Act
-
ప్రార్థనా స్థలాల చట్టం అంటే ఏమిటి? సంభల్, జ్ఞానవాపితో లింకేంటి?
ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లాలో గల జామా మసీదు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ మసీదు స్థానంలో హరిహర ఆలయం ఉండేదని హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపధ్యంలో కోర్టు ఏఎస్ఐ సర్వేకు అనుమతినిచ్చింది.పెరుగుతున్న ప్రార్థనా స్థలాల వివాదాలుతదనంతరం సంభల్లో హింస చెలరేగింది. ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ హింసాకాండలో కొందరు పోలీసులు, స్థానికులు గాయపడ్డారు. అజ్మీర్ షరీఫ్ దర్గాను మహాదేవుని ఆలయంగా అభివర్ణించడంతో చెలరేగిన వివాదం ఇంకా ముగియనే లేదు. ఈ అంశం కూడా కోర్టులో ఉంది. ఇటీవల జరిగిన ఈ వివాదాలు ఉదాహరణ మాత్రమే. దీనికి ముందు, మథురలోని జ్ఞానవాపి మసీదు, శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదాలు కూడా తరహాలోని హై ప్రొఫైల్ కేసులు. ఈ వివాదాలు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంతో ముడిపడివున్నాయి.చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆరు పిటిషన్లుప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ప్రార్థనా స్థలాల చట్టం అనేది ఏదో ఒక మతానికి చెందిన ప్రార్థనా స్థలాలను ఇతర మతాల ప్రార్థనా స్థలంగా మార్చకుండా నిరోధిస్తుంది. అయితే ఇప్పుడు ఈ చట్టాలనికి గల చట్టపరమైన చెల్లుబాటును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. అవి సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి.ప్రార్థనా స్థలాల చట్టం-1991లో ఏముంది?1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం 1947, ఆగస్టు 15కు ముందు అంటే దేశ స్వాతంత్య్రానికి ముందు ఉన్న ఏదైనా మతపరమైన ప్రార్థనా స్థలం యథాతథ స్థితిని కొనసాగించడానికి అధికారాన్ని ఇస్తుంది. అలాగే ఆయా ప్రార్థనా స్థలాలను ఇతర మతాల ప్రార్థనా స్థలాలుగా మార్చడాన్ని కూడా నిరోధిస్తుంది. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశాలున్నాయి. ఈ చట్టంలో కొన్ని ముఖ్యమైన సెక్షన్లు చేర్చారు.ప్రార్థనా స్థలం చట్టం సెక్షన్- 21947 ఆగస్టు 15 నాటికి ఏదైనా మతపరమైన స్థలంలో మార్పులకు సంబంధించి కోర్టులో ఏదైనా పిటిషన్ పెండింగ్లో ఉంటే, దానిని కొట్టివేస్తారని ప్రార్థనా స్థలాల చట్టంలోని సెక్షన్- 2 చెబుతోంది.ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సెక్షన్- 3మతపరమైన స్థలాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా మరొక మతంలోకి మార్చడానికి అనుమతి లేదు. 1947 ఆగస్టు 15న ఏ విధంగా ఉన్న మత స్థలాలు యధాతథంగా ఉంటాయి. నాడువున్న మతస్థలం అంతకుముందు ఎప్పుడైనా కూల్చివేసి, మరో మతస్థలం నిర్మించినట్లు రుజువైనా, దాని ప్రస్తుత రూపాన్ని మార్చేందుకు అవకాశం లేదు.ప్రార్ధనా స్థలం చట్టంలోని సెక్షన్- 4(1)సెక్షన్ 4(1) ప్రకారం 1947, ఆగస్టు 15 నాటికి అన్ని మతాల ప్రార్థనా స్థలాల యథాతథ స్థితిని కొనసాగించాలి.ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సెక్షన్- 4(2)ప్రార్థనా స్థలాల చట్టం సెక్షన్- 4 (2) ప్రకారం, ప్రార్థనా స్థలాల చట్టం అమల్లోకి వచ్చిన తేదీన పెండింగ్లో ఉన్న దావాలు, చట్టపరమైన చర్యలను నిలిపివేయడం గురించి ఇది తెలియజేస్తుంది. అంటే 1947 ఆగస్టు 15కు ముందు ఉన్న వివాదంపై తిరిగి విచారణ ఉండదు.ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సెక్షన్- 5ఈ సెక్షన్ కింద రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాన్ని పక్కన పెట్టారు. అంటే అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి ఈ ప్రార్థనా స్థలాల చట్టంలోని ఎలాంటి నిబంధనలు వర్తించవు.చట్టం ఎందుకు అవసరమయ్యింది?అయోధ్యలో రామమందిర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఈ చట్టం వచ్చింది. ఈ వివాదం దేశమంతటిపై ప్రభావం చూపింది. దేవాలయాలు, మసీదులకు సంబంధించిన వివాదాలు తెరపైకి రావడం మొదలయ్యింది. మతపరమైన ఉద్రిక్తతలు కూడా తలెత్తాయి. ఇలాంటి వివాదాలను నియంత్రించేందుకు అప్పటి ప్రభుత్వం ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకు వచ్చి, 1947 ఆగస్టు 15కి ముందు మత స్థలాల యథాతథ స్థితిని పునరుద్ధరించాలని ఆదేశించింది.ఇది కూడా చదవండి: India-Syria Ties: అసద్ పతనంతో భారత్-సిరియా దోస్తీ ఏంకానుంది? -
తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయని ‘ఎక్స్’ వేదికగా అన్నారు. ‘‘పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు.. హక్కులను అడిగితే బెదిరింపులు.. పోరాడితే సస్పెన్షన్లు.. ఇది నియంతృత్వ రాజ్యం.. నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం. పోరాటం తెలంగాణకు కొత్తకాదు.. ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నది. ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తాం.. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతాం’’అని పేర్కొన్నారు.పోరాడి సాధించుకొని.. పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..ప్రజాస్వామిక తెలంగాణలో..మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయి..ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు...హక్కులను అడిగితే బెదిరింపులు..పోరాడితే… pic.twitter.com/vmFnf0zmoP— KTR (@KTRBRS) November 2, 2024 -
Gift Deed: ముందే పకడ్బందీగా రాసుకోవాలి
నాకు, నా భార్యకి కలిపి కొంత ఆస్తి ఉండేది. వయసు అయిపోతుంది అని మా ఇద్దరి పిల్లలకి సమానంగా పంచుతూ గిఫ్ట్ డీడ్ చేశాము. అందులో ప్రస్తుతం మేము ఉంటున్న ఇల్లు కూడా వుంది. గిఫ్ట్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది. మా పిల్లల మధ్య వచ్చిన మనస్పర్థల వల్ల మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పరస్పరం తగాదా పడుతున్నారు. మాకు ఇదంతా చాల ఇబ్బందిగా మారింది. మేము ఇచ్చిన గిఫ్టు తిరిగి తీసుకోవాలి అనుకుంటున్నాము. పరిష్కారం తెలుపగలరు.– నరసింహ శర్మ, గుంటూరుట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ (ఆస్తి బదిలీ చట్టం) ప్రకారం ఒకసారి ఆస్తిని బదిలీ చేసిన తర్వాత, అది గిఫ్ట్ (బహుమతి) అయినప్పటికీ, సాధారణ పరిస్థితులలో రీవోకేషన్ (రద్దు చేయటం) సాధ్యపడదు. ఒకవేళ మీరు గిఫ్ట్గా ఇస్తున్న ఆస్తిని ఏదైనా కారణంచేత భవిష్యత్తులో తిరిగి తీసుకోవాలి అని మీరు అనుకుంటే, అలాంటి నిబంధనని, ఎలాంటి పరిస్థితులలో తిరిగి తీసుకోవచ్చు అన్న అంశాలను గిఫ్ట్ డీడ్ లో పొందుపరచవలసి ఉంటుంది. అలా రద్దు చేసుకోవచ్చు అని మీరు పేర్కొన్న సందర్భం ఎదురైతే, రద్దునకు తగు చర్యలు చట్టపరంగా తీసుకోవచ్చు. మీరు సీనియర్ సిటిజన్ అని అర్థం అవుతోంది. అందుకే మీకు అదనంగా తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం కింద కూడా కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు కనుక, మీరు చేసిన గిఫ్ట్ రిజిస్ట్రేషన్ పత్రంలో సదరు ‘గిఫ్టు తల్లిదండ్రులు, వయో వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం నిబంధనలకు లోబడి ఉంటుంది’ అనే అర్థం వచ్చేట్టు రాసుకుని వుంటే గనుక, మీరు ఇచ్చిన గిఫ్టును సులభంగా రద్దు చేసుకోవచ్చు లేదా ఉపసంహరించవచ్చు అంటే తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. అలా కాకపోయినా తిరిగి తీసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయం, కేవలం మీ పత్రాలు చూసిన తర్వాత మాత్రమే చెప్పగలం.తల్లిదండ్రులు – వయోవృద్ధులు తమ పిల్లలకి, కుటుంబ సభ్యులకు, మరే ఇతర వారసులకు లేదా మీరు ఆస్తి గిఫ్టు గా ఇవ్వాలి అనుకునే ఎవరికైనా సరే, గిఫ్టు డీడ్ (బహుమాన పత్రం/ఒప్పందం) లో కనీసం పైన పేర్కొన్న చట్టానికి ఆ గిఫ్టు లోబడి ఉంటుంది అని రాసుకోవటం ఉత్తమం. మీ వారసులు ఏదో చేస్తారు అని కాదు కానీ, మీ ప్రయోజనార్థం ఈ సూచన ఇస్తున్నాను.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
వీలునామాను మార్చవచ్చా? ఎన్నిసార్లు మార్చవచ్చు!
నేను ఇదివరకే వీలునామా రాసి ఉంచాను. అలా వీలునామా రాసిన విషయం నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకి చెప్పి ఉంచాను. ఇప్పుడు ఆ వీలునామాను మార్చాలను కుంటున్నాను. వీలవుతుందా? – పి. కోటేశ్వరరావు, విజయవాడమీరు సంపాదించిన ఆస్తులపై, మీకు సంక్రమించిన ఆస్తులపై వీలునామా రాయడం అనేది మీ హక్కు. మీ జీవిత కాలంలో మీ వీలునామాని మీరు కావాలి అంటే మార్చుకోవచ్చు. అయితే అలా మార్చుకోవాలి అనుకున్నప్పుడు గతంలోనే మీరు వీలునామా రాసిన విషయాన్ని, అందులోని అంశాలను, వివరాలను ప్రస్తావిస్తూ, పాత వీలునామా ఇక చెల్లదు అని మీరు రాయబోయే వీలునామాలో పేర్కొనాల్సి ఉంటుంది. మీ వీలునామాలో మీరు కావాలి అంటే ‘మరలా ఒకసారి కూడా వీలునామా మార్చవచ్చును’ అని, అలా మార్చక΄ోతే ఇదే ఆఖరి వీలునామా అవుతుంది అని కూడా రాయించవచ్చు.మీరు వీలునామా రాసిన విషయాన్ని ఇప్పటికే మీ బంధుమిత్రులకు, స్నేహితులకు చెప్పాను అని అన్నారు. అలాంటి వీలునామాలు చట్టరీత్యా చెల్లినప్పటికీ మీ తదనంతరం మీ ఆస్తిలో భాగం కోరుకునే వారు ఎవరైనా ఆ వీలునామా సరైనది కాదు అని లేదా మరొక కారణం చూపి లేని΄ోని కేసులు వేయవచ్చు. సొంతంగా రాసుకున్న వీలునామాలలో కచ్చితంగా ΄÷ందుపరచవలసిన కొన్ని అంశాలను విస్మరించడం తరచుగా చూస్తుంటాం. అలాంటి వీలునామాలు కోర్టు కేసులలో బలమైన అంశాలుగా పరిగణించబడవు. వీలునామాలో మీరు పేర్కొనే వారసులు ఒకవేళ మైనర్ అయితే, వారికి గార్డియన్ను నియమించటం, శానిటీ ఓత్ (చిత్తశుద్ధి ప్రమాణం/ధ్రువీకరణ) చేయటం, అచ్చుతప్పులు లేకుండా రాయటం, ఆస్తి వివరాలను క్షుణ్ణంగా వివరించటం వంటి అంశాలు వీలునామా చెల్లుబాటునకు అవసరం. అలా లీగల్ గా చెల్లుబడి అయేలా మెరుగైన వీలునామాను మీ దగ్గరలోని లాయర్తో రాయించుకుని, వీలునామాలో మీరు పొందుపరచాలి అనుకున్న నిబంధనలు ఏవైనా ఉంటే అవి చట్టరీత్యా చెల్లుతాయా లేదా అనే అంశాలను కూడా అడిగి తెలుసుకోవడం మంచిది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, మీరు రాసిన వీలునామాను రిజిస్టర్ చేయించుకోవడం ఉత్తమం. అలా రిజిస్ట్రేషన్ చేయించిన వీలునామా అయితే మీ తదనంతరం కూడా అందరికీ అన్ని విధాలా మేలు చేస్తుంది. మీరు అనుకున్న విధంగా మీ వీలునామా అమలుకు నోచుకుంటుంది.– శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshi.family3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
భూంకాల్ పోరాటం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాజ్యసంక్ర మణ సిద్ధాంతం, సైన్యసహకార పద్ధతి వంటి కుట్రపూరిత విధానాలతో బస్తర్ రాజ్యాన్ని కూడా ప్రిన్సిలీ స్టేట్గా బ్రిటీషర్లు మార్చారు. రాజును నామమాత్రం చేస్తూ పరోక్షంగా పాలన సాగించా రు. ఈ క్రమంలో 1878లో బ్రిటీష్ ప్రభుత్వం రిజ ర్వ్ ఫారెస్ట్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో బస్తర్ అడవుల్లో 66 శాతం భూభాగంపై ఆదివాసీ లు హక్కులు కోల్పోయారు. రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించిన ప్రదేశాల్లో కర్ర పుల్ల తీసుకెళ్లాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. మరోవైపు బ్రిటీ షర్ల కాలంలో బస్తర్ పాలకుడిగా ఉన్న భైరామ్ దేవ్ కుష్ఠువ్యాధి బారిన పడ్డారు. దీంతో ఆయన్ను పదవి నుంచి దూరంగా ఉంచి అతని కొడుకైన రుద్ర ప్రతాప్దేవ్ని 1891లో రాజుగా బ్రిటీష్ సర్కార్ గుర్తించింది. అయితే మేజర్ అయ్యేంత వరకు ఆయనకు పట్టాభిషేకం చేసే అవకాశం లేదు. అలా రాజుతోపాటు రాజకుటుంబంలో ప్రధాన పదవుల్లో ఉన్నవారు తమ అ«ధికారాలు కోల్పోయారు. ఇలా బ్రిటీషర్ల ఆధిపత్య ధోరణి కారణంగా ఇటు రాజవంశానికే కాక అటు ఆదివాసీలకు ఇక్కట్లు మొదలయ్యాయి. తిరుగుబాటుకు పిలుపు1909 అక్టోబర్లో జరిగిన దసరా వేడుకల్లో రిజర్వ్ ఫారెస్ట్ చట్టం, దాన్ని అమలు చేస్తున్న బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం చేయాలంటూ బస్తర్ రాజ్య మాజీ దివాన్ లాల్ కాళీంద్రసింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానికంగా పేరున్న ఆదివాసీ నేత గుండాధుర్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఫారెస్ట్ చట్టం కారణంగా తాము పడుతున్న బాధలను ఊరూరా ప్రచారం చేస్తూ తిరుగుబాటుకు ప్రజలను సిద్ధం చేశారు. ప్రతీ ఇంటి నుంచి ఒకరు పోరాటానికి రావాలని, ఆయుధాలు పట్టలేనివారు రాళ్లు, కర్రలు, కారం పొడి అయినా అందించాలని స్ఫూర్తి నింపారు. 1909 అక్టోబర్ నుంచి 1910 ఫిబ్రవరి మొదటివారం నాటికి బస్తర్లో అటవీ గ్రామాలన్నీ పోరాటానికి సంసిద్ధమయ్యాయి. ముఖ్యంగా బస్తర్లో ఉత్తర ప్రాంతమైన కాంకేర్ నిప్పు కణికలా మారింది.మూడు రోజుల్లోనే....1910 ఫిబ్రవరి 4న కుకనార్లో గుండాధూర్ నాయకత్వంలో ఆదివాసీలు బ్రిటీష్ అధికార కార్యాలయాలు, గోదాములు, మార్కెట్, ప్రభుత్వ అధికారుల ఇళ్లపై మెరుపుదాడులు జరిపారు. కేవలం మూడురోజుల్లోనే బస్తర్లోని 84 పరగణాల్లో 46 పరగణాలు తిరుగుబాటుదారుల అధీనంలోకి వచ్చాయి. కాంకేర్ ప్రాంతంలో బ్రిటీష్ అధికారులు, వ్యాపారులు ఇళ్లు వదిలి పారిపోయారు. దండకారణ్యంలో భూకంపం లాంటి తిరుగుబాటు వచ్చిందని తక్షణ సాయం అవసరమంటూ బ్రిటీష్ ప్రభుత్వానికి అప్పటి మహారాజు రుద్ర ప్రతాప్దేవ్ టెలిగ్రామ్ పంపారు. దీంతో ఈ పోరాటానికి భూంకాల్ పోరాటమని పేరు వచ్చింది. గుండాధూర్ చిక్కలేదుభూంకాల్ విప్లవాన్ని అణచివేసే పనిని కెప్టెన్ గేర్కు బ్రిటీష్ సర్కార్ అప్పగించింది. పదిరోజులు బ్రిటీష్, బస్తర్ స్టేట్ సైన్యాలు అడవుల్లో గాలించినా విప్లవకారుల్లో కేవలం 15 మందినే పట్టుకోగలిగారు. మరోవైపు తనను పట్టుకునేందుకు వచ్చిన కెప్టెన్ గేర్పైనే నేరుగా దాడి చేసి బ్రిటీషర్ల వెన్నులో గుండాధూర్ వణుకు పుట్టించాడు. తృటిలో కెప్టెన్ గేర్ ఆ దాడి నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడు కున్నాడు. దీంతో బెంగాల్, జైపూర్ రాజ్యాల నుంచి అదనపు బలగాలను బస్తర్కు రప్పించారు. ఆ తర్వాత గుంఢాదూర్కు నమ్మకస్తుడైన సోనుమాంఝీ ద్వారా కోవర్టు ఆపరేషన్ జరిపి 1910 మార్చి 25 రాత్రి గుంఢాధూర్ ఆయన సహచరులు బస చేసిన అటవీ ప్రాంతంపై బ్రిటీష్ సైన్యం దాడి జరిపింది. ఇందులో 21 మంది చనిపోగా మరో ఏడుగురు పట్టుబడ్డారు. కెప్టెన్ గేర్ ఎంతగా ప్రయత్నించినా ఆదివాసీ పోరాట యోధుడు గుండాధూర్ మాత్రం చిక్కలేదు. మెరుపు తిరుగుబాటుతో బ్రిటీషర్లకు చుక్కలు చూపించిన బస్తర్ ఆదివాసీలు ఆ తర్వాత తమ హక్కుల కోసం స్వతంత్ర భారత దేశంలో ఏర్పడిన ప్రభుత్వంతోనూ ఘర్షణ పడ్డారు. ఈ పోరులో తాము దైవంగా భావించే మహారాజునే కోల్పోయారు. -
త్వరలోనే డేటా రక్షణ నిబంధనలు
న్యూఢిల్లీ: వ్యక్తిగత డిజిటల్ డేటా పరిరక్షణ చట్టం ముసాయిదా నిబంధనలను నెలరోజుల్లోనే విడుదల చేస్తామని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. ప్రభుత్వం తొలుత డిజిటల్గా ఈ చట్టం అమలుపై దృష్టి పెట్టినట్టు.. అందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించినట్టు చెప్పారు.‘‘కార్యాచరణ సిద్ధమైంది. సంప్రదింపుల కోసం ముసాయిదా నిబంధనలను నెల రోజుల్లోపు ప్రజల ముందు ఉంచుతాం’’ అని మీడియా ప్రతినిధులకు వైష్ణవ్ తెలిపారు. నిబంధనలకు సంబంధించి భాష సరళతరంగా ఉంటుందన్నారు. గోప్యత హక్కు అన్నది ప్రాథమిక హక్కుల్లో భాగమేనంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఆరేళ్ల తర్వాత.. 2023 ఆగస్ట్ 9న ‘ద డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు’కు పార్లమెంట్ ఆమోదం తెలపడం గమనార్హం.ఆన్లైన్ ప్లాట్ఫామ్లు యూజర్ల వ్యక్తిగత డేటా దుర్వినియోగాన్ని ఈ చట్టం అడ్డుకుంటుంది. వ్యక్తిగత డేటా సేకరణ, ప్రాసెసింగ్కు సంబంధించి నిబంధనలను కచ్చితగా అమలు చేయాల్సి ఉంటుంది. డేటా ఉల్లంఘన చోటుచేసుకుంటే రూ.250 కోట్ల వరకు జరిమాన చెల్లించే నిబంధన సైతం ఈ చట్టంలో భాగంగా ఉంది. -
కొత్త చట్టమే..! భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సర్కారు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రస్తుతమున్న ఆర్వోఆర్ చట్టం ఉపయోగ పడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్–2020) చట్టాన్ని పూర్తిగా మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. పాత చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకురానుంది. అనేక అంశాల్లో స్పష్టతనిస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. ముసాయిదా చట్టం సిద్ధమవుతోందని, వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి ఆమోదం తెలిపే బిల్లును తీసుకువస్తారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. కొత్త చట్టమే ఉత్తమం! గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ను అమల్లోకి తెస్తున్న సందర్భంగా, ఇంతకుముందున్న చట్టం స్థానంలో ఆర్వోఆర్–2020 చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం నియమించిన ప్రత్యేక కమిటీ ఈ చట్టాన్ని అధ్యయనం చేసింది. ఈ చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని, చాలా అంశాలపై ఇది స్పష్టత ఇవ్వడం లేదని, దీని ద్వారా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా, కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయని కమిటీలోని నిపుణులు అభిప్రాయపడ్డారు. పాత చట్టంలో చేయాల్సిన సవరణల గురించి పలు సిఫారసులు చేశారు. లేనిపక్షంలో పూర్తిగా కొత్త చట్టాన్నైనా తీసుకురావాలంటూ ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలోనే లోపభూయిష్టమైన పాత చట్టానికి మార్పులు చేయడం కన్నా తమ ముద్ర ఉండే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావడమే సమంజసమనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వచి్చనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పాత చట్టంలోని కొన్ని అంశాలను తీసుకుంటూనే, అవసరమైన కీలక సవరణలు చేస్తూ రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్–2024) చట్టాన్ని రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. ముసాయిదా చట్టంపై న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత రాష్ట్ర కేబినెట్లో ఆమోదించి, ఆ తర్వాత జూలైలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదం పొందేలా ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కీలకాంశాల్లో మార్పులతో.. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టంలోని కీలకాంశాల్లో మార్పులు చేస్తూ కొత్త చట్టం తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా భూసమస్యల పరిష్కారం కోసం పలు స్థాయిల్లోని అధికారులకు ఉండే అధికారాల వికేంద్రీకరణపై కొత్త చట్టంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు ఎలాంటి అధికారాలు ఇవ్వాలి, ఆయా స్థాయిల్లోని అధికారులు ఎలాంటి నిర్ణయాలకు బాధ్యత వహిస్తారనే అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పార్ట్–బీలో పెట్టిన 18 లక్షల ఎకరాలు, సాదాబైనామాల కింద లావాదేవీలు జరిగి పాస్ పుస్తకాలు రాని 9 లక్షల ఎకరాల భూములకు పరిష్కారం చూపించే దిశలో చట్టం రూపొందుతోందని తెలుస్తోంది. అసైన్డ్, భూదాన్ కంగాళీకీ చెక్!అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూములకు సంబంధించిన కంగాళీ కూడా లేకుండా అన్ని సమస్యలకు పరిష్కారం చూపే విధంగా పాత చట్టాన్ని మార్చి కొత్త చట్టాన్ని తయారుచేస్తున్నారని, రెవెన్యూ ట్రిబ్యునళ్ల పునరుద్ధరణ లాంటి కీలక అంశాలు కొత్త చట్టంలో ఉంటాయని తెలుస్తోంది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసే అధికారాలను జాయింట్ సబ్ రిజి్రస్టార్ హోదాలో తహసీల్దార్లకే ఉంచాలా లేక డిప్యూటీ తహసీల్దార్లకు అప్పజెప్పాలా అన్న దానిపై కూడా కొత్త చట్టంలో స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం. కాగా ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించనున్నట్లు తెలిసింది. -
ఏఐతో వై-ఫై స్పీడ్ పెంచేందుకు పెట్టుబడులు
యాక్ట్ ఫైబర్నెట్ కంపెనీ..నెట్వర్క్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ స్టార్టప్ అప్రెకామ్లో పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించింది. యాక్ట్ ఫైబర్నెట్ తమ కస్టమర్లకు అందిస్తున్న హోమ్ వై-ఫై సదుపాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు, నెట్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు.ఈ సందర్భంగా యాక్ట్ ఫైబర్నెట్ సీఈఓ బాల మల్లాది మాట్లాడుతూ..‘అప్రెకామ్ అధునాతన సాంకేతికతను యాక్ట్ ఫైబర్నెట్ వై-ఫై టెక్నాలజీకు అనుసంధానం చేయనున్నాం. ఇది వై-ఫై పనితీరులో వేగాన్ని పెంచుతుంది. రియల్టైమ్ నెట్వర్క్ విజిబిలిటీని అందిస్తుంది. ఇకపై కస్టమర్లకు మరింత ఉత్తమమైన నెట్ సేవలందుతాయి. అప్రెకామ్ తయారుచేసిన ఏఐ ఆధారిత సెల్ఫ్ ఆప్టిమైజింగ్ టెక్నాలజీ, అధునాతన వై-ఫై అనాలసిస్ కంపెనీ నెట్వర్క్ను నిరంతరం ఆప్టిమైజ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.బెంగళూరుకు చెందిన యాక్ట్ ఫైబర్నెట్ దేశంలోని అతిపెద్ద వైర్డ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటిగా ఉంది. ఈ సంస్థ 25 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2.2 మిలియన్ కస్టమర్లకు సేవలు అందిస్తోంది. -
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? మత్తు, మందు..ఇంకా?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్పార్టీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు నటీనటులు పట్టుబడ్డారన్న వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సెలబ్రిటీలు సినిమా స్టార్స్స్పై పదే పదే ఎందుకు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు రేవ్పార్టీ అంటే ఏమిటి? కేవలం చిందు మందుతోపాటు, నిషేధిత మత్తుమందులు కూడా ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.రేవ్ పార్టీలు రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ప్రధానంగా బడాబాబుల బిడ్డలు, సెలబ్రిటీల పిల్లలు రేవ్ పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పలువురితోపాటు, ఇటీవల ప్రముఖ ఎల్విష్ యాదవ్పై ఆరోపణలు నమోదైనాయి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ అంటే ఏంటి? సెలబ్రిటీలకు ఎందుకంత క్రేజ్ విదేశాలతో పాటు, ముంబై, పుణె, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ-ఎన్సిఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో రేవ్ పార్టీలు పరిపాటి. ఈమధ్య కాలంలో ఈసంస్కృతికి హైదరాబాద్ నగరంలో కూడా విస్తరించింది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM) ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. సాధారణంగా రేవ్ పార్టీలు చాలా ఖరీదైన వ్యవహారం. ఇక్కడ గోప్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే డబ్బున్నోళ్లు, సెలబ్రిటీలు, సినీతారలు ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడికి క్యూ కడతారు. డ్యాన్స్, ఫన్, ఫుడ్, మద్యంతోపాటు, డ్రగ్స్కూడా ఇక్కడ యధేచ్ఛగా లభ్యమవుతాయి. రేవ్ పార్టీలు కాస్తా డ్రగ్స్ పార్టీలుగా మారిపోతున్నాయి. ఫుడ్, కూల్డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా, కొకైన్, హషిష్, చరాస్, ఎల్ఎస్డి, మెఫెడ్రోన్ తదితర డ్రగ్స్ కూడా దొరుకుతాయని సమాచారం.. కొన్ని రేవ్ పార్టీలలో లైంగిక కార్యకలాపాల కోసం ‘రూమ్స్’ కూడా ఉంటాయట. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి, విక్రయించేవారికి ఇది సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు.రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్ లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్లుగా నిలిచాయి.60వ దశకంలో యూరోపియన్ దేశాలలో పార్టీలంటే కేవలం మద్యానికి మాత్రమే. కానీ 80వ దశకంలో రేవ్ పార్టీ రూపమే పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవ్ పార్టీల ధోరణి ప్రారంభమైంది. లండన్లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను ‘రేవ్ పార్టీలు’ అని పిలుస్తారు. యుఎస్ లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ ప్రకారం.. రేవ్ పార్టీ 80ల నాటి డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించింది. డ్యాన్స్ పార్టీ కాస్తా రేవ్ పార్టీగా మారి పోయింది. మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక(ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం గంజాయికి కొకైన్, MDMA, LSD మొదలైన మత్తుపదార్థాలు , మాదకద్రవ్యాల వాడకం నిషేధం. -
ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య మా బంధువు ఒకాయన తరచుగా మీ సేవ కేంద్రానికి వెళుతున్నారు. ఎందుకు? అని అడిగితే.. ఆయన చెప్పిన విషయం ఆశ్చర్యం కలిగించింది. తన పొలం, స్థలాల వంటివి తన పేరనే ఉన్నాయా?లేవా? అన్నది చూసుకోవడానికి అని చెప్పారు. ఈసీ తీసుకోవడానికి వెళ్తున్నా అని అన్నారు. అలా ఎందుకు ఒక్కసారి రిజిస్టర్ అయ్యాక ఎక్కడి వెళతాయని అన్నాను. ఆయన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యం వేసింది.ప్రభుత్వం ఏదో చట్టం తెచ్చిందట. మా భూములు మాకు ఉండవట. ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని కాపీలు ఇస్తారట!.. ఇలా చెబుతూ పోయాడు. అదంతా విని ‘అలా ఎందుకు జరుగుతుంది?’ అని అడిగా. దానికి అతను వివరణ ఇచ్చాడు. అప్పుడు అర్ధం అయింది. ఆయన ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన అబద్దపు వార్తల ప్రభావానికి లోనయ్యాడని. ఒక మంచి పని చేయాలంటే ఒప్పించడానికి చాలా కష్టపడాలి. అదే ఒక వదంతి సృష్టించడం ఎంత తేలికో చూడండి. దేశంలో కాని, ప్రపంచంలోకాని ఏ ప్రభుత్వం అయినా ఎవరి ప్రైవేటు ఆస్తులను లాక్కోవడానికి చట్టం తీసుకు వస్తుందా? విద్యాధికుడు అయిన ఆయనే ఇంత అపోహపడితే ,సామాన్య ప్రజలు ఇంకెత అపార్ధం చేసుకుంటారు.టైటిలింగ్ చట్టం వస్తే ఎవరి భూములు ఉండవని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా నీచమైన అబద్దాలు రాయడానికి సిగ్గు పడడం లేదు. టీడీపీ మేనిఫెస్టోని జనం నమ్మడం లేదని, ఇలాంటి అబద్దాలు ప్రచారంచేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే పదో తరగతి మాత్రమే చదివిన వ్యక్తి కనుక ఆయన జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారులే అని అనుకోవచ్చు. కానీ ఎమ్.ఎ. చేసిన చంద్రబాబు నాయుడు వంటివారు కూడా ఇలా ప్రచారం చేయడం ఏమిటి?ఆయన నాయకత్వం వహించే తెలుగుదేశం పార్టీ ఈ అసత్యాలను ప్రజలలో ఎందుకు విస్తరిస్తోంది. సుమారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదహారు ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి దుర్మార్గపు ప్రచారాలు చేయవచ్చా? అంటే ఏమి చెబుతాం. ఔఆయనది ఎప్పుడూ కుట్ర స్వభావమే. తాను అధికారంలో ఉంటే అన్ని సంస్కరణలు తనవే అంటారు.ప్రతిపక్షంలో ఉంటే ఏ సంస్కరణ చేపట్టకూడదని అంటారు.తన వ్యతిరేక ప్రభుత్వం ఉంటే ,ఆ సంస్కరణలపై విషం కక్కుతారు. ఈయన రాజకీయ నేత, కుట్రలకు అలవాటుపడిన మనిషి కనుక ఇలా చేస్తున్నారులే అని అనుకోవచ్చు. కానీ, ఏభై ఏళ్లుగా ప్రజలకు తమ పత్రికల ద్వారా ,ఆ తర్వాత రెండు దశాబ్దాలుగా టీవీల ద్వారా విజ్ఞానం అందిస్తున్నామని ప్రచారం చేసుకునే ఈనాడు అధినేత రామోజీరావు ఇలాంటి దరిద్రపు ప్రచారం చేస్తున్నారు? అబద్దం అని తెలిసి కూడా ఇలాంటి చెత్త వార్తలు రాయవచ్చా? అంటే ఆ విజ్ఞతను రామోజీ ఎప్పుడో కోల్పోయారు. ఏపీ ప్రజలలో జగన్పై ఉన్న అభిమానాన్ని ఎలాగొలా మార్చాలని, జగన్ కు అనుకూలంగా ఉన్న ప్రజాభిప్రాయాన్ని మార్చాలన్న దుర్మార్గపు ఆలోచనే రామోజీరావులో ఉండడమే ఇందుకు కారణం. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడూ అలాంటి నీచపు ఆలోచనలతో ఉంటారు కనుక చెప్పుకోనవసరం లేదు.వాస్తవం ఏమిటంటే టైటిలింగ్ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ చట్టాన్ని ఆమోదించారు. కానీ ఇంకా మార్గదర్శక సూత్రాలను సిద్దం చేయలేదు. పైగా కోర్టులో స్టే ఉంది. రైతుల,భూ యజమానుల హక్కులను రక్షించి,వారికి అధునాతన టెక్నాలజీలో భూముల వివరాలను నమోదు చేయడానికి ఉద్దేశించినది ఈ చట్టం. కేంద్ర ప్రభుత్వం పలు కమిటీలు వేసి, వారు చేసిన సిఫారసుల మేరకు ఈ మోడల్ చట్టాన్ని రూపొందించింది.దీని ప్రకారం.. రాష్ట్రాలలో ఉన్న భూ వివాదాలు తగ్గించవచ్చు. ఒకసారి భూముల సర్వే జరిగి వివిధ శాఖల సమన్వయంతో రికార్డులలోకి వివరాలు ఎక్కితే భూ యజమానికి పూర్తి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అంతే తప్ప ఎవరి భూమి ప్రభుత్వం తీసుకోలేదు.భూములు, రిజిస్ట్రేషన్ ల రంగంలో నిపుణులైన కొందరు దీనిని అధ్యయనం చేసి,ఈ చట్టం తీసుకురావడం దేశానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఒకవేళ ఏవైనా చిన్న,పెద్ద అనుమానాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చు.అలాకాకుండా అసలు ఈ చట్టాన్నే వ్యతిరేకిస్తూ ఎన్నికల సమయంలో ప్రజలలో అపోహలు సృష్టించడానికి టిడిపి,ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలు ప్రయత్నించడం అంటే ఎపి ప్రజలకు ద్రోహం చేయడమే.ఈ చట్టం వస్తే వీరు తమ బినామీ,కబ్జా భూముల బాగోతం బయటకు సస్తుందని భయపడుతుండవచ్చు.ఒకసారి గతంలో చంద్రబాబు ఏమి చెప్పేవారో గుర్తుకు చేసుకోండి. ఆయన 1995 లో ఎన్టీఆర్ను పడగొట్టి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత తాను సంస్కరణవాదినని ప్రచారం చేసుకున్నారు. సచివాలయంలో కంప్యూటర్లు ప్రవేశపెట్టిన వ్యక్తినని చెప్పుకునేవారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో భూముల రిజిస్ట్రేషన్ ను కంప్యూటర్ ద్వారా చేసేవారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి సంస్కరణలు తీసుకు వచ్చింది. అయితే చంద్రబాబు తన టైమ్ లో ఏమి చేసినా తన ఘనత అని,అదే ఎదుటివారు ఏమైనా చేస్తుంటే బురద చల్లుతుంటారు.ఉదాహరణకు కేంద్రం తీసుకువచ్చిన చట్టం ప్రకారం విద్యుత్ రంగంలో కొన్ని మార్పులు తీసుకురావడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పుడు ఆ చట్ట సవరణ చేసిన కేంద్రం కన్నా,తానే అవన్ని కనిపెట్టానని చెప్పుకునేవారు.రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలు లేదని అనేవారు.ప్రభుత్వరంగంలో కార్పొరేషన్ లు వృధా అని చెప్పేవారు. తన మనసులో మాట పుస్తకంలో ఇలాంటివి అనేకం ఉన్నాయి. కాని అదే పెద్దమనిషి ప్రతిపక్షంలోకి రాగానే పూర్తిగా రివర్స్గా మాట్లాడుతున్నారు. మరో ఉదాహరణ చూస్తే.. కేంద్రం ఆదేశాల ప్రకారం జగన్ ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టింది. ఇదే చంద్రబాబు ఏమని ప్రచారం చేశారో తెలుసా?మోటార్లకు మీటర్లు అంటే రైతులకు ఉరి వేయడమే అని అన్నారు. పోనీ దానికే కట్టుబడి ఉన్నారా అంటే అదేమి లేదు. ఆ చట్టం తీసుకు వచ్చిన కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఆ ఊసు ఎత్తడం లేదు. ఎల్లో మీడియా కూడా దీని గురించి ప్రచారం ఆపేసింది.