Vijayawada
-
పోలీసుల నుంచి ప్రాణహాని ఉంది : వల్లభనేని వంశీ
సాక్షి,విజయవాడ: పోలీసుల (Andhra Pradesh Police) నుంచి తనకు ప్రాణ హాని ఉందని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ‘నాకు శ్వాసకోశ ఇబ్బంది ఉందని చెబుతున్నా పోలీసులు నా పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. అరెస్ట్ విషయంలో పూర్తిగా సహకరించినా నన్ను ఇబ్బందులకు గురి చేశారు. నాకు వైద్య సహాయం అందకుండా పోలీసులు ప్రతీక్షణం అడ్డుకున్నారు. అరెస్ట్ నుంచి కోర్టుకు తరలించే వరకు పోలీసులు నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు’అంటూ న్యాయమూర్తికి స్టేట్మెంట్ ఇచ్చారు. కాగా, విజయవాడ (Vijayawada) జైల్లో ఉంటే వంశీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు, వల్లభనేని వంశీ పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్తను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదని వాపోయారు. గురువారం రాత్రి 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ ఇస్తూ 4th ACMM కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా విజయవాడ సబ్ జైల్కి పోలీసులు వంశీని తరలించారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్పై ఆయన సతీమణి పంకజశ్రీ స్పందించారు.‘నా భర్త అరెస్టుపై న్యాయపోరాటం చేస్తా. అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంది. వంశీకి ఆరోగ్యం బాగాలేదు. నేనే టాబ్లెట్స్ ఇచ్చాను. ఉదయం నుండి కనీసం కాఫీ కూడా తాగలేదు. ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదు. ఎక్కడికి తీసుకు వెళుతున్నారో కూడా కనీస సమాచారం ఇవ్వలేదు. హైకోర్టుకి కచ్చితంగా వెళ్తాం. న్యాయపరంగానే ఎదుర్కొంటాం’ అని వ్యాఖ్యానించారు. -
HYD to Vjy: వల్లభనేని వంశీ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్కు చేరుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ పెట్టి ఆయనను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఎన్ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3) రెడ్విత్ 3(5) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.అలాగే, వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం పోలీసులు నమోదు చేశారు. ఇదే సమయంలో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్ట్ చేస్తున్నట్టు వంశీ భార్యకు పోలీసులు నోటీసుల్లో తెలిపారు. అనంతరం, వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.వంశీ అరెస్ట్.. ఆపై ఇలా..5 AM: గచ్చిబౌలిలోని వంశీకి ఇంటికి చేరుకున్న పటమట పోలీసులు.5:15 AM: వంశీకి అరెస్ట్ నోటీసులు ఇచ్చిన పోలీసులు.6 AM: వంశీని అరెస్ట్ చేసి ఆయన భార్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.7 AM: గచ్చిబౌలి నుంచి వల్లభనేని వంశీ విజయవాడకు తరలింపు. 10:45 AM: సూర్యాపేట వద్ద బ్రేక్ఫాస్ట్11:45 AM: నందిగామ దగ్గర వంశీ భార్య పంకజ శ్రీని అడ్డుకున్న పోలీసులు.12:30 PM: విజయవాడకు వంశీ తరలింపు. ఈ సందర్భంగా నగరంలో సెక్షన్ 144 విధింపు.12:45 PM: భవానీపురం పీఎస్లో వాహనం మార్పు.1:10 PM: కృష్ణలంక పీఎస్కు వంశీని తరలించిన పోలీసులు. పీఎస్లో వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
మమ్ము ఆశీర్వదించు మేరీమాతా! గుణదల తిరునాళ్ల సంరంభం
దేశంలోని క్రైౖస్తవ పుణ్యక్షేత్రాలలో రెండవ అతిపెద్ద ఆలయంగా విజయవాడలోని గుణదల మేరీమాత క్షేత్రం ప్రఖ్యాతి చెందింది. ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మరియమాతను దర్శించుకుంటారు. తమ మొక్కుబడులు చెల్లించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రతియేటా ఈ పుణ్యక్షేత్రంలో జరిగే ఉత్సవాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచీ లక్షలాది యాత్రికులు తరలి వచ్చి ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.నూరేళ్ల క్రితమే ప్రతిష్ట..కతోలిక క్రైస్తవులు భారతదేశంలో సేవనారంభించిన తొలినాళ్లలో అనగా 1925లో గుణదల ప్రాంతంలో విద్యాబోధన ప్రారంభించారు. గుణదల కొండ సమీపంలో సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్కి అప్పటి రెక్టర్ ఫాదర్ గా పనిచేస్తున్న అర్లాటి స్వామి కొండ పైభాగంలో సహజసిద్దం గా ఉన్న కొండ గుహను గుర్తించారు. భక్తులలో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే సంకల్పంతో ఆ గుహలో మరియమాత స్వరూపాన్ని ప్రతిష్టించారు. ఆనాటి నుంచీ కతోలిక క్రైస్తవులు, ఇన్స్టిట్యూట్ విద్యార్ధులు కొండపై ఉన్న మరియమాత స్వరూపాన్ని ఆరాధించడం ప్రారంభించారు. ఆ రోజుల్లో యేడాదికి ఒకసారి ఫిబ్రవరి 11వ తేదీన మరియమాత ఉత్సవాలను జరుపుకోవడం సంప్రదాయమైంది.అర్లాటి స్వామి మేరీమాత స్వరూపాన్ని ప్రతిష్ట చేసిన నాటి నుంచీ మేరీమాత పుణ్యక్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది. కొండ శిఖరాగ్రాన యేసుక్రీస్తు శిలువను ప్రతిష్టించారు.1937లో కొండగుహలో మేరీమాత విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేశారు. అటుపై ప్రత్యేక్ర ప్రార్థనలు, సమిష్టి దివ్యబలి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు బలిపీఠాన్ని నిర్మించారు. కొండగుహను తొలిచి మెట్ల మార్గాలు ఏర్పాటు చేశారు. 1948లో కొండ శిఖరాగ్రానికి చేరుకునే దారిలో దేవ రహస్యములు తెలియపరిచే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. గుణదల పుణ్యక్షేత్రంలో పనిచేసే గురువులు భక్తులకోసం మౌలిక సదు΄ాయాలు, మెట్లమార్గాలు ఏర్పాటు చేశారు. రానురాను ప్రాచుర్యం పెరిగి భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో మేరీమాత ఉత్సవాలను నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టారు.ఆచారాలుకులమతాలకు అతీతంగా భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. తొలుత మరియమ్మ తల్లిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. మైనపువత్తులు వెలిగించటం, కొబ్బరికాయ లు కొట్టడం, తలనీలాలు సమర్పించడం, చెట్లకు ఉయ్యాలలు కట్టడం, దివ్యపూజలు చేయించడం, యాత్రికులు నిద్ర చేయటం వంటి ఆచారాలను అనుసరిస్తుంటారు.ఉత్సవాల్లో మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బిషప్ గ్రాసి స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సమష్టి దివ్యబలిపూజ ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. అంతేకాకుండా నిరంతరం క్రై స్తవ భక్తి గీతాలాపనలు, ప్రత్యేక ప్రసంగాలు, క్రై స్తవ నాటికలు ప్రదర్శిస్తున్నారు. మహోత్సవాలు ప్రారంభంప్రస్తుతం 101వ తిరునాళ్ల మహోత్సవాలు జరుగుతున్నాయి. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 10 లక్షలమందికి పైగా విచ్చేస్తారని అంచనా. మూడు రోజుల పాటు నిర్వహించే ప్రార్థనల్లో కర్నూలు పీఠాధిపతి గోరంట్ల జ్వాన్నేస్, ఖమ్మం పీఠాధిపతి సగతి ప్రసాద్ తదితరులు పాల్గొంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభంఆదివారం ఉదయం విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, గుణదల పుణ్యక్షేత్రం రెక్టార్ ఫాదర్ యేలేటి విజయం జయరాజులు ప్రత్యేక ప్రార్థనలు, సమష్టి దివ్యబలి పూజ సమర్పించి తిరునాళ్ల మహోత్సవాలను ప్రారంభించారు. అనంతరం పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ గురువులుసందేశాలిచ్చారు– చక్రాల శరత్ రాజుసాక్షి, గుణదల (విజయవాడ తూర్పు) -
విజయవాడ : అదరహో.. మిస్ బ్లాక్ షో, ర్యాంప్ వాక్తో సందడి (ఫొటోలు)
-
విజయవాడ : శ్రీ శృంగేరీ శారదా పీఠంలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
భవానీపురం : కృష్ణానదిలో సీ ప్లేన్ ట్రయల్ రన్ (ఫొటోలు)
-
కార్తీకాన శివరూపం.. కమనీయం ఆ దర్శనం! (ఫోటోలు)
-
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
బెజవాడలో వ్యక్తి దారుణ హత్య
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరం నడిరోడ్డున మంగళవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచిన స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన, సేకరించిన వివరాల ప్రకారం.. యనమలకుదురు డొంకరోడ్డులోని శ్రీనివాస అపార్ట్మెంట్స్లో మహ్మద్ రఫీ(54), అజ్మరీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. రఫీ వారి ఇంటి సమీపంలోనే ఆదిల్ డిజిటల్ సేవా కేంద్రాన్ని నడుపుతూ జీవనం సాగిస్తూ పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. రఫీతో కలిసి లయోలా కళాశాలలో చదువుకున్న సాగి వెంకట నరసింహరాజు(54) అనే స్నేహితుడు హైదరాబాద్లో నివసిస్తూ ఓ ఫార్మసీ కంపెనీని నడుపుతున్నాడు. సోమవారం నగరానికి వచ్చిన నరసింహరాజు తన స్నేహితుడు రఫీకి ఫోన్ చేసి అయోధ్యనగర్లోని లోటస్ ల్యాండ్మార్క్లో ఉన్న తన ఫ్లాట్కు రమ్మని పిలిచాడు. దీంతో రఫీ సోమవారం తన స్నేహితుడు ఉన్న ఫ్లాట్కు వెళ్లాడు. రఫీకి మద్యం తాగే అలవాటు ఉంది. నరసింహరాజు మాత్రం మద్యం ముట్టడు. దీంతో నరసింహరాజు తన స్నేహితుడు రఫీకి మద్యం తెప్పించాడు. రఫీ మద్యం తాగాడు. అనంతరం రఫీకి, నరసింహరాజుకు మధ్య డబ్బుల విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో రఫీ సమీపంలో ఉన్న కత్తెరను తీసుకొని నరసింహరాజును పొడిచేందుకు ప్రయత్నించగా అతను తన మెడలో ఉన్న కండువాను తీసి రఫీ మెడకు గట్టిగా బిగించేయడంతో రఫీ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు. నరసింహరాజు విషయాన్ని 100కు ఫోన్ చేసి పోలీసులకు, 108కు ఫోను చేసి జరిగిన విషయాన్ని చెప్పగా వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రఫీని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. కత్తితో దాడి చేయబోతే ప్రతిఘటించా... తన స్నేహితుడు రఫీ ఇటీవల బాగా అప్పులపాలయ్యాడని ఈ క్రమంలో తనను రూ.3 లక్షలు అప్పుగా అడగడంతో తాను నిరాకరించానన్నారు. ఆ విషయంలో తమ ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందని, రఫీ పక్కనున్న కత్తెరతో తనపై దాడికి ప్రయతి్నంచగా తాను అతన్ని ఆపేందుకు కండువాతో గట్టిగా గొంతు నులిమానంటూ నిందితుడు నరసింహరాజు పోలీసులకు చెప్పుకొచ్చాడు. తన బాల్య స్నేహితుడిని తానెందుకు చంపుకొంటానంటూ వాపోయాడు. అన్నీ అబద్ధాలే.. కావాలనే నా భర్తను హతమార్చారు... నరసింహరాజు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని రఫీ భార్య అజ్మిరీ ఆరోపించింది. తన భర్త రఫీయే నరసింహరాజుకు డబ్బులు ఇచ్చాడని, వాటిని ఇవ్వమని అనేకసార్లు అడుగుతుంటే మాట దాట వేసుకుంటూ వస్తున్నాడన్నారు. ఈ విషయమే మాట్లాడేందుకు వారిద్దరూ కలిశారని తెలిపింది. పథకం ప్రకారమే తన భర్తకు ఫుల్గా మద్యం తాగించి, తన భర్త పైనే కత్తెరతో దాడిచేసి నైలాన్ కండువాతో గొంతు నులిమి హత్య చేశాడని ఆమె ఆరోపించింది. నరసింహరాజుతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కలిసి తన భర్తను హతమార్చి ఉంటారని, పోలీసు ఉన్నతాధికారులు దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆమె కోరింది. రఫీ బంధువుల ఆందోళన రఫీ కుటుంబ సభ్యులు, బంధువులు తమకు న్యాయం చేయాలని మంగళవారం సాయంత్రం రఫీ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సింగ్నగర్ పోలీస్స్టేషన్కు వచ్చేందుకు ప్రయతి్నంచారు. పోలీసులు వారిని ప్రభుత్వ హాస్పిటల్ వద్దే అడ్డుకుని గేటు మూసేసి బయటకు రాకుండా నిలిపివేశారు. -
అర్జీలన్నీ అంతే సంగతులా!?
విజయవాడ కండ్రికలోని ఈమె ఇల్లు ఇటీవల బుడమేరు వరదల్లో పూర్తిగా మునిగింది. 12 రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపింది. సర్వే సిబ్బంది వివరాలు రాసుకుని వెళ్లారు. అయితే, పరిహారానికి సంబంధించిన జాబితాలో మాత్రం ఈమె పేరులేదు. సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితంలేదు. కలెక్టరేట్లో కూడా మరోసారి దరఖాస్తు చేసుకుంది. చివరికి.. ఎవరిని అడిగినా లాభంలేక సాయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : బుడమేరు వరదతో విజయవాడలో నిండా మునిగిన బాధితులకు నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరదలు వచ్చి 45 రోజులకు పైగా గడిచినప్పటికీ, సాయం కోసం ఇంకా వేలాది మంది బాధితులు నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క బాధితుడికి సహాయం అందిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. రకరకాల సాకులతో బాధితుల జాబితాకు కోతేసి గతనెల 17న సచివాలయాల్లో ప్రదర్శించారు. కానీ, సర్వే అంతా తప్పుల తడకగా ఉందని, గ్రౌండ్ఫ్లోర్ అయితే, ఫçస్ట్ ఫ్లోర్ అని.. వాహనాలు నమోదు కాలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మరికొందరైతే తమ పేర్లు నమోదు చేయలేదంటూ రోడ్డెక్కి ధర్నా చేశారు. దీంతో బాధితుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సచివాలయాల పరిధిలో దరఖాస్తులు తీసుకున్నారు. ఆ సమయంలో 18వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో కొన్నింటిని పరిష్కరించి, వరద బాధితుల ఖాతాల్లో నగదు జమచేశారు. అయినా ఇంకా తమకు పరిహారం అందలేదంటూ చాలామంది సెపె్టంబరు 27 వరకు సచివాలయాల చుట్టూ తిరిగారు. తామేమీ చేయలేమని అక్కడి సిబ్బంది చెతులేత్తేయడంతో సెప్టెంబరు 28 నుంచి బాధితులు దరఖాస్తులతో విజయవాడలోని కలెక్టరేట్ బాటపట్టారు. ఇలా వచ్చిన దరఖాస్తులు 21వేలకు పైగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సాయం కోసం ఎదురుచూపులు.. సీన్ కట్చేస్తే.. ఇప్పుడీ దరఖాస్తుల గురించి సమా«ధానం చెప్పేవారే కరువయ్యారు. వీటిని అధికారులు పరిశీలించి, అర్హులైన జాబితాలు సచివాలయాల్లో ఉంచితే బాధితుల్లో గందరగోళం ఉండేది కాదు. అయితే, దరఖాస్తులు కంటితుడుపుగా తీసుకున్నారా లేక కాలయాపన చేసి వీటిని కోల్డ్స్టోరేజిలోకి నెడతారా అని బాధితులు అనుమానిస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోవడంతో, బాధితుల అర్జీలన్నీ బుట్టదాఖలు అయినట్లేనని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు. అంచనా బృందాల అరాచకం.. ఇక నష్టం అంచనా జాబితాలోనే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందంటూ బాధితులు మండిపడుతున్నారు. అంచనా బృందాలు వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నా డోర్లాక్ అని నమోదు చేశారని, గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటే నాలుగో అంతస్తు అని నమోదు చేశారని.. ఇల్లంతా బురదమయంగా కనిపిస్తున్నా.. నష్టం జరగలేదని నమోదు చేశారని, వాహనాలు పూర్తిగా పాడైనా.. ఎలాంటి నష్టం జరగలేదని నమోదు చేశారని, ఆధార్, బ్యాంకు ఖాతాలన్నీ సక్రమంగానే ఉన్నా నాట్ ట్రేస్డ్ అని నమోదు చేశారని బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారు. సాయం చేసింది గోరంతే.. ఇదిలా ఉంటే.. వరద నష్టం అంచనా పూర్తయిన తరువాత ముంపు ప్రాంతాల్లో 2.68 లక్షల కుటుంబాలకు నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇందులో 2.32 లక్షల కుటుంబాలకు సంబంధించి 1,700 సర్వే బృందాలతో సర్వే చేయించారు. ఇందులో ఇప్పటివరకు 89,616 ఇళ్లు నీట మునిగినందున రూ.188.80 కోట్ల పరిహారం అందించారు. ఎంఎస్ఎంఈలు, వాహనాలు, వ్యవసాయరంగం, పశువులు, మత్స్యశాఖ, చేనేత, ఉద్యానవనం అన్ని శాఖలకు కలిపి రూ.97.66 కోట్ల సాయం మాత్రమే అందించారు. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించే రూ.55.60 కోట్ల పరిహారం ఉంది. అంటే.. వరదకు సంబంధించి జిల్లాలో అన్ని రకాల సాయం కింద అందించింది కేవలం రూ.286.46 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక బాధితులకు ఇచ్చిన పరిహారం కంటే అగ్గిపెట్టెలు, భోజనాలు ఇతర ఖర్చుల కింద ఎక్కువగా ఖర్చుచేయడం విశేషం. అతీగతీలేని సాయం.. మేం రాజీవ్నగర్ ప్లాట్ నెంబరు 26లో ఉంటున్నాం. బుడమేరు వరదలో ఇల్లు పూర్తిగా మునిగింది. సర్వే సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. నష్టపరిహారానికి సంబంధించిన జాబితాలో పేరున్నా డబ్బు మాత్రం పడలేదు. ఎవర్ని అడిగినా సమా«ధానం కరువైంది. చివరికి కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు అతీగతీలేదు. – వెంగల సాయితేజ, రాజీవ్నగర్ -
విజయవాడ దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం
-
ఇంద్రకీలాద్రి: శ్రీదుర్గాదేవి అలంకరణలో విజవాడ దుర్గమ్మ (ఫోటోలు)
-
దసరా మహోత్సవాల రెండో రోజు.. శ్రీ గాయత్రిదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు (ఫోటోలు)
-
విజయవాడ వరదలు : జనం కన్నీళ్లకు జవాబు ఇదేనా? (ఫొటోలు)
-
విజయవాడ : సిద్ధార్థ కళాశాలలో ఉత్సాహంగా నృత్యోత్సవం 2024 (ఫొటోలు)
-
విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా స్క్రూ బ్రిడ్జిలో దూకిన తల్లి
సాక్షి,విజయవాడ: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. స్క్రూ బ్రిడ్జి వద్ద ఓ తల్లి తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి బందర్ కాలువలోకి దూకింది.ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు తల్లి,పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. సంవత్సరంలోపు వయసుగల పసికందును వెలికి తీశారు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.అయితే హాస్పటల్కు తరలించే లోపే పసికందు మృతి చెందినట్లు తెలుస్తోంది. తల్లి, కుమారుడు కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
విజయవాడ : సందడిగా దసరా సాంస్కృతికోత్సవాలు (ఫొటోలు)
-
ఇది సాయమా? మరో గాయమా!?
