Shikar Dhawan
-
శిఖర్ ధావన్ ఊచకోత.. కేవలం 29 బంతుల్లోనే! అయినా
బిగ్ క్రికెట్ లీగ్ 2024లో టీమిండియా మాజీ ఓపెనర్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ లీగ్లో నార్తరన్ ఛాలెంజర్స్కు సారథ్యం వహిస్తున్న ధావన్.. సోమవారం ఎంపీ టైగర్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.గబ్బర్ తనదైన స్టైల్లో షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. కేవలం 29 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్లతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ధావన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్తరన్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో 12 పరుగుల తేడాతో ధావన్ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. నార్తరన్ బ్యాటర్లలో ధావన్తో పాటు గురుకీరత్ సింగ్ మాన్(32 బంతుల్లో 73, 7 ఫోర్లు, 5 సిక్స్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.నమన్ ఓజా సూపర్ సెంచరీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎంపీ టైగర్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఎంపీ టైగర్స్ బ్యాటర్లలో నమన్ ఓజా(55 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీతో మెరవగా.. సాకేత్ శర్మ(78) హాఫ్ సెంచరీతో రాణించాడు. నార్తరన్ బౌలర్లలో కుందన్ కుమార్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ బిగ్ క్రికెట్లో పాకిస్తాన్ మినహా అన్ని దేశాల మాజీ క్రికెటర్లు భాగమయ్యారు. -
మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్న శిఖర్ ధావన్..
టీమిండియా మాజీ ఓపెనర్ మళ్లీ మైదానంలో అడుగు పెట్టేందుకు సిద్దమయ్యాడు. ఈ ఏడాది అగస్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు ధావన్ విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ధావన్ భారత్ వేదికగా జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో గుజరాత్ జెయింట్స్కు సారథ్యం వహించాడు. ఇప్పుడు మరో ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు గబ్బర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.నేపాల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్లో ఈ ఢిల్లీ ఆటగాడు భాగం కానున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్-2024లో కర్నాలీ యాక్స్ ఫ్రాంచైజీకి ధావన్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. కాగా ధావన్కు టీ20ల్లో మంచి రికార్డు ఉంది. టీ20ల్లో అతడు 9,797 పరుగులు చేశాడు. ఐపీఎల్లో కూడా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ధావన్(6769) రెండో స్ధానంలో ఉన్నాడు.ఇక ఎన్పీఎల్ విషయానికి వస్తే.. ఈ లీగ్లో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. కర్నాలీ యాక్స్తో పాటు బిరత్నగర్ కింగ్స్, చిత్వాన్ రైనోస్, జనక్పూర్ బోల్ట్స్, ఖాట్మండు గూర్ఖాస్, లుంబినీ లయన్స్, పోఖరా ఎవెంజర్స్, సుదుర్పాస్చిమ్ రాయల్స్ మిగితా ఏడు జట్లగా ఉన్నాయి. ఈ లీగ్ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 21 వరకు జరగనుంది. ఈ టోర్నీకి సబంధించి పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.చదవండి: అతడి కోసం నా ప్లేస్ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య -
LLC 2024: క్రిస్ గేల్ ఊచకోత.. ధావన్ మెరుపులు (వీడియో)
విండీస్ దిగ్గజం క్రిస్ గేల్, భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటకి తమలో ఏమాత్రం జోరుతగ్గలేదని మరోసారి నిరూపించారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ)2024లో గేల్, ధావన్ మెరుపులు మెరిపించారు.ఈ లీగ్లో గుజరాత్ గ్రేట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇద్దరూ లెజెండరీ క్రికెటర్లు.. శుక్రవారం కోనార్క్ సూర్యాస్ ఓడిశా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. కోనార్క్ జట్టు కెప్టెన్ టాస్ గెలిచి తొలుత గుజరాత్ టీమ్ను బ్యాటింగ్ ఆహ్హనించాడు.గుజరాత్ గ్రేట్స్ ఓపెనర్ మోర్నీ వ్యాన్ వాయక్(2)ను ఆదిలోనే పేసర్ వినయ్ కుమార్ పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గేల్..ధావన్తో కలిసి ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.గేల్ 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 34 పరుగులు చేయగా.. ధావన్ 24 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరితో ప్రసన్న(31) పరుగులతో రాణించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ గ్రేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది.అనంతం 142 పరుగుల లక్ష్యంతో దిగిన కోనార్క్ కేవలం 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోనార్క్ బ్యాటర్లలో మునివీరా(47) టాప్ స్కోరర్గా నిలవగా.. ఓబ్రియన్(43) పరుగులతో రాణించాడు.Chris Gayle 🤝 Shikhar Dhawan. 🔥- Gabbar and universe Boss together in the LLC. 🤯 pic.twitter.com/N8r4pbtQ3f— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2024 -
ముగిసిన లెజెండ్స్ లీగ్ వేలం.. భారీ ధర అతడికే
లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC)-2024 సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ క్రికెట్ టోర్నీ.. ఇప్పుడు మూడో సీజన్కు సిద్దమవుతోంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గోనునున్నాయి. తొలి సీజన్(2022)లో ఇండియా క్యాపిటల్స్ విజేతగా.. రెండువ సీజన్లో మణిపాల్ టైగార్స్ ఛాంపియన్గా అవతరించింది.ఇక ఇది ఇలా ఉండగా.. ఎల్ఎల్సీ మూడో సీజన్కు సంబంధించిన వేలం ముంబై వేదికగా గురువారం(ఆగస్టు 29)న జరిగింది. అయితే భారత మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్ ఈ ఏడాది ఎల్ఎల్సీ సీజన్లో భాగం కావడంతో మరింత ప్రాధన్యత సంతరించుకుంది. వేలానికి ముందే శిఖర్ ధావన్ను గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకోగా.. కార్తీక్తో సదరన్ సూపర్ స్టార్స్ ఒప్పందం కుదర్చుకుంది.అయితే ధావన్, కార్తీక్ల కోసం ఆయా ఫ్రాంచైజీలు ఎంత మొత్తం వెచ్చించియో వెల్లడించలేదు. వీరిద్దరూ మినహా మిగితా క్రికెటర్లందరూ వేలంలో పాల్గోనున్నారు. మొత్తం ఈ వేలంలో దాదాపు 300 మంది క్రికెటర్లు పాల్గోనగా.. 97 మంది మాత్రమే అమ్ముడు పోయారు. ఈ 97 మంది క్రికెటర్లను కొనుగోలు చేయడానికి ఆరు ఫ్రాంచైజీలు మొత్తం రూ. 39.63 కోట్లు వెచ్చించాయి. ఈ వేలంలో శ్రీలంకకు చెందిన ఇసురు ఉదానా అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రూ. అర్బనైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 62 లక్షలకు సొంతం చేసుకుంది.ఉదానా తర్వాత భారీ ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్గా వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ నిలిచాడు. అతడిని కూడా అర్బన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కాగా బ్రెట్లీ, దిల్షాన్, షాన్ మార్ష్, ఫించ్, ఆమ్లా వంటి దిగ్గజ క్రికెటర్లు అమ్ముడుపోలేదు.వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..మణిపాల్ టైగర్స్హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప, తిసర పెరీరా, షెల్డన్ కాట్రెల్, డాన్ క్రిస్టియన్, ఏంజెలో పెరీరా, మనోజ్ తివారీ, అసేలా గుణరత్నే, సోలమన్ మిరే, అనురీత్ సింగ్, అబు నెచిమ్, అమిత్ వర్మ, ఇమ్రాన్ ఖాన్, రాహుల్ శుక్లా, అమిటోజ్ సింగ్, ప్రవీణ్ గుప్తా, సౌరభ్ గుప్తా .ఇండియా క్యాపిటల్స్ యాష్లే నర్స్, బెన్ డంక్, డ్వేన్ స్మిత్, కోలిన్ డి గ్రాండ్హోమ్, నమన్ ఓజా, ధవల్ కులకర్ణి, క్రిస్ మ్ఫోఫు, ఫైజ్ ఫజల్, ఇక్బాల్ అబ్దుల్లా, కిర్క్ ఎడ్వర్డ్స్, రాహుల్ శర్మ, పంకజ్ సింగ్, జ్ఞానేశ్వరరావు, భరత్ చిప్లి, పర్వీందర్ అవానా, పవన్ సుయాల్, మురళీ సుయాల్ విజయ్, ఇయాన్ బెల్.గుజరాత్ జెయింట్స్క్రిస్ గేల్, లియామ్ ప్లంకెట్, మోర్నే వాన్ వైక్, లెండిల్ సిమన్స్, అసోహర్ అఫోహాన్, జెరోమ్ టేలర్, పరాస్ ఖాడా, సీక్కుగే ప్రసన్న, కమౌ లెవర్రాక్, సైబ్రాండ్ ఎనోయెల్బ్రెచ్ట్, షానన్ గాబ్రియేల్, సమర్ క్వాద్రీ, మహమ్మద్ కైఫ్, శ్రీసన్హవాన్, శ్రీసన్హవాన్.కోణార్క్ సూర్యస్ ఒడిశాఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, కెవిన్ ఓ బ్రియాన్, రాస్ టేలర్, వినయ్ కుమార్, రిచర్డ్ లెవీ, దిల్షన్ మునవీర, షాబాజ్ నదీమ్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, బెన్ లాఫ్లిన్, రాజేష్ బిష్ణోయ్, ప్రవీణ్ తాంబే, దివేష్ పఠానియా, కేపీ అప్పన్న, అంబటి రాయుడు, అంబటి రాయుడు.సదరన్ సూపర్ స్టార్స్దినేష్ కార్తీక్, ఎల్టన్ చిగుంబుర, హామిల్టన్ మసకద్జా, పవన్ నేగి, జీవన్ మెండిస్, సురంగ లక్మల్, శ్రీవత్స్ గోస్వామి, హమీద్ హసన్, నాథన్ కౌల్టర్ నైల్, చిరాగ్ గాంధీ, సుబోత్ భాటి, రాబిన్ బిస్ట్, జెసల్ కరీ, చతురంగ డి సిల్వా, మోను కుమార్అర్బన్రైజర్స్ హైదరాబాద్సురేష్ రైనా (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, డ్వేన్ స్మిత్, టినో బెస్ట్, స్టువర్ట్ బిన్నీ, క్రిస్టోఫర్ ఎంఫోఫు, అస్గర్ ఆఫ్ఘన్, చమర కపుగెదెరా, పీటర్ ట్రెగో, రిక్కీ క్లార్క్, పవన్ సుయాల్, ప్రజ్ఞాన్ ఓజా, శివ కాంత్ శుక్లా, సుదీప్ త్యాగి, తిరుమలశెట్టి సుమన్, యోగేష్ నగర్, షాదాబ్ జకాతి, జెరోమ్ టేలర్, గురుకీరత్ మాన్, అమిత్ పౌనికర్, దేవేంద్ర బిషూ. -
అంతర్జాతీయ క్రికెట్ కు శిఖర్ ధావన్ రిటైర్ మెంట్
-
శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై
టీమిండియా సీనియర్ క్రికెటర్, ఓపెనర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు ధావన్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ క్రికెట్లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు తెలిపాడు.As I close this chapter of my cricketing journey, I carry with me countless memories and gratitude. Thank you for the love and support! Jai Hind! 🇮🇳 pic.twitter.com/QKxRH55Lgx— Shikhar Dhawan (@SDhawan25) August 24, 2024 ఇక, ఈ వీడియోలో శిఖర్ ధావన్.. దేశం తరఫున ఆడినందుకు చాలా గర్వంగా ఉందన్నాడు. ఇక తన ప్రయాణంలో తనకు ఎంతో మంది.. సహాయం చేశారని, వారి వల్ల ఈ స్థాయికి వచ్చానని కూడా తెలిపారు. ఈ సందర్భంగా బీసీసీఐ, డీడీసీఏ, తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు. కాగా, టీమిండియా తరఫున శిఖర్ ధావన్.. 167 వన్డే మ్యాచ్లు, 34 టెస్టులు, 68 టీ20లు ఆడాడు. టీమిండియాకు ఓపెనర్గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక, వన్డేల్లో శిఖర్ ధావన్ 17 సెంచరీలతో 6793 పరుగులు సాధించాడు. టెస్టుల్లో ఏడు సెంచరీలతో 2315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1759 పరుగులు సాధించాడు. అయితే, ధావన్ ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ టీమ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. -
వారెవ్వా అభిషేక్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో
బెంగాల్ ప్రో టీ20-2024 సీజన్లో సంచలన క్యాచ్ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం మేదినీపూర్ విజార్డ్స్తో జరిగిన మ్యాచ్లో హౌరా వారియర్స్ ఆటగాడు అభిషేక్ దాస్ అద్భుతమైన క్యాచ్తో మెరిశాడు. ఊహకందని రీతిలో క్యాచ్ పట్టి ఔరా అనిపించుకున్నాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన మేదినీపూర్ విజార్డ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మేదినీపూర్ ఇన్నింగ్స్ 19వ వేసిన ఫాస్ట్ బౌలర్ కనిష్క్ సేథ్.. దీపక్ కుమార్ మహతోకు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. దీంతో దీపక్ కుమార్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అందరూ సిక్స్ అని భావించారు. కానీ లాంగాన్లో ఉన్న అభిషేక్ దాస్ అద్బుతం చేశాడు. అభిషేక్ వెనక్కి వెళ్తూ జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో ఫ్లయింగ్ క్యాచ్ను అందుకున్నాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అభిషేక్ కూడా క్యాచ్ పట్టిన వెంటనే టీమిండియా స్టార్ శిఖర్ ధావన్ స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపునకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 🏏🔥 What a catch! Abhishek Das's incredible reflexes are absolutely breathtaking! 🤯👏 ..#BengalProT20 #FanCode @bengalprot20 pic.twitter.com/WuAUcMZren— FanCode (@FanCode) June 15, 2024 -
క్రికెటర్ కావాలన్నది మా నాన్న కల.. చాలా సంతోషంగా ఉంది: పంత్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. దాదాపు 14 నెలల తర్వాత తిరిగి మైదానంలో అడగుపెట్టిన రిషబ్.. ఐపీఎల్-2024లో అదరగొట్టాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు సారథ్యం వహించిన పంత్.. ఆ జట్టు తరపున లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు.ఈ ఏడాది సీజన్లో ఓవరాల్గా 13 మ్యాచ్లు ఆడిన పంత్.. 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. పునరాగమనంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పంత్కు టీ20 వరల్డ్కప్-2024 భారత జట్టులో సైతం సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే అమెరికాకు చేరుకున్న ఈ ఢిల్లీ డైనమెట్.. వరల్డ్కప్నకు సన్నద్దమవుతున్నాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు శిఖర్ ధావన్ టాక్ షో 'ధావన్ కరేంగే'లో రిషబ్ పాల్గోనున్నాడు. ఈ షోలో పలు ఆసక్తికర విషయాలను పంత్ పంచుకున్నాడు. తనను క్రికెటర్గా చూడాలన్న తన తండ్రి కలను నేరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని పంత్ చెప్పుకొచ్చాడు. నేను క్రికెటర్ కావాలనేది మా నాన్న కల. మా నాన్న కలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు క్రికెటర్ని కావాలని నిర్ణయించుకున్నాను. మా నాన్న నాకు 14వేల విలువైన బ్యాట్ని బహుమతిగా ఇచ్చాడు. అయితే మా అమ్మకు మాత్రం చాలా కోపం వచ్చింది అంటూ నవ్వుతూ" పంత్ పేర్కొన్నాడు. -
స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడతాడు!
సినిమా హీరోలు అనగానే కాస్ట్ లీ బట్టలు, ఖరీదైన కార్లు, లగ్జరీ లైఫ్.. చాలామందికి ఇవే గుర్తొస్తాయి. కానీ వీళ్లలో చాలా తక్కువ మంది మీడియా కంటికి కనిపించకుండా చాలా సాధారణంగా జీవిస్తుంటాడు. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటి ఓ స్టార్ హీరో కొడుకు గురించి. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే స్టార్ హీరో తండ్రిగా ఉన్నాడు. కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ కొడుకు మాత్రం సెకండ్ హ్యాండ్ బట్టలే వాడుతున్నాడట.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. హిట్ ఫ్లాప్తో వరస మూవీస్ చేస్తూనే ఉంటాడు. రీసెంట్గానే 'బడే మియా చోటే మియా' సినిమాతో వచ్చాడు. కానీ ఘోరమైన ఫెయిల్యూర్ అందుకున్నాడు. తాజాగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ హోస్టింగ్ చేస్తున్న 'ధావన్ కరేంగే' అనే టాక్ షోకు అక్షయ్.. గెస్ట్గా వచ్చాడు. తన కొడుకు ఆరవ్ గురించి ఎవరికీ తెలియని విషయాల్ని బయటపెట్టాడు.'నేను, ట్వింకిల్ (అక్షయ్ భార్య).. ఆరవ్ని పెంచిన విధానంపై నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే అతడు చాలా సాధారణమైన అబ్బాయి. ఇది చెయ్ అది చెయ్ అని అతడిని ఎప్పుడూ బలవంత పెట్టలేదు. వాడికి సినిమాలపై ఇంట్రెస్ట్ లేదు. కానీ ఫ్యాషన్పై ఆసక్తి ఉంది. ఆరవ్.. 15 ఏళ్లకే లండన్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లాడు. అయితే అతడి వెళ్లాలని మేం కోరుకోలేదు. కానీ వెళ్తుంటే ఆపలేదు. ఎందుకంటే నేను కూడా 14 ఏళ్లప్పుడే ఇంటి నుంచి బయటకొచ్చాను. ఆరవ్.. ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకుంటాడు. మంచి డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు కానీ ఖరీదైన బట్టలు కొనడు. సెకండ్ హ్యాండ్ బట్టలమ్మే థ్రిప్టీ అనే షాప్కి వెళ్తాడు. అతడికి డబ్బు వేస్ట్ చేయడం ఇష్టం లేదు. అందుకే ఇలా చేస్తున్నాడు' అని అక్షయ్, తన కొడుకు గురించి సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు.(ఇదీ చదవండి: నటి, యాంకర్ శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న వార్నింగ్) -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
ఐపీఎల్-2024 సీజన్లో తమ చివరి మ్యాచ్ ఆడేందుకు పంజాబ్ కింగ్స్ సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్కమ్రించిన పంజాబ్.. కనీసం తమ చివరి మ్యాచ్లోనైనా గెలిచి సీజన్ను ఘనంగా ముగించాలని భావిస్తోంది.ఇక ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ వ్యవహరించనున్నాడు. పంజాబ్ తత్కాలిక కెప్టెన్, ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ శామ్ కుర్రాన్ టీ20 వరల్డ్కప్-2024కు సన్నద్దమయ్యేందుకు తన స్వదేశానికి వెళ్లిపోయాడు.ఈ క్రమంలోనే చివరి మ్యాచ్లో పంజాబ్ జట్టుకు జితేష్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. పంజాబ్ ఫ్రాంచైజీకి జితేష్ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. కాగా పంజాబ్ రెగ్యూలర్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా సీజన్లో మధ్యలోనే వైదొలిగాడు. దీంతో సామ్కుర్రాన్కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను పంజాబ్ అప్పగించింది. అయితే ఇప్పుడు సామ్ కుర్రాన్ కూడా స్వదేశానికి వెళ్లిపోవడంతో జితేష్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన పంజాబ్.. ఐదింట విజయం సాధించింది. -
గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా మెరుపు స్టంపింగ్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్లో విఫలమైనప్పటికి.. వికెట్ కీపింగ్లో మాత్రం అదరగొట్టాడు. అద్బుతమైన స్టంపింగ్తో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ను క్లాసెన్ పెవిలియన్కు పంపాడు. మెరుపు వేగంతో స్టంప్ చేసిన క్లాసెన్.. భారత లెజెండ్ ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు. 183 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలో తడబడింది. ఎస్ఆర్హెచ్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్వింగ్ను ఎదుర్కోవడానికి పంజాబ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో భువీ స్వింగ్ను కట్ చేసేందుకు ధావన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పంజాబ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన భువీ బౌలింగ్లో ధావన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి అద్బుతమైన షాట్ ఆడాడు. ఇది చూసిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. వికెట్ కీపర్ క్లాసెన్ను స్టంప్స్కు దగ్గరగా తీసుకువచ్చాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకు స్టంప్స్కు దగ్గరగా వికెట్ కీపింగ్ చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ కమ్మిన్స్ తీసుకున్న నిర్ణయం ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చింది. భువీ వేసిన అదే ఓవర్లో నాలుగో బంతిని అంచనా వేయడంలో విఫలమైన ధావన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి.. వికెట్ల వెనకు క్లాసెన్కు చిక్కాడు. గంటకు 140 కి.మీ వేగంతో వచ్చిన బంతిని అందుకున్న క్లాసెన్ మెరుపు వేగంతో స్టంప్స్ను పడగొట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 𝗤𝘂𝗶𝗰𝗸 𝗛𝗮𝗻𝗱𝘀 𝘅 𝗦𝘂𝗽𝗲𝗿𝗯 𝗥𝗲𝗳𝗹𝗲𝘅𝗲𝘀 ⚡️ Relive Heinrich Klaasen's brilliant piece of stumping 😍👐 Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #PBKSvSRH | @SunRisers pic.twitter.com/sRCc0zM9df — IndianPremierLeague (@IPL) April 9, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
PBKS vs SRH: ఉత్కంఠపోరులో ఎస్ఆర్హెచ్ గెలుపు..
IPL 2024 PBKS vs SRH Live Updates: పంజాబ్ కింగ్స్తో ఆఖరి వరకు జరిగిన ఉత్కంఠపోరులో 2 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఉనద్కట్ వేసిన ఆఖరి ఓవర్లో తమ విజయానికి 29 పరుగులు అవసరమవ్వగా పంజాబ్ బ్యాటర్లు అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ 26 పరుగులు సాధించారు. ఆఖరి వరకు పోరాడనప్పటికి తన జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయారు. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్(46) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అశుతోష్ శర్మ(15 బంతుల్లో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. సన్రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, నటరాజన్, నితీష్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ 64 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 19 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ 18 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ : 154/6. పంజాబ్ విజయానికి ఆఖరి ఓవర్లో 29 పరుగులు కావాలి. పంజాబ్ ఆరో వికెట్ డౌన్.. జితేష్ శర్మ రూపంలో పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది.19 పరుగులు చేసిన జితేష్.. నితీష్ రెడ్డి బౌలింగ్లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 116/6 ఐదో వికెట్ డౌన్.. 91 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన సికిందర్ రజా.. జయ్దేవ్ ఉనద్కట్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 97/5 నాలుగో వికెట్ డౌన్ 58 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. నటరాజన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి శశాంక్ సింగ్ వచ్చాడు. 9 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 58/3 9 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో సామ్ కుర్రాన్(29), సికిందర్ రజా(10) పరుగులతో ఉన్నారు. కష్టాల్లో పంజాబ్.. 20 పరుగులకే 3 వికెట్లు 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శిఖర్ ధావన్ రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ధావన్ ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో జానీ బెయిర్ స్టో డకౌటయ్యాడు. 2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 2/1 పంజాబ్ టార్గెట్ 183 పరుగులు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 37 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 4 ఫోర్లు, 5 సిక్స్లతో 64 పరుగులు చేశాడు. అతడితో పాటు అబ్దుల్ సమాద్(25), షాబాజ్ ఆహ్మద్(14) ఆఖరిలో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు సామ్ కుర్రాన్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ డౌన్.. నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 64 పరుగులు చేసిన నితీష్ కుమార్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 156/8 ఎస్ఆర్హెచ్ ఆరో వికెట్ డౌన్.. అబ్దుల్ సమాద్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన అబ్దుల్ సమాద్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 16.4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 133/6 నితీష్ కుమార్ ఫిప్టీ.. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తన హాఫ్ సెంచరీ మార్క్ను అందున్నాడు. 63 పరుగులతో నితీష్ కుమార్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 15 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 133/5 ఐదో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్ హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన క్లాసెన్.. హర్షల్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 111/5. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(41), సమాద్(9) పరుగులతో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్.. త్రిపాఠి ఔట్ 64 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. హర్షల్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 90/4. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(33), క్లాసెన్(6) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 61/3 10 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(11), రాహుల్ త్రిపాఠి(10) ఉన్నారు. మూడో వికెట్ డౌన్.. 39 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. సామ్ కుర్రాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 40/3 వారెవ్వా అర్ష్దీప్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఆర్ష్దీప్ సింగ్ బిగ్ షాకిచ్చాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లలో ఎస్ఆర్హెచ్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత ట్రావిస్ హెడ్(21), తర్వాత మార్క్రమ్ డకౌటయ్యాడు. క్రీజులో అభిషేక్ శర్మ నితీష్ శర్మ ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఇటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. తుది జట్లు పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, సికందర్ రజా, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ సన్రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ -
టీమిండియా స్టార్ క్రికెటర్కు విడాకులు మంజూరు..
టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ దావన్, అతడి మాజీ భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. గత కొంత కాలంగా ఆయేషా ముఖర్జీకి ధావన్ దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసిస్తోందని ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో ధావన్ విడాకుల పిటిషన్ ధాఖలు చేశాడు. దీంతో ఈ కేసు కోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది. తన భార్యపై ధావన్ చేసిన ఆరోపణలు అన్నీ వాస్తవమైనవని న్యాయమూర్తి హరీష్ కుమార్ విశ్వసించారు. కొన్నాళ్ల పాటు కుమారుడితో విడిగా ఉండాలని భార్య ఆయేషా ఒత్తిడి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. అదే విధంగా ఆస్ట్రేలియాలో తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన మూడు ఆస్తులలో 99 శాతం తనని యజమానిగా చేయాలని ఆయేషా తనను ఒత్తిడి చేసిందన్న ధావన్ ఆరోపణను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. కాగా ధావన్, ఆయేషా దంపతుల కుమారుడి శాశ్వత కస్టడీపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. కానీ ధావన్కు భారత్ లేదా ఆస్ట్రేలియాలో తన కుమారుడిని కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా వీడియో కాల్ ద్వారా కూడా ధావన్ తన కుమారుడితో మాట్లాడవచచ్చని పేర్కొంది. కాగా వీరిద్దరికి 2012లో వివాహం కాగా... జొరావర్ అనే 9 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మెల్బోర్న్కు చెందిన ఆయేషాకు శిఖర్తో పరిచయం కాక ముందే పెళ్లయింది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఆ తర్వాత ధావన్-ఆయేషా వ్యక్తిగత కారణాల వల్ల ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో 2021లో ధావన్తో విడాకులు తీసుకుంటున్నాని ఆయేషానే స్వయంగా వెల్లడించింది. చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్- కివీస్ తొలి పోరు.. ఎవరి బలాబలాలు ఎంత..? రికార్డులు ఎలా ఉన్నాయంటే?: -
వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కపోయినా.. ధావన్ మంచి మనసు! పోస్ట్ వైరల్
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లే. తాజాగా వన్డే ప్రపంచకప్కు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో కూడా ధావన్కు స్ధానం దక్కలేదు. అతడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అతడికి రీఎంట్రీ ఇచ్చే అన్ని దారులు మూసుకు పోయాయి. ఇక జట్టులో చోటు దక్కకపోయినప్పటికీ ధావన్ తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రపంచకప్కు ఎంపికైన తన సహచర ఆటగాళ్లకు గబ్బర్ అభినందనలు తెలిపాడు. "వరల్డ్కప్ 2023 టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైన నా తోటి సహచరులకు, స్నేహితులకు అభినందనలు. 1.5 బిలియన్ల ప్రజల ప్రార్థనలు మీకు మద్దతుగా ఉన్నాయి. మీరు ట్రోఫిని తిరిగి సాధించి, మమ్మల్ని గర్వించేలా చేయండి అంటూ ఎక్స్(ట్విటర్)లో ధావన్ రాసుకొచ్చాడు. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఇంగ్లండ్- న్యూజిలాండ్ మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. అదే విధంగా ఆక్టోబర్ 8 న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్తో భారత్ తమ వరల్డ్కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ప్రపంచకప్కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్థూల్ ఠాకూర్. చదవండి: World Cup 2023: వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్.. యుజ్వేంద్ర చాహల్ కీలక నిర్ణయం! Congratulations to my fellow team mates & friends chosen to represent India in the WC 2023 tournament! With the prayers and support of 1.5 billion people, you carry our hopes and dreams. May you bring the cup back home 🏆 and make us proud! Go all out, Team India! 🇮🇳… https://t.co/WbVmD0Fsl5 — Shikhar Dhawan (@SDhawan25) September 6, 2023 -
స్పిన్నర్లంతా లెఫ్ట్ హ్యాండర్లే.. ధవన్, శాంసన్లను ఎంపిక చేసి ఉండాల్సింది..!
ఆసియా కప్-2023 కోసం 17 మంది సభ్యుల భారత జట్టును సెలెక్టర్లు ఇవాళ (ఆగస్ట్ 21) ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టు ఎంపికలో ఎలాంటి సంచనాలకు తావివ్వని సెలెక్టర్లు, ఒకరిద్దరికి మొండిచెయ్యి చూపించారన్నది కాదనలేని సత్యం. ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లే.. చహల్ను తీసుకోవాల్సింది..! స్పిన్నర్ల ఎంపికలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తుంది. ఎంపిక చేసిన స్పెషలిస్ట్ స్పిన్నర్లంతా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్లే (అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్) కావడం చర్చనీయంశంగా మారింది. రైట్ ఆర్మ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ను ఎంపిక చేయాల్సిందని మెజార్టీ శాతం అభిమానులు అభిప్రాయపడుతున్నారు. శిఖర్ ధవన్కు ఆఖరి ఛాన్స్ ఇవ్వాల్సింది.. ఆసియా కప్కు ప్రకటించిన భారత జట్టులో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్కు అవకాశం ఇవ్వాల్సిందని సోషల్మీడియా వేదికగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ధవన్కు ఆసియా కప్లో (వన్డే) ఘనమైన ట్రాక్ రికార్డు (9 మ్యాచ్ల్లో 59.33 సగటున 91.43 స్ట్రయిక్రేట్తో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 534 పరుగులు) ఉండటం ఇందుకు ఓ కారణమైతే, వయసు పైబడిన రిత్యా అతనికి ప్రూవ్ చేసుకునేందుకు చివరి అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అంటున్నారు. ధవన్ను ఎంపిక చేసుంటే రోహిత్తో పాటు లైఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా వర్కవుట్ అయ్యుండేదని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, ధవన్ భారత్ తరఫున 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలు, 2015 వన్డే వరల్డ్కప్, 2018 ఆసియా కప్లలో భారత లీడింగ్ రన్ స్కోరర్ అని గుర్తు చేస్తున్నారు. వన్డే ఫార్మాట్లో ధవన్ దిగ్గజమని, అతన్ని గౌరవించాల్సిన బాధ్యత సెలెక్టర్లపైన ఉండిందని అంటున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టు టాపార్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు కేవలం ఇద్దరు మాత్రమే (ఇషాన్, తిలక్) ఉన్నారని, యువకులైన వారిద్దరిలో ఒకరి ప్రత్యామ్నాయంగా ధవన్ పేరును పరిశీలించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. సంజూ వర్సెస్ సూర్యకుమార్.. ఆసియా కప్ భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేయడంపై కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. స్కైకి బదులు సంజూ శాంసన్ను 17 మంది సభ్యుల జట్టులోకి ఎంపిక చేసి ఉండాల్సిందని అంటున్నారు. జట్టులో ఇద్దరు వికెట్కీపింగ్ బ్యాటర్లను పెట్టుకుని సంజూని ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపిక చేయడం కేవలం కంటి తుడుపు ఎంపిక మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు. గడిచిన కొన్ని వన్డేల్లో సంజూ ప్రదర్శన స్కైతో పోలిస్తే చాలా రెట్లు మెరుగ్గా ఉందని, సంజూకు వికెట్కీపర్గానూ మంచి రికార్డు ఉంది కాబట్టి, అతన్ని స్కై స్థానంలో ఎంపిక చేసి ఉండాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. సంజూని ఎంపిక చేయడం వల్ల కేఎల్ రాహుల్పై భారం కాస్త తగ్గుతుందని, శాంసన్ ఎలాగూ స్కై లాగే విధ్వంసకర ఆటగాడు కాబట్టి, శాంసన్, రాహుల్లను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. యశస్విని తీసుకుని ఉండాల్సింది.. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల సంఖ్య చాలా తక్కువగా (ఇషాన్, తిలక్) ఉందని, ఇది జట్టు ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఎవరైనా రైట్ హ్యాండ్ బ్యాటర్ స్థానంలో సూపర్ ఫామ్లో యశస్వి జైస్వాల్ను తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. -
అతడేం తప్పు చేశాడు.. రికార్డులు చూడండి! జట్టులో ఉండాల్సింది
వన్డే ప్రపంచకప్కు ముందు టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చేస్తున్న ప్రయోగాలపై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. విండీస్తో రెండో వన్డేలో రోహిత్, విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇచ్చి ప్రయోగాలు చేసిన టీమిండియాకు ఘోర పరాభావం ఎదురైంది. ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత మాజీ సెలెక్టర్ సునీల్ జోషి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. విండీస్తో వన్డే సిరీస్ను సరిగ్గా ఉపయోగించుకోవడంలో భారత జట్టు మెనెజ్మెంట్ విఫలమైందని జోషి అన్నారు. "విండీస్తో వన్డే సిరీస్లో యువ జట్టును ఆడించాలని సెలక్టర్లు భావించరా? అలా అయితే రోహిత్, కోహ్లి వంటి సీనియర్ ప్లేయర్స్ను ఎందుకు ఎంపిక చేశారు. ప్రపంచకప్కు అర్హత సాధించని విండీస్పై సీనియర్ జట్టు ఎందుకు? ఆ విషయం పక్కన పెడితే.. యువ ఆటగాళ్లను పరీక్షించడానికి ఇది సరైన సిరీస్. సెలక్టర్లు తప్పు చేశారు. ఈ సిరీస్ను సెలక్టర్లు సరిగ్గా ఉపయోగించలేకపోయారు. యువ జట్టును విండీస్కు పంపించి రుత్రాజ్ లేదా మరో ఆటగాడని కెప్టెన్గా నియమించాల్సింది. అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని యువ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారో చూడాల్సింది. మరో యంగ్ కెప్టెన్ తయారు చేయడానికి కూడా ఇదే సరైన సమయమని" అయన పేర్కొన్నారు. అదే విధంగా వెటరన్ ఓపెనర్ ధావన్ గురించి జోషి మాట్లాడుతూ.. శిఖర్ ధావన్ను విండీస్తో సిరీస్కు ఎంపిక చేయాల్సింది. వైట్బాల్ క్రికెట్లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ధావన్ భారత్ ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. అతడికి ఐసీసీ టోర్నీల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. నేను జాతీయ సెలక్షన్ కమిటీలో భాగంగా ఉన్న సమయంలో ధావన్ను ఎప్పుడూ బ్యాకప్ ఓపెనర్గా మద్దతు ఇచ్చేవాడని. ఈ క్రమంలో 2021లో శ్రీలంకలో పర్యటనలో భారత జట్టు పగ్గాలు అప్పగించామని" అయన పేర్కొన్నారు. చదవండి: IPL 2024: సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం.. 13 కోట్ల ఆటగాడికి గుడ్బై! అతడికి కూడా -
ఒకప్పుడు జట్టులో చోటే దిక్కు లేదు.. ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్గా!
చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023లో భారత క్రికెట్ జట్లు తొలిసారి పాల్గొనబోతున్నాయి. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల, పురుషుల జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ ఆసియాగేమ్స్లో భారత పురుషల జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ను సారథిగా ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం అనూహ్యంగా యువ ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. దావన్కు కనీసం జట్టులో కూడా చోటు దక్కలేదు. ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించారు. ఆగస్టు 31 నుంచి ఆసియాకప్ జరగనుండడంతో భారత ద్వితీయ శ్రీణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టులో ఐపీఎల్ హీరో రింకూ సింగ్తో పాటు తిలక్ వర్మ, యశస్వీ జైశ్వాల్, ప్రభుసిమ్రాన్కు చోటు దక్కింది. వీరితోపాటు ఆల్రౌండర్ శివమ్ దుబే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఒకప్పుడు జట్టులో చోటుకే దిక్కులేదు.. ఇక ఆసియాకప్లో పాల్గోనే జట్టుకు రుత్రాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా ఎంపిక చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ధావన్ వంటి అనుభవం ఉన్న ఆటగాడని కాదని గైక్వాడ్ను సారధిగా ఎంపిక చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. అయితే దేశవాళీ టోర్నీల్లో మాత్రం మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్గా రుత్రాజ్ వ్యవహరిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో కెప్టెన్గా రుత్రాజ్ విజయవంతం కావడంతో.. భారత జట్టు పగ్గాలను అప్పగించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే రుత్రాజ్ కెప్టెన్గా ఎంపికైనప్పటికి.. భారత్ సీనియర్ జట్టు తరపున ఆడిన అనుభవం మాత్రం పెద్దగా లేదు. అతడు ఇప్పటి వరకు టీమిండియా తరపున 9 టీ20లు, కేవలం ఒక్క వన్డే మాత్రం ఆడాడు. 9 టీ20ల్లో 16.88 సగటుతో 135 పరుగులు చేయగా.. ఏకైక వన్డేలో 19 పరుగులు రుత్రాజ్ సాధించాడు. రుత్రాజ్ చివరగా టీమిండియా తరపున గతేడాది జూన్లో ఆడాడు. అప్పటినుంచి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్-2023లో రుత్రాజ్ అదరగొట్టడంతో విండీస్ టూర్కు సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. విండీస్తో టెస్టు, వన్డే సిరీస్లకు రుత్రాజ్కు భారత జట్టులో చోటు దక్కింది. కానీ విండీస్తో తొలి టెస్టుకు మాత్రం తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. అయితే ఒకప్పుడు జట్టులొ చోటు కోసం అతృతగా ఎదురుచూసిన రుత్రాజ్.. ఇప్పుడు ఏకంగా భారత జట్టును నడిపించే స్థాయికి చేరుకోవడం విశేషం. ఈ ఏడాది ఆసియా గేమ్స్ ఆక్టో 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరుగుతాయి. చదవండి: Rohit Sharma Serious On Ishan Kishan: సింగిల్ తీయడానికి 20 బంతులు.. కిషన్పై రోహిత్ సీరియస్! వీడియో వైరల్ టీమిండియా పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్ , ముఖేష్ కుమార్, శివం మావి, శివం దూబే, ప్రభ్సిమ్రాన్ సింగ్ స్టాండ్బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్ -
Yashasvi Jaiswal: చరిత్రకు మరో 57 పరుగుల దూరంలో
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో యశస్వి జైశ్వాల్ డెబ్యూ సెంచరీతోనే రికార్డులు కొల్లగొట్టాడు. అరంగేట్రం టెస్టులోనే సెంచరీ చేసిన మూడో టీమిండియా ఓపెనర్గా రికార్డులకెక్కిన జైశ్వాల్ 143 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. మరో 45 పరుగులు చేస్తే భారత్ తరపున అరంగేట్రం చేసిన తొలి టెస్టులో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్గా నిలవనున్నాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్(187 పరుగులు) తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ(177 పరుగులు) ఉన్నాడు. ఇక జైశ్వాల్ మరో 57 పరుగులు చేస్తే అరంగేట్రం టెస్టులోనే డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్గా చరిత్రకెక్కే అవకాశముంది. ఇక వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండోరోజు ఆట ముగిసేసరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. చిచ్చరపిడుగు యశస్వి జైశ్వాల్ అరంగేట్రం టెస్టులోనే అదరగొడుతూ అజేయ సెంచరీతో మెరవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా శతకంతో అదరగొట్టాడు. ప్రస్తుతం జైశ్వాల్ (350 బంతుల్లో 143 పరుగులు నాటౌట్), విరాట్ కోహ్లి(96 బంతుల్లో 36 పరుగులు నాటౌట్) క్రీజులో ఉన్నారు. జైశ్వాల్ బద్దలుకొట్టిన రికార్డులివే.. ► టీమిండియా తరపున డెబ్యూ టెస్టులో సెంచరీ బాదిన 17వ ఆటగాడిగా.. మూడో ఓపెనర్గా నిలిచాడు. ఇంతకముందు శిఖర్ ధావన్(2016లో), పృథ్వీ షా(2018లో) ఈ ఘనత సాధించారు. విదేశాల్లో అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్గానూ జైశ్వాల్ చరిత్రకెక్కాడు. ► ఇక విదేశాల్లో అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన ఐదో భారత క్రికెటర్గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు అబ్బాస్ అలీ 1959లో ఇంగ్లండ్ గడ్డపై, 1976లో సురిందర్ అమర్నాథ్ న్యూజిలాండ్పై ఆక్లాండ్ వేదికగా, 1992లో ప్రవీణ్ ఆమ్రే సౌతాఫ్రికాపై డర్బన్ వేదికగా, 1996లో సౌరవ్ గంగూలీ లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్పై, 2001లో సౌతాఫ్రికాపై వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు. ► అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన నాలుగో యంగెస్ట్ భారత క్రికెటర్గా జైశ్వాల్(21 ఏళ్ల 196 రోజులు) నిలిచాడు. ఈ జాబితాలో పృథ్వీ షా, అబ్బాస్ అలీ బేగ్, గుండప్ప విశ్వనాథ్లు ఉన్నారు. ► ఇక 91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ గడ్డపై టీమిండియా తరపున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. यशस्वी भवः 💯 . .#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/59Uq9ik1If — FanCode (@FanCode) July 13, 2023 చదవండి: అరంగేట్రంలోనే రికార్డుల మోత మోగించిన జైశ్వాల్ ఒక్క బౌండరీ.. 'నిన్ను చూస్తే హీరో నాని గుర్తొస్తున్నాడు కోహ్లి' విండీస్ ఆటగాడిపై జైశ్వాల్ దూషణల పర్వం; కోహ్లి సీరియస్ -
రోహిత్ శర్మ ఫెయిల్యూర్ కి కారణం శిఖర్ ధావన్
-
పంజాబ్ కొంపముంచిన ధావన్ చెత్త కెప్టెన్సీ.. అలా చేసి ఉంటే?
