ్, రోజ్, ఆరంజ్, గ్రీన్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: మంగళ, శుక్ర, శని, ఆదివారాలు; సూచనలు: ఆదిత్యహృదయం పఠించడం లేదా వినడం, తండ్రిని కాని, తండ్రితో సమానులైన వారిని కాని ఆదరించడం, అనాథలకు, వికలాంగులకు, వృద్ధులకు తగిన సాయం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
'మా అబ్బాయిలతో కలిసి నటించాలని ఉంది'
న్యూఢిల్లీ : తన కుమారులతో కలిసి నటించాలని ఉందని బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర అన్నాడు. మంచి కథ దొరికితే తన కుమారులతో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. సన్నీడియోల్, బాబీడియోల్లు ధర్మేంద్ర మొదటి భార్య సంతానం అన్న విషయం అందరికి విదితమే.గతంలో వీరు ముగ్గురి కలయికలో అప్నే, యమ్లా పగ్లా దీవానా చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో మరో మూవీ చేయాలని వెటరన్ నటుడు, షోలే సూపర్ స్టార్ ధర్మేంద్ర ఉవ్విళ్లూరుతున్నాడు. తొలి రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ, యమ్లా పగ్లా దీవానా సీక్వెల్ ఫ్లాప్ అవడంతో మళ్లీ ఈ ముగ్గురి కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్పై కనిపించలేదు. ధరమ్ ఘరమ్ అనే ఓ స్టార్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. సన్నీ, బాబీలతో కలిసి మరోసారి వెండితెరపై కనిపించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. కానీ ఓ మంచి స్క్రిప్ట్ దొరికితే ఈ తండ్రీకొడుకులను మరోసారి సిల్వర్స్ర్ర్కీన్పై అభిమానులను కనువిందు చేస్తామన్నాడు. యాక్టింగ్ కింగ్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ధర్మేంద్ర 1960లలో బాలీవుడ్లో తన ప్రస్థానం ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదిగినా తనను తాను ఎప్పుడు ఓ స్టార్ అని భావించనని 'షోలే' సూపర్ స్టార్ మరిన్ని ముచ్చట్లను అభిమానులతో పంచుకున్నాడు. -
మితంగానా? సన్నీహితంగానా?
ఒకనాటి సూపర్హిట్ ఘాయల్కి సీక్వెల్ తీస్తున్నాడు సన్నీ డియోల్. ఘాయల్ వన్స్ అగైన్ పేరుతో రూపొందిస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో సన్నీడియోల్తో సైఫ్ సోదరి, రంగ్ దే బసంతిలో సిద్ధార్ధతో జోడీ కట్టిన సోహా అలీఖాన్ నటిస్తోంది. ఇందులో సైకియాట్రిస్ట్ పాత్ర పోషిస్తున్న సోహాకి, సన్నీడియోల్కి మధ్య కధలో సందర్భానుసారం వచ్చే కొన్ని శృంగార సన్నివేశాలు ఉన్నాయట. ఇంకా చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉన్న ఆ హాట్ సీన్ల గురించి 36 ఏళ్ల సోహా అలీఖాన్ ఇప్పటి నుంచి నెర్వస్గా ఫీలవుతోందట. సన్నీడియోల్ వంటి సీనియర్ నటుడితో నటించడం అనేది ఓ వైపు ఆనందంగానే అనిపిస్తున్నా... అదే సమయంలో సదరు సన్నివేశాల్లో ఎలా నటిస్తానో అనే ఆందోళన తనకు ఉందని సన్నిహితుల వద్ద ఓపెన్ అవుతోందట సోహా. మరో విషయమేమిటంటే... సోహా భర్త కునాల్ ఖేము కూడా నటుడే. నాటి హీరో ధర్మేంద్ర దర్శకత్వంలో రూపొందుతూ, నవంబరులో విడుదల కానున్న ‘ఘాయల్ వన్స్మోర్’ ప్రేక్షకుల ముందుకు వస్తే కానీ... సోహా అలీఖాన్ నెర్వస్నెస్ను తగ్గించుకోగలిగిందా లేదా అనేది మనకి తెలియదు. -
