Video call
-
ఫేస్బుక్ పరిచయం.. వివాహితకు శాపం
బంజారాహిల్స్: ఫేస్బుక్ పరిచయం ఆమె పాలిట శాపమైంది. కువైట్లో ఉన్న ఓ వ్యక్తి ఫేస్బుక్ చాట్లో తీయటి మాటలతో ఓ వివాహితను లోబర్చుకున్నాడు. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ ఆమెతో శారీరకంగా కలవడమే కాకుండా ప్రైవేటు ఫొటోలను, వీడియోలను కూడా తీశాడు. ఫేస్బుక్ మెసెంజర్లో ఆ ఫొటోలను పోస్ట్ చేసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతుండటంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కువైట్లో ఉంటున్న కుడుపూడి ప్రసాదరావుతో నగరానికి చెందిన ఓ వివాహితకు ఫేస్బుక్లో పరిచయమైంది. ఆ తర్వాత తరచూ చాటింగ్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తన పట్ల ప్రసాదరావు కనబరుస్తున్న ప్రేమతో అతనిని నమ్మడం ప్రారంభించింది. 2020లో ఇరువురూ శారీరకంగా ఒక్కటయ్యారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ప్రసాదరావు ఆమెతో 2, 3 రోజులుగా గడిపేవాడు. డబ్బు, బంగారం ఇచ్చేవాడు. కువైట్లో ఉన్నప్పుడు ఆమెతో వీడియో కాల్లో మాట్లాడేటప్పుడు ప్రైవేటు పార్ట్స్ను స్క్రీన్ రికార్డ్ చేశాడు. ప్రైవేటుగా కలిసే సమయంలో ఆమె ఫొటోలను సేవ్ చేశాడు. రోజులు గడిచే కొద్దీ ప్రసాదరావు ప్రవర్తన ఆమె పట్ల మారుతూ వచ్చింది. ఆమె కోసం ఖర్చు చేసిన డబ్బును తిరిగి అడగడం ప్రారంభించాడు. లేదంటే తనతో ఉన్న ప్రైవేటు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. ఈ క్రమంలో వీరిద్దరి ఫొటోలను తన ఐడీ ద్వారా ఫేస్బుక్ స్నేహితులకు మెసెంజర్లో పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏపీలోని రాజోలు పొన్నమండలో ఉండే ప్రసాదరావు భార్య భవాని, తండ్రి రామకృష్ణ తదితరులు కలిసి ఆమె ఇంటికి వెళ్లి రూ.4,28,800 చెల్లించాలంటూ తెల్ల కాగితంపై బలవంతంగా సంతకం చేయించుకున్నారు. బాధితురాలితో పాటు ఆమె కుమార్తెను బెదిరించి గొలుసు, ఉంగరాలు సహా 28 గ్రాముల బంగారాన్ని తీసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ శనివారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
చనిపోతున్నా బిడ్డా..!
ఇచ్చోడ: ‘‘చనిపోతున్నా బిడ్డా..’’అంటూ ఓ తండ్రి కూతురికి వీడియో కాల్ చేశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేసి.. వారు అతని ఆచూకీ కోసం ఆరా తీస్తూ వెళ్లేసరికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జున్ని గ్రామంలో శనివారం ఈ విషాదకర ఘటన జరిగింది. అప్పులు పెరిగిపోవడంతోపాటు, ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.గ్రామస్తులు, ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. జున్ని గ్రామానికి చెందిన అడిగే జనార్దన్కు భార్య గంగబాయి, ముగ్గురు కూతుళ్లు లక్ష్మి, ప్రియ, గంగమణి, కుమారుడు విఠల్ ఉన్నారు. కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. జనార్దన్ తనకున్న మూడెకరాల్లో పత్తి, సోయా సాగు చేశాడు. కొన్ని నెలల క్రితం ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అయితే ట్రాక్టర్ సరిగా నడవకపోవడంతో కిస్తీలు కట్టలేకపోయాడు. దీంతో కిస్తీలు కట్టాలని ఫైనాన్స్ వారు ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో జనార్దన్ మద్యానికి బానిసయ్యాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పుణేలో ఉంటున్న కూతురికి వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. వెంటనే ఆమె గ్రామంలోని తన కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించింది. వీడియో కాల్లో కనిపించిన ప్రదేశంలో సిమెంటు బెంచీలు ఉన్నాయని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చోడ పార్కులో గాలించారు. అక్కడ కనిపించకపోవడంతో పొలం చుట్టుపక్కల ప్రదేశంలో గాలిస్తుండగా.. ఓ స్టోన్ క్రషర్ సమీపంలో చెట్టుకు జనార్దన్ (50) మృతదేహం వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుపతి తెలిపారు. -
బాస్ లీవ్ ఇవ్వలేదని.. వీడియో కాల్లో పెళ్లి
పని, పని పని.. కార్పొరేట్ కల్చర్లో ఇది ఎక్కువైంది. కార్యాలయాల్లో పని ఒత్తిడి.. ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ముఖ్యమైన అవసరాలకు సైతం సరిగా లీవ్లు కూడా ఇవ్వని పరిస్థితి తలెత్తుతోంది. కానీ ఎంత పెద్ద ఉద్యోగమైన, ఎంత పెద్ద పదవిలో ఉన్న జీవితంలో జరిగే పెళ్లికి ప్రతి ఒక్కరూ తప్పక సెలవులు పెడతారు. అయితే టర్కీలో ఓ ఉద్యోగికి తన పెళ్లికి బాస్ లీవ్ ఇవ్వలేదు. దీంతో అతను వర్చువల్గా వివాహం చేసుకోవాలసి వచ్చింది.హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ జంట ఆన్లైన్ వీడియో కాల్ సాక్షిగా ఒక్కటైయ్యారు. పెళ్లి కూతురు మండిలో.. పెళ్లి కొడుకు టర్కీలో ఉండి వీడియో కాల్లోనే పెళ్లి తంతు పూర్తి చేశారు. బిలాస్పూర్ చెందిన అద్నాన్ ముహమ్మద్ టర్కీలో పని చేస్తున్నాడు. స్వదేశానికి వచ్చి వివాహ చేసుకునేందుకు అతడు లీవ్ కోరగా.. కంపెనీ సెలవు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతను వర్చువల్గా ముస్లిం మత సంప్రదాయ ప్రకారం వీడియోకాల్లో పెళ్లి చేసుకున్నాడు. అయితే అంత హడావిడీగా పెళ్లి చేసుకోవడానికి కారణం.. వధువు తాత అనారోగ్యంతో ఉండటంతో ఆమెను త్వరగా వివాహం చేసుకోవాలని పట్టుబట్టినట్లు వరుడి కుటుంబ సభ్యులు తెలిపారు.ఆమె పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో ఇరు కుటుంబీకులు ఆన్ లైన్ నికాకు అంగీకరించారు. బిలాస్పూర్ నుంచి నవంబర్ 3న ఆదివారం మండికి చేరుకున్నారు. మండీలో నవంబర్ 4న (సోమవారం) వీడియో కాలంలో వారి వివాహం జరిగింది. ఖాజీ వారితో కలిసి ఖుబూల్ హై అని మూడుసార్లు అనిపించారు. ఇదిలా ఉండగా గతేడాది జూలైలో సిమ్లాలో మరో వ్యక్తి కూడా ఇలానే ఆన్ లైన్ పెళ్లి చేసుకున్నాడు. కోట్ఘర్కు చెందిన ఆశిష్ సింఘా, కులులోని భుంతర్కు చెందిన శివాని ఠాకూర్లు కొండచరియలు విరిగిపడటంతో టైంకు వారి పెళ్లింటికి చేరుకోలేక పోయారు. దీంతో వీడియో-కాన్ఫరెన్స్లో పెళ్లి చేశారు. -
ఫేక్ వీడియో కాల్ బారినపడ్డ డేవిడ్ కామెరాన్!
లండన్: సామాన్యులు, రాజకీయ, సినీ ప్రముఖులు.. ఇలా అందరూ ఇటీవలఫేక్ కాల్స్ బారినపడుతున్నారు. అయితే తాజాగా బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరాన్ కూడా ఫేక్ వీడియో కాల్ బారిన పడ్డారు. డేవిడ్ కామెరాన్కు ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో నుంచి వీడియో కాల్ రావటంతో ఆయన సంభాషించారు. అయితే తర్వాత కొంతసేపటికి అది ఫేక్ కాల్ అని తేలిపోయింది. ఈ విషయాన్ని యూకే విదేశాంగ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.‘‘ కామెరాన్కు వీడియో కాల్ వచ్చింది. అందులో అచ్చం ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకోలా కనిపిస్తూ ఓ వ్యక్తి మాట్లాడారు. అయితే కొంత సమయానికి అవతలివైపు ఉన్న వ్యక్తి పెట్రో పోరోషెంకోనా? కాదా? అనే అనుమానం డేవిడ్కు కలిగింది. దీంతో అది ఫేక్ వీడియో కాల్గా ఆయన గుర్తించారు. ఈ ఫేక్ వీడియో కాల్, మెసెజ్లు నకిలీవి’ అని విదేశాంగ విభాగం పేర్కొంది.వీటిపై దర్యాపు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ నకిలీ కాలర్తో డేవిడ్ కామెరాన్ ఏం సంభాషించారనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఫేక్ కాలర్ కామెరాన్ను సంప్రదించటం కోసం మరింత సమాచారం అడిగినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన డేవిడ్ కామెరాన్.. ఫేక్ కాల్స్, నకిలీ సమాచారాన్ని ఎదుర్కొనే ప్రయత్నం, అవగాహన ప్రజల్లో పెంచాలని భావించినట్లు విదేశాంగ కార్యాలయం పేర్కొంది.2018లో బోరిస్ జాన్సన్ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో అర్మేనియా ప్రధాని పేరుతో ఓ ఫేక్ కాల్ వచ్చింది. అదే విధంగా 2022లో ఇద్దరు మంత్రులకు ఫేక్ కాల్స్ రావటం వెనక రష్యా హస్తం ఉందని బ్రిటన్ ఆరోపణులు కూడా చేసింది. -
అభిమానికి వీడియో కాల్ చేసి సర్ ప్రైజ్ చేసిన రష్మిక !
-
‘బ్లూజీన్’ ద్వారా కోర్టులో చంద్రబాబు హాజరు
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ శుక్రవారంతో పూర్తయిన నేపథ్యంలో వర్చువల్ విధానం ద్వారా ఆయన్ను ఏసీబీ న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. అత్యాధునిక ‘బ్లూ జీన్’ యాప్ ద్వారా ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి ఉదయం 11 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. మామూలుగా ఖైదీలను వర్చువల్ విధానం అంటే వీడియో కాల్ ద్వారా కోర్టులో హాజరు పరుస్తుంటారు. అప్పుడు కోర్టులో ఉన్న జడ్జిలు వారి స్థానం నుంచి మరో చోటుకు వెళ్లాల్సి వచ్చేది. అయితే చంద్రబాబుకు అత్యంత భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో బ్లూ జీన్ యాప్ను వినియోగించినట్లు తెలిసింది. దీనిద్వారా జడ్జి తన ఛాంబర్లో కూర్చొనే విచారణ చేయొచ్చు. ఖైదీ సైతం తనకు కేటాయించిన బ్యారక్లో నుంచే కోర్టు ఎదుట హాజరు కావచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటిసారిగా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రిమాండ్ ఖైదీని కోర్టులో హాజరు పరిచినట్లు ఓ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా, సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో న్యాయవాది లక్ష్మీనారాయణ ములాఖత్ అయ్యారు. క్వాష్ పిటీషన్ను హైకోర్టు కొట్టేసిన విషయాన్ని బాబుకు వివరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా టీడీపీ లీగల్ టీంపై బాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరింత మంది సుప్రీంకోర్టు సీనియర్లతో మాట్లాడాలని సూచించినట్లు తెలిసింది. ఎంత ఖర్చు అయినా సరే.. టాప్ లాయర్లను రంగంలోకి దింపాలని సూచించినట్లు సమాచారం. ఆధారాల జోలికి వెళ్లకుండా సాంకేతిక దారుల్లో వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. అనంతరం నేడు జరగబోయే కస్టడీ విచారణపై చర్చించినట్లు తెలిసింది. పట్టాభికి భంగపాటు టీడీపీ నేత పట్టాభికి రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద భంగపాటు ఎదురైంది. జైలు వద్ద ఉన్న మీడియా పాయింట్కు వచ్చిన ఆయన.. కాసేపట్లో తీర్పు వస్తుందని, బాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, ప్రభుత్వంపై పోరాటం చేస్తారని ప్రకటించారు. ఇదిజరిగిన కొద్ది గంటల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేసినట్లు వార్తలొచ్చాయి. దీంతో కోర్టులో ఉన్న అంశాలపై ఎందుకు మాట్లాడారని పార్టీలోని కొందరు పెద్దలు పట్టాభికి క్లాస్ పీకినట్లు తెలిసింది. -
అదిరిపోయే ఫీచర్: జూమ్ మీటింగ్లో ఇక ఆ ఇబ్బంది ఉండదు..
Zoom Notes Feature: వర్చువల్ మీటింగ్ ప్లాట్ఫామ్ జూమ్ (Zoom) అదిరిపోయే ఫీచర్ను తీసుకొస్తోంది. వీడియో కాల్స్ (Video Call) సమయంలో టెక్స్ట్ డాక్యుమెంట్ను రూపొందించడానికి, షేర్ చేయడానికి, ఏకకాలంలో ఎడిట్ చేయడానికి అనుమతించే 'నోట్స్' (Notes) అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. (Layoffs: భారత్లో లేఆఫ్లు.. విస్తుగొలుపుతున్న లెక్కలు!) ఈ నోట్స్.. జూమ్ చాట్ బాక్స్ లాగే వీడియో కాల్ స్క్రీన్పై ఓ వైపున కనిపిస్తాయి. కాల్లో ఉన్న వ్యక్తులు మీటింగ్ జరుగుతున్నప్పుడు మరొక స్క్రీన్కి మారే పని లేకుండా ఈ నోట్స్లో రాసుకోవడం, ఎడిట్ వంటివి చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన లేదా ఎడిట్ చేసిన నోట్స్ను జూమ్ మీటింగ్లో పాల్గొన్న వారికి షేర్ చేయవచ్చు. దీని వల్ల ఇతర థర్డ్ పార్టీ డాక్యుమెంట్స్ను, టూల్స్ను ఆశ్రయించే పని ఉండదు. యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు వారు ఇతర కంటెంట్ మేనేజ్మెంట్ టూల్స్కు వెళ్లే పని లేకుండా జూమ్ ప్లాట్ఫారమ్లోనే ఉంటూ మీటింగ్ అజెండాలు, ఇతర నోట్స్ తయారు చేసుకునేలా ఈ ఫీచర్ను తీసుకొచ్చినట్లు జూమ్ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్ హెడ్ డారిన్ బ్రౌన్ పేర్కొన్నారు. జూమ్ మీటింగ్ ప్రారంభానికి ముందు కానీ, మీటింగ్ జరుగుతున్న సమయంలో కానీ నోట్స్ ద్వారా అజెండా రూపొందించి ఇతరులకు షేర్ చేయవచ్చు. మీటింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ నోట్స్ను ఇతరులకు షేర్ చేసే వీలు ఉంటుంది. ఇక ఈ నోట్స్లో ఫాంట్, స్టైలింగ్, బుల్లెట్లు, టెక్ట్స్ కలర్స్ వంటి ఆప్షన్లు ఉంటాయి. అలాగే వీటికి ఇమేజ్లను, లింక్లను యాడ్ చేయవచ్చు. ఈ నోట్స్ ఎప్పటికప్పడు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇదీ చదవండి: WFH: అక్కడ వర్క్ ఫ్రమ్ హోం.. కంపెనీలకు పోలీసు శాఖ సూచన -
‘ఎక్స్’లో ఆడియో, వీడియో కాల్స్
వాషింగ్టన్: మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్విట్టర్’ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గత ఏడాది కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అందులో ఎన్నో మార్పులు చేస్తున్నారు. ట్విట్టర్ పేరును ‘ఎక్స్’గా మార్చారు. పిట్ట స్థానంలో ఎక్స్ లోగోను పొందుపర్చారు. ఆదాయం పెంపే లక్ష్యంగా మరో నిర్ణయం తీసుకున్నారు. ‘ఎక్స్’లో ఇకపై ఆడియో, వీడియో కాల్స్ సదుపాయం కలి్పంచనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఫోన్ నంబర్ అవసరం లేకుండానే యూజర్లతో కాల్స్ను కనెక్ట్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్్కటాప్ సహా వినియోగదారులంతా ఈ సదుపాయం పొందవచ్చని సూచించారు. ప్రభావవంతమైన ప్రపంచ ఆడ్రస్ బుక్కు ‘ఎక్స్’ వేదిక కానుందని, ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు ఉంటాయని వివరించారు. ‘ఎక్స్’లో ప్రస్తుతం ట్వీట్ డెక్ సరీ్వసులు ఉచితంగా అందిస్తున్నారు. వాటిని పెయిడ్ సరీ్వసులుగా మారుస్తున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. -
ఆడియో, వీడియో కాల్ సదుపాయం ఎక్స్(ట్విటర్)లో కూడా - ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్ ట్విటర్ కంపెనీ కొనుగోలు చేసిన తరువాత అనేక మార్పులు చేసిన విషయం తెలిసింది. ఉద్యోగుల తొలగింపు, బ్రాండ్ లోగోలో మార్పు వంటి వాటితో పాటు, ఇటీవల ట్విటర్కి 'ఎక్స్' అని నామకరణం చేసాడు. కాగా ఇప్పుడు ఆడియో అండ్ వీడియో కాల్స్కి సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల 'ఎక్స్'గా పేరు మార్చుకున్న ట్విటర్లో త్వరలో ఆడియో అండ్ వీడియో కాల్స్ సదుపాయం లభిస్తుందని కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. దీనిని వినియోగదారులు ఫోన్ అవసరం లేకుండా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్, మాక్, పీసీలో వినియోగించుకోవచ్చు. అయితే ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: 64 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్.. కారణం ఏంటంటే? Video & audio calls coming to X: - Works on iOS, Android, Mac & PC - No phone number needed - X is the effective global address book That set of factors is unique. — Elon Musk (@elonmusk) August 31, 2023 -
ప్రియురాలికి చివరి కాల్ చేసి.. నేను పోతున్నా, నువ్వు పెళ్లి చేసుకో
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు చావు తథ్యమని తెలుసుకుని, ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు, తన అంత్యక్రియలకు ఆహ్వానించిన కొంతసేపటికి ప్రాణం వదిలిన హృదయ విదారక సంఘటన నెలమంగలలో వెలుగు చూసింది. నెలమంగలకు చెందిన కిరణ్ అనే యువకునికి కొన్నిరోజుల కిందట కుక్క కరవడంతో పెద్దగా పట్టించుకోలేదు, దీంతో రేబిస్ వ్యాధి సోకింది. తల్లిదండ్రులు అతన్ని బెంగళూరు నిమ్హాన్స్ ఆస్పత్రిలో చేర్చగా బతకడం కష్టమని వైద్యులు నిర్ధారించారు. కిరణ్ ప్రియురాలికి వీడియో కాల్ చేసి.. తాను ఇక బ్రతకనని తన అంత్యక్రియలకు తప్పక రావాలని, మీ నాన్న చూపించిన యువకుడినే పెళ్లి చేసుకుని, పుట్టే బిడ్డకు నా పేరు పెట్టాలని కోరాడు. తరువాత కొన్ని గంటలకు అతడు చనిపోయాడు. ఆగస్టు 9న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి నిజాయితీకి నిలువుటద్దం కలాం: ఆ చెక్కను జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి -
నువ్వే కావాలి అంటూ లవ్ ప్రపోజ్.. క్లోజ్గా వీడియో కాల్స్ మాట్లాడి..
