Ajay Jain
-
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం సర్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇటీవలి బదిలీల అనంతరం కొన్ని సచివాలయాల్లో నిర్ణీత సంఖ్య 8మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండగా మరికొన్నింటిలో తక్కువ మంది ఉన్నారు. అన్ని చోట్లా సమాన సంఖ్యలో ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం రేషనలైజేషన్ (సర్దుబాటు)కు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలతో గ్రామ, వార్డు సచివాలయాలు – వలంటీర్లు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగులున్నారు. ప్రస్తుతం దాదాపు 7,900 సచివాలయాల్లో 8 మందికంటే ఎక్కువగానే ఉద్యోగులు ఉన్నారు. సుమారు 3,300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు. మిగిలిన చోట్ల 8 మంది చొప్పున పనిచేస్తున్నారు. ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉన్న సచివాలయాలకు ఉద్యోగులను సర్దుబాటు చేయనున్నారు. 8 మంది పనిచేస్తున్న చోట ఎవరికీ బదిలీలు ఉండవని అధికారులు తెలిపారు. ఈ çసుమారు 5,000 మందికి స్థానచలనం కలుగుతుందని వెల్లడించారు. జిల్లాల ప్రాతిపదికన కలెక్టర్ల ఆధ్వర్యంలో సర్దుబాటు జరుగుతుందని తెలిపారు. ఏ జిల్లాలోని వారికి ఆ జిల్లాలోనే బదిలీ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే రానున్న పది పదిహేను రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. విధివిధానాలివీ.. ♦ ఏ కేటగిరీ ఉద్యోగుల ఖాళీలో అదే కేటగిరీ ఉద్యోగితోనే సర్దుబాటు ♦ జిల్లా ప్రాతిపదిక జిల్లాల పరిధిలోనే సర్దుబాటు ♦ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సచివాలయాలకే బదిలీ ♦ ఎక్కడైనా భార్య, భర్త వేర్వేరు సచివాలయాల్లో పనిచేస్తుంటే, వారి అభ్యర్ధన మేరకు ఇరువురికీ ఒకే చోటకు బదిలీకి అవకాశం కల్పిస్తారు. వీరికి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు కూడా అవకాశం కల్పిస్తారు. ♦ గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల ఉద్యోగులు, వార్డు సచివాలయాల్లో మూడు కేటగిరీ ఉద్యోగులకు మాత్రమే పరిమితమై ఈ సర్దుబాటు ఉంటుంది. ♦ గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల్లో.. మొదట ప్రాధాన్యతగా గ్రామ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లతో సర్దుబాటు ప్రక్రియ సాగుతుంది. అప్పటికీ సర్దుబాటు చేయాల్సిన సచివాలయాలు మిగిలితే రెండో ప్రాధాన్యతగా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీసు)తో సర్దుబాటు చేస్తారు. మూడో ప్రాధాన్యతలో డిజిటల్ అసిస్టెంట్లు, అప్పటికీ మిగిలిపోతే నాలుగో ప్రాధాన్యతగా పంచాయతీ కార్యదర్శి విభాగాలు ఉంటాయి. ఇలా ప్రాధాన్యతల వారీగా సర్దుబాటు చేస్తారు. ♦ వార్డు సచివాలయాల్లో మొదటి ప్రాధాన్యతగా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, రెండో ప్రాధాన్యతలో మహిళా పోలీసు, మూడో ప్రాధాన్యతగా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విభాగాలు ఉన్నాయి. ♦ ఉద్యోగులతో నేరుగా కౌన్సెలింగ్ ద్వారా ఈ సర్దుబాటు ప్రక్రియ చేపడతారు -
దేశానికే ఆదర్శంగా జగనన్న కాలనీల్లో ఇంధన పొదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదల కోసం నిర్మిస్తున్న గృహాల్లో ఇంధన సామర్థ్య చర్యలను దేశానికే రోల్ మోడల్గా అమలు చేయనున్నట్లు ఏపీ గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ తెలిపారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సీఈవో విశాల్ కపూర్ తరఫున సీనియర్ ఎగ్జిక్యూటివ్లు అనిమేష్ మిశ్రా, నితిన్భట్, సావిత్రిసింగ్, పవన్లు అజయ్ జైన్ను కలిసినట్లు ఈఈఎస్ఎల్ దక్షిణాది రాష్ట్రాల సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం... హౌసింగ్ ఎండీ లక్ష్మీశా, జేడీ శివప్రసాద్, హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ గురించి ఈఈఎస్ఎల్ అధికారులకు వివరించారు. అజయ్ జైన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్ఎల్, కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్దదైన ఇంధన సామర్థ్య కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనుందని తెలి పారు. సీఎం జగన్ సూచన మేరకు వైఎస్సార్–జగ నన్న కాలనీల్లోని ఇళ్లకు అత్యంత నాణ్యమైన స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పరికరాలను గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలోనే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అందించనుందని తెలిపారు. ప్రతి ఇంటికి 4 ఎల్ఈడీ బల్బులు, 2 ఎల్ఈడీ ట్యూబ్లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ బీఎల్డీసీ ఫ్యాన్లను మార్కెట్ ధర కన్నా తక్కువకు ఈఈఎస్ఎల్ సహకారంతో సమకూర్చనున్నట్లు చెప్పారు. అయితే ఇది స్వచ్చందమేనని, లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ పరికరాలు తీసుకోవాలని లేదన్నారు. ఈ పరికరాలను వినియో గించడం వల్ల ప్రతి ఇంట్లో ఏటా 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందని ఈఈఎస్ ఎల్ అంచనా వేసిందని తెలిపారు. దాని ప్రకారం ఫేజ్–1లోని 15.6 లక్షల ఇళ్లకు రూ.352 కోట్ల వార్షిక ఇంధనం ఆదా అవుతుందని అజయ్ జైన్ వివరించారు. -
అమరావతిలో 47వేల గృహాలకు జూలై 8న శంకుస్థాపన: అజయ్జైన్
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థలాలను ఇప్పటికే ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 47వేల గృహాలకు జూలై 8న శంకుస్థాపన చేయనున్నట్టు గృహనిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా అజయ్ జైన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 50వేల మంది నిరుపేదలకు మే 26వ తేదీన సీఎం జగన్ చేతులమీదుగా ఇళ్ల పట్టాలిచ్చాం. కేంద్రం తొలిదఫాగా 47వేల ఇళ్లను మంజూరు చేసింది. రెండో దశలో మరో 3వేల ఇళ్లు మంజూరవుతాయి. ఇప్పటికే ల్యాండ్ లెవెలింగ్ కోసం సీఆర్డీఏకి రూ.30కోట్లు ఇచ్చాం. ఎల్లుండి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరుగనుంది. తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై నిర్ణయాలు తీసుకుంటాం. లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల జారీ సహా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, షేర్వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. దశలవారీగా ఆరు నుంచి 9 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: వృత్తి నిపుణుల జాబితాలోకి కౌలు రైతులు -
గ్రీన్కార్డులపై ‘కంట్రీ లిమిట్’ తొలగించండి
వాషింగ్టన్: గ్రీన్కార్డులపై 7 శాతంగా ఉన్న కంట్రీ లిమిట్ను తొలగించాలని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ భారత–అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ జైన్ భుతోరియా అమెరికా పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిమితి వల్ల గ్రీన్కార్డుల కోసం అర్హులైన వారు సుదీర్ఘీకాలం నిరీక్షించాల్సి వస్తోందని చెప్పారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లో భారతఅమెరికన్ పార్లమెంట్ సభ్యుడు రో ఖన్నా ఆధ్వర్యంలో తాజాగా జరిగిన యూఎస్–ఇండియా సదస్సులో అజయ్ జైన్ మాట్లాడారు. హెచ్–1 వీసాలపై లేని కంట్రీ లిమిట్ గ్రీన్కార్డులపై ఎందుకని ప్రశ్నించారు. అమెరికాలో ఇప్పుడు 8,80,000 మంది గ్రీన్కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. వీరిలో భారత్, చైనా నుంచి వచ్చినవారి సంఖ్య అధికంగా ఉందన్నారు. పదేళ్లకుపైగా నిరీక్షిస్తున్నవారు చాలామంది ఉన్నారని గుర్తుచేశారు. చట్టాన్ని మార్చకపోతే మరో 50 సంవత్సరాలు ఎదురు చూడక తప్పదని తేల్చిచెప్పారు. -
ఇందులో తప్పేంటి బాబూ?