సాక్షి, అమరావతి: అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు.. అన్నట్లుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే. విజయవాడను వరదలు ముంచెత్తి 15 రోజులు పూర్తయినా బాధితులకు చిల్లిగవ్వ సాయం కూడా చేయని రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వారి జేబులకు చిల్లులుపడే బాధ్యతను మాత్రం భుజానికెత్తుకుంది. బాధితులకు మేలు చేస్తున్నట్లు ఓ వైపు బిల్డప్ ఇస్తూనే మరోవైపు ఓ కార్పొరేట్ సంస్థకు మేలు చేకూర్చేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా.. బాధితుల ఇళ్లలో పనికిరాకుండా పోయిన గృహోపకరణాలతోపాటు ఇళ్లలో నీటి పైపులైన్లు, నీటి కుళాయిలు వంటి ప్లంబింగ్ పనులకు నిర్ణీత రేట్లతో మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం ఓ కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ మరమ్మతుల రేట్లు అవాక్కయ్యేలా ఉండడం ముంపు ప్రాంతాల్లో పెద్ద చర్చనీయాంశమవుతోంది. ఉదా.. స్విచ్బాక్స్ బిగించడానికి రూ.279, ఫ్యాన్ రెగ్యులేటర్ మార్చడానికి రూ.99, ఫ్యాన్ రిపేరుకు రూ.199, ఫ్యాన్ మార్చడానికి రూ.239, గీజర్ చెక్ చేయడానికి రూ.299, వాష్ బేసిన్ లీకేజీ రిపేరుకు రూ.169, సింక్ డ్రెయిన్ పైపు రిపేరుకు రూ.209, డ్రెయిన్ పైపులో అడ్డుతొలగించేందుకు రూ.169, వాటర్ ట్యాప్ రిపేరుకు రూ.139, ఫ్లష్ ట్యాంకు రిపేరుకు రూ.299, వెస్ట్రన్ టాయిలెట్ రిపేరుకు రూ.799, వెస్ట్రన్ టాయిలెట్ మార్చడానికి రూ.1,499, ఇండియన్ టాయిలెట్ బిగించడానికి రూ.1,699.. అంటూ సదరు సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ధరలను నిర్ణయించింది. అంటే.. ఈ ధరలను బాధితులు స్వయంగా డబ్బులు చెల్లించి రిపేర్లు చేయించుకోవాల్సి ఉంటుంది. నిజానికి.. బయట మార్కెట్లో ఈ ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయని బాధితులే స్వయంగా చెబుతున్నారు. మరోవైపు.. ఈ కార్పొరేట్ సంస్థకు అదనంగా అవసరమయ్యే టెక్నీíÙయన్లను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొందిన వారిని ప్రభుత్వమే కేటాయించడం గమనార్హం. బాధితులకు యాప్ బాధ్యత ప్రభుత్వ సిబ్బందికి.. ఇదిలా ఉంటే.. వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9–12 వరకు ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించింది. ఏ ఇంట్లో ఏ వస్తువులు పాడయ్యాయో వివరాలను సేకరించింది. ఇప్పుడు వీరి సమాచారం పరోక్షంగా ఆ సంస్థ చేతిలో ప్రభుత్వం పెట్టేసింది. అలాగే, పొదుపు సంఘాల కార్యక్రమాలను పర్యవేక్షించే ఉన్నతాధికారులు ఇటీవలే విజయవాడ పరిధిలోని మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించి ముంపు ప్రాంతాల్లోని పొదుపు మహిళల ఫోన్లలో సదరు కార్పొరేట్ సంస్థ యాప్ను డౌన్లోడ్ చేయించే బాధ్యతను వారికి అప్పగించారు. కొన్నిచోట్ల సచివాలయాల ఉద్యోగులు ఈ బాధ్యతను చేపట్టినట్లు సమాచారం. అంతేకాక.. ‘మీ ఇంట్లో పాడైన వాటిని సంబంధిత కంపెనీతో తక్కువ ఖర్చుతో బాగుచేయించుకోండి’ అంటూ ఆ సంస్థ క్యూఆర్ కోడ్తో ప్రభుత్వమే కరపత్రాలను బాధితులకు అందిస్తూ ఆ సంస్థను ప్రోత్సహిస్తోంది.కళ్లుచెదిరేలా రిపేరింగ్ రేట్లు.. నిజానికి.. పాడైన వస్తువులను ఇంటి చుట్టుపక్కల ఉండే టెక్నీషియన్తో బాగుచేయించుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. కానీ, ప్రభుత్వ ఒప్పందం ప్రకారం నిర్ణయించిన రేట్లు చూస్తే బయట మార్కెట్ రేట్లు లేదా ఆ కార్పొరేట్ సంస్థ తన యాప్లో ప్రదర్శించే ధరల కన్నా ఎక్కువగా ఉన్నాయి. వీరిని ఆశ్రయిస్తే బాధితుల ఖర్చులు తడిసిమోపెడవడం ఖాయం. ఎందుకంటే.. ఒకే ఇంట మూడు ట్యూబ్లైట్లను ఆ కంపెనీ ద్వారా మార్చుకుంటే మొత్తం రూ.360 చెల్లించాల్సి ఉంటుంది. కానీ, బయట మెకానిక్లో చేయిస్తే 150–200 మించి కావు. అలాగే.. ఎలక్ట్రికల్ స్విచ్ బాక్స్ బిగించడానికి రూ.239లు అని యాప్లో పేర్కొనగా, వరద ప్రాంతాల్లో ఇదే సేవకు రూ.279లుగా ధరను ప్రభుత్వం నిర్ణయించింది. లోకల్గా ఉండే మెకానిక్లు ఇదే పనికి రూ.100 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు.. ఫ్యాన్ మార్చడానికి యాప్ ధర రూ.199లు ఉంటే వరద ప్రాంతాల్లో రూ.239లుగా నిర్ణయించారు. అదే స్థానిక మెకానిక్లు ఈ పనికి కేవలం రూ.100–150ల చొప్పున తీసుకుంటామని చెబుతున్నారు. నీటి కుళాయి మార్చడానికి రూ.50 అని యాప్లో ఉంటే ఇదే పనికి వరద ప్రాంతాల్లో ప్రభుత్వం రూ.139లు నిర్ణయించింది. స్థానిక మెకానిక్లు ఈ పనికి రూ.100 తీసుకుంటున్నారు. వాస్తవానికి.. అనేక ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాధితులకు ఉచితంగా సేవలందిస్తుంటే ప్రభుత్వం వీటిని ప్రోత్సహించకుండా కార్పొరేట్ సంస్థకు కొమ్ముకాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక.. విపత్తు సమయంలో నిండా మునిగిన బా«ధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుండా బాధితుల నుంచి కార్పొరేట్ కంపెనీలు అధిక ధరలు వసూలుచేసుకునేలా వీలు కల్పించడం విడ్డూరంగా ఉందని బాధితులు వాపోతున్నారు. ఆదుకుంటామని చెప్పి ఇలా చేస్తారా!? ఇక వరద తగ్గిన ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లతో నీట మునిగిన ఇళ్ల పరిసరాలు శుభ్రం చేయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంట్లోని సామాన్లు, దుస్తులు, గృహోపకరణాలు పాడైపోయిన వారిని ఏ విధంగా ఆదుకోవాలో కూడా ప్రకటిస్తామన్నారు. తీరా ఇప్పుడు బాధితులే డబ్బులు కట్టి బాగుచేయించుకోవాలని సూచించడంతో పాటు ఆయా పనులకు ప్రభుత్వం ధరలు నిర్ణయించి కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకోవడంపై బాధితులు మండిపడుతున్నారు. సాయం మాట దేవుడెరుగు ఇది తమను మరింత గాయపర్చేలా ఉందని వారు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. -
నిర్లక్ష్యమే ముంచేసింది
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వరదల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని.. వరద హెచ్చరికలను పెడచెవిన పెట్టి విజయవాడను ముంచేసిన మాదిరిగానే ఏలేరు వరద విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతుల నోట్లో మట్టి కొట్టిందని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఒక బాధ్యత లేని ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్కు వరద వస్తుందని, అది ప్రమాదకర స్థాయిలో ఉంటుందని ప్రభుత్వానికి ముందే సమాచారం అందినా కాలువ ద్వారా నీటిని వదలకుండా తాత్సారం చేసి చివరకు సామర్థ్యానికి మించి వదిలి ముంచేశారని ధ్వజమెత్తారు. ఇరిగేషన్, రెవెన్యూ, హోంశాఖలతో కనీసం సమీక్షించకుండా సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. విజయవాడ ఎలా అతలాకుతలమైందో అలాంటి నిర్లక్ష్యమే ఏలేరు విషయంలోనూ కనిపిస్తోందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ శుక్రవారం పర్యటించారు. మాధవాపురం, పాత ఇసుకపల్లి, నాగులాపల్లి, రమణక్కపేట తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అనంతరం రమణక్కపేటలో మీడియాతో మాట్లాడారు. ప్రీమియం చెల్లించకుండా ఉచిత పంటల బీమాను గాలికొదిలేసి రైతులను ప్రభుత్వం నట్టేట ముంచేసిందని దుయ్యబట్టారు. ఈ క్రాప్ నమోదు చేయడం లేదని, ఆర్బీకేలను అడ్రస్ లేకుండా చేశారని, సచివాలయాలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రన్న వస్తాడు.. రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తాడన్న హామీ ఏమైందని నిలదీశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మనుషుల విలువ తెలిసి ఉంటే.. ఏలేరు రిజర్వాయర్ దగ్గర పరిస్థితిని చూస్తే విజయవాడ గుర్తుకొస్తోంది. అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆగస్టు 31నే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐఎండీ (భారత వాతావరణ విభాగం) అప్రమత్తం చేసింది. అలాంటి హెచ్చరిక అందగానే ప్రభుత్వం సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రెవెన్యూ, హోం, ఇరిగేషన్ కార్యదర్శులతో సమీక్ష చేయాలి. కానీ ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కలెక్టర్లతో మాట్లాడలేదు. సీఎస్ కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. సీఎం చంద్రబాబుకు మానవత్వం ఉంటే, మనుషుల విలువ తెలిసి ఉంటే స్పెషల్ ఆఫీసర్ను నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుని ముందు జాగ్రత్తలు చేపట్టే వారు. కానీ అవేమీ చేయలేదు. అన్నీ గాలి కొదిలేశారు. ఏలేరు ఆధునీకరణపై అబద్ధాలు.. అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు గోబెల్స్కు తమ్ముడే. పచ్చి అబద్ధాలాడతారు. అబద్ధాలను సృష్టించడం, వాటిని అమ్మగలగడంలో చంద్రబాబును మించిన వారు ప్రపంచంలోనే లేరు. ఆయనకు వంత పాడే మీడియా నిత్యం అవే అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ఏలేరు ఆ«ధునికీకరణపైనా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. తొలుత ఏలేరు కాలువ ఆధునికీకరణను 2008లో దివంగత వైఎస్సార్ రూ.138 కోట్లతో చేపట్టారు. ఆ తర్వాత ఎవరూ ఆ పనులను పట్టించుకోలేదు. వర్షాలు, నీళ్లు లేనప్పుడు మాత్రమే కెనాల్ ఆధునికీకరణ చేయగలం. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తే కానీ సాధ్యం కాదు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక అంచనాలు రూ.295 కోట్లకు పెంచడం మినహా పనులు చేయలేదు. నిజానికి అప్పుడు రిజర్వాయర్లో నీళ్లు కూడా పెద్దగా లేవు. నాడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏటా కరువే. చంద్రబాబు – కరువు ఇద్దరూ కవలలే. అప్పుడు వర్షాలు కూడా లేవు. అయినా పనులు ఎందుకు చేయలేదు? 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వరుసగా వర్షాలు కురవడంతో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కాలువ ఆధునికీకరణ పనులు వేగంగా చేయలేకపోయాం. ఏం జరిగినా జగనే కారణం అంటాడుఏలేరు వరదలపై ప్రభుత్వానికి ముందే ఇంత సమాచారం ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో చంద్రబాబు విఫలమై రైతులందర్నీ ఇబ్బంది పెట్టారు. వరదలు వస్తే రిజర్వాయర్లను ఎలా నిర్వహించాలో ఈ ప్రభుత్వానికి తెలియడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు అయింది. ఎక్కడ ఏం జరిగినా దానికి కారణం జగనే కారణం అంటాడు. విజయవాడలో వరదలు వచ్చినా జగనే కారణం.. ! ఏలేరు రిజర్వాయర్ కింద వరదలు వచ్చినా జగ¯నే కారణం..! కోవిడ్ వచ్చినా జగనే కారణం.. అంటాడు! చంద్రబాబు చేయాల్సింది జగన్నామస్మరణ కాదు. ప్రతి దానికి జగన్పై అరవకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇప్పటికైనా మమ్మల్ని నిందించడం మానుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి నిజాయితీగా పాలన అందించాలి. సామర్థ్యానికి మించి ఒకేసారి నీటి విడుదలతో.. ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యం దాదాపు 24 టీఎంసీలు కాగా 31వతేదీ నాటికే సుమారు 18 టీఎంసీలు ఉన్నాయి. సెపె్టంబర్ 1న ఏలేరు రిజర్వాయర్కు 9,950 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రభుత్వం జాగ్రత్త పడి ఉంటే, ఫ్లడ్ కుషన్ నిబంధన పాటించి ఉంటే ఆ మొత్తం వెంటనే కిందకు వదలాలి. ఎందుకంటే దిగువన కాలువ సామర్థ్యం 14 వేల క్యూసెక్కులు మాత్రమే. అలా అప్పుడే నీళ్లు దిగువకు వదిలి ఉంటే ఆ కాలువ పొంగకుండా ఉండేది. కానీ ప్రభుత్వం కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే వదిలిపెట్టింది. సెప్టెంబరు 4న 5,400 క్యూసెక్కులు వస్తే బయటకు పంపింది కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే. ఏమాత్రం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేపట్టలేదు. ఫ్లడ్ ఫ్లో కుషన్ ఏర్పాటు చేయలేదు. పైనుంచి నీళ్లొస్తున్నా తీవ్ర నిర్లక్ష్యం వహించారు. కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే వదులుతూ వచ్చారు. దీంతో 9వతేదీ నాటికి ఏలేరు రిజర్వాయర్ పూర్తిగా నిండింది. దీంతో గత్యంతరం లేక కిందకు 21,500 క్యూసెక్స్ వదిలారు. 10వ తేదీన 26,134 క్యుసెక్కుల ఇన్ఫ్లో ఉంటే ఏకంగా 27,275 క్యూసెక్స్ విడిచిపెట్టారు. అంటే కాలువ సామర్థ్యాన్ని మించి నీళ్లు వదలడంతో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. మరి ఇది కచ్చితంగా ‘‘మేన్ మేడ్ ఫ్లడ్’’ కాకపోతే మరేమిటయ్యా! అని అడుగుతున్నా. ప్రజలు పట్ల మానవత్వం చూపని, ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం ఇది. వరదలు వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో కనీసం ఇంగితం లేని ప్రభుత్వం ఇది! -
బడుగు జీవితాలు పదేళ్లు వెనక్కు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పటమట/కృష్ణలంక: విజయవాడ ముంపు ప్రాంతాల్లోని పేదల జీవితాలు పదేళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముంపు తగ్గినా.. అక్కడి పేదలను కష్టాలు చుట్టుముట్టడంతో ఎలా బయటపడాలో తెలియక తమలో తామే కుమిలిపోతున్నారు. కష్టపడి సమకూర్చుకున్న ఇంటి సామగ్రి అంతా వరదపాలైంది. రెక్కలు ముక్కలు చేసుకుని బతికే ఒక్కో పేద కుటుంబం సైతం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల విలువైన సామాన్లను కోల్పోయింది. ఇంటి సామగ్రిని సమకూర్చుకోవాలంటే మరో పదేళ్లు శ్రమించినా కష్టమే అవుతుందని తల్లడిల్లిపోతున్నారు. పనులకు వెళ్లే అవకాశం లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ముంపు కాలనీల్లో లక్ష మందికి పైగా ఆటో, మోటార్, హమాలీ, భవన నిర్మాణ కార్మికులు, షాపు వర్కర్లు, రోజువారీ కూలీలే కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ చాలామంది ఇంట్లో పొయ్యి వెలిగించలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం వంట పాత్రలైనా సమకూర్చుకునే వరకు భోజనాల ప్యాకెట్లు సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం వరద బాధితులకు సరఫరా చేసే భోజనం ప్యాకెట్లను సోమవారం నుంచే నిలిపివేసింది. దీంతో వారు దాతలు ఇచ్చే భోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కాలనీలను వీడని ముంపుజక్కంపూడి వైఎస్సార్ కాలనీ, రాజీవ్నగర్ కండ్రిక, కుందావారి కండ్రిక, ఉడా కాలనీ, అంబాపురం కాలనీల్లో ఇంకా వరద నీరు నిలిచే ఉంది. దీంతో కొందరు చర్చిలు, కమ్యూనిటీ హాళ్లలో తలదాచుకుంటున్నారు. జవసత్వాలు కూడదీసుకుని నెమ్మదిగా రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నారు. సుందరయ్య నగర్లో ఇళ్లు దెబ్బ తినడంతో ఇంట్లో ఉండలేక వృద్ధ దంపతులైన బండి రమణమ్మ, ఆమె భర్త వెంకటేశ్వరరావు బయటే చిన్న గుడారం వేసుకుని ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పది రోజులపాటు బయటే ఉన్నారు. రమణమ్మ దివ్యాంగురాలు కావడంతో మంచంపైనే ఉండిపోయింది. దాతలు ఇచ్చే ఆహారంతో కాలం వెళ్లదీస్తున్నారు. బుధవారం ఆమె భర్త ఆహారం తెచ్చేందుకు వెళ్లిన సమయంలో ఆ వృద్ధురాలు మృతిచెందగా.. ఈ ఘటన కాలనీవాసుల్లో విషాదం నింపింది. చాలా కాలనీల్లో మురుగు పేరుకుపోయింది. చెత్త ఎక్కడికక్కడ గుట్టలుగా పేరుకుపోవడంతో పలు కాలనీల్లోని రోడ్లు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. తాగునీటి పైపులు మురుగులో ఉండటంతో నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న నీటిని తాగటం లేదు. ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. విష పురుగుల సంచారంతో బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు నిన్నటి వరకు వరద తమను వణికిస్తే... ఇప్పుడు దొంగలు భయపెడుతున్నారని.. మిగిలిన కొద్దిపాటి సామాన్లు కాపాడుకునేందుకు ఇంటిలో ఒకరు కాపలా ఉండాల్సి వస్తోందని ముంపు ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. మరోవైపు వరద నష్టంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్వే బృందాలు తమ ఇళ్లకు రాకుండా వీధి మొదట్లో ఉండి తమను ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని చెబుతున్నారని కండ్రిక ప్రాంత ప్రజలు వాపోతున్నారు.10 రోజులుగా పనుల్లేవు కండ్రిక ప్రాంతానికి చెందిన ఈమె పేరు ఎన్.నాగమణి. వరద ముంపు నుంచి ఇంట్లోని సామగ్రి కాపాడుకునే ప్రయత్నంలో ఆమె భర్త కాలు విరిగింది. ఆయన్ను ఆస్పత్రిలో చేర్చి, నాగమణి ఇంటికి వచ్చింది. ‘వరద తగ్గినా ఇంట్లోకి వెళ్లలేకపోతున్నాం. సర్వం కోల్పోయి పది రోజులుగా పనిలేకుండా ఉన్నాం. ఓ వైపు భర్త ఆస్పత్రి పాలయ్యాడు. వరదలో మునిగిన ఇంటిని చూస్తూ ఏడవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నా. వరద వస్తుందని ముందుగా చెప్పి ఉంటే సామాన్లు సర్దుకుని వెళ్లిపోయేవాళ్లం. ఇలా మునిగిన ఇళ్లను కాపలాకాసే పరిస్థితి వచ్చేది కాదు. ఇంట్లో సామగ్రి సమకూర్చుకోవడం పదేళ్లకైనా మాలాంటోళ్లకు కష్టమే’ అని నాగమణి ఆవేదన చెందుతోంది.వంట పాత్రలైనా ఇవ్వండయ్యావరద వచ్చినప్పుడు ప్రభుత్వం మాకు సమాచారం ఇవ్వాలి కదా.. ఒక్కసారిగా వచ్చిన వరదతో సామాన్లన్నీ వదిలేసి ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్లాం. ఇంట్లో ఇంకా వరద తగ్గలేదు. ఒక్క సామాను కూడా పనికివచ్చేలా లేదు. ప్రభుత్వం స్పందించి వంట పాత్రలు, బకెట్లు వంటివి ఇవ్వాలి. – శైలజ, కండ్రిక ఇంట్లో ఉండలేం.. బయటకు వెళ్లలేం ఇల్లంతా వరద నీరు. నీరు తోడటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. చర్చిలో తలదాచుకుంటున్నాం. మాకు ఆహారం ఇవ్వడం ప్రభుత్వం మానేసింది. దాతలు పంపిన ఆహారంతోనే కడుపు నింపుకుంటున్నాం. మా అమ్మకు బ్రెయిన్స్ట్రోక్ వచ్చింది. ఎక్కడికి వెళ్లలేని స్థితి. ఇంట్లో ఉండలేం. బయటకు వెళ్లలేం. – దేవర నాగమల్లేశ్వరి, కండ్రిక -
‘దేవుడా.. ఇంకెన్ని రోజులు’!.. విజయవాడ వరద బాధితుల ఆవేదన (చిత్రాలు)
-
ఆటో రిపేర్కు 3 నెలలు
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): విజయవాడను ముంచెత్తిన వరదల కారణంగా ఇక్కడి ఆటోవాలాలకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. వరదలో మునిగిన ఆటోలు మరమ్మతులు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు వేచి ఉండాలని, లేదంటే బయట మెకానిక్ల వద్ద రిపేర్లు చేయించుకోవాలని షోరూం యజమానులు తెగేసి చెబుతున్నారు. దీంతో కంగుతింటున్న ఆటోవాలాలు అన్ని రోజుల పాటు ఉపాధి కోల్పోతే కుటుంబ పోషణ, ఆటోల ఈఎంఐల చెల్లింపు ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఆటో యజమానులను మరింత ఆందోళనకు గురిచేసేలా షోరూం యజమానులు ఓ ప్రతిపాదన కూడా పెడుతున్నారు. వన్టైం సెటిల్మెంట్ చేసుకుని ఆటోను వెనక్కి ఇచ్చేస్తే.. కట్టిన వాయిదాలను, ఆటో కండిషన్ను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు నగదు ఇస్తామని చెబుతున్నారు. బయట రిపేర్లంటే కష్టమే.. బయట మరమ్మతులు చేయించుకోవాలంటే కష్టమేనని, తాము ఇబ్బంది పడతామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. కొత్త మోడళ్ల ఆటోల రిపేర్లు బయట మెకానిక్లకు తెలియదని, సరిగా చేయకపోతే మళ్లీ మొరాయిస్తాయని వాపోతున్నారు. షోరూం వాళ్లు మూడు నెలల సమయం పెడితే ఈఎంఐ ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటికే ఉపాధిలేక నానా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలేదని చెబుతున్నారు. వన్టైం సెటిల్మెంట్ చేసుకోవాలంటే సంబంధిత ఫైనాన్స్ కంపెనీల నుంచి కచి్చతంగా క్లయిం నంబర్ తీసుకోవాలని, ఆ నంబర్ ఇవ్వడానికి కూడా ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు చేసి ఆటోలు కొనుక్కున్నామని, ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు షోరూం వాళ్ల తీరుతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని పలువురు ఆటో డ్రైవర్లు వాపోయారు. సమస్యను వారంలో పరిష్కరిస్తానని సీఎం చెప్పారు ఆటోల మరమ్మతులు వారం రోజుల్లో చేయిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఆచరణలో సాధ్యం కాలేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఆటో మరమ్మతుకు మూడు నెలల సమయం పడుతుందని షోరూం వారు చెబుతున్నారు.అప్పటి వరకు ఏమి చేసి కుటుంబాన్ని నడపాలి. ఏమి చేయాలో అర్థం కావడంలేదు. వన్టైం సెటిల్మెంట్ చేసుకోవడం కుదరదు. గతంలో చెల్లించిన కిస్తీల పరిస్థితి ఏంటో చెప్పడంలేదు. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలి. – ఇ.సింహాచలం, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ -
నిబంధనలు గాలికి..
సాక్షి, అమరావతి: విపత్తుల సమయంలో అనుసరించాల్సిన ప్రాథమిక నిబంధనలను సీఎం చంద్రబాబు గాలికి వదిలేయడంతో విజయవాడ ప్రజలు అష్టకష్టాలు అనుభవించారు. దేశవ్యాప్తంగా పాటించే విపత్తు నిర్వహణ విధానాలను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో ప్రజల నష్టం, కష్టం మరింత పెరిగిపోయిందని నిపుణులు సైతం పేర్కొంటున్నారు.ముందస్తుగా ప్రజలను హెచ్చరించి అప్రమత్తం చేయడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, కష్ట సమయంలో ఆదుకుని తక్షణ ఆర్థిక సాయం అందించడం లాంటివి కీలకం. ఎన్డీఎంఎ (జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ) మాన్యువల్లో ఈ మూడు అంశాలు అత్యంత కీలకం. రాష్ట్రంలో ఏ విపత్తు తలెత్తినా ఇవే ప్రామాణికం. అందులోని అంశాల ప్రకారమే నివారణ చర్యలు, సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముందే హెచ్చరించినా..విజయవాడను ముంచెత్తిన తాజా వరదల్లో విపత్తు మాన్యువల్ను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. బుడమేరు వరద గురించి కనీస సమాచారం ప్రజలకు ఇవ్వలేదు. ఆగస్టు 31వ తేదీన విజయవాడ పరిసరాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని మూడు రోజులు ముందే వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలతో సీఎం కనీసం సమీక్ష నిర్వహించలేదు. జలాశయాలు నిండుకుండల్లా కనిపిస్తున్నా ‘ఫ్లడ్ కుషన్’ నిబంధన పాటించలేదు. తీరా బుడమేరుకు వరద పోటెత్తాక అర్థరాత్రి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తేశారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలను కనీసం అప్రమత్తం చేయకపోవడంతో సగం విజయవాడ మునిగిపోయింది. 2.50 లక్షలకు పైగా కుటుంబాలు వరద నుంచి బయటపడే అవకాశం లేక తీవ్రంగా నష్టపోయాయి. వరదల్లో 60 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్ని నిండు ప్రాణాలు బలవ్వగా లక్షలాది కుటుంబాలకు రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఆస్తులకు అపార నష్టం జరిగింది. విపత్తుల సమయంలో అనుసరించాల్సిన ప్రాథమిక సూత్రాన్ని ప్రభుత్వం పాటించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. ఏ దశలోనూ కళ్లు తెరవని బాబు ఆ తర్వాత దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవకపోగా విపత్తు నిర్వహణ విధానాలను గమనించకుండా ప్రజలను వరదకు వదిలేసింది. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు అంటే వరద లేని ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలి.రెండున్నర లక్షల కుటుంబాలు మునిగిపోయినా కనీసం 50 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని బట్టి ప్రభుత్వ అలసత్వం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. దీంతో లక్షల మంది రోజుల తరబడి నీటిలో చిక్కుకుని విలవిల్లాడిపోయారు. వరద నుంచి బయటపడిన వారు చెట్టుకొకరు పుట్టకొకరుగా రైల్వే స్టేషన్, బస్టాండ్లు, కమ్యూనిటీ హాళ్లు, తెలిసిన వాళ్ల ఇళ్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మునిగిన లోతట్టు ప్రాంతాలకు నాలుగు రోజుల వరకు కనీసం ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదు. విపత్తు నిర్వహణ మాన్యువల్లోని షెల్టర్ మేనేజ్మెంట్ను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించి లక్షలాది మందిని తీవ్ర అవస్థలకు గురి చేసింది. 60 మంది చనిపోతే ఎక్స్గ్రేషియా ఏదీ? విజయవాడ వరదల్లో లక్షలాది మంది చిక్కుకుంటే పునరావాసం కల్పించకపోగా తక్షణ సాయం అందించలేదు. తన దగ్గర డబ్బులు లేవని సీఎం చంద్రబాబు ముందే చేతులెత్తేశారు. 60 మంది చనిపోతే ఎక్స్గ్రేషియా గురించి పట్టించుకోలేదు. విపత్తుల సమయంలో ప్రాథమిక సూత్రాలను పాటించకుండా ప్రజలను వారి ఖర్మకు వదిలేసిన సీఎం చంద్రబాబు ప్రచారాన్ని మాత్రం ఆకాశమంత స్థాయిలో చేసుకున్నారు. అన్ని దశల్లోనూ విఫలమైనా తాను బాగా పని చేస్తున్నట్లు హడావుడి, హంగామా చేసి మభ్యపుచ్చేందుకు రకరకాల ఫీట్లు నిర్వహించారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారాలకు తెర తీశారు. వరదల్లోనూ చంద్రబాబు తన మార్కు రాజకీయాన్ని వదలకపోవడంతో లక్షలాది మంది ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. తక్షణ సాయం ఊసే లేదు.. జగన్ హయాంలో పక్కాగావిపత్తు బారిన పడిన వారిని పునరావాస కేంద్రాలకు తరలించి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు తక్షణ సాయం అందించాలి. అసలు కేంద్రాలే ఏర్పాటు చేయని కూటమి సర్కారు తక్షణ సాయం ఊసే లేకుండా చేసింది. వరదలు, తుపానులు వచ్చినప్పుడు వైఎస్ జగన్ హయాంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు ఆర్థిక సాయంగా రూ.2 వేలు చొప్పున పంపిణీ చేశారు. 2020లో కృష్ణా, గోదావరి వరదలు, 2023లో మిచాంగ్ తుపానుతోపాటు ప్రతి విపత్తులోనే ఇదే విధానాన్ని అనుసరించి బాధితులకు తక్షణ సాయం అందించారు. 2014కి ముందు తక్షణ సాయంగా రూ.వెయ్యి అరకొరగా ఇచ్చేవారు. వైఎస్ జగన్ హయాంలో దాన్ని రూ.2 వేలకు పెంచి బాధితులందరికీ అందేలా చర్యలు తీసుకున్నారు. -
పాడైన అన్నం పెడుతున్నారు.. బెజవాడను వెంటాడుతున్న వరద కష్టాలు..
