vacancies
-
స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలు ప్రారంభం
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వం నియామకాలు ప్రారంభించింది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్(సీపీఎస్ఈ)లోని స్వతంత్ర డైరెక్టర్ పోస్టుల్లో డిసెంబర్ 2024 నాటికి 86% ఖాళీగా ఉన్నాయి. ఇది అక్టోబర్లో ఉన్న 59% కంటే అధికంగా పెరిగింది.వీరు ఏం చేస్తారంటే..కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను నిర్వహించడంలో, వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ఇండిపెండెంట్ డైరెక్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. చట్టబద్ధమైన ఆడిట్ విధానాన్ని పర్యవేక్షించే కమిటీల్లో వీరు ముఖ్యమైన బాధ్యత వహిస్తారు. కంపెనీల ఉనికి, పారదర్శకత, జవాబుదారీతనం వంటి అత్యున్నత ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తారు.ప్రస్తుత ఖాళీల పరిస్థితిసీపీఎస్ఈ బోర్డుల్లో సుమారు 750 ఇండిపెండెంట్ లేదా నాన్ అఫీషియల్ డైరెక్టర్ పోస్టుల్లో 2024 డిసెంబర్ చివరి నాటికి 648 ఖాళీగా ఉన్నాయి. ఇంత పెద్దమొత్తంలో ఖాళీలు ఉండడంతో కార్పొరేట్ పాలనపై ఆందోళనలు రేకిస్తున్నాయి. ఈ ఖాళీల పర్వం ఇలాగే కొనసాగితే సంస్థల పనితీరుపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వ స్పందన..ఈ ఆందోళనకర పరిస్థితికి ప్రతిస్పందనగా ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం తక్షణ ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా 64 లిస్టెడ్ సీపీఎస్ఈల బోర్డుల్లోని 200 ఖాళీలపై దృష్టి సారించింది. నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి డిపార్ట్మెంట్స్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్(డీఓపీటీ), పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగాలతో పాటు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరస్పరం చర్చలు జరుపుతుంది.ఇదీ చదవండి: వినియోగ సంక్షోభానికి కారణాలు.. బడ్జెట్పై ఆశలుఖాళీల సమస్యను పరిష్కరించడానికి అధికారులు అనేక చర్యలను పరిశీలిస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నాన్ అఫీషియల్ డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించి పోస్టులను భర్తీ చేసేలా చూడాలనే ప్రతిపాదనలున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీ డైరెక్టర్లలో కనీసం మూడింట ఒక వంతు మంది స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి. నిర్ణీత పరిమాణానికి మించి అన్ లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలకు కనీసం ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్లు అవసరం. వీరు కార్పొరేట్ గవర్నెన్స్ కస్టోడియన్లుగా వ్యవహరిస్తుండటంతో ఈ ఖాళీల భర్తీకి అత్యంత ప్రాధాన్యం ఉంది. -
జడ్జీలపై పెండింగ్ కేసుల కొండ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని న్యాయస్థానాలన్నీ కేసుల భారం, విపరీతమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నాయి. పెరుగుతున్న కేసుల కొండను కరిగించేంత స్థాయి పరిమాణంలో న్యాయమూర్తులు లేరు. క్రింది స్థాయి కోర్టులు మొదలు హైకోర్టు దాకా చాలా జడ్జీ పోస్టులు ఖాళీలున్నాయి. దీంతో ఉన్న కొద్దిమంది న్యాయమూర్తుల మీదనే విపరీతమైన పని భారం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4,94,907 కేసులు న్యాయస్థానాల్లో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలో ఒక్కో న్యాయమూర్తిపై 9,144, ఆంధ్ర ప్రదేశ్లో 8,576 కేసుల భారం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం 4,54,55,345 పెండింగ్ కేసులు ఉండగా.. వాటిలో 57 శాతం సివిల్ కేసులు, 62 శాతం క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టులో 83,410 కేసులు పెండింగ్లో ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కేసులతో పెండింగ్ భారం విపరీతంగా పెరిగిపోతోందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తుత పరిస్థితులపై విచారం వ్యక్తం చేసింది. ‘2005 నాటికి ట్రయల్ కోర్టుల్లోని న్యాయమూర్తుల సంఖ్య ప్రతి 10లక్షల జనాభాకు 50 మంది జడ్జిలుగా ఉండాలని 2002లో ఉత్తర్వులు జారీ చేశాం. ఉత్తర్వులు జారీ చేసి 22 సంవత్సరాలు గడిచినా ఈ నిష్పత్తి 2024 ఏడాదిలో ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 25 మంది న్యాయమూర్తులకు చేరుకోలేదు’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. ఢిల్లీకి చెందిన ఓ సెషన్స్ జడ్జికి ఉపశమనం కలి్పస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. సెషన్స్ జడ్జికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఒక్కో న్యాయమూర్తికి సగటున 2 వేలకు పైగా కేసుల భారం ఉంది. మూడు హైకోర్టుల్లోని జడ్జీలపైనే అత్యధిక పనిభారం రాజస్థాన్, మధ్యప్రదేశ్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులపై దేశంలోనే అత్యధిక పనిభారం ఉందని తెలుస్తోంది. 25 హైకోర్టుల్లో 61,09,862 కేసులు పెండింగ్లో ఉన్నాయి. దేశంలో పెండింగ్లో ఉన్న కేసుల విషయంలో ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉందని నివేదిక చూపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 6,56,141 కేసులు పెండింగ్లో ఉండగా కేవలం 32 మంది న్యాయమూర్తులు మాత్రమే ఈ కేసుల పరిష్కారానికి బాధ్యత వహిస్తున్నారు. ఇక్కడ సగటున ప్రతి న్యాయమూర్తి 20,504 కేసుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మొత్తం పాతిక హైకోర్టులలో ఇదే అత్యధికం. దీని తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టు రెండో స్థానంలో నిలిచింది. 4,69,462 కేసుల పరిష్కారం బాధ్యత 35 మంది న్యాయమూర్తులపై ఉంది. ఇక్కడి న్యాయమూర్తిపై సగటున 13 వేల 414 కేసుల భారం ఉంది. అలాగే అలహాబాద్ హైకోర్టు దేశంలోనే మూడో స్థానంలో ఉంది. 10,67,614 కేసులను పరిష్కరించే బాధ్యత 82 మంది న్యాయమూర్తులపై ఉంది. -
633 ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో 633 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీ కోసం ‘మెడికల్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డు’మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్రెడ్డి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు అక్టోబర్ ఐదో తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే మార్చుకునేందుకు 23, 24వ తేదీల్లో అవకాశం ఉంటుందని వివరించారు. నవంబర్ 30న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. నోటిఫికేషన్లోని కీలక అంశాలు,వివరాలివీ.. » మొత్తం 633 పోస్టులు ఉండగా.. అందులో 446 ప్రజారోగ్య సంచాలకులు, వైద్యవిద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగంలో ఉన్నాయి. మరో 185 తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో, ఇంకో 2 హైదరాబాద్ ఎంఎన్జే ఆస్పత్రిలో ఉన్నాయి. ళీ జోన్ల వారీగా చూస్తే.. జోన్–1లో 79, జోన్–2లో 53, జోన్–3లో 86, జోన్–4లో 98, జోన్–5లో 73, జోన్–6లో 154, జోన్–7లో 88 పోస్టులు ఉన్నాయి. » ఈ పోస్టులకు పేస్కేల్ రూ.31,040 నుంచి రూ.92,050 మధ్య ఉంటుంది. » రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాలు.. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. » ఫలితాల అనంతరం మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. » అభ్యర్థులు డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఫార్మా డీ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో తప్పక రిజి్రస్టేషన్ చేసి ఉండాలి. » ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిజేసే వారికి వెయిటేజీ ఉంటుంది. వారు అనుభవ పూర్వక ధ్రువీకరణపత్రం సమర్పించాలి. » అభ్యర్థుల వయసు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు.. దివ్యాంగులకు పదేళ్లు సడలింపు,ఎన్సీసీ, ఎక్స్ సర్విస్మన్లకు మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (ఆర్టీసీ, మున్సిపల్ ఉద్యోగులు అనర్హులు) ఐదేళ్ల సడలింపునిచ్చారు. » రాత పరీక్షకు 80 మార్కులు ఉంటాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసినవారికి వెయిటేజీ కింద 20 పాయింట్స్ కేటాయిస్తారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన ప్రతి ఆరు మాసాలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతీ ఆరు నెలలకు 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. » పూర్తి వివరాలను అభ్యర్థులు ఠీఠీఠీ.ఝజిటటb.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్సైట్లో పొందవచ్చు. -
2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేపట్టింది. ఇటీవల ల్యాబ్ టెక్నీíÙయన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం.. బుధవారం 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. తెలంగాణ మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్రెడ్డి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, సంస్థల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా అనుభవమున్న అభ్యర్థులు.. అనుభవ ధ్రువీకరణ పత్రాలు పొందాలని సూచించారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.36,750 – రూ.1,06,990 మధ్య ఉంటుందని తెలిపారు. స్టాఫ్నర్స్ పోస్టులను బహుళ ఐచ్చిక ఎంపిక విధానంలో రాతపరీక్ష ఆధారంగా భర్తీ చేస్తారు. పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన/చేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా అనుభవమున్న వారు ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్లో ఏ సేవలు అందించి ఉంటే.. ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. మరిన్ని వివరాలకు తమ వెబ్సైట్ ( https://mhsrb.telangana.gov.in) ను సందర్శించాలని ఆయన కోరారు. ఇదీ సిలబస్.. అనాటమీ, ఫిజియాలజీలో 14 అంశాలు, మైక్రోబయాలజీలో 6 అంశాలు, సైకాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎనీ్వరాన్మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ గైనకాల జికల్, గైనకాలజియల్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్టె్మంట్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్ ఉంటుంది. జోన్లవారీగా స్థానికులకు 95% రిజర్వేషన్ స్టాఫ్నర్స్ పోస్టులను జోన్లవారీగా భర్తీ చేయనున్నారు. ఆయా జోన్ల అభ్యర్థులకు 95 శాతం పోస్టులను కేటాయిస్తారు. మిగతావి ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. జోన్–1లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు.. జోన్–2లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.. జోన్–3లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.. జోన్–4లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్.. జోన్–5లో సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగాం.. జోన్–6లో మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్.. జోన్–7లో పాలమూరు, నారాయణపేట, జోగుళాంబ–గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. నోటిఫికేషన్లోని ముఖ్యాంశాలివీ.. » అభ్యర్థులు నోటిఫికేషన్ తేదీ నాటికి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి. » ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే.. ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన ’నిపుణుల కమిటీ’కి రిఫర్ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. » దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 46 ఏళ్ల వయో పరిమితి ఉంటుంది. వయసును 2024 జూలై 1 ఆధారంగా లెక్కిస్తారు. వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. » ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుల్లో మార్పులు చేయడానికి వచ్చే నెల 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్కు అవకాశం కల్పించారు. » నవంబర్ 17వ తేదీన సీబీటీ పద్ధతిలో రాత పరీక్ష ఉంటుంది. » హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అభ్యర్థులు తమ ప్రాధాన్యం ప్రకారం సెంటర్లను ఎంపిక చేసుకోవాలి. -
గెయిల్లొ 391 ఉద్యోగాలు (ఫోటోలు)
-
మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచి్చనట్టు చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నామని, అదేవిధంగా గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 ద్వారా పోస్టుల భర్తీతో పాటు వివిధ శాఖల్లో వచ్చిన ఖాళీలు కలిపి 30 వేల పైచిలుకు ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహిస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించిన అత్యంత కీలక అంశాల్లో ఉద్యోగాల భర్తీ ఒకటని, అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు.శుక్రవారం రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో తెలంగాణ ఫైర్ సరీ్వసెస్ అండ్ సివిల్డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో ఫైర్ మెన్ పాసింగ్ అవుట్ పరేడ్కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్లో పాల్గొన్న 483 మంది ఫైర్ మెన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అగి్నమాపక శాఖ డీజీ నాగిరెడ్డితో కలిసి పరేడ్ను పరిశీలించారు. అనంతరం శిక్షణలో ఉత్తమ ప్రతిభకనబర్చిన వారికి ట్రోఫీలను, అదేవిధంగా అగి్నమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్లుగా నియమితులైన 157 మందికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి నియామక పత్రాలను అందించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. జాబ్ కేలండర్ ద్వారా ప్రతి ఖాళీ భర్తీ ‘ఉద్యోగాల నియామకంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలను నిరుద్యోగులకు అందించాం. ఇప్పటికే ఇచి్చన ఉద్యోగాలతో పాటు త్వరలో భర్తీకానున్న పోస్టులు కలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 60 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేసినట్టవుతుంది.రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ కేలండర్ ద్వారా అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నిరుద్యోగులకు ఇబ్బందులు ఏమైనా ఉంటే మంత్రులు, అధికారుల దృష్టికి తెండి. నిరసనలు తెలపాల్సిన పనిలేదు.. ఆందోళన చెందాల్సిన పని అంతకంటే లేదు. మంత్రులు, ఉన్నతాధికారులు మీకు అందుబాటులో ఉంటారు. సహేతుకమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు మీ రేవంత్ అన్నగా ఎప్పుడూ నిబద్ధతతో పని చేస్తా..’అని సీఎం పేర్కొన్నారు. ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగింది.. ‘ప్రభుత్వ ఉద్యోగులకు యజమాని రాష్ట్ర ప్రభుత్వం. యజమాని ప్రతి నెలా ఒకటో తారీఖున జీతం ఇవ్వకపోతే ఆ ఉద్యోగి విశ్వాసం కోల్పోతాడు. గత ఎనిమిదేళ్లలో అధికారంలో ఉన్న ప్రభుత్వం.. ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో లేదో తెలియని గందరగోళ పరిస్థితి తెచి్చంది. పదవీ విరమణ పొందిన వారికి పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక నిబద్ధతను పాటించి.. ప్రతి నెలా మొదటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఉద్యోగ విరమణ పొందిన వారికి ఫించన్ అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగింది. ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడంలో భాగంగా గురువారం నాటి రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యకు, ఉపాధికి, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. రైతులకు సహాయం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యాలు నిర్దేశించుకున్నాం..’అని సీఎం తెలిపారు. ఇది ఉద్యోగం కాదు..సమాజ సేవ ‘కఠినమైన ఫైర్ మెన్ శిక్షణ పూర్తి చేసుకుని సమాజానికి సేవలందించేందుకు 483 మంది ముందుకు వచి్చనందుకు సంతోషంగా ఉంది. ఫైర్ సిబ్బంది అంటే కేవలం జీత భత్యాల కోసమే పని చేసేవారు కాదు. వరదలు ఇతర ఏ విపత్తు వచ్చినా ప్రాణాలు త్యాగం చేసైనా ప్రజలను కాపాడతామన్న సామాజిక బాధ్యత తీసుకోవడం..’అని రేవంత్ అన్నారు.యువకులను సుశిక్షితులుగా మార్చిన తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఉద్యోగులను సీఎం అభినందించారు. రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఫైర్ డీజీ నాగిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అగ్నిమాప శాఖ డైరెక్టర్ జీవీ నారాయణరావు , ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ నియామకాల్లో ‘మూడు ముక్కలాట’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఖాళీల భర్తీ వ్యవహారం మూడు ముక్కలాటగా మారింది. సంస్థలో 3035 పోస్టుల భర్తీకి ఇటీవలే ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇప్పటి వరకు ఆర్టీసీలో ఖాళీల భర్తీకి సంస్థనే సొంతంగా నియామకాలు చేపడుతూ వస్తోంది. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ అధికారానికి కోత పెడుతూ.. సొంతంగా భర్తీ చేసుకునే వీలు లేకుండా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాధ్యత చూస్తున్న టీఎస్పీఎస్సీకి ఆ బాధ్యత అప్పగించింది. డ్రైవర్లాంటి పోస్టుల భర్తీ బాధ్యత తమకు వద్దంటూ ఆ సంస్థ పేర్కొనటంతో పోలీసు రిక్రూట్బోర్డుకు అటాచ్ చేసింది. డ్రైవర్లు, శ్రామిక్లు, సూపర్వైజర్లు లాంటి పోస్టుల నియామక బాధ్యతను దానికి అప్పగించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకాల బాధ్యతను వైద్య ఆరోగ్యశాఖ నియామక విభాగానికి అప్పగించారు. దీంతో ఈ మూడు సంస్థలు ఆర్టీసీలో ఖాళీల భర్తీని చూడనున్నాయి. ఫలితంగా పోస్టులు ఎప్పుడు భర్తీ అవుతాయో ఆర్టీసీకే తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. జాబ్ కేలండర్ ఆధారంగానే... ఒకే అభ్యర్థి ఏక కాలంలో రెండుమూడు ఉద్యోగాల కోసం యత్నించటం సహజం. దీంతో అర్హత ఉన్న అన్ని ప్రవేశ పరీక్షలు రాస్తుంటారు. ఆయా పరీక్షలన్నింటికీ వారు హాజరు కావాలంటే వాటి నిర్వహణ తేదీలు వేరువేరుగా ఉండాల్సి ఉంటుంది. ఒకేరోజు రెండు పరీక్షలుంటే, ఏదో ఒక పరీక్షను మిస్ చేసుకోవాల్సిందే. దీంతో ఆయా సంస్థలు సమన్వయం చేసుకుని వేర్వేరు తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తాయి. జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఇది సాగుతుంది. ఇప్పుడు ఇదే ఆర్టీసీకి ఇబ్బందిగా మారింది. ఆర్టీసీకేమో ఖాళీల భర్తీ అత్యవసరం. కానీ, భర్తీ ప్రక్రియ చూసే మూడు సంస్థలు ప్రత్యేకంగా ఆర్టీసీ కోసం ఏర్పాట్లు చేసేందుకు ససేమిరా అంటున్నాయి. ఇతర శాఖల్లోని ఖాళీల భర్తీకి సంబంధించి పరీక్షల నిర్వహణకు రూపొందించే షెడ్యూల్ ఆధారంగానే ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రం వ చ్చిన తర్వాత కొత్త నియామకాల్లేవ్ ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరి సారిగా ఆర్టీసీలో ఖాళీల భర్తీ జరిగింది. తెలంగాణ రాష్ర్్టరం ఏర్పడ్డ తర్వాత కొత్త నియామకాలు చేపట్టలేదు. ప్రతినెలా పదవీ విరమణలు కొనసాగుతుండటంతో క్రమంగా సిబ్బంది సంఖ్య తగ్గిపోతూ బస్సుల నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. ఓ దశలో మూడు వేలకుపైగా డ్రైవర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. 2019లో ప్రభుత్వం ఆదేశించిందంటూ ఏకంగా 2 వేల బస్సులను ఆర్టీసీ తగ్గించుకుంది. అలా కొంత సమస్యను అధిగమించింది. ఆ తర్వాత మళ్లీ కొత్త బస్సులు అవసరమంటూ అద్దె బస్సుల సంఖ్యను ఒక్కసారిగా పెంచింది. అద్దె బస్సుల్లో వాటి యజమానులే డ్రైవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పద్ధతులతో ఎలాగోలా నెట్టుకొస్తూ వస్తోంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం 1200 డ్రైవర్ల కొరత ఉంది. ఫలితంగా ఉన్న డ్రైవర్లకు డబుల్ డ్యూటీలు వేస్తున్నారు. ఇది డ్రైవర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. నిద్ర కూడా చాలని స్థితిలో వారు డ్రైవింగ్ విధుల్లో ఉంటున్నారు. ఇది బస్సు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమిస్తోందని కారి్మక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.కనీసం డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలంటూ.. డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉందనీ వెంటనే ఖాళీల భర్తీని చేపట్టాలంటూ తాజాగా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ఆర్టీసీ అభ్యరి్థంచింది. పలుదఫాలు కోరిన మీదట ఆగస్టులో చూద్దామని ఆ బోర్డు పేర్కొన్నట్టు సమాచారం. -
వైద్య కాలేజీల్లో 607 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపు కీలక కేడర్లలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఈ మేరకు 36(8 కొత్త మెడికల్ కాలేజీలతో కలిపి) ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 607 ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చి0ది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 34 డిపార్ట్మెంట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు ఉండగా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలో కలిపి 85 పోస్టులకుపైగా ఉన్నాయి. మిగిలిన డిపార్ట్మెంట్లలో పరిమిత సంఖ్యలో పోస్టులున్నాయి. అకాడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు, కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 435 ఎంబీబీఎస్ డాక్టర్ పోస్టులకు 2,400 దరఖాస్తులుప్రభుత్వ దవాఖాన్లలోని 435 ఎంబీబీఎస్ (సివిల్ అసిస్టెంట్ సర్జన్) డాక్టర్ పోస్టుల భర్తీకి ఇటీవల మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీ సాయంత్రానికి అప్లికేషన్ల గడువు ముగియనుంది. బుధవారం నాటికి సుమారు 2400 మంది డాక్టర్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంకో వెయ్యి దరఖాస్తులు వరకూ వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఒక్కో పోస్టుకు ఐదుగురు డాక్టర్లు దరఖాస్తు చేయగా, ఈసారి ఒక్కో పోస్టుకు 7 నుంచి 8 అప్లికేషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు ప్రాక్టీస్పై బ్యాన్ పెట్టినప్పటికీ, ప్రభుత్వ సర్వీసులోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తుండడం గమనార్హం. -
ఆర్టీసీలో 3,035 పోస్టులు భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. వివిధ స్థాయిల్లో 3,035 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు అందుబాటులోకి వచ్చాక బస్సుల్లో రద్దీ దాదాపు రెట్టింపైంది. దీంతో కొత్త బస్సుల అవసరం ఏర్పడింది. ప్రస్తుత రద్దీకి 4 వేల కొత్త బస్సులు అవసరమని ఆర్టీసీ తేల్చింది. అయితే అన్ని బస్సులు కాకున్నా, దశలవారీగా 1,500 బస్సులు సమకూరనున్నాయి. దీంతో భారీ సంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్ల అవసరం ఏర్పడింది. ప్రస్తుతం కండక్టర్ల కొరత లేకున్నా, డ్రైవర్లకు కొరత ఉంది. కొత్త బస్సులు వచ్చే లోపే ఆ పోస్టుల భర్తీ అవసర మని ఆర్టీసీ నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనికి ముఖ్యమంత్రి ఓకే అనటంతో భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2012లో ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపట్టారు. నిజానికి భవిష్యత్తులో వచ్చే కొత్త బస్సుల దృష్ట్యా ఆర్టీసీలో 10 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి 3,035 పోస్టుల భర్తీతోనే సరిపెట్టనున్నారు. సాలీనా రూ.15 కోట్ల వ్యయం కొత్త నియామకాల వల్ల జీతాల రూపంలో సాలీనా రూ.15 కోట్ల వ్యయం కానుంది. అయితే అదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణలతో సంవత్సరానికి అంతకు మూడు రెట్ల మేర జీతాల భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఆర్టీసీలో సగటున నెలకు 200 మంది వరకు పదవీ విరమణ పొందుతున్నారు. సంవత్సరానికి దాదాపు 2,500 మంది రిటైర్ అవుతున్నారు. పదవీ విరమణ పొందేవారి జీతం గరిష్టంగా ఉంటుంది. ఆ మొత్తంతో ముగ్గురు కొత్త ఉద్యోగులను తీసుకోవచ్చు. అంటే కొత్త నియామకాలతో ఆర్టీసీపై అదనంగా పడే భారం ఏమీ లేదని స్పష్టమవుతోంది. ముందే అదనపు డ్యూటీల భారం ఆర్టీసీలో 12 సంవత్సరాలుగా నియామకాలు లేకపోవటంతో, రిటైర్మెంట్ల రూపంలో సిబ్బంది సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొరత మొదలైంది. ముఖ్యంగా డ్రైవర్ల సంఖ్య సరిపోక, ఉన్నవారిపై అదనపు డ్యూటీల భారం మొదలైంది. వీక్లీ ఆఫ్లలో కూడా డ్రైవర్లు విధుల్లోకి రావాల్సి వస్తోంది. డ్రైవర్లు అలసి పోవడంతో బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రిక్రూట్మెంటుకు అవకాశం ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు గత ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం, మహిళలకు ఉచిత ప్రయాణ వసతిని అందుబాటులోకి తేవటంతో సిబ్బందిపై భారం మరింత పెరిగింది. దీంతో అధికారులు రిక్రూట్మెంట్ చేపట్టాలంటూ ప్రతిపాదనలు పంపడమే కాకుండా తరచూ లిఖితపూర్వకంగా అభ్యరి్థస్తూ వచ్చారు. జనవరిలో ఆ ఫైలు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వద్దకు చేరింది. దాదాపు నెల విరామం తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. అక్కడ కూడా కొంతకాలం పెండింగులో ఉన్న తర్వాత ఎట్టకేలకు అనుమతి లభించింది. తాజా భర్తీ ప్రక్రియలో కండక్టర్ పోస్టుల ఊసు లేదు. భవిష్యత్తులో డ్రైవర్లే కండక్టర్ విధులు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డ్రైవర్ కమ్ కండక్టర్ పేరుతోనే డ్రైవర్ పోస్టుల భర్తీ జరగనుంది. టీజీఎస్ ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తాం – త్వరలో 3,035 పోస్టుల భర్తీ – రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్: టీజీఎస్ ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలోని వివిధ కేటగిరీల్లో 3,035 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు మంగళవారం కరీంనగర్లో పొన్నం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకొచ్చిన ఏడు నెలల్లోనే వెయ్యి బస్సులు కొనుగోలు చేశామని, మరో 1,500 బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆక్యుపెన్సీ వంద శాతం దాటిందని తెలిపారు. ఆర్టీసీ తార్నాక ఆసుపత్రిని సూపర్స్పెషాలిటీగా తీర్చిదిద్ది ఆర్టీసీ ఉద్యోగులు, కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందేలా చూస్తామని అన్నారు. -
సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఎగ్జిక్యూటివ్ కేడర్ కేటగిరిలో.. మేనేజ్మెంట్ ట్రైనీ (ఈ అండ్ ఎం) పోస్టు లు 42, మేనేజ్మెంట్ ట్రైనీ (సిస్టమ్స్) పోస్టులు 7, నాన్ ఎగ్జి క్యూటివ్ కేడర్ కేటగిరీలో జూనియర్ మైనింగ్ మేనేజర్ ట్రైనీ పోస్టులు 100, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (మెకానిక ల్) పోస్టులు 9, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులు 24, ఫిట్టర్ ట్రైనీ పోస్టులు 47, ఎలక్ట్రిషన్ ట్రైనీ పోస్టులు 98 అందులో ఉన్నాయి. ఈనెల 15 నుంచి వచ్చే నెల 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నా రు. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు కాగా, ఎస్సీ, ఎస్టీ , బీసీ, వికలాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తించనుంది. పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్సైట్ www.scclmines.com ను సంప్రదించాలని సంస్థ యాజమాన్యం తెలిపింది. -
ఏడాదిలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభు త్వ శాఖల్లో వచ్చే ఏడాదికాలంలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. పోలీసుశాఖలో త్వరలో 15 వేల ఉద్యోగ నియామకాలకు చర్య లు చేపడతామని, పోలీసు నియామకాల బోర్డు ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. దీనితోపాటు వైద్యారోగ్య శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో 5వేల ఉద్యోగాలకు కూడా ప్రకటనలు ఇస్తామని.. తర్వాత తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా వేగంగా ఉద్యోగాల భర్తీ చేపడతామని తెలిపారు. వైద్యారోగ్య శాఖ పరిధిలోని స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు అర్హత పొందిన 6,956 మందికి బుధవారం ఎల్బీ స్టేడియంలో సీఎం ఆధ్వర్యంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్తో ఉద్యోగాలు.. నిరుద్యోగుల కలల సాకారమే తెలంగాణ రాష్ట్రమని.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్లపాటు నిరుద్యోగులు దగాపడ్డారని రేవంత్ వ్యాఖ్యానించారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం కేసీఆర్ కుటుంబీకులకే ఉద్యోగాలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో కేసీఆర్ బిడ్డ కవిత నిజామాబాద్లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీని చేసిన కేసీఆర్.. రాష్ట్రంలోని నిరుద్యోగులను మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టడంతో రాష్ట్రంలోని చదువుకున్న యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. మేం అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ అంశాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ నా దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి, భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తిచేశాం..’’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై తాము ప్రమాణ స్వీకారం చేసినది ఎల్బీ స్టేడియంలోనేని.. ఆ కార్యక్రమంతో తమ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడ్డారని రేవంత్ చెప్పారు. ఇప్పుడు నర్సులుగా ఎంపికైనవారి కుటుంబాల్లో అలాంటి సంతోషాన్ని చూసేందుకే ఇక్కడ నియామకపత్రాల పంపిణీ చేపట్టామన్నారు. రోజుకు 16గంటలకుపైగా పనిచేస్తున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టి పెట్టామని రేవంత్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొదలుపెట్టామని, కొత్త చైర్మన్, సభ్యులను నియమించామని చెప్పారు. శాఖలవారీగా ఉద్యోగ ఖాళీలు, భర్తీ ప్రక్రియపై మరింత దృష్టి పెడుతున్నామన్నారు. మంత్రులు రోజుకు సగటున 16 నుంచి 18 గంటలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం పనిచేస్తున్నారన్నారు. అలాంటి ప్రజా ప్రభుత్వాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారని, వాటికి తాము వెరవబోమని వ్యాఖ్యానించారు. స్టాఫ్ నర్సులుగా ఎంపికైన వారి కళ్లలో ఆనందాన్ని చూసి ఫాంహౌజ్లోని వారు కుళ్లుకుంటారని విమర్శించారు. కేసీఆర్ మేనల్లుడు హరీశ్రావు ప్రజాప్రభుత్వంపై పిల్లి శాపాలు పెడుతున్నారని.. ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న కేసీఆర్ వెంటనే హరీశ్రావుకు గడ్డిపెట్టి నోరు మూయిస్తే మంచిదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో 6,956 మందికి స్టాఫ్ నర్స్ నియామక పత్రాలు అందజేసి, వారితో ఉద్యోగ ప్రతిజ్ఞ చేయించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. మాట నిలబెట్టుకుంటున్నాం: భట్టి విక్రమార్క ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన మాటను ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. వైద్యారోగ్య శాఖలో ఇంత పెద్ద సంఖ్యలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ గొప్ప విషయమన్నారు. ఇదే శాఖలో ఖాళీగా ఉన్న మరో 5 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు వేగవంతం చేశామని తెలిపారు. నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణబద్ధమై ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేసిందని.. దీనిని గాడిన పెట్టేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని చెప్పారు. పైసా పైసా పోగు చేస్తూ పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి మంచిపేరు తేవాలి: రాజనర్సింహ కొత్తగా నియమితులైన స్టాఫ్ నర్సుల్లో 88శాతం మహిళలు ఉండటం ఆనందంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అత్యుత్తమ సేవలు అందించి ప్రభుత్వ వైద్య విభాగానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. సమాజానికి విద్య, వైద్యం, సంక్షేమం ఎంతో కీలకమని.. తమ ప్రభుత్వం వీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో వేగంగా స్టాఫ్ నర్సు నియామకాలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎందరు డాక్టర్లు వచ్చినా రోగికి దగ్గరగా ఉండి సేవలు అందించేది నర్సులేనని చెప్పారు. -
‘గవర్నర్’ కోటాపై మెలిక !