సినిమా విడుదలపై ఆగస్టు 25 వరకు స్టే పొడిగింపు
బాలీవుడ్ సినిమా 'మొహల్లా అస్సీ' విడుదలపై ఉన్న స్టేను ఆగస్టు 25 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులిచ్చింది. సన్నీ డియోల్ నటించిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు, డైలాగులు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ ఆధారంగా కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. ఈ సినిమా విషయంలో తలెత్తిన అభ్యంతరాల గురించి ఏమంటారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) అభిప్రాయాన్ని కోర్టు కోరింది. ఈ సినిమా గానీ, దాని ట్రైలర్ గానీ ఆన్లైన్లో కూడా విడుదల చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. మతపరమైన సెంటిమెంట్లను ఈ సినిమా దెబ్బతీస్తోందని పిటిషన్లో ఆరోపించారు. వాస్తవానికి సినిమా ఈనెల 3వ తేదీనే విడుదల కావల్సి ఉంది. వారణాసిలో గంగానది ఒడ్డున గల అస్సీ ఘాట్ పరిసరాల చుట్టూనే ఈ సినిమా ఉంటుందన్న విషయాన్ని ట్రైలర్లో చూపించారు. అయితే ఈ ట్రైలర్లో పాత్రలు ఉపయోగించిన భాష అత్యంత అసభ్యంగా ఉందని కోర్టు భావించింది. ఒక సన్నివేశంలో శివుడి పాత్ర ధరించిన వ్యక్తి కూడా ఇలాంటి అసభ్య భాష ఉపయోగిస్తారు. -
హీరోపై మరో కేసు నమోదు
పాట్నా: బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీ డియోల్పై తాజాగా మరో కేసు నమోదైంది. దర్శకుడు చంద్ర ప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మోహల్లా అస్సీ' చిత్రంలో సన్నివేశాలు హిందూవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ న్యాయవాది ఓజా బీహార్లోని పాట్నా అడిషినల్ కోర్టును ఆశ్రయించారు. దాంతో ఆ చిత్రంలోని హీరో, దర్శకుడు, కథ రచయితతోపాటు ఇతర పాత్రధారులపై కూడా కేసులు నమోదు చేయాలని పాట్నా అడిషినల్ చీఫ్ మేజిస్ట్రేట్ రామచంద్ర ప్రసాద్ పోలీసులను శనివారం ఆదేశించారు. దాంతో సన్నీడియోల్, చిత్ర దర్శకుడు చంద్ర ప్రకాశ్ ద్వివేదితోపాటు కథ రచయిత కాశీనాథ్ సింగ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే మోహల్లా అస్సీ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ఆరోపిస్తూ సామాజిక స్వచ్ఛంద సంస్థ సర్వజన్ జాగృతి సంతష్ట గత నెల జూన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పోలీసులు దర్శకుడితో పాటు సన్నీ డియోల్ పై కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ చిత్రం కాశీ కా అస్సీ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సన్నీ డియోల్ సంప్రదాయ మత పెద్దగా కీలక పాత్ర పోషిస్తుండగా, అతనికి భార్యగా సాక్షి తన్వర్ నటిస్తోంది. -
'మొహల్లా అస్సీ' విడుదలపై స్టే
