Ashish Nehra
-
గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం.. ఆశిష్ నెహ్రాపై వేటు!
ఐపీఎల్-2025కు ముందు దాదాపు అన్ని ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుజరాట్ టైటాన్స్ ఫ్రాంచైజీ సైతం తమ జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం.తమ జట్టు హెడ్కోచ్ ఆశిష్ నెహ్రా, క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకిని తప్పించాలని గుజరాత్ టైటాన్స్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు సంవత్సరాల ఆశిష్ నెహ్రా కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ దాన్ని రెన్యూవల్ చేయకపోవడం.. ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. ఈ ఏడాది చివరలో జరగనున్న మెగా వేలానికి ముందు గుజరాత్ ఫ్రాంచైజీ నుంచి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా గుజరాత్ హెడ్కోచ్గా నెహ్రా విజయవంతమయ్యాడనే చెప్పుకోవాలి. తమ అరంగేట్ర సీజన్లో గుజరాత్ను ఛాంపియన్గా నిలిపిన నెహ్రా.. తర్వాతి సీజన్లో జీటీ రన్నరప్ నిలిచింది.అయితే ఐపీఎల్ 2024లో మాత్రం గుజరాత్ దారుణ ప్రదర్శన కనబరిచింది. తొలిసారి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించడంలో గుజరాత్ విఫలమైంది. అందుకు కెప్టెన్సీ మార్పు కూడా ఓ కారణం కావచ్చు. ఈ ఏడాది సీజన్కు ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకోవడంతో గుజరాత్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఎంపికయ్యాడు. కానీ జట్టును నడిపించడంలో శుబ్మన్ ఎంపికయ్యాడు.ఇక గత మూడు సీజన్లలో మెంటార్గా వ్యవహరించిన గ్యారీ కిరెస్టన్ ఇప్పటికే తన పదవి నుంచి తప్పుకున్నాడు. పాకిస్తాన్ పరిమిత ఓవర్ల హెడ్కోచ్గా గ్యారీ బాధ్యతలు చేపట్టాడు. మరోవైపు గుజరాత్ యాజమాన్యంలో మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.గుజరాత్ యాజమాన్యం సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ నుంచి కొంత వాటాను భారత వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ డీల్పై అధికారికంగా ప్రకటన విడుదల కానుందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. -
రోహిత్- కోహ్లి విషయంలో గంభీర్ నిర్ణయం సరికాదు: మాజీ బౌలర్
శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను జట్టులోకి పిలిపించడం సరైన నిర్ణయం కాదేమోనని టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. ఈ దిగ్గజ బ్యాటర్లకు విశ్రాంతి ఇవ్వకుండా నూతన కోచ్ గౌతం గంభీర్ తప్పుచేశాడని అభిప్రాయపడ్డాడు. రోహిత్- కోహ్లి గంభీర్కు కొత్త కాదని.. వారి ఆట తీరు గురించి అతడికి అవగాహన ఉందని నెహ్రా పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. ఈ టోర్నీ తర్వాత సెలవులు తీసుకున్నారు. భార్య రితిక, కూతురు సమైరాలతో కలిసి రోహిత్ అమెరికాకు వెళ్లిపోగా.. కోహ్లి లండన్లో ఉన్న తన సతీమణి అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్ల దగ్గరకు వెళ్లాడు.ఈ నేపథ్యంలో వీరిద్దరు శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపించాయి. కుటుంబాలతో మరికొన్నాళ్లు ఎక్కువ సమయం గడపాలని భావించిన కోహ్లి- రోహిత్.. ఈ విషయాన్ని ముందుగానే బీసీసీఐతో చర్చించినట్లు సమాచారం. అయితే, చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియాకు శ్రీలంక, ఇంగ్లండ్తో మాత్రమే మ్యాచ్(3+3)లు మిగిలి ఉండటంతో.. గంభీర్ వీరిద్దరిని వెనక్కిపిలిపించాడని తెలిసింది.సీనియర్లు జట్టులో ఉండాలని అతడు భావించాడని.. తన ఆలోచనను కోహ్లి- రోహిత్లతో పంచుకోగా వారు లంక పర్యటనకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా తదుపరి వన్డే సిరీస్కు 2- 3 నెలల సమయం ఉంది. నిజానికి ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి.అంతకంటే ముందు టెస్టు, టీ20 సిరీస్లు జరుగనున్నాయి. అలాంటపుడు రోహిత్, కోహ్లిలను హడావుడిగా రప్పించాల్సిన అవసరం లేదు. నిజానికి శ్రీలంక సిరీస్ ద్వారా ఇతర ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇస్తే బాగుండేది. గంభీర్ కొత్తగా కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో అతడు ఎక్కువ సమయం గడపాలని భావించడం సహజం.అయితే, రోహిత్- కోహ్లి గురించి అతడికి ముందే తెలుసు కదా! ఈ ఇద్దరితో ఎక్కువ సమయం గడిపి వారి ఆట తీరును పరిశీలించిందేకు తనేమీ విదేశీ కోచ్ కాదు. స్వదేశీ సిరీస్లు మొదలైన తర్వాత కోహ్లి- రోహిత్ ఎలాగో ఆడతారు. అప్పటిదాకా వేరే వాళ్లకు అవకాశం ఇస్తే బాగుండేది. ఈ విషయంలో నేను గంభీర్ను తప్పుబట్టడం లేదు. అయితే, ఇలాంటి వ్యూహాల వల్ల జట్టుకు మేలే చేకూరుతుంది’’ అని ఆశిష్ నెహ్రా సోనీ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా శ్రీలంకతో ఇప్పటిదాకా రెండు వన్డేల్లో రోహిత్ 122 పరుగులతో రాణించగా.. కోహ్లి మాత్రం కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. -
‘అందుకే అప్లై చేయలేదు.. నేను గంభీర్లా కాదు’
శ్రీలంక తాజా పర్యటనతో భారత క్రికెట్లో నూతన శకం ఆరంభం కానుంది. ఇంతవరకు కోచ్గా అనుభవం లేని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అదే విధంగా.. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రిటర్మెంట్ తర్వాత భారత్ తొలిసారి టీ20 సిరీస్లో పాల్గొననుంది.ఇక ఈ జట్టుకు నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పూర్తిస్థాయికి కెప్టెన్గా నియమితుడైన విషయం తెలిసిందే. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు టీ20 పగ్గాలు అప్పగించడంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా సైతం తన అభిప్రాయం వ్యక్తపరిచాడు.ఆశ్చర్యం కలిగించలేదు‘‘హార్దిక్ పాండ్యా మూడు ఫార్మాట్లు ఆడలేకపోతున్నాడు. టెస్టులకు దూరమైన అతడు యాభై ఓవర్ల క్రికెట్లోనూ పూర్తిస్థాయిలో జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. అలాంటి ఆటగాడి సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనుకోవడం కత్తిమీద సాము లాంటిదే.అయినా క్రికెట్లో ఇవన్నీ సహజం. హార్దిక్పై వేటు వేయడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్గా ఉన్న అతడిని ఇలా అకస్మాత్తుగా రేసు నుంచి తప్పించడం మాత్రం ఆశ్చర్యకరం. అయితే, కొత్త కోచ్ ఆలోచనలేమిటో మనకు తెలియదు. ప్రతి కోచ్, కెప్టెన్ అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి కదా’’ అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఆశిష్ నెహ్రా పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. అయితే, తాను మాత్రం ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోలేదని 45 ఏళ్ల నెహ్రా తెలిపాడు. ఇందుకు గల కారణాలు కూడా వెల్లడించాడు.నేను గంభీర్లా కాదు‘‘ఈ విషయం గురించి నేను ఎన్నడూ ఆలోచించనేలేదు. నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లే. గౌతం గంభీర్ పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. అయితే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు.ప్రస్తుతం నా పనులతో నేను బిజీగా, సంతోషంగా ఉన్నాను. జట్టుతో కలిసి తొమ్మిది నెలల పాటు ప్రయాణించే ఓపిక నాకు లేదు’’ అని ఆశిష్ నెహ్రా స్పష్టం చేశాడు. కాగా ఆశిష్ నెహ్రా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్తో కలిసి పనిచేస్తున్నాడు.టైటాన్స్తో అనుబంధంఐపీఎల్-2022లో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు నెహ్రా మార్గదర్శనంలోని హార్దిక్ పాండ్యా సారథ్యంలో చాంపియన్గా అవతరించింది. మరుసటి ఏడాది కూడా ఫైనల్ చేరింది. అయితే, ఐపీఎల్-2024లో పాండ్యా టైటాన్స్తో బంధం తెంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు.చదవండి: ‘ప్రేమ’తో నటాషా పోస్ట్.. హార్దిక్ పాండ్యా కామెంట్ వైరల్ -
IPL 2025: గుజరాత్ హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి చాలా సమయం ఉన్నప్పటికీ అన్ని ఫ్రాంచైజీలు ప్రక్షాళన బాట పట్టాయి. కొన్ని ఫ్రాంచైజీలేమో ఆటగాళ్లను వదిలించుకోవాలని భావిస్తుంటే.. మరికొన్ని కోచింగ్ స్టాఫ్, మెంటార్లను మార్చే పనిలో పడ్డాయి. తాజాగా గుజరాత్ ఫ్రాంచైజీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా గుజరాత్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అతనితో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి కూడా తప్పుకోనున్నట్లు సమాచారం. వీరిద్దరి పర్యవేక్షణలో గుజరాత్ తమ తొలి రెండు సీజన్లలో ఫైనల్స్కు చేరింది. 2022లో ఛాంపియన్గా, 2023లో రన్నరప్గా నిలిచింది. ఇంతటి విజయవంతమైన జోడీ ప్రస్తుతం గుజరాత్ను వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత సీజన్లో (2024) వైఫల్యాల కారణంగా ఫ్రాంచైజీ యాజమాన్యం సైతం వీరిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మేనేజ్మెంట్ తప్పించాలని నిర్ణయం తీసుకునే లోపే తామే స్వచ్చందంగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని వీరు భావిస్తుండవచ్చు. గుజరాత్ ఫ్రాంచైజీకి సంబంధించి ఈ టాపిక్ నడుస్తుండగానే మరో వార్త సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. నెహ్రా గుజరాత్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటే టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. యువరాజ్తో గుజరాత్ యాజమాన్యం సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యువీకి గతంలో ఏ జట్టుకు కోచింగ్ ఇచ్చిన అనుభవం లేదు. ఒకవేళ అతన్ని గుజరాత్ టైటాన్స్ పంచన చేర్చుకుంటే ఇదే అతనికి తొలి కోచింగ్ పదవి అవుతుంది. గుజరాత్ ఆఫర్పై యువీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా, గుజరాత్ గత సీజన్లో ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్కు అప్పజెప్పిన విషయం తెలిసిందే. హార్దిక్ ఎగ్జిట్తో శుభ్మన్ గిల్ గుజరాత్ నూతన కెప్టెన్గా ఎంపికయ్యాడు. గిల్ నేతృత్వంలో గుజరాత్ గత సీజన్లో 14 మ్యాచ్ల్లో ఐదింట మాత్రమే విజయాలు సాధించి లీగ్ దశలోనే నిష్క్రమించింది. -
హెడ్కోచ్గా గంభీర్.. బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ బెటర్!
‘‘గంభీర్ పట్టిందల్లా బంగారమే అవుతుంది. అతడు ఏ జట్టుతో చేరితే.. ఆ జట్టు విజయాలు సాధిస్తుంది. అసలు టీమిండియాకు విదేశీ కోచ్ల అవసరమే లేదు.ఇండియాలోనే ఎంతో మంది ప్రతిభావంతులైన కోచ్లు ఉన్నారు. ద్రవిడ్ తర్వాత.. భారత జట్టు ప్రధాన కోచ్గా గౌతం గంభీర్ కంటే అత్యుత్తమ ఆప్షన్ ఇంకొకటి ఉంటుందనుకోను.అతడొక అద్భుతమైన ఆటగాడు. గొప్ప కోచ్ కూడా కాగలడు. ప్రస్తుతం టీమిండియాకు హెడ్ కోచ్గా అతడే సరైనోడు. గంభీర్ తొలుత లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా ఉన్నాడు.అతడి మార్గ నిర్దేశనంలో లక్నో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. తర్వాత కేకేఆర్కు మెంటార్గా వెళ్లాడు. ఆ జట్టు ఏకంగా చాంపియన్గా నిలిచింది.గంభీర్ది అత్యద్భుతమైన క్రికెటింగ్ మైండ్. ప్రత్యర్థి జట్టును కచ్చితంగా అంచనా వేసి అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించడంలో దిట్ట. తనతో కలిసి ఆడిన అనుభవం నాకుంది.కలిసే భోజనం చేసేవాళ్లం. ఆట గురించి చర్చించుకునే వాళ్లం. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య స్నేహ బంధం ఉంది. టచ్లోనే ఉంటాం’’ అని పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు.భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రమే సరైన ఆప్షన్ అని నొక్కి వక్కాణించాడు. అతడి మార్గదర్శనంలో టీమిండియా మరింత పటిష్టంగా మారుతుందని కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు.బౌలింగ్ కోచ్గా వారిలో ఒకరు బెటర్ఇక గంభీర్ ప్రధాన కోచ్గా ఉంటే.. ఆశిష్ నెహ్రా లేదంటే జహీర్ ఖాన్లలో ఒకరిని బీసీసీఐ తమ బౌలింగ్ కోచ్గా ఎంచుకోవాలని సూచించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ కమ్రాన్ అక్మల్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్నాడు. ఈ నేపథ్యంలో అతడి వారసుడిగా గౌతం గంభీర్ ఎంపిక దాదాపుగా ఖాయమైపోయింది.మెంటార్గా మాత్రమేఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లకు మెంటార్గా పనిచేశాడు గౌతీ. అయితే, కోచ్గా మాత్రం అతడికి అనుభవం లేదు. ఇక వరల్డ్కప్ టోర్నీలో విజయ వంతంగా ముందుకు సాగుతున్న టీమిండియా గురువారం సూపర్-8 దశలో తొలి మ్యాచ్ ఆడనుంది. అఫ్గనిస్తాన్తో బార్బడోస్ వేదికగా తలపడనుంది. -
ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
టీమిండియా కొత్త కోచ్ నియామకం నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు హెడ్ కోచ్ అంటే ఆషామాషీ కాదని.. ఈ విషయంలో తెలివిగా వ్యవహరించాలని బీసీసీఐకి సూచించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత అతడి పదవీ కాలం ముగిసినా బీసీసీఐ అభ్యర్థన మేరకు ప్రస్తుతం ద్రవిడ్ కోచ్గా కొనసాగుతున్నాడు.అయితే, మెగా టోర్నీ తర్వాత మాత్రం ద్రవిడ్ వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బోర్డు ఇప్పటికే కొత్త కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. మే 27తో గడువు ముగిసింది.గంభీర్ పేరు దాదాపు ఖరారైనట్లే!కానీ ఇంతవరకు కొత్త కోచ్ ఎవరన్నా అన్న విషయంపై ఎటువంటి స్పష్టత రాలేదు. విదేశీ కోచ్ల వైపు బీసీసీఐ మొగ్గుచూపుతుందనే వార్తలు వచ్చినా.. టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో.. ఐపీఎల్-2024 చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా దాదాపు ఖరారైనట్లే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.తెలివిగా వ్యవహరించాలి‘‘ఎవరి జీవితంలోనైనా కోచ్కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మైదానం లోపల.. వెలుపలా.. ఒక వ్యక్తికి మార్గదర్శనం చేస్తూ వారిని గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత. కాబట్టి కోచ్ని ఎంచుకునేటపుడు తెలివిగా వ్యవహరించాలి’’ అని గంగూలీ ట్వీట్ చేశాడు. ఎవరు పడితే వాళ్లను కోచ్లుగా నియమించొద్దని పరోక్షంగా బీసీసీఐకి సూచించాడు.ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘గంభీర్కు వ్యతిరేకంగానే మీరు ఈ పోస్ట్ పెట్టారు కదా? ఆయన హెడ్కోచ్ అవటం మీకు ఇష్టం లేదా?’’ అంటూ గంగూలీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే, దాదా అభిమానులు మాత్రం.. ‘‘గ్రెగ్ చాపెల్ మాదిరి ఇంకో కోచ్ వస్తే ఆటగాళ్లను విభజించి జట్టును భిన్న వర్గాలుగా విడదీస్తాడనే భయంతోనే గంగూలీ ఇలా జాగ్రత్తలు చెబుతున్నారు’’ అని మద్దతుగా నిలుస్తున్నారు.చదవండి: T20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. పూర్తి వివరాలుThe coach's significance in one's life, their guidance, and relentless training shape the future of any person, both on and off the field. So choose the coach and institution wisely…— Sourav Ganguly (@SGanguly99) May 30, 2024 -
పాండ్యాను ఒప్పించే ప్రయత్నం చేయలేదు!
అహ్మదాబాద్: ఐపీఎల్లో ఎంతో అనుభవం ఉన్న హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమైన లోటు కనిపిస్తుందని, అయితే అతను వెళ్లకుండా తాము ఒప్పించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని గుజరాట్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అన్నాడు. గత రెండు సీజన్లలో టైటాన్స్కు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ ఈ సీజన్నుంచి ముంబై ఇండియన్స్ సారథిగా బరిలోకి దిగనున్నాడు. ఏ క్రీడలోనైనా కొన్ని అంశాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవాల్సిందేనని నెహ్రా అభిప్రాయ పడ్డాడు. ‘మా జట్టుతో ఉండిపొమ్మని పాండ్యాను ఒప్పించే ప్రయత్నం నేను ఎప్పుడూ చేయలేదు. మరో ఇతర ఫ్రాంచైజీకి వెళితే అలా చేసేవాడినేమో కానీ గుజరాత్కు ముందు 5–6 సీజన్లు ఆడిన ముంబైకి అతను వెళ్లిపోయాడు. అతను అక్కడ మళ్లీ కొత్తగా ఏదైనా నేర్చుకుంటాడేమో. కెపె్టన్గా రాటుదేలేందుకు గిల్కు ఇది మంచి అవకాశం’ అని నెహ్రా వ్యాఖ్యానించాడు. -
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా: తొలిసారి స్పందించిన నెహ్రా
GT Coach Ashish Nehra Comments: గుజరాత్ టైటాన్స్ సారథిగా టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్ సరైన వాడని ఆ జట్టు హెడ్కోచ్ ఆశిష్ నెహ్రా అన్నాడు. హార్దిక్ పాండ్యా లాంటి అనుభవజ్ఞుడైన, అద్భుతమైన నైపుణ్యాలు గల ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం కష్టమేనని.. అయితే, కెప్టెన్గా అతడు లేని లోటును గిల్ పూడ్చగలడని పేర్కొన్నాడు. అందుకే యువ క్రికెటర్ అయినప్పటికీ అతడిపై నమ్మకంతో గుజరాత్ టైటాన్స్ ఇంత పెద్ద బాధ్యతను గిల్కు అప్పగించిందని తెలిపాడు. ఫలితాలతో సంబంధం లేకుండా అతడికి తమ ప్రోత్సాహం ఉంటుందని ఆశిష్ నెహ్రా ఈ సందర్భంగా వెల్లడించాడు. కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు హార్దిక్ పాండ్యా టైటాన్స్కు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా తాను గతంలో ప్రాతినిథ్యం వహించిన ముంబై ఇండియన్స్తో భారీ ఒప్పందం కుదుర్చుకుని ట్రేడింగ్ ద్వారా సొంత గూటికి వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో.... తమ అరంగేట్ర సీజన్లోనే టైటిల్ విజేతగా నిలపడంతో పాటు రెండో ఎడిషన్లో ఫైనల్ తీసుకువెళ్లిన పాండ్యా జట్టును వీడటంతో గుజరాత్ టైటాన్స్ శుబ్మన్ గిల్ను తమ నాయకుడిగా ప్రకటించింది. హార్దిక్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం.. అయితే గిల్.. ఈ విషయాల గురించి తొలిసారిగా స్పందించిన టైటాన్స్ హెడ్కోచ్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘హార్దిక్ పాండ్యా వంటి ప్రతిభావంతుడైన, అనుభవం గల ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. అయితే, గత మూడు- నాలుగేళ్లలో గిల్ క్రికెటర్గా ఎదిగిన విధానం చూస్తూనే ఉన్నాం. అతడి వయసు ప్రస్తుతం 24- 25 ఏళ్ల మధ్య ఉంటుంది. అయితే, ఈ యువ ఆటగాడి నైపుణ్యాలపై మాకు నమ్మకం ఉంది. అందుకే అతడిని కెప్టెన్ను చేశాం. ప్రతిసారి ఫలితాలను బట్టే ముందుకు సాగడం కుదరదు. కెప్టెన్గా ఉన్నపుడు జట్టును విజయవంతంగా ముందుకు నడపాల్సి ఉంటుందన్నది వాస్తవమే. గిల్పై మాకు నమ్మకం ఉంది అయితే, సారథిగా ఉన్నపుడు కేవలం ఫలితాల గురించి మాత్రమే ఆలోచించకుండా ఒక్కోసారి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గిల్ అలాంటి వాడే. గుజరాత్ కెప్టెన్గా అతడు సరైన వాడని మేము నమ్ముతున్నాం’’ అని నెహ్రా పేర్కొన్నాడు. స్టార్క్కు అంత మొత్తం పెట్టొచ్చు ఇక ఐపీఎల్-2024 వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కోసం తాము పోటీపడటాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఐపీఎల్లో అధిక ధర అన్న దానికి కొలమానం లేదు. స్టార్క్ ఎలాంటి బౌలరో అందరికీ తెలుసు. మాకు సమర్థవంతమైన ఫాస్ట్ బౌలర్ అవసరం ఉంది. జట్టు ప్రయోజనాలు, వ్యూహాలకు అనుగుణంగా అతడిని కొనుగోలు చేయాలని భావించాం. అయితే, ఇప్పుడు మా దగ్గర ఉన్న పేస్ దళంతో మేము సంతృప్తిగానే ఉన్నాం. ఏదేమైనా స్టార్క్ వంటి బౌలర్కు అంత మొత్తం చెల్లించడం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు’’ అని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు. కాగా మిచెల్ స్టార్క్ను కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ. 24.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2024 వేలంలో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్ల జాబితా: 1. అజ్మతుల్లా ఒమర్జాయ్ (రూ.50 లక్షలు) 2. ఉమేశ్ యాదవ్ (రూ.5.8 కోట్లు) 3. షారూఖ్ ఖాన్ (రూ.7.4 కోట్లు) 4. సుశాంత్ మిశ్రా (రూ.2.2 కోట్లు) 5. కార్తీక్ త్యాగి (రూ.60 లక్షలు) 6. మానవ్ సుతార్ (రూ.20 లక్షలు) 7. రాబిన్ మింజ్ (రూ.3.6 కోట్లు) 8. స్పెన్సర్ జాన్సన్ (రూ.10 కోట్లు). వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: అభినవ్ సదారంగని, బి.సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, డేవిడ్ మిల్లర్, జయంత్ యాదవ్, జాషువా లిటిల్, కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, ఆర్ సాయి కిషోర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా. గుజరాత్ టైటాన్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు: అల్జారీ జోసెఫ్, దసున్ షనక, కోన శ్రీకర్ భరత్, ఒడియన్ స్మిత్, ప్రదీప్ సంగ్వాన్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, యశ్ దయాళ్. ట్రేడ్ చేసిన ప్లేయర్: హార్దిక్ పాండ్యా(ముంబై ఇండియన్స్కు). చదవండి: తండ్రిది పాన్ షాప్.. గ్లవ్స్ కొనేందుకు కూడా డబ్బులు లేవు! ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్లు -
‘సెలక్టర్లు అతడిని మర్చిపోవద్దు.. సౌతాఫ్రికా టూర్కు పంపాల్సింది’
India tour of South Africa, 2023-24: సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత ‘జట్ల’పై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. ప్రొటిస్ గడ్డపై వరుస సిరీస్లు ఆడేందుకు బీసీసీఐ ఒక్కో ఫార్మాట్కు ఒక్కో జట్టును సెలక్ట్ చేస్తుందని ముందే ఊహించానని పేర్కొన్నాడు. అయితే, మూడు జట్లలోనూ ఓ కీలక ఆటగాడి పేరు మాత్రం మిస్ అయిందని.. అతడు ఉంటే జట్టు మరింత పటిష్టమయ్యేదని నెహ్రా అభిప్రాయపడ్డాడు. కాగా డిసెంబరు 10 నుంచి జనవరి 7 వరకు టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లకు మూడు జట్లు ఇందులో భాగంగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే మూడు జట్లను ప్రకటించింది. రెగుల్యర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పరిమిత ఓవర్ల సిరీస్కు దూరంగా ఉండనున్నట్లు తెలిపింది. ఇక రోహిత్ గైర్హాజరీలో టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్ నాయకులుగా వ్యవహరించనున్నారు. టెస్టు సిరీస్తో రోహిత్, కోహ్లి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా జియో సినిమా షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అందరికీ సంతోషమే.. ఆ ఒక్కడికి తప్ప ‘‘సౌతాఫ్రికా పర్యటన కోసం టీమిండియా సెలక్టర్లు మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేయడం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. జట్టులో చోటు ఆశించిన చాలా మందికి సంతోషం దక్కింది. అయితే, ఈ టూర్ గురించి వినగానే నా మదిలో మెదిలిన పేరు భువనేశ్వర్ కుమార్. సౌతాఫ్రికాకు వెళ్తున్నామంటే జట్టులో ఎక్కువగా ఫాస్ట్బౌలర్లు ఉండాలి. అయితే, కొత్త బంతితో ఫలితం రాబట్టగల అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్ వంటి యువ బౌలర్ల రూపంలో మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నమాట వాస్తవమే. భువీ లాంటి అనుభవజ్ఞుడిని మర్చిపోకండి కానీ భువనేశ్వర్ కుమార్ వంటి అనుభవజ్ఞుడైన ఫాస్ట్బౌలర్ జట్టులో ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. సెలక్టర్లు అతడి పేరును పూర్తిగా విస్మరించడం తగదు. ముఖ్యంగా టీ20, వన్డేలలో అతడి అవసరం జట్టుకు ఉంది’’ అని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా సెలక్టర్లను ఉద్దేశించి మాట్లాడాడు. దేశవాళీ టోర్నీలో అదరగొట్టినా కాగా గతేడాది టీ20 ప్రపంచకప్లో నిరాశజనక ప్రదర్శన తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన భువీ.. ఇప్పటి వరకు రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. స్థానిక లీగ్, దేశవాళీ మ్యాచ్లలో అద్భుతంగా ఆడుతున్నప్పటికీ టీమిండియాలో చోటు కోసం యువ బౌలర్లతో పోటీలో మాత్రం వెనుకబడిపోయాడు. ఇటీవల ముగిసిన టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భువీ.. మొత్తంగా 16 వికెట్లు తీశాడు. చదవండి: సౌతాఫ్రికా టూర్: వన్డేలకు రాహుల్ సారథి.. జట్ల వివరాలివే చదవండి: WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్లో పాకిస్తాన్.. -
నెహ్రా వద్దన్నాడు.. మళ్లీ ద్రవిడే దిక్కయ్యాడు..!