సాక్షి, ఏలూరు: సోషల్ మీడియాలో హాయ్ అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. ప్రతీరోజూ చాటింగ్, కాల్స్ చేసి ఆమెకు నమ్మకం కలిగించాడు. ఇంతలోనే నువ్వంటే ఇష్టమని మనసులోని మాట తనకు చెప్పేశాడు. తర్వాత తన అసలు రంగు బయటపెట్టాడు యువకుడు. వీడియో కాల్ చేసి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. వీడియోలు రికార్డు చేశాడు. అనంతరం.. ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. రంగుల రాజాను అదుపులోకి తీసుకున్నాడు. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన నవీన్.. ఇన్స్స్టాగ్రామ్లో హైదరాబాద్లో ఎంబీఏ చేస్తున్న యువతితో పరిచయం పెంచుకున్నాడు. తరుచు ఆమెతో చాటింగ్, కాల్స్ చేస్తూ చనువుతో మెదిలాడు. ఇలా కొద్దిరోజులు గడిచాక.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ మనసులోని కపట ప్రేమను వ్యక్తం చేశాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు నవీన్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో, స్పీడ్ పెంచిన నవీన్.. యువతితో చనువు పెంచుకుని వీడియో కాల్స్ చేస్తూ అసభ్యకరంగా వీడియోలు తీసి రికార్డు చేసుకున్నాడు. ఇక, కొద్దిరోజులు గడిచిన తర్వాత వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుతున్న వీడియోలను ఆమెకు చూపించిన బెదిరింపులకు దిగాడు. డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను ఆమె బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి బాధితురాలు దగ్గరి నుంచి రూ.25వేలు వసూలు చేశాడు. తాజాగా వీడియోలను అడ్డుపెట్టుకుని మరో లక్ష రూపాయాలు డిమాండ్ చేశాడు. దీంతో, చేసేదేమీ లేక బాధితురాలు ఈ విషయాన్ని తన పేరెంట్స్ చెప్పింది. ఈ క్రమంలో వారంతా కలిసి ఓ ప్లాన్ చేశారు. తన ఇంటి వద్దే నవీన్కు డబ్బులు ఇస్తానని చెప్పి.. అక్కడికి రావాలని కోరింది. ఈ క్రమంలో నవీన్.. ఆమె ఇంటి వద్దకు రావడంతో.. అతడిని పట్టుకోవాలని వారు ప్రయత్నించారు. నవీన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో, బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నవీన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ఘాతుకం: కళ్లకు గంతలు.. కాళ్లు చేతులు వైర్లతో కట్టేసి.. ప్రేయసిని పూడ్చిపెట్టాడు -
వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో
కొత్త, కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ మరోకొత్త ఫీచర్ను ప్రకటించింది. తాజా అప్డేట్ ప్రకారం వాట్సాప్ వినియోగదారులు పీసీలో ఏకంగా గరిష్టంగా 32 మందితో ఒకేసారి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. బీటాలో 32 మంది పార్టిసిపెంట్స్తో వీడియో కాల్స్ను చేసుకునే ఫీచర్ను లాంచ్ చేసింది. అంటే ఇకపై గూగుల్ మీట్, జూమ్ లాంటి అవసరం లేకుండానే ఒకేసారి 32మందితో వీడియో ద్వారా డెస్క్ టాప్ ద్వారా సంభాషించవచ్చు. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?) వాబేటా ఇన్ఫో ప్రకారం 32 మంది యూజర్లు వీడియోకాల్స్ చేసుకోవచ్చు. గ్రూపు కాల్స్లో జాయిన్ కమ్మని వచ్చే ఇన్విటేషన్ మెసేజ్ ద్వారా కావాలనుకున్నబీటా యూజర్లు ఈ వీడియో కాల్లో జాయిన్ కావచ్చు. విండోస్ అప్డేట్ కోసం సరికొత్త వాట్సాప్ బీటాను ఇన్స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్లకు ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని నివేదిక పేర్కొంది. విండోస్ వినియోగదారులు ఇప్పటివరకు 32 మంది వ్యక్తులతో మాత్రమే ఆడియో వాట్సాప్ కాల్స్ చేసుకోగలిగేవారు. అయితే ఇప్పుడు తాజా అప్డేట్తో బీటా యూజర్లు గరిష్టంగా 32 మందితో వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. గత ఏడాది నవంబరులోనే మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఆండ్రాయిడ్ , ఐఓఎస్లో ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల ప్రారంభంలో, మెసేజింగ్ ప్లాట్ఫారమ్ విండోస్లోని కొంతమంది బీటా టెస్టర్లకు వీడియో కాల్ల కోసం స్క్రీన్-షేరింగ్ ఫీచర్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
డేటింగ్.. చీటింగ్
సాక్షి, హైదరాబాద్: సరదా కోసమో.. కాలక్షేపం కోసమో చేసే కొన్ని పనులు కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయనడానికి డేటింగ్ యాప్స్ వ్యవహారం ఓ ఉదాహరణ. ఏదో కాసేపు టైంపాస్ చేద్దామని కొందరు.. ఒంటరితంతో మరికొందరు ఆన్లైన్ డేటింగ్ యాప్ల వలలో చిక్కుతున్నారు. ఈ తరహా మోసాలకు గురవుతున్న వారిలో యువకుల నుంచి వయోవృద్ధులు వరకు ఉంటున్నారు. ఎదుటివారి బలహీనతలను అనుకూలంగా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు... అందమైన యువతులతో న్యూడ్ వీడియోకాల్స్ మాట్లాడిస్తున్నారు. ఎదుటి వ్యక్తిని మాటల్లో దింపి రెచ్చగొట్టి తర్వాత వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడేలా చేస్తున్నారు. ఆ వీడియోలను రికార్డు చేసి, ఆపై సోషల్ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు పంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో పరువు పోతుందని భావించి బాధితులు సైబర్ నేరస్తులు డిమాండ్ చేసినట్లు రూ. లక్షలు సమర్పిస్తున్నారు. లింక్లు పంపి.. మనకు డేటింగ్ యాప్లపై ఆసక్తి లేకున్నా సోషల్ మీడియాలో మన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కూడా కొందరు సైబర్ నేరగాళ్లు ఈ తరహా లింక్లు పంపి రెచ్చిగొట్టి ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల నారాయణగూడ ప్రాంతానికి చెందిన 78 ఏళ్ల ఓ వృద్ధుడికి వీడియోకాల్ చేసిన ఓ యువతి.. ఆ వృద్ధుడిని నగ్నంగా ఫోన్ మాట్లాడేలా చేసి దాన్ని వీడియో తీసి బెదిరింపులకు దిగింది. ఇలా రూ. లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న ఆ వృద్ధుడు చివరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. లాలాపేటకు చెందిన 59 ఏళ్ల బీమా కంపెనీ ఉద్యోగి సైతం రూ. 8 లక్షలు ఇదే రీతిలో పోగొట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్లు ప్రజల సోషల్ మీడియా ఖాతాల నుంచి సమాచారం సేకరించి వాటి ఆధారంగా డేటింగ్ యాప్ లింక్లు, వాట్సాప్ వీడియో న్యూడ్కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. అప్రమత్తంగా ఉండటం ద్వారానే ఇలాంటి ముప్పు నుంచి బయటపడగలుగుతామని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు మరవొద్దు... ♦ మన మానసిక పరిస్థితి ఏదైనా సరే ఆన్లైన్ డేటింగ్ యాప్లలో అపరిచిత వ్యక్తులతో స్నేహాలు అవసరమా అన్నది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఆన్లైన్ స్నేహాల వల్ల మోసపోయే కంటే నిజమైన స్నేహితులను, సన్నిహితులను గుర్తించడం ఉత్తమమన్నది తెలుసుకోవాలి. ♦ ఆన్లైన్ మోసగాళ్లకు సోషల్ మీడియా అనేది ప్రధాన వేదిక. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగాం వంటి సోషల్ మీడియా ఖాతాల్లో మనం పెట్టే వ్యక్తిగత సమాచారం, ఫాలో అవుతున్న వ్యక్తులను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు డేటింగ్ యాప్ల లింక్లు పంపి మోసాలకు తెరతీస్తున్నారు. సోషల్ మీడియాలో పరిమితికి మించి వ్యక్తిగత సమాచారం ఇవ్వకపోవడం ఉత్తమం. ♦ ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో మన ఫొటోలు, వీడియోలు కేవలం స్నేహితులకే కనపించేలా ప్రొఫైల్ ప్రైవసీ ఆప్షన్లు వాడాలి. దీనివల్ల ఇతరులకు మన వ్యక్తిగత అంశాలు వెల్లకుండా నిరోధించవచ్చు. ♦ అందమైన యువతుల ప్రొఫైల్ ఫొటోలతో (ఫేక్ ప్రొఫైల్స్తో) కొందరు సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతున్నారు. ఇలా వారి వలలో పడే అమాయకులను మోసగిస్తున్నారు. అందువల్ల అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లను అంగీకరించవద్దు. ♦ మొబైల్ఫోన్, ల్యాప్లాప్, డెస్క్టాప్లకు సెక్యూరిటీ సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. దీనివల్ల సైబర్ నేరగాళ్లు పంపే ఫిషింగ్ లింక్స్, మాల్వేర్స్ నుంచి రక్షణ ఉంటుంది. ♦ డేటింగ్ యాప్స్ పేరిట లింక్లు పంపి స్నేహాలు చేసే వారిని వీలైనంత వరకు వ్యక్తిగత సమాచారం అడిగేందుకు ప్రయత్నించాలి. ప్రశ్నించడం ప్రారంభిస్తే ఫేక్గాళ్లు వెంటనే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. అదేవిధంగా ఆన్లైన్లో పరిచయం అయ్యే స్నేహితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బులు పంపవద్దు. ఏ రకమైన ఆన్లైన్ యాప్లోనూ డబ్బు లావాదేవీలు చేయవద్దు. -
‘హాయ్ బావా.. నేను నచ్చితే వీడియో కాల్ మాట్లాడూ’
హిమాయత్నగర్: ‘హాయ్ జీజూ (బావ) నేను నీ మరదలు లాంటిదానిని. నేను నచ్చితే నాతో వీడియో కాల్ మాట్లాడు ప్లీజ్’ అంటూ 79 ఏళ్ల వృద్ధుడిని నిండా ముంచిందో సైబర్ కిలాడీ. 20 ఏళ్ల అందమైన యువతి ఫోన్ చేసి బావా అని పిలవడంతో అత్యాశకు పోయిన అతను రూ. లక్షలు పోగొట్టుకున్నాడు. మరిన్ని లక్షలు కావాలంటూ డిమాండ్ చేయడంతో పాటు వీడియోను బంధువులకు పంపిస్తానంటూ బెదిరింపులకు దిగడంతో తనకు న్యాయం చేయాలంటూ మంగళవారం సిటీ సైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన 79 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి ఇటీవల ఓ అమ్మాయి గొంతుతో ఫోన్ కాల్ వచ్చింది. మీరు నా బావ లాంటి వారు, మీతో మాట్లాడాలని ఉందనడంతో అతను ఆమెతో మాటలు కలిపాడు. రెండు గంటల్లోనే వీడియో కాల్ ద్వారా పరిచయమయ్యారు. వృద్ధుడిని బాత్రూమ్లోకి రప్పించిన కిలాడీ ‘ఐ లవ్యూ’ అంటూ న్యూడ్ వీడియోను రికార్డ్ చేసింది. పది నిమిషాల తర్వాత డబ్బు ఇస్తావా వీడియోను నీ కుటుంబ సభ్యులు, బంధువులకు పంపమంటావా అని బెదిరింపులకు పాల్పడింది. దీంతో పరువుపోతుందని భావించిన అతను ఆమెకు రూ.15 లక్షలు ముట్టజెప్పాడు. ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేస్తుండటంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. -
డాక్టర్తో వీడియో కాల్ చూస్తూ నర్స్ ఆపరేషన్.. గర్భిణీ మృతి
బిహార్:వీడియో కాల్లో చూస్తూ నర్స్ ఆపరేషన్ చేయడం వల్ల ఓ గర్భిణీ మృతి చెందింది. ఈ దారుణ ఘటన బిహార్లోని పూర్నియా ప్రాంతంలో జరిగింది. మాల్తీ దేవీ(22)కు నొప్పులు రావడంతో స్థానికంగా ఉన్న సమర్పన్ మెటర్నిటీ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్ లేకపోయిన గర్భిణీని ఆస్పత్రిలో జాయిన్ చేసుకున్నారు సిబ్బంది. మాల్తీకి నొప్పులు ఎక్కువవగానే ఐసీయూలోకి తీసుకెళ్లారు. వీడియో కాల్ ద్వారా డాక్టర్ సీతాకుమారి సలహాలు ఇస్తుండగా..గర్భిణీకి నర్స్ ఆపరేషన్ చేసింది. పుట్టిన కవలలు క్షేమంగానే ఉన్నప్పటికీ ఆపరేషన్ ఆనంతరం బాధితురాలికి విపరీతంగా కడుపునొప్పి వచ్చింది. అనంతరం మాల్తీ మృతి చెందింది.దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి:16 వేల గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్టు.. గుండెపోటుతో మృతి -
సైంటిస్ట్ల అద్భుతం.. ఎడాపెడా వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్న చిలుకలు!
రామచిలుకలు మాట్లాడగలుగుతాయి. మనుషులు మాట్లాడే మాటలు వింటూ, అవే మాటలను తిరిగి పలుకుతాయి. ఈ చిలక పలుకులు మనకు తెలిసినవే! హైటెక్ కాలంలోని రామచిలుకలు మాట్లాడటమే కాదు, ఏకంగా వీడియోకాల్స్ కూడా చేసేస్తున్నాయి. ఎవరికంటారా? వాటి తోటి పక్షి నేస్తాలకే! మాటలు నేర్చుకునే చిలుకలు, నేర్పిస్తే వీడియోకాల్స్ చేయడం ఎందుకు నేర్చుకోలేవు అనుకున్న శాస్త్రవేత్తలు కొన్ని రామచిలుకలకు ప్రయోగాత్మకంగా వీడియోకాల్స్ చేయడం నేర్పించారు. ఈ విద్యను అవి ఇట్టే నేర్చుకుని, దూర దూరాల్లో ఉంటున్న తమ పక్షి నేస్తాలకు ఎడాపెడా వీడియోకాల్స్ చేసి, చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి. అమెరికాలోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), స్కాట్లాండ్లోని గ్లాస్గో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు బృందంగా ఏర్పడి, ఇటీవల కొన్ని ఎంపిక చేసిన రామచిలుకలకు విజయవంతంగా వీడియోకాల్స్ నేర్పించారు. చదవండి👉 దేశంలోని 1 శాతం ధనవంతుల్లో ఒకరిగా ఉండాలంటే.. ఎంత డబ్బుండాలి? ఇళ్లల్లో పంజరాల్లో పెరిగే రామచిలుకలు ఈ వీడియోకాల్స్ ద్వారా ఒంటరితనాన్ని మరచిపోగలుగుతున్నాయని, తోటి నేస్తాలతో ముచ్చట్ల ద్వారా అవి ఉత్సాహాన్ని పొందగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
#ViratKohli: అనుష్కకు వీడియోకాల్.. కోహ్లి ఎమోషనల్
ఐపీఎల్ 16వ సీజన్లో గురువారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కింగ్ కోహ్లి 62 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఐపీఎల్లో సెంచరీ సాధించి నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఐపీఎల్లో ఆరో సెంచరీ సాధించిన కోహ్లి.. అత్యధిక సెంచరీలు బాదిన గేల్ రికార్డును సమం చేశాడు. తన సెంచరీతో జట్టు గెలవడంతో పాటు కీలకమైన ప్లేఆఫ్ రేసులో ఆర్సీబీ నిలవడం కోహ్లికి తెగ సంతోషాన్నిచ్చింది. అందుకే మ్యాచ్ అనంతరం జట్టు సభ్యులతో పాటు అభిమానులతో కోహ్లి తన సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లి తన భార్య అనుష్క శర్మకు వీడియో కాల్ చేసి మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా వీడియో కాల్ మాట్లాడుతూ కోహ్లి ఎమోషనల్ అయినట్లు అనిపించింది. కోహ్లి సెంచరీ చేసిన సమయంలో అనుష్క స్టేడియంలో ఉండుంటే ఆ ఫీల్ వేరుగా ఉండేదని అభిమానులు పేర్కొన్నారు. అయితే అనుష్క తన భర్త కోహ్లి సాధించిన ఘనతను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. ''He Is Bomb.. What An Innings My Love..''అంటూ క్యాప్షన్ జత చేసింది. ఏది ఏమైనా ఈ స్వీట్ కపుల్ తమ చర్యతో మరోసారి అభిమానులకు సంతోషాన్ని పంచారు. ఇక నిన్నటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ హోంగ్రౌండ్లో ఆడుతున్నప్పటికి ఆ ఫీల్ ఎక్కడా కలగలేదు. ఎందుకంటే మ్యాచ్కు వచ్చినవారిలో ఎక్కువమంది అభిమానులు ఆర్సీబీకే మద్దతిచ్చారు. దీంతో మ్యాచ్ జరుగుతుంది బెంగళూరు లేదా హైదరాబాద్ అన్న అనుమానం కూడా వచ్చింది. Virat talking to Anushka Sharma on video call after the match, I wish she would also come to the stadium today to cheer Virat #ViratKohli𓃵 #ViratKohli #anushkasharma #RCBvsSRH pic.twitter.com/wParcOuvvP — Akshay Kumar (@AkshayK63721592) May 18, 2023 Job well done in Hyderabad ✅ pic.twitter.com/PjhKVupn2C — Virat Kohli (@imVkohli) May 18, 2023 A magnificent CENTURY by Virat Kohli 🔥🔥 Take a bow, King Kohli! His SIXTH century in the IPL.#TATAIPL #SRHvRCB pic.twitter.com/gd39A6tp5d — IndianPremierLeague (@IPL) May 18, 2023 చదవండి: Virat Kohli: గేల్ రికార్డు సమం.. చరిత్రకెక్కడానికి ఇంకొక్కటి! -
మస్క్ సంచలనం.. ఫోన్ నెంబర్ ఇవ్వకుండా మాట్లాడొచ్చు, మెసేజ్ చేయొచ్చు!
ట్విటర్ను కొనుగోలు అనంతరం ఎలాన్ మస్క్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. తాజాగా, ఆయన ట్విటర్లో కాల్స్, మెసేజ్లను పంపుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. మస్క్ గత ఏడాది ‘ట్విటర్ 2.0 ది ఎవ్రిథింగ్ యాప్’ పేరుతో ఎన్క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్లు, లాంగ్ ఫార్మ్ ట్విట్లు,పేమెంట్స్ సంబంధిత లావాదేవీలు జరిపేలా కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనున్నట్లు తెలిపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా త్వరలో ట్విటర్ నుంచి వాయిస్, వీడియా కాల్స్ చేసుకోవచ్చని ట్వీట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవని, ఇందుకోసం ఎలాంటి ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మెటా తరహాలో ఎలాన్ మస్క్ చెప్పినట్లుగా ట్విటర్లోని ఈ సరికొత్త ఫీచర్లు ఇప్పటికే మెటా ఎనేబుల్ చేసింది. మెటా, ఇన్స్టాగ్రామ్ తరహాలో ట్విటర్లో ఉపయోగించుకునే సౌకర్యం ఉంది యాక్టివ్ లేని ట్విటర్ అకౌంట్లను బాస్గా అడుగు పెట్టిన నాటి నుంచి మస్క్.. ట్విటర్లో అనేక మార్పులు చేర్పులు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా వినియోగంలోని ట్విటర్ అకౌంట్లను డిలీట్ చేస్తున్నామని, తద్వారా కొంతమందికి ఫాలోవర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఇటీవల ట్విటర్ ద్వారా వెల్లడించారు. చదవండి👉 వావ్..డాక్టర్లు చేయలేని పని చాట్జీపీటీ చేసింది..కుక్క ప్రాణాలు కాపాడి! -
భర్త వీడియో కాల్ చేయలేదని.. మొదటి భార్య ఆత్మహత్య
అన్నానగర్: తన భర్త మొదటి భార్యతో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లడంతో రెండున్నర ఏళ్ల బిడ్డను విడిచిపెట్టి మహిళ ఆత్మహత్య చేసుకుంది. కోయంబత్తూరు సమీపంలోని గణపతి వీధికి చెందిన రఘుపతి (38) వ్యాపారి. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోయంబత్తూరుకు చెందిన దివ్యభారతి(31)ని రఘుపతి 2వ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర ఏళ్ల కుమార్తె ఉంది. ఆ ప్రాంతంలోని లక్ష్మీపురంలో దివ్యభారతి తన బిడ్డతో కలిసి నివసిస్తోంది. రఘుపతి కొద్ది రోజులు భార్య ఇంట్లోనూ, కొన్ని రోజులు దివ్యభారతి ఇంట్లోనూ ఉండేవాడు. రఘుపతికి అప్పటికే పెళ్లయిందని, భార్య, పిల్లలు ఉన్నారని దివ్యభారతికి తెలిసినా.. మొదటి భార్య ఇంటికి వెళ్లవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వీరి మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రఘుపతి తన మొదటి భార్య, పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దివ్యభారతి తన మొదటి భార్య పిల్లలతో కలిసి ఆంధ్రాకు వెళ్లొద్దని చెప్పి గొడవకు దిగినట్లు సమాచారం. అయితే అతను తన మొదటి భార్య, పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్కి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న దివ్యభారతి భర్తను ఎక్కడున్నావని ప్రశ్నించింది. తనతో వీడియో కాల్ మాట్లాడాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అయితే రఘుపతి వీడియో కాల్ చేయలేదని తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన దివ్యభారతి సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
ఈ మొబైల్ ఉంటే ఇంట్లో థియేటర్ ఉన్నట్టే.. ధర ఎంత ఉండొచ్చంటే?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇంట్లోనే మనకు నచ్చిన స్క్రీన్ సైజులో థియేటర్ క్వాలిటీతో వీడియోలు, సినిమాలు వీక్షించొచ్చు. వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ‘ప్రొజెక్టర్ మోడ్ స్మార్ట్ ఫోన్ల’తో డిజిటల్ రంగం మరింత స్మార్ట్ కానుంది. చేతిలో సెల్ఫోన్ ఉంటే ఇంట్లో గోడలు.. నేల.. కార్యాలయం.. కార్లు.. విహార యాత్రలకు వెళితే ఆరు బయటి ప్రాంతాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ సెల్ఫోన్లోని ప్రొజెక్టర్ ద్వారా వీడియోలు చూడొచ్చు. సెల్ఫోన్లో ప్రొజెక్టర్ ఇన్బిల్డ్ చేసి చైనా, జపాన్, అమెరికా, సౌత్ కొరియాకు చెందిన పలు కంపెనీలు వీటిని రూపొందించాయి. లినోవా, అక్యుమెన్, మోటో–జెడ్, మోవి, శాంసంగ్ బీమ్–2 మోడల్స్ పేరుతో ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లోకి విడుదలయ్యాయి. త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. థియేటర్ క్వాలిటీతో.. ఈ ఫోన్లలో ఇంటిగ్రేటెడ్ లేజర్ ప్రొజెక్టర్ ఉంటుంది. లినోవా కంపెనీ తొలుత దీన్ని రూపొందించగా.. ఆ తర్వాత ఇతర కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పుడు మార్కెట్లో ఈ ఫోన్ల ధర రూ.35 వేల నుంచి రూ.1.80 లక్షల వరకూ పలుకుతున్నాయి. ఫోన్, ప్రొజెక్టర్ క్వాలిటీ ఆధారంగా వీటి ధరలు ఉన్నాయి. 50 నుంచి 200 ఇంచుల స్క్రీన్ వరకూ మనం వీడియోలో ప్రొజెక్ట్ చేయొచ్చు. ఇందులో హెచ్డీ, ఫుల్ హెచ్డీ, 4కే క్వాలిటీతో వీడియోలు చూడొచ్చు. హోమ్ థియేటర్ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి డీటీఎస్ సౌండ్తో పూర్తిగా థియేటర్ ఎక్స్పీరియన్స్తో వీడియోలు చూడొచ్చు. వీడియో ప్రజెంటేషన్కు ప్రొజెక్టర్ల అవసరం లేకుండా ఇలాంటి సెల్ఫోన్తో ప్రజెంటేషన్ చేయొచ్చు. -
కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు వీడియో కాల్ సౌకర్యం
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్లలో 12 వేల మందికి పైగా ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. జైళ్లశాఖ డీజీపీగా అమరేష్ పూజారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జైళ్లశాఖలో పలు మార్పులను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశఆల్లో మంత్రి రఘుపతి జైలులో ఉన్న ఖైదీలు వారి బంధువులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం చైన్నెలోని పుళల్ జైలులో ఖైదీలు వీడయో కాల్ ద్వారా బంధువులతో మాట్లాడే అవకాశాన్ని డీజీపీ ప్రారంభించారు. కరోనా కాలంలో ఖైదీలపై ఒత్తిడిని తగ్గించేందుకు వేలూరు పురుషుల జైలులో ఇది వరకే వీడియో కాల్ వసతిని ఏర్పాటు చేశారు. తాజాగా వేలూరు మహిళా జైలులో ఖైదీలు బంధువులతో వీడియో కాల్తో మాట్లాడే వసతిని జైళ్లశాఖ డీఐజీ సెందామరై కన్నన్ శనివారం ఉదయం ప్రారంభించి పరిశీలించారు. మహిళా ఖైదీలు వారి బంధువుల వద్ద వారంలో మూడు రోజులకు ఒక సారి 12 నిమషాలు మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. -
భార్య రితికాతో ఆసక్తికర సంభాషణ.. మధ్యలో ఈ సామీ ఎవరు?