సాక్షి, అమరావతి : ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పని చేయడానికే ‘వలంటీర్ల’ వ్యవస్థ పుట్టుకొచ్చింది. ప్రభుత్వ పథకాలను మరింత సమర్థంగా ప్రజలకు చేరవేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి ప్రతిరూపమే ఈ వ్యవస్థ. దాన్ని వారు సమర్థంగా నెవరేరుస్తూ వస్తున్నారు కూడా!!. నెలవారీ పింఛన్ల నుంచి మొదలుపెడితే... వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నది వారే. పైపెచ్చు వారేమీ రెగ్యులర్ పేస్కేళ్లలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల్లాంటి వారు కారు. ఇది... గౌరవ వేతనంపై సేవలందిస్తున్న వ్యవస్థ. అసలు వీరిని నియమించిందే ప్రభుత్వానికి– ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా అయినపుడు వారు ప్రజల వద్దకు వెళ్లటం తప్పెలా అవుతుంది? ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? దీనిపై మీరెంత సంతృప్తిగా ఉన్నారు? వంటి అంశాలను తెలుసుకోవటానికి వారు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, గృహ సారథులతో పాటు ప్రజల వద్దకు వెళితే తప్పేమయినా ఉందా? అసలెందుకు చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నారో తమకర్థం కావటం లేదని అటు ప్రభుత్వ యంత్రాంగం, వలంటీర్ల వ్యవస్థతో పాటు ఇటు బాబు తీరును నిశితంగా గమనిస్తున్న వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడి హయాంలో జన్మభూమి కమిటీల పేరిట పార్టీ కార్యకర్తలను నియమించి మొత్తం గ్రామాల్లోని వాతావరణాన్ని రాజకీయ పూరితం చేసేశారు. ఈ కమిటీల్లో ఉన్నది తెలుగుదేశం నాయకులే కావటంతో... వారు ఏ పథకాలనైనా ఇతర అర్హతలన్నీ పక్కనబెట్టి టీడీపీ వారికే ఇచ్చేవారు. టీడీపీ సానుభూతిపరులు కాని వారికి అప్పటిదాకా ఉన్న పథకాలను కూడా నిలిపేసి దారుణమైన పరిస్థితులు సృష్టించారు. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని, అర్హులైన వారికి పార్టీలకతీతంగా పథకాలు అందాలనే ఉద్దేశంతో... వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన చేశారు ముఖ్యమంత్రి జగన్. ప్రభుత్వ పథకాలను సమర్థంగా ప్రజలకు చేరవేస్తున్న వీరు... ఆ క్రమంలో సహజంగానే ఆయా పథకాల ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, గృహసారథులతో మమేకమై పాల్గొంటున్నారు. దీన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేయటమెందుకో... అసలు వలంటీర్లంటే అంత వణుకెందుకో ఎవ్వరికీ అర్థం కాదు. ప్రజలకు మరింత మేలు.. ప్రజలకు పథకాలు అందాయా లేదా అనే విషయంపై గ్రామ, వార్డు వలంటీర్లు సర్వే చేయడాన్ని తప్పుపట్టా ల్సిన అవసరం లేదు. అర్హులైన వారికి పథకాలు అందకపోతే ఆ వివరాలను వారు నమోదు చేస్తారు. అర్హులైన వారికి పథకాలు అందకపోతే, అలాంటి వారికి ఏడాదిలో రెండుసార్లు.. జూన్, డిసెంబర్ నెలల్లో ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించడం, సర్వే చేయడం ఇది కొత్త కాదు. రెండేళ్లుగా ప్రతి నెల చివరి శుక్ర, శనివారాల్లో సిటిజన్ ఔట్ రీచ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల సమక్షంలో సర్వే చేస్తే ఎక్కడైనా తప్పులుంటే తెలుస్తాయి. ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో ప్రజాప్రతినిధులతో పాటు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ సర్వేలో కూడా పాల్గొంటున్నారు. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
భారతీయుల అమెరికా వీసా ప్రక్రియలో పురోగతి
వాషింగ్టన్: అమెరికా వీసాల కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్న భారతీయుల ఇబ్బందుల్ని తొలగించేందుకు అధ్యక్ష అడ్వైజరీ కమిషన్ చేసిన సిఫార్సులను ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఆచరణలో పెడుతోంది. భారతీయుల వీసా దరఖాస్తులను విదేశాల్లోనూ త్వరగా తేల్చేలా అదనంగా దౌత్య కార్యాలయాలు, కౌంటర్లు తెరుస్తున్నారు. కోవిడ్ అనంతరం ప్రయాణ ఆంక్షలు తొలగించాక అమెరికా వీసాల కోసం భారత్ నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడటం తెల్సిందే. అమెరికాలో అభ్యసించనున్న విద్యార్థులు, పర్యటించే సందర్శకులు చాలాకాలంపాటు వేచి ఉండాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారని ప్రెసిడెన్షియల్ కమిషన్ సభ్యుడు అజయ్ జైన్ భుటోరియా వ్యాఖ్యానించారు. భారతీయ వీసా దరఖాస్తుదారులకు ప్రపంచంలో ఏ దేశంలో కుదిరితే ఆ దేశం నుంచే అక్కడి అమెరికా ఎంబసీ సిబ్బంది వర్చవల్గా ఇంటర్వ్యూలు చేసి వీసా జారీ/నిరాకరణ ప్రక్రియను పూర్తిచేయడంలో సాయపడతారు. విదేశాల్లోని అమెరికా ఎంబసీల్లో ఎక్కువ వీసా అపాయ్మెంట్ కౌంటర్లను తెరుస్తారు. సిబ్బంది సంఖ్యను పెంచుకుంటారు. ఎంబసీల్లో కొత్తగా సిబ్బందిని నియమించుకుంటారు. 400 రోజులకుపైబడిన వెయిటింగ్ సమయాన్ని 2–4 వారాలకు కుదించడమే వీరి లక్ష్యం. -
పేదల ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిరుపేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా ఉత్తమ పనితీరుతో రాష్ట్రంలోనే తొలినుంచి మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ జిల్లాలో 73,496 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకు 63,517 ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఇందులో 52,386 ఇళ్లు (82 శాతం) పునాది, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. శంకుస్థాపన చేసిన 67,437 ఇళ్లలో 42,964 (64 శాతం) ఇళ్లు, 70,221 ఇళ్లలో 42,554 (61 శాతం) ఇళ్లు పునాది, ఆపై దశల నిర్మాణంతో అన్నమయ్య, విజయనగరం జిల్లాలు రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి. విశాఖ జిల్లాలో 1.35 లక్షల ఇళ్లకు ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. వీటిలో 63,389 ఇళ్లకు శంకుస్థాపన చేయగా 9,043 ఇళ్లు పునాది, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. దీంతో ఈ జిల్లా ప్రస్తుతం ఇళ్ల నిర్మాణంలో చివరిస్థానంలో ఉంది. న్యాయపరమైన చిక్కులు వీడటంతో విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో నిర్మిస్తున్న 1.24 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఈ ఏడాదిలోనే అనుమతులు లభించాయి. ఈ ఇళ్ల నిర్మాణాలు ఇటీవల ప్రారంభం కావడం విశాఖ చివరిస్థానంలో ఉండటానికి ప్రధాన కారణం. పుంజుకున్న నిర్మాణాలు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీవర్షాల ప్రభావం ఇళ్ల నిర్మాణంపై పడింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టి, వాతావరణం కూడా సహకరిస్తుండటంతో ఇళ్ల నిర్మాణాలు పుంజుకున్నాయి. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం రెండుదశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతోంది. ఇందులో 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు. మిగిలిన 18.63 లక్షల ఇళ్లకుగాను 15.15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటిలో 8.70 లక్షల ఇళ్లు పునాది ముందుదశలో, 2.85 లక్షల ఇళ్లు పునాది, 73,622 ఇళ్లు రూఫ్ లెవల్, 1.05 లక్షల ఇళ్లు ఆర్సీ దశలో నిర్మాణంలో ఉన్నాయి. 1,79,263 ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఇందులో 95 వేలకుపైగా ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కరెంటు, నీటిసరఫరా కనెక్షన్లు ఇప్పటికే ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు ఇస్తున్నారు. హౌసింగ్ డే రోజు సచివాలయ సిబ్బంది నుంచి కలెక్టర్ వరకు లేఅవుట్ల సందర్శన పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం తొలినుంచి ప్రత్యేకదృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతి శనివారాన్ని హౌసింగ్ డేగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో శనివారం కలెక్టర్లు, జేసీలు, డివిజన్, మండలస్థాయి అధికారులు, సచివాలయాల సిబ్బంది లేఅవుట్లను సందర్శిస్తున్నారు. అధికారులు తాము లేఅవుట్లను సందర్శించిన ఫొటోలను గృహనిర్మాణ సంస్థ రూపొందించిన హౌసింగ్ డే యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేఅవుట్లలో తమదృష్టికి వచ్చిన సమస్యలు, ఇబ్బందులను యాప్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించారు. ఆన్లైన్లో వచ్చిన సమస్యలు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 19న 961 లేఅవుట్లను 5,548 మంది మండల స్థాయి అధికారులు, 3,051 మంది సచివాలయాల స్థాయి అధికారులు సందర్శించారు. రోజువారీ లక్ష్యాలు ఇస్తున్నాం ఇళ్ల నిర్మాణాలు మరింత వేగంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాల వారీగా రోజువారీ లక్ష్యాలను ఇస్తున్నాం. వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేకదృష్టి పెడుతున్నాం. స్వయంగా ఆయా జిల్లాలకు రాష్ట్రస్థాయి అధికారులం వెళ్లి నిర్మాణాలు ఆలస్యం అవడానికి కారణమైన సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నాం. హౌసింగ్ డే రోజున పథకంతో ముడిపడి ఉన్న అధికారులు రెండు లేఅవుట్లు సందర్శించాల్సి ఉంటుంది. లేఅవుట్లో సందర్శించినట్టుగా ఫొటోలను హౌసింగ్ డే యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించాం. – అజయ్జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ -
మహిళలు, పిల్లలకు ఆరోగ్య భద్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళలు, పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నివారించి, ఆరోగ్యంగా ఉంచాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. తొలి దశలో 8 అంశాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్ర బిందువుగా సుస్థిర ప్రగతి లక్ష్యాల సూచికలను సాధించడం ద్వారా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు ఈ నెల 16 నుంచి ఇంటింటి సర్వే చేపట్టింది. వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసి, రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న మహిళలు, పిల్లలను గుర్తించి, వారికి అవసరమైన మందులు, పౌష్టికాహారాన్ని అందించి ఆరోగ్యంగా తీర్చీదిద్దడానికి చర్యలు చేపట్టింది. వారికి ముందులు, ఆహారం సరఫరాను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నిరంతరం పర్యవేక్షిస్తారు. ఇప్పటికే 40 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఈ సర్వే కోసం వలంటీర్లకు ప్రాధాన్యత గల 8 సుస్థిర ప్రగతి లక్ష్యాల సూచికలతో ఓ అప్లికేషన్ కూడా రూపొందించింది. 