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేయడానికి ముందే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పీటముడి వేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి సంబంధించి హైకోర్టులో ఉన్న కేసు పరిష్కారమయ్యే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించినట్లు బుధవారం రాజ్భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. గవర్నర్ కోటా కింద దాసోజు శ్రవణ్కుమార్, కె.సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించాలని ప్రతిపాదిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సిఫారసులను సెప్టెంబర్ 19న తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీచేశారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అభ్యర్థులిద్దరూ వేసిన కేసు ఇటీవల రాష్ట్ర హైకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. తొలుత కేసు విచారణార్హతను తేల్చాలని నిర్ణయిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కు హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు పరిష్కారమయ్యే వరకు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మరొకరి పేరును ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. తాజాగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. -
ఐదు వైద్య కళాశాలల్లో అన్ని పోస్టులు భర్తీ చేయండి
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న ఐదు వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించేలా చ ర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమా వేశంలో ఐదు వైద్య కళాశాలల్లో పోస్టుల భర్తీపై మంత్రి సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ బోధనా సి బ్బందిని కాంట్రాక్టు విధానంలో నియమించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కాంట్రాక్టు విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు వేతనాలు ఇవ్వడం, అదేవిధంగా శాశ్వత బోధనా సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించేందుకు సాధ్యా సా«ద్యాలను పరిశీలించాల న్నారు. సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 17 కొత్త వైద్య కళాశాలలను నెలకొల్ప డం ద్వారా రాష్ట్రంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేస్తున్నారని చెప్పారు. ఐదు కళాశాలలను ప్రారంభించామని, ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్యులు, వైద్య విద్యార్థుల హాజరు ఉండేలా పర్య వేక్షించాలని సూచించారు. వైజాగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యశాఖలో ఇప్పటి వరకు 53వేలకు పైగా పోస్టులు భర్తీ చేసినట్టు గుర్తుచేశారు. వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కా ర్యదర్శి డాక్టర్ మంజుల, సెకండరీ హెల్త్ డైరెక్టర్, వై ఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ వెంకటేశ్వర్, డీ ఎంఈ డాక్టర్ నరసింహం తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల కొలువుల పరీక్షలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్ఈఐఆర్బీ) నిర్వహించిన అర్హత పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మొత్తం 19 రోజుల పాటు ఈ పరీక్షలు జరిగాయి. 6,52,413 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 4,93,727 మంది హాజరయ్యారు. పరీక్షలకు సగటున హాజరైన అభ్యర్థుల శాతం 75.68గా నమోదైంది. గురుకుల బోర్డు ఏకకాలంలో తొమ్మిది నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా దాదాపు 56 విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేవలం 19 రోజుల్లో అత్యంత ప్రణాళికా బద్ధంగా పరీక్షలు నిర్వహించిన టీఆర్ఈఐఆర్బీ సరికొత్త రికార్డు సృష్టించింది. రోజుకు మూడు షిఫ్టుల్లో పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో ఈ పరీక్షలను టీఆర్ఈఐఆర్బీ విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పటివరకు గురుకుల బోర్డు నిర్వహించినవన్నీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలే కావడంతో మూల్యాంకన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసే వీలుంటుంది. ముందుగా అభ్యర్థుల జవాబు పత్రాల నకళ్లు, ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, తుది కీ ఖరారు చేసిన తర్వాత ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా టీఆర్ఈఐఆర్బీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని సొసైటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కాగా, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ ఉద్యోగ కేటగిరీలకు సంబంధించి మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, కీలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచలేదు. వీటికి సంబంధించి కోర్టులో కేసు ఉండటంతో వెబ్సైట్లో పెట్టలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రాథమిక కీ పట్ల అభ్యంతరాలుంటే ఈనెల 26వ తేదీ వరకు ఆన్లైన్లో సమర్పించాలని గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. ఈ నెలాఖరులోగా తుది కీలు తయారయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తుది కీ విడుదల చేసిన రోజునే అభ్యర్థులు సంబంధిత పరీక్షల్లో సాధించిన మార్కులు సైతం విడుదలవుతాయి. గురుకుల విద్యా సంస్థల్లో టాప్ పోస్టులుగా డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లకు డెమో పరీక్షలుంటాయి. -
ఈఎస్ఐలో కొలువుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య కొలువుల భర్తీకి ఈఎస్ఐసీ ఉపక్రమించింది. వివిధ కేటగిరీల్లో ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన డాక్టర్ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. నాలుగు కేటగిరీల్లో 40 పోస్టులు భర్తీ కానున్నాయి. సీనియర్ రెసిడెంట్ కేటగిరీలో 29 ఖాళీలు, సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్)/ సీనియర్ కన్సల్టెంట్ కేటగిరీలో 5 ఖాళీలు, సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీలెవల్)/జూనియర్ కన్సల్టెంట్ కేటగిరీలో 3 ఖాళీలు, స్పెషలిస్ట్ కేటగిరీలో 3 ఖాళీలున్నాయి. రోస్టర్, రిజర్వేషన్ వారీగా పోస్టులను నోటిఫికేషన్లో ప్రకటించారు. ఈ కొలువుల భర్తీ పూర్తిగా మెరిట్, ఇంటర్వ్యూల పద్ధతిలో జరుగుతుంది. సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్/ఎంట్రీలెవల్) గరిష్ట వయోపరిమితి 69 సంవత్సరాలుగా ఖరారు చేయగా.. స్పెషలిస్ట్కు 66 సంవత్సరాలు, సీనియర్ రెసిడెంట్కు 45 సంవత్సరాల గరిష్ట వయోపరిమితిని నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూరించాలి. నిర్దేశించిన డాక్యుమెంట్లతో ఆయా తేదీల్లో ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగానే ప్రాధాన్యత ఇస్తారు. ఫలితాలను వెబ్సైట్లో పొందుపరుస్తారు. అర్హత సాధించిన వైద్యులు వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుంది. పోస్టుల వారీగా వేతనాలు సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్) / సీనియర్ కన్సల్టెంట్ రూ.2,40,000/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీలెవల్) / జూనియర్ కన్సల్టెంట్ రూ.2,00,000/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) స్పెషలిస్ట్ రూ.1,27,141/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) సీనియర్ రెసిడెంట్ రూ.67,000/– + డీఏ, ఎన్పీఏ, హెచ్ఆర్ఏ, ఇతరాలు -
అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఒకేసారి 9,231 కొలువుల భర్తీకి ఒకే దఫా 9 నోటిఫికేషన్లు జారీ చేసిన బోర్డు.. నూరు శాతం ఉద్యోగాల్లో నియామకాలు జరిపేలా వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం భర్తీ చేయనున్న పోస్టులన్నీ బోధన రంగానికి సంబంధించినవే. కాగా ఒక అభ్యర్థి మూడు నుంచి నాలుగు పోస్టులకు (వేర్వేరు సబ్జెక్టులకు) దరఖాస్తు చేసుకునే వీలుంది. ఈ పరీక్షలన్నీ వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తుండటంతో ఇలాంటి వారంతా వివిధ పరీక్షలకు హాజరై అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా భర్తీ ప్రక్రియ చేపట్టకుంటే ఖాళీలు ఎక్కువగా మిగిలేపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అవరోహణ (డిసెండింగ్ ఆర్డర్)విధానాన్ని అమలు చేయాలని టీఆర్ఈఐఆర్బీ నిర్ణయించింది. ఈ పద్ధతిలో నియామకాలు చేపడితే పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేపట్టవచ్చని బోర్డు అంచనా వేస్తోంది. తొమ్మిది కేటగిరీల్లో కొలువులు... ఐదు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో గురుకుల డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, పాఠశాలల్లో 9,231 పోస్టుల భర్తీకి టీఆర్ఈఐఆర్బీ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో డిగ్రీ లెక్చరర్ (డీఎల్), జూనియర్ లెక్చరర్(జేఎల్), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, లైబ్రేరియన్ పోస్టులున్నాయి. కొన్ని పోస్టులు కాలేజీలు, స్కూళ్లలో ఉండడంతో రెండింటికీ దాదాపుగా ఒకే అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే డిగ్రీ లెక్చరర్కు అర్హతలున్న అభ్యర్థులు, జూనియర్ లెక్చరర్తో పాటు పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అవరోహణ పద్ధతి ఇలా.. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను నియామక సంస్థలు ఒక క్రమ పద్ధతిలో చేపడతాయి. ఇష్టానుసారంగా చేపడితే అన్ని పోస్టులూ భర్తీకాక తిరిగి ప్రకటనలు జారీ చేసి నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. తాజాగా గురుకుల నియామకాల బోర్డు పరిధిలో 9 వేలకు పైగా ఉద్యోగాలకు ప్రకటనలు జారీ అయ్యాయి. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన అంతా బోర్డు పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించినప్పటికీ నియామకాల కౌన్సెలింగ్ను మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. ప్రస్తుతం 9 కేటగిరీల్లో కొలువులున్నాయి. వీటిని పైస్థాయి నుంచి కింది స్థాయికి అవరోహణ క్రమంలో విభజించిన తర్వాత వాటికి కౌన్సెలింగ్ నిర్వహించి నియామకాలు చేపడతారు. అంటే ముందుగా డిగ్రీ కాలేజీల్లో కొలువులు భర్తీ చేసిన తర్వాత జూనియర్ కాలేజీల్లో పోస్టులు భర్తీ చేస్తారు. ఆ తర్వాత పాఠశాలల్లో పైస్థాయి పోస్టులైన పీజీటీ, టీజీటీ తర్వాత ఇతక కేటగిరీ పోస్టుల్లో నియామకాలు చేపడతారు. దీంతో ప్రకటించిన పోస్టులన్నీ పూర్తిస్థాయిలో భర్తీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇలా కాకుండా కిందిస్థాయి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఎంపికైన అభ్యర్థి, ఆ తర్వాత పైస్థాయి పోస్టుకు ఎంపికైతే కిందిస్థాయి పోస్టును వదిలేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆ ఖాళీ భర్తీ కాకుండా మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించి అమలు చేసేందుకు టీఆర్ఈఐఆర్బీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
ఉద్యోగ నియామకాలకు పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి అర్హత పరీక్షల నిర్వహణ తేదీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ వెల్లడించింది. నోటిఫికేషన్లో ప్రకటించిన తేదీలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహించనున్నట్టు కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పశుసంవర్థక శాఖ పరిధిలో 185 వీఏఎస్(వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్), ఉద్యాన వన శాఖ పరిధిలో 22 హెచ్ఓ పోస్టులు, రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు ఈనెల మార్చి, వచ్చే నెల ఏప్రిల్లో పరీక్షలు జరగనున్నాయి. వీఏఎస్ ఉద్యోగాలకు రెండ్రోజుల పాటు పరీక్షలు నిర్వహించనుండగా.. హెచ్ఓ, ఏఎంవీఐ పోస్టులకు ఒక రోజు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయి. మరిన్ని వివరాలకు కమిషన్ వెబ్సైట్ను చూడాలని టీఎస్పీఎస్సీ తెలిపింది. -
AP: జిల్లా కోర్టుల్లో 3,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: అటు హైకోర్టుతోపాటు ఇటు జిల్లా కోర్టుల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. ప్రధానంగా హైకోర్టులో పెద్ద సంఖ్యలో పోస్టుల ఖాళీలతో ప్రస్తుతమున్న ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది హైకోర్టు పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఖాళీల భర్తీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఇటీవల ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించి తద్వారా ఏర్పడిన ఖాళీలను సైతం ఇప్పటికే ఉన్న ఖాళీలతో కలిపి భర్తీచేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా హైకోర్టులో వివిధ కేటగిరీల్లో 241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. అలాగే, జిల్లా కోర్టులు కూడా ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆ వివరాలన్నింటినీ ఆయా కోర్టుల నుంచి తెప్పించుకున్న ప్రధాన న్యాయమూర్తి అక్కడ ఖాళీల భర్తీకీ ఆదేశాలిచ్చారు. వీటి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో 3,432 పోస్టుల భర్తీకి హైకోర్టు వర్గాలు నోటిఫికేషన్లు జారీచేశాయి. అటు హైకోర్టు, ఇటు జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను హైకోర్టు వెబ్సైట్ http://hc.ap.nic.inలో పొందుపరిచారు. వెబ్సైట్లలో దరఖాస్తులు.. ఇక హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు వెబ్సైట్లో, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల దరఖాస్తులను హైకోర్టు, ఆయా జిల్లాల ఈ–కోర్టు వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. హైకోర్టు ఉద్యోగాలకు ఈ నెల 29 నుంచి నవంబర్ 15వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 15 రాత్రి 11.59లోపు ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు ఈనెల 22 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 11 రాత్రి 11.59 లోపు ఆన్లైన్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన తరువాత పరీక్షా షెడ్యూల్ను తెలియజేస్తారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులు రూ.400లను ఫీజుగా చెల్లించాలి. ప్రతీ పోస్టుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. కానీ, హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్ (ఎస్ఓ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) పోస్టులను పదోన్నతుల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా భర్తీచేస్తున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఆలపాటి గిరిధర్ వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేశారు. హైకోర్టులో పోస్టుల ఖాళీలు.. ఆఫీస్ సబార్డినేట్–135, కాపీయిస్టు–20, టైపిస్ట్–16, అసిస్టెంట్–14, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్–13, ఎగ్జామినర్–13, కంప్యూటర్ ఆపరేటర్లు–11, సెక్షన్ ఆఫీసర్లు–9, డ్రైవర్లు–8, ఓవర్సీర్–1, అసిస్టెంట్ ఓవర్సీర్–1 మొత్తం 241 పోస్టులు. జిల్లా కోర్టుల్లో పోస్టుల ఖాళీలు.. ఆఫీస్ సబార్డినేట్–1,520, జూనియర్ అసిస్టెంట్–681, ప్రాసెస్ సర్వర్–439, కాపీయిస్టు–209, టైపిస్ట్–170, ఫీల్డ్ అసిస్టెంట్–158, స్టెనోగ్రాఫర్ (గ్రేడ్–3)–114, ఎగ్జామినర్–112, డ్రైవర్(ఎల్వీ)–20, రికార్డ్ అసిస్టెంట్–9 మొత్తం 3,432 పోస్టులు. -
పారదర్శకంగా అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: అంగన్వాడీ సూపర్వైజర్(గ్రేడ్–2) పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ స్పష్టం చేశారు. పోస్టుల భర్తీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ఆమె సోమవారం మీడియాతోమాట్లాడారు. 2013లో చేపట్టిన ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను అప్పట్లో పట్టించుకోలేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వాటి భర్తీకి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 560 పోస్టుల భర్తీకి అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. అర్హులైన వారినుంచి దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా రాతపరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా భర్తీచేసేలా పటిష్ట మైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే 560 పోస్టులకు 21 వేలకు పైగా దరఖాస్తులొచ్చాయని, వారికి ఈ నెల 18న నాలుగు జోన్లలో మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా ఓఎంఆర్ షీట్స్ ద్వారా రాతపరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. రాతపరీక్ష 45 మార్కులతోపాటు.. మరో ఐదు మార్కులకు ఇంగ్లిష్ పై పట్టు ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు వీడియో చేసి పంపాలని నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు తెలిపారు. రాతపరీక్ష తర్వాత ఒక్కో పోస్టుకు ఇద్దరి(క్వాలిఫైడ్ లిస్ట్)ని ఎంపిక చేసి వారికి సమాచారం అందించినట్టు తెలిపారు. పో స్టుల భర్తీలో రోస్టర్ విధానం, దివ్యాంగుల కోటా వంటి అన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు చెప్పారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలు వెల్లడిస్తామన్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సైతం ఎటువంటి అనుమానం ఉన్నా తమ ఆన్సర్ షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల్లో అపోహలు, అనుమానాలు రేకెత్తించేలా అసత్య వార్తలు, తప్పుడు ప్రచారాలు తగదని ఆమె సూచించారు. -
మరో 2,440 సర్కారీ కొలువులు
సాక్షి, హైదరాబాద్: విద్య, పురావస్తు శాఖల్లో మొత్తం 2,440 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ విద్య, కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్యాశాఖలో బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. సంబంధిత విభాగాలు పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం వాటిని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ విద్యలో.. అరబిక్–02, వృక్షశాస్త్రం–113, వృక్షశాస్త్రం (ఉర్దూ)–15, రసాయన శాస్త్రం–113, కెమిస్ట్రీ (ఉర్దూ)–19, పౌరశాస్త్రం–56, పౌరశాస్త్రం (ఉర్దూ)–16, సివిక్స్ (మల్టీమీడియం)–1, కామర్స్–50, కామర్స్ (ఉర్దూ)–7, ఎకనామిక్స్–81, ఎకనామిక్స్ (ఉర్దూ)–15, ఇంగ్లిష్–153, ఫ్రెంచ్–2, హిందీ–117, హిస్టరీ–60, హిస్టరీ (ఉర్దూ)–12, హిస్టరీ/సివిక్స్–17, హిస్టరీ/సివిక్స్ (ఉర్దూ)–5, హిస్టరీ/సివిక్స్ (మల్టీమీడియం)–1, గణితం–154, గణితం (ఉర్దూ)–09, భౌతికశాస్త్రం–112, భౌతికశాస్త్రం (ఉర్దూ)–18, సంస్కృతం–10, తెలుగు–60, ఉర్దూ–28, జంతుశాస్త్రం–128 జంతుశాస్త్రం (ఉర్దూ)–18 కలిపి 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తారు. మరో 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక విద్యలో 359 పోస్టులు.. సాంకేతిక విద్యలో 359 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్–4, ఆటోమొబైల్ ఇంజనీరింగ్–15, బయోమెడికల్ ఇంజనీరింగ్–3, కెమికల్ ఇంజనీరింగ్–1, కెమిస్ట్రీ–8, సివిల్ ఇంజనీరింగ్–82, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్–24, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్–41, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్–1, ఫుట్వేర్ టెక్నాలజీ–5, జియోలజీ–1, లెటర్ ప్రెస్–5, మెకానికల్ ఇంజనీరింగ్ 36, మెటలర్జీ–5, ప్యాకింగ్ టెక్నాలజీ–3, ఫార్మసీ–4, ఫిజిక్స్–5, ట్యానరీ–3, టెక్స్టైల్ టెక్నాలజీ–1 పోస్టులు కలిపి 247 పోస్టుల్ని లెక్చరర్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. ఇవికాక జూనియర్ ఇన్స్ట్రక్టర్–14, లైబ్రేరియన్–31, మ్యాట్రన్–5, ఫిజికల్ డైరెక్టర్–37, ఎలక్టీష్రియన్–25 పోస్టుల్నీ భర్తీ చేస్తారు. ఉన్నత విద్యలో.. కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్లో లెక్చరర్ విభాగంలో ఇంగ్లిష్–23, తెలుగు–27, ఉర్దూ–2, సంస్కృతం–5, స్టాటిస్టిక్స్–23, మెక్రోబయోలజీ–5, బయోటెక్నాలజీ–9 అప్లయ్డ్ న్యూట్రిషియన్–5, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్–311, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్–39, కామర్స్–బిజినెస్ అనలటిక్స్(స్పెషలైజేషన్)–8, డెయిరీ సైన్స్–8, క్రాప్ ప్రొడక్షన్–4, డేటా సైన్స్–12, ఫిషరీస్–3, కామర్స్–ఫారిన్ ట్రేడ్ (స్పెషలైజేషన్)–1, ఆర్కివ్స్, డిస్ట్రిక్ట్ గెజిటర్స్ విభాగంలో 6 రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు కలిపి మొత్తం 491 పోస్టులను భర్తీ చేస్తారు. ఇవికాక లైబ్రేరియన్–24, ఫిజికల్ డైరెక్టర్–29 పోస్టులున్నాయి. పాలనాపరమైన అనుమతి లభించడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. డైరెక్టర్ ఆఫ్ ఆర్కివ్స్లో 8 పోస్టులు.. డైరెక్టర్ స్టేట్ ఆర్కివ్స్ విభాగంలో 8 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో ఆర్కివిస్ట్–2, అసిస్టెంట్ ఆర్కివిస్ట్–2, అసిస్టెంట్ లైబ్రేరియన్–1, జూనియర్ రిసెర్చ్ అసిస్టెంట్(ఉర్వూ, పర్షియన్)–1, రిసెర్చ్ అసిస్టెంట్–1, సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్ (ఉర్దూ, పర్షియన్)–1 పోస్టులున్నాయి. -
Adilabad District: ఇన్చార్జీల పాలన ఇంకెన్నాళ్లు?
ఇచ్చోడ(బోథ్): అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడే జిల్లాలో ఆదిలాబాద్ మొదటిస్థానంలో ఉంది. జిల్లాలో 80 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అలాంటి రైతులకు ఆధునిక వ్యవసాయం, పంటల మార్పిడి, విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం, సాగులో మెలకువలు, సాగులో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ అధికారుల పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉన్నాయి. డీఏవో కూడా ఇన్చార్జీనే.. ఆదిలాబాద్లో పనిచేసిన జిల్లా వ్యవసాయ అధికారి ఆశకుమారి డిప్యూటేషన్పై మెదక్ జిల్లాకు వెళ్లింది. ఆమె స్థానంలో ప్రభుత్వం మళ్లీ డీఏవోను నియమించలేదు. దీంతో ఆదిలాబాద్ ఏడీఏ, మార్క్ఫెడ్ డీఎంగా అదనపు బాధ్యతలు చూస్తున్న పుల్లయ్యను ఇన్చార్జి డీఏవోగా నియమించారు. కొత్త మండలాలకు మంజూరు కాని పోస్టులు ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మండలాలు ఏర్పాటు చేసింది. జిల్లాలో సిరికొండ, గాదిగూడ, భీంపూర్, మావల, ఆదిలాబాద్ అర్బన్ మండలాలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్సైలను నియమించిన ప్రభుత్వం వ్యవసాయ అధికారులను నియమించడం మరిచింది. దీంతో ఆరు మండలాలకు ఆరేళ్లుగా ఇన్చార్జి వ్యవసాయ అధికారులే కొనసాగుతున్నారు. 18 మండలాలకు 11 మందే ఏవోలు జిల్లాలోని 18 మండలాల్లో కేవలం 11 మంది ఏవోలే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగితా ఏడు మండలాల్లో ఇన్చార్జి వ్యవసాయ అధికారులే అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొన్నేళ్లుగా రెగ్యులర్ ఏవోలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని బేల, ఇంద్రవెల్లి, తలమడుగు, సిరికొండ, భీంపూర్, మావల, గాదిగూడ మండలాల్లో ఇన్చార్జి వ్యవసాయ అధికారులే విధులు నిర్వర్తిస్తున్నారు. బేల మండల ఏవోగా పనిచేసిన రమేశ్ను కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేయగా, ఏడాది కాలంగా బోథ్ ఏవో విశ్వామిత్ర బేల ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. తలమడుగు ఏవో రమణను సర్వీసు నుంచి తొలగించడంతో నార్నూర్–2 ఏవో మహేందర్ తలమడుగు ఏవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంద్రవెల్లి ఏవో కైలాస్ నాలుగేళ్ల కిత్రం ఇచ్చోడకు బదిలీపై రావడంతో ఉట్నూర్ ఏవో గణేశ్ ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్నారు. నూతనంగా ఏర్పాటైన గాదిగూడకు టెక్నికల్ ఏవో జాడి దివ్య, సిరికొండకు ఇచ్చోడ ఏవో కైలాస్, భీంపూర్కు తాంసి ఏవో రవీందర్, మావలకు ఆదిలాబాద్ అర్బన్ ఏవో రవీందర్ ఇన్చార్జి ఏవోలుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నార్నూర్, జైనథ్ మండలాలకు ఇద్దరు ఏవోలు ఉండాల్సి ఉండగా ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. (క్లిక్: కరీంనగర్ జిల్లాలో మరో ఆరు కొత్త మండలాలు!?) ప్రభుత్వానికి నివేదించాం కొత్తగా ఏర్పడిన మండలాలకు ప్రభుత్వం ఏవోలను నియమించలేదు. దీంతో పాత మండలాల ఏవోలకు అదనపు బాధ్యతలు అప్పగించాం. కొన్ని మండలాల్లో ఏవోలు బదిలీపై వెళ్లడంతో అక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వారి స్థానాలను భర్తీ చేయడానికి ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. – పుల్లయ్య, ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారి -
‘స్థానిక’ ఖాళీల భర్తీకి 8న ముసాయిదా ఓటర్ల జాబితా
సాక్షి, హైదరాబాద్: వివిధ పంచాయతీరాజ్, పురపాలక సంస్థల్లోని వివిధ స్థానాలకు ఏర్పడిన ఖాళీల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 8న ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించి, వాటిపై అభ్యంతరాలుంటే స్వీకరించాలని సంబంధిత పీఆర్, మున్సిపాలిటీ శాఖల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. ఈ జాబితాలపై రాజకీయ పార్టీలప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరబాట్లు లేకుండా పక్కాగా తయారు చేస్తే ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు జరిగే అవకాశాలు ఉండవని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు, కౌన్సిలర్ల స్థానాల భర్తీకి సంబంధించిన ఓటర్ల జాబితాల తయారీపై సోమవారం వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఎస్ఈసీ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఓటర్ల జాబితా పార్థసారథి మాట్లాడుతూ 2022 జనవరి 1వ తేదీని ప్రాతిపదికగా తీసుకొని అదే నెల 6న ఈసీ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాల ఆధారంగా స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలను ఈ నెల 21న ప్రచురించాలని సూచించారు. వీటి తయారీలో సాధారణ ఎన్నికల్లో ఏర్పరిచిన వార్డు సరిహద్దులను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. ఈ ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాక ఎస్ఈసీ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, పబ్లికేషన్కు నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకు తేదీలను ఖరారు చేస్తుందని పార్థసారథి వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ శరత్, వివిధ జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు. -
Tribunals Vacancies: కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు అసహనం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పలు ట్రిబ్యునళ్లలో ఖాళీలపై(పెండింగ్ నియామకాలు చేపట్టకపోవడంపై) సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఈ వ్యవహారంపై స్పష్టమైన వైఖరి ఏంటో తెలపాలంటూ కేంద్రాన్ని వివరణ కోరింది. బుధవారం ఈ వ్యవహారంపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం.. బ్యూరోక్రసీ ఈ అంశాన్ని తేలికగా తీసుకుంటోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు నియమకాలపై కేంద్రం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను కోరింది బెంచ్. ‘‘ఇది ట్రిబ్యునల్స్కు సంబంధించిన అంశం. రోజూ ప్రస్తావిస్తూనే ఉన్నాం. అయినా ఏదో మొక్కుబడిగా నియామకాలు చేపడుతున్నారు. ఎంతో మంది రిటైర్ అవుతున్నారు. బ్యూరోక్రసీ ఈ అంశాన్ని చాలా తేలికగా తీసుకుంటోంది’’ అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, అటార్నీ జనరల్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బదులుగా ఏజీ స్పందిస్తూ.. ఈ ఇష్యూ మీద ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తుందన్నారు. దీంతో తదుపరి వాదనలను మూడు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. -
సెబీలో గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలు.. త్వరపడండి!