టీమిండియా కోచ్గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం ప్రపంచకప్-2023 ఫైనల్తో ముగిసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో భారత కోచ్గా మరో దఫా కొనసాగాలని బీసీసీఐ ద్రవిడ్ను కోరింది. అయితే అతని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో బీసీసీఐ పెద్దలు ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో పడ్డారు. స్వదేశంలో ఆసీస్తో జరుగుతున్న సిరీస్కు తాత్కాలిక కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్కు బాధ్యతలు అప్పజెప్పిన బీసీసీఐ.. ఫుల్ టైమ్ కోచ్ వేటలో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలోనే బీసీసీఐ పెద్దలు టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాను కలిశారు. భారత్ జట్టు కోచింగ్ బాధ్యతలు స్వీకరించాలని ఆహ్వానించారు. అయితే ఈ ప్రతిపాదనను నెహ్రా తిరస్కరించినట్లు తెలుస్తుంది. తన ఐపీఎల్ కమిట్మెంట్ల కారణంగా ఈ పదవిని స్వీకరించలేనని చెప్పినట్లు వినికిడి. దీంతో గత్యంతరం లేక బీసీసీఐ మళ్లీ ద్రవిడ్నే సంప్రదించినట్లు సమాచారం. త్వరలో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కోచ్గా వ్యవహరించాలని ద్రవిడ్కు కబురు పంపారని తెలుస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటన కోసం అతనికి వీసా కూడా తీశారని సమాచారం. ఒకవేళ ద్రవిడ్ దక్షిణాఫ్రికా సిరీస్కు ఓకే చెబితే కోచింగ్ స్టాఫ్గా విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్), పరాస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), టి దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. -
వాళ్లిద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప: ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు
Rohit Sharma- Virat Kohli: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యంపై మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా వారిద్దరు ఇంకొన్నాళ్లు పొట్టి ఫార్మాట్లో కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా గతేడాది ప్రపంచకప్-2022 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి ఇంటర్నేషనల్ క్రికెట్కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. గత సీజన్లో ఐపీఎల్ ఆడిన ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు.. టీమిండియా తరఫున మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ సీనియర్ ప్లేయర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న వరల్డ్కప్నకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అంతర్జాతీయ టీ20లకు గుడ్బై? ఈ క్రమంలో వన్డే వరల్డ్కప్-2023 ముగిసిన తర్వాత.. 36 ఏళ్ల రోహిత్ అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరం కానున్నాడనే వార్తలు వస్తున్నాయి. 35 ఏళ్ల కోహ్లి కూడా పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వదంతులపై ఆశిష్ నెహ్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒక క్యాలెండర్ ఇయర్లో విరాట్ కోహ్లి 800- 1000 పరుగులు చేస్తున్నాడు. ఇక రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే ఏ సెలక్టర్ అయినా అతడి ఎంపిక విషయంలో టెంప్ట్ కాకుండా ఎలా ఉంటాడు? వాళ్లిద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప కోహ్లి, రోహిత్ ఈ ఫార్మాట్లో కొనసాగుతారో లేదో తెలియదు కానీ.. రెస్ట్ తీసుకోవాలని మాత్రం భావిస్తున్నారని చెప్పవచ్చు. తమకు తాముగా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప.. వాళ్లను దూరం పెట్టే ప్రసక్తే లేదు. వాళ్లిద్దరు ఇంకొన్నాళ్లు పొట్టి ఫార్మాట్లో కొనసాగే సత్తా ఉన్న వాళ్లే’’ అని ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్ ఆరంభం సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక రోహిత్ శర్మ గైర్హాజరీ, హార్దిక్ పాండ్యా గాయం నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ తొలిసారి భారత టీ20 జట్టుకు సారథ్యం వహించాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన తొలి టీ20లో సూర్య సేన 2 వికెట్ల తేడాతో గెలిచింది. చదవండి: యూట్యూబర్ను పెళ్లాడిన టీమిండియా పేసర్.. సిరాజ్ విషెస్ -
‘టీమిండియా హెడ్కోచ్ పదవి వద్దు’.. ఆసక్తి లేదన్న మాజీ పేసర్! కారణం?
Team India Head Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోచ్గా అవతారమెత్తిన టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అనూహ్యరీతిలో ముందుకు దూసుకుపోతున్న విషయం విదితమే. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ను జట్టును చాంపియన్గా నిలిపిన ఘనత అతడిది. మలి ప్రయత్నంలోనూ నెహ్రా మార్గదర్శనం చేసిన టీమ్ రన్నరప్గా నిలవడం విశేషం. టీమిండియా కోచ్ అయితే బాగుంటుంది ఈ నేపథ్యంలో నెహ్రా కోచింగ్ నైపుణ్యాలకు ఫిదా అయిన హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు భవిష్యత్తులో అతడికి టీమిండియా కోచింగ్ బాధ్యతలు అప్పజెపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాదిరే.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్లను నియమిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో రాహుల్ ద్రవిడ్ కంటే ఎక్కువ అనుభవం ఉన్న నెహ్రాను పరిమిత ఓవర్ల కోచ్గా నియమించాలని భజ్జీ గతంలో సూచించాడు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత టీమిండియా హెడ్కోచ్గా ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. తెరమీదకు నెహ్రా పేరు ఈ నేపథ్యంలో మెగా టోర్నీ తర్వాత అతడు కోచ్గా కొనసాగడానికి ఇష్టపడతాడా? లేదంటే బాధ్యతల నుంచి తప్పుకొంటాడా? అన్న సందేహాల నడుమ ఆశిష్ నెహ్రా పేరు తెరమీదకు వచ్చింది. ఒకవేళ ద్రవిడ్ కాంట్రాక్ట్ పునురుద్ధరించుకుంటే.. టెస్టు జట్టు కోచ్గా అతడు ఉంటే.. నెహ్రాకు వన్డే, టీ20 బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసక్తి లేదన్న నెహ్రా! కారణమిదే ఈ క్రమంలో ఆశిష్ నెహ్రా మాత్రం తన సన్నిహితుల వద్ద.. తాను టీమిండియా హెడ్కోచ్ పదవిపై ఆసక్తిగా లేనని చెప్పినట్లు సమాచారం. గుజరాత్ టైటాన్స్తో 2025 వరకు ఒప్పందం ఉన్న కారణంగా ఈ మేరకు బీసీసీఐ పదవిని నెహ్రా తిరస్కరించే అవకాశం ఉన్నట్లు పీటీఐ కథనంలో పేర్కొంది. తొలి సీజన్లో ట్రోఫీ గెలిచి కాగా అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి చెందిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్లీగ్లో ఎంట్రీ ఇచ్చింది. టీమిండియా హార్దిక్ పాండ్యా సారథ్యంలో నెహ్రా మార్గదర్శనంలో తమ తొలి సీజన్లో టైటిల్ గెలిచి సత్తా చాటింది. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5- నవంబరు 19 వరకు భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 జరుగనుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాతే ద్రవిడ్ కోచ్గా కొనసాగుతాడా లేదా అన్న విషయం తేలుతుంది. ఈలోపే ఇలా ఊహాగానాలు వెలువడటం గమనార్హం. చదవండి: WC 2023: తిలక్ ఉండగా అతడిని ఎలా సెలక్ట్ చేస్తారు: ఆసీస్ మాజీ క్రికెటర్ -
స్కూటీపై చక్కర్లు; ఆ ఇద్దరు గుజరాత్ బలం.. జాగ్రత్త
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మరికొద్ది గంటల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో తలపడనున్నాయి. మరి ఫైనల్లో ఎవరు విజేత అనేది ఆసక్తికరంగా మారింది. సీఎస్కే ఐదోసారి ఛాంపియన్గా నిలిచి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేస్తుందా లేక గుజరాత్ టైటాన్స్ రెండోసారి టైటిల్ గెలుస్తుందా అనేది చూడాలి. ఈ విషయం పక్కనబెడితే.. గుజరాత్ టైటాన్స్ హెడ్కోచ్ ఆశిష్ నెహ్రా ఫైనల్ మ్యాచ్కు ముందు అహ్మదాబాద్లోని నరేంద్ర స్టేడియంలో స్కూటీపై చక్కర్లు కొట్టడం వైరల్గా మారింది, పైగా నెహ్రాకు తోడుగా స్కూటీపై మోహిత్ శర్మ, రషీద్ ఖాన్లు కూడా ఉండడం ఆసక్తి కలిగించింది. కాగా ఈ వీడియోనూ జియో సినిమా స్వయంగా ట్విటర్లో షేర్ చేస్తూ.. ''గుజరాత్ టైటాన్స్ ON Their Way To #IPLFinal Like..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక గుజరాత్ టైటాన్స్కు బౌలింగ్ పెద్ద బలం అని చెప్పొచ్చు. పర్పుల్క్యాప్ రేసులో గుజరాత్ టైటాన్స్ నుంచే ముగ్గురు బౌలర్లు ఉండడం విశేషం. మహ్మద్ షమీ 28 వికెట్లతో టాప్లో ఉండగా.. రషీద్ ఖాన్ 27, మోహిత్ శర్మ 24 వికెట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీడియో చూసిన అభిమానులు.. ''ఆ ఇద్దరు గుజరాత్ టైటాన్స్కు బలం.. కాస్త జాగ్రత్త'' అంటూ కామెంట్ చేశారు #GujaratTitans on their way to the #IPLFinal like... pic.twitter.com/nldijNxMR8 — JioCinema (@JioCinema) May 27, 2023 చదవండి: సీఎస్కే ఐదోసారి కొడుతుందా లేక గుజరాత్ డబుల్ ధమాకానా? -
గుజరాత్ గెలిచినా.. నెహ్రాలో కనిపించని సంతోషం
గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా సోమవారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో జట్టు బ్యాటింగ్ ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్లో గిల్ సెంచరీ చేసినప్పటికి.. గుజరాత్ గెలిచినప్పటికి నెహ్రా మొహంలో మాత్రం సంతోషం కనిపించలేదు. అందుకు కారణం గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఆఖర్లో కుప్పకూలడమేనంట. తొలి ఇన్నింగ్స్ అనంతరం కెప్టెన్ పాండ్యాతో ఆశిష్ నెహ్రా డగౌట్లో నిలబడి సీరియస్గా చర్చించడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వాస్తవానికి ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సాహా డకౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్-సాయికిషోర్లు వేగంగా ఆడుతూ రెండో వికెట్కు 14 ఓవర్లలోనే 147 పరుగులు జోడించారు. వీరి దూకుడు చూసి గుజరాత్ స్కోరు ఈజీగా 220-240 మధ్య ఉంటుందని భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. సెంచరీ కోసం గిల్ మెళ్లగా ఆడడం.. అదే సమయంలో చివరి ఆరు ఓవర్లలో కేవలం 41 పరుగులు మాత్రమే చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. అందులో నాలుగు వికెట్లు చివరి ఓవర్లో పోగొట్టుకోవడం గుజరాత్ బ్యాటింగ్ వీక్నెస్ను బయటపెట్టింది. ఇదే నెహ్రా కోపానికి కారణమయింది. గిల్ 58 బంతుల్లో సెంచరీ మార్క్ చేసి ఐపీఎల్లో తొలి సెంచరీ సాధించినప్పటికి నెహ్రా అభినందించకపోవడం కెమెరాలకు చిక్కింది. అంతేకాదు సాయికిషోర్, పాండ్యాలు ఔటయ్యాకా గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంపై నెహ్రా సీరియస్ అయ్యాడు. బ్యాటింగ్ విఫలంపై పాండ్యాతో చాలాసేపు చర్చించాడు. ఎందుకంటే నెహ్రా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ను సీరియస్గా తీసుకున్నాడు. ప్లేఆఫ్ చేరే క్రమంలో ప్రతీ మ్యాచ్ ముఖ్యం.. అందునా ఎస్ఆర్హెచ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు కాబట్టే నెహ్రా అంత ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ సీజన్లో ప్లేఆఫ్లో అడుగుపెట్టింది. అయితే ఇలాంటి బ్యాటింగ్తో టైటిల్ కొట్టలేమని పాండ్యాతో నెహ్రా అన్నట్లు తెలిసింది. అయితే పాండ్యా కూడా తమ బ్యాటింగ్ ఫెయిల్యూర్పై దృష్టి పెడుతామని నెహ్రాకు వివరించినట్లు తెలుస్తోంది. pic.twitter.com/huFccqaJzy — ChhalRaheHainMujhe (@ChhalRahaHuMain) May 16, 2023 చదవండి: 'చెప్పి మరి సిక్సర్ కొట్టడం సంతోషంగా అనిపించింది' -
ఆశిష్ నెహ్రా వల్లే ఇదంతా
-
ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్.. తర్వాత నెట్బౌలర్! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు..
From Purple Cap To Net Bowler To IPL Return- Mohit Sharma Comeback Story: ‘‘ఎప్పుడెప్పుడు మైదానంలో అడుగుపెడతానా అన్న ఆతురత ఓవైపు.. చాలా ఏళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్నా కదా.. పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో అన్న బెరుకు మరోవైపు.. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న తర్వాత గతేడాది దేశవాళీ క్రికెట్ ఆడాను.. అతికొద్ది మందికి మాత్రమే నేను డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నానని తెలుసు. వారిలో అషూ పా ఒకరు. అషూ పా నాకు కాల్ చేసి జట్టుతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పారు. నాకు కూడా.. ‘‘ఇంట్లో కూర్చుని పెద్దగా చేసేది కూడా ఏం లేదు కదా’’ అని అనిపించింది. అందుకే ఇంట్లో ఖాళీగా ఉండే బదులు జట్టుతో ఉండాలని నిర్ణయించుకున్నా. గతేడాది గుజరాత్ టైటాన్స్ నెట్ బౌలర్గా సేవలు అందించా. నెట్ బౌలర్గా ఉండటం అవమానకరంగా భావించాల్సిన విషయమేమీ కాదు. పైగా మనకు కావాల్సినంత ఎక్స్పోజర్ దొరుకుతుంది. గుజరాత్ టైటాన్స్తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది’’ అని టీమిండియా పేసర్ మోహిత్ శర్మ అన్నాడు. ఐపీఎల్లో తన పునరాగమనానికి కారణం ఆశిష్ నెహ్రా భయ్యా అని చెప్పుకొచ్చాడు. అంతా ఆయన వల్లే టైటాన్స్ డ్రెస్సింగ్ రూంలో వాతావరణం ఎంతో బాగుంటుందని కోచ్ నెహ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహాయ సహకారాల వల్లే తను అనుకున్నది చేయగలిగానని తెలిపాడు. కాగా గతంలో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన మోహిత్ శర్మ 2014 సీజన్లో పర్పుల్ క్యాప్ గెలిచాడు. సీఎస్కే తరఫున 16 మ్యాచ్లలో 23 వికెట్లు పడగొట్టి ఆ ఏడాది అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తూ తన ప్రతిభను నిరూపించుకున్న ఈ ఫాస్ట్బౌలర్ 2015 వరల్డ్కప్ జట్టుకు ఎంపికయ్యాడు కూడా! పర్పుల్ క్యాప్ విన్నర్ నుంచి నెట్ బౌలర్గా చివరిగా.. 2015లో టీమిండియాకు ఆడిన ఈ హర్యానా బౌలర్ ఐపీఎల్-2020 సీజన్ తర్వాత క్యాష్ రిచ్ లీగ్కు కూడా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో గతేడాది గుజరాత్ టైటాన్స్కు నెట్ బౌలర్గా ఉన్న మోహిత్ శర్మ.. ఆశిష్ నెహ్రా సూచన మేరకు దేశవాళీ క్రికెట్లో ఆటను కొనసాగించాడు. ఘనంగా పునరాగమనం ఈ క్రమంలో ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్తో గురువారం జరిగిన మ్యాచ్తో గుజరాత్ తరఫున అరంగేట్రం చేస్తూ ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు. పంజాబ్తో మ్యాచ్లో మొత్తంగా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన మోహిత్.. 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ(25), ఆల్రౌండర్ సామ్ కర్రన్ (22)లను అవుట్ చేశాడు. తద్వారా పంజాబ్ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జట్టు విజయంలో తన వంతు సాయం అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అప్పుడు ఆరున్నర కోట్లు.. ఇప్పుడు 50 లక్షలు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. తన రీఎంట్రీ, విజయం వెనుక ఆశిష్ నెహ్రా సహకారం ఉందంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు మోహిత్ శర్మ. కాగా 2016లో 6.5 కోట్ల రూపాయల(కింగ్స్ ఎలెవన్)కు అమ్ముడుపోయిన రైట్ఆర్మ్ మీడియం పేసర్ మోహిత్ను.. గుజరాత్ ఈ ఏడాది మినీ వేలంలో 50 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. స్టార్ బౌలర్గా భారీ ధర పలికిన మోహిత్.. నెట్ బౌలర్గా పనిచేసి ప్రస్తుతం 50 లక్షల ప్లేయర్గా మారడం గమనార్హం. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్ రూపంలో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే మోహిత్కు పూర్వ వైభవం వచ్చే దాఖలాలు లేకపోలేదు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ స్కోర్లు టాస్: గుజరాత్- బౌలింగ్ పంజాబ్: 153/8 (20) గుజరాత్: 154/4 (19.5) విజేత: గుజరాత్ టైటాన్స్.. 6 వికెట్ల తేడాతో గెలుపు చదవండి: కేకేఆర్తో మ్యాచ్.. 13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్! సన్రైజర్స్ తుది జట్టు ఇదే An impressive Mohit Sharma debut for #GT ✅ An elegant Shubman Gill half-century ✅ A Trademark Tewatia Finish ✅ We have got the #PBKSvGT clash summed up for you 📽️🔽 #TATAIPL pic.twitter.com/RhpipfO2Ze — IndianPremierLeague (@IPL) April 14, 2023 -
జీరో నుండి హీరోగా 3D ప్లేయర్ విజయ్ శంకర్...సీక్రెట్ ఏంటి?
-
#VijayShankar: ఎంత మార్పు.. అంతా నెహ్రా చలవేనట!
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ విజయ్శంకర్ మంచి జోరుమీద ఉన్నాడు. గత సీజన్లకు భిన్నంగా అతని బ్యాటింగ్ సాగుతుంది. తాజాగా ఆదివారం కేకేఆర్తో మ్యాచ్లో విజయ్ శంకర్ పూనకం వచ్చినట్లుగా చెలరేగాడు. కేవలం 21 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్న విజయ్ శంకర్ ఓవరాల్గా 24 బంతుల్లోనే 63 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ తరపున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. Photo: IPL Twitter అయితే ఒకప్పుడు విజయ్ శంకర్ వేరు. క్రీజులో కుదురుకునే వరకు బంతులు తింటాడనే పేరు బలంగా వినిపించేది. గతంలో ఎస్ఆర్హెచ్లో ఉన్నప్పుడు విజయ్ శంకర్ ఒక్క మ్యాచ్లో కూడా మెరిసింది లేదు. టీమిండియాలోకి కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అలా అని అతనిలో టాలెంట్ లేదని కాదు.. ఉంది కానీ బయటపెట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. పైగా త్రీడీ ప్లేయర్ అంటూ అందరు అతన్ని ట్రోల్ చేసేవారు. అంతలా ట్రోల్స్ బారిన పడ్డ విజయ్ శంకర్ ఈ సీజన్లో మాత్రం కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ తన ఇంపాక్ట్ను బలంగా చూపించాడు. తొలి రెండు మ్యాచ్ల్లో ఎలా ఆడినా.. ఇవాళ కేకేఆర్తో మ్యాచ్లో మాత్రం తన బ్యాటింగ్ పవర్ను ప్రదర్శించాడు విజయ్ శంకర్. Photo: IPL Twitter మరి ఇంతలా విజయ్ శంకర్ బ్యాటింగ్ మారడానికి కారణం గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రానే అని అభిమానులు ట్విటర్లో పేర్కొన్నారు. నిజానికి గత సీజన్లోనే విజయ్ శంకర్ను గుజరాత్ టైటాన్స్ రూ. 1.4 కోట్లకు కొనుగోలు చేసింది. విజయ్ శంకర్ను కొనుగోలు చేయడం వెనుకు పరోక్షంగా నెహ్రా హస్తం ఉన్నట్లు తేలింది. గత సీజన్లో అక్కడక్కడా మెరిసిన విజయ్ శంకర్ను కరెక్ట్గా వాడితే ప్రయోజనం ఉంటుందని కోచ్ నెహ్రా నమ్మాడు. అందుకు తగ్గట్లే విజయ్ శంకర్ తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గతేడాది మినీ వేలానికి ముందు విజయ్ శంకర్ను రిటైన్ చేసుకున్న తర్వాత ఒక మీడియా సమావేశంలో ఆశిష్ నెహ్రా మాట్లాడాడు.'' విజయ్ శంకర్ను వెనుకేసుకు రావడానికి ఒక కారణం ఉంది. అతను టీమిండియాకు ఆడాడు. అతనిలో ఏదో తెలియని టాలెంట్ దాగుంది. దానిని వెలికితీయాలనుకుంటున్నా.. అవకాశాలు ఇస్తేనే కదా తెలిసేది.. ఏదో ఒకరోజు తనను తాను నిరూపించుకుంటాడు.. ఆ నమ్మకం నాకుంది.. అంటూ పేర్కొన్నాడు. తాజాగా ఆశిష్ నెహ్రా వ్యాఖ్యలు నిజమయ్యాయి ఇక తొలి ఇన్నింగ్స్ అనంతరం విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ''ఈ సీజన్ను బాగా ఎంజాయ్ చేస్తున్నా. కొందరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే పనిలో ఉన్నా. గతేడాది నాకు కలిసి రాలేదు. కానీ ఈ ఏడాది డొమొస్టిక్ సీజన్లో చాలా పరుగులు చేశాను. ఫ్రాంచైజీ నన్ను రిటైన్ చేసుకోవడంతోనే వారు నాపై కాన్ఫిడెంట్గా ఉన్నారని అర్థమైంది. ఒకప్పుడు వరల్డ్కప్లో గాయపడిన నేను ఆ తర్వాత ఐపీఎల్లో ఘోరంగా విఫలమయ్యాను. ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి తిరిగి వస్తాననేది చెప్పలేను. అవకాశమొస్తే మాత్రం వదులుకోను. ఇక కోచ్ ఆశిష్ నెహ్రా మద్దతు నాకు చాలా ఉంది. అతను నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా గత ఐపీఎల్ తర్వాత నాకు సర్జరీ అయింది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దేశవాలీ క్రికెట్లో రాణించి మళ్లీ ఫామ్ను అందుకున్నా'' అంటూ ముగించాడు. 𝐒𝐇𝐀𝐍𝐊𝐀𝐑 𝐏𝐎𝐖𝐄𝐑 💪💥 The ball flew to all parts of Motera as Vijay Shankar powered @gujarat_titans to their 𝐡𝐢𝐠𝐡𝐞𝐬𝐭-𝐞𝐯𝐞𝐫 #TATAIPL total 😱 Enjoy the chase in #GTvKKR, LIVE & FREE with #IPLonJioCinema - for all telecom operators!#IPL2023 | @vijayshankar260 pic.twitter.com/3fGqVAW2vj — JioCinema (@JioCinema) April 9, 2023 This man's magical powers have brought out a different Vijay Shankar to the IPL 🙏🏼 pic.twitter.com/B9suXfzODv — Saurabh Malhotra (@MalhotraSaurabh) April 9, 2023 Vijay Shankar unleashed pic.twitter.com/oElwVsvDEp — Ethical Joker (Perry's version) (@Jokeresque_) April 9, 2023 -
టీ20 జట్టు కోచ్గా ద్రవిడ్ కంటే అతనే బెటర్..!