-
కష్టాల ఊబిలో..
బెజవాడలో బుడమేరు వరద తగ్గింది. కానీ, ముంపు ప్రాంతాల్లోని ప్రజల కష్టాలు మాత్రం ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఏ వీధిలో చూసినా గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలు... ఇళ్లలో చేరిన బురద... పాడైపోయిన వస్తువులు... వాటిని శుభ్రం చేసుకుంటున్న జనం... ఇళ్ల ముందు కంపు కొడుతున్న మురుగు... మొరాయిస్తున్న వాహనాలు... సర్వం కోల్పోయి షాపులను చూసి విలపిస్తున్న చిరు వ్యాపారులు... చేతి వృత్తులవారు... ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర కష్టాల్లో మునిగిపోయారు. ముంపు ప్రాంతాల్లో ఎవరిని కదిలించినా లక్షల రూపాయలు నష్టపోయామని చెబుతున్నారు. కుటుంబమంతా 10 నుంచి 15 ఏళ్లుగా కష్టపడి పని చేస్తూ పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న వాహనాలు, టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్, మంచాలు వంటి వస్తువులన్నీ పాడైపోయాయని కన్నీరుపెడుతున్నారు. ఇప్పుడు కోల్పోయినవన్నీ మళ్లీ సమకూర్చుకోవాలంటే మరో 10 నుంచి 15 ఏళ్లు పడుతుందని కుమిలిపోతున్నారు.మరోవైపు ప్రభుత్వం ఆహారం, తాగునీరుపంపిణీ చేస్తున్నా... అవన్నీ దాదాపు మెయిన్ రోడ్లకే పరిమితమయ్యాయని, చిన్న చిన్న వీధుల్లో ఉన్న తమకు అందడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇళ్లను శుభ్రం చేసేందుకు సాయం అందిస్తున్న ఫైర్ సిబ్బంది సేవలు కూడా ప్రధాన వీధులకే పరిమితమయ్యాయని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అంటువ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.పాడి గేదెలను బలి తీసుకున్న వరద బుడమేరు వరద పశుపోషకులను నట్టేట ముంచింది. రూ. లక్షల విలువైన పశువులు వరదలో కొట్టుకుపోయి మృతిచెందాయి. దీంతో వాటిపై ఆధారపడినవారు అల్లాడిపోతున్నారు. సింగ్నగర్ లెనిన్ సెంటర్లో నివాసం ఉంటున్న వెల్లబోయిన నాగేశ్వరమ్మ, మల్లేశ్వరరావు దంపతులతోపాటు వారి కుమారుడు దుర్గాప్రసాద్, కుమార్తె రాజేశ్వరి కుటుంబాలు ఉమ్మడిగా ఉంటూ 9 గేదెలను పెంచుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. వారి 4 గేదెలు వరదలో కొట్టుకుపోయాయి. తాము చూస్తుండగానే గేదెలు కొట్టుకుపోయాయని, వాటి విలువ రూ.1.50లక్షలు ఉంటుందని నాగేశ్వరమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.రైల్వేస్టేషన్.. బస్టాండ్లో బతికాంఈ వ్యక్తి పేరు ఉప్పు శ్రీను. విజయవాడ సింగ్నగర్లోని కృష్ణా హోటల్ సెంటర్లో నివాసం ఉంటున్నారు. తండ్రి ఇచ్చిన కొద్దిపాటి స్థలంలోనే పక్కపక్కన శ్రీను, అతని ఇద్దరు తమ్ముళ్లు ఇళ్లు నిర్మించుకుని తమ కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. శ్రీను ఆటో నడిపితే.. భార్య, ఇద్దరు పిల్లలు మట్టి పనులు చేసుకుని పైసాపైసా కూడబెట్టుకున్నారు. శ్రీను తమ్ముళ్లు కూడా మట్టి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. యథావిధిగా ఈ నెల ఒకటో తేదీ అందరూ పనికి వెళ్లగా, అకస్మాత్తుగా వారి ఇంటి చుట్టూ వరద వచ్చింది. ఇంట్లో ఉన్న మగ పిల్లలు శ్రీను తల్లిని, ఇతర కుటుంబ సభ్యులను పక్కింటి గోడ దూకించి సురక్షితంగా బయటకు చేర్చారు. కట్టుబట్టలతో కొంత మంది రైల్వేస్టేషన్, మరికొంత మంది బస్టాండ్లో వారానికిపైగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. దొరికింది తింటూ ఆకలి తీర్చుకున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో రెండు రోజుల కిందట తిరిగి ఇంటికి వచ్చి శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు ముగ్గురి ఇళ్లలోని మంచాలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు మొత్తం పాడైపోయాయి. కొత్త బైక్ కాస్తా నీటిలోని ఇంజిన్ సీజ్ అయిపోయింది. ఆటోకు, బైక్కు ఇన్సూరెన్స్ కోసం ఫోన్లు చేస్తుంటే కంపెనీల ప్రతినిధులు మళ్లీ ఫోన్ చేస్తామంటూ పెట్టేస్తున్నారని శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఒక్క కుటుంబంలోనే రూ.4లక్షలకు పైగా నష్టం జరిగింది. ‘మేం మనుషులం మాత్రమే బతికున్నాం. సర్వస్వం కోల్పోయాం. వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా బురదలో కొట్టుకుపోయాయి..’ అని శ్రీను కుటుంబ సభ్యులు విలపించారు.నీటి కొరతతో ఇబ్బందులు కండ్రిక, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, సింగ్నగర్, డాబాకొట్లు.. ఇలా అనేక ముంపు ప్రాంతాల్లో బాధితులను నీటి కొరత వెంటాడుతోంది. పది రోజులపాటు జలదిగ్భందంలో ఆయా ప్రాంతాలు ఉండటంతో మున్సిపల్ వాటర్ పైప్లైన్లోకి మురుగు నీరు చేరింది. దీంతో చాలాచోట్ల నీటి సరఫరా పునరుద్ధరించినప్పటికీ కుళాయిల ద్వారా వస్తున్న నీటిని వాడుకోలేకపోతున్నామని ప్రజలు తెలిపారు. మరికొన్ని చోట్ల నీటి సరఫరా ఇంకా పునరుద్ధరించలేదు. విద్యుత్ సరఫరా మొదలైనప్పటికీ ఇళ్లలోకి నీరు చేరడంతో మోటార్లు సైతం దెబ్బతిని భూగర్భ జలాలను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. నీళ్ల కోసం ముంపు ప్రాంతాల ప్రజలు నేటికీ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు.ప్రధాన వీధులకే ఫైర్ ఇంజన్ పరిమితంనీట మునిగిన ఇళ్లను ఫైర్ ఇంజన్ల సాయంతో శుభ్రం చేస్తున్నామని పదేపదే ప్రభుత్వం చెబుతోంది. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. సింగ్నగర్, ఉడా కాలనీ, వాంబేకాలనీ, కండ్రిక, జక్కంపూడి వైఎస్సార్ కాలనీతోపాటు చాలా ప్రాంతాల్లోని అనేక వీధుల్లో ఇప్పటి వరకు ఫైర్ ఇంజన్లు వచ్చి ఇళ్లు శుభ్రం చేసిన దాఖలాలు లేవు. కేవలం ప్రధాన వీధులకు మాత్రమే ఫైర్ ఇంజన్లు పరిమితమయ్యాయి. ఎక్కువ మంది ఇప్పటికీ రోడ్లపై ఉన్న మురుగు నీటితోనే ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు.దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరివరదల్లో కొట్టుకుని వచ్చిన చెత్తాచెదారంతో డ్రెయిన్లలో నీరు బయటకు వెళ్లడం లేదు. రాజీవ్నగర్, పాయకాపురం, ప్రకాష్నగర్, రాధానగర్, కండ్రిక, కృష్ణా హోటల్, డాబాకొట్లు సెంటర్, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, పాత, కొత్త రాజరాజేశ్వరీపేటలు... ఇలా అనేక ప్రాంతాల్లో రోడ్లపై చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇళ్ల మధ్యలో మురుగు నిలిచిపోయింది. ఆయా ప్రాంతాల ప్రజలు దుర్వాసనతో అల్లాడుతున్నారు.కట్టుకోవడానికి బట్టల్లేవు... పొయ్యి వెలగడం లేదులోతట్టు ప్రాంతాల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్లు వారం రోజులకు పైగానే నీట మునిగే ఉన్నాయి. ముంపు వీడాక ప్రజలకు అసలైన కష్టాలు మొదలయ్యాయి. చిరువ్యాపారులు, రోజువారీ కూలీలకు 10 రోజుల నుంచి ఉపాధి లేదు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేదు. బయట అప్పు కూడా పుట్టని దుస్థితి. కనీసం పాడైపోయిన గ్యాస్ స్టౌ రిపేరు చేయించుకోవడానికి డబ్బులు లేని దీనస్థితి అనేక కుటుంబాల్లో నెలకొంది. గ్యాస్ ఏజెన్సీలు ఉచితంగా సర్వీస్ క్యాంప్లు నిర్వహిస్తున్నాయి. కానీ, స్పేర్ పార్ట్లు కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటోంది. వరద నీరు ఇంట్లో చేరడంతో బీరువాలు, ర్యాక్లలోకి దుస్తులు వేసుకోవడానికి వీల్లేకుండా పాడైపోయాయి. ఈ నెల ఒకటో తేదీన కట్టుబట్టలతో ఇళ్లు వదిలిన అనేక మంది బాధితులు నేటికీ వాటితోనే కాలం వెళ్లదీస్తున్నారు.ట్యాంకర్ల చుట్టూ పరుగెత్తుతున్నాం..నీళ్ల కోసం చీటీలు రాయించుకోవాలా? ఆడవాళ్లంబిందెలు పట్టుకుని రోడ్డు చివరకు ఎలా వెళ్తాం. ఇన్నీ రోజులు వరద నీటిలో మగ్గిపోయాం. బాగాలేని నీళ్ల కోసం కూడా ట్యాంకర్ల చుట్టూ పరుగెత్తాల్సి వస్తోంది. ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ జీవిస్తున్నా. నా కుట్టుమిషన్ కూడా వరదలో పొయింది. సరుకు మొత్తం మునిగిపోయింది. నా భర్త వాచ్మెన్గా పని చేస్తారు. పది రోజులుగా ఇద్దరి ఉపాధి పోయింది. తిండికి గతిలేని పరిస్థితి. మా ఇంటిలో చిన్న పాప (మనవరాలు) ఉంది. కనీసం దానికి స్నానం చేయించడానికైనా నీళ్లు కావాలి. లేకుంటే పాపకు ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందోనని భయమేస్తోంది. ఇప్పటి వరకు మాకు ప్రభుత్వం నుంచి ఎటుంటి సాయం అందలేదు. – కుమారి, జక్కంపూడి వైఎస్సార్ కాలనీమెకానిక్ షెడ్కు వెళ్లాలంటే గుబులువరద వస్తుందని ముందే తెలిసినప్పటికీ లోతట్టు ప్రాంత ప్రజలను ప్రభుత్వం కనీసం అప్రమత్తం చేసిన పాపాన పోలేదు. అలా చేసి ఉంటే ఇంట్లో వస్తువులు, బైక్లను అయినా సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకునే వాళ్లం అని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. లక్షల సంఖ్యలో బైక్లు, స్కూటీలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుత రోజుల్లో ఇంటి నుంచి బయట అడుగు పెడితే బైక్ అనేది సర్వసాధారణం. అలాంటి బైక్ ముంపునకు గురై పనిచేయలేని దుస్థితిలో ఇంటి ముందే పడి ఉంది. దాన్ని మెకానిక్ షెడ్ వరకూ నెట్టుకుని వెళ్లి రిపేర్ చేయించడానికి ఎంత బిల్లు అవుతుందోనని భయపడుతున్నారు. ప్రస్తుత కష్టాల్లో అంత ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవని చాలా మంది అలాగే బైక్లను వదిలేశారు. 70 శాతం బైక్లకు ఇన్సూరెన్స్ ఉండదుఒకపక్క సీఎం చంద్రబాబు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి పాడైపోయిన వాహనాలను రిపేర్ చేయించి పెడతామని పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే పాడైపోయిన బైక్లలో ఎన్నింటికి ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంటుంది? అనే చర్చ బాధితుల్లో నడుస్తోంది. సాధారణంగా బైక్ను కొత్తగా కొనుగోలు చేసినప్పుడు మాత్రమే యజమానులు ఇన్సూరెన్స్ చేయిస్తారు. అనంతరం 70 శాతం మంది సమగ్ర ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించరని వాహన, ఇన్సూరెన్స్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం ప్రకటనలతో తమకు మేలు జరగదని చాలామంది బైక్ యజమానులు వాపోతున్నారు.రక్తం పీలుస్తున్న దోమలుముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్ పనులు చేపట్టాల్సి ఉంటుంది. లేదంటే దోమల వ్యాప్తి అధికమై డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. కానీ ఆశించినంత వేగంగా ముంపు ప్రాంతాల్లో శానిటేషన్ పనులు సాగడం లేదు. మురుగు, చెత్త మేటలతో దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. దోమల నియంత్రణకు ఫాగింగ్ కూడా సక్రమంగా చేయడంలేదని వరద బాధితులు చెబుతున్నారు. చీకటిపడితే చాలు దోమలు రక్తం పీల్చేస్తున్నాయని, ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్నామని, దోమ కాటుతో తమ ఆరోగ్యాలు కూడా గుల్ల అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దాతల కోసం ఎదురు చూపులు ముంపు ప్రాంతాల్లో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసినట్టు ప్రచారం చేస్తోంది. పది రోజులుగా జలదిగ్భందంలో ఉండి చేతిలో చిల్లిగవ్వలేని రోజువారీ కూలీలు, చేతివృత్తిదారులు కూరగాయలు కొనుగోలు చేయలేకపోతున్నారు. కొందరు అప్పు చేసి కూరగాయలు, సరుకులు కొనుగోలు చేస్తున్నారు. అప్పు పుట్టని వారు దాతలు పంపిణీ చేసే ఆహారం కోసం ప్రధాన రహదారుల వెంబడి గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.రాకపోకలకు అవస్థలే...అజిత్సింగ్నగర్ నుంచి కొత్త రాజరాజేశ్వరీపేట వైపు వచ్చేందుకు ఉన్న వంతెనపై గుర్రపు డెక్క, బురద పెద్ద పేరుకుపోయింది. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలు ఎక్కువగా నివాసం ఉంటున్న కొత్త రాజరాజేశ్వరీపేట ప్రాంత ప్రజలు ఎక్కువగా పని కోసం సింగ్నగర్ వెళుతుంటారు. అటువైపు నుంచి నగరంలోకి వస్తారు.దుర్వాసన భరించలేకపోతున్నాం..వరద తగ్గినా మురుగు సమస్య తీరలేదు. సైడు కాలువల్లో వరద ముందుకు పారకపోవడంతో దుర్వాసనవస్తోంది. ఆ వాసన భరించలేకపోతున్నాం. ఒకవైపు వరద నీటిలో ఇల్లు మునిగి వంట సామాన్లు, మంచాలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్, పిల్లల పుస్తకాలు అన్నీ తడిసి పాడైపోయి బాధపడుతుంటే.. మరోవైపు ఈ మురుగు సమస్య వేధిస్తోంది. వరద గురించి ముందుగా హెచ్చరించి ఉంటే అప్రమత్తమయ్యేవాళ్లం. పగలు వరద వచ్చింది కాబట్టి బతికాం. అదే రాత్రివేళ అయితే ఊహించడమే కష్టం. – ఎం.దేవకుమారి, మసీదు రోడ్డు, శాంతినగర్పుస్తకాలన్నీ నీటిలో నానిపోయాయి తెల్లవారుజామున అకస్మాత్తుగా ఇంట్లోకి వరద నీరు రావడంతో ఏం చేయాలో పాలుపోలేదు. నా పుస్తకాలతోపాటు ఇద్దరు చెల్లెళ్ల పుస్తకాలు, రికార్డులను ఇంట్లో నుంచి తీసుకువెళ్లడం సాధ్యం కాలేదు. పుస్తకాలన్నీ వరద నీటిలోనే నానిపోయాయి. వరద తగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చి చూస్తే అవి ఎందుకూ పనికి రాకుండాపోయాయి. స్కూలులో ఉన్నప్పుడు జగనన్న ఇచి్చన డిక్షనరీలు మా చదువులకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. అవి నీళ్లలో నాని చిరిగిపోవడంతో ఇప్పుడు డబ్బులు పెట్టి కొనే పరిస్థితి లేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనేది మా అక్కచెల్లెళ్ల లక్ష్యం. పుస్తకాలు మళ్లీ కొనాలంటే మా తల్లిదండ్రులకు ఇబ్బందే. – వర్ష, ఇంటర్ విద్యార్థిని, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, విజయవాడ -
సరుకులు లేవు..సమన్వయం లేదు
ఆరురోజులుగా విజయవాడ అతలాకుతలమవుతోంది. లెక్కలేనన్ని మరణాలు... అంతులేనంత నష్టం.. ఐదు లక్షల మంది ప్రజల జీవితాలు తల్లకిందులైపోయాయి.. ఇంతజరుగుతుంటే వరద నిండిన వీధుల్లో ముఖ్యమంత్రి రోడ్షోలు, తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా జేసీబీల్లో మంత్రుల ఊరేగింపులే తప్ప బాధితులకు రవ్వంత ఉపశమనం కలిగించలేకపోయారు. సరుకులు పంచుతున్నామని ప్రచారం చేయడంతో శుక్రవారం జనం ఆశగా ఎదురుచూశారు.. యథాప్రకారం అదీ లేదు... ఇక బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు.. వీధిలో చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ నెపాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకోవడం చూసి జనం విస్తుపోయారు..సాక్షి, అమరావతి: వరద సహాయక కార్యక్రమాల్లో చంద్రబాబు సర్కారు తీరు అజిత్ సింగ్ నగర్ వంతెన సాక్షిగా నవ్వుల పాలైంది. శుక్రవారం ఏరియల్ వ్యూ ముగించుకున్న తర్వాత అజిత్సింగ్నగర్లో నిత్యావసర సరుకుల పంపిణీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు నిలదీయడంతో ఆయన పక్కనే ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండియన్ వైపు తిరిగారు. ‘ఈ రోజు అటు నిత్యావసర సరుకులు పంచలేకపోయారు.. ఇటు ఆహారం అందించలేకపోయారు... అక్కడ ఉన్న ముసలాయన నా గతి ఏంటి? అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి..’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఈ రోజు ఒక్కరి ముఖంలో కూడా కళ లేదు. ఎందుకంటే వారికి ఆహారం అందలేదు. కడుపులో ఎంతో కొంత పడితే వారు కష్టాన్ని మర్చిపోతారు. మనం వ్యవహరిస్తున్నది మనుషులతో.. యంత్రాలతో కాదు’ అని అన్నారు. ‘అప్పటి వరకు పాజిటివ్గా ఉన్న ప్రజలు కూడా ఇలాంటప్పుడు ఎక్కువ నెగిటివ్గా బయటకొస్తారు. ఈ రోజు ఇక్కడ అదే జరిగింది’ అని అన్నారు. ఈ రోజు ఎన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని సీఎం అడగ్గా.. ఇప్పటి వరకు 9,000 పంపిణీ చేశామని, సాయంత్రానికి 15,000 చేస్తామని వీరపాండియన్ తెలిపారు. అంటే మనం పెట్టుకున్న 80,000 లక్ష్యంలో కనీసం 20 శాతం కూడా చేయలేదా? అని సీఎం నిలదీశారు. మధ్యలో కలగ చేసుకున్న మంత్రి నాదెండ్ల ఈ మొత్తం తప్పును పురపాలక శాఖ మంత్రి నారాయణ మీద తోసేశారు. సరుకుల పంపిణీ కోసం నారాయణ ట్రాక్టర్లను పంపిస్తామన్నారని, మా రేషన్ వాహనాలు సిద్ధం చేసి సరుకులు పంపిణీ మొదలు పెట్టడంతో ఆలస్యం అయ్యిందన్నారు. ‘సర్.. నేను మీకు ఫిర్యాదు చేయడం లేదు కానీ.. సరుకుల పంపిణీ నీకు సంబంధం లేదు.. నేను, మనోజ్ చూసుకుంటామని మంత్రి నారాయణ గురువారం రాత్రి ఫోన్ చేశారు’ అని నాదెండ్ల మనోహర్ చంద్రబాబుకు చెప్పారు. ఇలా నాదెండ్ల అసలు విషయాన్ని బహిరంగంగా చెప్పడంతో చంద్రబాబు అవాక్కయ్యారు. వెంటనే వీరపాండియన్తో మంత్రులుగా మేం పాలసీలు మాత్రమే ఇస్తాం. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ఏమి చేయాలో అది చేయండి అంటూ వ్యాన్ ఎక్కి వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన ప్రజలు ఇదేం ప్రభుత్వమంటూ నవ్వుకున్నారు. మరికొందరు ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. -
దాతలు, ప్రజలే ఆదుకోవాలి
సాక్షి, అమరావతి : వరద ముంపు తగ్గిన తర్వాత బాధితులకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం అతిపెద్ద సమస్యగా మారిందని, ఖజనా చూస్తే అటువంటి పరిస్థితులు కనిపించడంలేదని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలన్నా అప్పులుచేయడానికి ఎఫ్ఆర్బీఎం పరిధి అడ్డువస్తుండడంతో బ్యాంకులతో దీర్ఘకాలిక రుణాల ద్వారా ప్యాకేజీ ఇప్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పూర్తిస్థాయిలో ఆదుకునే అవకాశంలేకపోవడంతో దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు సామాజికసేవలో భాగం పంచుకోవాలన్నారు. ప్రజలకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం కూడా ఉదారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రెండ్రోజుల్లో అందరితో మాట్లాడి ఎంతవరకు ఆర్థికసాయం చేయగలమన్న దానిపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు. అలాగే, రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై నివేదికను శనివారం కేంద్రానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు.రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ..ఆదివారం నుంచి నిత్యావసర వస్తువుల ప్యాకేజీని రేషన్ దుకాణాల ద్వారా అందిస్తామన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం 80,000 మందికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 15,000 మందికి కూడా ఇవ్వలేకపోయామన్నారు. ఇంటి వద్దకే అందించే విధంగా వాహనాలను అత్యధిక సంఖ్యలో తీసుకురావడం ఇబ్బందిగా మారిందన్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులను అందించాక ఆహారం పంచే కార్యక్రమానికి పూర్తిగా స్వస్తి పలుకుతామన్నారు. ఇక బుడమేరు మూడో గండిని శుక్రవారం అర్థరాత్రి లేదా శనివారం ఉదయానికి పూడ్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం ఆర్మీ కూడా రంగంలోకి దిగిందన్నారు. తాజాగా.. గురువారం కురిసిన వర్షాలతో బుడమేరులో వరద ప్రవాహం 9,000 క్యూసెక్కులకు చేరడంతో నగరంలోకి మళ్లీ నీరు వచ్చిందన్నారు. అంతకుముందు.. హెలికాప్టర్లో వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించానన్నారు. ప్రకాశం బ్యారేజీ 15 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేందుకు కేంద్రంతో కలిసి ఒక ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. రాజధానిలో భాగమైన విజయవాడ కూడా వరదలను తట్టుకునేలా ఒక మాస్టర్ప్లాన్ను కూడా రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో గిగ్ ఎకానమీని విస్తరిస్తాం..ఇదిలా ఉంటే.. ఈ వరద సంక్షోభం గిగ్ ఎకానమీకి (నచ్చిన సమయంలో పనిచేసుకోవడం) ఒక చక్కటి అవకాశమని, ఈ అవకాశాన్ని తాను అందిపుచ్చుకుంటున్నానంటూ చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేయడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వరదలపై సహాయక వివరాలను తెలియచేయడానికి ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడిన తీరుపై అందరూ విస్మయం వ్యక్తంచేశారు. ఇప్పుడు కాలం మారిందని.. నచ్చిన సమయంలో నచ్చిన చోట పనిచేసుకోవడానికి గిగ్ వర్కర్లు ముందుకొస్తున్నారని, వీరిని పెద్దఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరికీ ఉబరైజేషన్ (ఆన్లైన్ ద్వారా సేవలు)తో తక్కువ ధరలో సేవలు అందించడం ద్వారా డిజిటల్ ఎంపవర్మెంట్ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వరదల్లో కార్పెంటర్, ప్లంబర్, టీవీ మెకానిక్, ఆటోమొబైల్ మెకానిక్స్, పెయింటర్స్.. ఇలా నైపుణ్యం కలిగిన వారి అవసరముందని.. ఇంతమందికి ఇక్కడ సేవలు అందించేవారు సరిపడా లేకపోవడంతో గిగ్ వర్కర్ల సేవలను ఆన్లైన్ సేవల సంస్థల ద్వారా అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంక్షోభాన్ని అవకాశం తీసుకుని గిగ్ ఎకానమీని రాష్ట్రంలో విస్తరిస్తామన్నారు. ఎందుకీ సుత్తి అంటూ బాబుపై సెటైర్లు..ఇదిలా ఉంటే.. ప్రాజెక్టుల్లో ఎంత నీరు ఉంది, ఎంత వరద వస్తోందని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా గతంలో తాను వాసర్ ల్యాబ్ను అభివృద్ధి చేశానని, కానీ గత ప్రభుత్వం వీరి సేవలను వినియోగించుకోకపోవడంతో తాను శిక్షణ ఇచ్చిన వారు వేరే రాష్ట్రాల్లో కన్సల్టెంట్లుగా ఉన్నారంటూ బాబు తన స్వోత్కర్షను చెప్పుకొచ్చారు. నిజానికి.. వాసర్ల్యాబ్ అనేది ప్రాజెక్టుల నీటి స్థితిగతులపై రియల్ టైమ్లో సేవలందించే విధంగా ఒక ఐటీఐ విద్యార్థి పెట్టుకున్న సంస్థ. ఇది మన రాష్ట్రంతోపాటు వేరే రాష్ట్రాల్లో కూడా సేవలందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం అయిపోవడంతో వారిప్పుడు వేరే రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు. కానీ, అసలు వాసర్ల్యాబ్ను తానే సృష్టించినట్లు, వారికి తానే శిక్షణ ఇచ్చినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంతో విలేకరులు తెల్లమొహం వేశారు. వరదల సమయంలో అసలు విషయాలు వదిలి ఈ సుత్తి ఎందుకంటూ వారు సెటైర్లు వేసుకున్నారు. -
లోడెత్తడంతోనే సరి..