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ).. వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్ ఏ(అసిస్టెంట్ మేనేజర్లు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 120 ► పోస్టుల వివరాలు: జనరల్–80, లీగల్–16, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)–14, రీసెర్చ్–07, అఫీషియల్ లాంగ్వేజ్–03. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 31.12.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: మూడు దశల్లో జరుగుతుంది. మొదటిగా ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఫేజ్ 1 స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. దీనిలో ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపికచేస్తారు. ఫేజ్ 2లో సాధించిన స్కోర్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.01.2022 ► వెబ్సైట్: sebi.gov.in -
డీఎస్ఎస్ఎస్బీ, న్యూఢిల్లీలో 691 పోస్టులు
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(ఎన్సీటీ ఢిల్లీ) ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(డీఎస్ఎస్ఎస్బీ).. జూనియర్ ఇంజనీర్/సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 69 ► పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)/సెక్షన్ ఆఫీసర్(ఎలక్ట్రికల్)–116, జూనియర్ ఇంజనీర్(సివిల్)/సెక్షన్ ఆఫీసర్(సివిల్)–575. ► జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)/సెక్షన్ ఆఫీసర్(ఎలక్ట్రికల్): అర్హత: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు రూ.9300 నుంచి 34,800+గ్రేడ్ పే 4200 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► జూనియర్ ఇంజనీర్(సివిల్)/సెక్షన్ ఆఫీసర్(సివిల్): అర్హత: సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు రూ.9300 నుంచి రూ.34,800+గ్రేడ్ పే 4200 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష(టైర్1, టైర్2) ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 10.01.2022 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.02.2022 ► వెబ్సైట్: dsssbonline.nic.in -
GHMC: హవ్వ.. ఇదేం పాలన?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలోని కోటిమందికి వివిధ రకాల సేవలందించాల్సిన బల్దియాలో ఉన్నతాధికారుల నిష్క్రియాపరత్వంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. డిప్యుటేషన్ల నుంచి వివిధ అంశాల్లో పట్టింపు లేకపోవడంతో కొందరు ఆడింది ఆటగా సాగుతోంది. డిప్యుటేషన్లు ముగిసినా బల్దియా నుంచి వెళ్లని వారితోపాటు.. ఎవరు ఎక్కడ ఏంచేసినా చెల్లుతుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి. బాధ్యతల వికేంద్రీకరణ పేరిట జోన్ల అధికారులకు పూర్తిస్థాయి అధికారాలివ్వడంతో అధికార వికేంద్రీకరణ బదులు అవినీతి వికేంద్రీకరణ జరుగుతోంది. కఠిన చర్యలు లేకపోవడంతో మహిళలను వేధించేవారి ఆగడాలకు అడ్డేలేకుండాపోయింది. జాయింట్ కమిషనర్ల పోస్టుల పేరిట కొందరిని ఖాళీగా కూర్చోబెట్టి జీతాలిస్తున్నారు. అయిదేళ్ల డిప్యుటేషన్ ముగిసినా మాతృశాఖకు వెళ్లకుండా.. పొడిగింపును కమిషనర్ అడ్డుకున్నా.. మరోమార్గంలో తిష్టవేసేందుకు కొందరు అధికారులు పావులు కదుపుతున్నారు. ఇలా.. చెబుతూపోతే.. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో.. కదలరు.. వదలరు.. ► ఇటీవల ఒకరి డిప్యుటేషన్ అయిదేళ్ల కాలం ముగిసిపోయింది. తిరిగి పొడిగింపునకు ప్రయత్నించారు. కమిషనర్ నిక్కచ్చిగానే ససేమిరా కాదన్నారు. కానీ.. మరో మార్గంలో జీహెచ్ఎంసీలోనే మరో విభాగం నుంచి సదరు అధికారి డిప్యుటేషన్ కోసం ఒక అడిషనల్ కమిషనర్, విభాగాధిపతి, మరికొందరు ప్రయత్నాలు చేసి సఫలమయ్యారంటే ఏమనుకోవాలి? కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు.. సదరు పోస్టులో మరొకరిని అప్పటికే ప్రభుత్వం నియమించడంతో ఆ అంకానికి తాత్కాలికంగా తెరపడినా.. ఏం జరగనుందో వేచి చూడాల్సిందే. ► మరో విభాగంలోని ఓ అధికారి అయిదేళ్ల డిప్యుటేషన్ ముగిసినా ఇంకా కొనసాగుతున్నారు. పై పెచ్చు పొడిగింపు వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిసింది. కేవలం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. సదరు ఫైల్ కదలదు. వీరు కదలరు. అయినా పట్టించుకున్నవారే లేరు. సారు.. చాలా బిజీ.. ► ఇక దోమల విభాగం తీరే ప్రత్యేకం. ఫాగింగ్ మెషిన్లు, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మస్కూట్స్ పేరిట జరుగుతున్న దోపిడీకి అంతేలేకుండాపోయింది. ఈ విభాగంలో ‘కలెక్షన్’ చేసి పెట్టేవారికి రెండు జోన్ల బాధ్యతలు అప్పగిస్తుంటారనేది అంతా తెలిసిన విషయమే. ► ఇక జోనల్స్థాయిలోని అధికారులు జోన్లను తమ రాజ్యాలుగా భావిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రజలకు సేవ కోసం ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తే.. వారు ఎవరికీ ఫోన్లు ఎత్తరు. ‘సారు చాలా బిజీ’ అనే అర్థంలో స్వీయ సందేశంతో ఆటోమేటిక్ మెసేజ్లు మాత్రం వెళ్తాయి. ► ఇక వీరి పర్యవేక్షణలో పనిచేసే వారు సైతం తామూ తక్కువేమీ తీసిపోలేదన్నట్లు..డిప్యూటీ కమిషనర్లయినా, వైద్యాధికారులైనా, ఇంజినీర్లయినా, మరొకరయినా సరే జోన్లు, సర్కిళ్లలో ఉండరు. ప్రజలెవరైనా తమ సమస్యల కోసం అక్కడకు వెళ్తే సీట్లలో ఉండరు. ఫీల్డ్ అంటారు. లేకుంటే హెడ్డాఫీసుకు వెళ్లారంటారు. కానీ ఎక్కడా ఉండరు. మరి ఎక్కడుంటారో తెలియదు. జోనల్ పెద్దసారుకు అనుకూలంగా ఉంటే చాలు.. ఎక్కడున్నా పనిచేసినట్లే. గదిలో కునుకు తీస్తున్నా బాగా పనిచేసినట్లే లెక్క. పైవారితో ‘లెక్క’ సరిగ్గా ఉంటే అంతా భేషే! ► వికేంద్రీకరణ పేరిట అధికారాలతోపాటు జీతాలు, బిల్లుల చెల్లింపులు, తదితరమైనవన్నీ జోన్లలోనే జరుగుతున్నాయి. పనుల తనిఖీలు, పర్యవేక్షణలు చేసే పెద్దసారుతో సవ్యంగా ఉంటే చాలు. ప్రధాన కార్యాలయం అలంకార ప్రాయం. బల్దియా బాస్ నామ్కే వాస్తే అన్న అభిప్రాయం బలంగా నెలకొంది. గోడు వెళ్లబోసుకున్న బాధితురాలు.. ► కొంతకాలం క్రితం ఓ డిప్యూటీ కమిషనర్ మహిళలతో కలిసిన ఫొటోలు వైరల్ కావడంతో అతడికి స్థానచలనం కలిగించారు. డిప్యూటీ కమిషనర్ కాస్తా జాయింట్ కమిషనర్గా మారారు. అంతే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ► ఓ స్టాటిస్టికల్ ఆఫీసర్.. మహిళా కంప్యూటర్ ఆపరేటర్ను వేధిస్తున్న విషయం తెలిసినా.. సంబంధిత విభాగం ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. పైగా తప్పుచేసిన వారిని రక్షించే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు మేయర్ను కలిసి గోడు వెళ్లబోసుకుంటే కానీ విషయం బయటకు రాలేదు. ఏళ్లకేళ్లుగా పొడిగింపు.. ► బల్దియాలోకి ఒకసారి వస్తే.. పాతుకుపోతారనే ప్రచారం ఉంది. లక్ష డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నప్పుడు అవసరమని దాదాపు 250 మంది ఇంజినీర్లను ఔట్సోర్సింగ్పై తీసుకున్నారు. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం పది శాతం పనుల కోసం మళ్లీ అంతమంది పొడిగింపు కోసం ప్రయత్నిస్తున్నారు. వారిలో చాలామంది బల్దియాలోని వారికి ఏదో రకంగా దగ్గరివారే. అందుకే పని చేయకున్నా, పని లేకున్నా జీతం వస్తోంది. అలా ఏళ్లకేళ్లు పొడిగింపునిస్తుంటారు. ► కమిషనర్ స్వీయనిర్ణయాలు తీసుకోక, బల్దియాలో పాత కాపులైన ఒకరిద్దరు అధికారులు చెప్పిందే వేదమన్నట్లు నడుచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. సచివాలయం స్థాయిలోని ఉన్నతాధికారులకు, సంబంధిత మంత్రులకు వారు దగ్గరవడమే కారణమని బల్దియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
సీట్లు కొండంత.. భర్తీ సగమంత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల సీట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ఏటా 3.2 లక్షల మంది ఇంటర్ పాసవుతుంటే డిగ్రీ సీట్లు మాత్రం 4.5 లక్షలకు పైనే ఉన్నాయి. ఇంజనీరింగ్, ఇతర కోర్సులు పోనూ డిగ్రీలో చేరికలయ్యాక ప్రతి ఏటా దాదాపు 2 లక్షలకు పైనే సీట్లు మిగులుతున్నాయి. గత ఐదేళ్లుగా ఇదే నడుస్తోంది. దీంతో ఉన్నత విద్యా మండలి పునః సమీక్షకు సిద్ధమైంది. డిమాండ్ ఉన్న కోర్సులు, విద్యార్థులు ఎక్కువగా చేరే కాలేజీలకే అనుమతి ఇవ్వాలని ఆలోచిస్తోంది. అలాగే నాణ్యత, అంతర్జాతీయ మార్కెట్ ఉన్న కోర్సులనూ ప్రవేశపెట్టాలని అనుకుంటోంది. 40 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు రాష్ట్రంలో 1,080 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో ఎక్కువగా ప్రైవేటు కాలేజీలే. ఈ ఏడాది ఈ కాలేజీల్లో 4,66,345 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అడ్మిషన్లు ముగిసే సమయానికి 2,49,266 సీట్లే భర్తీ అయ్యాయి. దాదాపు 40 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా లేదు. 30 కాలేజీల్లో కొన్ని గ్రూపుల్లో విద్యార్థులు నామమాత్రం కన్నా తక్కువే చేరారు. వాస్తవానికి రాష్ట్రంలో ఏటా ఇంటర్ పాసయ్యే వారి సంఖ్య 3.2 లక్షలకు మించట్లేదు. ఇందులో 70 వేల మంది ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక విద్య కోర్సులను ఎంచుకుంటున్నారు. మిగతా వాళ్లు డిగ్రీలో చేరుతున్నారు. ఈ లెక్కన 2.5 లక్షల డిగ్రీ సీట్లున్నా సరిపోతుంది. కానీ ప్రైవేటు కాలేజీల ఒత్తిడి మేరకు ఇష్టానుసారం అనుమతి ఇస్తున్నారు. పాఠ్య ప్రణాళిక ప్రక్షాళన! విద్యార్థుల చేరికను పరిశీలిస్తే కొన్ని కోర్సులకే డిమాండ్ ఉంటోంది. బీకాంలో 40 శాతం మంది చేరితే ఫిజికల్ సైన్స్ 35 శాతం మంది చేరుతున్నారు. బీఏలో 20 శాతానికి మించట్లేదు. డిగ్రీ కోర్సులు చేసిన వారికి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని విద్యార్థుల్లో అసంతృప్తి ఉంది. దీన్ని దూరం చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు అందిపుచ్చుకుని బీఏ (హానర్స్), బీకాం కోర్సులను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది. తరగతి బోధన కన్నా ప్రాజెక్టు వర్క్ ఎక్కువ ఉండాలని భావిస్తోంది. ఇందుకు మౌలిక సదుపాయాలున్న కాలేజీలను గుర్తించి వాటికే అనుమతి ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే నాణ్యత లేని కాలేజీలు తగ్గుతాయని, సీట్ల మిగులు సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. సీట్లు కాదు.. నాణ్యతే ముఖ్యం విద్యార్థుల సంఖ్యకు మించి డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నది నిజమే. అయితే నాణ్యత ప్రమాణాలతో కోర్సులు అందిస్తున్నామా లేదా అన్నదే ప్రధానం. మూస విద్యావిధానానికి బదులు సరికొత్త బోధన ఉండాలి. పాశ్చాత్య దేశాల్లో గ్రాడ్యుయేషన్లో ఏ కోర్సు చేసినా పీజీలో ఇష్టమైన కోర్సు తీసుకోవచ్చు. మన దగ్గర బీఏ చేస్తే ఎంకాం చేయడానికి వీల్లేదు. డిగ్రీలో ప్రమాణాలు పెంచితే పోటీని తట్టుకునే కాలేజీల సంఖ్య తగ్గి పరిమిత సీట్లే ఉండే వీలుంది. – ప్రొఫెసర్ రవీందర్ (ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉప కులపతి) ఇక ఈసారి నో చాన్స్ చేరే వాళ్లే లేనప్పుడు డిగ్రీలో ఇన్ని కాలేజీలు, ఇన్ని సీట్లు అవసరమా? అని ప్రశ్న వినిపిస్తోంది. నిజమే.. దాదాపు 30, 40 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు ఉంటున్నాయి. మరికొన్ని చోట్ల కోర్సుల్లో జీరో అడ్మిషన్లు నమోదవుతున్నాయి. వాస్తవానికి వీటిని మూసేయాలి. కానీ ఒక్క అవకాశం ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాలు ఏటా నెట్టుకొస్తున్నాయి. ఈసారి ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. హేతుబద్ధీకరణపై దృష్టి పెడుతున్నాం. – ప్రొఫెసర్ లింబాద్రి, (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
బీహెచ్ఈఎల్లో అప్రెంటిస్లు.. అప్లై చేసుకోండి
ఘజియాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 80 ► ఖాళీల వివరాలు: మెకానికల్ ఇంజనీరింగ్–20, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్–20, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్–20, మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్–20. ► అర్హత: 30.11.2018 తర్వాత సంబంధిత బ్రాంచ్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 30.11.2021 నాటికి 23ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: ఇంజనీరింగ్ డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దర ఖాస్తులకు చివరి తేది: 15.11.2021 ► వెబ్సైట్: www.bel-india.in బెల్, చెన్నైలో 73 అప్రెంటిస్లు చెన్నైలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్).. 2021–22 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 73 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు–63, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్లు–10. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు. స్టయిపెండ్: నెలకు రూ.11,110 చెల్లిస్తారు. ► టెక్నీషియన్(డిప్లొమా)అప్రెంటిస్లు:విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. స్టయిపెండ్: నెలకు రూ.10,400 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: డిప్లొమా, బీఈ/బీటెక్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021 ► బెల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 25.11.2021 ► వెబ్సైట్: www.mhrdnats.gov.in -
బీఈసీఐఎల్లో కన్సల్టెంట్ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్).. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్–ఎన్సీఆర్ పరిధిలో ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. (బ్యాంకు జాబ్ ట్రై చేస్తున్నారా.. మీకో గుడ్ న్యూస్) ► మొత్తం పోస్టుల సంఖ్య: 10 ► పోస్టుల వివరాలు: సీనియర్ కన్సల్టెంట్–04, కన్సల్టెంట్–03, జూనియర్ కన్సల్టెంట్–03 ► సీనియర్ కన్సల్టెంట్: విభాగాలు: ఇన్విరాన్మెంటల్ సైన్స్/టెక్నాలజీ, లా. అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. జీతం: నెలకు రూ.80,000 వరకు చెల్లిస్తారు. ► కన్సల్టెంట్: విభాగాలు: అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఇన్విరాన్మెంటల్ సైన్స్ /టెక్నాలజీ. అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. జీతం: నెలకు రూ.60,000 వరకు చెల్లిస్తారు. ► జూనియర్ కన్సల్టెంట్: విభాగాలు: ఐటీ, ఓఎల్. అర్హత: విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 02.09.2021 ► వెబ్సైట్: www.becil.com ఐహెచ్బీటీలో 17 ఖాళీలు భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ(ఐహెచ్బీటీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ ప్రకటనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం పోస్టుల సంఖ్య: 17 ► పోస్టుల వివరాలు: సైంటిస్ట్–10, సీనియర్ మెడికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్–07. ► అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఎస్సీ, ఎంబీబీఎస్, పీహెచ్డీ/ఎంఫార్మా/ఎండీ(ఆయుర్వేద)/ఎంవీఎస్సీ, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 28–40ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.49,000 నుంచి రూ.1,08,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021 ► వెబ్సైట్: https://www.ihbt.res.in/en/ -
ఈసీహెచ్ఎస్, ఇన్కాయిస్ లలో ఉద్యోగాలు
ఈసీహెచ్ఎస్, సికింద్రాబాద్లో 65 ఖాళీలు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్లోని ఎక్స్ సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ఈసీహెచ్ఎస్)... ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (డిగ్రీతో ఏఓ కొలువు.. నెలకు రూ.60వేల వేతనం..) ► మొత్తం పోస్టుల సంఖ్య: 65 ► పోస్టుల వివరాలు: గైనకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ తదితరాలు. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎనిమిదో తరగతి, జీఎన్ఎం, డీఎంఎల్టీ, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, సంబంధిత స్పెషౖలñ జేషన్లలో ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణులవ్వాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.16,800 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► ఇంటర్వ్యూ తేదీలు: 2021 అక్టోబర్ 05 నుంచి 13 వరకు ► ఇంటర్వ్యూ వేదిక: హెడ్క్వార్టర్స్, తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా, సికింద్రాబాద్. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఈసీహెచ్ఎస్ సెల్, బైసన్ యూఆర్సీ కాంప్లెక్స్, తిరుమలగిరి, సికింద్రాబాద్ –500015 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 04.09.2021 ► వెబ్సైట్: www.echs.gov.in ఇన్కాయిస్, హైదరాబాద్లో 82 ప్రాజెక్ట్ సైంటిస్ట్లు భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్కాయిస్).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (పీఎఫ్ఆర్డీఏ, ఇండియన్ కోస్ట్గార్డ్లో ఉద్యోగాలు) ► మొత్తం పోస్టుల సంఖ్య: 82 ► పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్లు(1,2,3)–62, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ (1,2)–20. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 28ఏళ్ల నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.39,000 నుంచి రూ.78,000+హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ప్రాజెక్ట్ సైంటిస్ట్(1,2,3) పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా; ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్(1,2) పోస్టులకు రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.09.2021 ► వెబ్సైట్: www.incois.gov.in -
ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్.. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 68 ► పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్–ఇంజనీర్(సివిల్)–36, అసిస్టెంట్ మేనేజర్–ఇంజనీర్(ఎలక్ట్రికల్)–10,అసిస్టెంట్ మేనేజర్–మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్–04, డిప్యూటీ మేనేజర్(అగ్రికల్చర్ స్పెషల్)–10, రిలేషన్షిప్ మేనేజర్(ఓఎంపీ)–06, ప్రొడక్ట్ మేనేజర్(ఓఎంపీ)–02. ► అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ (మార్కెటింగ్)/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: 01.04.2021 నాటికి 21ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది:13.08.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:02.09.2021 ► పరీక్ష తేది: 25.09.2021 ► వెబ్సైట్: https://sbi.co.in -
పది రోజుల్లో భర్తీ చేయండి.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ ట్రైబ్యునళ్లలో ఖాళీలు పది రోజుల్లో భర్తీ చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నియామకాల్లో జాప్యం కారణంగా ట్రైబ్యునళ్లు నిరీ్వర్యం అయ్యే దశకు చేరుకుంటున్నాయని పేర్కొంది. ఖాళీల భర్తీపై అలసత్వం చేస్తున్నారంటూ కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది. జబల్పూర్ ప్రిసైడింగ్ అధికారి అందుబాటులో లేనందున జబల్పూర్ డెబ్ట్ రికవరీ ట్రైబ్యునల్ అధికార పరిధి బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర బార్కౌన్సిల్, జీఎస్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ న్యాయవాది అమిత్ సాహ్నిలు దాఖలు చేసిన పిటిషన్లను సోమవారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన ధర్మాసనం విచారించింది. మద్రాస్ బార్ అసోసియేషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రెండు రోజులకే ఆ ఆదేశాలను అధిగమించడానికి పార్లమెంటులో తగిన చర్చ లేకుండానే ట్రైబ్యునల్ సభ్యుల సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్తో ముందుకొచి్చందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు, 2021పైనా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. గతంలో కోర్టు కొట్టివేసిన ప్రొవిజన్లను తిరిగి పొందుపరుస్తూ ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు తీసుకొచ్చిందని వ్యాఖ్యానించింది. ‘‘రెండు రోజుల్లోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. పార్లమెంటులో చర్చ జరిగినట్లుగా అనిపించలేదు. చట్టాలు రూపొందించే అధికారం సభకు ఉంది. కానీ ఈ చట్టాన్ని రూపొందించడానికి గల కారణాలు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంది’’ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ‘‘బిల్లుపై చర్చ ఏం జరిగిందో మాకు చూపించండి. ఇది చాలా తీవ్రమైన అంశం. చర్చ సమయంలో రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నంత మాత్రాన బిల్లులో నియమాలను కోర్టు కొట్టివేయలేదని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.. ఎందుకు ఈ బిల్లు రూపొందిస్తున్నాం... ట్రైబ్యునళ్లను కొనసాగించాలా.. మూసివేయాలా ? ఇదే ప్రధానమైన ప్రశ్న’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఖాళీలు భర్తీ చేయకపోతే ట్రైబ్యునళ్లు నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సదరు మంత్రిత్వశాఖ నోట్ సిద్ధం చేసే ఉంటుంది కదా అది మాకు చూపించగలరా అని సొలిసిటర్ జనరల్ తుషార్మెహతాను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. బిల్లు పూర్తిగా చట్టరూపం దాల్చకముందే తాను స్పందించలేనని, బిల్లు చెల్లుబాటు ప్రశ్నార్థకం కానందున ప్రస్తుతం తాను స్పందించలేనని తుషార్ మెహతా తెలిపారు. ట్రైబ్యునల్ కేసుల్లో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ హాజరు అవుతారని, ఏజీతో మాట్లాడి స్టేట్మెంట్ రూపొందించడానికి సమయం కావాలని తుషార్మెహతా కోరారు. ఖాళీ భర్తీపై స్టేట్మెంట్ రూపకల్పనకు పది రోజులు సమయం ఇవ్వాలని తుషార్మెహతా కోరగా.. గత విచారణ సమయంలో ఖాళీల జాబితా ఇచ్చారని, వారిని నియమించాలని భావిస్తే అడ్డుకోబోమని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కోర్టు చెప్పిన విషయాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, పదిరోజుల్లో పురోగతి ఉంటుందని, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్లో నియామకాలు జరుగుతున్నాయని, మిగతా వాటిల్లో నియామక ప్రక్రియ (అండర్ ప్రాసెస్) మొదలైందని తుషార్ తెలిపారు. అండర్ ప్రాసెస్ అంటే దీర్ఘకాల ప్రక్రియగా సీజేఐ అభివరి్ణంచారు. ఎప్పుడు నియామకాలు గురించి అడిగినా అండర్ ప్రాసెస్ అంటున్నారని, దీని వల్ల అర్థం లేదని, పదిరోజుల్లో నియామకాలు పూర్తి చేస్తారని విశ్వసిస్తున్నామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొంటూ విచారణ పది రోజులకు వాయిదా వేశారు. -
ఏఎన్యూలో టీచింగ్, నాన్టీచింగ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్యూ).. టీచింగ్, నాన్టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 07 ► పోస్టుల వివరాలు: టీచింగ్ పోస్టులు–03, నాన్ టీచింగ్ పోస్టులు–04. ► టీచింగ్ పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్(రూరల్ డెవలప్మెంట్, కంప్యూటర్ సైన్స్) అసోసియేట్ ప్రొఫెసర్(ఇంగ్లిష్). అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్/సెట్ అర్హత ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► నాన్ టీచింగ్ పోస్టులు: స్వీపర్, క్లీనర్, యుటెన్సిల్ క్లీనర్, మార్కర్. అర్హత: మార్కర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. మిగతా పోస్టులకు సంబంధిత పని అనుభవంతోపాటు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. వేతనం: నెలకు రూ.13,000 నుంచి రూ.40,270 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021 ► వెబ్సైట్: https://www.nagarjunauniversity.ac.in/indexanu.html ఏపీవీవీపీ, అనంతపురంలో వివిధ ఖాళీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాల యం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 09 ► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్/ఎంబీబీఎస్ డాక్టర్–01, నర్సు(ఏఎన్ఎం)–02, కౌన్సిలర్– 03, డేటాఎంట్రీ ఆపరేటర్–01, వార్డ్బాయ్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎనిమిది, పదో తరగతి/ఇంటర్మీడియట్ (ఎంపీహెచ్(ఎఫ్) ట్రెయినింగ్), గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ/ డిప్లొమా(సైకియాట్రీ మెడిసిన్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నైపుణ్యం ఉండాలి. ► వయసు: 42 ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సీనియారిటీ ప్రాతిపదికన ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(ఏపీవీవీపీ), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్, అనంతపురం చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 10.08.2021 ► వెబ్సైట్: ananthapuramu.ap.gov.in గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్, నెల్లూరులో 13 ఖాళీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఏపీ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్.. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 13 ► పోస్టుల వివరాలు: వాచ్మెన్–02, క్లీనర్/వ్యాన్ అటెండెంట్–01, ఆయాలు–01, స్వీపర్లు–01, ల్యాబ్ అటెండెంట్లు–01, కుక్స్–03, కిచెన్ బాయ్/టేబుల్ బాయ్–02, తోటీ/స్వీపర్–02. ► అర్హత: ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు పదో తరగతి, మిగతా అన్ని పోస్టులకు ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021 ► వెబ్సైట్: spsnellore.ap.gov.in -
హైదరాబాద్లో సైంటిస్ట్ పోస్టులు.. నెల జీతం లక్షపైనే
హైదరాబాద్లోని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సీఎస్ఐఆర్–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ).. సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 10 ► పోస్టుల వివరాలు: సైంటిస్ట్–05, సీనియర్ సైంటిస్ట్–02, ప్రిన్సిపల్ సైంటిస్ట్–03. ► సైంటిస్ట్: జీతం:నెలకు రూ.1,03,681 చెల్లిస్తారు. వయసు: 27.08.2021 నాటికి 32 ఏళ్లు మించకూడదు. ► సీనియర్ సైంటిస్ట్: జీతం: నెలకు రూ.1,19,332 చెల్లిస్తారు. వయసు: 27.08.2021 నాటికి 37ఏళ్లు మించకూడదు. ► ప్రిన్సిపల్ సైంటిస్ట్: జీతం: నెలకు రూ.1,81,795 చెల్లిస్తారు. వయసు: 27.08.2021 నాటికి 45ఏళ్లు మించకూడదు. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెక్షన్ ఆఫీసర్, రిక్రూట్మెంట్ సెక్షన్, సీఎస్ఐఆర్–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఉప్పల్ రోడ్, తార్నాక, హైదరాబాద్–500007, తెలంగాణ చిరునామాకు పంపించాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021 ► దరఖాస్తు హార్డ్కాపీలను పంపడానికి చివరి తేది: 10.09.2021 ► వెబ్సైట్: http://www.iict.res.in -
పోలీసుశాఖలో 19,454 కొత్త పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
సాక్షి,హైదరాబాద్: ఏడాదిగా ఆశతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్ పోలీస్ శాఖ తీపికబురు చెప్పనుంది. డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న 19,454 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా జారీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతకన్నా ముందు.. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)ల నియామకాలను చేపట్టనుంది. ఈ పోస్టుల భర్తీలో ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిన నేపథ్యంలో తొలుత వీటి భర్తీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ పోస్టులపై ఇప్పటికే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో నేడోరేపో నోటిఫికేషన్ రానుంది. ఏపీపీల నియామకాల నోటిఫికేషన్ తర్వాత టీఎస్ఎల్ పీఆర్బీ నుంచి పోలీసుల భర్తీకి అధికారిక ప్రకటన వెలువడనుంది. పోస్టులు ఇవే.. ఖాళీలపై పోలీసుశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం.. 425 ఎస్సై పోస్టుల్లో.. సివిల్లో 368, ఏఆర్లో 29, కమ్యూనికేషన్స్లో 18.. తదితర ఖాళీలున్నాయి. కానిస్టేబుళ్ల విషయానికి వస్తే.. సివిల్ 7,664, ఆర్మ్డ్ రిజర్వ్డ్ 6,783, టీఎస్ఎస్పీ 3,700, 15వ బెటాలియన్ 562, కమ్యూనికేషన్ 320 పోస్టులు కలుపుకొని... మొత్తంగా 19,454 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. కాగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. కేంద్రం కొత్త జోనల్ విధానానికి ఆమోదం తెలపడంతో కొత్త జిల్లాల ఆధారంగా ఈ పోస్టుల భర్తీ చేయనున్నట్లు సమాచారం. వయోపరిమితిపై ఉత్కంఠ.. 2018, జూన్లో 18,428 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. అప్పుడు 6.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి దాదాపు 8 లక్షల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారుల అంచనా. ఇదే సమయంలో వయోపరిమితి సడలింపుపైనా నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత 2 రిక్రూట్మెంట్లలోనూ వయోపరిమితిని ప్రభుత్వం కల్పించింది. ఈసారీ ఉంటుందా? ఉంటే.. ఎన్ని ఏళ్లు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నోటిఫికేషన్లలో జాప్యం కారణంగా ఇప్పటికే మూడు బ్యాచ్లు వయోపరిమితి దాటిపోయాయి. వీరందరిని సంతృప్తిపరిచేలా మినహాయింపు ఉండనుంది. చదవండి : అక్కపై దారుణం, ఎంత పనిచేశావ్ తమ్ముడు -
వైద్య శాఖలో 3 వేల కొత్త ఉద్యోగాలు..