టీమిండియా కోచ్ పదవిపై టీమిండియా మాజీ స్పిన్నర్, ప్రస్తుత ఎంపీ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత టీ20 జట్టు కోచ్గా తన మాజీ సహచరుడు ఆశిష్ నెహ్రా అయితే బెటర్గా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ను తక్కువ చేయాలన్నది తన ఉద్దేశం కాదని, నెహ్రా అయితే టీ20 జట్టు కోచ్ పదవికి పూర్తి న్యాయం చేయగలడని భావిస్తున్నానని మనసులో మాటను బయటపెట్టాడు. నెహ్రాకు పొట్టి ఫార్మాట్పై మంచి పట్టు ఉందని, కెరీర్ చరమాంకంలో అతను టీ20ల్లో అద్భుతంగా రాణించాడని, కేవలం ఇదే కారణంగానే ద్రవిడ్ బదులు నెహ్రాకు తను ఓటు వేస్తానని చెప్పుకొచ్చాడు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కోచ్ల ప్రతిపాదన తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. తన అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించానని, ఇందులో ఎవ్వరినీ కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని అన్నాడు. ఒకవేళ బీసీసీఐ ముగ్గురు కోచ్ల ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే.. ద్రవిడ్తో పాటు నెహ్రాకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అపార అనుభవమున్న ద్రవిడ్ను భారత టెస్ట్ జట్టు కోచ్గా, నెహ్రాను టీ20 టీమ్ కోచ్గా నియమిస్తే..భారత్కు రెండు ఫార్మాట్లలో తిరుగుండదని అన్నాడు. ఇదే సందర్భంగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్పై కూడా భజ్జీ స్పందించాడు. మొదటి మూడూ స్థానాల్లో వచ్చే వీరు స్ట్రయిక్ రేట్ మరింత పెంచుకోవాలని, తద్వారా 4, 5 స్థానాల్లో వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుందని సూచించాడు. కాగా, టీ20 వరల్డ్కప్-2022లో భారత్ సెమీస్లో నిష్క్రమించాక కోచ్తో సహా జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని అభిమానులు, విశ్లేషకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్కప్ నేపథ్యంలో ఇప్పటినుంచే కొత్తవారికి అవకాశం కల్పించేందుకు సీనియర్లను ఈ ఫార్మాట్ నుంచి తప్పించాలని, కోచ్గా ద్రవిడ్ కూడా ఈ ఫార్మాట్కు సూట్ కావట్లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. -
హార్దిక్ పూర్తిగా మారిపోయాడు.. ఈ మార్పునకు కారణం అతడే: మాజీ పేసర్
Asia Cup 2022- Hardik Pandya: ‘‘కాలం.. అనుభవం మనిషికి అన్ని విషయాలు నేర్పిస్తాయి. ఇందుకు పాండ్యా కూడా అతీతుడు కాడు. వ్యక్తిగా.. ఆటగాడిగా తనలో వచ్చిన మార్పులను నేను స్పష్టంగా చూశాను’’ అని టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. భారత జట్టు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. తండ్రిగా మారిన తర్వాత హార్దిక్ పరిణితి చెందాడని.. ఆటపై మరింత దృష్టి సారించాడని పేర్కొన్నాడు. చేదు అనుభవాలు ఎదుర్కొని.. కాగా గడ్డు పరిస్థితులను దాటుకుని ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ ఇచ్చిన అవకాశంతో మరోసాని తానేంటో నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్యా. అదే జోష్లో రెట్టించిన ఉత్సాహంతో కెరీర్లో ముందుకు సాగున్నాడు. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ను టైటిల్ విజేతగా నిలిపిన కెప్టెన్గా ఘనత వహించి.. టీమిండియాలో పునరగామనం చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీ టీ20 ఫార్మాట్లో ఏకంగా టీమిండియా పగ్గాలు చేపట్టి వరుస విజయాలు నమోదు చేశాడు. అంతేకాదు.. ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించి తన విలువ చాటుకున్నాడు. అయితే, గతంలో మాదిరి మరీ దూకుడుగా కాకుండా.. వివాదాల జోలికి పోకుండా.. కాస్త కామ్గా ఉంటూనే తన పనిని తాను చక్కబెట్టుకుంటున్నాడు. ఆశిష్ నెహ్రా, హార్దిక్ పాండ్యా(PC: IPL/BCCI) ఒకేలా ఉంటానంటే కుదరదు! ఈ నేపథ్యంలో.. గుజరాత్ టైటాన్స్ కోచ్గా హార్దిక్కు మరింత సన్నిహితంగా మెలిగిన ఆశిష్ నెహ్రా.. తమ కెప్టెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొడుకు అగస్త్య రాకతో హార్దిక్ పూర్తిగా మారిపోయాడన్నాడు. ఐసీసీ వీడియోలో మాట్లాడుతూ.. ‘‘మనిషికి మార్పు అవసరం. అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలా ఉంటానంటే కుదరదు. పాండ్యా విషయంలోనూ అదే జరిగింది. అగస్త్య వచ్చాకే! అనుభం తనకు చాలా నేర్పిందన్న విషయాన్ని అతడే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు కూడా! తను ఇప్పుడు వివాహితుడు.. ఓ బిడ్డకు తండ్రి.. అలాగే పరిణితి కలిగిన వ్యక్తి. నిజంగా అగస్త్య రాకతో తను చాలా మారిపోయాడు. తన పని ఏమిటో తాను చూసుకుంటూ.. కెరీర్పై మరింత దృష్టి సారించాడు. ఈ విషయాలను నేను దగ్గరగా గమనించాను’’ అని హార్దిక్ పాండ్యా గురించి నెహ్రా చెప్పుకొచ్చాడు. భార్య నటాషా, కొడుకు అగస్త్యతో పాండ్యా(PC: Natasa instagram ) ఇక పాండ్యా వయసు ఇంకా 28 ఏళ్లేనన్న నెహ్రా.. ఆటను ఇలాగే కొనసాగిస్తే.. కెరీర్ మరింత ఉజ్వలంగా సాగుతుందన్నాడు. కఠిన శ్రమకు ఓర్వడంతో పాటుగా నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునే తత్వం గలవాడని హార్దిక్ను కొనియాడాడు. కాగా హార్దిక్ పాండ్యా సెర్బియన్ మోడల్ నటాషాను పెళ్లాడాడు. వీరికి కొడుకు అగస్త్య సంతానం. ఇక హార్దిక్కు తన కొడుకంటే పంచప్రాణాలు. ఆట నుంచి విరామం దొరికితే కుటుంబానికే మొత్తం సమయం కేటాయిస్తాడు పాండ్యా. భార్య నటాషా, కొడుకు అగస్త్యతో పాండ్యా(PC: Natasa instagram ) చదవండి: Nazibulla Zardan: ఆరు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సాధించిన అఫ్గన్ బ్యాటర్ Asia Cup 2022: శ్రీలంకతో మ్యాచ్! మాకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'టీ20 ప్రపంచకప్ భారత జట్టులో అతడికి చోటు దక్కదు'
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు భారత్ ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్కు యువ ఆటగాళ్లకి బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఉమ్రాన్ మాలిక్, ఆర్ష్దీప్ సింగ్,ఆవేష్ ఖాన్ వంటి యువ పేసర్లు జట్టులోకి వచ్చారు. టీ20 ప్రపంచకప్ జట్టులో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ స్థానం సందిగ్థంలో పడింది. అదే విధంగా హార్షల్ పటేల్,ఆవేష్ ఖాన్ వంటి యువ పేసర్ల నుంచి షమీకి గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్కు షమీకి చోటు దక్కకపోయినా.. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్కు అతడు జట్టులో ఖచ్చితంగా ఉండాలని నెహ్రా తెలిపాడు. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్కు షమీకి సెలెక్టెర్లు విశ్రాంతి ఇచ్చారు. "టీ20 ప్రపంచకప్ కోసం భారత ప్రణాళికలో షమీ లేనట్లు కనిపిస్తోంది. ఒక వేళ అతడిని ఎంపిక చేసినా.. అద్భుతంగా రాణిస్తాడు. అతడు టెస్టు, వన్డే క్రికెట్ ఆడుతూనే ఉంటాడు. క ఈ మెగా టోర్నమెంట్లో యువ ఆటగాళ్లకి అవకాశం ఇచ్చినా..వచ్చే ఏడాది జరిగే 50 ఓవర్ల ప్రపంచకప్కు అతడిని తప్పకుండా ఎంపిక చేయాలి. ఐపీఎల్ తర్వాత షమీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఈ ఏడాదిలో పెద్దగా వన్డే సిరీస్లు లేవు. ఇంగ్లండ్తో ఏకైక టెస్టు మ్యాచ్ తర్వాత జరగునున్న వన్డే సిరీస్కు షమీకి చోటు దక్కవచ్చు. ఇంగ్లండ్ వంటి మేటి జట్టును ఓడించాలంటే ఖఛ్చితంగా షమీ లాంటి బౌలర్ జట్టులో ఉండాలి" అని నెహ్రా పేర్కొన్నాడు. చదవండి: T20 World Cup2022: 'భారత్ ప్రపంచకప్ గెలవాలంటే అతడు ఖచ్చితంగా జట్టులో ఉండాలి' -
IPL 2022: ఐపీఎల్ అత్యుత్తమ కోచ్లలో తనూ ఒకడు! ఎందుకంటే!
IPL 2022- Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ హెడ్కోచ్ ఆశిష్ నెహ్రాపై ఆ జట్టు మెంటార్ గ్యారీ కిర్స్టన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడు ఏ పనిచేసినా మనసు పెట్టి అంకితభావంతో పూర్తి చేస్తాడని కితాబిచ్చాడు. నెహ్రాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కిర్స్టన్.. ఐపీఎల్లోని బెస్ట్ కోచ్లలో అతడూ ఒకడంటూ ఆకాశానికెత్తాడు. ఆశిష్ నెహ్రా మార్గదర్శనంలోని కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అరంగేట్ర సీజన్లోనే లీగ్ దశలో టాపర్గా నిలిచి.. ఆపై రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఫైనల్లోనూ సత్తా చాటింది. క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన తొలి ఎడిషన్లోనే ట్రోఫీని ముద్దాడి మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది. గుజరాత్ టైటిల్ గెలవడంలో గ్యారీ కిర్స్టన్, నెహ్రాదే కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐసీసీ వరల్డ్కప్-2011 సమయంలో టీమిండియా కోచ్గా ఉన్న కిర్స్టన్, అప్పటి భారత జట్టులో సభ్యుడైన ఆశిష్ నెహ్రా 2018లో ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో భాగమయ్యారు. ఆ తర్వాత ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ హెడ్కోచ్గా నెహ్రా బాధ్యతలు స్వీకరిస్తే.. మెంటార్గా కిర్స్టన్ సేవలు అందించాడు. ఈ నేపథ్యంలో గ్యారీ కిర్స్టన్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘ఆశిష్ నాకు ప్రాణ స్నేహితుడు. మా ఇద్దరిది సుదీర్ఘ ప్రయాణం. ఆటను అర్థం చేసుకోవడంలో.. అత్యంత ప్రొఫెషనల్గా వ్యవహరించడంలో తనకు తానే సాటి. తను మనసు పెట్టి పని చేస్తాడు. కోచ్గా కూడా అంతే! ఎల్లప్పుడూ తన జట్టులోని ఆటగాళ్ల గురించి, వాళ్లకు మెలకువలు నేర్పడం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తను ఎప్పుడూ లో ప్రొఫైల్లోనే ఉంటాడు. అందరి దృష్టిలో పడాలనుకోవడం తనకు పెద్దగా ఇష్టం ఉండదు. అత్యంత నేర్పరులుగా వ్యవహరించే ఐపీఎల్ అత్యుత్తమ కోచ్లలో ఆశిష్ నెహ్రా కూడా ఒకడు’’ అని నెహ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. చదవండి 👇 IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్ను వదిలేస్తే.. చీప్గానే కొనుక్కోవచ్చు! వైభవంగా టీమిండియా క్రికెటర్ పెళ్లి.. ఫోటోలు వైరల్ Kal ki yeh yaadgar shaam, aap ke pyaar aur support ke naam 🥰😁 Jald lautenge, tab tak khayal rakhna Amdavad 💙#SeasonOfFirsts #AavaDe pic.twitter.com/IMgH0izYAL — Gujarat Titans (@gujarat_titans) May 31, 2022 -
IPL 2022: క్రెడిట్ మొత్తం ఆయనకేనన్న హార్దిక్.. అంతా అబద్ధం!
IPL 2022 Winner GT: ‘‘మొదటి సీజన్లోనే మనం సిక్సర్ కొట్టాము. చాంపియన్లుగా నిలిచాం. ఇది మనకు గర్వకారణం. మన బ్యాటింగ్, బౌలింగ్ విభాగం మరీ అంత గొప్పగా ఏమీ లేదని చాలా మంది అన్నారు. అయినా మనం ట్రోఫీ గెలిచాం. నిజంగా ఇది చాలా బాగుంది కదా’’ అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. తమ కోచ్ ఆశిష్ నెహ్రాతో ముచ్చటిస్తూ ఐపీఎల్-2022లో తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. కాగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ ఆరంభం నుంచి ఆధిక్యం కనబరిచి.. రాజస్తాన్ రాయల్స్తో ఫైనల్ మ్యాచ్లో గెలుపొంది ట్రోఫీ కైవసం చేసుకుంది. దీంతో తమ మొదటి సీజన్లోనే టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆశిష్ నెహ్రా- హార్దిక్ పాండ్యా సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఆశిష్ నెహ్రాపై పాండ్యా ప్రశంసలు కురిపించాడు. ‘‘మాలో మొదట ప్రాక్టీసుకు వెళ్లేది నెహ్రా. 20 నిమిషాల సమయం ఉన్నా సరే ప్రాక్టీసు అయిపోయినా మళ్లీ మళ్లీ బ్యాటింగ్ చేయమంటారు. నిజానికి ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుంది. అంకితభావంతో పనిచేశారు. మాలో ప్రతి ఒక్కరు హార్డ్వర్క్ చేసేలా ప్రోత్సహించారు’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, హార్దిక్ పాండ్యా మాటలకు మొహమాటపడిన నెహ్రా.. ‘‘ఇదంతా అబద్ధం’’ అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అబద్ధం కాదు నిజమే! హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, టీమ్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి వేలం రోజు నుంచి గుజరాత్ విజేతగా నిలిచే క్రమంలో తమదైన రీతిలో జట్టును తీర్చిదిద్దారు. లీగ్ సాగినంత కాలం జట్టు యాజమాన్యం ‘సీవీసీ క్యాపిటల్స్’ నుంచి ఒక్క వ్యక్తి కూడా ‘చిత్రం’లో ఎక్కడా కనిపించలేదు. అంతా వీరిద్దరికే అప్పగించారు. బ్యాటింగ్ కోచ్గా గ్యారీ కిర్స్టెన్ ఉన్నా... నిర్ణయాత్మక పాత్ర పై ఇద్దరిదే. చాలా మంది కోచ్లతో పోలిస్తే పూర్తి భిన్నమైన శైలితో నెహ్రా పని చేశాడు. ఆధునిక కోచ్ల తరహాలో చేతిలో పెన్నూ, పేపర్తో నోట్స్ రాసుకోవడం, ప్రతీ దానిని విశ్లేషణాత్మకంగా చూడటం అతను ఎప్పుడూ చేయలేదు. తాను చెప్పదల్చుకున్న అంశంపై డ్రెస్సింగ్ రూమ్లోనే ఒకే ఒక స్పష్టతనిచ్చేయడం, అమలు చేసే అంశాన్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటగాళ్లకే వదిలేసి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. సరిగ్గా చూస్తే గుజరాత్ టైటాన్స్ టీమ్లో ఫలానా ఆటగాడు ఘోరంగా విఫలమయ్యాడని ఒక్కరిని కూడా వేలెత్తి చూపలేం! వేలంలో 37 మంది పేర్లు వచ్చినప్పుడు గుజరాత్ పోటీ పడినా... చివరకు తమ అవసరాలను అనుగుణంగా కచ్చితంగా ఎంచుకుంటూ 20 మందినే తీసుకోవడంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సోలంకిదే ముఖ్య భూమిక. ఆటతో పాటు అన్నీ కలిసొచ్చిన గుజరాత్ సొంత అభిమానుల సమక్షంలో ఐపీఎల్ ట్రోఫీని అందుకోగలిగింది. ఐపీఎల్-2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ ►టాస్: రాజస్తాన్ ►రాజస్తాన్ స్కోరు: 130/9 (20) ►గుజరాత్ స్కోరు: 133/3 (18.1) ►విజేత: ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్-2022 చాంపియన్గా గుజరాత్ ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా(4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, 30 బంతుల్లో 34 పరుగులు) చదవండి 👇 IPL 2022 Final Prize Money, Awards: ఐపీఎల్ ‘విజేతలు’.. ఎవరెవరి ప్రైజ్మనీ ఎంతంటే! Hardik Pandya-Natasa Stankovic:'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే' View this post on Instagram A post shared by IPL (@iplt20) Let's ꜱᴀᴠᴇ this forever, #TitansFAM! 💙pic.twitter.com/66X3QqQXH7 — Gujarat Titans (@gujarat_titans) May 29, 2022 -
బుమ్రాను ఆడించడం ఏమిటి.. నిజంగా ఆశ్చర్యపోయా.. వాళ్ల సంగతి ఏంటి?
India Vs Sri Lanka T20 Series: శ్రీలంకతో టీ20 సిరీస్లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆడించడం పట్ల భారత మాజీ ఫాస్ట్బౌలర్ ఆశిష్ నెహ్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్-2022 సమీపిస్తున్న తరుణంలో ప్రయోగాలు చేయాల్సి ఉందని, మిగతా ఆప్షన్లు కూడా పరిశీలించాలని అభిప్రాయపడ్డాడు. ఇక శ్రీలంకతో రెండు టెస్టులు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో బుమ్రాకు విశ్రాంతినిచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఈ మేరకు నెహ్రా క్రిక్బజ్తో మాట్లాడుతూ... ‘‘శ్రీలంకతో టీ20 సిరీస్లో బుమ్రాను ఆడించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. భారత జట్టులో చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. ఇక ఆవేశ్ ఖాన్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. బుమ్రా జట్టులోకి వస్తే వీరిలో చాలా మంది బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. మెగా టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో అన్ని ఆప్షన్లు పరిశీలించాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ఇక స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనం సంతోషం కలిగిచిందన్న నెహ్రా... ‘‘జడేజా జట్టులోకి తిరిగి రావడం సంతోషాన్నిచ్చింది. అన్ని ఫార్మాట్లలో అతడు మెరుగ్గా రాణించగలడు. బ్యాటింగ్ పరంగా ఎంతో మెరుగయ్యాడు. ఏడు లేదంటే ఎనిమిదో స్థానంలో కాదు.. ఆరో స్థానంలో కూడా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది’’ అని ప్రశంసలు కురిపించాడు. కాగా శ్రీలంకతో మొదటి టీ20లో భారత్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బుమ్రా 3 ఓవర్లు బౌలింగ్ చేసి 19 పరుగులు ఇవ్వగా... జడేజా 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి 3 పరుగులతో అజేయంగా నిలిచాడు. చదవండి: Ravindra Jadeja: రీఎంట్రీ ఇచ్చాడు.. 'తగ్గేదేలే' అన్నాడు.. వీడియో వైరల్ -
IPL 2022: అహ్మదాబాద్ హెడ్ కోచ్గా టీమిండియా మాజీ పేసర్..!
Ashish Nehra: ఐపీఎల్ 2022 ద్వారా క్యాష్ రిచ్ లీగ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ.. జట్టు హెడ్ కోచ్, సహాయక సిబ్బంది విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. జట్టు హెడ్ కోచ్గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాని, మెంటార్గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టన్ను ఎంచుకున్నట్టు సమాచారం. ఈ ఇద్దరి ఎంపిక లాంఛనమేనని ఫ్రాంఛైజీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. మరోవైపు కోచ్, సహాయక సిబ్బందిని ఎంచుకునే విషయంలో మరో అరంగేట్రం జట్టు లక్నో ఓ రెండు అడుగులు ముందే ఉంది. ఆ జట్టు తమ ఫ్రాంఛైజీ హెడ్ కోచ్గా జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్ను, మెంటర్గా టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుతం ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ను ఎంపిక చేసుకుంది. కాగా, లక్నో జట్టును ఆర్పీఎస్జీ గోయెంకా గ్రూప్ గ్రూప్ రూ.7090 కోట్లకు కొనుగోలు చేస్తే, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీని సీవీసీ క్యాపిటల్ రూ.5625 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్లో ఈ రెండు జట్లు చేరడంతో మొత్తం ఐపీఎల్ జట్ల సంఖ్య 8కి చేరింది. చదవండి: కుంబ్లే సరసన శార్దూల్.. అరుదైన ఘనత సాధించిన బౌలర్గా రికార్డు -
భారత టీ20 కెప్టెన్గా ఆ ఫాస్ట్ బౌలర్ను ఎంపిక చేయండి...
Jasprit Bumrah Can Replace Virat Kohli As India Captain In T20Is: టీ20 ప్రపంచకప్- 2021 తర్వాత భారత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. దీంతో భారత తదుపరి కెప్టెన్ ఎవరన్న విషయంపై ఇప్పటివరకు బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోహిత్ శర్మ ,కెఎల్ రాహుల్, రిషబ్ పంత్.ల్లో ఒకరు భాద్యతలు స్వీకరించనున్నారనే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా టీ20ల్లో తదుపరి భారత కెప్టెన్గా.. కొత్త పేరును తెరపైకి తీసుకువచ్చాడు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు టీ20 కెప్టెన్ భాద్యతలు స్వీకరించే అర్హతలు ఉన్నట్లు నెహ్రా తెలిపాడు. "రోహిత్ శర్మతో పాటు, రిషబ్ పంత్ ,కేఎల్ రాహుల్ పేర్లును టీమిండియా తదుపరి కెప్టెన్గా వింటున్నాము. పంత్ భారత జట్టుతో ప్రపంచవ్యాప్తంగా పర్యటించాడు. కొన్ని సార్లు జట్టు నుంచి కూడా తొలగించబడ్డాడు. ఆదేవిధంగా మయాంక్ అగర్వాల్ ఫామ్ లేమి కారణం రాహుల్కు టెస్ట్ జట్టులో చోటు దక్కింది. అయితే బుమ్రా మాత్రం అన్ని ఫార్మాట్లలో తుది జట్టులో ఉంటున్నాడు.పేసర్లు కెప్టెన్లగా ఉండకూడదని ఎక్కడా వ్రాయలేదు"అని నెహ్రా క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni:ఆ జట్టులో కోహ్లికి నో ఛాన్స్.. కెప్టెన్గా మరోసారి ధోని -
అందరూ ధోనిలు కాలేరు.. పంత్కు కాస్త సమయం ఇవ్వండి
Everyone Cant Be MS Dhoni, Give Rishabh Pant Some Time Says Ashish Nehra : ఐపీఎల్-2021 సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి తన జట్టును ఫైనల్కు చేర్చేందుకు విఫలయత్నం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషబ్ పంత్కు టీమిండియా మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా మద్దతు పలికాడు. సారధిగా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్లోనే పంత్ తనను తాను నిరూపించుకున్నాడని, 2007 టీ20 ప్రపంచకప్లో ధోని టీమిండియాను విజేతగా నిలిపినట్లుగా పంత్ కూడా తన జట్టును ఛాంపియన్గా నిలపాలని ఆశించడం అత్యాశే అవుతుందని తెలిపాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత ఈ ఏడాది ఢిల్లీ సారధ్య బాధ్యతలను భుజానికెత్తుకున్న పంత్.. సీనియర్లు, జూనియర్లతో సమతూకం కలిగిన జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడని, అతనికి నిలదొక్కుకునేందుకు మరికాస్త సమయమిచ్చి, వచ్చే సీజన్లో కూడా కెప్టెన్గా కొనసాగించాలని సూచించాడు. కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు మినహా పంత్ సారధ్య బాధ్యతలకు వంద శాతం న్యాయం చేశాడని, అతన్ని కెప్టెన్గా కొనసాగించాలా వద్దా అన్నది అనవసరమైన రాద్దాంతమని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్గా పంత్కు వీలైనన్ని అవకాశాలు కల్పించాలని, అది వ్యక్తిగతంగా అతనికి, జట్టుకు ఉపయోగకరమని ఈ ఢిల్లీ ఆటగాడు పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుత ఐపీఎల్లో లీగ్ దశ వరకు టేబుల్ టాపర్గా నిలిచిన డీసీ జట్టు క్వాలిఫైయర్స్లో చెన్నై, కేకేఆర్ జట్ల చేతిలో వరుస ఓటములతో ఫైనల్ చేరకుండానే ఇంటి దారి పట్టింది. చదవండి: సీనియర్లకు రెస్ట్.. టీమిండియాలోకి ఐపీఎల్ హీరోస్..! -
T20 World Cup: తుదిజట్టు ఎంపికలో అతడి పేరే ముందు..