న్యూఢిల్లీ:కాశీ కా అస్సీ నవల ఆధారంగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో చంద్ర ప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రూపొందుతున్న 'మొహల్లా అస్సీ' చిత్రం విడుదలపై సివిల్ కోర్టు స్టే విధించింది. ఆ చిత్రంలో అసభ్యకరమైన సన్నివేశాలున్నాయన్న ఢిల్లీకి చెందిన గుల్షన్ కుమార్ కోర్టులో పిటిషన్ తో ఏకీభవించిన కోర్టు సినిమా విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మంగళవారం ఆ చిత్ర విడుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని పేర్కొంది. ఈ మేరకు చిత్ర ట్ర్రైలర్ ను చూసిన అనంతరం జడ్జి కిషోర్ కుమార్ తన తీర్పును వెలువరించారు. ఒక మతాన్ని కించపరుస్తూ చిత్రంలోని సన్నివేశాలపై కోర్టు తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసింది. ఆ సన్నివేశాలు తొలగించే వరకూ విడుదలను నిలుపుదల చేయాలని కోర్టు పేర్కొంది. పరమశివుడ్ని కించపరుస్తూ చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పిటిషనర్ సలహాదారు సచిన్ మిశ్రా తెలిపారు. వారణాసిలో ఉన్న అస్సి ఘాట్ రూపొందిన ఈ చిత్రం జూలై 3 వ తేదీన విడుదల కావాల్సి ఉంది. -
సన్నీ డియోల్ పై కేసు నమోదు
లక్నో: బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీ డియోల్ పై తాజాగా కేసు నమోదైంది. దర్శకుడు చంద్ర ప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రూపొందుతున్న 'మోహల్లా అస్సీ' చిత్రంలో కొన్ని అభ్యంతకర సన్నివేశాలున్నాయని ఆరోపిస్తూ సామాజిక స్వచ్ఛంద సంస్థ సర్వజన్ జాగృతి సంతష్ట ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారణాసి పోలీసులు దర్శకుడితో పాటు సన్నీ డియోల్ పై కేసు నమోదు చేశారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు కొన్ని మతాల సెంటిమెంట్లను ప్రభావితం చేసేవిగా ఉండటమే కాకుండా, నైతిక విలువలకు తీవ్ర విఘాతం కల్గిస్తుందంటూ ఆ సంస్థ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ తరహా సినిమాలు విడుదల కాకుండా అడ్డుకోవాలని కోరారు. 'కాశీ కా అస్సీ' నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు ఆరోపణలు ఎదుర్కోవడంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఈ చిత్రంలో సన్నీ డియోల్ ఆర్థడాక్స్ మత పెద్దగా కీలక పాత్ర పోషిస్తుండగా, అతనికి భార్యగా సాక్షి తన్వర్ నటిస్తోంది. -
మళ్లీ తెరపై మీనాక్షి
చిరంజీవితో ‘ఆపద్బాంధవుడు’లో ‘ఔరా అమ్మకు చెల్ల’ అనిపించుకున్న మీనాక్షీ శేషాద్రి గుర్తున్నారు కదా. హిందీ, తెలుగు చిత్రాలలో ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె మళ్లీ వెండితెరపై మెరవనున్నారు. 1996లో హిందీ సినిమా ‘ఘాతక్’ తరువాత ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. 1990లో ఆమె కథానాయికగా నటించిన ‘ఘాయల్’కు సీక్వెల్ అయిన ‘ఘాయల్ వన్స్ ఎగైన్’ చిత్రంతో మళ్లీ వెండితెరను పలకరించనున్నారీమె. సన్నీ డియోల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్కు ఆయన తండ్రి ధర్మేంద్ర నిర్మాతగా వ్యవ హరిస్తున్నారు. తన చిరకాల స్నేహితుడు సన్నీ డియోల్ నటించమని కోరడంతో మీనాక్షి ఈ చిత్రానికి మూడు రోజులు కేటాయించారట. ఇప్పటికే సీనియర్ తారలు శ్రీదేవి, జుహీ చావ్లా, మాధురీ దీక్షిత్ వెండితెరపై మెరిసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. మీనాక్షీ శేషాద్రి ఈ సినిమాతోనే తన నటనను ఆపేస్తారా..? లేక కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే! -
ప్రీతి జింటా.. ఓ బందిపోటు దొంగ!!
