Ugadi celebrations
-
కూతురితో తొలి తమిళ ఉగాది సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఉగాది వేడుక చీరలో అందంగా ముస్తాబైన సెలబ్రిటీలు (ఫొటోలు)
-
నా సంకల్పమేదీ విఫలం కాలేదు
సాక్షి, హైదరాబాద్: తమ ప్రభుత్వ ఆలోచనల్లో స్పష్టత ఉందని. సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడన్న సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. తన జీవితంలో సంకల్పించిన లక్ష్యం ఏదీ ఇప్పటివరకు విఫలం కాలేదన్నారు. తెలంగాణ రైజింగ్ 2050 లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న సంకల్పం కూడా విజయవంతమవుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, పర్యాటక సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా రవీంద్రభారతిలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం మాట్లాడారు. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ ‘తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టేందుకు మా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంది. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని నిజం చేస్తూ దేశంలో తెలంగాణ ఓ వెలుగు వెలిగేలా చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగు రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. లాంటి కీలక నిర్ణయాలతో హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడేలా మారుస్తాం. మన ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ ఆ ఆలోచనకు నమూనాగా నిలవబోతుంది. ఇది జనావాస యోగ్యానికే పరిమితమయ్యే నగరం కాదు. ఉద్యోగ, ఉపాధి కల్పన సంక్షేమ పథకాల అమలుకు నిధులు కావాలంటే ఆ నగరానికి పెట్టుబడులు భారీగా రావాల్సి ఉంది. ఆ పెట్టుబడులతో రాష్ట్ర ఆదాయం పెరగాల్సి ఉంది. అందుకే ఆ నగరం జనావాసాలకే పరిమితం కాకుండా ఓ పెట్టుబడుల నగరంగా రూపు దిద్దుకుంటుంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం..‘అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రజల నుంచి నూరు శాతం మద్దతు వస్తుందని మా ప్రభుత్వం అనుకోవటం లేదు. దేవుళ్ల ఆరాధన విషయంలోనే భిన్నాభిప్రాయాలుండే సమాజం నుంచి.. ప్రభుత్వ నిర్ణయాలకు పూర్తి ఆమోదం ఆశించలేం. కానీ మెజారిటీ ప్రజల సంక్షేమం కోసం మేం తీసుకునే చర్యలు అడ్డుకుంటే ఆగిపోతాయని అనుకునేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రజల నుంచి మాకు సూచనలొస్తున్నాయి. కాబట్టి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం..’ అని రేవంత్ అన్నారు. ఉగాది పచ్చడి లాగానే భట్టి బడ్జెట్ ‘ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కూడా షడ్రుచుల ఉగాది పచ్చడి లాగానే ఉంది. తీపి ఉంది, పులుపు ఉంది, కారం ఉంది. కాస్తోకూస్తో ఉప్పు కూడా ఉంది. కొన్ని అంశాల్లో స్వేచ్ఛగా నిధులిచ్చారు. కొన్నింటి విషయంలో తప్పనిసరి నియంత్రణ పాటించారు. ఉద్యోగ ఉపాధి, పరిశ్రమలు, వ్యవసాయం, విద్య వైద్యం తదితరాలకు మెరుగ్గా నిధులిచ్చారు. బడ్జెట్ కేటాయింపులు అమలు కావాలంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. అది జరగాలంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు స్థిరంగా ఉండాలి. అసాంఘిక శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలు సన్న బియ్యం కోరుకుంటున్నారు..నేను, భట్టి జోడెద్దుల్లా రాష్ట్రాన్ని పురోగమన పథంలోకి తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. గతంలో పండుగ పూట మాత్రమే తెల్లన్నం చూసే భాగ్యం పేదలది. కోట్ల విజయభాస్కర్రెడ్డి రూ.1.90కే, తర్వాత ఎన్టీఆర్ రూ.2కే కిలోబియ్యం ఇచ్చి కొంత మార్పు తెచ్చారు. సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఆహారభద్రత చట్టం వచ్చాక ఇప్పుడు పేదలు శ్రీమంతుల తరహాలో సన్న బియ్యం తినాలని కోరుకుంటున్నారు. వారికోసం హుజూర్నగర్లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో పాటు గవర్నర్, ఎన్నికల వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పార్టీలు, ప్రజా సంఘాలతో సత్సంబంధాలు కొనసాగిస్తాం. ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. రాష్ట్ర ప్రజలందరికీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు..’ అని సీఎం అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాభివృద్ధి: భట్టిఅన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, శంకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వా మి దేవస్థానం నూతనంగా రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. యాదగిరి క్షేత్ర ముఖ్య అర్చకులు మంగళగిరి నర్సింహమూర్తిని ఉగాది పురస్కారం, అవార్డుతో సన్మానించారు. -
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
-
YSRCP కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు
-
శ్రీశైలంలో ఘనంగా ఉగాది బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
ఫ్రాంక్ఫర్ట్ లోని తెలుగు కమ్యూనిటీలు భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రదర్శిస్తూ తెలుగు నూతన సంవత్సరం ఉగాది స్ఫూర్తిని సరిహద్దులు దాటించారు. తెలుగు వెలుగు జర్మనీ (టివిజి) నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులలో కనిపించి ఉత్సవాలకు తెలుగు శోభను అద్దారు.స్థానిక తెలుగు వారి ప్రతిభను వెలికితీయడానికి, సంస్కృతి చైతన్యాన్ని ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భారత రాయబారి హరీష్ పర్వతనేని, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బి.ఎస్. ముబారక్ పాల్గొన్నారు. దాదాపు రోజంతా జరిగిన ఉత్సవాలలో సాయంత్రం నిర్వహించిన మ్యూజికల్ ఫెస్ట్ హైలైట్గా నిలిచింది.ఈ సంగీతోత్సవంలో భారతదేశానికి చెందిన ప్రముఖ గాయకులు పృథ్వీ చంద్ర, మనీషా ఎరా బత్ని, ఇతిపాడ్ బ్యాండ్కి చెందిన సాకేత్ కొమండూరి ల సంగీత ప్రదర్శనలు ఉత్సవ హోరును శిఖరాలకు చేర్చాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఫ్రాంక్ఫర్ట్ మేయర్ (బర్గర్మీస్టర్) డాక్టర్ నర్గెస్ ఎస్కందారి గ్రున్బర్గ్ హాజరయ్యారు. అతిథులలో.. యూరోపా యూనియన్ ఫ్రాంక్ఫర్ట్ చైర్పర్సన్, క్లాస్ క్లిప్, జవ్వాజి గ్రూప్ కంపెనీల ఛైర్మన్, జవాజి, విదేశీ మండలి సభ్యురాలు నందిని తదితరులున్నారు. -
Ugadi2024 అంజలి ‘పాప’ ఎంత ముద్దుగుందో..! (ఫోటోలు)
-
ప్రయత్నిస్తే మంచి ఫలితమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో అధికార పక్షానికి కష్టతరంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ భవన్లో పంచాంగ శ్రవణం సందర్భంగా పండితులు జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు ప్రయతి్నస్తే ఈ ఎన్నికల్లో విజయం పొందే అవకాశం ఉందన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రోధి నామ సంవత్సరంలో రాజు కుజుడుగా ఉన్నాడని, శని మంత్రిగా ఉన్నాడని పండితులు తెలిపారు. కుజుడు అధిపతిగా ఉండటం వల్ల వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడి పంటలు మంచిగా పడుతాయని చెప్పారు. అయితే ధరలు అధికమవుతాయన్నారు. ఈ ఏడాదంతా కేసీఆర్కు బాగుంటుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాశి కర్కాటకం అని.. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 గా, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందని తెలిపారు. గురుడు మంచి స్థానంలో ఉన్నందున ఈ సంవత్సరమంతా కేసీఆర్కు బాగుంటుందని తెలిపారు. కర్కాటక రాశి వాళ్లు వేసే ఎత్తుగడలు ఫలిస్తాయని, వారి నిర్ణయాలకు ప్రజాబలం లభిస్తుందన్నారు. వ్యక్తిగతంగా కూడా మంచి ప్రతిష్ఠ ఉంటుందన్నారు. వారి మాటకు, గమనానికి ఈ ఏడాది అడ్డు ఉండదని చెప్పారు. అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలా ఉంటే కేటీఆర్ ప్రజాభిమానాన్ని పొందుతారు కేటీఆర్ది మకర రాశి అని, ఈ రాశి వారు ఏ పనిచేసినా బ్యాలెన్స్గా చేయాలని సూచించారు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉందని, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉందని పండితులు తెలిపారు. మాటను కట్టడి చేసుకొని మృదువుగా మాట్లాడం వల్ల , చక్కటి ఉపకారాన్ని, అభిమానాన్ని పొందగలుగుతారని అన్నారు. జాగ్రత్తగా ఉంటే ఎన్నికల్లో మంచి పట్టు సాధించే అవకాశం ఉందని పండితులు తెలిపారు. -
మళ్లీ బీజేపీదే అధికారం
సాక్షి, హైదరాబాద్: దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని పంచాంగ శ్రవణకర్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి జోస్యం చెప్పారు. –ఈ ఏడాది అంతా మంచే జరుగుతుందనీ, పార్టీ నాయకుల్లో ఐక్యత పెరుగుతుందనీ, సమష్టి విజయం సాధించాలనే సంకల్పం సిద్ధిస్తుందన్నారు. తమ శక్తి మేర ప్రజలకు వ్యయం చేస్తే నాయకులకు పేరు వస్తుందన్నారు. వృద్ధుల సహకారం ఉంటేనే యువకులు విజయం పొందుతారని తెలిపారు. ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తాను 14 ఏళ్ల క్రితం బీజేపీ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొని అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం తర్వాత మళ్లీ కలుసుకుందామని చెప్పినట్టు మూర్తి గుర్తుచేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి దంపతులు హోమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డుసభ్యుడు డా.కె.లక్ష్మణ్ , ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీ‹Ùబాబు, రాష్ట్రపార్టీ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ పాల్గొన్నారు. మోదీ సర్కార్నే ప్రజలు కోరుకుంటున్నారు: కిషన్రెడ్డి పంచాంగ శ్రవణం అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ క్రోధి నామ సంవత్సరం చాలా ప్రాధాన్యత కలిగిన సంవత్సరమని, మోదీ నాయకత్వంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మంచి వర్షాలతో, పాడిపంటలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. మోదీ నేతృత్వంలో మరింత సుస్థిర, స్థిరమైన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశం కోసం పనిచేస్తున్న మోదీ నాయకత్వానికి మద్దతు తెలిపి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
మరింత మంచి పాలన
సాక్షి, హైదరబాద్: క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం గాం«దీభవన్లో ఘనంగా జరిగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, వర్కింగ్ ప్రెసిసెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుడు శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. ప్రజాభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా పాలన సాగిస్తుందన్నారు. వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు అమలు చేసి, ప్రజాదరణ పొందారని, రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా పాలన సాగుతుందని జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా మహేష్కుమార్గౌడ్ మాట్లాడుతూ ఈ క్రోది నామ సంవత్సరంలో కోపం తగ్గించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు కుమార్రావ్, నిరంజన్, చల్లా నర్సింహారెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నవ వసంతంలో అందరికీ మేలు జరగాలి
గన్¸పౌండ్రీ (హైదరాబాద్): క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో క్రోధినామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాలలో పున్నమి వెన్నెలను నింపడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో భాగంగా బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి పంచాగ పఠనం చేశారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి ఆలయంలో వేడుకగా ఉగాది ఆస్థానం
తిరుమల/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/కాణిపాకం(చిత్తూరు రూరల్)/శ్రీశైలం టెంపుల్: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి అర్చకులు విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై, ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. శ్రీవారి మూలవిరాట్కు, ఉత్సవమూర్తులకు నూతన వ్రస్తాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఆలయంలో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్తో ఏర్పాటు చేసిన ఫల–పుష్ప అలంకరణలు ఆకట్టుకున్నాయి. అయోధ్య రామాలయం, బాలరాముడి సెట్టింగ్, నవధాన్యాలతో రూపొందించిన మత్స్య అవతారము మైమరిపించింది. టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 150 మంది పుష్పాలంకరణ కళాకారులు, 100 మంది టీటీడీ గార్డెన్ సిబ్బంది 2 రోజులు శ్రమించి ఈ ఆకృతులను రూపొందించారు. వైభవంగా దుర్గమ్మకు పుష్పార్చన.. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవి ఈ నెల 18 వరకు జరుగుతాయి. మంగళవారం తెల్లవారుజామున అంతరాలయంలో మూలవిరాట్కు స్నపనాభిషేకం నిర్వహించారు. దేవస్థానం రూపొందించిన పంచాంగాన్ని దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆవిష్కరించారు. అమ్మవారి ప్రధానాలయం, ఉపాలయాలను పుష్పాలతో అలంకరించారు. దుర్గమ్మకు విశేష పుష్పార్చన చేపట్టారు. ఉగాది సందర్భంగా ధర్మపథం వేదికపై కప్పగంతుల సోమయాజుల సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. సాయంత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథంపై నగరోత్సవాన్ని నిర్వహించారు. కాణిపాకంలో అంగరంగ వైభవంగా.. కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాన్ని పలు రకాల పుష్పాలు, మామిడి తోరణాలు, అరటి బోదెలతో శోభాయమానంగా అలంకరించారు. వేకువజామున స్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈవో వెంకటేశు స్వామి వారికి పట్టువ్రస్తాలను సమరి్పంచారు. శివకుమార్ శర్మ రచించిన కాణిపాక దేవస్థానం పంచాంగాన్ని ఆవిష్కరించారు. పురోహితులు మోహన్, రామలింగం పంచాంగ శ్రవణం చేశారు. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలను కాణిపాకం పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. శ్రీశైలంలో వేడుకగా రథోత్సవం... శ్రీశైలంలో మల్లన్న రథోత్సవం వైభవంగా సాగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులను చేయించి ఊరేగింపుగా రథశాల వద్దకు తోడ్కొనివచ్చి రథంపై అధిష్టింపజేశారు. అర్చకులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక హారతులిచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రథోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని రమావాణీ సేవిత రాజరాజేశ్వరీ అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ ఏడాది దేశం పారిశ్రామికరంగంలో అభివృద్ధి చెందుతుందని శ్రీశైలం దేవస్థాన ఆస్థాన సిద్దాంతి పండిత బుట్టే దైవజ్ఞ తెలిపారు. ఉగాది సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. -
ఉగాది వేడుకల్లో మెగాస్టార్ మనవరాలు నవిష్క (ఫొటోలు)
-
Ugadi 2024: సెలబ్రిటీల సంబరాలు
-
ఇంద్రకీలాద్రి పై ఘనంగా వసంత నవరాత్రి ఉగాది మహోత్సవాలు
-
కన్య రాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి..
-
ములుగు శివజ్యోతి ఉగాది రాశి ఫలాలు
-
వృషభ రాశి ఫలితాలు ములుగు శివజ్యోతి
-
అంతా సమానమే..
-
వారు ఆ విషయంలో జాగ్రత్త పాటించాలి
-
అదృష్టాన్ని నమ్ముకోవచ్చు..
-
రాజకీయ నాయకులకు అండదండలు.. కానీ
-
అన్నీ ఎక్కువే..
-
చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో ఉగాది వేడుకలు
-
విశాఖలో ఘనంగా ఉగాది ఉత్సవాలు
-
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
-
సత్యసాయి నిగమంలో ఉగాది ఉత్సవాలు
-
‘తాల్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలు-2023 ఘనంగా జరిగాయి. లండన్లోని సత్తావిస్ పటిదార్ సెంటర్లో ఏప్రిల్ 22న ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో లండన్, పరిసర ప్రాంతాలకుచెందిన సుమారు వెయ్యి మంది తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. తాల్ కల్చరల్ సెంటర్ (TCC) విద్యార్థులచే గణపతి పాట, భరతనాట్యం, కర్ణాటక సంగీత ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉగాది కోసం ప్రత్యేకంగా మూడు నెలలపాటు నిర్వహించిన సినీ నృత్య శిక్షణ శిబిరాలలో సుమారు వంద మంది చిన్నారులు, గృహిణులు, భార్య భర్తలు పాల్గొని, ఆ నృత్యాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. అవి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ, సినీ సంగీత నృత్యాలతో, విభిన్న కార్యక్రమాలతో వేదిక హోరెత్తింది. హాజరైన వారికి తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ఉగాది మిఠాయిలు, రుచికరమైన వంటకాలు అరిటాకులో వడ్డించారు. తాల్ చైర్పర్సన్ భారతి కందుకూరి, వైస్-చైర్మన్ , కోశాధికారి రాజేష్ తోలేటి, ఇతర ట్రస్టీలు గిరిధర్ పుట్లూరు, అనిత నోముల, అనిల్ అనంతుల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, నవీన్ గాదంసేతి మరియు కిషోర్ కస్తూరి పాల్గొన్నారు. 'తాల్' ఉగాది-2023 కన్వీనర్ శ్రీదేవి అల్లెద్దుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటుడు, హీరో, డబ్బింగ్ కళాకారుడు సాయి కుమార్ తన 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని, తన జీవిత విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన సినిమాలలో ప్రేక్షకాదరణ పొందిన డైలాగులు చెప్పి తెలుగువారిని, ప్రేక్షకుల్లో ఉన్న కొందరు కన్నడ వారికోసం కన్నడ డైలాగులు చెప్పి వారిని కూడా కేరింతలు కొట్టించారు. యూకేలో తెలుగు సంస్కృతిని పరిరక్షించడంలో, ప్రోత్సహించడంలో 'తాల్' చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. 'తాల్' వార్షిక పత్రిక “మా తెలుగు”ను సాయి కుమార్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తాల్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, పద్మశ్రీ , బ్రిటన్ ఓబీఈ గ్రహీత, KIMS ఉషా లక్ష్మీ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘురాం పిల్లరిశెట్టికి అందించి సత్కరించారు. డాక్టర్ రఘురాం మాట్లాడుతూ ఈ పురస్కారం తన జీవితంలో ఎప్పటికీ మంచి జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని అన్నారు. అలాగే 'తాల్' చేస్తున్న సేవా సాంస్కృతిక కార్యక్రమాలను కొనియాడారు. లండన్లోని హై కమిషన్ ఆఫ్ ఇండియా మినిస్టర్ (కోఆర్డినేషన్) దీపక్ చౌదరి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసి, లండన్లో 'తాల్' తెలుగువారి కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. అలాగే తెలుగు వారికి భారత దౌత్య కార్యాలయం 'తాల్' సమన్వయంతో సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని గుర్తు చేశారు. ప్రముఖ పర్వతారోహకుడు, ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అన్మిష్ వర్మ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారతదేశం నుంచి విచ్చేశారు. తన ఎవరెస్టు శిఖరం ఎక్కినప్పటి అనుభవాలను, రణ విద్యలలో తను గెలుచుకున్న ప్రపంచ స్థాయి పథకాల ప్రక్రియలో ఎదుర్కొన్న సవాళ్లను వివరించి ప్రేక్షకులలో ముఖ్యంగా యువతలో స్ఫూర్తి నింపారు. ప్రముఖ యాంకర్, నటి శ్యామల, కెవ్వు కార్తీక్, ఆర్జే శ్రీవల్లి తమదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. నేపథ్య గాయకులు హారిక నారాయన్, అరుణ్ కౌండిన్యలు తమ ప్రసిద్ధ తెలుగు పాటలతో మైమరిపించడమే కాకుండా ఉర్రూతలూగించే పాటలతో ప్రేక్షకులుమైమరచిపోయారు. లండన్ బారో ఆఫ్ హన్స్లో మేయర్ రఘువీందర్ సింగ్ అతిథిగా విచ్చేసి, 'తాల్' క్రీడల పట్ల చేస్తున్న కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. ప్రతి సంవత్సరం 'తాల్' ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 20-20 క్రికెట్ పోటీలు, 'తాల్' ప్రీమియర్ లీగ్ (TPL), ఈ సంవత్సరం ప్రైమ్ నార్త్ టీపీఎల్ 2023గా, మే 6 నుంచి మూడు నెలల పాటు నిర్వహించబోతున్నట్టు తెలియజేస్తూ టోర్నీకి సంబంధించిన పోస్టర్ని TPL కమిటీ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రేక్షకులకు, నిర్వాహక కమిటీకి, కళాకారులకు, వాలంటీర్లకు, తోటి సంస్థలు, తోడ్పాటు అందించిన స్పాన్సర్లందరికీ 'తాల్' చైర్పర్సన్ భారతి కందుకూరి ధన్యవాదాలు తెలిపారు. -
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు మరియు పంచాంగ శ్రవణం తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో లో మర్చి 22న ఘనంగా జరిగాయి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినా న సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. వేడుకల్లో బాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు సింగపూర్లో తొలిసారి స్థానిక కాలమాన ప్రకారం ప్రత్యేక గంటల పంచాంగాన్ని సభ్యులకు అందించారు. జోతిష పండితులు పంచాంగకర్తలు కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు , మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ దీన్ని రూపొందించారు. ఈ వేడుకల్లో సుమారు 200-250 మంది ప్రవాసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు కర్ణాటక తదితర రాష్ట్రాల వారు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి, భక్షాలు, పులిహోర ప్రసాదం పంపిణి చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ నిర్వహిస్తున్నపలు భక్తి, స్వచ్చంద సేవా కార్యక్రమాలు అభినందనీయమని భక్తులు కొనియాడారు. సాంస్కృతిక నృత్యాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా శశిధర్ రెడ్డి, నంగునూరి వెంకట రమణ, కాసర్ల శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల మరియు సతీష్ పెసరు వ్యవరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా జరుగుటకు మరియు ప్రసాదానికి సహాయం అందించిన దాత లకు, స్పాన్సర్స్ కు సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి , కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి,కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, నడికట్ల భాస్కర్, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి కృష్ణ విజాపూర్, సదానందం అందె, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యం గా ఈ వేడుకలకు ఘనంగా జరగడానికి చేయూతనందించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
తాడేపల్లి: సీఎం జగన్ నివాసంలో శోభకృత్ నామ ఉగాది వేడుకలు (ఫొటోలు)
-
సీఎం జగన్ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం
-
ఉగాది పచ్చడి సేవించిన సీఎం జగన్ దంపతులు
-
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూలమాల వేసిన సీఎం జగన్
-
సతీసమేతంగా ఉగాది సంబరాల్లో సీఎం జగన్
-
తాడేపల్లిలో శోభకృత్ నామ ఉగాది వేడుకలు.. హాజరైన సీఎం జగన్ దంపతులు
-
సీఎం జగన్ నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. వేడుకలకు ముందు శ్రీవెంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్ దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పంచాంగాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ‘‘రైతులకు మేలు జరగాలి. అక్క చెల్లెమ్మలు, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ అన్నారు. కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని సుబ్బరామ సోమయాజి అన్నారు. పంచాంగ పఠనం చేసిన సుబ్బరామ సోమయాజిని సీఎం జగన్ సన్మానించారు. తిరుమల ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి వచ్చిన పండితులు.. సీఎం జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. సీఎం జగన్ దంపతులకు మంత్రి ఆర్కే రోజా మెమెంటో అందజేశారు. సాంస్కృతిక శాఖ రూపొందించిన క్యాలెండర్ను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ దంపతులు వీక్షించారు. ఉద్యోగులు, శ్రామికులు, కర్షకులకు మంచి ఫలితాలు ఉంటాయన్నారు. పాడి పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉంటుందన్నారు. ఆహార ఉత్పతులతో ముడిపడిన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేశారు. మండలంలోని గోడలకు దశావతారాల బొమ్మలు ఆకట్టుకున్నాయి. -
Ugadi 2023: కొత్త కాంతుల శోభకృత్.. తెలుగు రాష్ట్రాల్లో తొలి పండగ సందడి (ఫొటోలు)
-
ఘనంగా టాస్ ఉగాది సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (టాస్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడేళ్ల తర్వాత జరుగుతున్న వేడుకలు కావడంతో టాస్ కన్నుల పండువగా ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. సినీ నేపథ్య గాయని ఉషా పాటలు అలరించాయి. టాస్ సాంస్కృతిక కార్యదర్శి నిరంజన్ నూక ఆధ్వర్యంలో టాస్ ప్రస్తుత, పూర్వ కార్యనిర్వాహాక సభ్యుల జ్యోతి ప్రజ్వాలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను చూసి ఇండో, స్కాటీష్ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఉగాది వేడుకలను పురస్కరించుకుని టాస్ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. టాస్ చైర్పర్సన్గా మైథిలీ కెంటూరీ, అధ్యక్షుడిగా శివ చింపిరి, ప్రధాన కార్యదర్శిగా ఉదయ్ కుమార్ కూదాడి, సంయుక్త కార్యదర్శిగా వెంకటేష్ గడ్డం, కోశాధికారిగా నిరంజన్ నూక, సాంస్కృతిక కార్యదర్శిగా మర్రి విజయ్కుమార్, మహిళా కార్యదర్శిగా మాధవీలత, క్రీడా కార్యదర్శిగా జాకీర్షేక్, ఐటీ, మీడియా కార్యదర్శిగా పండరీ జైన్ పొలిశెట్టి, యువజన కార్యదర్శిగా నరేశ్ దీకొండ, అసోసియేట్స్ ప్రాజెక్ట్ కార్యదర్శిగా కర్నాటి బాలాజీ, అసోసియేట్స్ క్రీడా కార్యదర్శిగా సాంబ రాజశేఖర్లు ఎన్నికయ్యారు. -
స్విట్జర్లాండ్లో ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ (సీహెచ్) జ్యూరీచ్లో ఉగాది వేడుకలు వైభవంగా జరిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కనువిందుగా ఈ వేడుక సాగింది. స్విట్జర్లాండ్లో స్థిర పడిన 200 మంది తెలుగు ప్రజలు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ ఉగాది వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విటర్లాండ్ ప్రెసిడెంట్ గనికాంబ కడలి, జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గారావు కారంకి, ట్రెజరర్ మాధురి ముళ్ళపూడి , కల్చరల్ సెక్రెటరీ మాణిక్యవల్లి చాగంటి, స్పోర్ట్స్ సెక్రెటరీ రామచంద్ర వుట్టిలతో పాటు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో నిర్వహించారు. -
సీజేఐ నివాసంలో ఉగాది వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నివాసంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. శనివారం సాయంత్రం జరిగిన వేడుకలకు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హిమా కోహ్లీ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి, తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, వేద ఆశీర్వచనం, సినీ గాయకులు కారుణ్య, సాహితీల సంగీత విభావరి జరిగింది. తెలుగు వంటకాలతో ఘనంగా విందు ఏర్పాటు చేశారు. -
ఇది ప్రజాసంగ్రామ సంవత్సరం
సాక్షి, హైదరాబాద్: ‘ఈ ఏడాది ప్రజాసంగ్రామ సంవత్సరం.. ధర్మ విజయ సంవత్సరం’అని శ్రీ శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ చెప్పారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది పండుగను పురస్కరించుకొని ఆయన పంచాంగ శ్రవణం నిర్వహించారు. కొత్త ఏడాదిలోనైనా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వస్తుందా అని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధా కర్రెడ్డి పంచాంగ ప్రవచనకర్త శర్మను అడగ్గా ప్రతిపక్షాల బలం వల్ల ప్రభుత్వం కాస్త గుణపాఠం నేర్చుకోకతప్పదని ఆయన బదులిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ ‘దే శం, రాష్ట్రంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉం డాలని దేవుడిని కోరుకుంటున్నా. అందరూ అనుకున్న లక్ష్యాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలి’అని అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ‘కేసీఆర్ కుటుంబ, నియంత, అవినీతి పాలనలో ప్రజలపై మోపిన భారాలు కొత్త సంవత్సరంలో తొలగిపోవాలి. ప్రజలకు మేలు జరగాలి. బీజేపీ శాంతియుత మార్గంలో చేపట్టే పోరాటాలకు ప్రజలు అండగా నిలవాలి’అని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, విజయశాంతి, కె.స్వామిగౌడ్, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, మంత్రి శ్రీనివాస్, బంగారు శ్రుతి, ఆలె భాస్కర్, గీతామూర్తి పాల్గొన్నారు. -
ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది గ్రహస్థితుల ప్రకారం శని రాజుగా ఉన్నాడని, దీంతో రాష్ట్రంలో పంటలు సంతృప్తిగా పండి, ప్రజలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని జ్యోతిష పండితుడు చిలుకూరి శ్రీనివాసమూర్తి చెప్పారు. శుభకృత్ నామ ఉగాది పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, నాయకులు దామోదర రాజనర్సింహ, మహేశ్కుమార్గౌడ్, అంజన్కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, సుదర్శన్రెడ్డి, మల్లు రవి, గోపిశెట్టి నిరంజన్, కుమారరావు, హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం చేసిన చిలుకూరి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు. తెలంగాణలో ఆర్థికాభివృద్ధి ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం వైద్యంపై ఎక్కువగా ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది అమెరికాతో భారతదేశ సంబంధాలు బాగుంటాయని, పాకిస్తాన్, చైనాలతో వైరం ఉంటుందని అన్నారు. నదుల అనుసంధానం కోసం చర్చలు జరుగుతాయని, కేంద్రంలో ఓ ముఖ్య నాయకుడి మరణ వార్త వింటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుందని, తెలుగుదేశం పార్టీ విచిత్రమైన పొత్తులకు ప్రయత్నిస్తుందని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారని, అక్టోబర్లో రేవంత్రెడ్డి మరింత విజృంభిస్తారని శ్రీనివాసమూర్తి జోస్యం చెప్పారు. -
సింగపూర్లో తొలి తెలుగు పండుగ “ఉగాది” వేడుకలు
-
సింగపూర్లో ఉగాది సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు సింగపూర్లోని సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో ఘనంగా జరిగాయి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినా న సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ వేడుకల్లో సుమారు 200 మంది ప్రవాసి తెలుగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సమన్వయకర్తలుగా దీప నల్ల, నంగునూరి వెంకట రమణ, కాసర్ల శ్రీనివాస్ మరియు గోనె నరేందర్ రెడ్డి వ్యవరించారు. అదే విధంగా సంబరాలు విజయవంతంగా జరిగేందుకు సహయం అందించిన దాతలకు టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్రాజులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సొసైటీ ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, రోజా రమణి, మరియు కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, శ్రీధర్ కొల్లూరి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్, మరియు ప్రవీణ్ మామిడాల గార్లు సంబరాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు (ఫోటోలు)
-
సీఎం జగన్ దంపతులకు పట్టువస్త్రాలు సమర్పణ
-
రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు కలగాలి: సీఎం జగన్
-
విశాఖ శారదపీఠంలో ఉగాది వేడుకలు
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు
-
ప్రగతి భవన్ లో ఉగాది వేడుకలు
-
పిల్లలతో సీఎం వైఎస్ జగన్ ఇంటరాక్ట్
-
వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
ఉగాది వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు
-
AP: శుభకృత్లో అన్నీ శుభాలే