Ashish Nehra Comments On Ravindra Jadeja: టీమిండియా ఆల్రౌండర్, చెన్నై సూపర్కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా ఐపీఎల్-2021లో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో పది మ్యాచ్లు ఆడిన జడ్డూ 179 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 62(నాటౌట్). మొత్తంగా 33 ఓవర్లలో 226 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆదివారం నాటి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై చెన్నై విజయంలో జడేజా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జోరు మీదున్న రాహుల్ త్రిపాఠిని పెవిలియన్కు పంపిన అతడు... లక్ష్య ఛేదనలో వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 19వ ఓవర్లో మెరుపులు మెరిపించాడు. మొత్తంగా 8 బంతులు ఎదుర్కొని 22 పరుగులతో రాణించాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రానున్న టీ20 వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా జడేజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుదిజట్టు ఎంపిక నేపథ్యంలో జడ్డూ పేరే కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి, మెంటార్ ధోనికి జ్ఞప్తికి వస్తుందన్నాడు. ‘‘బ్యాట్.. బాల్తోనూ అతడు రాణిస్తున్నాడు. గత మ్యాచ్లో(కేకేఆర్) 4 ఓవర్లు వేసి కేవలం 21 పరుగులే ఇచ్చాడు. వికెట్ కూడా తీశాడు. బౌలర్గా తన పాత్ర ఏమిటో మరోసారి గుర్తుచేశాడు. Jadeja: Photo: IPL ఇక బ్యాటింగ్ విషయానికొస్తే... గత రెండేళ్లుగా తను మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. మొన్నటి మ్యాచ్లోనూ ప్రసిద్ కృష్ణ బౌలింగ్ను చీల్చి చెండాడు. మనం ధోని, ఆండ్రీ రసెల్, కీరన్ పొలార్డ్ గురించి ఎక్కువగా చెప్పుకొంటాం కదా. ఇప్పుడు జడేజా కూడా అదే స్థాయిలో రాణిస్తున్నాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో.. సీఎస్కే తరఫున ఐపీఎల్లో బ్యాట్ ఝలిపిస్తున్న విధానం చూస్తున్నాం. తనను థర్డ్ స్పిన్నర్గా భావించినా.. ఇప్పుడు మాత్రం బ్యాటింగ్ ఆల్రౌండర్గా తుది జట్టు ఎంపికలో తొలుత జడేజా పేరే కోహ్లి, శాస్త్రి, ధోని మదిలో మెదులుతుంది’’ అని చెప్పుకొచ్చాడు. అతడు అద్భుతాలు చేయడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. చదవండి: T20 World Cup: రంగంలోకి ఇమ్రాన్.. వాళ్లను తప్పించే అవకాశం.. షోయబ్, ఫఖార్ జమాన్కు.. -
అసలు మీ స్ట్రాటెజీ ఏంటి: అలా ఐతే రాహుల్ ఓపెనర్గా రాకూడదు!
ముంబై: పంజాబ్ కింగ్స్ సారథి కేఎల్ రాహుల్ కెప్టెన్సీ తీరుపై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పెదవి విరిచాడు. సమర్థులైన బౌలర్లు అందుబాటులో ఉన్నా వారి సేవలను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఇటువంటి తప్పిదాలే పంజాబ్ కింగ్స్ కొంపముంచాయని, ఇప్పటికైనా కెప్టెన్, కోచ్ కలిసి మెరుగైన ప్రణాళికలు రూపొందించాలని హితవు పలికాడు. కాగా ఆదివారం నాటి మ్యాచ్లో ఢిల్లీ, పంజాబ్పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఓపెనర్ శిఖర్ ధావన్ ఆకాశమే హద్దుగా(49 బంతుల్లో 92; 13 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగి ఆడటంతో రాహుల్ సేన తలవంచకతప్పలేదు. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘కొన్నిసార్లు ఎంత బాగా బౌల్ చేసినా, మెరుగ్గా బ్యాటింగ్ చేసినా, అద్భుతంగా ఫీల్డింగ్ చేసినా ఫలితాలు మనకు అనుకూలంగా రావు. కొన్నిసార్లు గెలుస్తాం. కొన్నిసార్లు ఓడిపోతాం. ఆటలో ఇవన్నీ సహజం. కానీ, పరిస్థితులు మన చేతుల్లోనే ఉన్నప్పుడు కూడా, ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతే ఇలాగే చేదు అనుభవాలు ఎదురవుతాయి. కోట్లకు కోట్లు పెట్టి కొనుక్కున్న విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. తొలి ఓవర్లలో వారికి బౌలింగ్ చేసే చాన్స్ ఎందుకు ఇవ్వలేదు. నిజానికి, 10 ఓవర్ల తర్వాత రంగంలోకి దిగిన మెరెడిత్, తన తొలి ఓవర్లోనే స్టీవ్ స్మిత్ వికెట్ తీశాడు. షమీ కూడా వేసిన నాలుగు ఓవర్లలోనూ విభిన్నమైన స్పెల్స్తో ఆకట్టుకున్నాడు. కానీ మీరు అర్ష్దీప్నకు ప్రాధాన్యం ఇచ్చారు. అసలు, మీరు ఫ్రంట్ఎండ్ నుంచి గేమ్ను కంట్రోల్ చేస్తున్నారా లేదా బ్యాక్ఎండ్ నుంచా’’ అంటూ రాహుల్ కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘ఒకవేళ మీ వ్యూహం అదే అయితే, ఇకపై కేఎల్ రాహుల్ ఓపెనర్గా రాకూడదు. అతడి స్థానంలో జలజ్ సక్సేనా, షమీ లేదంటే షారుఖ్లతో ఓపెనింగ్ చేయించాలి’’ అని నెహ్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కెప్టెన్ రాహుల్, కోచ్ అనిల్ కుంబ్లేతో కలిసి కూర్చుని చర్చించాలని, తదుపరి మ్యాచ్లోనైనా ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించాడు. చదవండి: అంపైర్లను బాల్ మార్చమని పదే పదే అడిగా: రాహుల్ IPL 2021, DC vs PBKS: ధావన్ ధనాధన్... -
నెహ్రా ఆటోగ్రాఫ్ తీసుకుంటే స్టార్లయిపోతారంతే.. గతంలో కోహ్లి కూడా
న్యూఢిల్లీ: టీమిండియా విధ్వంసకర ఆటగాడు రిషబ్ పంత్కు చెందిన ఓ పాత ఫోటోగ్రాఫ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో పంత్ భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా ఆటోగ్రాఫ్ తీసుకుంటూ కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్గా మారి, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. గతంలో టీమిండియా సారధి విరాట్ కోహ్లి కూడా అచ్చం ఇలానే ఆశిష్ నెహ్రాతో ఆటోగ్రాఫ్ తీసుకుంటూ కనిపించాడు. దానికి సంబంధించిన ఫోటో కూడా గతంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ రెండు ఫోటోలను పోలుస్తూ సోషల్ మీడియాలో పెద్ద డిస్కషనే నడుస్తోంది. వీటిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ.. కామెంట్లు పెడుతున్నారు. ఈ రెండు ఫోటోలకు చాలా దగ్గరి సంబంధాలు ఉండటంతో కోహ్లితో పంత్ను పోలుస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కోహ్లి, పంత్ల సక్సెస్కు నెహ్రా ఆటోగ్రాఫే కారణమని కొందరంటుంటే.. మరి కొందరేమో నెహ్రా హస్తవాసి చాలా బాగుందని.. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుంటే క్రికెటర్లు స్టార్లయిపోతారని కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ ముగ్గురు క్రికెటర్లు దేశవాళి క్రికెట్లో ఢిల్లీ జట్టకే ప్రాతినిధ్యం వహించారు. కాగా, శనివారం ఇంగ్లండ్తో ముగిసిన ఆఖరి టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన శతకంతో(118 బంతుల్లో 101; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టిన పంత్.. టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో పంత్కు తోడుగా వాషింగ్టన్ సుందర్(96 నాటౌట్) రాణించడంతో భారత్కు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దీంతో పట్టుబిగించిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో ప్రత్యర్ధిని 135 పరుగులకే ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. There one and only Mr. Ashish Nehra who helped Cheeku (@imVkohli ) and Pant (@RishabhPant17 ) to become what they are today. Here are the proofs.#INDvsENG #RishabhPant #Kohli @BCCI pic.twitter.com/VVr04ch2OL — shehzad noor (@shehzad25362849) March 6, 2021 -
వాళ్లన్నట్టుగానే సైనీ కే ఓటు పడింది!
న్యూఢిల్లీ: ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవం లేని నటరాజన్ను సిడ్నీ టెస్టులో ఆడించడం సరైన నిర్ణయం కాదని వెటరన్ ఆటగాళ్ల అభిప్రాయం కాబోలు నవదీప్ సైనీకే బీసీసీఐ జై కొట్టింది. గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన మూడో టెస్టుకు నవదీప్ సైనీకి అవకాశం కల్పించింది. సిడ్నీ టెస్టుకు సంబంధించి తుది జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఇక గత మ్యాచ్లలో పెద్దగా ఆకట్టుకోని మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్ను తీసుకుంది. కాగా, గాయపడ్డ ఉమేష్ యాదవ్ స్థానంలో నటరాజన్ను తీసుకునేందుకు జట్టు యాజమాన్యం యోచించగా.. ఇండియన్ వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా వంటివారు పెదవి విరిచిన సంగతి తెలిసిందే. నటరాజన్ బదులు నవదీప్ సైనీని తుది జట్టులోకి తీసుకుని అరంగేట్రం చేయించాలని నెహ్రా మంగళవారం పీటీఐతో మాట్లాడుతూ అన్నాడు. లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడడంతోపాటు, సిడ్నీ ఫ్లాట్ వికెట్పై సైనీ ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ టీమిండియాకు పనికొస్తుందని పేర్కొన్నాడు. గాయపడిన మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, నటరాజన్ వచ్చారని, సైనీని నేరుగా తీసుకున్నారని గుర్తు చేశాడు. అందుకనే మూడో పేసర్గా తొలి ప్రాధాన్యం సైనీకే ఇవ్వాలని సూచించాడు. అతని తర్వాత స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, నటరాజన్ ఉంటారని నెహ్రా తెలిపాడు. ఇక మెల్బోర్న్ టెస్టులో అరంగేట్రం మ్యాచ్లోనే ఐదు వికెట్లతో ఆకట్టుకున్న మహ్మద్ సిరాజ్పై అతను ప్రశంసలు కురిపించాడు. తొలి మ్యాచ్లోనే ఎంతో అనుభవమున్న ఆటగాడిలా సిరాజ్ బౌలింగ్ చేశాడడని నెహ్రా కొనియాడాడు. కాగా, నెట్ బౌలర్గా కెరీర్ ప్రారంభించిన తమిళనాడు సేలంకు చెందిన టి.నటరాజన్ ఐపీఎల్ 2020లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి నిరూపించుకున్నాడు. యార్కర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకుని ఆస్ట్రేలియా పర్యటనలో టీ20, వన్డేల్లో అరంగేట్రం చేశాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరుగనుంది. ప్రస్తుతం ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. ఇదిలాఉండగా.. తొలి టెస్టు తర్వాత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రాగా.. మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ గాయాల బారిన పడి జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. -
‘ప్రతీసారి జట్టును మార్చలేరు’
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా సాధించలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రక్షాళన అవసరమని తాజాగా వినిపిస్తున్న మాట. అయితే ఆర్సీబీ ఎక్కువగా ఆటగాళ్లను మారుస్తూ ఉంటుందనేది కూడా కాదనలేని వాస్తవం. అయితే ఇలా చేయవద్దని అంటున్నాడు ఆర్సీబీ మాజీ బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా. ఎక్కువ మంది ఆటగాళ్లను వదిలేసుకోవడం, మళ్లీ వేలానికి వెళ్లడం వంటి ప్రక్రియ జట్టుకు మంచిది కాదన్నాడు. ఇలా చేయడం వల్లే ఆర్సీబీ ఎక్కువగా విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్లపై ఆధారపడాల్సి వస్తుందన్నాడు. ఈ ఇద్దరి చుట్టూనే జట్టు తిరుగుతూ ఉంటుందని నెహ్రా పేర్కొన్నాడు. క్రికెట్ అనేది 11 మంది ఆటగాళ్లు ఆడే ఆట అని తెలిపాడు. (ఒక గిఫ్ట్గా ముంబై చేతిలో పెట్టారు: టామ్ మూడీ) తీసుకున్న ఆటగాళ్లను కనీసం రెండు మూడేళ్ల పాటు నిలబెట్టుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చన్నాడు. జట్టులో నిలకడ రావాలంటే కోహ్లి, డివిలియర్స్, చాహల్లు కొనసాగుతున్నట్లు ఇతర ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలన్నాడు. ఎప్పుడూ ఆర్సీబీని చూసినా ముగ్గురు నుంచి నలుగురు మాత్రమే రిటైన్ అయిన ఆటగాళ్లు తుది జట్టులో ఆడుతూ ఉంటారన్నాడు. ఆర్సీబీలో ఎక్కువగా ఆటగాళ్లను తీసుకోవడం, వదిలేయడం మాత్రమే జరుగుతూ ఉంటుందని, ఇది మంచి పరిణామం కాదన్నాడు. ఒక మంచి జట్టుగా రూపాంతరం చెందాలంటే ఒక తుది జట్టు అంటూ ఉండాలన్నాడు. వేలంలో ప్రతీసారి ఆటగాళ్లను మార్చలేరని విషయం తెలుసుకోవాలన్నాడు. ప్రతీసారి జట్టులోకి కొత్త ఆటగాళ్లను తీసుకుంటూ పోతే చివరకు తీసుకున్న వాళ్లనే మళ్లీ తీసుకోవాల్సి వస్తుందన్నాడు. ఉన్న జట్టునే కనీసం మూడేళ్ల పాటు కొనసాగిస్తే వారి సత్తా బయటకు వస్తుందన్నాడు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన ఆర్సీబీ.. సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో ఈసారైనా కప్ను సాధించాలనే ఆర్సీబీ ఆశలకు ప్లేఆఫ్స్తోనే బ్రేక్పడింది. -
‘కోహ్లి.. నువ్వు ఓపెనర్గానే కరెక్ట్’
న్యూఢిల్లీ: ఈ సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లికి పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదని ఆ జట్టు బౌలింగ్ మాజీ కోచ్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. యూఏఈలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కోహ్లిపై తీవ్ర ఒత్తిడి ఉందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఒత్తిడికి లోనైన కోహ్లి వికెట్ సమర్పించుకున్నాడన్నాడు. రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్లు పెద్దగా వికెట్లు సాధించకపోయినా వారు అంత సులువుగా పరుగులు ఇవ్వడం లేదన్నాడు. ఇక్కడ ఆర్సీబీ కెప్టెన్ కోహ్లికి ఏ విధమైన చాన్స్ ఇవ్వని ఢిల్లీని ప్రత్యేకంగా అభినందించాలన్నాడు. (అదే పాంటింగ్ నాతో చెప్పాడు: రహానే) అసలు అరోన్ ఫించ్ జట్టులో లేనప్పుడు కోహ్లి ఓపెనర్గా దిగితేనే మంచిదన్నాడు. కనీసం రాబోవు మ్యాచ్ల్లోనైనా ఫించ్ లేని పక్షంలో కోహ్లి ఓపెనర్గా రావాలన్నాడు. ఆర్సీబీ జట్టులో ఫించ్ లేకపోతే కోహ్లినే ఓపెనర్గా కరెక్ట్ అని నెహ్రా పేర్కొన్నాడు.రాయల్ చాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఆర్సీబీ 153 పరుగుల టార్గెట్ను నిర్దేశించగా, ఢిల్లీ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అజింక్యా రహానే(60; 46 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్)లు రాణించి విజయానికి బాటలు వేశాడు. అయితే ఆర్సీబీ ఓడినప్పటికీ ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఢిల్లీ తన విజయాన్ని 19 ఓవర్ల వరకూ తీసుకురావడంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరింది. -
రిషబ్ పంత్పై నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు
ఢిల్లీ : ఐపీఎల్ 13వ సీజన్ సీరియస్గా సాగుతున్న వేళ టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా ఆసక్తికర ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్కు ఎంఎస్ ధోని గుడ్బై చెప్పి ఆరు సంవత్సరాలైపోయింది. ఈ ఆరు సంవత్సరాల్లో ధోని లాంటి ఆటగాడు మరొకరు రాకపోవడం.. ఒకవేళ వచ్చిన అడపా దడపా జట్టులోకి వచ్చిపోతుండడం చేస్తున్నారు. ఈ ఆరేళ్లలో టీమిండియా తన టెస్టు జట్టులో వృద్ధిమాన్ సాహా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లను ప్రయత్నించింది. వీరిలో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఇన్నింగ్స్లతో మెరిసేవారే గాని నిలకడగా ఆడిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే ఇప్పటికీ టెస్టు జట్టులో వికెట్కీపర్ స్థానం సుస్థిరంగా లేదు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో ధోని స్థానాన్ని భర్తీ చేసే సత్తా రిషబ్ పంత్కు ఉందంటూ.. అతని వారసుడు పంత్ మాత్రమేనని ఆశిష్ నెహ్రా అంటున్నాడు. ఇదే విషయమై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నాడు. (చదవండి : పేరు మాత్రమే పంత్.. కానీ పనులు మాత్రం) 'ఇప్పుడు మనం ఏ ఫార్మాట్ గురించి మాట్లాడుతున్నామనేది ముఖ్యం కాదు. బంగర్ చెప్పిన మాటలను నేను పూర్తిగా సమర్థిస్తాను. రిషబ్ పంత్ను టీమిండియాలో ఆడించాలని కోరుకుంటున్నా. ఈ ఐపీఎల్లో అతను మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ ద్వారా పంత్ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రతి ఆటగాడికి మద్దతు అనేది చాలా అవసరం 'అని తెలిపాడు. అంతకముందు స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో టీమిండియా సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఐపీఎల్లో పంత్ ప్రారంభించిన విధానం చాలా బాగుందన్నారు. లెఫ్ట్ హ్యాండర్, వికెట్ కీపర్గా రాణిస్తున్న పంత్.. టీమిండియా మిడిల్ ఆర్డర్ను బ్యాలెన్సింగ్ చేయడానికి సరిగా సరిపోతాడని అన్నారు. టీమిండియా మిడిల్ ఆర్డర్లో ఎక్కువగా రైట్ హ్యాండర్స్ ఉన్నారని చెప్పారు. టీమిండియా మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్ ఉండటం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. (చదవండి : ఇలా అయితే కష్టం పృథ్వీషా!) ప్రస్తుతం రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ సీజన్లో మంచి ఆటతీరు కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లో 171 పరుగులు చేశాడు. కాగా, టీమిండియా తరఫున 13 టెస్ట్లు, 16 వన్డేలు, 28 టీ-20లు ఆడిన పంత్ను పలువురు ధోని వారసుడిగా అభివర్ణిస్తున్నారు. అయితే టీమిండియా తరఫున నిలకడగా రాణించడంలో పంత్ విఫలమవుతున్నాడు. -
'ఆరోజు సచిన్ నక్కతోకను తొక్కాడు'
ఢిల్లీ : 2011 ప్రపంచకప్ సందర్భంగా పాకిస్తాన్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు అదృష్టం భలే కలిసొచ్చిందంటూ టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆశిశ్ నెహ్రా పేర్కొన్నాడు. ఆ మ్యాచ్లో సచిన్ 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడినా.. నాలుగుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాజాగా ఆనాటి మ్యాచ్ విషయాలను నెహ్రా మరోసారి పంచుకున్నాడు. 'నిజంగా ఆరోజు పాక్తో జరిగిన మ్యాచ్లో సచిన్ నక్కతోక తొక్కివచ్చాడనే చెప్పాలి. ఎందుకంటే అతను చేసిన 85 పరుగులు.. నాలుగు సార్లు పాక్ ఫీల్డర్లు క్యాచ్లు విడవడం ద్వారా సాధించాడు. అదృష్టం అంటే ఎలా ఉంటుందో బహుశా సచిన్కు ఆరోజు తెలిసి ఉంటుంది. సచిన్కు నెర్వెస్ నైంటీస్ అనే ఫోబియా ఉండేది.. కానీ పాక్తో జరిగిన సెమీ ఫైనల్లో ఆ ఫోబియా కనిపించలేదు.. కానీ ఒత్తిడి కనిపించింది. సచిన్ నాలుగుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడంటే ఆరోజు అదృష్టం అతని వెంట ఉంది. ఇక ప్రపంచకప్లో ఒక కీలక మ్యాచ్లో ఒత్తిడి ఉండడం సహజం.. అది ఇండియా-పాక్, ఇండియా- ఇంగ్లండ్ ఏ మ్యాచ్ అయినా కావొచ్చు.. మేం సెమీఫైనల్ చేరుకొని ఫైనల్కు చేరుకునే క్రమంలో ఒత్తిడిని అధిగమించాం 'అంటూ ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.('ఆకలితో ఉన్నా.. రిటైరయ్యే ఆలోచన లేదు') ఇక పాక్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 260 పరుగులు చేసింది. సచిన్ ఈ మ్యాచ్లో 85 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కానీ సచిన్ వరుసగా 25,45,70,81 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. మిస్బా, యూనిస్ ఖాన్, కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్లు నాలుగుసార్లు క్యాచ్లు జారవిడిచారు. ఆ తర్వాత భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాక్ జట్టు 231 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. దీంతో ఫైనల్లోకి ప్రవేశించిన భారత్ శ్రీలంకపై ఘనవిజయం సాధించి 28 సంవత్సరాల నిరీక్షణ తర్వాత సొంతగడ్డపై రెండోసారి సగర్వంగా ప్రపంచకప్ను అందుకుంది. -
‘ఆసీస్తో టీమిండియాను పోల్చలేం’
సిడ్నీ: ప్రస్తుత భారత క్రికెట్ జట్టును ఒకనాటి ఆస్ట్రేలియా జట్టుతో పోల్చలేమని టీమిండియా పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ప్రధానంగా 1990-2000మధ్య కాలంలోని ఆసీస్ జట్టుతో ప్రస్తుత టీమిండియాకు పోలిక లేదని నెహ్రా తేల్చిచెప్పాడు. అప్పటి ఆసీస్ జట్టును చేరుకోవడానికి భారత్ ఇంకా చాలా దూరంలో ఉందన్నాడు. స్టీవ్ వా, రికీ పాంటింగ్లు సారథ్యం వహించిన ఆసీస్ జట్టుకు ఇప్పటి కోహ్లి నేతృత్వంలోని భారత జట్టుకు చాలా తేడా ఉందని పేర్కొన్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో ‘ఆకాశ్ వాణి’ కార్యక్రమంలో నెహ్రా మాట్లాడుతూ పలు విషయాల్ని షేర్ చేసుకున్నాడు. ‘స్టీవ్ వా, రికీ పాంటింగ్లు కెప్టెన్లుగా చేసిన ఆసీస్ జట్టును చేరుకోవాలంటే ప్రస్తుత టీమిండియా చాలా దూరంలో ఉందనేది నా అభిప్రాయం. వారి సారథ్యంలో ఆసీస్ జట్టు చాలా పటిష్టంగా ఉండేది. 1996 వరల్డ్కప్ ఫైనల్కు చేరి రన్నరప్గా సరిపెట్టుకున్న ఆస్ట్రేలియా.. ఆపై హ్యాట్రిక్ వరల్డ్కప్లు సాధించింది. ఆ కాలంలోనే 18-19 వరకూ స్వదేశీ-విదేశీ టెస్టు గెలుపులను అందుకుంది. (36 ఏళ్లు... 11 సిరీస్లు...) అంటే భారత జట్టు ఆ మార్కును చేరుకోలేదని నేను చెప్పడం లేదు. అప్పటి ఆసీస్ జట్టుకు ప్రస్తుత భారత జట్టుకు చాలా తేడా ఉందనే విషయాన్ని మాత్రమే చెబుతున్నాను. ఇక్కడ కోర్ గ్రూప్ ముఖ్యం అనే విషయాన్ని నేను విశ్వసిస్తున్నాను. ఒక టేబుల్పై అనేక రకాల వంటకాలు ఉన్నప్పుడు ఏమీ తినాలనే విషయంలో గందరగోళం ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కువ వంటకాలు కంటే కూడా పరిమితంగా ఉండే నాణ్యత గల ఆహారమే ముఖ్యం’ అని ఆటగాళ్ల ఎంపికలో జాగ్రత్తలు అవసరమని పరోక్షంగా హెచ్చరించాడు. కాగా, కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో ఆడుతున్నాడని, ఎంఎస్ ధోని భర్తీ చేయాల్సిన రిషభ్ పంత్ను డ్రింక్స్ అందించడానికి మాత్రమే పరిమితం చేస్తున్నారని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఇటీవల కాలంలో పంత్ చాలా చాన్సులు మిస్సయ్యాడనే వాస్తవమని,కానీ అతను ఎంత టాలెంట్ ఉన్న క్రికెటర్ అనే విషయాన్ని ఇప్పటికే చూశామన్నాడు. పంత్కు సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఇస్తే ధోని స్థానాన్ని భర్తీ చేయగలడని నెహ్రా ఆశాభావం వ్యక్తం చేశాడు. అతన్ని కేవలం రిజర్వ్ బెంచ్లో కూర్చొబెట్టవద్దని నెహ్రా పేర్కొన్నాడు. తన కెరీర్లో 120 వన్డేలు, 17 టెస్టులు, 27 అంతర్జాతీయ టీ20లు ఆడిన నెహ్రా.. కోహ్లి కెప్టెన్సీ ఇంకా పురోగతిలోనే ఉందన్నాడు. ఒక బ్యాట్స్మన్గా కోహ్లి ఇప్పటికే ఎన్ని ఘనతలు సాధించాడో ప్రత్యేకం చెప్పనక్కర్లేదని, కానీ కెప్టెన్సీ విషయంలో చాలా పరిణితి సాధించాల్సి ఉందన్నాడు. (ఇమ్రాన్ను మించి పాపులర్ అయ్యాడు: నెహ్రా) -
ఇమ్రాన్ను మించి పాపులర్ అయ్యాడు: నెహ్రా
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా తనకు ఎంతగానో నచ్చిన 16 ఏళ్ల నాటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ను గుర్తు చేసుకున్నాడు. కార్గిల్ యుద్ధం తర్వాత భారత్ తొలిసారిగా పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు వెళ్లిన క్షణమది. 2003-04 సీజన్లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన భారత్ వన్డే సిరీస్తో పాటు టెస్టు సిరీస్ను కూడా కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, ఇర్పాన్ పఠాన్లు మెరుగైన ప్రదర్శనలతో కీలక పాత్ర పోషించారు. అయితే ఆ సిరీస్లో అద్భుతంగా, అమోఘంగా రాణించిన బౌలర్ ఒకరున్నారని నెహ్రా పేర్కొన్నాడు. ఆ సిరీస్ మోస్ట్ పాపులర్ అయిపోయిన అతని పేరు లక్ష్మీపతి బాలాజీ అని నెహ్రా తెలిపాడు. (‘ధోని వ్యూహాలకు తగ్గ కెప్టెన్లను తీసుకున్నాడు’) వన్డే, టెస్టు సిరీస్ల్లో భాగంగా మ్యాచ్లన్నింటిలో బాలాజీ అత్యుత్తమ ప్రదర్శన చేశాడని, నిర్ణాయత్మక మూడో టెస్టులో 7 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపుతిప్పాడని నెహ్రా స్పష్టం చేశాడు. ఆ టూర్ మొత్తంలో బాలాజీ ఆడిన తీరు ఒకప్పటి పాకిస్తాన్ క్రికెటర్, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్కంటే మెరుగ్గా ఉందన్నాడు. దాంతో పాకిస్తాన్ ప్రజల్లో ఇమ్రాన్ కంటే ఎక్కువగా బాలాజీ పాపులర్ అయిపోయాడన్నాడు. ఇది తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకమన్నాడు. ఒకవైపు వీరేంద్ర సెహ్వాగ్ సిక్సర్ల మోత, ఇర్ఫాన్ పఠాన్ స్వింగ్కు బాలాజీ మెరుపులు కూడా తోడవడంతో రెండు సిరీస్లను కైవసం చేసుకున్నామన్నాడు. టెస్టు సిరీస్లో బాలాజీ బౌలింగ్ గణాంకాలు ఒకటైతే, వన్డే సిరీస్లో బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా ఆకట్టుకోవడం ఇక్కడ విశేషమన్నాడు. ఆ వన్డే సిరీస్లో 10వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన బాలాజీ 160.71 స్టైక్రేట్తో 45 పరుగులు సాధించాడు. ఆ సిరీస్లో స్టైక్రేట్ పరంగా అఫ్రిది కంటే బాలాజీదే అధికం. (మియాందాద్ను కడిగేయాలనుకున్నారు..!) -
అంతా బాగుంటే... ఆఖర్లో ఐపీఎల్: నెహ్రా
న్యూఢిల్లీ: ఈ అక్టోబర్ కల్లా కోవిడ్–19 అదుపులోకి వస్తే ఐపీఎల్ 13వ సీజన్కు ఏ ఢోకా ఉండదని భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. ఓ స్పోర్ట్స్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాజీ సీమర్ మాట్లాడుతూ ‘ఒకవేళ ఆగస్టులో నిర్వహించాలనుకున్నా... వర్షాకాలం వల్ల అది సాధ్యపడదు. చాలా మ్యాచ్లు వర్షార్పణమవుతాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు అక్టోబర్కల్లా చక్కబడితే ఐపీఎల్ ఈ ఏడాదే జరిగేందుకు వందశాతం అవకాశముంటుంది’ అని అన్నాడు. భారత్లోనూ వైరస్ విస్తరిస్తుండటంతో ఈనెల 15 తర్వాత కూడా లీగ్ జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికీ వేచిచూసే ధోరణిలోనే ఉన్న బీసీసీఐ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల యువరాజ్ తన కెరీర్లో సారథిగా గంగూలీ ఇచ్చినంత సహకారం ఎవరు ఇవ్వలేదన్నాడు. దీనిపై స్పందించిన నెహ్రా.... ధోని సారథ్యంలోనూ యువీ చక్కగా రాణించాడని, 2007 టి20 ప్రపంచకప్లో... ఆ తర్వాత 2011 వన్డే ప్రపంచకప్లో ధోని అండదండలతో చెలరేగాడని గుర్తుచేశాడు. -
ఎంతో మందిని చూశా.. కానీ ధోని అలా కాదు
సాక్షి, న్యూఢిల్లీ : భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ధోని గురించి అడగ్గానే అత్యుత్తమ వికెట్కీపింగ్ నైపుణ్యం, బెస్ట్ ఫినిషింగ్, విజయవంతమైన సారథి అని అందరూ చెబుతారు. కానీ అతడు భారత క్రికెట్లో ఓవర్ నైట్ స్టార్ కాలేదు. ఛీవాట్ల నుంచి మొదలైన అతడి ప్రయాణం కీర్తించే స్థాయికి వెళ్లింది. ఆటకు దూరమై 8 నెలలు కావస్తున్నా అతడు లేకుండా క్రికెట్ వార్త ఉండటం లేదు.. కోహ్లి నుంచి ప్రతీ యువక్రికెటర్ ధోని జపం వదడం లేదు. ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ లెఫ్టార్మ్ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా ధోని గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘ధోని క్రికెట్ కెరీర్ అంతగొప్పగా అయితే ప్రారంభం కాలేదు. అటు బ్యాటింగ్లో ఇటు వికెట్ కీపింగ్లో వైఫల్యం చెందాడు. అయితే అతడు ఏ సమయంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. విశాఖపట్నంలో పాకిస్తాన్తో జరిగిన వన్డే అతడి కెరీర్ను మలుపుతిప్పింది. సెంచరీతో జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. టీమిండియాలోకి వచ్చినప్పుడు అతడు బెస్ట్ కాదు. కీపింగ్లో ధోని కంటే ముందు నయాన్మోంగియా, కిరన్ మోరెలు తమ అత్యుత్తమ కీపింగ్ నైపుణ్యంతో ఓ బెంచ్ మార్క్ సెట్ చేశారు. అయితే ఆటపై ధోనికి ఉన్న క్రమశిక్షణ, ఇష్టం, ప్రశాంతత, విశ్వాసం అతడిని గొప్పవాడిని చేశాయి. దినేశ్ కార్తీక్, పార్థీవ్ పటేల్లకు అనేక అవకాశాలు వచ్చాయి. కానీ వారు సద్వినియోగం చేసుకోలేరు. ఇదే క్రమంలో ధోని వారిద్దరి కంటే మెరుగని నిరూపించుకున్నాడు. మామూలు వికెట్కీపర్, బ్యాట్స్మన్గా వచ్చి అత్యుత్తమ వికెట్కీపర్ బ్యాట్స్మన్గా ఎదిగాడు. నాకు మైక్ బ్రెయర్లీ, ఇమ్రాన్ఖాన్, అర్జున్ రణతుంగల గురించి తెలియదు. నా 22 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనిలు నాకు నచ్చిన, అత్యుత్తమ సారథులు. వారికి ఏం చేయాలో తెలుసు, సహచర క్రికెటర్ల నుంచి అత్యుత్తమ ఆటను ఎలా రాబట్టాలో తెలుసు. లభించిన అవకాశాలను జట్టుకు ఉపయోగపడేలా ఎలా సద్వినియోగం చేసుకోవాలో గంగూలీ, ధోనిలకు బాగా తెలుసు. ఇక 2009లో టెస్టుల్లోకి పునరాగమనం చేయాలని ధోని కోరాడు. కానీ ధోని విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించాను. ధోనిని చూసినప్పుడల్లా ఆత్మ విశ్వాసం ఉన్న వ్యక్తికి అవకాశం లభించి సద్వినియోగం చేసుకున్నాక అతడిని వెనక్కి లాగడం కష్టం అనే సత్యం రుజువైంది’అని నెహ్రా పేర్కొన్నాడు. -
అప్పుడు ధోనిని తిట్టడం తప్పే..!