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠపోరులో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ 45 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా.. తిలక్ వర్మ 41 పరుగులతో రాణించాడు. అయితే చివర్లో ఉత్కంఠ నెలకొన్నప్పటికి ఆఖరి బంతికి టిమ్ డేవిడ్ రెండు పరుగులు తీసి ముంబైకి విజయాన్ని అందించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే మ్యాచ్ ముగిశాకా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాకా రోహిత్ శర్మ తన భార్య రితికా సదేశ్కు వీడియో కాల్ చేశాడు. అయితే రోహిత్ మాట్లాడుతూ.. ''ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది. సామీ నువ్వు ట్రోఫీ చూశావా అనగానే అందుకు నో అనే సమాధానం వచ్చింది. అయితే సరే.. ఈసారి సామీ కోసం కప్ తీసుకొస్తా''.. అంటూ పేర్కొన్నాడు. రితికాతో జరిగిన సంభాషణలో సామీ అనే పేరు రావడం అభిమానులకు ఆసక్తి కలిగించింది. మరి ఎవరా సామీ అని ఆరా తీస్తే విషయం తెలిశాకా నోరెళ్లబెట్టారు. ఎందుకంటే సామీ ఎవరో కాదు.. రోహిత్, రితికాల గారాల పట్టి.. సమైరానే. రోహిత్ తన బిడ్డ సమైరాను ముద్దుగా సామీ అని పిలుస్తుంటాడు. ఇక రితికాతో రోహిత్ ఇంకా ఏం మాట్లాడాడంటే.. ''ఈరోజు మ్యాచ్ చాలా బాగుంది. కానీ చివరి ఓవర్ చూడలేక బయటికి, లోపలికి తిరిగాను. చివరి బంతికి నేను ముని వేళ్లపై నిలబడ్డా. కానీ ముంబై గెలిచాకా సంబరం చేసుకున్నా. కానీ గత 15 ఏళ్లలో ఐపీఎల్లో ఇలాంటి మ్యాచ్లు చాలానే చూశాను.. అలవాటైపోయింది '' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా రోహిత్, రితికాల వీడియో కాల్ను ముంబై ఇండియన్స్ తమ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Ro on call with Rits after a nail-biting win in Delhi 🥺💙#OneFamily #DCvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @ImRo45 pic.twitter.com/qCXaLj8dwT — Mumbai Indians (@mipaltan) April 12, 2023 చదవండి: అప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్; బలయ్యింది మాత్రం ఒక్కడే -
వీడియో కాల్లో ఫ్రెండ్ను గుర్తుపట్టిన శునకం.. వీటి ప్రేమకు నెటిజన్లు ఫిదా..
శనకాలు వాటి యజమానులను గుర్తిస్తాయని అందిరికీ తెలుసు. తమ స్నేహితులను కూడా సులభంగా గుర్తుపెట్టుకుంటాయి. అయితే వీడియో కాల్లో శునకాలు ఇతరులను గుర్తించలవా? అంటే సమాధానం చెప్పలేదు. కానీ ఓ కుక్క మాత్రం తన ఫ్రెండ్ను వీడియో కాల్లో చూసిన వెంటనే టక్కున గుర్తుపట్టింది. దానితో ఆప్యాయంగా మాట్లాడింది. ఈ ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య సాగిన సంభాషణ, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ నెటిజన్లను కట్టిపడేసింది. View this post on Instagram A post shared by Rollo and Sadie (@rolloandsadie) శునకం మరో శుకనంతో వీడియో కాల్ మాట్లాడిన దృశ్యాలను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్గా మారింది. వీటి మధ్య ప్రేమను చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్ను నిజంగా మిస్ అయితే ఇలానే ఉంటుందేమో? ప్రేమానురాగాల విషయంలో జంతువులకు మనషులకు తేడా లేదని ఈ శునకాలు నిరూపించాయి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మనకు ఇష్టమైన స్నేహితులు బయటకు వెళ్లినప్పుడు వారు తిరిగొచ్చేంతవరకు డోర్ దగ్గరే ఎదురుచూస్తుంటాం. ఇలాంటి ప్రేమ పొందడం నిజంగా అదృష్టం. మనుషులైనా, శునకాలైనా స్నేహం, ప్రేమ విషయంలో ఒక్కటే.. అని మరో యూజర్ రాసుకొచ్చాడు. చదవండి: జైలులో నన్ను టార్చర్ చేశారు.. పిల్లలు అడిగిన ప్రశ్నలు బాధించాయి: నవనీత్ రానా -
Amritpal Singh: వివాహేతర సంబంధాలు.. వీడియో కాల్లో ముద్దులు..
చండీగఢ్: అమృత్పాల్ సింగ్.. కరుడుగట్టిన ఖలిస్థానీ వేర్పాటువాది. ఆరు రోజులుగా పోలీసుల కళ్లుగప్పి మారువేషంలో తిరగుతూ దేశం దాటేందుకు ప్రయత్నిస్తున్న అతివాది. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ప్రమాదకర వ్యక్తి. అయితే ఈయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తెలిస్తే మాత్రం.. ఇతనిలో ఈ యాంగిల్ కూడా ఉందా? అనుకుంటారు. అవును మరి సోషల్ మీడియాలో మనోడి వేషాలు మామూలుగా లేవు.. అమృత్పాల్ సింగ్కు చాలా మంది అమ్మాయిలు, వివాహితలతో సంబంధాలు ఉన్నట్లు ఓ జాతీయ వార్త సంస్థ వెల్లడించింది. సోషల్ మీడియాలో ఇతడు అనేక మంది మహిళలతో చాట్ చేసినట్లు పేర్కొంది. ఈ చాట్లతో పాటు 12 వాయిస్ మెసేజ్లను సేకరించింది. అమృత్పాల్ సింగ్ అమ్మాయిల అసభ్య వీడియోలను రికార్డు చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు కూడా పేర్కొంది. తనకు అమ్మాయిలతో కేవలం సాధారణ రిలేషన్షిప్ మాత్రమే కావాలని, సీరియస్ రిలేషన్షిప్ కోరుకోవడం లేదని అమృత్ పాల్ సింగ్ వాయిస్ మెసేజెస్లో చెప్పాడు. మహిళలకు ముక్కు మీద కోపం అని అన్నాడు. అలాగే ఓ మహిళ తన వివాహ సంబంధంపై ప్రభావం పడనంతవరకు వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చాడు. అమృత్పాల్ సింగ్ ఇన్స్టాగ్రాం ఖాతాలో అమ్మాయిల చాటింగ్ లిస్ట్ చాలా పెద్దగా ఉన్నట్లు తెలుస్తోంది. అనేక మందికి అతడు తరచు మెసేజ్లు పంపాడు. మన వివాహేతర సంబంధం ఖరారైంది అని ఓ మహిళతో, దుబాయ్లో హనీమూన్ చేస్కుందాం అని మరొకరితో చాట్ చేశాడు. వీటికి ఆ మహిళ లాఫింగ్ ఏమోజీస్తో రిప్లై ఇవ్వడం గమనార్హం. ముమ్మర గాలింపు.. మరోవైపు పంజాబ్ పోలీసులు అమృత్పాల్ సింగ్ కోసం ఆరు రోజులుగా వేట కొనసాగిస్తున్నారు. అతను మాత్రం సినిమా స్టైల్లో పోలీసుల కళ్లుగప్పి మారువేషంలో, వాహనాలు మార్చుతూ తిరుగుతున్నాడు. బైక్ను పక్కన పెట్టుకుని ఓ బండిపై అతను వెళ్తున్న ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయినా ఇప్పటివరకు అతని జాడ మాత్రం పోలీసులు కనుగొనలేకపోయారు. మహారాష్ట్ర పోలీసులు కూడా ఇతని కోసం అలర్ట్ అయ్యారు. చదవండి: నెల క్రితమే ఎన్నారై కిరణ్దీప్తో పెళ్లి.. అక్కడికి వీసా.. ప్లాన్ అదేనా? -
ఆమె వయసు 39, అతనికి 21.. ‘సంబంధం’పై తండ్రి హెచ్చరించడంతో..
చిత్తూరు అర్బన్: పదో తరగతి చదివే ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ మోజులో పడిన 21 ఏళ్ల యువకుడు కన్న తండ్రిపైనే దాడిచేసి తీవ్రంగా గాయపరచా డు. తాను కొడుతున్న దృశ్యాన్ని ప్రియురాలికి వీడియోకాల్ చేసి తండ్రిని చితకబాదాడు. చిత్తూరు నగరంలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి టూటౌన్ ఎస్ఐ మల్లికార్జున, బాధితుడి కథనం మేరకు.. ఢిల్లీబాబు అనే వ్యక్తి గాంధీరోడ్డులో కాపురముంటూ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇతని కొడుకు భరత్ (21) ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకుండా జులాయిగా తిరుగుతున్నాడు. పదో తరగతి చదివే ఇద్దరు పిల్లలు ఉన్న 39 ఏళ్ల ఓ మహిళతో ఇతను సన్నిహితంగా ఉండేవాడు. ఇది నచ్చకపోవడంతో కుమారుడిని పలు మార్లు ఢిల్లీబాబు హెచ్చరించాడు. ఈవిషయమై తండ్రీకొడుకుల మధ్య మనస్పర్థలున్నాయి. ఆదివారం ఇంట్లో భోజనం చేస్తున్న తండ్రి వద్దకు వచ్చిన భరత్.. మహిళకు వీడియోకాల్ చేసి తన తండ్రిని కొడుతున్న దృశ్యం చూడమంటూ ఫోన్ ఆన్లోనే ఉంచి దాడి చేశాడు. చింతకట్టెతో తలపై తీవ్రంగా కొ ట్టడంతో ఢిల్లీబాబుకు రక్తగాయాలయ్యాయి. గాయపడ్డ ఢిల్లీబాబును కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: హనీట్రాప్.. అందమైన రూపంతో ఎర.. ఒంటిపై నూలుపోగు లేకుండా వీడియో కాల్!
సాక్షి, హైదరాబాద్: ఓ అందమైన యువతి అనుకోకుండా వీడియో కాల్ చేయడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆమె మాయలో పడ్డాడు. మాయలేడి మాయ మాటలు చెప్పి ఆయనను పీకల్లోతు ప్రేమలోకి తీసికెళ్లింది. కట్ చేస్తే ఆ వీడియోను అడ్డం పెట్టుకుని రూ.లక్షలు కాజేసింది. ఆ వీడియో బయటకు వస్తే తన పరువుపోతుందని భావించిన అతను తనకు న్యాయం చేయాలని కోరుతూ సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంపాపేటకు చెందిన వ్యక్తి ఓ ప్రభుత్వోద్యోగిగా పని చేస్తున్నాడు. విధుల్లో ఉన్న ఆయనకు ఓ నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. దానిని లిఫ్ట్ చేయగా అవతలి వైపు అందమైన అమ్మాయి కనిపించింది. మీతో స్నేహాన్ని పంచుకోవాలనుకుంటున్నానంటూ తియ్యని మాటలతో అతడిని రెచ్చగొట్టింది. ఇంటికెళ్లిన తర్వాత కాల్ చేస్తానంటూ చెప్పి అతను కాల్ కట్ చేశాడు. రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటరిగా సదరు యువతికి కాల్ చేశాడు. వీడియో కాల్లో ఒంటిపై నూలు పోగు లేకుండా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఓ వ్యక్తి కాల్ చేసి పోలీసునని పరిచయం చేసుకున్నాడు. మీరు ఓ యువతిని భయపెట్టి ఆమెతో అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడారని, మేం చెప్పినట్లు వినకపోతే వీడియోకాల్ను సోషల్ మీడియాలో పెట్టడమే కాక కేసు ఫైల్ చేస్తామన్నారు. ఈ విషయం బయటికి వస్తే తన పరువు పోతుందనే భయంతో అతను వారికి రూ.5లక్షలు ముట్టజెప్పాడు. ఇంకా కావాలని ఫోన్ చేసి వేధిస్తుండటంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: హైదరాబాద్ పేలుళ్ల కుట్రకోణంలో కొత్త మలుపు -
60 ఏళ్ల వృద్ధుడు ఖననం చేసేశాక..హఠాత్తుగా బతికే ఉన్నానంటూ..
మహారాష్ట్రలో వింత ఘటన చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు అంత్యక్రియలు అయిపోయాక బతికే ఉన్నానంటూ స్నేహితుడికి కాల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు బంధువులు. వారు ఈ విషయాన్ని పోలీసులకి తెలపడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 60 ఏళ్ల ఆటో డ్రైవర్ రిఫీక్ షేక్ అనే వృద్ధుడు కొద్దినెలల క్రితం తప్పిపోయాడు. దీని గురించి కుటుంబసభ్యులు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు కూడా. ఐతే జనవరి 29న బోయిసర్ మరియు పాల్ఘర్ స్టేషన్ల మధ్య ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో రైల్వే పోలీసులు అతడి ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన ఒక వ్యక్తి రైల్వే పోలీసులను సంప్రదించి అతను తన సోదరుడు రఫీక్ షేక్ అని చెప్పాడు. అతను తప్పిపోయినట్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపాడు. ఆ తర్వాత రఫీక్ భార్య సైతం మృతి చెందింది తన భర్తే అని గుర్తిచడం విశేషం. దీంతో పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కుంటుంబికులు ఆ మృతదేహాన్ని ఖననం చేసేశారు కూడా. ఇంతలో రఫీక్ తన స్నేహితుడికి బతికే ఉన్నానంటూ సడెన్గా కాల్ చేశాడు. దీంతో అతను ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వీడియో కాల్ చేసి మాట్లాడేంత వరకు నమ్మలేకపోయాడు. ఈ విషయాన్ని అతను షేక్ కుటుంబికులకు చెప్పాడంతో వారు కూడా బిత్తరపోయారు. అతన్ని చూసి ఆ కుంటుంబం ఆనందానికి ఆవధులే లేకుండా పోయింది. అంతేకాదు వారు ఈ విషయాన్నిపోలీసులకు తెలియజేయడంతో వారు ఖననం చేసిన మృతదేహన్ని వెలికితీసి.. అతను ఎవరో కనిపెట్టి పని ప్రారంభించారు. ఆ వృద్ధుడు కొద్ది నెలల వరకు పాల్ఘర్లోని ఒక నిరుపేద ఇంటిలో ఉన్నట్లు సమాచారం. (చదవండి: తాజ్మహల్ని చూసి మంత్రముగ్దులయ్యి ముషారఫ్ ఏం అన్నారంటే..) -
వీడియో కాల్తో ట్రాప్..ఏకంగా ఢిల్లీ హైకోర్టు పేరుతో రూ.2.69 కోట్లు..
గుజరాత్ వ్యాపారవేత్తని ఒక మహిళ మాయమాటలతో ఉచ్చులోకి దింపి ఏకంగా రూ.2.69 కోట్లు కొల్లగొట్టింది. బలవంతంగా వీడియోకాల్స్ మాట్లాడించి ఆ తర్వాత బ్లాక్మెయిల్కి పాల్పడి, కేసుల పేరుతో భయబ్రాంతులకు గురిచేసి పలు దఫాలుగా డబ్బులు కొల్లగట్టారు. చివరికి బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి, సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకెళ్తే..పునరుత్పాదక ఇంధన సంస్థను నడుపుతున్న ఒక పారిశ్రమాకవేత్తకి గతేడాది ఆగస్టు8న రియా శర్మ అనే మహిళ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత ఆమె తన మాయమాటలతో ఆ వ్యక్తిని బట్టలు లేకండ వీడియో కాల్ మాట్లాడేలా చేసింది. ఆ తర్వాత అనుహ్యంగా ఫోన్ కాల్ కట్ అయ్యింది. కాసేపటికి ఆ వ్యాపారవేత్తని మీ నగ్న వీడియో సర్యూలేట్ కాకుండా ఉండాలంటే రూ. 50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరికొన్ని రోజుల తర్వాత ఢిల్లీ పోలీసు ఇన్స్పెక్టర్ గుడ్డుశర్మ అనే పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి ఏకంగా ఆ వీడియో క్లిప్ తన వద్ద ఉందని పేర్కొంటూ ఏకంగా రూ. 3 లక్షలు దోచేశాడు. సరిగ్గా ఆగస్టు14న మరో కాల్లో.. మీరు వీడియోకాల్ మాట్లాడిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, ఆమె తల్లి మీపై కేసు పెట్టిందుకు సీబీఐని అశ్రయించందంటూ బాంబుపేల్చారు. ఈసారి ఏకంగా రూ. 80 లక్షలు డిమాండ్ చేశారు. సదరు బాధితుడు కేసు అనేసరికి బెంబేలెత్తి...ఎంత డబ్బైనా చెల్లించి ఈ కేసు నుంచి బయటపడాని అనుకున్నాడు. ఆ దుండగలు ఫేక్ ఢిల్లీ హైకోర్టు పేరుతో డిసెంబర్ 15 వరకు బాధితుడు నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. చివరి కేసు క్లోజ్ అయ్యిందంటూ ఒక ఉత్తర్వు చేతిలో పెట్టారు. అప్పుడు ఆ ఉత్తర్వు చూడగానే అనుమానం తలెత్తి సైబర్ క్రైంని ఆశ్రయించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బాధితుడు జనవరి 10న సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి, దాదాపు 11 మందిపై కేసు పెట్టాడ. అంతేగాదు తన నుంచి సుమారు రూ. 2.69 కోట్లు దోపిడీ చేసినట్లు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: అయ్యో తల్లీ.. ఎంత పని చేశావ్? ) -
యువతుల వలపు వల! అందంతో టెంప్ట్ చేసి.. ఆపై టార్చర్..
సాక్షి, వరంగల్: న్యూడ్ కాల్స్ న్యూసెన్స్ చేస్తున్నాయి. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో.. అదే స్థాయిలో సైబర్ క్రిమినల్స్ కూడా మరింతగా అప్డేట్ అవుతున్నారు. వాట్సాప్ ద్వారా నేరుగా వీడియో కాల్స్ చేస్తున్న యువతులు ఆ ఫోన్ వినియోగదారుడిని టెంప్ట్(ప్రేరేపిస్తూ) చేసి.. వారిని కూడా వివస్త్రలు కావాలని చెప్పి మరీ ఆ సీన్ను వీడియో రికార్డు చేస్తున్నారు. ఆ తర్వాత వారు మొదలు పెట్టే అసలు ఆటలో ఈ విషయాలు బయటకు చెప్పుకోలేక రూ.లక్షలు సమర్పించుకుంటున్నారు. ఇంకొందరు ఈ వేధింపులు తారస్థాయికి చేరడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ గడపతొక్కుతున్నారు. మరికొందరేమో తమ పరిధిలోని ఠాణాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదికి పైగా కేసులు కూడా నమోదయ్యాయి. అందంతో టెంప్ట్ చేసి.. ఆపై టార్చర్.. అదిరే డ్రెస్సు.. ఆకర్షించే అందచందాలతో చూడచక్కగా ఉండే యువతులు వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేస్తున్నారు. ఇలా వీడియో కాల్ రాగానే.. ఇటు నుంచి యువకులు కూడా వారు చెప్పే మా టలకు ఫిదా అవుతున్నారు. ఓ అమ్మాయి నేరుగా వీడియో కాల్ చేయడంతో ఉబ్బితబి్బబ్బవుతున్నా రు. ఆ తర్వాత మాటల్లోకి దింపి సదరు యువతి డ్రెస్ తీసేసి ఇటువైపు నుంచి ఉన్న యువకులను టెంప్ట్ చేస్తుంది. మీరు కూడా బాత్రూమ్కు వెళ్లి బ ట్టలు తీసేయండి అంటూ చెప్పడంతో ఆ మోజులో చాలా మంది అలానే చేస్తున్నారు. ఈ సమయంలో సదరు యువతి మాటలతో రెచ్చగొట్టి యువకులు చేసే సీన్లను వీడియో రికార్డు చేస్తున్నారు. పోలీసుల పేరుతో కాల్స్.. ఇక్కడ్నుంచి నేరస్తుల అసలు కథ మొదలవుతుంది. వీడియో కాల్ పూర్తయ్యాక.. కాసేపటికి బాధితుడికి ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఢిల్లీ సైబర్ క్రైమ్ ఏసీపీ, సీఐని మాట్లాడుతున్నానని.. మీతో న్యూడ్ వీడియో కాల్ చేసిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని సదరు బాధితుడిని బెదిరిస్తారు. ఢిల్లీలో కేసు నమోదైందని.. అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తారు. అమ్మా యి సెల్ఫోన్న్వీడియోల రికార్డ్ అంతా రికవరీ చేశామంటారు. ఆ వీడియో సదరు యువకులకే పంపడంతో నిజమేనని నమ్మేస్తారు. కేసులు, తలనొప్పులు లేకుండా ఈజీగా బయటపడాలంటే కొంత డబ్బు పంపించాలని కొరతారు. కొందరు అధికారులను మేనేజ్ చేయాల్సి ఉందని నమ్మబలుకుతారు. ఇలా విడతలవారీగా రూ.లక్షల్లో డబ్బులను ఆన్లైన్లో కొందరు బాధితులు సమర్పించుకున్నారు. ఈ విధంగా వరంగల్లోని 36వ డివిజన్ చింతల్కు చెందిన ఓ వ్యక్తికి అనుభవం ఎదురుకావడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఆ వీడియో కాల్స్కు స్పందించొద్దు.. సైబర్ నేరగాళ్ల ముసుగులో కొందరు యువతులు వీడియో కాల్స్ చేసి తియ్యటి మాటలతో నగ్నంగా ఉండి టెంప్ట్ చేసి ఆ తర్వాత బెదిరించి డబ్బు వసూలు చేసే కేసులు పెరుగుతున్నాయి. సమాజంలో గౌరవం ఉన్నవారు బయటకు చెప్పుకోలేక పీకల్లోతు వేధింపులు వచ్చాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహా న్యూడ్ వీడియో కాల్స్కు స్పందించకపోవడమే మంచిది. ఒకవేళ అలాంటివి ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలి. నిందితులను టెక్నికల్ డాటా ఆధారంగా పట్టుకునే అవకాశం ఉంటుంది. – ఏవీ రంగనాథ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
Hyderabad: పాతబస్తీలోని కాలాపత్తర్లో దారుణం.. వీడియోకాల్లో..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని కాలాపత్తర్లో దారుణం జరిగింది. ప్రేయసితో వీడియోకాల్ మాట్లాడుతూ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేయసి పెళ్లికి దూరమవుతోందన్న బెంగతో మహ్మద్ తబ్రేజ్ అలీ ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలోనే వీరిరువురి వివాహం నిశ్చయమైంది. అయితే రెండు కుటుంబాల మధ్య తలెత్తిన గొడవల నేపథ్యంలో పెద్దలు పెళ్లిని రద్దు చేశారు. దీంతో యువతితో వీడియో కాల్ మాట్లాడుతూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. చదవండి: (మహిళా డాక్టర్ ఆత్మహత్య.. అదే కారణమా?.. మరేదైనానా?) -
HYD: కొంప ముంచిన వీడియో కాల్.. యువతి అందచందాలకు ఫిదా అయిపోయి..