అలాగే ఇప్పుడు కేంద్రం తీసుకు వచ్చిన ఈ చట్టం ఇంకా ఏపీలో అమలులోకి రాకముందే పచ్చి అబద్దాలను వీరంతా కలిపి ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారు. అదృష్టవశాత్తు చంద్రబాబు చెప్పేవాటిని ప్రజలు నమ్మడం లేదు కాబట్టి సరిపోయింది. రామోజీ , రాధాకృష్ణలు రాసే వార్తలను జనం విశ్వసించడం లేదు కనుక సరిపోయింది. లేకుంటే ఏపీ సమాజం అంతా తీవ్ర అలజడికి గురి అయ్యేది. అయినా వీరు రాసే అబద్దాలను నమ్మేవారు కొద్ది మంది ఉండకపోరు. ఒక చదువుకున్న వ్యక్తి అనుభవాన్ని గమనిస్తే,ఇలాంటి వారు కూడా ఉండవచ్చన్న భావన కలుగుతుంది. వీరిలో అత్యధికులు తెలుగుదేశం వారే. వారే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి రాసే చెత్తవార్తలు రాసి నమ్మి టెన్షన్ పడుతున్నారు.31 లక్షల ఇళ్ల స్థలాలు, కొన్ని లక్షల ఎకరాల చుక్కల భూములు.. తదితరాలను చట్టబద్దం చేసి పేద ప్రజలకు, అర్హులైన వాళ్లకు అందించిన జగన్ భూములు లాక్కొంటారని ఎంత దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారో చూడండి.ఏ సంస్కరణ అయినా, ఏ టెక్నాలజీ అయినా ప్రజలకు మంచి చేయడానికే ప్రభుత్వాలు తీసుకు వస్తాయి. అంతే తప్ప వారికి నష్టం చేయాలని ఎందుకు అనుకుంటాయి?. ఒకప్పుడు పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు తీసుకు వచ్చినప్పుడు వామపక్షాలు సీపీఐ, సీపీఎం వంటివి తీవ్రంగా వ్యతిరేకించేవి. బీజేపీ కూడా విమర్శలు చేసేది. కానీ బీజేపీ ఆధ్వర్యంలోని వాజ్ పేయి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ సంస్కరణలు అనుసరిస్తున్నట్లు ప్రకటించింది. మోదీ ప్రభుత్వం అయితే ఏకంగా భారతరత్న బిరుదును ఇచ్చింది.ఒకప్పుడు కంప్యూటర్లు లేని రోజుల్లో తెల్ల కాగితాల మీద పెన్నుతో ఏ విషయం అయినా రాయవలసి వచ్చేది. కంప్యూటర్లు వచ్చాక మొత్తం జన జీవితాలే మారిపోయాయి. కంప్యూటర్లనే అంతా వాడడం ఆరంభం అయింది. మొదట్లో ఈ కంప్యూటర్లను వ్యతిరేకించినవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ కంప్యూటర్ లేని జీవితాన్ని ఊహించగలమా? ఉమ్మడి ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పౌరులు రిజిస్టర్ చేసుకున్న డాక్యుమెంట్లన్నిటీ స్కాన్ చేసి కంప్యూటర్ లోకి ఎక్కిస్తున్నారు.దీనివల్ల రికార్డులకు భద్రత పెరిగింది.అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ లలో మోసాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టడానికి ఒకసారి రిజిస్టర్ అయిన భూమిని సంబంధిత యజమానికి సంబంధం లేకుండా మరెవరూ రిజిస్టర్ చేయడానికి వీలులేని విధంగా టైటిలింగ్ చట్టం ఉపయోగపడుతుంది.ప్రతి భూమికి ఒక నెంబర్ ఇస్తారు.దాని ఆధారంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఇందుకోసం ఇప్పటికే ఏపీలో భూముల సర్వే జరుగుతోంది. ఇదంతా అయిన తర్వాత కాని టైటిలింగ్ చట్టం అమలు చేయవలసి ఉంటుంది. అయినా ప్రజలలో అనవసర అనుమానాలను విపక్షం, ఎల్లో మీడియా కల్పిస్తున్నందున ,అసలు ఈ చట్టాన్ని ఇప్పట్లో అమలు చేయబోమని,దేశం అంతటా దీనిపై అన్ని రాష్ట్రాలు ఒక అభిప్రాయానికి వచ్చాక అమలు చేస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాలి.గతంలో బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే, ఆ డిపాజిట్లకు సర్టిఫికెట్ లు ఇచ్చేవారు. వాటిని మనం భద్రపరుచుకోవల్సి ఉండేది. ఇప్పుడు బ్యాంకులు సర్టిఫికెట్ ల బదులు రశీదులు ఇస్తున్నాయి. అవి కేవలం మన సంతృప్తి కోసమే. ఎందుకంటే మనం డిపాజిట్ మెచ్యూర్ అయ్యే డేట్ మర్చిపోయినా, బ్యాంకుల నుంచి ఆటోమాటిక్ గా మెస్సేజ్ రావడం, మనం ఆ డిపాజిట్ తీసుకోవడం జరుగుతోంది. ఎంత మార్పో ఆలొచించండి. ఒకప్పుడు ఏ కంపెనీ షేర్లను అయినా అప్లై చేసుకుంటే అవి సర్టిఫికెట్ రూపంలో వచ్చేవి. ఆ షేర్లను మనం అమ్మితే వాటిని కొనుగోలుదారుకు పంపవలసి ఉండేది. కాని ఇప్పుడు అసలు షేర్లు ఎలా ఉంటాయో కూడా ఎవరూ చూడనక్కర్లేదు. అన్ని డిజిటల్ లాకర్ లలోనే ఉంటున్నాయి. కొన్ని ట్రేడింగ్ కంపెనీలు వీటిని నిర్వహిస్తున్నాయి. మరి నా షేర్ సర్టిఫికెట్ ను ఇవ్వకుండా కాపీ ఇస్తారా? అని ఎవరైనా అడిగితే అతనిని అయోమయం వ్యక్తిగా చూస్తారు.అలాగే.. ఇప్పుడు భూముల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఒరిజినల్వి కాదని కొందరు ప్రచారం చేస్తున్నారు. కంపెనీల షేర్ల మాదిరి భూములు కూడా కంప్యూటర్లలో ఈ చట్టం కింద పరిరక్షణలో ఉంటాయి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాపీ తీసుకోవచ్చు. నిరభ్యంతరంగా లావాదేవీలు జరుపుకోవచ్చు.ఇంకో ఉదాహరణ చెప్పాలి. గతంలో పత్రికలు తమ దిన సంచికలను జాగ్రత్తగా స్టోర్ చేసేవి. అవన్ని దుమ్ముకొట్టుకుపోయేవి.చెదలు పట్టి పాడైపోతుండేవి. మరి ఇప్పుడు వాటన్నిటిని డిజిటలైజ్ చేస్తున్నారు. పలు లైబ్రరీలు కూడా ఇలాగే వివిధ పత్రికలను డిజిటలైజ్ చేసి అందుబాటులో ఉంచుతున్నారు. అలాకాదు.ఒరిజినల్ పాత పేపర్లు కావాలని ఎవరైనా అడిగితే ఏమి చెబుతాం?. పాతకాలపు మనిషి అని నవ్వుకుంటారు.కొన్ని సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు తయారు చేసేవారు లేకపోవడంతో భూ వివాదాలు పెరిగాయి. నకిలీలు, కబ్జాలు, రాజకీయ జోక్యం పెరిగిపోయింది..వీటన్నింటిని అరికట్టడానికి లాండ్ టైటిలింగ్ చట్టం ఉపయోగపడుతుంది.ఇక ఈ-స్టాంపింగ్ వ్యవస్థపై కూడా ఈనాడు పత్రిక దారుణమైన అబద్దాలు రాసింది. ఇప్పటికే పన్నెండు రాష్ట్రాలలో ఈ-స్టాంపింగ్ వ్యవస్థ అమలులో ఉంది. తెల్గీ స్టాంప్ కుంభకోణం తర్వాత కేంద్రం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న స్టాంప్ పేపర్ల కంటే ఎక్కువ భద్రత తో ఈ-స్టాంపింగ్ వ్యవస్థను కేంద్రం తెచ్చింది.ఈ ప్రభుత్వం కూడా దీనిపై ప్రయోగాలు చేస్తుంటే ,కొందరు స్వార్ధపరులు దీనికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ స్టాంపులు జిరాక్స్ కాపీలు కావని ,నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్ల కంటే ఎక్కువ సేఫ్ అని వారు అంటున్నారు.ఏపీలో ఏ అభివృద్ది జరిగినా, ఏ సంస్కరణ తెచ్చినా ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాటికి వ్యతిరేకంగా పచ్చి అబద్దాలు రాయడం,దానిని చంద్రబాబు, పవన్ కల్యాణ్లు అందుకోవడం నిత్యకృత్యం అయింది. వలంటీర్ల వ్యవస్థపై వీరంతా ఎంత విషం చిమ్మారో చూశాం. ఇప్పుడు అదే వ్యవస్థ తాము కొనసాగిస్తామని,ఇంకా ఎక్కువ జీతాలు ఇస్తామని చెబుతున్నారు. గ్రామ ,వార్డు సచివాలయాలతో గ్రామ పంచాయతీలకు నష్టం అని ప్రచారం చేశారు. ఇప్పుడు వృద్దుల పెన్షన్లు వారి ద్వారానే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏ సంస్కరణ తెచ్చినా విషం కక్కుతున్న వీళ్లిద్దరి పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి ఇలాంటివారిని నమ్మి మోసపోయారు. మరోసారి మోసపోతే కోలుకోవడం కష్టమే అవుతుందని చెప్పక తప్పదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన అక్రమఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ (ఐటీఏ)ను కూడా జత చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నా రు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైనప్పుడు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల అరెస్టు సమ యంలో ఈ చట్టంలోని సెక్షన్ల మేరకు ఆరోపణలు లేవు. తాజాగా ఈ చట్టాన్ని జోడించిన అధికారులు ఈ మేరకు నాంపల్లి కోర్టుకు మెమో ద్వారా సమాచారమిచ్చా రు. మరోపక్క ఈ కేసులో నిందితులపై నేరం నిరూపించ డానికి అవసరమైన చర్యలను సిట్ అధికారులు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎస్ఐబీలో ఎలక్ట్రీషియన్గా పని చేసిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ను సాక్షిగా చేర్చారు. ఐటీఏ ఉండాలన్న న్యాయ నిపుణులు ట్యాపింగ్పై ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్స్టేషన్లో ప్రణీత్ రావు, ఇతరులపై ఈ నెల 10న కేసు నమోదైంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) పోలీసులు మూడు చట్టాల్లోని తొమ్మిది సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు. ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల్లోని సెక్షన్లు చేర్చారు. కాగా ఈ నెల 13న ప్రణీత్ అరెస్టు తర్వాత కోర్టులో రిమాండ్ కేసు డైరీని సమర్పించిన అధికారులు.. ఇందులో ఓ సెక్షన్ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు. తొలుత చేర్చిన ఐపీసీలోని 120 బీ (కుట్ర), 34 (ఒకే ఉద్దేశంతో చేసే ఉమ్మడి చర్య) రెండు సెక్షన్లలో.. 120 బీ సెక్షన్లను తొలగించారు. అయితే నిందితులపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కింద అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఐటీఏను జోడించి, అందులోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ పిటిషన్లతో పాటు ఈ చట్టాన్ని జోడిస్తూ మెమోను కూడా అధికారులు కోర్టులో దాఖలు చేశారు. కీలకం కానున్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణ హార్డ్డిస్క్ల విధ్వంసంలో ప్రణీత్రావుతో కలిసి పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ కైతోజు కృష్ణను ఈ కేసులో సాక్షిగా చేర్చారు. నాటి ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్రావు ఆదేశాల మేరకు ప్రణీత్రావు గత ఏడాది డిసెంబర్ 4న అర్ధరాత్రి కృష్ణతో కలిసే ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లాడు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్తో పాటు అధికారిక ట్యాపింగ్లు జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలను కృష్ణ ద్వారా ఆఫ్ చేయించాడు. అతని సహాయంతో వార్ రూమ్లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితో పాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్ డిస్క్ల్నీ ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ధ్వంసం చేశాడు. ఈ కారణంగానే సిట్ అధికారులు కృష్ణను సాక్షిగా చేర్చారు. త్వరలో ఇతడితో న్యాయస్థానంలో స్టేట్మెంట్ రికార్డు చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే సిట్ కృష్ణ వాంగ్మూలం నమోదు చేయగా.. భవిష్యత్తులో అతను సాక్ష్యం చెప్పకుండా ఎదురుతిరిగే అవకాశం లేకుండా ఈ చర్య తీసుకోనున్నారు. ఎస్ఐబీలో నడిచిన ఓఎస్డీల రాజ్యం.. ఎస్ఐబీని చాలాకాలం పాటు పదవీ విరమణ పొంది ఓఎస్డీలుగా పనిచేస్తున్న వాళ్లే నడిపినట్లు తెలిసింది. ఇలాంటి దాదాపు 15 మంది అధికారులను ఆధారంగా చేసుకుని కథ నడిపినట్లు సమాచారం. ఓ మాజీ డీఐజీ, ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు ఇందులో కీలకంగా పనిచేశారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మారిన తరవాత ప్రభాకర్రావుతో పాటే వీళ్లు కూడా రాజీనామా చేసి వెళ్లిపోయారు. సాధారణంగా ఎస్ఐబీ లాంటి సున్నిత విభాగాల్లో మాజీ అధికారులను, ప్రైవేట్ వ్యక్తులను కీలక స్థానాల్లో ఉంచరని, అయితే ప్రభాకర్రావు స్వయంగా ఓఎస్డీ కావడంతో ఎస్ఐబీలో ఓఎస్డీలతో పాటు ప్రైవేట్ వ్యక్తుల రాజ్యం నడిచిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రణీత్రావుకు ట్యాపింగ్ వ్యవహారంలో ఐదుగురు ఇన్స్పెక్టర్లు సహకరించినట్లు సిట్ తేల్చింది. ఆ అధికారులకు త్వరలో నోటీసులు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు త్వరలో డీజీపీ, అదనపు డీజీపీ స్థాయి అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రధాన కార్యాలయం లక్డీకాపూల్లో ఉన్నప్ప టికీ... గ్రీన్ల్యాండ్స్లోని ఎస్ఐబీ కార్యాలయంలో కూడా ఆయనకు ఓ ఛాంబర్ ఉంది. గడిచిన కొన్నేళ్లుగా నిఘా విభాగాధిపతి అక్కడకు రాక పోవడంతో ప్రణీత్ రావు ఈ ఛాంబర్తో పాటు పక్కన ఉన్న రూమ్ను తన అక్రమ ట్యాపింగ్ వ్యవహారాల కోసం వార్రూమ్గా వినియోగించుకున్నట్లు తేలింది. ఆ చాంబర్ ఇతరులు విని యోగించాంటే కచ్చితంగా నిఘా విభాగాధిపతి, డీజీపీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్పట్లో ఏ కారణం చెప్పి ఈ అనుమతి తీసుకు న్నారు? ట్యాపింగ్ వ్యవహారాలు తెలిసే అను మతి ఇచ్చారా? లాంటి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి గాను వీరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. -
కొత్త రెవెన్యూ చట్టం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పట్టాదారు పాస్పుస్తకాల చట్టం (రికార్డ్ ఆఫ్ రైట్స్)–2020 స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం రానున్నట్టు సమాచారం. ధరణి పోర్టల్ ద్వారా రైతు లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ చట్టం అడ్డంకిగా మారిందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కొత్త చట్టం ప్రవేశపెట్టాలని సర్కారు భావి స్తోందని సమాచారం. ప్రస్తుత చట్టంలోని అనేక అంశాలకు సవరణలు సూచిస్తూ, ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ 20 పేజీల ముసాయిదాను రూపొందించిందని, అయితే అన్ని సవరణలతో అతుకుల బొంత లాంటి చట్టాన్ని మను గడలో ఉంచడానికి బదులు కొత్త చట్టాన్ని తీసుకురావడమే మంచిదని ప్రభుత్వం భావించిందనే చర్చ రెవెన్యూ వర్గా ల్లో జరుగుతోంది. దీనిపై ఆర్డినెన్స్ తేవాలనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో జరిగినా, అసెంబ్లీ ప్రొరోగ్ కానందున ఆర్డినెన్స్ చేసే అవకాశం లేదన్న న్యాయ నిపుణుల అభిప్రా యంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్టు తెలు స్తోంది. అయితే అప్పటివరకు ధరణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా స్పెషల్ డ్రైవ్ ద్వారా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని, అధికారాల వికేంద్రీకరణ ఉత్తర్వులిచ్చిందని సమాచారం. తహసీల్దార్లలో నైరాశ్యం అధికారాల వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ఉత్త ర్వులు తహసీల్దార్లలో నైరాశ్యానికి కారణమయ్యాయి. వికేంద్రీకరణ పేరుతో కలెక్టర్లకే ఎక్కువ అధికారాలు కట్టబె ట్టారని వారంటున్నారు. గతంలో తమకు ఉన్న అధికారా లనే మళ్లీ ఇచ్చారని, వారసత్వ హక్కుల సంక్రమణ, జీపీ ఏ, ఎస్పీఏల ఆధారంగా పట్టాలు చేసే అధికారం ఇప్పుడు కూడా తమకే ఉందని, మళ్లీ ఆ అధికారాలనే ఇచ్చి వికేంద్రీ కరణ అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ వద్ద సిబ్బంది లేరని, ఇలాంటి పరిస్థితుల్లో వారం రోజుల సమయం ఇచ్చి అన్ని దరఖాస్తులూ పరిష్కరించాలంటే ఎలా సాధ్యమనే చర్చ కూడా రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. హడావుడిలో తప్పులు జరిగితే సమస్య మళ్లీ మొదటి కొచ్చినట్టే కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వికేంద్రీకరణ తాత్కాలికమే! అయితే ప్రస్తుతం చేపట్టిన అధికార వికేంద్రీకరణ, స్పెషల్ డ్రైవ్లు తాత్కాలికమేనని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ధర ణి కమిటీ సూచన మేరకు తాత్కాలికంగానే ఈ ఏర్పాట్లు చేశామని, కొత్త ఆర్వోఆర్ చట్టంలో అధికార వికేంద్రీకరణ కు చట్టబద్ధత కల్పిస్తామని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబు తున్నారు. మరోవైపు కలెక్టర్లు తీసుకునే నిర్ణయాలను కూడా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్–1908లోని 166బీ నిబంధన ప్రకారం సవాల్ చేయవచ్చని అంటున్నారు. ప్రస్తుతం చేసిన అధికారాల పంపిణీ కూడా తాత్కాలికమేనని, ఆర్వో ఆర్ కొత్త చట్టంలో పకడ్బందీగా వికేంద్రీకరణ ఉంటుందని పేర్కొంటున్నారు. తహశీల్దార్లకు అధికారాల విస్తృత పంపిణీ అవకాశం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నా యి. అయితే ధరణి దరఖాస్తుల పరిష్కారంలో తహశీల్దార్ నివేదికలే ప్రాతిపదికలని, ఆ నివేదికల ఆధారంగానే ఉన్న తాధికారులు దరఖాస్తులను పరిష్కరిస్తారని ధరణి కమిటీ సభ్యుడొకరు చెప్పారు. ఈ మేరకు తహశీల్దార్లు క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుందని, గతంలో మాదిరి కాకుండా దరఖాస్తుల ఆమోదం, తిరస్కారం కోసం కచ్చితంగా కార ణాలతో కూడిన రాతపూర్వక ఉత్తర్వులివ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఎవరైనా రైతులు తమకు నష్టం కలిగిందని భావిస్తే రెవెన్యూ అధికారు లిచ్చే రాతపూర్వక ఉత్తర్వులపై కోర్టులను ఆశ్రయించే వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈనెల 1వ తేదీనుంచి 9వ తేదీ వరకు నిర్వహించే స్పెషల్ డ్రైవ్తో ధరణి దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోదని, ఈ డ్రైవ్లో తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ కూడా మరోమారు ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. -
పాడి రైతుకు సంపూర్ణ రక్షణ
సాక్షి, అమరావతి: పాల సేకరణ, విక్రయాల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023 అమలుకు రంగం సిద్ధమైంది. చట్టం అమలుకు అవసరమైన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపకల్పన చేసింది. నియమ, నిబంధనలతో ఇటీవలే అధికారిక గెజిట్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రతిరోజు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. స్థానికంగా 1.42 కోట్ల లీటర్ల పాలు వినియోగమవుతుండగా, ఆర్గనైజ్డ్ డెయిరీలు 21.6 లక్షల లీటర్లు, ప్రైవేటు డెయిరీలు 47.6 లక్షల లీటర్లు సేకరిస్తున్నాయి. మిగిలిన పాలు వివిధ రూపాల్లో మార్కెట్కి వస్తుంటాయి. పాల సేకరణలో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తూనికలు–కొలతల చట్టం ప్రకారం తనిఖీ చేసే అధికారాలను స్థానిక పశు వైద్యులకు అప్పగించారు. అయితే మోసాలకు పాల్పడినట్టు నిర్ధారణ జరిగినప్పుడు మిల్క్ ఎనలైజర్స్, ఇతర పరికరాలను సీజ్ చేయడం, బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తేవి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ దేశంలోనే తొలిసారి పటిష్టమైన పాలసేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చట్టం అమలు బాధ్యత వీరిదే.. చట్టం అమలు, పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో మిల్క్ కమిషనర్గా, కార్యనిర్వాహక అధికారిగా పశుసంవర్ధక శాఖ సంచాలకులు వ్యవహరించనుండగా, జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ ఆఫీసర్స్గా జిల్లా పశుసంవర్ధక శాఖాధికారులు, మిల్క్ ఇన్స్పెక్టర్లుగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, ఏవీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్లు వ్యవహరించనున్నారు. వీరు చట్టప్రకారం మిల్క్ ఎనలైజర్స్తో పాటు పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు పనిచేసేలా పర్యవేక్షిస్తారు. పాలనాణ్యత పాటించకపోతే ఫుడ్ సేఫ్టీ, నాణ్యత ప్రమాణాల యాక్టు 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారు. పాలల్లో ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి నిర్దేశించిన రేటు చార్ట్ ప్రకారం పాడి రైతుకు మద్దతు ధర దక్కేలా పర్యవేక్షిస్తారు. ఇందుకోసం సాఫ్ట్వేర్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. చట్టం అమలుపై రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్స్కు ఇటీవలే శిక్షణ కూడా పూర్తి చేశారు. వీరి ద్వారా మండల స్థాయిలో మిల్క్ ఇన్స్పెక్టర్లుగా వ్యవహరించనున్న అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. మిల్క్ ఎనలైజర్స్కు లైసెన్సింగ్ తప్పనిసరి మిల్క్ ఎనలైజర్స్ కలిగి ఉన్న వారు రూ.1,000 చెల్లించి సంబంధిత ఆథరైజ్డ్ అధికారి నుంచి లైసెన్సు పొందాలి. ఆ తర్వాత ఏటా లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. అదే తయారీ దారులు, డీలర్లు ప్రతీ 2 ఏళ్లకోసారి రూ. 2 లక్షలు చెల్లించి మిల్క్ కమిషనర్ ద్వారా లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లైసెన్స్ పొందిన తర్వాత మిల్క్ ఎనలైజర్స్ను 30 రోజులలోపు వారి పరిధిలోని మిల్క్ ఇన్స్పెక్టర్ వద్ద రూ. 500 చెల్లించి కనీసం ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేలా వెరిఫికేషన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. మిల్క్ ఎనలైజర్ లైసెన్స్, వెరిఫికేషన్ సర్టిఫికెట్ను పాలసేకరణ కేంద్రంలో ప్రదర్శించాలి. రికార్డులు, రిజిష్టర్లు విధిగా నిర్వహించాలి. క్రమం తప్పకుండా తనిఖీలు.. చట్టం ప్రకారం మిల్క్ ఇన్స్పెక్టర్లు.. పాల సేకరణ కేంద్రాలు, డెయిరీల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తారు. తేడా ఉన్నట్టుగా గుర్తిస్తే జరిమానా, లైసెన్సు రద్దు, కేసుల నమోదు వంటి చర్యలు తీసుకుంటారు. కల్తీ జరిగినట్టు గుర్తిస్తే తగిన చర్యల కోసం ఆహార భద్రత అధికారికి సమాచారమిస్తారు. మిల్క్ యూనియన్, డెయిరీ నిర్ధారించిన రేట్ చార్జి ప్రకారం పాలుపోసే వారికి పాలసేకరణ ధర చెల్లిస్తున్నదీ లేనిదీ కూడా పరిశీలిస్తారు. జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ అధికారిగా వ్యవహరించే అధికారులు ఈ మిల్క్ ఇన్స్పెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. మోసాలు, కల్తీలు జరిగినట్టుగా గుర్తిస్తే సంబంధిత రికార్డులు సహా ఆయా యూనిట్లను సీజ్ చేస్తారు. శిక్షార్హమైన నేరాలకు చట్టం ప్రకారం జరిమానాలు, కారాగార శిక్షలు విధిస్తారు. -
రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు: మంత్రి ధర్మాన ప్రసాదరావు
సాక్షి, తాడేపల్లి: భారతదేశంలో భూమిపై హక్కులు అనే విధానంపై క్లారిటీ కోసం గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. 1989లో కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ డీసీ వైద్య ద్వారా కమిషన్ నియమించి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో నివేదిక కోరారని చెప్పారు. ఆ కమిషన్ మన దేశంలో టైటిల్కి గ్యారెంటీ ఉండే వ్యవస్థ తీసుకురావాలని సిఫారసు ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తానంతట తానుగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురాలేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని ప్లానింగ్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్లుగా అధ్యయనం చేస్తోందని అన్నారు. శిస్తు వసూలు చేసుకోవడానికి 1బీ, అడంగల్ వంటివి మత్రమే తెచ్చారని తెలిపారు. భూమిపై ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాజెక్టులు టేకప్ చేసేలోపు కొన్ని వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. అందుకే దేశవ్యాప్తంగా 2019లోనే టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రప్రభుత్భం ప్రయత్నించిందని గుర్తుచేశారు. టైటిలింగ్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని, అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించిందని అన్నారు. నీతి ఆయోగ్ సూచనలమేరకు 2019లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపారని తెలిపారు. రెండుసార్లు వెనక్కి వెళ్లొచ్చి.. 2023లో ఆమోదం పొందిందని చెప్పారు. దేశంలోనే సివిల్ కోర్టుల్లోని వివాదాల్లో 66శాతం భూములకు సంబంధించిందేనని చెప్పారు. ఆ 66 శాతంలో లక్ష ఆదాయంలోపు ఉన్నవారి కేసులో 90 శాతం ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం 60 శాతం హత్యలు భూ వివాదాలు వల్ల జరుగుతున్నాయని అన్నారు. దేశ ప్రజల క్షేమం కోసం ఒక ప్రయత్నం జరుగుతుందని, 17 వేల గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల అప్డేషన్, సర్వే జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని, వివాదాలు లేని రికార్డులు తయారవుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీలో జరుగుతున్న సర్వే గురించి తెలుసుకుంటున్నారని అన్నారు. రికార్డులన్నీ అప్ డేట్ అయ్యాక, సర్వే పూర్తయ్యాక చట్టం నోటిఫై చేస్తామని చెప్పారు. ఇదంతా అయ్యేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు చట్టాన్ని ఆగమేఘాలమీద అమలు చేయడం లేదని అన్నారు. అన్నీ చట్ట ప్రకారం జరుగుతాయని, న్యాయస్థానాలు ఇచ్చే సలహాలు తీసుకుంటామని చెప్పారు. ఇంకా ఎలాంటి రూల్స్ విధించాలో కసరత్తు జరుగుతోందని తెలిపారు. భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన అంశాల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే టేకప్ చేసిందని పేర్కొన్నారు. రూల్ ఫ్రెమ్ చేసేటప్పుడు అందరి సలహాలు పాటిస్తామని అన్నారు. న్యాయవాదులు విధులకు హాజరు కావాలని, దేశంలో కంక్లూజివ్ టైటిల్ ఇవ్వడం విశేషమని తెలిపారు. చదవండి: ప్రతి ధర్నాకు ఓ రేటు... అదే వాళ్ల రూటు -
‘నిర్భయ’కు 11 ఏళ్లు... మహిళల భద్రతకు భరోసా ఏది?
అది దేశరాజధాని ఢిల్లీ.. 2012, డిసెంబరు 16.. రాత్రివేళ ఓ ప్రైవేట్ బస్సులో చోటుచేసుకున్న దారుణ అత్యాచార ఘటన భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నీ కుదిపేసింది. ఈ నేపధ్యంలో ఢిల్లీని అత్యాచారాల క్యాపిటల్గా అభివర్ణించారు. నాడు అత్యంత క్రూరంగా జరిగిన అత్యాచార ఘటన దేశంలోని ప్రతీఒక్కరినీ కంటతడి పెట్టించింది. డిసెంబరు నాటి వణికించే చలిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయ కామాంధుల చేతుల్లో చిగురుటాకులా వణికిపోయింది. ఈ నేపధ్యంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశంలోని ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. ఈ దారుణ అత్యాచారం దరిమిలా దేశంలో మహిళల రక్షణ విషయంలో పెను మార్పులు వచ్చాయి. దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం అనేక చర్యలు చేపట్టారు. నిర్భయ అత్యాచార ఘటన దర్యాప్తు అనంతరం జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సిఫార్సులు అమలయ్యాయి. దేశంలోని ప్రతీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యాచార బాధితుల కోసం వన్ స్టాప్ సెంటర్లు, హెల్ప్లైన్లు ప్రారంభించారు. నిర్భయ ఫండ్ విడుదల చేశారు. నిర్భయ స్క్వాడ్, నిర్భయ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల పాటు నిర్భయ కేసు విచారణ కొనసాగగా దోషులైన ముఖేష్, పవన్, అక్షయ్, వినయ్లను 2020, మార్చి లో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. ఒక మైనర్కు విముక్తి లభించగా, మరో నిందితుడు రామ్ సింగ్ విచారణ సమయంలో జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్భయ ఘటన, కేసు దర్యాప్తు, దోషులకు శిక్ష అమలు తర్వాత దేశంలో అత్యాచార ఘటనలు తగ్గుముఖం పట్టివుంటాయని అందరూ భావించివుంటారు. అయితే దీనికి భిన్నమైన పరిస్థితులు దేశంలో తాండవిస్తున్నాయి. ప్రముఖ జాతీయ ఏజెన్సీ ఎన్సీఆర్బీ.. నిర్భయ ఘటన అనంతరం గత 11 ఏళ్లలో దేశంలో చోటుచేసుకున్న అత్యాచార గణాంకాల వివరాలను విడుదల చేసింది. ఇవి మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయని పలువురు అంటున్నారు. సంవత్సరం అత్యాచారం కేసులు 2022 31,516 2021 31,677 2020 28,046 2019 32,032 2018 33,356 2017 32,559 2016 38,947 2015 34,651 2014 36,735 2013 33,707 2012 24,923 నిర్భయ లాంటి హృదయ విదారక అత్యాచార ఘటనల తర్వాత కూడా దేశంలో మహిళల భద్రత విషయంలో ఆశించినంత మార్పు రాలేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదిక ప్రకారం.. గత ఏడాది దేశంలో మొత్తం 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజూ దాదాపు 87 మంది , ప్రతి గంటకు మూడు నుంచి నలుగులు బాలికలు లేదా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఈ నివేదిక ప్రకారం అత్యాచార ఘటనల విషయంలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. గత ఏడాదిలో అత్యధికంగా 5,399 అత్యాచార కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ఢిల్లీలో 1212 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ.. -
అమల్లోకి ఏపీ భూ హక్కుల చట్టం
సాక్షి, అమరావతి: దేశంలోనే మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలో భూ హక్కుల చట్టం (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్) అమల్లోకి వచ్చింది. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 2023ని ఈ సంవత్సరం అక్టోబర్ 31 నుంచి అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 512 జారీ చేసింది. దాని గెజిట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. ఇటీవలే ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ప్రభుత్వం అమ ల్లోకి తీసుకువచ్చింది. భూ యజమానులు, కొను గోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి చట్టం లేదు. భూ హ క్కుల చట్టం ప్రకారం స్థిరాస్థి హక్కుల రిజిస్టర్ త యారు చేస్తారు. స్థిరాస్థిని యజమాని తప్ప వేరే ఎవరూ విక్రయించే అవకాశం ఉండదు. రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్థుల శాశ్వత రిజిస్టర్, వివాద రిజిష్టర్ తో పాటు కొనుగోలు రిజిస్టర్ రూపొందిస్తారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. ఆ అధికారి కింద మండల స్థాయిలో లాండ్ టైట్లింగ్ అధికారులను నియమిస్తారు. భూమి హక్కులను రిజిస్టర్ చేసే బాధ్యత ల్యాండ్ టైట్లింగ్ అధికారికే ఉంటుంది. పలు దశల తర్వాత టైట్లింగ్ అధికారి భూముల యజమానులను శాశ్వత హక్కుదారులు గా గుర్తించి రిజిస్టర్లో నమోదు చేస్తారు. వీటిపై ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ ట్రిబ్యు నళ్లలో తేల్చుకోవడం తప్ప కోర్టుకు వెళ్లడానికి అవ కాశం ఉండదు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు లపై నే హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది. -
రష్మిక ఫేక్ వీడియో : సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం మరోసారి రెడ్ సిగ్నల్
న్యూఢిల్లీ: తప్పుడు సమాచార వ్యాప్తికి సంబంధించి నటి రష్మిక మందన్నకు చెందినడీప్ఫేక్ వీడియో వైరల్ కావడంతో కేంద్రం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 66డీ ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్ష, జరిమానా తప్పదంటూ రిమైండర్ జారీ చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో డీప్ఫేక్లకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను, ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలను తాజా సర్క్యులేషన్లో మరోసారి గుర్తు చేసింది. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66డీ ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి ఎవరైనా వ్యక్తుల పట్ల మోసపూరితంగా వ్యవహరించినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా నేరం రుజువైతే మూడేళ్ల దాకా జైలు శిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా ఉంటుంది. ప్రభుత్వం, లేదా బాధిత వ్యక్తులు కోరిన వెంటనే సోషల్ మీడియా వెబ్ సైట్లు ఆయా కంటెంట్ వివరాలను 36 గంటల్లోగా తొలగించాల్సి ఉంటుంది. IT మధ్యవర్తి నియమాల ప్రకారం, సోషల్ మీడియా సంస్థలు 10 రకాల కంటెంట్కి సంబంధించిన పోస్టులను తప్పక తొలగించాలి. ముఖ్యంగా దేశ సమగ్రత, శాంతి భద్రతలు, సార్వభౌమత్వం, విదేశాలతో సంబంధాలు, ఇతర దేశాలను అవమానించడం, నేరాలకు పాల్పడేందుకు ప్రోత్సహించే చర్యలు, ఒక వ్యక్తి లేదా ప్రభుత్వాన్ని కించపర్చేలా మాట్లాడడం నేరంగా పరిగణిస్తారు. అలాగే అసభ్యకరమైన కంటెంట్, లింగ విద్వేషం రెచ్చగొట్టే పోస్టులు, ఇతరుల ప్రైవసీని దెబ్బ తీసే కంటెంట్, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేలా ప్రోత్సహించడం, జాతి, మతం, రంగును అవమానించడం, భారతీయ చట్టాలలో నేరంగా వెల్లడించిన పనులను ప్రోత్సహించే కంటెంట్ వంటివి ఎవరైనా పోస్ట్ చేస్తే వాటిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ప్రభుత్వం కోరితే ఆ సమాచారాన్ని ముందుగా పోస్ట్ చేసిన వ్యక్తి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో స్పందించిన కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫేక్ న్యూస్, డీప్ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులకు భద్రత, విశ్వాసం కల్పించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇవ్వడం తోపాటు ఇలాంటి ఫేక్ వీడియోపై సోషల్ మీడియా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
సమస్య తొమ్మిది నెలలేనా?