సాక్షి, అమరావతి: వరద సహాయక కార్యక్రమాల్లో ఆర్భాటపు ప్రకటనలు తప్ప.. ఆచరణలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. నిత్యావసరాల పంపిణీ విషయంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. బుధవారం సాయంత్రం సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో రేపటి (గురువారం) నుంచే వరద ముంపు బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. దీంతో గురువారం మొత్తం బాధితులంతా సహాయం కోసం ఎదురు చూశారు. తీరా సాయంత్రానికి.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా ముందుకు వచ్చి రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటల నుంచి నిత్యావసరాలు అందిస్తామని మరో ప్రకటన చేశారు. కానీ, క్షేత్ర స్థాయిలోకి వెళ్లి నిత్యావసరాలు అందించాల్సిన వాహనాలు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కూడా లోడింగ్ అవుతూనే కనిపించాయి.రూట్మ్యాప్ లేకుండా ఎలా?ఎండీయూ వాహనాలు చేరుకోవాల్సిన గమ్యస్థానాల వివరాలను వీఆర్వోలు ఇస్తారంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు చెబుతూనే ఉన్నారు. కానీ, ఉదయం 11 గంటలకు లోడింగ్ చేసుకున్న వాహనాలు రూట్మ్యాప్ లేక రాత్రయినా సరే ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎండీయూ వాహనాల్లోనే రెండు లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి వద్దే, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది నిత్యావసరాలు అందిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి విరుద్ధంగా శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చౌక దుకాణాల వద్దే రేషన్ ఇస్తామని ప్రకటించడం గమనార్హం. ఇప్పటికీ చాలా కాలనీల్లో మోకాలి లోతుపైగా నీళ్లు నిలిచి ఉన్నాయి. ఇక చాలా మంది బాధితులు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితులను పట్టించుకోకుండా ప్రభుత్వం నిత్యావసరాలపై నిర్ణయం తీసుకుంది. చౌకదుకాణాలే నీటమునినగిప్పుడు నిత్యావసరాలను ఎలా పంపిణీ చేస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.ఎండీయూల ఆకలి వెతలు..వరద బాధితులకు సాయం కోసం వచ్చిన ఎండీయూ వాహనాల ఆపరేటర్లను ప్రభుత్వం గాలికొదిలేసింది. రెండు రోజులుగా తిండితిప్పలు లేక.. నీళ్లు అందించే నాథుడు లేక తీవ్ర అవస్థలు పడ్డారు. గురువారం మధ్యాహ్నం విజయవాడ నగరానికి చేరుకున్న ఎండీయూలకు శుక్రవారం సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆహారం అందలేదు. ‘సాయం చేద్దామని వచ్చాం.. మేమే వరద బాధితులుగా మిగిలాం’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.చాలా మంది ఎండీయూ ఆపరేటర్లు షుగర్, బీపీ తదితర దీర్ఘకాలిక అనారోగ్య బాధితులు ఉన్నారు. ఆహారంతో పాటు మందులకు కూడా దొరక్క వారు నానా అవస్థలు పడ్డారు. దీనికితోడు వరద సహాయక చర్యలకు వచ్చిన ఎండీయూలకు ఎటువంటి రెమ్యూనరేషన్ ప్రకటించలేదు. చాలా వాటిల్లో అరకొరగానే ఆయిల్ కొట్టించి పంపించారు. సొంత ఖర్చులతో ఆయిల్ పట్టించుకుని వచ్చామని, రాకపోతే ఎక్కడ టార్గెట్ చేస్తారేమో అని భయపడ్డామని కొందరు చెప్పారు. 1,100 రేషన్ వాహనాల రాకవరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీకి వివిధ జిల్లాల నుంచి సుమారు 1,100 ఎండీయూ(రేషన్ పంపిణీ వాహనాలు) వాహనాలను తీసుకొచ్చినట్టు సమాచారం. గురువారం మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్న వాహనాలు శుక్రవారం సాయంత్రం వరకు రోడ్లపైనే దర్శనమిచ్చాయి. ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డుకు ఇరువైపులా ఎండీయూ వాహనాలు నిలిపారు. ఒక్కో వాహనంలో 40 మంది బాధితులకు సరుకులు పంపిణీ చేసేలా విధులు కేటాయించారు.ఇందులో 25 కిలోల బియ్యం బస్తాలు, రెండు కిలోల చొప్పున బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కిలో చొప్పున కందిపప్పు, పంచదార, లీటర్ పామాయిల్ ప్యాకెట్లను బ్యాగుల్లో వేసి ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. అయితే ఉదయం నుంచి ఎండీయూల్లో బియ్యం బస్తాలు లోడ్ చేసినప్పటికీ.. ఇతర నిత్యావసరాల బ్యాగులు రాలేదు. కానీ, మంత్రులు మాత్రం పత్రికల్లో వార్తల కోసం ఉత్తుత్తినే జెండాలు ఊపి వాహనాలు ప్రారంభించినట్టు చేశారని బాధితులు విమర్శిస్తున్నారు. మంచినీళ్లు ఇచ్చే నాథుడు లేడుఎండీయూ వ్యవస్థ వృథా అన్నారు. వరద బాధితుల కోసం మేమే రెండు రోజులుగా రోడ్లపై పడి ఉన్నాం. గురువారం సాయంత్రం విజయవాడకు వచ్చాం. మా వాహనంలో శుక్రవారం మధ్యాహ్నమైనా సరుకులు లోడింగ్ పూర్తి కాలేదు. ఎవరిని అడగాలో తెలియడం లేదు. మాకు కనీసం అన్నం పెట్టి, – దేవదానం, ఎండీయూ ఆపరేటర్, గుంటూరు గోరంట్లమేమే బాధితులుగా మారాం..బియ్యం బస్తాలు వేశారు. మిగిలిన సరుకుల సంచులు ఇవ్వలేదు. వాటిని ఇచ్చినా ఎక్కడికి వెళ్లాలో వేరే ఎవరో వచ్చి చెబుతారట. వాళ్లు ఎవరో.. ఎప్పుడొస్తారో తెలీదు. ఉదయం టిఫిన్ లేదు.. మధ్యాహ్నం భోజనం లేదు. రాత్రి నిద్రలేదు. సహాయం చేయడానికి వచ్చి మేమే వరద బాధితులుగా మారిపోయాం. – శంకర్, ఎండీయూ ఆపరేటర్, నూజివీడు -
వారిజీవితం ‘ఆటో’.. ఇటో!
సాక్షి, అమరావతి: విజయవాడ వరద విలయం.. సగటు బడుగు జీవితాలను ఒక్కసారిగా తిరగబెట్టింది. నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ జీవనాన్ని సాగించే ‘ఆటో వాలాల’ పరిస్థితి దారుణంగా మారింది. రయ్రయ్.. అంటూ రోడ్లపై దూసుకెళ్లే వేలాది ఆటోలు బుడమేరు ఉధృతితో కనబడకుండా పోయాయి. దాదాపు వారం రోజులుగా నీటిలో నానిపోతూ ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. శుక్రవారం వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం పర్యటించగా.. ముంపులో నుంచి ఆటోలను రోడ్లపైకి తీసుకొస్తూ, రహదారుల పక్కనే చేతనైనా మరమ్మతులు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లే కనిపించారు. ఇందులో ఎవరిని పలకరించినా కన్నీటి గాథలే వినిస్తున్నాయి. ఊహించని వరదల్లో విలవిల్లాడుతున్న జీవితాలు కళ్లముందు కదలాడుతున్నాయి. సింగ్నగర్ కాలనీలతో పాటు పైపుల రోడ్డు, పాయకాపురం, కండ్రిక, రాజరాజేశ్వరిపేట, అంబాపురంలో అత్యధికంగా ఆటోలు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. విజయవాడ నగరంలో తిరిగే ఆటోల్లో 80 శాతంపైగా ఈ ప్రాంతానికి చెందినవే. ఇక్కడ సుమారు 6 వేలకు పైగా ఆటోలు ఉంటాయని అంచనా. బుడమేరు ఒక్కసారిగా ముంచెత్తడంతో ఆ ఆటోలు, యజమానులు నీటిలో చిక్కుకుపోయారు. వరద నీరు ఇంజిన్లోకి చేరడంతో పాటు, సీట్లు, కవర్లు నీటిలో నానిపోవడంతో పెద్దఎత్తున నష్టపోయారు. 70 శాతం అద్దె ఆటోలే..బుడమేరు వరదల్లో ఇంటి ముందు పెట్టిన ఆటోలు కూడా కొట్టుకుపోయాయి. ఇప్పుడు నీటి ఉధృతి తగ్గడంతో యజమానులు ఆటోలను వెతుక్కునే పనిలో పడ్డారు. వాస్తవానికి ఇక్కడి ఆటో డ్రైవర్లలో 60–70 శాతం మంది అద్దె ఆటోలనే నడుపుకొనేవారే. ఆటోను బట్టి రోజుకు రూ. 450 నుంచి రూ. 500 వరకు అద్దె చెల్లిస్తూ.. సర్వీసులు తిప్పుకుంటున్నారు. రోజులో సర్వీసు ఉన్నా.. లేకున్నా ఆటో అద్దె చెల్లించాల్సిందే. రోజూ వేకువ జాము నుంచి రాత్రి వరకు కష్టపడినా రోజుకు రూ. 500 సంపాదించడం కష్టంగా ఉంటోంది. అలాంటి ఆటోవాలల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. చేతిలో చిల్లిగవ్వ లేక మరమ్మతులు చేసుకోలేక ఆటోవాలాలు దిక్కులు చూస్తున్నారు. ఒక్కో ఆటోకు సుమారు రూ.10 వేల నుంచి రూ. 20 వేలకుపైగా ఖర్చు చేస్తేకానీ మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించట్లేదని వాపోతున్నారు. మళ్లీ మొదటికి వచ్చింది..వరద తగ్గిపోయిందని ఇంటిని శుభ్రం చేసుకోవడం మొదలు పెడితే.. మళ్లీ తెల్లారేçÜరికి మెట్లపైకి వరద చేరింది. పైన అంతస్తుల్లో కాలకృత్యాలు తీర్చుకునే వారి వ్యర్థాలు మొత్తం నీళ్లలోకి చేరుతున్నాయి. ఎంత శుభ్రం చేసినా మళ్లీ మొదటికొచ్చింది. నేను గతంలో కరెంట్ కాంట్రాక్టు పనులు చేస్తూ దెబ్బతిన్నాను. ఆరోగ్యం రీత్యా నా కొడుకుతో కలిసి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. మాకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. వారం రోజులుగా ఆహారం అందించిన నాథుడే లేడు. బలవంతుడికి ఆహారం దొరికింది.. మా లాంటి బలహీనులు పస్తులున్నాం. ఇప్పుడు చలి జ్వరంతో ఇబ్బంది పడుతున్నాం. ఇదేం జీవితమో అర్థం కావట్లేదు. – ఏలియా, పాయకాపురంపాయకాపురం రాధానగర్కు చెందిన మణికంఠ. మూడేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుడమేరు వరద మణికంఠ జీవితాన్ని తల్లకిందులు చేసింది. రేయింబవళ్లు ఆటో నడిపి ఇంటిలో సమకూర్చుకున్న వస్తువులన్నీ దెబ్బతినడంతో సుమారు రూ. లక్షకుపైగా నష్టపోయాడు. నడిరోడ్డుపై నీట మునిగిన ఆటో వద్ద.. ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమిపెట్టుకుని ‘సాక్షి’ వద్ద గోడు వెళ్లబోసుకున్నాడు. ‘నాకు రూ.లక్షలు పోసి ఆటోలు కొనే పరిస్థితి లేదు. రోజూ రూ. 500కు అద్దె ఆటో నడుపుకొంటున్నాను. ఉదయం 5గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆటో నడిపితేనే ఒక్కోరోజు ఇంటికి రూ. వంద కూడా తీసుకెళ్లలేని పరిస్థితి. అలాంటిది వారం రోజులుగా ఉపాధి పోయింది. శనివారం రాత్రి వరద వస్తుందని అధికారులు హెచ్చరించలేదు. మేము రాత్రి నిద్రపోయాం. ఆదివారం ఉదయం 7 గంటలకే మా ఇంటిని వరద చుట్టుముట్టింది. ఆటోను స్టార్ట్ చేసి బయటకు వద్దామంటే ముందుకు కదల్లేదు. వైఎస్ రాజశేఖర్రెడ్డి కట్టించి ఇచ్చిన అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో అద్దెకు ఉంటున్నాం. ఇంటిలోకి నీళ్లు రావడంతో వంట సామగ్రిని తీసుకుని మొదటి అంతస్తులో కారిడార్లో కాలం వెళ్లదీస్తున్నాం. మునిగిపోయిన ఆటోను కిలో మీటరుపైగా మా నాన్నతో కలిసి తోసుకుంటూ వచ్చాను. కనీసం తాడు కట్టుకుని లాక్కుని వెళ్దామంటే మరో ఆటోని పోలీసులు లోపలికి రానివ్వట్లేదు. -
వరదను మించిన విపత్తు బాబే!
నీళ్లలో కొట్టుకొస్తున్న మృతదేహాలు.. నేలమట్టమైన గుడిసెలు.. బురద ముంచెత్తిన ఇళ్లు, వాకిళ్లు.. ధ్వంసమైన ఆస్తులు.. నిరాశ్రయులైన లక్షలాది ప్రజలు.. ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురుచూపులు.. ఇప్పటివరకు 57 మందికిపైగా మృత్యువాత.. రోదనలతో అలసిన గుండెలు... అంతటా దైన్యం.. శూన్యం.. మానవ తప్పిదానికి విజయవాడ చెల్లించుకున్న మూల్యం ఇదీ! – సాక్షి, అమరావతి వరదకు ముందు..1 . ఐఎండీ ముందే హెచ్చరించినా.. భారీ వరదలు ముంచెత్తడం విజయవాడ లోతట్టు ప్రాంతాల వాసులకు హఠాత్పరిణామమే... కానీ ప్రభుత్వానికి కాదు. విజయవాడ, ఎగువ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని, భారీ వరద రానుందని భారత వాతావరణ శాఖ (ఐంఎండీ) గత నెల 28నే (బుధవారం) రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. శుక్రవారం, శనివారం వర్షాలు కురుస్తున్నా సరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. శనివారం రాత్రి నుంచి పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది. అర్థరాత్రి దాటిన తరువాత భారీ వరద ముంచెత్తి విలయం సృష్టించి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. 2. హఠాత్తుగా అన్ని గేట్లు ఎత్తి... జనాన్ని ముంచేసి చంద్రబాబు సర్కారు మొద్దునిద్రతో పరిస్థితి విషమించి బుడమేరు వాగుకు భారీ వరద పోటెత్తింది. శనివారం అర్థరాత్రి దాటాక తెల్లవారు జాము సమయంలో వెలగలేరు 11 గేట్లను ఒకేసారి ఎత్తి వేశారు. గేట్లు ఎత్తే ముందు దిగువ ప్రాంతాల ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. లోతట్టు ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. హఠాత్తుగా గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు గాఢనిద్రలో ఉండగానే కాలనీలు, ఇళ్లను వరద ముంచెత్తి విధ్వంసం సృష్టించింది. 3. ‘ఫ్లడ్ కుషన్’ను పాటించ లేదువరదలు వస్తాయనే అంచనా ఉన్నప్పుడు పాటించాల్సిన విధివిధానాలను ‘ఫ్లడ్ కుషన్’ పేరిట సీడబ్ల్యూసీ నిర్దేశించింది. కృష్ణా నదికి ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుంటే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల... ఇలా వరుసగా రిజర్వాయర్లలో నీటిని దిగువకు విడిచి అవసరమైన మేరకు ఖాళీగా ఉంచాలి. ఈ ‘ఫ్లడ్ కుషన్’ నిబంధనను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేయడమే విజయవాడలో వరద బీభత్సానికి మరో ప్రధాన కారణం. ‘ఫ్లడ్ కుషన్’ పాటించి ఉంటే మున్నేరు, బుడమేరు వరదకు కృష్ణాలో ఎగువ నుంచి వచ్చే వరద జత కలిసేది కాదు. ప్రకాశం బ్యారేజ్కి ఆ స్థాయిలో వరద వచ్చేది కాదు. భారీ వరద కృష్ణాలో లేకుంటే బీడీసీ నుంచి వచ్చే నీరు కృష్ణలోకి చేరేది. తద్వారా వరద విపత్తు ఉండేదే కాదు.4 .కరకట్ట బంగ్లా ముంపును కప్పిపుచ్చేందుకే.... వరద ముంచెత్తడంతో చంద్రబాబు తన కరకట్ట బంగ్లాను ఖాళీ చేసి విజయవాడ కలెక్టరేట్కు చేరుకున్నారు. ఆ బంగ్లా సమీపంలోకి మీడియా ప్రతినిధులు వెళ్లకుండా కట్టడి చేశారు. తన బంగ్లా అక్రమ నిర్మాణమనే గుట్టు ఎక్కడ రట్టు అవుతుందోనన్నదే ఆందోళన మినహా వరదలను సమర్థంగా ఎదుర్కోవాలనే కనీస ధ్యాస ఆయనకు లేకుండా పోయింది.5 . 57 మందికిపైగా మృత్యువాత... అపార నష్టం వాతావరణ పరిజ్ఞానం, సమాచార–సాంకేతిక వ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందిన తరువాత కూడా విజయవాడలో వరదలు ఇంత విధ్వంసం సృష్టించడం పట్ల యావత్ దేశం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఇంతటి విపత్తుకు, విషాదానికి కారణం ఎవరంటే?.. అన్ని వేళ్లూ ముఖ్యమంత్రి చంద్రబాబునే దోషిగా చూపిస్తున్నాయి. అవును... ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం... ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్పడిన నేరం... దుర్మరణాలు కావవి చంద్రబాబు చేసిన హత్యలు... ఇదంతా ప్రభుత్వం సృష్టించిన విలయం. ప్రజలకు వరదలను మించిన విపత్తు చంద్రబాబేనేనది నిరి్వవాదాంశం!6 .వరద వచ్చిన తర్వాత.. వన్మేన్ షో.. పబ్లిసిటీ స్టంట్ఒకపక్కన వరద బాధితులు అల్లాడుతుంటే మీడియాలో ప్రచారం కోసం చంద్రబాబు చీప్ ట్రిక్స్కు పాల్పడ్డారు. అధికారులను క్షేత్రస్థాయిలోకి పంపించి యుద్ధప్రాతిపదికన పనులు చేయించడం ముఖ్యమంత్రి బాధ్యత. చంద్రబాబు మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ సహా యావత్ ఉన్నతాధికారులను తన చుట్టూ మోహరించారు. ఏదో సెమినార్ నిర్వహిస్తున్నట్టుగా దాదాపు 70 మంది ఉన్నతాధికారులను ఎదురుగా కూర్చోబెట్టి గంటల తరబడి ఉపన్యాసాలిచ్చారు. అధికార యంత్రాంగాన్ని వెంటబెట్టుకుని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన బోటు ఎక్కినా... జేసీబీ ఎక్కినా... కాలి నడకన వెళ్లినా... యావత్ అధికార యంత్రాంగం పిలిస్తే పలికేంత దగ్గరలోనే ఉండాలి. ఇక చంద్రబాబు అడుగుతీసి అడుగు వేస్తే చాలు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ.. మీడియాకు విడుదల చేస్తూ... వీడియో క్లిప్లతో రీల్స్ చేస్తూ పబ్లిసిటీ స్టంట్ను పతాకస్థాయికి చేర్చారు. దీంతో వరద బాధితులను పట్టించుకునే తీరిక, ఓపిక ఉన్నతాధికారులకు లేకుండా పోయాయి. 7 . సహాయ, పునరావాస చర్యలు శూన్యంవరద బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితుల కోసం శిబిరాలను ఏర్పాటు చేయలేదు. ఆరు లక్షల మంది వరదలో చిక్కుకుంటే తరలించేందుకు కనీసం 500 బోట్లను కూడా సిద్ధం చేయలేదు. బాధితులకు పట్టెడన్నం పెట్టలేదు. పాల ప్యాకెట్లు, తాగునీరు అందించలేదు. ఆరు రోజులైనా సరే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేకపోయింది. బంధువులు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహాయంపైనే బాధితులు ఆశ పెట్టుకున్నారు. 8 . అధికారులకు బెదిరింపులు.. ప్రతిపక్షంపై నిందలువరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ఆ తప్పును యంత్రాంగంపైకి నెట్టి వేయడంతోపాటు గత ప్రభుత్వ వైఫల్యంతోనే వరదలు వచ్చాయంటూ వితండవాదం వినిపించారు. ‘అధికారులు పని చేయడం లేదు...కొంతమంది ఉద్దేశపూర్వకంగాప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తు న్నారు... సస్పెండ్ చేస్తా... సంగతి తేలుస్తా... అంతుచూస్తా’ అంటూ మీడియా కెమెరాల ముందు హైడ్రామాకు తెరతీశారు. అసలు అధికారులను ఎక్కడ పని చేయనిచ్చారు? ‘అంతా నేనే.. ’ అనే ప్రచార యావతో బాధితులను నిండా ముంచారు. తన తప్పులు దాచిపెట్టి బుడమేరుకు గేట్లే లేవంటూ ప్రతిపక్షాన్ని తప్పుపట్టారు. సహాయ పునరావాసాలపై నిలదీసినందుకు ప్రతిపక్షంపై నిందలతో విరుచుకుపడ్డారు.9 . సచివాలయ, వలంటీర్ వ్యవస్థను పక్కనపెట్టేసి... ప్రతి 2 వేల ఇళ్లకు ఓ గ్రామ/వార్డు సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్తో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవాలన్న యోచనే చంద్రబాబుకు లేకుండా పోయింది. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను సద్వినియోగం చేసుకుని ఉంటే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉండేది. ఏ వీధిలో ఎంతమంది ఉన్నారు...? వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఎంతమంది? అనే పూర్తి వివరాలు తెలిసేవి. ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, తాగునీరు, పాల ప్యాకెట్లు సక్రమంగా సరఫరా చేయగలిగేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే దుగ్దతో సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు పక్కనపెట్టేశారు. దీంతో సహాయ, పునరావాస సేవల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.10 . మళ్లీ వరదొస్తున్నా తీరుమారని ప్రభుత్వం ఓసారి చేస్తే పొరపాటు అనుకోవచ్చు...కానీ అదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తుంటే అది కచ్చితంగా ప్రజలపట్ల నిర్లక్ష్యమే అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం అదే రీతిలో అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. వరద వస్తుందని ముందస్తు హెచ్చరికలు ఉన్నా సరే లోతట్టు ప్రాంతాలప్రజలను అప్రమత్తం చేయకుండా టీడీపీ ప్రభుత్వం ఘోర తప్పిదం చేసింది. కాగా గత రెండు రోజులుగా బుడమేరకు మళ్లీ వరద వస్తున్నా కూడా లోతట్టు ప్రాంతాలవారికి కనీస సమాచారం ఇవ్వడం లేదు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యతి్నంచడం లేదు. గురువారం రాత్రి వరద పెరిగింది... అయినా సరే ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయలేదు. శుక్రవారం రాత్రి కూడా వరద పెరుగుతున్నా సరే పట్టించుకోకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, బరితెగింపునకు నిదర్శమని పరిశీలకులు విమర్శిస్తున్నారు. -