న్యూఢిల్లీ: ఎంఎస్ ధోని.. భారత క్రికెట్లో ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్. టీమిండియాను మరో స్థాయికి తీసుకెళ్లిన సారథి. అయితే భారత జట్టులో చోటు నిలబెట్టుకోవడం దగ్గర్నుంచీ, కెప్టెన్గా ఎదిగే వరకూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ధోని అరంగేట్రం చేసిన కొత్తలో అతని స్థానంపై భరోసా లేని సందర్భాలు ఎన్నో. తన కెరీర్ ఆరంభంలో అటు బ్యాట్స్మన్గా, ఇటు కీపర్గాను ధోనిలో విఫలం కావడమే అందుకు కారణం. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఆగ్రహాన్ని కూడా ధోని చూశాడు. ఇదే విషయాన్ని నెహ్రా తాజాగా స్పష్టం చేశాడు. 2005లో పాకిస్తాన్తో జరిగిన ఒక వన్డేలో ధోనిని తాను తిట్టిన విషయాన్ని నెహ్రా మళ్లీ గుర్తు చేసుకున్నాడు. ఆనాటి మ్యాచ్లో తన బౌలింగ్లో క్యాచ్ను ధోని వదిలేయడంతో నెహ్రా కోపం కట్టలు తెంచుకుంది. అంతే, ధోనిపై తిట్ల దండకం అందుకున్నాడు నెహ్రా. ఇది ఆరోజు చేసిన పెద్ద తప్పని నెహ్రా పేర్కొన్నాడు.‘ ఆరోజు జరిగిన మ్యాచ్ నాకు బాగా గుర్తు. అది పాకిస్తాన్తో వన్డే సిరీస్లో నాల్గో వన్డే . ఆ మ్యాచ్లో నేను ధోనిని బాగా తిట్టా. నా బౌలింగ్లో ఆఫ్రిది స్ట్రైకింగ్లో ఉండగా ఇచ్చిన క్యాచ్ను ధోని వదిలేశాడు. దాంతో నాకు కోపం వచ్చేసింది.. ఆపుకోలేక తిట్టేశాను. అలా తిట్టడానికి కారణం ఉంది. అంతకుముందు బంతిని ఆఫ్రిది సిక్స్గా కొట్టాడు. ఆ వెంటనే ఇచ్చిన క్యాచ్ను ధోని పట్టుకోవడంలో విఫలమయ్యాడు. అది క్లిష్లమైన క్యాచ్.అటు స్లిప్కు ఇటు కీపర్కు మధ్యలో నుంచి వెళ్లిపోయింది. కాకపోతే నేను ధోనిపై అసహనం వ్యక్తం చేసిన ఘటన విశాఖలో రెండో వన్డేలో అని చాలామంది అభిమానులు అనుకుంటారు.. కానీ అది అహ్మద్బాద్లో నాల్గో వన్డేలో జరిగింది. నాల్గో వన్డేలో ధోనితో అలా ప్రవర్తించిన తీరుపై నేను చాలా బాధపడ్డా. ఏదో ఆవేశంలో నోటికి పనిచెప్పా. అలా చేయడం నిజంగా తప్పే. అది నేను గర్వించదగిన విషయం ఎంత మాత్రం కాదు. ఇక విశాఖలో జరిగిన రెండో వన్డేలో ధోని తొలి సెంచరీ చేశాడు. ఆ సెంచరీ నాకు ఇప్పటికీ గుర్తే’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్యూలో నెహ్రా తెలిపాడు. 2005, ఏప్రిల్5 వ తేదీన అంటే 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ధోని తన తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్లో ధోని 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్లతో 148 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ 356 పరుగుల భారీ స్కోరును పాక్ ముందుంచింది. ఆ తర్వాత పాకిస్తాన్ 298 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. -
కోహ్లి కూడా రాణించలేదు కదా!
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ పర్యటనలో ఘోరంగా విఫలమైన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అండగా నిలిచాడు. న్యూజిలాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. వెన్నుకు జరిగిన శస్త్రచికిత్స తర్వాత ఈ ఏడాది జనవరిలో తిరిగి జట్టులోకి వచ్చిన బుమ్రా కివీస్పై అంత ప్రభావం చూపలేకపోయాడు. కివీస్తో వన్డే సిరీస్లో వికెట్ కూడా తీయకపోవడం చర్చకు దారి తీసింది. అయితే అతడి ప్రదర్శనపై నెహ్రా తాజాగా మాట్లాడుతూ.. బుమ్రా ఫామ్ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదన్నాడు. ప్రస్తుతం బుమ్రా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడన్నాడు. (ఇక్కడ చదవండి: సే‘యస్’ అయ్యర్) ప్రతీ సిరీస్లోనూ బుమ్రా రాణించాలని అనుకోవడం పొరపాటే అవుతుందన్నాడు. ఇక్కడ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఉదహరించాడు. కివీస్తో ఇప్పటివరకూ జరిగిన సిరీస్లో కోహ్లి కూడా పెద్దగా రాణించలేదనే విషయం గుర్తించుకోవాలన్నాడు. ప్రతీ సందర్భంలో టాప్ ఆటగాళ్లు రాణించాలనుకోవడం సరైనది కాదన్నాడు. మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ వంటి వారి స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, నవ్దీప్ సైనీ వంటి వారిని కూడా గుర్తించాలని నెహ్రా కోరాడు. ప్రధాన బౌలర్లపైనే ఎప్పుడూ ఆధారపడకుండా జట్టు యాజమాన్యం సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నాడు. బుమ్రాపైనే ఆధారపడడం వల్ల అతడిపై ఒత్తిడి పెరిగిపోతోందన్నాడు. కివీస్తో జరగనున్న టెస్టు సిరీస్కు నవ్దీప్ సైనీని తీసుకుంటే బాగుంటుందన్నాడు. ఉమేశ్ యాదవ్ కంటే అతడే బెటరని నెహ్రా అభిప్రాయపడ్డాడు.(ఇక్కడ చదవండి: అదే బుమ్రా వైఫల్యానికి కారణం: జహీర్) -
బుమ్రా గాయానికి శైలి కారణం కాదు
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్ శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని, అలా చేసినా అది పెద్దగా ఫలితం ఇవ్వదని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. బుమ్రా గాయానికి తీరిక లేని క్రికెట్ ఆడటం అసలే కారణం కాదని, గాయం (స్ట్రెస్ ఫ్రాక్చర్)కు, యా క్షన్కు సంబంధం లేదని పేర్కొన్నాడు. ఓ ఫాస్ట్ బౌలర్గా సాంకేతిక అంశాలపై పట్టున్న నెహ్రా... ‘ఈ విషయంలో మన ఆలోచన మారాలి. పునరాగమనం చేశాక బుమ్రా ఇదే శైలితో ఇంతే తీవ్రతతో బంతులేయగలడు. అతడిదేమీ అసాధారణ యాక్షన్ కాదు. బంతిని విసిరే సందర్భంలో తన శరీరం కచి్చతమైన దిశలో ఉంటుంది. ఎడమచేయి మరీ పైకి లేవదు. ఎడమ కాలును వంచుతూ జావెలిన్ త్రో తరహాలో బౌలింగ్ చేసే మలింగ కంటే బుమ్రా యాక్షన్ పది రెట్లు మెరుగైనది’ అని నెహ్రా విశ్లేíÙంచాడు. గాయంతో ఉన్న ఆటగాడికి కోలుకునే వ్యవధి నిర్దేశించడం వివేకం కాదని, మైదానంలో దిగేందుకు తన శరీరం వంద శాతం సంసిద్ధంగా ఉందా లేదా అనేది వారికే తెలుస్తుందని అన్నాడు. బుమ్రా తరహా ఇబ్బందులకు శస్త్రచికిత్సలు అవసరం లేదని, కేవలం విశ్రాంతి, పునరావస ప్రకియ సరిపోతుందని నెహ్రా వివరించాడు. -
ఆశిష్ నెహ్రా వల్లే ఓడిపోయింది..!
ముంబై: ఐపీఎల్లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం అంచున నిలిచి క్రమంగా ఓటమి ఒడిలోకి జారుకుంది. అయితే ఆర్సీబీ ఓటమికి కారణం ఆ జట్టు బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రానే కారణమంటూ అభిమానులు విరుచుకుపడుతున్నారు. గెలుపు ముంగిట నిలిచిన జట్టును నెహ్రా ఓటమి కోరల్లోకి నెట్టేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబైతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 171 పరుగులు చేసింది. 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. చివరి రెండు ఓవర్లలో విజయానికి 22 పరుగులు అవసరం. క్రీజులో హార్దిక్ పాండ్యా, పొలార్డ్ ఉన్నారు. దీంతో 19వ ఓవర్ను పేసర్ నవదీప్ సైనీతో వేయించాలని ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి భావించాడు. అయితే, బౌలింగ్ ఆశిష్ నెహ్రా మాత్రం పవన్ నేగీతో వేయించాలని డగౌట్ నుంచి సూచించాడు. నెహ్రా సూచన మేరకు పవన్ నేగీకి కోహ్లి బంతిని అందించాడు. స్ట్రైకింగ్లో ఉన్న పాండ్యా.. నేగి బౌలింగ్ను చీల్చి చెండాడు. విజయానికి అవసరమైన 22 పరుగులను ఆ ఓవర్లోనే సాధించి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది చూసిన బెంగళూరు అభిమానులు నెహ్రాపై మండిపడుతున్నారు. జట్టు ఓటమికి అతడే కారణమంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. పాండ్యా, పొలార్డ్ వంటి బ్యాట్స్మెన్ క్రీజులో ఉన్నప్పుడు నేగీలాంటి స్పిన్నర్లకు బౌలింగ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. 19వ ఓవర్ను నేగీకి ఇవ్వకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు. నెహ్రా తలచుకుంటే స్టేట్ టాపర్ను కూడా యూనిట్ టెస్టులో ఫెయిల్ చేస్తాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశిష్ నెహ్రా ఒక బౌలింగ్ కోచ్ అంటే నమ్మలేకపోతున్నామని మండిపడుతున్నారు. ఇక ఆశిష్ సేవలు చాలు.. అతన్ని తీసేయండి అంటూ ధ్వజమెత్తుతున్నారు. ఫీల్డ్లో కెప్టెన్ పాత్రలో ఉన్న కోహ్లి.. నెహ్రా చెప్పిన సలహాకు ప్రభావితం కావడం ఏ మాత్రం బాలేదని చురకలు అంటిస్తున్నారు. (ఇక్కడ చదవండి: బెంగళూరు కథ కంచికే! ) -
‘టీమిండియాకు అతనొక విలువైన ఆస్తి’
న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత భారత జట్టులో షమీ ఒక విలువైన ఆటగాడని నెహ్రా కొనియాడాడు. ప్రధానంగా వరల్డ్కప్కు వెళ్లే భారత జట్టులో షమీ కీలక పాత్ర పోషించనున్నాడన్నాడు. ‘ప్రపంచకప్ జట్టులో టీమిండియాకు మహమ్మద్ షమీ అత్యంత కీలకంగా మారనున్నాడు. భారత జట్టుకు దొరికిన ఆస్తి షమీ. ఈ మధ్య కాలంలో తన ప్రదర్శన ఎంతో అద్భుతంగా ఉంది. ఎప్పటికప్పుడు తన ఆటతీరులో షమీ మార్పులు చేసుకుంటున్నాడు. బౌలింగ్లో మెరుగవుతూనే ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అతడిని గమనిస్తున్నాను. అత్యుత్తమ బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు. మరొకవైపు అతని ఫిట్నెస్ లెవెల్స్ కూడా బాగున్నాయి. కాబట్టి వరల్డ్కప్లో షమీ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆ మెగా టోర్నీలో భారత్కు షమీ విలువైన ఆస్తి’ అని నెహ్రా పేర్కొన్నాడు. -
ఓపెనర్గా పంత్ను ఆడించాల్సిందే
ముంబై : టీమిండియా హార్డ్ హిట్టర్, యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ను ప్రపంచకప్లో ఆడించాల్సిందేనని దిగ్గజ క్రికెట్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే పంత్ను ఓపెనర్గా ఆడించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ సూచించిన విషయం తెలిసిందే. అయితే వార్న్ సలహా మంచిదేనని, ఈ దిశగా టీమిండియా ఆలోచించాలని గవాస్కర్ పేర్కొన్నాడు. రిషభ్ పంత్ ఓపెనర్గా ఆడించడం వల్ల వచ్చే నష్టం ఏం లేదని, అతను చెలరేగితో మిడిలార్డర్పై ఎలాంటి ఒత్తిడి ఉండదని ఓ జాతీయ ఛానెల్కు తెలిపాడు. ‘పంత్ ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్. ఎడమ-కుడి బ్యాట్స్మెన్ కాంబినేషన్ను ఎదుర్కొవడం బౌలర్లకు కష్టమైన పని. ఇలానే రోహిత్-ధావన్ కాంబినేషన్ విజయవంతమైంది. గతంలో సచిన్-గంగూలీ, సెహ్వాగ్-గంగూలీలు జోడిలు కూడా ఓపెనర్లుగా రాణించాయి. పంత్ కూడా ఓపెనర్గా రాణిస్తాడు. ఇది జట్టుకు కలిసొచ్చే అంశం’ అని గావస్కర్ చెప్పుకొచ్చాడు. గావస్కరే కాదు మరో భారత మాజీ క్రికెటర్ ఆశిశ్ నెహ్రా సైతం పంత్ను ప్రపంచకప్కు ఎంపిక చేయాలని ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘బ్యాటింగ్లో కుడి–ఎడమ కాంబినేషన్ ముఖ్యం. టీమిండియాలో చూస్తే ధావన్ తప్ప ఏడో స్థానం వరకు ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ లేరు. పంత్ మ్యాచ్ విన్నర్. రోహిత్శర్మలా అలవోకగా సిక్స్లు బాదుతాడు. బ్యాకప్ ఓపెనర్గానూ పనికొస్తాడు. 1 నుంచి 7వ స్థానం వరకు ఎక్కడైనా ఆడగలడు. కోహ్లి... అతడిని ఏవిధంగానైనా ఉపయోగించుకోవచ్చు.’ అని పేర్కొన్నాడు. ఇక షేన్ వార్న్ ధోని కోసం పంత్ను పక్కకు పెట్టాల్సిన అవసరం లేదని, వికెట్కీపర్గా కాకుండా బ్యాట్స్మన్గా పరిగణించి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియా సిరీస్లోనే పంత్ను ఓపెనర్గా పంపించి ప్రయోగం చేయాలన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధావన్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ జట్టు గెలుపు కోసం కొన్ని త్యాగాలు చేయలన్నాడు. -
పంత్నే తీసుకోవాలి...
న్యూఢిల్లీ: ప్రపంచ కప్లాంటి పెద్ద టోర్నీల్లో విశేష అర్హతలున్న ఆటగాళ్లు కీలకం అవుతారని... యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ సరిగ్గా అలాంటివాడేనని అంటున్నాడు మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా. అందుకని పంత్ను తప్పనిసరిగా ప్రపంచ కప్ జట్టులోకి ఎంపిక చేయాలని సూచిస్తున్నాడు. ‘సాధారణంగా జట్టుకు ఒక్కొక్కరు శక్తిమేర ఉపయోగ పడుతుంటారు. రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్ మంచి ఆటగాళ్లే. కాకపోతే ఒకే తీరుగా ఆడుతుంటారు. ప్రపంచ కప్నకు వచ్చేసరికి పంత్లాంటి ‘ఎక్స్ ఫ్యాక్టర్’ ఆటగాళ్లు కావాలి. బ్యాటింగ్లో కుడి–ఎడమ కాంబినేషన్ ముఖ్యం. టీమిండియాలో చూస్తే ధావన్ తప్ప ఏడో స్థానం వరకు ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ లేరు. పంత్ మ్యాచ్ విన్నర్. రోహిత్శర్మలా అలవోకగా సిక్స్లు బాదుతాడు. బ్యాకప్ ఓపెనర్గానూ పనికొస్తాడు. 1 నుంచి 7వ స్థానం వరకు ఎక్కడైనా ఆడగలడు. కోహ్లి... అతడిని ఏవిధంగానైనా ఉపయోగించుకోవచ్చు. రోహిత్, కోహ్లి, బుమ్రా తర్వాత జట్టులో నాలుగో ‘మ్యాచ్ విన్నర్’ పంత్’ అని నెహ్రా విశ్లేషించాడు. -
వెటోరీనే హెడ్ కోచ్.. మెంటర్గా కిర్స్టన్
బెంగళూరు: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా బెంగళూరు రాయల్స్ చాలెంజర్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా, సలహాదారు(మెంటర్)గా గ్యారీ కిర్స్టన్ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో హాబర్ట్ హరికేన్స్ జట్టుకు గ్యారీ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. గతంలో భారత జట్టుకు కోచ్గా వ్యహరించిన గ్యారీ.. మూడు ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సైతం కోచ్గా సేవలందించాడు. కాగా, ఈ సీజన్లో ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్గా, మెంటర్గా కిర్స్టన్ను ఎంపిక చేశారు. అయితే ఇక్కడ ఆర్సీబీ ప్రధాన కోచ్గా డానియల్ వెటోరీనే కొనసాగనున్నాడు. మరొకవైపు ఆర్సీబీ బౌలింగ్ కోచ్గా ఆశిష్ నెహ్రాను వ్యవహరించనున్నాడు. ఈనెల 27, 28వ తేదీన ఐపీఎల్ ఆటగాళ్ల కోసం బెంగళూరులో వేలం జరుగనుంది. ఆర్సీబీకి తిరిగి హెడ్ కోచ్గా ఎంపికైన వెటోరీ మాట్లాడుతూ.. గ్యారీ కిరస్టన్, ఆశిష్ నెహ్రాలతో కలిసి పని చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ ఇద్దరి అనుభవం జట్టుకు మరింతగా కలిసి వస్తుందని వెటోరీ పేర్కొన్నాడు. -
ఆశిష్ నెహ్రా కొత్త ఇన్నింగ్స్!