ఇటీవలే ఓ వివాహిత 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు లేటైనా అబార్షన్ అవసరమవుతుంది. సరైన సమయంలో వైద్యం అందకపోవడం, లైంగికదాడి, గృహహింస, జైలు వంటివి ఎన్నో దీనికి కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్ను నేరంగా పరిగణించడాన్ని నిలిపి వేయాలి. గర్భం వయసుపై పరిమితులు తొలగించాలి. ప్రత్యేక పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకునే విషయంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం 2021లో ఒక తీర్పునిచ్చింది. పిండం వయసు గరిష్ఠంగా 24 వారా లున్నా పీడిత మహిళలు అబార్షన్ చేయించుకునేందుకు వీలు కల్పించింది. వైకల్యమున్నప్పుడు మాత్రమే మెడికల్ బోర్డు సిఫారసుతో అబార్ష¯Œ కు అనుమతించే పాత చట్టం నుంచి వీరికి విముక్తిని ప్రసాదించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల ముందు అబార్షన్కు అనుమతించే విషయంపై అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈ మార్పులు వచ్చాయి. అంతకుముందు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) యాక్ట్ (1971) ప్రకారం, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు (ఆర్ఎంపీలు) గర్భం ధరించిన 20 వారాల వరకూ అబార్షన్ చేసేందుకు అనుమతులుండేవి. 2021 నాటి సవరణ తీర్పు తరువాత కూడా చాలామంది మహిళలు వైద్యులు అబార్షన్కు నిరాకరించిన సందర్భాల్లో... కోర్టు నిర్దేశించిన సమయం దాటినా అఅబార్షన్కు అనుమతించాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవలే ఓ వివాహిత మహిళ 26 వారాల వయసున్న గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, విచారణ తరువాత కోర్టు అందుకు నిరాకరించడం తెలిసిన విషయాలే. పాలిచ్చే సమయంలో కొంతకాలం రుతుస్రావం జరగదు. అయితే ఈ మహిళ పాలిచ్చే సమ యంలోనే గర్భం ధరించింది. ఇది సహజం అనుకోవడంతో గర్భం ధరించినట్లు గుర్తించలేకపోయింది. ఏడాది క్రితమే బిడ్డకు జన్మనిచ్చి పోస్ట్పార్టమ్ సైకోసిస్కు చికిత్స తీసుకుంటున్న ఈ మహిళ మరోసారి గర్భం ధరించడం గమనార్హం. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్న ధర్మాసనం అంతకుముందు పిటీషన్ను అనుమతిస్తూ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను ప్రక్రియ చేపట్టాలని నిర్దేశించింది. 2021 సవరణలకు ముందు అబార్షన్ కోసం కోర్టుకు ఎక్కిన కేసుల్లో అత్యధికం మానభంగం లేదా పిండాల వైకల్యం ఉన్నవారికి సంబంధించినవి. పైగా చాలావాటిల్లో గర్భం వయసు 20 వారాల కంటే ఎక్కువే. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు కొంచెం లేటైనా అబార్షన్ అనేది అవసరమవుతుంది. తొలినాళ్లలోనే అబార్షన్ చేసేందుకు వైద్యపరంగా అవకాశాల్లేకపోవడం వీటిల్లో ఒకటి. లైంగిక దాడి, గృహహింస, జైలు వంటివి ఇతర కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులు (భాగస్వామి సాయం లేక పోవడం, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉద్యోగం వంటివి), శారీరక, మానసిక ఆరోగ్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసు కోవాల్సి ఉంటుంది. మెనోపాజ్ లేదా లాక్టేషనల్ అమెనోరియా (పాలిచ్చే సమయంలో రుతుస్రావం నిలిచిపోవడం) కూడా అబార్షన్కు తగిన కారణాలని చెప్పాలి. అబార్షన్లకు సంబంధించి 2021 నాటి సుప్రీంకోర్టు సవరణ గర్భం తాలూకూ వయో పరిమితిని పెంచింది మినహా ఇతర మార్పులేవీ చేయలేదు. దీనివల్ల ప్రయోజనం కొద్దిమందికే. తల్లి ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి వస్తే ఓ ఆర్ఎంపీ ఏ దశలోనైనా గర్భాన్ని తొలగించేందుకు అవకాశం ఉండగా చాలామంది కేసుల భయంతో ఆ పని చేసేందుకు జంకు తున్నారు. ఫలితంగా మహిళలు గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. కోర్టులకు వెళ్లడం ఇష్టం లేని వారైతే గర్భాన్ని కొనసాగిస్తున్నారు లేదా ముతక పద్ధతులతో అబార్షన్ కు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. పలుమార్లు వైద్యపరీక్షల అవసరం ఉండటం కూడా ప్రతిబంధకంగా మారుతోంది. ఒకవేళ న్యాయ స్థానాన్ని ఆశ్రయించినా న్యాయవాదుల ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుర్కోవడం కూడా ఒక సమస్య. గత వారం సుప్రీంకోర్టులోనూ ఇలాంటి స్థితి ఎదురు కావడం చెప్పుకోవాల్సిన అంశం. అబార్షన్ కోరిన మహిళ మానసిక పరిస్థితి బాగాలేదనీ, కౌన్సెలింగ్ తీసు కోవాలనీ పలుమార్లు న్యాయవాదులు సూచించారు. ఇంతటి కష్టా నికి, ఇబ్బందికి ఓర్చినా తుది ఫలితం అనుకూలంగా ఉంటుందన్న గ్యారెంటీ లేకపోవడం గమనార్హం. అయితే ఒక్క విషయం. ఇతర దేశాలతో పోలిస్తే అబార్షన్కు సంబంధించి భారతీయ చట్టాలు కొంత ఉదారంగానే ఉన్నాయని చెప్పాలి. అయినా అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలు, అబార్షన్లో అత్యుత్తమ విధానాల విషయంలో మాత్రం అంత గొప్పగా ఏమీ లేవన్నదీ సుస్పష్టం. గత ఏడాది ‘ఎక్స్’ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మధ్య జరిగిన ఒక కేసు విషయంలో వైద్యపరమైన చట్టాలను అవసరాలకు తగ్గట్టుగా అర్థ వివరణ తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు సూచించింది. ఆ కేసులో 24 వారాల వయసు గర్భంతో ఉన్న అవివాహిత మహిళకు అబార్షన్ చేయించుకునే హక్కు కల్పించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆ మహిళకు ఉన్న హక్కుల ఆధారంగా వైద్యపరమైన పరీక్షలకు అతీతంగా నిర్ణయం తీసుకోవడం, ఎంటీపీ చట్టాలపై లక్ష్యాధారిత అర్థ వివరణ తీసు కోవడం గమనార్హం. మహిళల వాస్తవిక జీవన పరిస్థితులు, సామాజిక వాస్తవాలను అర్థం చేసుకుని మరీ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవాలి. అబార్షన్కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్ను నేరంగా పరిగణించడాన్ని నిలిపివేయాలి. గర్భం వయసుపై పరిమితులు, ఇతర నియంత్రణలను కూడా తొలగించాలి. దీనివల్ల అందరికీ వివక్ష లేని అబార్షన్ సేవలు అందుతాయి. ఏ సమయంలోనైనా సురక్షితంగా గర్భాన్ని తొలగించేందుకు ఉన్న పద్ధతులను ఉపయోగించాలని కూడా ఈ మార్గదర్శకాలు సూచించాయి. అబార్షన్ పై అడ్డంకులు విధాన పరమైన అడ్డంకులుగా మారుతున్నాయనీ, ఏ రకమైన శాస్త్రీయ ఆధా రాలు లేనివిగా మారాయనీ కూడా అవి వ్యాఖ్యానించాయి. గత వారం జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్నల ముందు విచారణకు వచ్చిన కేసులో జస్టిస్ నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లీ తీర్పుతో విభేదించిన విషయం తెలిసిందే. ‘ఎక్స్’ కేసును ప్రస్తావించిన జస్టిస్ నాగరత్న గర్భం విషయంలో ఆ మహిళకు ఉన్న హక్కును గుర్తు చేశారు. మహిళ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆ గర్భం అవాంఛితమైతే తొలగించుకునే హక్కు ఆ మహిళకు ఉందని స్పష్టం చేశారు. గర్భాన్ని కొనసాగించాలని కోరడం ఆ మహిళ ఆరో గ్యాన్ని పణంగా పెట్టడం అవుతుందనీ, ఇది ఆర్టికల్ 21, 15 (3)లను అతిక్రమించినట్లు అనీ వివరించారు. అయితే చివరకు ఈ మహిళకు ‘ఎక్స్’ మాదిరిగా అబార్షన్ చేయించుకునే అవకాశం కలగకపోవడం గమనార్హం. ‘ఎక్స్’ కేసులో అవాంఛిత గర్భం తాలూకూ ప్రభావాన్ని అర్థం చేసుకున్న కోర్టు... ఇంకో మహిళ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించింది. అబార్షన్ను తొమ్మిది నెలల వ్యవహారా నికి పరిమితం చేసేసింది. అవాంఛిత గర్భం కారణంగా ఆ మహిళ కాన్పు తరువాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నది గుర్తించకపోవడం దురదృష్టకరం. వాదనల సందర్భంగానూ న్యాయమూర్తులు, ప్రభుత్వం పలుమార్లు ఈ కేసుకు ఇతర కేసులకు మధ్య తేడాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. అబార్షన్కు గల కార ణాల విలువ ఒకరికి ఎక్కువ? ఇంకొరికి తక్కువగా ఉంటాయా? -వ్యాసకర్త బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ) బోధకులు -
లంచం తీసుకున్న చట్టసభ సభ్యులకు విచారణ నుంచి మినహాయింపు ఉండదు
న్యూఢిల్లీ: చట్టసభ సభ్యుడు లంచం తీసుకొంటే తదుపరి విచారణ నుంచి అతడు ఎలాంటి మినహాయింపు, వెసులుబాటు పొందలేడని, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినప్పటికీ చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నప్పటికీ చట్ట ప్రకారం విచారించి, శిక్ష విధించాలని చెప్పారు. లంచం ఇచి్చనా, తీసుకున్నా అవినీతి నిరోధక చట్టం కింద విచారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్టసభల్లో మాట్లాడడానికి, ఓటు వేయడానికి లంచం తీసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి వెసులుబాటు ఉంటుందంటూ 1998 నాటి జేఎంఎం ముడుపుల కేసులో నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కొన్ని వర్గాల విజ్ఞప్తి మేరకు ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పున:పరిశీలిస్తోంది. భాగస్వామ్యపక్షాల వాదనలు వింటోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నట్లు ఒక్క సంఘటన బయటపడినా సరే విచారణ చేపట్టాలని తుషార్ మెహతా అన్నారు. లంచం స్వీకరించిన పార్లమెంట్ సభ్యుడికి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105, 194 కింద విచారణ నుంచి వెసులుబాటు కలి్పంచవద్దని కోర్టును కోరారు. పార్లమెంట్ సభ్యుడికి కలి్పంచిన వెసులుబాట్లు, ఇచి్చన మినహాయింపులు అతడి వ్యక్తిగత అవసరాల కోసం కాదని గుర్తుచేశారు. చట్టసభ సభ్యుడిగా బాధ్యతలను నిర్భయంగా నిర్వర్తించడానికే వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. -
ఇక పేదల ఇళ్ల స్థలాలకూ ‘భూదాన్’ భూములు
సాక్షి, అమరావతి: పేదలకు మేలు చేయడమే లక్ష్యంగా భూములకు సంబంధించి పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భూదాన్ బోర్డు విషయంలోనూ అదే ఒరవడిని కొనసాగించింది. భూదాన్ బోర్డుకి సైతం పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే అధికారాన్ని ఇచ్చింది. ఇందుకోసం 1965 ఏపీ భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని సవరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. భూస్వాములు తమకున్న భూమిలో కొంత పేదలకు ఇవ్వాలని కోరుతూ 1950వ దశకంలో గాంధేయవాది ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పలువురు భూమిని దానం చేశారు. ఇలా సంపన్నులు దానం చేసిన భూములను పేదలకు పంచే విధానాన్ని సూచిస్తూ కేంద్రం భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని రూపొందించగా దానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలు చట్టాలను చేసుకున్నాయి. మన రాష్ట్రం కూడా 1965లో ఏపీ భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని చేసింది. దాని ప్రకారం భూదాన్ యజ్ఞ బోర్డును నియమించి దాని ద్వారా భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారాలు నడిపారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని భూదాన్ భూముల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భూముల వ్యవహారాలన్నింటినీ పరిష్కరించేందుకు ఒక క్రమపద్ధతిలో పనిచేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం భూదాన్ భూముల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్ను నియమించింది. అలాగే భూదాన్ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో తాజాగా భూదాన్ చట్టాన్ని సవరించింది. ఆచార్య వినోబా భావే లేకపోతే ఆయన నామినేట్ చేసిన వ్యక్తి సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు భూదాన్ బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించాలి. ఇవీ సవరణలు గత చట్టంలో భూదాన్ భూమిని వ్యవసాయం, ప్రభుత్వం, స్థానిక సంస్థలు, సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించాలని నిర్దేశించారు. తాజా సవరణలో సామాజిక ప్రయోజనంతోపాటే బలహీనవర్గాలు, పేదల ఇళ్ల స్థలాల కోసం భూమిని కేటాయించే అధికారాలను భూదాన్ బోర్డుకి ఇచ్చారు. గతంలో ఇళ్ల స్థలాలకు కోసం భూదాన్ భూములను వినియోగించే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు వాటికి వినియోగించే అవకాశం ఏర్పడింది. వినోబా భావే మృతి చెందిన 41 సంవత్సరాలు దాటిపోవడంతో ఆయన ఎవరిని నామినేట్ చేశారనే దానిపై స్పష్టత లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఒకటి, రెండు సంస్థలు భూదాన్ బోర్డులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడడంతో పలు రాష్ట్రాలు చట్టాలను సవరించుకున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ప్రభుత్వమే భూదాన్ బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించేలా చట్టంలో మార్పు చేశారు. భూదాన్ భూమిని పొందిన వ్యక్తి వరుసగా రెండు సాగు సంవత్సరాలు వ్యవసాయం చేయకపోతే ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారంతోపాటు భూమి పొందిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తులు భూమిపై ఉన్నప్పుడు వారి నుంచి భూమిని తిరిగి తీసుకునే అధికారాన్ని తహసీల్దార్కు ఇస్తూ ఇప్పుడు చట్టంలో అవకాశం కల్పించారు. తద్వారా అన్యాక్రాంతమైన భూదాన్ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలు ఏర్పడింది. అర్బన్ ప్రాంతాల్లో వ్వవసాయం చేయకుండా ఆగిపోయిన భూదాన్ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. పేదలకు ఇంకా మంచి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ పేదల గురించే ఆలోచిస్తారనడానికి ఈ చట్ట సవరణ ఒక ఉదాహరణ. భూదాన్ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ఇంకా మంచి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ భూముల వివరాలన్నింటినీ సేకరిస్తున్నాం. సీఎం ఆలోచనలకు అనుగుణంగా భూదాన్ భూములపై నిర్ణయాలు తీసుకుంటాం. – తాడి విజయభాస్కర్రెడ్డి, ఛైర్మన్, ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డు -
డేటా భద్రత నిబంధనలు: తేడా వస్తే రూ. 250 కోట్ల వరకు జరిమానా
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్ట నిబంధనలకు అనుగుణంగా తమ సిస్టమ్స్ను సరిచేసు కునేందుకు వ్యాపార సంస్థలకు కొంత సమయం ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇది సుమారు ఏడాది పాటు ఉండొచ్చని పరిశ్రమ వర్గాలతో సమావేశం సందర్భంగా ఆయన విలేకరులకు చెప్పారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్ అథారిటీ అయిన డేటా ప్రొటెక్షన్ బోర్డు (డీపీబీ)ని వచ్చే 30 రోజుల్లోగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి తెలిపారు. డేటా భద్రత బోర్డుతో పాటు మార్గదర్శకాలు మొదలైనవన్నీ నెల రోజుల్లోగా సిద్ధం కాగలవని మంత్రి తెలిపారు. మెటా, లెనొవొ, డెల్, నెట్ఫ్లిక్స్ సహా పలు కంపెనీలకు చెందిన 125 మంది పైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పౌరుల వ్యక్తిగత డేటాను ఆన్లైన్ వేదికలు దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసే దిశగా డేటా భద్రత చట్టాన్ని రూపొందించారు. దీనికవసరమైన 25 నియమాలలో చాలా వరకు ముసాయిదా రూపొందించబడి సిద్ధంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు గతంలో చెప్పారు. సమ్మతి ఆధారిత యంత్రాంగం ద్వారా వినియోగదారుల డేటాను సేకరించడం కంపెనీలకు చట్టం తప్పనిసరి చేసింది, అయితే కొన్ని చట్టబద్ధమైన ఉపయోగాల కోసం, చట్టం కొన్ని సడలింపులను అందిస్తుంది. అమల్లో విఫలమైన సంస్థలకు రూ. 250 కోట్ల వరకు జరిమానా విధించవచ్చని చట్టంలో ప్రతిపాదనలు ఉన్నాయి. అంతేకాదు 500 కోట్లకు పెంచవచ్చని కూడా పేర్కొన్నారు. -
విద్యుత్ సవరణ బిల్లును అడ్డుకోవాలి
హిమాయత్నగర్: దేశంలోని కొన్ని కార్పొరేట్ శక్తులకు లాభాలు అందించే సరుకుగా విద్యుత్ మారిందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో 7 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ‘2022 విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిద్దాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాలను ఎండగడదాం’అనే అంశంపై రాష్ట్ర సదస్సును నిర్వహించారు. అంతకముందు బషీర్బాగ్ విద్యుత్ కాల్పుల్లో మృతి చెందిన అమరులకు నివాళులర్వించారు. ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చలపతిరావు, రాష్ట్ర కార్యదర్శి ప్రసదన్న, ఎస్యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురగరి, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఏఐఎఫ్బీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసా ద్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ సవరణ బిల్లు–2022 అనే ది కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమేనన్నారు.ఈ బిల్లు వల్ల విద్యుత్ చార్జీలు సామన్య వినియోగ దారులకు అందుబాటులో లేనివిధంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పేదప్రజలు, రైతులు, ప్రజా వినియోగ రంగాలకు ఇచ్చే సబ్సిడీలు క్రమంగా రద్దు అవుతున్నాయన్నారు. ప్రజా వ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లు–2022ను ఉపసంహరించుకోవాలని,విద్యుత్ చట్టం–2003ను రద్దు చేయాలని, ప్రీపెయిడ్ మీటర్ల యోచనను విరమించుకోవాలని, 100 యూనిట్లు లోపు గృహవినియోగదారులకు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలంటూ ఈ సదస్సు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, సుకన్య, తేజ, భరత్, హేమలత పాల్గొన్నారు. -
ఢిల్లీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఐఏఎస్లు సహా ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలపై కేంద్రానికి అధికారాలు కట్టబెట్టిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసు బిల్లు చట్టంగా మారింది. ఈసారి వర్షాకాలం సమావేశాల్లో వివాదాస్పద బిల్లులైన ఢిల్లీ సర్వీసు బిల్లు, డిజిటల్ డేటా బిల్లుల్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ఆమోదించారు. వీటితో పాటు జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు , జన విశ్వాస్ (సవరణ) బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేశారు. వీటిలో ఢిల్లీ పాలనాధికారాల బిల్లు (జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు), డిజిటల్ డేటా (డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు) బిల్లులపై పార్లమెంటులో విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నీ కేంద్రానికే కట్టబెడుతూ ఆర్డినెన్స్ తెచ్చింది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లుని మొదట లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభ ఆమోదించాయి. ఇప్పుడు రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది. అదే విధంగా డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును మణిపూర్ అంశంపై ప్రతిపక్షాల నినాదాల మధ్య మూజువాణి ఓటుతో ఉభయ సభలు ఆమోదించాయి. ఈ బిల్లులో విపక్ష పార్టీలు కొన్ని సవరణలు సూచించినా ప్రభుత్వం చేపట్టలేదు. బిల్లులో కేంద్ర ప్రభుత్వం సహా కొందరికి మినహాయింపులు ఇవ్వడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. -
ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా..ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘రాష్ట్రంలో వరద కారణంగా ఇంతవరకు ఎంతమంది చనిపోయారు? డిజాస్టర్ చట్టం ప్రకారం ఎంతమందిని రక్షించారు? గోదావరి తీర ప్రాంత గ్రామాల రక్షణకు ఏం చర్యలు చేపట్టారు? బాధితులకు కనీస సౌకర్యాలు అందిస్తున్నారా? వరదలపై వార్రూమ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎన్నికలప్పుడు ఏర్పాటు చేస్తారు కానీ.. వరదలు లాంటి అత్యవసర సమయంలో ఏర్పాటు చేయరా?..’అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఓ నివేదికను సోమవారం అందజేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వెల్లడించడం లేదని, రక్షణ చర్యలు తీసుకునేలా రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం శుక్రవారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పడం లేదు.. ‘వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో వరదల కారణంగా 19 మంది మృతి చెందారని పత్రికల్లో వస్తున్న వార్తలు తెలియజేస్తున్నాయి. వరదలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని కేంద్రం మరోసారి తెలియజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరదల నుంచి ప్రజలను రక్షించడానికి ఏం చర్యలు తీసుకున్నారు? ఎంత మంది మరణించారు? లాంటి వివరాలను వెల్లడించడం లేదు. కడెం ప్రాజెక్టు వద్ద తీవ్ర భయానక పరిస్థితి కొనసాగుతోంది. ప్రాజెక్టు తెగితే వందల గ్రామాలు నీట మునగడంతో పాటు లక్షల మంది నిరాశ్రయులుగా మారే అవకాశం ఉంది..’అంటూ న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, పల్లె ప్రదీప్కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ‘వరద బాధితులకు తక్షణమే కనీస సౌకర్యాలు అందేలా ఏర్పాట్లు చేయాలి. కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని భద్రతా చట్ట ప్రకారం చర్యలు చేపట్టి వెంటనే రక్షించాలి. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలి..’అని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదు పరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. -
ఎమ్మెల్యే సాహసం.. సముద్రంలోకి దూకి ముగ్గురిని రక్షించాడు
పరిస్థితిని అంచనా వేయకుండా సముద్రంలోకి దిగిన నలుగురు యువకులను అలలు ముంచెత్తాయి. ఆ ధాటికి మునిగిపోతూ కేకలు వేశారు వాళ్లు. ఆ పరిస్థితుల్లో అక్కడ కొందరు గుమిగూడగా.. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఒకరు సాహసం ప్రదర్శించారు. సముద్రానికి ఎదురీదిన ఆయన.. ఆ తర్వాత ఓ బోటు సాయంతో ముగ్గురిని స్వయంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. గుజరాత్ అమ్రేలి జిల్లాలో పట్వా గ్రామ సమీపంలోని సముద్ర తీరానికి బుధవారం మధ్యాహ్నం నలుగురు యువకులు ఈతలకు వెళ్లారు. అయితే వాతావరణంలోని మార్పులతో అలలు పోటెత్తాయి. దీంతో వాళ్లు మునిగిపోసాగారు. ఈలోపు రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. అయితే ఆ సమయంలో అక్కడ కొందరు గుమిగూడగా.. అక్కడే ఉన్న ఎమ్మెల్యే హీరా సోలంకి మాత్రం ఆలస్యం చేయలేదు. అలలతో పోటెత్తిన సముద్రానికి ఎదురీదారాయన. ఈలోపు కొందరు యువకులు ఆయనకు సాయానికి రాగా.. బోట్ సాయంతో సముద్రంలోకి వెళ్లారు. స్వయంగా నీళ్లలో దూకి ముగ్గురు యువకులను రక్షించారు. మరో యువకుడు అలల ధాటికి కొట్టుకునిపోగా.. సాయంత్రానికి మృతదేహం దొరికింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజుల నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు హీరా సోలంకి. ఆలస్యం చేయకుండా సాహసం ప్రదర్శించి ముగ్గురి ప్రాణాలు నిలబెట్టిన ఎమ్మెల్యేపై రియల్ హీరో అంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదీ చదవండి: కన్నకూతురిని పాతికసార్లు పొడిచాడు! -
ఉగ్రవాదులపై అటవీ చట్టం!
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు ఈ నెల 9న హైదరాబాద్తో పాటు భోపాల్లో అరెస్టు చేసిన ఉగ్రవాదులపై అటవీ శాఖ చట్టం కిందా అభియో గాలు చేయనున్నారు. భోపాల్కు చెందిన ఓ పర్యావరణవేత్త ఇచ్చిన సూచన మేరకు ఏటీఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంబంధిత కేసుల్లో పోలీసులు సాధారణంగా.. చట్ట విరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం–1967లోని వివిధ సెక్షన్ల కింద ఆరోపణలు చేస్తారు. ఆ ఉగ్రవాదుల వ్యవహారశైలి, చేసిన విధ్వంసాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ఆయుధ చట్టం, పేలుడు పదార్థాల చట్టంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ల కిందా ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్–¿ోపాల్ మాడ్యుల్స్పై మాత్రం అటవీ చట్టంలోని సెక్షన్లనూ జోడించాలని మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ నిర్ణయించింది. ఈ ఉగ్రవాదులు భోపాల్ శివార్లలోని రైసెన్ అడవుల్లో తుపాకీ కాల్చడాన్ని ప్రాక్టీసు చేశారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన సలీం తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. అటవీ చట్టాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లోకి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించడం నేరం. అలా వెళ్లడమే కాకుండా నిషిద్ధ ప్రాంతంలో తుపాకులు వాడినందుకు వీరిపై అటవీ చట్టాల ప్రకారం ఆరోపణలు చేయడమే కాదు, అభియోగాలు సైతం మోపి విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ ఏటీఎస్కు శుక్రవారం ఓ లేఖ అందింది. భోపాల్కు చెందిన ఓ పర్యావరణవేత్త దీన్ని రాశారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న ఏటీఎస్ ఆ చట్టంలోని సెక్షన్లను చేర్చాలని నిర్ణయించింది. 10 మంది పోలీసు కస్టడీ పొడిగింపు హైదరాబాద్, భోపాల్లలో అరెస్టు చేసిన 16 మంది ఉగ్రవాదుల పోలీసు కస్టడీ గడువు శుక్రవారంతో ముగియడంతో ఏటీఎస్ అధికారులు వీరిని భోపాల్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీ గడువు మరో పది రోజులు పొడిగించాలని కోరారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి రఘువీర్ యాదవ్ 10 మంది కస్టడీని ఈ నెల 24 వరకు పొడిగించారు. ఆరుగురికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కస్టడీ పొడిగించిన వారిలో సలీం, రెహా్మన్, యాసిర్ ఖాన్ తదితరులు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. వీరిని మరోసారి హైదరాబాద్కు తీసుకువస్తారా? సిద్దిపేటలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో 40 శాతం మహిళలే.. స్పెయిన్ కీలక నిర్ణయం
ఒక దేశ పురోగతిని ప్రభావితం చేసే అంశాల్లో లింగ సమానత్వం ముఖ్యమైంది. మానవ వనరుల్లో సగభాగమైన మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న దేశాలు ఆర్థికంగానే కాకుండా అన్నీ రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. లింగ వివక్ష కనబరుస్తున్న దేశాలు చతికిలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్ దేశంలో లింగ సమానత్వంలో మరో అడుగు ముందుకు వేసింది. కంపెనీ బోర్డ్లలో మహిళల నియామకంపై కొత్త చట్టాన్ని అమలు చేయనున్నట్లు ఫార్చ్యూన్ నివేదిక తెలిపింది. స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ వివరాల మేరకు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు స్పెయిన్ అధికార పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో మహిళల ప్రాధాన్యతపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని సాంచెజ్ తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 7న జరిగే కేబినెట్ మీటింగ్లో కంపెనీ బోర్డ్లలో 40 శాతం మహిళలు ప్రాతినిథ్యం వహించేలా కొత్త చట్టం అమలు చేసేందుకు కేబినేట్ సమావేశంలోని సభ్యులు ఆమోదం తెలపనున్నారని చెప్పారు. ఈ చట్టం ప్రకారం.. చట్టం ప్రకారం 250 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు, 50 మిలియన్ యూరోలు ($53 మిలియన్లు) వార్షిక టర్నోవర్ ఉన్న ప్రతి లిస్టెడ్ సంస్థ తప్పనిసరిగా 40 శాతం మహిళలు బోర్డ్ ఆఫ్ డైరక్టర్లగా నియమించాలని స్పష్టం చేశారు. ఇక తమ ప్రభుత్వం స్త్రీవాదానికి అనుకూలంగా మాత్రమే కాకుండా, మొత్తం స్పానిష్ సమాజానికి ప్రభుత్వం అనుకూలంగా ఉంది అని ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ అన్నారు. -
త్వరలో నీటిపారుదల సమీకృత చట్టం
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖకు సంబంధించిన 18 వేర్వేరు చట్టాలను కలిపి కొత్తగా ఒక సమీకృత నీటిపారుదల చట్టాన్ని తెస్తున్నామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు. ఇప్పటికే ముసాయిదా బిల్లును సిద్ధం చేశామని, బడ్జెట్ సమావేశాల్లో కాకుండా ఆ తర్వాత జరిగే సమావేశాల్లో ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముందన్నారు. నీటిపారుదలశాఖపై ఈఎన్సీ సి.మురళీధర్తో కలసి మంగళవారం ఆయన జలసౌధలో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నిజాం కాలం నాటి ఫసలి చట్టం 1935 అమల్లో ఉండగా రాష్ట్ర నీటిపారుదల రంగంలో సమూల మార్పులు రావడంతో కొత్త చట్టం అనివార్యమైందన్నారు. నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణతోపాటు నీటి నిర్వహణ పద్ధతులు, ఆర్థికపరమైన అధికారాలు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిబంధనల్లో భారీ మార్పులు వచ్చాయని... నీటిపారుదల ఆస్తుల పరిరక్షణ, నీటి భద్రత, నిర్వహణ అంశాలు పాత చట్టాల్లో లేవని, కొత్త చట్టంలో వాటిపై కచి్చతమైన నిబంధనలను పొందుపరచనున్నట్లు రజత్కుమార్ వెల్లడించారు. సెక్షన్–3పై వెనక్కి తగ్గలేదు.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకాల కోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం–1956లోని సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రజత్కుమార్ తెలిపారు. కృష్ణా జలాల పంపిణీ బాధ్యతను కొత్త ట్రిబ్యునల్కు అప్పగించాలా లేక ఇప్పటికే మనుగడలో ఉన్న కృష్ణా ట్రిబ్యునల్–2 లేదా మరే ఇతర ట్రిబ్యునల్కు అప్పగించాలా? అనే అంశంపై న్యాయశాఖ సలహా మేరకు చర్యలు తీసుకుంటామని గత అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. దీనిపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆ శాఖ అధికారులు గతేడాది డిసెంబర్లో హామీ ఇచ్చారని... అందువల్ల ఈ విషయమై మళ్లీ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లాలనే భావనతో ఉన్నామని చెప్పారు. ఒకవేళ కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని, ట్రిబ్యునల్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. గోదావరి జలాల విభజనకూ కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును ఏపీ కోరడంపై స్పందిస్తూ తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. ఎనిమిది డ్యామ్ల మరమ్మతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు.. ఆనకట్టల భద్రతా చట్టం కింద కడెం, మూసీ, స్వర్ణతోపాటు మొత్తం 8 డ్యామ్ల మరమ్మతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. మూసీ ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. సీతమ్మసాగర్ జలాశయం నిర్మాణంతో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు నీటమునగనున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని రజత్కుమార్ స్పష్టం చేశారు. -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టసవరణకు గవర్నర్ ఆమోదం