సాక్షి, హైదరాబాద్: పరిచయం లేని అందమైన అమ్మాయి ఫేస్బుక్ రిక్వెస్ట్కు బుట్టలో పడ్డాడు నగరానికి చెందిన పేరుమోసిన వ్యాపారవేత్త. ఇద్దరిమధ్యా చనువు పెరిగి ఒకరికొకరు వీడియో కాల్స్లో నగ్నంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోను అడ్డం పెట్టుకుని సైబర్నేరగాళ్లు బెదిరింపులకు దిగడంతో లక్షలు ముట్టజెప్పి న్యాయం కోసం సిటీ సైబర్క్రైం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. అమీర్పేటలో నివాసం ఉండే ప్రముఖ వ్యాపారవేత్తకు అంజనీశర్మ పేరుతో ఓ అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఆ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేయగా..ఇద్దరూ హాయ్ అంటూ మెసేంజర్లో పలకరించుకున్నారు. ఆతర్వాత వీరిద్దరూ వాట్సప్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. పరిచయమైన గంటలోనే యువతి వాట్సప్ నంబర్కు వీడియో కాల్ చేసి తన అందచందాలను చూపించింది. అమ్మాయి అందంగా ఉండటంతో వ్యాపారవేత్త రెండు అడుగులు ముందుకేశాడు. మరుసటి రోజు ఇద్దరూ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుకున్నారు. సుమారు నిమిషన్నర్ర నిడివిగల న్యూడ్ వీడియోను అడ్డం పెట్టుకున్న యువతి వ్యాపారవేత్తపై బ్లాక్మెయిల్కు ఒడిగట్టింది. సమాజంలో గుర్తింపు ఉన్న వ్యాపారవేత్త వీడియో బయటకు వస్తే పరువు పోతుందనే భయంతో..వారు అడిగిన విధంగా పలు దఫాలుగా రూ.9లక్షలు సమర్పించాడు. ఇంకా అడుగుతూ బెదిరింపులకు దిగడంతో చేసేదేమీ లేక న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఈ వ్యవహారం అంతా కూడా కేవలం రెండు రోజుల్లోనే జరగడం విశేషం. చదవండి: చంపుతానని బెదిరించి.. భార్యను వ్యభిచారంలోకి దింపి! -
బీజేపీ ఎమ్మెల్యేకు షాక్.. వాట్సాప్లో యువతి న్యూడ్ వీడియో కాల్చేసి..
ఇటీవలి కాలంలో హనీట్రాప్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాజకీయనేతలు, ప్రముఖులే టార్గెట్గా అందమైన యువతులు హనీట్రాప్నకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యేకు భారీ షాక్ తగిలింది. ఓ యువతి వాట్సాప్ కాల్ చేసి న్యూడ్గా మాట్లాడటంతో ఖంగుతిన్న ఎమ్మెల్యే వెంటనే కాల్ కట్ చేశాడు. వివరాల ప్రకారం.. కర్నాటకలోని చిత్రదుర్గ ఎమ్మెల్యే జి.హెచ్. తిప్పారెడ్డికి చేదుఅనుభవం ఎదురైంది. ఓ అపరిచిత యువతి తిప్పారెడ్డికి వాట్సాప్ కాల్ చేసి హనీట్రాప్ చేసేందుకు ప్రయత్నించింది. సదరు యువతి తనకు అక్టోబర్ 31వ తేదీన తనకు వీడియో కాల్ చేసిందన్నారు. అయితే, నియోజకవర్గానికి చెందిన వ్యక్తులెవరైనా తనకు కాల్ చేస్తున్నారని భావించిన ఆయన.. కాల్ లిఫ్ట్ చేయడంతో యువతి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందన్నారు. ఈ క్రమంలో తన దుస్తులు విప్పేసి న్యూడ్గా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. తాను వెంటనే కాల్ కట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. కాగా, మరికొద్ది క్షణాలు తర్వాత.. ఆమె మళ్లీ కాల్ చేసిందన్నారు. దీంతో, తన భార్యను కాల్ లిఫ్ట్ చేయమని చెప్పాను. అనంతరం, తన భార్య.. ఆ నంబర్ను బ్లాస్ చేసినట్టు చెప్పుకొచ్చారు. అనంతరం, ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. Karnataka #BJP Mla #GHThippareddy files complaint alleging there was an attempt to #HoneyTrap him. In his complaint, he alleges, he received a video call on WhatsApp, and some lady, on the other end stripped herself in the video. MLA has filed complaint with #Chitradurga police. pic.twitter.com/bcdcdyqq0k — Hate Detector 🔍 (@HateDetectors) November 2, 2022 -
పోలీసు కస్టడీకి హనీట్రాప్ ముఠా.. మరింత మంది స్వాములకు యువతి వల?
సాక్షి, బెంగళూరు: రామనగర జిల్లా మాగడిలోని బండేమఠం బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసు మొదటి నిందితునిగా ఉన్న కణ్ణూరు మఠాధిపతి మృత్యుంజయస్వామీజీ అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. హనీట్రాప్ ద్వారా బసవలింగ స్వామీజీ యువతితో ఉన్న వీడియోలను సేకరించి భారీగా డబ్బు డిమాండ్ చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ వద్ద గల వీడియో విడుదలచేస్తామని బెదిరింపులకు దిగాడు. ఈ ఉదంతంతో బసవలింగస్వామీజీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృత్యుంజయ స్వామి సొంత మఠంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసు కస్టడీకి తరలింపు బసవలింగస్వామీజీ ఆత్మహత్యకేసులో అరెస్టైన మృత్యుంజయస్వామీజీ, నీలాంబిక, మహదేవయ్య ను రామనగర పోలీసులు సోమవారం మాగడి ఏఎంఎప్సీ కోర్టులో హాజరుపరిచి మరింత దర్యాప్తు కోసం తమ కస్టడీకి ఇవ్వాలని మనవిచేశారు. న్యాయమూర్తి ధనలక్ష్మీ నవంబరు 4వ తేదీ వరకు వారిని పోలీసు కస్టడీకి ఆదేశించారు. కేసు గురించి డీజీపీ ప్రవీణ్సూద్ మాట్లాడుతూ బసవలింగస్వామీజీ ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఇందులో రహస్యం ఏమీ లేదని అన్నారు. మరింత మంది స్వాములకు యువతి వల? మృత్యుంజయ స్వామి, యువతి నీలాంబిక ఇతరులు కలిసి మరింతమంది స్వామీజీలను ఇదే విధంగా హనీట్రాప్ చేసినట్లు తెలిసింది. నీలాంబిక దొడ్డబళ్లాపురలో పేరుపొందిన కాలేజీలో ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యార్థిని. చిన్న వయసు నుంచి ఓ మఠానికి వెళ్తూ పలువురు స్వామీజీలను పరిచయం చేసుకుంది. నీలాంబిక మామ సిద్దగంగ మఠంలో పనిచేస్తున్నాడు. తనతో స్నేహంగా మెలిగిన మరింత మంది స్వామీజీల వీడియోలను ఆమె కణ్ణూరు మృత్యుంజయస్వామికి ఇచ్చి ఉండవచ్చునని అనుమానాలున్నాయి. తద్వారా ఈ బృందం బ్లాక్మెయిల్కు పాల్పడి ఉండవచ్చుననే కోణంలోనూ విచారణ సాగుతోంది. -
Whatsapp: వాట్సాప్ అంటే అంతే ఆ క్రేజే వేరు.. ఎన్నెన్నో ప్రత్యేకతలు!
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వాట్సాప్ను ప్రజలు వినియోగిస్తున్నారు. అన్ని దేశాల్లో కలిపి దాదాపు 244 కోట్లు మంది ఇప్పటివరకు వాట్సాప్ సేవలను వాడుతున్నారు. నవంబర్ 2009లో ప్రాథమికంగా వాట్సాప్ను యాపిల్ యూజర్ల కోసం తీసుకొచ్చారు. 2010లో అండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్ దశ తిరిగింది. కేవలం నాలుగేళ్లలోనూ 200 మిలియన్ యూజర్ల మార్కును చేరుకుంది. వాట్సాప్ పెరుగుతున్న తీరును చూసిన ఫేస్ బుక్.. వెంటనే బేరం పెట్టింది. ఏకంగా 19 బిలియన్ డాలర్లను వెచ్చించి 2014లో సొంతం చేసుకుంది. ఈ మొత్తం వాట్సాప్ విలువ కంటే 12 రెట్లు ఎక్కువ. భారత్ వ్యాప్తంగా వాట్సాప్కు 48 కోట్ల యూజర్లు ఉన్నారు. దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ మెసెజ్లు పంపుకోవచ్చు. ప్రతీ రోజు దాదాపు పది వేల కోట్ల మెసెజ్లను వాట్సాప్ చేరవేస్తుంది. (చదవండి: దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం.. అయోమయంలో యూజర్లు!) వాట్సాప్ వచ్చిన తర్వాత దెబ్బ పడిన మొదటి సర్వీస్ SMS. అప్పటి వరకు ఒక్కో SMSకు కొంత మొత్తాన్ని చార్జ్ చేసిన మొబైల్ నెట్వర్క్లు వాట్సాప్ దెబ్బకు భారీగా నష్టపోయాయి. ఇక భారతీయులయితే వాట్సాప్ను ఎంతగా అభిమానించారంటే.. ఏం చేసినా వాట్సాప్లో పంచుకున్నారు. మెసెజ్ షేరింగ్, ఫోటో షేరింగ్, స్టేటస్.. ఇలా ప్రతీ అంశానికి వాట్సాప్పై ఆధారపడతారు.కొన్నాళ్లుగా కాలింగ్కు కూడా వాట్సాప్ ప్రత్యామ్నాయంగా మారింది. నేరుగా కాల్ చేస్తే రికార్డు అవుతుందనో.. లేక సౌకర్యంగా ఉంటుందనో వాట్సాప్ కాలింగ్నే నమ్ముకున్నారు చాలా మంది. ఇక విదేశాల్లో, లేదా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారికి వాట్సాప్ కాలింగ్ ఎంతో సులభం. దీని వల్ల భారత్ లాంటి దేశాల్లో ISD ఇంటర్నేషనల్ కాలింగ్కు ఎంతో దెబ్బ పడింది. మొబైల్ నెట్వర్క్లు కన్నుమూసి తెరిచేలోపు వాట్సాప్ ఇంటర్నేషనల్ కాల్ ఎంతో ముందుకు వెళ్లింది. ఒకప్పుడు STD, ISD చేయాలంటే బూత్లకు వెళ్లేవాళ్లు. అపాయింట్మెంట్లు తీసుకునేవాళ్లు. వీటన్నింటికి వాట్సాప్ బెస్ట్సొల్యూషన్గా మారింది. ఇక వాట్సాప్ గ్రూపుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. ప్రతీ వాట్సాప్ యూజర్ కనీసం 10 గ్రూపుల్లో చేరడం, తమకు నచ్చిన అంశాలను బేస్ చేసుకుని గ్రూప్లు క్రియేట్ చేయడం వీపరీతంగా పెరిగింది. దీనికి తోడు మీడియాకు వాట్సాప్ ప్రధాన అస్త్రంగా మారింది. ప్రతీ వార్తను వాట్సాప్లో షేర్ చేసుకోవడం అనవాయితీగా మారింది. ఏకంగా వాట్సాప్ బేస్డ్గా మీడియా అంటే వార్తా ఛానళ్లు, పబ్లికేషన్లు నడుస్తుండడం ఆశ్చర్యం. గతంలో గోడ పత్రికలన్నీ ఇప్పుడు వాట్సాప్ పత్రికలుగా మారిపోయాయి. (చదవండి: WhatsApp Down కలకలం: స్పందించిన మెటా) -
అర్ధరాత్రి వాట్సాప్లో అశ్లీలంగా యువతి వీడియో కాల్..
కర్నూలు: పట్టణంలో హనీ ట్రాప్ కలకలం రేపుతోంది. తాజాగా ఓ యువకుడికి శనివారం అర్ధరాత్రి కొత్త నంబర్ నుంచి వాట్సాప్లో వీడియో కాల్ వచ్చింది. వీడియోలో ఉన్న యువతి హిందీలో మాట్లాడుతూ అశ్లీలంగా కనిపించటంతో ఆ యువకుడు కాల్ను కట్ చేశారు. వెంటనే వాట్సప్లో మేసేజ్ వచ్చింది. యువకుడి ఫొటోనుమార్ఫింగ్ చేసి అశ్లీల వీడియో పెట్టడం చూసి భయపడ్డాడు.తన అకౌంట్కు రూ.8,100 వెంటనే పంపాలని, లేకపోతే ఆ వీడియోను ఫ్రెండ్స్కు పంపుతానని, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని హిందీలో బెదిరించింది. తనకు ఒక రోజు సమయం ఇవ్వాలని యువకుడు కోరినా వినిపించుకోలేదు. ఆ యువకుడు సెల్ స్విచాఫ్ చేసుకోవడంతో అతని స్నేహితుడికి వీడియో పంపారు. వీడియో చూసిన స్నేహితుడు ఆ యువకుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో భయపడి ఫేస్బుక్ను డెలీట్ చేసుకున్నారు. అనంతరం బాధిత యువకుడు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై టౌన్ సీఐ మదుసుధన్రావును వివరణ కోరగా కేసు విచారిస్తున్నామని తెలిపారు. ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలోనే తేరుబజార్కు చెందిన ఓ యువకుడు హనీట్రాప్ బారిన పడి కొంత డబ్బు ఫోన్పే చేసినట్లు, అయినా బెదిరింపులు ఆగకపోవడంతో ఎదురుతిరిగి ఏం చేస్తారో చేసుకోండి, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో అప్పటి నుంచి మెసేజ్లు ఆగిపోయినట్లు బాధితుడు తెలిపారు. పట్టణంలో హానీ ట్రాప్ బాధితులు చాలా మంది ఉన్నా భయంతో ఎవరూ ముందుకు రావటం లేదు. -
షాకింగ్ ఘటన: వీడియో కాల్లో గర్ల్ఫ్రెండ్తో మాట్లాడుతూ... ఒంటికి నిప్పంటించుకున్నాడు...
ముంబై: 19 ఏళ్ల యువకుడు తన గర్లఫ్రెండ్తో వీడియో కాల్లో మాట్లాడతూ ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన సబర్బన్ శాంతాక్రూజ్లోని బాధితుడి నివాసంలోనే చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.....బాధితుడుని సాగర్ పరుశురామ్ జాదవ్గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను 30 శాతం కాలిన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. జాదవ్ సోమవారం అర్థరాత్రి గణపతి విగ్రహాన్ని సందర్శించి వచ్చిన తర్వాత ఒక నిర్ధిష్ట రహదారిపై తన గర్ల్ఫ్రెండ్తో ఫోన్లో గొడవపడ్డాడు. తదనంతరం తన నివాసంలో గర్లఫ్రెండ్తో వీడియో కాల్లో మాట్లాడతూ నిప్పంటించుకుంటానని బెదిరించాడు. ఐతే ఇంతలో ఆ నిప్పు కాస్త అతని కాటన్ షర్ట్కి అంటుకుని మంటలు ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టాయి. అంతే జాదవ్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అప్రమత్తమై.. ఆ మంటలను ఆర్పేసి అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఐతే జాదవ్ మాత్రం విచారణలో ఈ ఘటనకు ఎవరు బాధ్యులు కారని చెప్పడం గమనార్హం. (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
వాట్సాప్లో న్యూడ్ కాల్.. బ్లాక్మెయిల్
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్నగర్కు చెందిన న్యాయవాది మంగేష్కుమార్కు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ న్యూడ్ కాల్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడ్డారు. బాధితుడి వివరాల ప్రకారం.. ఈ నెల 6న ఆయనకు పలుసార్లు వీడియోకాల్ వచ్చింది. మొదట వాట్సాప్లో హాయ్.. హయమ్ శివాని అంటూ చాటింగ్ చేయగా ఆ న్యాయవాది హూ ఆర్యూ అంటూ రిప్లే ఇచ్చాడు. ఆ తర్వాత పలుసార్లు వీడియో కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఎవరో అని లిఫ్ట్ చేస్తే న్యూడ్కాల్ రావడంతో వెంటనే ఆయన కట్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసు పేరిట కాల్ చేసి వారికి డబ్బులు ఇవ్వాలని, లేనట్లయితే కేసు నమోదు అవుతుందని బెదిరించారు. తాను న్యాయవాదినని, కేసు పెడతానని మందలించడంతో మిన్నకుండిపోయారు. ఈ విషయమై సైబర్ క్రైంలో ఈ నె ల 7వ తేదీన ఫిర్యాదు చేసినట్లు బాధితుడు గురువారం విలేకరులకు ఈ విషయం వెల్లడించాడు. చదవండి: (భార్య ఉందని హత్య జాప్యం.. మసూద్ హత్యకు ప్రతీకారంగానే?) -
లవ్ యూ అంటూ దగ్గరై.. వీడియో కాల్లో నగ్న వీడియో సేవ్ చేసుకొని..
తిరువొత్తియూరు: దేశంలో ప్రతీరోజు ఏదో ఒకచోట యువతులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నగ్నంగా నిలబడి వీడియో కాల్లో మాట్లాడమని చెప్పి రికార్డు చేసుకుని ఓ విద్యార్థినిని బెదిరిస్తున్న యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కోవై సమీపంలో ఉన్న కోవిల్ పాళయంకు చెందిన 16 ఏళ్ల విద్యార్థిని ప్లస్ వన్ చదువుతోంది. 10వ తరగతి చదువుతున్న సమయంలో అదే తరగతిలో చదువుతున్న విద్యార్థితో పరిచయం ఏర్పడింది. అతను పదో తరగతి ఫెయిల్ కావడంతో చదువు ఆపేశాడు. ఆ తరువాత వారిద్దరూ సెల్ఫోన్లో మాట్లాడుకునేవారు. విద్యార్థినిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో వీడియో కాల్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఓసారి నగ్నంగా నిలబడి వీడియో కాల్ చేయమని అతడు కోరడంతో వీడియో కాల్లో మాట్లాడినప్పుడు అతడు రికార్డు చేసుకున్నాడు. తరువాత కాలంలో పదేపదే వీడియో కాల్ చేయమని కోరడంతో ఆమె భయపడి తల్లిదండ్రులకు తెలిపింది. వారు కోవై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆ విద్యార్థినితో మాట్లాడుతున్న యువకుడు వివరాలు తెలియకపోవడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: రికవరీ ఏజెంట్ల దూషణలతో.. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం -
అల్లరిపిల్ల: ఫేస్బుక్ ఐడీతో పురుషులకు వల.. నగ్నంగా కాల్స్
చిత్తూరు అర్బన్: పురుషుల బలహీనతలను ఆసరాగా చేసుకున్న ఓ యువతి ‘అల్లరిపిల్ల’ అవతారం ఎత్తింది. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపడం.. ఆ తర్వాత స్నేహితులు అయ్యాక.. నగ్నంగా వీడియోకాల్స్ చేసి మాట్లాడుకోవడం, కొందరికి నిఘా యాప్స్ పంపి మొబైల్ స్క్రీన్ షేరింగ్ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా రూ.లక్షలు కొల్లగొట్టింది. ఈ బాగోతంలో కమీషన్ కోసం తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు వేయించుకుంటున్న ఎనిమిది మంది మధ్యవర్తులను చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. డీఎస్పీ సుధాకర్రెడ్డి, సీఐ యుగంధర్ మంగళవారం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఫేస్బుక్లో అల్లరిపిల్ల అనే ఐడీ నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చేవి. వీటిని అంగీకరించిన కొద్దిరోజుల్లోనే ఓ అజ్ఞాత యువతి మెసెంజర్ ద్వారా వాయిస్కాల్స్ చేసి, మత్తెక్కించే మాటలతో అవతలి వాళ్లను తన బుట్టలో వేసుకునేది. అనంతరం వీడియో కాల్స్ ద్వారా నగ్నంగా మాట్లాడుకోవడం, నేరుగా కలవడానికి నమ్మకం వచ్చాక ప్రమాదకరమైన స్పై (నిఘా) యాప్స్ లింకులను పురుషుల మొబైళ్లకు పంపేది. ఆ లింకులను ఇన్స్టాల్ చేసుకున్న తరువాత అవతలి వ్యక్తి మొబైల్లో ఏం చేసినా అల్లరిపిల్ల తన సెల్ఫోన్ నుంచే చూసేది. వివరాలను వెల్లడిస్తున్న చిత్తూరు డీఎస్పీ సుధాకర్రెడ్డి, వెనుక అరెస్టయిన నిందితులు మరికొందరికి క్రెడిట్కార్డులు ఇప్పిస్తామంటూ నిఘా యాప్స్ పంపేది. ఆపై ఫోన్పే, గూగుల్పే, నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును మాయం చేసేది. ఈ డబ్బులను నేరుగా తన బ్యాంకు ఖాతాకు కాకుండా కొందరు వ్యక్తులను మధ్యవర్తులుగా నియమించుకుని వారి ఖాతాల్లోకి మళ్లించేది. ఇలా ఓ పది బ్యాంకు ఖాతాల నుంచి అల్లరిపిల్ల ఖాతాలోకి నగదు వెళ్తుంది. చిత్తూరు నగరానికి చెందిన సీకే మౌనిక్ అనే వ్యక్తి సైతం అల్లరిపిల్ల మాయలోపడి ఆమె పంపిన నిఘా యాప్స్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అంతే.. రూ.3.64 లక్షలు బ్యాంకు నుంచి మాయమయ్యాయి. ఈనెల 3న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. మాయమైన నగదు ఏయే ఖాతాల్లో జమయ్యిందో తెలుసుకుని విశాఖ జిల్లాకు చెందిన ఎ. సాంబశివరావు (32), బి.ఆనంద్మెహతా (35), జి. శ్రీను (21), సి. కుమార్రాజు (21), ఎల్.రెడ్డి మహేష్ (24), జి. శివకుమార్ (21), వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సి. సుధీర్కుమార్ అలియాస్ సుకు (30), వరంగల్కు చెందిన టి.శ్రావణ్కుమార్ (31) అనే మధ్యవర్తులను పోలీసులు అరెస్టుచేశారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపించిన ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్లను డీఎస్పీ అభినందించారు. ఈ ఎనిమిది మందికి కూడా ఆ అల్లరిపిల్ల ఎవరో తెలియకపోవడం కొసమెరుపు. వీరందరితో నెట్కాల్స్ ద్వారా మాట్లాడి కమీషన్ ఇచ్చి నగదు లావాదేవీలు జరపడానికి ఏజెంట్లుగా నియమించుకుంది. బాధితుడి ఫిర్యాదు, అరెస్టు అయిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా అల్లరిపిల్లను ఓ యువతిగా గుర్తించిన పోలీసులు ఆమెను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. -
ప్రియురాలికి స్నేహితురాలు వీడియోకాల్.. వక్రబుద్ధితో..