ఐపీఎల్-2023లో భాగంగా బుధవారం ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. దీంతో ప్లేఆఫ్స్కు చేరే అవకాశాలను పంజాబ్ సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిలీ రోసో (37 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్లు), పృథ్వీ షా (38 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్), వార్నర్ (31 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్లు) జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించారు. పంజాబ్ బౌలర్లలో సామ్కర్రాన్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. ఆతర్వాత 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేయగల్గింది. పంజాబ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో 48 బంతులు ఎదుర్కొన్న లివింగ్ స్టోన్ 9 సిక్స్లు, 5 ఫోర్లుతో 94 పరుగులు చేశాడు. అతడితో పాటు తైడే 55 పరుగులు చేశాడు. ధావన్ చెత్తకెప్టెన్సీ ఈ మ్యాచ్లో పంజాబ్ సారధి శిఖర్ ధావన్ తన వ్యక్తిగత ప్రదర్శనతో పాటు కెప్టెన్సీ పరంగా దారుణంగా విఫలమయ్యాడు. తమ బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోవడంలోధావన్ తేలిపోయాడు. ముఖ్యంగా క్రీజులో రిలీ రోసో వంటి విధ్వంసకర లెఫ్ట్ఆర్మ్ బ్యాటర్ ఉన్నప్పడు ధావన్ ఆఖరి ఓవర్ వేసేందుకు అర్ష్దీప్ను కాదని స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ను తీసుకువచ్చాడు. ధావన్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్కు గురిచేసింది. ఇదే పంజాబ్ కొంపముంచింది. చివర్ వేసిన బ్రార్ ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. బ్రార్ స్థానంలో అర్ష్దీప్ను తీసుకువచ్చి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదాని పలువరు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇక ధావన్ చెత్త కెప్టెన్సీ వల్లే పంజాబ్ ఓడిపోయింది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో ధావన్ గోల్డన్ డక్గా వెనుదిరిగాడు. చదవండి: #ShikarDhawan: గోల్డెన్ డకౌట్.. ఓపెనర్గా 'గబ్బర్' అత్యంత చెత్త రికార్డు -
అద్బుత విన్యాసం.. వయసుతో పనేంటి!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. 37 ఏళ్ల వయసులోనూ పూర్తిస్థాయి ఫిట్నెస్తో అద్బుత విన్యాసం చేయడం ధావన్కే చెల్లింది. విషయంలోకి వెళితే.. సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ రెండో బంతి వార్నర్ బ్యాట్ ఎడ్జ్ను తాకి గాల్లోకి లేచింది. కవర్స్లో ఉన్న ధావన్ ఎడమవైపుకు పరిగెత్తుకొచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే తొలుత బంతి చేతి నుంచి జారిపోతుందేమో అనిపించింది. కానీ ధావన్ కిందపడినప్పటికి బంతిని ఒడిసి పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Stunning from Shikhar Dhawan 🙌 (via @IPL) #PBKSvDC #IPL2023 pic.twitter.com/px5hB5y1dH — ESPNcricinfo (@ESPNcricinfo) May 17, 2023 చదవండి: #ShikarDhawan: గోల్డెన్ డకౌట్.. ఓపెనర్గా 'గబ్బర్' అత్యంత చెత్త రికార్డు -
గోల్డెన్ డకౌట్.. ఓపెనర్గా 'గబ్బర్' అత్యంత చెత్త రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్, ఓపెనర్ శిఖర్ ధావన్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. మధ్యలో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్నప్పటికి 9 మ్యాచ్లాడి 356 పరుగులు చేయడం విశేషం. ధావన్ ఖాతాలో మూడు ఫిఫ్టీలు ఉన్నాయి. అయితే బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో మాత్రం గబ్బర్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే ధావన్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో ఓపెనర్గా వచ్చి అత్యధికసార్లు డకౌట్ అయిన రెండో బ్యాటర్గా ధావన్ నిలిచాడు. ఇప్పటివరకు ఓపెనర్గా ధావన్(తాజా దానితో కలిపి) పదిసార్లు డకౌట్ కాగా.. తొలి స్థానంలో పార్థివ్ పటేల్ 11 సార్లు ఓపెనర్గా డకౌట్ అయ్యాడు. ధావన్తో కలిసి గౌతమ్ గంభీర్, అజింక్యా రహానేలు కూడా పదిసార్లు డకౌట్ కాగా.. డేవిడ్ వార్నర్ తొమ్మిదిసార్లు డకౌట్గా వెనుదిరిగాడు. -
లివింగ్స్టోన్ మెరుపులు వృథా.. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
లివింగ్స్టోన్ మెరుపులు వృథా.. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. లివింగ్స్టోన్(48 బంతుల్లో 94, 5 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. అథర్వ టైడే 55, ప్రబ్సిమ్రన్ సింగ్ 22 పరుగులు చేశారు. ఆఖర్లో లివింగ్స్టోన్ చెలరేగి ఆడి పంజాబ్ శిబిరంలో ఆశలు రేపినప్పటికి చేయాల్సిన స్కోరు ఎక్కువగ ఉండడంతో ఏం చేయలేకపోయాడు. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్లయింది. టార్గెట్ 214.. పంజాబ్ కింగ్స్ 12 ఓవర్లలో 100/2 12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. అథర్వ టైడే 48, లివింగ్స్టోన్ 27 పరుగులతో ఆడుతున్నారు. ధావన్ గోల్డెన్ డక్.. 6 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 47/1 పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. అథర్వ టైడే 23, ప్రబ్సిమ్రన్ సింగ్ 21 పరుగులతో ఆడుతున్నారు. రొసౌ విధ్వంసం.. ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు, పంజాబ్ టార్గెట్ 214 ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించింది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. రిలీ రొసౌ 37 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 82 నాటౌట్ విధ్వంసం సృష్టించగా.. పృథ్వీ షా 38 బంతుల్లో 54 పరుగులు, డేవిడ్ వార్నర్ 31 బంతుల్లో 46 పరుగులతో రాణించారు. రిలీ రొసౌ హాఫ్ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ 162/2 ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిలీ రొసౌ ఐపీఎల్లో తొలి అర్థశతకం సాధించాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఆరంభం నుంచి దాటిగా ఆడిన రొసౌ 25 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 17 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దంచుతున్న పృథ్వీ షా, రొసౌ.. 14 ఓవర్లలో ఢిల్లీ 138/1 పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతుంది. 14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 138 పరుగులు చేసింది. పృథ్వీ షా 54, రిలీ రొసౌ 36 పరుగులతో దాటిగా ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 46 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ సామ్ కరన్ బౌలింగ్లో శిఖర్ ధావన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఢిల్లీ 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. పృథ్వీ షా 46, రొసౌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 93/0 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 46, పృథ్వీ షా 45 పరుగులతో దాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 61/0 ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. పృథ్వీ షా 35, డేవిడ్ వార్నర్ 34 పరుగులతో ఆడుతున్నారు. 4 ఓవరల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 35/0 4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 25, పృథ్వీ షా 10 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం ధర్మశాల వేదికగా 64వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(కెప్టెన్), అథర్వ టైడే, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కుర్రాన్, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, అర్ష్దీప్ సింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, యష్ ధుల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ Back in Dharamshala after 1️⃣0️⃣ years, #PBKS win the 🪙 & elect to field first! Will the hosts be able to keep their #IPL2023 hopes alive? 👀#IPLonJioCinema #TATAIPL #PBKSvDC #EveryGameMatters | @PunjabKingsIPL @DelhiCapitals pic.twitter.com/Ut2NBzlWsj — JioCinema (@JioCinema) May 17, 2023 ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ రేసు నుంచి వైదలగ్గా.. పంజాబ్ కింగ్స్కు ఈ మ్యాచ్ కీలకం. అయితే మ్యాచ్లో గెలిచినప్పటికి ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
IPL 2023: పంజాబ్ కింగ్స్ ఘన విజయం.. ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్
IPL 2023: Delhi Capitals Vs Punjab Kings Live Updates పంజాబ్ కింగ్స్ ఘన విజయం.. ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్ ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్కు కీలక విజయం దక్కింది. ప్లేఆఫ్ అవకాశాలు ఉండాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్లో పంజాబ్ 31 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 54 మినహా మిగతావారంతా దారుణంగా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ నాలుగు వికెట్లు తీయగా.. నాథన్ ఎల్లిస్, రాహుల్ చహర్లు తలా రెండు వికెట్లు తీశారు. ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ప్రవీణ్ దూబే 15, కుల్దీప్ యాదవ్ ఒక పరుగుతో ఆడుతున్నారు. టార్గెట్ 168.. ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 91/6 టార్గెట్ 168.. ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 86/5 టార్గెట్ 168.. ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 86/4 టార్గెట్ 168.. ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 82/3 టార్గెట్ 168.. ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 80/2 టార్గెట్ 168.. ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 74/2 ప్రబ్సిమ్రన్ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 168 ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ప్రబ్సిమ్రన్ సింగ్ 65 బంతుల్లో 103 పరుగులు సెంచరీతో మెరవగా.. సామ్కరన్ 20 పరుగుల చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్లు తలా ఒక వికెట్ తీశారు. 15 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 117/4 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ప్రబ్సిమ్రన్ సింగ్ 69, హర్ప్రీత్ బ్రార్ క్రీజులో ఉన్నారు. అంతకముందు 20 పరుగులు చేసిన సామ్ కరన్ ప్రవీణ్ దూబే బౌలింగ్లో వెనుదిరిగాడు. 12 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 93/3 12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ప్రబ్సిమ్రన్ సింగ్ 49, సామ్ కరన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లలో పంజాబ్ స్కోరు 46/3 ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. ప్రబ్సిమ్రన్ సింగ్ 21, సామ్ కరన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన ధావన్ ఇషాంత్ శర్మ బౌలింగ్లో రిలీ రొసౌకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. ప్రబ్సిమ్రన్ సింగ్ 5, లివింగ్స్టోన్ నాలుగు పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 16వ సీజన్లో శనివారం ఢిల్లీ వేదికగా 59వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, సికందర్ రజా, షారుక్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ మధ్యలో రెండు విజయాలతో గాడినపడ్డట్లే కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ పరాజయాల బాట పట్టింది.మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయితే ఢిల్లీతో పోలిస్తే పంజాబ్ కింగ్స్ కాస్త నయంగా కనిపిస్తోంది. ఇరుజట్లు గతంలో 30సార్లు తలపడగా.. చెరో 15 మ్యాచ్లు గెలిచాయి. .@DelhiCapitals wins the 🪙 & elects to bowl in the northern derby of #TATAIPL ⚔️ Watch #DCvPBKS LIVE & FREE with #IPLonJioCinema across all telecom operators👈#IPL2023 #EveryGameMatters pic.twitter.com/k4EhNuzB84 — JioCinema (@JioCinema) May 13, 2023 -
అమ్మో మన ధోని, కోహ్లి, రిషభ్ ఇలా ఉంటారా?
-
చాలా బాధగా ఉంది.. కానీ క్రెడిట్ మొత్తం అతడికే: శిఖర్ ధావన్
ఐపీఎల్-2023లో భాగంగా ఈడెన్గార్డన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైంది. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడిన పంజాబ్ కింగ్స్.. చివరి బంతికి ఓటమి చవిచూడల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లిన పేసర్ అర్ష్దీప్ సింగ్పై పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 6 పరుగులు అవసరమవ్వగా.. అర్ష్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు కావల్సిన నేపథ్యంలో రింకూ సింగ్ ఫోర్ కోట్టి పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. "ఈ మ్యాచ్లో ఓటమి చవిచూసినందుకు చాలా బాధగా ఉంది. ఈడెన్ వికెట్పై బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ కేకేఆర్ మా కంటే బాగా ఆడారు. అయితే అర్ష్దీప్ సింగ్ మాత్రం అద్భుతమైన ప్రయత్నం చేశాడు. మ్యాచ్ను ఆఖరి బంతివరకు తీసుకువెళ్లాడు. కాబట్టి మేము ఓడిపోయినా క్రెడిట్ మాత్రం అర్ష్దీప్కు ఇవ్వాలని అనుకుంటున్నాను. లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లను అడ్డుకునేందుకు మా జట్టులో మంచి హాఫ్ స్పిన్నర్లలు లేరు" అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. చదవండి: KKR VS PBKS: విజయానందంలో ఉన్న నితీశ్ రాణాకు భారీ షాక్ -
ముంబై ప్రతీకారం.. పంజాబ్ కింగ్స్పై ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 215 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఏడు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇషాన్ కిషన్ 75, సూర్యకుమార్ 66 పరుగులతో ముంబై ఇండియన్స్ను పటిష్ట స్థితిలో నిలపగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్(10 బంతుల్లో 19 నాటౌట్), తిలక్ వర్మ(10 బంతుల్లో 26 నాటౌట్) ముంబైని విజయతీరాలకు చేర్చారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్, రిషి ధవన్ చెరొక వికెట్ తీశారు. ఈ విజయంతో ముంబై సీజన్ ఆరంభంలో పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ► ఇషాన్ కిషన్ 75 పరుగులు చేసి అర్ష్దీప్ బౌలింగ్లో రిషి ధావన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 178 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. స్కై సంచలన ఇన్నింగ్స్కు తెర.. మూడో వికెట్ డౌన్ 31 బంతుల్లో 66 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ ఇన్నింగ్స్కు తెరపడింది. నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో సూర్య అర్ష్దీప్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. కాగా మూడో వికెట్కు ఇషాన్ కిషన్, సూర్యకుమార్లు 116 పరుగులు జోడించారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 75, టిమ్ డేవిడ్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. సూర్య, ఇషాన్లు అర్థసెంచరీలు.. విజయం దిశగా ముంబై సూర్యకుమార్, ఇషాన్ కిషన్లు ధాటిగా ఆడుతుండడంతో ముంబై లక్ష్యచేధనలో దూసుకెళ్తుంది. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సూర్యకుమార్ 52, ఇషాన్ కిషన్ 57 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 215.. 9 ఓవర్లలో ముంబై 80/2 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 30, సూర్యకుమార్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website ముంబై బౌలర్లు విఫలం.. పంజాబ్ 20 ఓవర్లలో 214/3 ముంబై బౌలర్ల వైఫల్యంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లయామ్ లివింగ్స్టోన్ (42 బంతుల్లో 82 పరుగులు నాటౌట్, ఏడు ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసానికి తోడు జితేశ్ శర్మ(27 బంతుల్లో 49 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. శిఖర్ ధావన్ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. Photo Credit : IPL Website దంచికొడుతున్న లివింగ్స్టోన్.. 16 ఓవర్లలో 152/3 పంజాబ్ కింగ్స్ బ్యాటర్ లివింగ్స్టోన్ తొలిసారి తన విధ్వంసం ప్రదర్శిస్తున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లివింగ్స్టోన్ 49, జితేశ్ శర్మ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 13 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 120/2 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. లివింగ్స్టోన్ 28, జితేశ్ శర్మ 15 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website శిఖర్ ధావన్(30) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కెప్టెన్ శిఖర్ ధావన్(30 పరుగులు) పియూష్ చావ్లా బౌలింగ్లో స్టంప్ ఔట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్.. 9 పరుగులు చేసిన ప్రబ్సిమ్రన్ సింగ్ అర్షద్ ఖాన్ బౌలింగ్ ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 17/1గా ఉంది. Photo Credit : IPL Website టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం మొహలీ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, అర్షద్ ఖాన్ పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ గత మ్యాచ్లో టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్తో మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కిన ముంబై అదే కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు బలమైన సీఎస్కేను ఓడించి పంజాబ్ కింగ్స్ కూడా మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. గతంలో ఇరుజట్ల మధ్య 30 సార్ల తలపడగా.. చెరో 15 మ్యాచ్లు గెలిచాయి. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్నే విజయం వరించింది. -
56 పరుగుల తేడాతో లక్నో సూపర్జెయింట్స్ ఘన విజయం
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 56 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 258 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయింది. అథర్వ తైదే 33 బంతుల్లో 66 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిగతావారిలో సికందర్ రజా 36, జితేశ్ శర్మ 24 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో యష్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్ మూడు, రవి బిష్ణోయ్ రెండు, స్టోయినిస్ ఒక వికెట్ పడగొట్టాడు. 16 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 166/5 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. సామ్ కరన్ 15, జితేశ్ శర్మ 11 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 23 పరుగులు చేసిన లివింగ్స్టోన్ రవిబిష్ణోయి బౌలింగ్లో వెనుదిరిగాడు. టార్గెట్ 258.. నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ 258 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. అథర్వ టైడే(33 బంతుల్లో 66 పరుగులు) రవి బిష్ణోయి బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 6 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 55/2 6 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. అథర్వటైడ్ 32, సికిందర్ రజా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. టార్గెట్ 258.. 3 ఓవర్లలో పంజాబ్ స్కోరెంతంటే? 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ ఒక్క పరుగు మాత్రమే చేసి స్టోయినిస్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు.. పంజాబ్ టార్గెట్ 258 ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లను చీల్చిచెండాడిన లక్నో నిర్ణీత 20 ఓవర్ల ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్ చేసిన స్కోరు రెండో అత్యధిక కావడం విశేషం. ఇంతకముందు ఆర్సీబీ 263 పరుగుల స్కోరుతో టాప్లో ఉంది. లక్నో బ్యాటర్లలో స్టోయినిస్ 40 బంతుల్లో 72, కైల్ మేయర్స్ 24 బంతుల్లో 54, నికోలస్ పూరన్ 19 బంతుల్లో 45, ఆయుష్ బదోని 24 బంతుల్లో 43 పరుగులతో విధ్వంసం సృష్టించారు. పంజాబ్ బౌలర్లలో అందరు బారీగా పరుగులిచ్చుకోగా.. రబాడ ఒక్కడే 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్, సామ్ కరన్, లివింగ్స్టోన్ తలా ఒక వికెట్ తీశారు. లక్నో బ్యాటర్ల దెబ్బకు ధావన్ మ్యాచ్లో ఏడుగురితో బౌలింగ్ చేయించడం గమనార్హం. స్టోయినిస్ ఫిఫ్టీ.. లక్నో 17 ఓవర్లలో 216/3 మార్కస్ స్టోయినిస్ అర్థసెంచరీతో చెలరేగాడు. అతనికి తోడు పూరన్ కూడా చెలరేగుతుండడంతో లక్నో 200 మార్క్ను అందుకుంది. ప్రస్తుతం 17 ఓవరల్లో మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. స్టోయినిస్ 61, పూరన్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారీ స్కోరు దిశగా లక్నో.. 13 ఓవర్లలోనే 156/2 పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతుంది. 13 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. స్టోయినిస్ 26 బంతుల్లో 47 పరుగులు, ఆయుష్ బదోని 22 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లలో లక్నో 111/2 9 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. బదోని 23, స్టోయినిస్ 16 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 24 బంతుల్లో 54 పరుగులు చేసిన కైల్ మేయర్స్ రబాడ బౌలింగ్లో ధావన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్(12)ఔట్.. తొలి వికెట్ డౌన్ 12 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ రబాడ బౌలింగ్లో షారుక్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. మేయర్స్ 27, ఆయుష్ బదోని 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3 ఓవర్లలో లక్నో 35/0 మూడు ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ 27, కేఎల్ రాహుల్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 16వ సీజన్లో మొహలీ వేదికగా 38వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, యశ్ ఠాకూర్ పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అథర్వ తైదే, శిఖర్ ధావన్(కెప్టెన్), సికందర్ రజా, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్ Shikhar Dhawan wins the toss on his return & the @PunjabKingsIPL skipper opts to BOWL FIRST at 🏠 Watch #PBKSvLSG, LIVE & FREE on #JioCinema on any sim card.#TATAIPL #IPL2023 #IPLonJioCinema pic.twitter.com/07IfTUciIi — JioCinema (@JioCinema) April 28, 2023 మూడు మ్యాచ్లకు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి రావడం పంజాబ్కు బలమని చెప్పొచ్చు. ఇక లక్నో ఆఖరి ఓవర్లో గుజరాత్ టైటన్స్ చేతిలో కంగుతిని ఓటమిపాలైంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ బలమైన ముంబై ఇండియన్స్ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచుల్లో ఇరుజట్లు నాలుగు విజయాలు సాధించాయి. లక్నో ఆటగాళ్లు కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, స్టోయినిస్ నిలకడగా రాణిస్తున్నారు. ఇక పంజాబ్ ఓపెనర్ ప్రబ్సిమ్రాన్ సింగ్, సామ్ కరన్, అర్ష్దీప్ సింగ్ సూపర్ ఫామ్లో ఉన్నారు. దాంతో, ఈమ్యాచ్లో ఎవరు పై చేయి సాధిస్తారో మరికొన్నిగంటల్లో తెలియనుంది. -
150 పరుగులకే పంజాబ్ ఆలౌట్.. ఆర్సీబీ ఘన విజయం
150 పరుగులకే పంజాబ్ ఆలౌట్.. ఆర్సీబీ ఘన విజయం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. ప్రబ్సిమ్రన్ సింగ్ 46, జితేశ్ శర్మ 41 మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హసరంగా రెండు వికెట్లు, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్లు చెరొక వికెట్ తీశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్ 147 పరుగుల వద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో హర్ప్రీత్ బ్రార్ క్లీన్ బౌల్డయ్యాడు. ఓటమి దిశగా పయనిస్తున్న పంజాబ్.. ఏడో వికెట్ డౌన్ 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఓటమి దిశగా పయనిస్తుంది. హసరంగ బౌలింగ్లో షారుఖ్ ఖాన్ (7) స్టంపౌటయ్యాడు. 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్ పంజాబ్ రనౌట్ రూపంలో మరో వికెట్ కోల్పోయింది. హసరంగ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో సామ్ కర్రన్ (10) ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. సిరాజ్ సూపర్ త్రో.. నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి జోరుమీదున్న సిరాజ్, మరో అద్భుతమైన డైరెక్ట్ త్రోతో హర్ప్రీత్ సింగ్ (13) పెవిలియన్కు పంపాడు. 6 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 49/4. సామ్ కర్రన్, ప్రభ్సిమ్రన్ (21) క్రీజ్లో ఉన్నారు. నిప్పులు చెరుగుతున్న సిరాజ్.. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతున్నాడు. తన స్పెల్లో వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. తొలుత రివ్యూవి వెళ్లే అథర్వ వికెట్ (ఎల్బీ)ను దక్కించుకున్న సిరాజ్.. ఆతర్వాత 4వ ఓవర్లో కూడా రివ్యూకి వెళ్లి లివింగ్స్టోన్ను ఔట్ (ఎల్బీ) చేశాడు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ 175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ మూడో ఓవర్ తొలి బంతికి రెండో వికెట్ కోల్పోయింది. హసరంగ బౌలింగ్లో మాథ్యూ షార్ట్ (8) క్లీన్ బౌల్డయ్యాడు. టార్గెట్ 175.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ 175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ రెండో బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో అథర్వ టైడే (4) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రాణించిన డుప్లెసిస్, కోహ్లి.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..? టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. వరుస బంతుల్లో కోహ్లి (59), మ్యాక్స్వెల్ (0) ఔట్ కావడం.. స్కోర్ వేగం పెంచే క్రమంలో డుప్లెసిస్ (84) కూడా పెవిలియన్కు చేరడం.. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (7), మహిపాల్ (7 నాటౌట్), షాబాజ్ అహ్మద్ (5 నాటౌట్) చెత్తగా బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 174 పరుగుల స్కోర్కే పరిమితమైంది. హర్ప్రీత్ బ్రార్ 2, అర్షదీప్, ఇల్లిస్ తలో వికెట్ పడగొట్టారు. డుప్లెసిస్ (84) ఔట్ ఇల్లిస్ బౌలింగ్లో సిక్స్ బాదిన మరుసటి బంతికే డుప్లెసిస్ (84) ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 154/3. లోమ్రార్, కార్తీక్ (3) క్రీజ్లో ఉన్నారు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లి, మ్యాక్స్వెల్ ఔట్ ఆర్సీబీకి వరుస షాక్లు తగిలాయి. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో వరుస బంతుల్లో విరాట్ కోహ్లి (59), మ్యాక్స్వెల్ (0) ఔటయ్యారు. 17 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 145/2. డుప్లెసిస్ (78), దినేశ్ కార్తీక్ (1) క్రీజ్లో ఉన్నారు. కోహ్లి హాఫ్ సెంచరీ.. 14 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..? 40 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 118/0. కోహ్లికు జతగా డుప్లెసిస్ (65) క్రీజ్లో ఉన్నాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన డుప్లెసిస్ ఆర్సీబీ ఓపెనర్ డుప్లెసిస్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్లో డుప్లెసిస్కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ. ఓవరాల్గా 29వ ఐపీఎల్ ఫిఫ్టి. 11 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 98/0. డుప్లెసిస్కు జతగా కోహ్లి (39) క్రీజ్లో ఉన్నాడు. ధాటిగా ఆడుతున్న డుప్లెసిస్, కోహ్లి ఆర్సీబీ ఓపెనర్లు డుప్లెసిస్ (27), విరాట్ కోహ్లి (29) ధాటిగా ఆడుతున్నారు. వీరి ధాటికి ఆర్సీబీ 5.1 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు దాటింది. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 59/0గా ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. పంజాబ్ కింగ్స్: అథర్వ టైడే, మాథ్యూ షార్ట్, లివింగ్స్టోన్, హర్ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, నాథన్ ఇల్లీస్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్ ఆర్సీబీ: డుప్లెసిస్, విరాట్ కోహ్లి (కెప్టెన్), మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, పార్నెల్, సుయాష్ ప్రభుదేశాయ్, సిరాజ్ -
మొదట ముద్దుపెట్టాడు.. ఔటైతే సంబరపడ్డాడు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు మొదలైంది. అయితే టాస్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హార్ధిక్ పాండ్యాకు.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. తాజాగా పంజాబ్, గుజరాత్ మ్యాచ్ సందర్భంగా ఇద్దరు ప్రత్యర్థులుగా తలపడ్డారు. టాస్ వేయడానికి ముందు ఇద్దరు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో గబ్బర్ను హగ్ చేసుకున్న పాండ్యా అతని చెంపపై ముద్దుపెట్టడం అభిమానులకు ఆనందం కలిగించింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఇదే పాండ్యా ధావన్ ఔటైనప్పుడు తెగ సంబరపడిపోయాడు. ఇందుకు ఒక కారణం ఉంది. ధావన్ ఈ సీజన్లో భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. 8 పరుగులకే వెనుదిరగడంతో పాండ్యాకు ఎక్కడిలేని సంతోషం కలిగింది. అందుకే ధావన్వైపు చూస్తూ రెండు చేతులను పైకి లేపి సాధించాం అన్నట్లుగా గట్టిగా అరిచాడు. ఇది చూసిన అభిమానులు.. ''ఏంటో ఈ పాండ్యా సిత్రాలు.. మొదట ముద్దుపెట్టాడు.. ఔటైతే సంబరపడ్డాడు.'' అంటూ కామెంట్ చేశారు. Hardik Pandya with Shikhar Dhawan. What a lovely picture! pic.twitter.com/eb1jcVBTjb — Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2023: పంజాబ్పై గుజరాత్ టైటాన్స్ విజయం
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ను చేధించింది. శుబ్మన్ గిల్(49 బంతుల్లో 67, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో గిల్ ఔటైన తర్వాత కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికి రాహుల్ తెవాటియా బౌండరీ బాది జట్టును గెలిపించాడు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్, అర్ష్దీప్, హర్ప్రీత్ బార్, రబాడలు తలా ఒక వికెట్ తీశారు. 16 ఓవర్లలో గుజరాత్ 120/3 16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. గిల్ 52, మిల్లర్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు పాండ్యా 8, సాయి సుదర్శన్ 19 పరుగులు చేసి వెనుదిరిగారు. 11 ఓవర్లలో గుజరాత్ 88/1 11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. గిల్ 38, సాయి సుదర్శన్ 19 పరుగులతో ఆడుతున్నారు. 6 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 54/1 6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. గిల్ 20 పరుగులు, సాయి సుదర్శన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా సాహా 19 బంతుల్లో 30 పరుగులు చేసి రబాడ బౌలింగ్లో షార్ట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo Credit : IPL Website గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 154 గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో పెద్దగా ఎవరు రాణించలేదు. మాథ్యూ షార్ట్ 36 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. షారుక్ ఖాన్ 9 బంతుల్లో 22 పరుగులు చేశాడు. జితేశ్ శర్మ 25, సామ్ కరాన్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో జితేశ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. షమీ, జాషువా లిటిల్, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్లు తలా ఒక వికెట్ తీశారు. Photo Credit : IPL Website 16 ఓవర్లలో పంజాబ్ 109/4 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. రాజపక్స 19 పరుగులు, సామ్ కరన్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website ఆరు ఓవర్లలో పంజాబ్ 53/2 ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ 35, బానుక రాజపక్స 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 8 పరుగులు చేసిన ధావన్ జోషువా లిటిల్ బౌలింగ్లో అల్జారీ జోసెఫ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo Credit : IPL Website 3 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 27/1 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ 18, శిఖర్ ధావణ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు మహ్మద్ షమీ బౌలింగ్లో ప్రబ్సిమ్రన్ సింగ్ డకౌట్ అయ్యాడు. Photo Credit : IPL Website టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం 18వ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రిషి ధావన్, అర్ష్దీప్ సింగ్ గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్ 𝙎𝙖𝙙𝙙𝙖 𝙠𝙞 𝙝𝙖𝙖𝙡? Hardik Pandya wins the toss at Mohali 📍 the Titans will field first!#TATAIPL #IPLonJioCinema #PBKSvGT pic.twitter.com/RRQnHnRvby — JioCinema (@JioCinema) April 13, 2023 వరుసగా రెండు విజయాలతో సత్తా చాటిన ఈ రెండు జట్లకు మూడో మ్యాచ్లో షాక్ తగిలింది. ఉత్కంఠ పోరులో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో గుజరాత్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. యశ్ దయాల్ వేసిన 20వ ఓవర్ చివరి ఐదు బంతుల్లో రింకూ సింగ్ ఐదు సిక్స్లు బాదడంతో కేకేఆర్ సంచలన విజయం సాధించింది. సొంత గడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ అర్ధ శతకంతో (99 నాటౌట్) చెలరేగాడు. మూడు మ్యాచ్లకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ లియం లివింగ్స్టోన్ రాకతో పంజాబ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఈ ఆసక్తికర పోరులో విజయం ఎవరిని వరిస్తుంది అనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది. ఇరుజట్ల మధ్య గతంలో రెండు మ్యాచ్లు జరగ్గా పంజాబ్, గుజరాత్లు చెరొక మ్యాచ్ను గెలుచుకున్నాయి. -
హర్షా భోగ్లేకి ధావన్ సూపర్ పంచ్..