పండుగనాడూ పస్తులే
సాక్షి, అమరావతి : హిందువుల తొలి పండుగ వినాయక చవితిని ఘనంగా నిర్వహించేందుకు దేశమంతా ఏర్పాట్లు చేసుకున్నారు. రాష్ట్ర రాజధానిలో భాగంగా చెప్పుకొనే విజయవాడలో మాత్రం పండుగ జాడ కానరావట్లేదు. బెజవాడ నగరం సగానికిపైగా వరద నీటిలో మునగడంతో బాధితులు తీవ్ర విషాదంలో ఉన్నారు. పండుగ నాడూ పస్తులుండాల్సిన స్థితిలో ఉన్నారు. వరద ప్రాంతాల్లో మంచి నీరు, ఆహారం కోసం బాధితులు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. దాతలు పెద్ద ఎత్తున తెస్తున్న ఆహారం, ప్రభుత్వం అందిస్తున్న మంచినీరు, ఆహారం వరద ప్రాంతాల మొదట్లోనే ఆగిపోతున్నాయి. వరద తీవ్రత ఉన్న లోపలి ప్రాంతాలకు అవి అందడంలేదు. దీంతో పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు నీటిలో ఎదురీదుతూ వచ్చి నీరు, ఆహారం కోసం ట్రాక్టర్లు, వ్యాన్ల వెంట పరుగులు తీస్తున్న దృశ్యాలు గుండెలు పిండేస్తున్నాయి. వరద విపత్తుతో యుద్ధం.. గురువారం మధ్యాహా్ననికి వరద కొంత శాంతించిందని ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ బుడమేరు ఊరిపై పడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నీటి ఉధృతి పెరగడంతో అజిత్సింగ్నగర్, రాజరాజశ్వరిపేట, వాంబే కాలనీ, సుందరయ్యనగర్, కండ్రిక తదితర ప్రాంతాల్లో ప్రజలు మళ్లీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ప్రజల జీవన్మరణ పోరాటం.. పోలీసుల ఆంక్షలు.. ఉద్యోగుల హడావుడితో వరద ప్రాంతాల్లో యుద్ధ వాతావరణంలాంటి పరిస్థితి నెలకొంది. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లిన వారిని మళ్లీ ఇంటికి చేరకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో కుటుంబంలో బయట కొందరు, వరద నీరు చుట్టుముట్టిన ఇళ్లలో మరికొందరు చిక్కుకుపోయారు. వారి వాళ్లను కలిసే అవకాశం లేక అవస్థలు పడుతన్నారు. అటుగా వెళ్లే ట్రాక్టర్లు, వ్యాన్లు, బస్సులు ఎక్కి ముంపు ప్రాంతంలోని ఇళ్లకు తిరిగి చేరేందుకు బాధితులు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ బారికేట్లు ఏర్పాటు చేసి ఎవరినీ వెళ్లనీయడంలేదు. తమనైనా ఇళ్లకు పంపాలని, లేదంటే ఇంట్లో చిక్కుకుపోయిన వాళ్లనైనా బయటకు తీసుకురావాలని వందలాది మంది ఆందోళన చేసినా పోలీసులు పట్టించుకోలేదు. పైగా వారిపై పోలీసులు పరుష పదజాలంతో విరుచుకుపడుతన్నారు. దీంతో మేమేమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నామా? మా ఇంటికి మేము వెళ్లకుండా అడ్డుకుంటారా? ప్రభుత్వం ఎలాగు పట్టించుకోదు.. మా చావు మేము చస్తాం అంటూ పలుచోట్ల ప్రజలు పోలీసులపై తిరగబడ్డారు.మాకు రిలీవర్ను ఇవ్వండి సార్.. అధికారులకు రోజు విడిచి రోజు షిఫ్ట్ పద్ధతిలో వరద ప్రాంతాల్లో విధులు కేటాయిస్తుంటే.. దిగువ స్థాయి ఉద్యోగులకు మాత్రం 24/7 విధులు చేయించడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. సార్.. రేపు వినాయక చవితి ఇంటికి వెళ్తాం.. ఒక్కరోజుకైనా రిలీవర్ను పంపించండి అంటూ వేడుకుంటున్నారు. వారం రోజులుగా విజయవాడలోనే పని చేస్తున్నామని, పండుగ ఒక్కరోజైనా వేరొకరిని కేటాయించి తమకు శలవు ఇవ్వాలని పశి్చమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీకి చెందిన ఉద్యోగులు అధికారులకు మొరపెట్టుకోవడం గమనార్హం. నిన్ను నమ్మలేం బాబు..బాధితుల ఆగ్రహంవన్టౌన్ (విజయవాడ పశ్చిమ) : వరద ప్రభావిత ప్రాంతాల్లో జనం ‘నిన్ను నమ్మలేం బాబు’ అంటూ ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు. ఐదు రోజులుగా జనం నరకాన్ని చవిచూస్తున్నారు. మొదటి మూడ్రోజులు కొంతమందికే ఆహారం, మంచినీరు వచ్చింది. అది కూడా వంతెన పైన ఉన్న ప్రాంతాల్లో ఇచ్చి చేతులు దులుపుకున్న సంగతులు తెలిసిందే. అధికారులు, ప్రజా ప్రతినిధులు చివరివరకూ వెళ్లలేక చేతులెత్తేశారని స్థానికులు మండిపడ్డారు. అయితే, ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుతోంది. దీంతో సీఎం చంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు సాయమందిస్తాం ధైర్యంగా ఉండండి అంటూ పదేపదే భరోసా కల్పిస్తున్నప్పటికీ ఇక్కడి స్థానికులు వారి మాటలను విశ్వసించడంలేదు. మీకు రేషన్ బియ్యాన్ని పంపిస్తున్నాం, ఇతర సరుకులను పంపిస్తాం అంటూ తెగ ప్రచారం చేస్తున్నా మళ్లీ వరద వస్తే వీరంతా తమను వదిలేస్తారంటూ దాదాపు 30–40 శాతం మంది సురక్షిత ప్రాంతాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు.అనేక బోట్లు మా ముందే ఖాళీగా వెళ్తుంటే తాము బతిమాలుతున్నా పట్టించుకోకుండా పోయారంటూ బాధితులు మండిపడుతున్నారు. అటువంటి ప్రభుత్వం ఉన్న క్రమంలో మళ్లీ వరదనీరు ముంచెత్తితే మా బతుకులు తెల్లారతాయంటూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. వరద పూర్తిగా తగ్గిన తరువాతే మా ఇళ్లకు వస్తామంటూ సింగ్నగర్, ఆంధ్రప్రభ కాలనీ, వాంబే కాలనీ, ఉడా కాలనీ, కండ్రిక, రాజరాజేశ్వరిపేట, ప్రకాష్నగర్, కబేళాలకు చెందిన వారు తేల్చిచెబుతున్నారు. రెండు రోజులుగా రోడ్డుపైనే ‘నిత్యావసర’ లారీలుఅన్లోడ్ చేయకపోవడంతో అవస్థలు పడుతున్న డ్రైవర్లువరద వల్ల సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మిల్లర్లు పంపించిన నిత్యావసర సరుకుల లారీలు అన్లోడ్ కోసం ఎదురుచూస్తున్నాయి. అధికారులు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో రెండు రోజులుగా విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో పెద్ద సంఖ్యలో లారీలు నిలిచిపోయాయి. వాటిని ఎప్పుడు తీసుకెళ్తారో అర్థమవ్వక.. లారీల డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. ‘గురువారం రాత్రి బియ్యం లోడుతో అమలాపురం నుంచి విజయవాడకు వచ్చాను. అప్పటి నుంచి బీఆర్టీఎస్ రోడ్డులోనే పార్కింగ్ చేసి ఉంచాను. అధికారులు ఎప్పుడు అన్లోడ్ చేయిస్తారో అర్థమవ్వట్లేదు’ అని లారీ డ్రైవర్ ఏడుకొండలు వాపోయాడు.– నెహ్రూనగర్, మేడికొండూరుప్రకాశం బ్యారేజ్కు మరమ్మతులుసాక్షి, అమరావతి: కృష్ణా వరద ఉధృతికి కొట్టుకొచ్చిన నాలుగు పడవలు ఢీకొనడంతో దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ మూడు గేట్లకు ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, సలహాదారు కన్నయ్యనాయుడు నేతృత్వంలో మరమ్మతు పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా 69, 67 గేట్ల కౌంటర్ వెయిట్లను గురు, శుక్రవారాల్లో బీకెమ్ సంస్థ కార్మికులు తొలగించారు. 67, 68, 69 గేట్లను కిందకు దించారు. శనివారం 67–68 గేట్ల వద్ద ఉన్న రెండు పడవలను మరపడవతో తొలగించనున్నారు. హైదరాబాద్లో తయారు చేయించిన ఐరన్ కౌంటర్ వెయిట్లను విజయవాడకు తెచ్చి.. వాటిని 69, 67 గేట్లకు శనివారం బిగిస్తారు. -
జీవితాలు వరదపాలు.. సాక్షితో బాధితుల ఆవేదన
-
బురదను తొలగించేందుకు బాబు వింత పనులు..
-
ప్రజలే బుద్ధి చెబుతారు!
భారతదేశం నదీ నాగరికతల దేశం. అసలు ఇక్కడ నదులను దేవతలుగా కొలవడం సంస్కృతిలో భాగం. ఈ సంస్కృతికి మూల విరాట్టులు ఆదివాసీలూ, దళితులే. అడవులు, నదీతీరాలు వీరి ఆవాసాలుగా ఉన్నప్పుడు వాటికి ఏ ఇబ్బందులూ కలగలేదు. ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చి, వస్తూత్పత్తి వాణిజ్య స్థాయిలో అవ్వడం ప్రారంభమయ్యిందో... అప్పుడే ప్రకృతి వనరులను విచక్షణా రహితంగా దోచుకోవడం ప్రారంభమయ్యింది. పట్టణాలు, నగరాలు విస్తరించాయి. చివరికి నదులు, కాలువలు, చెరువులు, అడవులు అన్నింటినీ ఆధిపత్య వర్గాలవారు కబ్జా చేశారు. వీరి చేతుల్లోనే భూమి, మూలధనం కేంద్రీ కృతమై ఉన్నందున వీరే పరిశ్రమలు, ఇతర వ్యాపారాలను స్థాపించి పేరాశతో డబ్బు, అధికార దర్పాలతో కబ్జాలకు తెరలేపారు. తత్ఫలితమే విజయవాడ, ఖమ్మం వంటి చోట్ల ఇవ్వాళ నదులు లేదా ఏరులు సృష్టించిన విలయాలు! ఈ నేపథ్యంలో విజయవాడను చుట్టుముట్టిన వరదలను చూడాలి. ఇక్కడ ప్రజల కడగండ్లకు ప్రధాన కారణం బుడమేరు కాలువ/ వాగు. జలవనరుల శాఖ పరిభాషలో ఇది ఒక మేజర్ డ్రెయిన్. ఎన్టీఆర్,కృష్ణా జిల్లాల్లో పంట పొలాల్లోని మిగులు నీరు ప్రవహించే ఒక వాగు. ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈ వాగు మైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రెడ్డిగూడెం, మైలవరం, కొండూరు మండలాల్లోని పులివాగు, భీవ్ువాగు, లోయవాగును కలుపుకొని ముందుకు సాగుతుంది. విస్సన్నపేట, తిరువూరు నుంచి వచ్చే కొన్ని ఏరులు కూడా దీనిలో కలుస్తాయి. ఇవన్నీ కలిశాక, వెలగలేరు మీదుగా విజయవాడ శివారులోని సింగ్నగర్, గూడవల్లి, గన్నవరం, బాపులపాడు, గుడివాడ, నందివాడ వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు గరిష్ఠ నీటి ప్రవాహ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే. దీని ఉద్ధృతి తగ్గించేందుకు 1970ల్లోనాటి ప్రభుత్వం జి. కొండూరు మండలం వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటరీని నిర్మించింది. అక్కడ చిన్న జలాశయాన్ని తలపిస్తుంది. ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందకు వరద ప్రవాహాన్ని నియంత్రించే వారు. తర్వాత దీన్నుంచి మళ్లింపు కాలువ (బుడ మేరు డైవర్షన్ ఛానెల్– బీడీసీ)ని తవ్వారు. అధికంగా వచ్చే వరద ఈ ఛానెల్ ద్వారానే ప్రవహించి, ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా నదిలో కలుస్తుంది. వీటీపీఎస్లోని వృథా నీటిని కూడా దీని ద్వారానే కృష్ణాలోకి పంపిస్తారు. దీని సామర్థ్యం చాలా తక్కువ.కాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనల్లో ఉండ గానే బుడమేరుకు 2005లో సుమారు 70 వేల క్యూసెక్కుల వరద పోటెత్తి, విజయవాడను ముంచెత్తింది. వరదను అరికట్టాలంటే మళ్లింపు కాలువ విస్తరణే మార్గమని ప్రతిపాదన వచ్చింది. తర్వాత పోలవరం కుడి కాలువను బుడమేరులో కలిపారు. అంటే పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణా నదిలో కలిపేందుకు దీన్నొక అనుసంధాన కాలువగా మలిచారు. పోలవరం కుడి కాలువను 37,500 క్యూసెక్కుల సామర్థ్యంతో డిజైన్ చేయగా, ప్రస్తుత సామర్థ్యం 8,500 క్యూసెక్కులు మాత్రమే. గత ఏడెనిమిదేళ్లుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణాలోకి వస్తున్నాయి. భవిష్యత్తులో పోలవరం కాలువను విస్తరించేందుకు అవకాశ ముంది. ఆ మేరకు బీడీసీ సామర్థ్యం కూడా ఇప్పుడున్న 10 వేల క్యూసెక్కుల నుంచి పెంచాల్సిన అవసరముంది. సహజమైన నదీ తీరాన్ని ఇవ్వాళ ధ్వంసం చేసి పెద్ద పెద్ద అంతస్తులతో భవనాలు కట్టి నదీ గమనానికి అడ్డుగా నిలవడమే కాక నదీజలాలు కలుషితం కావడానికి కూడా కారణమవుతున్నారు బడాబాబులు. విజయవాడకు ఇంతటి పెనుముప్పు రావడానికి ఇదే ప్రధాన కారణం. కృష్ణా నది కరకట్ట మీద పెత్తందారుల అక్రమ కట్టడాల వల్లే ఇది జరిగింది. ఈ కరకట్ట మీద ఉన్న ముఖ్యమంత్రి నివాసం, కొంతమంది వైద్యం పేరుతో వ్యాపారం చేస్తున్న వారి కట్టడాలు ఉన్నాయి. వాటిని కూలుస్తామనే మాట పాలకులు చెప్పడం లేదు. ఈనాడు తెలంగాణలో ‘హైడ్రా’ చెరువులు కబ్జా చేసిన వారి అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నట్లు అన్ని రాష్ట్రాలలో కూల్చివేయాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కూల్చివేతల అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రజలు ప్రాకృతిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పునరుజ్జీవనం గురించి ఆలోచించవలసిన సమయం వచ్చింది. ప్రజల్లో అలముకున్న నిరాశ, నిస్పృహల స్థానంలో సమకాలీన పరిస్థితుల పట్ల స్పష్టమైన అవగాహన నింపాలి. అప్పుడే వారు పెత్తందార్లకు బుద్ధి చెబుతారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు కదా!డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
ఎటు చూసినా అంధకారమే..!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనీవినీ ఎరుగని రీతిలో ముంచెత్తిన బుడమేరు వరద.. విద్యుత్ సరఫరా వ్యవస్థనూ తీవ్రంగా దెబ్బతీసింది. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) పరిధిలోని విజయవాడ, గుంటూరు, ఒంగోలు జిల్లాలు, సీఆర్డీఏ ప్రాంతంలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. వరద వల్ల 1.5 లక్షల సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటి వరకూ దాదాపు 70 వేల సర్వీసులకు విద్యుత్ పునరుద్ధరించినట్లు ఇంధన శాఖ వెల్లడించింది. ఆ లెక్కన చూసుకున్నా ఇంకా సగానికిపైగా సర్వీసులకు కరెంటు లేదు. 15 సబ్ స్టేషన్లు దెబ్బతినగా, ఇప్పటి వరకూ 12 సబ్స్టేషన్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. 33కేవీ సబ్ స్టేషన్లు 78 దెబ్బతినగా, వాటిలో 48 పునరుద్ధరించారు. 33 కేవీ ఫీడర్లు 44 పాడవ్వగా, వాటిలో 43 ఫీడర్లు, 11కేవీ ఫీడర్లు 543 ప్రభావితమవ్వగా 477 ఫీడర్లు బాగుచేశారు. ఈ మొత్తం వ్యవస్థను సరిచేయడానికి ఏపీజెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నుంచి దాదాపు 1800 మంది సిబ్బంది బృందాలుగా ఏర్పడి పనులు చేస్తున్నారు. మొత్తం రూ.4.61 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. అజిత్సింగ్నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీల్లో ఇంకా వరద నీరు ఉండటం వల్ల సరఫరా ఇవ్వలేకపోతున్నామని విద్యుత్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ‘సాక్షి’కి వెల్లడించారు. నేటికీ తేరుకోని ఎన్టీటీపీఎస్బుడమేరుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్మించిన యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జల విద్యుత్ ఉత్పత్తి (మినీ హైడల్) ప్లాంటు వల్ల దెబ్బతిన్న ఎన్టీటీపీఎస్ ఇంకా తేరుకోలేదు. జల విద్యుత్ కేంద్రం బుడమేరు వరద ప్రవాహానికి అడ్డుపడటంతో ఆ వరద నీరు వెనక్కి ఎగదన్ని వీటీపీఎస్ను ముంచెత్తింది. దీంతో వీటీపీఎస్లో 1,260 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం కలిగింది. ఇదే వీటీపీఎస్లో రోటర్ దెబ్బతినడంతో యూనిట్–8లో పదిహేను రోజుల క్రితం 800 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. తమిళనాడులోని ఉప్పూరు నుంచి కొత్త రోటర్ తీసుకువచ్చారు. అయినా ఈ నెల 10కిగానీ ఈ యూనిట్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. రెండేళ్లకోసారి చేసే నిర్వహణలో భాగంగా యూనిట్–7లో 500 మెగావాట్ల ఉత్పత్తిని 21 రోజుల పాటు నిలిపివేశారు. అది కూడా ఇంకా పూర్తవ్వలేదు. ఈ మొత్తం 1300 మెగావాట్లకు తోడు ఇప్పుడు బొగ్గు నిర్వహణ వ్యవస్థలను వరద ముంచెత్తడం వల్ల మరో 1,260 మెగావాట్లు ఆగిపోయింది. మొత్తం ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడగా ఇప్పటికి మూడు యూనిట్లను మాత్రమే పునరుద్ధరించగలిగారు. వీటీపీఎస్లోని యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఏపీజెన్కో ఎండీ కె.విఎన్. చక్రధర్ బాబు తెలిపారు. -
వలస జీవుల బతుకు దైన్యం
‘వానవస్తే.. వరద ముంచితే.. బతుకు తప్పిన వలస జీవులకు ఎంత నష్టం.. ఎంత నష్టం. అలుపన్నది ఎరుగక.. ఆకలన్నది తెలియక.. ఆయువునే పణంగా పెట్టి డొక్కలెండిన పేద జీవులకు ఎంత కష్టం.. ఎంత కష్టం..’ అన్నం తినే కంచం నుంచి కునుకుతీసే మంచం వరకు ప్రతి వస్తువునూ వరద ఎత్తుకుపోవడంతో వలస జీవుల బతుకులు దుర్భరంగా మారాయి. తడిసిన ఇళ్లల్లో ఉండలేక.. మరో చోటకు పోయే దారిలేక పేద బతుకులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో తమలో తామే రోదిస్తున్నారు.సాక్షి ప్రతినిధి బృందం : సొంతూరిలో ఉపాధి లేక పొట్ట చేతపట్టుకుని నగరానికి వలసొచ్చిన నిరుపేదల జీవితాల్లో బుడమేరు వరద పెద్ద గాయం చేసింది. ఐదారు రోజులపాటు వరద నీరు ఇళ్లలోనే తిష్టవేయడంతో తినే కంచం దగ్గర నుంచి పిల్లల పుస్తకాలు, యూనిఫామ్, టీవీ, ఫ్రిడ్జ్, బైక్ ఇలా ప్రతి ఒక్కటి పనికిరాకుండా పోయిన దుస్థితి. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో తాము మళ్లీ ఇవన్నీ సమకూర్చుకుని కొత్తగా కాపురం ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొందని వరద బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. తీవ్ర ముంపునకు గురైన ప్రాంతాల్లో అధిక శాతం బాధితులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి బతుకుదెరువుకు విజయవాడకు వలస వచ్చినవారే. ఎవర్ని కదిలించినా ‘ఈ నగరాన్ని నమ్ముకుని ఏళ్ల తరబడి బతికిన మాకు ఇప్పుడు నరకప్రాయంగా మారింది. బెజవాడలో బతుకుదామని వచ్చాం.. ఇప్పుడు చావడానికే వచ్చామా అనిపిస్తోంది. నానా పాట్లుపడి సమకూర్చుకున్న సామగ్రి మొత్తం పోయింది. సర్వం కోల్పోయి మా బతుకులు మళ్లీ పదేళ్ల వెనక్కు వెళ్లాయి’ అని కన్నీరుమున్నీరుగా విలపిస్తునారు. వలసజీవులు పడుతున్న మనోవేదన గుండెలను పిండేస్తోంది. గురువారం వరద ప్రాంతాల్లో పర్యటించిన ‘సాక్షి’ ప్రతినిధి బృందానికి వలస జీవులు తమ వెతలను వెళ్లబోసుకున్నారు. మళ్లీ సామాన్లన్ని సమకూర్చుకోవాలి వలస జీవులంతా అద్దెలు తక్కువ ఉంటాయని సింగ్నగర్, కృష్ణలంక, వైఎస్సార్ కాలనీ, రాజరాజేశ్వరిపేట వంటి ప్రాంతాల్లోనే ఉంటారు. కక్షగట్టిన వరద విపత్తు వారుంటున్న ప్రాంతాల్లో తీవ్ర నష్టం చేసింది. రోజువారీ పనికిపోతే వచ్చిన కొంత మొత్తంలోనే తినీతినక దాచుకున్న సొమ్ముతో కిస్తీల (ఈఎంఐ) రూపంలో సమకూర్చుకున్న మొబైల్ ఫోన్, టీవీ, కూలర్, ఫ్యాన్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్యాస్ స్టవ్, బైక్ వంటివన్నీ ముంపు వల్ల పనికిరాకుండా పోయాయి. ప్రస్తుత రోజుల్లో ఈ వస్తువులు లేకుండా సగటు జీవనం కూడా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఆ వస్తువులన్నీ తిరిగి కొనేదెలా అనే మనోవేదన పేదలందరినీ తీవ్రంగా వేధిస్తోంది. టీవీ, మొబైల్ ఫోన్, ఫ్యాన్, మిక్సీ, ఫ్రిడ్జి ఇలా ఇంట్లోకి నిత్యం అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేయడానికే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చవుతుంది. బైక్ కూడా పనికిరాకుండా పోయినవారికి మరో రూ.