సాక్షి, హైదరాబాద్: వైద్య శాఖలో కొత్తగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఏడు మెడికల్ కళాశాలల్లో 2,135, 15 నర్సింగ్ కాలేజీల్లో 900 పోస్టులకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటు కానున్న సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్కర్నూల్ మెడికల్ కళాశాలల్లో మొత్తం 33 విభాగాలకు పలు రకాల పోస్టులు మంజూరు చేశారు. స్టోర్ కీపర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, స్టెనో టైపిస్టులు, రికార్డు క్లర్క్లు, రికార్డు అసిస్టెంట్లు, డార్క్ రూమ్ అసిస్టెంట్లు, కార్పెంటర్లు, అటెండర్లు, వార్డు బాయ్స్, డ్రైవర్లు, టెలిఫోన్ ఆపరేటర్లు లాంటి పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతినిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న 13 నర్సింగ్ కళాశా లలు, ఇప్పటికే నడుస్తున్న 2 నర్సింగ్ కాలేజీలు కలిపి మొత్తం 15 కళాశాలల్లో మరో 900 పోస్టు ల భర్తీకి అనుమతినిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కళాశాలల్లో కూడా టైపిస్టు లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈవో), అటెం డర్లు, హౌజ్కీపింగ్, శానిటేషన్ సిబ్బంది, కుక్ లు, కిచెన్ బాయ్స్.. తదితర పోస్టులున్నా యి. ఈ పోస్టులన్నింటికీ గతంలో ప్రభుత్వం విడుద ల చేసిన ఉత్తర్వుల ప్రకారం వేతనం ఉంటుందని, వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ పోస్టు లు మనుగడలో ఉంటాయని పేర్కొన్నారు. ఒక్కో నర్సింగ్ కాలేజీకి మంజూరైన పోస్టులు టైపిస్టు/డీఈవో (2), రికార్డు అసిస్టెంట్ (2), అసిస్టెంట్ లైబ్రేరియన్ (1), హౌస్ కీపర్స్ (4), ఎలక్ట్రీషియన్/మెకానిక్ (1), అటెండర్లు (6), డ్రైవర్లు (4), వాచ్మెన్ (4), క్లీనర్లు (4), శానిటేషన్ సిబ్బంది (13), ల్యాబ్ అటెండెంట్స్ (5), లైబ్రరీ అటెండెంట్స్ (3), కుక్స్ (4), కిచెన్బాయ్స్ (5), ధోబీ (2) -
సీఆర్పీఎఫ్, అసోం రైఫిల్స్లో ఉద్యోగాలు
న్యూఢిల్లీలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు చెందిన స్పోర్ట్స్ బ్రాంచ్ ట్రెయినింగ్ డైరెక్టరేట్.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 06 ► పోస్టుల వివరాలు: ఫిజియోథెరపిస్ట్–05, న్యూట్రిషనిస్ట్–01. ఫిజియోథెరపిస్ట్: అర్హత: ఫిజియోథెరపీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 40ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు. న్యూట్రిషనిస్ట్: అర్హత: న్యూట్రిషన్లో ఎమ్మెస్సీ కోర్సు/న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 50ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► ఇంటర్వ్యూ వేదిక: ట్రెయినింగ్ డైరెక్టరేట్, సీఆర్పీఎఫ్, ఈస్ట్ బ్లాక్–10, లెవల్–7, సెక్టర్–1, ఆర్.కె.పురం, న్యూఢిల్లీ–110066 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఈమెయిల్: igtrg@crpf.gov.in ► దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021 ► వెబ్సైట్: https://crpf.gov.in అసోం రైఫిల్స్లో 131 పోస్టులు భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇంఫాల్ ప్రధాన కేంద్రంగా ఉన్న అసోం రైఫిల్స్.. 2021 సంవత్సరానికి మెరిటోరియస్ స్పోర్ట్స్పర్సన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. దీనిద్వారా రైఫిల్ మెన్/రైఫిల్ ఉమెన్ జనరల్ డ్యూటీ పోస్టులు భర్తీ చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 26.06.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.07.2021 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.assamrifles.gov.in -
NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో 89 పోస్టులు
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థ.. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ)కు చెందిన జార్ఖండ్లోని టాకిసుడ్ నార్త్ కోల్మైన్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 89 ► పోస్టుల వివరాలు: కొల్లియరీ ఇంజనీర్(మెకానికల్, ఎలక్ట్రికల్)–02, లెయిజనింగ్ ఆఫీసర్–02, మైనింగ్ ఇంజనీర్–12, సర్వేయర్–02, ఎలక్ట్రికల్ ఓవర్మెన్–04, మైన్ ఓవర్మెన్–25, మెకానికల్ ఓవర్మెన్–04, మైన్ సిర్దార్–38. ► అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు వాలిడ్ సిర్దార్ సర్టిఫికేట్ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోస్టుల ఇంటర్వ్యూ ఆధారంగా; సూపర్వైజర్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు రాతపరీక్ష సూపర్వైజరీ స్కిల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► పరీక్షా విధానం: రాతపరీక్ష మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన సూపర్వైజరీ పోస్టు అభ్యర్థులను సూపర్వైజరీ స్కిల్ టెస్ట్కు, నాన్ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు స్కిల్ టెస్ట్కు ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.06.2021 ► వెబ్సైట్: www.nmdc.co.in మరిన్ని నోటిఫికేషన్లు: ఏపీ: శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 22 ఉద్యోగాలు సదరన్ రైల్వేలో 3378 అప్రెంటిస్ ఖాళీలు బెల్లో ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు -
ఎయిమ్స్, భువనేశ్వర్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
భువనేశ్వర్లోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 90 ► విభాగాలు: అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ తదితరాలు. ► అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/ఎండీఎస్/డీఎం/ఎంసీహెచ్/డీఎన్బీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: సూచించిన పోస్టులకు దరఖాస్తులు మూడు రెట్లు ఎక్కువగా వస్తే రాతపరీక్ష నిర్వహిస్తారు. లేదంటే కేవలం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ లేదా కేవలం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.06.2021 ► వెబ్సైట్: https://aiimsbhubaneswar.nic.in ఐఎంఎంటీ, భువనేశ్వర్లో 14 ఖాళీలు భువనేశ్వర్లోని సీఎస్ఐఆర్–ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(ఐఎంఎంటీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 14 ► పోస్టుల వివరాలు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జి)–07, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఫైనాన్స్–అకౌంట్స్)–02, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్–పీ)–03, జూనియర్ స్టెనోగ్రాఫర్–02. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జి): వయసు: 27 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.19,900–63,200 చెల్లిస్తారు. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్–అకౌంట్స్): వయసు: 27 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.19,900–63,200 చెల్లిస్తారు. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్–పీ): వయసు: 27ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.19,900–63,200 చెల్లిస్తారు. ► జూనియర్ స్టెనోగ్రాఫర్: వయసు: 27ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.25,500–81,100 చెల్లిస్తారు. ► అర్హత: ఇంటర్మీడియట్(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ టైపింగ్లో ప్రొఫిషియన్సీ(ఇంగ్లిష్లో నిమిషానికి 35 పదాలు) ఉండాలి. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.06.2021 ► వెబ్సైట్: http://www.immt.res.in -
టీటీడబ్ల్యూఆర్డీసీఎస్లో పార్ట్టైం టీచింగ్ పోస్టులు
హైదరాబాద్లోని తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి చెందిన సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్(టీటీడబ్ల్యూర్డీసీఎస్)లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ సబ్జెక్టుల్లో పార్ట్టైం గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► డైరెక్టర్ హానరరీ: అర్హత: మాస్టర్ ఆఫ్ డిజైన్/పీహెచ్డీతో సమానమైన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.60,000 చెల్లిస్తారు. ► పార్ట్టైం ఫ్యాకల్టీ ఇన్ ఫ్యాషన్ డిజైన్: అర్హత: ఫ్యాషన్ డిజైన్/ఫ్యాషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ► పార్ట్టైం ఫ్యాకల్టీ ఇన్ ఇంటీరియర్ డిజైన్: అర్హత: ఇంటీరియర్ డిజైన్/తత్సమాన సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ► పార్ట్టైం ఫ్యాకల్టీ ఇన్ ఫోటోగ్రఫీ: అర్హత: ఫోటోగ్రఫీ/తత్సమాన సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ► పార్ట్టైం ఫ్యాకల్టీ ఇన్ కంప్యూటర్ సైన్స్: అర్హత: ఎంసీఏ/ఎంటెక్(సీఎస్ఈ/ఐటీ) తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021 ► వెబ్సైట్: www.ttwrdcs.ac.in మరిన్ని నోటిఫికేషన్లు: ఆర్సీబీలో టెక్నికల్ కొలువులు డీఎస్ఎస్ఎస్బీలో 7236 ఉద్యోగాలు -
డీఎస్ఎస్ఎస్బీలో 7236 ఉద్యోగాలు
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(ఎన్సీటీ ఢిల్లీ) ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(డీఎస్ఎస్ఎస్బీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 7236 ► పోస్టుల వివరాలు: ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ)–6258, అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ, నర్సరీ)–628, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్–278, కౌన్సిలర్–50, పట్వారీ–10. ► ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): సబ్జెక్టులు: హిందీ, నేచురల్ సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, బెంగాలీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఏ(ఆనర్స్), బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు సీటెట్లో అర్హత సాధించి ఉండాలి. వయసు: 32 ఏళ్లు మించకూడదు. ► అసిస్టెంట్ టీచర్(ప్రైమరీ, నర్సరీ): అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లో డిప్లొమా/సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: అర్హత: మెట్రిక్యులేషన్/సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్లో నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి. వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. ► కౌన్సిలర్: అర్హత: సైకాలజీ/అప్లైడ్ సైకాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కౌన్సిలింగ్ సైకాలజీలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి. ► పట్వారీ: అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీతో పాటు ఉర్దూ /హిందీలో పని అనుభవం ఉండాలి. వయసు: 21–27 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: వన్ టైర్/టూ టైర్ ఎగ్జామినేషన్ స్కీమ్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 25.05.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.06.2021 ► వెబ్సైట్: dsssb.delhi.gov.in మరిన్ని నోటిఫికేషన్లు: ఐఐఐటీ శ్రీసిటీలో టీచింగ్ కొలువులు సీడ్యాక్, హైదరాబాద్లో 44 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు -
సుప్రీం, హైకోర్టుల్లో ఖాళీగా జడ్జీ పోస్టులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసేందుకు గాను కొలీజియం సిఫారసుల కోసం ఎదురు చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టులో 7 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండగా, రెండు హైకోర్టులు శాశ్వత ప్రధాన న్యాయమూర్తులు లేకుండానే నడుస్తున్నాయని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో ఇద్దరు ఒకటిన్నర నెలల్లో రిటైర్ కానున్నారని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోందని వివరించారు. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు(సీజేఐ)లుగా రిటైర్ కాగా, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందూ మల్హోత్రా పదవీ విరమణ చేశారు. మరో న్యాయమూర్తి ఎం.శంతను గౌడర్ గత నెలలో కన్నుమూశారని ఆయన తెలిపారు. దీంతో సుప్రీంకోర్టులో 34 జడ్జీలకుగాను ప్రస్తుతం 27 మందే ఉన్నారని చెప్పారు. కోల్కతా, అలహాబాద్ హైకోర్టులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులతోనే నడుస్తున్నాయన్నారు. దేశంలోని 25 హైకోర్టుల్లో కలిపి 1,080 జడ్జీలకు గాను ప్రస్తుతం 660 మంది ఉన్నారని చెప్పారు. పదోన్నతులు, రాజీనామాలు, పదవీ విరమణల కారణంగా జడ్జీల పోస్టుల్లో ఖాళీలు పెరుగుతున్నాయని తెలిపారు. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకం కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య నిరంతరం సహకార ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. సుప్రీంకోర్టు జడ్జీలు, 25 హైకోర్టు జడ్జీల నియామకానికి సంబంధించిన పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. వాటిని పరిశీలించాక కేంద్రం ఆ సిఫారసులకు ఆమోదం తెలపవచ్చు లేదా పునఃపరిశీలనకు తిప్పి పంపవచ్చు. హైకోర్టులో జడ్జీల ఖాళీలపై హైకోర్టు కొలీజియం తన సిఫారసులను ముందుగా న్యాయ శాఖకు అందజేస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలను వాటికి జత చేసి, ఆ సిఫారసులను న్యాయశాఖ తిరిగి సుప్రీం కోలీజియంకు పంపిస్తుంది. సీజేఐతోపాటు నలుగురు అత్యంత సీనియర్ జడ్జీలు సుప్రీంకోర్టు కొలీజియంలో ఉంటారు. ఇక్కడ చదవండి: 2-డీజీ మొత్తం ప్రపంచాన్ని కాపాడుతుంది: కేంద్ర ఆరోగ్య మంత్రి Ambulance Couple: పెళ్లి బహుమతిగా అంబులెన్స్! -
TSRTC: రంగారెడ్డిలో 33 అప్రెంటిస్ పోస్ట్లు
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్టీసీ), రంగారెడ్డి రీజియన్.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 33 ► మెకానిక్ డీజిల్(అప్రెంటిస్): అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ► స్టయిపండ్: రూ.6,931 నుంచి రూ.7,797 చెల్లిస్తారు. ► శిక్షణా వ్యవధి: 25 నెలలు ఉంటుంది. ఇందులో బేసిక్ ట్రెయినింగ్ కాలవ్యవధి 6 నెలలు, జాబ్ ట్రెయినింగ్ కాలం 19 నెలలు ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 08.04.2021 ► వెబ్సైట్: https://apprenticeshipindia.org/ ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు; ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి -
ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు; ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి
దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(ఈఎంఆర్ఎస్)లో టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3476 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులున్నాయి. వీటిలో తెలంగాణకు సంబంధించి 262 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో 117 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు ►ప్రిన్సిపల్–175, వైస్ ప్రిన్సిపల్–116 ► పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్–1244 ► ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్–1944 రాష్ట్రాల వారీగా ఖాళీలు ఆంధ్రప్రదేశ్–117(ప్రిన్సిపల్ 14, వైస్ ప్రిన్సిపల్ 06, టీజీటీ 97), తెలంగాణ–262(ప్రిన్సిపల్11, వైస్ ప్రిన్సిపల్ 06, పీజీటీ 77, టీజీటీ 168), ఛత్తీస్గఢ్–514, గుజరాత్–161, హిమాచల్ప్రదేశ్–08, జార్ఖండ్–208, జమ్మూ అండ్ కాశ్మీర్–14, మధ్యప్రదేశ్–1279, మహా రాష్ట్ర–216, మణిపూర్–40, మిజోరం–10, ఒడిశా–144, రాజస్తాన్–316, ఉత్తరప్రదేశ్–79, ఉత్తరాఖండ్–09, సిక్కిం–44, త్రిపుర–58. ఈఎంఆర్ఎస్ గిరిజన ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేసినవే.. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(ఈఎంఆర్ఎస్). ప్రస్తుతం 17 రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 3476 పోస్టుల ఖాళీల భర్తీకి కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న పాఠశాలలతోపాటు ప్రస్తుత ఏడాది ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో వీరిని భర్తీచేసే అవకాశం ఉంది. విద్యార్హతలు ► ప్రిన్సిపల్ : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 45శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ, బీఎడ్ లేదా తత్సమాన డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే హిందీ, ఇంగ్లిష్ మీడియం బోధనలో నైపుణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ► వైస్ ప్రిన్సిపల్: వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, బీఈడ్ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ► పీజీటీ: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వీటితోపాటు హిందీ, ఇంగ్లిష్ మీడియం బోధనలో నైపుణ్యం ఉండాలి. ► టీజీటీ : టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీతోపాటు బీఈడీ, సంబంధిత సబ్జెక్టుల్లో సీటెట్/టెట్లో అర్హత సాధించి ఉండాలి. వీటితోపాటు హిందీ, ఇంగ్లిష్ మీడియం బోధనలో నైపుణ్యం ఉండాలి. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ), ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టీజీటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూ రౌండ్ ఉండదు. ఎంపికకు సంబంధించిన అర్హత పరీక్షలను ఆయా ప్రాంతాల్లోనే నిర్వహిస్తారు. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో చేసుకోవాలి ► దరఖాస్తులకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2021 ► పరీక్ష తేదీ: జూన్ మొదటి వారంలో ► వెబ్సైట్: https://tribal.nic.in/ -
కలికిరి సైనిక్ స్కూల్లో టీచింగ్, నాన్టీచింగ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్ స్కూల్.. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 23 ► పోస్టుల వివరాలు: హెడ్మాస్టర్–01, ప్రీ ప్రైమరీ టీచర్లు–03, ప్రైమరీ టీచర్లు–06, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్–01, మ్యూజిక్/ డ్యాన్స్ టీచర్–01, స్పెషల్ ఎడ్యుకేటర్–01, పీఈటీ–01, హెడ్ క్లర్క్–01, అకౌంట్ క్లర్క్–01, డ్రైవర్–01, ఆయాలు–04, ఎంటీఎస్–02. ► హెడ్ మాస్టర్: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.35,000 చెల్లిస్తారు. ► ప్రీ ప్రైమరీ టీచర్లు: అర్హత: ఇంటర్మీడియట్, ఎన్టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు. ► ప్రైమరీ టీచర్లు: అర్హత: గ్రాడ్యుయేషన్, డీఈఈటీ/బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్/టెట్ అర్హత కలిగి ఉండాలి. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు. ► ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్: అర్హత: బీఎఫ్ఏ, టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► మ్యూజిక్/డ్యాన్స్ టీచర్: అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► స్పెషల్ ఎడ్యుకేటర్: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► పీఈటీ: అర్హత: ఇంటర్మీడియట్/ యూజీడీపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► హెడ్క్లర్క్: అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ► అకౌంట్ క్లర్క్: అర్హత: బీకాం ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ► డ్రైవర్: అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఆయా: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంటీఎస్: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్,రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ► దరఖాస్తులకు చివరి తేది: 10.04.2021 ► వెబ్సైట్: www.sskal.ac.in ఏపీ పౌరసరఫరాల శాఖలో ఖాళీలు.. దరఖాస్తు చేసుకోండి -
హైదరాబాద్: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో జాబ్స్
హైదరాబాద్లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 12 పోస్టుల వివరాలు: సూపర్వైజర్లు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ విభాగాలు: ప్రింటింగ్, టెక్నికల్ కంట్రోల్, ఐటీ, ఓఎల్, హిందీ. అర్హతలు: సూపర్వైజర్(ప్రింటింగ్): డిప్లొమా(ప్రింటింగ్ టెక్నాలజీ) /బీటెక్/బీఈ /బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు. సూపర్వైజర్(టెక్నికల్ కంట్రోల్): డిప్లొమా (ప్రింటింగ్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్/ఐటీ)/బీటెక్/బీఈ/ బీఎస్సీ(మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్/ఐటీ) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు. సూపర్వైజర్(ఐటీ): డిప్లొమా, బీటెక్/బీఈ(కంప్యూటర్ సైన్స్/ఐటీ) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు. సూపర్వైజర్(ఓఎల్): మాస్టర్స్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణులవ్వాలి. హిందీ /ఇంగ్లిష్ ట్రాన్స్లేషన్లో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది: 10.04.2021 వెబ్సైట్: https://spphyderabad.spmcil.com/Interface/JobOpenings.aspx?menue=5 ఈసీఐఎల్లో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు -
ఏపీ: ప్రకాశం జిల్లాలో 34 బ్యాక్లాగ్ ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ►మొత్తం ఖాళీల సంఖ్య: 34 ► డి.ఎస్.సి. పరిధిలోని ఉద్యోగాలు: –జూనియర్ అకౌంటెంట్–01, జూనియర్ అసిస్టెంట్–08, జూనియర్ ఆడిటర్–01, జూనియర్ స్టెనో–01, ల్యాబ్ టెక్నీషియన్–01, ఎలక్ట్రీషియన్–01, ఎం.పి.హెచ్.ఎ–02. ► డి.ఎస్.సి. పరిధిలోనికి రాని ఉద్యోగాలు: ఆఫీసు సబార్డినేట్/ అటెండర్–07, పబ్లిక్ హెల్త్ మేస్త్రి–01, పబ్లిక్ హెల్త్ వర్కర్–08, కుక్–02, చౌకిదార్–01. ► అర్హతలు: ఎ జూనియర్ అకౌంటెంట్: డిగ్రీ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీటెక్/బీఈ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► జూనియర్ అసిస్టెంట్: కంప్యూటర్ ఆటోమేషన్కు సంబంధించిన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► జూనియర్ ఆడిటర్: కంప్యూటర్ ఆటోమేషన్కు సంబంధించిన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► జూనియర్ స్టెనో: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైప్ రైటింగ్, షార్ట్హ్యాండ్ టైపింగ్లో అనుభవం ఉండాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► ల్యాబ్ టెక్నీషియన్: డీఎంఎల్టీ/ఎంఎల్టీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎలక్ట్రీషియన్: ఎలక్ట్రికల్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపీహెచ్ఏ(స్త్రీలు): ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఆఫీసు సబార్డినేట్(స్త్రీలు): ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► పబ్లిక్ హెల్త్ మేస్త్రి(స్త్రీలు): ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► పబ్లిక్ హెల్త్ వర్కర్(స్త్రీలు): ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► కుక్(స్త్రీలు): ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► చౌకిదార్(స్త్రీలు): ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: అకాడమిక్ మార్కులు, స్క్రీనింగ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్. దరఖాస్తును జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 22.03.2021 ► వెబ్సైట్: https://prakasam.ap.gov.in ఈసీఐఎల్లో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు -
ఎన్ఎండీసీలో జాబ్స్; 304 ఖాళీలు
హైదరాబాద్లోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎండీసీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 304 » పోస్టుల వివరాలు: ఫీల్డ్ అటెండెంట్(ట్రెయినీ)–65, మెయింటెనెన్స్ అసిస్టెంట్ (మెకానికల్)(ట్రెయినీ)–148, మెయింటెనెన్స్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్)(ట్రెయినీ)–81, బ్లాస్టర్ గ్రేడ్–2(ట్రెయినీ)–01, ఎంసీఓ గ్రేడ్–3(ట్రెయినీ)–09. » ఫీల్డ్ అటెండెంట్(ట్రెయినీ): బీఐఓఎల్ కిరండల్ కాంప్లెక్స్–35, బీఐఓఎల్ బచేలీ కాంప్లెక్స్–30. అర్హత: మిడిల్ పాస్/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » మెయింటెనెన్స్ అసిస్టెంట్(మెకానికల్) (ట్రెయినీ): బీఐఓఎల్ కిరండల్ కాంప్లెక్స్ –76, బీఐఓఎల్ బచేలీ కాంప్లెక్స్–72. అర్హత: వెల్డింగ్/ఫిట్టర్/మెషినిస్ట్/మోటార్ మెకానిక్/డీజిల్ మెకానిక్/ఆటో ఎలక్ట్రీషియన్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » మెయింటెనెన్స్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్)(ట్రెయినీ): బీఐఓఎల్ కిరండల్ కాంప్లెక్స్ –49,బీఐఓఎల్ బచేలీ కాంప్లెక్స్–32. అర్హత: ఎలక్ట్రికల్ ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » బ్లాస్టర్ గ్రేడ్–2(ట్రెయినీ): అర్హత: బ్లాస్టర్ ట్రేడులో మెట్రిక్/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. మైనింగ్ మేట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. బ్లాస్టింగ్లో మూడేళ్ల అనుభవం ఉండాలి. » ఎంసీఓ గ్రేడ్–3(ట్రెయినీ): అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. » వయసు: 15.04.2021 నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకి రాతపరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఆధారంగా.. మిగిలిన పోస్టులకి రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. » పరీక్షా విధానం: ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకి 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ 70 మార్కులు, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. మిగతా పోస్టులకి 130 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సబ్జెక్టు నాలెడ్జ్(సంబంధిత ట్రేడు) 30 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 70 మార్కులు, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. » దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును పోస్ట్ బాక్స్ నెం.1383, పోస్ట్ ఆఫీస్, హుమాయూన్ నగర్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, పిన్–500028 చిరునామాకు పంపించాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021 » దరఖాస్తు హార్ట్కాపీలను పంపడానికి చివరి తేది: 15.04.2021 » వెబ్సైట్: https://www.nmdc.co.in/Careers/Default.aspx ఎన్ఎండీసీలో జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులు -
ఎన్ఎండీసీలో జాబ్స్; నోటిఫికేషన్ విడుదల
భారత ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్యూ), హైదరాబాద్లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ).. ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 63 జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ఎండీసీ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎండీసీ).. ఇనుప ఖనిజం, రాగి, రాక్ఫాస్పెట్, సున్నపురాయి, డోల్మైట్, జిప్సం, మాగ్నసైట్, డైమండ్ వంటి ఖనిజాల అన్వేషణ చేస్తోంది. ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి, ఎగుమతి చేయడంలో ఎన్ఎండీసీ దేశంలోనే అగ్రగామీ సంస్థ. అంతేకాకుండా ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఎన్ఎండీసీ 3.0 ఎమ్టీపీఏ ఇంటిగ్రేటెడ్ స్టీల్ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది. ఎప్పటిప్పుడు మానవ వనరుల అవసరాలకు అనుగుణంగా ఖాళీల ను భర్తీచేసే ఎన్ఎండీసీ.. తాజాగా జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టుల వివరాలు జూనియర్ ఆఫీసర్(మైనింగ్) ట్రైనీ–28 : » విద్యార్హతలు: మైనింగ్ ఇంజనీరింగ్లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు ఓపెన్కాస్ట్ మోటాలిఫెరస్ మైన్కు సంబంధించిన ఫోర్మెన్స్ సర్టిఫికేట్ను కలిగి ఉండాలి. లేదా మైనింగ్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఓపెన్కాస్ట్ మోటాలిఫెరస్ మైన్కు సంబంధించిన మైన్స్ మేనేజర్ సర్టిఫికేట్ను పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ ఆఫీసర్ (మెకానికల్ ) ట్రైనీ –17 » విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో మూడేళ్ల డిప్లొమా/మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ ఆఫీసర్(ఎలక్ట్రికల్)ట్రైనీ –13 : » విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో మూడేళ్ల డిప్లొమాతోపాటు ఎలక్ట్రికల్ సూపర్వైజరీ సర్టిఫికేట్(మైనింగ్)/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ ఆఫీసర్(సివిల్) ట్రైనీ–05 : » విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో మూడేళ్ల/సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. » వయసు: 32ఏళ్లకు మించుకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు–05ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్టంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం ఆన్లైన్ టెస్ట్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ను ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ పద్దతిలో మొత్తం100 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని సూపర్వైజరీ టెస్ట్కు పిలుస్తారు. ఈ పరీక్ష కూడా 100 మార్కులకు ఉంటుంది. సూపర్వైజరీ టెస్ట్ను అర్హత పరీక్షగా మాత్రమే పరిగణిస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల తుది జాబితా రూపొందించి.. నియామకం ఖరారు చేస్తారు. ముఖ్యమైన సమాచారం » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. » దరఖాస్తు చివరి తేదీ : 23.03.2021 » వెబ్సైట్ : https://www.nmdc.co.in/Careers/Default.aspx హెచ్పీసీఎల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి -
సీడ్యాక్, నోయిడాలో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ–డ్యాక్), నోయిడా యూనిట్.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 72 » పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ మేనేజర్–08, ప్రాజెక్ట్ ఇంజనీర్–64, » ప్రాజెక్ట్ మేనేజర్: విభాగాలు–ఖాళీలు: సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్–04, సొల్యూషన్ ఆర్కిటెక్ట్–04. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంసీఏ/ ఎంఈ/ఎంటెక్/ పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. » ప్రాజెక్ట్ ఇంజనీర్: విభాగాలు–ఖాళీలు: సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలపర్–10,సాఫ్ట్వేర్ డెవలపర్–50, మొబైల్ అప్లికేషన్ డెవలపర్–04. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ఎంసీఏ/పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ/కంప్యూటర్ అప్లికేషన్స్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 31.12.2020 నాటికి 37 ఏళ్లు మించకూడదు. » ఎంపిక విధానం: పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.02.2021 » వెబ్సైట్: https://www.cdac.in/ సీఎస్ఐఆర్–సీడీఆర్ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు లక్నోలోని సీఎస్ఐఆర్–సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీడీఆర్ఐ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 07 » పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్–01, ప్రాజెక్ట్ అసోసియేట్–04, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్–02. » ప్రాజెక్ట్ అసిస్టెంట్: అర్హత: లైఫ్ సైన్సెస్ సబ్జెక్టుల్లో బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 50 ఏళ్లు మించకూడదు. స్టయిపండ్: నెలకు రూ.20,000 + హెచఆర్ఏ చెల్లిస్తారు. » ప్రాజెక్ట్ అసోసియేట్: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, ఎంఫార్మసీ, ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. వేతనం ప్రాజెక్ట్ అసోసియేట్–1కు నెలకు రూ.31,000, ప్రాజెక్ట్ అసోసియేట్–2: నెలకు రూ.35,000 చెల్లిస్తారు. » సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: అర్హత: బీసీఏ, బీటెక్(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 50 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.18,000 + హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. » ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. » దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.02.2021 » వెబ్సైట్: https://cdri.res.in/ సీఎన్సీఐ, కోల్కతాలో వివిధ ఖాళీలు కోల్కతాలోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్(సీఎన్సీఐ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 152 » పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్ గ్రేడ్–1–14, స్పెషలిస్ట్ గ్రేడ్–2– 32, స్టాఫ్ నర్సు–106. » స్పెషలిస్ట్ గ్రేడ్–1: వయసు: 50 ఏళ్లు మించకూడదు. » స్పెషలిస్ట్ గ్రేడ్–2: వయసు: 45 ఏళ్లు మించకూడదు. » స్టాఫ్ నర్సు: వయసు: 35 ఏళ్లు మించకూడదు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 19.02.2021 » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.03.2021 » వెబ్సైట్: https://www.cnci.ac.in/ -
పోస్టుల భర్తీ ఆర్థిక పరిస్థితిని బట్టే!