-
#KavyaMaran: 'చల్ హట్ రే'.. నీకు నేనే దొరికానా!
ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు ఆటగాళ్ల కంటే ఒకరిమీదే కెమెరాలు ఎక్కువ ఫోకస్గా ఉంటాయి. ఈ పాటికే మీకు అర్థమైంది అనుకుంటా ఎవరనేది. అవునండీ ఆమె కావ్యా మారన్. ప్రతీ సీజన్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు ఎక్కడ జరిగినా అక్కడ టక్కున వాలిపోయి వారిని ఉత్సాహపరుస్తుంది. జట్టు ఓడిపోతే తాను బాధపడుతుంది.. గెలిస్తే ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటుంది. అలాంటి కావ్యా మారన్కు ఇవాళ పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా ఒక కెమెరామన్ కోపం తెప్పించాడు. ఆ కోపానికి వేరే కారణం ఉంది లెండి. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో 88 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ వంద పరుగులు కూడా చేయదని కావ్యా మారన్ తెగ సంతోషపడింది. కానీ కాసేపటికే సీన్ రివర్స్ అయింది. ధావన్ తన క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకుంటుడడంతో కావ్యా మారన్కు ఫ్రస్టేషన్ పీక్స్కు చేరింది. ఇదే సమయంలో ఆమె స్టాండ్స్లో కూర్చొని సీరియస్గా మ్యాచ్ చూస్తున్న సమయంలో ఒక కెమెరామెన్ ఆమె వైపు కెమెరా తిప్పాడు. అది గమనించిన కావ్యా మారన్.. నీకు నేనే దొరికానా అన్నట్లుగా కోపంతో'' చల్ ..హట్ రే '' అని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 99 పరుగులతో అసమాన ఆటతీరు ప్రదర్శించి పంజాబ్కు 143 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. Baby #kavyamaran 😂 To cameraman Hat rey 😹😹#SRHvPBKS pic.twitter.com/duImSUu5OZ — चयन चौधरी (@Chayanchaudhary) April 9, 2023 -
'థాంక్స్ హైదరాబాద్'.. కోహ్లి రికార్డు బద్దలు
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ హైదరాబాద్ అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. ఆదివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి ఆఖరి వరకు నిలిచి 66 బంతుల్లో 99 పరుగులు చేసిన ధావన్ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒంటరిపోరాటం చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఈ క్రమంలో ఒక్క పరుగు దూరంలో సెంచరీ మార్క్కు దూరమైనప్పటికి కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా 88 పరుగుల వద్ద పంజాబ్ తొమ్మిదో వికెట్ కోల్పోయాకా ధావన్.. ఆఖరి నెంబర్ బ్యాటర్తో కలిసి పదో వికెట్కు 55 పరుగులు అజేయంగా జోడించి చరిత్ర సృష్టించాడు. ఇక ఎస్ఆర్హెచ్పై 99 పరుగుల ఇన్నింగ్స్తో ధావన్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన టీమిండియా ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లి ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు 50 సార్లు చేయగా.. తాజాగా ధావన్ కోహ్లి రికార్డును బద్దలుకొట్టి 51వ ఫిఫ్టీ ప్లస్ స్కోరు సాధించాడు. కాగా కోహ్లి 50- ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేయడానికి 216 ఇన్నింగ్స్లు తీసుకోగా.. ధావన్ మాత్రం 206 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇక తొలి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ ఇప్పటివరకు ఐపీఎల్లో 60 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. ఇక తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం ధావన్ మాట్లాడుతూ.. ''హైదరాబాద్ ప్రజలు నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ అనుకుంటున్నా. ఒకవైపు వికెట్లు పడుతుండడంతో ఒకదశలో ఒత్తిడి అనిపించింది. కానీ ఏమైనా సరే చివరి వరకు నిలబడాలనుకున్నా.. అందుకే వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడాను. సెంచరీ మార్క్ మిస్ అవడం కంటే ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడానన్న సంతోషం ఎక్కువగా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. Shikhar Dhawan said, "I'm glad that the Hyderabad crowd still remembers me". — Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2023 -
Shikar Dhawan: టి20 కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్; పలు రికార్డులు బద్దలు
టీమిండియా గబ్బర్.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తన టి20 కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి ఆఖరి వరకు నిలిచి 66 బంతుల్లో 99 పరుగులు చేసిన ధావన్ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీ మార్క్ను అందుకోలేకపోయాడు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఇక 88 పరుగుల వద్ద పంజాబ్ తొమ్మిదో వికెట్ కోల్పోయిన తర్వాత ఆఖరి బ్యాట్స్మన్తో కలిసి ధావన్ 55 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ► ఐపీఎల్లో 99 పరుగులతో నాటౌట్గా నిలిచిన బ్యాటర్ల జాబితాలో ధావన్ చోటు సంపాదించాడు. ఇంతకముందు సురేశ్రైనా (2013లో ఎస్ఆర్హెచ్పై), క్రిస్ గేల్(2019లో ఆర్సీబీపై), మయాంక్ అగర్వాల్(2021లో ఢిల్లీ క్యాపిటల్స్పై) ఉండగా.. తాజాగా శిఖర్ ధావన్ వీరి సరసన చేరాడు. ► ఇక టి20 క్రికెట్లో పదో వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జంటగా ధావన్-మోహిత్ రాతే జోడి ఐదో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో గ్రాంట్ ఇలియట్, జుల్ఫికర్ బాబర్ జోడి 63 పరుగులు(పీఎస్ఎల్ 2016, క్వెటా గ్లాడియేటర్స్ వర్సెస్ పెషావర్ జాల్మీ) ఉన్నారు. 62* - కేబీ అహిర్ & ఎన్ అహిర్, పనామా v అర్జెంటీనా, నార్త్ సౌండ్, 2021 61* - DJ వోరాల్ & DR బ్రిగ్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ vs హోబర్ట్ హరికేన్స్, హోబర్ట్, 2020 59 - స్ట్రీక్ & జేయి ఎవరైనా, వార్విక్షైర్ vs వోర్సెస్టర్షైర్, బర్మింగ్హామ్, 2005 55* - ఆర్ ఫ్రైలింక్ & పి సుబ్రాయెన్, డాల్ఫిన్స్ vs లాహోర్ లయన్స్, బెంగళూరు, 2014 ► ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి ఆఖరి వరకు నిల్చొని పదో నెంబర్ బ్యాటర్ వరకు అందరితో కలిసి ఆడిన రెండో ఆటగాడిగా ధావన్ అరుదైన రికార్డు సాధించాడు. ఇంతకముందు పార్థివ్ పటేల్ మాత్రమే 2019లో సీఎస్కే తరపున ఈ ఫీట్ సాధించాడు. Ek aur 𝐬𝐡𝐢𝐤𝐡𝐚𝐫 ki ore badhte hue 𝐆𝐚𝐛𝐛𝐚𝐫 💪 Shikhar Dhawan's 50 makes him the 🔝scoring batter of #TATAIPL2023 🙌 Keep watching #SRHvPBKS - LIVE & FREE on #JioCinema across all telecom operators 👈#IPLonJioCinema #IPL2023 #TATAIPL pic.twitter.com/kXyy1jPpMb — JioCinema (@JioCinema) April 9, 2023 -
IPL 2023 SRH Vs PBKS: ‘విన్’రైజర్స్...
Sunrisers Hyderabad vs Punjab Kings- సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్లో రెండు వరుస ఓటముల తర్వాత సన్రైజర్స్ చెలరేగింది. హైదరాబాద్ జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో కీలక విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (66 బంతుల్లో 99 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్స్లు) త్రుటిలో సెంచరీకి దూరమయ్యాడు. మయాంక్ మర్కండే (4/15) కింగ్స్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం సన్రైజర్స్ 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ త్రిపాఠి (48 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు), కెపె్టన్ మార్క్రమ్ (21 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు మూడో వికెట్కు 52 బంతుల్లోనే 100 పరుగులు జోడించారు. శిఖర్ మినహా... ఒక ఎండ్లో ధావన్ పట్టుదలగా చివరి వరకు నిలబడగా, మరో ఎండ్ నుంచి కనీసం సహకారం లేకపోవడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికి ప్రభ్సిమ్రన్ (0)ను అవుట్ చేసి భువనేశ్వర్ మొదటి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత జాన్సెన్ తన వరుస ఓవర్లలో మాథ్యూ షార్ట్ (1), జితేశ్ శర్మ (4)లను అవుట్ చేయడంతో జట్టు 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. స్యామ్ కరన్ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) కొద్దిసేపు ధావన్కు అండగా నిలిచాడు. అయితే ఆ తర్వాత పంజాబ్ టపటపా వికెట్లు కోల్పోయింది. 35 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 6 వికెట్లు చేజార్చుకుంది. దాంతో స్కోరు 88/9 వద్ద నిలిచింది. పంజాబ్ 100 పరుగులు చేయడం కూడా సందేహంగానే అనిపించింది. అయితే ఈ దశలో ధావన్ తను అనుభవాన్నంతా రంగరించి బాధ్యతను తీసుకున్నాడు. ఈ సమయంలో ధావన్ 47 పరుగుల వద్ద (38 బంతుల్లో) ఉన్నాడు. ఆపై చెలరేగిపోయిన అతను తర్వాతి 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో మరో 52 పరుగులు సాధించడం విశేషం. చివరి వికెట్కు ధావన్, మోహిత్ రాఠీ 55 పరుగులు జోడించగా, అందులో 52 ధావనే చేశాడు. భారీ భాగస్వామ్యం... ఛేదనలో రైజర్స్కు పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. ఓపెనర్లు బ్రూక్ (13), మయాంక్ అగర్వాల్ (21) ఫర్వాలేదనిపించడంతో పవర్ప్లేలో స్కోరు 34 పరుగులకు చేరింది. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా... త్రిపాఠి, మార్క్రమ్ కలిసి సునాయాసంగా జట్టును విజయం దిశగా నడిపించారు. పంజాబ్ బౌలర్లు ఎంతగా శ్రమించినా ఈ జోడీని ఇబ్బంది పెట్టలేకపోయారు. వరుస ఫోర్లతో దూకుడు ప్రదర్శించిన త్రిపాఠి 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎలిస్ ఓవర్లో మార్క్రమ్ నాలుగు ఫోర్లు కొట్టడంతో హైదరాబాద్ గెలుపు ఖాయమైంది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రన్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 0; ధావన్ (నాటౌట్) 99; షార్ట్ (ఎల్బీ) (బి) జాన్సెన్ 1; జితేశ్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 4; కరన్ (సి) భువనేశ్వర్ (బి) మర్కండే 22; రజా (సి) మయాంక్ (బి) ఉమ్రాన్ 5; షారుఖ్ (ఎల్బీ) (బి) మర్కండే 4; హర్ప్రీత్ (బి) ఉమ్రాన్ 1; చహర్ (ఎల్బీ) (బి) మర్కండే 0; ఎలిస్ (బి) మర్కండే 0; రాఠీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు 143). వికెట్ల పతనం: 1–0, 2–10, 3–22, 4–63, 5–69, 6–74, 7–77, 8–78, 9–88. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–1, జాన్సెన్ 3–1–16–2, నటరాజన్ 4–0–40–0, సుందర్ 1–0–6–0, మర్కండే 4–0–15–4, ఉమ్రాన్ 4–0–32–2. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (బి) అర్ష్ దీప్ 13; మయాంక్ (సి) కరన్ (బి) చహర్ 21; త్రిపాఠి (నాటౌట్) 74; మార్క్రమ్ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 0; మొత్తం (17.1 ఓవర్లలో 2 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–27, 2–45. బౌలింగ్: స్యామ్ కరన్ 3–0–14–0, అర్ష్ దీప్ 3–0–20–1, హర్ప్రీత్ 3.1–0–26–0, ఎలిస్ 3–0–28–0, రాహుల్ చహర్ 3–0–28–1, రాఠీ 2–0–29–0. 𝗪𝗛𝗔𝗧 𝗔 𝗪𝗜𝗡!👌 👌 1⃣st victory of the #TATAIPL 2023 for @SunRisers as they beat #PBKS by 8⃣ wickets in Hyderabad 👏 👏 Scorecard 👉 https://t.co/Di3djWhVcZ #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/DoAFIkaMgb — IndianPremierLeague (@IPL) April 9, 2023 -
ధావన్ విషయంలో బీసీసీఐ పై హర్భజన్ ఫైర్
-
David Warner: అత్యంత వేగంగా.. కోహ్లి, ధావన్ల రికార్డు బద్దలు
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ ఐపీఎల్లో 6వేల పరుగులు మార్క్ను అందుకున్నాడు. 165 ఇన్నింగ్స్లోనే వార్నర్ ఈ ఫీట్ను సాధించడం విశేషం. ఈ నేపథ్యంలోనే కోహ్లి, ధావన్ల రికార్డును బద్దలు కొట్టి ఐపీఎల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో ఆరువేల పరుగుల మార్క్ను అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదే ఆరువేల పరుగుల మార్క్ అందుకోవడానికి కోహ్లి 188 ఇన్నింగ్స్లు తీసుకుంటే.. శిఖర్ ధావన్ 199 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. కానీ వార్నర్కు మాత్రం 165 ఇన్నింగ్స్లు మాత్రమే అవసరమయ్యాయి. ఇక ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో వార్నర్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో కోహ్లి 6727 పరుగులు(225 మ్యాచ్లు), శిఖర్ ధావన్ 6370 పరుగులు(208 మ్యాచ్లు) రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఐపీఎల్లో 4వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లలో వార్నర్ బ్యాటింగ్ యావరేజ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. వార్నర్ సగటు 42.28 కాగా.. స్ట్రైక్ రేట్ 140.08గా ఉంది. ఇక స్ట్రైక్రేట్ విషయంలో ఏబీ డివిలియర్స్(151.68), క్రిస్ గేల్(148.96) తర్వాత వార్నర్కు మాత్రమే 140 స్ట్రైక్రేట్ కలిగి ఉన్నాడు. 6️⃣0️⃣0️⃣0️⃣ runs & counting in #TATAIPL for the #DC skipper #TATAIPL #IPL2023 | @delhicapitals @davidwarner31 pic.twitter.com/m7aM1GFGwe — JioCinema (@JioCinema) April 8, 2023 6000 runs for David Warner in IPL. One of the GOAT in this league. pic.twitter.com/UqtPFcsPA0 — Johns. (@CricCrazyJohns) April 8, 2023 David Warner - the IPL GOAT. pic.twitter.com/1yEHi9lCUZ — Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2023 చదవండి: సంజూ స్టన్నింగ్ క్యాచ్.. పృథ్వీ షా చెత్త రికార్డు -
రోహిత్, కోహ్లి, రాహుల్కే ఛాన్స్లు ఇస్తారా.. అతడు ఏం పాపం చేశాడు మరి?
టీమిండియా వెటరన్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఐపీఎల్-2023లో దుమ్మురేపుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన గబ్బర్.. అనంతరం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో 56 బంతులు ఎదుర్కొన్న ధావన్ 9 ఫోర్లు, మూడు సిక్స్ల సాయంతో 86 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఐపీఎల్లో అదరగొడుతున్న ధావన్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హర్భజన్ సింగ్ కీలక వాఖ్యలు చేశాడు. ధావన్ను వన్డే జట్టు నుంచి ఎందుకు తప్పించారో కారణం చెప్పాలని భారత సెలక్టర్లను భజ్జీ ప్రశ్నించాడు. కాగా ధావన్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 2018 నుంచి టెస్ట్లకు, 2021 నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న గబ్బర్.. గతేడాది స్వదేశంలో వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో జరిగిన వన్డే సిరీస్ల్లో టీమిండియాకు సారధ్యం వహించాడు. ఆ మూడు సిరీస్ల్లో గబ్బర్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో సెలక్టర్లు అతడని పక్కన పెట్టి, యువ ఓపెనర్ శుబ్మన్ గిల్కు అవకాశం ఇచ్చారు. ఇదే విషయంపై భజ్జీ హిందుస్థాన్ టైమ్స్తో మాట్లాడుతూ.."ధావన్ చాలా సిరీస్లలో టీమిండియా కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ సిరీస్లో సారథిగా ధావన్ విజయవంతమయ్యాడు. అయితే ధావన్ కెప్టెన్సీ పాత్ర ముగిశాక.. ఇకపై అతడు అవసరం లేనట్లుగా జట్టు నుంచి పక్కన పెట్టడం మనం చూశాం. ఇది నన్ను చాలా బాధించింది. ఎందుకంటే అందరి ఆటగాళ్ల విషయంలోను సెలక్టర్లు ఒకే తీరు కనబరిచాలి. ధావన్ ఒక అద్భుతమైన ఆటగాడు. అతడు భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.అటువంటి వ్యక్తి పట్ల సెలక్టర్లు వ్యవహరించిన తీరు సరికాదు. ధావన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు చాలా మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యారు. అయినప్పటికీ వారికి చాలా అవకాశాలు ఇచ్చారు. కానీ ధావన్ ఒక్కడి విషయంలో పక్షపాతం ఎందుకు. ధావన్కు పూర్తిగా భారత జట్టులోనే చోటు లేదు. అతడు ఎప్పుడూ తన వంతు సహకారం జట్టుకు అందించడానికే ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రాజస్తాన్ మ్యాచ్లో 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ కూడా ఆడాడు. అటువంటి ధావన్కు భారత జట్టులో చోటు ఇవ్వడానికి ఏంటి సమస్య? ఫిట్నెస్ పరంగా గబ్బర్ కూడా కోహ్లిలా 100 శాతం ఫిట్గా ఉన్నాడని" పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు.. కార్తీక్కే చుక్కలు! ఎవరీ సుయాష్ శర్మ? -
అశ్విన్ ఔట్.. తొడ గొట్టిన గబ్బర్; కావాలనే చేశాడా!
ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ జోరుమీద ఉంది. రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో పంజాబ్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 198 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్తాన్ చేధనలో తడబడుతుంది. ఇప్పటికే ప్రధానమైన నాలుగు వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ కష్టాల్లో పడింది. ఈ విషయం పక్కనబెడితే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్లోనూ మెరిశాడు. ఓపెనర్గా ప్రమోషన్ పొందిన అశ్విన్ అర్ష్దీప్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి ధావన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అశ్విన్ ఔట్ కాగానే గబ్బర్ ప్రేక్షకుల వైపు తిరిగి తొడ గొట్టి మీసం మెలేశాడు. ఇంతకముందు చాలాసార్లు అంతర్జాతీయం సహా ఐపీఎల్ మ్యాచ్ల్లో ధావన్ ఇలా తొడ గొట్టడం చూశాం. అయితే మళ్లీ చాన్నాళ్ల తర్వాత తనదైన సెలబ్రేషన్తో మెరిశాడు. అశ్విన్ ఔట్ కాగానే ధావన్ తొడ గొట్టడంతో ఇదంతా కావాలనే చేశాడని అభిమానులు పేర్కొన్నారు. ఎందుకంటే పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో అశ్విన్ ధావన్ను మన్కడింగ్ చేయబోయాడు. కానీ అలా చేయకుండా కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాడు. అయితే ధావన్ అది మనసులో పెట్టుకున్నాడని.. అందుకే అశ్విన్ ఔట్ కాగానే తొడగొట్టాడంటూ కామెంట్ చేశారు. Ash warning Gabbar and Jos going "I've seen this movie before" in his head - it's all happening at Barsapara 😅 Stream #RRvPBKS LIVE & FREE NOW with #IPLonJioCinema - across all telecom operators 📲#TATAIPL #IPL2023 | @ashwinravi99 @josbuttler pic.twitter.com/M5dChwgARd — JioCinema (@JioCinema) April 5, 2023 చదవండి: ధావన్కు అశ్విన్ వార్నింగ్.. వీడియో వైరల్ -
ఐపీఎల్లో ధావన్ చరిత్ర.. భారత్ తరపున తొలి క్రికెటర్గా
టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ధావన్ సూపర్ ఇన్నింగ్స్తో మెరిశాడు. ఇన్నింగ్స్ ఆఖరి వరకు నిలిచిన గబ్బర్ 56 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 86 నాటౌట్ వింటేజ్ ధావన్ను తలపించాడు. తొలుత ప్రబ్సిమ్రన్ సింగ్ రెచ్చిపోతుంటే తాను యాంకర్పాత్ర పోషించాడు. Photo: IPL Website ప్రబ్సిమ్రన్ ఔటైన తర్వాత ధావన్ తన ఆట మొదలుపెట్టాడు. చహల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ నాలుగో బంతిని బౌండరీ బాదడం ద్వారా ధావన్ అర్థసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో ధావన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో ధావన్కు ఇది 48వ అర్థసెంచరీ కాగా ఓవరాల్గా అతనికి ఇది 50వ 50ప్లస్ స్కోరు కావడం విశేషం. ఐపీఎల్లో డేవిడ్ వార్నర్(54 అర్థసెంచరీలు) తర్వాత అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా.. టీమిండియా తరపున తొలి బ్యాటర్గా ధావన్ నిలిచాడు. ఇక కింగ్ కోహ్లి 45 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్పై ధావన్కు ఇది ఏడో హాఫ్ సెంచరీ. Photo: IPL Website అయితే సీఎస్కేపై ధావన్ ఎనిమిది అర్థసెంచరీలు సాధించాడు. ఆ తర్వాత తాను ప్రస్తుతం ఆడుతున్న పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్పై ఏడు అర్థసెంచరీలు, ముంబై, కేకేఆర్, ఆర్సీబీలపై ఆరు అర్థసెంచరీలు సాధించాడు. ఇక రాజస్తాన్ రాయల్స్పై ధావన్ 22 మ్యాచ్ల్లో 126 స్ట్రైక్రేట్తో 576 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్లో 85 పరుగుల ఇన్నింగ్స్ ధావన్కు అత్యధిక స్కోరుగా ఉంది. చదవండి: ధావన్కు అశ్విన్ వార్నింగ్.. వీడియో వైరల్ ధావన్ దెబ్బకు రిటైర్డ్హర్ట్.. ఐపీఎల్కు దూరమయ్యే చాన్స్! That's that from Match 8. @PunjabKingsIPL win their second game on the trot as they beat #RR by 5 runs. Scorecard - https://t.co/Cmk3rElYKu #TATAIPL #RRvPBKS #IPL2023 pic.twitter.com/R9j1jFpt5C — IndianPremierLeague (@IPL) April 5, 2023 -
ధావన్కు అశ్విన్ వార్నింగ్.. వీడియో వైరల్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ను రాజస్తాన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హెచ్చరించాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో నాలుగో బంతిని విడవడానికి ముందే ధావన్ క్రీజు దాటాడు. ఇది గమనించిన అశ్విన్ బంతిని వేయడం ఆపేసి మన్కడింగ్ చేయడానికి ప్రయత్నించాడు. Photo: Jio Cinema Twitter కానీ బంతిని బెయిల్స్కు తగిలించకుండా ధావన్కు వార్నింగ్తోనే సరిపెట్టాడు. ఆ సమయంలో ధావన్ పూర్తిగా క్రీజు బయట ఉన్నాడు. కానీ అశ్విన్ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. అయితే వెంటనే వెనక్కి వచ్చిన ధావన్ అశ్విన్ను చూస్తూ చేసేయాల్సింది అన్న తరహాలో చిన్న స్మైల్ ఇచ్చాడు. ఇదే సమయంలో కెమెరా జాస్ బట్లర్వైపు తిరగడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కెమెరా బట్లర్వైపు ఎందుకు తిరిగిందో కూడా మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇదే ఐపీఎల్లో అశ్విన్ పంజాబ్కు ఆడుతున్న సమయంలో బట్లర్ను మన్కడింగ్ చేసి పెవిలియన్ చేర్చాడు. ఒకరకంగా అశ్విన్ మన్కడింగ్ను మరోసారి తెరపైకి తెచ్చిన క్రికెటర్గా నిలిచాడు. అయితే అశ్విన్ చర్యను కొందరు తప్పుబడితే మరికొందరు సమర్థించారు. కొన్నాళ్ల పాటు మన్కడింగ్పై చర్చ జరిగింది. అయితే ఇటీవలే మన్కడింగ్ను రనౌట్గా మారుస్తూ ఐసీసీ చట్టబద్దం చేసింది. Ash warning Gabbar and Jos going "I've seen this movie before" in his head - it's all happening at Barsapara 😅 Stream #RRvPBKS LIVE & FREE NOW with #IPLonJioCinema - across all telecom operators 📲#TATAIPL #IPL2023 | @ashwinravi99 @josbuttler pic.twitter.com/M5dChwgARd — JioCinema (@JioCinema) April 5, 2023 చదవండి: ధావన్ దెబ్బకు రాజపక్స రిటైర్డ్హర్ట్.. ఐపీఎల్కు దూరమయ్యే చాన్స్! -
ధావన్ దెబ్బకు రిటైర్డ్హర్ట్.. ఐపీఎల్కు దూరమయ్యే చాన్స్!
రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విధ్వంసక ఆటగాడు బానుక రాజపక్స్ రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. అశ్విన్ బౌలింగ్లో కెప్టెన్ శిఖర్ ధావన్ కొట్టిన స్ట్రెయిట్ షాట్ రాజపక్స మోచేతికి బలంగా తాకింది. దీంతో నొప్పితో రాజపక్స విలవిల్లాడిపోయాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతికి ఇది చోటుచేసుకుంది. ఫిజియో వచ్చి రాజపక్సను పరిశీలించగా.. చేయి వాచిపోయింది. దీంతో బ్యాట్ పట్టుకోవడం కష్టమవడంతో రాజపక్స రిటైర్డ్హర్ట్గా వెనుదిరగాల్సి వచ్చింది. బంతి చేతికి బలంగా తాకడంతో గాయం తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ముందుగా రాజపక్సకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. రిపోర్ట్లో పాజిటివ్ వస్తే రాజపక్స ఐపీఎల్కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే పంజాబ్కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. అంతకముందు ప్రబ్సిమ్రన్ సింగ్ 34 బంతుల్లోనే 60 పరుగులు సాధించి పంజాబ్ను పటిష్ట స్థితిలో నిలిపాడు. రాజస్తాన్ బౌలర్లను చీల్చి చెండాడిన ప్రబ్సిమ్రన్ మైదానం నలువైపులా షాట్లు ఆడి తన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. కాగా ప్రబ్సిమ్రన్కు ఐపీఎల్లో ఇదే తొలి అర్థశతకం కావడం విశేషం. Shikhar Dhawan's shot straight went to hit Bhanuka Rajapaksa on his forearm on the right hand. Not a great sign for Punjab Kings. 📸: Jio Cinema#CricTracker #RRvPBKS #BhanukaRajapaksa pic.twitter.com/gpDxOMj3vl — CricTracker (@Cricketracker) April 5, 2023 చదవండి: రాజస్తాన్ బౌలర్లను ఉతికారేశాడు.. ఎవరీ ప్రబ్సిమ్రన్ సింగ్ -
పంజాబ్ కింగ్స్కు రెండో విజయం.. పోరాడి ఓడిన రాజస్తాన్
పంజాబ్ కింగ్స్కు రెండో విజయం.. పోరాడి ఓడిన రాజస్తాన్ 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఐదు పరుగుల తేడాతో పోరాడి ఓడిపోయింది. ఆరంభం నుంచి వికెట్లు కోల్పోయినప్పటికి సంజూ శాంసన్ 42 పరుగులు చేశాడు. ఆ తర్వాత షిమ్రోన్ హెట్మైర్ (18 బంతుల్లో 36), ద్రువ్ జురెల్(15 బంతుల్లో 32 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడడంతో ఒక దశలో రాజస్తాన్ గెలుస్తుందని భావించారు. అయితే హెట్మైర్ రనౌట్తో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆఖరి రెండు బంతుల్లో 11 పరుగులు కావాల్సిన దశలో ఆరు పరుగులు మాత్రమే వచ్చాయి. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. 15 ఓవర్లలో రాజస్తాన్ 124/6 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరగడంతో రాజస్తాన్ ఓటమి నుంచి బయటపడడం కష్టమే. నాథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లతో రాజస్తాన్ వెన్ను విరిచాడు. 9 ఓవర్లలో రాజస్తాన్ 81/3 9 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 35, దేవదత్ పడిక్కల్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. విధ్వంసక బట్లర్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తోంది. నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో ఇన్ఫాం బ్యాటర్ బట్లర్ అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. శాంసన్ 25 పరుగులతో ఆడుతున్నాడు. Photo Credit : IPL Website ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ భారీ స్కోరు; రాజస్తాన్ టార్గెట్ 198 రాజస్తాన్ రాయల్స్కు పంజాబ్ కింగ్స్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శిఖర్ ధావన్(56 బంతుల్లో 86 నాటౌట్, 9 ఫోర్లు, మూడు సిక్సర్లు) వింటేజ్ గబ్బర్ను చూపించగా.. ప్రబ్సిమ్రన్ సింగ్(34 బంతుల్లో 60 పరుగులు) రాణించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. జితేశ్ శర్మ 27 పరుగులు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో హోల్డర్ రెండు వికెట్లు తీయగా.. అశ్విన్, చహల్ చెరొక వికెట్ పడగొట్టారు. Photo Credit : IPL Website ధావన్ అర్థసెంచరీ.. భారీ స్కోరు దిశగా పంజాబ్ పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఐపీఎల్ 50వ అర్థశతకం సాధించాడు. అతని ధాటికి పంజాబ్ స్కోరు పరుగులు పెడుతుంది. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. జితేశ్ శర్మ 27 పరుగులు చేసి చహల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. Photo Credit : IPL Website ప్రబ్సిమ్రన్(60) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ 60 పరుగులు చేసిన ప్రబ్సిమ్రన్ వెనుదిరగడంతో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 34 బంతుల్లోనే 60 పరుగులతో ధాటిగా ఆడుతున్న ప్రబ్సిమ్రన్ జాసన్ హోల్డర్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. ధావన్ 26, రాజపక్స్ 1 పరుగుతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website దాటిగా ఆడుతున్న ప్రబ్సిమ్రన్.. 4 ఓవర్లలో 45/0 రాజస్తాన్తో మ్యాచ్ను పంజాబ్ కింగ్స్ ధాటిగా ఆరంభించింది. 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రబ్సిమ్రన్ సింగ్ 30 పరుగులతో వేగంగా ఆడుతున్నాడు. ధావన్ 13 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. Photo Credit : IPL Website టాస్ గెలిచి ఫీల్డింగ్ ఏంచుకున్న రాజస్తాన్ మూడేండ్ల (2020లో చివరి మ్యాచ్) తర్వాత ఐపీఎల్ కు ఆతిథ్యమిస్తున్న అసోం లోని గువహతి స్టేడియంలో నేడు రాజస్తాన్ రాయల్స్ - పంజాబ్ కింగ్స్ లు ఈ సీజన్ లో తొలిసారి తలపడుతున్నాయి. గువహతిలోని బర్సపర స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, KM ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్ .@IamSanjuSamson wins the toss & @rajasthanroyals will field first in the first ever #TATAIPL match at the Barsapara 🏟️ Tune in to #IPLonJioCinema NOW to watch #RRvPBKS - streaming LIVE and FREE for all telecom operators! #IPL2023 #TATAIPL #JioCinema | @PunjabKingsIPL pic.twitter.com/RMtDInT0iD — JioCinema (@JioCinema) April 5, 2023 గత మ్యాచ్లో హైదరాబాద్ ను చిత్తుగా ఓడించిన రాజస్తాన్ రాయల్స్ అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నది. ఆ జట్టు నిండా మ్యాచ్ విన్నర్లకు కొదవ లేదు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో కళ్లు చెదిరే ఆరంభం ఇచ్చిన జోస్ బట్లర్ - యశస్వి జైస్వాల్ లు మరోసారి అలాంటి ప్రారంభాన్ని ఇవ్వాలని రాజస్తాన్ కోరుకుంటున్నది. వన్ డౌన్ లో సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ లతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగా ఉంది. బౌలింగ్ లో కూడా ట్రెంట్ బౌల్ట్ నాయకత్వంలో పేస్ బాధ్యతలు పంచుకుంటున్న కెఎం ఆసిఫ్ సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ఆకట్టుకున్నాడు. స్పిన్నర్లలో అశ్విన్, చహల్ రూపంలో రాజస్తాన్ కు ప్రపంచ స్థాయి బౌలింగ్ యూనిట్ ఉంది. పంజాబ్ కూడా బ్యాటింగ్ లో శిఖర్ ధావన్, భానుక రాజపక్స వంటి అనుభవజ్ఞులతో పాటు ఏ స్థానంలో వచ్చినా రెచ్చిపోయే ఆడే జితేశ్ శర్మ, సామ్ కరన్, సికిందర్ రజలతో బ్యాటింగ్ లైనప్ బాగానే ఉంది. కోల్కతా తో మ్యాచ్ లో ఆడింది తక్కువ బంతులే అయినా ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ ఆకట్టుకున్నాడు. ఇక బౌలింగ్ లో అర్ష్దీప్ సింగ్, సామ్ కరన్, నాథన్ ఎల్లీస్ లపైనే పంజాబ్ ఆశలు పెట్టుకుంది. -
అరుదైన రికార్డు.. కోహ్లిని సమం చేసిన గబ్బర్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్తో మ్యాచ్లో శిఖర్ ధావన్ తన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. పెద్దగా మెరుపులు లేకపోయినప్పటికి 40 పరుగులతో ధావన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ 191 పరుగుల భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. బానుక రాజపక్సతో కలిసి రెండో వికెట్కు 86 పరుగులు జోడించాడు. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ తన పేరిట అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు 50 ప్లస్ భాగస్వామ్యాలు సాధించిన క్రికెటర్గా ధావన్ నిలిచాడు. ఐపీఎల్లో ధావన్కు ఇది 94వ అర్థశతక భాగస్వామ్యం కావడం విశేషం. ఈ విషయంలో కోహ్లి రికార్డును సమం చేశాడు. ఆర్సీబీ తరపున కోహ్లి కూడా 94 అర్థశతక భాగస్వామ్యాలు అందించాడు. ఇక అత్యధిక 50 ప్లస్ భాగస్వామ్యాలతో ఈ ఇద్దరు తొలి రెండు స్థానాల్లో ఉండగా.. మూడో స్థానంలో సురేశ్ రైనా(83 అర్థశతక భాగస్వామ్యాలు), డేవిడ్ వార్నర్ 82 50ప్లస్ భాగస్వామ్యాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక 29 బంతుల్లో 40 పరుగులు చేసిన ధావన్ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు ఉన్నాయి. చదవండి: ఎందరు వచ్చినా ధోనికే సాధ్యమైన వేళ.. సీఎస్కే తరపున -
'వయసుతో పాటు మతిమరుపు'
టీమిండియా సీనియర్ ఆటగాడు.. ముద్దుగా గబ్బర్ అని పిలుచుకునే శిఖర్ ధావన్ పేలవ ఫామ్తో జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రారంభమైన ఐపీఎల్ 16వ సీజన్ ద్వారా తిరిగి ఫామ్లోకి వచ్చి టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శిఖర్ ధావన్ పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. శనివారం పంజాబ్ కింగ్స్ కేకేఆర్తో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ అనంతరం జట్టులో ఎవరు ఉన్నారనే దానిపై కెప్టెన్ మాట్లాడడం ఆనవాయితీ. మురళీ కార్తిక్ ధావన్ను తుది జట్టు గురించి అడిగాడు. ధావన్ తుదిజట్టు గురించి మాట్లాడుతూ విదేశీ ఆటగాళ్ల పేర్లు చెబుతున్న సమయంలో ముగ్గురి పేర్లు మాత్రమే చెప్పాడు. బానుక రాజపక్స, నాథన్ ఎల్లిస్, సామ్ కరన్ ఇంకా.. అంటూ ఆగిపోయాడు. ఆ తర్వాత..'' నాలుగో ఆటగాడి పేరు మరిచిపోయా.. క్షమించండి'' అని పేర్కొన్నాడు. దీంతో అక్కడ నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఇంతకు ధావన్ మరిచిపోయిన నాలుగో విదేశీ క్రికెటర్ ఎవరో తెలుసా.. జింబాబ్వే సంచలనం సికందర్ రజా. అయితే ధావన్ చర్యను క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.. 37 ఏళ్లు వచ్చాయి.. వయసు పెరుగుతోంది.. అందుకే మతిమరుపు కూడా అంటూ కామెంట్ చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ను ధాటిగానే ఆరంభించింది. 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టానికి 100 పరుగులు దాటింది. రాజపక్స అర్థసెంచరీతో దాటిగా ఆడుతుండగా.. ధావన్ అతనికి సహకరిస్తున్నాడు. .@KKRiders call it right with the 🪙! Who are you backing in #PBKSvKKR?#IPLonJioCinema is streaming LIVE & FREE across all telecom operators #IPL2023 #TATAIPL pic.twitter.com/xavY31Af5V — JioCinema (@JioCinema) April 1, 2023 చదవండి: 16 కోట్లు! ఇంతకీ ఏం చేశాడు? దండుగ అంటూ ట్రోల్స్! కానీ.. -
డక్వర్త్ లూయిస్ పద్దతిలో కేకేఆర్పై పంజాబ్ కింగ్స్ విజయం
PBKS Vs KKR Playing XI Updates And Highlights: కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ వర్షం పడే సమయానికి 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతి అమలు చేశారు. ఈ లెక్కన కేకేఆర్ ఏడు పరుగులు వెనుకబడి ఉంది. దీంతో పంజాబ్ మ్యాచ్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బానుక రాజపక్స 50 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. శిఖర్ ధావన్ 40 రాణించాడు. చివర్లో సామ్ కరన్ 17 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 26 నాటౌట్, షారుక్ ఖాన్ ఏడు బంతుల్లో 11 పరుగులు నాటౌట్ దాటిగా ఆడారు. కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్లు తలా క వికెట్ తీశారు. మ్యాచ్కు వర్షం అంతరాయం మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ప్రస్తుతం కేకేఆర్ 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం కేకేఆర్ ఏడు పరుగులు వెనుకబడి ఉంది. ఒకవేళ మ్యాచ్ జరగకపోతే పంజాబ్దే విజయం ఎదురీదుతున్న కేకేఆర్.. ► 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్ను రసెల్, వెంకటేశ్ అయ్యర్లు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ ఐదు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 32, రసెల్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. కేకేఆర్ విజయానికి 36 బంతుల్లో 74 పరుగులు కావాలి. 80 పరుగులకే ఐదు వికెట్లు ► పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కేకేఆర్ ఓటమి దిశగా పయనిస్తోంది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 4 పరుగులు చేసిన రింకూ సింగ్ రాహుల్ చహర్ బౌలింగ్లో సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వెంకటేశ్ అయ్యర్ 21 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 29కే మూడు వికెట్లు.. కష్టాల్లో కేకేఆర్ ► 192 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కేకేఆర్ కష్టాల్లో పడింది. 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం కేకేఆర్ ఆరు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. నితీష్ రాణా 7 పరుగులు, వెంకటేశ్ అయ్యర్ 10 పరుగులు క్రీజులో ఉన్నారు. కేకేఆర్ టార్గెట్ 192 ► కేకేఆర్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బానుక రాజపక్స 50 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. శిఖర్ ధావన్ 40 రాణించాడు. చివర్లో సామ్ కరన్ 17 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 26 నాటౌట్, షారుక్ ఖాన్ ఏడు బంతుల్లో 11 పరుగులు నాటౌట్ దాటిగా ఆడారు. కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్లు తలా క వికెట్ తీశారు. Photo Credit : IPL Website 16 ఓవర్లలో పంజాబ్ 153/4 ► కేకేఆర్తో మ్యాచ్లో పంజాబ్ ధాటిగా ఆడుతుంది. 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సికందర్ రజా 13, సామ్ కరన్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు రాజపక్స 50, ధావన్ 40 పరుగులతో రాణించారు. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ ► కేకేఆర్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జితేశ్(21) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు రాజపక్స 50 పరుగులు చేసిన వెంటనే ఔటయ్యాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది, ధావన్ 40, సికందర్ రజా ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 10 ఓవర్లలోనే వంద మార్క్ దాటిన పంజాబ్ ►కేకేఆర్తో మ్యాచ్లో పంజాబ్ ధాటిగా ఆడుతుంది. 10 ఓవర్లలోనే జట్టు స్కోరు వికెట్ నష్టానికి వంద పరుగుల మార్క్ దాటింది. రాజపక్స 46 పరుగులు, ధావన్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website ధాటిగా ఆడుతున్న రాజపక్స.. ఏడు ఓవర్లలో పంజాబ్ 69/1 ► ఏడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. బానుక రాజపక్స 18 బంతుల్లో 31 పరుగులతో ధాటిగా ఆడుతుండగా.. శిఖర్ ధావన్ 15 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ ►టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్.. సౌథీ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 23/1 ఐపీఎల్-2023లో మరో ఆసక్తికర పోరుకు సమయం అసన్నమైంది. మొహాలీ వేదికగా రెండో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా తొలిసారి కేకేఆర్కు నితీష్ రాణా సారథ్యం వహిస్తుండగా.. శిఖర్ ధావన్కు పంజాబ్ కెప్టెన్సీ ఇదే మొదటి సారి. తుది జట్లు కోల్కతా నైట్ రైడర్స్: మన్దీప్ సింగ్, రహమానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, అర్ష్దీప్ సింగ్, రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రార్ చదవండి: IPL 2023: ప్లీజ్.. అతడిని తప్పించండి! ఒక్కడి వల్ల ఇన్ని అనర్థాలు! ఆ ‘మహానుభావుడేమో’.. -