2,65,979 క్లస్టర్ల వారీగా 1,59,29,858 కుటుంబాలను వీరు కలుసుకుంటున్నారు. రక్తహీనత, బరువు తక్కువ, పౌష్టికాహార లోపాలతోపాటు పిల్లల్లో స్కూల్ డ్రాపవుట్స్ పాఠశాలల్లో మహిళా టాయిలెట్ల నిర్వహణ, విద్యుత్, తాగునీటి సదుపాయాలపై సర్వే చేస్తున్నారు. ఆ వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు తదనుగుణంగా చర్యలు చేపడతారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 11, 12 తరగతుల్లో పిల్లల ఎన్రోల్మెంట్ రేషియోతోపాటు డ్రాపవుట్స్ లేకుండా ఆ ఈడు పిల్లలందరూ విద్యా సంస్థల్లో ఉండేలా సర్వే ద్వారా చర్యలు చేపడుతున్నారు. పిల్లలు ఎవ్వరైనా స్కూల్కు రాకపోతే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి, మళ్లీ బడిలో చేర్పించేందుకు వలంటీర్లు చర్యలు తీసుకుంటారు. స్కూళ్లలో కనీస మౌలిక వసతుల వివరాలు సేకరించి, లోపాలుంటే వెంటనే సరిచేస్తారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఇంటింటి సర్వే పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ సమీర్ శర్మ సమీక్షించారు. సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 8 సుస్థిర ప్రగతి సూచికల లక్ష్యాల సాధనకు సర్వే అంశాలు ఇవే ► కౌమారదశలో ఉన్న 10 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు మహిళల్లో రక్తహీనత కలిగిన వారు ఎంత శాతం ఉన్నారు? ► 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల గర్భిణుల్లో రక్తహీనత కలిగిన వారు ఎంత శాతం ఉన్నారు? ► ఎదుగుదల లేక కుచించుకపోయిన ఐదేళ్ల లోపు పిల్లలు ఎంత మంది ఉన్నారు? ► తక్కువ బరువుగల ఐదేళ్లలోపు పిల్లలు ఎంత మంది ఉన్నారు? ► ఎలిమెంటరీ స్కూల్స్లో 1 నంచి 10వ తరగతి వరకు ఎన్రోల్మెంట్ రేషియో ► ఉన్నత విద్యలో 11, 12 తరగతుల్లో స్థూల నమోదు నిష్పత్తి ► స్కూళ్లలో విద్యుత్, తాగునీరు అందుబాటు ఎంత శాతం ఉన్నాయి? ► స్కూళ్లలో ప్రధానంగా బాలికల టాయిలెట్ల నిర్వహణ, స్థితి ఎలా ఉంది? ఈ నెల 25లోగా సర్వే పూర్తి మహిళలు, పిల్లల ఆరోగ్యం.. ప్రధానంగా రక్తహీనత, పౌష్టికాహార లోపాలను గుర్తించేందుకు రాష్ట్రం అంతటా తొలిసారిగా పెద్ద ఎత్తున ఇంటింటి సర్వే చేపట్టాం. ఈ నెల 25కి సర్వే పూర్తవుతుంది. సర్వే కోసం ప్రత్యేకంగా నమూనా ఫారమ్ను రూపొందించాం. సర్వేలో వివరాల ఆధారంగా రక్త హీనత, పౌష్టికాహార లోపాలు గల, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారిపై దృష్టి సారించి, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంంటాం. తద్వారా 8 అంశాల్లో సుస్థిర ప్రగతి సూచికల లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించడమే ధ్యేయం. – గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ -
డిసెంబర్ 23 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి
కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీల్లో డిసెంబర్ 23 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. కర్నూలు కలెక్టరేట్లో గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 21 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. మూడో ఆప్షన్ కింద ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తే లబ్ధిదారులతో ఎంవోయూ చేయిస్తామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.15 లక్షలు ఖర్చుచేస్తుండగా.. ఇందులో రూ.1.80 లక్షలు సబ్సిడీ పోగా, మిగిలిన రూ.35 వేలను లబ్ధిదారుడికి పావలా వడ్డీ కింద ఇప్పిస్తామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద ప్రజా ప్రతినిధులు 15 వేల సచివాలయాల పరిధిలో తిరిగి వివిధ పనుల కోసం ప్రతిపాదనలు పంపారని, వాటిలో 3,344 పనులకు ఆమోదం తెలిపామని, ఇందులో 2,317 పనులు ప్రారంభమయ్యాయని కూడా చెప్పారు. -
ఇళ్ల నిర్మాణాలకు రోజుకు రూ.23 కోట్ల ఖర్చు
కర్నూలు(అర్బన్): రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న లేఅవుట్లలో గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రోజు రూ.23 కోట్లు ఖర్చు చేస్తున్నదని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిని సమీక్షించేందుకు ఆయన బుధవారం కర్నూలు వచ్చారు. జిల్లా కలెక్టర్ పీ కోటేశ్వరరావుతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాల్లో పురోగతి చూపితే రోజుకు రూ.50 కోట్లు కూడా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ఏడు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికి ఇళ్లు’ కార్యక్రమంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఎనిమిది నెలల్లోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి పట్టాలను ఇవ్వడం జరిగిందని, ఇందులో మొదటి విడతలో 18 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని వివరించారు. -
గ్రామాలు, వార్డుల్లో పనుల జోరు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వేగం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తూ.. ప్రాధాన్యత పనులను గుర్తిస్తున్నారు. వాటిని మంజూరు చేసి, పనులు ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే 4,199 సచివాలయాలను ఎమ్మెల్యేలు, మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా వాటి పరిధిలో 12,428 ప్రాధాన్యత పనులను గుర్తించగా, వాటి వివరాలను అప్లోడ్ కూడా చేశారు. ఇందులో 7,329 పనులను అధికారులు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 1,044 పనులను ప్రారంభించారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 305 పనులు, తూర్పుగోదావరిలో 202, బాపట్లలో 200, శ్రీకాకుళంలో 157, కాకినాడ జిల్లాలో 152 పనులు ప్రారంభమయ్యాయి. అత్యధికంగా పార్వతిపురం మన్యం జిల్లాలో 513 పనులు, ప్రకాశంలో 483, అనకాపల్లిలో 443, కాకినాడలో 440, పల్నాడులో 423, బాపట్ల జిల్లాలో 404 పనులు మంజూరు చేశారు. ఈ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున రూ.3,000.88 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. గుర్తించిన మరుసటి రోజే పనులు అప్లోడ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సచివాలయాలను సందర్శించిన మరుసటి రోజే ప్రాధాన్యతగా గుర్తించిన పనులను వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకున్నాం. వారంలోగా మంజూరు చేసి, నెలలోనే పనులు ప్రారంభించేలా చూస్తున్నాం. వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నూరు శాతం పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఇప్పటికే ప్రాధాన్యత పనులుగా గుర్తించిన వాటిలో మిగిలిన 5,099 పనులను ఈ నెల 5వ తేదీలోగా మంజూరు చేసి, ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తాం. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
మీ ఇల్లు చల్లగుండ!
సాక్షి, అమరావతి: కూల్ రూఫ్ పెయింట్ ద్వారా జగనన్న కాలనీల్లోని ఇళ్లలో ఉష్ణోగ్రతలు తగ్గించడంపై ప్రయోగం చేపడుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఇండో–స్విస్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ (బీఈఈపీ) ద్వారా జగనన్న కాలనీల్లోని ఇళ్లల్లో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం), అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) చేపడుతున్న కూల్ రూఫ్ ప్రాజెక్టుపై మంగళవారం విజయవాడలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. దీనికి అజయ్జైన్ వర్చువల్గా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం వార్షిక విద్యుత్ డిమాండ్ 60,943 మిలియన్ యూనిట్లు ఉంటే, అందులో భవనాలకు వాడుతున్నది 17,514 మిలియన్ యూనిట్లు (28 శాతం) ఉందన్నారు. దీన్ని తగ్గించేందుకు జగనన్న ఇళ్లల్లో విద్యుత్ ఆదా చర్యలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కూల్ రూఫ్ను విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ జిల్లాల్లోని పన్నెండు ఇళ్లపై వేసి వచ్చే ఫలితాలను అధ్యయనం చేస్తామన్నారు. -
ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణానికి అవసరమైన పనులను వారంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆప్షన్–3 ఎంచుకున్న లబ్ధిదారులను కాంట్రాక్టర్లకు మ్యాపింగ్ చేయడం, అవగాహన ఒప్పందాలు, బ్యాంక్ ఖాతాలను ప్రారంభించడం తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు. విశాఖపట్నంలో సుమారు 1.24 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నందున.. లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రతి లేఅవుట్లో ఇటుకల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ.. నిర్మాణాలకు సకాలంలో సామగ్రి సరఫరాతో పాటు బిల్లులు చెల్లిస్తామన్నారు. -
పేదల ఇళ్లలో రూ.350 కోట్ల విద్యుత్ ఆదా
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సామర్థ్యంతో కూడిన గృహోపకరణాలను పేదలకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటోందని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. తద్వారా ఏటా రూ.350 కోట్ల విలువైన విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఇంధన శాఖకు చెందిన ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ సీడ్కో), హౌసింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అజయ్ జైన్ మాట్లాడారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఆదివారం వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. నవరత్నాలు–పేదలందరికి ఇళ్లు పథకం కింద మొదటిదశలో నిర్మించే 15.60 లక్షల ఇళ్లకు విద్యుత్ పొదుపు చేయగల గృహోపకరణాలను మార్కెట్ ధరల కన్నా తక్కువకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనివల్ల ఒక్కో ఇంటికి ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉందని అజయ్ జైన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి లబ్ధిదారుడికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ఎల్ఈడీ ట్యూబ్లైట్లు, రెండు ఇంధన సామర్థ్య ఫ్యాన్లు అందజేస్తామన్నారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) నుంచి ఏపీ సీడ్కో ద్వారా వీటిని సేకరిస్తామని చెప్పారు. నాణ్యతలో రాజీపడొద్దన్న సీఎం నాణ్యతలో రాజీపడకుండా అత్యుత్తమ ఇంధన సామర్థ్య గృహోపకరణాలను లబ్ధిదారులకు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. మార్కెట్ ధరతో పోలిస్తే 30 నుంచి 35 శాతం తక్కువ ధరకు ఉపకరణాలను ఏపీకి అందచేసేందుకు ఈఈఎస్ఎల్ సూత్రప్రాయంగా అంగీకరించిందన్నారు. ఎల్ఈడీ బల్బుల వినియోగం వల్ల 90 శాతం విద్యుత్, ఎల్ఈడీ ట్యూబ్లైట్ వల్ల 60 శాతం, ఇంధన సామర్థ్య ఫ్యాన్ వల్ల 50 శాతం విద్యుత్ ఆదా అవుతుందని ఈఈఎస్ఎల్ అంచనా వేసిందని చెప్పారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే లబ్ధిదారులకే ఈ ఉపకరణాలు అందచేస్తామన్నారు. జగనన్న కాలనీల్లో విద్యుదీకరణ, ఇంటర్నెట్ కోసం రూ.7,989 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. గృహనిర్మాణ పథకంలో ఇండోస్విస్ ఇంధన భవన నిర్మాణ సాంకేతికతను వినియోగిస్తున్నందున ఇంటిలోపల రెండుడిగ్రీల ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంటుందని అజయ్ జైన్ చెప్పారు. ఈ సమావేశంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ్భరత్ గుప్తా, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, హౌసింగ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.శివప్రసాద్, చీఫ్ ఇంజనీర్ జి.వి.ప్రసాద్, ఏపీసీడ్కో అధికారులు పాల్గొన్నారు. -