-
గర్భం వద్దనుకుంటే భర్త అనుమతి అవసరం లేదు: హైకోర్టు
కొచ్చి: గర్భం వద్దనుకుంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (ఎంటీపీ యాక్ట్ కింద 20 నుంచి 24 వారాల గర్భాన్ని తొలగించుకునే హక్కు) కింద భర్త అనుమతి అవసరం లేదని కేరళ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు భర్త నుంచి విడిపోయానని చెప్పుకునే మహిళ సైతం తన గర్భాన్ని తొలిగించాలనుకుంటే ఎంటీపీ యాక్ట్ కింద భర్త అనుమతి అవసరం లేదంటూ కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గర్భిణీ స్తీకి చట్టబద్దంగా విడాకులు తీసుకున్న లేదా వింతంతువు కానప్పటికీ గర్భధారణ సమయంలో వైవాహిక జీవితంలో పలు మార్పులు వస్తే తాను ప్రెగ్నెన్సీని కొనసాగించమనే హక్కు భర్తకు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు పిటిషనర్ తాను డిగ్రీ చదువుతుండగా అదే ప్రాంతంలో బస్సు కండక్టర్గా పనిచేస్తున్న వ్యక్తిని తన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నట్లు పిటిషన్లో పేర్కొంది. వివాహం అనంతరం తన భర్త ఆమె తల్లి కట్నం కోసం వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. అదే సమయంలో తాను ప్రెగ్నెంట్గా ఉండటంతో మరింత వేధింపులు అధికమయ్యాయని, దీనికి తోడు ఎలాంటి ఆర్థిక భరోసా ఇవ్వకపోవడంతో అతడిని విడిచి వేరుగా ఉంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఆమె తన గర్భాన్ని తొలగించుకుందామని ఆస్పత్రికి వెళ్లితే వైద్యులు అందుకు నిరాకరిచండమే కాకుండా విడాకులు తీసుకున్నట్లు పత్రాలు సమర్పించాలని చెప్పారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ వీజీ అరుణ్ వింతంతువు లేదా చట్ట బద్ధంగా విడిపోయిన వాళ్లకు వర్తించే ఎంటీపీ చట్టంలోకి గర్భధారణ సమయంలో వైవాహిక జీవితంలో మార్పులు సంభవించిన మహిళలను కూడా చేరుస్తూ చారిత్రాత్మక తీర్పుని వెలువరించారు. పైగా సదరు మహిళలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అంతేగాదు సదరు పిటిషనర్కి గర్భం తొలగించుకునేందుకు అనుమతించడమే కాకుండా అందుకు అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. (చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ ఎదురవుతున్న సంక్షోభాలు... ఆదుకోమంటూ ఆ నాయకుడికి పిలుపు) -
కోరలు లేని ఫైర్ సర్వీసెస్ యాక్ట్.. హైదరాబాద్లోనే ఎక్కువ కేసులు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లోని రూబీ హోటల్ యజమాని నిర్లక్ష్యం ఎనిమిది మంది ప్రాణాలు బలిగొంది. కేవలం ఈ ఒక్క భవనమే కాదు సరిగ్గా వెతికితే నగరంలోని ప్రతి వీధికి కనీసం మూడు ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి నిర్మాణాలు చేపట్టిన యజమానులపై చర్యలు తీసుకోవడానికి అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏపీ ఫైర్ సర్వీసెస్ యాక్ట్. 1999లో రూపొందించిన ఈ కోరలు లేని చట్టాన్నే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. వాణిజ్య భవనాలు, సముదాయాల యజమానులు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడటానికి ఇదీ ఓ కారణమే అన్నది నిపుణుల మాట. సమరీ ట్రయల్కు మాత్రమే అవకాశం... ఏదైనా నేరానికి సంబంధించి పోలీసు విభాగం ఐపీసీ కింద కేసు నమోదు చేస్తుంటుంది. నేరం, నేరగాడి తీరుతెన్నుల్ని బట్టి అరెస్టుపై నిర్ణయం తీసుకుంటుంది. ఆపై జైలు, బెయిలు, కోర్టులో కేసు విచారణ తదితరాలు ఉంటాయి. అదే ఫైర్ సర్వీసెస్ యాక్ట్ వద్దకు వచ్చేసరికి ఆ చట్టం, అగ్నిమాపక శాఖకు ఉన్న అధికారాలు వేరు. వీళ్లు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు సంబంధించి కేసు నమోదు చేసినప్పటికీ నోటీసుల జారీ మినహా అరెస్టుకు ఆస్కారం లేదు. ఈ కేసు కోర్టు వరకు వెళ్లినా సాధారణ కేసుల్లా విచారణ ఉండదు. అదే ఎందరి ప్రాణాలు తీసిన ఉదంతం, ఎంత తీవ్రమైన ఉల్లంఘన అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఈ కేసుల విచారణ సివిల్ కోర్టుల్లో సమరీ ట్రయల్ విధానంలో జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై నమోదైన కేసుల మాదిరిగానే ఉంటుంది. గరిష్ట శిక్ష మూడు నెలలు మాత్రమే... ఈ చట్టంలోని అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ శిక్షలు మాత్రం చాలా తక్కువ. దాదాపు 90 శాతం ఉల్లంఘనలకు జరిమానా మాత్రమే విధించే ఆస్కారం ఉంది. మిగిలిన వాటిలోనూ గరిష్ట శిక్ష కేవలం 3 నెలలు మాత్రమే. ఈ సెక్షన్లకు సంబంధించిన ఉల్లంఘనల్లోనూ పెనాల్టీ విధించే ఆస్కారం ఉంది. రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు 2014 నుంచి ఇప్పటి వరకు 689 కేసులు నమోదు చేశారు. వీటిలో కనీసం ఒక్క కేసులోనూ ఉల్లంఘనులకు జైలు శిక్ష పడలేదు. 83 కేసులు జరిమానాలతో ముగిసిపోగా... మరో 60 ఆ విభాగమే ఉపసంహరించుకుంది. మిగిలిన వాటిలో 257 కేసులను న్యాయస్థానం రిటర్న్ చేసి మార్పు చేర్పులు సూచించింది. ఇంకో 270 కేసులు ఇప్పటికీ వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని 665 నిర్మాణాలకు నోటీసులు, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన మరో 636 మంది యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోనే అత్యధికంగా కేసులు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అగ్నిమాపక శాఖ నమోదు చేసిన కేసుల్లో అత్యధిక హైదరాబాద్కు సంబంధించివనే. మొత్తం 689 కేసులకు నగరానికి సంబంధించినవి 325, రంగారెడ్డి 154, వరంగల్ 70, నల్లగొండ 56, ఖమ్మం 36 కేసులు ఉన్నాయి. గతంలో అగ్నిమాపక శాఖకు సొంతంగా ప్రాసిక్యూషన్ సర్వీస్ కూడా ఉండేది కాదు. పంజగుట్టలోని మీన జ్యువెలర్స్లో 2006లో జరిగిన అగ్నిప్రమాదం ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఆ కేసు నుంచి అగ్నిమాపక శాఖ ప్రాసిక్యూషన్ మొదలెట్టింది. అగ్నిమాపక శాఖలో పదవీ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘2000 సంవత్సరం తర్వాత అభివృద్ధి వేగం పుంజుకుంది. దీంతో అనేక భారీ నిర్మాణాలు, భవనాలు వచ్చాయి. వాణిజ్య కార్యకలాపాలూ పెరగడంతో ఉల్లంఘనలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఫైర్ సర్వీసెస్ యాక్ట్ను మార్చాలి. కఠినమైన నిబంధనలతో పాటు శిక్షలు అమలులోకి తీసుకువస్తేనే అగ్ని ప్రమాదాల్లో అమాయకులు బలికాకుండా ఉంటారు. మీన జ్యువెలర్స్ కేసులో ఆ భవన యాజమాన్యానికి పడిన జరిమానా కేవలం రూ.15 వేలే’ అని అన్నారు. (క్లిక్ చేయండి: హైదరాబాద్ మెట్రో రైలు.. తప్పని తిప్పలు) -
కాల్చేస్తాం, జరిమానా కట్టేస్తాం
సాక్షి, బెంగళూరు: ధూమపానం అటు ఆరోగ్యాన్ని, ఇటు జేబును నాశనం చేస్తుందని ఎందరు హితోక్తులు చెప్పినా ధూమపాన ప్రియులు చెవికెక్కించుకోవడం లేదు. రాష్ట్రంలో ధూమపానం చేసేవారి సంఖ్య పెరగడమే దీనికి నిదర్శనం. దేశంలోనే అగ్రస్థానంలో కన్నడనాడు నిలిచింది. పబ్లిక్ స్థలాల్లో పొగతాగుతూ పట్టుబడిన వారి జాబితాలోనూ కర్ణాటకదే తొలిస్థానం. సుమారు 35 శాతంతో కర్ణాటక ఇందులో పై వరుసలో ఉంది. ఎన్నిసార్లు జరిమానాలు విధిస్తున్నప్పటికీ పబ్లిక్ ప్రాంతాల్లో ధూమపానం చేయడం మాత్రం ఆగడం లేదు. కర్ణాటక తర్వాత స్థానంలో కేరళ ఉంది. గడిచిన మూడేళ్లలో 5.07 లక్షల మంది పొగ తాగుతూ దొరికిపోయి జరిమానా కట్టారు. కోట్పా చట్టం చూస్తోంది సిగరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టం (కోట్పా) అమల్లో ఉంది. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం ఈ చట్టరీత్యా నేరం. కానీ ధూమపానప్రియులు యథావిధిగా రద్దీ ప్రాంతాల్లో పొగాకు కాలుస్తున్నారు. టీ స్టాళ్లు, పాన్ దుకాణాలు, పార్కులు, వీధుల్లో ఇది అధికంగా ఉంది. అధికారుల తనిఖీలలో దొరికితే ఈ నేరానికి రూ. 200 జరిమానా విధిస్తున్నారు. పొగరాయుళ్లు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని తూర్పు జోన్ డీసీపీ శరణప్ప తెలిపారు. 5.07 లక్షల జరిమానాలు 2019 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు దేశంలో మొత్తం 14.40 లక్షల మంది బహిరంగ ప్రాంతాల్లో ధూమపానం చేసి జరిమానాలు చెల్లించారు. ఇందులో కర్ణాటక నుంచే సుమారు 5.07 లక్షల మంది ఉండడం గమనార్హం. దేశంలోని మొత్తం కేసులతో పోలిస్తే 35 శాతం ఒక్క బెంగళూరు నుంచే ఉన్నాయి. మొత్తం జరిమానాల్లో 50 శాతం కర్ణాటక, కేరళ రాష్ట్రాల వాటానే ఉంది. (చదవండి: చాటింగ్, హాట్ ఫొటోలతో పారిశ్రామికవేత్తకు టోకరా) -
PMLA చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
శతమానం భారతి: గుర్తింపు చట్టం
బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం 1920లో నేరస్థుల గుర్తింపు చట్టాన్ని ఆమోదించింది. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన నెల రోజుల తర్వాత ఈ చట్టం అమలులోకి వచ్చింది. జాతీయవాదం పెల్లుబుకుతున్న వేళ, ప్రజలపై నిఘా పరిధిని విస్తరించడం ద్వారా వారిని మరింతగా నియంత్రించడానికిగానూ బ్రిటిష్ పాలకులు చేసిన ప్రయత్నంలో భాగంగా ఆనాడు నేరస్థుల గుర్తింపు చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం నేరస్థుల ఫొటోగ్రాఫ్లు, వేలిముద్రలు, పాద ముద్రలు వంటివాటిని (కొన్ని పరిమిత కేసుల్లో నేరస్థులు కానివారివి కూడా) భద్రపర్చే అధికారాలను చట్టాన్ని అమలు చేసే అధికారులకు దఖలు పర్చింది. ఇలాంటి వివరాలను భద్రపర్చడానికీ, తొలగించడానికీ మరిన్ని నిబంధనలు తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ 102 సంవత్సరాల తర్వాత, స్వతంత్ర భారతదేశంలో నెహ్రూ తర్వాత సుదీర్ఘ కాలం దేశాన్ని పాలిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, వలస పాలనా కాలంనాటి చట్టం చేసిన దానికంటే మరింత అధికంగా వ్యక్తిగత డేటాను (అతితక్కువ భద్రతలతో) సేకరించడానికి ప్రయత్నిస్తూ తాజా ముసాయిదా బిల్లును తీసుకొచ్చి నేరస్థుల గుర్తింపు చట్టాన్ని మార్చనుంది. అయితే ఈ అధికారాలను చట్టపరంగా విస్తరించేటప్పుడు వాటిని క్రమబద్ధీకరించ వలసి ఉంటుందన్న ప్రజాభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ చట్టంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయనుంది. ఇందుకోసం మరింత ప్రజాస్వామికమైన ప్రక్రియను అనుసరించనుంది. (చదవండి: స్వతంత్ర భారతి: షా బానో కేసు) -
స్వతంత్ర భారతి: అఫ్స్పా చట్టం
తీవ్రవాదాన్ని అణచివేసి, శాంతిభద్రతలను కాపాడడమే ధ్యేయంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అస్సాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, మిజోరామ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని 1958 సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం సైనిక దళాలకు కొన్ని అధికారాలు దక్కాయి. ముందస్తుగా వారంట్ ఇవ్వకుండానే ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. సోదాలు నిర్వహించవచ్చు. ఎవరినైనా కాల్చి చంపినా అరెస్టు, విచారణ నుంచి ప్రత్యేక రక్షణ ఉంటుంది. అయితే ఆనాటి నుంచీ ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏఎఫ్ఎస్పీఏకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త ఇరోం చాను షర్మిళ 16 ఏళ్లపాటు నిరాహార దీక్ష కొనసాగించారు. 2015లో త్రిపురలో, 2018లో మేఘాలయాలో ఈ చట్టాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 న నాగాలాండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈ వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)–1958 ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. అస్సాంలో 23 జిల్లాలు, మణిపూర్లో 6 జిల్లాలు (15 పోలీసు స్టేషన్ల పరిధిలో), నాగాలాండ్లో 7 జిల్లాలకు (15 పోలీసు స్టేషన్ల పరిధిలో) ఈ చట్టం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఇదొక కీలకమైన అడుగు అని ఆయన అభివర్ణిం చారు. 2021 డిసెంబర్లో నాగాలాండ్లో సైనికుల దాడిలో 14 మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. దాంతో అక్కడి ప్రజల వినతి మేరకు ఏఎఫ్ఎస్పీఏ (అఫ్స్పా) ను ఎత్తివేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. -
ప్రపంచంలోనే తొలిసారిగా ‘రైట్ టూ రిపేర్’ యాక్ట్
వినియోగదారుల హక్కులకు కాపాడేందుకు నడుం బిగించింది న్యూయార్క్ చట్టసభ. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో ఎంతో కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపే దిశగా తొలిసారిగా అడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఫెయిర్ రిపేర్ యాక్ట్ను అమలు కోసం చట్టాన్ని సిద్ధం చేసింది. డిజిటల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఏ చిన్న సమస్య వచ్చినా తిరిగి మాన్యుఫ్యాక్చరర్ సూచించి చోటే రిపేర్ చేయించుకోవాల్సి వస్తోంది. బయట చేయిస్తే వారంటీ, గ్యారంటీలు లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సార్లు రిపేర్ ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో వినియోగదారులు అనివార్యంగా తయారీదారు మీదే ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి అనేక సమస్యలకు చెక్ పెట్టే దిశగా న్యూయార్క్ చట్టసభ నడుం బిగించింది. న్యూయార్క్ చట్టసభ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తయారీదారులు ఏదైనా ప్రొడక్టును మార్కెట్లోకి తెచ్చినప్పుడు అందులో తలెత్తే సమస్యలు వాటికి పరిష్కారాలను కూడా సూచించాల్సి ఉంటుంది. కొనుగోలుదారులు రిపేర్ల కోసం తయారీదారులతో పాటు స్థానికంగా ఉండే రిపేర్ షాప్లను కూడా ఆశ్రయించవచ్చు. సాధ్యమైతే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా వాళ్లే పరిష్కారం వెతుక్కొవచ్చు. అంతేకాదు రిపేరుకు అవసరమైన విడి భాగాలు, ఇతర టూల్స్ అమ్మకంపై తయారీదారులు విధించిన ఆంక్షలు కూడా తొలగిపోతాయి. చదవండి: అమెజాన్కి గుడ్బై చెప్పిన డేవ్క్లార్క్.. వీడిన 23 ఏళ్ల బంధం.. -
ఉక్రెయిన్కి మద్దతుగా కీలకమైన బిల్లు...పుతిన్ పని ఔట్
Putin doesn't know way out of war: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై సాగిస్తున్న దాడిని సైనిక చర్యగానూ, మాతృభూమి రక్షణ కోసం చేస్తున్న పోరాటంగా సమర్థించుకున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. గత రెండు నెలలకు పైగా ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న నిరవధిక దాడిని గత దశాబ్దాల కాలంలో ఐరోపాలో జరగని అత్యంత ఘోరమైన యుద్ధంగా బైడెన్ అభివర్ణించారు. అంతేకాదు బైడెన్ ఉక్రెయిన్కు సహాయాన్ని వేగవంతం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఉక్రెయిన్కు మరో 4,000 కోట్ల డాలర్ల సైనిక, మానవీయ సాయం అందించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ సోమవారం సంతకం చేశారు. రష్యాపై ఉక్రెయిన్ విజయం సాధించడంలో ఈ సాయం కీలకంగా మారనుందని అనంతరం ఓ ప్రకటనలో ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని సహాయం చేసేలా రెండో ప్రపంచ యుద్ధం నాటి లెండ్ లీజు చట్టాన్ని ప్రవేశ పెట్టారు. ఈ మేరకు బైడన్ ఆ బిల్లు పై సంతకం చేస్తూ..."ఉక్రెనియన్ ప్రజలు తమ మాతృభూమి కోసం చేస్తున్న పోరాటంలో పూర్తి మద్దతిచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ కీలకమైన బిల్లుపై నేను సంతకం చేస్తున్నాను. ఇది రెండోవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా తన మిత్రదేశాలకు సహాయం చేయడంలో ఉపకరించిన లెండ్ లీజు చట్టం. 1941 వరకు యుఎస్ యుద్ధంలోకి ప్రవేశించనప్పటికీ, ఈ చట్టంతో దాని మిత్రదేశాలకు సహాయం చేసిందని చెప్పారు. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పని అయిపోయినట్లేనని, ఇక యుద్ధం నుండి బయటపడే మార్గమే ఉండదన్నారు. ఈయుద్ధం కారణంగా నాటో, యూరోపియన్ యూనియన్ విడిపోతాయని పుతిన్ చాలా తప్పుగా భావించారు. పుతిన్ సాగిస్తున్న యుద్ధం యూరప్లో విధ్వంసాన్ని తీసుకురావడంతో పాటు ప్రజాస్వామ్యానికి, మానవ హక్కులకు భంగం కలిగించింది. శాంతియుత పరిష్కారంపై ఆధారపడిన భవిష్యత్తుకు శాశ్వతమైన నిబద్ధతను పునరుద్ఘాటించేందుకే ఈ బిల్లు పై సంతకం చేశాను. ఈ బిల్లుకు మద్దతిచ్చి ఆమోదించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ సభ్యులకు ధన్యావాదాలు. అని అన్నారు. అంతేకాదు పుతిన్ సాగిస్తున్న దురాక్రమణ చర్యలను తన సొంతగడ్డలోని ప్రజలే వ్యతిరేకించారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు కూడా. (చదవండి: పుతిన్ ఫొటో వైరల్.. ఆరోగ్యంపై అనుమానాలకు మరింత బలం!) -
కొత్త చట్టం, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లు ఉండేలా ఇళ్లను నిర్మించాలి..
ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఈవీ) వినియోగం పెరిగిపోతుంది.టెక్నాలజీని ఫోలో అవుతూ వినియోగదారులు పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయా దేశాల ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ వెహికల్స్ కోసం కొత్త చట్టాల్ని అమలు చేయనున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్లను ఎంకరేజ్ చేస్తూ ఓ నూతన చట్టాన్ని అమలు చేయనుంది. 2030 నాటికి ఇంగ్లాండ్లో ఫ్యూయల్ వెహికల్స్ను పూర్తిగా బ్యాన్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ లో నిర్మించే ఆఫీస్ల్లో, ఇళ్లల్లో స్మార్ట్ ఛార్జింగ్లను ఏర్పాటు చేయాలని తెలిపింది. వీటితో పాటు ప్రతి ఐదు పార్కింగ్ స్థలాలకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జర్ను ఏర్పాటును తప్పని సరి చేసింది. లేదంటే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. ఎలక్ట్రిక్ వెహికల్ చట్టం మంచిదే వరల్డ్ వైడ్గా తొసారి ఇంగ్లాండ్ ఈ చట్టాన్ని అమలు చేయనుంది. ఈ చట్టంపై పలువురు అ దేశాది నేతలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్కు చెందిన ఇళ్లలో సరైన పార్కింగ్ లు, గ్యారేజీలు లేకపోవడంతో పర్యావరణం దెబ్బతింటుందని, ఈ నూతన చట్టం అమలు చేయడం ప్రయోజకరంగా ఉంటుందని అమెరికన్ మీడియా 'ఎలక్ట్రిక్' తన కథనంలో పేర్కొంది. చదవండి: అన్నీ ఎలక్ట్రిక్ వాహన కంపెనీల ఛార్జింగ్ స్టేషన్లు ఒకే యాప్లో -
హీరో సూర్యకు తమిళనాడు బీజేపీ వార్నింగ్
సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కోలీవుడ్, టాలీవుడ్ సహా ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చట్టాన్ని సవరించడం ద్వారా మూవీ రిలీజ్ డేట్ కేంద్రం చేతుల్లోకి వెళ్తుందని సినీ పెద్దలు తీవ్ర అసనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సీనీ ప్రముఖులు బాహాటంగానే కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలె హీరో సూర్య కూడా కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా సూర్య వ్యాఖ్యలపై తమిళ బీజేపీ యువజన విభాగం మండిపడింది. సూర్య..తన సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే పట్టించుకుంటే మంచిదని, వేరే విషయాలపై జోక్యం చేసుకోవద్దని హితవు పలికింది. తీరు మార్చుకోకపోతే సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ యువజన విభాగం సూర్యపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై సూర్య ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంది. -
ఆ విషయంలో కేంద్రం నిర్ణయం సరైంది కాదు: సూర్య
సాక్షి, చెన్నై: ప్రజలను రక్షించడం కోసం చట్టం ఉండాలి గాని వారి గొంతు నొక్కడం కోసం కాదని నటుడు సూర్య అన్నారు. సినిమాటోగ్రఫీ చట్టం–1952ను సవరిస్తూ కేంద్రం తీసుకున్ననిర్ణయంపై సూర్య అసంతృప్తి వ్యక్తం చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ పొందిన చిత్రాన్ని కూడా ప్రేక్షకులు వ్యతిరేకిస్తే ఆ చిత్రాన్ని తిరిగి సెన్సార్ చేయడం, ప్రదర్శన నిలిపివేయడం సరికాదన్నారు. కాగా ఈ చట్టాన్ని బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్, సీనియర్ దర్శకుడు భారతీరాజా, అమీర్, నటుడు సూర్య, విశాల్, కార్తీక్ వంటి ప్రముఖులు కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నటుడు విశాల్ మాట్లాడుతూ.. సెన్సార్ అయిన చిత్రాలను కూడా నిర్వహిస్తే సెన్సార్ బోర్డు ఎందుకని ప్రశ్నించారు. అదే విధంగా జీఎస్టీ, పైరసీని అరికట్టడం వంటి విషయాల గురించి స్పందించకపోవడం పైనా ప్రశ్నించారు. -
రెవెన్యూ వ్యవస్థ: ‘టైటిల్’ గ్యారంటీ
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి ‘టైటిల్ గ్యారంటీ’ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. యూపీఏ సర్కారు 2011లో రూపొందించిన భూ హక్కుల ముసాయిదా చట్టానికి మార్పులు, చేర్పులు చేసి.. కొత్త్త ముసాయిదాను రూపొందించే బాధ్యతను నీతి ఆయోగ్కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు నూతన ముసాయిదా చట్టం–2020, నియమాల(రూల్స్)ను తయారు చేసిన నీతి ఆయోగ్ వాటిని రాష్ట్ర ప్రభు త్వాలకు పంపింది. కేంద్రం రూపొందించిన టైటిల్ గ్యారంటీ ముసాయిదా చట్టంతో పాటు మహారాష్ట్ర చట్టాన్ని కూడా జతపరిచింది. ఈ రెండింటిలో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా టైటిల్ గ్యారంటీ చట్టాలను రూపొందించు కోవాలని స్పష్టం చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేక నిబంధనలు (రెగ్యులేషన్లు) పంపింది. ఇప్పటికే హరియాణాలో ప్రయో గాత్మకంగా అమలు చేస్తున్న ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ 2024లోపు ప్రవేశపెట్టాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. భూ వివాదాలకు అంతిమ పరిష్కారం టైటిల్ గ్యారంటీ చట్టంతోనే సాధ్యపడుతుం దని కేంద్ర సర్కారు భావిస్తోంది. గత యూపీఏ ప్రభుత్వం టైటిల్ గ్యారంటీని 2020లోపు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా కూడా తయారు చేసింది. ఆ తర్వాత కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావ డంతో ఈ చట్టంలో మార్పులు, చేర్పులు చేసి కొత్త ముసాయిదాను రూపొం దించే బాధ్యతను నీతి ఆయోగ్కు మోదీ ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీకే అగర్వాల్ నేతృత్వంలోని కమిటీ ముసాయిదాకు తుదిరూపు ఇచ్చింది. ఈ డ్రాఫ్టును తాజాగా నీతి ఆయోగ్ రాష్ట్రాలకు పంపింది. ప్రస్తుతం ఉన్న రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) స్థానే కంక్లూజివ్ టైటిల్ను తేవాలని కేంద్రం నిర్ణయించింది. కేవలం రెండు రిజిస్టర్లే..! టైటిల్ గ్యారంటీ ముసాయిదా చట్టంలో పలు కీలకాంశా లను నీతి ఆయోగ్ పొందుపరిచింది. భూములకు సంబం ధించి పదుల సంఖ్యలో ఉన్న రిజిస్టర్ల స్థానంలో రెండు రిజిస్టర్లనే నిర్వహించాలని అభిప్రాయపడింది. అవి టైటిల్ రిజిష్టర్, దానికి అనుబంధంగా వివాదాల రిజిష్టర్ మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. భూ సర్వే, ఇతరత్రా సంస్కరణలకు నిధులను సమకూర్చేందుకు కేంద్రం ఇదివరకే అంగీకరించింది. భూ భారతి, మొదలు సమగ్ర భూ సర్వేకు కూడా నిధులను విడుదల చేసింది. దీంట్లో భాగంగానే టైటిల్ గ్యారంటీ చట్టం అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను అందజేసేందుకు సుముఖంగా ఉంది. ముసాయిదా చట్టంలో ముఖ్యాంశాలు: – అన్ని రకాల భూములకు ఇక ఓకే ఒక రికార్డు. వివాదాలు ఉంటే తాత్కాలికంగా మరో రికార్డులో. – వివాద పరిస్కారాలకు ట్రిబ్యూనళ్ల ఏర్పాటు. – రికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వమే పూచీకత్తు. యజమానికి నష్టం జరిగితే పరిహారం. – రికార్డుల్లోకి ఎక్కిన వివరాలను రెండేళ్ల తరువాత మార్చే వీలు ఉండదు – భూముల సర్వే చేసి ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఏపీలో ఇప్పటికే చట్టానికి ఆమోదం టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమలుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకంటే ఒకడుగు ముందుంది. గతేడాది ఏపీ అసెంబ్లీ టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ చట్టం అమలుకు ఆయువు పట్టయిన భూ సమగ్ర సర్వేను వచ్చేడాది జనవరి నుంచి శ్రీకారం చుట్టడానికి ముహూర్తం ఖరారు చేసింది. మన రాష్ట్రంలో ఇలా.. తెలంగాణలోనూ కంక్లూజివ్ టైటిల్ను తీసుకురావాలని గత మూడేళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా భూ రికార్డుల ప్రక్షాళనతో రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా నిర్వహించింది. ఈ క్రమంలో కంప్యూటర్ ఆధారిత భూ రికార్డుగా ప్రకటించిన ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. పార్ట్–బీ, పెండింగ్ కేసులను కొలిక్కి తేవడానికి సమగ్ర భూ సర్వేను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మూడుచింతలపల్లిలో జరిగిన ధరణి ప్రారంభోత్సవ సభలో ప్రకటించారు. దీంతో మన రాష్ట్రం కూడా టైటిల్ గ్యారంటీ చట్టం వైపు అడుగులేస్తుందని చెప్పవచ్చు. -
కదిరిలో దిశ చట్టం అవగాహనా ర్యాలీ
-
మహిళల లక్ష్య సాధనకు ‘దిశ’ నిర్దేశం
సాక్షి, ఏలూరు: మహిళలు తమ లక్ష్యాలను సాధించుకునేందుకు ‘దిశ’ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని ఏలూరు సెయింట్ థెరిసా కళాశాల విద్యార్థినులు అన్నారు. దిశ చట్టంపై సాక్షి టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహిళల్లో ఎదగాలని ఎంతో తపన ఉన్నప్పటికి అత్యాచార ఘటనల వల్ల అభద్రత భావానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వెంటనే శిక్షించాలని కోరారు. దిశచట్టం తో మహిళలపై దాడులు తగ్గుతాయనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. దిశ చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. దిశ చట్టం తీసుకురావడంతో అమ్మాయిల కన్నా.. అబ్బాయిల తల్లిదండ్రులే ఎక్కువ భయపడుతున్నారని వారు పేర్కొన్నారు. మహిళలందరి తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సెయింట్ థెరిసా కళాశాల విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆయుధ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఓకే
న్యూఢిల్లీ: ఆయుధ సవరణ బిల్లు-2019కు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును సోమవారం లోక్సభ ఆమోదించింది. ఒక వ్యక్తి ఇప్పటివరకు అత్యధికంగా మూడు తుపాకులు, లేదా సంబంధిత ఆయుధాలను కలిగి ఉండే అవకాశం ఉండగా, ఇకపై అత్యధికంగా రెండు మాత్రమే కలిగి ఉండే ప్రతిపాదనను బిల్లులో చేర్చారు. వారసత్వంగా వచ్చిన ప్రాచీన ఆయుధాలను నిరుపయోగం చేసి, ఎన్నైనా భద్రపరుచుకోవచ్చని హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి రాజ్యసభకు తెలిపారు. నిర్లక్ష్యంగా, మనుషులకు ప్రాణహాని కలిగేలా ఆయుధాన్ని ఉపయోగిస్తే రెండేళ్ల జైలు, లక్ష జరిమానా ప్రతిపాదన బిల్లులో ఉంది. అక్రమంగా ఆయుధాలు తయారు చేసినా, కలిగివున్నా గరిష్టంగా జీవితఖైదు విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. -
‘దేశభక్తి చట్టం’ ఉపయోగించిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా మొట్టమొదటి సారిగా ‘దేశభక్తి చట్టం’ను ఉపయోగించింది. ఈ చట్టాన్ని ఉపయోగించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కారు. టెర్రరిస్టు కార్యకలాపాలకు సంబంధించి ఆదమ్ అమీన్ హసౌన్, అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 50 ఏళ్ల పైబడిన ఆదమ్కు 2017లోనే శిక్షాకాలం పూర్తయింది. ప్రతికూల పరిస్థితుల్లో ఆయన్ని విడుదల చేయకుండా, ఎలాంటి విచారణ లేకుండానే జీవితాంతం జైల్లో నిర్బంధించేందుకు ‘దేశభక్తి చట్టం’ను ప్రయోగించారు. ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. జన్మతా లెబనాన్కు చెందిన ఆదమ్ను మొదటి సారి 2002, జూన్ నెలలో అక్రమ వలస కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికా యుద్ధం ప్రకటించాక ఎక్కువ సార్లు ఆదమ్ కటకటాల వెనక్కే ఉన్నారు. వాస్తవంగా ఆయన ప్రత్యక్షంగా టెర్రరిస్టు కార్యకలాపాల్లో పాల్గొనలేదు. కానీ టెర్రరిస్టు కార్యకలాపాలకు మద్దతిస్తున్న పలు ముస్లిం చారిటీ సంస్థలకు భారీగా విరాళాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఈ చారిటీ సంస్థలను కూడా అమెరికా నిషేధించింది. 2017లో ఆదమ్ శిక్షాకాలం పూర్తయ్యాక ఆయన పుట్టిన లెబనాన్గానీ, పెరిగిన పాలస్తీనాను ఆక్రమించుకున్న ఇజ్రాయిల్గానీ శరణార్థిగా తీసుకునేందుకు తిరస్కరించడంతో జాతీయ భద్రతా దృష్ట్యా ఆయన్ని దేశభక్తి చట్టంలోని 412 సెక్షన్ కింద నిర్బంధించారు. కేవలం విదేశీయులకే వర్తించే ఈ చట్టాన్ని అమెరికాపై ఒసామా బిన్ లాడెన్ జరిపించిన వైమానిక దాడుల అనంతరం 2001, అక్టోబర్ 26వ తేదీన అమెరికా పార్లమెంట్ ఆమోదించింది. -
మోటారు వాహనాల చట్టం 2019 అమలుపై వ్యతిరేకత
-
రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీల చట్టం
-
పదునెక్కిన ‘పంచాయతీ’ చట్టం