'ప్రేమించండి.. పెళ్లి మాత్రం చేసుకోకండి'
టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ టీమిండియా ఓపెనర్గా శిఖర్ ధావన్ ఒక దశాబ్దం పాటు వెలుగొందాడు. వయసు పెరగడంతో పాటు ఫామ్ కోల్పోవడంతో క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనప్పటికి ఇప్పుడున్న పోటీలో ధావన్ మళ్లీ జట్టులో రావడం అసాధ్యమే. ఇక వ్యక్తిగత జీవితంలో తనకంటే పదేళ్ల పెద్దదైన అయేషా ముఖర్జీని 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అయేషాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2014లో ఈ దంపతులకు జొరావర్ పుట్టాడు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం అనంతరం సెప్టెంబర్ 2021లో ఈ ఇద్దరు విడిపోయారు. అప్పటినుంచి తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా మాట్లాడని గబ్బర్ తొలిసారి తాను, అయేషా విడిపోడంపై స్పందించాడు. ''పెళ్లి అనే పరీక్షలో నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే అది ఓ ఒక్క వ్యక్తి చేతుల్లో ఉండదు, రెండు వ్యక్తులు కలిసి రాయాల్సిన పరీక్ష. తను తప్పు చేసిందని అనను.. అలాగని నాది తప్పని ఒప్పుకోను. నాకు పెళ్లి అనే ఫీల్డ్ కొత్త. సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో తెలీదు. నేను 20 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా కాబట్టి ఆ ఆట గురించి నాకు తెలుసు. ఆట గురించి చెప్పమంటే అనర్గళంగా చెబుతా... అది అనుభవంతో వచ్చింది. విడాకుల గురించి చెప్పాలంటే ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఒకవేళ భవిష్యత్తులో నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, చాలా ఎక్కువ జాగ్రత్త పడతాను. ఎలాంటి అమ్మాయి కావాలనే విషయంలో బుర్ర బద్ధలు కొట్టుకున్నా పర్లేదు, తొందర మాత్రం పడను. నేను 26-27 ఏళ్ల వరకూ ఒంటరిగా ఉన్నా. ఎలాంటి రిలేషన్లోనూ లేను. బయటికి వెళ్లేవాడిని, స్నేహితులతో తిరిగేవాడిని. ఫుల్లుగా ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఎవ్వరితో రిలేషన్ మాత్రం పెట్టుకోలేదు. అయితే నేను ప్రేమలో పడిన తర్వాత నాకు అన్నీ మధురంగానే కనిపించాయి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నవ్వుతూ చేసుకుంటూ పోయా. కానీ కళ్లకు అలుముకున్న ప్రేమ తెర తొలిగిపోతే అన్నీ ఇబ్బందిగానే అనిపిస్తాయి. కుర్రాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. రిలేషన్లో ఉంటే, అన్నింటినీ అనుభవించండి. కోపాలు, తాపాలు, బాధలు, బ్రేకప్స్ కూడా. అంతేకానీ ఎమోషనల్ అయిపోయి, పెళ్లి మాత్రం చేసుకోకండి. కొన్నేళ్ల పాటు కలిసి ఉండి, తన గురించి నీకు, నీ గురించి తనకు తెలిసిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి. ఇది కూడా క్రికెట్ మ్యాచ్ లాంటిదే. కొందరికి సెటిల్ అవ్వడానికి నాలుగు ఐదు మ్యాచుల సమయం పడుతుంది. మరికొందరికి ఒక్క మ్యాచ్లోనే దొరకవచ్చు, ఇంకొందరికి ఇంకా ఎక్కువ సమయమే పట్టొచ్చు.. అయితే పెళ్లికి ముందు కాస్త అనుభవం మాత్రం చాలా ముఖ్యం.'' అని పేర్కొన్నాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ధావన్ టీమిండియా తరపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టి20 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ 2023 సీజన్లో పంజాబ్ కింగ్స్కి కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు శిఖర్ ధావన్. టీమిండియాలో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2023 సీజన్లో అదరగొట్టి తన ప్లేస్ని తిరిగి సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు. Ek hi to Dil hai kitni baar jeetoge Shikhar Dhawan 😭❤️ pic.twitter.com/VfZ4P3FPZi — Professor ngl राजा बाबू 🥳🌈 (@GaurangBhardwa1) March 26, 2023 చదవండి: 'ఓపెనర్గా నాకంటే శుబ్మన్ గిల్ బెటర్' చెత్త రికార్డు సమం చేసిన డికాక్ -
'ఓపెనర్గా నాకంటే శుబ్మన్ గిల్ బెటర్'
టీమిండియా ఓపెనర్గా శిఖర్ ధావన్ ఒక దశాబ్దం పాటు వెలుగొందాడు. వయసు పెరగడంతో పాటు ఫామ్ కోల్పోవడంతో క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనప్పటికి ఇప్పుడున్న పోటీలో ధావన్ మళ్లీ జట్టులో రావడం అసాధ్యమే. అయితే ధావన్ జట్టుకు దూరమైన తర్వాత ఓపెనింగ్ విషయంలో టీమిండియా సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ శుబ్మన్ గిల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో ఓపెనింగ్ కొరత కనిపిస్తుంది.. రోహిత్కు సరైన జోడి లేదు.. ఒకవేళ ఆ స్థానంలో శిఖర్ ధావన్, శుబ్మన్ గిల్లో ఒకరికి చోటు ఇవ్వాల్సి వస్తే ఎవరు బెస్ట్ అనుకుంటున్నారని ధావన్ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై స్పందించిన ధావన్.. తన పేరు చెప్పకుండా ఆ స్థానానికి శుభ్మన్ గిల్ బెటర్ అని చెప్పాడు. తాను సెలెక్టర్ ప్లేస్లో ఉంటే శుభ్మన్గిల్ను ఓపెనర్గా ఎంపిక చేస్తానన్నాడు. టెస్ట్లతో పాటు టి20ల్లో గిల్ చక్కగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. కానీ అతడికి సరైన అవకాశాలు రావడం లేదని తెలిపాడు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో తగినన్ని అవకాశాలు లభిస్తే ఆటగాడిగా శుభ్మన్ మరింత రాటుదేలుతాడని శిఖర్ ధావన్ అన్నాడు. ఓపెనర్గా తనకంటే శుభ్మన్ బెస్ట్గా భావిస్తోన్నట్లు పేర్కొన్నాడు. జట్టుకు దూరమయ్యాననే బాధ తనలో లేదని పేర్కొన్నాడు. కాగా గిల్పై ధావన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ధావన్ టీమిండియా తరపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టి20 మ్యాచ్లు ఆడాడు. Ek hi to Dil hai kitni baar jeetoge Shikhar Dhawan 😭❤️ pic.twitter.com/VfZ4P3FPZi — Professor ngl राजा बाबू 🥳🌈 (@GaurangBhardwa1) March 26, 2023 చదవండి: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి ఆర్సీబీ గుండె బద్దలయ్యే వార్త.. గాయాల కారణంగా ఇద్దరు స్టార్లు ఔట్..! -
హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్.. సెలబ్రిటీల సందడి
సాక్షి, హైదరాబాద్: నగరం వేదికగా జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా- ఈ రేస్ ఛాంపియన్షిప్లో శనివారం పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. ఫార్ములా వన్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ఫార్ములా-ఈ కావడంతో భాగ్యనగరం పూర్తి సందడిగా మారింది. హీరో రామ్చరణ్తో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్, స్పిన్నర్ యజ్వేంద్ర చహల్, దీపక్ చహర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా రేసును వీక్షించడానికి వచ్చాడు. ప్రధాన రేసుకు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ రేసులను తిలకించిన క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు. నెక్లెస్ రోడ్డులో రయ్యుమని దూసుకెళ్తున్న రేసింగ్ కార్లను చూస్తుంటే ముచ్చటేస్తుందని క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేసు ప్రారంభమైంది. మొత్తం 2.8 కిమీ స్ట్రీట్ సర్క్యూట్లో 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 రేసర్లు పోటీల్లో పాల్గొంటున్నారు. ఫార్ములా-ఈలో ప్రస్తుతం 9వ సీజన్ నడుస్తోంది. ఇందులో ఇప్పటికే మూడు రేస్లు పూర్తయ్యాయి. మెక్సికో సిటీ మొదటి రేస్కు ఆతిథ్యం ఇవ్వగా, సౌదీ అరేబియాలోని దిరియాలో తర్వాతి రెండు రేస్లు జరిగాయి. హైదరాబాద్లో జరగబోతోంది ఈ సీజన్లో నాలుగో రేస్. ప్రస్తుతం మూడు రేస్ల తర్వాత మొత్తం 76 పాయింట్లతో ఆండ్రెటీ టీమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పోర్‡్ష (74) రెండో స్థానంలో ఉంది. Master Blaster #SachinTendulkar at #HyderabadEPrix venue pic.twitter.com/EpqSOt1xML — Sarita Avula (@SaritaTNews) February 11, 2023 He was there for the inaugural Formula 1 race 12 years ago. He is here for the first Formula E race in India @sachin_rt pic.twitter.com/ygDYTNpwuT — Bharat Sharma (@sharmabharat45) February 11, 2023 -
మూడేళ్ల క్రితమే పంత్ను హెచ్చరించిన ధావన్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం అభిమానులను ఆందోళన పరిచింది. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్లోని రూర్కీ సమీపంలో పంత్ కారు ప్రమాదానికి గురయ్యింది. ఢిల్లీవైపు నుంచి వేగంగా వచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టి 200 మీటర్ల దూరం దూసుకెళ్లింది. ఆపై కారుకు మంటలు అంటుకోవడం.. పంత్ కారు నుంచి బయటపడడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బీసీసీఐ తమ ప్రకటనలో తెలిపింది. గాయాల తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికి పంత్ కోలుకుంటాడని పేర్కొంది. ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితమే క్రికెటర్ శిఖర్ ధావన్.. పంత్ను డ్రైవింగ్ విషయంలో హెచ్చరించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్గా మారింది. ఐపీఎల్ 2019 సమయంలో పంత్, ధావన్లు ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరు సరదాగా ఒకరినొకరు ఇంటర్య్వూ చేసుకున్నారు. ఆ సమయంలో తనకంటే సీనియర్ అయిన ధావన్ను.. భయ్యా ఒక సీనియర్గా నువ్వు నాకు ఏమి అడ్వైజ్ ఇస్తావు అని అడిగాడు. దీనికి బదులుగా ధావన్.. ''డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించు'' అని పేర్కొన్నాడు. తాజాగా పంత్ కారు ప్రమాదం బారిన పడడంతో ధావన్-పంత్ల పాత వీడియో మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. Shikhar Dhawan gave Rishabh Pant right advice about driving. pic.twitter.com/XxFRE5K74j — Ami ✨ (@kohlifanAmi) December 30, 2022 చదవండి: పంత్ను కాపాడిన బస్ డ్రైవర్ ఆసక్తికర వ్యాఖ్యలు రిషభ్ పంత్కు ప్రమాదం.. ప్రార్థిస్తున్నా అంటూ ఊర్వశీ రౌతేలా పోస్ట్ -
ధావన్ పని అయిపోయింది? గబ్బర్పై దినేశ్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు
బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన ధావన్ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అయితే బంగ్లాతో ఆఖరి వన్డేలో ఓపెనర్గా వచ్చిన ఇషాన్ కిషన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. కిషన్ సంచలన ఇన్నింగ్స్తో ధావన్ కెరీర్కు తెరపడినట్లే అని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధావన్ కెరీర్పై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. యువ ఆటగాళ్లు కిషన్, గిల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నందున ధావన్ వన్డే కెరీర్ ముగిసినట్లే అని కార్తీక్ అభిప్రాయపడ్డాడు. "స్వదేశంలో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్కు ధావన్కు చోటు దక్కకపోవచ్చు. ఎందుకంటే ఓపెనింగ్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ను పక్కన పెట్టే సాహసం సెలక్టర్లు చేయరు అనుకుంటున్నా. మరోవైపు శుబ్మాన్ గిల్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తే వీరి ముగ్గురిలో ఎవరైనా తప్పుకోవాల్సి వస్తుంది. నా అంచనా ప్రకారం అది ధావన్ కావచ్చు. ఇది అద్భుతమైన శిఖర్ కెరీర్కు విషాదకరమైన ముగింపు కావచ్చు. ఒక వేళ ధావన్ జట్టుకు ఎంపిక అయినా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కడం కష్టం. అయితే ఈ ప్రశ్నలన్నింటికి కొత్తగా వచ్చే సెలక్టర్లే సమాధానం చెప్పాల్సి ఉంటుంది" అని క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. చదవండి: టీమిండియా అత్యుత్తమ వన్డే జట్టు.. సూర్యకుమార్ యాదవ్కు నో ఛాన్స్! -
చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం అంటే ఇదే!
బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన టీమిండియా మూడు వన్డేల సిరీస్ను 2-0తేడాతో ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. బంగ్లాదేశ్ గడ్డపై టీమిండియా వన్డే సిరీస్ ఓడిపోవడం ఇది వరుసగా రెండోసారి. ఇక చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది టీమిండియా పరిస్థితి. వన్డే సిరీస్ కోల్పోయాకా టీమిండియాకు జ్ఞానోదయం అయినట్లుంది. వరుసగా విఫలమవుతున్నప్పటికి ధావన్కు అవకాశాలిస్తూనే వచ్చారు తప్ప ఇషాన్ కిషన్ను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఇషాన్కు తొలి రెండు వన్డేల్లో అసలు అవకాశమే దక్కలేదు. అయితే రోహిత్ గాయం ఇషాన్ కిషన్కు కలిసి వచ్చింది. హిట్మ్యాన్ గాయంతో మూడో వన్డేకు దూరం కావడంతో అతని స్థానంలో ఇషాన్ తుది జట్టులోకి వచ్చాడు. తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న ఇషాన్ వచ్చీ రావడంతోనే డబుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న తొలి క్రికెటర్గా ఇషాన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకవేళ ఇషాన్ కిషన్ను తొలి రెండు వన్డేల్లో ఆడించి ఉంటే పరిస్థితి కచ్చితంగా వేరుగా ఉండేదని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇక మూడో వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ ఓవరాల్గా 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఇక వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్గా కిషన్ రికార్డులకెక్కాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ ఈ ఘనతను సాధించారు. ఇక ఓవరాల్గా ఈ రికార్డు సాధించిన జాబితాలో కిషాన్ ఏడో స్థానంలో నిలిచాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. తొలి భారత బ్యాటర్గా
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 1500 పరుగులు సాధించిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. బుధవారం బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో 82 పరుగులు సాధించిన అయ్యర్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ 36 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించగా.. అయ్యర్ 34 ఇన్నింగ్స్లలో నే ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అయ్యర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్లో 38 వన్డేలు ఆడిన అయ్యర్.. 1534 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో 2 సెంచరీలతో పాటు 14 అర్ధ శతకాలు ఉన్నాయి. ధావన్ రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్.. ఇక ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ మరో రికార్డును కూడా సాధించాడు. 2022 ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా అయ్యర్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్(685) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ధావన్ రికార్డును అయ్యర్ బ్రేక్ చేశాడు. ఈ ఏడాదిలో 14 మ్యాచ్లు ఆడిన అయ్యర్ 721 పరుగులు సాధించాడు. చదవండి: IND vs BAN: వరుసగా రెండు సెంచరీలు.. రోహిత్ స్థానంలో జట్టులోకి! ఎవరీ ఈశ్వరన్? -
మూడో వన్డే కూడా రద్దు.. వన్డే సిరీస్ న్యూజిలాండ్దే
క్రైస్ట్చర్చ్ వేదికగా జరగుతున్న భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను న్యూజిలాండ్ 1-0తో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. కాగా 220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 18 ఓవర్లలో వికెట్ నష్టపోయి 104 పరుగులు చేసింది. ఈ క్రమంలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. అనంతరం వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో ఆఖరికి అంపైర్లు రద్దు చేశారు. కాగా వరుసగా రెండు వన్డేలు కూడా వర్షం కారణంగానే రద్దయ్యాయి. అంతకుముందు టీ20 సిరీస్లో కూడా ఆఖరి టీ20 వర్షం కారణంగానే ఎటువంటి ఫలితం తేలలేదు. ఇక తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన టామ్ లాథమ్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. రాణించిన వాషింగ్టన్ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో కేవలం 219 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(51) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. శ్రేయస్ అయ్యర్(49) పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, మిచెల్ తలా మూడు వికెట్లు సాధించగా.. సౌథీ రెండు, శాంట్నర్ ఒక్క వికెట్ సాధించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Ind Vs NZ: అతడు వెలకట్టలేని ఆస్తి! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు! -
ధవన్ లాగే రోహిత్నూ వన్డేలకు మాత్రమే పరిమితం చేస్తారా..?
గడిచిన 9 ఏళ్లలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోడం అభిమానులు, ఆటగాళ్లను ఎంత బాధిస్తుందో బీసీసీఐని కూడా అంతే ఆవేదనకు గురి చేస్తుంది. ఈ విషయంలో భారత్ ఓ మోస్తరు జట్ల కంటే హీనంగా ఉండటాన్ని టీమిండియా ఫ్యాన్స్, బీసీసీఐ చిన్నతనంగా భావిస్తుంది. వెస్టిండీస్, శ్రీలంక లాంటి జట్లు సైతం ఐసీసీ ట్రోఫీలు గెలవడంతో మెగా ఈవెంట్ల సందర్భంగా భారత అభిమానులు తలెత్తుకోలేకపోతున్నారు. భారత్ చివరి సారిగా 2013 ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. నాడు ధోని సారధ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి తాజాగా ముగిసిన టీ20 వరల్డ్కప్-2022 వరకు టీమిండియా ఆడిన ప్రతి ఐసీసీ టోర్నీలో రిక్త హస్తాలతో ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) జరుగబోయే వన్డే వరల్డ్కప్ను బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ఇందులో భాగంగా ఇప్పటినుంచే ప్రక్షాళనను మొదలుపెట్టింది. ఇప్పటికే సెలెక్షన్ కమిటీపై వేటు వేసిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. అతి త్వరలో టీ20 జట్టు నుంచి సీనియర్లను పూర్తిగా తప్పించి.. వన్డేలు, టెస్ట్లకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను టీ20 జట్టు నుంచి తప్పించి వన్డే, టెస్ట్లకు మాత్రమే పరిమితం చేయడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం శిఖర్ ధవన్ను వన్డేలకు మాత్రమే ఎలా వాడుకుంటున్నారో, రోహిత్ను కూడా మున్ముందు వన్డేల్లో మాత్రమే ఆడించాలని బీసీసీఐ యోచినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా రోహిత్.. టీ20ల్లో, టెస్ట్ల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోవడం, వయసు మీదపడటం, ఫిట్నెస్ కారణంగా చూపి కెప్టెన్పై వేటు వేసే అవకాశం ఉందని సమాచారం. రోహిత్ను వన్డేలకు మాత్రమే పరిమితం చేస్తే.. ఈ ఫార్మాట్పై అతను ఎక్కువ ఫోకస్ పెట్టి వరల్డ్కప్ను సాధించి పెట్టగలడని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బీసీసీఐ ప్లాన్లు ఎలా ఉన్నా అతి త్వరలో రోహిత్ విధుల్లో కోత పడటంతో పాటు ఏదో ఒకటి లేదా రెండు ఫార్మాట్లకు మాత్రమే పరిమతం కావడం ఖాయమని తెలుస్తోంది. -
IND VS NZ 3rd ODI: టీమిండియాకు షాకింగ్ న్యూస్
న్యూజిలాండ్తో మూడో వన్డేకు ముందు టీమిండియా అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. క్రైస్ట్చర్చ్లోని హాగ్లే పార్క్ వేదికగా రేపు (నవంబర్ 30) జరుగబోయే మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ వెదర్ ఫోర్కాస్ట్లో పేర్కొంది. క్రైస్ట్చర్చ్లో రేపు ఉదయం నుంచే అకాశం మేఘావృతమై ఉంటుందని, మ్యాచ్ సమయానికి (భారతకాలమానం ప్రకారం ఉదయం 7 గంటకు) భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ ప్రెడిక్షన్లో వెల్లడించింది. ఈ వార్త తెలిసి భారత క్రికెటర్లు, అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ మ్యాచ్ సాధ్యపడకపోతే సిరీస్ కోల్పోవాల్సి వస్తుందని బాధ పడుతున్నారు. కనీసం 10 ఓవర్ల పాటైన మ్యాచ్ జరిగితే, సిరీస్ సమం చేసుకునే అవకాశం అయినా ఉంటుందని అనుకుంటున్నారు. కాగా, 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో న్యూజిలాండ్ తొలి వన్డేలో విజయం సాధించగా (7 వికెట్ల తేడాతో).. రెండో వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇక మూడో వన్డే కూడా రద్దైతే న్యూజిలాండ్ 1-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే, వన్డే సిరీస్కు ముందు జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మూడో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మధ్యలో జరిగిన రెండో మ్యాచ్లో గెలిచిన హార్ధిక్ సేన.. 3 మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. -
IND VS NZ 3rd ODI: హార్ధిక్ను ఆదుకున్న వరుణుడు ధవన్ను కరుణిస్తాడా..?