ఢిల్లీ: ఇటీవల తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా కొత్త ఇన్నింగ్స్ ను ఆరంభించడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్లో విరాట్ కోహ్లి నేతృత్వం వహించే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సలహాదారుగా(మెంటర్) వ్యవహరించనున్నట్టు సమాచారం. తన రిటైర్మెంట్ తర్వాత భారత్- శ్రీలంక సిరీస్లో నెహ్రా కామెంటరీ బాక్స్లో కనిపించాడు. తనకు అత్యంత సన్నిహితుడైన వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి వ్యాఖ్యానాన్ని పంచుకున్నాడు. అయితే తాజాగా రాయల్ చాలెంజర్స్కు మెంటర్గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్ల విశ్వసనీయం సమాచారం. బెంగళూరు మెంటర్గా నెహ్రా డీల్ కుదుర్చుకున్నట్టు ముంబై మిర్రర్ ఒక కథనాన్ని ప్రచురించింది. బెంగళూరు కోచ్గా బాధ్య తలు నిర్వహించిన దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలెన్ డొనాల్డ్ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో అతని స్థానంలో నెహ్రా వచ్చే అవకాశాలున్నట్లు పేర్కొంది. 1999లో మొహ్మద్ అజహరుద్దీన్ సారథ్యంలో భారత్ జట్టులో అరంగేట్రం చేసిన నెహ్రా.. ఇటీవల న్యూజిలాండ్తో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన టీ 20 తరువాత క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అతని కెరీర్లో 17 టెస్టులు మాత్రమే ఆడిన నెహ్రా 44 వికెట్లు తీశాడు. ఇక 120 వన్డేల్లో 157 వికెట్లు, 27 టీ 20ల్లో 34 వికెట్లు సాధించాడు. -
యో-యో టెస్ట్ నాకు ఈజీ.. కానీ యువరాజ్కే..
కోల్కతా: యో-యో టెస్ట్ నెగ్గడం పేస్ బౌలర్గా తనకు సులువైనదని, కానీ యువరాజ్ వంటి క్రికెటర్లకు ఇబ్బందిగా మారిందని టీమిండియా మాజీ బౌలర్ అశీష్ నెహ్రా అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి కామెంటేటర్గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ మాజీ బౌలర్ ఆటగాళ్ల ఫిట్నెస్ను పరీక్షించే యోయో టెస్ట్పై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న నెహ్రాకు మరో వ్యాఖ్యాత వీరేంద్ర సెహ్వాగ్ మధ్య యోయో టెస్ట్పై ఆసక్తికర సంభాషణ నడిచింది. తొలుత సెహ్వాగ్ అసలు తీవ్ర చర్చనీయాంశమైన యో-యో టెస్ట్ అంటే ఏమిటని నెహ్రాను ప్రశ్నించాడు. దీనికి నెహ్రా ‘యో-యో టెస్ట్ 2001-02 మధ్యలో నిర్వహించిన బ్లిప్ టెస్ట్ వంటిదే. ఈ పరీక్షల్లో ఆటగాళ్లు ఒక స్థానం నుంచి ప్రారంభమై మళ్లే అదే స్థానానికి చేరాలి. ఇలా మెత్తం 20 మీటర్ల పరిధి పరుగును నిర్ణిత సమయంలో పూర్తి చేయాలి. టీమిండియా ఈ టెస్టుకు అర్హత మార్క్గా 16.1 మీటర్లు పెట్టింది. త్వరలో 16.5 మీటర్లు చేసే యోచనలో బీసీసీఐ ఉంది. ఇక అత్యధికంగా న్యూజిలాండ్ 18.5 మీటర్ల మార్క్ను పరీక్షిస్తోంది. వేగంగా పరుగెత్తితేనే ఈ పరీక్షను నెగ్గుతాం. అని నెహ్రా పేర్కొన్నాడు. ఇక 38 ఏళ్ల వయసులో ఈ టెస్టు నెగ్గడంపై నెహ్రా స్పందిస్తూ.. పేస్ బౌలర్గా ఇది నాకు చాల సులభం. కానీ యువరాజ్ వంటి కొంత మంది క్రికెటర్లకు ఈ పరీక్ష నెగ్గడం చాలా కష్టంగా ఉంది. ఇక భారత ఆటగాళ్ల యో-యో స్కోర్లపై మాట్లాడుతూ.. అందరూ 16.1 అర్హత మార్క్ను దాటాల్సిందే. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్ సందర్భంగా నిర్వహించిన యో-యో టెస్ట్లో హార్దిక్ పాండ్యా స్కోరు 19, మనీష్ పాండే 19, తనది 18.5 స్కోర్ అని నెహ్రా తెలిపాడు. ఇక కెప్టెన్ కోహ్లి స్కోర్ గురించి సెహ్వాగ్ ప్రస్తావించగా అది తెలియదు. కోహ్లి స్కోరు చూడలేదని నెహ్రా పేర్కొన్నాడు. ఇక యువీ యో-యో టెస్ట్ నెగ్గితే టీమిండియా జట్టులో చోటు దక్కడం సులువని ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. -
‘నెగ్గాలంటే నాణ్యమైన పేసర్లు ఉండాలి’
కోల్కతా: వచ్చే ఏడాది విదేశీగడ్డపై జరిగే పర్యటనల్లో భారత్ విజయవంతం అవ్వాలంటే ఐదారుగురు మన్నికైన పేస్బౌలర్లు జట్టులో ఉండాలని ఇటీవల రిటైరయిన బౌలర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయ పడ్డాడు. టెస్టుల్లో ప్రస్తుతం ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఆడకపోయినా నాణ్యమైన పేసర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారని టీమ్ రిజర్వ్బెంచ్పై ప్రశంసలు కురిపించాడు. ఇతర ఫార్మాట్లలోనూ ఇది కొనసాగాలని అభిప్రాయపడ్డాడు. భారత్–శ్రీలంక తొలిటెస్టు సందర్భంగా కామెంటేటర్గా వ్యవహరిస్తున్న నెహ్రా ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. వచ్చే జనవరిలో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లను దక్షిణాఫ్రికా గడ్డపై ఆజట్టుతో టీమిండియా ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో విరాట్ కోహ్లిసేన పర్యటించనుంది. మరోవైపు తొలిటెస్టు వేదికైన ఈడెన్పై నెహ్రా మాట్లాడుతూ.. వికెట్ చాలా బాగుందని, వర్షం కారణంగానే మైదానంలో తేమ నెలకొందని పేర్కొన్నాడు. ఈ వికెట్లో స్వింగ్, బౌన్స్, సీమ్ ఉన్నాయని తెలిపాడు. వర్షం కారణంగానే బంతి అనూహ్యంగా స్పందిస్తుందని అభిప్రాయపడ్డాడు. కోహ్లి ఔటైన తీరే దీనికి నిదర్శమని, దీనిపై బ్యాట్స్మెన్ ఏమీ చేయలేరని పేర్కొన్నాడు. ఇది బౌలర్లకు కూడా ఇబ్బందికరమేనని తెలిపాడు. మరోవైపు ఈమ్యాచ్లో టాస్ నెగ్గి ఉంటే భారత్ ఫీల్డింగ్ను ఎంచుకుని ఉండేదని, అప్పుడు లంక జట్టు 50–60 పరుగుల మధ్య ఆలౌటై ఉండేదని వ్యాఖ్యానించాడు. 200–220 పరుగులు ఇక్కడ చాలా మంచి స్కోరని అభిప్రాయపడ్డాడు. ఈడెన్లో మాదిరే దక్షిణాఫ్రికాలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉంటాయని, ఆ పర్యటనకు ముందు ఇలాంటి వికెట్పై ఆడడం భారత్కు ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డాడు. సఫారీగడ్డపై ఆడనుండడంతో భారతేమీ ఒత్తిడికి గురికాబోదని, ఆజట్టులో డేల్ స్టెయిన్, కగిసో రబడలాంటి పేసర్లుంటే మన జట్టులో కోహ్లి లాంటి అత్యుత్తమ బ్యాట్స్మన్ ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. -
ధోని ఫామ్ పై నెహ్రా స్పందన
న్యూఢిల్లీ:న్యూజిలాండ్ తో రెండో టీ 20లో నెమ్మదైన ఆట తీరుతో విమర్శల పాలైన ఎంఎస్ ధోనికి మాజీ భారత ఆటగాడు ఆశిష్ నెహ్రా అండగా నిలిచాడు. ధోని తాజా ఫామ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం సరికాదన్నాడు. తన మునపటి ఫామ్ ను ధోని త్వరలోనే అందుకుంటాడని ఇటీవల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న నెహ్రా వ్యాఖ్యానించాడు. '2020 వరల్డ్ టీ 20 వరకూ ధోని జట్టులో కొనసాగుతాడనేది నా నమ్మకం. ఏదొక మ్యాచ్ లో అతను ఆడనంత మాత్రనా విమర్శలు చేయడం సరికాదు. ఇంకా రెండు-మూడేళ్లు ఆడే సత్తా ధోనిలో ఉంది. ధోనిపై విమర్శలు కట్టిపెట్టి అతని ఆటను ఆడనివ్వండి. భారత క్రికెట్ జట్టులో అత్యంత నిజాయితీ గల క్రికెటర్లలో ధోని ఒకడు. అతను తప్పకుండా గాడిలో పడతాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకూ కాదు.. వచ్చే వరల్డ్ టీ 20 వరకూ ధోనిని జట్టులో చూస్తానని నమ్మకం ఉంది. ఒక ఫాస్ట్ బౌలర్ గా నేను 39 ఏళ్ల వయసు వరకూ క్రికెట్ ఆడినప్పుడు.. బ్యాట్స్ మన్ గా ధోని ఫిట్ నెస్ బట్టి చూస్తే ఇంకా మూడేళ్ల పాటు ఆడతాడు. టీమిండియా కెప్టెన్సీ పదవిని ధోని సరైన సమయంలోనే కోహ్లికి అప్పజెప్పాడు. మరి అటువంటప్పుడు అతను ఎప్పుడు క్రికెట్ నుంచి తప్పుకోవాలో తెలీదా. ధోనిపై విమర్శలు చేయడం ఆపితే అతను సహజసిద్ధమైన ఆటతో సత్తాచాటతాడు' అని నెహ్రా బదులిచ్చాడు. ధోనినే విమర్శిస్తారా.. కెప్టెన్ కోహ్లీ ఆగ్రహం! 'ఎంఎస్ ధోని తప్పుకోవాలి' -
ఆ బౌలర్ చెలరేగితే బ్యాట్స్మెన్లకు కష్టమే: నెహ్రా
న్యూఢిల్లీ : ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20తో రిటైరైన భారత క్రికెటర్ ఆశిష్ నెహ్రా ఓ ఆస్ట్రేలియా బౌలర్కు తన మద్ధతు తెలిపాడు. 2013–14 సీజన్లో మిచెల్ జాన్సన్ (37 వికెట్లు) సహా ఆసీస్ పేసర్లు చెలరేగడంతో ఇంగ్లండ్పై కంగూరులు తమ సొంతగడ్డపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే తీరుగా ప్రస్తుత యాషెస్ సిరీస్లో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చెలరేగితే విజయం కంగూరులదేనని భారత మాజీ క్రికెటర్ నెహ్రా అంటున్నాడు. స్వదేశంలో సిరీస్ జరగనుండటం ఆసీస్ పేసర్లకు మరింత కలిసొచ్చే అంశమన్నాడు. స్టార్క్ చెలరేగితే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవని, ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లపై కచ్చితంగా భారం పడనుందని అభిప్రాయపడ్డాడు ఒకవేళ స్టార్క్ ఆ సిరీస్లో ఐదు టెస్టులు ఆడగలిగితే.. కనీసం 30 వికెట్లు తీసి సత్తా చాటుతాడని నెహ్రా ధీమా వ్యక్తం చేశాడు. గాయాలతో సతమతవుతున్న స్టార్క్ జట్టులోకి రావడం ఆసీస్కు కలిసొచ్చే అంశంకాగా, వివాదాలతో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ దూరం కావడం ఇంగ్లండ్పై ప్రతికూల ప్రభావం చూపుతుందనడంలో సందేహం అక్కర్లేదు. ఈ నెల 23వ తేదీ నుంచి ఆరంభం కానున్న యాషెస్ సిరీస్ లో మిచెల్ స్టార్క్ తో కలిసి హజల్ వుడ్ ఆసీస్ ఓపెనింగ్ బౌలింగ్ ను పంచుకునే అవకాశం ఉంది. వీరికి జతగా మరో పేసర్ ప్యాట్ కమిన్స్ కూడా అందుబాటులో ఉన్నాడు. -
ఆ ఘనత విరాట్ కోహ్లిదే: నెహ్రా
న్యూఢిల్లీ:దాదాపు 14 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లికి ఆశిష్ నెహ్రా బహుమతి అందజేస్తున్న ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. న్యూజిలాండ్ తో తొలి టీ 20 అనంతరం ఆశిష్ నెహ్రా తన అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు చెప్పిన క్రమంలో ఆ ఫొటోకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్ గా ఉండటమే అందుకు ప్రధాన కారణం. అయితే దీనిపై నెహ్రా స్పందిస్తూ.. ' సోషల్ మీడియాకి నేను చాలా దూరం. ఆనాటి విరాట్ తో దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ గా మారిందని తెలుసుకున్నా. విరాట్ గొప్పస్థాయికి చేరుకున్నాడు కాబట్టే ఆ ఫొటోకు అంత విలువ. అందుకే దాని గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఒకవేళ విరాట్ ఈ స్థాయికి చేరకపోయి ఉంటే.. అది సాధారణ ఫొటో మాదిరిగా ఏ గోడకో పరిమితమయ్యేది. దాన్ని పట్టించుకునేవారే ఉండేవారు కాదు. నేను వీడ్కోలు చెప్పిన తరుణంలో ఆ ఫొటో బయటకు రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఆ ఫొటో ఘనత విరాట్ కోహ్లికే దక్కాలి'అని నెహ్రా పేర్కొన్నాడు. 2003లో భారత జట్టు వరల్డ్ కప్ ఆడుతున్న సమయంలో కోహ్లికి నెహ్రా ఒక బహుమతిని అందజేశాడు. అప్పుడు స్కూల్ స్థాయి క్రికెట్ ఆడుతున్న కోహ్లి.. ఇప్పుడు క్రికెట్ ను శాసించే స్థాయికి చేరుకోవడంతో ఆ ఫొటో వైరల్ గా మారింది. -
నెహ్రా: రిటైర్మెంట్ తర్వాత నెక్స్ట్ ఏంటీ?
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా.. రిటైర్మెంట్ తర్వాత ఏం చేయబోతున్నారు? నిజానికి రిటైర్మెంట్ గురించి నిశితంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న నెహ్రా.. తర్వాత ఏం చేయాలన్నది మాత్రం నిర్ణయించలేదు. అయితే, భవిష్యత్తులో కోచ్ లేదా కామెంటేటర్గా కొనసాగాలని రెండు ఆప్షన్లు పెట్టుకున్నారు. కొంతకాలం విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. నిజానికి నెహ్రా జీవితమంతా క్రికెట్ తప్ప మరో వ్యాపకం లేకుండా సాగిపోయింది. గాయాల కారణంగా ఎన్నిసార్లు జట్టులో చోటు కోల్పోయినా.. మరింత అకుంఠిత దీక్షతో శ్రమించి.. తిరిగి జట్టులోకి వచ్చాడు. యువకులతో పోటీ పడి మరీ బౌలింగ్ చేసిన ఈ క్రికెటర్ బుధవారం న్యూజిలాండ్తో జరిగిన టీ-20 మ్యాచ్తో తన కెరీర్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. భవిష్యత్ కార్యాచరణ గురించి నెహ్రాను ప్రశ్నించగా.. ’తర్వాత ఏం చేయాలనేది నేనింకా నిర్ణయించుకోలేదు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోచింగ్ లేదా కామెంటేటరీలోకి వెళ్లొచ్చు’ అని చెప్పాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో చివరి ఓవర్ వేయాల్సింది కోహ్లి తనకు బంతి ఇచ్చినప్పుడు తనను ఎన్నో భావోద్వేగాలు ముంచెత్తాయని నెహ్రా చెప్పాడు. ’అది నిజంగా భావోద్వేగభరితమైన సందర్భం. 15-16వ ఓవర్ తర్వాత చివరి ఓవర్ వేయాల్సిందిగా కోహ్లి నాకు బాల్ ఇచ్చాడు. ఒక క్రికెటర్గా ఈ మాట చెప్పకూడదు కానీ, అప్పటికే గేమ్ ముగిసిపోయింది’ అని నెహ్రా అన్నాడు. ఈ మ్యాచ్లో కివీస్పై 53 పరుగుల తేడాతో టీమిండియా సునాయసంగా గెలుపొందిన సంగతి తెలిసిందే. -
నేను సెలక్టర్లకు చెప్పి క్రికెట్ ఆడలేదు కదా..!
న్యూఢిల్లీ:మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో సొంతమైదానం ఫిరోజ్ షా కోట్లలో జరిగిన మొదటి మ్యాచ్ ద్వారా తన అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ తన నిర్ణయాన్ని ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20సిరీస్ లోనే ప్రకటించిన నెహ్రా.. అన్నట్లుగానే కివీస్ తో బుధవారం జరిగిన మ్యాచ్ ద్వారా కెరీర్ కు ముగింపు పలికాడు. అయితే, న్యూజిలాండ్ తో టీ 20 సిరీస్ కు సెలక్టర్ల నిర్ణయాన్ని ముందుగానే తీసుకుని వీడ్కోలు పలికారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు నెహ్రా ఘాటుగా స్పందించాడు. ఈ మేరకు న్యూజిలాండ్ తో సిరీస్ కు నెహ్రాను పరిగణలోకి తీసుకోవడం లేదంటూ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలపై కూడా నెహ్రా అసహనం వ్యక్తం చేశాడు. 'నేను సెలక్టర్ల అనుమతితో క్రికెట్ ఆడటం ప్రారంభించలేదు. అటువంటప్పుడు సెలక్టర్ల అనుమతితో వీడ్కోలు ఎందుకు చెబుతాను. మరి ఎంఎస్కే ప్రసాద్ అలా వ్యాఖ్యానించినట్లు నాకు తెలియదు. ఆ విషయాన్ని నాకైతే ఎంఎస్కే చెప్పలేదు. మీరు మాత్రమే నన్ను ఆ ప్రశ్న అడుగుతున్నారు. నా వీడ్కోలుపై నేను కేవలం జట్టు మేనేజ్ మెంట్ తో మాత్రమే చర్చించాను. ఇటీవల ముగిసిన ఆసీస్ తో సిరీస్ లో భాగంగా నేను రాంచీకి వచ్చినప్పుడు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి నా ప్లాన్ ను చెప్పా. మొత్తం క్రికెట్ కు వీడ్కోలు చెబుదామని అనుకుంటున్నట్లు స్పష్టం చేశా. కోహ్లి ఆశ్చర్యపోయాడు. ఐపీఎల్లో ఆడే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు క్రికెట్ నుంచి మొత్తంగా గుడ్ బై చెప్పడమని అడిగాడు. ఆ క్రమంలోనే ఐపీఎల్లో ఆటగాడిగా కోచ్ గా ఉంటూ కెరీర్ ను కొనసాగించవచ్చు కదా అన్నాడు. నేను మొత్తంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు విరాట్ కు తెలిపా. ఇది మాత్రమే జరిగింది. నా వీడ్కోలు గురించి ఎన్నిసార్లు అడిగినా ఇదే చెబుతా. అది కివీస్ తో సిరీస్ కు ఢిల్లీ మ్యాచ్ ద్వారా కుదిరింది. అంతేకానీ నాకు వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయమని ఎవర్నీ అడగలేదు. నేను సెలక్టర్ల అనుమతితో ఫేర్ వెల్ మ్యాచ్ ను ఏర్పాటు చేయించుకోలేదు. నేను తీసుకునే నిర్ణయంలో విరాట్, కోచ్ రవిశాస్త్రి, జట్టు మేనేజ్ మెంట్ పాత్ర మాత్రమే ఉంది. సెలక్టర్ల పాత్ర ఇక్కడ ఎంతమాత్రం లేదు' అని నెహ్రా పేర్కొన్నాడు. -
హీరోలా రిటైరయ్యాడు
-
గుడ్బై నెహ్రాజీ...
సాక్షి క్రీడావిభాగం :కొన్నాళ్ల క్రితం వరకు కూడా ఆశిష్ నెహ్రా అంటే కీలక సమయంలో పరుగులు ఇచ్చి భారత్కు విజయాన్ని దూరం చేయడం, తనకే సాధ్యమైన చెత్త ఫీల్డింగ్, వీటిపై ఇంటర్నెట్లో లెక్కలేనన్ని జోకులు... కానీ బుధవారం అతను సొంత మైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడి హీరోలా రిటైరయ్యాడు. తనపై గౌరవంగా ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్రికెట్ సంఘం ఏర్పాటు చేసిన ‘ఆశిష్ నెహ్రా ఎండ్’ నుంచి బౌలింగ్ చేసే అదృష్టం దక్కించుకున్నాడు. గ్రౌండ్లో దూసుకొచ్చి నెహ్రా కాళ్లు మొక్కే అభిమాని కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయే ఘటన కూడా ఈ మ్యాచ్లో మనకు కనిపించింది! దిగ్గజాలు సెహ్వాగ్కు, వీవీఎస్ లక్ష్మణ్కు, జహీర్ ఖాన్లకు కూడా సాధ్యం కాని ‘వీడ్కోలు మ్యాచ్’ నెహ్రాకు లభించింది. ఇన్నేళ్ల కెరీర్లో అతను అంతర్జాతీయ క్రికెట్లో పడగొట్టిన 235 వికెట్లే కాదు... మంచివాడుగా ఎందరినుంచో పొందిన అభిమానం కూడా అందుకు కారణం అంటే అతిశయోక్తి లేదు. ఎప్పుడో కొత్త మిలీనియంకు ముందు నెహ్రా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రికెట్ ఎంతో మారింది. నెహ్రా స్వయంగా అజహర్తో మొదలు పెట్టి ఇంజమాముల్ హక్ (ఆసియా ఎలెవన్) నుంచి కోహ్లి వరకు ఏడుగురు కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడాడు. వేర్వేరు జట్లలో సభ్యుడిగా, తరాల అంతరాలకు వారధిగా నెహ్రా కొనసాగాడు. సుదీర్ఘ కెరీర్లో గాయాల పుస్తకంలో అన్ని పేజీలు చదివేసిన నెహ్రా ఇంత కాలం కొనసాగడం అతని పట్టుదలకు, ఆత్మ స్థైర్యానికి నిదర్శనం. ఎప్పుడూ ఇక నా పనైపోయిందనే ఆలోచన రాకుండా అతను సాగించిన ప్రయాణమే నెహ్రాను అనేక మంది కంటే భిన్నంగా, గొప్పగా నిలబెట్టింది. మధ్యలో సుదీర్ఘ విరామాలు రావడాన్ని పక్కన పెట్టి, ఓవరాల్గా తొలి మ్యాచ్కు, చివరి మ్యాచ్కు మధ్య కెరీర్ను చూస్తే 18 ఏళ్ల 250 రోజుల కెరీర్తో సుదీర్ఘకాలం ఆడిన భారత ఆటగాళ్లలో నెహ్రా నాలుగో స్థానంలో నిలుస్తాడు. నెహ్రా అరంగేట్రానికి కేవలం ఇద్దరు భారత లెఫ్టార్మ్ పేసర్లు మాత్రమే ఐదుకు మించి టెస్టు వికెట్లు పడగొట్టారు. అలాంటి సమయంలో నెహ్రా భిన్నమైన రనప్, యాక్షన్ కలగలిసిన తనదైన ప్రత్యేక శైలితో దూసుకొచ్చాడు. నెహ్రా అనగానే అందరికీ 2003 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో 6/23 ప్రదర్శన మాత్రమే గుర్తుకొస్తుంది. అది మాత్రమే కాకుండా పాకిస్తాన్పై కరాచీ వన్డేలో, ఆ తర్వాత పాక్పైనే 2011 ప్రపంచ కప్ సెమీస్, గత ఏడాది టి20 ప్రపంచ కప్లో కుర్రాళ్లతో పోటీ పడి అతను చూపించిన ఆట కూడా నెహ్రా విలువేంటో చెబుతాయి. 36 ఏళ్ల వయసులో వృద్ధ సింహంలా టి20 క్రికెట్లోకి రావడం, 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం సాధారణ విషయం కాదు. ఐదేళ్ల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాక ‘ఇంత కాలం నా మొహం ఎవరికీ నచ్చలేదేమో’ అంటూ తనపైన జోకులు వేసుకోవడం...‘ఇప్పటికీ పాత నోకియా ఫోన్ను వాడుతున్న నన్ను సోషల్ మీడియా గురించి అడిగితే ఏం చెబుతాను’ అంటూ సరదాగా వ్యాఖ్యానించినా అది నెహ్రాకే చెల్లింది. కెమెరా కళ్లకు నెహ్రా పెద్ద స్టార్ కాకపోవచ్చు, అతని గణాంకాలు మరీ గొప్పగా లేకపోవచ్చు గానీ... ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాడగలిగిన, ఈతరం ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చే క్రికెటర్గా మాత్రం నెహ్రా ఎప్పటికీ గుర్తుండిపోతాడు. -
నెహ్రాజీ.. నీఫీల్డింగ్కు ఫిదాజీ..