ఐపీఎల్లో తన వ్యాపార భాగస్వామి నెస్ వాడియాతో న్యాయవివాదం పెట్టుకుని.. చాలాకాలం పాటు పత్రికల ప్రధాన శీర్షికలలో నిలిచిన సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా.. మరోసారి ముఖానికి రంగేసుకుని వెండితెర మీదకు వస్తోంది. అయితే ఈసారి ఆమె అందాన్ని ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు లేదు. ఎందుకంటే.. నీరజ్ పాఠక్ తీస్తున్న 'భయ్యాజీ' అనే ఈ సినిమాలో ప్రీతి ఓ అరివీర భయంకరమైన బందిపోటు దొంగగా నటిస్తోంది. హీరో సన్నీ డియోల్ కూడా యూపీకి చెందిన ముఠానాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. ప్రీతిజింటా ఓ గ్యాంగ్స్టర్ కుమార్తెగాను, సన్నీడియోల్ భార్యగాను చేస్తోందని దర్శకుడు నీరజ్ పాఠక్ చెప్పారు. ఈ సినిమాలో ప్రీతిని చూసి.. 'సోహ్ని మాహివాల్' చిత్రం రీమేక్లో సోహ్నికి పంజాబీ తల్లి పాత్ర ఆమే చేయాలని సన్నీ డియోల్ భావిస్తున్నాడు. ఆ సినిమాలో సన్నీ కొడుకు హీరోగా నటించబోతున్నాడు. ఈ ఫైర్ బ్రాండ్ పాత్రలో ప్రీతి అద్భుతంగా చేస్తోందని, ఇకమీదట ఆమెను కేవలం గ్లామర్ డాల్గానే చూడటం కుదరదని నీరజ్ అన్నారు. తమ షూటింగ్ ఇంకా 12 రోజులే మిగిలి ఉందని చెప్పారు. ఇంతకుముందు సోల్జర్, ద హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై చిత్రాల్లో బాబీ డియోల్, సన్నీ డియోల్లతో ప్రీతి జింటా నటించింది. ఆ రెండు సినిమాలూ బ్రహ్మాండమైన హిట్లయ్యాయి. -
సోదరి వివాహానికి బాబీ, సన్నీడియోల్ దూరం!
సోదరి ఇషా డియోల్ పెళ్లికి గైర్హాజరైన సన్నీ, బాబీ డియోల్ లు అహనా పెళ్లికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలనాటి బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, ప్రకాశ్జీల సంతానం సన్నీ, బాబీ డియోల్ కాగా, ధర్మేంద్ర రెండవ భార్య సినీనటి హేమమాలినిలకు ఇషా, అహనా డియోలు ఇద్దరు కూతుళ్లు. ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్న కారణంగా 2012 లో జరిగిన ఇషా డియోల్ వివాహానికి హాజరుకాలేదు. అయితే అహనా పెళ్లికి హాజరుకాకపోవడం వెనుక ఎలాంటి కారణాలు లేవని సన్నిహితులు వెల్లడించారు. ఇషా, అహనా, బాబీ, సన్నీ డియోల మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయన్నారు. అహనా పెళ్లి కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన మెహందీ వేడుకలో ఇషా డియోల్ జారి కింద పడిపోవడంతో ఆమె భుజానికి స్వల్పంగా గాయమైంది. చేతికి ఉన్న కట్టుతోనే వివాహ వేడుకల్లో ఇషా హడావిడి చేస్తోంది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ వోరా తో అహనా వివాహం ఆదివారం సాయంత్రం ముంబైలోని ఐటీసీ మరాఠాలో జరుగనుంది. ఈ వివాహానికి బాలీవుడ్ కు చెందిన షారుక్ ఖాన్ తోపాటు పలువురు తారలు, రాజకీయ నేతల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, రాజ్ థాకరేలు హాజరుకానున్నారు. -
'ఘాయల్ రిటర్న్స్'కు సన్నీ డియోల్ దర్శకత్వం