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులకు కొత్త పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా వివిధ విధులు, అధికారాలు, బాధ్యతలను నిర్దేశించారు. కొత్తగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గ సభ్యులంతా తమ విధులను సక్రమంగా నిర్వహించేలా చట్టంలో ఆయా అంశాలు సోదాహరణంగా వివరించారు. గ్రామ ప్రథమ పౌరుడిగా వార్డు సభ్యులకు సర్పంచ్ నేతృత్వం వహిస్తారు. వివిధ రూపాల్లో పంచాయతీకి వచ్చే అన్నిరకాల నిధులను సమర్థవంతంగా నిర్వహించేలా వార్డుమెంబర్లకు సర్పంచ్ చేదోడువాదోడుగా నిలుస్తారు. సర్పంచ్లు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా ఈ చట్టంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సర్పంచ్ల విధులు, బాధ్యతలు.. ►చట్టం లేదా ప్రభుత్వ నిబంధనల ద్వారా సంక్రమించిన అధికారాలు వినియోగించుకుని సర్పంచ్ తన విధులు నిర్వహిస్తారు. ►పంచాయతీ కార్యదర్శి కార్యకలాపాలపై సర్పంచ్కు పరిపాలనాపరమైన అధికారం. గ్రామ పంచాయతీలు, ఇతర కమిటీలలో ఆమోదించిన తీర్మానాల అమలుకు పంచాయతీ కార్యదర్శుల విధులపై సర్పంచ్ల పర్యవేక్షణ ఉంటుంది. ►రోజువారీ పనుల నిమిత్తం ప్రభుత్వ ఆమోదం మేరకు డబ్బు ఖర్చుచేసే అధికారం సర్పంచ్లకు ఉంటుంది. ఈ మేరకు చేసిన వ్యయాలకు తదుపరి పంచాయతీ సమావేశంలో ఆమోదం పొందాలి. పంచాయతీల ఆమోదం మేరకు చెల్లింపులు, ధరావతు చెల్లింపులు జరుపుతారు. చెల్లింపు విషయంలో గ్రామపంచాయతీ తీర్మానాలకు లోబడే సర్పంచ్ పనిచేయాలి ►గ్రామంలో పారిశుద్ధ్యం సక్రమంగా ఉండేలా సర్పంచ్ బాధ్యత వహిస్తారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శిచేసే పనుల పరిశీలన, పారి«శుధ్య కార్మికులు తమ విధులకు సక్రమంగా హాజరయ్యేలా పర్యవేక్షిస్తారు. ► ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చూడాలి. శిథిలాలు తొలగించాలి. పాడుబడిన బావులు, నీటి గుంటలు పూడ్చేయాలి. పిచ్చిచెట్లు నరికివేయాలి. ► పంచాయతీకి విధించిన లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఉద్దేశించిన హరితహారం కార్యక్రమాన్ని సర్పంచ్ పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతియేటా నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం పెరిగి పెద్దవయ్యేలా చూడటం సర్పంచ్ బాధ్యత ► ప్రతి ఇంటికి మొక్కలు సరఫరాచేయాలి. వీధులు, ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. మొక్కలను జాగ్రత్తగా కాపాడాలి. ► నెలకు ఒకసారి గ్రామపంచాయతీ సమావేశం నిర్వహించాలి. రెండునెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించాలి. ► వందశాతం పన్నులు వసూలు చేయాలి. పంచాయతీ రికార్డులు, వీధి దీపాల నిర్వహణ, జనన మరణ రికార్డుల నిర్వహణ. ► సర్పంచ్లు తమ గ్రామాల్లోనే నివాసముండాలి. గ్రామపంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరుకావాలి. గ్రామపంచాయతీ సమర్థవంతంగా పనిచేసేలా అప్పగించిన విధులను పూర్తిచేయడానికి సర్పంచ్ల పర్యవేక్షణ ఉపయోగపడుతుంది. నిర్లక్ష్యంగా ఉంటే వేటుకూ అవకాశం.. నూతనంగా ఎన్నికైన గ్రామ పాలకవర్గాలకు అధికారాలతోపాటు బాధ్యతలు కూడా పెరిగాయి. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై వేటు పడేందుకు కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త చట్టంలో నిర్ధేశించిన బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే, కేటాయించిన నిధులను సవ్యంగా ఖర్చుచేయకపోతే సర్పంచ్ల తొలగింపుతో పాటు పాలకవర్గాన్ని రద్దుచేసే అవకాశముంది. చట్టప్రకారం తాను నిర్వహించాల్సిన విధుల నిర్వహణలో విఫలమైతే వివరణ ఇచ్చేందుకు సర్పంచ్కు అవకాశమిస్తారు. ఈ తర్వాత జిల్లా కలెక్టర్ అతడిని పదవి నుంచి తొలగించవచ్చు. పంచాయతీల నిర్వహణకు కలెక్టర్ లేదా పీఆర్ కమిషనర్, ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు పట్టించుకోకపోతే విధుల నుంచి తొలగించే అవకాశముంది. ఒకసారి సర్పంచ్గా తొలగిస్తే ఆరేళ్లపాటు సర్పంచ్గా పోటీచేయకుండా అనర్హత వేటు వేయొచ్చు. గ్రామాభివృద్ధికి సంబంధించిన ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలను పంచాయతీ పాలకవర్గాలు రూపొందించుకోవాలి. చట్టంలో సర్పంచ్లకు పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారాలతో పాటు, సర్పంచ్, ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ను కట్టబెట్టారు. గ్రామాల్లో అక్రమ లేఅవుట్లకు అనుమతినిచ్చిన పక్షంలో మొత్తం పాలకవర్గాన్నే రద్దు చేసే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాల విషయంలోనూ కఠిన చర్యలుంటాయి. మూడు వందల మీటర్ల స్థలంలో, పది మీటర్ల ఎత్తు మించకుండా జీప్లస్టు భవనాల నిర్మాణాలకే పంచాయతీలు అనుమతి ఇవ్వొచ్చు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అయ్యే వ్యయాన్ని సర్పంచ్, స్థానిక కార్యదర్శి భరించాలి. ప్రతి ఊళ్లో నర్సరీ... మొక్కల నిర్వహణలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కల పంపిణీ కోసం నర్సరీ ఏర్పాటుతోపాటు ఊళ్లోని ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా చూసే బాధ్యత సర్పంచ్పై ఉంటుంది. ప్రతీ రెండు నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించాలి. వరుసగా మూడుసార్లు గ్రామసభలు నిర్వహించకపోతే సర్పంచ్లను తప్పించే వీలుంది.. ప్రతినెలా గ్రామపాలకవర్గం సమావేశమై అభివృద్ధి, ఇతర కార్యకలాపాలు సమీక్షించాలి. చెత్తపడేస్తే జరిమానా... గ్రామాలు, ఇళ్ల పరిసరాల్లో ఇష్టం వచ్చినట్టుగా చెత్తా చెదారం పడేస్తే, ఇంటి ఎదుట చెత్త వేస్తే ఆ ఇంటి యజమానికి రూ.500 జరిమానా విధించే అధికారాన్ని సర్పంచ్లకు కల్పించారు. ఇంటి నుంచి మురుగునీటిని రోడ్డు మీదకు వదిలితే రూ. ఐదువేలు జరిమానా విధించే అవకాశముంది. ఊళ్లోని ప్రతి కుటుంబం ఆరు మొక్కలు నాటాలని చట్టంలో పేర్కొన్నా, వాటిలో కనీసం మూడింటినైనా నాటాలి. హరితహారంలో ఇచ్చిన మొక్కలను పెంచకపోతే ఇంటి యజమాని నుంచి రెండింతలు ఆస్తిపన్నును జరిమానాగా వసూలు చేసే వీలుంది. -
అక్రమ లే అవుట్లకు అనుమతిస్తే కొరడా
సాక్షి, హైదరాబాద్: నిర్దేశిత నిబంధనల ప్రకారం లేని లే అవుట్లకు అనుమతి ఇస్తే గ్రామపంచా యతీ పాలకవర్గాన్ని రద్దు చేసే నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో చేర్చింది. నగరాలు, పట్టణాల శివారుల్లోని గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు విచ్చలవిడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 2018 మార్చి 31 వరకు ఉండే లే అవుట్ల జాబితాలను కొత్త పాలకవర్గాలు ప్రకటించి.. అనంతరం వాటిపై చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లోని వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చే ముందు వ్యవసాయ భూమి చట్టం కింద రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇలా భూ మార్పిడి ప్రక్రియ తర్వాతే లే అవుట్ ప్రతిపాదన దరఖాస్తును గ్రామపంచాయతీలకు ఇవ్వాలి. గ్రామపంచాయతీలు దీన్ని 7 రోజుల్లో జిల్లా టౌన్, కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) అనుమతి జారీ చేసే సంస్థలకు పంపాలి. ఈ గడువులోపు గ్రామపంచాయతీ నిర్ణయం తీసుకోకున్నా అనుమతి ఇచ్చినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. లే అవుట్లలో డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు వ్యవస్థ ఏర్పాటు చేయాలని సాంకేతిక కమిటీ లే అవుట్ నిర్వాహకులకు చెబుతుంది. అనంతరం లే అవుట్ పరిధిలోని సామూహిక స్థలాలు, రోడ్లను గ్రామపంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలి. అన్నింటినీ పరిశీలించి డీటీసీపీ నెలలోపు ఆమోదించాల్సి ఉంటుంది. లే అవుట్ నిర్వాహకులు విక్రయానికి ప్రతిపాదించే మొత్తం స్థలంలో 15 శాతాన్ని గ్రామపంచాయతీకి తనఖా పెట్టాలి. గ్రామ కంఠం స్థలానికి ఈ నిబంధనలు వర్తించవు. లే అవుట్లో ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాన్ని ఎవరికైనా విక్రయిస్తే మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. డీటీసీపీ కమిటీ ఆదేశాలు లేకుండా లే అవుట్కు అనుమతి ఇస్తే గ్రామపంచాయతీ పాలకవర్గం రద్దవుతుంది. చట్టంలో క్రమబద్ధీకరణ అంశం.. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ అంశాన్నీ చట్టంలో పొందుపరిచారు. లే అవుట్లో నిర్దేశిత అవసరాలకు అనుగుణంగా వసతులు లేనప్పుడు అది అక్రమం అవుతుంది. నిబంధనలకు అనుగుణంగా వసతులు కల్పించిన తర్వాత లే అవుట్లను క్రమబద్ధీకరిస్తారు. లే అవుట్కు వినియోగించే స్థలానికి అప్పటి మార్కెట్ విలువతో పోల్చితే పది శాతం గ్రామపంచాయతీకి చెల్లిస్తే క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఉంటుంది. అక్రమ లే అవుట్లో వసతులు కల్పించే విషయంలో విఫలమైతే దాన్ని అక్రమంగానే నిర్ధారిస్తారు. ఎంత మొత్తం చెల్లించినా దీన్ని క్రమబద్ధీకరించే అవకాశం ఉండదు. -
అడవిలో అలజడి
కాకులు దూరని కారడవి కాదు.... చీమలు దూరని చిట్టడవి కాదు....అదొక మామూలు అడవే... కానీ అతి పెద్ద అడవి....ఆ అడవిలో ఒక అలజడి...అది సింహం సృష్టించిన సంహారమా!అది వ్యాఘ్రం విసిరిన పంజాయా!అది ఏనుగులు చేసిన విధ్వంసమా!అది నక్కలు పన్నిన కుతంత్రమా!అది తోడేళ్ళు ఆడిన నాటకమా!అది గద్దలు లేపిన దుమారమా!అది పందికొక్కులు మెక్కిన ఫలహారమా!అవన్నీ ఎలాగూ ఉన్నాయి,అందుకు కాదు అలజడి...మరెందుకు అడవిలో అలజడి రేగింది?ఈ అజెండాతోనే అడవికి రారాజు...మృగరాజు అడవిలోని అతిముఖ్య అమాత్య శేఖరులతో అత్యవసర సమావేశానికి ఆదేశించాడు. ‘‘ఏమిటి! నా అడవిలో అలజడి! నా చట్టం పట్టు తప్పుతోందా! ఏమిటి?’’ అంటూ గట్టిగా గర్జించాడు. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించిన ఆ అడవిలో సింహరాజు చేసిన గర్జన భూదిగంతములంతటా ప్రతిధ్వనించింది. భూకంపం వచ్చినట్లుగా అడవిలోని పక్షులన్నీ భయభ్రాంతులకు గురవుతూ తమ వృక్షావాసాల నుంచి ఒక్కసారిగా రెక్కలు టపటపలాడిస్తూ ఎటో ఎగరిపోయాయి.అడవిలోని అల్ప జంతుజాలమంతా కకావికలమై భూమి కలుగుల్లోనో, చెట్ల పొదల్లోనో ముడుచుకుపోయి దాక్కున్నాయి. మృగరాజు అడిగిన ప్రశ్నకు అమాత్యులేవీ సమాధానం చెప్పడానికి సాహసించలేక మౌనంగా ఉండిపోయాయి. అవి ఉలుకు, పలుకు లేకుండా ఉండడంతో మృగరాజుకు అసహనం కలిగింది. ఏనుగు నుద్దేశించి ‘‘మత్తేభమా! ఏమిటిదంతా! మాకు తలవంపులు తెచ్చేవిధంగా అడవిలో అలజడి!’’ అని తిరిగి ప్రశ్నించింది.తననుద్దేశించి మృగరాజు అడిగేసరికి మత్తగజానికి మాట్లాడక తప్పలేదు.‘‘నేడు కొత్తగా వచ్చిన అలజడి కాదు ప్రభూ! అడవిలో మన న్యాయం ప్రతిష్టించినప్పటి నుంచి ఉన్న అలజడే. అయితే దాని తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అదే మనకు తలనొప్పిగా పరిణమించింది’’‘‘ఏది ఏమైనా మాకిది చాలా సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తోంది. ఇదేమైనా మన ప్రత్యర్థుల పన్నాగమంటావా!’’ అంటూ నక్కవైపుతిరిగి‘‘జంబుకోత్తమా! నీవద్దేమైనా సమాచారముందా? కాలికి బలపం కట్టుకొని అడవంతా కలియదిరుగుతుంటావుగా! నీవైనా చెప్పు’’ అంటూ అడిగింది సింహం.ఏనుగు మాట్లాడిన తరువాత కొంత ధైర్యం తెచ్చుకున్న నక్క ‘‘ఏమీ లేదు ప్రభూ! అదే మన అడవి న్యాయం ఇక చెల్లదని కొద్దిమంది అల్పులు కొండలెక్కి, గుట్టలెక్కి అరుస్తూ అఘోరిస్తున్నారు’’నక్క ఇచ్చిన సమాచారానికి సింహం పక్కనే నిల్చున్న పెద్దపులి ఆగ్రహంతో శివాలెత్తి పోయింది.‘‘మృగరాజా! మీరు ఆదేశించండి! ఇప్పటికిప్పుడే వెళ్ళి వాళ్ళందరి భరతం పడతాను. వారేమనుకుంటున్నారు? ఇది అడవి కాదనుకుంటున్నారా! అడవి న్యాయం వద్దనిచెప్పడానికి వారికెన్ని గుండెలు’’ అంటూ పెద్ద పెట్టున గాండ్రించింది. మర ఫిరంగి మ్రోగినట్లుగా వచ్చిన ఆ శబ్దానికి కలుగుల్లోని ఎలుకలు బిక్కచచ్చి ఆంజనేయ దండకం ఆలపించాయి. పులి దూకుడుగా వ్యవహరించి పరిస్థితిని చేయి దాటిపోయేటట్లు చేస్తుందనే ఆందోళనతో ఏనుగు కల్పించుకొని ‘‘వ్యాఘ్ర శ్రేష్టమా! ఆగాగు, అన్ని పనులను దండనతోనే చక్కదిద్దలేము. యుగయుగాలుగానున్న మన చట్టానికి సవాలు ఎదురైనప్పుడు సంయమనంతో వ్యవహరించాలి’’‘‘హా!...చాలు.. చాలు మీ నీతి బోధలు. ఆఫ్ట్రాల్ భీతహరిణాలు! మనలను చూసి భయంతో పరుగులు పెట్టే వాటి గురించి ఇంతగా ఆలోచించాలా’’ అంటూ పులి కొట్టిపడేసింది. పులి వైఖరి నక్కకు నచ్చలేదు. అయినా పైకి నవ్వు పులుముకుంటూ ‘‘అయ్యా! మృగ శ్రేష్టమా! మీరు తలుచుకుంటే ఏమైనా చేయగల సమర్థులు. అందులో సందేహంలేదు. కానీ మనం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు వచించియున్నారు. నిజమే! నీవన్నట్లు అల్పులైన హరిణాలు మన కాళ్ళ కింద అణిగి, మణిగి ఉండతగ్గవే. అయితే అవన్నీ కలసి దుమ్ము రేపితే మట్టి మన కళ్ళలో వచ్చి పడుతుంది సుమా! వాటిని నీవు వేటాడుతున్నప్పుడు అవి తెలివిగా అమాంతంగా పరుగెడుతున్న దిక్కుమార్చి నీకు దక్కకుండా తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి గుర్తుంచుకో... ‘‘ఓహో!... మీ నక్క జిత్తులు వదిలించుకున్నారు కాదు. ఈ డొంక తిరుగుడు ఎందుకు? అటో ఇటో సూటిగా తేల్చేయకుండా’’ అని పులి జంబుకం వైపు చురచుర చూసింది. అప్పుడు సింహం కల్పించుకొని ‘‘ఆపండి! మీ వాగ్వివాదం...మనలో మనం కలహించుకోవడానికి కాదు నేను మిమ్మల్ని ఇక్కడకు పిలిచింది. హరిణాలు లేకుండా మన అడవి మనజాలదు. అలాగే అడవిన్యాయాన్ని అవి కాదనడానికి వీల్లేదు. కావున రెండింటికీ సయోధ్య కుదిర్చే సలహా ఇవ్వండి’’ అంటూ తిరిగి నక్కవైపే చూసింది.సింహమంతటి మృగ మహారాజు తననే సలహా చెప్పమని అడిగే సరికి జంబుకానికి లోలోపల ఆనందం జివ్వున ఉప్పొంగింది. దాన్ని బయటకు కనిపించకుండా ‘‘ప్రభూ! మీ దయాదాక్షిణ్యాల క్రింద బ్రతుకుతున్న భృత్యులం. మీ క్షేమమే మా క్షేమం. అదే అడవికి క్షేమం. అంతకు మించినది మరేముంది!’’ నక్క ఇలా సాగదీస్తూ మాట్లాడుతుంటే చిరుతకు చిర్రెత్తుకొచ్చింది.‘‘అది సర్లే!... మీ భట్రాజుల పొగడ్తలు తర్వాత చేద్దురుగాని. మీ ఆలోచన ఏమిటో తొందరగా చెప్పండి’’ అని అడిగింది. ‘‘మృగరాజ్య శేఖరులారా! నా యోచన ప్రకారం ఆ కురంగముల వద్దకు మన ప్రతినిధిని పంపుదాం. మొదట వారి కోర్కెలేమిటో తెలుసుకుందాం. రాజనీతి గురించి మీకు పాఠాలు చెప్పేటంతటి దాన్ని కాను. సామ, దాన,బేధముల తరువాత ఎలాగూ దండోపాయముందిగా’’ అని పలికింది.ఈ ప్రతిపాదనకు పులితో సహా అన్ని అంగీకరిస్తున్నట్లు తలలూపాయి. అతి చిక్కు సమస్యను తానే పరిష్కరించినట్లుగా నక్క అన్నిటివైపు ఒకసారి కలియజూసి తిరిగి ధీమాగా మాట్లాడింది.‘‘మన అమాత్యశేఖరులలో శాకాహార భక్షకులైన మత్త గజేంద్రమే ఇందుకు సార«థ్యం వహించి కార్య భారాన్ని వహిస్తే మంచిది. ఎలాగూ హరిణాలకు మనపై నమ్మకం లేదు’’ అంటూ మరొక సలహా ఇచ్చింది.‘‘భలే, భలే...భేష్! గోమాయువా! అలాగే చేద్దాం. మన కుంజరమును ఆ కురంగముల వద్దకు రాయబారిగా పంపుతున్నాను’’ అంటూ ప్రకటన చేసి మృగరాజు గంభీరంగా అడుగులు వేస్తూ నిష్క్రమించింది. ఆహా! ఎంతటి శోభాయమానంగా ఉందా దృశ్యం... అడవిలోని హరిణాలన్నీ ఒక్క చోట చేరితే అతి మనోహరం కదా! ప్రకృతిలోని వర్ణాలన్నీ విరబూసినట్లుంది. ఉషోదయాన ఆకుల గలగలల సవ్వడి వింటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో... ఇంద్రధనస్సులోని రంగులన్నింటినీ మేనికి పులుముకున్న ఆ కురంగములు అటూ ఇటూ చక చకా కదులుతూ ఒకటితో నొకటి దరహాస పలికింపులను చూస్తే మనస్సు పులకించక మానదు. వాటి వదనాల్లో లాలిత్యం, లావణ్యం విరజిమ్ముతుంటే... కళ్ళలో అణువణువునా ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతోంది. మహిషాసురున్ని వధించి, దశమికి విజయోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమైనట్లుందా సమూహం.ఆ హరిణాలు చిన్న చిన్న గుంపులుగా విడిపోయి ముచ్చటించుకుంటున్న సమయంలో ఎవరో వస్తున్నట్లుగా కలకలం రేగింది. ఎవరు? ఎవరు? అని ఒకటి మరొకదాన్ని అడుగుతున్న సమయానికి మృగరాజు పంపిన మదపుటేనుగు భారీకాయాన్ని మోస్తూ, తొండమూపుతూ అక్కడికి వచ్చింది. ఏనుగు తమ సమీపానికి వచ్చేసరికి లేళ్ళన్నీ ఒకే పెద్ద గుంపుగా వచ్చి నిలబడ్డాయి.ఏనుగు వాటికి ఎదురుగా నిలిచి ఒక్కసారి అంతటా పరికించి చూసింది. లేళ్ళ నుంచి ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు. ఇంతటి భారీ కాయమొచ్చి నిలబడితే అవి పల్లెత్తి మాట్లాడకుండా ఉండడంతో ఏనుగు ఒకింత కోపంతో ఘీంకరించి‘‘మీరంతా ఇలా గుమిగూడడం అడవికి మంచిది కాదు. మీలో దేనికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే అవి ఒక్కొక్కటిగా మృగరాజు వద్దకు వెళ్ళి చెప్పుకోవాలి. అంతేకాని కొండలెక్కి, గుట్టలెక్కిఅలజడికి దిగడం సరికాదు’’ అంటూ ఆయాసంగా పలికింది. ‘‘ఇబ్బంది కాదు మహానుభావా! మత్తగజమా!’’ అంటూ గుంపు వెనక భాగంలోంచి ఒక హరిణం గట్టిగా అరిచింది. అంతటా ముందున్నవన్నీ బాగా చెప్పావని అభినందిస్తున్నట్లుగా కాలి గిట్టలతో నేలకు రాస్తూ,గుర్–గుర్ మంటూ సకిలిస్తూ వెనక్కి తిరిగి చూశాయి. ‘‘ఇబ్బంది కాకపోతే కష్టం కావచ్చు. అంత మాత్రానికే ఇంత హంగామా చేస్తారా!’’‘‘కాదు, కాదు... కష్టం కూడా కాదు మహాశయా!’’ అంటూ అన్నీ ఒక్క పెట్టున గొంతెత్తాయి.‘‘ఇలా అన్నీ అరిస్తే నాకేమీ అర్థం కాదు. మీలో ఎవరైనా ఒకటి మీ కోర్కెలేమిటో నాకు ఎరుక పరిస్తే, మృగరాజుకు తెలియబరుస్తాను’’ ‘‘అలాగే... అలాగే...’’ అంటూ గుంపు ముందు భాగానున్న హరిణాలలో బంగరు మేని ఛాయతోనున్న ఒకటి మిగతా వాటిని వారించి ఏనుగు ఎదుటికి వచ్చి నిల్చుంది.‘‘గజరాజా! మా మొర అలకించడానికి మీరు వచ్చినందుకు ధన్యవాదములు. ఇబ్బందులు, కష్టాలు ఓర్చుకోలేక మేమిలా గుమిగూడలేదు. అవన్నీ మాకు సహజమే. అంతకు మించిన ఉపద్రవం మామీద వచ్చి పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం వేటాడుతోంది. మాలో ఒక్కదానికి మాత్రమే కాదు. మా జాతి జాతంతా నిత్యం భయ భ్రాంతులకు గురవుతోంది. అడవిలో ఆహారానికి వెళ్ళినా, నదీ తీరాలవద్ద నీళ్లుతాగుతున్నా, ఎండకు తాళలేక చెట్ల కింద సేద తీరుతున్నా, చివరకు చెట్టు పొదల్లో విశ్రమిస్తున్నా...మా పిల్లలకు పాలిస్తున్నా...అక్కడ, ఇక్కడ అని లేదు అన్ని చోట్ల మాపై వ్యాఘ్రాల వేట విలయతాండవం చేస్తోంది. మా నీడను చూసి మేమే భయపడాల్సి వస్తోంది’’ అంటూ ఉద్వేగభరితంగా రుద్ధ కంఠంతో విన్నవించింది. ఆ మాటల్లో అనంతకాలంగా గూడుకట్టుకున్న ఆవేదన ఉప్పెనలా పెల్లుబికింది. కాసేపు ఆ హరిణం తనను తాను సంభాళించుకొని కంఠస్వరం మార్చి మళ్ళీ ఇలా చెప్పింది. ‘‘ఏం! ఈ అడవి మాది కాదంటారా! నిర్భయంగా జీవించే హక్కు మాకు లేదా! చెప్పండి’’ అంటూ ఏనుగును నిలదీసింది. ‘‘రెండు రోజుల క్రితం మాలో ఒకటి ఏమరుపాటున ఒక వృద్ధ వ్యాఘ్రం సమీపానికి వెళ్లడమే అది చేసిన పాపమైపోయింది. ఆ వ్యాఘ్రం కండకావరంతో కన్నూమిన్నూ కానకుండా మా దానిపై లంఘించి రాక్షసంగా నొక్కి, రక్కి గాయపర్చింది. మా హరిణం ఎలాగో చావు తప్పించుకుని బయటపడింది. ఈ అన్యాయాన్ని అది నోరు తెరచి మాకు చెప్పడం వల్ల బయటకు తెలిసి వచ్చింది. బయటకు చెప్పలేక మౌనంగా రోదిస్తున్నవీ, కిరాతకంగా బలైనవి మా జాతిలో చాలా ఉన్నాయి. ఇలాంటి అన్యాయాలకు అంతం పలకాలనే మేమిలా చేస్తున్నాం’’ అని దృఢంగా పలికి ఊరుకుంది. ఆ హరిణం చెప్పిన విషయాన్ని సావధానంగా ఆలకించిన ఏనుగు ‘‘ఇంతకీ మీ కోర్కెలేమిటో మాకు విశదం కాలేదు’’ అంటూ ప్రశ్నార్థకంగా చూసింది. అంతా విని సీతకి రాముడికి సంబంధమేమిటో తెలియదన్నట్లుగా ఏనుగు మాట్లాడే సరికి హరిణాలన్నీ ఆగ్రహంతో ఎగరి గంతులేస్తూ‘‘మీకు విశదం కాకపోవడమే మా విషాదం’’ అంటూ తిరిగి బర్–బర్మంటూ గావుకేకలు పెట్టాయి.‘‘శాంతించండి! శాంతించండి! ఆవేశపడకండి! మనం చెప్పదల్చుకున్న విషయాన్ని స్పష్టం చేద్దాం’’ అంటూ ఇంతకు మునుపు వివరించిన ఆ లేడియే మిగతా వాటిని సమాధానపరచి ‘‘మా కోర్కె ఒకే ఒక్కటి. మమ్ములను భయోత్పాతంలో ముంచుతున్న మీ ఆటవిక న్యాయం మాకొద్దు. దాన్ని తిరగరాయాలి. బలాఢ్యులకు చట్టం చుట్టం కారాదు. అడవిలోని జంతువులన్నీ అంతటా సమానమని కొత్త చట్టాన్ని లిఖించాలి. కండ బలంతో మాపై దాడి చేసే మృగమదాంధులను వెలి వేయాలి. ఇలా చేస్తేనే మా అలజడి అగుతుంది. ఇంతే. ఇంతకు మించి ఏమీ లేదు’’ అని తెలియజేసి అడుగులు వెనక్కు వేసి లేళ్ళ గుంపులో కలిసింది. ఏనుగుకు ఏం చేయాలో, ఏమని సమాధానం చెప్పాలో కాసేపు పాలుపోలేదు. కొంత ఆలోచించిన తరువాత‘‘అడవి న్యాయాన్ని అధర్మమనీ, దీన్ని తిరగ రాయమని మీరు అడుగుతున్నట్లు నాకర్థమైంది. ఇది నా చేతిలో లేనిది. మృగరాజుకు విన్నవిస్తాను. ఆపై ప్రభువుల ఇష్టం. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని మాత్రం ప్రత్యుత్తరమిచ్చి, తను ఇక చేయగలిగింది ఏమీ లేదని తలచి వెనక్కు తిరిగి భారంగా అడుగులు వేస్తూ వెళ్ళి పోయింది. ఏనుగు కనుమరుగు అయ్యేవరకు హరిణాల గుంపు కదలకుండా నిశ్చలంగా నిలబడి పోయాయి. తమను అధికారం ఆదుకుంటుందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా లోకానికి తమ గోడును వినిపించేటట్లు చేయగలిగామనే సంతృప్తి వాటిల్లో కనిపించింది. ఆ అలజడి చివరికేమైంది?ఆటవిక న్యాయం అంతమైందా?అధికారం దాన, భేద, దండోపాయాలతో అణచి వేసిందా?ఇవి సమాధానాలు దొరకని ప్రశ్నలని భావించకండి!మాకెందుకులేనని మౌనం వహించకండి!రండి! వెళ్దాం!కాకులుదూరే కారడవికి...చీమలు దూరే చిట్టడవికి...అమ్మో! నాకు భయమేస్తుంది...క్రూరమృగాలు చంపుకుతింటాయి...అంటూ అక్కడే ఆగి పోయారా...ఆ భయం పెనుభూతమై మిమ్మల్ని కూడా వెంటాడుతుంది... - ఎస్. జి. జిజ్ఞాస -
‘అగ్రవర్ణాల ఆత్మరక్షణకు చట్టం తేవాలి’
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనల పునరుద్ధరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో అగ్రవర్ణాల ఆత్మరక్షణకూ ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అగ్రవర్ణాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసుల నుంచి కాపాడుకునేందుకు అగ్రవర్ణాల ఆత్మరక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించి పార్లమెంటులో ఆమోదించాలని కోరారు. కులం అనేది సామాజిక హోదాగా పరిగణించబడుతున్న నేపథ్యంలో కులం పేరుతో ఏ వర్గాన్ని దూషించినా నేరంగా పరిగణించేలా చట్టాన్ని సవరించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగమవుతోందని భావించిన అత్యున్నత న్యాయస్థానం చట్టంలో మార్పులు చేసిందని పేర్కొన్నారు. అయితే రాజకీయ పార్టీలు, సంఘాల ఒత్తిడికి తలొగ్గి పాత నిబంధనలను పునరుద్ధరించేందుకు కేబినెట్ ఆమోదం తెలపడం సరైంది కాదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దళితులు, అగ్రవర్ణాల మధ్య ఐక్యతను పెంపొందించకుండా కేవలం వారి మధ్య అగాధం సృష్టించేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
చట్టంతో కొట్టండి
రేపల్లె ప్రాంతంలోని ఎనిమిదో తరగతి బాలిక రోజూ ఇంటి సమీపంలోని వరుసకు బాబాయి అయిన వ్యక్తి వద్ద సాయంత్రం కబుర్లు చెపుతూ కూర్చొంటుంది. కొద్ది రోజుల తర్వాత కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళితే గర్భిణిగా నిర్ధారించారు. బాలికను అడిగితే బాబాయి అనే మానవ మృగం చేసిన పని కారణంగానే గర్భిణి అయినట్లు తేలింది. బయటకు తెలిస్తే పరువుపోతుందని తల్లిదండ్రులు బాలికకు గర్భస్రావం చేయించారు. పాఠశాలలోఅవగాహన కార్యక్రమానికి వెళ్లిన మహిళా కానిస్టేబుల్కు బాలిక చెప్పిన అమానుషం ఇది. ఇటీవల తెనాలిలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్న మృగాడు ఆమె కూతురుపై కన్నేశాడు. మహిళకు నిద్రమాత్రలు వేసి.. బాలికపై మానవ మృగం లా వ్యవహరించాడు. కడుపు నొప్పితో బాధ పడుతున్న బాలికను ఆస్పత్రికి తీసుకు వెళ్లి పరీక్షలు చేయిస్తే గర్భిణిగా తేలింది. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. బాలికకు అవగాహనలేని కారణంగా ఏం జరుగుతుందనే విషయం కూడా తెలుసుకోలేకపోయింది. గుంటూరు: మన ఇంటికి వచ్చే బంధువులు, సన్నిహితుల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు చాలా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తోంది. లేకుంటే అభం శుభం తెలియని పసిమొగ్గలను చిదిమేసి వారి భవిష్యత్పై మాయనిమచ్చ వేసే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో బాధిత బాలికలు మగవారిపై చిన్న వయసులోనే సదభిప్రాయాన్ని కోల్పోతారని మానసిక వైద్యులు చెబుతున్నారు. స్పర్శ ద్వారా గ్రహించేలా అవగాహన కల్పించాలి ఇటీవల కాలంలో మైనర్లపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పాఠశాల స్థాయి నుంచి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కేవలం పాఠ్యాంశాలతో సరిపెట్టకుండా టీనేజీ బాలికలకు మంచి స్పర్శ, చెడు స్పర్శల గురించి అర్థమయ్యేలా వివరించాలని వైద్యులు చెబుతున్నారు. బాలికలపై తాకకూడని ప్రదేశాల్లో ఎవరైనా చేతులు వేస్తే సమీపంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లడంగానీ, పెద్దగా కేకలు వేయడంగానీ చేయాలి. తల్లిదండ్రుల పాత్ర కీలకం... నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు విఛ్చిన్నమయ్యాయి. తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం పరుగులు పెడుతున్నారు. ఈ కారణంగా పిల్లలపై ప్రత్యేక దృష్టి నిలపలేకపోతున్నారు. ఇదే అవకాశంగా భావిస్తున్న మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలి. మంచిచెడుల గురించి చెప్పాలి. పిల్లలతో కలసి ఒకే గదిలో నిద్రించే తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. మహిళలు వేధింపులకు గురైతే రక్షణ పొందేందుకు చట్టాలు ఉన్నాయి. చట్టంలోని సెక్షన్లు ఇలా... ♦ పోక్సో, నిర్భయ సెక్షన్ల కింద కేసులు నమోదైతే కనీసం ఏడేళ్ల జైలు, – జరిమానా విధించే అవకాశం ఉంది. ♦ సెక్షన్–100 ప్రకారం ఆత్మరక్షణ కోసం దాడి చేస్తే తప్పు లేదు. ♦ సెక్షన్ 294 ప్రకారం అసభ్యకరంగా ప్రవర్తిస్తే కనీసం మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. ♦ సెక్షన్ 354(బీ) ప్రకారం మహిళల దుస్తులను బలవంతంగా తొలగిస్తే మూడు నుంచి ఐదేళ్ల శిక్ష పడుతుంది. ♦ సెక్షన్(సీ) ప్రకారం మహిళలు, విద్యార్థినుల అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తే మూడేళ్ల శిక్ష పడుతుంది. ♦ సెక్షన్ 354(డీ) ప్రకారం ఉద్దేశపూర్వకంగా వెక్కిరించినా, అనుకరించినా, పని చేసే ప్రాంతంలో యజమాని వేధింపులకు గురి చేసినా మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ♦ సెక్షన్ 494 ప్రకారం భార్య ఉండగా మరొకరిని వివాహం చేసుకుంటే జైలు శిక్షపడుతుంది. ♦ సెక్షన్ 498(ఏ) ప్రకారం వివాహితను హింసిస్తే కనీసం మూడేళ్లు శిక్షతోపాటు జరిమానా ఉంటుంది. ♦ సెక్షన్ 499 ప్రకారం ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో పెడితే శిక్ష విధిస్తారు. ♦ సెక్షన్ 509 ప్రకారం మహిళలతో అవమానంగా మాట్లాడినా, సైగలు చేసినా జైలు శిక్ష ఖాయం. -
పురుగు మందులకు బలవుతున్న రైతులు
సాక్షి, న్యూఢిల్లీ : పంటలకు పురుగు మందులు కొట్టే క్రమంలో ఏటా దేశంలో ఎంతో మంది రైతులు బలైపోతున్నారు. 2017 సంవత్సరంలోనే మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రంలో 50 మంది రైతులు ఈ మందుల ప్రభావంతో మరణించారు. వారిలో ఎక్కువ మంది మనోక్రోటోఫస్ మందులను ఉపయోగించినవారే. వాటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రమాదకారిగా గుర్తించిన ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ మందును ఇప్పటికే ఎన్నో దేశాలు నిషేధించాయి. ప్రపంచంలో పలు దేశాలు నిషేధించిన పురుగు మందుల్లో ఇప్పటికీ భారత్లో రైతులు కనీసం 99 మందులను వాడుతున్నారు. పంటలకు పట్టిన చీడ పీడలను నాశనం చేసేందుకు భారత్లో రైతులు ఉపయోగిస్తున్న 260 మాలిక్యూల్ రకాల పురుగు మందుల్లో 99 మందులను పలు దేశాలు ఎప్పుడో నిషేధించాయి. వీటిని మన రైతులు ఇప్పటికీ వాడుతుండడమే కాకుండా లైసెన్స్లేని నకిలీ మందులను కూడా వాడుతున్నారు. ఈ కారణంగా రైతులు ఎక్కువగా మృత్యువాతకు గురవుతున్నారు. 1968 నాటి ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ కిందనే భారత ప్రభుత్వం పురుగు మందులను ఇప్పటికీ నియంత్రిస్తోంది. ఆధునిక కాలానికి అవసరమైన విధంగా చట్టాన్నిగానీ, విధానాలనుగానీ మార్చుకోలేదు. దేశంలో వ్యవసాయమేమో రాష్ట్రానికి సంబంధించిన అంశం. పురుగు మందులేమో కేంద్రానికి సంబంధించిన విషయం. అయినప్పటికీ ఇరు ప్రభుత్వాలు సమన్వయంతో రైతుల బలిని అరికట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ‘ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్’ విధానం అన్నది ఒకటి ఉంది. దాని ప్రకారం ఎప్పటికప్పుడు రైతులను పురుగు మందుల విషయంలో, ఇతర వ్యవసాయ పద్ధతుల విషయంలో చైతన్యపరచాలి. అందుకోసం రైతులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలి. ఇందుకోసం వ్యవసాయ శాఖ, అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించవు. సిబ్బంది కొరత కారణమైని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కూడా చెబుతోంది. ఉద్యాగాలిస్తామంటూ అధికారంలోకి వచ్చినప్పుడు ఖాళీలను భర్తీ చేసుకోవచ్చుగదా! పెస్ట్ మేనేజ్మెంట్ విధానం ప్రకారం తప్పనిసరి అయినప్పుడు మాత్రమే పురుగు మందులను వాడాలి. పురుగులను నివారించేందుకు సాధ్యమైనంత వరకు సహజ పద్ధతులను పాటించాలి. వర్మీ కంపోజ్, వేప నూనెలు వాడడం, నున్నటి రబ్బరు గొట్టాల ద్వారా చేనుకు పట్టిన పురుగులు పడిపోయేలా చేయడం సహజమైన పద్ధతులు. సహజమైన పద్ధతులన్నీ విఫలమైన సందర్భాల్లో ప్రభుత్వం చూపించిన మోతాదుల్లోనే రసాయనిక మందులను వాడాలి. ప్రభుత్వం విధానం ప్రకారం ఎరువులు అమ్మే వ్యాపారులు కూడా వాటిని ఎలా వాడాలో రైతులకు విడమర్చి చెప్పాలి. కేవలం లాభాపేక్ష కలిగిన ఎరువుల వ్యాపారులు అలా చేయరు. వారి వద్ద శిక్షణ కలిగిన సిబ్బంది కూడా ఉండరు. ఎరువుల షాపుల్లో వ్యవసాయ బీఎస్సీ చదివిన వారిని ప్రమోటర్లుగా పెట్టుకోవాలని, వారు విధిగా రైతులకు సూచనలు ఇవ్వాలంటే గతేడాది కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తెచ్చింది. ఎక్కడా ఆ చట్టం అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. లాభాపేక్షలేని ప్రభుత్వమే రైతుల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలి. పటిష్ట చట్టాలను పట్టుకురావాలి. -
మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టాలి
వనపర్తి విద్యావిభాగం: రాష్ట్రంలో మూఢనమ్మకాలను శాశ్వతంగా దూరం చేసేందుకు మూఢనమ్మకాల నిరోధన చట్టాన్ని ప్రవేశపెట్టాలని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కోశాధికారి జితేందర్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో జనవిజ్ఞాన వేదిక వనపర్తి జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని విడుదల చేయాలని వాల్పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి ఎదుగుతున్నా మూఢనమ్మకాలను పాటించడంలో తగ్గడం లేదన్నారు. నేటికీ రాష్ట్రం నలుమూలలా ఎక్కడో ఒకచోట చేతబడి, బాణామతి, మంత్రాలు, క్షుద్రపూజలు వంటివి కొనసాగుతూ దాడులు, హత్యలు చేసుకునే పరిస్థితి కొనసాగుతుందన్నారు. మూఢనమ్మకాలతో జరుగుతున్న సంఘటనలు సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చి వీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అవునన్నా... కాదన్నా..!