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో భర్తీ చేసే పోస్టులపై ఇంకా స్పష్టత రాలేదు. ఖాళీ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం, హోంమంత్రి ఇటీవల వేర్వేరు సందర్భాల్లో ప్రకటించారు. దీంతో ఖాళీలను గుర్తించిన పోలీసు శాఖ దాదాపు 20 వేల వరకు పోస్టుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో 19,300లకు పైగా కానిస్టేబుళ్లు, దాదాపు 450 వరకు ఎస్సై పోస్టులు ఉన్నాయి. డిసెంబర్లోనే ఈ పోస్టుల వివరాలను ప్రభుత్వానికి అందజేసినా.. రిక్రూట్మెంట్ విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. గతేడాది ప్రబలిన కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు, ఈ పరిస్థితుల్లో ఎన్ని పోస్టులకు గ్రీన్ సిగ్నల్ వస్తుందన్న ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతోంది. సగం పోస్టులకైనా ఆర్థికశాఖ అనుమతిస్తుందా? లేక మొత్తం పోస్టుల భర్తీకి మొగ్గుచూపుతుందా? అన్న విషయం ప్రభుత్వ ఆదేశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర విషయాలపై ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా గతేడాది దాదాపు 10,300 కానిస్టేబుళ్లు, 1200 మంది ఎస్సైల పోస్టులను భర్తీ చేశారు. మరో 4 వేల మంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కానిస్టేబుళ్లు శిక్షణలో ఉన్నారు. వీరు జూలై నాటికి శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరతారు. సాధన షురూ.. పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి, హోంమంత్రి ప్రకటనల నేపథ్యంలో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడొచ్చన్న ప్రచారంతో.. లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు మైదానాల్లో శారీరక పరీక్షల కోసం సాధన ప్రారంభించారు. గతేడాది దాదాపు 18 వేల ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టులకు దాదాపు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి దాదాపు 7 లక్షల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారని అంచనా. -
టీఆర్ఎస్లో కొలువుల జాతర
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ రాజకీయ నాయకులకు కొలువుల జాతర రానుంది. ఒకవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధిష్టానం కసరత్తు చేస్తుండగా... మరోవైపు ఏడాది కాలంలో భారీ సంఖ్యలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు వారిని ఊరిస్తున్నాయి. అధికారిక ‘హోదా’కోసం ఆరాటపడుతున్న వారంతా... ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు.పైగా మెజారిటీ (స్థానిక సంస్థల్లో, ఎమ్మెల్యేల కోటాలో) తమవైపే ఉంది కాబట్టి గెలుపు ఖాయమనే ధీమాలో ఆశలు పెంచేసుకుంటున్నారు. శాసనమండలిలోని మొత్తం 40 మంది సభ్యులకుగాను వచ్చే ఏడాది జనవరి నాలుగో తేదీలోగా సగానికి పైగా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఈ ఏడాది మార్చి 29 నాటికి పట్టభద్ర ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎన్.రాంచందర్రావు పదవీకాలం పూర్తవుతుండటంతో ఇప్పటికే ఎన్నికల సందడి ప్రారంభమైంది. వీరితో పాటు శాసనసభ్యుల కోటా నుంచి మండలికి ఎన్నికైన మరో ఆరుగురు సభ్యుల పదవీకాలం కూడా ఈ ఏడాది జూన్ 3న ముగియనుంది. శాసనసభ్యుల కోటా నుంచి పదవీ విరమణ చేయనున్న ఎమ్మెల్సీల జాబితాలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. వీరితో పాటు గవర్నర్ కోటాలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి పదవీ కాలపరిమితి కూడా ఈ ఏడాది జూన్ 16న ముగియనుంది. ఈ ఏడాది పదవీ విరమణ చేస్తున్న తొమ్మిది మంది ఎమ్మెల్సీల్లో ఎన్.రామచందర్రావు (బీజేపీ) మినహా మిగతా ఎనిమిది మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. కాగా శాసనమండలికి స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన 14 మందిలో 12 మంది వచ్చే ఏడాది జనవరి 4న పదవీ కాలపరిమితి పూర్తి చేసుకుంటారు. వీరిలో నిజామాబాద్ నుంచి ఎన్నికైన కల్వకుంట్ల కవితతో పాటు పట్నం మహేందర్రెడ్డి (రంగారెడ్డి), టి.భానుప్రసాద్ (కరీంనగర్), పురాణం సతీష్ (ఆదిలాబాద్), నారదాసు లక్ష్మణ్రావు (కరీంనగర్), వి.భూపాల్రెడ్డి (మెదక్), సుంకరి రాజు (రంగారెడ్డి), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్నగర్), కూచుకుళ్ల దామోదర్రెడ్డి (మహబూబ్నగర్), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి (వరంగల్), తేరా చిన్నపరెడ్డి (నల్గొండ) ఉన్నారు. మొత్తంగా వచ్చే ఏడాది జనవరి 4వ తేదీలోగా ఖాళీ అయ్యే 21 శాసనమండలి స్థానాల్లో 20 మంది టీఆర్ఎస్ పార్టీ సభ్యులే ఉన్నారు. మళ్లీ అడుగు పెట్టేదెవరో? పట్టభద్రుల కోటాలో రెండు స్థానాలు ఈ ఏడాది మార్చి 29న ఖాళీ అవుతుండటంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజవకర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోమారు పోటీ చేయడం ఖాయమైంది. మరో పట్టభద్రుల నియోజకవర్గం ‘హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్నగర్’నుంచి బీజేపీకి చెందిన రాంచందర్రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో ఫలితాలు ఎలా వచ్చినా... వచ్చే ఏడాది జనవరిలోగా ఖాళీ అయ్యే మరో 19 శాసనమండలి స్థానాలు తిరిగి టీఆర్ఎస్ ఖాతాలోనే చేరే అవకాశముంది. అటు శాసనసభలో, ఇటు స్థానికసంస్థల్లో టీఆర్ఎస్కు పూర్తిస్థాయిలో బలం ఉండటంతో ఆయా కోటా శాసనమండలి స్థానాలకు జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే తిరిగి ఎన్నికయ్యే అవకాశముంది. అందుకే ఆశావహుల్లో పోటీనెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత శాసన మండలిలో మెజారిటీ కోసం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసలను ప్రోత్సహించడంతో వివిధ సందర్భాల్లో పలువురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరారు. వీరిలో వి.భూపాల్రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, టి.భానుప్రసాద్ తదితరులకు రెండో పర్యాయం కూడా ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఈ టర్మ్ ముగిశాక వీరి భవితవ్యం ఏమిటనే ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మంత్రివర్గంలో చోటు దక్కని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొంది. ఫరీదుద్దీన్, నేతి విద్యాసాగర్, ఆకుల లలితను మండలికి మళ్లీ నామినేట్ చేసేందుకు ఎంత మేర అవకాశాలున్నాయనే అంశంపై చర్చ జరుగుతోంది. ‘చైర్మన్’గా గుత్తా కొనసాగింపు! గుత్తా సుఖేందర్రెడ్డి 2019 ఆగస్టులో శాసనమండలి సభ్యుడిగా ఎన్నిక కాగా, అదే ఏడాది సెప్టెంబర్లో మండలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జూన్ 3న ఎమ్మెల్సీగా ఆయన పదవీకాలం ముగియనున్న ఈ నేపథ్యంలో మరోమారు గుత్తా సభ్యత్వాన్ని పొడిగించడంతో పాటు మండలి చైర్మన్గా కొనసాగించే యోచనలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఆశావహులు ఎందరో... శాసనమండలిలో సగానికి పైగా స్థానాలు రెండు విడతలుగా ఖాళీ అవుతుండటంతో ఔత్సాహికుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలు, సామాజికవర్గాల సమీకరణాల్లో తమకు ఎంత మేర అవకాశముందనే లెక్కలు వేసుకుంటూ... మండలిలో చోటు కోసం ఇప్పటి నుంచే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమకాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారితో పాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నాయకులు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని కేసీఆర్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. ఔత్సాహికుల జాబితాలో మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాజ్యసభ మాజీ ఎంపీ గుండు సుధారాణి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ విప్ కర్నె ప్రభాకర్ ఉన్నారు. వీరితో పాటు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్రావు, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, క్యామ మల్లేశ్ యాదవ్లు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బ్రేవరేజెస్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ తదితరులు కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు. శాసనమండలి కూర్పు ఇలా... స్థానిక సంస్థల కోటాలో ఎన్నికయ్యేవారు 14 శాసనసభ్యుల ఎన్నుకొనేవారు 14 గవర్నర్ కోటాలో నామినేటెడ్ 6 పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి 3 ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి 3 మొత్తం: 40 ప్రస్తుతం ఎవరికెంత బలం... ప్రస్తుతం శాసనమండలిలో ఎంఐఎంకు ఇద్దరు, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉపాధ్యాయుల కోటా నుంచి ఎన్నికైన ముగ్గురు సభ్యుల్లో ఎ.నర్సిరెడ్డి మినహా మిగతా ఇద్దరు టీఆర్ఎస్కు అనుబంధంగా పనిచేస్తున్నారు. దీంతో శాసనమండలిలో 40 మంది సభ్యులకు గాను 35 మందిని టీఆర్ఎస్కు చెందిన వారిగానే పరిగణించొచ్చు. -
మళ్లీ ఉద్యోగ ‘సంబరం’
అరసవల్లి: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కానుకను అందించనుంది. గతేడాది అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి.. భారీగా నియామకాలు చేపట్టి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో వేలాదిమంది నిరుద్యోగులను ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా నియమించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అమలు, పరిపాలన వికేంద్రీకరణలో సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ కారణాలతో ఇంకా ఖాళీగా ఉన్న సచివాలయాల ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈమేరకు అదనపు నోటిఫికేషన్ను ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా నిరుద్యోగుల కోసం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తున్న క్రమంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, ఆ తర్వాత కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికల వాయిదాతోపాటు సచివాలయాల ఉద్యోగుల భర్తీ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో వచ్చే నెల మూడో వారంలో అర్హత రాత పరీక్షలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో 1187 పోస్టుల భర్తీ కలెక్టర్ జె.నివాస్ ఆధ్వర్యంలో జెడ్పీ సీఈవో జి.చక్రధరరావు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్ ఈ నియామకాలకు చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 835 గ్రామ సచివాలయాలు, 95 వార్డు సచివాలయాలుండగా, వీటిల్లో 19 విభాగాల్లో 7884 పోస్టులను గుర్తించారు. గతేడాది 6697 పోస్టులను భర్తీ చేయగా, వివిధ కారణాలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పలు పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. ఇలా ఖాళీగా ఉన్న 1187 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా సుమారు 70 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 48,756 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. వీరికే హాల్టిక్కెట్లు పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ 20 నుంచి రాత పరీక్షలు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు వచ్చే నెల 20 నుంచి ఓ వారం రోజులపాటు రాతపరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా నిర్ణయించింది. జిల్లాలో 19 విభాగాల్లో 1187 పోస్టులను భర్తీ చేసే క్రమంలో పరీక్షలను విభాగాల వారీగానే నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటిస్తూ.. పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయనున్నారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రాల వద్ద వీడియో రికార్డింగ్ చేయాలని, అలాగే ప్రతి పరీక్ష కేంద్రాన్ని శానిటైజ్ స్ప్రే చేయాలని, థర్మల్ స్కానింగ్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షల నిర్వహణ రెండో విడత సచివాలయాల్లో పోస్టుల భర్తీకి సర్వం సిద్ధం చేస్తున్నాం. కోవిడ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అవసరమైనన్ని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. తొలి విడత కంటే అభ్యర్థులు తగ్గినప్పటికీ వైరస్ ప్రభావం పడకుండా పరీక్ష కేంద్రాలను ఎక్కువగానే ఏర్పాటు చేస్తాం. 1187 పోస్టులకు 48,756 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. – జి.చక్రధరరావు, జిల్లా పరిషత్ సీఈవో -
రా..రమ్మంటున్న.. ఉద్యోగాలు!
విజయనగరం: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికోసం సెప్టెంబర్ 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించాలని ఇటీవల నిర్ణయించింది. ఇప్పటికే పరీక్ష కేంద్రాల గుర్తింపు పూర్తయినట్లు రాష్ట్రస్థాయి అధికారులు చెబుతున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలను చేపట్టారు. రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ల ప్రకారం కొందరు అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో పలు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే మిగిలిన సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది రెండో విడతగా జనవరి 11న ప్రభుత్వ ప్రకటన జారీ చేసింది. ఏప్రిల్లోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కరోనా వ్యాప్తి కారణంగా జరగలేదు. ఆ తరువాత ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారని భావించినా కోవిడ్ ఉద్ధృతి తగ్గని నేపథ్యంలో మరోసారి వాయిదాపడింది. తాజాగా సెప్టెంబర్ 20వతేదీ నుంచి సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు జరుగుతాయని రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రకటించడంతో జిల్లాలోని నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు పరీక్ష కేంద్రాల్లోని గదుల్లో భౌతిక దూరం పాటిస్తూ తక్కువమంది అభ్యర్థులనే కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. నిరుద్యోగుల నుంచి అధిక పోటీ: జాతిపిత మహాత్మా గాం«ధీ కలలుకన్న గ్రామ స్వరాజ్య పాలన అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన సచివాలయ వ్యవస్థకు అనూహ్య స్పందన లభిస్తోంది. గతేడాది నుంచి ప్రారంభమైన వ్యవస్థ ద్వారా ప్రజలకు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ సేవలు సులభంగా అందుతున్నాయి. ఈనేపథ్యంలో గతంలో భర్తీ కాని మిగులు పోస్టులను ఈ ఏడాది భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రెండవ విడతగా రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లాలో వివిధ పోస్టులు 1134 ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం ఆన్లైన్లో 48,276 దరఖాస్తులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. పరీక్షల ద్వారా 18 రకాల ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఇందులో గ్రామీణ పరిధిలో 12, పట్టణ ప్రాంతాల్లో 6 ఉన్నాయి. ప్రతి ఉద్యోగానికి నిర్దేశిత విద్యార్హతలు తప్పక ఉండాలి. ప్రతి ఉద్యోగ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచారు. గత ప్రకటనతో పోలిస్తే ఈసారి చాలా తక్కువ ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తుల సమర్పణకు గడువు ముగిసింది. రాత పరీక్ష షెడ్యూల్ ఖరారు విజయనగరం రూరల్: గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండో విడత ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాత పరీక్ష షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో పంచాయతీరాజ్ శాఖా మంత్రి పి.రామచంద్రారెడ్డి, కమిషనర్లు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పరీక్షల నిర్వహణపై పలు మార్గదర్శకాలు విడుదల చేశారు. అలాగే వివిధ విభాగాల ఉద్యోగాలకు నిర్వహించే రాత పరీక్షలను వచ్చే నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్న సమయాల్లో నిర్వహించనున్నారు. -
సబ్ ఎడిటర్లు కావలెను
సాక్షి పత్రిక అనుబంధ వెబ్సైట్ "సాక్షి డాట్ కామ్"లో పనిచేసేందుకు సబ్ ఎడిటర్లు/సీనియర్ సబ్ ఎడిటర్లు కావలెను. మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్లుగా, న్యూస్ వెబ్సైట్లలో కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు సబ్ ఎడిటర్గా పనిచేసిన అనుభవం ఉండాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ బాగా చేయగలగాలి. 30 సంవత్సరాల లోబడిన వయసు కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈ కింద పేర్కొన్న మెయిల్కు పూర్తి వివరాలతో కూడిన బయోడేటాలను ఈ నెల 31 వ తేదీలోగా పంపించగలరు. recruitments@sakshi.com -
పంచాయతీలలో కార్మికుల భర్తీకి కసరత్తు
సాక్షి, ఆదిలాబాద్: ఏడాది క్రితం ప్రతీ పంచాయతీకో కార్యదర్శిని నియమించిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతీ పంచాయతీకో పారిశుధ్య కార్మికుడిని నియమించాలని నిర్ణయించింది. పల్లెలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతీ గ్రామంలో కార్మికులు తప్పనిసరని భావిస్తోంది. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ద్వారా పారిశుధ్య కార్మికుల పనిని దగ్గరుండి పరిశీలించిన సర్కారు.. కార్మికుల భర్తీకి శ్రీకారం చుట్టింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్న వారిని అన్ని రకాల పనులకు వినియోగిచడంతోపాటు జీతం కూడా ఎక్కువగా ఇవ్వనున్నారు. కాగా, కార్మికులను ఔట్సోర్సింగ్ పద్ధతిన నియమించుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు ఖాళీల వివరాలను కార్యదర్శుల నుంచి సేకరిస్తున్నారు. ఏ పంచాయతీకి ఎంత మంది కావాలి.. ప్రస్తుతం ఉన్న వారి సంఖ్యతోపాటు ఆసక్తిగా ఉన్న వారి వివరాలను పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులతో పాటు కొత్తగా చేరే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పుల్టైం వర్కర్లకు నెలకు రూ.8,500 చొప్పున వేతనం ఇవ్వాలని అధికారులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో (జీవో 51) స్పష్టం చేసింది. వివరాలు సేకరిస్తున్న కార్యదర్శులు పాత గ్రామ పంచాయతీలతోపాటు కొత్త వాటిలోనూ సరిపడా కార్మికులు లేరు. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతీ 500 మంది జనాభాకు ఒక స్వీపర్.. ఒక పంప్ ఆపరేటర్ పని చేసేవారు. గ్రామంలో 2 వేల జనాభా ఉంటే అక్కడ ఇద్దరు స్వీపర్లు, ఒక ఆపరేటర్ ఉండాలి. ఐదువేల జనాభా దాటిన పంచాయతీల్లో ముగ్గురు లేదా నలుగురు స్వీపర్లు పారిశుధ్య పనులు చేపట్టేవారు. ఇక మేజర్ గ్రామ పంచాయతీల్లో అధిక సంఖ్యలో ఉండాల్సి ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారిశుధ్య కార్మికుల జనాభా ప్రతిపాదికన పంచాయతీలో ఎంత మంది కార్మికులు అవసరం.. ప్రస్తుతం రెగ్యులర్గా ఎంత మంది కార్మికులుగా పని చేస్తున్నారు. కార్మికులుగా పని చేసేందుకు ఎవరెవరూ ఆసక్తిగా ఉన్నారనే వివరాలతో కూడిన నివేదికలను కార్యదర్శులు సిద్ధం చేస్తున్నారు. కార్యదర్శులు సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో ఎంత మంది కార్మికులను కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోనున్నారో వెల్లడి కానుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో మరికొందరికీ అవకాశం గత నెలలో పల్లెల్లో చేపట్టిన ప్రణాళిక ద్వారా పారిశుధ్య కార్మికుల సంఖ్య స్పష్టంగా తెలిసింది. గ్రామాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత పనులతోపాటు ఇతర పనుల్లో కీలకంగా వ్యవహరించే కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో కొత్త వారిని తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో జిల్లాలో మరికొంత మంది పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగంలోకి చేరనున్నారు. అయితే జిల్లాలోని 17 గ్రామీణ మండలాల పరిధిలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 598 మంది పారిశుధ్య కార్మికులు ప్రస్తుతం పనులు చేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన వీరిని నియమించి వివిధ రకాల పనులు చేపట్టాల్సి ఉన్నా.. 500 నుంచి 2 వేల జనాభా గల గ్రామాల్లో కూడా ఒకరిద్దరితో సర్దుకుపోతున్నారే తప్పా.. కొత్త నియామకాలపై ఇంత వరకు దృష్టి సారించలేదు. దీంతో పారిశుధ్య కార్మికులు దాదాపు సగం పంచాయతీల్లో రెగ్యులర్గా కొనసాగుతుండగా, మరికొన్ని జీపీల్లో రోజు వారీ కూలీగా పని చేస్తున్నారు. అయితే రోజు వారి కూలీ రూ.250 నుంచి రూ.300 చెల్లించనుండగా, రెగ్యులర్గా కొనసాగుతున్న వారికి ఒక్కో పంచాయతీలో ఒక్కో విధంగా రూ.4 వేల నుంచి రూ.7వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కార్మికులపై దృష్టి పెట్టడంతో ఇక నుంచి అందరికీ సమానంగా వేతనం అందనుంది. ఆదిలాబాద్అర్బన్: ఏడాది క్రితం ప్రతీ పంచాయతీకో కార్యదర్శిని నియమించిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతీ పంచాయతీకో పారిశుధ్య కార్మికుడిని నియమించాలని నిర్ణయించింది. పల్లెలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతీ గ్రామంలో కార్మికులు తప్పనిసరని భావిస్తోంది. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ద్వారా పారిశుధ్య కార్మికుల పనిని దగ్గరుండి పరిశీలించిన సర్కారు.. కార్మికుల భర్తీకి శ్రీకారం చుట్టింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్న వారిని అన్ని రకాల పనులకు వినియోగిచడంతోపాటు జీతం కూడా ఎక్కువగా ఇవ్వనున్నారు. కాగా, కార్మికులను ఔట్సోర్సింగ్ పద్ధతిన నియమించుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు ఖాళీల వివరాలను కార్యదర్శుల నుంచి సేకరిస్తున్నారు. ఏ పంచాయతీకి ఎంత మంది కావాలి.. ప్రస్తుతం ఉన్న వారి సంఖ్యతోపాటు ఆసక్తిగా ఉన్న వారి వివరాలను పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులతో పాటు కొత్తగా చేరే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పుల్టైం వర్కర్లకు నెలకు రూ.8,500 చొప్పున వేతనం ఇవ్వాలని అధికారులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో (జీవో 51) స్పష్టం చేసింది. వివరాలు సేకరిస్తున్న కార్యదర్శులు పాత గ్రామ పంచాయతీలతోపాటు కొత్త వాటిలోనూ సరిపడా కార్మికులు లేరు. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతీ 500 మంది జనాభాకు ఒక స్వీపర్.. ఒక పంప్ ఆపరేటర్ పని చేసేవారు. గ్రామంలో 2 వేల జనాభా ఉంటే అక్కడ ఇద్దరు స్వీపర్లు, ఒక ఆపరేటర్ ఉండాలి. ఐదువేల జనాభా దాటిన పంచాయతీల్లో ముగ్గురు లేదా నలుగురు స్వీపర్లు పారిశుధ్య పనులు చేపట్టేవారు. ఇక మేజర్ గ్రామ పంచాయతీల్లో అధిక సంఖ్యలో ఉండాల్సి ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారిశుధ్య కార్మికుల జనాభా ప్రతిపాదికన పంచాయతీలో ఎంత మంది కార్మికులు అవసరం.. ప్రస్తుతం రెగ్యులర్గా ఎంత మంది కార్మికులుగా పని చేస్తున్నారు. కార్మికులుగా పని చేసేందుకు ఎవరెవరూ ఆసక్తిగా ఉన్నారనే వివరాలతో కూడిన నివేదికలను కార్యదర్శులు సిద్ధం చేస్తున్నారు. కార్యదర్శులు సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో ఎంత మంది కార్మికులను కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోనున్నారో వెల్లడి కానుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో మరికొందరికీ అవకాశం గత నెలలో పల్లెల్లో చేపట్టిన ప్రణాళిక ద్వారా పారిశుధ్య కార్మికుల సంఖ్య స్పష్టంగా తెలిసింది. గ్రామాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత పనులతోపాటు ఇతర పనుల్లో కీలకంగా వ్యవహరించే కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో కొత్త వారిని తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో జిల్లాలో మరికొంత మంది పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగంలోకి చేరనున్నారు. అయితే జిల్లాలోని 17 గ్రామీణ మండలాల పరిధిలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 598 మంది పారిశుధ్య కార్మికులు ప్రస్తుతం పనులు చేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన వీరిని నియమించి వివిధ రకాల పనులు చేపట్టాల్సి ఉన్నా.. 500 నుంచి 2 వేల జనాభా గల గ్రామాల్లో కూడా ఒకరిద్దరితో సర్దుకుపోతున్నారే తప్పా.. కొత్త నియామకాలపై ఇంత వరకు దృష్టి సారించలేదు. దీంతో పారిశుధ్య కార్మికులు దాదాపు సగం పంచాయతీల్లో రెగ్యులర్గా కొనసాగుతుండగా, మరికొన్ని జీపీల్లో రోజు వారీ కూలీగా పని చేస్తున్నారు. అయితే రోజు వారి కూలీ రూ.250 నుంచి రూ.300 చెల్లించనుండగా, రెగ్యులర్గా కొనసాగుతున్న వారికి ఒక్కో పంచాయతీలో ఒక్కో విధంగా రూ.4 వేల నుంచి రూ.7వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కార్మికులపై దృష్టి పెట్టడంతో ఇక నుంచి అందరికీ సమానంగా వేతనం అందనుంది. ఖాళీల వివరాలు పంపించాం గ్రామ పంచాయతీలో పని చేస్తున్న కార్మికుల సంఖ్యతోపాటు ఖాళీల వివరాలను అధికారులకు పంపించాం. కొత్తగా నియామకానికి సంబంధించిన ఆదేశాలు జిల్లా ఉన్నతాధికారుల నుంచి మాకు రాలేదు. ఆదేశాలు రాగానే కొత్త వారిని తీసుకునేందుకు చర్యలు చేపడుతాం. – లక్ష్మీనారాయణ, సాంగిడి పంచాయతీ కార్యదర్శి, బేల -
తహసీల్దార్లు కావలెను
సాక్షి, అనంతపురం అర్బన్: జిల్లా పరిపాలనలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖకు సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. దీంతో రెవెన్యూ సిబ్బందిపై పనిభారం పెరగగా...పనులు సకాలంలో జరగక ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భూపరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం నుంచి తహసీల్దార్లను జిల్లాకు ఎప్పుడు కేటాయింపు జరుగుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. పరిపాలనాధికారి పోస్టులే ఖాళీ ప్రస్తుతం జిల్లాలోని 17 తహసీల్దార్లు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఐదు రెవెన్యూ డివిజన్లు ఉండగా.. అందులో నాలుగు డివిజన్లలో పరిపాలనాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కలెక్టరేట్లో రెండు విభాగాలకు సంబంధించి సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 11 మండలాల్లో తహసీల్దారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తహసీల్దార్ పోస్టుల ఖాళీలు ఇలా... రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో డివిజన్ పరిపాలనాధికారులుగా (డీఏఓ) తహసీల్దార్లు ఉంటారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ మినహా అనంతపురం, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాల్లో డీఏఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక కలెక్టరేట్లో విభాగాల సూపరింటెండెంట్లుగా తహసీల్దార్లు ఉంటారు. హెచ్–సెక్షన్ , ఈ–సెక్షన్లకు సూపరింటెండెంట్లు లేరు. దీంతో ఈ స్థానాల్లో డిప్యూటీ తహసీల్దార్లను నియమించాల్సిన పరిస్థితి నెలకొంది. మండలాల విషయానికి పెద్దపప్పూరు, వజ్రకరూరు, విడపనకల్లు, యల్లనూరు, బ్రహ్మసముద్రం, ఆడమడగూరు, నల్లచెరువు, నల్లమాడ, తలపుల, తాడిపత్రి, ఓడీచెరువు తదితర 11 మండలాల్లో తహసీల్దారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండలాల్లో ఇన్చార్జిల పాలన ప్రభుత్వపరంగా అమలయ్యే కార్యక్రమాల్లో చాలా వరకు రెవెన్యూశాఖ కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. ఇలాంటి ప్రాధాన్యత కలిగిన శాఖలో తహసీల్దార్ల కొరత కారణంగా కొన్ని మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లను ఇన్చార్జిగా నియమించారు. దీంతో ఆయా మండలాల్లో సమర్థవంతమైన పాలన సాగడం లేదనే అభిప్రాయాలు రెవెన్యూ శాఖ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రెవెన్యూకు సంబంధించిన పనులు కూడా సకాలంలో జరగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దారు స్థానాల ఖాళీలు ఇలా... ఆర్డీఓ కార్యాలయాల్లో డీఏఓ పోస్టుల ఖాళీలు - 4 కలెక్టరేట్లో సూపరింటెండెంట్ పోస్టుల ఖాళీలు - 2 మండలాల్లో తహసీల్దారు పోస్టుల ఖాళీలు - 11 -
విద్యాశాఖకు ఖాళీల దెబ్బ!