‘హౌసు’ ఫుల్లు..!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది నిరుపేద అక్క చెల్లెమ్మల సొంతింటి కలలు నెరవేరుతున్నాయి. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తొలిదశ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ‘నవరత్నాలు–పేదలం దరికీ ఇళ్లు’ పథకం కింద 31 లక్షల మందికిపైగా పేదలకు ప్రభుత్వం పక్కా గృహాలను నిర్మిస్తోంది. తొలిదశలో 15.60 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ ఏడాది పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.13,100 కోట్లు వెచ్చిం చనుండటంతో నిర్మాణాలు జోరందుకున్నాయి. ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా 1.54 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా కోసం రూ.1,121.12 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాయితీ కింద ఇచ్చే 3.46 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ కోసం రూ.2,425.50 కోట్లు, 35 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ సరఫరాకు రూ.1,575.27 కోట్లు వ్యయం కానుంది. మిగిలిన నిధులను బిల్లుల చెల్లింపులు, ఇతర అవసరాలకు వెచ్చించనున్నారు. రాయితీపై నిర్మాణ సామగ్రి ఒక్కో ఇంటి నిర్మాణానికి ఉచితంగా 20 టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నారు. రాయితీపై మార్కెట్ ధర కన్నా తక్కువకు 140 బస్తాల సిమెంట్, 480 కిలోల ఐరన్ సహా ఇతర సామగ్రిని ప్రభుత్వమే సమకూరుస్తోంది. గతంలో 90 బస్తాల సిమెంట్ ఇవ్వగా ఇప్పుడు అదనంగా మరో 50 బస్తాలు ఇస్తున్నారు. అదనపు చేయూత సొంతిళ్లు నిర్మించుకునే అక్క చెల్లెమ్మలకు అదనంగా చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకుల ద్వారా స్వయం సహాయక బృందాల మహిళలకు పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నారు. రూ.35 వేల నుంచి ఆ పైన రుణ సాయం అందుతోంది. ఇప్పటివరకూ 3,59,856 మంది లబ్ధిదారులకు రూ.1,332.09 కోట్ల రుణం మంజూరైంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అత్యధికంగా చిత్తూరులో 69,170, అనంతపురంలో 49,918, తూర్పు గోదావరిలో 36,462 మంది రుణాలు పొందారు. లబ్ధిదారులపై భారం తగ్గించేలా ఊరికి దూరంగా ఉండే లేఅవుట్లలోకి సిమెంట్, ఐరన్, ఇతర సామాగ్రి తరలింపు భారం లబ్ధిదారులపై పడకుండా స్థానికంగా గోడౌన్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. 66 పెద్ద లేఅవుట్లలో గోడౌన్ల నిర్మాణం చేపట్టగా ఇప్పటికే 47 అందుబాటులోకి వచ్చాయి. ఇటుకల తయారీ యూనిట్లు కూడా లే అవుట్లలోనే ఏర్పాటు చేసి తక్కువ ధరలకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. ఆప్షన్–3 ఇళ్లపై పర్యవేక్షణ.. ప్రభుత్వమే నిర్మించే ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 3.27 లక్షల మంది లబ్ధిదారులు ఆప్షన్–3ను ఎంచుకోగా గ్రూపులుగా విభజించి కాంట్రాక్టర్ల ద్వారా నిర్మాణాలు చేపడుతున్నారు. మొత్తం 25,430 గ్రూపులు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో కనీసం పదిమంది లబ్ధిదారులు ఉంటారు. వెయ్యి ఇళ్లకు ఒక వార్డు అమెనిటీ సెక్రటరీని కేటాయించి ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తున్నారు. లేఅవుట్ల నుంచే హాజరు నమోదుకు వీరికి అవకాశం కల్పిస్తున్నారు. రుణాల మంజూరుకు బ్యాంకులు, ఇతర అధికారులతో సమన్వయంతో వ్యవహరించే బాధ్యత అప్పగించారు. నున్నలో నిర్మిస్తున్న పాపాయమ్మ ఇల్లు వేగంగా నిర్మాణాలు పేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల కోసం లే అవుట్లలోనే ఇటుకల తయారీ యూనిట్లతో పాటు సామగ్రి రవాణా భారం లేకుండా గోడౌన్లు నిర్మించాం. ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి వెయ్యి ఇళ్లకు అమెనిటీ సెక్రటరీ, లే అవుట్కు డిప్యూటీ ఈఈలను ఇన్చార్జ్లుగా నియమిస్తున్నాం. – అజయ్జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కష్టాలు తీరాయి.. కూలి పనులు చేసుకుంటూ మా అమ్మతో కలసి ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్తు దరఖాస్తు చేసుకున్నా నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఇంటి స్థలం రావడంతోపాటు నిర్మాణం కూడా పూర్తైంది. సుదీర్ఘ కల నెరవేరుతోంది. నా కష్టాలు తీరాయి. – ఇందూరి మంగతాయమ్మ, చెరువుకొమ్ముపాలెం, ఎన్టీఆర్ జిల్లా మరో 40 రోజుల్లో.. శ్రీకాళహస్తిలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. సంపాదనలో చాలావరకు అద్దెలకే ఖర్చవుతోంది. గతంలో ఇంటిపట్టా కోసం ఎంతో ప్రయత్నించినా రాలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక వలంటీర్ మా ఇంటికే వచ్చి వివరాలు నమోదు చేసుకున్నాడు. మాకు స్థలం, ఇల్లు మంజూరైంది. మరో 40 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. – రెడ్డిపల్లి సుబ్రహ్మణ్యం, ఊరందూరు, తిరుపతి జిల్లా సొంతింట్లోకి దర్జీ కుటుంబం.. దర్జీగా పనిచేసే నా భర్త సంపాదనతో ఇద్దరు పిల్లలను చదివించి అద్దెలు కట్టేందుకు ఎంతో అవస్థ పడేవాళ్లం. మాకు స్థలంతో పాటు ఇల్లు మంజూరైంది. తక్కువ ధరకే సిమెంటు, ఐరన్, ఇతర సామాగ్రి ఇవ్వడంతో ఇంటిని నిర్మించుకున్నాం. – రహీమా, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా గృహ ప్రవేశం చేశాం ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. రాయితీపై సిమెంట్ అందించారు. గృహ ప్రవేశం కూడా చేశాం. చాలా సంతోషంగా ఉంది. సీఎం జగన్ మాకు సొంత గూడు సమకూర్చారు. – ఇస్సాకుల శేషారత్నం, నేమాం, కాకినాడ జిల్లా రేకుల షెడ్డు నుంచి.. చక్కెర కర్మాగారంలో కూలీగా పనిచేసే నా భర్త సంపాదనలో నెలకు రూ.4 వేలు ఇంటి అద్దెకు ఖర్చయ్యేవి. ఒకదశలో అద్దె భారాన్ని భరించలేక ఫ్యాక్టరీ సమీపంలోని రేకుల షెడ్డులో తలదాచుకున్నాం. ఇప్పుడు మాకు ప్రభుత్వం సొంత గూడు కల్పించింది. ఈ ఏడాది జనవరిలో ఇంటి నిర్మాణం పూర్తైంది. తొమ్మిది నెలల్లో సొంతిల్లు కట్టుకున్నాం. బిల్లులు సక్రమంగా అందాయి. ఇటీవలే కొత్త ఇంట్లోకి వచ్చాం. – మామిని పాడి, పాలకొండ అర్బన్, పార్వతీపురం మన్యం జిల్లా అదనంగా 50 బస్తాల సిమెంట్ .. బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసి లెంటల్ లెవెల్ వరకు ఇంటిని నిర్మించుకున్నాం. ఉచితంగా ఇసుక, రాయితీపై సిమెంటు, స్టీలు ఇస్తున్నారు. ఇప్పటి వరకూ 90 బస్తాల సిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు అదనంగా మరో 50 బస్తాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఇది మాకెంతో ఉపయోగపడుతుంది. – ఖైరున్నిసాబీ, పార్నపల్లె, నంద్యాల జిల్లా సొంతిల్లు కడుతున్న మేస్త్రి విజయవాడలోని నున్నలో నివసించే భూలక్ష్మి మిషన్ కుడుతూ.. భర్త శ్రీనివాసరావుకు తోడుగా నిలుస్తోంది. వీరు 20 ఏళ్లకుపైగా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. చాలాసార్లు ఇంటి నిర్మాణానికి ప్రయత్నించినా అక్కడ సెంటు స్థలం రూ.10 లక్షల వరకు పలుకుతుండటంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఇంటి స్థలం మంజూరైంది. శ్రీనివాసరావు తాపీ మేస్త్రీ కావడంతో తనే స్వయంగా దగ్గరుండి ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఇటీవల స్లాబ్ వేశారు. స్థలంతో పాటు రూ.1.80 లక్షలు ఆర్థిక సాయం అందిందని, పొదుపు సంఘం ద్వారా రూ.50 వేలు లోన్ తీసుకున్నానని.. ఇంటి నిర్మాణం పూర్తి కావచ్చిందని భూ లక్ష్మి ఆనందంగా చెబుతోంది. తరతరాల కోరిక తీరింది.. విజయవాడ నున్న ప్రాంతంలో ఇళ్లలో పనులకు వెళ్లే పాపాయమ్మ కొద్ది నెలల క్రితం పక్షవాతం బారిన పడటంతో మంచానికే పరిమితమైంది. భర్త అప్పారావు రిక్షా కార్మికుడు. వీరికి తరతరాలుగా సొంతిల్లే లేదు. ఇంటి స్థలం, ఇల్లు కోసం ఎన్నోసార్లు విఫలయత్నం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక చివరి ప్రయత్నంగా వలంటీర్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాపాయమ్మకు రూపాయి ఖర్చు లేకుండా సొంతిల్లు మంజూరైంది. ఇల్లు నిర్మించుకుంటున్నారు. త్వరలో గృహ ప్రవేశం చేయనున్నారు. -
1.79 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 2021–22 సంవత్సరానికి సంబంధించి మరో 1,79,060 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. యూనిట్కు రూ.1.80 లక్షల చొప్పున రూ.3,223.08 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. 1.79 లక్షలలో అత్యధికంగా గుంటూరు జిల్లాకు 27,330, కర్నూలుకు 21,494, పశ్చిమగోదావరికి 19,146 ఇళ్లు కేటాయించారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి దశ కింద చేపట్టిన 15.65 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. -
సచివాలయాల్లో ఏటీఎంలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పల్లె ప్రజానీకానికి మరిన్ని సేవలు విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే వీటి ద్వారా ఉన్న ఊళ్లోనే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 540 రకాలకు పైగా సేవలను అందిస్తున్న సర్కారు.. ఇప్పుడు కొత్తగా వాటిల్లో ఏటీఎం సేవలను అందించేందుకు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా.. తొలి దశలో వచ్చే ఉగాది నాటికి కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఒక్కో జిల్లా నుంచి ఒక్కో సచివాలయంలో ఈ ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ఆయా జిల్లాల్లో కూడా ఒక సచివాలయంలో ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక రెండో దశలో రెవెన్యూ డివిజన్లో కార్యకలాపాలు ఎక్కువగా సాగే ఒక సచివాలయంలోను.. మూడో దశలో మండల కేంద్రాల్లో కార్యకలాపాలు అత్యధికంగా జరిగే ఒక సచివాలయంలోను ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చర్యలను చేపట్టింది. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఇక రాష్ట్రంలో 9,160 రైతుభరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించగా.. 4,240 కేంద్రాల్లో ఇప్పటికే వీరు సేవలందిస్తున్నారు. రాష్ట్రంలో 500 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలందిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి మొత్తం 2,95,925 మందికి ఆధార్ సేవలందించారు. మరో 2,500 సచివాలయాల్లో వచ్చే ఉగాది నాటికి ఈ సేవలనూ అందుబాటులోకి తేనున్నారు. సచివాలయాల్లో తొలిదశ కింద ఇప్పటికే 51చోట్ల రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించగా రెండో దశలో మరో 613చోట్ల అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దశల వారీగా ఏటీఎంలు గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు రైతుభరోసా కేంద్రాల కార్యకలాపాలు అత్యధికంగా ఉన్నచోట తొలిదశలో ఉగాది నాటికి జిల్లాకొక సచివాలయంలో ఏటీఎంలను ఏర్పాటుచేయనున్నాం. వ్యవసాయానికి అవసరమైన కొనుగోళ్లు చేసే రైతులతోపాటు ఇతరులకూ ఈ ఏటీఎంలు ఉపయోగపడతాయి. క్రమంగా రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లోని ఒక్కో సచివాలయంలో వీటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ -
Andhra Pradesh: త్వరలో 14,493 పోస్టుల భర్తీ..