‘‘నేను నీ అన్నయ్యనే కదా?!’’ ‘‘అవునన్నా..’’ ‘‘నేను తెచ్చిన సంబంధం చేసుకుంటావా? లేదా?’’ ‘‘కాదన్నా..’’ ‘అవునన్నా, కాదన్నా ఇంట్లో వాళ్లు చెప్పిందే చెయ్యాలి. తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా జీవించాలి..’ అని ఏ మహిళా అనుకోకూడదు. కుటుంబ హింస నుంచి కాపాడేందుకు ఆమెకు అండగా చట్టం ఉంది. ఇది అందరూ తెలుసుకోవాలి. హింస పెట్టేవాళ్లు, హింస పడేవాళ్లూ.. తెలుసుకోవాలి. ఇంట్లోకి వెళ్తున్న దీపను ఉక్రోషంగా, కోపంగా చూస్తున్నాడు శ్రీను. దీప అన్నయ్య అతడు. ‘‘ఊ.. ఊ.. చూసింది చాల్లే.. నడువ్’’ శ్రీనును అదిలించారు పోలీసులు. తల కిందికి దించుకుని ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టాడు శ్రీను. ఆ వెంటనే, దీపను అక్కున చేర్చుకొని బోరుమంది ఆమె తల్లి. ‘‘ఊరుకో అమ్మా.. ఎందుకు ఏడుస్తున్నావ్? మీకే కష్టం కలగకుండా చూసుకుంటా!’’.. తల్లిని సముదాయిస్తూ చెప్పింది దీప. కూతురు మాటలకు ఆమె తండ్రి కళ్ల వెంట ఆనందబాష్పాలు రాలాయి. ‘‘నాన్నా.. నువ్వు కూడానా?’’ అంది తన కళ్లనూ తుడుచుకుంటూ దీప. ‘‘వాడు నిన్ను ఇబ్బంది పెడ్తుంటే నేను అడ్డురాలేదు సరికదా.. కనీసం వాడిని మందలించే ధైర్యం కూడా చేయలేకపోయాన్రా.. నన్ను క్షమించరా తల్లీ.. ’’ కూతురు రెండు చేతులూ పట్టుకున్నాడు దీప తండ్రి. ‘‘ఛ.. అవేం మాటలు నాన్నా.. మీరు నన్ను ఆడపిల్ల అని చూడకుండా అన్నయ్యతో సమానంగా చూసి, మీ బాధ్యతను తీసుకునే హక్కు ఇస్తే చాలు నాన్నా.. ’’ అంది దీప. ఆనందోద్వేగంలో మాటలు రాక బిడ్డను గుండెలకు హత్తుకున్నాడు ఆ తండ్రి. అసలు ఆ ఇంట్లో దీప ఎంట్రీకి.. ఆమె అన్న శ్రీను ఎగ్జిట్కు కారణం ఏంటి? అప్పుడే పెళ్లొద్దు దీప, శ్రీనుల తండ్రి అచ్యుతరావు రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి. తల్లి సుజాత.. గృహిణి. ఆ ఇల్లు అచ్యుతరావు కట్టిందే. పిల్లలు ఆలస్యంగా పుట్టారు. పైగా శ్రీనుకు, దీపకు మధ్య అయిదేళ్లకు పైగా అంతరం ఉంది. అచ్యుతరావు రిటైరయ్యేనాటికి శ్రీను చదువు మాత్రమే అయింది. దీప డిగ్రీలోకి రాగానే ఆయన పదవీవిరమణ సమయం వచ్చేసింది. దాంతో శ్రీను ఆర్థిక అండా ఆ కుటుంబానికి అవసరమైంది. ఉన్న కాస్త డబ్బును దీప పెళ్లి కోసం దాచి ఆమె చదువు బాధ్యతను కొడుకు మీద పెట్టాడు తండ్రి.దీప చదువులో చాలా చురుకు. పెద్ద చదువులు చదవాలనే ఆకాంక్ష కూడా ఉంది. ఈ క్రమంలో డిగ్రీ కాలేజ్ ఫస్ట్ వచ్చింది. పీజీకి అప్లయ్ చేసింది. సంబంధం తెచ్చాడు అన్న. ‘నాకు అప్పుడే పెళ్లి వద్దు.. చదువుకుంటాను’’ అంది. అదీగాక కాలుకు కొంచెం పోలియో ఉన్న పెళ్లి కొడుకును వెదికాడు.. అతనికి మంచి ఉద్యోగం ఉంది అని. అది అసలే నచ్చలేదు దీపకు. ఎంత చెప్పినా అన్నయ్య వినకపోవడంతో.. ‘‘పెళ్లి నా చాయిస్.. ఎప్పుడు చేసుకోవాలి? ఎలాంటివాడిని చేసుకోవాలి అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. నాకిప్పుడే పెళ్లి ఆలోచనలు లేవు. నేను అందుకు ఇప్పుడు సిద్ధంగా లేను కూడా’’ అని స్పష్టం చేసింది దీప. ఆ మాటతో ఆ అన్న అహం దెబ్బతింది. ‘‘ఏంటే.. నీ చాయిస్? నువ్వు డిసైడ్ చేసుకునేదేంటి? చదివిస్తుంది నేను.. నీ పెళ్లి చేయాల్సింది కూడా నేనే. మన అయ్య దాచిన సొమ్ము పెళ్లి టెంట్లకు కూడా సరిపోదు గుర్తుపెట్టుకో’ అని బెదిరించాడు శ్రీను. పిచ్చివేషాలు వెయ్యకు ‘‘చదివించినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్యా! పీజీ ఫ్రీ సీటే తెచ్చుకుంటాను. నా ఖర్చులకు పార్ట్టైమ్ జాబ్ చూసుకుంటాను. మంచి ఉద్యోగం తెచ్చుకున్నాక.. నువ్ నా చదువుకి పెట్టిన డబ్బు కూడా తీరుస్తా. కాని ఈ పెళ్లి చేసుకోమని బలవంతపెట్టకన్నయ్యా...’’ అని బతిమాలింది దీప. ‘‘నోర్ముయ్’’ అంటూ చెంప పగలకొట్టాడు శ్రీను.‘‘పిచ్చి వేషాలేస్తే.. కాళ్లు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతా’’ అని అరిచేశాడు. అతని ఉగ్ర రూపం, అహంకారం చూసి నివ్వెరపోయారు తల్లిదండ్రులు. అడ్డొస్తే వాళ్లనూ తోసేశాడు. ‘‘నేను వాళ్లకు మాటిచ్చాను. రేపు పెళ్లి చూపులకు వస్తున్నారు. అదీ ఫార్మల్గా. దాదాపు పెళ్లి ఖరారు అయినట్టే. మర్యాదగా ఒప్పుకో. లేకుంటే బలవంతంగానైనా కట్టబెడ్తా’’.. హెచ్చరించాడు. ‘‘అంతదాకా వస్తే.. చావనైనా చస్తా.. కాని ఈ పెళ్లి చేసుకోను’’ అని అన్నకు చెప్పి ‘‘అమ్మా.. చెప్పమ్మా అన్నయ్యకు’’అని ప్రాధేయపడింది. కాని ఆ తల్లి నోటెంట మాటలేదు.. ఏడుపు తప్ప. ‘‘అమ్మా.. నాన్నా.. ఈ విషయంలో మీరు కల్పించుకోవద్దు. ఒకవేళ మీరూ దానికే వంత పాడితే జీవితంలో మీ మొహం చూడను. దాని బాధ్యత ఆవగింజంతైనా తీసుకోను’’.. తల్లిదండ్రులకూ అల్టిమేటమిచ్చాడు. ‘‘ఒరేయ్.. అలా అంటే ఎలారా.. నీ తోడబుట్టింది అది. కాస్త ఆలోచించు.. చదువుకుంటానంటోంది. చదివిద్దాం’’..నచ్చజెప్పబోయాడు తండ్రి. గదిలో పెట్టి తాళం! ‘‘చదివించుకోండి.. పెళ్లీ చేయండి.. ఈ క్షణమే నేను ఇంట్లోంచి వెళ్లిపోతా’’.. బ్లాక్మెయిల్ చేశాడు శ్రీను.‘‘అంత మాటనుకురా.. ’’ అంది తల్లి బాధగా.‘‘పోతే పోనియ్ అమ్మా.. నేను చూసుకుంటా అన్నీ.. ’’ కళ్లు తుడుచుకుంటు అన్నది దీప. అంతే ఆ మాటకు విసురుగా వచ్చి ఆ అమ్మాయిని తన్నాడు శ్రీను. ‘‘చూసుకునేంత పెద్దదానివయ్యావా? చంపేస్తా చెప్పినట్టు వినకపోతే’ అంటూ ఆ అమ్మాయి మీద చేయి చేసుకొని విసావిసా ఆ పిల్లను లాక్కెళ్తూ గదిలో పెట్టి తాళం వేశాడు. కొడుకు ప్రవర్తనకు నిశ్చేష్టులయ్యారు తల్లిదండ్రులు. తేరుకొని వారించినా వినలేదు. ‘‘చెప్పినట్టు వింటే ఈ ఇంట్లో ఉంటుంది. మొండిపట్టు పడితే బయటకు గెంటేస్తా’’ అని చెప్పండి నీ కూతురికి’’ అంటూ బయటకు వెళ్లిపోయాడు శ్రీను. దీప గది తలుపులు బాదుతూనే ఉంది. కాసేపటికి సుజాత డూప్లికేట్ కీ తీసుకొచ్చి తాళం తీసి కూతురిని బయటకు పంపిచేసింది. అప్పటికి రాత్రి ఎనిమిది గంటలు. కోర్టు ఆర్డర్స్! ఇంటి నుండి బయటపడ్డ దీప సరాసరి పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లయింట్ ఇచ్చింది అన్న మీద. వెంటనే పోలీసులు దీపవాళ్లింటికి వెళ్లారు. అప్పుడే ఇంటికొచ్చిన శ్రీను పోలీసులను చూసి గతుక్కుమన్నాడు. తెల్లవారి పోలీస్స్టేషన్కు హాజరుకావాలనే సమాచారం ఇచ్చి పోలీసులు వెళ్లిపోయారు. దీప ఆ రోజు తన స్నేహితురాలి హాస్టల్రూమ్లో తలదాచుకుంది. తెల్లవారి దీప కంప్లయింట్ను డైరెక్ట్గా డీవీ ఫోరమ్కు (విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి) పంపారు పోలీసులు. కాలయాపన లేకుండానే దీపను ఇంట్లోనుంచి బయటకు గెంటేయకుండా వెంటనే ఆర్డర్స్ ఇచ్చారు. అదే సమయంలో తక్షణమే ఆ ఇంట్లోంచి బయటకు వెళ్లమనే ఆర్డర్స్ను శ్రీనుకూ జారీ చేసింది కోర్టు. అంతేకాదు మళ్లీ శ్రీను తన చెల్లెలి మీద దాడి చేస్తాడేమోనన్న ముందుచూపుతో దీపకు రక్షణ ఉత్తర్వులనూ ఇచ్చింది కోర్టు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలి మహిళలు తల్లిదండ్రులు, మెట్టినింటి వారి గౌరవం కాపాడాలనే ఉద్దేశంతో తమపై జరుగుతోన్న హింసను బయటకి చెప్పరు. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం, పోలీసుల తీరుపై నమ్మకం లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా బయటకి రాలేకపోతున్నారు. ఇంట్లో సోదరుల నుంచి ఇలాంటి సమస్యలు ఎదురైనా ఏం చేయలేని స్థితిలో ఉంటున్నారు. దీనికి ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఒకటే మార్గం. హింసను ఎదుర్కొనే ధైర్యం ఉండేలా మహిళలు సంసిద్ధులవ్వాలి. ఆటవిడుపుగానో లేక అభిరుచికి అనుగుణంగా ఏదైనా సంపాదించుకునేలా మహిళలు ఉండాలి. తమ కంటే చిన్నవారికి ట్యూషన్లు చెప్పడం తదితర మార్గాల ద్వారా సంపాదన వైపు అడుగేయాలి. దీని వల్ల వాళ్లలో తెలియని ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మహిళలు గౌరవంగా బతికేందుకు కావాల్సిన విద్యను తల్లి దండ్రులు వారికి అందించాలి. వారి శక్తి, సామర్థ్యాలు తెలుసుకునే విధంగా ఆ విద్య ఉండాలి. – శృంగవరపు రచన, జయహో ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ డైరెక్టర్, రచయిత్రి – సరస్వతి రమ -
ప్రభుత్వాలు కళ్లు తెరవాలి
లేని పెద్దరికాన్ని తెచ్చుకుని సమాజంపై స్వారీ చేస్తున్న బృందాలకు మళ్లీ సర్వోన్నత న్యాయస్థానం నుంచి మొట్టికాయలు పడ్డాయి. పెళ్లీడు వచ్చిన ఆడ, మగ వివాహం చేసుకుంటే అందులో జోక్యం చేసుకునే హక్కు వ్యక్తులకు గానీ, బృందాలకుగానీ, కుల పంచాయతీలకుగానీ లేదని సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విస్పష్టంగా చెప్పింది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో సమా జానికి, ముఖ్యంగా మహిళలకు బెడదగా పరిణమించిన ఖాప్ పంచాయతీల తీరును, వాటి విషయంలో పట్టనట్టు ఉంటున్న ప్రభుత్వాల వైఖరిని ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రేమ పెళ్లి చేసుకున్నవారిని ఊరి నుంచి వెలేయడం దగ్గరనుంచి వారిని హత్య చేసేవరకూ ఈ ఖాప్ పంచాయతీలు సాగి స్తున్న అరాచకాలకు అంతూ పొంతూ లేదు. ఆడపిల్లలు బయటకు వెళ్తే సెల్ఫోన్ వాడకూడదని, 40 ఏళ్లలోపు మహిళలు బయటకు వెళ్లాల్సివస్తే తలపై వస్త్రం కప్పుకోవాలని, ఒంటరిగా వెళ్లకూడదని, సూర్యాస్తమయం అనంతరం బయటికే రాకూడదని, వారి దుస్తులు ఫలానా విధంగా మాత్రమే ఉండాలని, సగోత్రీకుల మధ్య వివాహం జరిగితే ఊరుకోబోమని అయిదేళ్లక్రితం హర్యానాలోని ఖాప్ పంచాయతీ తీర్మానాలు చేసింది. ఈ ఖాప్ పంచాయతీల ఆగడాలపై వ్యంగ్య చిత్రాన్ని నిర్మించిన దర్శకుడి తల తెచ్చి ఇచ్చినవారికి 51 గేదెలు బహుమానంగా ఇస్తామని 2015లో ఉత్తరప్రదేశ్లోని ఖాప్ పంచాయతీ ప్రకటించింది. అదే ఏడాది హర్యానాలో తల్లిదండ్రులు కుదిర్చి చేసిన పెళ్లిని సైతం ఒక ఖాప్ పంచాయతీ రద్దు చేసింది. పెళ్లయి అయిదు నెలలయ్యాక ఇద్దరూ అన్నాచెల్లెళ్లలా ఉండాలంటూ ఫర్మానా జారీచేసింది. గ్రామం వెలివేసిన పరిస్థితుల్లో వారిద్దరూ గత్యంతరం లేక పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. నిజానికి ఈ దేశంలో ప్రజలెన్నుకున్న చట్టసభలున్నాయి. వాటి ద్వారా ఏర్ప డిన ప్రభుత్వాలున్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వాల ఉనికి పోలీసుల అత్యు త్సాహం వల్లా, పన్నుల విధింపు ద్వారా తప్ప ప్రజలకు ఇతరత్రా తెలియడం లేదు. అధికార పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలే అధికారులపైనా, సామాన్యులపైనా దాడు లకు దిగడం పెరిగింది. ఇక ఖాప్ పంచాయతీలనూ, గోరక్షణ బృందాలనూ, మతోన్మాదంతో రెచ్చిపోయే ముఠాలనూ అదుపు చేయడం గురించి అడిగేదే ముంటుంది? అందువల్లే ‘శక్తివాహిని’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్ర యించాల్సివచ్చింది. ఈ వ్యాజ్యం దాఖలై కూడా అయిదేళ్లవుతోంది. ఎప్పుడో ఒకప్పుడు న్యాయస్థానానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సివస్తుందని, కనుక ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని ఇన్నేళ్లలో ఏ ఒక్క ప్రభుత్వానికీ అనిపించలేదు. ఈ అయిదేళ్లలో పలు రాష్ట్రాల్లో వేరే పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి. కేంద్రంలో యూపీఏ నిష్క్రమించి, ఎన్డీఏ ఏలుబడి ప్రారంభమైంది. అయినా ఈ బృందాల ఆగడాలు మాత్రం యథాప్రకారం సాగుతున్నాయి. పైగా ఈ మాదిరి బృందాలు, వాటి ఆగడాలు మరింతగా పెరిగాయి. సారాంశంలో రాజకీయ పక్షాలన్నీ ఈ బృందాల ముందు మోకరిల్లుతున్నాయి. వాటి చేతుల్లో ఓటు బ్యాంకులున్నాయన్న ఏకైక కారణంతోనే ఇలా వ్యవహరిస్తున్నాయి. బహుశా సుప్రీంకోర్టు కూడా ఈ సంగతిని గ్రహించి ఉండొచ్చు. అందువల్లే సమాజంపై స్వారీ చేస్తున్న ఈ నానా రకాల బృందాల విషయంలో ఏం చేయాలన్న సూచనలిచ్చేందుకు సీనియర్ పోలీస్ అధికారులతో కమిటీని నియమించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై రెండు వారాల్లో మార్గదర్శకాలను తయారు చేస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు తాజాగా చెబుతున్నారు. విచారణ సందర్భంగా ఖాప్ పంచాయతీల తరఫు న్యాయవాది వినిపించిన వాదనలు గమనించదగ్గవి. 1955నాటి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 5 సగోత్రీకుల మధ్య వివాహబంధాన్ని నిషేధిస్తున్నదని ఆ న్యాయవాది వివరించారు. ఖాప్ పంచాయతీలు అలాంటి వివాహాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నాయని సంజా యిషీ ఇచ్చారు. అయితే పెళ్లీడు వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహం జరి గినప్పుడు ఏ ఒక్క వ్యక్తి లేదా బృందం, సమాజం జోక్యం చేసుకోవడానికి, ఆ దంపతులను వేధించడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరితో సహ జీవనం చేయాలో, జీవితాంతం కలిసి ఉండాలో ఎంపిక చేసుకునే హక్కు యుక్త వయస్కులందరికీ ఉంటుందని చెప్పింది. ఆ వివాహం చెల్లుతుందో, లేదో...అది సక్రమమో కాదో చెప్పేందుకు న్యాయస్థానాలకు తప్ప మరెవరికీ అధికారం లేద న్నది. ఇది సామాజికాంశం తప్ప, చట్టపరమైనది కాదని ఖాప్ న్యాయవాది చేసిన వాదనను అంగీకరించలేదు. ఖాప్ పంచాయతీలు, ఇతర ప్రైవేటు బృందాలు నిర్వహిస్తున్నవారికి చదువు సంధ్యలు సక్రమంగా లేని కారణం వల్లనే ఇలా అనాగరికంగా వ్యవహరిస్తారని చాలామందిలో అపోహలుంటాయి. తోటి మనుషులతో మర్యాదగా మెలగాలని, వారిని అగౌరవపర్చడం, వారిపై పెత్తనం చలాయించడం, దౌర్జన్యం చేయడం నాగరిక లక్షణం కాదని తెలియడానికి చదువు అవసరం లేదు. ఇంగితజ్ఞానం ఉంటే చాలు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించడం ద్వారా వచ్చే అతి సాధారణ జ్ఞానాన్నే ఇంగితజ్ఞానం అంటారు. ఈ బాపతు బృందాలను వెంటేసుకు తిరిగే వారికి ఆ జ్ఞానం కూడా లోపిస్తోంది. ఇలాంటివారు సమాజాన్ని బాగు చేస్తామని బయల్దేరితే ఆ సమాజం ఎంతటి దురవస్థలో పడుతుందో చెప్పనవసరం లేదు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఎటూ మూర్ఖత్వంలో కూరుకుపోయినవారిలో మార్పు తీసుకురాలేవు. కఠిన శిక్షలే వారికి మందు. కనీసం ప్రభుత్వాలైనా కళ్లు తెరవాలి. ఈ బృందాల కారణంగా రాజ్యాంగ విలువలు, పౌరు లకు అది ప్రసాదించిన హక్కులు ధ్వంసమవుతున్నాయని గుర్తించాలి. కనీసం ఓటేసి గద్దెనెక్కించిన పౌరుల మాన ప్రాణాలు కాపాడటం తమ ప్రాథమిక కర్తవ్య మని తెలుసుకోవాలి. ప్రైవేటు బృందాల ఆగడాలను అరికట్టేందుకు సమగ్రమైన, కఠినమైన చట్టం తీసుకురావాలి. -
డేటా భద్రతపై తక్షణం చట్టం తేవాలి
న్యూఢిల్లీ: డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో డేటా ప్రైవసీకి సంబంధించి సాధ్యమైనంత త్వరలో ఒక చట్టాన్ని రూపొందించాలని ఆర్థిక అంశాల పార్లమెంటరీ స్థాయీ సంఘం.. ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే, సమాచార మౌలిక అంశాలపై సమన్వయం కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం వీరప్ప మొయిలీ సారథ్యంలోని స్థాయీ సంఘం ఈ మేరకు డిజిటల్ ఎకానమీపై నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. సైబర్ నేరాలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన నిపుణుల కొరతపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దేశం డిజిటల్ వైపు మళ్లుతున్న తరుణంలో క్లోనింగ్ వంటి ఏటీఎం మోసాలు మొదలైనవి భారీగా పెరుగుతున్నాయని, సామాన్యులు మోసాలబారిన పడుతున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో డేటా భద్రత కోసం చట్టం తేవాలని, మోసాలపై ఫిర్యాదులు చేసేందుకు హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని సూచించింది. -
రెరా చట్టం.. స్థిరాస్థి కొనుగోలుదారులకు వరం
సాక్షి, నెల్లూరు: ఏదైనా వెంచర్లో ప్లాట్ బుక్ చేసుకుంటే నిర్మాణదారు మనకు ఎప్పుడు అప్పగిస్తాడో తెలియదు. ఒక వేళ డబ్బు తీసుకుని మనకు ఇంటిని సరైన సమయానికి అప్పగించకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి. తీసుకున్న బ్యాంకు రుణంపై వడ్డీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇటీవల కొత్తగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టాన్ని తీసుకువచ్చింది. నియంత్రణ అధికారుల వద్ద నమోదు ఈ చట్ట ప్రకారం చేపడుతున్న ప్రాజెక్టులను, ఇప్పటికీ కంప్లీషన్ సర్టిఫికెట్(సీసీ)అందుకోని ప్రాజెక్టులను, కొత్త ప్రాజెక్టులను నియంత్రణ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి. దీంతో నిర్మాణ రంగంలోని బిల్డర్లు చేసే మోసాల నుంచి కొగుగోలుదార్లను రక్షించవచ్చు. ఇంతకు ముందు కోర్టు కేసులు, వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి మాత్రమే వినియోగదారులు తమకు రావాల్సిన డబ్బును రాబట్టుకునేందుకు వీలుండేది. ఇకపై ఈ ప్రయాసలకు కాస్త విముక్తి కలుగుతుంది. రెరా చట్టంలోని కీలక ప్రతిపాదనలు బిల్డర్లు తాము చేపట్టిన ప్రాజెక్టుల కోసం ఒక ప్రత్యేక(ఎస్క్రో) ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. పెట్టుబడిదారుల, కొనుగోలుదారుల నుంచి సేకరించిన డబ్బులో 70 శాతం అదే ఖాతాలో ఉండాల్సిందే. ఈ సొమ్మంతా ప్రాజెక్టు నిర్మాణానికి, భూమి కొనుగోలుకు వెచ్చించాల్సిఉంటుంది. ఒక్క ప్లాట్ అమ్మిన తర్వాత దాని నిర్మాణంలో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే తప్పనిసరిగా బిల్డర్ కొనుగోలుదారు నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. దీంతో మధ్యలోనే మళ్లీ ధరలు పెంచే అవకాశం ఉండదు. ప్రతి దశా ప్రాజెక్ట్ కిందే ఈ చట్టం ప్రకారం భవన నిర్మాణంలోని ప్రతి దశా ప్రత్యేక ప్రాజెక్టు కింద లెక్క. ప్రతి దశకూ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ దశలను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. సమాచారం అందుబాటులో.. ప్రతి బిల్డర్ ప్రాజెక్టు ప్లాన్, లేఅవుట్, ప్రభుత్వ అనుమతులు, ప్రాజెక్టు నిర్మించే భూమిపై హక్కు, ప్రస్తుత స్థితిగతులు, ప్రాజెక్టు ఉప కాంట్రాక్టర్ల వివరాలు, ఎప్పటి లోపు పూర్తవుతుందనే వివరాలను ఆయా రాష్ట్రాల నియంత్రణ సంస్థలకు సమర్పించాలి. ప్లాట్ కొనుగోలుకు ముందే కొనుగోలుదారులు ఈ వివరాలను ఆయా సంస్థ«ల నుంచి ఎప్పుడైనా తెలుసుకునే వీలుంటుంది. నిర్మాణదారులకు జైలు, జరిమానా రెరా చట్టం కింద ఏర్పాటు చేసిన అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చే ఆదేశాలను పాటించి తీరాలి. లేనిపక్షంలో 3 సంవత్సరాల వరకూ జైలుశిక్ష అనుభవించాలి. అక్కడ కేసు తీవ్రతను బట్టి జరిమానా సైతం ఉండొచ్చు. అలాగే ఈ చట్టం ప్రకారం కొనుగోలుదారుడికి ప్లాట్ చేతికందిన ఏడాది సమయం వరకూ తలెత్తే నిర్మాణలోపాలను సరిదిద్దే బాధ్యత బిల్డర్ తీసుకోవాల్సిఉంటుంది. బుకింగ్ సొమ్ము ఇలా.. కొంత మంది బిల్డర్లు పూర్తి నిర్మాణ ఖర్చులో 10 శాతం కన్నా ఎక్కువ సొమ్మును బుకింగ్ కోసం అడుగుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమ్మకపు ఒప్పందం తర్వాత జరుగుతోంది. కానీ రెరా చట్టం ప్రకారం ప్రమోటర్లు 10 శాతం కన్నా ఎక్కువ సొమ్మును డిమాండ్ చేయకూడదు. మొదట సేల్ అగ్రిమెంట్ను కుదుర్చుకోవాల్సిందే. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరిగితే బ్యాంకు రుణం మీద వడ్డీ కట్టాల్సిన బాధ్యత నిర్మాణదారుపై పడుతుంది. దీంతో వినియోగదారునికి వడ్డీ భారం తగ్గుతుంది. -
పరువు హత్యలపై చట్టం చేయాలి
రాష్ట్ర ఐద్వా నేతల డిమాండ్ అమలాపురం రూరల్ (అమలాపురం) : రాష్ట్రంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న పరువు హత్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రత్యేక చట్టం చేయాలని ఐద్వా రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో పాల్గొన్న రాష్ట్ర మహిళా ప్రతినిధులు డిమాండ్ చేశారు. మండలంలోని భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తోన్న ఈ తరగతుల్లో ఆదివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చోటు చేసుకున్న పరువు హత్య కేసులను జిల్లాల వారీగా చర్చించారు. ఈ ప్రధాన సమస్యతో పాటు మహిళా సమస్యలను నిరసిస్తూ భట్లపాలెంలో ఐద్వా మహిళలు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. పరువు హత్యలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి డిమాండ్ చేశారు. పార్లమెంటులో పెండింగ్లో ఉన్న మహిళా బిల్లును ఆమోదించాలని కోరారు. ‘మహిళా సమస్యలు... పరిష్కార మార్గాలు’అంశంపై సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.స్వరూపరాణి ప్రసంగించారు. మహిళల సమస్యలు పోరాటాల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. స్త్రీ, పురుషులకు సమాన హక్కుల కోసం ఆస్తుల చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర నాయకురాలు నండూరి రూపావాణి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమయంలో మహిళలు కీలక పాత్ర పోషించారని... అలాంటి మహిళలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ సమాజంలో మూఢ నమ్మకాలు...మద్యం అనర్ధాలపై మహిళలకు అవగాహన కల్పించారు. మెజీషియన్ సీహెచ్ శ్రీరాములు, జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్ ఎ.కృష్ణశ్రీ, జిల్లా కార్యదర్శి వీఎస్ఎన్ రెడ్డి తదితరులు మహిళా చైతన్యం, విజ్ఞానం అంశాలపై వివిధ ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. శిక్షణ తరగతులు సోమవారం కూడా ఇదే వేదికపై కొనసాగుతాయని ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణి చెప్పారు. నాలుగో రోజు మంగళవారం ముగింపు కార్యక్రమాన్ని అంతర్వేదిలో నిర్వహిస్తామన్నారు. ఐద్వా నాయకురాళ్లు విజయమ్మ, మాధవి, అలివేలు, ఇందిర, సావిత్రి, తులసి, అరుణ, ఆదిలక్ష్మి, కుడుపూడి రాఘవమ్మ తరగతుల్లో ప్రసంగించారు. సీపీఐ డివిజన్ కార్యదర్శి మోర్త రాజశేఖర్, కార్మిక నాయకుడు పచ్చిమాల వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక కొమ్మకు పుట్టిన ప్రేమ
లీగల్ స్టోరీస్ ప్రేమ ఒక బంధమే. కానీ అది కూడా ఒక విపరీత బంధానికి దారితీయవచ్చు. ఒక కొమ్మకు పుట్టిన పిల్లలు వరసలు తెలియక ప్రేమలో పడితే?! సంప్రదాయం వద్దంటోంది. సంస్కారం కాదంటోంది. మరి చట్టం ఏమంటుంది? ‘‘ఆనందా... గుడ్ న్యూస్ డియర్’’ శ్రీరామ్ వాయిస్లో ఆనందం.‘‘మీవాళ్లు ఒప్పుకున్నారా?’’ ఇవతల ఆనంద గొంతులో ఆత్రుత.‘‘ఊ.... ఒప్పుకున్నారు..’’ ఆ స్వరంలో ధీమా.‘‘హూ..’’ ఓ భరోసాతో నిట్టూర్చింది ఆనంద.‘‘నిన్ను ఎల్లుండి కలుస్తామన్నారు అమ్మానాన్న..’’ చెప్పాడు. ‘‘అవునా... అయితే తాతయ్యతో చెప్పేస్తాను ఈ రోజే’’. ‘‘చెప్పేయ్.. కాని హడావిడి పడకు.. పెద్దాయన్ని హడావిడి పెట్టకు. జస్ట్ నిన్ను చూసి పెద్దాయనతో మాట్లాడి వెళతారు అంతే.. ఓకేనా?’’ అన్నాడు శ్రీరామ్.‘‘ఒకే బాస్..’’ ఆనందలో సంతోషం.‘బై మరి..’ అంటున్న శ్రీరామ్కి ‘బై’ అంటూ ఆన్సర్ చేసింది. ఇద్దరి ఫోన్లు డిస్కనెక్ట్ అయ్యాయి.ఆనందకి ఆనందం మామూలుగా లేదు. ఎక్కడా కాలు నిలవడం లేదు. శ్రీరామ్ పేరెంట్స్ ఒప్పుకున్నారు. అంటే త్వరలోనే శ్రీరామ్కి భార్య కాబోతుంది. ఆ ఊహ ఆమె కళ్లల్లో ఓ మెరుపుని తెచ్చింది. మదిలో జ్ఞాపకాలను తట్టిలేపింది. ‘ప్రొఫైల్స్’.. కలిపాయి ఇద్దరినీ ఆనంద కృష్ణ... ఫేస్బుక్లో ఓ మ్యూచువల్ ఫ్రెండ్ పోస్ట్కి కామెంట్ పెట్టింది. ఆమె సోషల్ కాన్షస్కి ముగ్ధుడయ్యాడు శ్రీరామ్. ఆ పేరును క్లిక్ చేసి ఆమె పేజీని ఓపెన్ చేశాడు. ప్రతి పోస్ట్లో కనిపించిన ఆమె ఆలోచన, అభిరుచి, అవగాహన ఆయనను ఆనందకు కట్టిపడేశాయి. ఆమె ప్రొఫైల్ పిక్ ఆయనను ఫిదా చేసింది.బ్యూటీ విత్ బ్రెయిన్! మురిసిపోయాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. నాలుగు రోజులకు గానీ రెస్పాన్స్ రాలేదు ఆనంద నుంచి... యాక్సెప్ట్ చేస్తూ! ముందు హలో.. హాయ్ అంటూ పలకరింపు పర్వం. అతి కొద్ది రోజుల్లోనే వీళ్ల ప్రేమతో ఇన్బాక్స్ సిగ్గు పడడం మొదలెట్టింది. శ్రీరాం ఓ యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ హెడ్. ఆనంద ఓ మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్. మంచి క్లాసికల్ డాన్సర్. ఆయన సోషల్ సర్వీస్లో మేటి. ఆయన స్లమ్స్లో సర్వీస్ ఇచ్చే చోట ఆ పిల్లలకు స్వచ్ఛందంగా డాన్స్ నేర్పించడం స్టార్ట్ చేసింది. దాంతో శ్రీరామ్కి ఆనంద మీద మరింత ప్రేమ పెరిగింది. గౌరవమూ ఇనుమడించింది. తను జీవిత భాగస్వామిగా వస్తే బాగుంటుందని ఆశపడ్డాడు. ఆ ఆశను ఆమె ముందు ఎక్స్ప్రెస్ చేశాడు. శ్రీరామ్ తనకన్నా మూడేళ్లు చిన్నవాడు. ఆ సంశయాన్నే వెలిబుచ్చింది ఆనంద. అదసలు మ్యాటరే కాదన్నాడు. రెండు రోజులు ఆలోచించుకునే టైమ్ అడిగింది. మూడో రోజు ‘ఎస్’ అని చెప్పింది. పెళ్లిచూపులకు ఏర్పాట్లు శ్రీరామ్ ఆనందానికి అవధుల్లేవ్ ఆరోజు. ఆనందను తలచుకొని గర్వంగా ఫీలయ్యాడు. ఇద్దరి ఆలోచనలూ ఒకటే. ఆలోచనలు సరే... అలవాట్లూ ఒకటే! ఆ విషయంలో చాలాసార్లు ఆశ్చర్యపోయేవాడు శ్రీరామ్. మొత్తానికి తనతో పెళ్లికి ఆనంద ఒప్పేసుకుంది. ఆనందకు అమ్మానాన్న లేరు. తాతే ఆమెను పెంచాడు. ఆయన ఆమెకు ఓ స్నేహితుడు. అన్నీ షేర్ చేసుకుంటుంది. శ్రీరామ్ విషయమూ చెప్పింది. చూస్తాను అన్నాడు. ఇంటికి తీసుకెళ్లింది. పిల్లాడు నచ్చాడు పెద్దాయనకు. ఆయన తల్లిదండ్రులకు విషయం చెప్పి వారిని ఇంటికి తీసుకురమ్మన్నాడు. శ్రీరామ్ ఉండేది ముంబైలో. తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉంటారు. కిందటి వారం హైదరాబాద్ వెళ్లినప్పడు చెప్పాడు. వివరాలు అన్నీ విని.. ‘వీలు చూసుకొని వస్తాం’ అన్నారు. తర్వాత అతడి పేరెంట్స్ దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది వస్తున్నట్టుగా. వెంటనే ఆనందకు చెప్పాడు.జ్ఞాపకాల్లోంచి వాస్తవంలోకి వచ్చింది ఆనంద. శ్రీరామ్ చెప్పిన శుభవార్తను తాతయ్యకు అందించింది. శ్రీరామ్ కుటుంబాన్ని రిసీవ్ చేసుకునే ఏర్పాట్లలో పడిపోయారు తాతా మనవరాలు ఆ క్షణం నుంచే...! ఊహించని పరిణామం శ్రీరామ్ చెప్పిన ఎల్లుండి రానేవచ్చింది. ఇల్లంతా నీట్గా సర్దింది. సర్దినవాటిని వందసార్లు సరిచూసుకుంది. మనవరాలి ఆరాటం చూసి తాతయ్య ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. ఈలోపు కాలింగ్ బెల్ మోగనే మోగింది. ఆత్రంగా వెళ్లి తలుపు తీసింది ఆనంద. ఎదురుగా చిలిపిగా నవ్వుతూ శ్రీరామ్... అతని వెనకాలే మొహాల మీద చిరునవ్వులతో ఆయన తల్లిదండ్రులు ‘రండి రండి...’ అంటూ అంతే ఆత్రంగా లోనికి ఆహ్వానించింది. హాల్లో సోఫా చూపిస్తూ కూర్చోండి అంది. ఆనంద తాతయ్య వచ్చి త్రీ సీటర్ సోఫాకు ఎదురుగా ఉన్న సింగిల్ సీటర్లో కూర్చున్నాడు. అక్కడే నిలబడ్డ ఆనందను చూస్తూ వాళ్లకు కాస్త మంచినీళ్లు తెచ్చివ్వమ్మా అంటూ మనవరాలిని పురమాయించాడు. వచ్చిన వాళ్లను పరిచయం చేసుకుందామని ఇటు తిరిగాడు. శ్రీరామ్ తల్లిని చూడగానే ఒక్కక్షణం ఆగిపోయాడు ఎందుకో ఆ పెద్దాయన! ఆయనను చూసిన శ్రీరామ్ తల్లిలో కూడా ఇంచుమించు అదే భావం. అమ్మా... నువ్వు శోభ కదూ... అన్నాడు అనుమానం నివృత్తి చేసుకుందామని. అర్థమైపోయింది... శోభకు విషయం మొత్తం అర్థమైపోయింది. మామయ్యా... మీరు... ఆనంద... అంటూ ఆగిపోయింది. కాళ్లు చేతులు చల్లబడ్డాయి. మెదడు మొద్దు బారిపోయింది. అడుగు ముందుకు పడడం లేదు. పాలిపోయిన మొహంతో కొడుకును, భర్తను చూసింది. శ్రీరామ్ తల్లి వైపు, తండ్రి వైపు అయోమయంగా చూశాడు. భార్య స్థితి అర్థమైన శ్రీరామ్ తండ్రి... కొడుకును బయటకు తీసుకెళ్లాడు. నాటి కూతురే.. నేటి కోడలు! ‘‘శ్రీరామ్... నాతో పెళ్లికి ముందే మీ అమ్మకు పెళ్లయింది. ఓ కూతురు కూడా. ట్రైన్ యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. అప్పటికి వాళ్లకు యేడాదిన్నర బిడ్డ. ఆ షాక్తో మీ అమ్మ సైకలాజికల్గా ఎఫెక్ట్ అయింది. దాదాపు ఆర్నెల్లు పిచ్చిదానిలాగే ఉంది. ఇక్కడ ఉంచితే లాభంలేదు ఎప్పటికీ కోలుకోదని వాళ్ల మేనమామ అమెరికా తీసుకెళ్లాడు. ఆ బిడ్డను శోభ వాళ్ల అత్తగారు, మామగారే ఉంచేసుకున్నారు. మీ అమ్మమ్మ వాళ్లు అడిగినా ఇవ్వలేదు. కొడుకు జ్ఞాపకంగా ఉంటుందని తమ దగ్గరే పెట్టుకున్నారు. శోభ యూఎస్లోనే ఉండిపోయింది. నయం అయ్యాక కూతురి కోసం చాలానే తాపత్రయ పడింది. కాని పెద్దవాళ్లు సర్ది చెప్పి అక్కడే యూఎస్లో వాళ్ల మేనమామ ద్వారా ఉద్యోగం ఇప్పించారు. ఆ కంపెనీలోనే నేనూ జాబ్ చేసేవాడిని. అలా ఇద్దరం లవ్ లో పడ్డాం. పెళ్లి ప్రస్తావన తెచ్చాను. అప్పుడు చెప్పింది మీ అమ్మ.. తనకు అంతకు ముందే పెళ్లయిన విషయం, ఓ కూతురూ ఉన్న సంగతి. అయినా నాకేం అభ్యంతరం లేదన్నాను. పెళ్లి చేసుకున్నాను. తర్వాత నేను, మీ అమ్మ ఇద్దరం కలిసి ఆ అమ్మాయిని తెచ్చేసుకోవాలని చాలా ప్రయత్నించాం. ఆ పాప నానమ్మ, తాతయ్యను కలిశాం. వాళ్లు ససేమీరా అన్నారు. చేసేదేం లేక అమెరికా తిరిగి వెళ్లిపోయాం. యేడాదికి నువ్వు పుట్టావ్. లైఫ్ బిజీలో పడిపోయాం. అదిరా వివరం. అందుకే ఈ పెళ్లి కుదరదు’’ అని చెప్పాడు శ్రీరాం తండ్రి. హతాశుడయ్యాడు శ్రీరాం. ఉన్న చోటనే కూలబడిపోయాడు. చట్టం ఏం చెబుతోందంటే... హిందూవివాహ చట్టం 1955, సెక్షన్ 5 పెళ్లికి కొన్ని షరతులు విధిస్తోంది. పెళ్లి సమయానికి వధూవరుల్లో ఎవరికైనా అంతకుముందే పెళ్లయి ఉండి, ఆ భాగస్వామి బతికున్నా, విడాకులు ఇవ్వకపోయినా ఆ పెళ్లి చెల్లదు. ఆచార వ్యవహారాలు అనుమతించినప్పడు తప్ప నిషేధించిన బంధుత్వం ఉండకూడదు, సపిండులు కాకూడదు. పై షరతులకు విరుద్ధంగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదు. వీటినే వాయిడ్ మ్యారేజెస్ అంటారు. సెక్షన్ 11 ప్రకారం ఇలాంటి పెళ్లిళ్లను రద్దు చేయొచ్చు. వేరువేరు తండ్రుల ద్వారా ఒకే తల్లికి పుట్టిన పిల్లల సంబంధాన్ని ఏకోదర రక్తసంబంధం అంటారు. పైన కేస్లోని శ్రీరామ్, ఆనందల బంధం దీని కిందికే వస్తుంది. కాబట్టి ఆ పెళ్లి చెల్లదు. సంపూర్ణ రక్త సంబంధం అంటే... ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల మధ్య, అసంపూర్ణ రక్త సంబంధం... అంటే ఒకే భర్తకు వేరువేరు మహిళల ద్వారా పుట్టిన పిల్లల మధ్య, ఏకోదర రక్తసంబంధం ఉన్న పిల్లల మధ్య వివాహాలు నిషిద్ధం. – ఇ. పార్వతి,అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్ parvathiadvocate2015@ gmail.com – సరస్వతి రమ -
కాపీయింగ్ నిరోధంలో ‘పాస్’ అవుతారా?