సాక్షి, న్యూఢిల్లీ: భారత సీనియర్ పేస్ బౌలర్ అశీష్ నెహ్రా కెరీర్ను లేటుగా ముగించిన లెటేస్ట్గా ముగించాడు. న్యూజిలాండ్తో సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో చివరి మ్యాచ్ ఆడిన నెహ్రా తన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. బౌలింగ్లో 4 ఓవర్లు వేసిన నెహ్రా కేవలం 29 పరుగులే ఇచ్చాడు. అయితే భారత ఫీల్డర్ల తప్పిదం వల్ల నెహ్రాకు చివరి మ్యాచ్లో వికెట్ దక్కలేదు. మున్రో ఇచ్చిన సునాయసమైన క్యాచ్ను పాండ్యా విడిచిపెట్టడంతో నెహ్రాకు వికెట్ దక్కే అవకాశం చేజారింది. విలియమ్సన్ ఇచ్చిన మరో కష్టమైన క్యాచ్ను కూడా కోహ్లి జార విడిచాడు. అయితే వికెట్ పడకున్నా తన మైమరిపించే మార్క్ ఫీల్డింగ్తో ఔరా అనిపించాడు ఈ 38 ఏళ్ల క్రికెటర్. చహల్ వేసిన ఓ ఓవర్లో బ్యాట్స్మెన్ బ్యాక్ సైడ్కు ఆడగా.. లెగ్సైడ్లో ఫీల్డింగ్ చేస్తున్న నెహ్రా బంతిని తన లెగ్ టెక్నిక్తో అందుకున్నాడు. దీంతో కెప్టెన్ కోహ్లి వావ్ నెహ్రాజీ అంటూ నవ్వుతూ.. చప్పట్లు కొట్టగా.. బౌలర్ చహల్ చేతులు పైకెత్తి సలాం..జీ అన్నట్లు చప్పట్లు కొట్టాడు. అయితే ఈ వీడియోను బీసీసీఐ ‘మన నెహ్రాజీ ఫూట్ టెక్నిక్ ఎలా ఉంది’ అనే క్యాఫ్షన్తో ట్వీట్ చేసింది. ఈ వీడియోకు భారత అభిమానులు ముగ్ధులయ్యారు. నెహ్రాజీ.. యూ ఆర్ గ్రేట్జీ అంటూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు. How's that for footy skills from our very own Nehraji? What do you make of that @YUVSTRONG12 ;) #INDvNZ pic.twitter.com/YaTeJk5d0t — BCCI (@BCCI) November 1, 2017 -
శ్రేయస్ అయ్యర్ అరంగేట్రం.. నెహ్రాకు సన్మానం
సాక్షి, న్యూఢిల్లీ : తొలి టీ20 మ్యాచ్ లో శ్రేయర్ అయ్యర్ పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. తుది జట్టులోకి కొత్త ఆటగాడు శ్రేయర్ అయ్యర్ చేరడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. టీమిండియ కోచ్ రవిశాస్త్రి చేతుల మీదుగా జట్టు క్యాప్ ను అందుకుంటూ కొత్త కుర్రాడు అయ్యర్ ఉద్వేగానికి లోనయ్యాడు. మరోవైపు దినేష్ కార్తీక్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో నెహ్రాకు చివరి మ్యాచే శ్రేయర్ అయ్యర్ కు అరంగేట్ర మ్యాచ్ కావడం గమనార్హం. తన కెరీర్ లో చివరి ట్వంటీ20 మ్యాచ్ ఆడుతున్న భారత వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రాకు జట్టు సభ్యులు అభినందనలు తెలిపారు. ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న తొలి టీ20తో కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు నెహ్రా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేటి మ్యాచ్ టాస్ కు ముందు టీమిండియా ఆటగాళ్లు నెహ్రాకు జ్ఞాపికను అందజేశారు. జట్టు సభ్యులు చప్పట్లు కొడుతుండగా.. మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ, కెప్టెన్ విరాట్ కోహ్లీలు నెహ్రాను జ్ఞాపిక ప్రదానం చేసి సత్కరించారు. భారత వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రా 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు నేటి మ్యాచ్తో శుభం కార్డు పడనుంది. 1999లో నెహ్రా భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. సొంతగడ్డపై అతనికి విన్నింగ్ ఫేర్వెల్ ఇచ్చేందుకు ఢిల్లీ సహచరుడు భారత కెప్టెన్ కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు. -
ఆఖరి ఆటకు నెహ్రా
భారత వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రా 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు నేటి మ్యాచ్తో శుభం కార్డు పడనుంది. 1999లో నెహ్రా భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. సొంతగడ్డపై అతనికి విన్నింగ్ ఫేర్వెల్ ఇచ్చేందుకు ఢిల్లీ సహచరుడు భారత కెప్టెన్ కోహ్లి తన సేనతో సిద్ధమయ్యాడు. సెహ్వాగ్ ద్వారం... భారత్, న్యూజిలాండ్ల మధ్య ఇక్కడ జరిగే తొలి టి20 మ్యాచ్కు సెహ్వాగ్ ద్వారం స్వాగతం పలకనుంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోని రెండో గేట్కు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరూ పేరు పెట్టారు. దీనిపై అతను స్పందిస్తూ ‘దీన్ని నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నా. యువ క్రికెటర్లకు ప్రేరణ ఇచ్చేలా ఢిల్లీ సంఘం (డీడీసీఏ) తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు. గేట్పై ఉన్న పేరును చూస్తే కుర్రాళ్లు స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నా’ అని అన్నారు. -
అశిష్ నెహ్రాకు గ్యారంటీ ఇవ్వలేం!
ముంబయి: సొంత మైదానం న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లాలో జరిగే తొలి ట్వంటీ20 తనకు ఆఖరి మ్యాచ్ అని టీమిండియా క్రికెటర్ ఆశిష్ నెహ్రా స్పష్టం చేసినా.. ఆ మ్యాచ్లో అతడికి చోటుంటుందో లేదో చెప్పలేనని చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. న్యూజిలాండ్తో ట్వంటీ20 సిరీస్కు ఎమ్మెస్కే నేతృత్వంలోని సెలక్టర్ల బృందం 16 మంది ఆటగాళ్లను సోమవారం ఎంపిక చేసింది. ఆటగాళ్ల ఎంపిక అనంతరం ఎమ్మెస్కే జాతీయ మీడియాతో మాడ్లాడుతూ.. రిటైర్మెంట్ పై సీనియర్ పేసర్ నెహ్రా నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమే. సరైన సమయంలో నెహ్రా తగిన నిర్ణయం తీసుకున్నాడు. యువతరం కోసం సీనియర్లు సొంతంగా ఓ అభిప్రాయానికి వస్తే మంచిది. అయితే న్యూఢిల్లీలో న్యూజిలాండ్, భారత్ తలపడే తొలి టీ20కి తుదిజట్టులో నెహ్రా ఆడతాడా లేదా అన్నది చెప్పలేం. తుది జట్టులో నెహ్రాకి ఛాన్స్ దక్కుతుంతా లేదా అన్నది కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిల చేతుల్లో ఉంటుంది. నెహ్రా, టీమ్ మేనేజ్మెంట్తో ఇదివరకే చర్చించాం. న్యూజిలాండ్ సిరీసే అతడికి ఆఖరి సిరీస్ అవుతుంది. కివీస్తో సిరీస్కు ఓ లెఫ్టార్మ్ పేసర్ అవసరమని భావిస్తున్నాం. కానీ గత సిరీస్లలో ఆడి రాణించిన బౌలర్లకే చోటు దక్కవచ్చునంటూ' అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్తో టీ 20 సిరీస్ కు భారత జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, అశిష్ నెహ్రా, సిరాజ్ -
అంతకన్నా గొప్పేముంటుంది!
'ప్రజలు ఎందుకు రిటైరవుతున్నావని అడుగుతున్నప్పుడే తప్పుకోవడం మంచిది.. లేదంటే ఇంకా రిటైర్ కావడం లేదేంటి అంటారు'.. ఇది టీమిండియా వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయం.. గాయాలతో సతమతమవుతున్న నెహ్రా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చేనెల ఢిల్లీలోని సొంత గ్రౌండ్లో న్యూజిల్యాండ్తో జరిగే టీ-20 మ్యాచ్తో తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతానని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన నెహ్రా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అంతకన్నా గొప్పేముంటుంది.. 'టీమిండియా మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ చైర్మన్తో నేను మాట్లాడాను. ఢిల్లీలో న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతోంది. 20 ఏళ్ల కిందట తొలి రంజీ మ్యాచ్ ఆడిన సొంత మైదానంలో సొంత ప్రేక్షకుల నడుమ రిటైర్ కావడం కంటే గొప్పేముంటుంది' అని నెహ్రా అన్నాడు. ఆస్ట్రేలియాలో టీ-20 సిరీస్ కోసం నెహ్రా తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ.. తొలి రెండు మ్యాచ్ల్లో అతని తుదిజట్టులో చోటు లభించలేదు. ప్రస్తుతం టీమిండియా యువతరం ఆటగాళ్లతో దృఢంగా ఉందని నెహ్రా చెప్పాడు. 'సిరీస్ కోసం నన్ను జట్టులోకి తీసుకున్నప్పుడు.. అన్నీ మ్యాచ్లు ఆడాలని సన్నద్ధమయ్యాను. కెప్టెన్ (విరాట్ కోహ్లి), కోచ్ (రవిశాస్త్రి)కి నేరుగా ఈ విషయాన్ని చెప్పాను. అవకాశం ఉంటే తుదిజట్టులోకి తీసుకుంటారని భావించాను. గత రెండేళ్లలో భారత్ టీ-20 మ్యాచ్లన్నింటిలోనూ నేను ఆడాను' అని నెహ్రా వివరించాడు. తుది జట్టులో చోటు లభించకపోవడంతో రాత్రికి రాత్రే రిటైర్ అవ్వాలని నిర్ణయం తీసుకోలేదని, యంగ్ పేస్ బౌలర్లు దీటుగా రాణిస్తుండటంతోనే వారికి అవకాశం కల్పించాలని తాను ఈ నిర్ధారణకు వచ్చానని నెహ్రా తెలిపాడు. 'భువనేశ్వర్ బౌలింగ్ బాధ్యతలను మోసేందుకు సిద్ధంగా ఉన్నాడు. గతంలో నేను, బుమ్రా బౌలింగ్ చేసేవాళ్లం. ఇప్పుడు భువీ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక, వచ్చే ఐదారు నెలలు పెద్దగా మ్యాచ్లు, ఈవెంట్లు లేవు. అందుకే నా అభిప్రాయాన్ని మేనేజ్మెంట్కు చెప్పాను. నా నిర్ణయాన్ని అందరూ గౌరవించారు' అని నెహ్రా వివరించాడు. -
నెహ్రాపై రైనా కామెంట్
న్యూఢిల్లీ: వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా చాలా మంచివాడని టీమిండియా ఆల్రౌండర్ సురేశ్ రైనా అన్నాడు. నెహ్రా క్రికెట్కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమవడంతో అతడితో తనకున్న అనుబంధాన్ని రైనా గుర్తు చేసుకున్నాడు. ‘అతడు చాలా మంచి మనిషి. తన ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి నిరంతరం శ్రమిస్తాడు. చాలాసార్లు అతడిని కలిశాను. అతడితో కలిసి ఎన్నో మ్యాచ్లు ఆడాను. ఎల్లప్పుడు మంచి సలహాలు ఇచ్చే వారిలో అతడొకరు. 38 ఏళ్ల వయసులోనూ ఎంతో బలంగా ఉన్నాడు. అతడు ఆడే చివరి మ్యాచ్లో రాణించి, దేశానికి విజయాన్ని అందిస్తాడని ఆశిస్తుస్తున్నా’ అని సురేశ్ రైనా పేర్కొన్నాడు. నవంబర్ 1న సొంత మైదానం ఢిల్లీలో న్యూజిలాండ్తో జరిగే టి20 మ్యాచ్తో నెహ్రా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాడు. గువాహటిలో ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై రాళ్లు రువ్విన ఘటనపైనా సురేశ్ రైనా స్పందించాడు. ‘ఇది బాధాకర ఘటన. ఏం జరిగిందనేది బీసీసీఐ విచారిస్తుంది. ఆస్ట్రేలియా క్రికెటర్లతో కలిసి ఐపీఎల్లో ఆడాం. ఎవరికీ గాయాలు కాలేదు కాబట్టి ఫర్వాలేదు. బీసీసీఐ, అవినీతి వ్యతిరేక విభాగం, పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల’ని రైనా అన్నాడు. -
తుది జట్టులో లేకపోవడం వల్లే...
సాక్షి, హైదరాబాద్: కెరీర్లో పలు మార్లు గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో బాధ పడిన లెఫ్టార్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా జట్టులోకి ఎన్నో సార్లు వచ్చి పోయాడు. కానీ ఏకంగా ఐదేళ్ళ విరామం తర్వాత 2016 జనవరిలో టి20 జట్టులోకి అతని పునరాగమనం ఆశ్చర్యం కలిగించింది. గత రెండేళ్ల కాలంలో అతనికి తుది జట్టులో చోటు లభించని మ్యాచ్ లేదు. ఇప్పుడు ఆసీస్తో తొలి రెండు మ్యాచ్లలో అతను ఆడలేదు. ఇప్పుడు ఇదే కారణంతో అతను రిటైర్మెంట్కు సిద్ధమయ్యాడు. నవంబర్ 1న సొంత మైదానం ఢిల్లీలో న్యూజిలాండ్తో జరిగే టి20 మ్యాచ్తో నెహ్రా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాడు. 1999లో అరంగేట్రం చేసిన నెహ్రా కెరీర్ 18 ఏళ్లు సాగడం విశేషం. ఈ నేపథ్యంలో గురువారం ఉప్పల్ స్టేడియంలో పలు అంశాలపై మీడియాతో నెహ్రా వెలిబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే... ►ఈ సిరీస్కు ఎంపికయ్యాక బౌలింగ్ చేసేందుకు నేను పూర్తి సన్నద్ధతతో వచ్చాను. నా ఆలోచనలు కెప్టెన్, కోచ్తో పంచుకున్నాను. ఎందుకంటే నెహ్రా జట్టుతో ఉన్నాడంటే తుది జట్టులో కచ్చితంగా ఉంటాడు. గత రెండేళ్లలో నేను బయట కూర్చోవడం ఎప్పుడైనా చూశారా? ►అయితే ఏదో ఒక దశలో రిటైర్ కావాల్సి ఉంటుందని తెలుసు. ఇది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. ఎవరైనా ఇంకా ఎందుకు ఆడటం లేదు అంటే బాగుంటుంది కానీ ఇంకా ఆడుతున్నాడా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే ఏం కష్టపడినా భారత జట్టుకు ఆడటం కోసమే. కాబట్టి నేను ఐపీఎల్ వైపు తిరిగి కూడా చూడను. భారత్కు ఆడనప్పుడు ఐపీఎల్లో ఆడటం అనవసరం అనేది నా ఉద్దేశం. -
అదే నా ఆఖరి మ్యాచ్: నెహ్రా
సాక్షి, స్పోర్ట్స్: టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. నవంబర్ 1న సొంత మైదానమైన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో న్యూజ్ల్యాండ్ తో జరిగే మ్యాచ్ తన ఆఖరి మ్యాచ్ అని చెప్పారు. రిటైర్మెంట్ అనేది తన వ్యక్తిగత నిర్ణయం అని వెల్లడించారు. ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్ లో భారత్కు ఆడటం గర్వంగా ఉందన్నారు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని కోచ్ రవి శాస్త్రి, కెప్టెన్ కోహ్లీతో చర్చించినట్టు తెలిపారు. భారత బౌలింగ్ భువనేశ్వర్, బుమ్రాతో సమతూకంగా ఉందన్నారు. ఇంకా రెండేళ్లు ఆడమని సహచరులు కోరినట్లు వెల్లడించారు. కాగా వచ్చే ఏడాది ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్)లోనూ నెహ్రా ఆడకపోవచ్చు. 1999 లో మొహమ్మద్ అజహరుద్దీన్ కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నెహ్రా, ఇప్పటివరకు భారత్ తరపున 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 44 వికెట్లు, వన్డేల్లో 157, టీ20ల్లో 34 వికెట్లు తీశాడు. 2011లో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కూడా నెహ్రా సభ్యుడిగా ఉన్నాడు. -
నెహ్రాజీ..నిన్ను మిస్సవుతున్నాం!
న్యూఢిల్లీ: వచ్చే నెలలో టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా కెరీర్ రిటైర్మెంట్ దాదాపు ఖరారైన నేపథ్యంలో అతనిపై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది. నవంబర్ లో న్యూజిలాండ్ తో సిరీస్ లో భాగంగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో వీడ్కోలు చెప్పడానికి సిద్ధమవుతున్న నెహ్రాను అభిమానులు పొగడ్తలతో కొనియాడుతున్నారు. ప్రధానంగా 38 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానం సంపాదించుకోవడాన్ని ప్రస్తావిస్తూ నెహ్రాను దిగ్గజ బౌలర్లతో పోల్చుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు అభిమానులు. 'నెహ్రాజీ.. నిన్ను కచ్చితంగా మిస్సవుతాం. నీ బౌలింగ్ తో పాటు నీ ఎయిర్ ప్లేన్ సిలబ్రేషన్స్ కూడా ఇక ముందు కనిపించదు అని ఒక అభిమాని ట్వీట్ చేయగా, దాదాపు 40 ఏళ్ల వయసులో జట్టులోకి రావడం చాలా కష్టం..అటువంటిది లేటు వయసులో జట్టులో చోటు సంపాదించిన నెహ్రా ఇక ఫీల్డ్ లో కనిపించడు'అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. దిగ్గజ బౌలర్ కు బ్యాట్లు సాల్యూట్ చేస్తున్నాయి'అని మరో అభిమాని ప్రశంసించాడు.వచ్చే నెల మొదటి వారంలో కెరీర్ కు గుడ్ బై చెప్పడానికి నెహ్రా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ కోహ్లితో పాటు కోచ్ రవిశాస్త్రిలకు తెలియజేసినట్లు బీసీసీఐలోని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. యువకులకు అవకాశం ఇచ్చే క్రమంలో తన వీడ్కోలు ఇదే సరైన సమయంగా నెహ్రా భావించి తన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి తెలిపారు. దాంతో ట్వట్టర్ లో పలువురు అతనిపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. -
అజార్ కెప్టెన్సీలో అరంగేట్రం.. కోహ్లీ హయాంలో రిటైర్
కాలం చాలా చిత్రమైన పరీక్షలు పెడుతుంది. ఒక్కోసారి ఊహించని మలుపులు తిప్పుతుంది. ఇందుకు సజీవ సాక్ష్యం టీమిండియా బౌలర్ ఆశిష్ నెహ్ర. ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ20 సిరీస్కు నెహ్రా (38)ను ఎంపిక చేయడం ఒకరకంగా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ట్వంటీ20 జట్టుకు ఎంపికైన వారిలో నెహ్రానే వయసులో అందరికంటే పెద్దవాడు. నెహ్రాతో పాటు క్రికెట్లో అరంగేట్రం చేసిన పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు.. ఆటకు గుడ్బై కొట్టేసి వివిధ వ్యాపకాల్లో బిజీ అయిపోయారు. ఇదిలా ఉండగా నవంబర్ 1న న్యూజిలాండ్తో జరిగే మ్యాచే నెహ్రా ఆఖరిదని బీసీసీఐ ప్రకటించింది. ఎప్పుడో మహమ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన నెహ్రా తరువాత కాలంలో సచిన్, గంగూలీ, ద్రావిడ్, ధోనీ ప్రస్తుతం విరాట్ కోహ్లీ నాయకత్వంలో క్రికెట్ ఆడారు. నెహ్రా గురించిన ఆసక్తికర విషయాలు మీ కోసం ఆశిష్ నెహ్రా 1999లో శ్రీలంకతో కొలంబోలో జరిగిన టెస్ట్ మ్యాచ్తో అంతర్జాతీయ కెరీర్ ఆరంభించారు. అదే ఏడాది ప్రస్తుత బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా అదే ఏడాది అక్టోబర్లో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంటర్నేషనల్ కెరీర్ మొదలు పెట్టారు. ప్రస్తుత భారత్ జట్టు బ్యాటింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న సంజయ్ బంగర్ కూడా 2001లొ అతంర్జాతీయ క్రికెట్ మొదలు పెట్టారు. నెహ్రా అంతర్జాతీయ కెరీర్ మొదలు పెట్టినపుడు శ్రీలంక కెప్టెన్ అర్జున రణతుంగ. అదే జట్టులో ఉన్న అరవింద డిసిల్వా, సనత్ జయసూర్య, హసన్ తిలకరత్నే, మార్వన్ ఆటపట్టు, మహేల జయవర్ధనే, కుమార సంగక్కర, తిలకరత్నే దిల్షాన్, ఏంజెలో మ్యాథ్యూస్లు శ్రీలంక జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి రిటైర్ అయ్యారు. ఆశిష్ నెహ్రా అంతర్జాతీయ కెరీర్ మొదలు పెట్టేనాటికి.. బంగ్లాదేశ్కు టెస్ట్ హోదా లేదు. నెహ్రాతో పాటు అదే ఏడాది ఇంటర్నేషనల్ కెరీర్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియన్ మిడిలార్డర్ బ్యాట్స్మన్ డారెన్ లీమన్.. ప్రస్తుతం ఆ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నారు. నెహ్ర అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం నాటికి ప్రస్తుత జట్టు సభ్యుడు కుల్దీప్ యాదవ్ వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. -
నెహ్రా రిటైర్మెంట్ యోచన!
న్యూఢిల్లీ: 38 ఏళ్ల వయసులో భారత టి20 జట్టులో మళ్లీ స్థానం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరచిన పేసర్ ఆశిష్ నెహ్రా మరో ఆశ్చర్యకర నిర్ణయానికి సిద్ధమయ్యాడు. త్వరలో న్యూజిలాండ్తో జరిగే సిరీస్లో తన ఆఖరి మ్యాచ్ ఆడి అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. నవంబర్ 1న సొంత గడ్డ న్యూఢిల్లీలో కివీస్తో జరిగే తొలి టి20 మ్యాచ్ నెహ్రాకు ఆఖరి మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాను అద్భుతమైన ఫిట్నెస్తో ఉన్నానని, కుర్రాళ్లతో పోటీ పడుతూ బౌలింగ్ చేయగల సత్తా ఉండటం వల్ల మళ్లీ ఎంపికయ్యానని గర్వంగా చెప్పుకున్న నెహ్రా... అంతలోనే తప్పుకునేందుకు సిద్ధం కావడం అనూహ్యం. యువరాజ్, రైనాలాంటి వారిని కాదని నెహ్రాను ఈ వయసులో పొట్టి ఫార్మాట్కు ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. అయితే అతని మాజీ సహచరుడు వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు ‘40 ఏళ్ల వయసులో సచిన్ ఆడగా లేనిది నెహ్రా ఆడితే తప్పేంటి’ అంటూ అతడికి గట్టి మద్దతు పలికారు. ప్రత్యేకంగా కారణమంటూ చెప్పకపోయినా... మరిన్ని విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఇక ఆట చాలించాలని నెహ్రా భావిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ కోసం అతడిని ఎంపిక చేసినా, తొలి రెండు మ్యాచ్లలో తుది జట్టులో అవకాశం లభించలేదు. 26 టి20 మ్యాచ్లలో నెహ్రా 7.75 ఎకానమీతో 34 వికెట్లు పడగొట్టాడు. 2011 వరల్డ్ కప్ సెమీస్లో పాకిస్తాన్పై తన ఆఖరి వన్డే ఆడిన ఈ వెటరన్ మొత్తం 120 వన్డేల్లో 31.72 సగటుతో 157 వికెట్లు తీశాడు. నెహ్రా టెస్టు కెరీర్ 2004లోనే 17 మ్యాచ్లతో ముగిసింది. -
ఆశిష్ నెహ్రా రిటైర్మెంట్?