సాక్షి, అమరావతి: శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పంచకట్టులో సీఎం వైఎస్ జగన్, సతీమణి భారతితో కలిసి ఈ వేడుకలకు ముఖ్య అతి«థులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ రోజు శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని, పంచాంగాలన్నీ ఈ పేరులోనే శుభం అన్న మాట కనిపిస్తోందని చెబుతున్నాయని తెలిపారు. సతీమణి భారతీరెడ్డికి కంకణం కడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో విప్ చెవిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి తదితరులు ఈ సంవత్సరం అంతా రాష్ట్ర ప్రజలందరికీ శుభం జరుగుతుందని చెబుతున్న నేపథ్యంలో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి ఇంకా బలాన్నివ్వాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సంవత్సరం అంతా ప్రజలందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. ఇక్కడ ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, మిత్రులే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు, ప్రతి తాతకు, అవ్వకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. క్యాలెండర్లు, పుస్తకాలు ఆవిష్కరించారు. సీఎం దంపతులకు ఘన స్వాగతం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సీఎం దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, సాంస్కృతిక, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. పంచాంగ శ్రవణ వేదిక వద్దకు వస్తున్న సమయంలో సీఎం వైఎస్ జగన్ నుదిటిపై తిలకం దిద్దుతున్న ఆయన సతీమణి వైఎస్ భారతి ప్రత్యేక వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం దంపతులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సంప్రదాయ పంచకట్టులో వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుదిటిపై సతీమణి భారతి తిలకం దిద్దగా, ఆమె నుదిటిపై సీఎం కుంకుమ అద్దడంఅక్కడున్న వారందరినీ ఆకర్షించింది. వేద పండితులు సీఎం చేతికి కంకణ ధారణ చేయగా, భారతి చేతికి సీఎం కంకణ ధారణ చేశారు. అనంతరం వారు వేదం నేర్చుకుంటున్న చిన్నారులతో కలిసి ప్రాంగణమంతా కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ పేరుపేరున పలకరిస్తూ సభా వేదికపైకి చేరుకున్నారు. వైఎస్ భారతి నుదిటిపై తిలకం అద్దుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాలెండర్ల ఆవిష్కరణ సమాచార శాఖ రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్, వ్యవసాయ పంచాంగం 2022–23, ఉద్యానవన పంచాంగం 2022–23, సాంస్కృతిక శాఖ రూపొందించిన శిల్పారామం క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు జయశ్రీ రచించిన ‘ఆమెకు తోడుగా న్యాయదేవత’, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘తెలుగు సాహిత్యం, సమాజం చరిత్ర – రెండువేల సంవత్సరాలు’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రంలో వివిధ దేవస్థానాలకు చెందిన వేద పండితులను సీఎం సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలపై చిన్నారుల నృత్య రూపకాన్ని తిలకించి, వారితో కలసి ఫొటోలు దిగారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్.మల్లిఖార్జునరావు రూపొందించిన డీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చిత్రపటాన్ని సీఎం ఆవిష్కరించారు. ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్ రూపంలో విరాళం అందజేశారు. ఈ కార్యక్రమాలను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆద్యంతం దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం సీఎం దంపతులకు శ్రీవారి దశావతార కళారూపం అందజేశారు. శుభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని సిద్ధాంతి సోమయాజులుకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి (ప్రజా వ్యవహారాలు), జీవీడీ కృష్ణమోహన్ (కమ్యూనికేషన్స్), పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలు హాయిగా ఉంటారు.. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు పంచాంగ పఠనం చేశారు. పేరుకు తగ్గట్లుగానే శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరుగుతాయని సిద్ధాంతి చెప్పారు. ప్రభువుల చల్లని పాలనకు తగ్గట్లే ప్రజలూ హాయిగా ఉంటారని, చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందన్నారు. ఓర్పుగా అవాంతరాలను ఎదుర్కొంటూ మంచి పాలన అందిస్తారని సీఎం జగన్ను సిద్ధాంతి ఆశీర్వదించారు. ఉగాది పచ్చడిని స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు శుభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని సీఎం ఆవిష్కరించి, కప్పగన్తు సుబ్బరామ సోమయాజులకు అందజేశారు. అనంతరం ఆయన సీఎం దంపతులకు ఉగాది పచ్చడి అందించారు. సిద్ధాంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం సత్కరించారు. పంచాంగ శ్రవణం అనంతరం ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం స్థానాచార్యులు, అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఉట్టిపడిన గ్రామీణ వాతావరణం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లతో ఒక గ్రామ నమూనా ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయంలో ఒక అరుగు మీద సీఎం దంపతులు కూర్చోగా, వారికి ఎదురుగా మరో అరుగుపై సిద్ధాంతి కూర్చొన్నారు. సచివాలయం ఎదురుగా ఆహుతులు కూర్చొని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. పంచాంగ శ్రవణం, ఇతర కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Ugadi 2022: మనమే మార్గదర్శి
విద్య, విద్యుత్తు, విద్వత్తు, తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం.. ఇలా చదివితే చాంతాడంత లిస్టు అయ్యేన్ని రంగాల్లో తెలంగాణ ముందుంది. కొన్ని దుష్టశక్తులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా.. తెలంగాణ ప్రజలు ఏకోన్ముఖంగా ముందుకు కలిసిరావటం వల్లనే ఈ పురోగతి సాధ్యమైంది. ప్రజల అండ, భగవంతుడి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కలగటం వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతృప్తి నిచ్చింది. మనకు జాతి, కులం, మతం భేదం లేదు. తెలంగాణ జాతి అంతా ఒకటే. అందరూ సుఖసంతోషాలతో ఉండాలి. మన బంగారు తెలంగాణ స్వప్నం నిజం కావాలి. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం సాధించనంత అద్భుత ఫలితాలు ఎన్నిం టినో తెలంగాణ సాధించి చూపిందని సీఎం కె.చంద్రశేఖరరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో కరెంటు కష్టాలు, తాగునీరు, సాగునీటి వసతి.. తదితరాలపై ఎన్నో సందేహాలు, అనుమానాలు రేకెత్తించారన్నారు. వాటన్నింటినీ అధిగమించి తెలంగాణ దేశంలోనే వేగంగా ప్రగతిపథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధి పథంలో ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లాంటి రాష్ట్రాల కంటే ముందు వరసలో ఉండి అభివృద్ధి దిశలో పరుగుపెడుతోందన్నారు. కుల, మత, వర్గ భేదాలకతీతంగా, అన్ని వర్గాల సహకారంతో తెలం గాణ గొప్పగా రాణిస్తోందని, ఎలాంటి పథకంలోనైనా యావత్తు దేశం తెలంగాణను చూసి నేర్చుకోవాల్సిన స్థితికి చేరిందని చెప్పారు. శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. శృంగేరీ ఆస్థాన పౌరాణికులు బాచంపల్లి సంతోష్కుమారశాస్త్రి పంచాంగాన్ని పఠించారు. అనంతరం సీఎం యావత్తు తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగానికి ఉపక్రమించగానే ‘లాంగ్లివ్ కేసీఆర్’ అంటూ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. సమైక్య రాష్ట్రాన్ని మించి ఆదాయం ‘పంచాంగ పఠనం సందర్భంలో పౌరాణికులు కొన్ని మంచి మాటలు చెప్పారు. ఇక మాస్కుల్లేవు, ఆర్టీపీసీఆర్ లేదు, పీసీఆర్ లేదు.. వాటి గొడవే లేదంటూ శుభం పలికారు. చాలా సంతోషం. సర్వజనులకు శుభకృత్ నామ సంవత్సరంలో సుఖ శాంతి ఐశ్వర్యాలు కలగాలని భగవంతుడిని నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను. అపోహలు, అనుమానాలు, అసహాయతలు, నిస్సహాయతలు, ఔతుందా కాదా అన్న సందిగ్ధం, చర్చోప చర్చల మధ్య 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రస్తుతం అన్నిరంగాల్లో ముందున్నాం. గత ఏడాది రాష్ట్రం రూ.1,77,630 కోట్ల ఆదాయాన్ని సాధించినట్టుగా రిజర్వు బ్యాంకు తేల్చిందని అధికారులు చెప్పారు. 23 జిల్లాల సమైక్య రాష్ట్రాన్ని మనం ఎప్పుడో దాటిపోయామని, అంతకుమించిన ఆదాయాన్ని సాధిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ కలిసి రావడం వల్లే ఈ విధంగా ఎంతో సంపద సృష్టించాం. ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి పోయి పరిశీలించినా ఎకరం రూ.25 లక్షలు, రూ.30 లక్షల లోపు లేదు. మరి ఈ సంపద ఎలా సృష్టించగలిగాం. ఇది ఒక్క అధికారుల ఘనతే కాదు, అనేక అంశాలు కలిసి రావటంతోనే ఇది సాధ్యమైంది..’అని కేసీఆర్ చెప్పారు. దళిత బంధుతో అద్భుతాలు ‘దళితుల జీవితాలు మార్చేందుకు తెచ్చిన దళిత బంధు అద్భుతాలు ఆవిష్కరించబోతోంది. దళిత జాతి వజ్రాలు అద్భుత ఫలితాలు సాధించబోతున్నారు. దేశానికే కొత్త మార్గనిర్దేశం ఇచ్చే దిశగా తెలంగాణ నిలవబోతోందని శుభకృత్ సంవత్సరం తొలిరోజు నేను సంకల్పిస్తున్నాను. ఎన్నికల కోసం, రాజకీయ స్టంట్ల కోసం కాకుండా ఈ విషయంలో ఎవరూ చేయని సాహసాన్ని మనస్ఫూర్తిగా చేశాను. దళితుల సంక్షేమం విషయంలో ఇప్పుడు యావత్తు దేశం తెలంగాణ నుంచే నేర్చుకునే పరిస్థితి కల్పించాం. ఇదొక్కటే కాదు.. ఏ పథకం అయినా దేశం మొత్తం తెలంగాణ నుంచే నేర్చుకునేలా చేశాం..’అని అన్నారు. అన్ని వర్గాల సమున్నతికి కృషి ‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి బడ్జెట్ ఏనాడూ రూ.10 వేల కోట్లు కూడా దాటలేదు. తాజా బడ్జెట్ను మనం రూ.రెండున్నర లక్షల కోట్లుగా పెట్టుకున్నాం. 95 శాతం ఉద్యోగాలు మనకే వచ్చేలా కొత్త విధానాన్ని ఇటీవలే ఆవిష్కరించుకున్నాం. వివక్ష లేకుండా అన్ని వర్గాల సమున్నతి కోసం యత్నిస్తున్నాం. అద్భుత, అపురూప, ఆర్థిక సౌష్టవంతో, సంస్కారంతో, సర్వమత సామరస్యంతో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోంది. దీనికి ఎక్కడా అపశృతి రాకుండా ఇంకా గొప్పగా, ఉజ్వలంగా దేశానికే అన్నంపెట్టే విధంగా ముందుకు సాగాలని, తెలంగాణ రైతుల కష్టం ఫలించాలని, అద్భుతంగా పంటలు పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, మన సామూహిక స్వప్నం బంగారు తెలంగాణ నిజం కావాలని కోరుకుంటున్నా..’అని సీఎం చెప్పారు. బ్రాహ్మణులకు సత్కారాలు, వసతులు ‘బ్రాహ్మణులు దేశంలో ఎక్కడా లేనివిధంగా వారి స్థాయికి తగ్గట్టు సత్కారాలు, వసతులు తెలంగాణలో పొందుతున్నారని కాలర్ ఎగరేసి చెప్పగలను. బంజారాహిల్స్లో కట్టిన బ్రాహ్మణ సదనాన్ని త్వరలో ప్రారంభిస్తాం. ఆధ్యాత్మిక రంగంలో తెలంగాణ దేనికీ తీసిపోదు. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దాం. సర్వజనుల సంక్షేమం కోసం పరితప్పిస్తున్న మనకు దేవుడి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరి అభ్యుదయం మనందరి అభిమతం అయ్యేలా ఆశీర్వదించాలని దేవదేవుడిని కోరుకుంటున్నా..’అని కేసీఆర్ తెలిపారు. పంచాంగం ఆవిష్కరణ కాగా కృష్ణమాచార్య రూపొందించిన పంచాంగాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించారు. వారిని ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన ‘మా తెలంగాణం కోటి ఎకరాల మాగాణం’పుస్తకాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు. -
ఉగాది వేడుకల్లో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు
-
సకల శుభారంభం
చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది పర్వదినం. ఆబాలగోపాలం ఆనందంగా చేసుకునే పండుగ ఉగాది. కాలగమన సౌ«ధానికి తొలి వాకిలి. పౌర్ణమిరోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసానికి అదే పేరు ఉంటుంది. చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉండటం వలన ఈ మాసావికి చైత్రమాసం అని పేరు. అన్ని ఋతువులకన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. కోకిల పాటలు, సన్నజాజి, మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతిమాత కొత్త అందాలు సంతరించుకుంటుంది. మనిషిని, మనస్సును, బుద్ధిని వికసింపజేసే అహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. అంటే నిన్నటి వరకు ఉన్న ప్లవనామ సంవత్సరం నుంచి నేటితో శుభకృతు నామ సంవత్సర ఉగాదిలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా ఉగాది విశిష్టతతోపాటు ఈ రోజున ఏమేం చేయాలో తెలుసుకుందాం... చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి , వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి. చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం, పగుళ్ళు, పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత, పిందెలు, పండ్లు – ఇలా అంతా ఫలవంతంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నీ ఇస్తుంది. చలికాలంలో, వర్షాకాలంలో ఉండే మందకొడితనం వసంతఋతువు నుంచి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం. ఎలా జరుపుకోవాలి? ఉగాది పండుగ జరుపుకునే విధానాన్ని అత్యంత ప్రామాణిక గ్రంథమైన ‘ధర్మసింధు’’పంచవిధుల సమన్వితం’గా సూచిస్తోంది. అవి 1. తైలాభ్యంగనం, 2. నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), 4. ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), ç5. పంచాంగ శ్రవణం... తైలాభ్యంగనం తైలాభ్యంగనం అంటే తల మొదలుకొని ఒళ్లంతా నువ్వుల నూనె పట్టించి నలుగుపెట్టి తలస్నానం చేయడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను నివసిస్తారని, అందుకే నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన వారికి లక్ష్మి, గంగాదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. నూతన సంవత్సర స్తోత్రం అభ్యంగ స్నానానంతరం దీపధూపాది పూజాదికాలు చేసిన తర్వాత మామిడి ఆకులతో, పూలతోరణాలతో అలంకరించిన పూజామందిరంలో నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించాలి. ఉగాడి పచ్చడి సేవనం ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ సేవించాలి. ఉగాది నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా షడ్రుచుల సమ్మేళనంతో ఉంటుందని చెబుతారు. పురాణ కాలం నుంచి... చారిత్రకాల వరకు... ► అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుమూర్తి మత్సా్యవతారం ఎత్తింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడే. ► బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించింది ఉగాదినాడే. ► ఈ కారణంగానే ఉగాది నాడు కొత్త లెక్కలు ప్రారంభించే ఆచారం వచ్చింది. ► వనవాసానంతరం సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చింది ఈనాడే. ► వసు చక్రవర్తి తపస్సు చేసి ఈనాడే రాజ్యాధికారం సాధించాడు. అందుకే ఉగాదికి అంత ప్రాశస్త్యం. ► చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు. ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యింది చైత్ర శుద్ధ పాడ్యమినాడే. అదేవిధంగా మరో శకకారుడైన శాలివాహన శకం కూడా ఉగాదిరోజునే ఆరంభమైంది. వీరిద్దరినీ ఉగాదిరోజున స్మరించుకోవడం ఆచారం. ► చైత్ర శుక్ల పాడ్యమి నాడు నూతన సంవత్సరాది. ఈ సంప్రదాయం కన్నడ, మహారాష్ట్రులకు కూడ ఉంది. పంచాంగ శ్రవణం ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి గంగాస్నాన ఫలితం లభిస్తుందని పురాణోక్తి. ఏమిటీ పంచాంగం? మనకు తెలుగు సంవత్సరాలు ‘ప్రభవ’ తో మొదలుపెట్టి ‘అక్షయ’ నామ సంవత్సరం వరకు గల 60 సంవత్సరాలలో తాము జన్మించిన నామ సంవత్సరాన్ని జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చూస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరాలకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి ‘షష్టిపూర్తి’ ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. పంచాంగంలో ఏముంటుంది? నిత్య వ్యవహారాల కోసం అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ని ఉపయోగిస్తున్నప్పటికీ... శుభకార్యాలు, పూజాపురస్కారాలు, పితృ దేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి ‘పంచాంగం’ చూడటమే ఆచారం. ఇది మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం. ‘పంచాంగం’ అంటే... తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలు కలది అని అర్థం. పాడ్యమి నుంచి పూర్ణిమ లేదా అమావాస్య వరకు 15 తిథులు, ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు వారాలు, అశ్వని మొదలు రేవతి వరకు 27 నక్షత్రాలు, విష్కంభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగాలు, బవ మొదలుకొని కిం స్తుఘ్నం వరకు11 కర ణాలు ఉన్నాయి. వీటన్నిటినీ తెలిపేదే పంచాంగం. ‘పంచాంగ శ్రవణం’ ఉగాది విధుల్లో ఒకటి. నేడు పల్లెటూళ్లు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము . ఇప్పుడంటే పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి కానీ ఇంతకుమునుపు ఇలా దొరికేవి కాదు. తాళపత్రాల మీద రాసినవి మాత్రమే... అదీ కొందరు పండితులవద్ద మాత్రమే ఉండేవి కాబట్టి వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేసేవారు. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పం చాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏయే గ్రహాలకు ఏయే అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి. ఎవరిని ధ్యానించాలి? ఈ పండుగకు అధిదేవత రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి లేదా వినాయకుడు వంటి దేవతలు కారు. కాలపురుషుడు ఈ పర్వపు అధిదేవత. ‘ఓం కాలాయనమః’ అనే నమక మంత్రం గాని విష్ణు సహస్రం గాని పఠించాలి. భగవంతుడే కాలపురుషుడని, నిత్యం అతణ్ణి ధ్యానించాలని శాస్త్రం చెబుతోంది. మానవ జీవితం అంతా కాలం పైననే ఆధారపడి ఉండుట వలన కాలపురుషుని ఆరాధించాలి. మనం చేసే పంచాంగ శ్రవణమే ఈ ఆరాధన. విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పినట్లు మనం ఏ రూపంలో స్తుతించినా అది పరమాత్మునికే చెందుతుంది. ఈ దృష్టితో కాలపురుషుని పంచాంగ శ్రవణ రూపాన స్తుతించాలి. ఇంకనూ సత్కర్మానుష్టానానికి కావలసిన కాల విశేషణాలను తెలుసుకోవడమే పంచాంగం ప్రయోజనం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనేవి పంచాంగాలు. ఒక శుభ కార్యం గాని ఒక ధర్మకార్యం గాని చేయడానికి పంచాంగమే మనకు మార్గదర్శనం చేస్తుంది. ఈ చైత్రమాసపు శుద్ధ పాడ్యమి నుంచి వసంతరాత్రులు జరుపుకుంటారు. అంతేకాదు, తెలుగువారి ప్రీతికరమైన శ్రీ రామనవమి కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ శ్రీ శుభకృత్నామ సంవత్సర ఉగాది మన దేశమంతటికీ శుభాలను చేకూరుస్తుందనీ, సకల జీవులకు సుఖశాంతులు ప్రసాదించగలదనీ ఆకాంక్షిద్దాం. – డి.వి.ఆర్. -
రాజ్భవన్లో ఉగాది వేడుకలు.. సీఎం కేసీఆర్ దూరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ మధ్య దూరం మరింత రోజురోజుకీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గవర్నర్ అధికారిక నివాసం రాజ్భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకలకు కేసీఆర్తో పాటు మంత్రులు కూడా హాజరుకాలేదు. కాగా రాజ్భవన్లో శుక్రవారం శ్రీ శుభకృత్ నామ ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాంలో పాల్గొనాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్ను ఆహ్వానించారు. ప్రగతి భవన్కు ఆహ్వానం కూడా పంపారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు కూడా గైర్హాజరయ్యారు. స్టేజ్పై ఉన్న ఫ్లెక్సీలోనూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఫ్లైక్సీలో కేసీఆర్ ఫోటో కనిపించలేదు. రాజ్భవన్లో జరిగిన ఉగాది వేడుకలకు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు , ఈటెల రాజేందర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చడా వెంకట్ రెడ్డి, టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శినం మొగులయ్య, పలువురు జడ్జీలు, ప్రముఖులు హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వేడుకల్లో పాల్గొన్నారు. చదవండి: ‘తెలంగాణ సర్కార్ ఏం చేస్తోందో వచ్చి చూడండి’ -
ఉగాది వేడుకల్లో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు
సాక్షి, అమరావతి: శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా రేపు(శనివారం) తాడేపల్లిలో జరగనున్న వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. ఉదయం 10.36కి పంచాంగ పఠనంలో సీఎం దంపతులు పాల్గొంటారు. పంచాంగ పఠనం కోసం గ్రామీణ వాతావరణంలో ఏర్పాటు పూర్తి చేశారు. చదవండి: శుభకృత్లో అన్నీ శుభాలు కలగాలి: సీఎం జగన్ శ్రీ శుభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, సమృద్ధిగా వానలు కురవాలని; పంటలు బాగా పండాలని, రైతులకు మేలు జరగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు. -
సీఎం కేసీఆర్ సారొస్తారొస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉగాది రాజకీయాలు రంజుగా మారాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు రాజ్భవన్లో ముందస్తు ఉగాది వేడుకలను తలపెట్టిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. సీఎంతోపాటు రాష్ట్ర మంత్రులు, విపక్షాల ముఖ్య నేతలు, ఇతర రంగాల ప్రముఖులకు కూడా రాజ్భవన్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. అయితే విభేదాల కారణంగా చాలా కాలంగా రాజ్భవన్ గడప తొక్కని సీఎం కేసీఆర్.. ఇప్పుడు గవర్నర్ ఆహ్వా నం మేరకు వెళతారా, లేదా అన్నదానిపై చర్చ జరుగుతోంది. ‘నూతన సంవత్సరం సందర్భంగా పాత చేదు జ్ఞాపకాలను మరిచి కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని పెద్దలు అంటుంటా రని.. పరస్పరం ఆరోపణలు చేసుకునే స్థాయికి వెళ్లిన గవర్నర్, సీఎం మధ్య విభేదాలు ఉగాదితో సమసిపోతాయా?, కొనసాగుతాయా? అన్నది శుక్రవారం తేలిపోతుంద’ని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాజ్భవన్ ఉత్సవాలకు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఒకరిపై ఒకరు నిత్యం విమర్శలు చేసుకునే నేతలంతా ఎదురుపడే నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది. మరోవైపు సీఎం కేసీఆర్ శనివారం ప్రత్యేకంగా ప్రగతిభవన్లోని జనహితలో ఉగాది వేడుకలను తలపెట్టారు. దానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. దానికి ఎవరెవరు హాజరువుతారనే దానిపై చర్చ జరుగుతోంది. విభేదాలకు చెక్ పడేనా? గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని, బీజేపీ రాజకీయాలకు రాజ్భవన్ అడ్డాగా మారిందని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వమే గవర్నర్గా తనకు అందాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదని తమిళిసై అంటున్నారు. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడు గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో ఉంచడంతో రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు మొదటిసారిగా బహిర్గతమయ్యాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడినప్పటి నుంచి దూరం పెరిగినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇక సామాన్యుల నుంచి విన్నపాలు స్వీకరించడానికి రాజ్భవన్ గేటు వద్ద గ్రివెన్స్ బాక్స్ ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి రుచించలేదు. ఇక గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రభుత్వం పంపే ప్రసంగాన్ని గవర్నర్ చదవాల్సి ఉంటుంది. కానీ కోవిడ్ నేపథ్యంలో గణతంత్ర దినాన్ని సాదాసీదాగా నిర్వహించాలని, గవర్నర్ ప్రసంగం అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ ఇందుకు భిన్నంగా గణతంత్ర వేడుకల్లో సొంతంగా ప్రసంగించారు. అందులో రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపడాల్సి ఉందని గవర్నర్ పేర్కొనడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ఈ క్రమంలోనే గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. దానిని గవర్నర్ తప్పుపట్టారు కూడా. మరోవైపు సమ్మక్క–సారక్క జాతరలో పాల్గొనడానికి హెలికాప్టర్ కావాలని గవర్నర్ కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు ముదిరాయన్న అభిప్రాయం నెలకొంది. ఇలాంటి సమయంలో ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్ను గవర్నర్ ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. -
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ అధ్వర్యంలో ఉగాది వేడుకలు
లండన్: ప్లవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ అధ్వర్యంలో ఆన్లైన్లో ఈ నెల 18 న “ఉగాది సంబరాలు 2021” వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంతేకాకుండా అసోసియేషన్ 19 వ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు. కాగా లాక్డౌన్ కారణంగా ఈసారి కూడా వేడుకలను ఆన్లైన్లో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రముఖ రాజకీయ నేత, నటుడు డాక్టర్ బాబు మోహన్ హాజరయ్యారు. స్కాట్లాండ్, యూకేలోని తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా తన రాజకీయ అనుభవాలు, సినీ ప్రస్థానం గురించి తెలుగు ప్రజలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ పర్రి మాట్లాడుతూ.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ తరపున ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా మదర్స్డే సందర్భంగా మహిళలను ఉద్ధేశించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. అంతేకాకుండా భారత్ నుంచి యూకే, స్కాట్లాండ్కు ఇంటర్నేషనల్ స్టడీస్ కోసం వస్తోన్న విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నామనీ ప్రకటించారు. ఉగాదిపర్వదినం సందర్భంగా అందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని తెలుపుతూ అందరికీ శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శివ చింపిరి, చైర్మన్ మైధిలి కెంబూరి, సాంస్కృతిక కార్యదర్శి నిరంజన్, విజయ్కుమార్, మాధవి లత, ఉదయ్కుమార్ తదితరలు హజరయ్యారు. చదవండి: సింగపూర్లో వైభవంగా సంగీత రాఘవధాన కార్యక్రమం.. -
ఫిన్లాండ్ తెలుగు అసోషియేషన్ ఉగాది పండగ శుభాకాంక్షలు
హెల్సింకి: ఫిన్లాండ్ దేశంలో ‘ఫిన్లాండ్ తెలుగు అసోషియేషన్’ రెండు తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల అభివృద్దికి ఎంతో కృషి చేస్తోంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు తెలుగు పండగలను నిర్వహిస్తోంది. తెలుగు పండగల గొప్పదనాన్ని నేటి తరాలకు తెలియజేస్తోంది. ఫిన్లాండ్ దేశంలో సుమారు వెయ్యికి పైగా తెలుగు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. ఈ ఏడాది రఘునాథ్ పర్లపల్లి ఫిన్లాండ్ తెలుగు అసోషియేషన్(ఎఫ్ఐటీఏ)కి నూతన అధ్యక్షుడిగా నియమించడ్డారు. ఆయన ఈ పదవిలో మర్చి 2023 వరకు కొనసాగుతారు. ఉగాది పండగ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిన్లాండ్లో నివసించే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ‘శ్రీ ప్లవ నామ తెలుగు నూతన సంవత్సరం( ఉగాది) పండగ’ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేసే ఓ ప్రత్యేక వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. ఈ వీడియోలో చిన్నారులు శ్రీ ప్లవ నామ సంవత్సర(ఉగాది) శుభాకాంక్షలు తెలియజేశారు. ఎఫ్ఐటీఏ నిర్వహించిన పలు కార్యక్రమాలకు సహకారం అందించిన న్యూస్పేపర్లు, టీవీ చానళ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎప్ఐటీఏ తరపున తెలుగు ప్రజలందరికీ ఈ ఉగాది పండగ నుంచి శుభం జరగాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు. చదవండి: ఉగాదిరోజున సింగపూర్లో ఘనంగా శ్రీవారి కల్యాణం -
ఉగాదిరోజున సింగపూర్లో ఘనంగా శ్రీవారి కల్యాణం
సింగపూర్: లోక కల్యాణార్థం శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది రోజున (ఏప్రిల్ 13) సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సింగపూర్లోని సెరంగూన్ రోడ్డులో ఉన్న శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. శ్రీవారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకంతో పాటు మహా గణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి, ఆంజనేయస్వామి వార్లకు అభిషేకం మొదలగు విశేష పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం శ్రీవారి ఆస్ధానంలో బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం పఠించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హిందూ ఎండోమెంట్స్ బోర్డ్ నిర్దేశించిన మార్గదర్శకాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయానికి వచ్చే భక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించడం, భక్తుల వివరాల సేకరించడంతో పాటు భక్తులు భౌతిక దూరాన్ని పాటించేలా వివిధ ఏర్పాట్లు చేశారు. కలియుగ దైవం కృప అందరికీ కలగాలనే సత్సంకల్పంతో భక్తులు ఇంటి నుంచే శ్రీనివాస కల్యాణోత్సవం వీక్షించేలా ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ప్రత్యేక ప్యాకెట్లో సుమారు 2000 మందికి అందించారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి తెలుగువారందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాంగ పఠనం చేసిన నాగఫణి శర్మకు, బండారు దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ పోలిశెట్టి, కార్యదర్శి సత్యచిర్ల పాల్గొన్నారు. చదవండి: ఉగాది.. కాలగమన సౌధానికి తొలి వాకిలి -
ప్రతి ఇల్లూ సుభిక్షం.. ప్రతి ఒక్కరిలో ఆనందం
ప్లవ అంటే ఒక నావ అని అర్థం. ఈ సంవత్సరం బాగుంటుందని సిద్ధాంతి కూడా చెప్పారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని, రైతులందరికీ మంచి జరగాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కోవిడ్పై జరిపే యుద్ధంలో మనం గెలవాలని ఆకాంక్షిçస్తున్నా. ప్రతి ఒక్కరికి ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరిగి ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారికంగా నిర్వహించిన పండుగ కార్యక్రమంలో సీఎం జగన్ సంప్రదాయ బద్ధంగా పంచె కట్టుకుని పాల్గొన్నారు. శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి.. తొలి ప్రతిని ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతుల సుబ్బరామ సోమయాజులుకు అందజేశారు. ఈ సందర్భంగా సోమయాజుల పంచాంగ పఠనాన్ని సీఎం జగన్ ఆసాంతం ఆలకించారు. అనంతరం సిద్ధాంతి అందజేసిన ఉగాది పచ్చడి స్వీకరించారు. అనంతరం సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అర్చకుల బృందం సీఎం జగన్కు స్వామి వారి ప్రసాదాలు అందజేసి, ఆశీర్వదించింది. ఉగాది పండుగ సందర్భంగా శారదా పీఠం పంపిన శేషవస్త్రాలను పండితులు సీఎం జగన్కు అందజేశారు. ఉగాది సందర్భంగా నూతన పంచాంగం తొలి ప్రతిని సుబ్బరామ సోమయాజులుకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, అధికారులు ఈ ఏడాది చాలా అనుకూల పరిస్థితులు సిద్ధాంతి సోమయాజులు ఆధ్వర్యంలో జరిగిన పంచాంగ పఠనంలో..ప్లవ నామ సంవత్సరంలో రాష్ట్రమంతటా అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పారు. పాలన చేసే సీఎం వ్యక్తిగత జాతక రీత్యా గురువు సంచారంతో చాలా అనుకూలంగా ఉందని తెలిపారు. పంచాంగ ప్రభావానికి తోడు పరిపాలన చేసే వారి జాతకం బావుండటం మూలంగా గ్రహాలు రాష్ట్ర ప్రజలందరికీ అనుకూలిస్తాయన్నారు. ► ఈ ఏడాది మేఘాలు అన్ని ప్రాంతాల్లో చక్కగా వర్షిస్తాయి. వ్యాపారాలకు మంచి అనుకూలత ఉంది. ఈ ఏడాది అంతా బాగుంటుంది. ధన ధాన్యం సమృద్ధిగా చేకూరుతుంది. సుభిక్షం, సంక్షేమం, ఆర్యోగంతో రాష్ట్రమంతా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ► గురు, శుక్రుల ప్రభావంతో మంత్రి మండలి చాలా చక్కటి ఆలోచనలు చేయడంతో పాటు వాటి అమలును దిగ్విజయంగా కొనసాగిస్తుంది. ఈ కారణంతో ప్రభుత్వం, ప్రజలు చక్కటి ఫలితాలతో ముందుకెళ్లే పరిస్థితి. ఈ సంవత్సరం వాతావరణం సమతూకంగా నడుస్తుంది. ► గురువు ప్రభావంతో భూమి సస్యశ్యామలం అవుతుంది. పంటలు బాగా పండుతాయి. వర్షాలు బాగా కురవడం వల్ల చెరువులు, నదులు నీళ్లతో నిండుతాయి. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి అనుకూల అవకాశాలు పెరుగుతాయి. రైతులు, రైతు కూలీలు, శ్రామికులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ పాలన కొనసాగడానికి అనుకూలత ఉంది. ► ఈ ఏడాది విద్య, వ్యవసాయం, ఆర్థిక రంగాలు అన్నీ బాగుంటాయి. గతేడాది కంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. అన్ని అనుకూల పరిస్థితులతో ప్రజలందరూ వ్యక్తిగతంగా, ఆర్థికంగా బలపడే అవకాశాలుంటాయి. ► వ్యవస్థాపరంగా ఆర్థిక పరిస్థితులు పుంజుకునే అవకాశం ఉంది. ఆనందంగా ఉన్నామని ప్రతి వారు అనుకునేలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం రాష్ట్రం ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకొస్తారు. మంచి ప్రణాళికలు చేసే అవకాశం ఉంది. ► కరోనాను జయించడమే కాకుండా, ప్రజలందరికీ చక్కటి ఆరోగ్యం అందేలా ముందుకు సాగే పరిస్థితులు ఉంటాయి. రాబోయే కాలంలో అందరి మన్ననలు పొందేలా సీఎం వ్యక్తిగత జాతకం ఉంది. అందరితో స్నేహ భావంతో వ్యవహరిస్తూ రాష్ట్రం విజయాలు సాధిస్తుంది. ప్రభుత్వ పథకాల వివరాలతో క్యాలెండర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా రూపొందించిన తెలుగు సంవత్సర క్యాలెండర్లోనూ ఈ ఏడాది ఎప్పుడు ఏయే పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తారన్నది పొందుపర్చారు. క్యాలెండర్ తొలి పేజీలో అన్ని పథకాల వివరాలను, రెండో పేజీలో గత 22 నెలల కాలంలో అంటే, 2019 జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఏయే పథకాలలో ఎంత మందికి, ఎన్ని కోట్ల మేర ప్రయోజనం కల్పించారన్న వివరాలను ఇచ్చారు. మూడో పేజీలో అవ్వాతాతలకు ఆసరాగా అందిస్తున్న వైఎస్సార్ పింఛన్ కానుక వివరాలను ప్రచురించారు. ఆ తర్వాత వరుసగా ఏనెల, ఏయే పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తారన్నది వివరించారు. వేద పండితులు, అర్చకులకు సీఎం సత్కారం ► ప్రభుత్వ సిద్ధాంతి కప్పగంతుల సుబ్బరామ సోమయాజులుతో పాటు పలువురు అర్చకులు, వేద పండితులను సీఎం సత్కరించారు. ► విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు లింగంభట్ల దుర్గాప్రసాద్, ప్రకాశం జిల్లా మార్కాపురం అర్చకులు ఏవీకే నరసింహాచార్యులు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అర్చకులు మామిళ్లపల్లి మృత్యుంజయప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్, వేద పండితులు ఆర్వీఎస్ యాజులు సీఎం జగన్ చేతుల మీదగా సత్కారం పొందారు. ► ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వ్యవసాయ పంచాంగంతో పాటు, ప్రభుత్వ క్యాలెండర్ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ ఫోటోలు
-
సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకలు
-
ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులను సీఎం వైఎస్ జగన్ సన్మానించారు. కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. సంక్షేమం దిశగా సీఎం జగన్ పాలన ఉంటుందని శాస్త్రి తెలిపారు. విద్యా విధానాల్లో కొత్త మార్పులు వస్తాయన్నారు. కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలను సీఎం జగన్ సమర్ధవంతంగా అమలు చేస్తారని అన్నారు. ఈ ఏడాది ఎన్నో విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. ప్లవనామ సంవత్సరంలో కూడా వరుణుడి అనుగ్రహం ఉంటుందని.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. పాడిపరిశ్రమ చక్కని ఫలితాలు అందుకుంటుందన్నారు. ఈ ఏడాది రైతులకు లాభదాయకంగా ఉంటుందని శాస్త్రి తెలిపారు. తెలుగు ప్రజలకు సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు ప్రజలకు శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా వానలు కురిసి పంటలు బాగా పండాలని, కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేద పండితులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపాలని సీఎం వైఎస్ జగన్ తపన పడుతున్నారని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
షడ్రుచులు దేనికి సంకేతం అంటే..
తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ వచ్చిందంటే చాలు.. మనవాళ్ళు.. ముఖ్యంగా మన తెలుగు వారు.. మామిడాకులతో తోరణాలు, రకరకాల రంగవళ్లులు, పిల్లల అల్లరి చేష్టలు, పెద్దల హడావుడి, కొత్త బట్టలతో ఇంచుమించు అందరి ఇళ్లు కళకళలాడుతూ ఉంటాయి. పల్లెటూళ్లలో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఉగాది పండుగ రోజు నుంచి, శ్రీరామనవమి వరకు ఏడు రోజుల పాటు చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుతుంటారు. ఉగాది పండుగకే ప్రత్యేకంగా నిలిచేది ఉగాది పచ్చడి. షడ్రుచుల మేళవింపుతో తయారు చేసే ఈ పచ్చడి మనిషి జీవితంలోని అనేక జ్ఞాపకాలకు ప్రతీక అని చెప్పవచ్చు. మానవ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, సంతోషం, బాధ, అవమానాలు అన్ని ఉంటాయి. వీటిన్నంటిని ఒక్కో రుచితో మేళవించారు పెద్దలు. షడ్రుచుల మిళితమైన శ్రేష్ట పదార్ధమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత కలదో.. ఆహార, ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్యనిపుణుల మాట. మన పుర్వీకులు గ్రంధాల్లో ప్రస్తావించిన ఆ షడ్రుచులు.. పేరు వినటమే గాని, ఆ రుచులేమిటో చాలా మందికి నిజంగా తెలియదు. ఇక ప్రస్తుత కాలంలో ఉగాది పచ్చడి కూడా నూతన పోకడలు పోతుంది. అసలు ఉగాది పచ్చడిని తయారు చేసే పదర్థాలు ఏవి అంటే బెల్లం, చింతపండు, మిరియాలు, వేప పువ్వు, ఉప్పు, మామిడి. ఈ పదార్థాలన్నింటిని కొత్త కుండలో కలిపి.. అచ్చమైన ఉగాది పచ్చడి తయారు చేస్తారు. షడ్రుచులు దేనికి సంకేతం అంటే.. బెల్లం తీపి - ఆనందానికి సంకేతం ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం వేప పువ్వు - చేదు -బాధకలిగించే అనుభవాలు చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు మిరియాలు - కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు -
ఉగాది నాడు ఏం చేయాలో తెలుసా?
ఉగాది పండుగ మన పంచాంగం ప్రకారం మొదటి పండుగ. యుగప్రారంభాన్ని యుగాది అంటారు. ఈ యుగాది శబ్దం ఉగాది అనే కొత్త శబ్దాన్ని ఉత్పత్తి చేసింది. ఇక్కడ ఉగాది అంటే సంవత్సరానికి ప్రథమ దినం. మనకు నాలుగు యుగాలు ఉన్నాయి ఇవి చక్రంలా తిరుగుతూ ఒకదాని తరువాత వేరొకటి వస్తూ వుంటాయి. ఈ యుగాలు వరుసగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, చివరిది కలియుగం. ఇప్పుడు మనం కలియు గంలో ఉన్నాము. వైవస్వత మన్వంతరంలో ఇప్పటివరకు ఇరవై ఏడు మహాయుగాలు జరిగిపోయాయి. ఇరవై ఎనిమిదవ యుగం జరుగుతోంది. ఈ మహాయుగంలో కృత, త్రేతా, ద్వాపర యుగాలు గడచిపోయాయి. ఇప్పటికి కలియుగంలో 5120 సంవత్సరాలు పూర్తయ్యాయి. శార్వరి నామ సంవత్సరం సెలవు తీసుకుని13 ఏప్రిల్న శ్రీ ప్లవనామ సంవత్సరం ప్రవేశిస్తోంది. చైత్రశుద్ధ పాడ్యమి అనగా ఉగాది పర్వదినం. కాలగమన సౌధానికి తొలి వాకిలి. ఋతు సంబంధ ప్రథమ ఆరోగ్యకోకిల గానం నూతన సంవత్సరానికి శ్రీకారం. ప్రజల మధ్య పెంపొందించే మమకారం. బహు సాంప్రదాయాలకు సాకార క్రియారూపం. ఆబాలగోపాలం ఆనందంగా చేసుకునే పండుగ ఉగాది. పౌర్ణమిరోజున చంద్రుడు ఏ నక్షత్రంలోఉంటాడో ఆ మాసానికి అదే పేరు ఉంటుంది. చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉండటం వలన ఈ మాసావికి చైత్రమాసం అని పేరు. అన్ని ఋతువులకన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. ఋతూనాం కుసుమాకరః– ఋతువుల్లో చెట్లు చిగిర్చి పూవులు పూయు వసంత ఋతువును నేనే అని తన ముఖ్య విభూతులు చెప్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. కోకిల పాటలు, సన్నజాజి, మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతిమాత కొత్త అందాలు సంతరించు కుంటుంది. వసంత ఋతువు చైత్రమాసంతో మొదలవుతుంది. మనిషిని, మనస్సును, బుద్ధిని వికసింపజేసే అహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. ఉగాది నాడు ఏం చేయాలి? ఈనాడు మనమేం చేయాలో మన పెద్దలు నిర్దేశించారు. నూతన సంవత్సర కీర్తనలు చేస్తూ, తలంటు పోసుకుని నూతన వస్త్రాలు ధరించి, ధ్వజారోహణ చేయాలి. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినాలి. వేపపూత, కొత్త బెల్లం, మామిడి పిందెలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు. దీని సేవనం వల్ల వాత, కఫ దోషాలు తొలగుతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ పచ్చడిని సంవత్సరానికి ఒకమారు ఉగాది నాడు తింటే దీని ప్రభావం తిరిగి ఉగాది వచ్చేవరకు ఉంటుందని నమ్మకం. ఈ రోజు పంచాంగం వినాలి కాలగతిని లెక్కించడానికి చంద్రుని గమనాన్ని అనుసరించడం సులభమైన విధానం. అందువల్ల చైత్రమాసంలో కూడా శుద్ధపాడ్యమినే, అంటే చంద్రుడి కళలు వృద్ధి చెందడం మొదలయ్యే సమయమే ‘ఉగాది ’ అని కమలాకరభట్టు ప్రతిపాదించారు. ‘చతుర్వర్గ చింతామణి’ అను గ్రంథంలో బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజే మనం ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది అని ఆ గ్రంధకర్త హేమాద్రి పండితుడు తెలియజేసారు. అయితే ఈ పండుగ ఏ దేవుడి/దేవత ప్రీతి కొరకు చేస్తున్నాము, ఎవరిని ధ్యానించాలి? ఈ పండుగకు అధిదేవత రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి లేదా వినాయకుడు వంటి దేవతలు కారు. కాలపురుషుడు ఈ పర్వపు అధిదేవత. ‘ఓం కాలాయనమః’ అనే నమక మంత్రం గాని విష్ణు సహస్రం గాని పఠించాలి. భగవంతుడే కాలపురుషుడని, నిత్యం అతణ్ణి ధ్యానించాలని శాస్త్రం చెబుతోంది. మానవ జీవితం అంతా కాలం పైననే ఆధారపడి ఉండుట వలన కాలపురుషుని ఆరాధించాలి. మనం చేసే పంచాంగ శ్రవణమే ఈ ఆరాధన. విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పబడినట్లు మనం ఏ రూపంలో స్తుతించినా అది పరమాత్మునికే చెందుతుంది. ఈ దృష్టితో కాలపురుషుని పంచాంగ శ్రవణ రూపాన స్తుతించాలి. ఇంకనూ సత్కర్మానుష్టానానికి కావలసిన కాల విశేషణాలను తెలుసుకోవడమే పంచాంగం పరమ ప్రయోజనం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనేవి పంచాంగాలు. ఒక శుభ కార్యం గాని ఒక ధర్మకార్యం గాని చేయడానికి పంచాంగమే మనకు మార్గదర్శనం చేస్తుంది. ఈ చైత్రమాసపు శుద్ధ పాడ్యమి నుంచి వసంతరాత్రులు జరుపుకుంటారు. అంతేకాదు, తెలుగువారి ప్రీతికరమైన శ్రీ రామనవమి కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది విశ్వ మానవ సౌభ్రాభృత్వాన్ని, సకల జీవులకు సుఖశాంతులు ప్రసాదించగలదని ఆకాంక్షిద్దాం. – గుమ్మా ప్రసాదరావు చదవండి: పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి -
టెక్సాస్లో ఉగాది ఉత్సవాలు
టెక్సాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఉగాదిని ఘనంగా జరుపుకున్నారు. వికారినామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ.. సంబరాల్లో మునిగితేలారు. యూలెస్లోని ట్రినిటి హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొన్నారు. 150కి పైగా పిల్లలు, పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ అలరించారు. టాంటెక్స్ 2019 ‘ఉగాది పురస్కారాల’ను ఈ సంవత్సరం సాహిత్యం, సంగీతం, నాట్యం, సమాజ సేవ, సాంకేతిక, వైద్య రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు. తెలుగు సాహిత్య రంగంలో కిరణ్ ప్రభ , సంగీతం రంగంలో శ్రీనివాస్ ప్రభల, నాట్యం రంగంలో శ్రీమతి శ్రీలత సూరి, సమాజ సేవ రంగంలో శ్రీకాంత్ పోలవరపు . సాంకేతిక రంగంలో డా. సాంబారెడ్డి, వైద్యరంగంలో డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి , డా. కోసూరి రాజు మొదలైన వారికి ఈ పురస్కారాలను అందజేశారు. వివిధ కార్యక్రమాలలో తమదైన శైలిలో సేవలను అందిస్తున్న, అవినాష్ వెల్లంపాటి, కిరణ్మయి వేములలకు ‘ఉత్తమ స్వచ్ఛంద సేవకుడు (బెస్ట్ వాలంటీర్) ’ పురస్కారంతో సత్కరించి వారి సేవా ధృక్పదాన్ని పలువురికి చాటారు. జీవన సాఫల్య పురస్కారం డా. ప్రేమ్రెడ్డికి ఇచ్చారు. ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ట్రినిటీ హైస్కూల్ సూపరింటెండెంట్ డా. స్టీవ్ చాప్మన్ మాట్లాడుతూ తెలుగు వారి విశిష్టత మరియు సేవా కార్యక్రమాలను కొనియాడారు. తరువాత డా. స్టీవ్ చాప్మన్ను ఘనంగా సత్కరించారు. సంస్థ అధ్యక్షులు చినసత్యం వీర్నపు.. ట్రినిటీ హైస్కూల్ ఆడిటోరియంను ఉచితంగా ఇప్పించిన డా. తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కళాకారుల సన్మాన కార్యక్రమంలో భాగంగా గాయకులు సుమంగళి, నరేంద్ర, మిమిక్రి ఆర్టిస్ట్ కళారత్నమల్లం రమేష్, వ్యాఖ్యాత రఘు వేముల లకు జ్ఞాపికలతో టాంటెక్స్ సంస్థ కార్యవర్గబృందం సభ్యులు సత్కరించారు. -
దక్షిణ కొరియాలో ఘనంగా ఉగాది సంబరాలు
సియోల్ : దక్షిణ కొరియాలో సుంగ్క్యున్ క్వాన్ విశ్వవిద్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. దక్షిణ కొరియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ జరిగిన ఉగాది వేడుకలకు 100మందికి పైగా హాజరు అయ్యారు. ఉగాదిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించి, అతిథులకు ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్లాసికల్ డ్యాన్స్లు, పిల్లల ఫ్యాషన్ షో కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డా. సుశ్రుత కొప్పుల, డా.వేణు నూలు, డా.అనిల్ కావాలా, తరుణ్, డా. కొప్పల్లి స్పందన రాజేంద్ర, సంపత్ కుమార్, సాయి కృష్ణ చిగురుపాటిల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. -
వైఎస్సార్సీపీకి అధికారం ఖాయం
శ్రీకాళహస్తి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కడం ఖాయమని, ఏపీలో అత్యధిక ఎంపీ స్ధానాలను కూడా ఆ పార్టీనే దక్కించుకుంటుందని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగ వర ప్రసాదు వెల్లడించారు. వికారి నామ సంవత్సర ఉగాదిని పురష్కరించుకుని శనివారం ఆయన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో పంచాంగ పఠనం నిర్వహించారు. అందులో భాగంగా ఈ ఏడాది జరగనున్న పలు అంశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపడతారని చెప్పారు. రాష్ట్రంలోని మెజారీటీ ఎంపీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. కేంద్రంలోని భారతీయ జనతాపార్టీకి ఈ ఏడాది ఎదురుదెబ్బ తగలనుందని, ప్రధాని మోదీకి ఈ సంవత్సరం అంతగా కలిసిరాదని చెప్పారు. తమిళనాడులో అన్నాడీఎంకే బలమైన పార్టీగా నిరూపించుకుంటుందని, కర్ణాటకలో కాంగ్రెస్ కూటమి బలపడుతుందని చెప్పారు. అలాగే అంతర్జాతీయస్థాయిలో ట్రంప్కు ఎదురుగాలి, భారతీయులకు ప్రతి మూడు మాసాలకోసారి ఇబ్బందులు ఉంటాయన్నారు. ఈ పంచాంగ పఠనం కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీరామరామస్వామి, పలువురు ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం
-
రాజ్భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు
-
19న మిచిగాన్లో ఉగాది వేడుకలు
మిచిగాన్ : అమెరికాలోని మిచిగాన్లో విళంబి నామ సంవత్సర ఉగాది సంబారాలను నిర్వహించడానికి ట్రాయ్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఉగాది సంబరాలను టీటీఏ మహిళ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 19న రొచెస్టర్ హిల్స్ లోని రొచెస్టర్ అడమ్స్ హై స్కూల్లో జరపనున్నారు. ఈ వేడుకల్లో ఆట పాటలు, నాటకాలు, మాటల చమత్కారాలు అథితులను అలరిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ లీడ్ జ్యోత్స్న కంకటాల, కల్చరల్ కమిటీ లీడ్ దీపా కనకపల్లి, స్టాల్స్ కమిటీ లీడ్ సంధ్య చొలవేటి, ఫుడ్ కమిటీ లీడ్ శశికళ తియ్యారి, పబ్లిసిటీ కమిటీ లీడ్ గాయత్రి గంగిసెట్టి, రిసిప్షన్ కమిటీ లీడ్ సీతాల పసుల, డెకరేషన్ కమిటీ లీడ్ రూప గండ్రలు ఉగాది వేడుకల పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున తెలుగువారు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
న్యూ జెర్సీ : స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. సేవా కార్యక్రమాల నిధుల సేకరణ కోసం స్పందన ఫౌండేషన్ ఈ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన విరాళాలతో ఖమ్మంలోని స్పందన మేఫి మానసిక వికలాంగుల గృహంకి నూతన భవన సముదాయం కోసం ఖర్చు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 1300 మందికి పైగా అతిథులు పాల్గొన్న ఈ ఉగాది వేడుకల్లో 450 మంది వివిధ సంస్కృతికి ప్రదర్శనలతో అతిథులను అలరించారని నిర్వాహకులు నాగరాజు రెడ్డి తెలిపారు. చిత్రలేఖనం, చదరంగం పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. వివిధ రంగాల్లో విశేషంగా రాణిస్తున్న వారికి ఇచ్చే అవార్డును ఈ ఏడాదికిగానూ, స్పందన స్టార్ అవార్డు సంజన మల్ల, సాహితి తోలేటిలకు స్పందన సర్వీస్ అవార్డు ఇందిర శ్రీరాంలకు బహుకరించినట్టు స్పందన ప్రతినిధి ప్రశాంతి మదుపూరు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వాలంటీర్లకు శ్రీధర్ పొందూరి కృతజ్ఞతలు తెలిపారు. స్పందన ఫౌండేషన్ భారత్లోని ప్రభుత్వ పాఠశాలలకు-విద్యాలయ, పేద విద్యార్థులకు-ప్రతిభ, నిరాశ్రయులకు-ఆశ్రయ, క్లిష్టమైన అనారోగ్య సమస్యలున్న వారికి-చేయూత వంటి కార్యక్రమాలతో తమ వంతు సహాయం అందిస్తోంది. -
టెన్నెస్సీలో ఘనంగా ఉగాది వేడుకలు
నాష్విల్ (అమెరికా) : టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో నాష్విల్ లో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఫాదర్ ర్యాన్ ఆడిటోరియంలో టెన్నెస్సీ తెలుగు సమితి అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వంలో నిర్వహించిన ఈ ఉగాది సంబరాలకు డాక్టర్ దీపక్ రెడ్డి, జితేందర్ కట్కూరి, శారద కట్కూరి సమర్పకులుగా వ్యవహరించారు. స్థానిక తెలుగు వారు సుమారు 600 మందికి పైగా ఈ సంబరాలలో పాల్గొనడం విశేషం. టెన్నెస్సీ లోని నాష్విల్ సంగీత నగరంగా పేరొందడం అందరికీ తెలిసిందే. మరి ఆ సంగీత నగరంలో ప్రముఖ తెలుగు సినీ కోయిల సునీత అడుగెడితే, రాగం అందుకుంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరంలేదు. సునీతతో పాటు మాటీవీ సూపర్ సింగర్ ఫేమ్ గాయకులు దినకర్ కూడా ఈ సంగీత విభావరిలో పాల్గొన్నారు. ముందుగా దీప్తి రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ అందరికి శ్రీ విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పంచాంగ శ్రవణంతో కార్యక్రమం మొదలవగా, స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చేసిన భరతనాట్యం, సినీ నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సునీత, దినకర్లు క్లాసిక్ పాటలతో మొదలుపెట్టి జానపద, సాంఘీక, ఫాస్ట్ బీట్ పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రేక్షకుల అరుపులు, చప్పట్లతో వేదిక ప్రాంగణం మార్మోగిపోయింది. తర్వాత స్పాన్సర్స్ ని, సునీత, దినకర్ లను పుష్ప గుచ్ఛం, శాలువా, జ్ఞాపికలతో టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గం ఘనంగా సన్మానించారు. మధ్య మధ్యలో రాఫుల్ డ్రాల్లో విజేతలకు ఉప్పాడ పట్టుచీరలు, ముత్యాల నగలు వంటి విలువైన బహుమతులు గాయని సునీత చేతులమీదుగా అందజేశారు. దీప్తి రెడ్డి దొడ్ల మాట్లాడుతూ ఈ ఉగాది సంబరాలకు వెన్నంటి ఉండి తమ పూర్తి సహకారం అందించిన కార్యదర్శి కిరణ్ కామతం, సాంస్కృతిక కార్యదర్శి ప్రశాంతి చిగురుపాటి, ఫుడ్ కమిటీ లీడ్ నిషిత కాకాని, రిజిస్ట్రేషన్ కమిటీ లీడ్ రజని కాకి తదితర అడ్వైసరీ కమిటీ, యూత్ కమిటి సభ్యులు, అలాగే విజయవంతంచేసిన ప్రేక్షకులు, స్పాన్సర్స్, తమ పాటలతో అందరిని ఆహ్లాదపరచిన సునీత, దినకర్, ఆడియో & లైటింగ్ అందించిన డి.జె. శ్రీనివాస్ దుర్గం, ఫోటోగ్రఫీ సేవలందించిన సందీప్ జానర్, వేదికనందించిన ఫాదర్ ర్యాన్ ఆడిటోరియం యాజమాన్యం, వేదికను చక్కగా అలంకరించిన డాజిల్ ఈవెంట్స్, రుచికరమైన విందు బోజనాలను అందించిన పారడైస్ బిర్యానీ ఇలా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి ఉగాది సంబరాలను ముగించారు. -
మలేషియాలో ఘనంగా ఉగాది వేడుకలు
కౌలాలంపూర్, మలేసియా : తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు మలేషియాలోని మరిడేక స్క్వేర్లో అట్టహాసంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా(టామ్) ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్, ఫెడరల్ టెరిటోరిస్ మంత్రి తంకూ అద్నాన్ మన్సూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకల సందర్భంగా చిన్నారుల ఆట పాటలు, హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు అందర్ని ఆకట్టుకున్నాయి. టామ్ అధ్యక్షులు డీఆర్ అచ్చయ్య కుమార్ మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగు వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాపర్ ప్రణవ్ చాగంటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
జర్మనీలో ఘనంగా ఉగాది వేడుకలు
ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ : నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ వేడుకలు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఘనంగా నిర్వహించారు. జర్మనీ తెలుగు వెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సోస్సెన్ హైం ఆడిటోరియంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ ఎంబసీ కాన్సులేట్ జనరల్ ప్రతిభ పార్కర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఫ్రాంక్ఫర్ట్ నగర పురపాలక ప్రతినిధి మోబిస్ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగువెలుగు సంస్థ కమిటీని, వారు చేసే వివిధ సాంస్కృతిక సేవలను కొనియాడారు. గాయకులు ధనుంజయ్, సాయి శిల్పలు వారి ప్రదర్శనలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. భూషణ సాయి హేమంత్ కృష్ణ తన నాసికా వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. నదియా నృత్య ప్రదర్శన తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇండియన్ మ్యూజిక్ అకాడమీ, ఇండియన్ డాన్స్ అకాడమీ, ఉజ్వల డాన్స్ గ్రూప్, ఫ్రాంక్ఫర్ట్ గర్ల్స్ ఎంతో ఉత్సాహంగా వారి కళలను ప్రదర్శించారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులకు రుచి రెస్టారెంట్ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసింది. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన రుచి రెస్టారెంట్, ఎయిర్ ఇండియా, హెక్స్డ్ సాఫ్ట్వేర్, జవాజి సాఫ్ట్వేర్, జస్ట్ 1 బజార్, స్పూన్స్ అండ్ ఫోక్స్, వాట్సమన్ కన్సల్టింగ్, పిజె ఈవెంట్స్ వారికి సంస్థ అధ్యక్షుల సాయి రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
బ్రిస్టల్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
బ్రిస్టల్: శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు బ్రిస్టల్లో ఘనంగా నిర్వహించారు. బ్రిస్టల్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున తెలుగు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. శ్రీ విళంబి నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 250 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగస్వామ్యులైన వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, బూరెలు, కమ్మని తెలుగు వంటకాలు పంపిణి చేశారు. దిలీప్ మెరుగుమల్లి, వంశి మూల ఆధ్వర్యంలో సంప్రదాయ నృత్యాలు, లలితకళల ప్రదర్శనలు, తెలుగు సాహితీ అభిమానులను కూడా అలరించే పద్యాలతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు . తెలుగు సినిమా సంగీత నృత్యాలు, నాటికలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాజేంద్రప్రసాద్, శ్రావ్య వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. శ్రీనివాస కిరీటి బోయినపల్లి బ్రిస్టల్ తెలుగు సంఘం తరుపున మాట్లాడుతూ తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని, ఐక్యతను, సంస్కృతిని కాపాడటానికి బ్రిస్టల్ తెలుగు సంఘం ఏర్పడిందని తెలిపారు. ఈ ఉగాది సంబరాలు విజయవంతం కావడానికి విద్యాసాగర్ రెడ్డి, ప్రసాద్ పచ్చాల, సతీష్, శివ కొండపర్తి, హరి బాబు, రవి వింజమూరి, శ్రీనివాస మూర్తి, శివాంజనేయులు, ప్రసాద్ బత్తల, గిరీష్ బిందు మాధవ్, సుధాకర్, చిరంజీవి మాదాల, శ్రీదేవి, జ్ఞాని, శ్రావణి, భవాని కెంచే, డా. దీప సునీల్ రెడ్డి, రోహిణి మాటూరి, బిందు కొణిదలు ఎంతగానో కృషి చేశారు. మరిన్ని ఫోటోలు.. -
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
-
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. బుకిత్ పంజాంగ్ లోని శ్రీ మురుగన్ హిల్ ఆలయంలో పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ విళంబి నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 400 మంది ప్రవాసి తెలంగాణ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగస్వామ్యులైన వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణి చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులు, ప్రసాద దాతలకు సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ఉపాధ్యక్షులు నీలం మహేందర్, బూర్ల శ్రీనివాస్, పెద్ది శేఖర్ రెడ్డి, ముదం అశోక్, కోశాధికారి గడప రమేశ్, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, యెల్ల రామ్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు, గార్లపాటి లక్ష్మా రెడ్డి, నల్ల భాస్కర్ గుప్త, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివ రామ్ ప్రసాద్, ఆర్ సి రెడ్డి, మొగిలి సునీత, గోపగోని దాము, చిల్క సురేశ్, చెట్టిపెల్లి మహేష్, పింగిలి భరత్లు ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటు గోనె నరేందర్, భగవాన్ రెడ్డి, సురేందర్, సంతోష్, ఆర్మూర్ నవీన్, నంగునూరి వెంకట్ రమణ, జయ లక్ష్మిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్టు సొసైటీ ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఆరుగురు అవుట్!