లక్షకుపైనే భారం అవుతోంది. రోజంతా పనికిపోతే రూ.500 వరకు సంపాదించే తాము మళ్లీ ఎన్నేళ్లు కష్టం చేస్తే అవన్నీ కొనుగోలు చేయడం సాధ్యపడుతుందని దిగులుపడుతున్నారు. ఇక జీవనాధారమైన ఆటోలు, రిక్షాలు, తోపుడు బండ్లు ధ్వంసమైన వారి పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.నా ఇల్లు ఐదు రోజులుగా నీటిలోనే ఉంది వడ్రంగి పని చేసుకుని బతుకుదామని పిల్లలను తీసుకుని 20 ఏళ్ల క్రితం విజయవాడ వచ్చేశాం. నా భర్త, పిల్లలు కష్టపడి సంపాదించిన దాంతో రేకుల షెడ్డు వేసుకున్నాం. ఏటా మా ప్రాంతంలో వరద వచ్చేది. వరద వచ్చిన ప్రతిసారీ మేం పటమట చేపల మార్కెట్ సమీపంలోని స్కూల్కు వచ్చి తలదాచుకునేవాళ్లం. ప్రభుత్వమో, దాతలో భోజనం పెట్టేవారు. వరద తగ్గగానే వెళ్లిపోయే వాళ్లం. గత ప్రభుత్వం కృష్ణా నదికి గోడ కట్టడంతో వరద సమస్య లేదు. ఇప్పుడు కూడా పల్లపు ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు, వర్షం నీటితో మా ఇల్లు మునిగిపోయింది. ఐదు రోజులుగా మా ఇల్లు నీటిలోనే ఉంది. కట్టుబట్టలతో బయటపడ్డాం. – నడకుదుటి లక్ష్మి, రోజువారీ కూలికట్టుబట్టలే మిగిలాయ్.. తెలంగాణలోని ఇల్లెందు నుంచి 30 ఏళ్ల క్రితం విజయవాడ వచ్చాను. నేను, నా భార్య పద్మ పారిశుధ్య పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. వరదపై మాకు ముందస్తు హెచ్చరికలు చేసినవారు లేరు. ఊహించని ఉపద్రవం ముంచుకురాగా ప్రాణాలతో బయటపడ్డాం. ఇన్నేళ్లుగా కష్టపడి సమకూర్చుకున్న టీవీ, మంచం, సెల్ఫోన్, బట్టలు ఏ ఒక్కటీ మిగల్లేదు. అవన్నీ సమకూర్చుకోవాలంటే కనీసం రూ.70 వేలు కావాలి. నాకు అంత స్థోమత లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. – భూక్యా శంకర్నాయక్, పారిశుధ్య కార్మికుడు తినే కంచం నుంచి ఏమీ మిగల్లేదు పాతికేళ్ల క్రితం విజయనగరం నుంచి విజయవాడకు వలస వచ్చాం. గతంలో వరద వస్తున్నప్పుడు ముందే ప్రభుత్వం హెచ్చరించేది. ఇంట్లో ఉన్న వస్తువులను ఆటోల్లో వేసుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లేవాళ్లం. ఈ సారి వరద వస్తోందని మాకు ఏ ఒక్క అధికారి చెప్పిన పాపానపోలేదు. ఉప్పెనలా వచ్చిన వరద రేకుల షెడ్డును ముంచేసింది. ప్రాణాలరచేత పట్టుకుని కుటుంబం అంతా బయటపడ్డాం. వరద తగ్గాక వెళ్లి చూస్తే ఇంట్లో ఏ ఒక్క వస్తువు మిగల్లేదు. మా అబ్బాయి బీటెక్, మా అమ్మాయి 10వ తరగతి చదువుతున్నారు. వాళ్ల పుస్తకాలు, యూనిఫామ్ బురదగొట్టుకుపోయాయి. తాపీపని చేస్తే రూ.800 ఇస్తారు. వచ్చే కూలితో ఇల్లు గడవడమే కష్టం. – జి.రామకృష్ణ, తాపీమేస్త్రిఆధార్ లేదు.. ఆధారం పోయింది తెలంగాణ నుంచి వచ్చి విజయవాడలో 25 ఏళ్ల క్రితం స్థిరపడ్డాం. అనారోగ్యంతో మా అమ్మా నాన్న చనిపోయారు. నాలుగేళ్ల క్రితం నా భర్త, ఒక్కగానొక్క కూతుర్నీ కోల్పోయి ఒంటరినయ్యాను. కూలీనాలీ చేసుకుని బతుకుతున్నాను. కనీసం పింఛన్ కూడా రావట్లేదు. ఆధార్ కార్డు లేదని ప్రభుత్వం పింఛన్ ఇవ్వట్లేదు. ఆధార్ లేక.. ఆధారం లేక అవస్థలు పడుతున్న నాకు వరద నిలువ నీడకూడా లేకుండా చేసింది. ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలి. – ఎలిశెట్టి సుజాత, ఒంటరి మహిళ -
విజయవాడలో బుడమేరు విలయం..ఈ ఫోటోలు చూడండి
-
బెజవాడ ‘ప్రళయానికి’ బాబే కారణం
సాక్షి, అమరావతి/జి.కొండూరు: కృష్ణా, బుడమేరు డైవర్షన్ ఛానల్ (బీడీసీ) ఒకేసారి ఉప్పొంగాయి. ఉండవల్లి కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ సౌధాన్ని వరద చుట్టుముట్టే ప్రమాదం వచ్చింది. ఆ అక్రమ బంగ్లాను ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు అర్ధరాత్రి కుట్ర పన్నారు. బుడమేరు వరదను శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత (తెల్లవారుజామున) మళ్లించేశారు. ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వకుండా వెలగలేరు రెగ్యులేటర్ 11 గేట్లు ఒకేసారి ఎత్తేయడంతో 60 వేల క్యూసెక్కుల బుడమేరు వరద విజయవాడ నగరంపై పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చేసింది. ఇదే విజయవాడలో జలప్రళయానికి, భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం జమ్ములవోలు దుర్గం కొండల్లో పురుడుపోసుకునే బుడమేరు.. ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లాల్లో పలు వాగులను కలుపుకుని రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, విజయవాడ శివారులోని సింగ్నగర్, గూడవల్లి, గన్నవరం, బాపులపాడు, గుడివాడ, నందివాడ మీదుగా ప్రవహించి కైకలూరు మండలం ఇళ్లపర్రు వద్ద కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు పరివాహక ప్రాంతం 1,321 చదరపు కిలోమీటర్లు. బుడమేరు వరదల వల్ల గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాలు.. ప్రధానంగా విజయవాడ ముంపునకు గురయ్యేవి. అందుకే బుడమేరును బెజవాడ దుఃఖదాయిని అంటారు.బీడీఎస్పై రాధాకృష్ణకు పవర్ ప్లాంటువిజయవాడ, కృష్ణా జిల్లాలకు బుడమేరు ముంపు ముప్పు నుంచి తప్పించడానికి 1960లో వెలగలేరు వద్ద రెగ్యులేటర్ నిర్మించారు. అక్కడి నుంచి 7,500 క్యూసెక్కుల సామర్థ్యంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ (బీడీఎస్) తవ్వి కృష్ణా నదిలో కలిపారు. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్) నుంచి 2 వేల క్యూసెక్కుల వేడి నీటిని కూడా బీడీఎస్లో కలిపేలా 1979లో మరో కాలువ తవ్వారు. అంటే ఏడాది పొడవునా బీడీఎస్లో రోజూ కనీసం 2 వేల క్యూసెక్కులు నీరు ఉంటుంది. దాంతో బీడీఎస్పై 1400 కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని 1994లో జెన్కో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే, 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకోవడానికి సహకరించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చంద్రబాబు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారు. 1020 క్యూసెక్కులు వినియోగిస్తూ 500 కిలోవాట్లు సామర్థ్యంతో 2 ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన ‘యాక్టివ్’ పవర్ ప్లాంట్కు 1998 ఏప్రిల్ 13న చంద్రబాబు అనుమతిచ్చారు. ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ 1,520 క్యూసెక్కులు వినియోగించి ఒక్కో కేంద్రంలో 700 కిలోవాట్లు ఉత్పత్తి చేసేలా 1999 ఫిబ్రవరి 15న అనుమతి ఇచ్చారు. ముంపు శాశ్వతంగా తప్పించడానికిబుడమేరుకు 2005లో 70 వేల క్యూసెక్కుల వరద రావడంతో విజయవాడ ముంపునకు గురైంది. దాంతో బుడమేరు ముంపు ముప్పు నుంచి విజయవాడను శాశ్వతంగా తప్పించడంపై అధ్యయనానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకు వెలగలేరుపై జి.కొండూరు మండలం కుంటముక్కల వద్ద మరో రెగ్యులేటర్ నిర్మించి 20 వేల క్యూసెక్కులను కృష్ణా నదిలో కలిపేలా డైవర్షన్ ఛానల్ తవ్వకం, బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులకు పెంచేలా ప్రణాళిక రూపొందించారు. రూ.241.45 కోట్ల ఖర్చుతో ఈ పనులు చేపట్టేందుకు 2008 ఆగస్టు 12న నాటి సీఎం వైఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈలోగా కృష్ణా డెల్టా ఆధునికీకరణలో భాగంగా ఎనికేపాడు నుంచి కొల్లేరులో కలిసే బుడమేరును అభివృద్ధి చేశారు. బీడీసీని ఆధునికీకరిస్తే రాధాకృష్ణ పవర్ ప్లాంట్ను తొలగించాలి. ఇందుకోసం 2009 ఆగస్టు 29న రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ని రద్దు చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో బీడీసీ ఆధునికీకరణ పనులు ముందుకు కదల్లేదు. ఇది బాబు చేసిన తప్పేబుడమేరు వరద శనివారం గంటగంటకు పెరుగుతుండడంతో స్థానిక ఏఈ ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. వారు ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియజేస్తూ వచ్చారు. శనివారం మధ్యాహ్నం కలువూరు వద్ద హెడ్ రెగ్యులేటర్ లాకులు ఎత్తివేయాల్సిన అవసరం వస్తుందని కూడా ప్రభుత్వాధికారులకు సమాచారం అందించారు. ప్రభుత్వం అనుమతితోనే శనివారం రాత్రి లాకులు పూర్తిగా ఎత్తివేశారు. ఇలా ముందుగానే ప్రభుత్వానికి తెలిసినా విజయవాడ నగర పరిధిలోని లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయకపోవడం వెనుక సందేహాలు తలెత్తుతున్నాయి. ఒక్కసారిగా హెడ్ రెగ్యులేటర్ వద్ద నిల్వ ఉన్న వేలాది క్యూసెక్కుల వరద కిందకు వస్తున్న క్రమంలో ప్రభుత్వం ముందస్తుగా ఎటువంటి సమాచారం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.బీడీసీ ఆధునికీకరణను పట్టించుకోని టీడీపీ సర్కార్రాష్ట్ర విభజనకు ముందు కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు కొన్ని షరతులతో ఎన్వోసీని పునరుద్ధరించింది. విభజన తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం రాధాకృష్ణకు లబ్ధి చేకూర్చడం కోసం బీడీసీ ఆధునికీకరణను అటకెక్కించేసింది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక బీడీసీ ఆధునికీకరణపై దృష్టి పెట్టింది. ఇందుకోసం 2021 జనవరి 6న రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు ఎన్వోసీని రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్వోసీ రద్దుపై హైకోర్టు స్టే విధించడంతో బీడీసీ ఆధునికీకరణ పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది.వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దుష్ప్రచారంచంద్రబాబు తప్పిదం వల్లే విజయవాడలో జలప్రళయం చోటుచేసుకుంది. అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వరద సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు సర్కార్ తీరుపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతుండటంతో సీఎం చంద్రబాబు నుంచి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వరకూ ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైకి నెట్టేందుకు పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నారు. బీడీసీ ఆధునికీకరణ పనులు 2014–19 మధ్య తాము చేపట్టామని, మిగిలిన పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేయకపోవడం వల్లే భారీ వరదకు బీడీసీ కరకట్టకు గండ్లు పడి విజయవాడలో జలవిలయం చోటుచేసుకుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.అర్ధరాత్రి వరద మళ్లించారువరద వస్తుందన్న విషయం మాకు చెప్పలేదు. అర్ధరాత్రి బుడమేరు నుంచి వరద వదిలారు. ఒక్కసారిగా వచ్చిన వరదతో ఇళ్లు నీటమునిగాయి. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.రోజానమ్మ, బాధితురాలు, సుందరయ్యనగర్ కట్ట ముందుగా హెచ్చరించలేదుఎటువంటి హెచ్చరికలు లేకుండా బుడమేరు వరద మాపైకి వదిలారు. వరద ఉధృతికి ఇళ్లు నీటమునిగాయి. వరద వచ్చిన నాటి నుంచి నేటి వరకు కంటిమీద కునుకు లేదు. తిందామంటే తిండిలేదు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణం. నల్లూరి లక్ష్మి, లక్ష్మీనగర్, 62వ డివిజన్ -
ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా..
-
వాంబే కాలనీ కష్టాలు
-
పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ పూర్తిగా విఫలమైందని సీఎం చంద్రబాబు చెప్పారు. అకాల వర్షాలకు తోడు మానవ తప్పిదంతో విజయవాడ నగరం ముంపునకు గురైందన్నారు. ప్రభుత్వ విభాగాలు సక్రమంగా పని చేయకపోవడంతో రాష్ట్రాన్ని వెంటిలేటర్పై పెట్టే పరిస్థితి తెచ్చారని అన్నారు. అధికారులు తన మాట వినడం లేదని చెప్పారు. ఏం చేయాలో తెలియడం లేదు అంటూ చేతులెత్తేశారు. ‘మూడు రోజులుగా వరద బాధిత ప్రాంతాల్లో మంచినీళ్లు, ఆహారం, పాలు లాంటి కనీస నిత్యావసరాలు కూడా అందించలేకపోయాం. ఇంకో రోజు సమయం ఇవ్వండి.. మొత్తం సెట్ చేస్తా’ అని అన్నారు. విజయవాడలో ప్రతి కుటుంబం శక్తి మేరకు వంటలు వండి క్యారేజీలు పంపాలని కోరారు. సీఎం చంద్రబాబు మంగళవారం విజయవాడలోని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. వరద బాధితుల బాధలు వర్ణనాతీతమని చెప్పారు. బిడ్డను బతికించుకోవడం కోసం భార్య భర్తలు ఒకరినొకరు వదిలేసి రావాల్సి వచి్చందన్నారు. మూడు రోజులుగా పిల్లలకు కనీసం నీళ్లు, పాలు ఇప్పించలేని దయనీయ స్థితి నెలకొందన్నారు. ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఉన్నారని, వారి మనోభావాలను అధికారులు అర్థం చేసుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కొందరు అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, ఓ అధికారిని సస్పెండ్ చేశామని చెప్పారు.సరిగా పని చేయకుంటే మంత్రులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాక్టర్ల ద్వారా ప్రతి సచివాలయం పరిధిలో అందిరికీ ఆహారం అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. వీలైనన్ని ఎక్కవ డ్రోన్లతో బిల్డింగులపై ఉన్న వారికి ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బుధవారం సాయంత్రానికి వాటర్ స్కీమ్స్, మెట్రో వాటర్ వర్క్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. కానీ, ఆ నీళ్లు తాగడానికి పనికిరావని, వాటి వినియోగంపై ప్రజలకు సూచనలు చేస్తామని అన్నారు. ఫైర్ ఇంజన్లతో ప్రతి ఇంటిని శుభ్రం చేయిస్తామన్నారు. ఆచూకీ లేని మృతదేహాలను వెదికి, పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. డ్రోన్లు, సెల్ఫోన్లు ఉపయోగించి దెబ్బతిన్న పంటలు, వరదల్లో మునిగిన వాహనాల నష్టాన్ని అంచనా వేస్తామన్నారు. బ్యాంకర్లు, ఇన్సూ్యరెన్స్ కంపెనీలతో సమావేశమై వాహనాలకు రెండు వారాల్లో క్లైయిమ్లు సెటిల్ చేయిస్తామని తెలిపారు. విధుల్లో చనిపోయిన విద్యుత్ లైన్మేన్ కుటుంబానికి డిపార్ట్మెంట్ రూ.20 లక్షలు, ప్రభుత్వం రూ.10 లక్షలు అందిస్తుందన్నారు.అప్పుడు వలంటీర్లు అనవసరం..ఇప్పటికిప్పుడు అత్యవసరంసాక్షి, అమరావతి: సచివాలయ వలంటీర్ల సేవలు అవసరమొస్తే గానీ.. సీఎం చంద్రబాబుకు వారు గుర్తు రాలేదు. గత ప్రభుత్వ హయాంలో వరదల వంటి విపత్తు సమయాల్లో వలంటీర్లు విశేష సేవలు అందించి.. ప్రభుత్వం అందించిన సాయాలను బాధితుల చెంతకు సత్వరమే చేర్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజునుంచీ రాష్ట్రంలోని వలంటీర్లకు ఏ ఒక్క పని అప్పగించకుండా.. గడచిన మూడు నెలలుగా వారికి జీతాలు కూడా చెల్లించకుండా.. సీఎం చంద్రబాబు వలంటీర్ల వ్యవస్థనే పూర్తిగా పక్కన పెట్టేశారు. విజయవాడ సింగ్నగర్, సమీప ప్రాంతాల్లో వరద విలయతాండవం చేయడంతో సోమవారం రాత్రి హడావుడిగా వరద సహాయక చర్యల్లో తక్షణం పాల్గొనాలంటూ అధికారుల ద్వారా ఆదేశాలు ఇప్పించారు. అదికూడా కేవలం విజయవాడ ప్రాంత వలంటీర్లను మాత్రమే రావాలని కోరారు. కాగా.. ఇతర ప్రాంతాల వలంటీర్లు విధులకు హాజరయ్యే అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు అంటున్నారు. -
ఎట్టకేలకు బయటకొచ్చిన పవన్
విజయవాడ, సాక్షి: భారీ వర్షాలు.. వరద బీభత్సంతో అల్లాడిపోయిన పరిస్థితులపై ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గిపోగా.. శుక్రవారం తీరికగా అధికారులతో కలిసి మానిటరింగ్ నిర్వహించారాయన. అయితే.. వచ్చి రావడంతోనే గత ప్రభుత్వంపై నెపం నెట్టేసే ప్రయత్నం చేశారాయన.‘‘బుడమేరును గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. సరిగా మెయింటెన్స్ చేయలేకపోయారు. బుడమేరు నిర్వహణ సరిగ్గా ఉంటే.. వరద ముప్పు తక్కువగా ఉండేది. ప్రస్తుతం వరద తగ్గుతోంది. పెద్ద ప్రమాదం తప్పింది’’ అని అన్నారాయన. అయితే సకాలంలో చర్యలు తీసుకోకపోవడం, సత్వరంగా సహాయక చర్యలు పప్రారంభించకపోవడంపై ఆయన మౌనం వహించారు. తక్కువ టైంలో ఎఫెక్టివ్గా పని చేశాం. ఇండియన్ ఎయిర్ఫోర్స్, నేవీ సహకారంతో బాధితులకు సాయం అందిస్తున్నాం. చిన్న చిన్న ప్రాంతాలకు కూడా ఐఏఎస్లను పెట్టాం. లక్షా 72 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. నేను సాయపడాలి కానీ అదనపు భారం కాకూడదు. సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే నేను ఫీల్డ్లోకి రాలేదు. ఇప్పుడు.. నా వంతు సహకారంగా కోటిరూపాయలు అందిస్తున్నా అని పవన్ తెలిపారు. -
వరద బాధితులకు వైఎస్సార్సీపీ భారీ విరాళం
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో వరదల నేపథ్యంలో వైఎస్సార్సీపీ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయల విరాళం ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిని నిన్న స్వయంగా వైఎస్ జగన్ సమీక్షించిన సంగతి తెలిసిందే. బాధితులతో మాట్లాడిన ఆయన.. వాళ్లకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఇవాళ అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన విరాళ ప్రకటన చేశారు. ‘‘వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదు. లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారు’’ అని సమావేశంలో పలువురు నాయకులు జగన్కు తెలిపారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవంగా ఎలాంటి చర్యలు అక్కడ లేవన్నారు. వరద ప్రాంతాల్లో షో చేస్తూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారని, అధికార యంత్రాంగమంతా ఆయనతో ఉంటూ, ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని చెప్పారు. ఫలితంగా.. వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా.. వారికి మందులు కూడా లభించడం లేదన్నారు. జగన్ స్పందిస్తూ.. తన పర్యటనలో వరద బాధితుల పడుతున్న కష్టాలను స్వయంగా చూశానన్న జగన్.. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లనే వరదలు ముంచెత్తాయని.. అయినా నింద వైఎస్సార్సీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని నేతలతో ఆయన అన్నారు. వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నామని.. అది ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది చర్చించి నిర్ణయం తీసుకుందామని నేతలతో జగన్ చెప్పారు. ఈ సమావేశంలో.. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు మెరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషు, పార్టీ నాయకుడు షేక్ ఆసిఫ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు. -
పవన్.. కొంచమైనా బాధ్యత ఉందా?