న్యూఢిల్లీ: ఇటీవల భారత క్రికెట్ జట్టులోకి వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ తో మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా నెహ్రాను జట్టులోకి తీసుకున్నారు. ఇక్కడ వెటరన్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలను కాదని, నెహ్రాకు చోటు కల్పించడంపై విమర్శలు సైతం చెలరేగాయి. దాదాపు 9నెలల విరామం తరువాతం అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం చేసిన ఆశిష్..తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నాడట. రాబోవు న్యూజిలాండ్ తో సిరీస్ లో వీడ్కోలు చెప్పడానికి సిద్ధమవుతున్నట్లు ముంబై మిర్రర్ ఓ కథనాన్ని ప్రచురించింది. న్యూజిలాండ్ తో తన స్వస్థలం ఢిల్లీలో జరిగే మ్యాచ్ ద్వారా రిటైర్మెంట్ కు యోచిస్తున్నట్లు స్పష్టం చేసింది. న్యూజిలాండ్ తో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్ కు ఒక టీ 20 మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ ద్వారా వీడ్కోలు తీసుకుని అభిమానులకు ఘనమైన ముగింపు ఇవ్వడానికి నెహ్రా సన్నద్ధం అవుతున్నట్లు కథనంలో పేర్కొంది. ఇప్పటికే ఆసీస్ తో టీ 20 సిరీస్ లో నెహ్రాకు ప్రాబబుల్స్ లో చోటు కల్పించినా, తొలి రెండు టీ 20లకు నెహ్రాకు చోటు దక్కని విషయం గమనార్హం. ప్రస్తుతం 38 ఒడిలో ఉన్న నెహ్రా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నడా?లేదా? అనేది త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. , -
అప్పుడు దాని విలువ తెలియలేదు: నెహ్రా
న్యూఢిల్లీ:ఆస్ట్రేలియాతో జరిగే మూడు ట్వంటీ 20 సిరీస్ లో భారత వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే. యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలకు అవకాశం ఇవ్వని సెలక్టర్టు.. ఆశిష్ నెహ్రాపై మాత్రం నమ్మకం ఉంచి అతన్ని ఎంపిక చేశారు. గత ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెహ్రా చివరిసారి కనిపించాడు. కాగా, చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో ఆశిష్ నెహ్రాకు తొలుత చోటు కల్పించినా, మోకాలి గాయం కారణంగా దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం నెహ్రా పూర్తి ఫిట్ నెస్ ను నిరూపించుకోవడంతో అతని జట్టులోకి రావడానికి మార్గం సుగుమం అయ్యింది. తన పునరాగమనంపై స్పందించిన నెహ్రా.. మరికొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకవేళ తన శరీరం ఆటకు అనుకూలించిన పక్షంలో ఆడితే మాత్రం అప్పుడు సంతోషంగ ఉండేవాడిని కాదన్నాడు. తాను అన్నివిధాలుగా ఫిట్ గా ఉండటంతో ఆడటానికి ఎటువంటి అభ్యంతరం లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఈ క్రమంలోనే తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి యత్నిస్తూనే ఉన్నానని నెహ్రా స్పష్టం చేశాడు. '38-39 ఏళ్ల వయసులో ఫాస్ట్ బౌలర్ గా రాణించడం చాలా కష్టం.. కాకపోతే నా ఫిట్ నెస్ పరంగా నాకు ఇబ్బందులు లేవు. నాకు నా శరీరం అన్ని విధాలుగా సహకరిస్తుంది. దాంతో మరికొన్ని సంవత్సరాలు ఆడతానని ఆశిస్తున్నా. మనం యుక్త వయసులో ఉన్నప్పుడు దేన్నీ పెద్దగా అర్ధం చేసుకోం. అప్పుడు భారత జట్టుకు ఆడే విలువ తెలియదు. గత 7-8ఏళ్లలో నేను చాలా క్రికెట్ మిస్సయ్యాను. కానీ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకునే యత్నం చేయలేదు. ఫలితాల్ని సాధించడం కోసం కృషి చేస్తూనే ఉన్నా. దాంతోనే మళ్లీ జట్టులోకి వచ్చా'అని నెహ్రా తెలిపాడు. ప్రస్తుతం తాను ఉన్న స్టేజ్ లో ఎటువంటి ప్రణాళికలు లేవని పేర్కొన్న నెహ్రా.. ప్రతీ సిరీస్ ను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతానన్నాడు. వచ్చే ఐపీఎల్లో తాను ఆడటంపై హామీ ఇవ్వలేనన్నాడు. అలాగే తన కెరీర్ ఎప్పుడు వరకూ సాగుతుందో కచ్చితంగా చెప్పలేనన్నాడు. -
సచిన్ ఆడినప్పుడు.. నెహ్రాకు ఏంటి..?
సాక్షి, న్యూఢిల్లీ: 40 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ ఆడినపుడు.. వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా విషయంలో వచ్చిన సమస్య ఏమిటని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించారు. ఆసీస్ తో మూడు టీ20లకు ప్రకటించిన 15 మంది జట్టు సభ్యుల్లో నెహ్రాకు అనూహ్యంగా అవకాశం దక్కిన విషయం తెలిసిందే. అయితే రైనా, యువరాజ్ వంటి ఆటగాళ్లకు చోటు దక్కకుండా ఈ సీనియర్ బౌలర్కు అవకాశం రావడం పట్ల క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ మాజీ క్రికెటర్లు మాత్రం ఈ విషయంలో సెలక్టర్లను ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే గంగూలీ క్రికెట్ కు వయస్సుతో సంబంధం లేదని నెహ్రా ఎంపికపట్ల మద్దతుగా నిలవగా తాజాగా సెహ్వాగ్ ఆ జాబితాలో చేరారు. ఓ జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు. ‘నెహ్రా ఎంపిక నాకు ఆశ్చర్యం కలిగించలేదు. అతను జట్టులో చోటు దక్కించుకోవడం చాల సంతోషాన్నిచ్చింది. భవిష్యత్తులో మరిన్ని మ్యాచ్ లు ఆడాలని కోరుకుంటున్నా. నెహ్రా ఎంపిక వెనుక ఉన్న రహస్యం అతని ఫిట్ నెస్. అతను అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడనప్పుడు పూర్తి సమయాన్ని జిమ్ కే కేటాయిస్తాడు. అంతేగాకుండా ఆటగాళ్లకు నిర్వహించే ఫిట్నెస్ పరీక్ష యో-యో టెస్టులో నెహ్రా 18 స్కోరు సాధించాడు. ఇది దాదాపు కోహ్లి స్కోరుకు సమానం. ఫిట్నెస్కు అతని హైట్ కలిసొచ్చే అంశం. ఫాస్ట్ బౌలర్ కావడంతో పరుగులో కూడా ఎలాంటి సమస్య లేదు. క్రికెట్ ఆడటానికి వయస్సుతో సంబంధం లేదని నేను భావిస్తాను. శ్రీలంక ప్లేయర్ సనత్ జయసూర్య 42 ఏళ్ల వయసులో, సచిన్ 40 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడలేదా? అలాంటప్పుడు ఫిట్గా ఉన్న నెహ్రాకు వచ్చిన సమస్య ఏమిటి? యువరాజ్, రైనాలు యో-యో టెస్టు అర్హత సాధించలేకపోవడంతో జట్టులో వారికి చోటు దక్కలేదు. క్రికెట్లో కొనసాగాలంటే ఫిట్నెస్ ముఖ్యం. ఫిట్గా ఉంటే హిట్ చేయవచ్చు. ప్రస్తుత జట్టులో అన్ఫిట్ ఎవరూ లేరు’. అని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. -
నేనేంటో... వారికి తెలుసు
కొందరిని మినహాయిస్తే చాలా మంది క్రికెటర్లు 38 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. ఆ వయసులో ఒకసారి జట్టులో స్థానం కోల్పోయాక వారి మదిలో పునరాగమనం చేయాలనే ఆలోచన రావడం అరుదుగా జరుగుతుంది. భారత వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రా ఇందుకు విరుద్ధం. ఐపీఎల్ ద్వారా యువ క్రికెటర్లు దూసు కొస్తున్న వేళ... పొట్టి ఫార్మాట్లో ఈ ఢిల్లీ పేసర్ తన ప్రత్యేకత నిలబెట్టుకున్నాడు. యువ ఆటగాళ్లతో పోటీపడుతూ 38 ఏళ్ల వయసులో మరోసారి జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఈ వారంలో జరిగే మూడు టి20 మ్యాచ్ల సిరీస్కు ఎంపికైనందుకు ఆనందం వ్యక్తం చేసిన నెహ్రా... తన నైపుణ్యంపై సెలెక్టర్లకు, కెప్టెన్ కోహ్లికి నమ్మకం ఉన్నందునే మరోసారి అవకాశం వచ్చిందని అన్నాడు. న్యూఢిల్లీ: అనూహ్యంగా వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రా భారత టి20 జట్టుకు ఎంపికయ్యాడు. లేటు వయసులో లేటెస్ట్గా మళ్లీ పునరాగమనం చేస్తున్న ఈ ఢిల్లీ స్పీడ్స్టర్... కెరీర్ ఆసాంతం విమర్శలెప్పుడూ పట్టించుకోలేదని కొత్తగా ఇప్పుడు ఏమంటారోననే బెంగలేదని స్పష్టం చేశాడు. సోషల్ మీడియాకు ఆమడదూరముండే ఆశిష్... అజహరుద్దీన్ హయంలో వచ్చాడంటే ఆశ్చర్య పోవాల్సిందే. 38 ఏళ్ల వయసులో కూడా యువకులాడే టి20 సత్తా తనలో ఉందంటున్నాడు. టెస్టులు, వన్డేల నుంచి ఎప్పుడో తప్పుకున్న ఈ సీనియర్ సీమర్ ఐపీఎల్ అయినా అంతర్జాతీయ క్రికెట్లో అయినా కేవలం పొట్టి ఫార్మాట్కే అందుబాటులో ఉంటున్నాడు. తన సుదీర్ఘ కెరీర్లోని ఆసక్తికర విషయాల్ని ఇలా పంచుకున్నాడు. సెలక్టర్లకు తెలుసు... సారథికీ తెలుసు.. నేను తిరిగి భారత్కు ఆడితే ఎవరు నొచ్చుకుంటారో మరి! అయినా నేనెప్పుడు విమర్శలను, విమర్శకులను పట్టించుకోను. నా సత్తా ఏంటో డ్రెస్సింగ్ రూమ్కు తెలుసు. సారథి కోహ్లికి బాగా తెలుసు. సెలక్టర్లకు ఇంకా బాగా తెలుసు. జట్టులో ఉంటే నా వంతు నేను కష్టపడతాను. ఇక ఈ వయసులో పెద్ద గా లక్ష్యాలేవీ పెట్టుకోను. మూడు మ్యాచ్లకు నన్ను ఎంపిక చేశారు. ఒక్కో మ్యాచ్పై దృష్టి పెడతాను. నేను ఆడితే వార్త. బాగా ఆడకపోతే అది ఇంకా పెద్ద వార్త (వైసే భి నెహ్రా అచ్చా కరేగా తో భి న్యూస్ హై. అచ్ఛా నహీ కరేగా తో వో ఔర్ భి బడీ న్యూస్ హై). నాకు తెలియదు... ట్విట్టర్కు, ఫేస్బుక్కు నేను దూరం. నిజానికి ట్విట్టర్లో నా గురించి ఎమరు ఏమనుకుంటున్నారో నిజంగా నాకు తెలియదు. ట్రెయినింగ్, ఫిట్నెస్ ఇలా రోజువారీ పనుల్లోనే నిమగ్నమవుతాను. అందుకే ఈవయసులో కూడా స్థిరంగా గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్ వేయగల సత్తా వుంది. సోషల్ మీడియాలో కనిపించని వారికి ఇప్పుడు జట్టులో కనిపించడం అనూహ్యమే కదా! జహీర్ సూపర్ బౌలర్... నా సహచరుడు జహీర్ ఖాన్ కెరీర్ ఆసాంతం టెస్టులు ఆడాడు. అద్భుత బౌలింగ్ నైపుణ్యం అతని సొంతం. ఐదు రోజుల మ్యాచ్ ఆసాంతం 80 శాతం సామర్థ్యంతో బౌలింగ్ చేయగలడు. నా వరకైతే నేను కేవలం టి20లకే పరిమితమయ్యా. నా బౌలింగ్ యాక్షన్ కూడా అసాధారణమైంది కాదు. అలాగే 80 శాతం సత్తా కూడా నాలో లేదు. కేవలం 24 బంతులు (టి20లో గరిష్టంగా 4 ఓవర్లు) మాత్రం చక్కగా వేయగలను. బహుశా ఓ సాధారణ బౌలిం గ్ యాక్షన్ కలిగివుండటం వల్లేనేమో ఈ వయసు లోనూ తేలిగ్గా బౌలింగ్ చేయగలుగుతున్నా. అజ్జూ భాయ్ హయంలో వచ్చా... చాలా మందికి తెలుసో, తెలియదో కానీ నేను 1999లో అజహరుద్దీన్ కెప్టెన్సీలో జట్టులోకి వచ్చాను. బహుశా నేను, హర్భజన్ సింగ్ తప్ప ఆయన హయాంలో జాతీయ జట్టులోకి వచ్చిన క్రికెటర్ ఇప్పటికీ ఆడుతున్నట్టు కనిపించడంలేదు. వచ్చే ఫిబ్రవరి నాటికి నా అంతర్జాతీయ కెరీర్కు 19 ఏళ్లు పూర్తవుతాయి. ఈ దశలో నేను డబ్బుకోసం ఆడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నాకు 12 సార్లు సర్జరీలు అయ్యాయి. అన్ని శస్త్రచికిత్సలయ్యాక కూడా కోలుకొని క్రికెట్ ఆడటం కూడా అరుదేనేమో? అయితే నా ఉదయం దినచర్య ప్రాక్టీస్తో మొదలవుతుంది. ఫిట్నెస్తో కొనసాగుతుంది. విరామం లేకుండా ఇలా చేస్తున్నందుకేనేమో ఇంకా నేను క్రికెట్ ఉత్సాహంగా ఆడగలుగుతున్నాను. -
ధావన్ ఇన్.. సీనియర్ బౌలర్కు అనూహ్య చాన్స్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్ల ట్వంట్వీ-20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు పిలుపు అందింది. 38 ఏళ్ల నెహ్రా చివరిసారిగా గత ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో టీ-20 మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత ఈ వెటరన్ బౌలర్కు జట్టులో చోటు దక్కడం ఇదే. శనివారం నుంచి జరిగే ఈ టీ-20 సిరీస్ కోసం సెలెక్టర్లు 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను 4-1 తేడాతో భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదో వన్డే ముగిసిన వెంటనే ప్రకటించిన టీ-20 జట్టులో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఆశిష్ నెహ్రాతోపాటు.. ఓపెనర్ శిఖర్ ధావన్కు చోటు దక్కింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను దగ్గరుండి చూసుకునేందుకు ధావన్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ధావన్ లేకపోవడంతో అతని స్థానంలో అజింక్యా రహానే.. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ బాధ్యతలు నిర్వహించాడు. ఇప్పుడు ధావన్ రావడంతో రహానేపై వేటు పడింది. వికెట్ కీపర్గా మహేంద్రసింగ్ ధోనీని ఎంపికచేయడంతోపాటు అదనంగా దినేశ్ కార్తీక్ను కూడా తీసుకోవడం గమనార్హం. టీమిండియా జట్టు ఇదే విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, కేదార్ జాధవ్, దినేష్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, హార్థిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, అక్సర్ పటేల్. -
రణతుంగకు సవాల్!
ముంబై:దాదాపు ఆరేళ్ల క్రితం భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేసిన లంక మాజీ క్రికెట్ కెప్టెన్ అర్జున రణతుంగపై భారత సీనియర్ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన రణతుంగకు దాన్ని నిరూపించగలవా అంటూ విరుచుకుపడ్డ గంభీర్.. 'ఫిక్సింగ్' అంశానికి సంబంధించి ఆధారాలుంటే తీసుకురావాలంటూ సవాల్ విసిరాడు. 'రణతుంగ ఆరోపణలతో ఆశ్చర్యానికి గురయ్యా. అంతర్జాతీయ క్రికెట్ లో గౌరవప్రదమైన వ్యక్తి చేసే వ్యాఖ్యలను చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. రణతుంగా చేసిన కామెంట్స్ నిజంగా సీరియస్ వ్యాఖ్యలే. దీనికి రణతుంగా సమాధానం చెప్పక తప్పదు. ఆధారాలతో ఫిక్సింగ్ జరిగినట్లు నిరూపించు'అని గంభీర్ ఛాలెంజ్ చేశాడు. మరొక సీనియర్ క్రికెటర్, ఆ వరల్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు ఆశిష్ నెహ్రా కూడా రణతుంగా వ్యాఖ్యలను ఖండించాడు. 'నేను రణతుంగా వ్యాఖ్యల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ స్వాగతించను. ఆరోపణలు చేసేటప్పుడు దానికి ఎంతోకొంత విలువ ఉండాలి. ఈ తరహా స్టేట్మెంట్లకు ముగింపు ఎప్పుడు దొరుకుతుంది. ఇక్కడ 1996 వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక జట్టును నేను ప్రశ్నించడం మంచి పద్ధతి అవుతుందా?, అనవసర వ్యాఖ్యల జోలికి వెళ్లడం సమంజసం కాదు' అని నెహ్రా ధ్వజమెత్తాడు. -
ఆ సత్తా నాలో ఉంది: నెహ్రా
న్యూఢిల్లీ: తన వయసు పైబడుతున్నా సత్తా ఏమాత్రం తగ్గలేదని అంటున్నాడు భారత వెటరన్ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా. ఏ ఫార్మాట్ లోనైనా 140 కి.మీ వేగంతో బౌలింగ్ వేయగల సత్తా ఉందని నెహ్రా పేర్కొన్నాడు. 'వచ్చే నెలకు 38వ ఒడిలో అడుగుపెడుతున్న నేను ఇంకా ఫాస్ట్ బౌలర్ గానే ఉన్నా. నేను ఎప్పుడూ 125-128 కి.మీ వేగం తగ్గకుండా బౌలింగ్ వేస్తూ వస్తున్నా. ఈరోజుకీ కొత్త బంతితో 138 కి.మీ వేగంతో బంతిని సంధించాలనేదే నా లక్ష్యం. దాన్ని సాధించి చూపెడతా. ఇక్కడ వేగం అనేది ముఖ్యం కాకపోయినా, అవసరమైతే 140కి.మీ వేగాన్ని అందుకుంటా 'అని నెహ్రా ధీమా వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ ఎవరైనా అతనిపై ఒత్తిడి లేదని చెబితే మాత్రం అది అబద్ధమేనని నెహ్రా స్పష్టం చేశాడు. ప్రస్తుతం తనపై ఒత్తిడి కంటే కూడా ఒక సీనియర్ క్రికెటర్ గా ఒక బాధ్యత ఉందని నెహ్రా పేర్కొన్నాడు. యువ క్రికెటర్లకు అమూల్యమైన సలహాలిస్తూ వారి కెరీర్ కు సహకరించడమే తన ముందున్న టార్గెట్ అని తెలిపాడు. అయితే 2019 వరల్డ్ కప్ లో ఆడతారా? అనే దానికి మాత్రం నెహ్రా నో అనే సమాధానమే చెప్పాడు. అప్పటికి తాను దాదాపు 40 ఏళ్లకు దగ్గరయ్యే క్రమంలో ఆడటం కష్టమేనన్నాడు. -
'బౌలింగ్తోనే సమాధానం చెప్పాడు'
నాగ్పూర్:ఇంగ్లండ్తో మూడు ట్వంటీ 20ల సిరీస్కు వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రాను ఎంపిక చేయడం సబబేనా అనే ప్రశ్నకు అతను బౌలింగ్తోనే సమాధానం చెప్పాడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ప్రత్యేకంగా నెహ్రా వేసిన తొలి స్పెల్ అద్భుతమని కొనియాడాడు. 'నెహ్రా ఎప్పుడూ అసాధారణ బౌలరే. అతను మెరుగైన ఫీల్డర్ కానప్పటికీ, బంతితో నెహ్రా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. నిన్నటి మ్యాచ్లో అతని బౌలింగ్ సూపర్. నెహ్రా తాజా బౌలింగ్ తో విమర్శకుల నోళ్లను మూయించాడు. కాన్పూర్ లో తొలి ట్వంటీ తరువాత అతని ప్రదర్శనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఈ రోజు బంతితోనే నెహ్రా సమాధానం చెప్పాడు'అని గంగూలీ కొనియాడాడు. ఈ మ్యాచ్ లో నెహ్రా నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్లో విజయానికి సంబంధించిన క్రెడిట్ మాత్రం జస్స్రిత్ బూమ్రాకే దక్కుతుందని గంగూలీ అన్నాడు. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి ఎనిమిది పరుగులు కావాల్సిన తరుణంలో బూమ్రా చెలరేగిపోవడంతోనే భారత్ కు విజయం దక్కిందన్నాడు. బూమ్రా తన చివరి రెండు ఓవర్లలో ఐదు పరుగులు మాత్రమే ఇవ్వడం కారణంగానే భారత్ కు గెలుపు సాధ్యమైందన్నాడు. ఇంతటి ఒత్తిడితో కూడిన మ్యాచ్ లో భారత్ చివరి వరకూ పోరాడి విజయం సాధించడం నిజంగానే చిరస్మరణీయమన్నాడు. -
హ్యాట్సాప్ బుమ్రా.. అద్భుతాన్ని చేశావు!
-
హ్యాట్సాప్ బుమ్రా.. అద్భుతాన్ని చేశావు!
నాగ్పూర్లో జరిగిన రెండో టీ-20 మ్యాచ్లో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ చేశాడు. చివరి రెండు ఓవర్లలో ఐదు పరుగులు ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్పై భారత్ అనూహ్యంగా ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో భారత బౌలర్లు ఆశిష్ నెహ్రా, జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించారు. 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఒక దశలో 30 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన స్థితిలో దృఢంగా కనిపించింది. కానీ తాను వేసిన చివరి రెండు ఓవర్లలో బుమ్రా అద్భుతమైన ట్రిక్స్తో భారత్ వైపు విజయాన్ని తిప్పాడు. 18వ ఓవర్లో నాలుగు డాట్ బాల్స్ వేసిన బుమ్రా.. దాదాపు రూట్ను ఔట్ చేసినంత పని చేశాడు. ఇక చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి ఎనిమిది పరుగులు కావాల్సిన దశలో ఈ యువ బౌలర్ ఒత్తిడిని తట్టుకుంటూ వేసిన స్లో డెలివరీ బంతులు ఇంగ్లిష్ జట్టును ఉక్కిరిబిక్కిరి చేశాయి. రెండు వికెట్లు సమర్పించుకొని ఐదుపరుగుల తేడాతో అతిథి జట్టు పరాజయాన్ని మూటగట్టుకుంది. బుమ్రా చూపిన ఈ అసాధారణ బౌలింగ్ ప్రతిభపై సహ బౌలర్ ఆశీష్ నెహ్రా ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఇది చాలా ప్రెషర్ గేమ్. మ్యాచ్ను కాపాడుకునేందుకు జస్ప్రీత్కు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగుల తేడా ఇవ్వడానికి ప్రయత్నించాను. అతనికి హ్యాట్సాప్ చెప్పాలి. గతంలో కూడా ఇదే తరహాలో ఆడి.. భారత్కు విజయాన్ని అందించాడు. ఎలా బౌలింగ్ చేయాలని అతను నన్ను అడిగాడు. నువ్వు యార్కర్లు బాగా వేస్తావు. పుల్లెంత్ బంతులు వెయ్యి. కొట్టడానికి కష్టంగా ఉంటుందని చెప్పాను. అది పనిచేసింది. నాలుగు ఓవర్లలో 32 పరుగులు చేయాల్సిన దశలో ఇంగ్లండ్ ఉన్నప్పుడు విజయం మనదేనని జస్ప్రీత్కు నేను చెప్పాను' అని మ్యాచ్ అనంతరం నెహ్రా చెప్పాడు. -
వన్డే, టీ20 సిరీస్ లకు షమీ దూరం
న్యూఢిల్లీ: త్వరలో ఇంగ్లండ్తో జరగబోయే వన్డే, ట్వంటీ 20 సిరీస్లకు భారత ప్రధాన బౌలర్ మొహ్మద్ షమీ దూరం కానున్నాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న షమీ.. ఇంగ్లండ్ తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి వైదొలగాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే అతని స్థానంలో ఇషాంత్ శర్మకు వన్డే జట్టు ప్రాబబుల్స్ లో చోటు దక్కే అవకాశం కనబడుతోంది. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్లో ఇషాంత్ కు చోటు కల్పించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెలక్టర్లు మరొకసారి అతనికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా పేరును ట్వంటీ 20 సిరీస్ కు పరిశీలిస్తున్నారు. ఇటీవల టీమిండియా కీలక ఆటగాళ్లు గాయాలు పాలు కావడంతో యువ క్రికెటర్లకు అవకాశం కల్పిస్తున్నారు. గాయం కారణంగా రోహిత్ శర్మ టెస్టు సిరీస్కు దూరమైన నేపథ్యంలో కరుణ్ నాయర్ కు అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నాయర్..ఇంగ్లండ్ తో జరిగే వన్డే, టీ 20 సిరీస్ల్లో ఆడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంగ్లండ్ తో తదుపరి సిరీస్లకు అజింక్యా రహానే, శిఖర్ ధవన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకుంటున్న వీరిద్దరూ వన్డే, ట్వంటీ20 సిరీస్ల్లో ఆడతారని సెలక్టర్లు భావిస్తున్నారు. -
'అప్పటివరకు ధోని కొనసాగాలి'
మెగా ఈవెంట్ నేపథ్యంలో టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ పై ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతోంది. చాంపియన్స్ ట్రోఫీ 2017, జూన్ లో జరగనుంది. అయితే 2019 వన్డే ప్రపంచ కప్ వరకు ధోని కొనసాగాలని మాజీ క్రికెటర్లు కోరుకుంటున్నారు. 'వచ్చే వన్డే వరల్డ్ కప్ నాటికి ధోని వయసు 38 ఏళ్లు. ఈ రోజుల్లో క్రికెట్ లో కొనసాగడానికి ఇదేమంత పెద్ద వయసు కాదు. పాకిస్థాన్ ఆటగాళ్లు యూనిస్ ఖాన్, మిస్బా-వుల్-హక్.. 40 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతున్నారు. అయితే 2019 వరకు ఫిట్ నెస్ కాపాడుకుంటే ధోని కూడా కొనసాగవచ్చు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని ఇప్పుడే వైదొలగాల్సిన అవసరం కనబడడం లేద'ని మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. ఇదే అభిప్రాయాన్ని మాజీ కెప్టెన్ రవిశాస్త్రి వ్యక్తం చేశాడు. 'కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లా ధోని కూడా గొప్ప ఆటగాడు. 2019 వరకు అతడు ఆడాలి. అతడి లాంటి ఆటగాడు సమీప భవిష్యత్తులో లభించడం కష్టం. తనదైన ఆటతీరుతో సమకాలిన క్రికెట్ లో ధోని చెరగని ముద్ర వేశాడ'ని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఫిట్ నెస్ చాలా కీలకమని, ఫిట్ గా ఉంటే 2019 వరకు ధోని కొనసాగుతాడని మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ధోని రిటైర్ అవుతాడా, వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగుతాడా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.