సాక్షి, హైదరాబాద్ : ‘పనితీరులో వైఫల్యాలరీత్యా ఐదారుగురు మంత్రులకు చిక్కులు తప్పవు.. వారికి మళ్లీ పదవులూ కష్టమే..’ ‘కుంభరాశివారికి మంచి యోగమే ఉంది. ఆ రాశిలో ఉన్నవారికి ఎన్నికల్లో టికెట్లు పొందడం ఇబ్బంది కాకపోవచ్చు!’ ‘విళంబినామ సంవత్సరం రాజు స్థానంలో సూర్యుడు ఉన్నాడు. మంత్రి స్థానంలో శని ఉన్నాడు. ఇద్దరి మధ్యా సహజ వైరం ఉంటుంది. మందగమనంలో ఉండే మంత్రి.. రాజు వేగాన్ని అందుకోలేడు. ఇది రాష్ట్ర పాలకుల్లో కనిపిస్తుంది’ ..ఎన్నికల ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనంలో కనిపించిన కొన్ని ఆసక్తికర చమక్కులివీ! సాధారణంగా పంచాంగంలో వర్షాలు, రైతులు, పంటలు, ప్రజల సుభిక్షం వంటి అంశాలే చర్చకు వస్తుండగా.. ఈసారి రాజకీయాంశాలే కీలకంగా మారాయి. ఆదివారం ప్రగతి భవన్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఉగాది వేడుకల్లో శృంగేరీ పీఠం ఆస్థాన పండితుడు బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, భారీ సంఖ్యలో హాజరైన ఆహూతుల సమక్షంలో పంచాంగ పఠనం సాగింది. అనంతరం ముఖ్యమంత్రి తన ప్రసంగంలో కూడా టికెట్ల అంశాన్ని ఉటంకించడం, పంచాంగం ముందస్తుగానే పరిస్థితులను సూచనప్రాయంగా తెలుపుతుందని అనడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చిక్కులు ఎదుర్కోనున్న ఆ ఐదారుగురు మంత్రులు ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది. కేసీఆర్కు తిరుగుండదు.. రవి, శుక్ర, చంద్రుల సంచారం, లఘ్నాధిపతి బుధుడు కావటంతో రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన దిగ్విజయంగా కొనసాగుతుందని బాచంపల్లి వివరించారు. ఎన్ని విమర్శలు, ఒడిదొడుకులు ఎదురైనా రాజు ఆత్మకారక శక్తి చేత వాటన్నింటిని ఎదుర్కోగలరన్నారు. లఘ్నాన్ని శని వీక్షిస్తున్నందున మధ్యమధ్య కొన్ని చికాకులు తప్పవని, అయితే జగజ్జనని శక్తి చేత రాజే బలవంతుడవుతాడన్నారు. ఇక గురు బలం, సూర్య బలం చేత ఉన్నత యోగస్థానం ఉన్నందున రాష్ట్రంలోనే కాకుండా కేసీఆర్ ఎక్కడైనా చక్రం తిప్పగలరని పేర్కొన్నారు. కర్కాటక రాశిలో ఉన్నందున సీఎం ఆదాయం 8, వ్యయం 2గాను, రాజపూజ్యం 7 అవమానం 3గా ఉన్నందున ఆయనకు తిరుగు ఉండదన్నారు. ఇదే సమయంలో వృశ్చిక రాశిలో ఉన్నందున ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొన్ని ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రధాని మోదీని ఎదురించి మూడో కూటమి పేరుతో కేసీఆర్ సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ పోలిక ప్రాధాన్యం సంతరించుకుంది. దేవాదాయశాఖలో అవినీతి గురుడు, శుక్రుడి స్థితి వల్ల ధార్మిక కార్యక్రమాల్లో అటంకాలు ఏర్పడతాయని బాచంపల్లి వివరించారు. ఇదే కారణంతో దేవాదాయ శాఖను ఓ ప్రధాన అంశం తీవ్ర చికాకుకు గురిచేస్తుందని, అవినీతి వ్యవహారం బహిర్గతమవుతుందన్నారు. ఓ మఠాధిపతి తీవ్ర అనారోగ్యానికి గురయ్యే సూచన కనిపిస్తోందని, గతంలో ఉన్నత పదవిలో ఉన్న కీలక వ్యక్తికి అపమృత్యు భయం కలిగిస్తుందన్నారు. వానలకు ఢోకా లేదు గత సంవత్సరం తరహాలోనే విళంబి నామ సంవత్సరంలో కూడా సమృద్ధిగానే వానలు కురుస్తాయని బాచంపల్లి చెప్పారు. ద్రోణకం పేరుతో ఉండే మేఘం వానలు కురిపిస్తుందన్నారు. ఆ మేఘం ఆక్టోబరు నుంచి మంచి వానలు కురిపిస్తుందని, డిసెంబర్లో వరదలు సంభవిస్తాయని చెప్పారు. రైతులు ఆషాఢంలో నాట్లు వేసేప్పుడు ప్రకృతిని అనుసరించాల్సి ఉంటుందన్నారు. ఈ సంవత్సరం ప్రకృతి ఉపద్రవాలు కూడా పెరుగుతాయని చెప్పారు. పశు నష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. దేశీయ ఆవుకు ప్రాధాన్యమిచ్చి శక్తిమంతంగా మారిస్తే క్షీర రాబడి పెరుగుతుందన్నారు. పశు సంపదను రక్షించుకునేందుకు ప్రత్యే దృష్టి అవసరమని చెప్పారు. ‘ఎరుపు’ విప్లవం మకరంలో కుజుడు ఉన్నందున మే 2 నుంచి నవంబర్ 6 వరకు ఎరుపు రంగు నేలలు, ధాన్యాలు ఉత్పత్తి, ధరల్లో ఉన్నతంగా ఉంటాయని బాచంపల్లి పేర్కొన్నారు. ఎరుపు నేలల ధరలు బాగా పెరుగుతాయని, బంగారం, వెండి ధరలు కూడా పరుగు అందుకుంటాయని, ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగం పైకి లేచేలా చైతన్య కదలిక వస్తుందని చెప్పారు. గోధుమలు, కందులు, మిరియాలు, గులాబీ రంగు వస్తువుల ధరలకూ రెక్కలొస్తాయని చెప్పారు. బ్యాంకుల ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. విడాకులు పెరుగుతాయి కుజుడు సంచరించే స్థితి వల్ల కుటుంబాల్లో కలహాలు బాగా పెరుగుతాయని, దంపతుల మధ్య మనస్పర్థలు ఎక్కువై విడాకులు తీసుకునే వారి సంఖ్య బాగా పెరుగుతుందన్నారు. ఇక మనసులు కలిసిన యువతీ, యువకులే పెళ్లి చేసుకోవాలని, వివాహ విషయంలో తొందరపాటు కూడదని హితవు పలికారు. పర్యాటక రంగం వృద్ధి చెందుతుందని, ఆర్టీసీలో నష్టాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. వినోదం, మీడియా రంగంలో మంచి ఎదుగుదల కనిపిస్తుందని వివరించారు. పురపాలక, భూగర్భ శాఖలు, సాంఘిక సంక్షేమ శాఖ కూడా మంచి పనితీరు కనబరుస్తుందన్నారు. విమానయాన రంగం కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్నారు. క్రీడల్లో తెలంగాణ మరోసారి మంచి ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుందన్నారు. పోలీసు శాఖ బ్రహ్మాండంగా పనిచేస్తుందని, రక్షణ శాఖ ముందే ఉపద్రవాలను పసిగట్టి నిర్వీర్యం చేసే విషయంలో విజయం సాధిస్తుందన్నారు. మహిళదే ఆధిపత్యం సైన్యాధిపతి శుక్రుడు కావటం చేత ఈ సంవత్సరం మహిళలు కీలక పాత్ర పోషిస్తారని బాచంపల్లి తెలిపారు. పాలన, ఇంట్లో వారి ఆధిపత్యం కనిపిస్తుందని వెల్లడించారు. వెరసి దీన్ని స్త్రీనామ సంవత్సరంగా అభివర్ణించారు. ఆషాఢ పూర్ణిమ 27–7–2018న మకరరాశిలో శుభ ఫలితాన్ని ఇచ్చే చంద్రగ్రహణం సంభవిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం మాంసభక్షణ వద్దు. ఈ సంవత్సరం రాజు స్థానంలో సూర్యుడు ఉన్నందున ఆయనకు ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం కావటంతో ఆ రోజు మాంస భక్షణ క్షేమకరం కాదని బాచంపల్లి వివరించారు. రాష్ట్ర ప్రజల మంచిని కాంక్షించి ఆదివారం మాంస భక్షణకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. వేద పండితులకు సత్కారం పంచాంగ శ్రవణం అనంతరం పలువురు వేద పండితులు, పంచాంగ కర్తలను ముఖ్యమంత్రి సన్మానించారు. వేదికపైకి వెళ్లే పరిస్థితిలో లేని వెంకటరమణ శాస్త్రి అనే పండితుడిని సన్మానించేందుకు సీఎం వేదిక దిగి వెళ్లారు. అంతకుముందు భద్రాచల ఆలయ పండితుల ఆధ్వర్యంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి.. సీఎం, వేదికపైనున్నవారికి పట్టు వస్త్రాలు అందించారు. యాదగిరిగిగుట్ట పంచాంగాన్ని ఆవిష్కరించారు. భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. ‘తీయనైన తెలుగు తెలంగాణ వెలుగు’ ప్యాకెట్ పుస్తకాన్ని పంచారు. వచ్చిన ఆహూతులకు పట్టు కండువాలను అందించారు. ఇటీవల శాసనసభ సమావేశాల ప్రారంభం రోజున గాయపడిన మండలి చైర్మన్ స్వామిగౌడ్ నల్లటి అద్దాలు ధరించి వచ్చారు. మరోవైపు ఆహ్వాన పత్రాలు ఉన్నవారినే లోనికి అనుమతించటంతో వేడుకలు చూసేందుకు వచ్చిన సాధారణ ప్రజలు నిరాశగా వెనుదిరిగారు. -
డెన్మార్క్లో టాడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
కోపెన్ హాగెన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) ఆధ్వర్యంలో డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్ హాగెన్లో శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంప్రదాయ పద్ధతులలో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, భక్షాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డెన్మార్క్లో ఉన్న ప్రవాస తెలుగు వారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉగాది పర్వదినాన్ని జరుపుకొన్నారు. ఈ ఉత్సవాలు టాడ్ అధ్యక్షులు సామ సతీష్ రెడ్డి, ఉపాధ్యక్షులు సంగమేశ్వర్ రెడ్డి, సెక్రటరీ రమేష్ పగిళ్ళ, కోశాధికారి జయచందర్ రెడ్డి, టెక్నికల్ మేనేజర్ వెంకటేష్, కార్యవర్గ సభ్యులు వాసు, దాము, రాజారెడ్డి, శివసాగర్, శ్రీనివాస్, రఘు, కరుణాకర్, రాజు, నర్మద, ఉష, ప్రీమియం సభ్యులు, తదితరుల సహకారంతో వేడుక ఘనంగా జరిగింది. -
అమరావతి డిజైన్లపై పవన్ వ్యాఖ్యలు
-
మాస్టర్ ప్లాన్ ఫైనల్ కాదు: పవన్
సాక్షి, అమరావతి : నవ్యాంధ్ర రాజధానిపై తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు చూపిస్తున్న మాస్టర్ ప్లాన్ ఫైనల్ది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఆదివారం ఉదయం ఉద్దండ్రాయుని పాలెం రైతులను కలిసిన పవన్.. ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. ‘ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం అంటే అషామాషీ వ్యవహారం కాదు. అందుకు రెండు దశాబ్దాలకు పైగానే సమయం పట్టొచ్చు. అన్ని పార్టీలు రాజధానిపై కూర్చుని మాట్లాడాలి. అమరావతి కోసం ఇప్పుడీ ప్రభుత్వం చూపిస్తున్న మాస్టర్ ప్లాన్ తుదిదేం కాదు. అందుకోసం మరిన్ని చర్చలు, మార్పులు జరగాల్సి ఉంది. పార్టీలు, మేధావుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. రాత్రికి రాత్రే పెద్ద నగరం కట్టాలన్న ఆకాంక్ష ప్రభుత్వాలకు ఉంటే ఉండొచ్చు, కానీ, అందుకోసం ప్రజలను దీర్ఘకాలిక ఇబ్బందులకు గురి చేయటం సరికాదు’ అని పవన్ పేర్కొన్నారు. ఇక సింగపూర్ తరహా రాజధాని ఏర్పాటు అంటే.. పాలన కూడా అదే రీతిలో ఉంటేనే సాధ్యమౌతుందని పవన్ పేర్కొన్నారు. అమరావతిలో కుల గొడవలు ఎక్కువగా ఉన్నాయని.. విశ్వనగరం నిర్మించాలంటే అందుకు విశాలమైన మనసులు కావాలని, అప్పుడే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. రాజధాని రైతుల సమస్యలపై ఉన్నతస్థాయి విచారణ కమిటీగానీ.. జ్యుడీషియల్ విచారణగానీ జరగాలని కోరారు. ప్రభుత్వంపై పోరాటం తన అభిమతం కాదని... కేవలం పాలసీలకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తానన్నారు. తన దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారాలు లేవని.. సమస్యలు ఏవైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని పవన్ స్పష్టత ఇచ్చారు. ఒకవేళ అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులను ప్రజల ముందు నిలదీస్తానని పవన్ చెప్పారు. -
ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్
-
హైటెక్... ట్రెడిషనల్ లుక్
-
రాజ్భవన్లో ఉగాది
-
అదే కదా ఉగాది
అన్ని రోజులూ ఒకలా ఉండవు. అలా అని ప్రతి రోజూ పండగలా ఉండకూడదని కాదు. నిజానికి ప్రతిరోజూ ఉగాది కావాలి. అన్ని భావోద్వేగాలనూ షడ్రుచులలా ఆస్వాదించాలి. సిరిలాంటి మాటలు..వెన్నెల్ లాంటి భావాల‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఇంటర్వ్యూను ఆస్వాదించండి. ► సిరివెన్నెలగారిది అచ్చ తెలుగు సాహిత్యం. ఉగాది అంటే మన తెలుగు సంవత్సరాది. ఈ సందర్భంగా బాల్యంలో మీరు జరుపుకున్న ఉగాదిని గుర్తు చేసుకుంటారా? సాధారణంగా బాల్యానికి శ్రమను, ఉత్సాహాన్ని, ఇష్టాన్ని కలిగించేవి వినాయక చవితి, దీపావళి, దసరా, సంక్రాంతికి భోగి మంట. వినాయక చవితి పత్రి కోసం అడవిలోకి వెళ్లేవాళ్లం. దీపావళికి నెల ముందు నుంచీ మందుగుండు సామగ్రి తయారు చేస్తూ చేతులు కాల్చుకునేవాళ్లం. భోగి మంట అంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎక్కడ నిప్పుల్లో పడేస్తామేమో అని పెద్దవాళ్లు కంగారుపడేవాళ్లు. ఉగాది గురించి పెద్ద పెద్ద జ్ఞాపకాలు లేవు. ఉగాది అంటే ఉదయాన్నే పచ్చడి తినటం. ఏ పండగైనా సరే పులిహోర, గారెలు, పాయసం అన్నీ ఉంటాయి. ఆ వయసులో తిండి యావ ఉంటుంది. నా బాల్యంలో ఆటపాటలు ఎక్కువగా లేవు. నా జీవితం ఎక్కువగా లైబ్రరీలోనే గడిచింది. ► వేపపూత కోసం చెట్టెక్కిన సందర్భం మిగతా రోజుల్లో అయితే చెట్టెక్కితే కాళ్లు విరగ్గొట్టే వారు. ఆరోజు మాత్రం చెట్టెక్కితే ఏమీ అనేవాళ్లు కాదు. ► ఉగాది రుచుల్లో మీకు ఏది ఇష్టం? ఆరు రుచులు కలిసిన ఒక కొత్త రుచితో ఉగాది పచ్చడి తయారవుతుంది. ఆ రుచి ఇష్టం. మా చిన్నప్పుడు చేసిన పచ్చడిలాగా ఇప్పుడు చేయడం లేదు. మా అప్పుడు చిక్కగా ఉండేది. ఇప్పుడు పల్చబడిపోయింది. ఏం లోపించిందో చెప్పలేను కానీ కచ్చితంగా తేడా వచ్చింది. ► మీకు పచ్చడి చేయడం వచ్చా? వంటలో ప్రవేశం ఉందా? వంట మీద ఆసక్తి లేదు. ఉద్యోగంలో చేరిన కొత్తలో పప్పు, చారు నేర్చుకున్నాను. వంకాయ, బంగాళ దుంప, టమాటా.. మూడూ కలిపి కూర చేయడంవచ్చు. ఇప్పుడు ఇటు పుల్ల అటు పెడదామనుకున్నా అదేదో అపరాధం అనుకుంటారు నా భార్య, పిల్లలు. తన వల్లే నేను వంట మర్చిపోయాను. నాకు ఏ మూడు కూరలు ఇష్టమో తను అందులో స్పెషలిస్ట్. నేను వండుకున్న రోజుల్లో గ్యాస్ స్టౌ లేదు. అందుకే గ్యాస్ స్టౌ అంటే తెలియని ఫోబియా. అది ఎటు తిప్పితే ఆన్ అవుతుందో కూడా తెలియదు. ► ఉగాదికి మీరు తీసుకోబోయే కొత్త సంకల్పం ఏంటి? ఏమీ లేదు. అందరికీ నేను చెప్పదలచుకున్నది కొత్త సంకల్పం ఏమీ తీసుకోవద్దని. ‘మనో వాక్కాయ కర్మణే’ అంటారు. ముందు మనసులో సంకల్పించాలి. తర్వాత దాన్ని మాటతో అనాలి. ఆ తర్వాత చేత. ఒకసారి సంకల్పించుకుంటే ఆ పని మొదలైనట్లే. సంకల్పించుకోవ టానికి ఒక రోజు ఎందుకు? తలచుకుంటే ప్రతిరోజూ యుగాది. యుగాది అంటేనే అంతకు ముందు యుగంలో లేనిది ఆ రోజుతోనే మొదలయ్యేది అనే అర్థం వస్తుంది. ప్రతిరోజూ సూర్యుడితో పాటు మళ్లీ పుట్టాను అనుకో. నిత్యం శుభాన్నే సంకల్పించుకుందాం. దీని కోసం జనవరి ఒకటి నుంచి, ఇంకెప్పుడో అని అనుకోవక్కర్లేదు. ► ప్రపంచం పరిగెడుతోంది. ఈ పరుగులో ఉద్వేగాలు కోల్పో తున్నాం. పోటీ తప్ప మరోటి లేదు. ఈ పరిస్థితి గురించి? ఓ ఇరవై, ఇరవై ఐదేళ్ల నుంచి కొంచెం విపరీతాలు.. పైత్యం ఎక్కువ చేస్తున్నాం. జీవితం గురించి ఏమీ మాట్లాడుకోవడంలేదు. జీవితం నుంచి తప్పించుకు పారిపోయేవే చేస్తున్నాం. అసలు కొట్టుకోవడమేంటి? కొట్టుకోవ డం అనే కాన్సెప్ట్ విచిత్రమైన విషయం. గట్టిగా తిట్టుకోవాలంటే అవమానంగా అనిపిస్తుంది. మన అందరిలోనూ సున్నితత్వాలు పోతున్నాయి. అందుకే సినిమాల్లో కూడా ఒక్కడే పదీ ఇరవై మందిని కొట్టేస్తున్నాడు. సమాజంలో ఉన్న సంక్లిష్టత అంతా చిక్కు పడిపోయిన దారపు ఉండలా ఉండి పోయింది. దీన్ని బాగు చేయాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి? అనే తెలియని కంగారులో ఎవరికి వాళ్లు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని చూస్తూ కలలు కంటూ కూర్చుంటాం. ‘ఒక్కడు’ సినిమాలో హీరో క్రీడాకారుడు. ‘పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం. ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం’ అని పాట రాశాను. అలాగే ‘గోల్కొండ హైస్కూల్’లో ‘మొదలెట్టక మునుపే ముగిసే నడక కాదే మన పయనం, సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే యుద్ధం’ అని రాశా. పాట అంటే మనసుకు ఆనందాన్నిచ్చేది, ఆహ్లాదాన్ని కలిగించేది. ఇవాళ పాటల పోటీ అని పెట్టి, ‘మీరు ఓడిపోయారు.. మీరు గెలిచారు’ అని చెప్పటం మూలానే అసలు గెలుపనే మాటకు అర్థం తీసేశారు. పోటీలు పెట్టకండి. ఇలాంటి దౌర్భాగ్యపు భావాల్ని పెంపొందించకండి. యుద్ధం అంటే గెలిచాడు.. ఓడిపోయాడని కాదు. యుద్ధానికి నేను సిద్ధం అన్నప్పుడే గెలిచినట్టు. మన జీవితంలోకి ఇది అన్వయించుకుంటే ఏ కష్టం కష్టంలా తోచదు. ► బడి చదువుకి, జీవితపు చదువుకి తేడా చెబుతారా? బడి చదువులు సులభమైనవి. జవాబులు చెప్పి, తర్వాత ప్రశ్నలు వేస్తుంది. కానీ జీవితపు చదువు ముందు ప్రశ్నేసి తర్వాత సమాధానం నేర్పుతుంది. జీవితం అక్కడ గొయ్యి ఉందని చెప్పదు. ముందు పడేస్తుంది. ఆ పడటం మనకు జీవితాన్ని నేర్పిస్తుంది. జీవితాన్ని మనం ఎలా తీసుకుంటున్నామనేది ముఖ్యం. శివరాత్రి రోజు భక్తితో పస్తుంటాం. ఒకరోజు అన్నం లేకా పస్తుంటాం. అప్పుడు భక్తితో ఊగిపోయాం, ఇప్పుడు ఆకలితో తల్లడిల్లిపోయాం. ఆకలి పస్తును భక్తి పస్తే అనుకుంటే ఇష్టంగా పస్తుంటాం. ► ‘తెలుగు పాట’లో పరభాష పదాల తాకిడి ఎక్కువైందనే వాదన ఉంది. ఈ పరిస్థితి మారాలంటే మీరిచ్చే సలహా? ఈరోజుల్లో అందరి సంస్కృతులు అందరికీ పరిచయం అవుతున్నాయి. చచ్చేలోపు కాశీకి పోకపోతే పుణ్యం రాదనుకుంటాం. ఇప్పుడు అమెరికాకు వెళ్లకపోతే బతుకు లేదనుకుంటున్నాం. ఇలా దేశవిదేశాల తాలూకు వివిధ సంస్కృతుల కలబోతలలో స్వీయ సంస్కృతులను, మనం పుట్టి పెరిగిన మూలాలను మర్చిపోయి ఎదుగుతున్నాం. అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకోవద్దు అనటం లేదు. కానీ పాట అనగానే షకీరా పాడిన పాటను తీసుకువచ్చి ఇక్కడ పెడతానంటే నువ్వు ఏ భావాన్నీ కలిగించలేవు. సినిమా పాటలలో చాలా ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం పరిపూర్ణంగా విస్మరించబడుతోందని నా అభిప్రాయం, అభియోగం కూడా. దీనికి కారకులు ఎవరంటే ఇచ్చేవాళ్లూ.. పుచ్చుకునేవాళ్లు. ఈ మధ్య సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా కూడా పట్టుమని ఒక్క పాట కూడా నిలబడలేదు. నిర్మాతలకు నేను చెప్పేది ఏంటంటే పాట అంటే ఆరు లక్షల నుంచి ఆరు కోట్లు వరకు ఖర్చు అయ్యే ప్రొడక్ట్. అలాంటి పాట పట్ల అంత అశ్రద్ధ ఏంటి? సినిమా బావుంటే పాట లేక పోయినా చూస్తారు అనే స్థితికి ప్రేక్షకులు వెళితే పాటలు తీసేయ్. డబ్బులు మిగులుతాయి కదా. లేదా ఈ పాటలు మాకు కావాలని వాళ్లు తహతహలాడాలి. పూర్వం తహతహలాడే వారు. సాహిత్యం కాకపోయినా ఆ సంగీతం అయినా చాలా కమ్మగా ఉండేది. ఆ రోజుల్లో విశ్వనా«థ్గారి సినిమాల్లో ఒక పాట కూడా మిస్ అయ్యేవారు కాదు. ఆ పాట ఏదో చెబుతుంది. ఈరోజుల్లో తెలుగు పాట నిద్రావస్థ స్థితిలో ఉంది. నేను ఆశావాదిని. నిద్ర అంటే లేస్తాం. నిదనం అంటే చావు. ఇది నిద్ర తప్ప నిదనం కాదు. ఈ ఉగాది సందర్భంలో అయినా మంచి పాట కావాలని మీరు, చేయాలని నటులు అనుకుంటే సరిపోతుంది. ► మీరు అనేక దేశాల్లోని తెలుగువాళ్లను కలుస్తుంటారు. తెలుగుదనాన్ని కాపాడుకోవడంలో అక్కడివాళ్ల చిత్తశుద్ధికి, ఇక్కడివాళ్ల చిత్తశుద్ధికి ఎలాంటి తేడా గమనించారు? నిస్సంశయంగా ఇక్కడికంటే అక్కడే బాగుంది. వాళ్లు ఎందుకు వెళ్లినప్పటికీ కూడా ఒక ‘నోస్టాలిజిక్’ ఫీలింగ్ ఉంటుంది. అది మానవ సహజం. మనం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి మారేటప్పుడు మొత్తం సామానంతా పట్టుకెళ్లలేం. నా చిన్నప్పటి సంగతి చెబుతున్నా. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్లేటప్పుడు అయిష్టంగా రుబ్బు రోలు ఇచ్చేస్తాం. ఆ బరువు తీసుకెళ్లలేక (నవ్వుతూ). వాళ్లు ఇక్కడ ఉంటే చేసుకుంటారో లేదో చెప్పలేం. ఇక్కడ ఉన్నప్పుడు చేసుకున్నవి అక్కడికెళ్లాక చేసుకోలేకపోతున్నాం అనే బెంగ ఉంటుంది. ఆ బెంగ వల్ల చేసుకుంటున్నారు. కష్టపడి వేప పువ్వు సంపాదించుకుని పచ్చడి చేసుకుంటున్నారు. వాళ్ల దేశాలు ఒప్పుకోకపోతే ఇంట్లో గుట్టుగా ఎలక్ట్రికల్ భోగి మంటైనా వేసుకుంటున్నారు. అక్కడికెళ్లినప్పుడు నేనేం చెప్పానంటే... ‘‘పండగ పరమార్థం తెలుసుకుని చేయండి. అమెరికాలో పేడతో పనులు చేయడం అనేది శుభ్రం కాదని వాళ్లు ఒప్పుకోరు. మీరు అమెరికాకు పోవద్దు. వెళితే అమెరికాకు తగ్గట్టే ఉండాలి. సంక్రాంతి వచ్చినప్పుడు ఏదో చట్టవిరుద్ధమైన పని చేస్తున్నట్లు రహస్యంగా పేడ సేకరించి తలుపులేసుకుని, గొబ్బెమ్మలు పెట్టి, ఇంగ్లిషు మాట్లాడే మీ పిల్లలకు పట్టు లంగాలు తొడిగి,‘బొహియల్లో బొహియల్లో’ అని తిప్పకండి. మీకు సంక్రాంతి కావాలంటే సంక్రాంతి తాలూకు అర్థాన్ని చెప్పండి. పుష్యమాసంలో పంట ఇంటికి వస్తుంది. నేను తినడానికి ముందు సమాజంలో ఉన్నవాళ్లకు నా వంతుగా ఇస్తా అనే సంప్రదాయం ఏదైతే ఉందో అదీ సంక్రాంతి అంటే. సమైక్య క్రాంతి అని అంటాం. ఆ రోజు తెలుగువాళ్లందరూ ఒకచోట కలవండి. అవసరమైన వాళ్లకు ఇవ్వండి. అంతేకానీ పేడ చుట్టూ తిరగక్కర్లేదు. ► తెలుగువారి ఖ్యాతికి జాతీయ స్థాయిలో న్యాయం జరుగుతోందని మీకనిపిస్తోందా? ‘పద్మ’ అవార్డుల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అవార్డులనేవి ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటాయి. ఎందుకంటే ఒక ఐదారుగురు కూర్చుని, ఇవ్వబడిన తక్కువ సమయంలో అనేకమైన సినిమాలు చూసి, గబగబా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో, ఇంకా ఇతరత్రా పైరవీలు.. ఇలా చాలా కారణాలు ఉంటాయి. ఒక అవార్డు ద్వారా నీ విలువను నిరూపించకూడదు. ఒక విలువని గుర్తించి, గౌరవించడం కోసమే అవార్డు పుట్టింది కానీ అవార్డుల కోసం విలువ పుట్టలేదు. ఏనాడైతే నువ్వు రాసిన పాట పది మంది పెదాల మీద కూనిరాగాలు తీస్తుందో అదే పెద్ద అవార్డు కింద లెక్క. అది కాకుండా చెక్కముక్క మీద పద్మశ్రీ రాసి ఇస్తే, అది నా గోడకు తగిలించుకుంటే ఏం ప్రయోజనం? అంటే.. రాక ఏడుస్తున్నావా? అని మీరు అనొద్దు. నాకన్నా అవార్డులు పొందినవాళ్లు తెలుగులో ఎవరూ లేరు. అవార్డులు తీసుకుంటున్నప్పుడు నేను ఒకటే చెబుతా... మనం పెట్టుకున్నటువంటి, మనం విధించుకున్నది ప్రభుత్వం. తప్పూ తేడా ఉంటే సరిదిద్దుకుందాం. మనం ఏర్పాటు చేసుకున్న మన వ్యవస్థను గౌరవించుకోవడానికి సంకేతం కోసమే అవార్డులను స్వీకరిస్తాను తప్ప అవార్డు వచ్చిన ఆ పాట మాత్రమే గొప్పది అని కాదు. దాని విలువను జడ్జి చేయడానికి అక్కడ కూర్చున్న కమిటీ సరిపోదు.. సమయమూ సరిపోదు. అసలు నేను ‘పద్మశ్రీ’ తెచ్చు కునే ఇండస్ట్రీకి వచ్చాను అని ఆ మధ్య ఓ సందర్భంలో అన్నాను. నా భార్య పేరు ‘పద్మ’ (నవ్వుతూ). నా జీవితాన్ని ఇవాళ మీరొచ్చి ఇంటర్వ్యూ అడిగేదాకా తీసుకొచ్చింది ఆవిడే. ఈ వెన్నెల్లో ‘సిరి’ ఆవిడే. ► తెలుగు సంప్రదాయాల్ని మీ ఇంట్లో ఎలా మార్గదర్శకత్వం చేస్తుంటారు? నేను నమ్మేది ఒక్కటే. పిల్లలకు ఏమీ చెప్పడానికి ప్రయత్నించొద్దు. పిల్లలు చాలా చురుకైన మేధస్సు కలిగినవాళ్లు. వాళ్ల మెదడు ఖాళీగా ఉంటుంది. గబగబా నింపుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. రెండు కళ్లతో ప్రపంచాన్ని తాగేయడానికి చూస్తుంటారు. వాళ్లకు ఏం కనిపించాలి? వాళ్ల చెవులు ఏం వినాలి? వాళ్ల చేతులు ఏం పుచ్చుకోవాలి? అన్నది మొట్టమొదట వేసుకో వాల్సిన ప్రశ్న. అమ్మా నాన్న ఇద్దరూ ఏం మాట్లాడు కుంటే వీళ్లేం వింటారు. సో.. ఇంట్లో జీవించండి. ఆడదాని నుంచి ఇల్లాలివై, ఆ తర్వాత అమ్మ అయ్యావు. ఒక మగాడివై భర్త అయ్యి, తండ్రి అయ్యావు. దానికి తగ్గట్టు ఇద్దరూ జీవించాలి. మీలో అంతవరకూ ఏమైనా లోపాలుంటే దిద్దుకుని ఇంతకు మునుపు లేని విలువలు తెచ్చిపెట్టుకోవాలి. అంతకు ముందు లక్ష్యం లేకుండా తిరిగితే లక్ష్యం పెట్టుకో. నా పాటల్లో ఇదే రాశాను. నా పాటల్లో ఒకలా జీవితంలో ఒకలా నేను లేను. పాటల్లో చెప్పే నీతినే ఆచరిస్తున్నాను. ► ‘చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే ఉగాది అనుకోమా..’ అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో ‘మరీ అంతగా మహా చింతగా..’ పాటలో రాశారు. ఎంతో అర్థం ఉన్న ఆ వాక్యం గురించి వివరంగా చెబుతారా? మనకు అవకాశం ఉందని చేదు లేకుండా పచ్చడి చేస్తే ఏదో లోపించినట్టు ఫీలవుతాం కదా. చేదును కోరుకుంటున్నాం. అదీ ఎప్పుడు? జీవితానికి మరో కొత్త ప్రారంభం (కొత్త సంవత్సరం) అనుకుంటున్న రోజు. అదే కదా ఉగాది. ఉగాది పచ్చడి ఆరు రుచులలో చేదు, కారం ఉంటాయి. అవి ఇష్టంగా తీసుకుంటున్నాం. ఆ రుచులను మన జీవితానికి అన్వయించుకుంటే కష్టాలు వచ్చినప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ తల్లడిల్లి పోము. తల్లడిల్లకూడదని కాదు. ఎక్కువ తల్లడిల్లకూడదంటున్నాను. అలా రాయడానికి ఆ సినిమాలో అవకాశం దొరికింది. ఎంతో ఇష్టంగా రాశానా పాట. సంగీతప్రియులకు నచ్చింది. నంది అవార్డు గెలుచుకున్నాను. ► కుటుంబ విలువలను శ్లాఘించే పాటలెన్నో రాశారు. ఇవాళ తెలుగు కుటుంబాలు ఎలా ఉన్నాయని మీకనిపిస్తోంది? మా చిన్నతనంలో ఉన్నవి కొన్ని డిగ్రీలే. ఏదో గుమస్తా ఉద్యోగమో.. మహా అయితే బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగమో. ఎప్పుడైతే అవకాశాలు తక్కువ అనుకున్నామో అప్పుడు చదువుకుని, ఓ ఉద్యోగం చూసుకునే వాళ్లం. త్వరగా పెళ్లి చేసుకుని, వంశం నిలబడాలి కాబట్టి, పిల్లల్ని కనేవాళ్లం. ఇప్పుడలా కాదు. 40 ఏళ్ల వయసు వచ్చేవరకూ చదువుతూనే ఉంటారు. సెటిల్ కాలేదని పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పుడంతా 40ఏళ్ల పెళ్లికొడుకు లు, 35 ఏళ్ల పెళ్లి కూతుళ్లు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. వారి స్పర్శ తాలూకు వెచ్చదనం పిల్లలకు ఎక్కడ తెలుస్తుంది? తెలుగు కుటుంబాలు అనేకన్నా ఇవాళ కుటుంబం అనేది భారతదేశంలో విచ్ఛిన్నం అవుతోంది. అనేక రకాల ఆరాటాలు, సమస్యలతో జీవితాన్ని క్లిష్టమయం చేసుకుని ఏం సాధిస్తున్నావ్? ఇవాళ ప్రతి ఒక్కరికీ కారు ఉంది. నా చిన్నతనంలో ఒక్క సైకిల్ ఉండేది. నలుగురైదుగురు సర్దుకునేవాళ్లం. మాకది బాగుండేది. మేం జీవితంలో ఒక్కసారైనా కారు ఎక్కాలని కల కన్నాం. ఇవాళ కళ్లల్లోంచి కలలు కూడా రాలిపోయాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ రెండేసి కార్లు ఉన్నాయి. కారు ఉంది కాబట్టి 250 మైళ్ల దూరంలో ఆఫీసు ఉన్నా వెళుతున్నారు. కారు అనేది పరిగెత్తడానికి పనికొస్తోంది... సౌకర్యానికి కాదు. ఈరోజు సాంకేతిక ప్రగతి అనేది మనకు సుఖం ఇవ్వడంలేదు. అంటే వికాసం వద్దనను. 1995లో వచ్చింది సెల్ఫోన్. ఇప్పుడు సెల్ఫీలు తీసుకుని చనిపోయే పరిస్థితికి రావడం అనేది ఏ రకమైన సాంకేతిక వికాసం. ఇది అడిగేవాళ్లు లేరు. అడిగితే చెప్పేవాళ్లు లేరు. చెబితే వినేవాళ్లు లేరు. ‘నువ్వంటే నువ్వు కాదు. ఒక వ్యవస్థవి. ఈ వ్యవస్థకి పునాది ఒక కుటుంబం. నీ కుటుంబంలోను, పక్క కుటుంబంలోనూ నీతో పొంతనలేనివాళ్లు ఉంటారు. వాళ్ల కోసం నీ ఇష్టాలను వదులుకుని గడపడమే కుటుంబం, పక్క కుటుంబం. పక్క కుటుంబం ద్వారానే ఊరు, ఊరు ద్వారా రాష్ట్రం, రాష్ట్రం ద్వారా దేశం. ఇలా అయితేనే ఎప్పటికైనా నిలబడగలుగుతాం. లేకపోతే క్రమంగా విచ్ఛిన్నం తప్పదు. ► భారతీయులంతా ఒక్కటే అనే భావనతో బతకాలి అంటుంటాం. కానీ నీ ప్రాంతం.. నా ప్రాంతం.. నీ భాష.. నా భాష అంటూ గొడవలు పడుతున్నాం. దీనిపై మీ అభిప్రాయం? ఇటీవల కాలంలో భారతీయత అనే కాన్సెప్ట్ మరుగునపడిపోయి తమ తమ ప్రాంతాలతో తోటి, తమ తమ యాసలతోటి, భాషలతోటి ఉనికిని ప్రదర్శించుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. చెట్టు మూలాలను నరుక్కుంటూ బయటికొచ్చేస్తున్న పరిస్థితి. భారత మాత ఒక్కటే. తెలుగు తల్లి, తమిళ తల్లి అని లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరం మన తల్లిదండ్రులను దేవతలుగా పూజించాలి అని విశ్వసిస్తాం. మన పుట్టుక ముందు నుంచీ ప్రయాణం ఉంది. చనిపోయాక కూడా మన ప్రయాణం ఉంది. ఇలాంటి ఆలోచనలతో ఉన్న మనం ఇవాళ మన భాష ద్వారా మనం వేరుపడుతున్నాం. ‘నేను బెంగాలీవాణ్ణి కాదు.. నేను తమిళీయుణ్ణి’ అంటున్నారు. మొన్నటికి మొన్న కర్ణాటకవాళ్లు జెండా తయారు చేసుకున్నారు. ఇది వినాశకర ఆలోచన. ఇప్పుడు కూడా మనం తెలంగాణ, ఆంధ్రాగా విడిపోయింది పరిపాలనా సౌలభ్యం కోసం, భౌగోళికంగానూ, భౌతికంగానూ, రాజకీయంగానూ మారాం. అది తప్పు లేదు. రెండు తెలుగులు లేవు. ఒకటే తెలుగు ఉంది. మనము, తమిళులం, అందరం.. ఈ భారతదేశపు వివిధ శాఖలం అనుకోవాలి. సమైక్యంగా ఉండాలి. ఎవరో పోయారని అదే పనిగా తలుచుకుంటే వాళ్లు మళ్లీ రారు. వాళ్లు మనల్ని ఎంతగాప్రేమించారో గుర్తుపెట్టుకుంటే వాళ్లు మనతోనే బ్రతికి ఉన్నట్టు లెక్క. మన తల్లిదండ్రులుఎప్పుడూ పోరు అని మనం గుర్తుపెట్టుకోవాలి. వయసు వాళ్ల శరీరాల్ని తీసుకువెళ్తుంది. వాళ్లేవాళ్ల ప్రాణాల్ని, ఆత్మల్ని మనలో పెట్టారు. ఆ సంగతి గ్రహిస్తే వాళ్లు పోయినట్టు లెక్క కాదు. – డి.జి. భవాని -
మూడు కోకిలలు.. ఆరు పాటలు
ప్రతిరోజూ పండగలానే... ఉగాది అనగానే నాకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పిండివంటలు. ఇప్పటివరకు నేను ఎనిమిది భాషల్లో మూడు వందలకు పైగా పాటలు పాడాను. బాలీవుడ్లో కూడా చాలా మంచి పాటలు పాడి పేరు సంపాదించాను. ఉగాది అని ప్రత్యేకంగా చెప్పను కాని ప్రతి రోజూ పండగ లాగానే ఉంటుంది. మన తెలుగువారందరూ విళంబి నామ సంవత్సరంలో మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. రోజూ అందరూ చాలా కష్టపడి పని చెయ్యాలి. నా విషయానికొస్తే నాకైతే ఇంకా అన్ని భాషల్లో పాటలు పాడాలి అని ఉంటుంది. అలాగే నేను నటిస్తానని కూడా అందరికీ తెలుసు. ఇప్పటివరకు మూడు తెలుగు సినిమాల్లో నటించాను. ఇప్పుడు తెలుగులో ‘ఉగ్రం’ అనే సినిమాలో జేడీ చక్రవర్తి, నేను కలిసి నటిస్తున్నాం. ఈ ఉగాదికి స్పెషల్ ఏంటంటే అమెజాన్ ప్రైమ్లో నా కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘దరీమిక్స్’ అనే షో ప్రసారమౌతుంది. నాకు చాలా పేరొస్తుందనే గట్టి నమ్మకముంది. వారానికి ఒక షో రిలీజవుతుంది. ఇప్పటివరకు రెండు ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ఇందులో సింగింగ్, డాన్సింగ్కి చాలా స్కోప్ ఉంది. హిందీలో మంచి ఆల్బమ్స్ చేస్తున్నాను. వచ్చే ఉగాది లోపు నటుడిగా మంచి అవకాశలొస్తాయని ఆశిస్తున్నా. – శ్రీరామచంద్ర బాలీవుడ్లో ఎంటరవుతా 2017 సంవత్సరానికి సంబంధించిన ఇండియన్ ఐడల్ ట్రోఫీని సొంతం చేసుకున్నా. ఈ టైటిల్ను సొంతం చేసుకున్న తర్వాత వచ్చిన మొదటి ఉగాది ఇది. మాది మధ్యతరగతి కుటుంబం. కంబైన్డ్ ఫ్యామిలీ. ఉగాది అనగానే ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. ఈసారి పచ్చడి మిస్సవుతానేమో అనుకొన్నాను. కాకపోతే ఈ సంవత్సరం మీ అందరికంటే ముందే నేను ఉగాది పచ్చడి రుచి చూశాను. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. అమెరికా వెళ్లే ముందే మా అమ్మగారు నాకు ఉగాది పచ్చడి ఇష్టమని ముందే తయారు చేసి రుచి చూపించారు. గతేడాది ఉగాదికి నేను మన రాష్ట్రాంలోని తెలుగువారికి మాత్రమే తెలుసు. ఈ ఉగాదికి భారతదేశం మొత్తం తెలుసు. ఎప్పుడైతే నా పేరు పక్కన ‘ఇండియన్ ఐడల్’ అని చేరిందో అది నా జీవితాన్ని మార్చేసింది. ఉగాది పండగ స్పెషల్ ఏంటంటే మన జీవితంలో ఉన్న అన్ని రుచులు ఈ ఉగాది పచ్చడిలో ఉంటాయి. మనం జీరోలో ఉన్నప్పుడు మనల్ని ఎవరూ పట్టించుకోరు. అలాగే మనం ఏదైనా సాధించగానే అందరూ మనవాళ్ల లాగే మన దగ్గరికి వస్తారు. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. మన కష్టం, మన యాటిట్యూడ్ మాత్రమే మనల్ని మనలా నిలబెడతాయి. అవే మనకెప్పుడూ మనతో పాటు తోడుంటాయి. ఈ ఉగాది సందర్భంగా నేను కొన్ని అనుకొంటున్నాను. అవేంటంటే.. నా సింగింగ్తో బాలీవుడ్లోకి ఎంటర్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంటాను. అలాగే ఇండియన్ మైఖేల్ జాక్సన్ అవుతా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. – రేవంత్ అప్పుడే తీపి విలువ తెలుస్తుంది ఉగాది అనగానే మొదట గుర్తొచ్చేది ఉగాది పచ్చడే. ఎందుకంటే నేను భోజన ప్రియుణ్ణి. అందరూ బతకటం కోసం తింటే నేను మాత్రం తినడం కోసమే బతుకుతాను. కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత కూడా ఉంది కదా. మా ఇంట్లో అందరం కలిసి భోజనం చేసేటప్పుడు కనీసం ఫోను కూడా క్యారీ చెయ్యం. ఒక్క ఎలక్ట్రానిక్ గాడ్జెట్ను కూడా మేం డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకురాం. భోజనం చేసేటప్పుడు మనకు ఇష్టమైన మనుషులతో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యాలి. ఎందుకు ఫుడ్ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే ఉగాది పండగలోని ఆరు రుచులు మన లైఫ్ ఫిలాసఫీని గుర్తు చే స్తాయి. అందులో చేదు రుచిని చూస్తేనే కదా మనకు తర్వాత వచ్చే తీపి విలువ తెలుస్తుంది. 2006 సంవత్సరంలో నేను మొదట ఇండియన్ ఐడల్ గెలిచిన ఉగాదిని ఎప్పటికీ మరచిపోలేను. ఆ ఉగాది నా కెరీర్కే మైల్స్టోన్ లాంటిది. ఆ తర్వాత ఎన్నో బెస్ట్ ఉగాదులు నన్ను పలకరించినా 2017 ఉగాది మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ప్రస్తుతం నాకు సింగింగ్ అనేది వృత్తికాదు, ప్రవృత్తి మాత్రమే. నేను గతేడాది నా సొంత యూట్యూబ్ చానల్ని ప్రారంభించింది ఉగాది రోజునే. అదిప్పుడు పదిలక్షల మంది సభ్యులకు చేరువలో ఉంది. నా చానెల్ కోసం యస్పీ బాలసుబ్రమణ్యం లాంటి వారు వీడియోలు చేయటం నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను. అలాగే గతేడాది ఉగాది నుండి ఈ ఏడాది ఉగాదికి నేను మూడు పెద్ద పనులు ప్రారంభించాను. అవేంటంటే మొదటిది నాకు నేనుగా నా యూట్యూబ్ చానల్ కోసం సంగీతం తయారు చేసుకోవటం, రెండోది మా పెద్దనాన్న వాళ్లు చాలా గొప్ప సంగీత విద్వాంసులు. వారు సొంతంగా తయారు చేసుకున్న లలిత సంగీతాన్ని ఇప్పటివరకు మా ఇంట్లో మేం మాత్రమే పాడుకున్నాం. అవి బయట వారికి తెలియవు. ఇప్పుడు వాటిని యూట్యూబ్ చానల్ ద్వారా ప్రజలకు అందజేయటం . ఇక మూడోది కర్ణాటక సంగీత కచేరీలను కూడా మొదలెట్టాను. సినిమాలు కాకుండా ముచ్చటగా ఈ మూడు పనులను ఉగాది నుండి ఉగాది వరకు అన్నట్టు చేసుకున్నాను. ఈ ఉగాదికి ‘సాక్షి’ పాఠకులందరూ ఆరు రుచులతో హాయిగా ఉండాలి. – కారుణ్య -
మలేషియాలో ఘనంగా ఉగాది సంబరాలు
తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా (టామ్) ఆధ్వర్యములో ఉగాది వేడుకలు మరిడేక స్క్వేర్ లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలేషియా ఉప ప్రధాని అహమ్మద్ జహీద్ విచ్చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఆట పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన తెలుగు వారందరికీ టామ్ ప్రెసిడెంట్ డాక్టర్ అచ్చయ్య కుమార్ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి మలేషియా తెలంగాణ అసోసియేషన్ (ఎంవైటీఏ) తన వంతు సహకారాన్ని అందజేసినందుకు గాను తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ డాక్టర్ అచ్చయ్య కుమార్.. మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతిని, ఉపాధ్యక్షుడు సత్యలను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మరికొందరికి జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. -
ఉత్తర కాలిఫోర్నియాలోఉగాది సంబరాలు
కాలిఫోర్నియా : తెలుగు వారి తొలిపండుగ ఉగాది సంబరాలు ఉత్తర కాలిఫోర్నియాలో మౌంటెన్ హౌస్ ట్రెసీ తెలుగుసంఘం(ఎంటీటీఎ) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మౌంటెన్ హౌస్ ట్రెసీ బెతనీ మల్లీపర్సస్ రూంలో జరిగిన వేడుకల్లో మౌంటెన్ హౌస్, ట్రేసీలోని తెలుగువారు సంప్రదాయదుస్తులు ధరించి ఆట, పాటలతోఅందరిని అలరించారు. ప్రముఖ హృద్రోగ వైద్యనిపుణులు డాక్టర్ లక్కిరెడ్డిహనిమిరెడ్డి, ఇండోఅమెరికన్ కమ్యూనిటీ స్టేట్ఆఫీస్, గవర్నర్స్ ఆఫీసు కల్చరల్ అంబాసిడర్ మన్నాప్రగడశ్రీనివాస్, తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ రమేష్ తనిగెళపల్లి, ఎంహెచ్సీఎస్డీ బోర్డు వైస్ ప్రెసిడెంట్ బెర్నైస్ ట్రిగిల్లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అనంతరం శ్రీ సీతారామస్వామికళ్యాణం నిర్వహించారు. ఉగాది పచ్చడి కళ్యాణ పానకం ఇచ్చి అనంతరం నోరూరించే విందు భోజనం వడ్డించారు. శివపార్వతి అనంతు, స్వప్న ఆదేలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. డాక్టర్ లక్కిరెడ్డి ప్రసంగం ఆకట్టుకుంది. ఎంటీటీఎ కార్యనిర్వాహక సంఘం వారు అందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. -
ఐటీఎస్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు
హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా డబ్లిన్లో ఐటీఎస్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం జరగబోతుంది. ఇది ఏప్రిల్ 9న మాల్ట్రాన్ హోటల్, వైట్స్టౌన్ వే, తాలా, డబ్లిన్లో మద్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7 వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి వందలాది మంది ఎన్నారైలు హాజరుకానున్నారు. ఇందులో తెలుగు సంస్కృతిని అద్దం పట్టే కార్యక్రమాలను ఐటీఎస్ రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగర్స్ గోపిక, మల్లిఖార్జున, జబర్దస్త్ ఫేం అదిరే అభి, మాస్ అవినాశ్లు పాల్గొననున్నారు. ఇందులో పల్గోనాలనుకునే వారు ముందుగా www.lrelandtelugusamajam.org లో రిజిస్టర్ చేసుకొని ఉచితంగా ఎంట్రీ టికెట్ పొందవచ్చు. -
ఐర్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
-
సిలికానాంధ్ర యూనివర్సిటీలో ఘనంగా ఉగాది వేడుకలు
కాలిఫోర్నియా : శ్రీ హేమలంబ నామ ఉగాది ఉత్సవాలు కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో సిలికానాంధ్ర యూనివర్సిటీలోని లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పంచ ఘట నాదలయవిన్యాసం, వాద్య సంగీత గోష్టి (ఫ్యుజన్) కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. ప్రపంచ ప్రఖ్యాత ఘటవాయిద్య విద్వాంసులు పద్మభూషణ్ విక్కు వినాయకరాం తన శిష్య బృందంతో నిర్వహించిన 'పంచ ఘట నాదలయ విన్యాసం' తో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం పరవశించింది. ఈ సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో విక్కు వినాయకరాం మాట్లాడుతూ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పవిత్రతో కూడిన దివ్యత్వం ఉన్నట్టుగా అనుభూతి కలుగుతోందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఏ ఆశయం కోసం ప్రారంభించారో అది తప్పక నెరవేరుతుందన్నారు. తానూ ఇందులో భాగమై, విద్యార్ధులకు విద్య నేర్పడానికి సిద్ధం అని ప్రకటించారు. తాను కచేరీ చేసే ఘటం ని సంతకం చేసి కానుకగా సిలికానాంధ్ర యూనివర్సిటీకి అందజేశారు. అనంతరం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం రాబోయే ఫాల్ సెమిస్టర్ కరపత్రాలు, గోడపత్రికను పద్మభూషణ్ విక్కు వినాయకరాం ఆవిష్కరించి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, యూనివర్సిటీ కార్యవర్గానికి అందజేశారు. బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వెంకట శాస్త్రి హేమలంబ ఉగాది పంచాంగ పఠనం చేశారు. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనాన్ని మధు ప్రఖ్య సంధాతగా ఎంతో ఆసక్తిగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా పిల్లలకు నిర్వహించిన ‘భాషా వికాస పోటీ’ విజేతలకు బహుమతులు అందజేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అన్నవరపు రామస్వామి శిష్యులు 'దేవన్ డ్రోన్ ' గా చిరపరిచితులైన కళాకారులు వయోలిన్ వాసుదేవన్, ఫ్లూట్ ఫణిలు నిర్వహించిన వాయులీన-వేణుగాన ‘నాదామృత వర్షిణి’ కార్యక్రమం ప్రేక్షకులను ఆసాంతం ఉర్రూతలూగించింది. సిలికానాంధ్ర సంస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ.. యువతే రేపటి భవిత అనే సిద్ధాంతాన్ని సిలికానాంధ్ర ఎప్పుడూ నమ్ముతుందని, అందుకే ప్రతిభావంతులైన యువ కళాకారులను ఎల్లప్పుడూ సిలినాంధ్ర వేదిక స్వాగతం పలుకుతుందని అన్నారు. ఇదే వేదికపై, ఎంజే తాటిపాముల, ఫణిమాధవ్ కస్తూరి సిద్ధం చేసిన సిలికానాంధ్ర అంతర్జాల పత్రిక 'సుజనరంజని' కొత్త పోర్టల్ విడుదల చేశారు. రత్నమాల వంక, మాధవ కిడాంబి, పద్మ హరి, సిద్దార్ధ్ నూకల, సాయి కందుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, ప్రభ మాలెంపాటి, సంజీవ్ తనుగుల, రవీంద్ర కూచిభొట్ల, తదితరులు పాల్గొన్నారు. -
టాక్ ఆద్వర్యం లో యూకేలో ఉగాది వేడుకలు
యూకే లోని షెఫీల్డ్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకే (టాక్ ), హిందూ మందిర్ సంయుక్తంగా శ్రీ హేవిళంబి నామ ఉగాది సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. టాక్ సభ్యులు సాయిబాబు నర్రా, అరవింద్ రెడ్డి అధ్యక్షతన షెఫీల్డ్ హిందూ దేవాలయంలోని కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ వేడుకలకు లార్డ్ లెఫ్టినెంట్ అఫ్ సౌత్ యార్క్ షైర్ ఆండ్రూ కూమ్బ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రవాస తెలుగు వారు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మొదట సాంప్రదాయ పూజలతో ఆరంభమైన వేడుకలో పంచాగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథి లార్డ్ లెఫ్టినెంట్ అఫ్ సౌత్ యార్క్ షైర్ ఆండ్రూ కూమ్బ్ మాట్లాడుతూ.. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తనకు హిందూ ధర్మం, సాంప్రదాయాలంటే ఎంతో గౌరవమని, ఇకముందు కూడా హిందూ ధర్మం గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తానని అన్నారు. టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ.. రుచులలో తీపి, చేదు ఉన్నట్లే జీవితంలో కూడా కష్టసుఖాలు ఉంటాయని, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది సంబరాలలో తెలుగువారే కాకుండా మరాఠీలు , గుజరాతీలు, బెంగాలీలు మరియు పంజాబీలు పాల్గొనడం విశేషం. తెలుగు వారి పండగలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న షెఫిల్డ్ హిందూ సమాజ్ సంస్థకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సంబరాలలో టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది, సభ్యులు సాయిబాబు నర్రా, అరవింద్ రెడ్డి, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, శ్రీకాంత్ జెల్లా, స్నేహలత, ప్రత్యుష, మాధవ్,విజయ్ ,భూషణ్ ,రాజేష్ వాకా ,వెంకీ ,రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉగాది సంబరం.. బ్రూతో ఆనందం
తెలుగు ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ.. ఉగాది. ప్రేమ, సమైక్యతాభావాలను ఇది తీసుకొస్తుంది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దస్థాయిలో సంబరం చేసుకుంటారు. కొత్త సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలతో ఈ ఆనందం రెట్టింపు అవుతుంది, జీవితం మరింత విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఉగాది సంబరాలు మరింత బాగా చేసుకోడానికి బ్రూ మరో అవకాశం కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజల మధ్య గణనీయమైన మార్పును తీసుకురావడంలో బ్రూ కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు రెండు రాష్ట్రాల మధ్య అంతంత మాత్రంగానే ఉండే సంబంధాలను మెరుగు పరచాలని బ్రూ నిర్ణయించింది. ఇందుకోసం కృష్ణా పుష్కరాలను వేదికగా తీసుకుంది. దాదాపు 3 కోట్ల మంది పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాలు చేశారు. 12 రోజుల పాటు జరిగిన ఈ సంబరాల్లో నదీ తీరం వెంట రంగులతో కూడిన సంబరాలు జరిగాయి. ఈ సంబరాలకు మరింత వన్నె తెచ్చేలా హీట్ టెక్నాలజీని ఉపయోగించిన బ్రూ.. అక్కడున్న వారందరి ముఖాల్లో చిరునవ్వులు తీసుకొచ్చింది. పుష్కరాల సందర్భంగా 430 స్టాల్స్ను ఏర్పాటుచేసి, 40 లక్షల కప్పుల కాఫీని, దాంతో పాటు అపార ప్రేమను పంచిపెట్టింది. ఇవన్నీ మేజికల్ కప్పులు. వాటిలో వేడిపదార్థం ఏదైనా పోస్తే.. అప్పటివరకు ముదురుగోధుమ రంగులో కనిపించిన కప్పుల మీద మంచి మంచి బొమ్మలు, వాటితో పాటు ప్రేమపూర్వక సందేశాలు బయటపడతాయి. ఆంధ్రప్రదేశ్లోని తమ సోదరీ సోదరుల కోసం తెలంగాణ వాసులు రాసిన సందేశాలను బ్రూ తీసుకొచ్చింది. మొత్తం 12 రోజుల పాటు ఈ మేజికల్ కప్పులతో కాఫీని ఉచితంగా ఇస్తూ.. దాంతోపాటు పొరుగు రాష్ట్రం నుంచి ప్రేమను కూడా తీసుకొచ్చింది. ఆ కప్పుల మీద రాసిన సందేశాలు చూసి.. తాగిన ప్రతి ఒక్కరి ముఖాల మీద చిరునవ్వులు పూశాయి. ప్రతి ఒక్కరూ తాము చదవడమే కాక చుట్టుపక్కల ఉన్నవాళ్లకు కూడా ఆ సందేశాలు చూపించి, పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ప్రేమాభిమానాలకు మురిసిపోయారు. ఆ విధంగా బ్రూ విజయవంతంగా ఆ 12 రోజుల పాటు సమైక్యత, స్నేహభావాల సందేశాన్ని మోసుకొచ్చింది. బ్రూ చేసిన ఈ చిరు ప్రయత్నం జనం మోముల్లో ఎలాంటి ఆనందాన్ని నింపిందో మీరే చూడండి.. కింద వీడియో క్లిక్ చేయండి. -
'యుక్త' ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
లండన్: యునైటెడ్ కింగ్డమ్ తెలుగు సంఘం (యుక్త) నిర్వహించిన ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక తూర్పు లండన్లోని బీకాన్ట్రీలో నిర్వహించిన ఈ వేడుకల్లో వెయ్యిమందికి పైగా ప్రవాస తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ విద్యా భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. నందకుమార, ప్రత్యేక అతిథిగా ఈస్ట్ హాం పార్లమెంట్ సభ్యుడు స్టీఫెన్ టిమ్మిన్స్ పాల్గొన్నారు. విశేష అతిథులుగా లాంబెత్ మేయర్, ప్రవాస తెలుగు మహిళ సాలేహ జాఫర్, పంజాబ్ నేషనల్ బ్యాంకు యు కె అధ్యక్షుడు నాయక్ పాల్గొన్నారు. ప్రతి ఉగాది పండుగ ఒక యుగాదికి నాంది అని, ఉక్త అంటే సరస్వతీ వాక్కు, యుక్త అంటే పవిత్రమైనదని నందకుమార అన్నారు. సూర్యగమనాన్ని అనుసరించి ఋతువులు ఏర్పడటం, వాటి ద్వారా పండుగలు జరుపుకోవటం ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంటుందని, అదే మన సంస్కృతికి నాంది అని తెలిపారు. పార్లమెంట్ సభ్యుడు స్టీఫెన్ టిమ్మిన్స్ మాట్లాడుతూ బ్రెక్సిట్ అధ్యయన కమిటీలో తాను సభ్యుడని, భారతదేశంతో మైత్రి, సత్సంబంధాల ద్వారా మాత్రమే అనూహ్యమైన పరిణామాలను ఎదుర్కునే మనోబలాన్ని బ్రిటన్ పొందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగువారితో తనకున్న అనుబంధం విడదీయలేనిదని అభిప్రాయపడ్డారు. అనంతరం సంప్రదాయ రీతిలో పంచాంగ శ్రవణం, చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. హేవిళంబి నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో ప్రతిభ చూపించిన చిన్నారులకు, అనేక రంగాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుని సామాజిక సేవకు శ్రీకారం చుట్టిన ప్రవాస తెలుగు ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు. ఎయిర్ ఇండియా యు కె ప్రాంతీయ అధికారిణి తారా నాయుడు, పెళ్లిచూపులు చిత్ర నిర్మాత యష్ రంగినేని ఉగాది పురస్కారాలు పొందిన వారిలో ఉన్నారు. తెలుగు సంఘాలను అనుసంధానం చేస్తూ పండుగల ద్వారా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్ర ప్రవాసులను ఏక త్రాటి మీదకు తీసుకురావాలన్న ధ్యేయాన్ని యుక్తా ఈ ఉగాది వేడుకల ద్వారా శ్రీకారం చుడుతోందని అధ్యక్షుడు ప్రసాద్ మంత్రాల పేర్కొన్నారు. తెలంగాణా ఎన్ఆర్ఐ ఫోరమ్ తో కలిసి తెలంగాణా చేనేత కార్మికుల సహాయార్ధం పోచంపల్లి, గద్వాల్ వస్త్ర శ్రేణి ఫ్యాషన్ షో నిర్వహించారు. అనంతరం యుక్తా నూతన వెబ్ సైట్ ఆవిష్కరించారు. ఆహూతులందరికీ ఉగాది పచ్చడి, కమ్మని తెలుగు భోజనం వడ్డించారు. శ్రీమతి రమ్య, సుజాత తలాడి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో యుక్తా ట్రస్టీ లు శ్రీమతి గీత మోర్ల, డా. వెంకట పద్మ కిల్లి, ఉపాధ్యక్షుడు రాజ్ కుర్బా, ప్రధాన కార్యదర్శి సత్యప్రసాద్ మద్దసాని, కోశాధికారి నరేంద్ర మున్నలూరి, ఐటి కార్యదర్శి క్రిష్ణ యలమంచిలి, మీడియా కార్యదర్శి రుద్ర వర్మ, ప్రజా సంబంధాల కార్యదర్శి బలరాం విష్ణుభొట్ల, మానవ వనరుల అభివృద్ధి కార్యదర్శి ఉదయ్ అర్యన్ ఆరేటి, సాంస్కృతిక కార్యదర్శి పూర్ణిమ చల్లా, క్రీడలు కార్యదర్శి సుధీర్ కొండూరు, కృష్ణ సనపల, సమాచార మరియు ఐటి ఆదిత్యవర్దన్ అల్లాడి , అమరనాద్ రెడ్డి, కార్తిక్లు పాల్గొన్నారు. -