మాంచి వర్షాకాలంలో న్యూజిలాండ్లో అడుగుపెట్టిన టీమిండియా.. వరుణుడి పుణ్యమా అని టీ20 సిరీస్ను గెలుచుకోగలిగింది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మూడో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మధ్యలో జరిగిన రెండో మ్యాచ్లో గెలిచిన హార్ధిక్ సేన.. వరుణుడు సహకారంతో 3 మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్లోనూ టీ20 సిరీస్ తరహాలోనే సమీకరణాలు మారిపోయాయి. అయితే టీ20 సిరీస్లో వరుణుడు టీమిండియా పక్షాన నిలబడగా.. వన్డే సిరీస్లో ఆతిధ్య జట్టుకు అనుకూలంగా నిలిచాడు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ గెలుపుతో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లగా, ఇవాళ (నవంబర్ 27) జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణమైంది. ఈ మ్యాచ్ రద్దుతో టీమిండియా సిరీస్ గెలుచుకునే అవకాశం కోల్పోయింది. వరుణుడు కరుణించి, ఆట సాధ్యపడి, ఈనెల 30న (బుధవారం) జరిగే మూడో వన్డేలో గెలిస్తే, సిరీస్ డ్రా చేసుకునే అవకాశం మాత్రమే టీమిండియా ముందు ఉంది. అయితే, మూడో వన్డేకు వేదిక అయిన క్రైస్ట్చర్చ్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో టీమిండియా సిరీస్పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ వరుణుడు కటాక్షించక, మూడో వన్డే రద్దైతే.. తొలి మ్యాచ్లో గెలిచిన న్యూజిలాండ్ సిరీస్ విజేతగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్లో హార్ధిక్ను ఆదుకున్న వరుణుడు.. ధవన్కు వన్డే సిరీస్ను కనీసం డ్రా చేసుకునే అవకాశాన్నైనా కల్పిస్తాడా లేదా అన్నది సందేహంగా మారింది. -
అందుకే సంజూ శాంసన్ను పక్కకు పెట్టాం: టీమిండియా కెప్టెన్
హామిల్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 27) జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్(3) విఫలం కాగా, మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (42 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(25 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రీజ్లో ఉన్నారు. 4.5 ఓవర్ల తర్వాత తొలిసారి మ్యాచ్కు అంతరాయం కలిగించిన వర్షం, మళ్లీ 12.5 ఓవర్ల తర్వాత అడ్డుతగిలింది. ఈ దశలో ప్రారంభమైన భారీ వర్షం, ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్లో కివీస్ ఆధిక్యం 1-0తో కొనసాగుతుంది. తొలి వన్డేలో టామ్ లాథమ్ భారీ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్లో భారత తుది జట్టు కూర్పుపై పెద్ద దూమారమే రేగింది. తొలి వన్డేలో పర్వాలేదనిపించిన సంజూ శాంసన్ను జట్టు నుంచి తప్పించడం, గత కొన్ని మ్యాచ్లుగా దారుణంగా విఫలమవుతున్న రిషబ్ పంత్ను జట్టులో కొనసాగిండచడంపై అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నందుకు సోషల్మీడియా వేదికగా కెప్టెన్ శిఖర్ ధవన్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్లను ఎండగట్టారు. సంజూ శాంసన్ దక్షిణాది రాష్ట్రానికి చెందిన వాడు కాబట్టే ఇలా చేస్తున్నారని కొందరు, కుల వివక్ష కారణంగానే శాంసన్కు అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని మరికొందరు పరుష పదజాలం ఉపయోగించి బీసీసీఐ, కెప్టెన్, కోచ్, సెలెక్టర్లను టార్గెట్ చేశారు. శాంసన్ను జట్టు నుంచి ఎందుకు తప్పించారో టాస్ సమయంలో కెప్టెన్ ధవన్ ఎలాంటి కారణం చెప్పకపోవడంతో అభిమానులు మరింత రెచ్చిపోయారు. జట్టు నుంచి ఎందుకు తప్పించారో చెప్పాల్సిన బాధ్యత కెప్టెన్పైన ఉంటుంది, అలాంటిది శాంసన్ను తప్పించడంపై కెప్టెన్ ధవన్ కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. అయితే, ఈ విషయం వివాదాస్పదంగా మారడం, నెట్టింట భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుండటంతో మ్యాచ్ రద్దైన అనంతరం కెప్టెన్ ధవన్ స్పందించాడు. రెండో వన్డేలో శాంసన్ను పక్కకు పెట్టడానికి గల కారణాలను వివరించాడు. జట్టుకు ఆరో బౌలర్ అవసరమని, తప్పనిసరి పరిస్ధితుల్లో శాంసన్కు బదులు దీపక్ హుడాను తుది జట్టులో తీసుకున్నామని తెలిపాడు. పిచ్ స్వింగ్కు అనుకూలిస్తుందని భావించి శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్కు అవకాశం కల్పించామని పేర్కొన్నాడు. ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసమే శాంసన్ను పక్కకు పెట్టాల్సి వచ్చిందని, దీనిపై రాద్దాంతం అనవసరమని ట్రోలింగ్కు దిగిన వారికి పరోక్షంగా చురకలంటించాడు. -
మరోసారి విలన్గా మారిన వర్షం.. న్యూజిలాండ్- భారత్ రెండో వన్డే రద్దు
భారత్-న్యూజిలాండ్ సిరీస్లో వరుణుడు మరోసారి విలన్గా మారాడు. హామిల్టన్ వేదికగా జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. భారత ఇన్నింగ్స్ 4.5 ఓవర్ల వద్ద మ్యాచ్కు తొలుత వర్షం అంతరాయం కలిగించింది. దాదాపు మూడు గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ను 29 ఓవర్లకు కుదించారు. అయితే మళ్లీ భారత ఇన్నింగ్స్ 12.5 (89-1) వద్ద వర్షం తిరుగుముఖం పట్టింది. దీంతో మ్యాచ్ను నిలిపివేశారు. ఇక వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో ఆఖరికి అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. భారత ఇన్నింగ్స్లో శుబ్మాన్ గిల్(45), సూర్యకుమార్ యాదవ్(34) పరుగులతో క్రీజులో ఉండగా మ్యాచ్ రద్దైంది. కాగా మూడు మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఇక ఇరు జట్ల మధ్య అఖరి వన్డే బుధవారం(నవంబర్ 30)న క్రైస్ట్ చర్చ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతోంది. ఒక వేళ న్యూజిలాండ్ గెలుపొందితే 2-0 తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. చదవండి: IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? -
ఒక్క మ్యాచ్కే పక్కనబెట్టారు.. సౌత్ ప్లేయర్ అనేగా వివక్ష
టాలెంటెడ్ ఆటగాడు సంజూ శాంసన్కు మరోసారి అన్యాయం జరిగింది. ఆదివారం కివీస్తో మొదలైన రెండో వన్డేలో శాంసన్ను ఎంపిక చేయలేదు. దీంతో శాంసన్ను కేవలం ఒక్క మ్యాచ్కే పరిమితం చేశారా అంటూ అభిమానులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజూ శాంసన్పై ఎందుకంత వివక్ష చూపిస్తున్నారు.. సౌత్ ప్లేయర్ అనేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శాంసన్ న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయ్యాడన్న మాటే కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడంపై విమర్శలు వచ్చాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టి20 జట్టులో శాంసన్కు చోటు దక్కలేదు. మరి ఆ విమర్శలకు భయపడ్డారేమో తెలియదు కానీ ఉన్నపళంగా కివీస్తో జరిగిన తొలి వన్డేకు సంజూకు అవకాశం ఇచ్చారు. మ్యాచ్లో భారీ స్కోరు చేయకపోయినప్పటికి మరి తీసిపారేసేంత చెత్తగా మత్రం ఆడలేదు. దారుణంగా విఫలమవుతున్న పంత్తో పోలిస్తే సంజూ శాంసన్ చాలా బెటర్గా కనిపించాడు. పంత్ 15 పరుగులు చేసి ఔటవ్వగా.. సంజూ శాంసన్ 38 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే సుందర్(37 నాటౌట్)తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరి ఇన్నింగ్స్తోనే ఆ మ్యాచ్లో టీమిండియా 300 పరుగులు మార్క్ను దాటింది. అయితే పేలవమైన బౌలింగ్ కారణంగా టీమిండియా ఆ మ్యాచ్లో ఓడిపోయింది. ఇదిలా ఉంటే రెండో వన్డేలో సంజూ శాంసన్పై మరోసారి వేటు పడింది . తొలి వన్డేలో భారత బౌలర్లు వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో ఆల్రౌండర్ దీపక్ హుడాకి తుదిజట్టులో చోటు దక్కింది. హుడాని జట్టులోకి తీసుకురావాలనుకుంటే పేలవ ఫామ్లో ఉన్న రిషబ్ పంత్ని తప్పించొచ్చు. అలాగే సూర్యకుమార్ యాదవ్ టి20 ఫార్మాట్లో దుమ్మురేపుతున్నా.. వన్డేల్లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. విఫలం అవుతున్న ఈ ఇద్దరినీ కొనసాగించిన టీమిండియా.. సంజూ శాంసన్ను మాత్రం పక్కనబెట్టేసింది. సంజూ శాంసన్ను ఎంపిక చేయకపోవడంపై ధావన్ సహా జట్టు మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్తో రెచ్చిపోయారు అభిమానులు. ''సంజూ శాంసన్.. దక్షిణ భారతదేశానికి చెందిన వాడు కావడం వల్లే అతనికి తుదిజట్టులో చోటు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారు.. శిఖర్ ధావన్, శుబ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అర్ష్దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్, ఉమ్రాన్ మాలిక్... ఇలా భారత జట్టులో ఉన్న ప్లేయర్లు అందరూ నార్త్ ఇండియాకి చెందినవాళ్లే... ఒక్క వాషింగ్టన్ సుందర్ తప్ప!''.. ''సంజూ శాంసన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన దీపక్ హుడా కూడా నార్త్ ఇండియనే'' అంటూ ధ్వజమెత్తారు. ''సంజూ ఇండియాలో ఉంటూ అవకాశాల కోసం ఎదురుచూసే కంటే వేరే దేశానికి వెళ్తే స్టార్ ప్లేయర్ అవ్వడం ఖాయం''..''ఇంతకముందు త్రిబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా కరణ్ నాయర్.. ఆస్ట్రేలియాలో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చిన టి.నటరాజన్.. ఆ తర్వాత కనిపించకపోవడానికి కూడా ఈ వివక్షే కారణమని'' కొంతమంది అభిమానులు పేర్కొన్నారు. Cricket craze gonna end here. Thanks to BCCI. from viru, yuvi to msd to sanju samson. Sanju is a victim of favourism running in bcci. Until it is stopped, I won't be watching any matches of team india. Replacing inform batsman is ridiculous. No more tweets🤐🤐🤐 #SanjuSamson pic.twitter.com/cCfxMz8uMX — ADARSH J S (@never_give_u_p_) November 27, 2022 Doesn't make any sense. SKY has a poor ODI record, Pant hasn't performed in white ball cricket, Samson played a good knock in last match. But you*****ing drop samson! Wow BCCI. #justiceforsamson #SanjuSamson https://t.co/jER4ZulT8o — Karthikeyan (@IamKarthi1818) November 27, 2022 Once Again #justiceforsanjusamson Sanju fans please Show your Power.#SanjuSamson #ShameOnYou #BCCI 😑 pic.twitter.com/BdV4s3LaRK — Sachin Gandhi (@SachinG25184819) November 27, 2022 చదవండి: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? FIFA WC: నువ్వయ్యా అసలు సిసలైన అభిమానివి! -
భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్తో రెండో వన్డే కష్టమే!
న్యూజిలాండ్తో తొలి వన్డేలో ఓటమిపాలైన భారత జట్టు.. ఇప్పుడు హామిల్టన్ వేదికగా రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలాని ధావన్ సేన భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఆదివారం హామిల్టన్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. "హామిల్టన్లో 91 శాతం వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని" అక్యూవెదర్ తమ నివేదికలో పేర్కొంది. అదేసమయంలో అక్కడ పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 18 డిగ్రీలు, కనిష్టంగా 16 డిగ్రీల వరకు ఉండవచ్చు. ఇక ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యహ్నాం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే పిచ్ను కవర్స్తో కప్పి ఉంచారు. ఒక వేళ ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసి నట్లయితే మ్యాచ్ను రద్దు చేసే అవకాశం ఉంది. కాగా టీ20 సిరీస్లో కూడా వరుణుడు విలన్గా మారిన సంగతి తెలిసిందే. తొలి టీ20 వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా.. మూడో టీ20కు కూడా వర్షం అంతరాయం కలిగించింది. ఈ మ్యాచ్ డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం డ్రా ముగిసింది. చదవండి: IPL 2023: 'వచ్చే ప్రపంచకప్ టోర్నీలోనైనా గెలవాలంటే ఐపీఎల్ ఆడడం మానేయండి'.. లేకుంటే -
శిఖర్ ధావన్ అరుదైన రికార్డు.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ లిస్ట్-ఏ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 12,000 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఏడో భారత క్రికెటర్గా రికార్డులకెక్కాడు. న్యూజిలాండ్తో తొలి వన్డేలో 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనతను ధావన్ సాధించాడు. కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత కెప్టెన్గా ధావన్ బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు లిస్ట్-ఏ క్రికెట్లో 297 మ్యాచ్లు ఆడిన ధావన్ 12,025 పరుగులు చేశాడు. వీటిలో 162 అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు ఉన్నాయి. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(21,999) పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక పరుగులు వీరే సచిన్ టెండూల్కర్(551 మ్యాచ్లు) - 21,999 పరుగులు సౌరవ్ గంగూలీ(437 మ్యాచ్లు) -15, 622 పరుగులు రాహుల్ ద్రవిడ్ (449 మ్యాచ్లు)- 15,271 పరుగులు విరాట్ కోహ్లీ(296 మ్యాచ్లు)- 13,786 పరుగులు ఎంఎస్ ధోని(423 మ్యాచ్లు)- 13,353 పరుగులు యువరాజ్ సింగ్(423 మ్యాచ్లు)-12,633 పరుగులు శిఖర్ ధావన్(297 మ్యాచ్లు)-12,025 పరుగులు రాణించిన ధావన్, అయ్యర్ న్యూజిలాండ్తో తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్(72), శ్రేయస్ అయ్యర్(80), గిల్(50) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మిల్నే ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: ఇంగ్లండ్ వికెట్ కీపర్ అద్భుత విన్యాసం.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్ -
కేన్ మామతో ధావన్ పరాచకాలు.. వీడియో వైరల్
కివీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే టి20 సిరీస్ను పూర్తి చేసుకుంది. హార్దిక్ పాండ్యా సారధ్యంలోని టీమిండియా 1-0 తేడాతో సిరీస్ను గెలిచింది. ఇక నవంబర్ 25 నుంచి శిఖర్ ధావన్ నేతృత్వంలో టీమిండియా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్కు దూరంగా ఉండడంతో ధావన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ధావన్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటికే పలు సిరీస్లు ఆడిన సంగతి తెలిసిందే. ఈ సంగతి పక్కనబెడితే.. టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ ధావన్ తన చర్యతో మరోసారి వైరల్గా మారాడు. సాధారణంగా మంచి హ్యూమర్ కనబరిచే ధావన్ మరోసారి తన మ్యాజిక్తో మెరిశాడు. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫోజులు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఇక్కడ ధావన్ స్వయంగా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రూంకి వెళ్లి అతన్ని ట్రోఫీ పెట్టిన ప్లేస్కు తీసుకురావడం విశేషం. ఈ గ్యాప్లోనే ఒకరినొకరు హగ్ చేసుకొని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ట్రోఫీని ఆవిష్కరించడానికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ తన ట్విటర్లో పంచుకుంది. ఇక టి20 సిరీస్ విషయానికి వస్తే తొలి మ్యాచ్ రద్దు కాగా.. రెండో మ్యాచ్లో భారత్ 65 పరుగుల తేడాతో నెగ్గింది. ఇక మూడో టి20లో వర్షం అంతరాయంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో మ్యాచ్ను టైగా నిర్ణయించడంతో సిరీస్ను టీమిండియా చేజెక్కించుకుంది. Smiles, friendly banter & the trophy 🏆 unveil! #TeamIndia | #NZvIND pic.twitter.com/3R2zh0znZ3 — BCCI (@BCCI) November 24, 2022 చదవండి: కెప్టెన్గా కఠిన నిర్ణయాలు తీసుకుంటా! లోకాన్ని వీడేటపుడు ఏం పట్టుకుపోతాం -
న్యూజిలాండ్తో తొలి వన్డే.. ఎక్స్ప్రెస్ పేసర్ ఎంట్రీ! సంజూ కూడా
న్యూజిలాండ్తో టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్పై కన్నేసింది. ఆక్లాండ్ వేదికగా శుక్రవారం(నవంబర్25) న్యూజిలాండ్తో తొలి వన్డేలో తలపడేందుకు భారత్ సిద్దమైంది. కాగా ఈ సిరీస్కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యారు. ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్గా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. ఇక కివీస్తో జరగనున్న తొలి వన్డేలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ భారత్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కాగా న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఉమ్రాన్ మాలిక్ ఎంపికైనప్పటికీ కేవలం బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో తొలి వన్డేలో అతడిని ఆడించాలని జట్టు మేనేజేమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా దీపక్ హుడా స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మరో వైపు పేసర్ దీపక్ చాహర్ తొలి వన్డేకు దూరమమ్యే ఛాన్స్ ఉంది. అతడి స్థానంలో అర్ష్దీప్ సింగ్ భారత తరపున వన్డే అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆక్లాండ్కు చేరుకున్న ధావన్ సేన ప్రాక్టీస్లో నిమగ్నమైంది. తుది జట్టు(అంచనా) శిఖర్ ధావన్(కెప్టెన్),శుభమాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్,సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ చదవండి: Abu Dhabi T10: కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్లతో! -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శిఖర్ ధావన్.. మయాంక్పై వేటు
ఐపీఎల్-2023కు ముందు పంజాబ్ కింగ్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్గా టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ను పంజాబ్ ఫ్రాంచైజీ నియమించింది. బుధవారం(నవంబర్ 2) జరిగిన బోర్డు మీటింగ్లో కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని పంజాబ్ ఫ్రాంచైజీ తీసుకుంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టు ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. ఐపీఎల్-2023లో 14 మ్యాచ్లు ఆడిన పంజాబ్.. ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో మయాంక్ను తప్పించి జట్టు పగ్గాలను ధావన్కు అప్పజెప్పాలని పంజాబ్ కింగ్స్ నిర్ణయించింది. అదే విధంగా ఈ ఏడాది సెప్టెంబర్లో అనిల్ కుంబ్లేను తప్పించి ట్రెవర్ బేలిస్ను జట్టు కొత్త ప్రధాన కోచ్గా పంజాబ్ నియమించిన సంగతి తెలిసిందే. మరోవైపు తమ జట్టు అసిస్టెంట్ కోచ్గా ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్తో కూడా పంజాబ్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక వచ్చే ఏడాది సీజన్లో కొత్త కోచింగ్ స్టాప్, కొత్త కెప్టెన్లతో పంజాబ్ బరిలోకి దిగనుంది. చదవండి: T20 WC 2022: మళ్లీ మాది పాత కథే.. వర్షం రాక పోయింటే విజయం మాదే: షకీబ్ -
మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం (ఫొటోలు)
-
IND vs SA 3rd ODI: మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం
సౌతాఫ్రికాతో స్వదేశంలో మూడో వన్డేలో ధావన్ సేన ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. మ్యాచ్ స్కోర్లు: సౌతాఫ్రికా 99 (27.1 ఓవర్లు) భారత్ 105/3 (19.1) పాపం గిల్.. హాఫ్ సెంచరీ మిస్ విజయానికి మూడు పరుగుల దూరంలో ఉండగా టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. లుంగి ఎంగిడి బౌలింగ్లో ఓపెనర్ శుబ్మన్ గిల్ పెవిలియన్ చేరాడు. 49 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ అవుట్ ఇషాన్ కిషన్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఫోర్టుయిన్ బౌలింగ్లో క్వింటన్ డికాక్కు క్యాచ్ ఇచ్చి 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాన్ నిష్క్రమించాడు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 42 పరగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధవన్ 8 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. గిల్కు (30)కు జతగా ఇషాన్ కిషన్ క్రీజ్లోకి వచ్చాడు. విజృంభించిన భారత బౌలర్లు.. 99 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా మూడో వన్డేలో భారత స్పిన్నర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా 99 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించగా.. వాషింగ్టన్ సుందర్, షబాజ్ ఆహ్మద్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. ప్రోటీస్ బ్యాటర్లలో క్లాసన్ 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. 94 పరుగులకే ఏడు వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో దక్షిణాప్రికా 94 పరుగులకే దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయింది. 34 పరుగులు చేసిన క్లాసన్.. షబాజ్ ఆహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 73 పరుగుల వద్ద దక్షిణాప్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఫెహ్లుక్వాయో.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 66 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన మిల్లర్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి ఫెహ్లుక్వాయో వచ్చాడు. నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 43 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన మార్క్రమ్.. షబాజ్ ఆహ్మద్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి మిల్లర్ వచ్చాడు. 26 పరుగులకే మూడు వికెట్లు 26 పరుగులకే దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. 3 పరుగులు చేసిన హెండ్రిక్స్.. సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 25 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన మలాన్.. సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ 7 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాప్రికా వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. క్రీజులో మలాన్(11), హెండ్రిక్స్(2) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ను కోల్పోయిన దక్షిణాఫ్రికా 7 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన డికాక్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి రెజా హెండ్రిక్స్ వచ్చాడు. సిరీస్ను డిసైడ్ చేసే మూడో వన్డేలో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ కీలక మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగింది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం మూడు మార్పులు చేసింది. ఈ మ్యాచ్కు డేవిడ్ మిల్లర్ దక్షిణాఫ్రికా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. తుది జట్లు: భారత్: శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, జోర్న్ ఫోర్టుయిన్, లుంగి ఎంగిడీ, అన్రిచ్ నోర్ట్జే ఢిల్లీ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే ఆలస్యంగా ప్రారంభం కానుంది. అరుణ్జైట్లీ స్టేడియం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో.. మ్యాచ్కు అంతరాయం కలిగింది. దీంతో మధ్యాహ్నం 1:00 గంటకు పడాల్సిన టాస్ ఇప్పుడు వాయిదా పడింది. కాగా 1:30 గంటలకు అంపైర్లు పిచ్ను పరీశీలించాక ఓ నిర్ణంయం తీసుకోనున్నారని" బీసీసీఐ ట్వీట్ చేసింది. UPDATE from Delhi 🚨 - Toss has been delayed. There will be an official inspection at 1:30 PM IST.#TeamIndia | #INDvSA — BCCI (@BCCI) October 11, 2022 -
ఢిల్లీలో భారీ వర్షాలు.. మూడో వన్డే జరిగేనా?