ముంబై: 1990లో ఘనవిజయం సాధించిన 'ఘాయల్' చిత్ర సీక్వెల్ ను తెరకెక్కించేందుకు బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీడియోల్ సన్నద్ధమవుతున్నారు. ఘాయల్ రిటర్న్స్ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు 57 ఏళ్ల సన్నీ తెలిపాడు. ఈ చిత్రానికి రాహుల్ రావాలీ దర్శకత్వం వహిస్తాడని ముందు అనుకున్నా, కొన్ని అనివార్యకారణాల వల్ల అతను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆ అవకాశం సన్నీ డియోల్ ను వరించింది. ఈ చిత్ర విశేషాలను సన్నీ మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం ఘాయల్ రిటర్న్స్ స్క్రిప్ట్ వర్క్లో నిమగ్నమైయ్యామని, ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో సెట్స్ మీదుకు తీసుకువస్తామని తెలిపాడు. తను తీయబోయే ఘాయల్ రిటర్న్స్ పాత చిత్రానికి కొనసాగింపు మాత్రం కాదని తెలిపాడు. 1983లో 'బెతాబ్' సినిమాతో బాలీవుడ్కు పరిచయమైన సన్నీ..1999లో దిల్లగీ చిత్రానికి దర్శకత్వం వహించాడు. -
టాప్ హీరోయిన్లు నాతో పని చేయడం లేదు:సన్నీడియోల్
ముంబై: టాప్ హీరోయిన్లు తనతో పని చేయడానికి ఇష్టపడటం లేదని బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీడియోల్ తెలిపాడు. బాలీవుడ్లో తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నసన్నీ తాజాగా నటించిన 'సింగ్ సాబ్ ద గ్రేట్' త్వరలో విడుదల కానుంది. తనలోని నటుడిని బయటపెట్టిన దర్శకుడు అనిల్ శర్మతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. అనిల్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో 50 ఏళ్ల పైబడిన తనతో 19 ఏళ్ల ఉర్వశీ రౌతేలా జోడి కట్టిందన్న విషయాన్ని గుర్తు చేశాడు. పెద్ద హీరోయిన్లతో సినిమా చేయడానికి ఆసక్తి ఉన్నా వారు మాత్రం అయిష్టత చూపిస్తున్నారన్నాడు. తాను ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి తానేంటో నిరూపించుకున్నానని తెలిపాడు. ఇంకా తన గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. 1983లో 'బెతాబ్' సినిమాతో బాలీవుడ్కు పరిచయమైన సన్నీ..ఆపై దర్శకుడిగా కూడా మరాడు. ఈ 30 ఏళ్ల బాలీవుడ్ ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లను చూశానని తెలిపాడు.ప్రస్తుతం తాను తిరిగి ఓ సినిమాకు దర్శకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఈ క్రమంలో కొత్త నటీమణుల కోసం అన్వేషిస్తున్నానని తెలిపాడు. కొత్త వారి డేట్లు దొరకబుచ్చకోవడం కూడా పెద్ద కష్టం కాదన్నాడు. తనతో పని చేయమని చాలా మంది ప్రముఖ హీరోయిన్లు కలిశాన్నాడు. కాగా, వారు మాత్రం తనతో పనిచేయడానికి ఆసక్తి కనబరచడం లేదన్నాడు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, హృతిక్ రోషన్లతో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నాడు. -
మళ్లీ కెమెరా వెనక్కు వెళ్తా!