ఏపీలో వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి జన జీవనం స్తంభించి పోయింది. విజయవాడలో కనీవినీ ఎరుగని రీతిలో వరద బీభత్సం సృష్టించింది. కృష్ణమ్మ నీటి ప్రవాహం ధాటికి సిటీ జల దిగ్బంధమైంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరగుతోంది. పవన్ ఎక్కడ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా.. సీఎం చంద్రబాబు సహా పలువురు నేతలు వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తుంటే పవన్ ఎక్కడ అని అడుగుతున్నారు. గతంలో చిన్న చిన్న విషయాలకే గొంతు చించుకుని, చొక్కా ఎగరేసుకుంటూ పెద్దగా అరిచే పవనాలు సార్.. ఇలాంటి ఆపదలో ఎక్కడికి వెళ్లారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇంతటి నిర్లక్ష్యం వహించడమేంటని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. సరే ఈరోజు ఆయన పుట్టినరోజు. కుటుంబంతో ఒకవేళ బయటకు వెళ్లి ఉంటే తాను అందుబాటులో లేను అనే విషయామైన తెలియజేయాలి కదా?. సోషల్ మీడియా వేదికగా అయినా ప్రజల బాగోగులు అడుగవచ్చు కదా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో విషెస్ తెలిపిన వారిని కృతజ్ఞతలు చెప్పే సమయం ఉంది కానీ.. ప్రజలను పరామర్శించే టైమ్ లేదా? అని మండిపడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో అందరికీ అందుబాటులో ఉండి.. ముందుండి నడిపించాల్సిన పవన్.. ఎవరి ఆదేశాల మేరకు ఎక్కడ దాక్కున్నారో చెప్పాలి. సాధారణ రోజుల్లో తన ఆఫీసులో గంటల తరబడి అధికారులతో చర్చలు జరుపుతారు. ఇలాంటి సందర్భంలో మాత్రం బయటకు రాకపోవడమేంటి?. పవన్ ఎక్కడున్నా వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒరే @murthyscribe నీ ఓవర్ యాక్షన్ నీ ఓనర్ మీద బాగానే చూపిస్తున్నావురా. మరి పిల్ల బత్తయి @naralokesh వదిలేసావే. అంటే @ncbn తోనే మన వ్యాపారవ్యవహారాల జరుగుతాయా ? మన షష్ఠి పూర్తి వీరుడు @PawanKalyan ఎక్కడ కనపడటం లేదే pic.twitter.com/WWN4MXCUJM— Madhav (@nenunaaistam) September 2, 2024 -
కృష్ణలంకలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
విజయవాడలో జడివానకు స్తంభించిన జన జీవనం (ఫొటోలు)
-
కూటమి సర్కార్ నిర్లక్ష్యం.. బెజవాడను ముంచేసింది
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం నగర ప్రజలను ముంచేసింది. ప్రజలను అప్రమత్తం చేయని అధికారులు.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బుడమేరు 11 గేట్లు ఎత్తివేశారు. బుడమేరు గేట్లు ఎత్తేయడంతో కవులూరు వద్ద బుడమేరు కట్ట తెగిపోయింది.షాబాదు, కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, గొల్లపూడి రోడ్డు, సితార సెంటర్, మిల్క్ ఫ్యాక్టరీ, ఊర్మిళా నగర్, రామరాజ్య నగర్, పాత రాజరాజేశ్వరి పేట, కొత్త రాజరాజేశ్వరి పేట, నందమూరి నగర్,ఇందిరా నాయక్ నగర్, ఆంధ్రప్రభకాలనీలను బుడమేరు వరద ముంచెత్తింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోలేదు. బుడమేరు వరదతో నగరం నీట మునిగింది.ప్రకాశం బ్యారేజీకి 7 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తుతోంది. 5 లక్షల క్యూసెక్కులు దాటటంతో బుడమేరు నీరు కాలనీల్లోకి ప్రవహిస్తోంది. ప్రజలను కనీసం అప్రమత్తం చెయ్యని ప్రభుత్వం, అధికారులు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించలేదు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తున్న కూడా అధికారులు అప్రమత్తం చేయలేదు. -
ఊళ్లు.. నీళ్లు.. కోస్తా కకావికలం
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: ఎడతెరిపి లేని అతి భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు కోస్తా జిల్లాలు వణికిపోయాయి. వర్షపు నీరు వాగులా మారి రోడ్లపై ప్రవహిస్తుండడంతో విజయవాడ నగరం పూర్తిగా స్తంభించింది. మచిలీపట్నంలోనూ అదే పరిస్థితి నెలకొంది. విజయవాడ మొగల్రాజపురంలో ఇళ్లపై కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మంగళగిరిలో కొండరాయి తలపై పడి ఓ వృద్ధురాలు మరణించింది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలోని మురికివాగులో కారు కొట్టుకుపోవడంతో ఓ టీచర్, ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగి పడడంతో అమ్మవారి దేవస్థానం కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. భూపరిపాలన కమిషనర్ జయలక్ష్మి నేతృత్వంలో 19 మంది అధికారులతో కమిటీని నియమించింది. మచిలీపట్నం, విజయవాడలో అన్ని ప్రధాన రోడ్లు, వీధులు, సందులు, ఖాళీ స్థలాలు వరద ప్రవాహంతో నిండిపోవడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ సున్నపుబట్టీల సెంటర్ వద్ద శనివారం ఉదయం 7 గంటల సమయంలో కొండ చరియలు ఇళ్లపై విరిగి పడటంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక విద్యార్థి ఉన్నారు. నలుగురు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. నాలుగు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతులను నవుడు మేఘన (25), బోలెం లక్ష్మీ(49), పుర్కట్ లాలో (38), జంపాన అన్నపూర్ణ (55), కమ్మరి సంతోషాచారి (18)గా గుర్తించారు. మరికొందరు శిథిలాల కింద ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గుడ్లవల్లేరుకు చెందిన యశ్వంత్ అనే విద్యార్థి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఘటన స్థలం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కొండ రాళ్లను తొలగించి యశ్వంత్ ఆచూకీ నిర్ధారించాల్సిందిగా పొలీసులను కోరారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడం లేదని, పెద్ద రాళ్లను తొలగించటం సాధ్యం కాదని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం పెద్ద రాళ్లను తొలగిస్తే తప్ప నిర్ధారణకు రాలేమన్నారు. మరోసారి కొండ చరియలు విరిగి పడే సూచనలు కనిపిస్తుండటంతో సహాయ బృందాలు పలు ఇళ్లలో ప్రజలను ఖాళీ చేయించాయి. కాయ కష్టం చేసుకుని జీవించే వారంతా ఈ ఘటనతో బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో సమాచార కేంద్రం, డోనార్ సెల్ ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వర్షాలతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి మిరప పైర్లు నీట మునిగిపోయాయి. పసుపు, అరటి, కూరగాయ తోటలు ముంపుబారిన పడ్డాయి. మెట్ట రైతులకు భారీ నష్టం వాటిల్లింది. పెనమలూరు మండలం యనమలకుదురులో కొండ చరియలు విరిగిపడి షెడ్డు ధ్వంసం కావడంతో 20 జీవాలు మృత్యువాత పడ్డాయి. విజయవాడలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యాన చంద్ర తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా 8181960909 నంబర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ⇒ ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. గుంటూరులో వర్షం బీభత్సం సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 250 నుంచి 399 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. రోడ్లు జలాశయాలుగా మారాయి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కలకత్తా–చెన్నై రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. కాజా టోల్గేట్ వద్ద నాలుగు అడుగుల మేర వరద ప్రవాహంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పెదకాకాని మండలం ఉప్పలపాడు వద్ద వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో నంబూరు ప్రైవేట్ విద్యాసంస్థలో గణితం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నడుంపల్లి రాఘవేంద్రరావు(39), విద్యార్థులు పసుపులేని సౌదీస్ (6), కోడూరి మాన్విత్(9) మృత్యువాత పడ్డారు. మంగళగిరి కొత్తపేటలో కొండ చరియ విరిగి పడి రూకా నాగరత్నమ్మ (85) గాయాల పాలై మృతి చెందింది. ⇒ పల్నాడు జిల్లాలో 28 మండలాల పరిధిలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. అచ్చంపేట మండలంలో దోసపాటి చెరువుకు గండి పడింది. ⇒ ఏలూరు జిల్లాలో కరాటం కృష్ణమూర్తి జల్లేరు జలాశయంలోకి వరద పోటెత్తింది. నూజివీడులో పెద్ద చెరువుకు గండిపడి పొలాలు ముంపునకు గురయ్యాయి. ⇒ ప్రకాశం జిల్లాలో శనివారం చలిగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నెమలి గుండ్లరంగనాయకస్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన 40 మంది భక్తులు చిక్కుకుపోయారు. ⇒ బాపట్ల జిల్లా పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో రహదారులు చెరువులను తలపించాయి. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఐదువేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల వృక్షాలు నేలకొరిగాయి. ⇒ శ్రీకాకుళం జిల్లాలో రోజంతా జల్లులు పడటంతో వాగులు, చెరువులు ఉరకలెత్తుతున్నాయి. కడలి కల్లోలంగా మారింది. ⇒ వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో అత్యధికంగా 97 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కర్నూలు జిల్లాను ముసురు కమ్మేసింది. జిల్లా మొత్తంగా సగటున 19.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ⇒ విశాఖలో శనివారం గరిష్టంగా సగటున 50 మి.మీ వర్షపాతం నమోదైంది.అష్ట దిగ్బంధంలో అమరావతిసాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ: జోరు వర్షాలకు రాజధాని అమరావతి ప్రాంతం జల దిగ్బంధంలో చిక్కుకుంది. రాజధానిని వరద నీరు చుట్టుముట్టడంతో గ్రామాల నుంచి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొండవీటి వాగు ఉప్పొంగడంతో హైకోర్టుకు వెళ్లే ప్రధాన రహదారి నీటితో నిండిపోయింది. ఎస్ఆర్ఎం, విట్ వర్సిటీలు, పలు నివాస భవనాలు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కొండవీటి వాగు ఉధృతికి తాడికొండ మండలం లాం గ్రామం వద్ద అమరావతి– గుంటూరు ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు ఉప్పొంగడంతో రాజధానికి రాకపోకలు నిలిచిపోయాయి. అయ్యన్న వాగు, పాలవాగు కూడా పొంగి పొర్లుతున్నాయి. దొండపాడు టిడ్కో గృహాల వద్ద నీరు చేరడంతో బయటకు వచ్చే పరిస్థితి లేక అల్లాడుతున్నారు. నెక్కల్లు వద్ద వాగులో ఓ ఆటో గల్లంతు కావడంతో ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ట్రాక్టరుపై వెళ్లి తాడు సాయంతో ముగ్గురిని రక్షించారు. అమరావతి ప్రాంతంలో ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. చెరువులు ప్రమాదకర పరిస్థితికి చేరాయి. కొండవీటి వాగు గట్టుపై నుండి నీరు పొంగి ప్రవహిస్తోంది. ఈ వాగులో భారీగా జమ్ము, తూటికాడ అడ్డం పడుతుండటంతో నీరు ముందుకు కదలటం లేదు. దీంతో ఎగువ నుండి వస్తున్న వరద నీరంతా వెనక్కి తన్ని గ్రామాలు, పొలాల్లోకి వస్తోంది. దీంతో రాజధాని ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో రికార్డుస్థాయిలో వర్షంవిజయవాడలో వందేళ్ల చరిత్రలో ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. శుక్రవారం సాయంత్రం 4 నుంచి శనివారం 4 గంటల వరకు 24 గంటల్లో నగరంలో 26.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు తెనాలిలో 17.9, వత్సవాయిలో 17.75, మంగళగిరిలో 15.47, దాచేపల్లిలో 15.2, నూజివీడులో 15, వీరులపాడులో 14.95, ఆగిరిపల్లిలో 12.65, పెదకాకానిలో 11.25 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. కృష్ణా, గుంటూరులో ఇందుకే అధిక వర్షాలు నైరుతి రుతుపవనాలు కొనసాగుతున్న సమయంలో ఉత్తరాంధ్రలో వాయుగుండం ఏర్పడితే నైరుతి సెక్టార్లో ఉన్న దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రధానాధికారి స్టెల్లా తెలిపారు. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడానికి ఇదే కారణమని చెప్పారు. -
అంబేద్కర్ విగ్రహంపై టీడీపీ దాడి.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ఎందుకీ వివక్ష బాబూ?.. అంబేద్కర్కు అలంకరణ కరువు
సాక్షి, విజయవాడ: పంద్రాగస్ట్ వేడుకలకు కూడా డా.బిఆర్. అంబేద్కర్ స్మృతి వనం నోచుకోలేదు. అంబేద్కర్ మహా న్యాయశిల్పాన్ని చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడను రాష్ట్ర ప్రభుత్వం రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించింది. అయితే స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ స్మృతివనానికి మాత్రం మరిచింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రారంభించారనే ప్రభుత్వం వివక్ష చూపిందని పలువురు బాహాటంగా విమర్శించారు. విద్యుత్ కాంతులతో బందరు రోడ్డు మెరిసిపోతోంది. ఇందిరాగాంధీ స్టేడియంతో పాటు బందరు రోడ్డులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ అలంకరణ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి కూతవేటు దూరంలోనే రాజ్ భవన్, కలెక్టరేట్,కలెక్టర్ క్యాంప్ కార్యాలయం,సీపీ కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్ ఉన్నాయి. అంబేద్కర్ మహా న్యాయశిల్పం మినహా అంతటా విద్యుత్ దీపాలంకరణ వెలిగిపోతోంది. బందరు రోడ్డు మధ్యలోని డివైడర్లు, చెట్లు, కరెంట్ పోల్స్కు సైతం విద్యుత్ అలంకరణ చేశారు. -
విజయవాడ : ప్రకాశం బ్యారేజి వద్ద సందర్శకుల సందడి (ఫొటోలు)
-
‘అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలన్నదే కూటమి సర్కార్ ప్లాన్’
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. విగ్రహంపై ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందన్నారు. అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించడం టీడీపీ నేతలకు ఇష్టంలేదని చెప్పుకొచ్చారు.కాగా, విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ నేతలు నిరసన చేపట్టారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనల్లో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్,షేక్ ఆసిఫ్, పోతిన మహేష్, దళిత సంఘం నేతలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి.👉ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది ధ్వంసం చేయాలని చూశారు. ఈ దుశ్చర్యను యావత్ రాష్ట్ర ప్రజానీకం ఖండించారు. అంబేద్కర్ను అవమాన పరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసన చేపట్టాం. ఈ ఘటనకు కారకులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ నిరసన తెలిపాం. కొంతమంది కళ్లు లేని కబోథులు అక్షరాలే కదా అని అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రాంతంలో ఏ చిన్న అవాంతరం జరిగినా అవమానమే. గునపాలతో దాడి చేసేందుకు వస్తే మీకు కళ్లు కనిపించలేదా?. అంబేద్కర్ విగ్రహం బెజవాడ నడిబొడ్డున ఉండటం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఇష్టం లేదు. అంబేద్కర్ను అవమాన పరిచిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని గవర్నర్, రాష్ట్రపతికి లేఖలు ఇచ్చాం. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తాం. అంబేద్కర్ విగ్రహంపై గునపం పడితే ఊరుకునేది లేదు. మా ఆందోళన ఉధృతం చేస్తాం. ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తాం. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎలాంటి వారైనా శిక్ష పడాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 👉మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం ఉండటాన్ని ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. ఈ ఘటనపై ఇంతవరకూ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. రాత్రి పూట లైట్లు ఆర్పి అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ సెక్యూరిటీ లేదు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగింది. ఈ దాడి ఘటనపై కేంద్రాన్ని, గవర్నర్, రాష్ట్రపతిని, కోర్టులను ఆశ్రయిస్తాం. 👉వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉండకూడదని నీచమైన చర్యలకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం దిగజారిపోయి వ్యవహరిస్తోంది. అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. 👉విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తెర తీసింది. అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. 👉వైఎస్సార్సీపీ నాయకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ప్రజాస్వామ్యం పై దాడిగా పరిగణిస్తాం. రాజ్యాంగంపై నమ్మకం ఉంటే ఈ ఘటనను ప్రభుత్వం ఖండించి ఉండేది. ఈవీఎంలను నమ్ముకున్నారు కాబట్టే అంబేద్కర్పై జరిగిన దాడిని ఖండించ లేకపోతున్నారు. చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి ఎందుకు నివాళులర్పించలేదు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అంబేద్కర్కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు. స్వరాజ్య మైదానాన్ని చంద్రబాబు చైనా కంపెనీలకు, సుజనా చౌదరికి అమ్మేయాలని చూశారు. వారసత్వ సంపదైన స్వరాజ్య మైదానాన్ని చంద్రబాబు దోచుకోవాలని చూశారు. కానీ, వైఎస్ జగన్ మాత్రం కాపాడారు. కుట్రలు కుయుక్తలతో అంబేద్కర్ విగ్రహాన్ని విధ్వంసం చేయాలనేదే కూటమి పార్టీల ఉద్ధేశం. పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదు. అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని శిక్షించకపోతే రాష్ట్ర ప్రజలు త్వరలోనే మిమ్మల్ని తిరస్కరిస్తారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
అంబేద్కర్ విగ్రహంపై దాడి రాజకీయ కుట్రే: కైలే అనిల్ కుమార్
సాక్షి, తాడేపల్లి: విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగితే కూటమి ప్రభుత్వం కనీసం స్పందించ లేదన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. అలాగే, విగ్రహం వద్ద దాడిపై టీడీపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.కాగా, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగే అవకాశం ఉందని ప్రభుత్వానికి తెలియదా?. విగ్రహం దాడిపై టీడీపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారు. ఒకసారి దుండగులు దాడి చేశారన్నారు. ఇంకో సారి ఏపీ ఐఐసి వాళ్ళు వచ్చారు అన్నారు. మరోసారి వైఎస్ జగన్ అంటే గిట్టని దళితులు ఎవరో చేశారని అంటున్నారు. అసలు దాడి చేసింది ఎవరైనా తేల్చాల్సిందే ప్రభుత్వ మే కదా?. అంత మంది వచ్చి దాడి చేస్తుంటే పోలీసులకు తెలియలేదా?. విగ్రహం వద్ద రాత్రి సమయంలో లైట్లు ఆర్పేస్తే ఎందుకు సిబ్బందిని విచారించలేదు. పోలీసులు కూడా అక్కడే ఉన్నారని అంటున్నారు. ఒకవేళ పోలీసులు లేకపోతే ఎందుకు ఇప్పటివరకు ఎవ్వరినీ విచారించలేదు. పోలీస్ కమిషనర్ ఆఫీస్ పక్కనే ఉన్న అంబేద్కర్ స్మృతివనంపై జరుగుతున్న దాడి కనిపించలేదా?. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్పైనా, ఆయన భావజాలంపైనా చంద్రబాబుకు గౌరవం లేదు. అందుకే ఈ దాడి జరిగినా కనీసం స్పందించలేదు.స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడం సీఎం చంద్రబాబుకి ఇష్టం లేదు. ఆయన అమరావతిలో పెడతాను అన్నారు తప్ప అక్కడ పెట్టలేదు. స్వరాజ్య మైదానాన్ని గతంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి చంద్రబాబు లబ్ది పొందాలని చూశారు. గతంలోనే అక్కడ ప్రజలు ఆందోళన చేస్తే చంద్రబాబు వెనక్కి తగ్గారు. అంబేద్కర్ స్మృతి వనానికి రక్షణ లేకపోవడం దారుణం. అంబేద్కర్ను గుర్తు చేసుకునేలా చంద్రబాబు ఏనాడైనా ఒక్క పని చేశారా?. చంద్రబాబు ఏనాడైనా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లారా?. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర. టీడీపీ నేతలే అరాచక మూకలని పంపారు. అంబేద్కర్ స్మృతి వనం తీసేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టే కుట్ర ఉంది. అందులో భాగంగానే ఈ దాడికి పాల్పడ్డారని భావిస్తున్నాం. వాళ్లే ప్రభుత్వంలో ఉండి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. -
ఈ ‘బరితెగింపు’.. ఎల్లో మీడియాకు కనబడలేదా?
ఏమిటి ఈ బరి తెగింపు.. ఏమిటీ అరాచకం. చివరికి రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వదలిపెట్టరా! ఏపీలో జరుగుతున్న దుష్టపాలనకు ఇది నిలువుటద్దంగా నిలుస్తుంది. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడ నడిబొడ్డున భాసిల్లుతున్న అంబేద్కర్ విగ్రహం. అక్కడే ఉన్న పార్కు, లైబ్రరీ అంతా ఒక విజ్ఞాన సంపదగా ఉన్న టూరిస్టు స్పాట్పై గురువారం రాత్రి దాడి జరగడం అత్యంత శోచనీయం.ఏపీ సమాజంలో అశాంతి రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో అంబేద్కర్ విగ్రహంపై దాడి మరింత ప్రమాదకరంగా ఉంది. ఒకవైపు గవర్నర్ బంగళా, మరో వైపు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల నివాసాలు, కార్యాలయాలు ఉన్న విజయవాడ స్వరాజ్మైదాన్లోని అంబేద్కర్ విగ్రహంపై దుండగులు దాడికి సాహసించారంటే కచ్చితంగా దీని వెనుక ఎవరో కొందరు పెద్దల హస్తం ఉందన్న అనుమానం సహజంగానే వస్తుంది. ప్రత్యేకించి అంబేద్కర్ కేంద్రాన్ని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును శిలాఫలకం నుంచి తొలగించడానికి జరిగిన యత్నం చూస్తే ఇది టీడీపీ అల్లరి మూకల పనేనన్న సంగతి అర్ధం అవుతుందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ల ప్రమేయంతోనే ఇలాంటి నీచమైన అకృత్యాలు జరుగుతున్నాయని ఆ పార్టీ ధ్వజమెత్తుతోంది. అంబేద్కర్ను దేశ వ్యాప్తంగా ప్రజలు గౌరవిస్తారు. అంతర్జాతీయంగా కూడా అనేక దేశాలలో ఆయన విగ్రహాలు ఉన్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో సైతం ఆయన విగ్రహాలు ఉన్నాయంటే ఆయన పట్ల మానవ సమాజం ఎంత అభిమానంతో ఉండేదో తెలుస్తుంది. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన రావడం, దానిని ఎక్కడో మారుమూల కాకుండా విజయవాడ నడి బొడ్డున ఏర్పాటు చేసి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి జగన్ ప్రభుత్వం సంకల్పించి పూర్తి చేసింది. వేలాది మంది ప్రజలు రాష్ట్రం నలుమూల నుంచి తరలిరాగా, విగ్రహం.. అంబేద్కర్ లైబ్రరీ, పార్కు మొదలైనవాటిని జగన్ ఆవిష్కరించారు.నిత్యం వేలాది మంది అక్కడకు వెళ్లి అనుభూతి పొందుతారు. 2014 టరమ్లో చంద్రబాబు ప్రభుత్వం కూడా అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించాలని, ఆయన పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాని విజయవాడ వంటి సెంటర్లో కాకుండా, అమరావతిలో ఎక్కడో మారుమూల ఒక గ్రామంలో నెలకొల్పాలని ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రభుత్వం చివరికి దానిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన. జగన్ ప్రభుత్వం ఏదో కుగ్రామంలో కాకుండా, విజయవాడ నగరంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సముచితంగా ఉంటుందని భావించింది. స్వరాజ్మైదాన్ను అటు అంబేద్కర్ కేంద్రంగాను, ఇటు పార్కు, వాకింగ్ ట్రాక్ మొదలైనవాటితో టూరిస్టు స్పాట్గా అభివృద్ది చేయాలని ప్లాన్ చేసి సుమారు రూ.400కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసింది.సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్ను అంతా చూసుకుంటారు. పేదల గుండెల్లో, ప్రత్యేకించి దళితుల హృదయాలలో ఆయన కొలువై ఉన్నాడంటే ఆశ్చర్యం కాదు. స్వరాజ్మైదాన్ను అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం చైనా మాల్గా మార్చాలని ప్రయత్నించింది. కాని విజయవాడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ముందుకు వెళ్లలేదు. జగన్ ప్రజలందరికి ఉపయోగపడేలా దానిని తీర్చిదిద్దారు. అంతే కాక అంబేద్కర్ పేరుతో కోనసీమ జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా రాజకీయం జరిగింది.తొలుత అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు కోనసీమ జిల్లా అని పేరు పెట్టగా దళితవర్గాలు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసి ఆందోళనలకు దిగాయి. ఆ ఉద్యమంలో టీడీపీ, జనసేన వంటివి కూడా పాల్గొని దళితవర్గాలను రెచ్చగొట్టాయి. జగన్ ప్రభుత్వం అందరి అభిప్రాయాల మేరకు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు కూడా జత చేసింది. అప్పుడు ఇదే టీడీపీ, జనసేన నేతలు ఇతర వర్గాలను రెచ్చగొట్టి కల్లోలం సృష్టించాయి. చివరికి అప్పటి మంత్రి, ఒక ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేసి నిప్పు పెట్టి అరాచకానికి పాల్పడ్డాయి. టీడీపీ, జనసేనలు డబుల్గేమ్ ఆడినా జగన్ ప్రభుత్వం నిర్దిష్ట విధానంతో ముందుకు వెళ్లింది. దాని వల్ల వైఎస్సార్సీపీకి కొంత నష్టం కూడా వాటిల్లింది. ఆ తర్వాతకాలంలో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం నిర్మాణాన్ని భారీ ఎత్తున చేపట్టారు.విజయవాడకు ఎటువైపు నుంచి ఎంటర్ అవుతున్నా విగ్రహం కనబడుతుంటుంది. అలాంటి టూరిస్ట్ స్పాట్ పై టీడీపీకి చెందిన కొందరు గూండాలు దాడి చేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణంగా ఉంది. అంబేద్కర్ కేంద్ర సిబ్బంది నుంచి సెల్ పోన్లు లాక్కుని మరీ టీడీపీ కార్యకర్తలు రౌడీయిజానికి పాల్పడ్డారు. ఈ విగ్రహాన్ని ప్రారంబించిన జగన్ పేరు అక్కడ ఉండడం వారికి నచ్చలేదు. అంతే ఆ అక్షరాలను పీకేశారట. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సమాచారం అంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోకపోవడం శోచనీయం. టీడీపీ గూండాలు హత్యలు, దాడులు, విద్వంసాలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు చూసి-చూడనట్లు ఉండడం, పైగా వాటిని ప్రోత్సహించే విదంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లు వ్యాఖ్యలు చేస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో టీడీపీ రౌడీలకు అడ్డు, ఆపు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.ఇక తెలుగుదేశం మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నాయి. చివరికి ఆంద్రజ్యోతి మీడియా ఈ దాడిని సైతం సమర్ధించే రీతిలో కదనాలు ఇస్తోందంటే అది ఏ రకంగా తయారైంది అర్థం చేసుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ వారు ఎంత అరాచకం చేసినా కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు. ఆయనకు పదవి రావడం పరమాన్నంగా మారింది. ఇక్కడ ఒక సంగతి గమనించాలి. గతంలో ఎప్పుడూ ఇలా విగ్రహాలపై, శిలాఫలకాలపై ఏ రాజకీయ పార్టీ దాడి చేయలేదు. ఒక్కడైనా ఒకటి, అరా జరిగినా, పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకునేవారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను దగ్ధం చేయడం, ధ్వంసం చేయడం, జగన్ పేరు, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్న శిలాఫలకాలను ద్వసం చేయడం వంటి అల్లర్లతో టీడీపీ అరాచక శక్తులు రెచ్చిపోయాయి.గుంటూరులో స్వయంగా ఒక టీడీపీ ఎమ్మెల్యేనే గుణపం పట్టుకుని శిలాఫలకాన్ని కూల్చుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చాయి. రాజమండ్రిలో అప్పటి ఎంపీ భరత్ ఆద్వర్యంలో ఒక వంతెన నిర్మాణం జరిగింది. దానికి సంబంధించిన శిలాఫలకాన్ని కూడా టీడీపీ గూండాలు ద్వంసం చేశారు. ఇలా ఒకటి కాదు. అనేక చోట్ల టీడీపీ కార్యకర్తలు నీచంగా వ్యవహరిస్తుంటే నిరోధించవలసిన నాయకత్వం వారిని ఎంకరేజ్ చేసేలా కామెంట్స్ చేస్తూ వచ్చింది. టీడీపీ దళిత నేతలు సైతం నోరు విప్పడం లేదు. గతంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎవరైనా కొద్దిపాటి అపచారం చేసినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేవి. అలా వార్తలు ఇవ్వడం తప్పు కాదు. ఏ నాయకుడి విగ్రహంపైన ఎవరూ దాడులు చేయకూడదు. కాని వైఎస్ విగ్రహాలను ద్వంసం చేసినా, చివరికి అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా ప్రముఖంగా వార్త ఇవ్వలేదంటే వారు ఏ స్థాయికి దిగజారింది అర్ధం చేసుకోవచ్చు.టీడీపీ మీడియాలో ఈ ఘటనలు రిపోర్టు చేయకపోతే, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా టీడీపీ రౌడీ గ్యాంగ్లు, టీడీపీ మీడియా మాఫియా మాదిరి ప్రవర్తిస్తున్న తీరు ఏపీ బ్రాండే ఇమేజీని నాశనం చేస్తున్నాయి. చంద్రబాబు ఈ వయసులో మంచి పేరు తెచ్చుకోకపోతే మానే, ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారన్న అప్రతిష్టను మూటకట్టుకుంటున్నారు. ఇదంతా ఆయన కుమారుడు లోకేష్ కనుసన్నలలో జరుగుతోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు టీడీపీ ఇష్టారీతిన విధ్వంసానికి పాల్పడితే, అప్పటి సీఎం పేరును, మంత్రుల పేర్లను ఫలకాల నుంచి తొలగించి ఆనందపడితే, భవిష్యత్తులో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే, అప్పుడు ఇదే పరిస్తితి వారికి ఎదురు కాదా అన్న ప్రశ్న వస్తుంది. కాని సంకుచిత స్వభావంతో వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతం విచక్షణ కోల్పోయి ఉన్మాదులుగా మారారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అధికారం శాశ్వతం కాదు. ఈ విషయం పలుమార్లు అనుభవం అవుతున్నా, టీడీపీకి చెందిన కొందరు మూర్ఖులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతుండడం దురదృష్టకరం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