సాక్షి, గుంటూరు(బాపట్ల): ప్రియురాలికి ఆమె స్నేహితురాలు చేసిన వీడియోకాల్ ద్వారా మెడలో ఉన్న బంగారం చూసిన ప్రియుడు కక్కుర్తిపడ్డాడు. దాన్ని ఏదో విధంగా కొట్టేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. ఆ వక్రబుద్ధితో ప్రియురాలితో కుమ్మకై ఆమెను హత్య చేసి బంగారాన్ని వలుచుకున్నాడు. గోనె సంచిలో మృతదేహాన్ని కుక్కి కృష్ణానది ఒడ్డున పడేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పులుగు రామకృష్ణారెడ్డి, తూమాటి మహేష్, దావూలూరి భారతీలు ఈనెల 2న ఆర్ఐ సురేష్బాబు సమక్షంలో లొంగిపోయి హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. పక్షం రోజులుగా ఉత్కంఠ రేపిన మహిళా అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఈ మేరకు డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు గురువారం స్థానిక టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. బాపట్ల పట్టణం పెయింట్స్ కాలనీకి చెందిన గూడపాటి భారతి గత నెల 16వ తేదీ నుంచి కనిపించడం లేదని 19వ తేదీన ఆమె కుమార్తె ఝాన్సీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ పి.కృష్ణయ్య, ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు భారతితో ఆమె స్నేహితురాలు దావులూరి భారతి చివరిసారిగా మాట్లాడటంతో కేసును ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలేనికి చెందిన పులుగు రామకృష్ణారెడ్డికి, ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలకు చెందిన దావులూరి భారతితో అక్రమ సంబంధం కొనసాగడంతో నాలుగేళ్లుగా పట్టణంలోని నరాలశెట్టివారిపాలెంలో కాపురం ఉంటున్నారు. చదవండి: (తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే..) మృతురాలు భారతి కూడా చెడు వ్యసనాలు కలిగి ఉండటంతోపాటు నిందితురాలు భారతీని కూడా తనకు కాకుండా చేస్తోందని రామకృష్ణారెడ్డి తరచూ గొడవపడుతూ ఉండేవాడు. ఈ సమయంలో మార్చి 16న గుంటూరు నుంచి కారులో వస్తున్న నిందితురాలు భారతికి మృతురాలు భారతి వీడియోకాల్ చేసింది. మృతురాలి మెడలో బంగారం ఉండటంతో కారులోనే పక్కా ప్రణాళిక వేసి బాపట్ల నుంచి భారతిని ఎక్కించుకుని, అక్కడ నుంచి కృష్ణారెడ్డి స్నేహితుడైన తూమాటి మహేష్ను కూడా తీసుకుని సూర్యలంక వెళ్లారు. అక్కడ మృతురాలు భారతితో పాటు అందరూ మద్యం తాగి బాపట్లలో గోనె సంచి కొనుగోలు చేసి రేపల్లె రోడ్డువైపు బయలుదేరారు. చీరతో గొంతు బిగించి హత్య మృతురాలు భారతిని చీర కొంగుతో చంపి వెంట తెచ్చిన గోనెసంచిలో వేసి పెనుమూడి పులిగడ్డ వారధిలో పడేశారు. కేసును పక్కదారి పట్టించేందుకు ఆమె ఫోన్ను తీసుకుని రాజమండ్రి వెళ్లి అక్కడ నుంచి మాట్లాడకుండా అక్కడే దాన్ని పడేశారు. పోలీసుల్ని పక్కదారి పట్టించేందుకు ఈ విధంగా చేశారని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. చదవండి: (ఫార్మాసిస్ట్ వచ్చీరాని వైద్యం.. బాలిక మృతి) ప్రధాన నిందితుడికి నేర చరిత్ర ప్రధాన నిందితుడు పులుగు రామకృష్ణారెడ్డి 2011 సంవత్సరంలోనే హైదరాబాద్ నుంచి ఒక స్టాఫ్ నర్సును ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె వద్ద నగదు తీసుకుని కర్లపాలెంలో హత్య చేసిన కేసు నమోదైందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడికి నేరచరిత్ర ఉందని చెప్పారు. కేసును అత్యంత వేగంగా దర్యాప్తు చేసిన సీఐ పి.కృష్ణయ్య, ఎస్ఐలు రఫీ, సీహెచ్. సింగయ్యతోపాటు పలువురు సిబ్బందికి రివార్డులు ఇచ్చేందుకు ప్రతిపాదించినట్లు డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. నిందితుల్ని కోర్టుకు హాజరు పరుస్తునట్లు చెప్పారు. -
మహిళా ప్రొఫెసర్కు అశ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్లు..
న్యూఢిల్లీ: మహిళా ప్రొఫెసర్ను లైంగిక వేధింపులకు గురిచేస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. నిందితుడిని ఉత్తర ప్రదేశ్లోని ఘాజీపూర్కు చెందిన ధరంపాల్ రాయ్గా (36) గుర్తించారు. వివరాలు..36 ఏళ్ల ధరంపాల్ జోధ్పూర్లోని ఆర్ఓ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. అయితే రాయ్ గత కొద్దిరోజులుగా ఢిల్లీ వర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్కు అశ్లీల వీడీయోలు, అసభ్యకరమైన మెసేజ్లు పంపుతూ వేధిస్తున్నాడు. వాట్సాప్లో అభ్యంతరకర వీడియోలు పంపిస్తూ ఇబ్బంది పెట్టేవాడు. చదవండి: మూడేళ్ల క్రితమే పెళ్లి.. వరుసకు బావతో వివాహేతర సంబంధం ఉందని.. దీంతో గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్లో అశ్లీల వీడియోలు పంపి వేధిస్తున్నాడని మహిళా ప్రొఫెసర్ జనవరి 29న ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక సహకారంతో ఢిల్లీ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్కు వీడియో కాల్స్ చేస్తూ వేధిస్తున్నాడు. ఫేస్బుక్ సెర్చ్లో ఫ్రొఫెసర్ కాంటాక్ట్ నంబర్ దొరికిందని, అప్పటి నుంచి ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించానని నిందితుడు పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు. ఇతర మహిళలనూ ఇదే తరహాలో నిందితుడు గతంలో వేధించాడనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. చదవండి: కొడుకు ప్రేమ పెళ్లి.. మానసికంగా కుంగిపోయిన తల్లి.. చివరికి -
Facebook Scam: ‘ఈ వీడియోలో ఉంది మీరేనా?’
Facebook Messenger Video Link Scam Alert: ఆన్లైన్ మోసాలకు భారత్ నెంబర్ వన్ అడ్డాగా మారుతోంది. స్మార్ట్ఫోన్ యూజర్లు పెరిగిపోవడం.. కనీస అవగాహన లేకపోవడం లాంటి కారణాలతో కొత్త తరహా ఆన్లైన్ స్కామ్లు తెర పైకి వస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఫేస్బుక్ మెసేంజర్ వీడియో స్కామ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఫేస్బుక్ అకౌంట్ టార్గెట్గా జరిగే పిషింగ్ స్కామ్ ఇది. ఈ గాలంలో చిక్కితే గనుక.. ఫేస్బుక్ లాగిన్ క్రెడెన్షియల్స్ సహా అన్నీ వాళ్లకు తెలిసిపోతాయి. తద్వారా ఆన్లైన్ మోసగాళ్లు ఫేస్బుక్ అకౌంట్లపై పట్టు సాధిస్తారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘సోఫోస్’ ఈ స్కామ్కు సంబంధించి హెచ్చరిక జారీ చేసింది కూడా. విశేషం ఏంటంటే.. ఐదేళ్ల క్రితం ఇదే తరహా స్కామ్ ఒకటి ఫేస్బుక్ను కుదిపేసింది కూడా. లింక్కి టెంప్ట్ అయితే.. ముందుగా ఫేస్బుక్ మెసేంజర్ (మెసేజ్ బాక్స్) కు ఓ లింక్ పంపిస్తారు ఆన్లైన్ మోసగాళ్లు. ఆ లింక్ పైన ‘ఈ వీడియో ఉంది మీరేనా?’ అని రాసి ఉంటుంది. ఆ లింక్ యూబ్యూట్ లింక్ మాదిరి ఉంటుంది. కాబట్టి, చాలా క్యాజువల్గా యూజర్ క్లిక్ చేసే అవకాశం ఉంది. ఒక్కసారి గనుక క్లిక్ చేసినట్లయితే.. నేరుగా ఫేస్బుక్ లాగిన్కు వెళ్తుంది. ఒకవేళ ఫేస్బుక్లోకి లాగిన్ గనుక అయినట్లయితే.. కిస్సా ఖల్లాస్. ఫేక్ పేజీ.. అది ఫేస్బుక్ లాగిన్ పేజీ అనుకుంటే పొరపాటే!. పక్కా ఫేక్ పేజీ. యూజర్ ఇన్ఫర్మేషన్ను తస్కరించేందుకే ప్రత్యేకంగా అలా డిజైన్ చేసి పంపిస్తారు ఆన్లైన్ మోసగాళ్లు. ఒకవేళ అక్కడ లాగిన్ గనుక అయితే పాస్వర్డ్తో సహా అన్నీ వాళ్లకు తెలిసిపోతాయి. వెంటనే ఫేస్బుక్ అకౌంట్ మీద పట్టు సాధించి.. ఆపై బ్లాక్మెయిల్కు, మోసాలకు దిగుతారు. గుర్తుపట్టడం ఎలా? ఆ ఫేస్బుక్ లాగిన్ లింక్ ఫేక్ లేదా ఒరిజినల్ అని గుర్తుపట్టడం ఎలా?. వెబ్సైట్ యూఆర్ఎల్ ఒక్కటే మార్గం. లింక్ పైన యూఆర్ఎల్లో HTTPS లేదంటే HTTPతో మొదలైందంటే.. అది ఒరిజినల్ అని గుర్తు పట్టొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ మధ్యకాలంలో సేఫ్ ప్రొటోకాల్ కింద వెబ్సైట్లు అన్నీ HTTPS యూఆర్ఎల్ను కచ్చితంగా ఫాలో అవుతున్నాయి కాబట్టి. మోసపోయి ఫిర్యాదులు చేయడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చదవండి: మీ Whatsapp బ్యాన్ అని చూపిస్తుందా? పని చేయట్లేదా? ఇలా చేయండి -
సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్కు వెళ్లాడా’’
Lance Naik Saiteja: ‘పాప దర్శిని ఏం చేస్తోంది.. మోక్షజ్ఞ స్కూల్కు వెళ్లాడా.. చిట్టితల్లిని చూడాలని ఉంది. వీడియో కాల్ చేస్తా’ అంటూ భార్య శ్యామలతో లాన్స్నాయక్ బి.సాయితేజ బుధవారం ఉదయం 8.45 గంటలకు మాట్లాడారు. భార్య, పాపను వీడియోకాల్లో చూస్తూ తాను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్తో కలిసి తమిళనాడు వెళుతున్నానని.. వీలు కుదిరితే సాయంత్రం చేస్తానని టాటా చెప్పిన సాయితేజ.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ ఘటనతో సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామం షాక్కు గురైంది. ప్రమాద విషయం తెలుసుకున్న సాయితేజ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు మదనపల్లెలో భార్య శ్యామల నివాసం ఉంటున్న ఇంటికి, ఎగువరేగడ గ్రామంలో తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో సాయితేజ చనిపోయాడని తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని, ఎలాంటి దుర్వార్త ఏ సమయంలో వినాల్సి వస్తోందని బాధాతప్త హృదయాలతో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. సాయితేజ మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. తల్లి భువనేశ్వరిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. సిపాయిగా ఎంపికై.. లాన్స్నాయక్ స్థాయికి.. 28 ఏళ్ల సాయితేజ 2013లో బెంగళూరు రెజిమెంట్కు ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యారు. అక్కడ శిక్షణ పొందుతూ డిపార్ట్మెంట్కు సంబంధించిన పరీక్షలు రాసి ఏడాది తర్వాత ప్యారా కమాండోగా ఎంపికై 11వ పారాలో లాన్స్నాయక్గా నియమితులయ్యారు. విధి నిర్వహణలో భాగంగా కశ్మీర్, బెంగళూరు హెడ్క్వార్టర్స్లో పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలోబిపిన్ రావత్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. తల్లి భువనేశ్వరి మాజీ ఎంపీటీసీ, తండ్రి మోహన్ సాధారణ రైతు. తమ్ముడు మహేష్ఆర్మీలో సిపాయిగా సిక్కింలో పని చేస్తున్నారు. సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ (5), పాప దర్శిని (2) సంతానం. కుమారుడు మోక్షజ్ఞ చదువు కోసం సాయితేజ భార్య శ్యామల మదనపల్లె ఎస్బీఐ కాలనీ రోడ్ నెం.3లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సాయితేజ చివరిగా సెప్టెంబర్లో వినాయక చవితికి స్వస్థలానికి వచ్చి వెళ్లారు. -
కాల్ లిఫ్ట్ చేయగానే నగ్న వీడియో.. అప్పుడే అసలు కథ మొదలైంది..
సాక్షి, హైదరాబాద్: అందివచ్చే ప్రతీ ఒక్క అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరస్తులు. ఏమ్రాతం అలసత్వంగా ఉన్నా లక్షలు పోగొట్టుకోకతప్పదు. తాజాగా హైటెక్సిటీలోని ప్రముఖ ఐటీ కంపెనీలోని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఇదే అనుభవం ఎదురైంది. ఫేస్బుక్లో అమ్మాయి ప్రొఫైల్ ఫొటోతో ఫ్రెండ్ రెక్వెస్ట్ వచ్చింది. వచ్చిందే తడువు క్రాస్ చెక్ చేసుకోకుండా యాక్సెప్ట్ చేశాడు. కాసేపటికి న్యూడ్ వీడియో కాల్ అంటూ ఎఫ్బీలో మెసేజ్ పంపించింది. దీంతో సరేనని.. ఇతనూ రెడీ అయ్యాడు. కాల్ లిఫ్ట్ చేయగానే ఓ అమ్మాయి నగ్న వీడియో ప్లే అయింది. అయితే వాస్తవానికి అది ప్రత్యక్ష వీడియో కాదు.. రికార్డెడ్ వీడియో. అటువైపు నుంచి ఆడ గొంతుతో ఈ టెకీని కూడా బట్టలు విప్పమని కోరింది. దీంతో ఇతనూ ఒంటిపై దుస్తులు తీసేశాడు. ఈ తతంగాన్నంతా అటువైపు నుంచి సైబర్ నేరస్తులు వీడియో తీశారు. చదవండి: ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. మైనర్ బాలికపై.. ఢిల్లీ ఏసీపీని మాట్లాడుతున్నాను.. ఇకడ్నుంచి నేరస్తుల అసలు కథ మొదలైంది! వీడియో కాల్ పూర్తయ్యాక.. కాసేపటికి సదరు ఐటీ ఉద్యోగికి ఫోన్ వచ్చింది. ‘ఢిల్లీ ఏసీపీని మాట్లాడుతున్నాను. మీతో న్యూడ్ వీడియో కాల్ చేసిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మీపైన ఢిల్లీలో కేసు నమోదయింది. అరెస్ట్ చేస్తామని’ బెదిరించారు. అమ్మాయి సెల్ఫోన్ వీడియోలను సంబంధించిన రికార్డ్ అంతా రికవరీ చేశామని తెలిపారు. పోలీస్ అనగానే టెకీ భయపడిపోయాడు. ఇతని వీడియో ఇతనికే పంపడంతో నిజమేనని నమ్మేశాడు. కేసు, అరెస్ట్ గట్రా లేకుండా ఉండాలంటే కొందరు అధికారులను మ్యానేజ్ చేయాలని, కొంత డబ్బు పంపిచమని కోరారు. సరేనని..గత నెల 7వ తేదీ నుంచి 20 రోజుల పాటూ విడతల వారీగా రూ.29 లక్షలు ఆన్లైన్లో సమర్పించుకున్నాడు. అయినా వదిలిపెట్టకుండా పదే పదే బెదిరిస్తుండటంతో తప్పని పరిస్థితులతో గురువారం సైబరాబాద్ సైబర్ క్రై మ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు గుట్టరట్టయింది. ఇదంతా రాజస్తాన్ చెందిన సైబర్ ముఠా పనేనని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. చదవండి: ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్లో రూం తీసుకొని.. సిగ్గుపడి రిపోర్ట్ చేయడం లేదు ఇప్పటివరకు నగ్న వీడియో కాల్స్ ఘటనలపై 6–7 కేసులు నమోదయ్యాయి. సెక్ట్సార్షన్ అని పిలిచే ఈ తరహా బాధితులు చాలా మందే ఉంటారు కానీ, చెప్పుకోవటానికి సిగ్గుపడి ముందుకు రావటం లేదు. పోలీసులు ఏమంటారోనని భయపడుతుంటారు. ఇదే సైబర్ నేరస్తులకు ఆయుధంగా మారుతోంది. అపరిచితులతో ఫోన్లో సంభాషించొద్దు. అమ్మాయితో నగ్న వీడియో కాల్స్ అనగానే నమ్మొద్దు. – జీ. శ్రీధర్, ఏసీపీ, సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ -
అలాంటి వీడియో కాల్స్తో జాగ్రత్త!
వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్లలో తెలియని ఏదో అకౌంట్ నుంచి వీడియో కాల్స్ వస్తుంటాయి. లిఫ్ట్ చేయగానే.. షాక్. అవతల నగ్నంగా ఉన్న అమ్మాయిలు కనిపిస్తారు. ఏం జరుగుతుందో ఊహించే లోపే కాల్ కట్ అవుతుంది. ఆ తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది. కాసేపటికి అన్నోన్ నెంబర్ లేదంటే సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫోన్ కాల్స్ లేదంటే మెసేజ్లు వస్తాయి. అశ్లీల వీడియోలు చూసిన మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేశామనో, ఫొటోలు తీశామనో బెదిరిస్తారు. కొంత డబ్బును డిమాండ్ చేస్తూ.. ట్రాన్స్ఫర్ చేయకపోతే ఆ వీడియో/ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తారు. ఈ వ్యవహారాలను కొందరు లైట్ తీస్కుంటే.. చాలామంది భయంతో కంగారులో ఏం చేయాలో పాలుపోక వణికిపోతారు. సదరు అకౌంట్లను బ్లాక్ చేయడమో లేదంటే యాప్లను అన్ఇన్స్టాల్ చేయడమో చేస్తుంటారు. అయినా బెదిరింపులు ఆగిపోతాయనుకోవడం పొరపాటే!. చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టే మొబైల్ యాప్! ఇక సైబర్ కేటుగాళ్ల ఆటకట్టు.. దేశంలో ఆన్లైన్ మోసాలు, వేధింపుల కేసులు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే సైబర్ నేరాల్లో భారత్ నెంబర్ వన్ ప్లేస్లో కొనసాగుతోంది. ఈ తరుణంలో కొంతకాలంగా తగ్గిపోయిన ‘సెక్స్టార్షన్’ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఉత్తర రాష్ట్రాలు కేంద్రంగా జరుగుతున్న ఈ నేరాలపై సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేవలం మేవాత్ (హర్యానా), భరత్పూర్ (రాజస్థాన్) నుంచి 36 బ్యాచ్లు దేశవ్యాప్తంగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే 600 మందికి పైగా అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపించి ఆపై వాటిని బూచిగా చూపించి బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నాయి ఈ ముఠాలు. నిజానికి సెక్స్టార్షన్.. నేరాలు కొత్తేం కాదు. కాకపోతే లాక్డౌన్ నుంచి ఈ తరహా నేరాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. దేశ రాజధాని లక్క్ష్యంగా, మిగతా రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు ఈమధ్య ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మీకు తెలుసా?.. డిలీటైన వాట్సాప్ డేటాను సింపుల్గా ఇలా బ్యాకప్ చేయొచ్చు ఏం చేయాలంటే.. సెక్స్టార్షన్లు చాలా సీరియస్ నేరాలు. ఫేస్బుక్ మెసేంజర్లోగానీ, వాట్సాప్లోగానీ, ఇతర ఏ యాప్లలో అయినాగానీ తెలియని అకౌంట్లు, గుర్తుతెలిని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ కంగారులో లిఫ్ట్ చేసినా కెమెరాను కవర్ చేయాలి. కాల్స్ వచ్చే నెంబర్లు, అకౌంట్లను బ్లాక్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయాలి. బ్లాక్మెయిలింగ్ కాల్స్, మెసేజ్లకు ఎక్కువసేపు స్పందించకుండా ఉంటే.. ఫిర్యాదు చేస్తారేమోనని నేరగాళ్లే భయపడొచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా ఫిర్యాదులు చేయడమే ఉత్తమమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. -
గోదారమ్మ ఒడిలో... పౌర్ణమి వీడియో కాల్...
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): కార్తీక మాసంలో పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే గోదావరిలో స్నానాలు చేసి ఉసిరికాయలతో దీపాలు వెలిగించి గంగమ్మకు పూజలు చేస్తారు... బియ్యంపిండితో చేసిన ప్రమిదలతో ఇంటింటా దీపాలు అలంకరించి వెలిగించడం పౌర్ణమి ప్రత్యేకత.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా తన కుటుంబీకులకు వీడియోకాల్ చేస్తూ గోదారమ్మ ఒడిలో దీపాలు వదులుతున్న మహిళ ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. -
హస్కి వాయిస్.. న్యూడ్ వీడియో కాల్స్ చేయించుకోని..