కెమెరా వెనక్కు వెళ్లాలనే కోరిక తనలో ఇంకా అలాగే ఉందంటున్నాడు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్. ఇప్పటిదాకా నటుడిగా కెమెరా ముందు ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్న సన్నీ దర్శకుడిగా కూడా కొన్ని అనుభవాలను మూటగట్టుకున్నాడు. అయితే మరోసారి దర్శకత్వం వహించాలనే తన కల సాకారం కావడానికి ఒకట్రెండేళ్లు పట్టే అవ కాశముందంటున్నాడు. త్వరలో ‘సింగ్ సహాబ్ ద గ్రేట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాభయేడేళ్ల నటుడు 1999లో ‘దిల్లగీ’ సినిమాతో దర్శకుడిగా మారాడు. నటుడిగా కాకుండా ఇంకేదైనా చేయాలనే కోరిక తనను దర్శకత్వం వైపు లాగుతోందని, అయితే ఒకట్రెండేళ్లు ఆగుతానంటున్నాడు. సినిమాను తెరకెక్కించే మంచి అంశమేదైనా బుర్రకు తట్టగానే కెమెరా వెనక్కు వెళ్తానంటున్నాడు. తనలోని నటుడిని బయటపెట్టిన దర్శకుడు అనిల్ శర్మతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. గదార్-ఏక్ ప్రేమ్ కథా, ద హీరో: లవ్స్టోరీ ఆఫ్ ఏ స్పై, అప్నే తదితర చిత్రాలను సన్నీతో కలిసి శర్మ తెరకెక్కించినవే. దీంతో తాజాగా విడుదల కానున్న ‘సింగ్ సహాబ్ ద గ్రేట్’పై అంచనాలు కూడా భారీగానే పెరిగాయి.ఈ విషయమై సన్నీ మాట్లాడుతూ... ‘దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ సినిమాను చేస్తున్నా. ఓ రకంగా ఇది సోలో ఫిల్మ్ అని చెప్పొచ్చు. వందశాతం కష్టపడుతున్నా.. మరోసారి యాంగ్రీ-యాక్షన్ హీరోగా నిలబెడుతుందనే విశ్వాసముంది. అమృతారావు, నూతన నటి ఊర్వశీ రౌతేలాలు కథనాయికలుగా నటిస్తున్నారు. శర్మ చెప్పిన కథపై చాలా నమ్మకముంది. నాకు సరిపడే కథలతోనే ఆయన నా వద్దకు వస్తారు. అందుకే ఆయనతో కలిసి పనిచేసే ఏ అవకాశాన్ని కూడా ఇప్పటిదాకా వదలిపెట్టలేదు. సినిమాలో కొంత భాగాన్ని జైలులో చిత్రీకరించాం. అందులో ఖైదీలో ఎంతో క్రమశిక్షణతో ఉన్నార’ని కితాబునిచ్చాడు. -
సన్నీ కండలు చూసి ముచ్చటపడిన బాలీవుడ్ తార!
ముంబై: బాలీవుడ్ వెటరన్ సన్నీ డియోల్ కండలు చూసి ఓ బాలీవుడ్ నటికి ముచ్చటేసిందట. గతంలో తన యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్స్ తో బాలీవుడ్ టాప్ హీరోగా చెలరేగిన సన్నీడియోల్ ఇటీవల కుర్ర హీరోల ధాటికి రేసులో వెనకపడ్డాడు. అయితే తాజాగా 'సింగ్ సాహెబ్ ది గ్రేట్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆలరించేందుకు సన్నీ సిద్ధమయ్యాడు. సన్నీ సరసన అమృతారావు జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది. ఇటీవల సన్నీతో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో అమృతారావు పాల్గొన్నారు. యాక్షన్ సన్నివేశాల్ని సన్నీ అద్బుతంగా చేశారని.. యాక్షన్ సీన్లను చూడటం తనకు బోనస్.. కండల తిరిగిన చేతులను చూస్తే ముచ్చటేసింది అని అన్నారు అమృతారావు. తాను ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నానని.. ఆ పాత్ర కోసం ఉత్తర ప్రదేశ్ లో మాట్లాడే హిందీని కష్టపడి నేర్చుకున్నానని తెలిపింది.