విజయవాడ కు వైఎస్ జగన్
-
దుర్గగుడిలో శాకంభరి ఉత్సవాల రెండవ రోజు (ఫొటోలు)
-
ఆషాఢంలో దుర్గ గుడికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
విజయవాడ : అమ్జద్ హబీబ్ ప్రీమియం సలోన్ ని ప్రారంభించిన సినీనటి వర్ష (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆషాఢ మాసోత్సవాలు (ఫొటోలు
-
విజయవాడ : శోభాయమానంగా శ్రీ జగన్నాథ రథయాత్ర (ఫొటోలు)
-
బెజవాడలో కిడ్నీ రాకెట్ కలకలం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): గుంటూరులో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ మూలాలు బెజవాడలోనే ఉన్నట్టు తేలడం కలవరం సృష్టిస్తోంది. ఆరి్థక ఇబ్బందుల్లో ఉన్న వారికి డబ్బు ఆశ చూపి కిడ్నీ రాకెట్ నడుపుతున్నారు. అందుకోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తున్నారు. నగరంలో జరిగిన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తాయంటున్నారు. గుంటూరులోని కేవీపీ కాలనీకి చెందిన 31 ఏళ్ల గార్లపాటి మధుబాబుకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన బాషా అనే వ్యక్తి కిడ్నీ అమ్మితే రూ.30 లక్షలు ఇస్తామని నమ్మబలికాడు. వెంకట్ అనే మరో మధ్యవర్తిని పరిచయం చేసి మధుబాబును విజయవాడ రప్పించారు. జూన్ 10న అతడిని బెజవాడలోని ఓ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చి.. 15వ తేదీన శస్త్రచికిత్స ద్వారా కిడ్నీ కాజేశారు. రూ.30 లక్షలు ఇస్తామని.. కేవలం రూ.1,09,500 మాత్రమే ఇచ్చారని, మిగిలిన డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని బాధితుడు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన విదితమే. తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఇదే తరహాలో మరో ఐదుగురికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్టు బాధితుడు ఆరోపించారు. గతంలోనూ ఇదే తీరు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స కోసం దొంగ పత్రాలు సృష్టించేందుకు విజయవాడలోని భవానీపురం తహసీల్దారుకు ఓ వ్యక్తి దరఖాస్తు చేయగా.. తహసీల్దారు తిరస్కరించారు. అవి తప్పుడు ధ్రువీకరణ పత్రాలుగా నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం ఏలూరుకు చెందిన బాధితుడు తన కిడ్నీ తీసుకుని.. డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నారంటూ ఏడాది కిందట అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బీఆర్టీఎస్ రోడ్డులోని ఓ ఆస్పత్రిలో తనకు డబ్బు ఆశ చూపి కిడ్నీ తీసుకున్నానని, ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వలేదని మరో బాధితుడు ఏడాదిన్నర క్రితం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు. వైద్యులు అతనికి డబ్బులిచ్చి అల్లరి కాకుండా కప్పిపుచ్చారు.విచారిస్తే అనేకం వెలుగులోకి నగరంలో జరుగుతున్న కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలపై విచారణ జరిపితే మరిన్ని కేసులు వెలుగు చూసే అవకాశం ఉంది. ఈ రాకెట్ వెనుక కొందరు ఏజెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, వైద్యశాఖ ఉన్నతాధికారులు దృష్టి పెడితే అనేక అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. రోగి ఎవరు, కిడ్నీ దాత ఎవరూ అనేది క్షేత్రస్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు: డీఎస్పీగుంటూరు ఈస్ట్: కిడ్నీ రాకెట్ బాధితుడు మధుబాబును నగరంపాలెం పోలీసుస్టేషన్లో వెస్ట్ డీఎస్పీ మహేశ్ మంగళవారం విచారించారు. అనంతరం మధుబాబు నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. డీఎస్పీ మహేశ్ మాట్లాడుతూ కిడ్నీ రాకెట్ కేసు త్వరితగతిన ఛేదించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మోసం చేసి కిడ్నీ తీసుకున్నారని మధుబాబు నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు సేకరించామని, దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో కేసును ట్రాన్స్ఫర్ చేయాలా, లేదా అనే విషయాన్ని ఉన్నతాధికారులను సంప్రదించి, తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆషాఢ మాస సారె మహోత్సవం (ఫొటోలు)
-
విజయవాడ : అదరహో అనిపించిన ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
‘బొండా’.. నీది అధికార మదం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పాయకాపురం (విజయవాడ రూరల్) : ‘ఉమా.. నీకు అధికార మదం తలకెక్కింది. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి అనుకూలంగా పనిచేసిన నన్ను వేధిస్తున్నావు. అక్రమ నిర్మాణం పేరుతో మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి నా ఇంటిని కూలగొట్టించావు. నేను టీడీపీలో ఉండగా నీ చేతుల మీదుగానే భవన నిర్మాణానికి భూమిపూజ, గృహ ప్రవేశం చేశావు. ఈరోజు నేను పార్టీ మారగానే సక్రమ నిర్మాణం కాస్తా అక్రమమైందా? ఎన్నికల్లో నీకు వ్యతిరేకంగా పని చేశానని దళితుడినైన నాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నావు.. ఆరాచకం సృష్టిస్తున్నావు.ఉమా.. నీ పతనం ప్రారంభమైంది’.. అంటూ వైఎస్సార్సీపీ దళిత నేత, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుడు నందెపు జగదీష్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఆగడాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపులకు పాల్పడడాన్ని నిరసిస్తూ సోమవారం జగదీష్ విజయవాడ ప్రకాష్ నగర్లోని తన ఇంటి వద్ద గుండు గీయించుకుని, అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 2012లో నేను ప్రకాష్ నగర్లో కాట్రగడ్డ హరిబాబు అనే వ్యక్తి నుంచి 224 గజాల స్థలాన్ని కొని అన్ని అనుమతులు తీసుకుని ఇల్లు కట్టుకున్నా. 2014లో టీడీపీలో ఉన్న సమయంలోనే అక్కడ ఇంటి నిర్మాణం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బొండా చేతుల మీదుగానే భూమి పూజ జరిగింది. ఉమా తీరు, ఆయన విధానాలు నచ్చక నేను ఈ మధ్య వైఎస్సార్సీపీలో చేరి ఉమాకు వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో పనిచేశా. ఇది మనసులో పెట్టుకుని ఎన్నికల్లో గెలవగానే దళితుడినైన నాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. గతంలో నేను టీడీపీలో ఉన్నా.కార్పొరేటర్గా కూడా గెలుపొందా. అప్పుడు బొండా ఉమా ఎమ్మెల్యేగా గెలుపొందడానికి ఎంతో కృషిచేశా. తిరువూరులో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని చెప్పగా ‘నా కింద పనిచేసే దళితుడవు.. ఎమ్మెల్యేగా పోటీచేస్తావా’ అంటూ ఆయన నాపై కక్ష పెంచుకున్నారు. ఇప్పుడు నా ఇల్లు అక్రమ నిర్మాణం అంటూ మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి కూలగొట్టించారు. 2014లో భూమిపూజ చేసిన రోజు సక్రమంగా ఉండి ఈరోజు అదెలా అక్రమం అయ్యిందో బొండా సమాధానం చెప్పాలి. నా ఇంటిని క్రమబద్దికరించాలని గతంలోనే దరఖాస్తు చేశా. కానీ, బొండా ఒత్తిడికి మున్సిపల్ అధికారులు తలొగ్గి అది అక్రమ నిర్మాణమంటూ నోటీసులు జారీచేశారు.నోటీసుల్లో 24 గంటల వ్యవధి అంటూ పేర్కొని.. నేనులేనప్పుడు నోటీసిచ్చిన ఎనిమిది గంటల్లోపే కూల్చేశారు. ఎక్కడ అక్రమం జరిగిందో చెబితే నేనే నిర్మాణాన్ని తొలగించేవాడిని. కానీ, బొండా కక్ష సాధింపులకు అధికారులు సహకరిస్తున్నారు. నేను, నా భార్య ఎమ్మెల్యే కాళ్లపై పడితే వదిలేస్తానని చెబుతున్నారు. కానీ, నేను ఏ తప్పూ చేయలేదు.. ఎవరి కాళ్లపై పడాల్సిన అవసరంలేదు. ఇకపై బొండా అరాచకాలను నియోజకవర్గంలో ప్రచారం చేస్తా. కూల్చిన భవనం ఫొటోలు ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రచారం చేస్తా. నేను సమరయోధుల భూములు ఆక్రమించుకోలేదు.. ఇక బొండా ఉమా మాదిరిగా నేను స్వాతంత్య్ర సమరయోధుల స్థలాలను ఆక్రమించుకోలేదు. నేను స్థలం కొని ఇల్లు కట్టాను. అప్పట్లో ఎమ్మెల్యే బొండా ఉమా స్వాతంత్య్ర సమరయో«ధుల స్థలాలు ఆక్రమించుకున్నారని, టీడీపీ ప్రభుత్వంలోనే ఆయన భార్యపై కేసు నమోదైంది. ఇక అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామంటున్న మున్సిపల్ అధికారులు భవానీపురం, గొల్లపూడి ప్రాంతాల్లోని బొండా అక్రమ భవనాలను కూల్చగలరా? ఇదే రోడ్డులో వందల అక్రమ నిర్మాణాలు ఉన్నా వాటినెందుకు కూల్చలేదు? నేను వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నానని, దళితుడిని కావడంవల్లే నాపై వేధింపులకు పాల్పడుతున్నారు. అధికారులు తస్మాత్ జాగ్రత్త.. బొండా ఉమాతో మున్సిపల్, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఎంతోమంది అధికారులపై దురుసుగా ప్రవర్తించిన చరిత్ర అతనిది. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు.. అధికారులు చట్టబద్ధంగా నడుచుకోవాలి. ఉమా ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఏ అధికారి పనిచేయలేరు. సెంట్రల్ నియోజకవర్గం నుంచి బదిలీ చేసుకుని వెళ్లిపోవాలి. బంగారంలాంటి ఉద్యోగ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నాకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తా. బొండా అరాచకాలను సీఎం చంద్రబాబునాయుడు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తా. -
విజయవాడ : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
అర్ధరాత్రి విజయవాడలో భారీ వర్షం (ఫొటోలు)
-
ఆగని టీడీపీ దాడులు.. పెరిగిన విధ్వంసం
సాక్షి నెట్వర్క్: టీడీపీ పార్టీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ, శంకుస్థాపనల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాల వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రాలున్న శిలాఫలకాలను టీడీపీ శ్రేణులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశాయి. శనివారం ఉదయం విధులకు హాజరైన సచివాలయ సిబ్బంది దీనిని గుర్తించారు. ఈ ఘటనపై తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు తెలిపారు. నూజివీడులో శిలాఫలకం కూల్చివేత ఏలూరు జిల్లా నూజివీడు నెహ్రూ పేటలో శనివారం తెల్లవారుజామున ఒక శిలాఫలకాన్ని కూల్చివేశారు. వారం రోజుల క్రితం చాట్రాయి మండలం పోలవరంలో నాలుగు శిలాఫలకాలను ధ్వంసం చేయగా.. ఈ నెల 11న రాత్రి నూజివీడు మండలం బోర్వంచలో గ్రామ సచివాలయ భవనం కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఎంఎన్పాలెంలో రెండు శిలాఫలకాలను, సీతారామపురంలో ఒక శిలాఫలకాన్ని, తూర్పుదిగవల్లిలో గ్రామ సచివాలయం బోర్డును ధ్వంసం చేశారు. సచివాలయంపై టీడీపీ జెండా ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండం సచివాలయం ప్రారం¿ోత్సవ శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు నెలకుర్తి దినే‹Ù, గుత్తా మహేందర్ ధ్వంసం చేశారు. సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనం వద్ద ఉన్న శిలాఫలకం కూడా ధ్వంసం చేశారు. అనంతరం గ్రామ సచివాలయంపై టీడీపీ జెండా పెట్టారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలను టీడీపీ కార్యకర్తలు వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని కామెంట్లు పెట్టారు. ధ్వంసం చేసిన శిలాఫలకాల బోర్డులను, సచివాలయ భవనాలను శనివారం వైఎస్సార్సీపీ నాయకులు, సర్పంచ్ వడ్లమూడి మురళీమోహన్, ఎంపీటీసీ కోండ్రు వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ ఉన్నం శ్రీనివాసులు పరిశీలించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి నాగార్జున ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొదిలి సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ మాధవరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ, ఎస్ఐ చెప్పారు. వైఎస్సార్ పేరు తొలగింపు ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని నూతన మునిసిపల్ కార్యాలయంపై గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు, కార్యాలయం ప్రవేశ ఆర్చిపై ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేర్లను టీడీపీ నాయకులు శనివారం తొలగించారు. మునిసిపల్ కార్యాలయం 6 నెలల క్రితం ప్రారంభం కాగా.. ఆర్చిని బూచేపల్లి శివప్రసాదరెడ్డి సొంత నిధులతో నిర్మించారు. వీటితో పాటు చీమకుర్తిలోని ప్రభుత్వాస్పత్రి ప్రవేశ ద్వారం ఆర్చిపై ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ పేర్లను కూడా తొలగించారు. ఈ ఘటనలపై వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, కౌన్సిలర్ సోమా శేషాద్రి, గోపురపు చంద్ర, ఆముదాలపల్లి రామబ్రహ్మం తదితరులు సీఐని కలిసి వినతిపత్రం అందించారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
విజయవాడ : ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
'ఏంటిది సుజనా'..?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తీరు స్థానిక ఓటర్లలో గుబులు రేపుతోంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం, ఆర్యవైశ్య, నగర సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. తాజాగా ఆయన వీరితో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో ‘నా ఎదుగుదలకు మీరే కారణం.. మీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి’అంటూ తెగ ఊదరగొట్టారు. దీంతో సమావేశాలకు వెళ్లిన వారంతా ఒకటే మాట.. బ్యాంకులు లూటీ చేసి, ఆ డబ్బుతో ఎన్నికలకో పార్టీ మారే సుజనా ఎదుగుదలకు తామెలా కారణమవుతామని మిత్రులతో గుసగుసలాడుకుంటున్నారు. కొంపదీసి ఈయన ఎగ్గొట్టిన బ్యాంకు రుణాల బకాయిల్ని తమ నెత్తిన రుద్దుతారేమోనని భయపడుతున్నారట.ఇవి చదవండి: 'గ్లాస్ గుచ్చుకుంది'..! -
విజయవాడ : వైభవంగా శ్రీలలితా పారాయణ (ఫొటోలు)
-
ఎన్నికల తర్వాత బీజేపీ చేతిలోకి టీడీపీ: కేశినేని నాని
-
రాయి విప్పిన రాక్షస కుట్ర
-
ముస్లిములకు వెన్నుపోటు..!
-
రిమాండ్ రిపోర్ట్..బోండా ఉమా బ్యాచ్ స్కెచ్
-
సీఎం జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్ అరెస్ట్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడి కేసులో సతీష్ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కేసులో సతీష్ ఏ1గా ఉన్నాడు. నిందితుడు సతీష్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కాగా విజయవాడ అజిత్సింగ్నగర్లో శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్పై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడిన విషయం తెలిసిందే. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది. గాయం నుంచి కారుతున్న రక్తాన్ని సీఎం జగన్ అదిమిపట్టుకున్నారు. బాధను పంటిబిగువన భరిస్తూనే ప్రజలకు అభివాదం చేశారు. సీఎం జగన్ ఎడమ కంటి పై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. ప్రాథమిక చికిత్స తర్వాత సీఎం జగన్ యాత్ర కొనసాగించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం
-
సీఎం జగన్పై హత్యాయత్నం కేసు దర్యాప్తు కొలిక్కి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసుల దర్యాప్తు కొలిక్కి వచ్చింది. విజయవాడ అజిత్సింగ్నగర్లో శనివారం రాత్రి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సందర్భంగా సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నానికి పాల్పడ్డ దుండగుడితోపాటు సహకరించిన ముఠా, కీలక సూత్రధారులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దాడికి పాల్పడినట్లు గుర్తించిన అనుమానితుడితోపాటు మరో ఐదుగురిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఒకరు ఉండటం గమనార్హం. హత్యాయత్నం వెనుక కుట్ర కోణంలో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. అనుమానితులు, తెర వెనుక పాత్రధారులకు సంబంధించిన ఆధారాలను పక్కా శాస్త్రీయంగా విశ్లేషించారు. నేరాన్ని రుజువు చేసేందుకు హేతుబద్ధమైన ఆధారాలను సేకరించి క్రోడీకరించారు. సాంకేతికపరమైన ప్రక్రియను కూడా పాటించిన అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు గురువారం వెల్లడించే అవకాశాలున్నాయి. 60 మందికిపైగా విచారణ ముఖ్యమంత్రి జగన్పై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. పదునైన రాయితో ఏ విధంగా హత్యాయత్నానికి పాల్పడిందీ నిర్ధారించారు. పదునైన రాయితో దాడి చేసింది ఎవరు? దుండగుడికి సహకారం అందించింది ఎవరు? అనే కీలక అంశాలను రాబట్టారు. వీడియో ఫుటేజీలు, కాల్ డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలతో కేసు దర్యాప్తును పోలీసులు తుది అంకానికి తెచ్చారు. దాదాపు 60 మందికిపైగా అనుమానితులను విచారించి అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేసి కేసును కొలిక్కి తెచ్చారు. కుట్ర కోణంపై ముమ్మర దర్యాప్తు ఈ హత్యాయత్నం వెనుక కుట్ర కోణంపై విచారణ సందర్భంగా సంచలన విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. దుండగుడికి సహకరించినవారితోపాటు ఆ దిశగా ప్రోత్సహించిన కీలక నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ క్రియాశీలక నేత కావడం గమనార్హం. టీడీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్గా కూడా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని క్షుణ్నంగా విచారించడంతో సంచలన అంశాలు వెల్లడైనట్టు తెలుస్తోంది. అజ్ఞాతంలో సెంట్రల్ నేత తాజా పరిణామాల నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం. పోలీసులు దీంతో నిమిత్తం లేకుండా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. టీడీపీ నేత వెల్లడించిన విషయాలను ఇతర అంశాలతో సరిపోల్చి నిర్ధారించుకుంటున్నారు. అదుపులో ఉన్న నిందితులు వెల్లడించిన కుట్ర కోణం వాస్తవమేనని నిర్ధారించుకున్న తరువాతే తదుపరి చర్యలు చేపట్టాలన్నది పోలీసుల ఉద్దేశం. దాంతో ఆ దిశగా దర్యాప్తు వేగం పుంజుకుంది. ప్రధాన ఎన్నికల అధికారికి నివేదిక ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఈ కేసు దర్యాప్తు వివరాలను పోలీసులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనాకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు. దాడికి పాల్పడిన విధానం, అనుమానితుల నుంచి సేకరించిన సమాచారం, కుట్ర కోణాలపై కీలక సమాచారాన్ని విజయవాడ పోలీసులు ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి నివేదించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వివరాలపై ఆయన వ్యక్తం చేసిన సందేహాలను సంతృప్తికరంగా నివృత్తి చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో సాంకేతిక వ్యవహారాలను పూర్తి చేసి కేసులో కీలక వివరాలను నేడు వెల్లడించవచ్చని భావిస్తున్నారు. -
పనికిమాలిన వెధవలు చేసిన పని అందరు బయటకి వస్తారు: కేతిరెడ్డి
-
ఎదుర్కోలేమనే భయంతోనే...
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంటోంది. ఒకవైపు ఎండవేడిమి మంట పుట్టిస్తుంటే, మరోవైపు ప్రచారాల్లో భాగంగా రాజకీయ పార్టీల మాటల తూటాలు పేలుతున్నాయి. ఇది ఒక అడుగు ముందుకేసి దాడులకు తెగబడే పరిస్థితులకు చేరింది. 13వ తేదీన విజయవాడ వేదికగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత నెల 27న ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి నుండి ‘మేమంతా సిద్ధం’ పేరుతో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నాలుగు సంవత్సరాల 10 నెలల కాలంలో తాను ఏం చేశానో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ప్రచారానికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. అంతేకాకుండా తెలుగుదేశం, జనసేన పార్టీల నుండి అనేకమంది వైసీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే రాయి వేసి ఆయన్ని అంతమొందించే ప్రయత్నం జరిగింది. దీనిని ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముక్తకంఠంతో ఖండించారు. చంద్రబాబు కూడా ఈ దాడిని ఖండించారు. అయితే, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అడగకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన చేసిన ట్వీట్, వెంటనే ఆ పార్టీకి చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. తానేమీ తక్కువ తినలేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రజా ముఖ్యమంత్రి, జనం గుండెల్లో గూడు కట్టుకున్న నేతపై దాడి జరిగితే దీనిని రాజకీయం చేయడం ఏంటని అసహ్యించు కుంటున్నారు. దాడి సమయంలో తమ ప్రియతమ నేత అభివాదం చేస్తూ పక్కకు తిరగడంతో పెను ప్రాణాపాయం నుండి రక్షించుకున్నారని చెబుతున్న ప్రజలు ఆయన ఎప్పుడూ చెప్పే ఒక్క మాటను గుర్తు చేస్తున్నారు. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలు ఉన్నంతకాలం తనకేమీ కాదన్నది ఇప్పుడు నిరూపి తమైంది. గతంలో 2019 ఎన్నికల సమయంలో విశాఖ విమానాశ్రయంలో జగన్పై కత్తితో దాడికి ప్రయత్నించిన ఘటనను ప్రజలు ఉటంకిస్తూ, ఘటన జరిగిన 24 గంటల్లో నిందితుణ్ణి పట్టుకోలేకపోయారని గుర్తుచేస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి సమయంలో అక్కడ డీజీపీ హడావిడిగా ఇదంతా కేవలం సానుభూతి కోసం అంటూ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన చెప్పిన గంటకే అమరావతిలో చంద్రబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే మాట చెప్పారు. అంటే దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడం కాదా అన్నది ఇక్కడ అందరూ అడుగుతున్న ప్రశ్న. తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు చావో రేవో అన్న చందంగా మారి ఆ కంగారులో తలో మాట మాట్లాడుతున్నారనుకుంటే, పవన్ కల్యాణ్ దాడి ఘటనను డ్రామాగా చిత్రీకరిస్తూ సినిమా తరహాలో డైలాగులు చెబుతున్నారు. ప్రజలు సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఇదంతా డ్రామాగా మీరే తేల్చేసినప్పుడు ఇక దీనిపై విచారణ ఎందుకు? చంద్రబాబు రాజకీయ నైజం గురించి కూడా విస్తృతమైన చర్చ జరుగుతోంది. 1987 ప్రాంతంలో పేదల పక్షపాతి, నిస్వార్థ రాజకీయ నేత వంగవీటి మోహన రంగాను అకారణంగా పొట్టన పెట్టుకున్న ఘటనను ఇప్పుడు ప్రజలు ఉటంకిస్తుండటం నిజంగా ప్రజల్లోని రాజకీయ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. అంతేకాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బషీర్బాగ్ కాల్పుల ఘటన, అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన ఘటన, గోదావరి పుష్కరాల్లో ప్రచార ఆర్భాటం కోసం 26 మందిని పొట్టనపెట్టుకున్న సంఘటన, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై, ఆయన కుటుంబంపై పరుష పదజాలం వాడుతూ కొట్టుకుంటూ ఇంటి నుండి బయటకు తీసుకొచ్చిన వైనం, గుంటూరులో చీరలు పంపిణీ చేస్తామని పిలిచి తొక్కిసలాటలో అమాయక మహిళల ప్రాణాలను బలిగొన్న అంశాలను చర్చించటం చూస్తుంటే, ఒక నేతపై ప్రజల్లో ఉండే అభిప్రాయానికి దీన్ని సూచికగా చెప్పుకోవచ్చు. ఇదంతా చూస్తుంటే కేవలం జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందనే ఆయనంటే గిట్టనివారి కడుపు మంటకు కారణంగా కనిపిస్తోంది. రాజధాని ప్రాంతంలో కూడా విశేష ఆదరణ లభించడం ఈ కడుపు మంటను రెట్టింపు చేసింది. అందుకే జనాల గుండెల్లో గూడు కట్టుకున్న జగన్ను అంతమొందించేందుకు కుట్రకు తెరలేపినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షులు