సాక్షి, నల్లగొండ : ఖాళీల దెబ్బకు జిల్లా విద్యాశాఖ కుదేలవుతోంది. ఎంతో ప్రాధాన్యమున్న ఈ శాఖను ముందుకు నడిపే అధికారుల్లేక కునారిల్లుతోంది. జిల్లాలోని 31 మండలాలకు ఒక్కటంటే ఒక్క మండలానికి కూడా ఎంఈఓ (మండల విద్యాధికారి) లేడంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఏళ్ల తరబడి టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఇన్చార్జ్ లతోనే కాలాన్ని వెల్లదీసే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఉప విద్యాధికారులతో పాటు 31 మండలాలకు ఒక్క రెగ్యులర్ అధికారి లేక పర్యవేక్షణ కొరవడింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. తొమ్మిదేళ్లుగా పదోన్నతులు ఏవీ? విద్యాశాఖలో గడిచిన తొమ్మిదేళ్లుగా పదోన్నతులు లేవు. ఉపాధ్యాయుల్లో,ప్రభుత్వ ఉపాధ్యాయులు,జిల్లా పరిషత్ ఉపాధ్యాయులుగా రెండు విభాగాలున్నాయి. వీరి మధ్య ఏళ్ల తరబడి సర్వీస్ రూల్స్ సమస్య తేలక పదోన్నతులన్నీ నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ సమస్య న్యాయస్థానంలో ఉంది. పదోన్నతులు కల్పించని కారణంగానే, ఇన్చార్జ్ల పాలన అనివార్యమవుతోందని చెబుతున్నారు.జిల్లాలో 1483 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో పనిచేసే ఉప విద్యాధికారులతో పాటు మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు కూడా సరిపడా లేక విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మూడు ఉప విద్యాధికారుల పోస్టులు ఖాళీ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉండగా ఒక్కో డివిజన్కు ఒక ఉప విద్యాధికారి చొప్పున మూడు పదవులు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులో మాత్రమే అధికారి ఉండగా, మూడు డిప్యూటీ డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ డివిజన్లలో ఉప విద్యాధికారులుండాల్సి ఉండగా, ఆ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. మరో వైపు మొత్తం 31 మండలాలకు గానూ ఒక్కో మండలంలో ఒక్కో మండల విద్యాధికారి ఉండాలి. 31 మండలాల పరిధిలో ఒక్కరు రెగ్యులర్ ఎంఈఓ లేరు. కొన్నేళ్లుగా, ఆయా మండలాల్లో సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులనే ఆయా మండలాల విద్యాశాఖ ఇన్చార్జులుగా పనిచేస్తున్నారు. 862 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ జిల్లాలో 862 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యావలంటీర్లతోనే ప్రతి విద్యాసంవత్సరాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది కూడా 832మంది విద్యావలంటీర్లుగా, గత సంవత్సరం బోధించిన వారినే రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ప్రభుత్వం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే దిశలో పావులు కదుపుతోంది. ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. ఎరికీ నష్టం జరగకుండా పదోన్నతులు కల్పించేందుకు సరైన ప్రణాళికలు తయారు చేయాలని సీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో తమకు త్వరలోనే పదోన్నతులు లభిస్తాయన్న ఆశాభావం టీచర్లలో వ్యక్తమవుతోంది. కొరవడిన పర్యవేక్షణాలోపం విద్యాశాఖలోని ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు నిత్యం పాఠశాలలు సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించి విద్యాబోధన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉప విద్యాధికారులు హైస్కూళ్లను తనిఖీ చేయాల్సి ఉండగా మండల విద్యాధికారులు ప్రతి రోజూ ఆయా మండలాల్లోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను పరిశీలించి అక్కడ బోధన సవ్యంగా సాగే విధంగా కృషి చేయాలి. ఎప్పటికప్పుడు వారి పరిధిలో పరిష్కారం కాగల సమస్యలను పరిష్కరించాలి. లేదంటే జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది. కానీ సీనియర్ హెడ్మాస్టర్లనే ఇన్చార్జ్ ఎంఈఓలుగా నియమించడం వల్ల ఇటు ఆ పాఠశాల నిర్వహణ, విద్యా బోధనతోపాటు మండల విద్యాధికారి బాధ్యతలను కూడా నిర్వహించాల్సి వస్తోంది. ఇది కొత్త సమస్యలకు దారితీస్తోంది. ఇటు మధ్యాహ్న భోజనం, అందుకు సంబంధించిన చెల్లింపులు, రికార్డు చేయడం, తదితర పనులతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ పనులన్నీ చూడలేక ఇన్చార్జి ఎంఈఓలు ఇబ్బందులు పడుతున్నారు. -
ఉపాధ్యాయుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
సాక్షి, మచిలీపట్నం : పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో విద్యాశాఖాధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, గిరిజన సంక్షేమ విభాగాల్లో మొత్తం 222 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. కోర్టు కేసుల నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్ కేడర్ గల తెలుగు, హిందీ, సంస్కృతం, పీఈటీ పోస్టులు మొత్తం 43 ఖాళీలు ఉండగా, ప్రస్తుతానికి వీటిని భర్తీ చేయడం లేదు. మిగిలిన 179 పోస్టుల్లో అర్హులైన వారిని ఎంపిక చేసి, నియామక పత్రాలను అందజేసేందుకు విద్యాశాఖాధికారులు దృష్టి సారించారు. 2018 డీఎస్సీ ఫలితాల మేరకు అర్హులైన అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించనున్నారు. ఉపాధ్యాయ పోస్టులను దక్కించుకునేందుకు జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుంచి కూడా సుమారుగా 30 వేల మంది అభ్యర్థులు డీఎస్సీకి హాజరయ్యారు. వీరిలో సబ్జెక్టుల వారీగా అర్హులైన వారి మెరిట్ జాబితా ఇదివరకే సిద్ధమైంది. తాజాగా ప్రభుత్వం నుంచి నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు రావటంతో విద్యాశాఖాధికారులు డీఎస్సీ ఫైళ్లను బయటకు తీస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ధ్రువీకరణ పత్రాల పరిశీలన మొదలు, పోస్టింగ్లు ఇచ్చేంత వరకు నిర్ధిష్టిమైన షెడ్యూల్ సైతం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విడుదల చేయడంతో జిల్లా విద్యాశాఖాధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. అంతా ఆన్లైన్లోనే.. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా జరుగుతున్న నియామకాలు కావడంతో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. నియామకాల్లో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అంతా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి మొదలయ్యే ప్రక్రియ సెప్టెంబర్ 4 వరకు కొనసాగనుంది. పాఠశాల విద్యాశాఖ (సీఎస్సీ) వెబ్సైట్ ద్వారా ఎంపిక అభ్యర్థుల జాబితాను ఈ నెల 20న అందుబాటులో ఉంచనున్నారు. దీనిని జిల్లాల స్థాయి సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆమోదించి ఈ నెల 21న జాబితాను ప్రకటిస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 22, 23 తేదీల్లో వారికి సంబంధించిన ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా పలు దఫాలుగా పరిశీలన అనంతరం ఆగస్టు 29న పోస్టుల కోసమని ఎంపికైన వారి తుదిజాబితా ప్రకటించనున్నారు. ఆగస్టు 30న వెబ్ అప్షన్ల అనంతరం ఎంపికైన వారికి పోస్టింగ్ ఆర్డర్లను సైతం ఆన్లైనే జారీ చేయనున్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ప్రత్యేక కమిటీ డీఎస్సీ ఫలితాల ఆధారంగా ఇప్పటికే సబ్జెక్టుల వారీగా మెరిట్ అభ్యర్థుల జాబితాను విద్యాశాఖాధికారులు ఎంపిక చేశారు. అయితే అందుబాటులో ఉన్న ఖాళీల మేరకు మెరిట్, రోస్టర్, అభ్యర్థుల ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకొని మెరిట్ జాబితాలో టాప్లో నిలిచిన వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకు వడపోత కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. ఈ దశలోనే అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇదే విషయమై సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులు పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాలను విద్యా, రెవెన్యూ, గిరిజన సంక్షేమ, వైద్యశాఖలకు చెందిన అధికారులతో కూడిన కమిటీ సభ్యులు పరిశీలన జరిపి, వాటికి ఆమోదం తెలిపిన తరువాతనే తుది జాబితా ప్రకటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భాషా పండితుల నియామకాలకు బ్రేక్ న్యాయస్థానంలో వివాదంలో ఉన్న కొన్ని పోస్టుల భర్తీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. స్కూల్ అసిస్టెంట్ కేడర్లో గల తెలుగు (12), హిందీ (6), ఎల్పీ తెలుగు (4), ఎల్పీ హిందీ (4), ఎల్పీ సంస్కృతం (3), పీఈటీ (14) పోస్టులు మొత్తం 43 ఖాళీగా ఉండగా, వీటి నియామకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా వీటిని భర్తీ చేసేలా, జాబితా సిద్ధం చేస్తున్నారు. -
ఉద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం
న్యూఢిల్లీ: కేంద్ర పారా మిలటరీ బలగాల్లో 76,578 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు హోంశాఖ తెలిపింది. ఈ మొత్తం ఉద్యోగాల్లో 54,953 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా, వీటిలో మహిళల కోసం 7,646 పోస్టులను కేటాయించినట్లు వెల్లడించింది. కానిస్టేబుల్ పోస్టుల్లో సీఆర్పీఎఫ్లో అత్యధికంగా 21,566 ఖాళీలు ఉండగా, బీఎస్ఎఫ్(16,984), ఎస్ఎస్బీ(8,546), ఐటీబీపీ(4,126) అస్సాం రైఫిల్స్(3,076) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. ఇందుకోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) 2019, ఫిబ్రవరి 11 నుంచి మార్చి 11 వరకూ కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. ఇక సబ్ఇన్స్పెక్టర్ హోదాలో 1,073 పోస్టులు ఉండగా వాటిలో బీఎస్ఎఫ్లో 508, సీఆర్పీఎఫ్లో 274, ఎస్ఎస్బీలో 206, ఐటీబీపీలో 85 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా ట్రేడ్స్మెన్, హోంశాఖ, వైద్యం, పారా మెడికల్, కమ్యూనికేషన్, ఇంజనీరింగ్ రంగాల్లో మరో 20,086 పోస్టులను పదోన్నతుల ద్వారా హోంశాఖ భర్తీ చేయనుంది. -
న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి కొలీజియం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా న్యాయమూర్తుల పోస్టులకు న్యాయవాదుల కోటా నుంచి ఏడుగురిని ఎంపిక చేసినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. వీరి పేర్లను శుక్రవారం సుప్రీం కోర్టుకు పంపనున్నట్లు సమాచారం. కొలీజియం ఎంపిక చేసిన వారిలో సీనియర్ న్యాయవాది ఆర్.రఘునందన్రావు (వెలమ), తడకమళ్ల వినోద్కుమార్ (బ్రాహ్మణ), బట్టు దేవానంద్ (ఎస్సీ), నైనాల జయసూర్య (కాపు), డి.రమేశ్ (కమ్మ), అన్నిరెడ్డి అభిషేక్రెడ్డి (రెడ్డి), కూనురు లక్ష్మణ్ (గౌడ్) ఉన్నారు. వీరిలో రఘునందన్రావు, బట్టు దేవానంద్, జయసూర్య, రమేశ్లు ఏపీకి చెందిన వారు కాగా, మిగిలిన వారు తెలంగాణకు చెందిన వారు. వీరితో పాటు జిల్లా జడ్జీల కోటా నుంచి ఏడుగురు న్యాయాధికారులకు సైతం హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాలనీ కొలీజియం నిర్ణయించినట్లు సమాచారం. హైకోర్టుకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 61 కాగా, ప్రస్తుతం 28 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. మిగిలిన 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తిని మినహాయిస్తే మిగిలిన న్యాయమూర్తుల్లో 10 మంది న్యాయమూర్తులు న్యాయాధికారుల కోటా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఖాళీలతో జడ్జీలపై భారం.. దాదాపు 50 శాతం న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులు తీవ్ర పనిభారంతో ఒత్తిడికి గురవుతున్నారు. తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడంతో కేసులు విచారణకు నోచుకోక న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బం ది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ ఈ అక్టోబర్తో ఆ బాధ్యతలు చేపట్టి 3 నెలలు పూర్తయింది. ఈ కాలంలో హైకోర్టు న్యాయవాదుల గురించి ఆయన తగిన అవగాహన తెచ్చుకున్నారు. దీంతో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. కొలీజియంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కలసి న్యాయమూర్తుల పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సుదీర్ఘ వడపోత.. కొలీజియం ఈ నెల 9న ప్రధాన న్యాయమూర్తి ఇంట్లో సమావేశమై సుదీర్ఘ సమయం పాటు వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పలు సమీకరణల ఆధారంగా ఏడుగురు న్యాయవాదులను ఎం పిక చేసింది. ఈ ఎంపిక గురించి ఆ ఏడుగురికీ తెలియజేసి వారి అంగీకారం కూడా తీసుకుంది. అనంతరం వారి ఆదాయపు పన్ను వివరాలు, వాదించిన కేసులు, లా జర్నల్స్లో రిపోర్ట్ అయిన కేసులు తదితర వివరాలను పరిశీలించి వారి పేర్లను సుప్రీం కోర్టుకు పం పాలని నిర్ణయించింది. మరో కాపీ కేంద్రానికి కూడా వెళ్తుంది. ఈ జాబితా లోని వ్యక్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా కేంద్రం తెప్పించుకుం ది. ఆ వ్యక్తుల ఐబీ నివేదికలను కేంద్రం సుప్రీం కోర్టుకు పంపుతుంది. ఆ తర్వాతే సుప్రీం కోర్టు తమ ముందున్న జాబితా విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. జాబితా అందుకున్న రెండు నెలల్లోపు కేంద్రం ఐబీ నివేదికలను సుప్రీం కోర్టుకు పంపాల్సి ఉంటుంది. ఒకవేళ అలా పంపకపోతే ఆ జాబితా విషయంలో కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు సుప్రీం కోర్టు భావించి ఆ జాబితాను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతుంది. -
ఐదేళ్లకు పైబడిన ఖాళీలు రద్దు!
న్యూఢిల్లీ: ఐదేళ్లకు పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను రద్దుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తమ విభాగాల్లో భర్తీచేయని ఉద్యోగాలకు సంబంధించి సమగ్ర నివేదికలు సమర్పించాలని అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఐదేళ్లకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి, వాటి రద్దుకు తీసుకున్న చర్యలు వివరిస్తూ నివేదికలు ఇవ్వాలని పలు విభాగాల ఉమ్మడి కార్యదర్శులకు ఆర్థిక శాఖ జనవరి 16న మెమొరాండం పంపింది. ఈ మేరకు కొన్ని శాఖలు, విభాగాలు ఇప్పటికే నివేదికలు సమర్పించగా, మరికొన్ని కొంత సమాచారం మాత్రమే అందించాయి. ఆ తరువాత హోం మంత్రిత్వ శాఖ కూడా తన పరిధిలోని అదనపు కార్యదర్శులు, ఉమ్మడి కార్యదర్శులతో పాటు పారామిలటరీ బలగాల చీఫ్లు, ఇతర అనుబంధ సంస్థలకు ఇలాంటి ఆదేశాలే జారీచేస్తూ నివేదికలు కోరిందని ఆ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. -
వైద్య ఖాళీలు భర్తీ చేయండి.. షరతులు వర్తిస్తాయి
– ఏజెన్సీలో వైద్యులు, సిబ్బంది భర్తీపై సర్కారు నాటకం – కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయాలంటూ సీఎం ఆదేశం – ఉద్యోగ భద్రత లేకుండా ఏజెన్సీలో పని చేసేందుకు వైద్యుల విముఖత – రెగ్యులర్ విధానంలో ఎందుకు భర్తీ చేయరు? – గత ఏడాది చింతూరు సభలో సీఎం ఇచ్చిన హామీ ఏమైంది? – చాపరాయి ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాలని అధికారులకు హితవు – కాళ్లవాపు మృతుల ఘటనతో నేర్చుకోలేదా..? – ప్రాణాలు పోతున్నా ప్రకటనలతో సరిపెడతారా..? సాక్షి, రాజమహేంద్రవరం: వైద్య, ఆరోగ్యశాఖలో తక్షణమే ఖాళీలను భర్తీ చేయండి. కాంట్రాక్టు పద్ధతిలో చేయండి. శాశ్వత నియామకాల వరకు వేసి చూడొడ్డు. చాపరాయి ఘటనతో అధికారులు పాఠాలు నేర్చుకోండి. వైద్య ఆరోగ్యశాఖలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను నీరుగారిస్తే సహించం. ఇదీ క్లుప్తంగా మంగళవారం వివిధ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలు. చేసిన సూచనలు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేయండం, అధికారులపై చిందులు తొక్కడం... ఆ తర్వాత షరా మామూలే. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు చూసిన వారు ఆయన గిరిజనుల ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ చూపుతున్నారోనని ప్రజలు అనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది ఏప్రిల్లో విలీన మండలాల్లో పర్యటన సందర్భంగా చింతూరు బహిరంగ సభలో మన్యంపై వరాల జల్లు కురిపించారు. ఏరియా ఆస్పత్రి ఏర్పాటు చేసి అవసరమైన అన్ని సదుపాయాలు, వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తామన్నారు. పీహెచ్సీల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేస్తామని చెప్పారు. జూన్, జూలై నెలల్లో అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధితో 16 మంది గిరిజనులు మృతి చెందినప్పుడు ఇలాంటి ప్రకటనలే చేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరుగకుండా గట్టి చర్యలు చేపడతామన్నారు. చింతూరులో డయాలసిస్, ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ చంద్రబాబు మాటలు కోటలు దాటినా పనులు గడప దాటలేదు అన్న విషయం ఏడాది క్రితం ఆయన చేసిన హామీలు, ప్రకటనలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. చింతూరు సభ జరిగి ఏడాది రెండు నెలలు, కాళ్ల వాపు ఘటన జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. ఆ రెండు సమయాల్లో సీఎం చంద్రబాబు వైద్య పోస్టులను తక్షణమే భర్తీ చేస్తామన్నారు. ఆ మేరకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు కూడా పంపారు. కానీ రెగ్యులర్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు అవసరమైన జీవో ఇవ్వకుండా నాన్చుతున్నారు. ఉద్యోగ భద్రత లేకుండా ఎవరు వస్తారు..? కాంట్రాక్టు పద్దతిలో వైద్య పోస్టులను భర్తీ చేయాలని సీఎం చెబుతున్నారు. పట్టణాల్లో అన్ని సౌకర్యాలున్నా కూడా కాంట్రాక్టు విధానంలో పని చేసేందుకు స్పెషలిస్ట్ డాక్టర్లు, కనీసం ఎంబీబీఎస్ చదవిన డాక్టర్లు కూడా రారు. అలాంటిది ఎలాంటి సౌకర్యాలు లేని ఏజెన్సీలో పని చేయడానికి ఎలా వస్తారు?. వైద్య విధానంలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు ఏజెన్సీలోని ఆస్పత్రుల్లో పోస్టులను రెగ్యులర్ విధానంలో ఎందుకు భర్తీ చేయడంలేదు. వైద్యులు ఇక్కడ ఉండడానికి నివాసం, మంచి ఆహారం చింతూరు, రంపచోడవరంలలో కూడా లభించదు. ప్రస్తుతం నాలుగు రోజుల నుంచి చాపరాయి బాధితులను పరామర్శించడానికి వెళుతున్న అధికారులకు తినడానికి తిండి కూడా దొరకడంలేదు. కొంత మంది అధికారులు అక్కడికి వెళ్లే సమయంలో రాజమహేంద్రవరం నుంచి భోజనం పార్శిళ్లు తీసుకెళుతున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడాలంటే చింతూరు, రంపచోడవరంలలో ఐటీడీఏ ఆధ్వర్యంలో క్యాంటిన్లు నిర్వహించాలి. వైద్యాధికారులు, సిబ్బంది ఉండేందుకు నివాసాలు నిర్మించాలి. కానీ ఇవ్వన్నీ చేయరు. ఘటన జరిగినప్పుడు మాత్రం ఏదో చేసినట్లు ప్రకటనలతో కాలాన్ని నడిపిస్తారు. కాలంతోపాటు సమస్య కూడా సమసిపోతుంది. కాళ్లవాపుతో పాఠాలు నేర్చుకోలేదా...? చాపరాయి ఘటనతో అధికారులు పాఠాలు నేర్చుకోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి గత ఏడాది జరిగిన కాళ్లవాపు మరణాలతో ఏం నేర్చుకున్నారో ఆ ఘటనపై అనేక మార్లు ప్రకటనలు చేసిన ఆయనకే తెలియాలి. ఏజెన్సీలో పోస్టుల భర్తీకి, కొత్తగా గత ఏడాది చింతూరు సభలో సీఎం ఇచ్చిన హామీల పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు పంపినా అవి చెత్త బుట్టలకే పరిమితమయ్యాయి. ఏడాది అవుతున్నా భర్తీకి సంబంధించిన జీవో ఎందుకు విడుదల చేయలేదో ముఖ్యమంత్రి చంద్రబాబుకే తెలియాలి. 11 మండలాలు, 1180 గ్రామాలు, 4.5 లక్షల మంది ప్రజల ఆరోగ్యంపై సర్కారు నిర్లక్ష్యాన్ని చాపరాయి ఘటన మరోమారు ఎత్తి చూపుతోంది. -
ఐటీడీఏలో అన్నీ ఖాళీలే
19 మందికిగాను ఉండేది ఆరుగురే పని ఒత్తిడిలో ఉద్యోగులు నెల్లూరు(సెంట్రల్) : పది మంది పనిని ఒకరితో చేయిస్తే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం అవుతోంది. కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు నిర్వహించే గిరిజన(యానాదుల) సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో తగినంత సిబ్బందిని నియమించలేదంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప నాలుగు జిల్లాలకు కలిపి నెల్లూరులో ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం పనిచేస్తోంది. అందులో ఉండాల్సిన 19 మంది ఉద్యోగులకు గాను ప్రస్తుతం 6 మంది మాత్రమే ఉన్నారు. వారిలోనూ ఒకరు ఔట్సోర్సింగ్ కావడం గమనార్హం. సిబ్బంది కొరత ఐటీడీఏలో సిబ్బంది కొరత కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయి. తగినంత సిబ్బందిని నియమిస్తే పనులు సకాలంలో పూర్తి చేయవచ్చు. నాలుగు జిల్లాలకు కలిపి ఇంజనీరింగ్ విభాగంలో ఈఈ–1, డీఈఓ–1, డ్రాఫ్ట్స్మెన్స్–2, క్లర్క్లు–2, అటెండర్లు–2, కంప్యూటర్ ఆపరేటర్లు–2, సబ్డివిజన్లకు సంబంధించి డీఈఈ–1, ఏఈ–3, ఏఈఈ–3, గేడ్ర్ 3 డ్రాఫ్ట్స్మెన్–1, యూడీసీ–1, ఎల్డీసీ–1, అటెండరు–1 మొత్తం 19 పోస్టులు ఉండాల్సి ఉండగా అందులో ప్రస్తుతం ఉండేది మాత్రం ఈఈ–1, ఏఈ–1, డీఈ–1, సీనియర్ అసిస్టెంట్–1, కంప్యూటర్ఆపరేటర్–1, అటెండరు–1 మాత్రమే ఉండడం గమనార్హం. ఐటీడీఏలో ఖాళీగా ఉన్న పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాల్సి ఉంది. ఉన్నతాధికారులకు తెలియజేశాం సిబ్బంది కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏ పనులు చేయాలన్నా ఆలస్యం అవుతోంది. నిత్యం నాలుగు జిల్లాలోని కాంట్రాక్ట్ పనులు చూసుకోవాలి. తగినంత సిబ్బందిని నియమిస్తే పనులు సకాలంలో పూర్తిచేయవచ్చు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయాం. –ఏవీజీకే ప్రసాద్, ఈఈ -
సేవల్లేవ్!
వైద్య శాఖలో అరకొరగా సిబ్బంది కీలక పోస్టులు ఖాళీ.. అలంకారప్రాయంగా పీహెచ్సీలు {V>Ð]l*ÌZÏ అందని ప్రభుత్వ వైద్యం ఎంజీఎం : వర్షాకాలం మొదలైంది. ముసుర్లతో అంటు వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. పల్లెలు మంచం పట్టే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితుల నుంచి ప్రజలను గట్టెక్కించాల్సిన వైద్య శాఖ మాత్రం సిబ్బంది లేక ఇబ్బంది పడుతోంది. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో అవి అలంకారప్రాయంగా మారుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదు. జిల్లాకు ఐదు సివిల్ సర్జన్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం రెండు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ సివిల్ సర్జన్ 20 పోస్టులు ఉంటే రెండు ఖాళీగా ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 154 ఉంటే వీటిలో తొమ్మిది ఖాళీలు ఉన్నాయి. ఉన్నవారిలోనూ 11 మంది పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేసేందుకు వెళ్లనున్నారు. వీరంతా ఏజెన్సీ ప్రాంతంలోని వారే. ఫార్మసిస్టు పోస్టులు 75కు 24 ఖాళీగా ఉన్నాయి. 65 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులలో 26 ఖాళీగా ఉన్నాయి. గ్రామాల్లో వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, చికిత్స అందించే హెల్త్ అసిస్టెంట్ పోస్టులు పురుషుల కేటగిరీలో 327 ఉండగా, అందులో 156, మహిళా కేటగిరీలో 546 పోస్టులకు గాను 140 ఖాళీగా ఉన్నాయి. కొత్త పీహెచ్సీలు ఖాళీ... గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ)లోనూ సేవలు అందుబాటులోకి రావడం లేదు. 2014-15లో జిల్లాలో కొత్తగా ప్రాథమిక వైద్య కేం ద్రాలను నిర్మించారు. కొన్నింటిని ప్రజాప్రతినిధులు హడావుడిగా ప్రారంభించారు. అరుుతే ఏ ఒక్కదాంట్లోనూ వైద్య సేవలు మొదలు కాలేదు. పీహెచ్సీలో ఒక వైద్యాధికారి, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, ఏఎన్ఎం, సహాయ సిబ్బంది ఉండాలి. కానీ, ఏ ఒక్క అధికారి, సిబ్బంది ఇప్పటి వరకు విధుల్లో చేరలేదు. తాడ్వాయి మండలం కాటాపూర్, హన్మకొండ మండలం పైడిపల్లి, కొండపర్తి, హసన్పర్తి మండలం సిద్ధాపూర్, చేర్యాల మండలం ముత్యాల, మంగపేట మండలం బ్రాహ్మణపల్లి, మహబూబాబాద్ మండలం మల్యాల, స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ, ఇప్పగూడ, జనగామ మండలం ఓబుల్కేశ్వాపూర్, మరిపెడ మండలం ఉగ్గంపల్లిలో కొత్తగా పీహెచ్సీలను నిర్మించారు. అసరమైన సామగ్రిని సమకూర్చారు. వైద్య సేవలు అందించే సిబ్బంది మాత్రం లేకపోవడంతో ఇవన్నీ అలంకారప్రాయంగానే మిగిలాయి. -
అంతా ఖాళీ!