సాక్షి, అమరావతి: వచ్చే జూన్ నెలాఖరులోగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సచివాలయంలో గురువారం గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన సలహాదారు ధనుంజయరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలి మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పనితీరుకు సంబంధించి ఆయా శాఖల వారీగా సర్టిఫికెట్లు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ను ఆదేశించారు. మునిసిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ (ఏపీ సేవా పోర్టల్)ను గురువారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారని తెలిపారు. దీంతో ప్రజలు వివిధ సేవలకు ఏ సచివాలయం నుంచి అయినా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ.. ప్రస్తుతం గ్రామాల్లో 11,162, పట్టణాల్లో 3,842.. మొత్తం 15,004 సచివాలయాలు పనిచేస్తున్నాయని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో 11, వార్డు సచివాలయాల్లో 10 ఫంక్షనరీలకు సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. ఈ సచివాలయాల్లో ఉన్న 14,493 ఖాళీలను త్వరితగతిన భర్తీచేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 3.50 కోట్ల సేవలు అందించినట్లు వివరించారు. -
జగనన్న కాలనీలను మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతాం: అజయ్ జైన్
సాక్షి, తాడేపల్లి: జగనన్న కాలనీల మొదటి దశ పనులు శరవేగంగా సాగుతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 15లక్షల ఇళ్ల నిర్మాణం సాగుతోందని తెలిపారు. వర్షాకాలం పూర్తికావడంతో పనులు ఊపందుకున్నాయని చెప్పారు. మౌలిక వసతుల కల్పన కోసం 34వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అజయ్ జైన్ తెలిపారు. పేదలనే చిన్న చూపు లేకుండా కాలనీల్లో అన్నీ మౌలిక వసతులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. దీనికోసం కేంద్ర పథకాలతో పాటు ఇతర ఆర్థిక సాయం తీసుకుంటున్నామని చెప్పారు. జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ 1000 నుంచి 1500 కోట్ల ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. అండర్ గ్రౌండ్ విద్యుత్, విద్యుత్ పొదుపు చర్యలు తీసుకుంటున్నందుకు ఆ సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. కాలనీల్లో మౌలిక వసతులపై కీలక దృష్టి పెట్టామని, సీఎం జగన్ ఆదేశాల మేరకు అక్కడ కావాల్సిన ప్రతి ఒక్క వసతి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జగనన్న కాలనీలు ఒక మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతామని అజయ్ జైన్ తెలిపారు. చదవండి: మంత్రి పెద్దిరెడ్డి, అధికారులకు సీఎం జగన్ అభినందనలు -
కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాం: అజయ్ జైన్
-
Andhra Pradesh: ఇళ్ల నిర్మాణాలు వేగవంతం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 15.65 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఇప్పటికే 10.87 లక్షల ఇళ్ల శంకుస్థాపనలు పూర్తయ్యాయి. వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. గత ఏడాది కోర్టు కేసుల కారణంగా కొద్దినెలలపాటు వీటి పనులు నిలిచిపోయాయి. ఇటీవల ఆ అడ్డంకులు తొలగిపోవడంతో డిసెంబర్ నుంచి నిర్మాణాలు తిరిగి గాడినపడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రూ.30 కోట్లకు పైగా విలువైన పనులు జరుగుతున్నాయి. మిగిలిన ఇళ్ల శంకుస్థాపనకు చర్యలు తొలిదశలో శంకుస్థాపనలు కాని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికీ గృహ నిర్మాణ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు లేఅవుట్లలో రీలెవలింగ్, గోడౌన్ల నిర్మాణం, నీటి సరఫరా, ఇతర సౌకర్యాల కల్పన నిమిత్తం రూ.228.6 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మొత్తంలో రూ.62.81 కోట్లు అప్రోచ్ రోడ్లు, లేఅవుట్లలోని ఎలక్ట్రికల్ లైన్లు మార్చడానికి రూ.6.60 కోట్లు, లేఅవుట్లలో లెవలింగ్ కోసం రూ.132 కోట్లు, గోడౌన్ల నిర్మాణానికి రూ.3.25 కోట్లు, ఇతర పనుల కోసం రూ.23.94 కోట్లు కేటాయించారు. ఇప్పటికే రూ.30 కోట్ల నిధులను జిల్లాలకు విడుదల చేశారు. అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రెండు జిల్లాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాం. వీరు అక్కడ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు, జేసీలతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. తొలి నుంచి చిత్తూరు జిల్లా ఇంటి నిర్మాణాల్లో ముందంజలో ఉంది. ఇటీవల రూ.228 కోట్లతో లేఅవుట్లలో వసతుల కల్పనకు అనుమతులిచ్చాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జర్మనీ సంస్థ ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోంది. పేదలకు నిర్మించే ఇళ్లలో అత్యుత్తమ ఇంధన ప్రమాణాలు అమలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని జర్మనీకి చెందిన అంతర్జాతీయ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ అధికారులు అభినందించారు. ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఇళ్లలో ఇంధన సామర్థ్య ప్రమాణాలు అమలు చేసేందుకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు కేఎఫ్డబ్ల్యూ ఆసక్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ, ఇంధన శాఖ అధికారులతో ఆదివారం వర్చువల్గా జరిగిన సమావేశంలో కేఎఫ్డబ్ల్యూ అధికారులు ఈ ప్రతిపాదన చేశారు. 152 మిలియన్ యూరోల సాయం కేఎఫ్డబ్ల్యూ ఎనర్జీ ఎఫిషియెన్సీ విభాగం అధిపతి మార్టిన్ లక్స్ మాట్లాడుతూ.. గృహ నిర్మాణ పథకంలో నిర్మించే ఇళ్లలో ఇంధన సామర్థ్య ప్రమాణాల అమలుకు సంబంధించి ప్రాజెక్ట్ తయారీ, అధ్యయనం తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్పై అధ్యయనం అనంతరం ఇంధన సామర్థ్య ప్రమాణాలతో కూడిన ఇళ్ల నిర్మాణ కోసం 150 మిలియన్ యూరోలు , సాంకేతిక సహకారం కోసం మరో 2 మిలియన్ యూరోలు అందచేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా జగనన్న కాలనీల్లో విద్యుత్ పంపిణీ మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా నెట్వర్క్ బలోపేతానికి కూడా ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. -
త్వరలోనే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్
నెల్లూరు (అర్బన్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ఇష్టంతో ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగులకు త్వరితగతిన ప్రొబేషన్ పీరియడ్ను డిక్లేర్ చేసి పీఆర్సీ అమలు చేయనున్నారని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ తెలిపారు. నెల్లూరులో పలువురు సచివాలయ ఉద్యోగులు మంగళవారం విధులు బహిష్కరించి, తమకు ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేయాలంటూ స్థానిక కలెక్టరేట్లో అజయ్జైన్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యపాలన తీసుకుని రావడంలో భాగంగా రాష్ట్రంలో ఒకే దఫా 1.20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. వారికి ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేసేందుకు లెక్కలు తీసుకుంటున్నామన్నారు. డిపార్ట్మెంట్ పరీక్ష పాసయిన ప్రతి ఒక్కరికి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారని చెప్పారు. ఎక్కువ శాఖల నుంచి వివరాలు సేకరించాల్సి ఉన్నందున కాస్త ఆలస్యం అయిందన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు జూన్నాటికి డిక్లేర్ చేస్తామని తెలపగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇంకా ముందుగా వీలైనంత త్వరగా ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. అధికారులు అదే ప్రయత్నంలో ఉన్నారన్నారు. సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడంలో తప్పులేదని, విధులు బహిష్కరించి రోడ్డెక్కడం మంచిపద్ధతి కాదని చెప్పారు. ఎవరో రెచ్చగొడితే ఇలా రోడ్డెక్కితే అంతిమంగా సచివాలయ ఉద్యోగులకే నష్టం జరుగుతుందన్నారు. ఇకనైనా విధులకు హాజరై ప్రజలకు మంచిగా సేవలందించాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం వందశాతం న్యాయం చేస్తుందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన చెప్పారు. -
నిరసనలొద్దు.. వెంటనే విధుల్లో చేరండి
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఎలాంటి నిరసనలు చేపట్టకుండా మంగళవారం నుంచి విధులకు హాజరు కావాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర తాత్కాలిక సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై, ప్రొబేషన్ ప్రకటన తదితర సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి చాలా దారులున్నాయి. మీరు ఇంకా 30 ఏళ్లు ఉద్యోగాలు చేయాలి. మొదట్లోనే ఇలా చేస్తే మీపై తప్పుడు భావనలు వెళతాయి. మీరంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి అభిప్రాయం ఉంది. కానీ, ఈ మూడు రోజుల పరిణామాలు తప్పు దారిలో వెళ్తున్నాయి. ఎలాంటి వినతులు లేకుండా విధులకు హాజరుకాకపోవడం, అధికారిక గ్రూపుల నుంచి వైదొలగడం, రోడ్లపైకి వచ్చి స్లోగన్లు వంటివి ఉద్యోగులకు కుదరదు. మీరు ఆశిస్తున్నవి కొంతవరకైనా జరగాలంటే మంచి వాతావరణం తేవాలి. పరిస్థితులు చక్కబడితేనే మీరు చెప్పిన అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లగలను. 13 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై 2018 నుంచి చర్చలు జరుగుతున్నాయి. వాళ్లు అన్నిసార్లూ చర్చలు, వినతుల ద్వారా డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. మీరు మంచిగా అడిగితే సీఎం ఒకటికి రెండు చేసే అవకాశం ఉంటుంది. తలకు బులెట్ పెట్టి ఇవ్వాలని కోరితే ఇచ్చేది కూడా ఇవ్వరు’ అని స్పష్టం చేశారు. అధికారులు అక్టోబరన్నా, సీఎం జూన్ కల్లా ఇవ్వాలన్నారు గతంలో ప్రొబేషన్పై జరిగిన సమావేశంలో 60 వేల మంది ఉద్యోగులే డిపార్టమెంట్ పరీక్షలు పాసయ్యారని అధికారులు సీఎంకు చెప్పారు. ఈ ఏడాది అక్టోబరుకల్లా అందరికీ ఒకేసారి ప్రొబేషన్ డిక్లేర్ చేద్దామని సూచించారు. కానీ, ముఖ్యమంత్రి జూన్ 30వ తేదీ ప్రొబేషన్ ప్రకటనకు చివరి తేదీ కావాలని చెప్పారు. ఉద్యోగులు మంచిగా అడిగితే ఇంకా ముందే వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరూ అడగకుండా ఒకేసారి 1.34 లక్షల మందికి ఉద్యోగాలిచ్చిన ముఖ్యమంత్రి.. మంచి విధానంలో అడిగితే మీ మాట వినే అవకాశం ఎందుకు ఉండదు? అందరికీ ఒకే రోజు సీఎం గారి చేతుల మీదుగా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అనుకున్నారు. అది అర్ధం చేసుకోకుండా తప్పు దారిలో వెళితే చట్ట ప్రకారం చర్యలకు అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ ఉద్దేశంతో లేదు. ఆ పరిస్థితులు మీరు తెచ్చుకోకూడదు. ఎవరన్నా మీకు ప్రొబేషన్ ప్రకటించరంటే నమ్మకండి. ఈ సీఎం ఉండగా మీ ప్రొబేషన్ని ఎవరూ ఆపలేరు. కాకపోతే ఇలాంటివి చేసుకొని మీకు మీరే ప్రొబేషన్ను ఆపుకొనే అవకాశం ఉంటుంది’ అని చెప్పారు. ఇందుకే ప్రొబేషన్ ఐఏఎస్ అధికారిగా 30 ఏళ్ల సర్వీసులో ఏ ముఖ్యమంత్రికి నేరుగా మెసేజ్ చేయలేదని, కానీ, కొందరు సచివాలయ ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా నేరుగా మేసేజ్లు పంపారని జైన్ తప్పుపట్టారు. తాము ఏ సమాచారాన్నయినా సీఎంవో అధికారులు, సీఎస్ ద్వారా సీఎంకు చేరవేస్తామన్నారు. ఇలాంటి సర్వీసు రూల్స్పై అవగాహన కలిగించి, విధుల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రొబేషన్ ఉంటుందని చెప్పారు. 77 వేల మంది విధులకు హాజరు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం నిర్ణీత సమయానికే 55,515 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరయ్యారని ఆ శాఖ ప్రధాన కార్యాలయం వర్గాలు తెలిపాయి. సాయంత్రానికి మొత్తం 77,409 మంది విధుల్లో పాల్గొన్నట్టు వెల్లడించాయి. సీఎం జగన్పై మాకు నమ్మకం ఉంది: అంజన్రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పూర్తి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రతి నిధి అంజన్రెడ్డి చెప్పారు. అజయ్జైన్తో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆందోళన వెనుక కొన్ని శక్తులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఉద్యోగులు వాటి జోలికి పోకుండా వెంటనే విధుల్లో చేరాలని కోరారు. ఎవరికీ నష్టం జరగదు: జానీ పాషా ప్రొబేషన్ విషయంలో సచివాలయ ఉద్యోగులెవరికీ ఎలాంటి నష్టం జరగదని అజయ్జైన్ హామీ ఇచ్చారని ఉద్యోగుల మరో ప్రతినిధి జానీ పాషా చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులెవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అందోళనలు చేయవద్దని సూచించారు. -