రాజ్భవన్లో ఉగాది వేడుకలు
-
తెలుగు అకాడమీని పునరుద్ధరిస్తాం
- సంగీత, నాటక అకాడమీలు కూడా.. - ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు - ప్రముఖులకు పురస్కారాల ప్రదానం విజయవాడ కల్చరల్ : తెలుగు అకాడమీని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అలాగే సంగీత, నాటక అకాడమీలను కూడా పునరుద్ధరిస్తామని తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలుగు భాషాభివృద్ధికి గతంలోనే ఒక కమిటీ వేశామని, తాజాగా ప్రాధికార కమిటీని నియమించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యర్యంలో హేవళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం, వ్యవసాయ శాఖ, భాషా సాంస్కృతిక శాఖలు ప్రచురించిన పంచాంగాలను ఆవిష్కరించారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు 2017 సంవత్సరానికి కళారత్న పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు భాషా వైభవాన్ని కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కూచిపూడి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1,000 పాఠశాలల్లో 50 వేల మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, పల్లె రఘునా«థరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, బి.గోపాల కృష్ణారెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, భాషా–సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగుపల్లి శ్రీకాంత్, సంచాలకుడు డి.విజయభాస్కర్, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, జిల్లా కలెక్టర్ బాబు.ఎ తదితరులు పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర :వేదాంతం వేదాంతం రాజగోపాల చక్రవర్తి పంచాంగ పఠనం సభికులను ఆకట్టుకుంది. హేవళంబి అంటే బంగారు తోరణమని, ఏడాదంతా జీవన యాత్ర శుభప్రదంగా జరుగుతుందని చెప్పారు. సకాలంలో వర్షాలు పడతాయని, రైతులకు తృణధాన్యాలకు గిట్టుబాటు ధర వస్తుందని తెలిపారు. వ్యవసాయ పంచాంగాన్ని వ్యవసాయ శాస్త్రవేత్త కూర్మారావు వివరించారు. -
ఒక నాయకుడికి పొంచి ఉన్న ప్రమాదం
-
ysrcp కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు
-
2019లో వార్ వన్సైడే!
-
ఒక నాయకుడికి పొంచి ఉన్న ప్రమాదం
తెలంగాణలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు పెరిగే అవకాశం ఉందని, ఒక నాయకుడికి కూడా ప్రమాదం పొంచి ఉందని పంచాంగకర్త సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రగతిభవన్లో ఆయన పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, పలువురు మంత్రులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని, ఆషాడంలో తుపానులు కూడా వస్తాయని సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన బాగుంటుందని, అయితే పోలీసు శాఖ మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు మేలు జరుగుతుందని, రైతులు సుభిక్షంగా ఉంటారని అన్నారు. -
2019లో వార్ వన్సైడే!
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతకం అద్భుతంగా ఉందని, 2019లో వార్ వన్సైడే అవుతుందని పంచాంగకర్త రామచంద్ర శాస్త్రి చెప్పారు. పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన ఉగాది వేడుకలకు వైఎస్ జగన్ సహా పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 2019లో అంతా ఏకపక్షంగానే ఉంటుందని, ఈసారి రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుందని, ఆ క్రెడిట్ అంతా జగన్కే దక్కుతుందని కూడా ఆయన అన్నారు. హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన వైఎస్ జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలు, తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. -
రాజ్భవన్ ఉగాది వేడుకలు..
-
రాజ్భవన్ ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్
-
శిల్పారామంలో 12రాష్ట్రాల కళాకారులతో ఉగాది ఉత్సవాలు
-
ఎంఎల్ఆర్ఐటీలో ‘సాక్షి’ ఉగాది సందడి
-
రెండు తెలుగు రాష్ట్రాలు.. సమృద్ధి సాధించాలి
సాక్షి, హైదరాబాద్: ‘హేవళంబి సంవత్సరం తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు ఇవ్వాలి. రెండు రాష్ట్రాలు సమృద్ధిని సాధించాలి. ఇక్కడ రాజ్భవన్లో రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఇలాగే కలిసి మెలిసి ఉండాలి. పాడి పంటలు, వర్షాలు సమృద్ధిగా ఉంటాయి పంచాగ శ్రవణం ద్వారా తెలిసింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు’ అని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ పేర్కొన్నారు. రాజ్భవన్లో మంగళవారం రాత్రి ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు నేలతో తనకు వీడదీయరాని అనుంబంధం ఉందని, ఉగాది తనకెంతో ప్రత్యేకమని గవర్నర్ తన పాత జ్ఞాపకాలను నెమరు వెసుకున్నారు. తన చదవు మొదలైంది తెలుగు నేలపైనేని, తన మొదటి ఉద్యోగం కూడా తెలుగు గడ్డపైనే ప్రారంభమైందని చెప్పారు. ఈ తెలుగు నేల తనకు రెండో జన్మను ఇచ్చిందని, నలభై ఆరేళ్ల కిందట జరిగిన ఓ దుర్ఘటనలో కర్నూలులో రెండు రోజుల కోమాలో ఉండి బతికి బయటపడ్డానని, ఇది ఉగాది రోజే జరిగిందని, అందుకే ఉగాది అంటే తమ కుటుంబానికి ప్రత్యేకమని వివరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజభవన్ ఉద్యోగుల కోసం కొత్తగా ఫ్లాట్స్ నిర్మాణం మొదలు పెట్టారని, ఆ సముదాయానికి సమృద్ధి అని పేరు పెట్టామని, రాజభవన్ సమృద్ధిగా ఉంటే రెండు రాష్ట్రాలు సమృద్ధిగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. (రాజ్భవన్లో ఉగాది వేడుకల ఫొటోలు) సమృద్ధిగా వర్షాలు: పంచాంగ శ్రవణంలో శ్రీవిద్యా శ్రీకాంత శర్మ ఉగాది వేడుకల్లో బ్రహ్మశ్రీ కొండగప శ్రీవిద్యా శ్రీధర్ శర్మ పంచాగ పఠనం చేశారు. దుర్ముఖి నామ సంవత్సరం కంటే ఎక్కువగా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పంచాంగ పఠనంలో పేర్కొన్నారు. గత ఏడాది కంటే తేడాలు ఉండవన్నారు. కీళ్లు, మెదడు, నరాల సంబంధ వ్యాధులు పెరిగే అవకాశం ఉందన్నారు. బంగారు, వెండి, పెట్రోలు ధరలు నిలకడగా ఉంటాయని, నకిలీ మందుల బెడద తప్పక పోవచ్చనఆనరు. సంప్రదింపుల ద్వారా సరిహద్దు రాష్ట్రాలతో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్ ‘ తెలుగు వారు కాకపోయినప్పటికీ గవర్నర్ ప్రతీ ఏటా ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు, ఆయన అభినందనీయులు. తెలంగాణ ప్రజల తరపున గవర్నర్కు అభినందనలు, కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకంక్షలు..’. రాజ్భవన్ మనుషులను కలిపే వేదిక అయ్యింది : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ‘ రాజ్భవన్ కళకళలాడుతోంది. రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబిస్తోంది. మనుషులను కలిపే వేదికగా రాజ్భవన్ పనిచేస్తోంది. ఉగాది విషయంలో కొంత గందరగోళం ఉంది. గవర్నర్ ఒక రోజు ముందే వేడుకలు జరిపినా, నాకు గానీ, తెలంగాణ సీఎం కేసీఆర్కు గానీ ఎలాంటి గందరగోళం లేదు. బుధవారం ఉగాది జరుపు కొంటాం. పాలకులుగా ఆలోచించి ప్రజలకు సుపరిపాలన ఇస్తాం. అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నా. ఉభయ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు..’. ప్రముఖుల హాజరు రాజ్భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్.జగన్ మోహన్రెడ్డిని గవర్నర్ తన పక్కనే కుర్చీ వేయించి కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు వేడుకల్లో గడిపిన తర్వాత వైఎస్ జగన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపి వెళ్లారు. స్పీకర్ ఎస్. మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు వెంట మంత్రి అచ్చన్నాయుడు హాజరు కాగా, తెలంగాణ కేబినెట్ నుంచి మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీ తారక రామావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, డాక్టర్ లక్ష్మారెడ్డి, సీఎస్ ఎస్.పి.సింగ్ తదితరులు హాజరయ్యారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఉగాది వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీకి చెందిన రామాచారి బృందం గీతాలు అలపించగా, అరబి వయోలిన్ స్కూల్కు చెందిన విద్యార్థులు గురువు అశోక్ గురజాల నేతృత్వంలో వయోలిన్ సింఫనీ నిర్వహించారు. మంజుల రామస్వామి శిశ్య బృందం ఇచ్చిన దీపనాట్యం ఆహుతులను ఆకట్టుకుంది. -
ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత హైదరాబాద్కు చెందిన సత్యసాయి భక్తుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ భక్తి గీతాలతో కచేరీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు జడ్జి రామసుబ్రమణియన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సత్యసాయి బోధనలు మానవాళికి ఆదర్శమన్నారు. బాలవికాస్ విద్యార్థిగా బాల్యంలో సత్యసాయి బోధనలు అనుసరిస్తున్న తన జీవితంలో చోటు చేసుకున్న అద్భుత అనుభవాలను ఆయన వివరించారు. అనంతరం ఆయన సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. హైదరాబాద్ భక్తుల నగర సంకీర్తన పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన హైదరాబాద్ సత్యసాయి భక్తులు పట్టణంలో నగరసంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పెద్దవెంకమరాజు కల్యాణమండపం వద్ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్.జె.రత్నాకర్రాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెండిరథంలో సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగిస్తూ భక్తిగీతాలు ఆలపిస్తూ భక్తులు ముందుకు సాగారు. సుమారు వెయ్యి మందికిపైగా భక్తులు నగరసంకీర్తనలో పాల్గోన్నారు.చిన్నారులు పౌరాణిక వేషధారణలో ముందకు సాగుతూ అలరించారు. ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వద్ద మంగళహారతితో సంకీర్తన ముగిసింది. అలంకరణలో మహాసమాధి ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు బుధవారం ఘనంగా జరగనున్నాయి. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత వేదపఠనంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రశాంతి నిలయాన్ని వేడుకల కోసం ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సత్యసాయి మహాసమాధిని దేదీప్యమానంగా ఫలపుష్పదళాలతో ఆలంకరించారు. హేవిళంబి నామ సంవత్సరం ఉగాది పంచంగ శ్రవణాన్ని పండిత అవధాని శివసుబ్రహ్మణ్యంశాస్త్రి పఠించనున్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
రాజ్భవన్లో ఉగాది వేడుకలు
హైదరాబాద్ : హేవిళంబి తెలుగునామ సంవత్సరం సందర్భంగా మంగళవారం ఉగాది వేడుకలు రాజ్భవన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆయన కొద్దిసేపు అనంతరం వెళ్లిపోయారు. అలాగే తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు నాయిని, కేటీఆర్, చందూలాల్, ఇంద్రకరణ్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులకు గవర్నర్ నరసింహన్ శాలువతో సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తెలుగువారు కాకపోయినా ఘనంగా నూతన సంవత్సరం వేడుకలను జరిపారని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గవర్నర్ వచ్చినప్పటి నుంచి రాజ్భవన్ కళకళలాడుతోందని, అందరికి మంచి జరుగుతుందని పంచాగకర్త చెప్పారని, పాలకులకు మంచి పాలన అందించేలా, రైతులకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. -
రాజ్భవన్లో ఉగాది వేడుకలు
-
జనహితలో ఉ.10.30కి ఉగాది వేడుకలు
ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: శ్రీ హేవళంబి నామ ఉగాది వేడుకలు ఈసారి హైదరాబాద్ బేగంపేట్ రోడ్డులోని జనహిత, సీఎం క్యాంపు కార్యాలయ సముదాయంలో నిర్వహిస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లలో భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికా రులు మునిగిపోయారు. ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు ఉగాది వేడుకలు ప్రారంభమవుతాయి. మొదట నాదస్వరం, పూర్ణకుంభ స్వాగతం, ప్రార్థనాగీతం, వేదాశీ ర్వచనం, పంచాంగ పఠనం, వేదపండితులకు, అర్చకు లకు, ఆధ్యాత్మికవేత్తలకు సత్కారం, ఉగాది నృత్యరూపకం నిర్వ హించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు కవి సమ్మేళనం కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ పాల్గొననుండగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ జ్యోతి ప్రకాశనం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, పలువురు మంత్రులు, నగర మేయర్ తదితరులు పాల్గొననున్నారు. -
హైదరాబాద్లో తెలుగోత్సవం పేరుతో ఉగాది ఉత్సవాలు
-
ఉగాది 28నే జరుపుకోవాలి
ముఖ్యమంత్రికి శ్రీనివాస గార్గేయ సూచన సాక్షి, అమరావతి: ఉగాది పండుగను ఈ నెల 28నే జరుపుకోవాలని పంచాంగకర్త శ్రీనివాస గార్గేయ సిద్ధాంతి ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు. శుక్రవారం సచివాలయంలో కంచికామకోటి పీఠ సిద్ధాంతి ఎల్ సుబ్రహ్మణ్యం, హనుమంత వజ్జల సుబ్రహ్మణ్యంతో కలసి ఆయన బాబును కలిశారు. నాసా చెప్పిన పద్ధతిలో 29న పాడ్యమి లేదని కాబట్టి ఆరోజు ఉగాది చేయకూడదని, 28నే చేయాలని కోరారు. అనేక రాష్ట్రాల్లో ఈ నెల 28నే ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం శ్రీజైన్ శ్వేతాంబర సభ ప్రతినిధి దినేశ్ జైన్ సీఎంను కలిశారు. ఆత్మహత్య చేసుకున్న మెడికో బాలసంధ్యారాణి తండ్రి బాల సత్తెయ్య ముఖ్యమంత్రిని కలిసి ఆదుకోవాలని కోరగా ఆయన రూ.2 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. -
ఉగాదికి కళారత్నపురస్కారాలు..
అమరావతి: హేవలంబి నామ ఉగాది ఉత్సవాల నిర్వహణ, కళారత్న పురస్కారాల ఎంపికకు సలహామండలిని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ శక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మండలికి ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహిరిస్తారని, వివిధ విభాగాల చెందిన 12 మంది ప్రముఖులు సభ్యులుగా ఉంటారని సాంస్కృతిక శాఖ తెలిపింది. ఈ మండలి ఉగాదిపురస్కారాల నిర్వహణ, కళారత్న ( హంస) పురస్కారాల విజేతలను ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు. మార్చి 29న జరగబోయే ఉగాది ఉత్సవాల్లో భాషా సాంస్కృతిక శాఖ కళారత్న (హంస) పురస్కారాలు ఇవ్వనుంది. ఈ పురస్కారానికి ఎంపికైనవారికి ఒక్కొక్కరికి రూ. 50,000లు, హంస ప్రతిమలు, శాలువ ప్రశంసా పత్రం బహుకరిస్తారు. వివిధ రంగాలు సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపదం, మిమిక్రీ, అవధానంలో ప్రతిభ కనబర్చినవారికి ఈ పురస్కారం అందజేస్తారు. ఉగాది రోజు నిర్వహించే పోటీల్లో గెలిచిన వారికి రూ.10,116/-లు, శాలువ ప్రశంసాపత్రం, తెలుగు తల్లి జ్ఞాపిక బహుకరిస్తారు. ఈ కార్యక్రమాలకు సాంస్కృతిక శాఖతో పాటు దేవాదయ శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, తిరమల తిరుపతి దేవస్థానములు పాలుపంచుకుంటాయి. -
మెంఫిస్లో ఘనంగా ఉగాది వేడుకలు
మెంఫిస్: మెంఫిస్ తెలుగు సమితి వారి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే ముప్ఫై ఐదు సంవత్సరాల వసంతోత్సవాన్ని కూడా అక్కడి తెలుగువాళ్లు వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెంఫిన్ అధ్యక్షుడు యెదురు పుల్లారెడ్డి గారి ఆధ్వర్యం లో ఘనంగా జరిగింది ఈ నెల 4,5 తేదీల్లో జరిగిన ఈ సంబరాలకు స్థానిక వైట్ స్టేషన్ హై స్కూల్ ఆడిటోరియం వేదికగా నిలిచింది. శాస్త్రీయ సంగీతం, సాంప్రదాయ కూచిపుడి నృత్యాలు, నాడు-నేడు సినిమాపాటల్లో నృత్యాలు, బాహుబలి సినిమాలోని దృశ్యానుకరణలు అందరిని అలరించారు. ఈ కార్యక్రమానికి మెంఫిస్ మేయర్ కార్యాలయం నుంచి కేఎన్ మూడి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారితో ఈ సంబరాలలో పాలు పంచుకోవడం ఎంతో ఆనందం వుందన్నారు. అలాగే 35 వసంతాల పండుగలో పలువురు టాలీవుడ్ నటీనటులు, గాయనీ గాయకులు ప్రదర్శనలు అందర్ని అలరించాయి. అంతేకాకుండా తెలుగు వారి పసందైన వంటకాల విందు భోజనం, తాంబూలం(కిళ్లి)తో ఉగాది వేడుకలకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా మెంఫిస్ తెలుగు సమితి బోర్డు చైర్మన్ భద్రం నరిసెట్టి ...టీఏఎం (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెంఫిన్) చేస్తున్న వివిధ కార్యాక్రమాలను వివరించారు. అలాగే క్యాన్సర్తో బాధపడుతున్న మన్నన్ పటేల్ (2) వసతి కోసం సేకరించిన 5000 డాలర్ల విరాళాన్ని బాలుని తండ్రికి అందజేశారు. ఇక కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి కృషి చేసిన ఉపాధ్యక్షుడు గోపి జవాబ్ నవీస్, సహా ఉపాధ్యక్షుడు రంజిత్ కొమరవెల్లి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మండలపు, సహ ప్రధాన కార్యదర్శి మదన్ వెన్,కోశాధికారి సుబ్బారెడ్డి కర్నాటి, సహా కోశాధికారి రమేష్ నర్సాపురం, సాంసృతిక కార్యదర్శి రత్నాకర్రావు వాన, సాంసృతిక సహా కార్యదర్శి స్వప్న వొంటరి, క్రీడల విభాగ కార్యదర్శి శ్రీనివాస్ బుసిరెడ్డి,క్రీడల విభాగ సహా కార్యదర్శి అరవింద్ నూనె,ఫుడ్ కమిటీ చైర్ పర్సన్చంద్రశేఖర్ పొట్నూరు, క్రియేటివ్ డైరెక్టర్ సత్య ప్రోద్దుటూరి, యూత్ కమిటీ చైర్ పర్సన్ రవిపోలూరి, మార్కెటింగ్ కమిటీ చైర్ పర్సన్ రాజేంద్ర తంగళ్లపల్లి,మార్కెటింగ్ కమిటీ ఉప చైర్ పర్సన్ అరుణ్ ద్యసాని, మీడియా చైర్ పర్సన్ సింధూర కల్లేపల్లి మరియు బోర్డు చైర్మన్ వీరభద్రం నరిశెట్టి, ధర్మకర్తలు స్వామి పొలస, ఉదయ్ నట్రలను, రాజ్ తోట మరియు సురేశ్ కొత్తలను అభినందించారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా ఉగాది వేడుకలు
♦ టి.ఆర్.యస్ ఆస్ట్రేలియా ఆద్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు ♦ బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ పాలన భేష్ అని ఎన్నారైల హర్షం టిఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు, ఆస్ట్రేలియాలో నివసముంటున టిఆర్ఎస్ మద్దతుదారులు, తెలంగాణ జాగృతి సభ్యులు ఏప్రిల్ 9న ఆస్ట్రేలియాలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలను బెల్ హెవెన్ , 82 స్టేషన్ స్ట్రీట్ , వెంట్వర్త్విల్లేలో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ ఉగాది వేడుకలకు ఆస్ట్రేలియా నలుమూలల నుండి తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు భారీగా హాజరయ్యారు. ముఖ్య అతిధిగా TV9 వ్యాపార ఎడిటర్ సుకుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో టి.ఆర్.యస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, పథకాలను గురించి వివరించారు, టి.అర్.యస్ ప్రబుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని, అందరి సూచనలని తీసుకొని ముందుకు వెళుతోందని కొనియాడారు. తెలంగాణా డెవలప్మెంట్ మరియు శ్రేయస్సు కోరకు తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న పెట్టుబడులు గురించి సంక్షిప్తంగా వివరించారు. ఇతర ప్రముఖ అతిథులు - 1. గోపాల్ గటిగంటి - చార్టెడ్ అకౌంటెంట్ 2. సాగర్ రెడ్డి కోమిడి- ఆస్ట్రేలియ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు 3. మాధవ్ కటికాన్ని - ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం మాజీ అధ్యక్షుడు హాజరయ్యారు. జాతీయ కోర్ కమిటీ వివరరాలు 1. అధ్యక్షుడు - రాజేష్ గంగసాని 2. ఉపాధ్యక్షులు - సందీప్ మునుగాల 3. జనరల్ సెక్రటరీ - ప్రవీణ్ పిన్నామ 4. సెక్రటరీ - అనిదీప్ గౌడ్ 5. జాయింట్ సెక్రటరీ - సుమన్ పారుపటి 6. మీడియా సెక్రటరీ అండ్ మీడియా స్పోకేస్ పర్సన్ - ప్రశాంత్ కడపర్తి 7. సుమేష్రెడ్డి సూర్య 8. పవన్ పప్పయ్యగారి 9. లక్ష్మీ కుమార్ గుప్తా కలకొండ 10. సురేన్ వంగపల్లి 11. కపిల్ కట్పల్లి 12. జ్యోతి అర్శానపల్లి 13. వినోద్ ఏలేటి 14. నరేష్ భీంరెడ్డి 15. ససిధర్ బీరవెల్లి 16. సతీష్ చౌదరి 17. వేణుగోపాల్ ముద్దసాని -
తిరుమలలో ఘనంగా ఉగాది ఆస్థానం
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం శ్రీదుర్ముఖినామ సంవత్సర ఉగాది ఆస్థానం కార్యక్రమం వైభవంగా జరిగింది. వేకువజామున సుప్రభాతం, అభిషేకం కార్యక్రమాల అనంతరం... 7 గంటల నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలిలో ఆస్థానం నిర్వహించారు. సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు వేంచేపు చేసి, ప్రత్యేక పూజలందుకున్నారు. ఆలయ పెద్ద జీయర్, చినజీయర్, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు నూతన పట్టువస్త్రాలు స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆస్థాన కైంకర్యాలు నిర్వహించారు. స్వామివారి పాదాల మీద ఉంచిన పంచాంగాన్ని తీసుకుని ఆస్థాన సిద్దాంతి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా ఆలయం మహద్వారం నుంచి గర్భాలయం వరకు లక్ష కట్ పుష్పాలు, 8 టన్నుల సంప్రదాయ పుష్పాలతో చేపట్టిన ప్రత్యేక అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొత్త కాంప్లెక్స్ ప్రారంభం తిరుమలలో శుక్రవారం రూ.300 టికెట్ల భక్తుల కోసం కొత్త కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. భక్తులను శ్రీవారి దర్శనానికి ఈ కాంప్లెక్స్ నుంచి అనుమతించారు. భక్తులకు కొత్త కాంప్లెక్స్లో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. -
లెక్కివ్వకుండా సంబరాలా?