సాక్షి, హిమాయత్నగర్(హైదరాబాద్): అందమైన అమ్మాయిల ఫొటోలు పంపి, ఆపై న్యూడ్ వీడియోకాల్ చేపించుకుని నగర వాసి నుంచి డబ్బులు వసూలు చేశారు సైబర్ నేరగాడు. క్యాప్చర్ చేసిన వీడియోను అడ్డుపెట్టుకుని పలు దఫాలుగా పెద్ద మొత్తంలో లక్షలు వసూలు చేయడంతో..బాధితుడు న్యాయం కావాలంటూ సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని సోమవారం ఆశ్రయించాడు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం..ఇటీవల నగర యువకుడికి ఓ వ్యక్తి అమ్మాయిల వాట్సప్లో పరిచయమయ్యాడు. సాంకేతికను అడ్డం పెట్టుకుని పలుమార్లు అమ్మాయి గొంతుతో మాట్లాడారు.. దుస్తులు ధరించినవి, దుస్తులు లేకుండా(న్యూడ్) ఉన్న ఫొటోస్ని పంపి యువకుడికి గాలం వేశారు. ఇలా రెండు, మూడు పర్యాయాలు వాట్సప్ వీడియో కాల్ చేపించుకున్నారు. అవతలి వ్యక్తి కనిపించకుండానే..యువకుడిని దుస్తులు విప్పాలన్నారు. ఆపై యువకుడి వీడియోను రికార్డ్ చేశారు. తదనంతరం డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే నీ న్యూడ్ వీడియోను వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో పాటు..యూట్యూబ్లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో వారు చెప్పిన విధంగా యువకుడు పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.4లక్షలు పంపాడు. ఎంత పంపినా తీసుకుంటున్నారే కానీ..వీడియో డిలీట్ చేయడం లేదని, మరికొన్ని డబ్బులు కావాలని వేధిస్తుండటంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి తాము దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. -
బైడెన్–జిన్పింగ్ భేటీకి రంగం సిద్ధం
వాషింగ్టన్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత జీ పిన్పింగ్ భేటీకి రంగం సిద్ధమయ్యింది. వారిద్దరూ సోమవారం సాయంత్రం వర్చువల్గా సమావేశం కానున్నారు. వీడియో కాల్ ద్వారా ఇరువురు నేతలు మాట్లాడుకోనున్నారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాతో సంబంధాలు క్షీణించాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు నివురు గప్పిన నిప్పులా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో బైడెన్, జిన్పింగ్ సమావేశం పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ భేటీ ద్వారా పెద్దగా ఆశించాల్సింది ఏమీ ఉండదని వైట్హౌస్ అధికార వర్గాలు పరోక్షంగా సంకేతాలిస్తున్నాయి. అమెరికా, చైనా ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు కలిసి పనిచేసే దిశగా బైడెన్, జిన్పింగ్ ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ చెప్పారు. అమెరికా ఉద్దేశాలు, ప్రాధాన్యతలను బైడెన్ చైనా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లనున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఇరువురు నేతలు మాట్లాడుకుంటుండడం ఇది మూడోసారి. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు అమెరికా సహకరిస్తుందని తాము ఆశిస్తున్నట్లు చైనా వెల్లడించింది. -
భార్యకు వీడియో కాల్ చేసి జైలు వార్డెన్ ఆత్మహత్య
బెంగళూరు(కర్ణాటక): కర్ణాటకలోని బెంగళూరులోని విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. 24 ఏళ్ల అశ్ఫక్ తగడి శివమొగ్గజైలులో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను.. ఏడాది క్రితమే ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో.. భార్యకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో భయపడిపోయిన భార్య.. అతడిని వారించింది. తీవ్ర భయాందోళనలకు గురైన భార్య.. ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. అధికారులు.. అశ్ఫక్ ఇంటికి చేరుకుని అతని ఇంటి డోర్ను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే .. అతను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, అశ్ఫక్ను అధికారులు.. శివమొగ్గలో తొలిపోస్టింగ్ ఇచ్చారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: మరో మహిళతో భర్త ఫోటోలు: ఐదుగురు పిల్లలను బాత్టబ్లో ముంచి -
నగ్నంగా వీడియో కాల్స్ చేసి.. 200 మందిని మోసం చేసిన జంట
లక్నో: కొందరు కేటుగాళ్లు సోషల్మీడియా సాయంతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ దాదాపు 200 మందిని మోసం చేసిన ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఉత్తర ప్రదేశ్లోని ఘాజియాబాద్కు చెందిన సప్నాగౌతమ్, యోగేశ్ భార్యాభర్తలు. వీరికి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆశ పుట్టింది. దీంతో ఆ దంపతులకు ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ రికార్డు చేసి బాధితుల నుంచి డబ్బులు లాగొచ్చని సలహా ఇచ్చాడు. దీంతో సప్నా గౌతమ్, యోగేశ్ జంట ఈ దందాలోకి దిగింది. యోగేశ్ వ్యక్తుల వివరాలు సేకరించడంతో ఆ వివరాలతో వీడియో కాల్స్ ఎలా మాట్లాడలో కొంతమంది యువతులకు సప్నా శిక్షణ ఇవ్వటం ప్రారంభించింది. దీని కోసం వీరు ముందుగా ఓ వెబ్సైట్ సాయంతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడేవారు. దానికి నిమిషానికి రూ.200పైగా ముందుగానే చెల్లించాలని చెప్పేవారు. ఇందులో సగం వెబ్సైట్ వారికిపోగా మిగిలిన సగం ఈ దంపతులకు చేరుతుంది. తర్వాత ఆ రేటు కంటే తక్కువకే తాము వీడియో కాల్స్ చేస్తామంటూ బాధితుల నుంచి ఫోన్ నంబర్లు సేకరించేవారు. వాట్సాప్ లేదా ఇతర మాధ్యమాల్లో వీడియో కాల్స్ చేసి, అవతలి వారు నగ్నంగా మాట్లాడేలా చేసి రికార్డు చేసేవారు. అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేకుంటే.. వారి వీడియోలు బయట పెడతామని బాధితులను బెదిరించేవారు. ఇలా ఎంతో మందిని మోసం చేసి గత రెండేళ్లుగా సుమారు రూ.22 కోట్లను పలువురు బాధితుల నుంచి దోచుకున్నారు. యువతులను రిక్రూట్ చేసుకుని వారికి నెలకు రూ.25 వేల చొప్పున జీతాలు చెల్లించి నగ్న వీడియో కాల్స్ చేయించారు. కేవలం మెసేజ్లు చేసే వారికి నెలకు రూ.15వేలు ఇచ్చేవారు. ఓ కంపెనీకి చెందిన ఉద్యోగి రూ.80 లక్షలను కంపెనీ ఖాతా నుంచి బదిలీ చేయడంతో ఆ కంపెనీ యజమాని గుజరాత్లోని రాజ్కోట్ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ జంట దందా వెలుగులోకి వచ్చింది. ఆ కేసు విచారణలో రాజ్కోట్ పోలీసులు ఘజియాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేస్తుంటే హనీ ట్రాప్ విషయం బయటపడింది. ఈ కేసులో భార్యాభర్తలు సహా, మరో ముగ్గురు యువతులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులు, తరచూ భార్యతో గొడవలు.. పొద్దున్న తలుపు తెరచి చూస్తే..
సాక్షి,రాజేంద్రనగర్( హైదరాబాద్ ): సెల్ఫీ వీడియో తీసుకోని ఓ ఫోటోగ్రాఫర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన మేరకు.. బండ్లగూడ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్(30) కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దీనికి తోడు భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకోని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియోలో భార్యతో పాటు బావమరిది వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వివరించాడు. ఉదయం ఇంట్లో నుంచి చంద్రశేఖర్ బయటకు రాకపోవడంతో స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మార్చరికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: న్యూడ్ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి -
చావుబతుకుల్లో అభిమాని.. కోరిక తీర్చిన ఎన్టీఆర్
అభిమానులు లేనిదే హీరోలు లేరనేది వాస్తవమే అయినా.. ఆ మాటకు విలువనిచ్చే వారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అభిమానులతో మాత్రం ఎప్పుడూ టచ్లోనే ఉంటారు. ఆపదలో ఉన్న అభిమానులకు ఎప్పుడు అండగా నిలుస్తుంటాడు. గతంలో ఎన్నోసార్లు తన అభిమానుల కోరికలను తీరుస్తూ.. వారిని వారికి సర్ ప్రైజ్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఇప్పుడు మరోసారి తన అభిమానికి కోరిక తీర్చాడు ఈ నందమూరి హీరో. (చదవండి: సమంత లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్: భావోద్వేగంతో ఇలా..) తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం.. గూడపల్లి గ్రామానికి చెందిన కొప్పాడి మురళి ఎన్టీఆర్కు వీరాభిమాని. అయితే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మురళి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి మరింతగా విషమించింది. ఈ క్రమంలో వైద్యులు అతడి కోరికలు, ఇష్టాయిష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో తనకు జూనియర్ ఎన్టీఆర్ ను చూడాలని ఉందని చెప్పగా.. ఆ విషయాన్ని అతని కుటుంబసభ్యులకు చెప్పాడు. ఈ విషయాన్ని యంగ్ టైగర్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తన వీరాభిమానికి వీడియో కాల్ చేసి మాట్లాడారు ఎన్టీఆర్. అనంతరం డాక్టర్లు, కుటుంబసభ్యులను పలకరించి.. నేను ఉన్నాను.. త్వరలో మనం కలుద్దామని ధైర్యం చెప్పారు ఎన్టీఆర్. Young Tiger #NTR generous gesture towards his fan Murali who met with an accident recently. @tarak9999 spoke to him through video call and wished him speedy recovery.👏 pic.twitter.com/dEeHh9UNWO — VamsiShekar (@UrsVamsiShekar) October 7, 2021 -
అభిమానికి వీడియో కాల్ చేసి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్
అభిమాని లేనిదే హీరోలు లేరు అనేది అందరికి తెలిసినా.. ఆ మాటలకు విలువ ఇచ్చే వారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అభిమానులకు తిరిగి ప్రేమను పంచడం కొందరు గొప్ప గౌరవంగా భావిస్తారు. అలాంటి వారిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకరు. ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటీకీ.. అభిమానులతో మాత్రం ఎప్పుడూ టచ్లోనే ఉంటారు. ఇక రీసెంట్గా క్యాన్సర్తో బాధపడుతున్న తన అభిమానికి వీడియో కాల్లో మాట్లాడి ఆమె ముఖంపై నవ్వులు కురిపించాడు. (చదవండి: థియేటర్లను పూర్తిగా మూసేయ్యాలి అనుకుంటున్నారా..?) శోభిత అనే అమ్మాయి అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ప్రభాస్ అంటే ఇష్టమని తెలుసుకున్న డాక్టర్లు.. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, అతని పట్ల ఆమెకున్న అభిమానాన్ని తెలుసుకున్న ప్రభాస్ తన బిజీ షెడ్యూల్లో ఆమెకు కొంత సమయం కేటాయించి వీడియో కాల్లో మాట్లాడి ఆమెకు అనందాన్ని పంచారు. గతంలో కూడా భీమవరంలో మృత్యువుకు దగ్గరవుతున్న తన 20 ఏళ్ల అభిమానితో ఇలానే మాట్లాడి సర్ప్రైజ్ చేశాడు ఈ పాన్ ఇండియా స్టార్. -
వీడియోకాల్లో ఫ్యామిలీతో మాట్లాడిన తేజ్
Sai Dharam Tej: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయిధరమ్తేజ్ శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. తను మాట్లాడే క్రమంలో తీవ్రంగా ఇబ్బందిపడినట్లు సమాచారం. కేవలం ఒక నిమిషమే మాట్లాడినప్పటికీ ఆ సమయంలో చాలా నొప్పిగా ఉందని తేజ్ వైద్యులకు చెప్పారట. దీంతో తను మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న తేజ్ దగ్గరకు ఆయన కుటుంబ సభ్యులను కూడా అనుమతించడం లేదు అపోలో వైద్యులు. కాలర్ బోన్ ఫ్రాక్చర్.. తొందరగానే నయమవుతుంది సాయిధరమ్తేజ్కు మొట్టమొదటిగా వైద్యం చేసిన డాక్టర్ సతీష్ కుమార్ సాక్షి టీవీతో మాట్లాడుతూ.. సాయి తేజ్ను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు స్పృహలో లేరని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత ఫిట్స్ వచ్చాయని, అందుకే చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నారని పేర్కొన్నారు. ఎక్కువగా రక్తస్రావం కాకపోవడం వల్ల ఎదుటి వ్యక్తిని గుర్తుపట్టే స్థితిలోనే ఉన్నారన్నారు. ఆయనకు కంటి మీద గాయం కాలేదని, అది చిన్న స్క్రాచ్ మాత్రమేనని చెప్పారు. చేతితో పాటు, ఛాతీ, కాళ్ల మీద చిన్నచిన్న గాయాలయ్యాయని పేర్కొన్నారు. అలాగే కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యిందని, అయితే ఇది పెద్ద సమస్యేమీ కాదని, తొందరగానే నయమవుతందని చెప్పుకొచ్చారు. -
వర్క్ ఫ్రమ్ హోం: ‘ఏయ్.. వీడియోలోకి రా’
Work From Home Sexual Harassment: పనిచేసే చోట లైంగిక వేధింపులు.. చర్చల్లో నడిచే ఒక ప్రధాన అంశం. అయితే కరోనా కారణంగా ఈ ఫిర్యాదులు బాగా తగ్గాయి. అది ‘వర్క్ ఫ్రమ్ హోం’ కారణంగానే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రిమోట్ వర్క్ స్పేస్లోనూ లైంగిక వేధింపులు ఆగట్లేదని ఎంప్లాయిస్ వాపోతున్నారు. యాంటీ-సెక్సువల్ హరాస్మెంట్ అడ్వైజరీ ‘కంప్లైకరో డాట్ కామ్’ ఈ ఏడాదికి నిర్వహించిన సర్వేలో.. వార్షిక నివేదిక ద్వారా ఈ విషయం వెల్లడైంది. భారత్లో ఉన్న టాప్ 44 కంపెనీలలో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న ఎంప్లాయిస్ నుంచి లైంగిక వేధింపులపై ఫిర్యాదులు సేకరించింది కంప్లైకరో డాట్ కామ్. కిందటి ఏడాదితో పోలిస్తే తక్కువ ఫిర్యాదులు(రెండొందలకు పైగా తక్కువ) రాగా.. లైంగిక వేధింపుల కేసుల శాతం 38.26 శాతానికి పడిపోయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఇది గత రెండేళ్లతో పోలిస్తే చాలా తక్కువ. అయితే రిమోట్ వర్క్లోనూ ఎంప్లాయిస్ తాము ఎదుర్కొంటున్న వేధింపులను చర్చకు తీసుకురావడం విశేషం. సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ప్లేస్ యాక్ట్ 2013 ప్రకారం.. ప్రతీ ఏడాది లిస్టెడ్ కంపెనీలు తప్పనిసరిగా లైంగిక వేధింపుల ఫిర్యాదుల్ని నమోదు చేయడం, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి ప్రభుత్వాలకు నివేదికల్ని సమర్పించాల్సిందే. వేళకానీ వేళలో.. సర్వేలోనే సుమారు ఐదు వందల దాకా ఫిర్యాదు అందాయి. ఇవిగాక కొందరు సర్వే పోర్టల్కు పర్సనల్ మేసేజ్ల ద్వారా, మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ అభద్రత భావాన్ని వ్యక్తపరిచారు. ఈ క్రమంలో కొలీగ్స్, టీమ్ మేట్స్, టీమ్ లీడ్స్తో పాటు మేనేజర్, బాస్ స్థాయి వ్యక్తులపై సైతం ఫిర్యాదులు రావడం విశేషం. విపరీతమైన వర్క్ టాస్క్లు ఇస్తున్నారని, అవి తప్పించాలంటే తమతో సన్నిహితంగా ఉండాలంటూ ఒత్తిడి చేస్తున్నారని కొందరు వాపోయారు. ఇంకొందరు వేళకానీ వేళలో ఆన్లైన్కి, వీడియో కాల్స్కి రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, ‘అనవసరమైన-వ్యక్తిగత’ చర్చలతో ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఇదంతా తమ మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపెడుతోందని వాపోయారు వాళ్లు. దీంతో నాలుగు గోడల మధ్య వర్చువల్గా జరుగుతున్న వేధింపుల వ్యవహారం ఇప్పుడు చర్చకు దారితీసింది. టార్గెట్ ఎంప్లాయిస్ కరోనా కారణంగా.. వర్క్ ఫ్రమ్ హోంకి ఎంప్లాయిస్కు అనుమతిస్తున్న కంపెనీల్లో చాలావరకు హైక్ల సంగతి పక్కనపెట్టి, ఉద్యోగాల విషయంలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి ఎంప్లాయిస్తో పని చేయించుకుంటున్నాయి. టార్గెట్లను ఫినిష్ చేయడానికి సాధారణ పని గంటల కంటే అదనంగా (మరో నాలుగైదు గంటలు) పని చేయాల్సి వస్తోందని చాలామంది వాపోతున్నారు కూడా. అయినప్పటికీ వైరస్ భయం, ఇతరత్ర కారణాలతో వర్క్ ఫ్రమ్ హోంకే మొగ్గు చూపిస్తున్నారు. ఈ తరుణంలో ఆఫీస్ స్పేస్లలో వేధింపులు తగ్గినప్పటికీ.. వర్క్ఫ్రమ్ హోంలోనూ వర్చువల్ మీటింగ్ల పేరుతో కొందరు ఉద్యోగిణులు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల్ని ఈ సర్వేలో ప్రస్తావనకు తెచ్చారు. చదవండి: వర్క్ఫ్రమ్ హోం.. కంపెనీల అనూహ్య నిర్ణయం -
భర్తకు వీడియో కాల్ చేసి భార్య ఆత్మహత్య
సాక్షి, రాజేంద్రనగర్: ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భర్తకు వీడియో కాల్ చేసి భార్య ఉరివేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండ ప్రాంతానికి చెందిన సాయిశివ(28), రాజమండ్రికి చెందిన నాగదేవి(24) ప్రేమించుకున్నారు. 8 నెలల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. సాయిశివ బెంగళూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా నాగదేవి బ్యూటీషియన్. ఇరువురు హైదర్గూడ చైతన్య విలాస్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు. సాయిశివ వారానికి రెండు రోజులు ఇక్కడే ఉండి అయిదు రోజులు బెంగళూర్లో విధులు నిర్వహించే వాడు. అతడి కుటుంబం ఎల్బీనగర్ ప్రాంతంలో నివసిస్తోంది. సోదరి వివాహం ఉండటంతో అతడు మూడు రోజుల క్రితం నగరానికి వచ్చాడు. ఎల్బీనగర్లో పెళ్లి పనులు చూసుకుంటున్నాడు. మంగళవారం రాత్రి నాగదేవి వీడియో కాల్ చేసి వెంటనే ఇంటికి రావాలని అతడిని కోరింది. వివాహం అనంతరం వస్తానని తెలపడంతో ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వీడియో కాల్లోనే ఉరి వేసుకుంటున్నానంటూ నాగదేవి తెలిపింది. అపార్ట్మెంట్ పక్కన ఉండే వారికి సాయిశివ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వాచ్మెన్ సాయంతో తలుపులను బద్దలు కొట్టి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది. ఘటన స్థలానికి చేరుకున్న సాయిశివ రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందజేశాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం: ఏడుగురి రిమాండ్ రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ దంపతుల మృతి -
ప్రపంచవ్యాప్తంగా జూమ్ యాప్ డౌన్
కరోనా మహమ్మారి భాగ పాపులర్ అయిన ప్రముఖ వీడియో-కాన్ఫరెన్సింగ్ జూమ్ యాప్ సర్వర్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా షట్ డౌన్ అయ్యింది. ఆస్ట్రేలియాలో వినియోగదారులు ఎక్కువగా ఈ సమస్యలను ఎదుర్కొన్నారు. కొద్ది సమయం తర్వాత ఆస్ట్రేలియాలో ఏర్పడిన సమస్యను పరిష్కరించినట్లు సంస్థ తెలిపింది. తాజాగా భారతదేశంలో కూడా సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. భారతీయ జూమ్ వినియోగదారులు వీడియో మీటింగ్స్ యాప్ లో వచ్చిన సమస్యల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ ప్రకారం.. జూమ్ యాప్ మధ్యాహ్నం 1 గంటల నుంచి భారతదేశంలో సమస్యలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 600 మందికి పైగా వినియోగదారులు జూమ్ వెబ్ సైట్ లో తమ సమస్యలను నివేదించారు. చాలా మంది వినియోగదారులు తమ సమస్య గురుంచి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్, ట్విట్టర్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఒకవేళ మీరు కనుక ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సర్వర్లో ఏర్పడిన సమస్యను పరిష్కరించే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. డౌన్ డిటెక్టర్ నివేదిక ప్రకారం.. 48 శాతం వినియోగదారులు ఈ సమస్యలను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. 30 శాతం మంది వినియోగదారులు వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించలేకపోయారు. ఈ సమస్య భారతదేశం, ఆస్ట్రేలియా దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఈ సమస్య ఏర్పడింది. తాత్కాలికంగా గూగుల్ మీట్ మరో యాప్ లను వాడుకోవచ్చు.(చదవండి: మారుతి సుజుకిపై భారీ జరిమానా విధించిన సీసీఐ) -
విద్యార్థుల కోసం జూమ్ సరికొత్త ఫీచర్!
Zoom Focus Mode Feature: కరోనా మహమ్మరి కారణంగా ఆన్లైన్ వినియోగం రోజు రోజుకి భారీగా పెరిగిపోతుంది. ప్రస్తుతం పరిస్థితులలో వీడియో కాలింగ్ యాప్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. విద్యార్థుల పాఠ్యాంశాల నుంచి ఉద్యోగుల బోర్డు సమావేశాల వరకు అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. దీంతో జూమ్, గూగుల్ మీట్ వంటి వీడియో కాలింగ్ యాప్లు వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వినియోగదారుల కోసం ఈ యాప్లు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ను తీసుకొస్తున్నాయి. తాజాగా జూమ్ యాప్ విద్యార్థులకు కోసం మరో కొత్త ఫీచర్ను పరిచయం చేసింది. ‘ఫోకస్ మోడ్’ అనే పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ వల్ల విద్యార్థులు శ్రద్ధగా ఆన్లైన్ క్లాసులు వినడమే కాకుండా తోటి విద్యార్థుల ఏకాగ్రతకు ఎటువంటి భంగం కలగకుండా సహాయపడనున్నట్లు జూమ్ పేర్కొంది. ఈ ఫీచర్ యాక్టివేట్ చేస్తే విద్యార్థి కేవలం టీచర్ / హోస్ట్ ని మాత్రమే చూడగలడు. ఆ విధ౦గా ఒక ఉపాధ్యాయుడు భోదించే సమయ౦లో తన అనుమతి లేకుండా విద్యార్థులు షేర్ చేసే వీడియోలు, స్క్రీన్ షేర్లను ఇది కనిపించకుండా చేస్తుంది. టీచర్స్ కూడా తమ విద్యార్థులు ఏం చేస్తున్నారని, ఎలాంటి అంశాలు షేర్ చేస్తున్నారనేది చూడవచ్చు. అలాగే, టీచర్/హోస్ట్ ఫోకస్ మోడ్ డిసేబుల్ చేస్తేనే విద్యార్థులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇది జూమ్ డెస్క్ టాప్ క్లయింట్లకు మాత్రమే లభ్యం అవుతున్నట్లు తెలుస్తుంది. కుటుంబ సమావేశాలు, చిన్న వ్యాపార సమావేశాలు, ఇతర సమావేశలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ కొద్ది మందికి మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
జియో కస్టమర్లకు గుడ్న్యూస్..!