జగనన్న కాలనీల్లో ఇం‘ధన’ ఆదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో ఏటా రూ.539.7 కోట్ల విలువైన విద్యుత్ను ఆదా చేయొచ్చని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తెలిపారు. స్టార్ రేటెడ్ ఉపకరణాలు అమర్చడం ద్వారా భారీగా విద్యుత్ ఆదా చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను కూడా మరింత మెరుగుపరచవచ్చన్నారు. ఇంధన శాఖను సమన్వయం చేసుకుంటూ ఇందుకు అవసరమైన ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా తదితరులతో మంత్రి ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాకుండా.. రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ, విద్యుదీకరణ, తాగు నీరు, పాఠశాలలు, ఆస్పత్రులు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తోందని మంత్రి చెప్పారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. వీటిలో 10.72 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం తొలి దశ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఆమోదంతో ఫైవ్ స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలు అందజేస్తామని మంత్రి చెప్పారు. ప్రతి ఇంటికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్లు అందించాలనుకుంటున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. వీటి వల్ల ప్రతి ఇంటికి ఏటా రూ.3,598 విలువైన విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 15 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలు అమర్చడం వల్ల ఏడాదికి 1,674 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. కేంద్ర సంస్థలైన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఏపీ ఇంధన సంరక్షణ మిషన్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోందని అజయ్ జైన్ తెలిపారు. -
క్షేత్రస్థాయి ఉద్యోగులకు బయోమెట్రిక్లో వెసులుబాటు
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయి విధులకు హాజరయ్యే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విషయంలో కొంత వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రొబేషనరీ సహా ఉద్యోగుల ఇతర సమస్యలపై చర్చించేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ బుధవారం పలు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించింది. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్, డైరెక్టర్ షాన్మోహన్లతోపాటు ఆరు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అర్హులైన సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ ప్రకటన ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, వీలైనంత త్వరలో పూర్తవుతుందని అజయ్జైన్ తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో వెసులుబాటు సచివాలయాల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో విధులకు హాజరు కావాల్సి ఉంటుందని సంఘాల నేతలు ఈ సందర్భంగా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. బయోమెట్రిక్ హాజరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఏఎన్ఎంలతో పాటు ప్రత్యేకించి వ్యవసాయ అసిస్టెంట్, సర్వేయర్ తదితర క్షేత్రస్థాయి విధులలో పాల్గొనే ఉద్యోగులు సంబంధిత రోజుల్లో ఉదయమే కచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయాల్సిన అవసరం లేదని, అయితే అలాంటి రోజుల్లో ఆయా ఉద్యోగులు సాయంత్రం 3–5 గంటల మధ్య తప్పనిసరిగా హాజరై వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు బయోమెట్రిక్ వేసేలా వెసులుబాటు కల్పిస్తామని అజయ్ జైన్ ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏఎన్ఎం లాంటి ఉద్యోగులు సాయంత్రం పూట ప్రసూతి విధులకు హాజరైతే అన్డ్యూటీకి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. గ్రేడ్–5 గ్రామ కార్యదర్శులకు పూర్తి స్థాయిలో అధికారులు కల్పించే అంశంతో పాటు ఉద్యోగుల జాబ్ చార్టు రూపొందించని సెరికల్చర్ అసిస్టెంట్ తదితరులపై శాఖాధిపతులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని డిజిటల్ అసిస్టెంట్ కేటగిరి ఉద్యోగుల పేరును డిజిటల్ సెక్రటరీగా మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు భేటీ.. ప్రతి మూడు నెలలకొకసారి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్టు అజయ్జైన్ చెప్పారు. ప్రమోషన్ చానల్పై స్పష్టత కోరాం ఉద్యోగుల ప్రమోషన్ చానల్ను స్పష్టం చేయాలని సమావేశంలో కోరినట్లు గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అంజనరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని శాఖలకు ఇప్పటికీ సర్వీస్ రూల్స్ లేని విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చామన్నారు. సెరికల్చర్, ఏఎన్ఎం, మహిళా పోలీస్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించి సర్వీస్ రూల్స్ వెంటనే రూపొందించాలని కోరామన్నారు. కోవిడ్తో మృతి చెందిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగ అవకాశం క ల్పించాలని కోరామన్నారు. -
విద్యుత్ ఆదాతో ‘చల్లటి’ వెలుగులు
సాక్షి, అమరావతి: పేదలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో విద్యుత్ను ఆదా చేసేలా ఇళ్ల నిర్మాణం జరుగుతుందని భవన నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఇండో స్విస్– బీప్ (బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్), ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సంయుక్తంగా ఎకో–నివాస్ సంహిత (రెసిడెన్షియల్ ఈసీబీసీ కోడ్)పై విజయవాడలో గురువారం అవగాహనా సదస్సు జరిగింది. జగనన్న కాలనీల్లో ఇంధన సామర్థ్య ఇళ్ల నిర్మాణ ప్రచార పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. అనంతరం అజయ్ జైన్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా తొలి విడత రూ. 28 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇళ్లల్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ‘ఇండో స్విస్ బీప్’ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆ ఇళ్లకు బల్బులు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు సరఫరా చేస్తామన్నారు. విద్యుత్ వినియోగంలో 42 శాతం బిల్డింగ్ సెక్టార్లోనే జరుగుతున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఇండో స్విస్ బీప్ సాంకేతికత వల్ల బైట ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇళ్ల లోపల 3 నుంచి 5 డిగ్రీలు, విద్యుత్ వినియోగం 20 శాతం తగ్గుతుందని, వెలుగు ఎక్కువగా ఉంటుందని బీప్ ఇండియా డైరెక్టర్ సమీర్ మైతేల్ అన్నారు. ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ రంగ సంస్థల ప్రతినిధులు, భవన నిర్మాణ రంగ నిపుణులు పాల్గొన్నారు. -
ఓటీఎస్ ద్వారా రూ.10 వేల కోట్ల రుణాలు మాఫీ
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల మేరకు పేదల రుణాలను మాఫీ చేస్తోందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. బుధవారం విజయవాడలో సంస్థ ఎండీ భరత్ గుప్తతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1983 నుంచి 2011 వరకూ గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకొని ఇళ్లు నిర్మించుకున్న వారి అసలు, వడ్డీ కలిపి రూ.14 వేల కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఓటీఎస్ రూపంలో పేదలకు వడ్డీ, అసలు రెండింటికీ రాయితీ ఇచ్చి నిర్ణీత మొత్తాలు చెల్లించిన వారికి ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పిస్తోందని వివరించారు. 22–ఏ లిస్ట్లో ఉన్న స్థలాలను ఆ జాబితా నుంచి తొలగించి, ఎలాంటి యూజర్, స్టాంప్ చార్జీలు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు తెలిపారు. సాధారణంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో విలువపై 7.5% చెల్లించాలని, రిజిస్ట్టర్ కార్యాలయాల దగ్గర పడిగాపులు కాయాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు 7.5% చార్జీలు లేకుండా, ఎక్కడా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తుందన్నారు. డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్ స్థలాలను 22–ఏ లిస్టులో నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల స్థలం, ఇంటి విలువపై 75% వరకు బ్యాంక్ రుణం పొందే సదుపాయం ఉంటుందన్నారు. బ్యాంక్లతో సంప్రదించి రుణాలు పొందడానికి వీలుగా రిజిస్ట్రేషన్ పత్రాలు సిద్ధం చేశామని (వెట్టింగ్) చెప్పారు. గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకోని వారు 12 లక్షల మంది ఉన్నారని, వీరు కేవలం రూ.10 చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 8 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, 21న సీఎం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ ప్రారంభిస్తామన్నారు. తొలి విడతలో వాస్తవ హక్కుదారులు, వారి వారసుల ఆధీనంలో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నామన్నారు. రెండో విడతలో చేతులు మారిన ఇళ్లపై విచారణలు జరిపి, ఉత్తర్వులు అందాక రిజిస్ట్రేషన్లు చేస్తామని వివరించారు. స్వచ్ఛందంగా వచ్చిన వారికే రిజిస్ట్రేషన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, అర్హులపై ఒత్తిళ్లు ఉండవన్నారు. ఎవరైనా హక్కులు పొందడానికి ముందుకు రాకపోతే ఎటువంటి బలవంతం చేయడంలేదని తెలిపారు. ఓటీఎస్కు ముందుకు రాని వారి పింఛన్లు నిలిపివేయాలని శ్రీకాకుళం జిల్లాలో సర్క్యులర్ జారీ చేసిన పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకున్నామన్నారు. ఓటీఎస్ వినియోగించుకోకపోతే ఇతర పథకాలు ఆగిపోతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పథకం ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలని, ఒత్తిడి తీసుకురావద్దని కలెక్టర్లు, జేసీలను ఆదేశించామన్నారు. అనేక వినతులు అందాయి చివరిసారిగా రాష్ట్రంలో 2014లో ఓటీఎస్ అమలు జరిగిందని అజయ్ జైన్ చెప్పారు. అనంతరం ప్రజాప్రతినిధులు, రుణ గ్రహీతల నుంచి ఓటీఎస్ అమలు చేయాలని అనేక వినతులు అందాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 2016లో ఓటీఎస్ అమలుకు గృహ నిర్మాణ శాఖ కార్యవర్గం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిందన్నారు. అయితే అప్పటి ప్రభుత్వం అమలుపై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వడ్డీ, అసలు రెండింటికీ రాయితీ ఇచ్చి పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు. -