-చూసిరాతలకు చెక్ పెట్టేందుకు యాక్ట్-25 -నిఘా నీడలో పదో తరగతి పరీక్షలు..! -చర్చనీయాంశమైన హైకోర్టు ఆదేశాలు రాయవరం : వచ్చే నెల 17 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షల్లో చూసిరాతలను (కాపీయింగ్) నివారించేందుకు గట్టి చర్యలు తీసుకోనున్నారు. మాస్ కాపీయింగ్ను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని హైకోర్టు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు విద్యాశాఖలో సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇంతవరకూ ఏం జరుగుతోందంటే.. పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే ఖాళీగా ఉంటున్నారని, దీంతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కొందరు భావిస్తున్న నేపథ్యంలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు అనధికారికంగా చూసిరాతలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్లుగా పబ్లిక్ పరీక్షల్లో చూచి రాతల సంస్కృతి పెరిగి పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయులే చూసిరాతలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పక్క విద్యార్థి జవాబు పత్రంలో చూసి రాయడం, స్లిప్పులు తెచ్చుకుని రాయడం ద్వారా ఉత్తమ గ్రేడులు పొందేందుకు పక్కదారులు పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యాక్ట్ -25 అంటే.. పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ను అరికట్టేందుకు యాక్ట్ -25ను రూపొందించారు. దశాబ్దాల క్రితమే ఈ యాక్ట్ అమల్లో ఉంది. మాస్ కాపీయింగ్ నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ను నిరోధించేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రెండు రాష్ట్రాలను హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా నిరోధించేందుకు అమలు చేసే యాక్ట్ -25కు విద్యాశాఖ అధికారులు పదును పెడుతున్నారు. మాల్ ప్రాక్టీస్ చేసి పట్టుబడిన సందర్భాల్లో ఈసారి ఇన్విజిలేటర్ను కూడా ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంటుందని సమాచారం. మాస్ కాపీయింగ్ను నిరోధించాలంటే.. గతేడాది జిల్లాలో మాస్ కాపీయింగ్ నిరోధక చర్యల్లో భాగంగా 15 చోట్ల సీసీ కెమెరాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా, రాష్ట్ర అధికారులు ప్రత్యక్ష్యంగా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. బయో మెట్రిక్ హాజరు, ఆన్లైన్ మానిటరింగ్ ద్వారా చూసిరాతలకు ఫుల్స్టాప్ పెట్టే అవకాశం ఉంది. తనిఖీ బృందాల్లో ఏసీబీ, విజిలెన్స్ విభాగాల నుంచి ఒక్కొక్కరిని నియమిస్తే మాస్ కాపీయింగ్ను పక్కాగా నిరోధించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదో తరగతి విద్యార్థులకు కూడా జవాబులు రాయడానికి సింగిల్ బుక్లెట్లు ఇవ్వడం ద్వారా మాస్ కాపీయింగ్కు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఈ ఏడాది జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఇది ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 67,740 మంది రెగ్యులర్ విద్యార్థులు.. ఈ ఏడాది జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 67,740 మంది రెగ్యులర్ విద్యార్థులుగా హాజరు కానున్నారు. వీరికి 297 రెగ్యులర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది పబ్లిక్ పరీక్షల్లో సబ్జెక్ట్స్ ఫెయిలైన వారికి ఏడు ప్రైవేటు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పకడ్బందీగా యాక్ట్-25 అమలు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాల్ప్రాక్టీస్కు అవకాశం లేకుండా యాక్ట్ 25ను కచ్చితంగా అమలు చేస్తాం. ఎక్కడా అక్రమాలకు తావీయకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై కచ్చితమైన గైడ్లైన్స్ రావాల్సి ఉంది. –ఎస్.అబ్రహాం, ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ -
భర్త కాటుకు భలే దెబ్బ
అసలు సామెత.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. భర్తలు మనుషుల్లా ప్రవర్తించకపోతే.. కరవడం దాకా ఎందుకు.. మొరిగినా చాలు చట్టం ‘గొలుసు’తో కట్టేస్తుంది! ఆ తర్వాత కూడా తోక ఆడిస్తే.. దెబ్బ వేస్తుంది. గృహహింస నుంచి బంగారు తల్లులను రక్షించడానికిది.. భలే చట్టం. ఉసూరుమంటూ గేటు తీసి, కాంపౌండ్లోకి వచ్చింది ఉష. రెండు బస్సులు మారి రావడంతో ఒళ్లు హూనమైపోనట్లయింది.వరండాలో పిల్లలు బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉన్నారు. ‘ఏమ్మా డాలీ.. ఇంట్లోకి ఎందుకు వెళ్లలేదు?’ అని కూతుర్ని అడిగింది. ‘డాడీ పక్కింటి ఆంటీకి కీస్ ఇవ్వలేదటమ్మా! తమ్ముడికి ఆకలేస్తోందట.. నీ కోసం వెయిట్ చేస్తున్నాం’ అంది కూతురు. తల్లి మనస్సు తల్లడిల్లింది. తాళం తీసి ఇంట్లోకి వెళ్లింది. లైట్ వేసింది. వెలగలేదు! వీధిలో అందరికీ కరెంట్ ఉంది. వాచ్మెన్ని అడిగితే, ‘ఈ నెల కరెంటు బిల్లు కట్టలేదటమ్మా.. డిపార్ట్మెంట్వాళ్లొచ్చి మధ్యాహ్నమే కట్ చేసి వెళ్లారు’ అని చెప్పాడు. ‘ఈ ఫోన్కి కాల్ చేస్తే అతనొచ్చి బిల్లు కట్టించుకుని కనెక్షన్ ఇస్తాడంట’ అని.. ఫోన్ నెంబర్ రాసి ఉన్న స్లిప్పు ఇచ్చాడు. బిల్లును చూసుకుంది ఉష. గాడ్! వెయ్యి రూపాయలు. నెలాఖరు రోజులు. అంత డబ్బెలా కట్టాలి? ఇల్లంతా వెతికి వెతికి చిల్లర జమ చేసి, పక్కింట్లోంచి కొంత చేబదులు తీసుకుని వెంటనే కరెంట్ కనెక్షన్ ఇప్పించుకుంది. స్వర్గసీమను నరకం చేశాడు! బెడ్రూమ్లోకి వెళ్లింది ఉష. అందులోని వాష్రూమ్కి తాళం వేసి ఉంది! బుర్ర తిరిగిపోయింది. దేవుడా అనుకుంది. తిరిగి పిల్లల రూమ్లోకి వచ్చింది. ‘అమ్మా.. ఆకలి’.. కడుపు చేత్తో పట్టుకుని తల్లి చెంతకు వచ్చాడు కొడుకు. ‘అయిపోతుందమ్మా... స్నాక్స్ చేస్తున్నాను’ అంటూ మిక్సీ దగ్గరకు వెళ్లింది. వైర్ కట్ అయిపోయి కనిపించింది మిక్సీ! అరె, మాయగా ఉందే అనుకుంది ఉష.. అలసటని, చికాకుని దాచుకునే ప్రయత్నం చేస్తూ. రిఫ్రెష్ అవ్వకుండా.. అప్పటికప్పుడు వేడివేడిగా ఉప్మా చేసి పెట్టి పిల్లల ఆకలి చల్లార్చింది. తర్వాత కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా తెరిచింది. ఫ్చ్. బియ్యం లేవు! ఉదయమే చెప్పి వెళ్లింది కిశోర్కి, బియ్యం తెచ్చిపెట్టమని. తేలేదన్నమాట. పిల్లలు హోమ్ వర్క్ చేసుకుంటున్నారు. ‘అమ్మా.. స్కూల్ ఫీజ్కి రేపే లాస్ట్ డేట్’.. కూతురు గుర్తుచేసింది. ఒక్కక్షణం తనవన్నీ సినిమా కష్టాల్లా అనిపించాయి ఉషకి. అంత ఒత్తిడిలోనూ తనను తను సముదాయించుకుంటోంది. ‘అలాగే అమ్మా..’ అని చెప్పి బాత్రూమ్లోకి వెళ్లింది. అర్జెంటుగా తనిప్పుడు స్నానం చెయ్యాలి. వేణ్ణీళ్లతో స్నానం చేస్తే కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది. పిల్లల బాత్రూమ్లో గీజర్ లేదు. మాస్టర్ బెడ్రూమ్లో మాత్రమే ఉంది. దానికి తాళం వేసి ఉంది. ఆలోచనలో పడిపోయింది ఉష. ఇదంతా కిషోర్ చేస్తున్న పని కాదు కదా, ఉద్దేశపూర్వకంగానే తను ఇలా చేస్తున్నాడా అనుకుంది. కొన్నాళ్లుగా భర్త కిషోర్ ప్రవర్తనలో మార్పును గమనిస్తోంది ఉష. ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు పైన రెండు గదులు కట్టించి అద్దెకు ఇవ్వాలని కిశోర్ అంటున్నాడు. ఆ అనడం క్రమంగా సతాయింపుగా మారుతోంది. సతాయింపు కొన్నిసార్లు వేధింపు స్థాయిని అందుకుంటోంది! ఉష పేరు మీద ఉన్న ప్లాట్ని అమ్మించి, ఇప్పుడున్న ఇంటిపై గదులు కట్టించాలని కిశోర్ ఒత్తిడి తెస్తున్నాడు. ఇదే విషయమై తరచు గొడవ పడుతున్నాడు. ఆ ప్లాట్ని అమ్మడం ఉషకు ఇష్టం లేదు. ముందుముందు పిల్లల చదువులకు పనికొస్తుందని ఆమె ఆశ. పైగా వాళ్లుంటున్న ఏరియాలో అద్దెలు కూడా ఎక్కువగా రావు. ఆ మాట అంటే కిశోర్ వినడం లేదు. పైగా కోపం తెచ్చుకుంటున్నాడు. కిశోర్ మొండితన ం గురించి ఉషకు తెలియంది కాదు కానీ, ప్లాటు విషయమై పట్టినపట్టు విడవకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. అస్తమానం పిల్లల ముందు గొడవపడితే ఆ పసి మనసులు కల్లోలం అయిపోతాయేమోనన్న భయంతో అన్నిటికీ ఓర్చుకుని నెట్టుకొస్తోంది. వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడవుతాయని.. చిన్న ఉద్యోగం వస్తే, ఇరవై కిలోమీటర్ల దూరమే అయినా వెళ్లి వస్తోంది. ఆ ఉదయం మళ్లీ గొడవైంది. ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు. తేలిగ్గా తీసుకుని ఆఫీసుకు వెళ్లిపోయింది. తనూ మొండి వైఖరి ప్రదర్శిస్తే మొదటికే బంధం తెగిపోవచ్చు. అందుకుని అడ్జెస్ట్ అవుతోంది. ఇదిగో... ఇప్పుడు ఇంటికొచ్చేటప్పటికీ ఇలా ఉంది పరిస్థితి. పిల్లలు వింటున్నారన్నా వదల్లేదు! రాత్రి బాగా లేట్గా వచ్చాడు కిశోర్. ‘అబ్బో కరెంట్ తెప్పించుకున్నావే! భేష్. ఎంతైనా సంపాదనాపరురాలివి కదా’ అన్నాడు. ప్లేట్లో అందించిన చపాతీలను విసిరికొట్టి, ‘ఏం? బియ్యం తెప్పించుకోలేదా?’ అని పెద్దగా అరిచాడు. పిల్లలు వింటారు అన్నట్లు అతడి వైపు చూసింది ఉష. ‘ఇక మీదట ఇంటి ఖర్చులకూ నాకూ ఏ సంబంధమూ లేదు. నేను బయట తినొస్తాను. నా మాటా వినని వారు నా ఇంట్లో ఉండకూడదు’ అని పెద్ద గొడవ చేశాడు. ‘పిల్లలు వింటున్నారు. మెల్లిగా మాట్లాడండి’ అని ప్రాధేయపడింది ఉష. కిశోర్ వినలేదు. ‘నా అరుపులే కదా ఇప్పటి వరకు పిల్లలు విన్నారు. ఇప్పుడు నీ అరుపులు వింటారు చూడు’ అంటూ చప్పున బెల్టు తీసి ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు. ఉష అరవలేదు. బాధను అదిమి పెట్టుకుంది. అది ఇంకా కోపం తెప్పించింది కిశోర్కు. పిడికిలి బిగించి ఆమె ముఖం మీద కొట్టాడు. ‘అమ్మా’ అని అరిచింది ఉష. ఆ పెదవుల మధ్య తడిగా.. ఉప్పటి స్పర్శ! వేలితో తడుముకుంది. రక్తం!! ఆర్థికంగా.. మానసికంగా.. శారీరకంగా... రాత్రంతా నిద్ర పోలేదు ఉష. ఆమె దేహం దెబ్బతింది. ఆమె ఆత్మాభిమానం దెబ్బతింది. ఈ రెండిటి కన్నా కూడా.. భర్తతో ఆమె అనుబంధం దెబ్బతింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తల్లిదండ్రులతో పిల్లల బంధం దెబ్బతింటుంది. ఆలోచనలు ఉషను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఇంటి కోసం ఒక్క పనీ చేయడం లేదు కిశోర్. అంతేకాదు, ఇంట్లోని వస్తువులను వాడుకోనివ్వడం లేదు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. భర్త కారణంగా ఆఫీసు నుంచి ఇంటికి రావడానికే భయం వేస్తోంది ఉషకు. తనపై కోపంతో, పగబట్టినట్లు బిహేవ్ చేస్తున్నాడు కిశోర్. అతని ఇష్ట ప్రకారమే ప్లాటు అమ్మేసి, ఇంటిపైన గదులు వేయించినా అతడు మారతాడనేం లేదు. అప్పుడు ఇంకొకటేదో మొదలుపెడతాడు. ‘అద్దెల మీద బతికేయెచ్చు’ అని కిశోర్ తరచు అనేమాట చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఉషకు. ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నదో చితకదో తనూ చేస్తోంది. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు చేస్తే.. తమకేం తక్కువని! ప్లాటు ఎలాగూ ఉంటుంది. ఉండేది అలా ఉండిపోదు కదా. వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇవేవీ కిశోర్ తలకు ఎక్కడం లేదు. తెల్లవారుతుండగా ఒక నిర్ణయానికి వచ్చింది ఉష. ఆఫీస్లో లేట్ పర్మిషన్ తీసుకుని ‘ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్’కి వెళ్లింది! అక్కడ ఓ విభాగానికి పెద్ద బోర్డు వేలాడుతోంది. ‘డొమెస్టిక్ వయెలెన్స్ కేసెస్ ఆఫీస్’ అని! పదిరోజులు.. పంటి బిగువన..! ‘ఇది డొమెస్టిక్ వయెలెన్స్’ కిందికి వస్తుంది అన్నారు.. ఉష చెప్పిందంతా విన్న లీగల్ ఆఫీసర్. కేస్ ఎలా ఫైల్ చెయ్యాలో కూడా చెప్పారు. చాలా సులభంగా ఉంది ఆ ప్రొసీజర్ అంతా. ఉష మౌనంగా ఉండిపోయింది. ‘చెప్పండమ్మా.. ఏం చేద్దామంటారు’ అన్నారు ఆఫీసర్.‘కేసు పెట్టడం నా ఉద్దేశం కాదు సర్. నా భర్త మారేలా కౌన్సెలింగ్ ఇప్పించగలరా?’ అని అభ్యర్థనపూర్వకంగా అడిగింది ఉష. ఆ తర్వాత పది రోజుల్లో కిశోర్కి నోటీసులు వెళ్లాయి. ఈ పదిరోజుల్లో కిశోర్ ప్రవర్తన మితిమీరిపోయింది. పంటిబిగువన ఓపిక పట్టింది ఉష. నోటీసు రాగానే కాస్త నెమ్మదించింది.‘ఎంతకు తెగించావే’ అంటూ శాపాలు, శాపనార్థాలు పెడుతూ కౌన్సెలింగ్కి బయల్దేరాడు కిషోర్. హింస నుంచి రక్షణ ఉత్తర్వులు కౌన్సెలింగ్ మొదలైంది. కౌన్సెలింగ్ పూర్తయింది. లాయర్ ప్రస్తాంచిన ‘డీవీ’ యాక్ట్ తప్ప కిశోర్కి ఏవీ గుర్తులేవు. ‘మీ భార్య తలచుకుంటే మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్లిపోయేలా ఈ చట్టం ద్వారా ఆమె ఆదేశాలు తెచ్చుకోవచ్చు. ఉమ్మడి నివాసం నుండి భర్తను ఖాళీ చేయించడానికి మాత్రమే కాదు.. తనను, పిల్లల్నీ వేధించకుండా ‘రక్షణ ఉత్తర్వు’లను కూడా ఆమె ఈ చట్టం ద్వారా పొందవచ్చు’ అని చెప్పాడు లాయర్. అయితే ఆమె మీపై కేసు పెట్టాలని కోరుకోవడం లేదు. మీరు మారితే అదే చాలు అనుకుంటోంది’ అని కూడా చెప్పాడు. కిశోర్ ముఖం వాడిపోయింది. అతడి కళ్లలో భయం కనిపిస్తోంది. ‘ఇకపై అలాంటి పనులు చేయను’ అని లిఖితపూర్వకంగా అంగీకరించి కేసు విత్డ్రా చేయించుకున్నాడు. గృహహింస (రక్షణ చట్టం) ఏం చెబుతోంది? ‘గృహహింస నుంచి, వేధింపుల నుంచి మహిళకు రక్షణ కల్పించడం కోసం 2005లో ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అదే డీవీ యాక్ట్. (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయెలెన్స్). ఈ చట్టం ప్రకారం... భర్త కానీ, ఇతర కుటుంబ సభ్యులు కానీ మహిళను ఏ విధంగానైనా హింసిస్తే, ఆమె కోర్టును ఆశ్రయిస్తే.. కోర్టు ఆమెకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. గృహోపకరణాలను వాడుకోనివ్వకుండా అడ్డుకోవడడం, ఇంట్లోని సదుపాయాలను, సౌకర్యాలను వినియోగించకుండా నిరోధించడం; బియ్యం, ఇతర సరకులను తీసుకురాకుండా ఉండడం; అద్దె, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు కట్టకుండా ఉండడం, పిల్లల ఫీజులకు, గృహావసరాలకు డబ్బులు ఇవ్వకపోవడం.. ఇవన్నీ కూడా గృహ హింసనుంచి రక్షణ కల్పించే చట్టం పరిధిలోకే వస్తాయి. అంతేకాదు.. సూటిపోటి మాటలతో మహిళను కించపరచడం, ఆమె ఆత్మాభిమానం దెబ్బతినేలా అవమానించడం, చెయ్యి చేసుకోవడం, ఆహారం అందకుండా నిర్బంధించడం, బెదిరించడం.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఏ విధంగా మహిళను వేధించినా కూడా ఈ చట్ట ప్రకారం.. ఆ మహిళ కోర్టు నుంచి ‘రక్షణ ఉత్తర్వు’లను పొందవచ్చు. ఇ. పార్వతి, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
సినిమాగా రాబోతున్న పురుచ్చ తలైవీ జీవితం ?
-
బలవంతపు భూసేకరణ ఆపాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పెద్దారెడ్డి డిమాండ్ వడ్డేశ్వరం (తాడేపల్లి రూరల్): రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టిన బలవంతపు భూసేకరణ వెంటనే నిలుపు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పుల్లా పెద్దారెడ్డి అన్నారు. సోమవారం వడ్డేశ్వరంలోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీల కోసం రైతుల నుంచి భూమి సేకరించడం, పెద్దలకు కట్టబెట్టడం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. మిగులు భూములు, బంజరు భూమిని పేదలకు పంచాలని, సమగ్ర భూసంస్కరణలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే విత్తన చట్టాన్ని తేవాలని కోరారు. కల్తీ విత్తనాలను అరికట్టి బహుళ జాతి కంపెనీల ప్రమేయాన్ని తగ్గించాలని ఆయన కోరారు. ప్రభుత్వం 245 కరువు మండలాలను ప్రకటించిందని, కానీ తమ పరిశీలనలో మరో 150 మండలాలు తేలాయని, మొత్తం 395 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఖరీఫ్లో 400 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం ఇంత వరకు రైతులకు చెందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని విమర్శించారు. భూసేకరణకు వ్యతిరేకంగా వామపక్ష నాయకులు, రైతుల మీద ప్రభుత్వ అణచివేతను నిరసిస్తూ డిసెంబర్ 12న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఛలో కలెక్టర్ కార్యాలయం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రైతులను రక్షించండి – వ్యవసాయాన్ని కాపాడండి ’ అనే నినాదంతో ఈ నెల 9,10,11 తేదీలలో అఖిల భారత కిసాన్ సభ జాతా రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క రైతు ఆ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై కేశవరావు, రైతువాణి చీఫ్ ఎడిటర్ వంగల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
విత్తన చట్టంలో మార్పులు తెస్తాం
పెద్దాపురం : చరిత్ర కల్గిన పెద్దాపురం దుంప పరిశోధన కేంద్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక దుంప పరిశోధనా కేంద్రాన్ని మంత్రి పుల్లారావు బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జరిగిన సభలో మంత్రి పుల్లారావు మాట్లాడుతూ బయో పేరుతో రసాయనాలతో ఎరువులు కల్తి చేసిన చేసిన 51 కంపెనీల యజమానులను అరెస్టు చేశామన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై పీడీ యాక్టు కింద కేసు పెడతామని హెచ్చరించారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పరిశోధనా కేంద్రాన్ని పెద్దాపురం తీసుకువచ్చిన ఘనత రాజప్పదేనన్నారు. మంత్రి రాజప్ప మాట్లాడుతూ రైతు అభివృద్ధికి పాటుపడుతాన్నారు. అనంతరం సుమారు రూ.42 లక్షలతో నిర్మించిన నూతన పరిశోధన కేంద్ర భవనానికి మంత్రులు, ఎంపీ, భూమిపూజ చేశారు. ఎమ్మెల్యేలు వర్మ, వేగుళ్ళ జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ అంగులూరి శివకుమారి, జిల్లా గ్రం«థాలయ సంస్థ చైర్మన్ వీర్రెడ్డి పెద్దాపురం, సామర్లకోట ఎఎంసి చైర్మన్లు ముత్యాల రాజబ్బాయి, పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, రైతు నేతలుమాసిన వెంకట్రావు, పుట్టా సోమన్నచౌదరి, నున్నా రామకృçష్ణ (రాంబాబు), రంధి సత్యనారాయణ, ఎంపీపీ గుడాల రమేష్, జెడ్పీటీసీ సుందరపల్లి శివ నాగరాజు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
మిర్యాలగూడ టౌన్ వివిధ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి అజిత్సింహరావు, సినియర్ సివిల్ జడ్జి వై.సత్యేంద్ర, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ఎ.రాధాకృష్ణమూర్తి అన్నారు. సోమవారం స్థానిక కోర్టులో మండల న్యాయసేవా సంస్థ, ఏపీ గ్రామీణ వికాస బ్యాంకు వారు సంయుక్తంగా కాంట్రాక్టర్ చట్టం, ఇండియన్ స్టాంపు, రిజిస్ట్రేషన్, వారసత్వం, ఆస్తుల బదలాయింపు, డబ్బు లావాదేవిలకు సంబంధించిన దావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కల్గి ఉంటేనే బాగుంటుందన్నారు. కార్యక్రమంలో ఏపీజీవిపీ చైర్మన్ వి. నర్సింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రామకృష్ణారెడ్డి, ఏపీపీ నరేందర్రెడ్డి, సీహెచ్ రఘురామారావు, రీజినల్ మేనేజర్ రమణామూర్తి, డాక్టర్. పందిరి రవీందర్, డి.శ్రీనివాస్ తదితరులున్నారు. -
2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సెగ్గం రాజేష్ కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టు భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సెగ్గెం రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మహదేవపూర్ మండలం సూరారం గ్రామంలో పర్యటించి భూనిర్వాసితులతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కింద భూమి పోతుందనే ఆవేదనతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చల్లా స్వరూప, పత్తిపంట నష్టంతో బలవన్మరణం చెందిన యువరైతు ప్రవీన్ కుటుంబాలను పరామర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నెపల్లి పంప్హౌస్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు న్యాయమైన పరిహారం కోసం ఏకతాటిపై నిలవాలన్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సన్నచిన్నకారు రైతులకు సాగునీరందించేందుకు కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే... ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు. భూనిర్వాసితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట మల్హర్ మండల అద్యక్షుడు సుంకె వెంకటి, నాయకులు కల్యాణ్, కుమార్ ఉన్నారు. -
చట్టానికి కళ్లుంటాయి
లీగల్ స్టోరీస్ ఆయుధానికి దయ ఉండదు. అణ్వస్త్రానికి కరుణ ఉండదు. అవి... తమ పని తాము చేసుకుపోతాయంతే! ఉండాల్సిందల్లా వాటిని వాడుతున్న వారికి విచక్షణ. కావాల్సిందల్లా ఆ పర్యవసానాలపై అవగాహన. 498-ఏ... దుర్మార్గపు భర్తలు, ధూర్తులైన మొగుళ్ల పాలిటి ఓ అణ్వస్త్రంలాంటిదే... ఓ ఆయుధం లాంటిదే. చేతిలో ఉందని అస్త్రాన్ని, ఆయుధాన్ని వేస్ట్ చేయవద్దు. అస్త్రాన్ని... దివ్యస్త్రం అని కూడా అంటారు. న్యాయదేవత పర్యవేక్షణలోని చట్టాల్లో ఓ దివ్యత్వం ఉంది. అస్త్రం లాంటి చట్టాన్ని అనవసరంగా ఉపయోగిస్తే... చట్టం కళ్లు మూసుకునే ఉండదనీ, దివ్య చక్షువులతో సత్యాలను వీక్షిస్తుందని... కోర్టు వివేచనతో వ్యవహరిస్తుందని చాటి చెప్పడానికే ఈ కథనం. తండ్రి స్నేహితుడు విద్యాధరరావుతో కలిసి పోలీస్ స్టేషన్లో వెయిట్ చేస్తున్నాడు చంద్ర. ఇన్స్పెక్టర్ కోసం! గంట అయింది.. అప్పుడు వచ్చాడు ఇన్స్పెక్టర్. ఆయన్ని చూసి చంద్ర, విద్యాధరరావు చటుక్కున లేచి నిలబడ్డారు. కనీసం వాళ్ల వంక చూడనైనా చూడకుండా తన సీట్ దగ్గరకు వెళ్లిపోయాడు. కానిస్టేబుల్స్తో ఏవో కేసులకు సంబంధించినవి మాట్లాడుతూ, ఆరా తీస్తూ, ఫోన్లలో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు ఆ ఇన్స్పెక్టర్. ఈలోపు రెండు మూడుసార్లు కానిస్టేబుల్తో చంద్ర తాము ఇన్స్పెక్టర్ను కలవాలనుకున్నట్టు చెప్పించాడు. వినీ విననట్టు ఊరుకున్నాడు ఇన్స్పెక్టర్. ఈలోపే జ్వాల, ఆమె పేరెంట్స్, జ్వాల మేనమామా స్టేషన్కి వచ్చారు. రావడం రావడంతోనే వరండాలో ఉన్న చంద్రవాళ్లను చూసిన జ్వాల మేనమామ.. ‘‘కట్నం కోసం మా అమ్మాయిని సతాయిస్తారా? తిండి పెట్టకుండా మాడుస్తారా? నీ చెల్లెలికి అస్తమానం నీతో ముచ్చట్లేంటి? మీ అమ్మకేం పనిలేదా... పొద్దాక కోడలిని పట్టుచీరలు కట్టుకొమ్మని, నగలేసుకుని తిరగమని పోరడం తప్ప? నీ తండ్రేంటి? ముసలాడు మాట్లాడాల్సిన మాటలా అవి? కొడుకుతో ఎలా ఉండాలో కోడలికి సలహాలిస్తాడా? నీ చెల్లికి ఇచ్చుకొమ్మను. భలే దొరికారు మా ప్రాణాలకు పర్వర్టెడ్ ఫెలోస్. ఆగండి మీ పని చెప్తా.. మీ అంతు చూస్తా!’’ అంటూ కుడిచేతి చూపుడువేలు చూపిస్తూ ఆవేశంతో, కోపంతో ఊగిపోయాడు. ఆ మాటలు విన్న చంద్రకూ కోపం నషాళానికి అంటింది. పిడికిలి బిగుసుకుంది. దవడలు అదిరాయి. అంతే.. ఆవేశంతో ఏదో అనబోయాడాడు. పక్కనే ఉన్న విద్యాధరరావు.. చంద్ర భుజం నొక్కి ఆపాడు. మరో గంట గడిచాక.. అప్పుడు.. బయట వెయిట్ చేస్తున్న చంద్రవాళ్లను లోపలికి పిలిపించాడు ఇన్స్పెక్టర్. కళ్లతోనే కూర్చోండి అన్నట్లు సైగ చేసి కుర్చీలో వెనక్కి వాలాడు. ‘‘ఏంటి విషయం?’’ చెవిలో ఇయర్ బడ్ తిప్పుకుంటూ కళ్లు సగం మూసి అడిగాడు చంద్ర వాళ్లను. ‘‘నా పేరు చంద్ర. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. మా ఇంటికి కాల్ చేసి నన్ను, మా పేరెంట్స్ని, మా చెల్లిని స్టేషన్కి రమ్మన్నారట సర్ మీరు’’ చెప్పాడు చంద్ర వినయంగానే. ‘‘ఓ.. జ్వాల అనే అమ్మాయి మొగుడువే కదా నువ్వు’’ అని చంద్రను ఉద్దేశించి అంటూ, ‘‘బయట జ్వాలా అనే వాళ్లున్నారేమో చూడు.. ఉంటే పిలువ్’’ అని అంతే నిర్లక్ష్యంగా కానిస్టేబుల్కి చెప్పాడు ఇన్స్పెక్టర్. జ్వాలా వాళ్లూ వచ్చారు. చంద్రకు విషయం మొత్తం అర్థమైంది. ‘ఓహో.. 498 ఏ పెట్టారన్నమాట’అనుకున్నాడు మనసులో! జ్వాలా తరపు వాదనను, చంద్ర ప్రతివాదనను విన్నాడు ఇన్స్పెక్టర్. అంతా విన్నాక అమ్మాయికే పెళ్లి ఇష్టంలేదనే కన్క్లూజన్ కనిపించింది, వినిపించింది, అర్థమైంది ఇన్స్పెక్టర్కి. ‘రేపు.. మీ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఉంది... ఉదయం పదకొండు గంటలకల్లా రండి’ అని చెప్పాడు ఇన్స్పెక్టర్. ఏం కష్టం ఇది? కొడుకు కోసం ఎదురుచూస్తూ గుమ్మంలోనే కూర్చుని ఉన్నారు చంద్ర తల్లిదండ్రులు. వాళ్లను చూడగానే ప్రాణం ఉసూరుమంది చంద్రకి. ‘‘ఏరా.. ఏమైంది?’’ ఆత్రంగా అడిగారు ఇద్దరూ ఒకేసారి. ‘‘ఏం లేదులే ’’ అంటూ అమ్మానాన్నలను డైనింగ్ హాల్లోకి తీసుకొచ్చాడు చంద్ర. వాళ్లను కూర్చోబెడుతూ.. ‘‘రాజీవీ..’’ అంటూ చెల్లెల్ని పిలిచాడు. ‘‘ఆ.. వస్తున్నా’’ అంటూ వచ్చిందామె. ‘‘నాన్నకు టాబ్లెట్ వేశావా?’’ అడిగాడు. ‘‘వేశానన్నయ్యా.. అమ్మే ఏం తినలేదు’’ అంది రాజీవి. వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడినుంచి బాల్కనీలోకి వెళ్లిపోయాడు చంద్ర. మూడు నెలల కిందట జరిగినవన్నీ ఒకటొకటిగా గుర్తొస్తున్నాయి అతనికి! అపరిచితురాలేం కాదు జ్వాల.. తన తల్లి వైపు దూరపు బంధువుల అమ్మాయి. పోలీస్స్టేషన్లో పెద్దపెద్దగా అరిచిన జ్వాల మేనమామే ఆ సంబంధం తీసుకొచ్చాడు. రాజీవి పెళ్లయ్యాకే తాను చేసుకుందామనుకున్నాడు. కాని ఒప్పుకునే వరకు వాళ్లు వదల్లేదు. జ్వాలకేం తక్కువ. చక్కగా ఉంటుంది. బాగా చదువుకుంది. ఊ అనేసెయ్’’ అంటూ అమ్మా ఒప్పించింది. రాజీవికి, దుబాయ్లో ఉన్న అక్కకూ జ్వాల బాగా నచ్చింది. మొత్తానికి పెళ్లికి ఓకే అనేశాడు. కట్నం గురించిన మాటే రాలేదు. వాళ్లే ‘అదిస్తున్నాం, ఇదిస్తున్నాం’ అంటూ లాంఛనాలు ఇచ్చారు. జ్వాలకు గోల్డ్ పెట్టుకున్నారు. ఘనంగా పెళ్లి చేశారు. అక్కావాళ్లకు కుదరక పెళ్లికి రాలేదు. కానీ ఫోన్లో ఆడపిల్ల మనసు బాధపెట్టొద్దని జ్వాల గురించి ఎంత పాజిటివ్గా చెప్పింది! ఫస్ట్నైట్ ఇంట్లోనే ఏర్పాటు చేస్తే.. ‘‘మీరూ మీ చాదస్తాలు ఇక ఆపండి’ అంటూ తనే అక్కడి నుంచి ఇక్కడ ఓ స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసింది. అమ్మయితే తనకు తన అత్తగారిచ్చిన నగలన్నిటినీ కోడలికి పెట్టి చూసుకుని మహాలక్ష్మిలా ఉందని మురిసిపోయింది. ‘‘ఒరేయ్.. నువ్వూ, అమ్మాయి ఎటన్నా వెళ్లండిరా.. మళ్లీ రోటీన్లో పడిపోతే వెళ్లలేరు’’ అని నాన్న కూడా తన వెంటపడ్డాడు. అలాంటి నాన్న మీద జ్వాల వాళ్ల మేనమామ ఎలా నోరు పారేసుకున్నాడు? పదహారు రోజుల పండగ పెళ్లయి ముచ్చటగా మూడునెలలు అంతే. తను నాతో కలిసి ఉన్నది పదిహేను రోజులే. అసలు ఇంకా ఒకరికొకరు అర్థమే కాలేదు. అర్థం చేసుకునే ప్రయత్నం జ్వాలా చేయలేదు.. తనకూ చాన్స్ ఇవ్వలేదు. పెళ్లయినప్పటి నుంచీ ముభావంగానే ఉంది. తను ఎంత కల్పించుకొని మాట్లాడినా కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్లే సమాధానమిచ్చింది తప్ప మనసు విప్పి మాట్లాడలేదు. ఫస్ట్నైట్ కూడా జరగలేదు. పదహారు రోజుల పండగకు వెళ్లి.. మళ్లీ రాలేదు. మూడు నెలల తర్వాత ఇదిగో ఇలా.. పోలీస్ కంప్లయింట్.. 498ఏ కేస్తో స్టేషన్లో కలిసింది. తను, తన తల్ల్లీతండ్రి, తన కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆమెను కొట్టి, బట్టల బ్యాగ్తో బయటకు గెంటేశామని అభియోగం మోపింది. ఇదేమని అడగడానికి వచ్చిన జ్వాల అమ్మానాన్నల్నీ, బంధువులనూ నానా తిట్లు తిట్టామని అపవాదు. అసలు ఆరోజు తను ఊళ్లోనే లేడు. ఒక ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళ్లాడు. పోలీస్లు ఫోన్ చేసి రాష్గా మాట్లాడుతున్నారని, పోలీస్ స్టేషన్కు రమ్మంటున్నారని చెల్లెలు ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరాడు. మర్నాడు ఇన్స్పెక్టర్ చెప్పిన టైమ్కి ఇద్దరూ స్టేషన్కి చేరుకున్నారు. అంతకుముందే జ్వాలతో మాట్లాడ్డానికి చాలా ప్రయత్నించాడు చంద్ర. తను మాట్లాడలేదు. ఆమె వైపు వాళ్లు. 50 లక్షలు ఇస్తే కేస్ విత్డ్రా చేసుకుంటామని బేరం బెట్టారు. లేకుంటే చిప్పకూడే అని భయపెట్టారు. ఆ రోజుకి కౌన్సిలింగ్ వాయిదా వేసి రెండు రోజుల తర్వాత రమ్మన్నారు. అప్పుడూ అదే ధోరణి. చంద్ర, వాళ్లవైపు వాళ్లను అరెస్ట్ చేయకుంటే ప్రైవేట్ కంప్లయింట్ వేసుకుంటామని పోలీసుల మీద ఒత్తిడి పెట్టారు. కాళ్లా వేళ్లాపడితే 25 లక్షలకు దిగారు సీనియర్ సిటిజన్స్ అనే కన్సర్న్తో చంద్ర తల్లిదండ్రులకు బెయిల్ ఇచ్చారు. నెలరోజుల్లో అతని చెల్లి పెళ్లి ఉండడంతో రాజీవికీ బెయిల్ దొరికింది. చంద్రను రిమాండ్ చేశారు. కొడుకును రిమాండ్కు పంపడంతో బేజారెత్తాడు చంద్ర తండ్రి. ‘‘50 లక్షలు ఇచ్చుకోలేను. ఇల్లు, నగలు అన్నీ తాకట్టు పెట్టి.. కొంత అప్పు తెచ్చి 25 లక్షలు మాత్రం ఇచ్చుకుంటాను నా కొడుకును వదలండి’’ అంటూ కాళ్లావెళ్లా పడ్డాడు చంద్ర తండ్రి. కూతురు పెళ్లి ఉంది.. తమ పరువు బజారుకీడ్చొద్దని బతిమాలుకున్నాడు. అయినా లాభం లేకపోయింది. మైల్డ్గా హార్ట్ఎటాక్ వచ్చింది ఆయనకు. హై బీపీతో చంద్ర తల్లీ మంచాన పడింది. తీవ్రమైన ప్రయత్నాలతో చంద్రకు బెయిల్ దొరికింది. పెళ్లి ఇష్టం లేకే.. ఫోర్ నైంటీ ఎయిట్! దాదాపు రెండేళ్లు కేస్ నడిచింది. చంద్ర బెంగుళూరు వెళ్లిన నాటి ఫ్లయిట్ టిక్కెట్లు, అక్కడ తీసుకున్న హోటల్ రూమ్ బిల్, హాజరైన ఇంటర్వ్యూ, రాత పరీక్ష వివరాలు, హాల్టికెట్ అన్నిటినీ కోర్టు ముందుంచాడు చంద్ర తరపు లాయర్. అంతేకాదు.. అసలు అమ్మాయి, అబ్బాయి ఎన్నాళ్లు కలిసి ఉన్నారు? ఎక్కడో ఉన్న అక్క ప్రభావం వీళ్ల సంసారం మీద ఎంత ఉంది? నిజంగానే అమ్మాయి పై చేయిచేసుకున్నారా? అమ్మాయి వాళ్లు పెళ్లప్పుడు 30 లక్షలు కట్నంగా ఇచ్చామని చెప్పారు. నిజంగా ఇచ్చారా? ఇచ్చినట్టు తగిన సాక్ష్యాధారలున్నాయా... వంటి విషయాలన్నిటినీ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అన్నీ అబద్ధమనే తేలాయి. కేసు నిలవలేదు. చంద్ర నిర్దోషిగా తేలాడు. మరి జ్వాల ఎందుకు అబద్ధం చెప్పింది? తనకు చంద్రతో పెళ్లి ఇష్టం లేక. ఆ విషయాన్ని పెళ్లికి ముందే చెప్పి ఉంటే హుందాగా తప్పుకునేవాడిని కదా.. నా కుటుంబాన్ని ఇంత బజారుకీడ్చాలా? ఇంత అవమానం చెయాలా? మా అక్కా, చెల్లి కూడా తనలాంటి ఆడపిల్లలే కదా.. మా అమ్మా తన తల్లిలాంటిదే కదా.. అని బాధపడ్డాడు చంద్ర. సెక్షన్ 498ఏ ఏం చెప్తోంది? భర్త, అత్తమామలు, ఆడపడుచుల గుండెల్లో దడపుట్టించే సెక్షన్ 498ఏ. భర్త గాని, ఆయన కుటుంబ సభ్యులుగానీ భార్యను క్రూరంగా హింసిస్తే, క్రూరంగా ప్రవర్తిస్తే అది 498ఏ ప్రకారం నేరమవుతుంది. నేరం రుజువైతే మూడేళ్లు శిక్ష పడుతుంది. క్రూర ప్రవర్తన అంటే.. వివాహిత మహిళ ఆమెకై ఆమె ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు కల్పించడం,ఆమెకు తీవ్రమైన గాయాలు కలిగేలాగా లేక ఆమె ప్రాణానికి, అవయవాలకు లేక ఆరోగ్యానికి భంగం వాటిల్లేలా బుద్ధిపూర్వక ప్రవర్తన. (అది శారీరకమైనది కావచ్చు లేక మానసికమైనది కావచ్చు). ఆస్తిని కాని, విలువైన వస్తువులను కాని తెమ్మని వేధించడం, తేకపోతే ఆమెను, ఆమె బంధువులను వేధించినా, అదనపు కట్నం కోసం మాటలతో, చేతలతో హింసించినా... అది క్రూరప్రవర్తనే అవుతుంది. సెక్షన్ 324 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ప్రకారం.. కట్నం ఇవ్వడం, తీసుకోవడం, ప్రోత్సహించడం కూడా నేరడమే. వధువు లేక వరుడి తల్లిదండ్రుల నుంచి గాని, వారి సంరక్షకుల నుంచి గాని ప్రత్యక్షంగా, పరోక్షంగా కట్నం డిమాండ్ చేస్తే అదీ నేరమే. ఈ నేరాలకు గరిష్టంగా అయిదేళ్లు, కనిష్టంగా ఆరునెలల నుంచి రెండేళ్ల వరకు శిక్ష, జరిమానా ఉంటాయి. 498ఏను ఒక రక్షణ కవచంలా ఉపయోగించుకోవాల్సిన మహిళలు దాన్ని ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని సుప్రీంకోర్టు అనే సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసింది. తగిన సాక్ష్యాధారాలు లేకుండా భర్తను, అత్తామామను, ఆడపడుచులను అరెస్ట్లు చేయరాదని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కొన్ని సవరణలు కూడా జరిగాయి. అలాగు కొందరు మహిళలు తీవ్రమైన ఆవేశానికి, ఫ్రస్ట్రేషన్కి లోనై కేసులు వేస్తున్నారని తద్వారా వివాహబంధాలు దెబ్బతింటున్నాయని భావించి కేస్ వేయగానే కౌన్సిలింగ్ నిర్వహించి సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com - సరస్వతి రమ -
ఆ భయం ఉండాలి... ఆ బెత్తం కావాలి!