సంక్రాంతి సంబరాలకు వెచ్చించిన డబ్బుకే దిక్కులేదు.. అప్పట్లో ఒక్కో ఎంపీడీఓ రూ.50 వేలు చేతి నుంచి పెట్టుకున్న వైనం ఆ డబ్బుల కోసం ఇప్పటికీ ఎదురు చూపు తాజాగా ఉగాది సంబరాలు నిర్వహించాలంటూ ఆదేశం మండలానికి రూ.20 వేలు ఖర్చు చేయాలని సూచన స్మార్ట్ విలేజ్, జీపీడీపీ కార్యక్రమాల బకాయిలూ అందలేదు.. ఇలాగైతే ఎలా అంటూ లబోదిబోమంటున్న ఎంపీడీఓలు ప్రొద్దుటూరు : ఉగాది సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించాలని ఉన్నట్లుండి గురువారం ఆదేశాలు రావడంతో ఎంపీడీఓలు అసహనానికి గురవుతున్నారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు దుర్ముఖి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు నిర్వహించాలని వైఎస్ఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేత నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఎంపీడీఓలు ఆందోళనకు గురయ్యారు. కనీసం రెండు రోజులు ముందైనా సమాచారం అందజేస్తే బావుండేదని, ఉన్నపళంగా చెబితే ఏర్పాట్లు ఎలా చేయాలని అధికారులు ఒకరినొకరు చర్చించుకుంటున్నారు. చుట్టుపక్కల జిల్లాల్లో మూడు రోజుల ముందుగానే ఎంపీడీఓలకు జిల్లా అధికారులు సమాచారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఉగాది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం గత నెల 28న జీఓ ఆర్టీ నెంబర్ 97ను జారీ చేసింది. అయితే ఇంత వరకు మండల అధికారులకు ఈ సమాచారం అందలేదు. గురువారం సాయంత్రం 3.30 గంటల నుంచి ఎంపీడీఓ, తహశీల్దార్లు, మండల స్థాయి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ అభివృద్ధి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని ముందుగా ఆదేశాలు రావడంతో అధికారులంతా ఆయా తహశీల్దార్ కార్యాలయాల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఎంపీడీఓలకు ఉగాది ఉత్సవాల సమాచారం మెయిల్ ద్వారా అందింది. ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేసి ఉత్సవాలు నిర్వహించమనడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆదేశాలు అందుకున్న అధికారులు కొంత సమయం అయిపోగానే వీడియో కాన్ఫరెన్స్ నుంచి బయటికి వచ్చి ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. ఉగాది ఉత్సవాల నిర్వహణకు పురోహితుల ఏర్పాటు, ప్రజాప్రతినిధుల ఆహ్వానం కోసం ఫోన్లలో బిజీగా గడిపారు. వాస్తవానికి తమ యూనియన్ బలంగా లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని, పక్క జిల్లాల్లో ముందుగా సమాచారం అందించగా, ఇక్కడ 24 గంటలు కూడా సమయం ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయడం ఏమిటని ఈ సందర్భంగా ఓ ఎంపీడీఓ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల కారణంగానే ఇప్పటికే జిల్లాలో ఓ ఎంపీడీఓ మరో విభాగానికి వెళ్లారని, మరొకరు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారని జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లో పనిచేస్తున్న ఓ ఎంపీడీఓ తెలిపారు. గత ఏడాది ఎంపీడీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్ ఆత్మహత్యాయత్నం చేసుకుని కర్నూలు జిల్లాకు బదిలీపై వెళ్లిన తర్వాత నూతన కమిటీని ఎన్నుకోవడంలో జాప్యం జరుగుతోంది. తమలో తాము మాట్లాడుకున్నా ఇంకా యూనియన్ను అధికారికంగా ప్రకటించలేదన్న విష యం కూడా చర్చకు వచ్చింది. ఉగాది ఉత్సవాల నిర్వహణకు మండలానికి రూ.20 వేలు, మున్సిపాలిటీలు ఉన్న మండలానికి రూ.25 వేలు చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రకారం పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, హంస ఉగాది పురస్కారాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎంపీడీఓ, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్తోపాటు ఇతర మండలాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఉత్సవాలకు ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, వార్డు కౌన్సిలర్లను ఆహ్వానించాలని తెలిపారు. ఈ ప్రకారం పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనానికి రూ.5 వేలు, కళాజాత నిర్వహణకు రూ.5 వేలు, ఉగాది పచ్చడికి రూ.1000, మిగిలిన మొత్తం ఇతర ఏర్పాట్లకు కేటాయించారు. సంబంధిత బిల్లులు, ఓచర్లు కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని వారం లోపు డబ్బు విడుదల చేస్తామని సూచించారు. ఉగాది పురస్కారాలు ఏ విధంగా ఇవ్వాలన్న విషయంపై ఉత్తర్వుల్లో స్పష్టత లేదు. ఇప్పటికీ అందని సంక్రాంతి సంబరాల బకాయిలు ప్రభుత్వం జనవరిలో అన్ని మండల కేంద్రాలతోపాటు గ్రామ పంచాయతీల పరిధిలో సంక్రాంతి సంబరాలను నిర్వహించింది. ఇందులో భాగంగా జనవరి 11న గ్రామ పంచాయతీల్లో, 12న మండల కేంద్రాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చాలా ప్రాంతాల్లో ఎంపీడీఓలు నగదు బహుమతులు అందజేశారు. ఈ ప్రకారం మండలానికి రూ.25 వేలు, మున్సిపాలిటీలు ఉన్న మండల కేంద్రాలకు రూ.30 వేలు చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పశు ప్రదర్శన, మేలు జాతి పశువుల ఎంపిక, గాలి పటాల పోటీలు, కబడ్డీ పోటీలు, వంటకాల పోటీలు, రంగవళ్లుల పోటీలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి ప్రతి మండలానికి రూ.లక్ష వరకు ఖర్చు చేశారు. ఇంత వరకు ఈ డ బ్బు ఎంపీడీఓలకు అందలేదు. గత నెలలో స్మార్ట్ విలే జి, స్మార్ట్ వార్డు కార్యక్రమాలకు సంబంధించి మండల కేంద్రాల్లో ఎంపీడీఓల అధ్యక్షతన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇందుకోసం మండలానికి రూ.25 వేల వరకు కేటాయించారు. మండల స్థాయి అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వీరికి ఒక్కొక్కరికి రూ.110 చొప్పున కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి 15 మందిని ఆహ్వానించి శిక్షణా శిబిరాలను నిర్వహించారు. ఈ ప్రకారం ప్రతి సభ్యునికి భోజనంతోపాటు పెన్ను, పుస్తకం తదితర వాటికి రూ.150 చొప్పున ప్రభుత్వం కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం ఎంపీడీఓలు రూ.35 వేల వరకు ఖర్చు చేశారు. ఈ డబ్బును ఎంపీడీఓలే చేతి నుంచి ఖర్చు చేశారు. వీరికి ప్రభుత్వం డబ్బు చెల్లించాల్సి ఉంది. పాత బకాయిలు ఇవ్వకుండానే ప్రస్తుతం మళ్లీ ఉగాది ఉత్సవాలు అనే సరికి వారికి గుబులు పట్టుకుంది. -
తిరుమలలో అర్జిత సేవలు రద్దు
తిరుమల: తిరుమలలో ఉగాది ఆస్థానం సందర్భంగా శుక్రవారం జరగాల్సిన అన్నీ అర్జిత సేవలను రద్దు చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఆలయ ప్రాంగణంలో ఆస్థానం నిర్వహించనున్నారు. బంగారు వాకిలి చెంత ఆలయ ఆర్చకులు ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం శ్రీ దుర్ముఖినామ సంవత్సర పంచాంగ శ్రవణం కార్యక్రమం జరగనుం -
నేడు లోటస్పాండ్లో ఉగాది వేడుకలు
సాక్షి, హైదరాబాద్: లోటస్పాండ్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తారు. -
గరగ నృత్యాలతో చిందేసిన చింతలూరు
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో గరగల జాతరలో ఆనందం ఉప్పొంగింది. గరగ నృత్యాలతో బుధవారం చింతలూరు చిందేసింది. ప్రతి అడుగులో జానపదం ఝళ్లుమంది. అసాదుల గజ్జెల సవ్వడిలో గోదావరి జిల్లాల సంస్కృతి పల్లవించింది. నూకాంబిక అమ్మవారి ఉగాది సంబరాల్లో భాగంగా డప్పుల మోతలు.. గరగ నృత్యాలతో చింతలూరు సంబరాల్లో మునిగితేలింది. పౌర్ణమి నుంచి చింతలూరులో జరుగుతున్న ఈ గరగ నృత్యాల కోలాహలం బుధవారం రాత్రి ముగిసింది. ఇక్కడి నూకాంబిక అమ్మవారిని స్థానిక చింతలూరి వంశస్థుల ఆడపడుచుగా భావిస్తారు. అందుకే గరగ వేడుక చివరి రోజున సంప్రదాయం ప్రకారం.. చింతలూరు వెంకట నీలాచలం ఇంట్లో మొక్కుబడి గరగ స్వీకరించి, చింతలూరు పూర్ణ ప్రభాకరరావు నివాసంలో పూల గరగ అందుకుంది నూకాలమ్మ తల్లి. అనంతరం గరగల ఆలయ ప్రవేశ ఘట్టం వైభవంగా జరిగింది. గ్రామదేవత మూలవిరాట్టుకు ప్రతిరూపంగా గరగలను భావించి.. పర్వదినాల్లో తీర్థ జాతరల్లో బయటకు తీసుకువస్తారు. గరగల జాతరకు శతాబ్దాల చరిత్ర: గర్భగుడిలో అమ్మవారిని అలంకరించినట్టుగానే చీర, గాజులు పూలు, పసుపు కుంకుమలతో ముస్తాబుచేసి గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు. గ్రామదేవతను నమ్ముకున్న ఆసాదులు ఉగాదికి దాదాపు నెలరోజుల ముందు నుంచి గరగ నృత్యాలతో గ్రామంలో ఉత్సాహాన్ని నింపుతారు. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 35 గ్రామాల్లో 500మంది వరకు ఆసాదులున్నట్టు తెలుస్తోంది. చింతలూరు గరగలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచాయి. గతంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు, దేవి తదితర సినిమాల్లో చింతలూరు గరగ కళాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఇక చింతలూరు నూకాలమ్మ జాతరలో ఈ ఏడాది కూడా గరగ నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గరగల రూపంలో సాక్షత్తూ నూకాలమ్మే తమ ఇంటికి వచ్చిందని భావిస్తూ.. గ్రామస్తులు పసుపు కుంకుమలతో పూజించారు. చింతలూరివారి ఇలవేల్పు తమపాలిట కొంగుబంగారమై చింతలు తీరుస్తుందని పొంగిపోయారు. -
దుర్ముఖి మంచే చేస్తుంది: గవర్నర్
రాజ్భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు * సీఎంలు కేసీఆర్, చంద్రబాబు హాజరు * ఇదే దుర్ముఖి గొప్పదనమన్న గవర్నర్ * రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలి * తెలుగు ప్రజలకు శాంతి సౌభాగ్యాలు కలగాలి: కేసీఆర్ * కష్టాలు తీరాలి, సుఖసంతోషాలు కలగాలి: చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: దుర్ముఖి అనగానే భయమేస్తుంది గానీ, అది మంచే చేస్తుందని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ వ్యాఖ్యానించారు. ‘‘దుర్ముఖి నరసింహావతారం. నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించి లోకకల్యాణం చేశాడు. అలాగే దుర్ముఖినామ సంవత్సరంలో కూడా అన్ని మంచి పనులే జరుగుతాయి’’ అని అభిప్రాయపడ్డారు. శ్రీ దుర్ముఖినామ ఉగాది వేడుకలు గురువారం రాజ్భవన్లో గవర్నర్ సారథ్యంలో ఘనంగా జరిగాయి. సాయంత్రం ఆరింటి నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా జరిగిన ఈ అధికారిక వేడుకల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, ఏపీ సీఎం చంద్రబాబు, ఇరు రాష్ట్రాల మంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వంలా ఈ ఉగాది వేడుకల్లో ఇరు రాష్ట్రాల వారూ పాల్గొన్నారు. అదే దుర్ముఖి గొప్పదనం’’ అని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో రెండు రాష్ట్రాలూ ఎంతో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ‘‘రాజ్భవన్లో ఒకసారి ముందుకు పోతేనే మంచిదని ఒక రోజు ముందే వేడుకలు జరిపాం’’ అన్నారు. ఇద్దరు సీఎంలకు గవర్నర్ శాలువాలు కప్పి సత్కరించారు. రాజ్భవన్లో వేడుకలు హర్షణీయం: సీఎం కేసీఆర్ తెలుగు సంప్రదాయాన్ని గౌరవిస్తూ రాజ్భవన్లో ఉగాది వేడుకలు నిర్వహించడం సంతోషదాయకమని కే సీఆర్ పేర్కొన్నారు. గవర్నర్ తమిళుడైనా ఉగాది వేడుకలను అధికారికంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈసారి కరువు పరిస్థితి ఉండదని, మంచి వర్షాలు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాంగమే గాక సైన్సు కూడా అదే చెబుతోందన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి. వారికి శాంతి సౌభాగ్యాలు కలగాలి’’ అని ఆయన ఆకాంక్షించారు. అచ్చం తెలుగువారిలా గవర్నర్: బాబు తెలుగు వారందరికీ ఉగాది ప్రత్యేకమని చంద్రబాబు అన్నారు. ‘‘పంచాంగశ్రవణం ద్వారా మంచి చెడులను విశ్లేషించుకుని ముందుకెళ్లే అవకాశముంటుంది. మానసికంగా సిద్ధం కావడానికీ ఉపయోగపడుతుంది. ఒకరోజు ముందుగానే ఉగాది వేడుకలు జరిపిన గవర్నర్కు ధన్యవాదాలు తెలుపుతున్నా’’ అన్నారు. ఈ ఏడాది తెలుగువారందరికీ కష్టాలు తీరి, వారు సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ‘‘కొత్త రాష్ట్రం అంటే కొత్త సంసారం లాంటిది. అనేక సమస్యలున్నా తెలుగు ప్రజల ఆశీస్సులతో మంచి రాష్ట్రంగా తయారు చేసుకునేందుకు కష్టపడతాం. ఏపీ అభివృద్ధికి గవర్నర్ సహకారమందిస్తూ ప్రోత్సహిస్తున్నారు’’ అన్నారు. వేడుకల్లో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్, కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, సీఎల్పీ నేత జానారె డ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి దంపతులు, ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సినీ నటుడు చిరంజీవి దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఉగాది వేడుకల్లో జుగల్బందీ, భరతనాట్యంతో పాటు ఒగ్గు డోళ్ల నృత్యం తదితరాలు ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది శుభప్రదమే దుర్ముఖి అనగానే చెడుగా, విపరీతార్థం తీసుకోవద్దని రాజ్భవన్ ఉగాది వేడుకల్లో పంచాంగశ్రవణం చేసిన కొండగడప శ్రీవిద్యా శ్రీధర్శర్మ చెప్పారు. ఈ ఏడాది శుభప్రదంగా ఉంటుందన్నారు. గతం కంటే భిన్నంగా లేకున్నా, ప్రమాదకరంగా కూడా లేదని చెప్పారు. ‘‘వాతావరణం విభిన్నంగా ఉంటుంది. స్త్రీల ఉత్పత్తి 15 శాతం, పురుష ఉత్పత్తి 9 శాతం ఉంటాయి. భ్రూణ హత్యలుండవు. స్త్రీలపై దాడులు తగ్గుతాయి. మేఘాధిపతి బుధుడు కావడంతో వర్షాలు బాగా పడతాయి. వర్షాభావ పరిస్థితులుండవు. ఏడాది ద్వితీయార్ధంలో సెప్టెంబరు నుంచి వర్షాలు ఎక్కువ కురుస్తాయి. ఈ ఏడాది రెండు గ్రహణాలున్నా అవి తెలుగు రాష్ట్ర్రాల్లో కనిపించవు. ఈ ఏడాది ఆగస్టు 11న కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. విదేశాల్లో సామూహిక ఉపద్రవాలు సంభవిస్తాయి’’ అని చెప్పారు. -
బెల్ఫాస్ట్లో నిటా ఉగాది సంబరాలు
నార్తర్న్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్(నిటా) ఆధ్వర్యంలో ఈ నెల 21న బెల్ఫాస్ట్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని బెల్ఫాస్ట్ లార్డ్ మేయర్ నికోలా మల్లోన్, లార్డ్ దాల్జిత్ రానా ప్రారంబించారు. ప్రముఖ గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి తమ గాన మధుర్యుం తో అలరించారు. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది హాజరయ్యారు. నిటా అసోసియేషన్ వాలంటీర్స్ కుమార్ జల్లూరి, డాక్టర్ రఘు రెడ్డి, రమేష్ గుమ్మడవెల్లి, సురేష్ గోపిడి, శ్రీ వెంకట చౌడల, సతీష్ దారం, శ్రీకాంత్ గుండం, శ్రీనివాస్ కోటప్రోలు, రజినికర్, శశాంక్, గోపి, నాగార్జున, నగేష్, కళ్యాణ్, శర్మ, ఉష పేరి, సుమ, కోమల,పూర్ణిమ, మౌనిక, జయశ్రీ, శ్రీ పద్మ, నిహారిక, సౌజన్య, జ్యోతి కోటప్రోలు, పవిత్ర, సుష్మిత, సత్య జల్లూరి తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఐర్లండ్లో ఘనంగా 'ఉగాది వేడుకలు'
ఐర్లండ్: మన్మద నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఐర్లండ్లోని ఐర్లండ్ తెలుగు సమాజం అధ్వర్యంలో 'ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. డబ్లిన్లోని హిలీక్స్ హాల్లో జరిగిన ఈ ఉగాది వేడుకల్లో 500మంది వరకు తెలుగువారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలుగు సినీగాయనీ, సునీత, సింపూలు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వారి పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ అంబాసిడర్ రాధిక లోకేష్ హాజరయ్యారు. మన్మద నామ సంవత్సర ఉగాది వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారికి ఐర్లండ్ తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీధర్ వైకుంఠం, నిర్వహకులు సత్యప్రకాష్ చవడవరపు, మహేష్ అలిమెల్లి, అరవింద్ కరింగుల, రామకృష్ణ మదమంచి, శ్రీనివాస్ కోసనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఉత్కంఠభరితంగా పిడకల సమరం
కర్నూలు: ఉగాది వేడుకల్లో భాగంగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఆదివారం పిడకల సమరం ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రేమ వ్యవహరంలో వీరభద్ర స్వామి, కాళికాదేవి మధ్య ఏర్పడిన విభేదాలే పిడకల సమరానికి దారి తీసిందని గ్రామస్తులు చెబుతున్నారు. పిడ కల సమరాన్ని(పెద్ద నుగ్గులాటను) చూడటానికి కర్నాటక, మహారాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. అలాగే కల్లూరులోని శ్రీచౌడేశ్వరిదేవి ఆలయం చుట్టూ బురదలో గార్ధబాలతో ప్రదక్షిణ నిర్వహించారు. రజకుల కుటుంబాలపై అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు భక్తులు చెప్పారు. -
రాజధాని నిర్మాణం ముందుకు సాగదు
విపక్షాలకు ప్రభుత్వం తలొగ్గాల్సిందే ఇందిరా భవన్లో హరికృష్ణ శర్మ పంచాంగ శ్రవణం హైదరాబాద్: రాజధాని నిర్మాణం ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ముందుకు సాగదని బ్రహ్మశ్రీ మేడిచెర్ల హరికృష్ణ శర్మ స్పష్టం చేశారు. ఉగాది పండుగ సందర్భంగా ఇందిరా భవన్లో శనివారం ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల పక్షాన పోరాటాలు చేయడం వల్లే ప్రతిపక్ష పార్టీలు బలపడతాయని చెప్పారు. అలాగే ప్రతిపక్ష పార్టీల ఒత్తిడికి ప్రభుత్వాలు తలొగ్గక తప్పదని వివరించారు. ప్రభుత్వాల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొననుందని దీంతో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని జోస్యం చెప్పారు. అధికార, ప్రతిపక్ష సభ్యులకు సంయమనం కల్పించాలని కోరుతూ.. కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి విపక్షనేత సి.రామచంద్రయ్య ప్రార్థించారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తూ ప్రతిపక్షాలు చేసే సూచనలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఒంటెత్తు పోకడలతో ముందుకెళ్లడం మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు కరువు, ఇతర కష్టాల నుంచి బయటపడి సుఖ శాంతులతో మెలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మాదాసు గంగాధరం, జంగా గౌతమ్, గిడుగు రుద్రరాజులు పాల్గొన్నారు. -
ఉట్టిపడిన తెలుగుదనం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నవ్యాంధ్ర రాజధానిలో తెలుగు సంస్కృతి తొణికిసలాడింది. కళారూపాల్లో సంప్రదాయం ఉట్టిపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం తుళ్లూరు మండలం అనంతవరంలో నిర్వహించిన ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు తంగిరాల వెంకట పూర్ణప్రసాద్ పంచాంగ శ్రవణం చేయగా, వ్యవసాయ, ఉద్వానవన పంచాంగాల ఆవిష్కరణ జరిగింది. కూచిపూడి విశిష్టతను తెలియపరిచే కూడిపూడి నాట్యారామం వెబ్సైట్ను ఆవిష్కరించారు. తొలుత ముఖ్యమంత్రి అనంతవరం కొండపై కొలువైన వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు ముగించి వేదిక వద్దకు 10.35 గంటలకు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి ఐవైఆర్ కృష్ణారావు అనంతరంలో ఉగాది వేడుకలు నిర్వహణలోని ఆవశ్యకతను వివరించారు. కృష్ణానదికి సమీపంలో ఏర్పాటు కానున్న నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు వలన నదికి ఇరువైపులా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. రానున్న సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని టీటీడీ పండితులు తంగిరాల పేర్కొన్నారు. వర్షపాతం తక్కువుగా ఉన్నప్పటికీ పంటల దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం లభిస్తుందని పేర్కొన్నారు. వృవసాయం, క్షీర సంపద వృద్ధి.. అనంతరం వ్యవసాయ పంచాంగాన్ని గుంటూరు హిందూ కళాశాల అధ్యాపకులు డీఎన్ దీక్షితులు చదవి వినిపించారు. రానున్న సంవత్సరంలో వ్యవసాయ అభివృద్ధి, క్షీరసంపద అధికంగా జరుగుతుందని తెలిపారు. ఆ తరువాత ఉద్యానవన పంచాంగం, కూచిపూడి విశిష్టతను తెలియపరిచే వెబ్సైట్, జర్నలిస్టుల డైరీల ఆవిష్కరణలు జరిగాయి. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు పల్లె రఘునాధరెడ్డి, సిద్దా రాఘవరావు, మాణిక్యాలరావు, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తదితరులు ప్రసంగించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఈ సందర్భంగా మంత్రులంతా కృతజ్ఞతులు తెలిపారు. ముఖ్యమంత్రిపై నమ్మకంతో భూములు ఇచ్చిన రైతులకు అన్ని వేళలా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని, రాజధాని నిర్మాణం, ఉపాధి అవకాశాల్లో స్థానికులకు, రైతులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం చేపట్టనున్న చర్యలను వివరించారు. రాజధాని శంకుస్థాపన, నిర్మాణ పనుల ప్రారంభం తదితర వివరాలను వెల్లడించారు. పురస్కారాల ప్రదానం ఈ సందర్భంగానే 32 మందికి కళారత్న(హంస), 67 మందికి ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రదానం చేసింది. ప్రముఖ వాగ్గేయకారులు డాక్టర్ బాలాంత్రపు రజనీ కాంతారావుకు తెలుగు వెలుగు విశిష్ట పురస్కారాన్ని అందించి సత్కరించారు. పురస్కారంలో భాగంగా రూ. లక్ష నగదు, జ్ఞాపికను ప్రదానం చేశారు. హంస పురస్కార గ్రహీతలకు రూ. 50, ఉగాది పురస్కార గ్రహీతలకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతిని అందజేశారు. విచ్చేసిన ఆహూతులకు ఉగాది పచ్చడి, ఆల్పాహారం, లస్పీ, మంచినీటి సౌకర్యాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఉగాది వేడుకల ఆవరణ ప్రారంభంలో వెలవెల బోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించే ఆనవాయితీ ఉండటంతో పూజలు పూర్తయిన తరువాతగాని వేడుక వద్దకు ప్రజలు రాలేదు. సుమారు 50 వేల మందికి ఈ ఆవరణలో సౌకర్యాలు కల్పించినా, కార్యక్రమం ప్రారంభంలో ఐదారువేలకు మించి ప్రజలు లేరు. దీనితో అధికారులు, ప్రజాప్రతినిధులు హుటాహుటిన ఆర్టీసీ బస్లను గ్రామాల్లోకి పంపి డ్వాక్రా గ్రూపు సభ్యులను కార్యక్రమానికి వచ్చే ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఉగాది వేడుకల కార్యక్రమం వైభవంగానే పూర్తికావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, శాసన సభ్యులు తెనాలి శ్రావణ్కుమార్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్లు వేడుకల ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
పాలకులకు పెను సవాళ్లే..