♦ డీడీతోపాటు ఏఎస్డబ్ల్యూఓ పోస్టులు ఖాళీ ♦ వార్డెన్లే ఇన్చార్జీలు హాస్టళ్లను పర్యవేక్షణ చేసే నాథుడే లేడు ♦ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టని ప్రభుత్వం ♦ కుంటుపడుతున్న ఎస్సీ సంక్షేమ శాఖ ఇందూరు : ఒకప్పుడు అధికారులు, సిబ్బందితో కళకళలాడిన జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ప్రస్తుతం ఖాళీలతో వెక్కిరిస్తోంది. వసతిగృహాల పర్యవేక్షణ, ఇతర సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన(డీఎస్డబ్ల్యూఓ) డివిజన్ స్థాయి సహాయ సంక్షేమాధికారుల పోస్టుల్లో పని చేసిన వారందరూ క్రమక్రమంగా పదవీ విరమణ పొందడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో ఏళ్ల తరబడి వార్డెన్స్ ఇన్చార్జీ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జిల్లా అధికారి డిప్యూటీ డెరైక్టర్ పోస్టు కూడా ఖాళీ అయ్యింది. ప్రస్తుతం వసతిగృహాలు ప్రారంభమయ్యాయి. వీటిని పర్యవేక్షణ చేసే నాథులే లేక వసతిగృహాలు, వార్డెన్ల పనితీరు అస్తవ్యస్తంగా మారింది. ఇదీ పరిస్థితి... జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 67 వసతి గృహాలు ఉన్నాయి. ఇందుకు సరిపడా వార్డెన్లు ఉన్నారు. అయితే ఈ వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సౌకర్యాల కల్ప న, మెనూ ప్రకారం భోజన వసతి సక్రమంగా కల్పించాల్సిన బాధ్యత వార్డెన్లపై ఉంది. కానీ.. వార్డెన్లు సక్రమంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో వసతిగృహాల పర్యవేక్షణకు డివిజన్లవారీగా ఐదు స హాయ సంక్షేమాధికారుల పోస్టులను మంజూరు చేసి పోస్టులను భర్తీ చేశారు. వార్డెన్లు వీరి ఆధీనంలో పని చేయాలి. కానీ.. ప్రస్తుతం ఐదు పోస్టుల్లో కేవలం నిజామాబాద్ డివిజ న్కు చెందిన ఒక్కరు మాత్రమే సహాయ సంక్షేమాధికారిగా పని చేస్తున్నారు. బోధన్ డివిజన్ భూమయ్య, కామారెడ్డి డివిజన్ ఆల్ఫోన్సా, మద్నూరు డివిజన్ వెంకట్రాంలు, ఆ ర్మూర్ డివిజన్ రాంకిషన్లు గడిచిన కాలంలో పదవీ విరమ ణ పొందారు. వీరి స్థానాల్లో ప్రభుత్వం రెగ్యులర్ అధికారుల ను నియమించాలి. ప్రాధాన్యత కలిగిన ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో సంబంధిత డివిజన్లోని సీనియర్, గ్రేడ్-1 వార్డెన్లకు సహాయ సంక్షేమాధికారులుగా ఇన్చార్జీ బా ధ్యతలు అప్పగించారు. వార్డెన్లు తమ సొంత ఉద్యోగంతోపాటు అదనపు బాధ్యతలు చేపట్టడం కష్టంగానే మారింది. స్థానికంగా వసతిగృహంలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ విధానం ద్వా రా చేపడుతున్న నేపథ్యంలో వారి వేలి ముద్రలు సమయానికి తీసుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా ఇదే శాఖలో ప్ర ధానంగా జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి (డీఎస్డబ్ల్యూఓ) పో స్టు మూడేళ్లకు పైగా ఖాళీ ఉంది. ఇందుకు నిజామాబాద్ ఏఎస్డబ్ల్యూఓ జగదీశ్వర్రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. వసతిగృహాల పర్యవేక్షణే కాకుండా ప్రస్తుతం కళ్యా ణ లక్ష్మి పథకాన్ని ఎస్సీ సంక్షేమ శాఖకు జోడించిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలు బాధ్యతలను వార్డెన్లు, సహా య సంక్షేమాధికారుపై పెట్టారు. లబ్ధిదారుల వెరిఫికేషన్ చే యడంలో కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలా ఎస్సీ సంక్షేమ శాఖలో ఉద్యోగుల లేమితో, ఇన్చార్జీల పాలనతో చతికిల పడింది. శాఖకు బాసే లేడు.. జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖకు జిల్లా అధికారిగా డిప్యూటీ డెరైక్ట ర్ (డీడీ) పోస్టు ఉంది. ఈ శాఖకు ఈ పోస్టే కీలకం. సహాయ సంక్షేమాధికారులు, వార్డెన్లు, శాఖలోని ఉద్యోగుల పరిపాలన, వసతిగృహాలు ఇలా మొత్తం శాఖకు ఆయనే బాస్గా వ్యవహరించాలి. కానీ ఈ పోస్టు కూడా ఖాళీ అయ్యింది. రెం డు నెలల క్రితం పని చేసిన డీడీ విజయ్ కుమార్ను పనితీరు బాగోలేదని కలెక్టర్ ఆయనను రాష్ట్ర శాఖకు సరెండర్ చేశారు. ఖాళీ అయిన స్థానంలో డీసీఓ గంగాధర్ ఇన్చార్జిగా పని చేశారు. ఇన్చార్జి బాధ్యతలను మళ్లీ ఏజేసీ రాజారాంకు అప్పటించారు. ప్రస్తుతం ఆయనే కొనసాగుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం... ఎస్సీ సంక్షేమ శాఖలో ప్రధానంగా సహాయ సంక్షేమాధికారుల పోస్టులు ఖాళీగా మారాయి. ఐదు పోస్టులకు ఒక్కరే పని చేస్తున్నారు. మిగతా వాటికి ఇన్చార్జీలుగా వార్డెన్లకు బాధ్యతలు అప్పగించాం. ఇటు డీఎస్డబ్ల్యూఓ పోస్టు కూడా మూడేళ్లకు పైగా ఖాళీ ఉంది. అయితే ఇన్చార్జీల పాలనతో పాలను ముందుకు సాగడం లేదు. ఇబ్బందికరంగా మారింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పోస్టులను భర్తీ చేయాలని కోరాం. - జగదీశ్వర్రెడ్డి, ఇన్చార్జి డీఎస్డబ్ల్యూవో -
న్యాయానికి న్యాయం కావాలి!
37 పంజాబ్-హర్యానా ఖాళీలు తృతీయ స్థానం! 88 అలహాబాద్ ఖాళీలు ప్రథమ స్థానం! 44 మద్రాస్ ఖాళీలు ద్వితీయ స్థానం! న్యాయం కోసం జనం కంటతడి పెట్టుకోవడం మనం ఎన్నోసార్లు చూశాం. కానీ, న్యాయానికి పెద్ద దిక్కయిన ప్రధాన న్యాయమూర్తే న్యాయం కోసం విలపించడానికి గొప్ప కారణాలే ఉండివుండాలి. వాటిలో ఇవి కొన్ని మాత్రమే. దేశంలో కేసులు హిమపాతంలా పేరుకుపోతున్నాయి. వాటిని విచారణకు స్వీకరించేందుకు తగినంత మంది జడ్జీలు లేరు. కక్షిదారులు, జైళ్లలో మగ్గుతున్నవారి తరఫున దేశాభివృద్ధి కోసం మిమ్మల్ని వేడుకుంటున్నా. పరిస్థితికి తగ్గట్టుగా స్పందించండి. పెండింగు కేసులపై న్యాయవ్యవస్థమీద విమర్శలు సరికాదు. - సి.ఎం.లు, హైకోర్టు సి.జె.ల సదస్సులో ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ ఆవేదన. 3 కోట్లు న్యాయం కావాలి! ప్రస్తుతం మన దేశంలోని న్యాయస్థానాల్లో దాదాపు 3 కోట్ల మేర కేసులు పెండింగ్లో ఉన్నట్లు ఒక లెక్క. 10.ఏళ్లు సుదీ....ర్ఘ నిరీక్షణ మన కోర్టుల్లో 1940లు, 1950ల నాటి కేసులు కూడా ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అందుబాటులో ఉన్న 21 హైకోర్టుల్లోని కేసుల లెక్కలు చూస్తే - సగటున ఏ కేసు అయినా సరే మూడు సంవత్సరాల ఒక నెల పాటు (1,128 రోజులు) పెండింగ్లో ఉంటోంది. అదే గనక సబ్-ఆర్డినేట్ కోర్టుల్లోని కేసుల విషయానికొస్తే, అక్కడ కేసు తేలడానికి సగటున 6 ఏళ్ళ (2,184 రోజుల) టైమ్ పడుతోంది. అంటే, సుప్రీమ్ కోర్టు గడప తొక్కకుండానే సగటున ప్రతి కక్షిదారూ తన కేసు పరిష్కారం కోసం దాదాపు 10 ఏళ్ళు కోర్టులోనే గడపాల్సి వస్తోంది. ఒకవేళ కేసు సుప్రీమ్ కోర్టుకు వెళ్ళిందంటే, సగటున అక్కడ కనీసం మరో 3 ఏళ్ళు నిరీక్షించాలి. మొత్తం కలిపి సగటున 13 ఏళ్ళ పైచిలుకు పుణ్యకాలం కోర్టుల్లోనే గడిచిపోతుందన్న మాట! సుప్రీంలో 15 న్యాయమూర్తులు వేధిస్తున్న కొరత కేసులు పరిష్కరిద్దామన్నా- మన న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత తీవ్రంగా ఉంది. ఈ ఏడాది మార్చి నాటి లెక్కల ప్రకారం హైకోర్టుల్లో ఉండవలసిన దాని కన్నా 44 శాతం మంది తక్కువమంది జడ్జీలే ఉన్నారు. సబ్-ఆర్డినేట్ కోర్టుల్లో అవసరమైనవాళ్ళ కన్నా 25 శాతం తక్కువ సంఖ్యలో జడీలు ఉన్నారు. ఇక, సుప్రీమ్కోర్టులో వంద మంది జడ్జీలు కావాలనుకొంటే 81 మందే ఉన్నారు. అంటే, 19 శాతం కొరత అన్న మాట. తగిన సంఖ్యలో జడ్జీలు లేకపోయేసరికి, కోర్టులన్నీ ఖాళీలతో వెలవెలబోతున్నాయి. హైకోర్ట్ల సంగతికొస్తే - అత్యధికంగా అలహాబాద్ హైకోర్ట్లో 88 ఖాళీలున్నాయి. 44 ఖాళీలతో మద్రాస్ హైకోర్ట్ ఆ తరువాత స్థానంలో ఉంది. 37 ఖాళీలతో పంజాబ్-హర్యానా హైకోర్ట్ మూడో స్థానంలో ఉంది. సబ్-ఆర్డినేట్ కోర్టుల విషయానికొస్తే - బిహార్లోని సబ్-ఆర్డినేట్ కోర్టుల్లో అత్యధికంగా 730 ఖాళీలున్నాయి. 717 ఖాళీలతో గుజరాత్ రెండోస్థానంలో, 470 ఖాళీలతో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచి, నియామకాల కోసం నిరీక్షిస్తున్నాయి. ఆ గోడు వినరేం? 1987 నుంచి గడచిన 29 ఏళ్ళుగా 15 మంది భారత ప్రధాన న్యాయమూర్తులయ్యారు. దేశంలో న్యాయం జరగాలంటే, కోర్టులు, జడ్జీల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన న్యాయమూర్తులతో పాటు, ‘భారత న్యాయ సంఘం’ కూడా ఇన్నేళ్ళుగా మొత్తుకుంటూనే ఉంది. రాగల అయిదేళ్ళలో న్యాయవ్యవస్థ మొత్తం సంఖ్యాబలాన్ని 30 వేలకు తీసుకువెళ్ళాలని సుప్రీమ్ కోర్టు లక్ష్యంగా పెట్టుకుంది. దేవుడు వరమిచ్చినా... అయితే, సుప్రీమ్కోర్ట్ కొలీజియమ్ సిఫార్సు చేసిన న్యాయమూర్తుల పూర్వాపరాలను ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్ధారించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. కానీ, అది కూడా సకాలంలో జరగడం లేదు. దాదాపు 170 మంది జడ్జీల నియామకం కోసం సుప్రీమ్ కోర్టు ప్రతిపాదనలు చేసింది. నిజానికి, వారిలో నూటికి 90 మంది ఇప్పటికే పనిచేస్తున్న అడిషనల్ జడ్జీలు. అయినప్పటికీ, వాళ్ళపై నివేదిక పంపడానికి ఐ.బి. చాలా నెలలుగా తాత్సారం చేస్తోంది. 193 సుప్రీంపని దినాలు ఎన్నాళ్ళు పని చేస్తున్నాం? లెక్కచూస్తే... ఏటా మన సుప్రీమ్ కోర్టు 193 రోజులు పనిచేస్తుంది. హైకోర్టులు 210 రోజులు పని చేస్తాయి. ట్రయల్ కోర్టులు 245 రోజుల పాటు పనిచేస్తున్నాయి. అదే గనక విదేశాల్లో చూస్తే - అమెరికాలో కానీ, ఫ్రాన్స్ లాంటి ఐరోపా దేశాల్లో కానీ కోర్టులు వేసవి సెలవులంటూ మూసుకోవడం ఉండదు. కెనడా సుప్రీమ్ కోర్టుకైతే ఏటా కేవలం 11 రోజులే సెలవులు. బ్రిటన్లో ఏటా 24 రోజులే సెలవులుంటాయి. కానీ, మన దగ్గర సెలవులు లేకుండా బండెడు పని ఒత్తిడిని న్యాయమూర్తులు భరించగలరా అన్నది ప్రశ్న. అరకొర కేటాయింపు దేశ బడ్జెట్లో న్యాయవ్యవస్థ కోసం అతి కొద్దిగా, కేవలం 0.5 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. సర్వే చెబుతున్న సంగతులు మన దేశంలోని న్యాయవ్యవస్థ పనితీరును అర్థం చేసుకోవడానికీ, కక్షిదారుల తీరుతెన్నులను గ్రహించడానికీ వీలుగా పరిశోధన సంస్థ ‘దక్ష్’ దేశంలోని 24 రాష్ట్రాల్లో ఒక సర్వేను నిర్వహించింది. మన దేశంలో సామాన్యుడికి న్యాయం అందడానికి ఎంత ఆలస్యమవుతోంది, జడ్జీలపై పడుతున్న అపారమైన పని ఒత్తిడి లాంటి అనేక అంశాలపై ఈ న్యాయ సర్వే దృష్టి సారించింది. రోజుకు 70 వాదనలు నలిగిపోతున్న న్యాయం మన హైకోర్టులు సగటున రోజూ 20 నుంచి 150 కేసులు చేపట్టాల్సి వస్తోంది. కేసులు వినడానికి సగటున రోజూ 5 నుంచి 5.5 గంటల సమయాన్ని జడ్జీలు కేటాయిస్తుంటారు. ప్రతి న్యాయమూర్తీ రోజూ సగటున 70 వాదనల్ని వినాల్సి వస్తోంది. ఏ వ్యవస్థలోనూ జడ్జీలపై రోజువారీగా ఇంత ఒత్తిడి ఉండదని నిపుణుల అంచనా. మన జడ్జీల పరిస్థితి చూస్తే, టీ-20 క్రికెట్ మ్యాచ్లో 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి తపిస్తున్న జట్టులా ఉందని కొందరి వ్యాఖ్య. 30 వేల కోట్లు కేసులతో... భారీ మూల్యం ♦ కోర్టు వాయిదాకు హాజరవ్వాలంటే, ఒక్కో కక్షిదారుకూ సగటున రోజుకు అయ్యే ఖర్చు- రూ. 519. ♦ వార్షిక కుటుంబ ఆదాయం లక్ష రూపాయల లోపు ఉన్న కక్షిదారులు లీగల్ ఫీజుల లాంటివి కాకుండా, కేవలం కోర్టు వాయిదాలకు హాజరు కావడానికే ఏటా తమ ఆదాయంలో 10 శాతం ఖర్చుపెట్టుకోవాల్సి వస్తోంది. ♦ కోర్టు కేసుకు హాజరవడం వల్ల నష్టపోయే పని గంటలు, జీతభత్యాలు, వ్యాపారాన్ని బట్టి చూస్తే ఒక్కో కక్షిదారు విషయంలో నష్టపోయే ఉత్పాదకత - రూ. 873. ♦ వాయిదాలకు హాజరవడానికి కక్షిదారులందరి మీద కలిపి దేశంలో అవుతున్న మొత్తం ఖర్చు ఏటా రూ. 30 వేల కోట్లు. ♦ ఇక, 50 వేల కోట్ల పైచిలుకు మేర వారి ఉత్పాదకత నష్టమవుతోంది. మరో మాటలో చెప్పాలంటే, భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో 0.48 శాతం నష్టపోతున్నామన్న మాట! ♦ అంటే, కోర్టుకెక్కినవారికి అయ్యే ఖర్చు, వారి జీతభత్యాల నష్టం, వ్యాపార నష్టం మొత్తం కలిపి ఏటా రూ. 80 వేల కోట్లన్న మాట! 2 నిమిషాలే కేసు వినేది 2 నిమిషాలే! రెండే రెండు నిమిషాల టైమ్ ఇవ్వమని మనం రోజులో చాలాసార్లు అంటూ ఉంటాం. కానీ, ఆ 120 సెకన్లలో ఏం చేయగలం? కాఫీ తాగడం, ఫోన్ మాట్లాడడం - లాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఆ కాస్త టైమ్ చాలదు. కానీ, పాట్నా హైకోర్టు సగటున రోజూ రెండే రెండు నిమిషాల్లో ఒక కేసులో వాదన వినాల్సి వస్తోంది. జడ్జీలు తగిన సంఖ్యలో లేకపోవడంతో న్యాయవ్యవస్థపై ఇలా చాలా ఒత్తిడి పడుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటి లెక్కల్ని బట్టి చూస్తే... పాట్నా హైకోర్ట్లో ఒక్కో జడ్జీ సగటున రోజుకు 149 కేసుల్లో వాదన వింటున్నారు. ఒక్కో కేసులో వాదన వినడానికి సగటున 2 నిమిషాల మించి టైమ్ కేటాయించలేకపోతున్నారు. కలకత్తా హైకోర్ట్లో సగటున రోజుకు 148 కేసుల వాదన వింటూ, ఒక్కో కేసుకు 2.1 నిమిషాలే ఇస్తున్నారు. అయిదే నిమిషాల్లో తీర్పు! మొత్తం మీద లెక్క తీస్తే, దేశంలో బిజీ బిజీగా గడిచే కోర్టుల్లో సగటున ఒక కేసులో వాదనలు వినడానికి జడ్జీలు కేవలం రెండున్నర నిమిషాలే వెచ్చించగలుగుతున్నారు. అలాగే, దాదాపు 5 నిమిషాల్లో కేసులో తీర్పు నిర్ణయించేయాల్సి వస్తోంది. హైకోర్టులో 821 సగటున కేసులు మన హైదరాబాద్లో..! హైదరాబాద్ హైకోర్ట్లో సగటున ఒక్కో కేసూ 821 రోజులు పెండింగ్లో ఉంటోంది. ఒక్కో జడ్జీ సగటున రోజుకు 109 కేసుల్లో వాదన వినాలి. ప్రతి కేసుకూ కేవలం 2.8 నిమిషాల టైమే కేటాయించగలుగుతున్నారు. ఇక సగటున 28 రోజులకు ఒకసారి ఆ కేసు మళ్లీ విచారణకు వస్తోంది. (సోర్స్: ఇండియా టుడే) -
సెంట్రల్ వర్సిటీల్లో 6 వేల పోస్టులు ఖాళీ
► తెలంగాణలో 300 పోస్టులు ఖాళీ ► ఎంపీ మేకపాటి ప్రశ్నకు స్మృతీ ఇరానీ సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 6 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్రెడ్డి అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ ఇరానీ సోమవారం సమాధానం ఇచ్చారు. మొత్తం పోస్టులు 16,600 ఉండగా అందులో ఏకంగా 5,928 ఖాళీగా ఉన్నాయన్నారు. ఇందులో ప్రొఫెసర్ పోస్టులు 1277, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 2,173, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2,478 పోస్టులున్నాయని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల పరిధిలో 680 పోస్టులు ఖాళీగా ఉండగా, ఇతర ప్రాంతాల్లోని పాత సెంట్రల్ వర్సిటీల్లో 3,943 పోస్టులు, కొత్త వర్సిటీల్లో 1,305 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటి భర్తీ ఆయా వర్సిటీలే చేపట్టాల్సి ఉందని వివరించారు. గతేడాది ఫిబ్రవరిలో వీసీల సదస్సులో ఈ అంశంపై చర్చించామని తెలిపారు. అలాగే రాష్ట్రపతి అధ్యక్షతన గతేడాది నవంబరులో జరిగిన విజిటర్స్ సదస్సులో కూడా చర్చించామని తెలిపారు. ఇక తెలంగాణలోని మూడు సెంట్రల్ వర్సిటీల్లో 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో 77 పోస్టులు, హైదరాబాద్ వర్సిటీలో 164 పోస్టులు, ఇఫ్లూలో 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
నాల్గోతరగతి ఉద్యోగాలు భర్తీ చేయం
♦ ఆర్థికమంత్రి యనమల వెల్లడి ♦ మొత్తం ఖాళీలు 77 వేలేనన్న మంత్రి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నాల్గోతరగతి ఉద్యోగాలను భర్తీ చేయబోమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. మిగతా వాటిలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయబోమన్నారు. ‘లక్ష ఉద్యోగాలు హుష్ కాకి’ శీర్షికతో సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం స్పందించారు. నాల్గోతరగతి పోస్టులు తీసేస్తే డెరైక్టు రిక్రూట్మెంటు ద్వారా భర్తీచేయడానికి అందుబాటులో ఉన్న ఖాళీలు 20 వేలు మాత్రమేనని మంత్రి చెప్పారు. అవసరాన్నిబట్టి మాత్రమే ఆ ఉద్యోగాలను భర్తీచేస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగంలోనే ఉపాధి కల్పించడం సాధ్యం కాదని, ప్రైవేట్ రంగంలో కూడా అనేక ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామన్నారు. అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ పాత్ర కూడా మారుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆయా శాఖలను పునర్వ్యవస్థీకరిస్తామన్నారు. కమలనాథ్న్ కమిటీ పరిధిలో స్టేట్క్యాడర్, మల్టీజోనల్ క్యాడర్ ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని, ఈ పోస్టులు 76,429 ఉండగా ఇందులో 22,226 ఖాళీగా ఉన్నట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల వివరాలే కాకుండా రెగ్యులర్ ఉద్యోగులు కాని అంగన్వాడీ, మినీ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, హోమ్గార్డులు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు, లాస్ట్గ్రేడ్ ఉద్యోగాల్లో ఉన్న అవుట్సోర్సింగ్ సిబ్బంది, స్థానిక సంస్థల ఉద్యోగుల వివరాలను కూడా కమలనాథన్ కమిటీకి అందించినట్లు తెలిపారు. ఆ కమిటీకి అందించిన సమాచారం ప్రకారం 2016 జనవరి 1 నాటికి రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలు మంజూరైనవి 4,83,491 కాగా అందులో 4,05,754 మంది పనిచేస్తున్నారని, 77,737 ఖాళీలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. నాల్గోతరగతి ఉద్యోగాలను అవసరమైన మేరకు స్వల్పకాలిక పద్ధతిపై అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో భర్తీచేస్తుంటారని వివరించారు. ఈ నేపథ్యంలో డెరైక్టు రిక్రూట్మెంటు ద్వారా భర్తీచేయడానికి అందుబాటులో ఉన్న ఖాళీలు 20 వేలు మాత్రమేనని మంత్రి స్పష్టంచేశారు. -
అధికారులు కావలెను
జిల్లా స్థాయి అధికారుల పోస్టులు ఖాళీ ఇన్చార్జీల పాలనలో పలుశాఖలు మిగతా శాఖల్లో 213 సిబ్బంది సిటీ బ్యూరో: ప్రభుత్వ పనులు సకాలంలో జరగాలన్నా, ప్రజాసమస్యలు సత్వరం పరిష్కారం కావాలన్నా అధికారులు ఉండాలి. ప్రజాప్రతినిధులు ఎందరున్నా అధికారుల చేతుల మీదుగానే సమస్యలు ఓ కొలిక్కి వస్తా యి. ప్రభుత్వ పాలనలో అధికారుల పాత్ర కీలకం. అయితే హైదరాబాద్ జిల్లాలో ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. అధికారులు, ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. ఖాళీల స్థానంలో ప్రత్యామ్నాయంగా ఇన్చార్జీలు ఉండటంతో వారు పనిభారంతో సతమతమవుతున్నారు. వివిధ కార్యాలయాలకు పనుల కోసం వచ్చే ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది శాఖలకు జిల్లా స్థాయి అధికారులు లేరు. ఈ కారణంగా పనుల పురోగతికి బ్రేక్ పడుతోంది. ఖాళీగా ఉన్న పోస్టులివే జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ (డీబీసీడబ్ల్యూఓ) డీడీ, ఆర్వీఎం పీడీ, హార్టికల్చర్ ఏడీ, హైదరాబాద్ ఎస్టేట్ అధికారి, గృహనిర్మాణ శాఖ పీడీ, ఎన్సీఎల్డీ పీడీ, మైనారిటీ వెల్ఫేర్ అధికారి, వయోజన విద్య డీడీ వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ శాఖలో కూడా ఖాళీలు భారీగా ఉన్నాయి. జిల్లా పరిధిలోని 16 మండలాల్లో 591 మంది ఉద్యోగులకు గానూ 506 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో ఇద్దరు తహసీల్దార్లు, ఎనిమిది మంది డీటీలు, పన్నెండు మంది వీఆర్ఓలు, 13 మంది వీఆర్ఏలు, 20 మంది టైపిస్టులతో సహా సీనియర్, జూని యర్ అసిస్టెంట్లు, వాచ్మెన్లు, అటెండర్లు, డైవర్లు మొత్తం కలిపి 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఉద్యోగులు, సిబ్బంది కలిసి మొత్తంగా 92 ఖాళీలు ఉన్నాయి. ఇందులో డీఎస్డబ్ల్యూఓ పోస్టులు రెండు, ఏఎస్డబ్ల్యూఓ పోస్టులు 13, వార్డెన్ పోస్టులు 22, కామాటీలు, వాచ్మెన్లు, వంటవారికి చెందిన పోస్టులు 55 ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతమున్న సిబ్బందిలో కూడా 120 మంది ఔట్సోర్సింగ్పై పని చేస్తున్నారు. ఆర్వీఎంలో 24 ఇంజనీర్లకు గానూ 12 మంది మాత్రమే ఉండగా 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐసీడీఎస్లో సీడీపీఓతోపాటు అంగన్వాడీ వర్కర్స్, ఆయాల పోస్టు లు మొత్తం 10 ఖాళీగా ఉన్నాయి. ల్యాండ్ సర్వే విభాగంలో 16 మంది సర్వేయర్లకు గాను 9 మంది మాత్రమే ఉన్నారు. ఏడు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. జిల్లా విద్యాశాఖలో కూడా ఉపాధ్యాయ పోస్టులతోపాటు పలు కీలక అధికారుల పోస్టులు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. -
‘కష్ట’ర్లు
♦ నాలుగైదు క్లస్టర్లకు ఒకరే కార్యదర్శి ♦ 179 క్లస్టర్లలో పోస్టులు ఖాళీ ♦ అస్తవ్యస్తంగా పల్లె పాలన ♦ గ్రామ సచివాలయాల వద్ద ప్రజల పడిగాపులు దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల్లో పాలన కుంటుపడింది.. కార్యదర్శుల్లేక రోజు రోజుకు కునారిల్లుతున్నాయి. స్మార్ట్విలేజ్ అంటూ హడావుడిచేసిన సర్కార్ ఆ తర్వాత ఆ ఊసెత్తడం లేదు. కనీసం పల్లెల్లో పాలనపై కూడా దృష్టి పెట్టడం లేదు. కేంద్రం నుంచి నేరుగా వచ్చే నిధులను దారి మళ్లిస్తూ దొడ్డిదారిన పెత్తనం చెలాయిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : గ్రామ సచివాలయాలుగా పిలవబడే పంచాయతీ కార్యాలయాలు ఎప్పుడు చూసినా తాళాలు వేసే కన్పిస్తున్నాయి. అవసరానికి తగ్గట్టుగా కార్యదర్శుల్లేక ఈ కార్యాలయాల్లో పాలన పట్టాలు తప్పింది. ఉన్న కొద్ది మంది కార్యదర్శులపై పనిభారం పెరిగి పోవడంతో వారానికో రోజు కూడా కార్యాలయాల్లో అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 925 పంచాయతీలున్నాయి. 2 నుంచి 5 పంచాయతీల కొకటి చొప్పున 558 క్లస్టర్లుగా కుదించారు. కనీసం ఈ క్లస్టర్లకైనా పూర్తిస్థాయిలో కార్యదర్శులున్నారా అంటే అదీలేదు. 558 క్లస్టర్లుకు కేవలం 379 మంది కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. 179 క్లస్టర్లలో పోస్టులు ఖాళీ : రూ.5 లక్షలపైబడి ఆదాయమున్న గ్రేడ్-1 క్లస్టర్లు 77 ఉంటే వాటి పరిధిలో 61 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులున్నారు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయమున్న గ్రేడ్-2 క్లస్టర్లు 50 ఉంటే 39కి మాత్రమే కార్యదర్శులున్నారు. ఇక రూ.లక్ష నుంచి రూ.3 లక్షల ఆదాయమున్న గ్రేడ్-3 క్లస్టర్లు 151 ఉంటే.. కేవలం 49 చోట్లే కార్యదర్శులున్నారు. ఇక రూ.లక్ష లోపు ఆదాయం ఉన్న 280గ్రేడ్-4 క్లస్టర్లకు గాను 230 మంది కార్యదర్శులున్నారు. 2013లో 55 మంది కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయగా.. ఏపీపీ ఎస్సీ ద్వారా 155 మందిని కొత్తగా నియమించడంతో ఆ మాత్రమైనా కార్యదర్శులున్నారు. లేకపోతే మరీ ఘోరంగా ఉండేది. ఇంకా 179 క్లస్టర్లకు కార్యదర్శులు లేకపోవడం వల్ల వీటి పరిధిలో ఉన్న సగానికి పైగా పంచాయతీలు దిక్కూమొక్కూలేని అనాథల్లా తయారయ్యాయి. పంచాయతీల్లో వారానికోరోజే.. కార్యదర్శుల కొరత కారణంగా నాలుగైదు క్లస్టర్స్ కొకరు చొప్పున కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంటే ఒక్కో కార్యదర్శిపై ఐదునుంచి 10 పంచాయతీల భారం పడింది. ప్రతీనెలా 1 నుంచి 10వ తేదీ వరకు పింఛన్ల పంపిణీలో తలమునకలవ్వాల్సి వస్తోంది. ఆ తర్వాత సమావేశాలు.. సమీక్షలు, పన్నుల వసూళ్లంటూ ఊళ్లమ్మట తిరగడంతో నెలలో పట్టుమని నాలుగైదురోజులు కూడా కార్యాలయాల్లో ఉండలేని పరిస్థితి. కొంతమంది అయితే ఇదేఆసరాగా చేసుకుని సొంత పనులు చక్కబెట్టుకుంటూ కాలం గడిపేస్తున్నారు. లక్ష్యానికి దూరంగా పన్నుల వసూలు జిల్లాలో పన్నుల వసూలు డిమాండ్ రూ.38 కోట్లు కాగా మరో నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా.. రూ.13కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. మరో పక్క జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఎన్వోసీలు ఇలా పనుల కోసం వచ్చే సామాన్య ప్రజలు కార్యదర్శుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వస్తోంది. చివరకు మిగిలింది ఆరుగురే.. ఖాళీ పోస్టులను భర్తీచేయాల్సిన సర్కార్ ఆ ఊసెత్తకుండా వివిధ శాఖల్లో అదనపు సిబ్బందిని పంపించాలన్న ఆలోచనతో జీవో 966ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాసినా పెద్దగా స్పందన రాలేదు. కేవలం 19 మంది మాత్రమే కార్యదర్శులుగా చేరేందుకు ఆసక్తిచూపగా.. డిగ్రీ అర్హత ఉన్న రెగ్యులర్ ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోవాలని తొలుత జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 10మందిని అర్హులుగా నిర్ధారించారు. కానీ తాజాగా జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉన్న ఉద్యోగులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని చెప్పడంతో దరఖాస్తు చేసిన అటెండర్ స్థాయి సిబ్బందిని జాబితా నుంచి తప్పించడంతో చివరికి మిగిలింది ఆరుగురే. వీరికి శిక్షణ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. వెనక్కి వెళ్లనున్న డిప్యుటేషన్ సిబ్బంది మరో పక్క ఇప్పటికే డిప్యుటేషన్పై పనిచేస్తున్న 22 మందిలో ఒకరు లాంగ్ లీవ్లో ఉండగా.. మిగిలిన 21మంది పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. 14 ఏళ్లుగా పనిచేస్తూ, పదోన్నతులు పొందే అవకాశాన్ని కోల్పోతుండడంతో సొంత శాఖలకు వెళ్లేందుకు ఆసక్తిచూపుతున్నారు. వీరు కూడా వెళ్లిపోతే పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయకుంటే పంచాయతీల పాలన మరింత కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. -
గాడితప్పిన ‘పరిషత్’ పాలన
- 36 మండలాలకు 19 మందే ఎంపీడీఓలు - 16 ఈఓపీఆర్డీ పోస్టులూ ఖాళీ - ఏళ్లుగా భర్తీకి నోచుకోని పోస్టులు - పదోన్నతులను గాలికొదిలిన ప్రభుత్వాలు ఇందూరు : గ్రామాల అభివృద్ధికి బాటలు వేసే మండల పరిషత్ కార్యాలయాలు ప్రస్తుతం అచేతన స్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు ప్రజలు, అధికారులతో కళకళలాడిన ఈ కార్యాలయాలు ఇప్పుడు వెలవె లబోతున్నాయి. రెగ్యులర్ ఎంపీడీఓలు లేకపోవడం, నిధుల లేమితో పాలన గాడి తప్పింది. అధికారులు ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. 17 సంవత్సరాలుగా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. కిందిస్థాయి అధికారులకు పదోన్నతులు కల్పించలేదు. ఫలితంగా మండల పరిషత్ను అధికారుల కొరత తీవ్రంగా వెంటాడుతోంది. ఇన్చార్జ్లు పని భారం మోయలేకపోతున్నారు. జిల్లాలోని 36 మండలాల్లో 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఉద్యోగ విరమణ, ఇతర కారణాలతో ప్రస్తుతం 17 మండలాల్లో ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 19 మండలాల్లో మాత్రమే రెగ్యులర్ ఎంపీడీఓలున్నారు. సగం మండలాల్లో సూపరింటెండెంట్లకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం పనిచేస్తున్న రెగ్యులర్ ఎంపీడీఓలకు జిల్లా పరిషత్లో ఒకరికి డిప్యూటీ సీఈఓగా, మరొకరికి ఏఓగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా ఈఓపీఆర్డీ పోస్టుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మండలానికి ఒకరు చొప్పున 36 మండలాలకు 36 మంది రెగ్యులర్ అధికారులు ఉండాలి. కానీ, ప్రస్తుతం 16 మండలాల్లో ఈ పోస్టులు అధికారులు లేక వెక్కిరిస్తున్నాయి. దీంతో సూపరింటెండెంట్లకు, పంచాయతీ కార్యదర్శులకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. మండల పరిషత్ కార్యకలాపాలు చూడటం, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, ఉపాధిహామీ, మరుగు దొడ్ల నిర్మాణం, మండల పరిషత్ సమావేశాల నిర్వహణ, ఇతర పనులతో పనిభారం తీవ్రమైందని ఇన్చార్జ అధికారులు వాపోతున్నారు. 718 గ్రామ పంచాయతీలు, 477 క్లస్టర్లకు 236 మంది మాత్రమే రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలను అప్పగించారు. పదోన్నతులు లేకపోవడం కూడా ప్రధాన కారణం... ఎంపీడీఓ, ఈఓపీఆర్డీల కొరత వెనుక ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా దాదాపు 41 మంది సూపరింటెండెంట్లు సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారు. నిజానికి 5 సంవత్సరాలు ఇదే పోస్టులో పనిచేసిన వారికి ఎంపీడీఓగా పదోన్నతి కల్పించాలనే నిబంధన ఉంది. ప్రభుత్వాలు తమను రెగ్యులర్ చేస్తాయనే ఆశతో పనిచేసిన సూపరింటెండెంట్లు చాలా మంది ఉద్యోగ విరమణ పొందారు. అయితే పదోన్నతుల విషయంతో పాటు తమకు గెజిటెడ్ హోదా కల్పించాలనే డిమాండ్తో పంచాయతీ రాజ్ కమిషనర్ను కలుస్తూనే ఉన్నారు. కానీ,పదోన్నతులకు మాత్రం మోక్షం లభించడం లేదు. అతిగా ఒత్తిడి చేస్తే కోర్టులో కేసు ఉందని చెప్పి బుకాయిస్తున్నారు. నిబంధనల ప్రకారం చూస్తే ఎంపీడీఓ పోస్టులను సీనియార్టీ జాబితా ప్రకారం 35 శాతం సూపరింటెండెంట్లకు, 35 శాతం ఈఓపీఆర్డీలకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలి. 30 శాతం పోస్టులను నేరుగా ప్రభుత్వమే భర్తీ చేయాలి. 1998 సంవత్సరం తర్వాత ఒక్కరికి కూడా పదోన్నతులు కల్పించకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పిస్తే జిల్లాలో ఖాళీ ఉన్న 17 ఎంపీడీఓ, 16 ఈఓపీఆర్డీ పోస్టులు ఎప్పుడో భర్తీ అయ్యేవి. ఖాళీ అయిన ఈఓపీఆర్డీ, సూపరింటెండెండ్ పోస్టులు పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతుల ద్వారా లభించేవి. పదోన్నతులు చేపట్టాలి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వద్దకు చేర్చాలంటే మండల పరిషత్ ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇలాంటి మండల పరిషత్తో ఎంపీడీఓతో పాటు, సూపరింటెండెండ్, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు పూర్తి స్థాయిలో ఉండాలి. కానీ ప్రస్తుతం జిల్లాలో 36 మండలాల్లో 50 శాతం ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. తద్వారా పాలన సాధ్యం కావడం లేదు. ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయిస్తే తప్పులు దొర్లే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వాలు పదోన్నతుల విషయాన్ని మరిచిపోయాయి. ఏళ్లుగా పదోన్నతులు లేక ప్రధాన పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ఉద్యోగుల ఆశలు నెరవేరడం లేదు. ప్రభుత్వం పదోన్నతులు వెంటనే చేపట్టాలి. - గోవింద్, ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు -
వైద్యం ‘పోస్టు’పోన్!
వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీపై సర్కారు శీతకన్ను ఉద్యోగ నియామక ప్రకటనలో పోస్టుల ఊసే లేదు సిబ్బంది లేమితో అవస్థలు పడుతున్న ఆస్పత్రులు హైదరాబాద్: రాష్ట్రంలోని ఆస్పత్రులకు సమగ్ర చికిత్స చేసి ఆధునిక హంగులతో మరింత విస్తరిస్తామన్న సర్కారు.. ఆచరణలో మాత్రం ఆ వైపు ఒక్క అడుగు కూడా వేయడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో 15 వేల పోస్టులు ఖాళీగా ఉన్నా... ఇటీవల విడుదల చేసిన ఉద్యోగ నియామక ప్రకటనలో ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా ఈ శాఖకు సంబంధించినది లేకపోవడం గమనార్హం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల ఆస్పత్రులుగా, ఏరియా ఆస్పత్రులను 100 పడకలుగా, జిల్లా ఆస్పత్రులను సూపర్ స్పెషాలిటీలుగా... ఉస్మానియాలో 2,500 పడకలతో కూడిన 24 అంతస్తులతో రెండు భారీ టవర్ల ఆసుపత్రిగా... గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులను రెండు వేల పడకలుగా అభివృద్ధి చేస్తామని ఏప్రిల్లో జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా ప్రకటించారు. అలాగే ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది, పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ ఘనమైన ఈ లక్ష్యాల సాధనకు కీలకమైన వైద్య ఉద్యోగ ఖాళీల భర్తీపై మాత్రం శీతకన్ను వేశారు. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ లేకుండా ప్రజలకు మేలైన వైద్యం ఎలా అందించగలరని చర్చ జరుగుతోంది. 15 వేలకు పైగా ఖాళీలు: వైద్య ఆరోగ్యశాఖలో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు భారీగా ఖాళీలున్నాయి. దీంతో రోగులకు వైద్యసేవలు అరకొరగానే అందుతున్నాయి. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో రోజుకు 2 వేల మందికిపైగా రోగులు ఓపీలో చికిత్స పొందుతుంటారు. రోజూ 250 మంది వరకు ఆస్పత్రుల్లో చేరుతుంటారు. రోజూ 200 మంది వరకు ఆపరేషన్లు జరుగుతుంటాయి. సరైన సిబ్బంది లేక ఆపరేషన్ కోసం వారాల తరబడి రోగులు వేచి ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఎంఆర్ఐ, సీటీస్కాన్, ఆల్ట్రాసౌండ్ తదితర పరీక్షల కోసమైతే నెలల తరబడి వేచి ఉండాల్సిందే. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత వల్లే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పీహెచ్సీల్లో కనీసం ఇద్దరు వైద్యులుండాల్సి ఉండగా... ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. 24 గంటల వైద్య సేవలు సిబ్బంది లేక కునారిల్లుతున్నాయి. నిమ్స్లో 172 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్కడ నర్సింగ్ పోస్టులు 158 ఖాళీలున్నాయి. 116 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విధాన పరిషత్లో 385 వైద్యులు, నర్సింగ్ 429, పారామెడికల్ 765 ఖాళీలున్నాయి. ప్రజారోగ్యంలో 298 వైద్యులు, నర్సింగ్ 205, పారామెడికల్లో 765 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విద్యలో 426 వైద్యులు, 324 నర్సింగ్, 784 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవిగాక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, జాతీయ ఆరోగ్య మిషన్ కింద కూడా ఖాళీలున్నాయి. మొత్తంగా 15,727 ఖాళీలున్నట్లు అప్పట్లో సీఎం సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖలో వేల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా రోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని తెలంగాణ నర్సింగ్, పారామెడికల్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీను నాయక్ విమర్శించారు. తక్షణమే పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ ఖాళీలు కేటగిరి ఖాళీలు వైద్యులు 1,983 నర్సింగ్ 1,494 పారామెడికల్ 8,614 ఇతరులు 3,636 మొత్తం 15,727 -
బీసీ హాస్టళ్లలో ఖాళీల మోత..!
మొత్తం 549 పోస్టులు ఖాళీ హైదరాబాద్: రాష్ర్టంలోని చాలామటుకు బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్ హాస్టళ్లలో వార్డెన్లతో సహా వాచ్మెన్, కామాటీ, వంటవాళ్ల ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యాసంవత్సరం మొదలయ్యేనాటికే అన్ని వసతులను కల్పిస్తామని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో లోటు లేకుండా చేస్తామన్న మంత్రి ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ అనే తేడా లేకుండా ఆయా హాస్టళ్లలో ఖాళీల భర్తీకి ప్రభుత్వపరంగా చర్యలు కరువవుతున్నాయి. స్కూల్, కాలేజీ హాస్టళ్లలో విద్యార్థుల బాగోగులు చూసే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 239 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీ రాష్ర్టంలోని మొత్తం 490 ప్రీ మెట్రిక్, పోస్ట్మెట్రిక్ హాస్టళ్లలో వార్డెన్, వంటవాళ్లు, వాచ్మెన్, కామాటీలు కలుపుకుని 549 పోస్టులు ఖాళీగా ఉండటం హాస్టళ్లలో ఉన్న స్థితికి అద్దం పడుతోంది. ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్ హాస్టళ్లలో 239 హేచ్డబ్ల్యూఓ పోస్టులు ఖాళీగా ఉండగా.. ప్రీమెట్రిక్కు సంబంధించి 177 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, పోస్ట్మెట్రిక్ హాస్టళ్లలో 62 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హేచ్డబ్ల్యూఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆర్థికశాఖ వద్ద ఫైల్ వార్డెన్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమశాఖ ద్వారా పంపిన ఫైలు ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. అంతేకాకుండా హాస్టళ్లకు కామాటీలు, వంటవాళ్లు, వాచ్మెన్ను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకునేందుకు అనుమతినివ్వాలని ఆర్థికశాఖను బీసీశాఖ కోరింది. వార్డెన్ పోస్టుల భర్తీకి సమయం పట్టినా, వంటవాళ్లు, కామాటీ, వాచ్మెన్ పోస్టులను ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడవచ్చునని ఈ శాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు. -
రెండు నెలల్లో వ్యవసాయ శాఖలో ఖాళీల భర్తీ
కదిరి (అనంతపురం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న వ్యవసాయాధికారుల(ఏఓ) పోస్టులకు 2, 3 నెలల్లో భర్తీ చేస్తామని ఆ శాఖ అదనపు డెరైక్టర్ వి.విజయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో విత్తన వేరుశనగ పంపిణీని పర్యవేక్షించారు. అనంతరం కదిరిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో ఏఓ పోస్టులు చాలా వరకూ ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా సరఫరా చేస్తున్న వేరుశనగ విత్తనాలు సరిగా లేకుంటే... వాటిని వాపసు ఇచ్చి మరో సంచి తీసుకెళ్లవచ్చన్నారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. -
తెలంగాణలో జాబుల జాతర
-
ఉద్యోగాల రగడ
►ఖాళీల భర్తీపై అసెంబ్లీలో సర్కారును నిలదీసిన విపక్షాలు ► రాజకీయ పదవులపై చూపిన శ్రద్ధ.. ఉద్యోగాలపై లేదని మండిపాటు ►నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టు ► కమిటీల పేరుతో కాలయాపన చేయొద్దంటూ హితవు ►విపక్షాలవి మొసలి కన్నీరంటూ మంత్రులు ఈటెల, హరీశ్ ఎదురుదాడి ►సీఎం చెప్పినట్లు లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడి ►కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ►మంత్రుల సమాధానంతో సంతృప్తి చెందని విపక్షాలు ►నిరసనగా కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం వాకౌట్ ►రెండున్నర గంటలపాటు దద్దరిల్లిన సభ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై శాసనసభ మంగళవారం అట్టుడికింది. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో ఇప్పటికీ ఉద్యోగాల భర్తీని చేపట్టకపోవడంపై సర్కారును విపక్షాలు గట్టిగా నిలదీశాయి. నియామకాలు ఎప్పుడు, ఎలా, ఎన్ని భర్తీ చేస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలంటూ పట్టుబట్టాయి. రాజకీయ పదవులను మాత్రం వేగంగా భర్తీ చే స్తున్న ప్రభుత్వం.. ఉద్యోగ ఖాళీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని కూడా ప్రస్తావించి సభను హోరెత్తించాయి. అయితే విపక్షాల దాడికి అధికారపక్షం దీటుగానే బదులిచ్చింది. ఉద్యోగ భర్తీల విషయంలో విపక్షాలన్నీ మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఎదురు దాడికి దిగింది. విభజన అడ్డంకులను అధిగమిస్తూ ప్రభుత్వం ముందుకు కదులుతోందని, లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామని మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్రావు ప్రకటించారు. మంత్రుల సమాధానానికి సంతృప్తి చెందని కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీల సభ్యులు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. మొత్తానికి ఉద్యోగాల అంశంపై దాదాపు రెండున్నర గంటలపాటు శాసనసభ దద్దరిల్లింది. మంగళవారం ఉదయం సభ మొదలవగానే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు, కేటగిరీవారీగా వివరాలు, వాటి భర్తీకి తీసుకుంటున్న చర్యలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై అన్ని పార్టీల నుంచి 27 మంది సభ్యులు ఒకే ప్రశ్నగా అడిగారు. దీనికి ఆర్థిక మంత్రి ఈటెల మొదట సమాధానమిచ్చారు. అనంతరం మిగతా సభ్యులందరూ దీనిపై తలో ప్రశ్న వేయడంతో సభ రెండున్నర గంటల పాటు ఇదే అంశంపై నడిచింది. దీంతో మిగతా ప్రశ్నలను స్పీకర్ వాయిదా వేశారు. ఉద్యోగుల భర్తీ ఎప్పుడు?: కాంగ్రెస్ ఉద్యోగాల కోసం 25 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ పేర్కొంది. పాఠశాలల్లో 25 వేల పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని సభ దృష్టికి తెచ్చింది. పార్టీ తరఫున ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, సభ్యులు చిన్నారెడ్డి, వంశీచంద్రెడ్డి మాట్లాడారు. ‘ఉద్యోగ భర్తీపై ఏమీ చెప్పకుండా గత ప్రభుత్వాలపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూడటం సమంజసం కాదు. నియామకాలు ఎప్పుడు, ఎంత వ్యవధిలో, ఎలా చేస్తారో స్పష్టతనివ్వాలి. కమలనాథన్ కమిటీతో సంబంధం లేని 85 శాతం పోస్టుల్లో సుమారు 90 వేల ఖాళీలను భర్తీ చేసే అవకాశముంది. వీటిని ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పండి’ అని జానారెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి హరీశ్రావు స్పందిస్తూ.. ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామన్నారు. దాటివేత ధోరణి: బీజేపీ ‘ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. ఖాళీలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం భర్తీపై స్పష్టతనివ్వడం లేదు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల భర్తీని కూడా కమల్నాథన్ కమిటీతో ముడిపెడుతున్నారు. ఇది మోకాలుకు, బోడిగుండుకు ముడిపెట్టడమే. కాంట్రాక్టు ఉద్యోగులను ఎంతమందిని క్రమబద్ధీకరిస్తారో చెప్పండి’ అని బీజేపీపక్ష నేత కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎంతమందో తేల్చండి: ఎంఐఎం నియామకాలు చేపట్టే ముందు శాఖలవారీగా ఎంత మంది ఉద్యోగులు అవసరమో తేల్చాలని సర్కారుకు ఎంఐఎం సూచించింది. ఆ పార్టీ తరఫున అక్బరుద్దీన్ మాట్లాడారు. ఉద్యోగ ఖాళీలకు నిర్వహించే పరీక్షలను ఉర్దూలో నిర్వహిస్తారా? ఈ నియామకాల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తారా అన్నది స్పష్టంగా తెలపాలని డిమాండ్ చేశారు. క్రమబద్ధీకరణ ఎప్పుడు?: లెఫ్ట్ కాంట్రాక్టు ఉద్యోగులను ఎప్పటిలోగా క్రమబద్ధీకరణ చేస్తారని సీపీఐ, సీపీఎం పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఆ పార్టీల నేతలు రవీంద్రకుమార్, సున్నం రాజయ్య ఈ విషయాన్ని ప్రస్తావించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా ప్రభుత్వం వద్ద ఉన్న ప్రస్తుత లెక్కల ప్రకారం ఖాళీలను భ ర్తీ చేయాలని కోరారు. నిరంతర ప్రక్రియగా ఉద్యోగాల భర్తీ: ఈటెల ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం మంత్రి ఈటెల రాజేందర్ సమాధానమిచ్చారు. ‘కమల్నాథన్ కమిటీతో సంబంధం లేకుండా 85 శాతం ఉద్యోగ ఖాళీలు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పరిధిలో ఉన్నాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేశాం. గతంలో ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయి. మళ్లీ అలా జరగకుండా నియామకాలను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇకపై నిరంతర ప్రక్రియలా ఉద్యోగాల భర్తీని చేపడతాం’ అని మంత్రి పేర్కొన్నారు. నియామకాలన్నీ ప్రస్తుతమున్న రిజర్వేషన్ మేరకే జరుగుతాయన్నారు. ఏడాదిలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం ఇచ్చిన హామీ మేరకు నియామకాలు జరుపుతామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు చర్యలు మొదలుపెట్టామని, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నియామక పరీక్షలన్నీ ఉర్దూలోనూ ఉండేలా చూస్తామన్నారు. -
76,545 పోస్టులకు మోక్షమెప్పుడో
హైదరాబాద్: విభజన సమస్య లేకున్నా భర్తీకి నోచుకోని జిల్లా స్థాయి ఖాళీలు జోన్ల వ్యవస్థ కొనసాగితే మరో 20 వేల ఖాళీల భర్తీకీ ఢోకా లేదు అయినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. ఆవేదన చెందుతున్న నిరుద్యోగులు రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా పోస్టుల భర్తీ వ్యవహారం ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. క్షేత్ర స్థాయిలో భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా.. వాటి భర్తీకి చేపట్టాల్సిన చర్యల్లో వేగం పుంజుకోవడం లేదు. రాష్ట్ర విభజన జరిగి 10 మాసాలు పూర్తి కావస్తున్నా ఖాళీల భర్తీ ముందుకు సాగడం లేదు. కొత్త రాష్ట్రం ఏర్పడగానే ఉద్యోగ నోటి ఫికేషన్లు వస్తాయని భావించిన నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. గ్రూపు-1, గ్రూపు-2, లెక్చరర్, ఇంజనీర్ తదితర పోస్టుల కోసం లక్షల మంది ఏళ్ల తరబడి శిక్షణలు తీసుకుంటూనే ఉన్నారు. కొత్త రాష్ట్రంలో నోటిఫికేషన్ల జారీకి సమయం పడుతుందని కొన్నాళ్లు.. సిలబస్ మార్పుల పేరుతో ఇంకొన్నాళ్లు, ఎన్నికల పేరుతో మరి కొన్నాళ్లు.. ఇలా కారణాలు ఏమైనా నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడక తప్పడం లేదు. ఇక పరీక్షల విధానం, సిలబస్లో మార్పుల ఖరారుకు ఇంకెంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటివరకు 44 శాఖల్లోని ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. ఇంకా మరో 110 విభాగాల్లోని ఉద్యోగుల నుంచి ఆప్షన్లను తీసుకోవాల్సి ఉంది. ఇక ఆప్షన్లు ఇచ్చిన 44 శాఖల్లోని ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు. దీంతో రాష్ట్ర స్థాయి, మల్టీ జోనల్, విభాగాధిపతి కార్యాలయాల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇవి కాకుండా జిల్లా స్థాయిలోనే 76,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ జిల్లాల్లోని వివిధ శాఖల కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టుల భర్తీకి విభజన సమస్య లేనేలేదు. ప్రభుత్వం తలచుకుంటే ఈ పోస్టుల భర్తీకి పెద్దగా అడ్డంకులు లేవు. అయినా ప్రభుత్వం దృష్టి సారించడం లేదని నిరుద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరో 20 వేల పోస్టులు.. రాష్ట్రంలో జోన్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టకుండా ప్రస్తుతం ఉన్న రెండు జోన్లను యథావిధిగా కొనసాగిస్తే మరో 20,591 పోస్టుల భర్తీకి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే రాష్ట్రంలో రెండు జోన్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో వాటిని మూడు లేదా నాలుగు జోన్లకు పెంచాలన్న వాదన ఉంది. ఇదీ ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేదు. జోన్ల పునర్వ్యవస్థీకరణ చేయాలంటే రాష్ట్రపతి ఆమోదంతో 371(డి) అధికరణానికి సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పట్టనుంది. అందుకే ప్రస్తుతమున్న రెండు జోన్లను కొనసాగిస్తూ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని, తద్వారా 96 వేల ఉద్యోగాలను భర్తీ చేయవచ్చని నిరుద్యోగులు కోరుతున్నారు. టీచర్ పోస్టుల భర్తీలో గందరగోళం.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వ్యవహారమైతే మరింత గందరగోళంగా తయారైంది. ఈ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తారో చేయరో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతుండగా, దాదాపు 3 లక్షల మంది నిరుద్యోగులు మాత్రం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే వేసవి సెలవుల్లో స్కూళ్లలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది. తద్వారా ఉన్న ఉపాధ్యాయులనే అవసరం ఉన్న స్కూళ్లకు పంపించే ప్రణాళికలపై దృష్టి పెట్టింది. దీంతో కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందా? రాదా? అనే తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,702 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ తాజాగా లెక్కలు వేసింది. మరి వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇస్తుందా? లేదా? అనే విషయాన్ని కూడా ప్రభుత్వమే తేల్చాల్సి ఉంది. గత వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ను మార్చి మూడో వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో జారీ చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగినా అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. -
మెడి‘కిల్స్’!
-వైద్యశాఖలో వందలాది పోస్టుల ఖాళీ - వేధిస్తున్న డాక్టర్లు, సిబ్బంది కొరత - పేదలకందని వైద్య సేవలు - భయపెడుతున్న స్వైన్ఫ్లూ లాంటి పమాదకర వ్యాధులు చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రమాదకర వ్యాధులు ప్రజల్ని భయపెడుతున్నా పట్టించుకునేవారు లేరు. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పర్యవసానంగా పేదలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇలాంటి ప్రమాదకర వ్యాధులపై అవగాహన కల్పించి ప్రజల్ని చైతన్య పరచాల్సిన వైద్య ఆరోగ్య శాఖ ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేతులెత్తేసింది. మరోవైపు వ్యాధి నిరోధకానికి అవసరమైన మందులు, మాస్క్లు, టెస్టింగ్ కిట్లు తగినన్ని సరఫరా చేయడంలోనూ ఆ శాఖ విఫలమైంది. గాలి ద్వారా వ్యాపించే వైరస్ను తట్టుకునేందుకు అవసరమైన రెస్ప్విలేటర్ మాస్క్లతోపాటు ఓసెల్టామిర్ (టామీఫ్లూ) 78 మిల్లీ గ్రాముల మాత్రలు తగినన్ని సరఫరా చేయలేదు. సిరఫ్లు, టెస్టింగ్ కిట్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పేద రోగులు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా చితికిపోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా సిబ్బంది కొరత జిల్లాలో 94 పీహెచ్సీలు, 644 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వైద్యులతో పాటు సిబ్బంది పోస్టులు 2,302 ఉండగా, 1,741 మంది మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. మిగిలిన 560 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏపీవీవీపీల్లో 55కు పైగా వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా తంబళ్లపల్లెలో ఆరు పీహెచ్సీలు, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉండగా, ఆరుగురు డాక్టర్లు, 13 మంది ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సు పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కుప్పంలో 9 పీహెచ్సీలు, 56 ఉపఆరోగ్య కేంద్రాలుండగా 26 ఏఎన్ఎం పోస్టులు, నాలుగు డాక్టర్ పోస్టులు, పీలేరులో ఆరు పీహెచ్సీలుండగా ఐదు పీహెచ్సీలకు డాక్టర్లు, పుంగనూరులో 9 పీహెచ్సీల పరిధిలో డాక్టర్లతో పాటు ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పూతలపట్టులో పి.కొత్తకోట, బంగారుపాళెంలోని ఆస్పత్రుల పరిధిలో పూర్తిస్థాయిలో డాక్టర్లు లేరు. పలమనేరులో వంద పడకల ఆస్పత్రితోపాటు ఏడు పీహెచ్సీల పరిధిలో డాక్టర్లు, సిబ్బంది కొరత అక్కడి రోగులను వేధిస్తోంది. జీడీనెల్లూరు పరిధిలో 8 పీహెచ్సీలుండగా వెదురుకుప్పం, పెనుమూరు ఆస్పత్రుల్లో వైద్యులు, ఏఎన్ఎంల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చంద్రగిరిలో ఏడు పీహెచ్సీల పరిధిలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. మదనపల్లెలో ఏడు పీహెచ్సీలుండగా వైద్యులు సక్రమంగా అందుబాటులో లేరు. నగరిలో నాలుగు పీహెచ్సీలుండగా డాక్టర్లు, సిబ్బంది కొరత ఉంది. సత్యవేడులో రెండు పీహెచ్సీ పరిధిలో డాక్టర్లు, సిబ్బంది కొరత ఉంది. చిత్తూరులోనూ స్టాఫ్ నర్సుతోపాటు పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శ్రీకాళహస్తిలో ఐదు పీహెచ్సీలుండగా డాక్టర్లు, సిబ్బంది కొరత ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. -
ఖాళీ పోస్టుల లెక్క తేల్చండి: కడియం
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల లెక్క తేల్చాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు, వివిధ విభాగాధిపతులతో సోమవారం ఆయన శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన అంశాలు, త్వరలో జరుగబోయే వార్షిక పరీక్షల ఏర్పాట్లపైన సమీక్షించారు. జిల్లాల్లో మోడల్ స్కూళ్లు, బాలికల హాస్టళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.