న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ మంగళవారం మధ్యహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా మూడో వన్డే సిరీస్ డిసైడ్ చేసే మ్యాచ్ కావడంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచుస్తున్నారు. అయితే ఈ కీలక పోరుకు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. కాగా గత మూడు రోజుల నుంచి దేశ రాజధాని న్యూ ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం మ్యాచ్ జరిగే సమయంలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని అక్యూ వెదర్ పేర్కొంది. అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మంగళవారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, 40 శాతం వర్షంపడే అవకాశం ఉంది. అదే విధంగా ఉష్ణోగ్రత కూడా 21 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే ఛాన్స్ ఉంది అని అక్యూ వెదర్ తెలిపింది. ఇక రాంఛీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ప్రోటీస్ జట్టుపై ఘన విజయం సాధించిన భారత్.. మూడు వన్డేల సిరీస్ను1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తుది జట్లు(అంచనా): భారత్: శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. డిన్నర్కు వెళ్లిన భారత ఆటగాళ్లు -
దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. డిన్నర్కు వెళ్లిన భారత ఆటగాళ్లు
సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో వన్డేలో దక్షిణాప్రికాతో తాడో పేడో తేల్చుకోవడానికి టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్ మంగళవారం (ఆక్టోబర్11) ఢిల్లీ వేదికగా జరగనుంది. అయితే మ్యాచ్కు ముందు రోజు(సోమవారం) టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్తో పాటు శ్రేయస్ అయ్యర్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్ డిన్నర్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ధావన్ తన సోషల్ మీడియా ఖతాలో షేర్ చేశాడు. ఇక రాంఛీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఆజేయ సెంచరీతో చెలరేగాడు. ఇక మూడో వన్డేలో జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. తుది జట్లు(అంచనా): భారత్: శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) చదవండి: Shahbaz Ahmed: 'ఏదైనా సాధిస్తేనే ఇంటికి రా..' -
'వన్డే ప్రపంచకప్లో భారత ఓపెనర్లు వారిద్దరే'
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ టీ20 కెరీర్కు దాదాపు ఎండ్ కార్డ్ పడినట్లే. గతేడాది జూలైలో భారత్ తరపున ధావన్ తన అఖరి టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతడిని భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. కాగా ధావన్ టీ20లకు దూరంగా ఉన్నప్పటికీ.. వన్డేల్లో మాత్రం చోటు దక్కించుకుంటున్నాడు. ధావన్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతోన్న వన్డే సిరీస్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ సారథ్యంలోని భారత సీనియర్ జట్టు టీ20 ప్రపంచకప్-2022 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లడంతో ధావన్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే వరల్డ్కప్-2023 భారత్ వేదికగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్కు భారత జట్టులో ధావన్కు ఖచ్చితంగా చోటు దక్కుతుందని టీమిండియా మాజీ సెలెక్టర్ సబా కరీం థీమా వ్యక్తం చేశాడు. అదే విధంగా రోహిత్తో కలిసి భారత ఇన్నింగ్స్ను శిఖర్ ప్రారంభిస్తాడని కరీం జోస్యం చెప్పాడు. ఇండియా న్యూస్తో కరీం మాట్లాడుతూ.. "వన్డే ప్రపంచకప్కు భారత జట్టులో శిఖర్ ధావన్కు స్థానం దాదాపు ఖారారైంది. అతడు అద్భుతమైన ఆటగాడు. అతడు విఫలమైన మ్యాచ్లు ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటాయి. ప్రపంచకప్లో రోహిత్ శర్మ, ధావన్ను ఓపెనర్లుగా ఉండాలని సెలక్టర్లు ఇప్పటికే నిర్ణయించారని నేను భావిస్తున్నాను" పేర్కొన్నాడు. చదవండి: Ravindra Jadeja: తన క్రష్ ఏంటో చెప్పిన జడేజా.. షాకైన అభిమానులు -
శివాలెత్తిన శ్రేయస్, ఇషాన్.. సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం
శివాలెత్తిన శ్రేయస్, ఇషాన్.. సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (113 నాటౌట్) శతకంలో, ఇషాన్ కిషన్ (93) భారీ అర్ధశతకంతో చెలరేగడంతో 45.5 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. శతక్కొట్టిన అయ్యర్ 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రేయస్ అయ్యర్ శతకం బాదాడు. సహచరుడు ఇషాన్ కిషన్ 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ శ్రేయస్ మాత్రం ఆ తప్పు చేయకుండా నిలకడగా ఆడి కెరీర్లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. అయ్యర్ 103 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 43 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 263/3. అయ్యర్కు జతగా శాంసన్ (21) క్రీజ్లో ఉన్నాడు. సెంచరీ చేజార్చుకున్న ఇషాన్ వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన ఇషాన్ కిషన్ 7 పరుగుల తేడాతో సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నారు. హాఫ్ సెంచరీ చేశాక ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇషాన్.. ఫోర్టున్ బౌలింగ్లో హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇషాన్ తన ఇన్నింగ్స్లో 84 బంతులను ఎదుర్కొని 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. 35 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 210/3. క్రీజ్లో శ్రేయస్ (71)కు జతగా సంజూ శాంసన్ వచ్చాడు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న ఇషాన్, శ్రేయస్ 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయాక టీమిండియా ఆచితూచి ఆడుతుంది. ఇషాన్ కిషన్ (60 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 50; 7 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 144/2. 100 దాటిన టీమిండియా స్కోర్ 48 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతూ 100 పరుగుల మార్కును దాటింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో సిక్సర్ బాది ఇషాన్ కిషన్ 100 పరుగుల స్కోర్ను దాటించాడు. అదే ఓవర్లో ఇషాన్ మరో సిక్సర్ కూడా బాది గేర్ మార్చాడు. 21 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 111/2. క్రీజ్లో ఇషాన్ (42), శ్రేయస్ అయ్యర్ (26) ఉన్నారు. 48 పరుగులకే ఓపెనర్లిద్దరూ ఔట్ భారీ లక్ష్యఛేదనలో టీమిండియా ఆరంభంలోనే తడబడుతుంది. 48 పరుగులకే ఓపెనర్లిద్దరూ ఔటయ్యారు. ధవన్ 13 పరుగులు చేసి ఔట్ కాగా.. 9వ ఓవర్లో రబాడ బౌలింగ్లో గిల్ (28) క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. 9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 49/2 కాగా.. క్రీజ్లో ఇషాన్ (5), శ్రేయస్ (1) ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్ 6వ ఓవర్ ఆఖరి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ధవన్ (13)ను వేన్ పార్నెల్ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ బాట పట్టించాడు. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 28/1. క్రీజ్లో గిల్ (13), ఇషాన్ కిషన్ ఉన్నారు. రాణించిన మార్క్రమ్, హెండ్రిక్స్.. టీమిండియా టార్గెట్ 279 టీమిండియా బౌలర్లు ఇన్నింగ్స్లో మధ్యలో వరుస వికెట్లు తీసి ప్రెషర్ పెట్టడంతో భారీ స్కోర్ దిశగా సాగిన దక్షిణాఫ్రికా 278 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమతమైంది. రీజా హెండ్రిక్స్ (74), ఎయిడెన్ మార్క్రమ్ (79) అర్ధసెంచరీలతో రాణించగా.. క్లాసెన్ (30), డేవిడ్ మిల్లర్ (35 నాటౌట్) పర్వాలేదనిపించారు. ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా 300 స్కోర్ చేరుకోలేకపోయింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్ (3/38) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. సుందర్, షాబాజ్ అహ్మద్, శార్ధూల్ ఠాకూర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఆరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 256 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన పార్నెల్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా వరుస క్రమంలో దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. 79 పరుగులు చేసిన మార్క్రమ్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 40 ఓవర్లకు దక్షిణాప్రికా స్కోర్: 221/5 నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 215 పరుగుల వద్ద ప్రోటీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన క్లాసన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 36 ఓవర్లకు దక్షిణాప్రికా స్కోర్: 197/3 36 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(76), క్లాసన్(15) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాప్రికా 169 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసిన హెండ్రిక్స్.. సిరాజ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 25 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ 122/2 25 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లు హెండ్రిక్స్(49), మార్క్రమ్(41) పరుగులతో ఉన్నారు. 18 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 77/2 18 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(18), హెండ్రిక్స్(29) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 40 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన మలాన్.. షబాజ్ ఆహ్మద్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో షబాజ్కు ఇది తొలి వికెట్. 6 ఓవర్లకు దక్షిణాప్రికా స్కోర్: 24/1 6 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. క్రీజులో మలాన్(13), హెండ్రిక్స్(3) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 7 పరుగుల వద్ద దక్షిణాప్రికా తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన డికాక్.. సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి హెండ్రిక్స్ వచ్చాడు. రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. రుత్రాజ్ గైక్వాడ్, బిష్ణోయ్ స్థానంలో సుందర్, షాబాజ్ ఆహ్మద్ జట్టులోకి వచ్చారు. మరో వైపు ఈ మ్యాచ్కు ప్రోటీస్ రెగ్యూలర్ కెప్టెన్ టెంబా బావుమా, స్పిన్నర్ షమ్సీ దూరమయ్యారు. వారి స్థానంలో హెండ్రిక్స్, బెజార్న్ ఫోర్టుయిన్ జట్టులోకి వచ్చారు. తుది జట్లు దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్(కెప్టెన్), జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబడ, అన్రిచ్ నార్టే భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ -
దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. రుత్రాజ్కు నో ఛాన్స్! పటిదార్ అరంగేట్రం!
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ను టీమిండియా ఓటమితో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రోటీస్తో తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్.. ఇప్పుడు రెండో వన్డేలో తలపడేందకు సిద్దమైంది. రాంఛీ వేదికగా ఆక్టోబర్9 భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే జరగనుంది. ఇక ఈ మ్యాచ్లో ఏలగైనా విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని ధావన్ సేన భావిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం ఈ మ్యాచ్లో కూడా తొలి వన్డే జోరును కొనసాగించి సిరీస్ కైవసం చేసుకోవాలి అని అనుకుంటుంది. ప్రస్తుతం మూడు సిరీస్లో ప్రోటీస్ జట్టు 1-0తో ముందంజలో ఉంది. ఇక ఇప్పటికే రాంఛీకి చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో ఓ మార్పుతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి వన్డేలో విఫలమైన రుత్రాజ్ గైక్వాడ్ స్థానంలో యువ ఆటగాడు రజిత్ పటిదార్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. లక్నో వేదికగా జరిగిన మొదటి వన్డేలో 42 బంతులు ఎదర్కొన్న రుత్రాజ్ కేవలం 19 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. మరో వైపు దక్షిణాఫ్రికా మాత్రం తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే రెండో వన్డేలో కూడా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. తుది జట్లు(అంచనా) టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, రజిత్ పటిదార్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ చదవండి: T20 World Cup 2022: టీ20 క్రికెట్ చరిత్రలో.. ఆఫ్గానిస్తాన్- ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ -
'మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం! సంజూ గ్రేట్'
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందించాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్లో చేయడంలో విఫలమం కావడం జట్టు ఓటమికి దారితీసిందని ధావన్ తెలిపాడు. కాగా ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు అఖరి ఓవర్లలో మాత్రం తెలిపోయారు. ప్రోటీస్ బ్యాటర్లు క్లసన్, మిల్లర్ బౌండరీల వర్షం కురిపించారు. అఖరి 5 ఓవర్లలో టీమిండియా బౌలర్లు ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నారు. అదే విధంగా ఫీల్డింగ్లో కూడా భారత్ పేలవ ప్రదర్శన కనబరిచింది. మిల్లర్, క్లసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్లను భారత ఫీల్డర్లు జారివిడిచారు. ఇందుకు భారత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది. ఇక బ్యాటింగ్లో కూడా టీమిండియా అంతగా రాణించలేకపోయింది. ధావన్, గిల్, కిషన్, గైక్వాడ్ తీవ్రంగా నిరాశపరిచారు. అయితే సంజూ శాంసన్ మాత్రం అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు. ఈ మ్యాచ్లో 63 బంతులు ఎదుర్కొన్న సంజూ 9 ఫోర్లు, 3 సిక్స్లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో ధావన్ మాట్లాడుతూ.. "40 ఓవర్లకు 250 పరుగులు చిన్న లక్ష్యమేమి కాదు. స్వింగ్, స్పిన్ అయ్యే వికెట్పై మేము చాలా పరుగులు ఇచ్చాము. ఫీల్డింగ్లో కూడా అంతగా రాణించలేకపోయాం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాము. ఇక బ్యాటింగ్లో కూడా ఆరంభం మంచిగా లేదు. కానీ సంజూ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అద్భుతమైనది. అఖరిలో శార్థూల్, సంజూ జట్టును గెలిపిస్తారని భావించాము. ఈ మ్యాచ్ నుంచి మేము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మా తదుపరి మ్యాచ్లో ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా చూస్తాం" అని పేర్కొన్నాడు. చదవండి: IND Vs SA: 'దటీజ్ సంజూ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి' -
IND vs SA 1st ODI: చివరి వరకు పోరాడి ఓడిన భారత్!
తొలి వన్డేలో పోరాడి ఓడిన భారత్! సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమి పాలైంది. చివరి వరకు పోరాడినా నాలుగు ఓవర్లలో పరుగులు రాబట్టకపోవడంతో పాటు వికెట్లను కోల్పోయింది భారత్. దీంతో తొలి మ్యాచ్ సౌతాఫ్రికా విజయం సాధించింది. సంజు శాంసన్(86) నాటౌట్ వీరోచిత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 35 ఓవర్లకు భారత్ స్కోర్: 177/5 35 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 177/5. క్రీజులో శార్ధూల్(19), సంజు శాంసన్(48) ఉన్నారు. 30 ఓవర్లకు భారత్ స్కోర్: 145/5 30 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 145/5. క్రీజులో శార్ధూల్(12), సంజు శాంసన్(25) ఉన్నారు. భారత్ విజయం కోసం చివరి 10 ఓవర్లో 105 పరుగులు అవసరం. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. గెలుపు కష్టమే! అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్ అయ్యర్(50), ఎంగిడి ఓవర్లో భారీ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ వికెట్తో భారత్ గెలుపు కష్టంగా మరిందనే చెప్పాలి. క్రీజులో సంజు శాంసన్(15), శార్ధూల్ ఠాకూర్ (0) ఉన్నారు. 25 ఓవర్లకు భారత్ స్కోర్:112/4 25 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 112/4. క్రీజులో శ్రేయస్ అయ్యర్(45), సంజు శాంసన్(14) ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో భారత్.. నాలుగో వికెట్ డౌన్ 51 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన ఇషాన్ కిషాన్.. మహరాజ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరుకున్నాడు. క్రీజులో శ్రేయస్ అయ్యర్(1), సంజు శాంసన్(0) ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన భారత్ 48 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన గైక్వాడ్.. షమ్సీ బౌలింగ్లో స్టంప్ ఔటయ్యి వెనుదిరిగాడు. క్రీజులో ఇషాన్ కిషన్(19), శ్రేయస్ అయ్యర్(0) ఉన్నారు. 15 ఓవర్లకు భారత్ స్కోర్:45/2 15 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 45/2. క్రీజులో ఇషాన్ కిషన్(18), గైక్వాడ్(17) ఉన్నారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్:24/2 ఆరంభంలోనే భారత్ శిఖర్, గిల్ రూపంలో ఓపనర్లను కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసమయానికి భారత్ స్కోరు 24/2. క్రీజులో క్రీజులో ఇషాన్ కిషన్(10), గైక్వాడ్(6) ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 8 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన ధావన్.. పార్నెల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో ఇషాన్ కిషన్(0), గైక్వాడ్(1) ఉన్నారు తొలి వికెట్ కోల్పోయిన భారత్: 8/1 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ తొలి వికెట్ను కోల్పోయింది. రబాడా బౌలింగ్లో గిల్ పెవిలియన్కు చేరుకున్నాడు. క్రీజులో శిఖర్ ధావన్(4), గైక్వాడ్(0) ఉన్నారు భారత్ టార్గెట్- 250 మొదట్లో తడబడ్డ దక్షిణాఫ్రికా బ్యాటర్లు, చివరికి భారత్ ముందు గౌరవప్రదమైన స్కోరునే ఉంచారు. వర్షం కారణంగా మ్యాచ్ని 40 ఓవర్లకు కుదించగా.. మ్యాచ్ ముగిసే సమయానికి సౌతాఫ్రికా 249 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది.(40 ఓవర్లు- 249/4) ..క్లాసెన్(74), మిల్లర్(75 )పరుగులతో నాటౌట్గా నిలిచారు. 35 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 195/4 35 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(48), మిల్లర్(49 )పరుగులతో ఉన్నారు. 30 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 164/4 30 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(39), మిల్లర్(28 )పరుగులతో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 108 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా డికాక్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజులో నిలదొక్కుకున్న డికాక్ అర్థసెంచరీ దగ్గర్లో తన వికెట్ని రవి బిష్ణోయ్కు సమర్పించుకున్నాడు. క్రీజులో క్లాసెన్(19), డేవిడ్ మిల్లర్(0) ఉన్నారు 21 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 105/3 21 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(46), క్లాసెన్(18) పరుగులతో ఉన్నారు. కష్టాల్లో దక్షిణాఫ్రికా.. మూడో వికెట్ డౌన్ 71 పరుగుల వద్ద దక్షిణిఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. బావుమా అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన మార్క్రామ్(0) కుల్దీప్ బౌలింగ్లో డకౌట్గా పెవిలియన్కు చేరాడు. 16 ఓవర్లకు స్కోరు: 71/3 రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 70 పరుగుల వద్ద దక్షిణిఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన బావుమా.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. క్రీజులోకి మార్క్రామ్ వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 49 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన మలాన్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 8 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 28/0 8 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(10), మలాన్(17) పరుగులతో ఉన్నారు. 2 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 8/0 2 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(6),మలాన్(2) పరుగులతో ఉన్నారు. ఎట్టకేలకు భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించారు. మరోవైపు రుత్రాజ్ గైక్వాడ్ టీమిండియా తరపున వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. తుది జట్లు దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా తలపడేందుకు సిద్దమైంది. అయితే మ్యాచ్ ఆరంభానికి వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు టాస్ వేయాల్సి ఉండగా.. వర్షంతో ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంతరాయం కలిగింది. టాస్ 1: 30కు పడుతుంది అని బీసీసీఐ ట్విట్ చేసింది. అయితే టాస్ పడే సమయానికి మళ్లీ వర్షం రావడంతో మ్యాచ్ మరింత అలస్యంగా ప్రారంభం కానుంది. కాగా రోహిత్ సారథ్యంలోని సీనియర్ భారత జట్టు టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు పయనం కాగా.. ధావన్ నేతృత్వంలో భారత ద్వితీయ శ్రేణి జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. ఈ సిరీస్కు దేశీవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్న ముఖేష్ కుమార్, పటిదార్కు భారత జట్టు తరపున చోటు దక్కింది. చదవండి: Womens Asia Cup 2022: పాకిస్తాన్కు భారీ షాకిచ్చిన థాయ్లాండ్.. క్రికెట్ చరిత్రలో తొలి విజయం -
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే .. రజత్ పటిదార్ అరంగేట్రం! భారత జట్టు ఇదే!
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్పై కన్నేసింది. లక్నో వేదికగా ఆక్టోబర్6న తొలి వన్డేలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. కాగా రోహిత్ శర్మ సారథ్యంలో భారత సీనియర్ జట్టు టీ20 ప్రపంచకప్-2022 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుండడంతో.. భారత ద్వితీయ శ్రేణి జట్టు ఈ సిరీస్లో తలపడనుంది. ఈ జట్టుకు భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యం వహించనున్నాడు. అదే విధంగా రజిత్ పాటిదార్, ముఖేష్ కుమార్కు తొలి సారిగా టీమిండియాలో చోటు దక్కింది. ఓపెనర్లగా ధావన్, శుబ్మన్ గిల్ తొలి వన్డేలో ఓపెనర్లగా ధావన్, శుబ్మాన్ గిల్ రానున్నారు. గిల్ ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. విండీస్, జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్లో అదరగొట్టాడు. ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 9 వన్డేలు ఆడిన గిల్.. 499 పరుగులు సాధించాడు. ఇక ధావన్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. ధావన్ ఆడిన అఖరి ఆరు వన్డేల్లో 322 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠికి చోటు దక్కే అవకాశం కన్పిస్తుంది. మరోవైపు రజిత్ పాటిదార్ భారత్ తరపున అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఆల్ రౌండర్ల కోటాలో షబాజ్ ఆహ్మద్, శార్థూల్ ఠాకూర్కు చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఇక చివరగా మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్కు బౌలర్ల కోటాలో ఎంపికయ్యే అవకాశం కన్పిస్తోంది. తొలి వన్డేకు భారత జట్టు (అంచనా): శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రజిత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్ (వికెట్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్ చదవండి: T20 World Cup 2022: 'టీ20 ప్రపంచకప్ టైటిల్ రేసులో ఆ మూడు జట్లే నిలుస్తాయి' -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! కెప్టెన్గా ధావన్
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు రోహిత్ సారథ్యంలోని భారత సీనియర్ జట్టు వెళ్లనుండడంతో.. ఈ సిరీస్కు ద్వితీయ శ్రేణి జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా యువ ఆటగాళ్లు రజిత్ పటిదార్, ముఖేష్ కుమార్కు తొలి సారి భారత జట్టులో చోటు దక్కింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇక దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. ఇరు జట్లు మధ్య తొలి వన్డే ఆక్టోబర్ 6న లక్నో వేదికగా జరగనుంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్ , అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్. Shikhar Dhawan (C), Shreyas Iyer (VC), Ruturaj Gaikwad, Shubhman Gill, Rajat Patidar, Rahul Tripathi, Ishan Kishan (WK), Sanju Samson (WK), Shahbaz Ahmed, Shardul Thakur, Kuldeep Yadav, Ravi Bishnoi, Mukesh Kumar, Avesh Khan, Mohd. Siraj, Deepak Chahar.#TeamIndia | #INDvSA — BCCI (@BCCI) October 2, 2022 -
సూర్యకుమార్ యాదవ్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. తిరువనంతపురం వేదికగా ప్రోటీస్తో జరిగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మోగించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో టీమిండియా ముందంజ వేసింది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బౌలర్లు సఫారీల బ్యాటర్ల భరతం పట్టగా.. అనంతరం బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. కాగా తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ప్రోటీస్.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. చాహర్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. అదే విధంగా స్పిన్నర్ అక్షర్ పటేల్కు ఒక వికెట్ దక్కింది. ఇక 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్(56 బంతుల్లో 51 నటౌట్), సూర్యకుమార్ యాదవ్(33 బంతుల్లో 50 పరుగులు నటౌట్) రాణించారు. మరోసారి అదరగొట్టిన సూర్య.. టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరో సారి అదరగొట్టాడు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఆరంభంలో భారత్ తడబడింది. ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్గా వెనుదిరగగా.. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మూడు పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్య.. తన ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్లో కేవలం 33 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 5 ఫోర్లు, 3 సిక్స్లతో 50 పరుగులు సాధించాడు. అఖరి వరకు క్రీజులో నిలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. రిజ్వాన్ రికార్డు బద్దలు కొట్టిన సూర్య ఈ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా సూర్య రికార్డులకెక్కాడు. 2022 ఏడాదిలో ఇప్పటి వరకు ఈ ముంబైకర్ మొత్తం 45 సిక్సర్లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉండేది. 2021 ఏడాదిలో రిజ్వాన్ 42 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు తాజా మ్యాచ్తో రిజ్వాన్ను రికార్డును సూర్య బద్దలు కొట్టాడు. అదే విధంగా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా స్కై నిలిచాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అతడు 732 పరుగులు సాధించాడు. అంతకుముందు ఈ ఘనత భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. 2018 ఏడాదిలో ధావన్ 689 పరుగులు చేశాడు. చదవండి: T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్.. కరోనా నుంచి కోలుకున్న షమీ -
టీమిండియా గబ్బర్ను గుర్తుచేసిన అర్ష్దీప్ సింగ్..
సౌతాఫ్రికాతో తొలి టి20లో టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. టీమిండియా పేసర్లు అర్ష్దీప్ సింగ్, దీపక్ చహర్లు చెలరేగడంతో సౌతాఫ్రికా జట్టు 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అందులో అర్ష్దీప్ మూడు వికెట్లు కాగా.. రెండు వికెట్లు దీపక్ చహర్వి ఉన్నాయి. కాగా సౌతాఫ్రికాకు టి20 క్రికెట్లో ఇదే అత్యంత చెత్త ఆరంభం. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డక్గా వెనుదిరగడం విశేషం. రొసో, మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్లు తాము ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగారు. ఇక అర్షదీప్ సింగ్.. టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ను గుర్తుకు తెచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో దీపక్ చహర్ బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్ భారీ షాట్కు యత్నించగా.. థర్డ్మన్లో ఉన్న అర్ష్దీప్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో అర్ష్దీప్ క్యాచ్ అందుకున్న సంతోషంలో తొడ కొట్టి మీసం మెలేశాడు. కాగా టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ క్యాచ్ పట్టిన ప్రతీసారి తొడగొట్టడం అలవాటు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. కెప్టెన్గా ధావన్.. వైస్ కెప్టెన్గా శాంసన్!
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్కు భారత జట్టును బుధవారం(సెప్టెంబర్ 28) బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రోటీస్తో వన్డే సిరీస్కు టీ20 ప్రపంచకప్-2022 భారత జట్టులో భాగంగా ఉన్న ఆటగాళ్లందరికీ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్ కోసం ఆక్టోబర్ 6వ తేదీన ఆస్ట్రేలియాకు పయనమవుతుంది. అదే రోజున భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే కూడా లక్నో వేదికగా జరగనుంది. ఇక ప్రోటీస్తో వన్డే సిరీస్లో భారత జట్టు సారథ్య బాధ్యతలు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ చేపట్టే అవకాశం ఉంది. ధావన్ డిప్యూటీగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ బాధ్యతలు నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సీనియర్ జట్టుతో ఆస్ట్రేలియాకు వెళ్లనుండడంతో అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా స్వదేశంలో న్యూజిలాండ్-ఏతో జరుగుతోన్న వన్డే సిరీస్లో అదరగొట్టిన భారత ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా సిరీస్కు సెలక్టర్లు ఎంపికచేయనున్నట్లు సమాచారం. “రోహిత్, విరాట్తో సహా టీ20 ప్రపంచకప్లో ఉన్న ఆటగాళ్లందరికీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వబడుతుంది. శిఖర్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. భారత్-ఎ వర్సెస్ న్యూజిలాండ్-ఎ మధ్య జరిగే 3వ వన్డే తర్వాత ప్రోటీస్ సిరీస్కు జట్టును ప్రకటిస్తారు అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్తో పేర్కొన్నారు. కాగా భారత పర్యటనలో భాగంగా సౌతాఫ్రికా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 28న తివేండ్రం వేదికగా జరగనున్న తొలి టీ20తో ప్రోటీస్ టూర్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో వన్డేలకు భారత జట్టు(అంచనా): శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ప్రసిద్ద్ మాలిక్ , కుల్దీప్ సేన్