‘మన్మథ’ పంచాంగ శ్రవణంలో రామచంద్రశాస్త్రి వెల్లడి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు పోరుబాటలో ప్రజలు.. జనం పక్షాన విపక్షం రాష్ట్రంలో కొత్త పార్టీలకు అవకాశం లేదు యువతకు బాధ్యతలు అప్పగించేందుకు జనం మొగ్గు సాక్షి, హైదరాబాద్: ‘మన్మథ’ నామ సంవత్సరంలో ప్రభుత్వ పాలకులు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రముఖ పంచాంగకర్త మారేపల్లి రామచంద్రశాస్త్రి పేర్కొన్నారు. రాజు స్థానంలోకి శని, మంత్రి స్థానంలోకి కుజుడు చేరడమే అందుకు కారణమని చెప్పారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ శ్రవణం చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గట్టిగా పోరాటాలు చేస్తేనే దేన్నైనా సాధించగలమనే మనస్తత్వంతో ప్రజలుంటారని, ప్రతిపక్షం కూడా జనం పక్షాన నిలబడుతుందని పంచాంగ కర్త పేర్కొన్నారు. వీరిద్దరూ ఏకం కావడానికి ముందే ప్రభుత్వం మేలుకుని ప్రజా సమస్యలను నెరవేరిస్తే చాలా మంచిదన్నారు. ‘ఈ సంవత్సరం అంతా చాలా వివాదాలొస్తాయి. రాజకీయంగా ఇంకా రసవత్తరంగా ఉంటుంది. పాలించే వారికిది ఛాలెంజింగ్ కాలం. ప్రతిపక్షం అంటే అన్ని చోట్లా ఉన్నట్లుగా ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నట్లుగా ఇక్కడ ఉండదు. ఆంధ్రప్రదేశ్లో మొన్నటి ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య చాలా స్వల్ప తేడా ఉంది. మన్మథ నామ సంవత్సరంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందుతుంది. గ్రామీణ స్థాయి నుంచీ పార్టీ పటిష్టం అవుతుంది. పార్టీకి బ్రహ్మాండమైన ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంది. ఎన్టీఆర్, వైఎస్ఆర్ తరువాత అంతటి ప్రజాదరణ వైఎస్ జగన్మోహన్రెడ్డికి లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పార్టీకి అవకాశమే లేదు. కొత్త పార్టీ పెట్టాలనుకునే వారు మరో రాష్ట్రానికి వెళితే మంచిది. తెలంగాణలో కూడా వైఎస్సార్సీపీకి మంచి భవిష్యత్తు ఉంది. ప్రపంచంలో తెలుగువారున్న చోట్లల్లా వైఎస్ అభిమానులున్నారు. వైఎస్సార్ అభిమానులు ఉన్న చోట్లల్లా వైఎస్సార్సీపీ బలపడుతుంది. ఈ ఏడాది యువతకు భవిత బాగుంటుంది. యువతకు బాధ్యతలు అప్పగించడానికే ప్రజలు ఇష్టపడతారు. ‘ఫ్యాన్’కు ‘ఫ్యాన్స్’ ఈ ఏడాదిలో పెరుగుతారు. పార్టీ శ్రేణులు ఏ సంకల్పంతో ఉన్నారో దాన్ని నెరవేర్చే భారాన్ని ప్రజలే తమపై వేసుకుంటారు. పార్టీలు మేనిఫెస్టోలోని అంశాలను మర్చిపోతే ప్రజలు, మీడియా, మేధావులు ఊరుకోరు. లోపల ఒక మాట, బయట ఇంకో మాట మాట్లాడే రాజకీయ నాయకులను ప్రజలు బాగా పరిశీలిస్తారు. లోపల, బయట ఒకే మాదిరిగా మాట్లాడే వారినే ప్రజలు విశ్వసిస్తారు. అందుకే రాజకీయ నేతలు మాట్లాడే మాటలు సూటిగా ఉండాలి. విశ్వవ్యాప్తంగా కూడా రాజకీయంగా పెనుమార్పులు వస్తాయి. పెళ్లికాని ప్రసాదులకు (బ్రహ్మచారులకు) ఈ ఏడాది గడ్డుకాలం. సోలో బతుకు మంచిది అనుకుంటే కుదరదు. సంసార జీవితంలో ఉన్న వారికి శుభం జరుగుతుంది. బంగారం ధర పెరుగుతుంది. షేర్మార్కెట్ ప్రతి ఏడాది మాదిరిగానే మన్మథ నామ సంవత్సరంలో కూడా ఒడిదుడుకులకు లోనవుతుంది. మత్స్య, కోళ్ల పరిశ్రమల వారు జాగ్రత్తగా ఉండాలి. నష్టాలొచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా రంగం ఒడిదుడుకులకు లోనవుతుంది. పోలవరం ప్రాజెక్టు నాలుగేళ్ల ఒక్క నెల తరువాత కొంత ఆలస్యంగా ప్రారంభం అవుతుంది’ అని పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. జగన్కు పచ్చడి తినిపించిన చిన్నారులు ఉగాది సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. రామచంద్రశాస్త్రి వారికి పంచాం గాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమం ముగిశాక చిన్నారులు జగన్కు ఉగాది పచ్చడిని తినిపించారు. కార్యక్రమంలో పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, నెల్లూరు ఎమ్మెల్యే పి.అనిల్కుమార్ యాదవ్, ముఖ్య నేతలు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎస్.రామకృష్ణారెడ్డి, పీఎన్వీ ప్రసాద్, ఇతర నేతలు కొండా రాఘవరెడ్డి, చల్లా మధుసూదన్రెడ్డి, మేడపాటి వెంకట్, కోటింరెడ్డి వినయ్రెడ్డి, కొల్లి నిర్మల, డాక్టర్ ప్రపుల్లరెడ్డి, అమృతాసాగర్, డాక్టర్ ఎ.భాస్కర్రెడ్డి, కె.ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సూపర్హిట్
కొత్త రాష్ట్రం భవిత అద్భుతంగా ఉంటుందన్న కేసీఆర్ దేవాదాయ శాఖ ఉగాది వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి గత ఉగాదికి తీవ్ర విద్యుత్ సమస్య.. ఇప్పుడు వెలుగుజిలుగులు మిగులు కరెంటు దిశగా సాగుతున్న రాష్ట్రం కొత్త పారిశ్రామిక విధానంతో భారీగా పెట్టుబడుల రాక హైదరాబాద్ ముంగిట క్యూ కట్టనున్న ప్రపంచం పేదల సంక్షేమం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి దైవబలం తోడుగా ముందుకుసాగుతామన్న సీఎం సాక్షి, హైదరాబాద్: గత ఉగాది నాటికి తీవ్ర స్థాయిలో ఉన్న విద్యుత్ సమస్యలు తొమ్మిది నెలలుగా రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తొలగిపోయాయని, ఇప్పుడు రాష్ర్టం వెలుగుజిలుగులతో నిండిపోయిందని సీఎం కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. భగవంతుడు ప్రసాదించిన సకల శక్తులను సమీకరించుకుని మిగులు కరెంటు సాధించుకునే దిశగా రాష్ర్టం సాగుతోందన్నారు. సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను ప్రాధాన్యాంశాలుగా ప్రభుత్వం గుర్తించిందని, రాష్ర్టం ఇక పురోగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం రవీంద్రభారతిలో దేవాదాయ శాఖ నిర్వహించిన మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగకర్త యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. 60 సంవత్సరాల తెలుగు పంచాంగ కాలచక్రంలో మన్మథనామ సంవత్సరం 29వదని, దేశంలో తెలంగాణ కూడా 29వ రాష్ట్రంగా ఏర్పడిందని, కొత్త రాష్ట్రం భవిత అద్భుతంగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దశాబ్దంన్నర కాలం ఉద్యమాలతో ముందుకు సాగి, అవమానాలను అధిగమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుని తెలుగు సంవత్సరాదిని తెలంగాణలో గర్వంగా నిర్వహించుకుంటున్నామని, భవిష్యత్తులో రాష్ట్రం సంతోషంగా ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమమే సర్కారు లక్ష్యం పేదలు కడుపునిండా తిన్నప్పుడే నిజమైన పండుగ అని, తాము క్షేమంగా ఉంటామన్న భావన ప్రజల్లో వచ్చినప్పుడు అది నిజమైన రాష్ట్రమని, అందుకే పేదల సంక్షేమం లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం వివరించారు. ఆర్థికవేత్తలకు గిట్టకపోయినా పేదల సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే నిర్ణయాలను రాష్ర్టంలో అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. హాస్టళ్లలో సన్నబియ్యం పెట్టాలనే ఆలోచన గతంలో ఎవరూ చేయలేదని, ఇప్పుడు అమలు చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని చూడబోతున్నారని పేర్కొన్నారు. రాష్ర్టంలో 65 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ ప్రాంతాన్ని విత్తనాభివృద్ధి భాండాగారంగా అభివృద్ధి చేయబోతున్నామన్నారు. గొంతెండిపోయి కరువు, ఫ్లోరైడ్తో అల్లాడుతున్న మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు మేలు చేసేందుకు మరో వారం రోజుల్లో పాలమూరు, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసే ఆలోచనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కృష్ణ, గోదావరి జలాల్లో చట్టబద్ధంగా రావాల్సిన వాటా తెలంగాణకు దక్కలేదని, అందుకోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్థిక మంత్రికి భయం అక్కర్లేదు.. ‘నాది కర్కాటక రాశి. ఆదాయం 5, వ్యయం 5గా ఉంటుందని సిద్ధాంతి చెప్పారు. నాకేం ఢోకాలేదు. అక్కడికక్కడికి సున్నకు సున్నాగా ఉంటుంది. మా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కు భయం అక్కర్లేదు, ఏం బాకీపడకుండా చూస్త’ అని ఆదాయ వ్యయాల ఫలితాలపై ముఖ్యమంత్రి చమత్కరించారు. అలాగే పంచాంగ శ్రవణంలో వానల విషయంలో సిద్ధాంతి అయోమయంలో ఉంచారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘వానలు పడ్తయో, పడయో ఆయన ఎటూ తేల్చలేదు. కానీ అంతిమంగా తేల్చిందేమంటే ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వచ్ఛమైన మనసుతో ముందుకు సాగితే దైవబలం తోడవుతుందన్నారు’ అని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో గోదావరి పుష్కరాలు నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. విమర్శలు లేకుండా.. సాధారణంగా రవీంద్రభారతి వేదిక మీదుగా ప్రసంగించే సమయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం భిన్నంగా ఉంటుంది. చతురోక్తులు, ఆంధ్ర ప్రాంత నేతలపై వ్యంగ్యాస్త్రాలతో సాగడం ఇటీవల పలు సందర్భాల్లో కనిపించింది. కానీ ఉగాది వేడుకలో ఉపన్యాసం మాత్రం అందుకు భిన్నంగా సాగింది. ఎక్కడా పొరుగు రాష్ట్ర నేతలు, ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయలేదు. చమక్కులు, చలోక్తులు కూడా లేకుండా సీఎం మాట్లాడారు. పెట్టుబడులకు ప్రపంచం క్యూ కడుతుంది.. ఈ ఏడాది పారిశ్రామిక రంగం అద్భుతంగా ఎదుగుతుందని పంచాంగ శ్రవణం లో సిద్ధాంతి చెప్పారని, అది నిజమవుతుంద ని సీఎం అన్నారు. ‘ప్రపంచంలో ఎక్కడా లేని పారిశ్రామిక విధానం రూపొందించాం. ఇది తమాషాకు చెబుతున్న మాటకాదు, ఇలాంటిది ప్రపంచంలోనే లేదు. త్వరలోనే దాన్ని ప్రకటించబోతున్నం. ఇటీవల నేను సింగపూర్ వెళ్లిన సందర్భంలో దీని ప్రస్తావన వచ్చినప్పుడు.. రాష్ర్టం రూపొందించిన కొత్త విధానంలో 50 శాతం అమలు చేసినా ప్రపంచమంతా హైదరాబాద్కు క్యూ కడుతుందని అక్కడి వారన్నారు. వనరులను సరిగా సద్వినియోగం చేసుకోగలిగితే తెలంగాణ అద్భుతంగా వర్ధిల్లుతుంది, పెట్టుబడుల వరదతో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టమవడమే కాకుండా యువతకు అద్భుత ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని కేసీఆర్ అన్నారు. -
రుణమాఫీ ఖాతాల్లో భారీ కోత
రుణమాఫీపై సీఎం కోతలు కోసిన కొద్దిసేపటికే రైతుల ఖాతాల కుదింపు ఉగాది వేళ ప్రజలకు సంతోషాన్ని దూరం చేసిన బాబు సర్కార్ గుంటూరు: నూతన తెలుగు సంవత్సరాది కోతలతో ప్రారంభమైంది. శనివారం తుళ్లురు మండలం అనంతవరంలో జరిగిన ఉగాది వేడుకల్లో పట్టిసీమ, రాజధాని నిర్మాణం, బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల కోతలు కోసిన కొద్దిసేపటికే.. రుణమాఫీలో భారీ కోతను విధించేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమైంది. అందుకు వీలుగా నిబంధనల పేరుతో దాదాపు 30 లక్షల రైతుల ఖాతాలను కుదించింది. ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.18,500 కోట్లు రుణమాఫీ, వడ్డీకింద రూ.2500 కోట్లు వడ్డీ కింద.. మొత్తం కలిపి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చెల్లింపులు చేశామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పండ్ల తోటల రుణ మాఫీకి మూడు వేల కోట్లతోపాటు డ్వాక్రా సంఘాల్లోని ఒక్కో మహిళకు రూ.10 వేలు చెల్లించేందుకు అవసరమయ్యే రూ10 వేల కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు సీఎం అయ్యేనాటికి వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు ఉండగా, శనివారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం రైతులకు చెల్లించింది కేవలం రూ.18,500 కోట్లేనని తేలింది. మరో విషయమేంమంటే 2015-16 బడ్జెట్ లో బాబు సర్కార్ రుణమాఫీకి కేటాయించింది కేవలం 4,300 కోట్లు మాత్రమే. మరోవైపు రుణమాఫీలో భారీ కోత విధించే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 83.28 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లోనుంచి దాదాపు 30 లక్షల ఖాతాలను కుదించారు. ఆధార్ కార్డు అనుసంధానం, ఇతర నిబంధనలను బూచిగా చూపి మొత్తం ఖాతాల సంఖ్యను 51.45 లక్షలకు తగ్గించివేశారు. రైతులకు చెందిన బంగారం, పాసు పుస్తకాలు కూడా నాలుగేళ్ల వరకు బ్యాంకుల్లో ఉండవలసిందేననీ అంశాన్ని కూడా నిబంధనల్లో చేర్చారు. దీంతో అప్పుల కోసం రైతులు ప్రైవేటు వడ్డీవ్యాపారుల్ని ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. -
'ప్రతి నెల ఒక రోజు జీతం రాజధానికి ఇవ్వాలి'
-
రవీంద్రభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు
-
'ప్రతి నెల ఒక రోజు జీతం రాజధానికి ఇవ్వాలి'
గుంటూరు: ఉగాది వేడుకల్లో భాగంగా రాజధానిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా తుళ్లురు మండలం అనంతవరంలో కొత్త ప్రకటన చేశారు. రాజధాని నిర్మాణానికి త్వరలో విరాళాల సేకరణ కోసం కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతినెల సంపాదనలో ఒక రోజు వేతనాన్ని రాజధానికి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే విరాళాలను ప్రతినెలా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ప్రతి ఊరు, ప్రతి వ్యక్తి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. 2018 జూన్ 2 లోపు రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణానికి ఉభయగోదావరి జిల్లాల ప్రజల పూర్తి అంగీకారం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పట్టిసీమ ఎలా కడతారని తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగుతున్నారు... సముద్రంలోకి వెళ్లే గోదావరి జలాలను వాడుకునే స్వేచ్ఛ మనకుందని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరు చెప్పినా వినను... పట్టిసీ ప్రాజెక్టు కట్టి తీరుతానన్నారు. రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుంది... ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉందని... తొందరలోనే రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు. నేను చేసిన అభివృద్ధి వల్లే తెలంగాణకు ఆదాయం వస్తుందని చంద్రబాబు చెప్పారు. -
గాంధీభవన్లో ఘనంగా ఉగాది వేడుకలు
హైదరాబాద్ : గాంధీభవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు శనివారం ఘనం జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, భట్టి విక్రమార్క, డీఎస్తోపాటు పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరుకూరి శ్రీనివాసమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవహారాల్లో స్తబ్దత ఉంటుందన్నారు. అలాగే ప్రతిపక్షాలు స్థిరత్వాన్ని కోల్పోతాయని తెలిపారు. రాజకీయ లోపాలు ఉంటాయని చెప్పారు. అన్ని రంగాల్లోనూ మిశ్రమ ఫలితాలు ఉంటాయని చిరుకూరి శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు
-
ఉగాది వేడుకల్లో విజయమ్మ, వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
-
తూళ్లూరులో ఉగాది వేడుకలు!
-
రాజ్భవన్లో ఉగాది వేడుకలు
హాజరైన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కేసీఆర్, చంద్రబాబు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు పజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి: కేసీఆర్ తెలుగు ప్రజలంతా ఉజ్వల భవిష్యత్ సాధించాలి: చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: మన్మథ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని రాజ్భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, తెలంగాణ, ఏపీ సీఎంలు కె.చంద్రశేఖర్రావు, చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ముగ్గురు అతిథులను ఆత్మీయంగా సత్కరించారు. ఇరు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారందరికీ గవర్నర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కూడా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది వేడుకల ద్వారా గవర్నర్ చక్కని సంప్రదాయానికి శ్రీకారం చుట్టారంటూ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణలో తొలి ఉగాది పండుగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని, కొత్త ఏడాదిలో తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. జయ నామ సంవత్సరంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి, కొత్త రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర సత్వర అభివృద్ధికి ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ... తెలుగు ప్రజల మధ్య విడదీయలేని అనుబంధం ఉందని బాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా, ఉజ్జ్వల భవిష్యత్ను సాధించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో భాగంగా శృంగేరీ ఆస్థాన పండితుడు సంతోష్కుమార్ పంచాగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పలు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, పేరిణి నృత్యం అందరినీ ఆకట్టుకున్నాయి. రెండు దశాబ్దాల అనుబంధం: కలాం తెలుగు రాష్ట్రాలతో తనకు రెండు దశాబ్దాల అనుబంధం ఉందని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారు. ప్రజలందరికీ ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 1970లో శ్రీహరికోటలో పనిచేయటంతో పాటు.. 1982 నుంచి పదేళ్లపాటు హైదరాబాద్లోని డీఆర్డీఏలో శాస్త్రవేత్తగా పనిచేసిన తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అగ్ని, పృథ్వీ క్షిపణుల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడే రూపొందించినట్లు చెప్పారు. సుఖశాంతులతో వర్ధిల్లాలి.. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, శాసనసభలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క తదితరులు శుభాకాంక్షలను తెలియజేశారు. తెలుగు ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. అంతులేని ఆనందం నిండాలి తెలుగు వారికి వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలుగువారి తొలి పండుగ, తెలుగు నూతన సంవత్సరం అయిన ఉగాది అందరి జీవితాల్లోనూ అంతులేని ఆనందం తీసుకురావాలి. రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ ఏడాదంతా సుఖ శాంతులతో వర్థిల్లాలి. కొత్త సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురిసి రాష్ర్టం సుభిక్షంగా ఉండాలి. -
రూ.5 కోట్లతో ఉగాది ఉత్సవాలు
మంత్రి పల్లె ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు పుట్టపర్తి టౌన్ : మన్మథనామ సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఆయన న్యూస్లైన్తో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్లో మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకలను శనివారం గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలోని అనంతరంవరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుకలను ప్రారంభిస్తారన్నారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన తెలుగు జాతి కీర్తిని ఇనుమడింపజేసిన 32 మంది కళాకారులకు కళారత్న పురష్కారాలు, 67 మందికి ఉగాది పురస్కారాలను సీఎం చేతులు మీదుగా అందజేస్తారన్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు డాక్టర్ బాలాంత్రపు రజనీ కాంతారావుకు తెలుగు-వెలుగు విశిష్ట పురస్కారంతో పాటు లక్ష రూపాయల నగదును బహుమతిగా అందజేయనున్నట్లు తెలిపారు. 32 మంది కళారత్న పురస్కాకర గ్రహితలకు రూ.10 వేల నగదు బహుమతి అందిస్తామన్నారు. అనంతపురం జిల్లా నుంచి 8 మంది రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు ఆయన ప్రత్యేక ఉగాధి శుభాకాంక్షలు తెలిపారు. -
ఉగాది వేడుకలకు సర్వం సిద్ధం
అరండల్పేట(గుంటూరు)/తాడికొండ: నూతన రాష్ట్రంలో తొలి ఉగాది వేడుకలకు తుళ్లూరు మండలం అనంతవరం గ్రామం ముస్తాబైంది. రాజధాని ప్రాంతంలో తొలిసారిగా అనంతవరంలో అధికారికంగా ఉగాది పండుగను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు తగిన విధంగా తెలుగు సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా పండుగ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో తొలి ప్రధాన ఘట్టమైన భూ సమీకరణ ప్రభుత్వం ఆశించిన రీతిలో జరగడంతో అధికారులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ ఏర్పాట్లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలోని నాలుగు ఎకరాల స్థలంలో సీఎం, ప్రముఖుల వేదిక, పంచాంగ శ్రవణం వేదిక, సంప్రదాయనృత్యాలకు ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేశారు. వేలాది మంది ప్రజల సమక్షంలో ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఇదే ప్రథమం. ఉమ్మడి రాష్ట్రంలో ఇలా ప్రజల మధ్యలో ఉగాది వేడుకలను నిర్వహించిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి రాక ... అనంతవరం గ్రామంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఆయన రాక కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ నిర్మించారు. సభాస్థలి చుట్టుపక్కల పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేసి తనిఖీలు చేస్తున్నారు. గ్రామంలో ఉగాది వేడుకలను తెలిపే ఫ్లెక్సీలు, రోడ్లవెంట బ్లీచింగ్ చల్లారు. అడుగడుగునా పోలీసులను ఏర్పాటు చేయటంతో గ్రామం పోలీసు వలయంగా మారింది. కొండపైకి రెండు బస్సులను ఏర్పాటు చేసి అందులో సీఎంతోపాటు కొందరు ప్రముఖలను వేంకటేశ్వరస్వామి దర్శనానికి తీసుకువెళ్లే ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 8 గంటలకు అనంతవరం చేరుకుని, కొండపై కొలువైన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఆ తరువాత ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. నాలుగుచోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మూడుచోట్ల ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. ఉగాది పురస్కారాలు... రైతులకు సన్మానం .... ఉగాది వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట వ్యక్తులను సత్కరించనుంది. ఇప్పటికే కొంతమందికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. అదే విధంగా ఉత్తమ రైతులతో పాటు, భూసమీకరణకు భూములు ఇచ్చిన రైతులను ముఖ్యమంత్రి సన్మానించనున్నట్లు అధికారులు ప్రకటించారు. సీఎంను రైతులు అభినందించే కార్యక్రమాన్నీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల బందోబస్తు విధుల్లో సుమారు 2500 మంది పోలీసులు పాల్గొంటున్నారు. ఏడుగురు ఏఎస్సీలు, 20 మంది డిఎస్పీలను నియమించారు. వేదిక సమీపంలో కూర్చునే ప్రజలు సెల్ఫోన్లు, అగ్గిపెట్టెలు లేకుండా రావాలని పోలీసులు ప్రకటించారు. సుమారు 50 వేల మంది ప్రజలు ఈ వేడుకలకు రానున్నట్టు అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. అందరికి మంచినీరు, ప్రసాదాలను అందించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకట పూర్ణచంద్రప్రసాద్ పంచాంగ పఠనం చేస్తారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా వేదిక ... గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఉగాది వేడుకల వేదికను అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. 20 జానపద కళాబృందాలు ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. -
ఆశల ఉగాది
విజయవాడ : నూతన రాజధాని తుళ్లూరు మండలం అనంతవరంలో శనివారం ఉగాది వేడుకలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. ఇందుకోసం రూ.5కోట్ల నిధులు మంజూరుచేసింది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగజ్జనని కనకదుర్గమ్మ ఆశీస్సులతో తయారుచేసే షడ్రుచుల ఉగాది పచ్చడితో ఈ కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభంకానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అయితే, కేవలం రాజధాని అని ప్రకటించడమే కాదు.. ఉత్సవాలు నిర్వహించడమే కాదు.. రాజధాని ప్రాంత ప్రజల జీవనం షడ్రుచుల సమ్మేళనంగా సాగేందుకు, వారి ఆశల్లో ఉగాది ఉషస్సు కనిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆశల ఉపాధి అందివ్వాలి.. నవ్యాంధ్రప్రదేశ్కు సరికొత్త రాజధాని తుళ్లూరేనని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ భవిష్యత్తు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని పాలకులు చెబుతున్నారు. రాజధాని నేపథ్యంలోనే విద్య, వైద్యం, కమ్యూనికేషన్ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా రానున్నాయి. ఇందులో భాగంగా సింగపూర్, జపాన్ వంటి దేశాల నుంచి మేధావులు నగరాన్ని సందర్శిస్తున్నారు. వీటి ద్వారా అయినా యువతకు ఉపాధి కల్పించాలి. వారి బంగారు భవితకు పూలబాట వేయాలి. పర్యాటకంగా పరిఢవిల్లాలి.. జిల్లాలో పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాలి. కృష్ణాతీర ప్రాంతంతో పాటు కొల్లేరు సరస్సును పర్యాటకంగా అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ స్థాయిలో రాజధానికి మంచి పేరు లభిస్తుంది. రాజధాని రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన వారి కుటుంబాల్లో ప్రస్తుతం దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారికి పరిహారం పెంపుతో పాటు విద్య, ఉద్యోగావకాశాలు కల్పించాలి. -
అనంతవరం ముస్తాబు
తుళ్లూరు మండలంలో ప్రభుత్వ ఉగాది వేడుకకు ఏర్పాట్లు పూర్తి నేటి ఉదయం 8 గంటలకు సీఎం రాక పంచాంగ శ్రవణానికి ప్రత్యేక వేదిక భారీ బందోబస్తు గుంటూరు : నూతన రాష్ట్రంలో తొలి ఉగాది వేడుకలకు తుళ్లూరు మండలం అనంతవరం గ్రామం ముస్తాబైంది. రాజధానిలో తొలిసారిగా అనంతవరంలో అధికారికంగా ఉగాది పండుగ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విష యం తెలిసిందే. ఇందుకు తగిన విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామంలోని నాలుగు ఎకరాల స్థలంలో సీఎం, ప్రముఖుల వేదిక, పంచాంగ శ్రవణం వేదిక, సంప్రదాయ నృత్యాలకు ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటుచేశారు. వేలాది మంది సమక్షంలో ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఇదే ప్రథమం. ముఖ్యమంత్రి రాక అనంతవరంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొననున్నారు. ఆయన రాక కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ నిర్మించారు. కొండపైకి రెండు బస్సులను ఏర్పాటుచేసి అందులో సీఎంతోపాటు ప్రముఖులను వేంకటేశ్వరస్వామి దర్శనానికి తీసుకువెళ్లే ఏర్పాటుచేశారు. నాలుగుచోట్ల పార్కింగ్ ప్రదేశాలు, మూడుచోట్ల ఉచిత వైద్యశిబిరాలను సిద్ధం చేశారు. చంద్రబాబు ఉదయం 8 గంటలకు అనంతవరం చేరుకుని, కొండపై కొలువైన వేంకటేశ్వరస్వామిని దర్శిం చుకుంటారు. ఆ తరువాత వేడుకల్లో పాల్గొంటారు. పురస్కారాలు-రైతులకు సన్మానం ఉగాది వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట వ్యక్తులను సత్కరించనుంది. ఇప్పటికే కొంతమందికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ రైతులతో పాటు భూసమీకరణకు భూములు ఇచ్చిన రైతులను ముఖ్యమంత్రి సన్మానించనున్నట్లు ప్రకటించారు. విధుల్లో 2,500 మంది పోలీసులు వేడుకల బందోబస్తు విధుల్లో సుమారు 2,500 మంది పోలీసులు పాల్గొంటున్నారు. 50వేల మంది రానున్నట్టు అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. టీటీడీ సిద్ధాంతి తంగిరాల వేంకట పూర్ణచంద్రప్రసాద్ పంచాంగ పఠనం చేస్తారు. -
వేడుకగా ఉగాది సంబరాలు
శ్రీకాకుళం : మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా, మండలస్థాయిల్లో ఈ నెల 21వ తేదీన ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, మండలాభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయి వేడుకలను జెడ్పీ సమావేశ మందరంలో, మండల స్థాయిలో మంచి వేదికలను ఎంపిక చేసుకుని అక్కడ తెలుగుదనం ఉట్టిపడేలా, కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మండల స్థాయిలో భాష, నృత్య, సంగీత సాహిత్య, కళారంగాలకు చెందిన వారిని సత్కరించాలని సూచించారు. ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ప్రోటోకాల్ పాటించాలన్నారు. ఉగాది వేడుకల కోసం తహశీల్దార్కు 25 వేల రూపాయ లను కేటాయించినట్టు కలెక్టర్ వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ సివిల్ సప్లైకి సంబంధించి రేషన్షాపుల నిర్వహణపై అధికారులు తరచూ పర్యవేక్షించాలన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఉన్న పురుగుల బియ్యాన్ని విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేయడం తగదన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, వంశధార నిర్వాసితుల సమస్య పరిష్కరానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ వివేక్యాదవ్, జిల్లా పౌరసరఫరాల అధికారి ఆనందరావు, రెవెన్యూ డివిజన్ అధికారి బి.దయానిధి పాల్గొన్నారు. -
ఉగాది వేడుకలకు స్థల పరిశీలన
అనంతవరం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్, ఎస్పీ తాడికొండ : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను రాష్ట్ర ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో నిర్వహించను ంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్దండే, ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, ఇతర అధికారులు ఆదివారం ఆ గ్రామాన్ని సందర్శించి స్థల పరిశీలన చేశారు. గ్రామ ప్రవేశానికి ముందు రోడ్డుపక్కన ఉన్న పొలాన్ని వేదికగా నిర్ణయించారు. తొలుత కలెక్టర్, ఎస్పీ గ్రామంలోని కొండపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యే పూజలు నిర్వహించారు. అనంతరం పండుగనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండపైకి వచ్చి పూజలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి దేవాదాయశాఖ అసిస్టెంటు కమిషనరు పీవీ శ్రీనివాసరావుతో చర్చించారు. ప్రధాన రహదారి నుంచి సీఎం కాన్వాయ్ ఎటు నుంచి రావాలి, ఎటునుంచి వెళ్ళాలన్న దానిపై అధికారులతో చర్చించారు. రోడ్డుకు 75 మీటర్ల లోపల నుంచి వేదిక ఏర్పాటు చేయాలని సూచించారు. వేదిక ముందు వీఐపీ, మీడియాకు స్థలం ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదే విధంగా ప్రధాన రహదారి నుంచి వేదిక వద్దకు, వేదిక వద్ద నుంచి కొండ వరకు తాత్కాలిక రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాలకు పార్కింగ్, ప్రజలకు వేదిక వద్ద కుర్చీలు ఉండేలా ఏర్పాటు చేయాలని చెప్పారు. సీఎం కూర్చునే వేదికతోపాటు పక్కనే మరో రెండు వేదికలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వేదిక కూడా తూర్పు ముఖంతో ఉండేలా చూడాలన్నారు. వేడుకలకు వచ్చేవారికి పానకం, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొండపైకి వెళ్ళేసమయంలో సీఎం కాన్వాయ్లో ఏడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేలా చూడాలని భావిస్తున్నారు. ఘాట్రోడ్డుపై ట్రయల్ రన్ నిర్వహించాలని అమరావతి సీఐ హనుమంతరావును ఆదేశించారు. సీఎం హెలిప్యాడ్పై ఖరారు కాని నిర్ణయం... అనంతవరం రానున్న సీఎం కోసం హెలిప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది అధికారులు నిర్ణయించలేదు. ఉగాది రోజున సీఎం చంద్రబాబు రాజధాని ప్రాంతంలో కొన్ని గ్రామాల్లోనైనా రోడ్డుషో నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. దీంతో రోడ్డుషో రూట్ ఖారారు అయిన తరువాత మాత్రమే హెలిప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై ఓ నిర్ణయానికి వస్తారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ రాఘవేంద్రరావు, అదనపు జేసీ ఎం.వెంకటేశ్వరావు, డీఎస్పీ మధుసూదనరావు, పలు శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.