జియో తన కస్టమర్లకు తీపికబురును అందించింది. జియో ఫైబర్ వినియోగదారులు ఇప్పుడు ఏలాంటి వెబ్కెమెరా లేకుండా టీవీల్లో వీడియో కాలింగ్ చేసే సదుపాయాన్ని జియో తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. 'కెమెరా ఆన్ మొబైల్' అనే కొత్త ఫీచర్తో యూజర్లు తమ టీవీల్లో వీడియో కాలింగ్ ఆప్షన్ను పొందవచ్చును. అందుకోసం జియోజాయిన్ అనే యాప్ను యూజర్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గత కొన్ని నెలలుగా 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్ను జియో పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. జియోఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను వినియోగించుకునే కస్టమర్లకు జియోఫైబర్వాయిస్తో వీడియోకాలింగ్ ఆప్షన్ను ఎనెబుల్ చేయవచ్చును. కస్టమర్లు తమ మొబైల్లోని జియోజాయిన్ యాప్ ద్వారా ల్యాండ్లైన్ నంబర్లకు కూడా వాయిస్కాల్స్ చేసుకోవచ్చును. మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా యూజర్లు తమ టీవీలో వీడియో కాల్ చేయడానికి ముందుగా పది అంకెల జియో ఫైబర్ నంబర్ను జియోజాయిన్ యాప్లో నమోదు చేయాలి. జియోఫైబర్ నంబర్ను నమోదు చేసిన తర్వాత, జియో జాయిన్ యాప్ సెట్టింగ్లలో 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్తో వీడియోకాల్స్ చేసుకోవచ్చును. స్పష్టమైన వీడియో కాలింగ్ సేవల కోసం జియోఫైబర్ మోడమ్ను 5GHz Wi-Fi బ్యాండ్కి మార్చాల్సి ఉంటుంది. 2.4GHz బ్యాండ్లో కూడా వీడియో కాలింగ్ ఫీచర్ను పొందవచ్చును, కానీ వీడియో కాలింగ్లో కొంత అస్పష్టత ఉండవచ్చును. -
ఒకే సారి 1000 మంది వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు
టెక్ ప్రపంచంలో యూజర్లను ఆకట్టుకోవడంతో పాటు వారిని సొంతం చేసుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ సంస్థలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.తాజాగా టెలిగ్రామ్ కొత్త అప్డేట్ తెచ్చింది. ఈ అప్డేట్తో యూజర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో షేరింగ్ ఇటీవల కొత్త ప్రైవసీ పాలసీ కారణంగా యూజర్లు వాట్సాప్కు దూరం అవుతున్నారు. అదే సమయంలో ప్రత్యామ్నయంగా టెలిగ్రామ్ యాప్ను వినియోగించుకునేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో టెలిగ్రాం వాట్సాప్తో పోటీ పడడంతో పాటు యూజర్లను ఆకట్టుకునేలా కొత్త కొత్త అప్డేట్లతో దూసుకుపోతుంది. తాజాగా ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో పాటు వీడియోలను షేర్ చేసేలా ఫీచర్ ను అప్డేట్ చేసింది. యూజర్లందరు ఒకే సారి గ్రూప్కాల్ లో యాడ్ అయ్యే వరకు పరిమితిని పెంచుతూనే ఉండాలని టెలిగ్రామ్ తెలిపింది.1000 మంది వీడియో కాల్ మాట్లాడుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఈ ఫీచర్ వల్ల ఆన్లైన్ క్లాసులు, మీటింగ్స్లో పాల్గొనే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీడియో ఫీచర్ టెలిగ్రామ్ తన వీడియో షేరింగ్ ఫీచర్ని అప్డేట్ చేసింది. మీరు మీ చాట్ బాక్స్లోని రికార్డింగ్ బటన్ని ట్యాప్ చేస్తే వీడియో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డైన వీడియోలను మీ స్నేహితులకు షేర్ చేసుకోవచ్చు. -
వీడియో కాల్తో భార్యను ‘రొంపి’లోకి దించేందుకు భర్త యత్నం
పురుషులు మహిళలను ఇంకా ఆట వస్తువుగానే భావిస్తున్నారు. ఆమెను అడ్డంగా పెట్టుకుని అప్పనంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనలు వికృత రూపాలకు దారి తీస్తోంది. డబ్బుపై ఆశతో అబలను పాడు వృత్తిలోకి దింపుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా ఓ వ్యక్తి తన భార్యను ఆ వృత్తిలోకి దింపేందుకు ప్రయత్నించాడు. భార్య నిద్రిస్తుండగా ఆమెను వీడియో కాల్లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఆమె శరీరంపై వికృత చేష్టలు చేస్తూ అవతలి వారికి వీడియో కాల్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న భార్య పోలీసులను ఆశ్రయించింది. అలా చేసిన వ్యక్తి ఓ వైద్యుడు. పైగా ముంబైలోని ఓ స్టార్ హోటల్ యజమాని పుత్రరత్నం. ముంబై: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ ఫిజియోథెరపిస్టు 2014లో ఓ యువతి (28)ని వివాహం చేసుకున్నాడు. అతడు ముంబైలోని ఓ స్టార్ హోటల్ యజమాని కుమారుడు. వీరికి ఏడేళ్లయినా ఇంతవరకు సంతానం కలగలేదు. దీంతో అత్తింటి వారు వేధించడం మొదలుపెట్టారు. అయితే భర్తకు అశ్లీల వీడియోలు చూడడం బాగా అలవాటు. వాటికి బానిసగా మారాడు. ఇక పిల్లలు పుట్టడం లేదుగా నువ్వు పోర్న్ స్టార్ అయితే డబ్బులు బాగా సంపాదించొచ్చు అని భార్యకు చెప్పాడు. ఆ వృత్తిలోకి దింపేందుకు ఆమెపై తీవ్రంగా ఒత్తిడి తీసుకు వస్తున్నాడు. అయితే భార్య ససేమిరా అటోంది. దీనిపై కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భర్త ఇలా అయితే కాదని జూన్ నెలలో ఒకరోజు భార్య నిద్రిస్తుండగా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశాడు. ఓ వ్యక్తికి తన భార్యను చూపించేందుకు ప్రయత్నం చేశాడు. ఆమె నిద్రిస్తుండగా ప్రైవేటు పార్ట్స్లో వికృత చేష్టలు చేస్తూ అవతలి వ్యక్తికి లైవ్లో చూపిస్తున్నాడు. వెంటనే తేరుకున్న ఆమె భర్త చేసిన పనికి హతాశయురాలైంది. ఈ విషయం అత్తామామలకు చెప్పగా వారు కుమారుడిని వెనకేసుకొచ్చారు. ఆమె పుట్టింటికి చేరింది. మతాచారం ప్రకారం విడాకులు తీసుకో అని అత్తింటి వారు చెప్పగా ఆమె తిరస్కరించింది. ‘భారతదేశంలో ఉన్నాం.. చట్టపరంగా విడాకులు తీసుకుంటా’ అని ప్రకటించి పోలీసులను ఆశ్రయించింది. ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి గజనాన్ కబ్డులే తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. అతడు వినియోగించిన ఫోన్ను సీజ్ చేశాం’ అని వివరించారు. -
చనిపోతున్నానంటూ తమ్ముడికి వీడియో కాల్.. ట్విస్ట్ ఏంటంటే..
సాక్షి, మహదేవపూర్(వరంగల్): బతుకుమీద విరక్తి చెందిన వ్యక్తి తన తమ్ముడికి వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నానంటూ చెప్పి అదృశ్యమైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన వావిలాల రాజేందర్కు మహారాష్ట్రకు చెందిన యువతితో వివాహం జరిగింది. రెండేళ్లుగా రాజేందర్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం అతను తన తమ్ముడికి, స్నేహితులకు వీడియో కాల్ చేసి తాను బతకను.. చనిపోతానని చెబుతూ కాల్ కట్ చేశాడు. దీంతో రాజేందర్ భార్య ఆర్తి మహదేవపూర్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై రాజ్కుమార్ గాలింపు చర్యలు చేపట్టి ఆచూకీ కనుగొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ప్రాణం తీసిన వీడియో కాల్
సాక్షి, హైదరాబాద్: సెల్ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ రెండో అంతస్తు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండలో చోటుచేసుకుంది. మణికొండలో నివసించే తాళ్లూరి శ్యామ్యూల్ సుజిత్ (32) ప్రైవేటు ఉద్యోగి. శనివారం ఉదయం తన సోదరుడితో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. రెండో అంతస్తులోని బాల్కనీలో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు సుజిత్ జారిపడ్డాడు. వెంటనే స్పందించిన పక్కింటివారు సుజిత్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన సుజిత్ను కుటుంబసభ్యులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సుజిత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి సోదరుడు సుశీల్ బాగ్యరాజ్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
ఒకానొక సమయంలో దివాళా తీయాల్సిన పరిస్థితి: కబీర్ బేడి
న్యూఢిల్లీ: జీవితంలో అనుకోని విజయాలు, అంతలోనే పతనాలు ఇలా ఎన్నో చూశానంటున్నాడు బాలీవుడ్ ప్రముఖ నటుడు కబీర్ బేడి. ఇటీవల ఆయన రాసిన పుస్తకం ‘స్టోరీస్ ఐ మస్ట్ టెల్: ది ఎమోషనల్ లైఫ్ ఆఫ్ యాన్ యాక్టర్’ కు మంచి గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆయన తన మనవరాలు ఆలయతో లైవ్ వీడియో చాట్లో ముచ్చటించారు. కబీర్ రాసిన పుస్తకం మార్కెట్లో అత్యధిక కాపీలు అమ్ముడై బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఆయన తన మనవరాలు అలయతో చాలా సేపు సంభాషించారు. అందులో కబీర్.. తన జీవితంలో చవిచూసిన ఎత్తు పల్లాలు, వివిధ సంబంధాలు, వివాహం, విడాకులు, మానసిక ఆరోగ్యం లాంటి అంశాలను పంచుకున్నారు. కబీర్ రాసిన పుస్తకం తన స్నేహితులు చదివారని, వారికి ఎంతగానో నచ్చిందని ఆలయ తెలిపింది. ఒకానొక సమయంలో దివాలా తీయాల్సి వచ్చింది నా జీవితంలో ఊహించని విజయాలు, అనుకోని పతనాలను చూడాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో దివాలా తీయాల్సి వచ్చింది. కాని అంతలా జీవితంలో కిందకు పడ్డా వాటి నుంచి లేచాను. లైఫ్లో ఫెయిల్యూర్ కావడం సహజమే, కాని ఎదగాలన్న ఆశ వదులుకోవద్దు. నా వైఫల్యాల నుంచి గుణపాఠాలను నేర్చుకున్నాను అలాగే ఇతరులు కూడా చేస్తారని ఆశిస్తున్నానని ఆయన అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. కబీర పుస్తకానికి స్పందన రోజు రోజు పెరుగుతుండడంతో ఆయన తన పుస్తకాన్ని ఇటలీలో అతిపెద్ద ప్రచురణకర్త అయిన మొండడోరితో సెప్టెంబర్లో ఇటలీలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by ALAYA F (@alayaf) చదవండి: తాప్సీపై కంగనా ఫైర్.. తన పేరు వాడొద్దంటూ చురకలు -
Covid: హృదయ విదారకం.. అమ్మా లేమ్మా అంటూ
దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకీ కొత్త కరోనా మరణాలు నమోదవుతుంటే బాధితుల్ని రక్షించేందుకు ప్రభుత్వాలు, ఫ్రంట్ లైన్ వారియర్స్ అహర్నిశలు కృషి చేస్తున్నాయి. బాధితులకు చికిత్స ఇవ్వడమే కాకుండా, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని నింపుతున్నాయి. అయితే కరోనా మరణాలు మాత్రం తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా ఓ ఆస్పత్రి కోవిడ్ వార్డ్ లో తల్లి కొడుకుల మధ్య జరిగిన ఓ సంఘటన నెటిజన్లని కంటతడి పెట్టిస్తోంది. డాక్టర్ దీప్షికా ఘోష్ ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా భావోద్వేగానికి లోనయ్యాను. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి’ అని కామెంట్ జతచేశారు. ఆమె ఈ ఆస్పత్రిలోని కోవిడ్ వార్డ్లో సేవలు అందిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా దీప్షికాకు ఓ యువకుడు కాల్ చేశాడు. మేడం ప్లీజ్ నేను మా అమ్మతో మాట్లాడాలి. నేను వీడియో కాల్ మాట్లాడేదాకా వెయిట్ చేయరా ? అని రిక్వెస్ట్ చేశాడు. అయితే కోవిడ్ వార్డ్లో ప్రాణా పాయస్థితిలో తల్లితో మాట్లాడేందుకు వీడియో కాల్ చేసిన అతను తల్లి వైపు చూస్తూ 'తేరా ముజ్సే హై పెహ్లే కా నాటా కోయి' అంటూ 1973లో విడుదలైన ‘ఆ గేల్ లాగ్ జా’ సినిమా పాట పాడి తల్లిని ఓదార్చేందుకు ప్రయత్నించాడు. కోవిడ్తో బాధపడుతున్న తన తల్లికి ‘అమ్మా లేమ్మా..’ అని ధైర్యం చెప్పాడు. అతను పాటపాడుతుండగా వార్డ్లో సేవలు అందిస్తున్న నర్స్లు కొన్ని నిమిషాలపాటు వారికి ఇబ్బంది కలగకుండా అలా నిల్చుండిపోయారు. బెడ్మీద ఉన్న బాధితురాలు వీడియోకాల్లో అతన్ని చూడడంతో.. తన తల్లి ఆరోగ్యంగానే ఉందని పాడడం ఆపేశాడు. తన తల్లితో మాట్లాడినందుకు డాక్టర్లకు, నర్స్లకు కృతజ్ఞతలు చెప్పాడు. ఈ వీడియో కాల్ చేసిన ఆ యువకున్ని అభినందిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘తన తల్లి పట్ల అతనికి ఉన్న ప్రేమ చాలా గొప్పది’ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Today, towards the end of my shift, I video called the relatives of a patient who is not going to make it. We usually do that in my hospital if it’s something they want. This patient’s son asked for a few minutes of my time. He then sang a song for his dying mother. — Doctor (@DipshikhaGhosh) May 12, 2021 చదవండి: పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్కు డీసీజీఐ ఆమోద -
కొత్త ప్రైవసీ పాలసీకి అంగీకరించకపోతే... పరిమిత సేవలే: వాట్సాప్
న్యూఢిల్లీ: కొత్త ప్రైవసీ నిబంధనలు అంగీకరించేలా వాట్సాప్ ఒత్తిడి పెంచుతోంది. ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని మాతృసంస్థ ‘ఫేస్బుక్’తో పంచుకునేందుకు వీలు కల్పించేలా వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలకు అంగీకరించకపోతే ఇప్పటికిప్పుడు ఖాతాను తొలగించకున్నా.. వినియోగదారులు పొందే సేవలు పరిమితం చేస్తామని వాట్సాప్ తాజాగా ప్రకటించింది. కొద్ది వారాల తర్వాత వినియోగదారులు తమ చాట్ లిస్టును చూడలేరని, ఆపై వాట్సాప్లో ఫోన్ కాల్స్ను, వీడియో కాల్స్ను అందుకోలేరని స్పష్టం చేసింది. కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించడానికి మే 15వ తేదీని గడువుగా విధించిన వాట్సాప్... అలా చేయని ఖాతాదారుల తక్షణం వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని, అకౌంట్ను తొలగించడం, సేవలకు అంతరాయం కలిగించడం చేయబోమని శుక్రవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇంతలోనే తమ వెబ్సైట్లో అసలు విషయాన్ని బయటపెట్టింది. కొత్త ప్రైవసీ పాలసీలోని నియమనిబంధనలను అంగీకరించాలని వినియోగదారులకు కొద్దివారాల పాటు రిమైండర్లు (గుర్తుచేసే సందేశాలు) పంపుతామని, అప్పటికీ ఒప్పుకోని వారికి నిరంతరం సందేశాలు వెల్లువెత్తుతాయని వాట్సాప్ స్పష్టం చేసింది. అయితే వినియోగదారులకు ఎన్నివారాల గడువు ఇస్తున్నదీ స్పష్టం చేయలేదు. రిమైండర్ల తర్వాత కూడా స్పందించకపోతే వారు అందుకునే సేవలను పరిమితం చేస్తామని తెలిపింది. ఇలా కొద్దివారాల పరిమిత సేవల తర్వాత కూడా కొత్త ప్రైవసీ పాలసీని ఆమోదించని వారికి ఇన్కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్, మెసేజ్లు నిలిపివేస్తామని వాట్సాప్ ప్రకటించింది. ఖాతాలను తొలగించబోమని చెబుతూనే... వాట్సాప్ను కొంతకాలం వాడని వినియోగదారుల విషయంలో తాము అనుసరించే విధానాన్ని ఎత్తిచూపింది. ఎవరైనా వాట్సాప్ను 120 రోజులు వినియోగించకపోతే... సదరు ఖాతాను వాట్సాప్ తొలగిస్తుంది. అంటే... ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే కొద్దివారాల తర్వాత మన ఫోన్లో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. ఆపై సదరు ఖాతా ఇన్యాక్టివ్గా మారిపోతుంది. 120 రోజుల తర్వాత దీన్ని తొలగిస్తారన్న మాట. -
జూమ్ లో అదిరిపోయే కొత్త ఫీచర్
జూమ్ ఇమ్మర్సివ్ వ్యూ అని పేరుతో అదిరిపోయే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. గతంలో జూమ్ నుంచి వీడియో కాల్ చేసినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటే అలా కనబడేది. ఇప్పుడు జూమ్ తీసుకొచ్చిన ఇమ్మర్సివ్ వ్యూ అనే ఫీచర్ సహాయంతో ఉద్యోగులు అయితే నిజంగానే మనం ఆఫీసులో ఉన్నమా?, విద్యార్థులు అయితే పాఠశాలలో ఉన్నమా? అనే అనుభూతి కలుగుతుంది. జూమ్ గత సంవత్సరం తన జూమ్ టోపియా పేరుతో ఈ ఫీచర్ను ప్రకటించింది. జూమ్ ఇమ్మర్సివ్ వ్యూ పేరుతో నిర్వహించే సమావేశంలో 25 మందికి మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ విదేశాల్లో ఉన్న ఉచిత, ప్రో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్ను ఎంచుకుంటే ఒక గదిలో ఐదారు స్థానాలు కనిపిస్తాయి. అందులో టేబుల్ దగ్గర(పైన ఒకటో ఫొటోలో ఉన్నట్లు) సమావేశంలో కూర్చున్నట్లుగా అడ్జెస్ట్ చేయవచ్చు. అవసరమైతే బ్యాగ్రౌండ్ను కూడా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. అయితే దీనిలో ఎటువంటి మార్పులు చేయాలన్న కేవలం హోస్ట్కు మాత్రమే అవకాశం ఉంటుంది. త్వరలో మన దేశంలోనూ అందుబాటులోకి తీసుకొనిరనున్నారు. ఈ ఫీచర్ ప్రస్తుతానికి జూమ్ డెస్క్ టాప్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే దీనికి పోటీగా ఇదే తరహా ఫీచర్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ‘టుగెదర్ మోడ్’ పేరుతో అందుబాటులో ఉంది. చదవండి: టెకీలకు ఊరట: వేతనంతో కూడిన సెలవులు -
తప్పులో కాలేసిన టెలీకాలర్, కట్చేస్తే న్యూడ్ వీడియో కాల్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఓ సంస్థలో టెలీకాలర్గా పని చేస్తున్న యువతి చేసిన చిన్న పొరపాటు ఆమెకే శాపంగా మారింది. తన విధులకు సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి వేధింపులు పాలైంది. వేళగాని వేళల్లో ఫోన్లు, సందేశాలతో పాటు న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. ఉత్తర మండల పరిధిలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతి ఓ ప్రైవేట్ సంస్థలో టెలీకాలర్గా పని చేస్తోంది. వృత్తిలో భాగంగా నిత్యం అనేక మందితో సంస్థ ఫోన్ నుంచి కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అయితే టెలీకాలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ క్లైంట్స్కు వ్యక్తిగత ఫోన్ నెంబర్లు, వివరాలు అందించకూడదనేది ప్రాథమిక సూత్రం. ఓ సందర్భంలో ఈ యువతి ఛత్రినాక ప్రాంతానికి చెందిన చంద్రవేగ్కు ఫోన్ చేసి తమ సంస్థ వ్యాపారం విషయం మాట్లాడింది. ఆ సంస్థకు కస్టమర్గా మారే విషయాన్ని తాను పరిశీలిస్తానంటూ చెప్పిన చంద్రవేగ్ కాస్త సమయం కావాలన్నాడు. సమాధానం చెప్పడం కోసం సంప్రదించడానికంటూ ఆమె వ్యక్తిగత ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ప్రైవేట్ ఉద్యోగి అయిన ఇతగాడు అప్పటి నుంచి ఆమెను రకరకాలుగా వేధించడం మొదలెట్టాడు. అర్ధరాత్రి వేళల్లో ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో విచక్షణ కోల్పోయిన ఇతగాడు బాధితురాలికి న్యూడ్ వీడియో కాల్స్ చేయడం మొదలెట్టాడు. విసిగివేశారిన బాధితురాలు ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు చంద్రవేగ్ నిందితుడిగా గుర్తించారు. గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
యువకుడి నగ్న వీడియోలు రికార్డు చేసి..