ఆచార్య దేవోభవ మా వీధిలో ఒక మాస్టారు ఉండేవారు. పేరు శ్యామ్ సుందర్. అప్పటికి ఆయనకు ఓ నలభయ్యేళ్లుంటాయి. రోజూ సాయంత్రాలు ప్రైవేటు(ట్యూషన్) చెప్పేవారు. ఆయనకు కాస్త కాలు అవుకు (ఫిజికల్లీ ఛాలెంజ్డ్). గొడుగు కర్రను పోలి ఉండే ఒక చేతికర్ర సాయంతో నడిచేవారు. చెప్పిన పాఠం సరిగా అప్పజెప్పలేని పిల్లలు భయంతో వెనక్కి వెనక్కి వెళిపోతుంటే... ఆ కర్రనే తిరగేసి మెడకో, కాలికో వేసి తన దగ్గరగా లాక్కునేవారు. దగ్గరగా వెళ్లేసరికే సగం పాఠం గుర్తొచ్చేసేది. లేకపోతే ఒక్క తొడపాశం, మరుసటిరోజు పాఠం అప్పజెప్పేవరకు గుర్తుండేది. బడినుంచి ఇంటికొచ్చాక పుస్తకం ముట్టుకోని పిల్లల్ని ఆయన దగ్గర ప్రైవేటుకు పంపేవాళ్లు. స్కూల్లో మాట వినని అల్లరోళ్లని అక్కడికే పంపించమని తల్లిదండ్రులకు టీచర్లే రికమండ్ చేసేవాళ్లు. పిల్లల్ని చదివించడంలో... చదువును దారిలో పెట్టడంలో ఆయనకు అంత పేరు. హైస్కూల్లో సుబ్బారావుగారు కూడా అంతే. హెడ్ మాస్టర్. టేబుల్ మీద ఎప్పుడూ రూళ్ల కర్ర, చెక్క స్కేలు మెరుస్తూ ఉండేవి. దెబ్బ బాగా తగలడానికి రోజూ మాస్టారు వాటికి ఏదో కొత్తరకం నూనె రాస్తున్నారని మేమంతా చెప్పుకునేవాళ్లం. మాస్టారు కంటే ముందు మేము వాటినే చూసేవాళ్లం. ఆయన చేతికి అవి ఎంత దగ్గరగా ఉంటే మేము ఆయనకు అంత దూరంగా నిలబడేవాళ్లం. సుబ్బారావు మాస్టారు ఉన్నారన్న ఉనికే స్కూల్ మొత్తాన్ని అటెన్షన్ లో ఉంచేది. దెబ్బ తినేంత తప్పు చేసినవాళ్లు, మెచ్చుకునేంత ఒప్పు చేసినవాళ్లు తప్ప ఆయనకు చేతికందే దూరంలో నిలబడిన విద్యార్థులు ఎవరూ లేరు. అలాగని బాగా కొట్టి భయపెట్టేవారా అంటే కాదు. ఆయన పిల్లల చేతిమీద కొట్టిన దానికంటే బల్లమీద కొట్టిందే ఎక్కువ. ఆ శబ్దం చాలు క్లాసురూము లైబ్రరీగా మారడానికి, చేతులు కట్టుకుని దూరంగా నిలబడిన విద్యార్థి కాళ్లు వణకడానికి. ఇప్పుడు స్కూల్లోనే టీచరు. అప్పుడు ఊళ్లోనూ టీచరే. వాళ్లు తిరిగే వీధిలో ఆటల్లేవు.. వాళ్లు ఎక్కిన బస్సుల్లో అల్లరిలేదు. కాలం మారింది. ఇప్పుడంతా ఫ్రెండ్లీ కల్చర్. ఈ ఫ్రెండ్లీ కల్చర్ గురుశిష్యులు కలిసి సరదాలు పంచుకోడానికి ఎంత పనికొస్తుందో, విద్యార్థులకు విలువల్ని నేర్పడానికి ఉపాధ్యాయులకు అంతగా అడ్డొస్తోంది. భయం, బెత్తం లేక ఫ్రెండ్లీ కల్చర్ కారణంగా ఏర్పడిన దగ్గరతనం వల్ల కొన్నిసార్లు వినకూడని విషయాల్లో ఉపాధ్యాయుల పేర్లు వినాల్సి వస్తోంది. మంచి చెడు తేడా తెలియని పసివాళ్లను, ఆడపిల్లల్ని తమ ఒడినుంచి బడికి పంపిస్తున్న కన్నవాళ్ల గుండెల్ని కుదిపేసే దారుణాలు చూడాల్సివస్తుంది. ఒక ఘోరం జరిగింది అనే బాధకంటే, అందుకు ఒక టీచర్ కారణం అనే వేదన సమాజాన్ని తొలిచేస్తుంది. ఆచార్యదేవోభవః అనడానికి నాలుక తడబడుతుంది. ఊళ్లో పిల్లలు ఎవరైనా తప్పుచేస్తే నువ్వు ఎవరి తాలూకు అని అడగడంకంటే ముందు ‘నీకు చదువు చెప్పింది ఎవర్రా?’ అనేవారు. అదీ సమాజంలో టీచర్ స్థానం. ఇప్పుడు అదే ప్రశ్న చెవుల్లో తిరుగుతోంది. టీచరంటే కాస్త భయం.. ఆ టేబుల్ మీద ఒక బెత్తం రేపటి సమాజానికి అవసరమనిపిస్తోంది. బెత్తంతో ఒక్క దెబ్బ కొడితే మారిపోయే జీవితాలు... చట్టంతో, సంకెళ్లతో భయపెట్టినా పట్టనంత ఘోరంగా మారిపోయాయి. దేశ భవిష్యత్తే కాదు... మనిషిలో సరైన ఆలోచనా నిర్మాణం కూడా తరగతి గదుల్లోనే రూపుదిద్దుకోవాలి. అదే సరైన సమాజాన్ని నిర్మిస్తుంది. అందుకోసం... ఉపాధ్యాయుల ముందు చేతులు కట్టుకునేంత భయం, ఆ భయాన్ని గుర్తుచేసే బెత్తం కావాల్సిందే! ఉపాధ్యాయ వృత్తిని ఉద్యోగంగా కాక, సామాజిక బాధ్యతగా, కొన్ని తరాలను నడిపించే దిక్సూచిగా భావించి ప్రేమిస్తున్న ప్రతి గురువుకు వందనం. - పూడి శ్రీనివాసరావు -
కార్మిక చట్టాలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక హక్కుల చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ అనుబంధ యూనియాన్ మున్సిపల్ వర్కర్స్ యూనియాన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏసురత్నం విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని యూనియాన్ భవనంలో జిల్లా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతం రూ.18 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులే లేకుండా చేస్తానని ఎన్నికల ముందు హామీమి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సంవత్సరాలు గడిచిన ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నేరవేర్చకపోవడమే కాకుండా యూనియాన్ సమావేశాలకు హాజరైతే పని నుంచి తొలగిస్తామని బెదిరింపులు పల్పడుతున్నారని పేర్నొన్నారు. కార్మికులు సంఘటితంగా ఉంటనే సమస్యల పరిష్కమవుతాయన్నారు. 15 డిమాండ్లును నేరవెర్చాలని సెప్టెంబర్ 2న దేశ వ్యాప్త సమ్మెలో అన్ని యూనియాన్ల పాటు కార్మికులు పాల్గొటారని పేర్కొన్నారు. ఈ నెల 30న జిల్లాలో అన్ని మున్సిపల్ కార్మికులు బైక్ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్, మున్సిపల్ కార్మిక అధ్యక్షుడు ముడుపు ప్రభాకర్రెడ్డి, నాయకులు కాంతారావు, బాపురావు, సంతోష్, పోషెట్టి పాల్గొన్నారు. -
రమ్య యాక్టు తేవాలి
నల్లకుంట: జూబ్లీహిల్స్లో జూలై 1న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలు పునరావృతం కాకుండా రమ్య పేరిట యాక్టు తేవాలని దివంగత రమ్య తల్లి రాధిక ప్రభుత్వాన్ని కోరారు. నిర్భయం చట్టం తరహాలో ‘రమ్య’ యాక్టును రూపొందించాలని కోరారు. మంగళవారం డీడీ కాలనీలో విలేకరులతో మాట్లాడుతూ తిథి ప్రకారం రమ్య పుట్టిన రోజైన ఆగష్టు 24న విద్యాసంస్థల్లో రమ్య ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరారు. మద్యం మత్తులో యువకులు చేసిన తప్పిదానికి నాలుగు కుటుంబాలు, మూడు తరాలు బలయ్యాయన్నారు. మద్యానికి బానిసలవుతున్న యువకులకు బుద్ధి చెప్పేందుకు రమ్య యాక్టును తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రమ్య ఘటన తర్వాత కూడా అనేక సంఘటనలు జరుగుతుండటం దారుణమన్నారు. అన్ని పాఠశాలల్లో బుధవారం ప్రార్ధన సమయంలో రెండు నిమిషాలు మౌనం పాటించి రమ్యకు నివాళులర్పించి, తమకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశౠరు. ప్రజలు, విద్యా సంస్థల మద్దతుతో రమ్య యాక్టును సాధిస్తామని, అందుకు ప్రభుత్వం సహకరిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. -
భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలి
భువనగిరి అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణాల్లో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూ సేకరణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వేముల మహేందర్ అన్నారు. శనివారం పట్టణంలోని సుందరయ్య భవన్లో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు 123 జీఓను కొట్టివేసిన తిరిగి మళ్లీ ఆ జీఓపై కోర్టుకు అప్పీలు చేస్తూ రైతులకు, నిర్వాసితులకు నష్టం కలిగించే విధానాలు ప్రభుత్వం అవలంబిస్తున్నట్లు చెప్పారు. అలాగే గత 4 నెలలుగా ఉపాధి కూలీలకు పని చేసిన వేతనాలు రావటం లేదని ఇప్పటికైన వెంటనే చెల్లించాలన్నారు. 2వ ఏఎన్ఎంలు గత 25 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు పల్లేర్ల అంజయ్య, డివిజన్ నాయకులు దయ్యాల నర్సింహ, మండలశాఖ అధ్యక్షుడు ఎస్. ఎల్లయ్య, నాయకులు రవి, ప్రభాకర్, కిషన్, భిక్షపతి పాల్గొన్నారు. -
కలప అక్రమ రవాణా నిరోధానికి చట్టం
డీఎఫ్వో శేఖర్బాబు పర్యటన సీలేరు: విశాఖ ఏజెన్సీలో విలువైన అటవీ కలప దొంగదారి పట్టకుండా ర వాణా నిరోధానికి ప్రభుత్వం అటవీ శాఖ చట్టాల్లో పెనుమార్పులను తీసుకు వచ్చిందని నర్సీపట్నం డీఎఫ్వో శేఖర్బాబు అన్నారు. బా ధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి సీలేరు రేంజీలో గురువారం పర్యటించారు. విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ఫారెస్ట్ యాక్టు ప్రకారం 1967 లో మార్పులు చేసిన ప్రకారం ఫారెస్ట్ కేసులన్నీ నాన్బెయిల్బుల్ కేసులుగా మార్పు చేసినట్టు తెలిపారు. ఈయాక్టు వచ్చిందని, దీంతోపాటు రూల్స్ రావాల్సి ఉన్నందున వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. కలప అక్రమ రవాణా నివారించేందుకు దారకొండ, చింతపల్లి తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఉన్నాయని, వీటితోపాటు 2 వెహికల్ పోస్టులు నిఘా పెట్టినట్టు తెలిపారు. 2029 నాటికి జీయోగ్రఫీకల్ ఆఫ్ ఏపీగా తీర్చిదిద్దుతాం.. 2029 నాటికి ఏపీలో 50 శాతం జీయోగ్రఫీకల్ ఆఫ్ ఏపీ మొక్కలు ఉండే ప్రదేశంగా తీర్చిదిద్దిందేకు వనం–మనం కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. నర్సీపట్నం అటవీశాఖలో 225 హెక్టార్లలో వివిధ రకాల మొక్కలతో పాటు, 40 ఎకరాల్లో ఔషధజాతి మొక్కలు (నేషనల్ మెడికల్ ప్లాంట్ బోర్డు) నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. 160 హెక్టార్లలో టేకు, ఇతర జాతి మొక్కలను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గత ఏడాది చేపట్టిన 280 హెక్టార్లలో వుడా మెయింట్నెన్స్ పనుల కింద చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటనున్నట్టు వివరించారు. రిజర్వ్ ఫారెస్ట్లో ఖాళీ ప్రదేశాలను గుర్తించి హెక్టార్కు 200 మొక్కలు పెంచేందుకుప్రభుత్వం ఎ¯Œæఆర్ఈజీఎస్ నిధులతో ట్రీగార్డులు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇచ్చిందన్నారు. హెలీకాప్టర్ ద్వారా విత్తనాలు చల్లేందుకు ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. డివిజన్ పరిధిలో 7 లక్షల వరకు నర్సరీలో మొక్కలు ఉన్నాయని వీటిని ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఫీల్డ్వోకు 0–50 పైసలకు పంపిణీ చేస్తామని వివరించారు. -
పుష్కర పనుల్లో బాలకార్మికులు!
మంగళగిరి(గుంటూరు):ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో కార్మిక చట్టాలను పాతరేస్తూ కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తోందని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఎంత ఘోషిస్తున్నా పట్టించుకోకపోగా పుష్కర పనుల్లోనూ తిరిగి అదే తప్పు చేస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాజధాని నిర్మాణంలో కార్మిక చట్టాలను ఉల్లంఘించి పనులు చేయిస్తుండడంతో కొంత మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది వికలాంగులుగా మారిన విషయం విదితమే. అయినా తీరుమార్చుకోని ప్రభుత్వం ఇప్పుడు పుష్కర పనులను హడావుడిగా చేయించేందుకు పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల నుంచి 15 ఏళ్ల వయస్సు దాటని పిల్లలను తరలించడం చూస్తుంటే కాంట్రాక్టర్లు తప్పుచేసినా ప్రభుత్వం ఏమీ చేయదనే భరోసానిచ్చినట్లుగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కరాల నేపథ్యంలో విద్యుద్దీకరణ, ఘాట్లలో టైల్స్ పనులు నిర్వహించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా కార్మికులను రైళ్లల్లో తరలిస్తున్నారు. కార్మికులను తరలించడంలో తప్పు లేకపోయినా 14, 15 ఏళ్ల వయస్సుగల పిల్లలను పనులకు తీసుకురావడం బాధాకరం. గురువారం మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి వాహనాల్లో కార్మికులను తరలిస్తుండగా అందులో బాలకార్మికులను సాక్షి పలుకరించగా తాము పశ్చిమబెంగాల్ వాసులమని, విద్యుత్ పనుల కోసం రోజుకు రూ.300 కూలి ఇస్తామని చెప్పడంతో వచ్చినట్లు పేర్కొన్నారు. అందేది రూ.600.. దక్కేది రూ.300 కార్మికులను తరలిస్తున్న దళారి ‘వారితో మీకేంటి మాటలు’ అంటూ బాలకార్మికులను గద్దించి ఆటో ఎక్కించారు. అయితే కార్మికులకు రోజుకు రూ.600లు ఇస్తున్నామని దళారి చెప్పడం విశేషం. ఇలా ఒక్కో కార్మికుడి నుంచి రూ.300 దళారి జేబులోకి వెళతాయని దీనిని బట్టి ఇట్టే అర్థమవుతోంది. చేసిన కష్టానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వకుండా కార్మికులను దళారులు దోచుకుంటున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. -
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదు
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం గుడిపూడి ఎస్టీ కాలనీలో పేదల గుడిసెలు ఉన్నపళంగా కూల్చి వేసేందుకు అధికారులు చట్టాలను చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లంచర్ల సాంబశివరావు గహంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2000 సంవత్సరంలో సుమారు 312 మందికి పైగా నిరుపేదలకు నివేశన స్థలాల పట్టాలు ఇచ్చారని, గత కొంతకాలంగా తమను ఖాళీచేయించాలనే ప్రయత్నాలు స్థానిక నాయకులు చేస్తుండటంతో పేదలు గమనించి కోర్టును ఆశ్రయించారన్నారు. గహాలు నిర్మించుకోక పోవడం వల్ల ఖాళీ చేయిస్తున్నామని ప్రభుత్వం తరఫున కోర్టులో వాదన వినిపించారని, నిజంగా ఇళ్ళు వేసుకోకపోతే డ్యూ ప్రాసెస్ ప్రకారం నోటీసులు ఇచ్చి వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇంతవరకు డ్యూ ప్రాసెస్ చేపట్టకుండానే రెవెన్యూ అధికారులు రికార్డులను ట్యాంపరింగ్ చేస్తున్నారని అంబటి ఆరోపించారు. హఠాత్తుగా ఖాళీ చేయించేందుకు ప్రొక్లెయిన్లతో, పోలీసు బలగాలతో వెళ్లారని, ఇది మంచిది కాదన్నారు. నిజంగా గహాలు నిర్మించుకోకపోతే చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి వారిని ఖాళీ చేయించాలన్నారు. కేవలం స్థానిక ఎమ్మెల్యే, వారి తాబేదారుల ఒత్తిడి మేరకు అధికారులు చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్నారని అంబటి ఆరోపించారు. కోర్టులు, చట్టాలను అధికారులు మోసం చేయడం భావ్యం కాదన్నారు. ఈరోజు అధికారంలో ఉన్న పాలకులు కాపాడవచ్చని, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడానికి ఉన్న పోలీసులను గుడిసెలు కూల్చడానికి వినియోగించడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి రాజకీయాలకతీతంగా నిరుపేదలకు న్యాయం చేయాలన్నారు. దీనిపై ఇప్పటికే జిల్లాకలెక్టర్తో మాట్లాడామన్నారు. అంతేకాక వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతల దష్టికి కూడా ఈవిషయాన్ని పేదలు తీసుకువెళ్లారన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచి వారి కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరాన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లంచర్ల సాంబశివరావు, పార్టీ మండల అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, యూత్ సెల్ పట్టణ, మండల అధ్యక్షులు అచ్యుత్ శివప్రసాద్, కళ్ళం విజయభాస్కరరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కట్టా సాంబయ్య, గుడిపూడి వాసులు తదితరులు పాల్గొన్నారు. -
పునరావాస చట్టం అమలు చేయాలి
ఆలూరు (గట్టు ) : పునరావాస చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ డిమాండ్ చేశారు. ఆదివారం గట్టు మండలంలోని ఆలూరు గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005లో ఈ గ్రామం ర్యాలంపాడుపాడు రిజర్వాయర్లో ముంపునకు గురైందన్నారు. దీంతో మూడువేల ఎకరాలను రైతులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. పరిహారం చాలా తక్కువగా ఇచ్చినట్లు ఆరోపించారు. చెరువులో ముంపునకు గురైన 32 ఎకరాలకు పరిహారమే ఇవ్వలేదన్నారు. పునరావాస కేంద్రంలో పూర్తిస్థాయిలో ప్లాట్లు కేటాయించలేదని, కనీస సౌకర్యాలు కల్పించకుండా గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు అన్నివిధాలా న్యాయం చేయాలన్నారు. ఈనెల 26న పోరాట నిర్వాసిత కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ఉప్పేరు నర్సింహ, రాజు, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు నియంత్రణ చట్టం అమలుకు చర్యలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పొగాకు నియంత్రణ చట్టం అమలుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ–2 పి.రజనీకాంతారావు ఆదేశించారు. తన చాంబర్లో జిల్లాస్థాయి పొగాకు నియంత్రణ కార్యక్రమం అమలు కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. పొగాకు నియంత్రణ చట్టం 2003 ప్రకారం సిగరెట్లు, సిగార్లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలా, ఖైనీలను ఆస్పత్రులు, విద్యా సంస్థలు, గ్రంథాలయాలు, ఆడిటోరియం, స్టేడియం, రైల్వేస్టేషన్లు, బస్స్టాప్ వంటి ప్రాంతాల్లో అమ్మకం, సేవించడం నిషేధమన్నారు. పొగాకు ఉత్పత్తులపై ప్రచారం చేస్తే శిక్షార్హులని పేర్కొన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులతో ర్యాలీ, మానవహారం నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మెండ ప్రవీణ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ రత్నకుమారి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ధవళ భాస్కరరావు, డీఐఓ డాక్టర్ ఎ.హేమంత్, దంతవైద్యులు డాక్టర్ వినోద్, డిప్యూటీ డీఈఓ ప్రభాకరరావు, ఆర్వీఎం పీఓ పాల్గొన్నారు. -
చట్టం దూరంగా ఉంచింది... బంధం దగ్గర చేసింది!
కేస్ స్టడీ రజనీ, మాధవ్లది అన్యోన్య దాంపత్యం. వివాహమై ఎనిమిదేళ్లైనా ఏమాత్రం వారి మధ్య అపోహలు అపార్థాలు లేవు. ఉద్యోగంలో, ఇంటిపనిలో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటారు. ఒక పూట వంట రజని చేస్తే, మరో పూట మాధవ్ చేస్తాడు. ఇరువురు ఒకే సంస్థలో ఉద్యోగం చేసుకుంటారు. కానీ కడివెడు పాలల్లో ఒక విషం బొట్టులా ఆర్నెల్ల క్రితం రజనీ మేనత్త పల్లెటూరి నుండి వచ్చింది. తనకు ఏ దిక్కూ లేదని, మేనకోడలింట్లో పెద్ద దిక్కుగా ఉంటానని తిష్ట వేసింది. ఇకనేం రజనీ మనస్సులో రోజూ విషం చిమ్మే కబుర్లు మొదలెట్టి, భార్యాభర్తల మధ్య చిచ్చు రగిల్చింది. చినికి చినికి గాలివానై విడాకుల వరకు వెళ్లింది. కేసు విచారణ ముగిసింది. జడ్జిగారికి విడాకులకు కారణాలు కన్పించలేదు. కేస్ కొట్టివేస్తే అప్పీల్కు వెళ్తారు. ఈ లోగా ఇరువురి మధ్య ద్వేషం పెరుగుతుంది. అందుకే ప్రత్యామ్నాయ ఉపశమనంగా సెక్షన్ 13-ఎ ప్రకారం అంటే ఆల్టర్నేటివ్ రిలీఫ్గా వారికి ‘జుడీషియల్ సపరేషన్’ ఆర్డర్స్ ఇచ్చారు. ఇది భార్యాభర్తల మధ్య వివాహం రద్దు పరచదు. కేవలం ఒక కప్పు కింద సంసారం చేసే బాధ్యతను రద్దు పరచి, పరస్పరం ఆలోచించుకొని సర్దుబాటు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. కోర్టు ఆర్డర్స్ ప్రకారం రజనీ, మాధవ్లు వేరువేరుగా కొంతకాలం ఉన్నారు. తమ లోపాలను, ఆలోచనా విధానాలను సరిదిద్దుకున్నారు. అపోహలు తొలిగాక హాయిగా కలిసి కాపురం చేస్తున్నారు. రజనీ మేనత్తను సాగనంపారు. న్యాయమూర్తిగారు సెక్షన్ 13ఎ హిందూ వివాహచట్టం ప్రకారం ఆల్టర్నేటివ్గా జుడీషియల్ సపరేషన్ ఆర్డర్స్ ఇచ్చి వారికి కాపురం నిలబెట్టుకునే అవకాశం ఇచ్చారు. -
విజయ్ తో చేయాలని ఉంది
వర్ధమాన నాయికలు ప్రముఖ కథానాయకుల సరసన నటించే అవకాశం రావాలని ఆశపడడం సాధారణ విషయమే. నటి కీర్తీసురేష్ అలా కోరుకోవడంలో ఆశ్చర్యం ఏముంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఒకప్పుడు కోలీవుడ్లో హీరోయిన్ల కొరత చాలా ఉండేది. నయనతార, త్రిష, కాజల్అగర్వాల్, తమన్న, అనుష్క లాంటి వారే ప్రముఖ కథానాయకులతో నటించేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. హన్సిక, కీర్తీసురేష్, శ్రీదివ్య, క్యాథరిన్ ట్రెసా వంటి వర్ధమాన హీరోయిన్లు పోటీగా తయారయ్యారు. దీంతో హీరోయిన్లకు కొరత లేకుండాపోయింది. అంతేకాదు దర్శక నిర్మాతలకు పారితోషికాల విషయంలో బేరసారాలాడి నాయికల్ని ఎంపిక చేసుకునే అవకాశం కలుగుతోంది. అదే విధంగా ఇప్పుడు చిత్రానికో కొత్త నాయకి పరిచయం అవడంతో పలాన ప్రముఖ నాయకిలా ఉన్నావంటూ వారికి ప్రాచుర్యం తెచ్చిపెట్టడంతో ఆయా ప్రముఖ నాయికలు తమ అవకాశాలను తన్నుకు పోతారనే భయంతో తమ పారితోషకాలను దగ్గించుకోవడానికి సిద్ధపడుతున్నారని కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. విషయం ఏమిటంటే విజయ్ తాజాగా నటిస్తున్న తెరి చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇది తనకు 60వ చిత్రం అన్నది గమనార్హం. విజయాప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరతన్ దర్శకుడు. ఇందులో కథానాయికగా కాజల్ అగర్వాల్ నటించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఆమె ఇందులో నటించడానికి రెండున్నర కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారంలో ఉంది. తాజాగా వర్ధమాన నటి నటి మియాజార్జ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆమె ఆ ప్రచారాన్ని కొట్టివేయడంతో ఇప్పుడు మరో యువ నటి కీర్తీసురేష్ పేరు వార్తలో తేలుతోంది. దీని గురించి ఆ అమ్మడిని అడగ్గా విజయ్తో నటించాలని తనకూ చాలా ఆశగా ఉంది. అలాంటి అవకాశం వస్తే వదులుకోను అనిబదులిచ్చింది. అన్నట్టు ఈ బ్యూటీ నటించిన రజనీమురుగన్ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో వీరవిహారం చేస్తోంది. దీంతో కీర్తీసురేష్ ఆనందానికి అవధుల్లేకుండాపోతున్నాయి. మరి ఈ ముద్దుగుమ్మకు ఇళయదళపతితో నటించే అవకాశం అంత త్వరగా వస్తుందా? చూద్దాం ఈ భామ అదృష్టం ఎలాగుందో. -
ముష్కరులపై చర్యలను ఆశిస్తున్నాం
న్యూఢిల్లీ: పంజాబ్లోని పఠాన్కోట్లో ఉగ్రవాదుల దాడి ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై ఉగ్రవాదులపై పాక్ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని అమెరికా అత్యున్నత అధికారి ఒకరు తెలిపారు. దాడికి కుట్రపన్నిన ఉగ్రవాదులపై చర్యలకు ఉపక్రమిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. దక్షిణాసియాలో ఉగ్రవాదం అందరికీ సవాల్ విసురుతోందని అమెరికా వ్యాఖ్యానించింది. ఉగ్రవాద నిర్మూలనకు అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చింది. మరోవైపు పఠాన్కోట్లో ఉగ్రదాడిని పాకిస్థాన్ విదేశాంగశాఖ ఖండించింది. పఠాన్కోట్ మృతులకు సంతాపం తెలిపిన విదేశాంగ అధికారి కిర్పి.. ఉగ్రవాదాన్ని ఉమ్మడి సమస్యగా ప్రపంచ దేశాలు గుర్తించాలని కోరారు. భారత్ అందించిన సమాచారం ఆధారంగా పనిచేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.