హుబ్లీ/కర్ణాటక: ఓ యువతి నగరానికి చెందిన వ్యక్తికి ఊహించని షాకిచ్చింది. వాట్సప్ వీడియో కాల్ చేసి అతడి అశ్లీల వీడియోను రికార్డ్ చేసి డబ్బు డిమాండ్ చేసింది. వివరాలు.. ఫేస్బుక్లో ఓ యువతి స్థానిక వ్యక్తిని పరిచయం చేసుకుంది. తరచుగా చాట్చేస్తూ సాన్నిహిత్యం పెంచుకుంది. ఈ క్రమంలో, ఈ నెల 13 నుంచి 16వ తేదీ మధ్యలో అతడికి వాట్సప్ వీడియో కాల్స్ చేసింది. అతడు నగ్నంగా ఉన్న సమయంలో వీడియోను రికార్డ్ చేసి దానిని సదరు వ్యక్తికి పంపి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. అడిగినంత డబ్బు పంపకపోతే సోషల్ మీడియాలో సదరు వీడియోను అప్లోడ్ చేసి పరువుకు భంగం కల్గిస్తానని బెదిరించింది. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. చదవండి: రాసలీలల కేసు: ఢిల్లీ నుంచి వీడియో అప్లోడ్ -
'నేను చనిపోతున్నా.. పిల్లల్ని బాగా చూసుకో'
సాక్షి,కోదాడ: భార్యకు వీడియో కాల్ చేసి ఓ వ్యక్తి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలోని సాయిబాబా థియేటర్ బజార్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన రుంజా అశోక్(32) టాటాఏస్ వాహనం డ్రైవర్గా పని చేస్తుంటాడు. లాక్డౌన్ కారణంగా పనిదొరక్క పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్యది కాపుగల్లు కావడంతో ఏదైనా పని చేసుకుందామని నెలరోజుల కిందట కోదాడ పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. పని లేకపోవడం.. తాగుడుకు అలవాటుపడిన అశోక్ భార్య పిల్లలను పుట్టింటికి పంపించాడు. శుక్రవారం రాత్రి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని పిల్లలను మంచిగా చూసుకో అని భార్యకు వీడియో కాల్ చేసి చెప్పాడు. వెంటనే వారు కోదాడకు వచ్చి చూసేవరకు అప్పటికే అశోక్ మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి దావిద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ సైదా తెలిపారు. -
నగ్నంగా కవ్వించి...ఆపై రికార్డు చేసి
సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకుని ఆ తర్వాత వాట్సాప్ ద్వారా నగ్నంగా వీడియో కాల్ చేసి కవ్వించి తనను కూడా రెచ్చ గొట్టి నగ్నంగా ఉన్న దృశ్యాలను రికార్డు చేసిన ఓ యువతి రూ.2 లక్షల వరకు వసూలు చేసిందని మలక్పేటకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం...మలక్పేట్కు చెందిన వ్యక్తికి ఫేస్బుక్లో రాజస్థాన్కు చెందిన ఓ యువతి ఇటీవల ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత మెసేంజర్లో నాలుగు రోజులు చాట్ చేసిన అనంతరం వాట్సాప్ నంబర్ అడిగితే ఇచ్చాడు. ఆ తర్వాత మూడు రోజులు వాట్సాప్కాల్లో మాట్లాడిన సదరు యువతి ఓ రోజు నగ్నంగా వీడియోకాల్ చేసింది. బాధితుడిని కూడా నగ్నంగా ఉంటే చూడాలని ఉందని కవ్వించి ఆ దృశ్యాలను స్క్రీన్ రికార్డు చేసింది. ఆ తర్వాత యూట్యూబ్లో సేవ్ చేసిన ఆ వీడియో లింక్ను బాధితుడి వాట్సాప్ నంబర్కు పంపింది. దీంతో బాధితుడు ఆమెకు ఫోన్ చేయగా రూ.50వేలు ఇస్తే తొలగిస్తానని చెప్పడంతో నగదు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నట్లుగా గుర్తు తెలియని మహిళ ఫోన్ చేసి ఓ యువతి మీ పైనా ఫిర్యాదు చేసిందని, నగ్నంగా ఉన్న ఆమె వీడియోను అడ్డుపెట్టుకొని వేధిస్తున్నారని, మీపైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించింది. దీంతో భయపడిన బాధితుడు వారు అడిగినట్లు రూ.1.5 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసి కేసు నమోదు కాకుండా చూడాలని కోరాడు. ఆ తర్వాత కూడా ఆ యువతి నుంచి మళ్లీ వేధింపుల కాల్స్ వస్తుండడంతో హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
డెస్క్ టాప్లోనూ వాయిస్, వీడియో కాల్స్
వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ తన వినియోగదారుల ఆకట్టుకోవడానికి మరో కొత్త ఫీచర్ తీసుకు వచ్చింది. వాయిస్, వీడియో కాల్స్ సౌకర్యాన్ని డెస్క్ టాప్ యాప్నకూ కలిపించినట్టు వాట్సాప్ గురువారం ప్రకటించింది. ఈ సౌకర్యాన్ని పొందాలంటే డెస్క్ టాప్/ల్యాప్ ట్యాప్తో పాటు మొబైల్ కూడా ఇంటర్నెట్తో అనుసంధానమై ఉండాలి. కస్టమర్లకు నమ్మదగిన, అత్యంత నాణ్యమైన అనుభూతి కలిపిస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది. డెస్క్ టాప్ యాప్నకూ గ్రూప్ వాయిస్, వీడియో కాల్స్ను రానున్న రోజుల్లో అందుబాటులోకి తీసుకు రానున్నట్టు వివరించింది. ఏడాదిగా వాట్సాప్ కాల్స్ పెరుగుతున్నాయని, నూతన సంవత్సర వేడుక నాడు 140 కోట్ల వాయిస్, వీడియో కాల్స్ నమోదయ్యాయని వెల్లడించింది. చదవండి: భూమికి దగ్గరగా దూసుకెళ్లనున్న ఆస్టరాయిడ్ ఇండియా పోస్ట్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ -
కామారెడ్డి: అందాలు చూపించాలంటూ ప్రిన్సిపాల్ వేధింపులు
సాక్షి, నిజామాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. సొంత బిడ్డలుగా చూసుకోవాల్సిన విద్యార్థినిల పట్ల పైశాచికింగా ప్రవర్తించాడు. అమ్మాయిలకు వీడియో కాల్ చేసి అందాలు చూపించాలంటూ వేధించాడు. లాక్డౌన్ నుంచి సాగుతోన్న ఈ అరాచకం ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడంతో వెలుగులోకి వచ్చింది. దాంతో సదరు ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు. వివరాలు.. నల్లమడుగు తండాకు చెందిన రాము అనే విద్యార్థి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సదరు ప్రధానోపాధ్యాయుడు రాముకి టీసీ ఇచ్చాడు. మనస్తాపానికి గురైన రాము నిన్న తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో రాముని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు నిరసనగా గిరిజన విద్యార్థి సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో సదరు ప్రధానోపాధ్యాయుడి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్లు చెప్పాలని ప్రభుత్వ నిర్ణయించింది. దీన్ని అవకాశంగా చేసుకుని ప్రిన్సిపాల్ విద్యార్థినిలను వేధించేవాడు. ఆన్లైన్ క్లాస్ల కోసం విద్యార్థినిల ఫొన్ నంబర్లను సేకరించాడు. ఆ తర్వాత అమ్మాయిలకు వీడియో కాల్స్ చేస్తూ అందాలు చూపించాలని వేధించేవాడు. అంతేకాకుండా డాన్స్ క్లాస్ల పేరుతో కూడా విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిసింది. విద్యార్థినిలకు ఒక్కొక్కరికి విడిగా డాన్స్ నేర్పుతాను అంటూ గదిలోకి తీసుకు వెళ్లి వారిని వేధించాడని తెలిసింది. ప్రిన్సిపాల్ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రలు, విద్యార్థి సంఘం నాయకులతో కలిసి పాఠశాల బయట కూర్చొని నిరసన తెలిపారు. సదరు ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆన్లైన్ పాఠాల పేరుతో.. అశ్లీల చిత్రాలు.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ప్రిన్సిపాల్కు ఉరిశిక్ష -
చేనేతకు వీడియో ‘కాల్’
నిన్నటి వరకు.. గుట్టలుగా పట్టుచీరలు.. ఎలా అమ్ముకోవాలో తెలియదు.. బేరం వస్తే వచ్చినట్టు లేదంటే లేదు.. కొత్తగా ఏదైనా ఆలోచన చేయాలన్నా బయటి పరిస్థితులు, మార్కెట్పై అంతంతగానే అవగాహన.. ప్రత్యేకించి ఆన్లైన్పై అవగాహన లేక అమ్మకాల్లో వెనుకబాటు.. ఈ క్రమంలోనే నష్టాలు.. ఆపై బతుకు కష్టాలు.. ప్రస్తుతం.. అవసరం అన్నిటినీ నేర్పిస్తుంది. ఇప్పుడు భూదాన్పోచంపల్లి పట్టు చీరల వ్యాపారులు ‘ఆన్లైన్’ బాటపట్టారు. వీడియో కాల్లో డిజైన్ చూపించి అమ్మడం నేర్చుకున్నారు. మంచి డిజైన్లను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్చేసి ఆర్డర్లు రాబట్టుకుంటున్నారు. కరోనా కాలంలో అన్ని రంగాలు కుదేలైపోతే ఇక్కడి వ్యాపారులు మాత్రం ఆన్లైన్, సామాజిక మాధ్యమాల ద్వారా లక్షల విలువైన చేనేత వస్త్రాలను విక్రయించారు. సాక్షి, యాదాద్రి: ఆన్లైన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో భూదాన్ పోచంపల్లి పట్టుచీరల అమ్మకాలు ఊపం దుకున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ల ద్వారా వందలాది మంది యువ చేనేత కళాకారులు ఇక్కత్, టైఅండ్డై పట్టుచీరలు, పెళ్లిచీరలు, కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్ అమ్మకాలను పెంచుకుని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా సుమారు రూ.4 కోట్ల మేరకు ఆన్లైన్ వ్యాపారం సాగుతోందని అంచనా. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లితో పాటు చౌటుప్పల్, రామన్నపేట, హైదరాబాద్ కేంద్రాలుగా ఆన్లైన్లో వస్త్రాల అమ్మకాలు సాగుతున్నాయి. చేనేత కుటుం బాల్లో ఉన్నత చదువులు చదువుకున్న యువత.. తమకున్న అవగాహనతో ఈ రంగంలో రాణిస్తున్నారు. జిల్లాలో సుమారు 700 మంది వరకు ఆన్లైన్ వ్యాపారంలో కొనసాగుతున్నారు. కరోనా సమయంలోనూ తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకుని కొత్త డిజైన్లతో కొనుగోలుదారులకు చేరువయ్యారు. ధర తక్కువ.. మంచి డిజైన్ కరోనా నేపథ్యంలో అందరి ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. జనం అనవసర ఖర్చులు తగ్గించుకున్నారు. దీంతో వస్త్రాల కొనుగోళ్లూ పడిపోయా యి. మరోపక్క రవాణా వసతి లేక, శుభకార్యాలు నిలిచిపోవడంతో చేనేత పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ఎగుమతులు నిలిచిపోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఉత్పుత్తులు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో ఈ రంగంలోని యువత చేనేత వస్త్రాలను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూ బ్ వంటి మాధ్యమాల్లో పెడుతూ వాటి గురించి ప్రచారం చేశారు. చివరకు వీడియో కాల్ ద్వారా డిజైన్లను చూపించి ఆకర్షించే యత్నం చేశారు. త క్కువ ధరకే మంచి రంగులు, అందమైన చీరల డిజైన్లను ఆన్లైన్లో ఉంచి కొనుగోలుదారులను ఆకట్టుకోగలిగారు. దీంతో వస్త్రాల కొనుగోళ్లు పెరిగాయి. ఆన్లైన్లో అమ్మకాలు ఇలా.. భూదాన్పోచంపల్లి, చౌటుప్పల్, సిరిపురం, వెల్లం కి, బోగారం, రామన్నపేట, హైదరాబాద్కు చెందిన వ్యాపారులు ఆన్లైన్ అమ్మకాల్లో ముందున్నారు. పోచంపల్లి ఇక్కత్ (టై అండ్ డై) పట్టుచీరలు, డ్రెస్మెటీరియల్స్తోపాటు, మస్రస్ (మెర్స్రైజ్డ్), సిల్కు, పట్టు, కాటన్ వస్త్రాలలో తమకు అందుబాటులో ఉన్న డిజైన్లను, వాటి ధరలను వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తారు. డిజైన్లు, ధర నచ్చి డబ్బులు చెల్లించిన వారికి కొరియర్ ద్వారా పంపిస్తారు. నమ్మకం కుదిరిన వారికి, సంస్థలకు క్రెడిట్ కూడా ఇస్తున్నారు. దీంతో లాక్డౌన్ సమయంలోనూ ఆన్లైన్ అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్కొక్కరు నెలకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైన సరుకు విక్రయించారని అంచనా. లాక్డౌన్ అనంతరం దుకాణాలు తెరుచుకోవడంతో ఆన్లైన్ వ్యాపారం కాస్త తగ్గింది. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 30 వేల చేనేత కుటుంబాలు ఉండగా, ప్రతి నెలా సగటున లక్ష పట్టుచీరలు ఉత్పత్తవుతున్నాయి. ఆన్లైన్లో విక్రయించే వారికి సొంతంగా వెబ్సైట్లు, కొందరికి యూట్యూబ్ చానల్స్ ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేసేవారు కొందరు అమెజాన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. విదేశాల నుంచి ఆర్డర్లు.. ఆన్లైన్లో పట్టుచీరల కోసం ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. కరోనాతో తగ్గిన సేల్స్ను ఆన్లైన్ ద్వారా పెంచుకున్నాం. ఆర్థిక ఇబ్బందులను గుర్తించి కొనుగోలుదారుల కోసం తక్కువ ధర చీరలను కొత్త డిజైన్లతో ఎక్కువగా తయారుచేసి అమ్మకానికి పెట్టాం. వీడియో కాల్ ద్వారా చీరల రంగులు, డిజైన్లు చూపించి.. నచ్చితే ఆన్లైన్ చెల్లింపులతో విక్రయిస్తున్నాం. వీరికి ఇండియా పోస్ట్, కొరియర్ల ద్వారా పార్శిళ్లను పంపిస్తున్నాం. – అంబటి సాయినాథ్, ఆన్లైన్ వస్త్రవ్యాపారి, భూదాన్పోచంపల్లి మార్జిన్ తగ్గించుకున్నాం లాక్డౌన్ వేళ ఆన్లైన్ వస్త్రవ్యాపారం బాగా జరిగింది. షాపింగ్కు బయటకు వెళ్లే వీల్లేకపోవడంతో చాలామంది ఆన్లైన్ ద్వారా చీరల్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చారు. కరోనా సమయంలో మేం కూడా మార్జిన్ (లాభం) తగ్గించుకున్నాం. ఒక్క పోచంపల్లిలోనే సుమారు 300పైగా యువకులు, దుకాణదారులు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్సీజన్తో గిరాకీ కొంచెం తగ్గింది. – భారత హరిశంకర్, ఆన్లైన్ వస్త్రవ్యాపారి, భూదాన్పోచంపల్లి -
అమ్మాయితో వీడియో కాల్.. లైవ్లో దుస్తులిప్పి..
బెంగళూరు : మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన ఓ యువతిని గుడ్డిగా నమ్మి మోస పోయాడో యువకుడు. వీడియో కాల్లో దుస్తులిప్పి అడ్డంగా బుక్కయ్యాడు. కర్ణాటకలోని బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. బెంగళూరు, హులిమావుకు చెందిన 33 ఏళ్ల అంబిత్ కుమార్ మిశ్రాకు కొద్దిరోజుల క్రితం మాట్రిమోనియల్ సైట్ ద్వారా శ్రేయ అనే యువతి పరిచయమైంది. తానో సాఫ్ట్వేర్ ఇంజనీర్నని, ఎలక్ట్రానిక్ సిటీలో పనిచేస్తున్నానని ఆమె చెప్పింది. అంబిత్ను పెళ్లి చేసుకోవాలన్న కోరికను ప్రకటించింది. దీంతో ఇద్దరూ ఫోన్ ద్వారా తరచూ మాట్లాడుకునే వారు. ఫిబ్రవరి 7వ తేదీన వాట్సాప్ వీడియోకాల్ చేయాల్సిందిగా శ్రేయ, అంబిత్ను కోరింది. దీంతో అతడు వీడియో కాల్ చేశాడు. మొదట ఇద్దరి ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నారు. ( మాయమైపోతున్న మనిషి! ) ఆ తర్వాత ఆమె తన దుస్తులు మొత్తం తొలగించి నగ్నంగా అతడి ముందు నిలబడింది. అంబిత్ను కూడా దుస్తులు తీసేయమని కోరింది. ఆమె చెప్పినట్లుగానే అతడు దుస్తులు తీసేశాడు. దీన్నంతా వీడియో రికార్డింగ్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని, అలా చేయకుండా ఉండాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో అదే రోజు 20 వేల రూపాయలు చెల్లించాడు. ఆమె అంతటితో ఆగలేదు. డబ్బుకోసం మళ్లీ, మళ్లీ ఇబ్బంది పెట్టసాగింది. ఈ నేపథ్యంలో అంబిత్ పోలీసులను ఆశ్రయించాడు. శ్రేయపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు పశ్చిమ బెంగాల్లోని హౌరా నగరంనుంచి ఫోన్ చేసినట్లు గుర్తించారు. -
సెల్ఫీ సూసైడ్: ప్రాణాలు తీసిన లక్కీ డ్రా మోసం
సాక్షి, రామారెడ్డి(నిజామాబాద్): సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ నిండు ప్రాణం పోయింది. అప్పుల పాలైన ఓ వ్యక్తి.. పిల్లల కళ్లెదుటే బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి ఉరేసుకున్నాడు. పిల్లలు వద్దు నాన్న అంటూ వేడుకుంటున్నా, వారిని అనాధలను చేసి వెళ్లి పోయాడు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే.. రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన మంగళపల్లి లక్ష్మణ్ (42), లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఉపాధి కోసం గతంలో కామారెడ్డికి వలస వెళ్లి, అక్కడే పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే, భార్య లక్ష్మికి నాలుగు నెలల క్రితం సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీరు లక్కీ డ్రాలో కోటి గెలుచుకున్నారంటూ నమ్మబలికారు. ఈ నగదు మీరు అందుకోవాలంటే సర్వీస్ చార్జీలు చెల్లించాలని డబ్బు డిమాండ్ చేశారు. దీంతో దంపతులు విడతల వారీగా రూ.2.65 లక్షలు వారికి చెల్లించారు. ఎంతకీ డబ్బులు రాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు అప్పట్లోనే పోలీసులను ఆశ్రయించారు. అయితే, అప్పులు పెరిగి పోవడం, మోసపోయామని లక్ష్మణ్ మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న పోసానిపేటకు వెళ్లిన లక్ష్మణ్.. కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నానంటూ చెప్పాడు. ‘వద్దు నాన్న.. ఇంటికి రా నాన్న’ అంటూ కూతురు వేడుకుంటున్నా అతడు చలించలేదు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఉరేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. -
వీడియో కాల్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి
చెన్నై: సోషల్ మీడియాలో ఒకరికొకరు పరిచయమయ్యారు, తర్వాత ప్రేమించుకున్నారు. ఇంతలో ప్రియుడికి ఇదివరకే పెళ్లైందన్న విషయం బయటపడింది. అతడు చేసిన మోసానికి 24 ఏళ్ల యువతి అర్ధాంతరంగా తనువు చాలించింది. ఆమె ప్రాణాలను కాపాడాల్సిన ప్రియుడే చచ్చిపొమ్మని సలహా ఇవ్వడం మరింత విషాదం. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పెళ్లైందన్న విషయం దాచి ప్రేమరాగాలు.. తమిళనాడుకు చెందిన ముత్తు కుమారేశన్ నాగ్పూర్లో ఆర్మీ అంబులెన్స్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడికి వీడియో చాటింగ్ యాప్లో పెరంబక్కమ్కు చెందిన భారతి పరిచయమైంది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. తర్వాత ప్రేమలో మునిగారు. ఎప్పుడూ వీడియో కాల్స్లో మాట్లాడుకోవడమేనా, ఒకసారి నేరుగా కలుసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. అలా నవంబర్ 18న చెన్నైలో ఇద్దరూ కలుసుకుని కబుర్లు చెప్పుకున్నారు. ప్రియుడి మాటల్లో అతడికి ఇదివరకే పెళ్లైందని తేలింది. ఇద్దరు పిల్లల తండ్రన్న విషయం బయటపడింది. దీంతో షాకైన ప్రియురాలు ఈ ప్రేమాదోమా వద్దని, దీన్ని ఇక్కడితో ఆపేద్దామని అతడికి తేల్చి చెప్పింది. (చదవండి: ప్రేమ పేరుతో నమ్మించి.. వ్యభిచారంలోకి!) ఉరేసుకుంటే త్వరగా చస్తావు.. కానీ అతడు మాత్రం ఆమె మాటలు వినిపించుకోలేదు. పెళ్లి చేసుకుందామని వెంటపడ్డాడు. లేదంటే చచ్చిపోతానని బెదిరించాడు. ఈ వేధింపులు తట్టుకోలేని భారతి డిసెంబర్ 2న చివరిసారి అతడికి వార్నింగ్ ఇద్దామని వీడియో కాల్ చేసింది. నన్ను వేధించడం ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని చేతిలో కత్తి పట్టుకుని బెదిరించింది. ఈ సమయంలో ఆమెకు నచ్చజెప్పాల్సిన ప్రియుడు రాక్షసంగా ప్రవర్తించాడు. గొంతు కోసుకోవడం కన్నా ఉరేసుకుంటే త్వరగా చస్తావని సలహా ఇచ్చాడు. చివరికి వీడియో కాల్లోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా ఆమె ఫోన్లో రికార్డైంది. దీని ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు శనివారం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. (చదవండి: నాన్నా... నీ వద్దకే వస్తున్నాం! ) -
మైక్రోసాఫ్ట్ టీమ్స్ యూజర్స్ కి గుడ్ న్యూస్
మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇప్పుడు తన వినియోగదారులకు డెస్క్ టాప్, వెబ్ యాప్స్ లో టీమ్స్ నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే మైక్రోసాఫ్ట్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్ కి ఈ ఫీచర్ ని తీసుకొచ్చింది. "మైక్రోసాఫ్ట్ టీమ్స్ యూజర్స్ తమ వ్యక్తి గత ఖాతాల ద్వారా టీమ్స్ డెస్క్ టాప్ లేదా వెబ్ యాప్ లో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో వీడియో కాలింగ్ లేదా చాటింగ్ చేసుకోవడానికి" ఈ ఫీచర్ ని తీసుకొచ్చినట్లు మైక్రోసాఫ్ట్ 365 ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ అర్జున్ తోమర్ తెలిపారు. గ్రూప్ చాట్, వీడియో కాలింగ్.. ఇప్పుడు డెస్క్ టాప్, మొబైల్ రెండింటిలోనూ అందుబాటులో ఉన్నందున మీకిష్టమైనవారితో కనెక్ట్ అవ్వడం, నిర్వహించడం గతంలో కంటే సులభతరమవుతుందని, ముఖ్యంగా సెలవులప్పుడు ఉపయోగించుకోవచ్చని ఆయన గురువారం ఒక బ్లాగ్ లో పోస్ట్ చేశారు. -
ఎన్టీఆర్ చొరవ, ఫ్యాన్స్ ఫిదా!
సాక్షి, హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్లో బిజీబిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని కోసం పెద్ద మనసు చేసుకున్నారు. గతం కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న తన ఫ్యాన్ను పలకరించి అతనికి భారీ ఓదార్పునిచ్చారు. దీంతో యంగ్ టైగర్ చూపించిన మానవత్వం, అభిమానంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మస్క్యులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న తన అభిమాని వెంకన్న అనారోగ్యం గురించి తెలుసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైపోయిన తన వీరాభిమాని దీనావస్థ గురించి విని చలించిపోయారు. వీడియో కాల్ ద్వారా ఎన్టీఆర్ వెంకన్నను పలకరించారు. దీంతో ఆశ్చర్యపోవడం అతని వంతైంది. ఎన్టీఆర్తో సెల్ఫీ తీసుకోవాలని ఉందనే కోరికను వ్యక్తం చేశాడు. అతని మాటలను ఓపికగా విన్న ఎన్టీఆర్ పరిస్థితులన్నీ చక్కబడిన వెంటనే అతడిని కలవడానికి వస్తానని అప్పుడు తనతో సెల్ఫీ తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. తరువాత వెంకన్న తల్లితో కూడా మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్ ఆందోళన చెందవద్దంటూ ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
మాజీ తహసీల్దార్ నాగరాజు వీడియో కాల్?!
సాక్షి, హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు మృతి కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఆయన చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడారని తెలిసింది. ‘నేను ఏ తప్పు చేయలేదు.. అన్నీ ప్రాపర్గానే ఉన్నాయి. అన్నీ రికార్డ్స్ పరిశీలించాకే చేశాం. న్యాయవాదికి ఈ విషయాలు చెప్పి కోర్టులో తెలపాలి’అని నాగరాజు ఆ వీడియో కాల్లో కుటుంబసభ్యులను కోరినట్టు సమాచారం. బెయిల్పై బయటకు వచ్చాక కోర్టులో చూసుకుందామని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక నిన్న మీడియాతో మాట్లాడిన నాగరాజు కుటుంబ సభ్యులు, అతను ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నాగరాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికీ హత్యేనని వారు వాదించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని శుక్రవారం తెలిపారు. కాగా, కోటి 10 లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజును నెలరోజులుగా ఏసీబీ విచారించింది. ఈక్రమంలోనే చంచలగూడ జైల్లో ఉన్న ఆయన గత బుధవారం ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. నాగరాజు మృతిపై కస్టోడియల్ డెత్ కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు) (చదవండి: కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య!)