'బయోమెట్రిక్' ఆధారంగానే వేతనాలు
సాక్షి, అమరావతి: ‘ఏ ప్రభుత్వ, లేదా ప్రైవేట్ సంస్థ ఉద్యోగైనా సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకుండా జీతం ఇవ్వమంటే ఎవ్వరూ ఇవ్వరు. జీతం రావాలంటే సెలవు అయినా పెట్టాలి లేదా కార్యాలయానికైనా రావాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇదే అమలుచేస్తున్నారు. వారికి గతంలోనే బయోమెట్రిక్ హాజరుతో వేతనాలను అనుసంధానం చేశారు. అయితే, కోవిడ్ విపత్తు నేపథ్యంలో ఆ విధానానికి సడలింపు ఇచ్చారు. ఇప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బయోమెట్రిక్ హాజరును పునరుద్ధరించారు. అదే తరహాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ నుంచి పునరుద్ధరించారు. బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే అక్టోబర్ నెల వేతనాలిస్తాం’.. అని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ స్పష్టంచేశారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులతో పాటు శాఖాధిపతులు, కార్యదర్శులకు ఇదే విధానంలో హాజరును అమలుచేస్తున్నారని.. ప్రభుత్వోద్యోగుల తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు దీనిని అమలుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైతేనే వేతనాల్లో కోత పెడతారని.. ఇందులో తప్పేమీ లేదన్నారు. వారికి సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తాం కానీ.. విధులకు హాజరుకాకుండా సెలవు పెట్టకుండా వేతనాలివ్వాలంటే సాధ్యంకాదని జైన్ స్పష్టంచేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 మధ్య కాలంలో మొత్తం పనిదినాలు.. విధులకు హాజరైన రోజులు, ప్రభుత్వ సెలవులు పరిగణనలోకి తీసుకున్న తరువాత సిబ్బంది విధులకు గైర్హాజరైతేనే ఆ రోజులకు వేతనాల్లో కోత విధించాలని ఆయన ఆదేశించారు. మరోవైపు.. బయోమెట్రిక్ హాజరు ఆధారంగా అక్టోబర్ వేతనాలను నవంబర్ 1న చెల్లించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పష్టంచేసింది. హాజరు క్రమబద్ధీకరణకు వెసులుబాటు ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులందరికీ హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్, లాగిన్ను అందుబాటులోకి తెచ్చారు. శిక్షణలో ఉన్నా, బయోమెట్రిక్ పనిచేయకపోయినా, విధుల్లో భాగంగా సమావేశాలకు వెళ్లినా, డిప్యుటేషన్పై ఇతర శాఖలకు వెళ్లినా హాజరు క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించారు. అలాగే, సిబ్బంది రోజువారీ హాజరును తనిఖీ చేసుకునేందుకు వీలుగా గ్రామ, వార్డు సచివాలయ వెబ్సైట్లో హాజరు డ్యాష్బోర్డును అందుబాటులోకి తెచ్చారు. దీని ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు పాత పంచాయతీ కార్యదర్శులు, పాత వీఆర్వోలు, పాత మునిసిపల్ ఉద్యోగులకు వేతనాలను చెల్లించాల్సిందిగా డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశించింది. డ్యాష్బోర్డు హాజరులో సెలవులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ప్రస్తుతం హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్లో సీఎల్, ఐచ్ఛిక సెలవులే ఉన్నందున ఇతర సెలవులను కూడా పరిగణనలోకి తీసుకుని వేతనాలు చెల్లించాలని తెలిపింది. ఈ మార్గదర్శకాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వేతనాల బిల్లులను డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆధికారులు అప్లోడ్ చేసి ట్రెజరీలకు సమర్పించాల్సిందిగా అజయ్జైన్ ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో సజావుగా అమలయ్యేలా గ్రామ, వార్డు సచివాలయాల జేసీలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
ఏపీ సచివాలయ వ్యవస్థ సరికొత్త రికార్డు
సాక్షి, విజయవాడ: ప్రజాపాలనలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ వ్యవస్థ సరికొత్త రికార్డు సృష్టించిందని గ్రామ వార్డు సచివాలయ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మట్లాడుతూ.. రాష్ట్రంలో 3.2 కోట్ల మందికి సేవలు అందించిన సచివాలయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు కొత్త నిర్వచనంగా నిలిచాయని తెలిపారు. రాష్ట్రంలో రెండేళ్లలోనే 15,004 సచివాలయల ద్వారా 543సేవలు, 34సంక్షేమ పథకాల అమలవుతున్నాయని పేర్కొన్నారు. సచివాలయాలు పని తీరును ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని తెలిపారు. చదవండి: ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ 99శాతం సేవలను సీఎం వైఎస్ జగన్ చెప్పిన సమయంలోనే అందిస్తున్నామని అన్నారు. త్వరలో సచివాలయంలో 150 కేంద్ర ప్రభుత్వ సేవలను కూడా అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. 500 సచివాలయాల్లో ఆధార్ సేవలు ప్రారంభించామని తెలిపారు. రిజిస్ట్రేషన్లు కూడా సచివాలయంలో ప్రారంభిస్తామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలు ఈ వ్యవస్థను పరిశీలించాయని అజయ్ జైన్ తెలిపారు. -
ఆకర్షణీయంగా పేదల కాలనీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద వైఎస్సార్– జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. అన్ని వసతులతో పేదల కాలనీలను ఆదర్శంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 17,005 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్ల నిర్మాణాలను రెండు దశల్లో చేపడుతున్న విషయం తెలిసిందే. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు రూ.32,909 కోట్లు ఖర్చు చేయనుంది. మౌలిక వసతుల కల్పన పనులకు సంబంధించి డీపీఆర్లు సిద్ధం అయ్యాయి. తొలి దశలో ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేసిన 10 వేల లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.24 వేల కోట్లు ఖర్చు చేయనుంది. విశాలమైన రోడ్లు.. ఇంటర్నెట్ సదుపాయం.. ► కాలనీల్లో ఇళ్ల సంఖ్య, లేఅవుట్ విస్తీర్ణాన్ని బట్టి 20, 30, 40 అడుగుల రోడ్లు నిర్మించనున్నారు. 40 అడుగుల రోడ్లు నిర్మించిన చోట రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేస్తారు. ► 1,500 లోపు ఇళ్లు ఉన్న కాలనీలో సీసీ డ్రైన్లు, ఆపైన ఇళ్లు ఉన్న చోట అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు వర్షపు నీరు బయటకు వెళ్లేలా ఏర్పాటు చేస్తారు. ► కాలనీలో 550 ఇళ్ల లోపు ఉన్న చోట ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్, 550 ఇళ్లు పైబడి ఉంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్ చేపట్టనున్నారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం కల్పించనున్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద పారిశుధ్యం, పరిశుభ్రత, గ్రీనరీ కోసం కూడా చర్యలు తీసుకోనున్నారు. నాణ్యత పట్ల ప్రత్యేక శ్రద్ధ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు సన్నాహాలు చేస్తున్నాం. డీపీఆర్లు పూర్తయ్యాయి. డీపీఆర్లు సమర్పించడం, నిధుల సమీకరణ, ఇతర పనులు చేపడుతున్నాం. నాణ్యతపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాం. – ఎం.శివప్రసాద్, మౌలిక వసతుల ప్రత్యేక అధికారి, గృహ నిర్మాణ శాఖ వచ్చే ఏడాది డిసెంబర్లో పనులు పూర్తి ఇళ్ల నిర్మాణ అవసరాలకు వీలుగా బోర్లు, మోటార్లు, విద్యుత్ కనెక్షన్లు, నీటి నిల్వ వసతులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.1200 కోట్లు ఖర్చు పెట్టింది. శాశ్వత మౌలిక వసతుల కల్పనకు రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి నిధుల సమీకరణ, టెండర్లు పిలవడం, ఇతర సాంకేతిక పరమైన పనులు పూర్తి చేస్తాం. 2022 డిసెంబర్ నెలాఖరుకు తొలి లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ -
‘సచివాలయ’ సిబ్బంది వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: వచ్చే అక్టోబర్ నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ పూర్తయినట్లు ప్రకటించేందుకు జిల్లాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)ల ఆధ్వర్యంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అక్టోబర్ నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారి వివరాలతో పాటు వారి పోలీసు వెరిఫికేషన్, డిపార్ట్మెంట్ టెస్ట్ ఉత్తీర్ణత వివరాలను సిద్ధం చేసుకుని వాటిని నిర్ణీత ఫార్మాట్లో గ్రామ, వార్డు సచివాలయ శాఖకు తెలియజేయాలని అజయ్ జైన్ కలెక్టర్లను కోరారు. -
పేదల ఇళ్ల సామగ్రిలో రూ.5,120 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ సామగ్రిలో (మెటీరియల్) రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా గృహ నిర్మాణశాఖ భారీగా ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసింది. తొలిదశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లకు ఇసుకను మినహాయించి మిగతా 12 రకాల మెటీరియల్కు రివర్స్ టెండర్లను నిర్వహించగా ఏకంగా రూ.5,120 కోట్ల మేర ఆదా అయింది. సిమెంట్, స్టీలు, డోర్లు, శానిటరీ, పెయింటింగ్, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, టాయిలెట్ సామాన్లు, నీటి సరఫరా తదితర 12 రకాల మెటీరియల్కు జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదం అనంతరం టెండర్లను ఆహ్వానించడమే కాకుండా అనంతరం రివర్స్ టెండర్లను గృహ నిర్మాణ శాఖ నిర్వహించింది. ఈ రివర్స్ టెండర్లు సత్ఫలితాలనిచ్చాయి. ఐఎస్ఐ మార్కు కలిగిన నాణ్యమైన మెటీరియల్ తక్కువ ధరకే లభ్యమయ్యాయి. 12 రకాల మెటీరియల్కు ఒక్కో ఇంటికి రివర్స్ టెండర్కు ముందు రూ.1,31,676 చొప్పున వ్యయం కానుండగా రివర్స్ టెండర్ల ద్వారా రూ.98,854కే లభించాయి. అంటే ఒక్కో ఇంటికి 12 రకాల మెటీరియల్లో రూ.32,822 చొప్పున ఆదా అయింది. తొలిదశలో నిర్మించనున్న 15.60 లక్షల ఇళ్లను పరిగణలోకి తీసుకుంటే మొత్తం రూ.5,120 కోట్లు ఆదా అయింది. లబ్ధిదారుల ఐచ్ఛికమే మన ఇంటికి ఎలాంటి నాణ్యమైన మెటీరియల్ వినియోగిస్తామో పేదల ఇళ్లకు కూడా అలాంటి మెటీరియలే సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందుకు అనుగుణంగా నాణ్యమైన మెటీరియల్ తక్కువ ధరకు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నాం. 12 రకాల మెటీరియల్కు రివర్స్ టెండర్లు నిర్వహించగా ఒక్కో ఇంటి మెటీరియల్లో రూ.32,822 చొప్పున ఆదా అయింది. ప్రభుత్వం సరఫరా చేసే నాణ్యమైన, తక్కువ ధరకు దొరికే మెటీరియల్ను తీసుకోవాలా వద్దా అనేది ఇళ్ల లబ్ధిదారుల ఇష్టమే. వలంటీర్లు లబ్ధిదారుల వద్దకు వెళ్లి ప్రభుత్వం సరఫరా చేసే మెటీరియల్ వివరాలను తెలియచేస్తారు. లబ్ధిదారులు కోరిన మెటీరియల్ సరఫరా చేస్తాం. 12 రకాల మెటీరియల్లో ఒకటి లేదా రెండు కావాలన్నా కూడా అంతవరకే సరఫరా చేస్తాం. ఇది పూర్తిగా లబ్ధిదారుల ఐచ్ఛికమే. ఎక్కడా బలవంతం లేదు. – అజయ్జైన్, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ -
జోరుగా ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే పది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు శంకుస్థాపనలు పూర్తిచేశారు. అంతకుముందు ఇళ్ల శంకుస్థాపనలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మెగా గ్రౌండింగ్ మేళాను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోజుకు రూ.పది కోట్ల విలువైన ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ధారించిన గడువులోగా తొలిదశ నిర్మాణాలను పూర్తిచేయాలని అధికార యంత్రాంగం పట్టుదలతో కృషిచేస్తోంది. దీంతో రెండు నెలల్లో రూ.597.94 కోట్ల విలువైన పనులు జరిగాయి. మరోవైపు.. తొమ్మిది లక్షలకు పైగా ఇళ్ల పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. ఇందుకు స్టీలు, సిమెంట్, ఇసుక, కూలీలకు మాత్రమే ప్రస్తుతం వ్యయమవుతోంది. బేస్మెంట్ స్థాయి దాటితే రోజు వారీ వ్యయం మరింత పెరుగుతుందని గృహ నిర్మాణ శాఖ చెబుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్–జగనన్న కాలనీల్లో సాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులు, శ్రీకాకుళం జిల్లాలో పనులను పరిశీలిస్తున్న అధికారులు కాలనీల వద్దే నిర్మాణ సామగ్రి గోదాములు ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సామగ్రిని గృహ నిర్మాణ శాఖ కాలనీలకు సమీపంలోనే అందుబాటులో ఉంచడంతో లబ్ధిదారులు ఉత్సాహంగా ఇళ్ల నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. గ్రామ, మండల స్థాయిల్లో గోదాములను అద్దెకు తీసుకుని వీటిని నిల్వ ఉంచారు. అలాగే.. ► పేదల ఇళ్ల నిర్మాణాల నిమిత్తం ఇప్పటికే 1.57 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ను కొనుగోలు చేయడమే కాకుండా 89,379.30 మెట్రిక్ టన్నుల సిమెంట్ను గోదాములకు తరలించి లబ్ధిదారులకు అందుబాటులో ఉంచారు. ► 24,022.68 మెట్రిక్ టన్నుల స్టీలు కొనుగోలు చేసి 3,930.557 మెట్రిక్ టన్నులను గోదాముల్లో ఉంచారు. ► ఇక 1,09,774 మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ ఉంచారు. దీంతో జాప్యం లేకుండా ఇళ్ల నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలను నిర్ధారించిన గడువులో పూర్తిచేసేందుకు సీఎం జగన్ జిల్లాకో జేసీని ప్రత్యేకంగా నియమించిన విషయం తెలిసిందే. వీరు క్షేత్రస్థాయిలో పనులు వేగంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 15కల్లా బేస్మెంట్లు పూర్తి సీఎం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 15కల్లా బేస్మెంట్ స్థాయికి ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం రోజుకు రూ.పది కోట్ల విలువగల పనులు జరుగుతున్నాయి. బేస్మెంట్ స్థాయి దాటిన తరువాత రోజుకు రూ.50 కోట్ల పనులు జరుగుతాయి. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ -
బాధిత కుటుంబాలకు సత్వర పరిహారం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ బీమా, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ పశు నష్టపరిహార పథకాలతోపాటు రైతుల ఆత్మహత్యల ఘటనల్లో బాధిత కుటుంబాలను సకాలంలో ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బాధిత కుటుంబాలను వెంటనే గుర్తించి.. వారికి సకాలంలో పరిహారం అందించేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. బాధిత కుటుంబాలకు సకాలంలో నష్టపరిహారం అందించేలా చూడాల్సిన బాధ్యతను జాయింట్ కలెక్టర్లు (గ్రామ, వార్డు సచివాలయాలు)కు అప్పగించారు. జాయింట్ కలెక్టర్ ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లా, మండల, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించి కలెక్టర్కు నివేదిక సమర్పించాలి. దీనిపై కలెక్టర్ నెలకోసారి సమీక్షించి గ్రామ, వార్డు సచివాలయాల రాష్ట్ర డైరెక్టర్కు నివేదించాలి. డైరెక్టర్ అన్ని జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించి ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సంతోషానికి 'పునాది'
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో గురువారం చేపట్టిన ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమం విజయవంతమయ్యింది. తొలి రోజు 13 జిల్లాల కలెక్టర్లు లక్ష ఇళ్లకు శంకుస్థాపనలు చేయించాలని లక్ష్యం నిర్ధేశించుకోగా, లబ్ధిదారులు కలసి రావడంతో 158 శాతం అధికంగా ఇళ్లకు శంకుస్థాపన జరిగింది. దేశ చరిత్రలో ఒకే రోజున ఒక రాష్ట్రంలో 2,02,190 ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులే స్వయంగా భూమి పూజ చేసుకోవడం ఇదే తొలిసారి. మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం శనివారం, ఆదివారం కూడా కొనసాగనుంది. సాక్షి, అమరావతి: సొంతింట్లో ఉండాలనేది అందరి కల. ఇది పెద్దోళ్లకు సుసాధ్యమైనా, పేదోళ్లకు మాత్రం కష్టసాధ్యం. సొంతింటి కల విషయంలో ఇక పేదోళ్లు దిగులు పడాల్సిన అవసరమే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వారి చేయి పట్టుకుని నడిపిస్తోంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా తొలి విడతలోనే ఏకంగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గురువారం చేపట్టిన ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమం తొలి రోజు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రాష్ట్రంలో సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి నిరుపేదలు పోటీపడ్డారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో గృహాల నిర్మాణానికి కుటుంబ సభ్యులతో కలిసి పోటాపోటీగా శంకుస్థాపనలు చేయడంతో రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. తొలి రోజు 13 జిల్లాల కలెక్టర్లు నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా.. 157 శాతం ఇళ్లకు శంకుస్థాపన జరగడం గమనార్హం. దేశ చరిత్రలో ఒకే రోజున ఒక రాష్ట్రంలో 2,02,190 ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులే స్వయంగా భూమి పూజ చేసుకోవడం ఇదే తొలిసారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం శని, ఆదివారాల్లో కూడా కొనసాగనుంది. అనంతపురం జిల్లా ఉరవకొండలోని లేఅవుట్ వద్ద లబ్ధిదారులు పేదోళ్లందరికీ సొంతిల్లు రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలెవరూ ఉండకూడదనే లక్ష్యంతో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ పథకం కింద మొదటి దశలో 8,905 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని గతనెల 3న సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ గృహాలను 2022 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. జగన్ దృఢ సంకల్పాన్ని సాకారం చేసేందుకు అధికార యంత్రాంగం సమష్టిగా ముందుకు కదిలింది. ఈనెల 1, 3, 4న మూడు రోజుల్లో రోజుకు లక్ష చొప్పున మూడు లక్షల ఇళ్లకు లబ్ధిదారులతో శంకుస్థాపన చేయించాలని నిర్దేశించుకుంది. ఈ మూడు రోజులూ యజ్ఞంలా పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం.. గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 13 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. మెగా ఇళ్ల శంకుస్థాపనలో తొలి రోజున 1.28 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రికార్డు స్థాయిలో శంకుస్థాపనలు లబ్ధిదారులు గురువారం ఉదయమే వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తమకు కేటాయించిన స్థలంలో.. సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అధికారుల సమక్షంలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం పండిత విల్లూరులోని వైఎస్సార్ జగనన్న కాలనీలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కృష్ణా జిల్లా పెనమలూరులోని కాలనీలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం.. గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు, 13 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించడం, ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులు పోటాపోటీగా కదలిరావడంతో గురువారం రాత్రి 7 గంటల సమయానికి 2,02,190 గృహాలకు శంకుస్థాపనలు జరిగాయి. ప్రత్యేక జాయింట్ కలెక్టర్ ద్వారా పర్యవేక్షణ దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 68,381 ఎకరాల భూమిని 30.76 లక్షల మంది నిరుపేద మహిళలకు ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేసి, రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇళ్ల నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు చొప్పున స్థలాలను పంపిణీ చేసి గృహాలను కూడా మంజూరు చేసింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రూ.50,944 కోట్లతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రహదారులు, భూగర్భ మురుగునీటి కాలువల వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.32,909 కోట్లను ఖర్చు చేస్తోంది. తొలి దశలో 8,905 కాలనీల్లో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని జూన్ నాటికి పూర్తి చేసేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్–హౌసింగ్ పదవి సృష్టించి, యువ ఐఏఎస్ అధికారులను నియమించింది. పనులను పరుగులు పెట్టిస్తోంది. కృష్ణాజిల్లా నున్న గ్రామంలో ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన పనుల్లో లబ్ధిదారులు యజ్ఞంలా ఇళ్ల శంకుస్థాపన మెగా ఇళ్ల శంకుస్థాపనలో తొలి రోజు లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో 2.02 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేసుకున్నారు. దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ ఒకే రోజున లబ్ధిదారులే ఇంత భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్న దాఖలాలు లేవు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో తొలి దశ కింద 15.60 లక్షల ఇళ్లను జూన్లోగా పూర్తి చేయాలన్నది సీఎం వైఎస్ జగన్ దృఢ సంకల్పం. ఆలోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం సమష్టిగా కృషి చేస్తున్నాం. తొలి రోజున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, జేసీలు, అధికారులు, లబ్ధిదారులకు కృతజ్ఞతలు. – అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ -
జగనన్న కాలనీల్లో ‘పవర్’ఫుల్ లైన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో అత్యాధునిక హంగులతో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక 90 శాతం తయారైనట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై గురువారం సమీక్షిస్తారని చెప్పారు. జగనన్న కాలనీల్లో పటిష్టంగా విద్యుత్ పంపిణీకి అన్ని చర్యలు చేపట్టారు. లే అవుట్లలో ఇళ్ల సంఖ్య, వినియోగించే విద్యుత్ ఆధారంగా ముందే లోడ్ను అంచనా వేశారు. భవిష్యత్తులో లోడ్ పెరిగినా తట్టుకునేలా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికతకు ఇందులో ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి వీధిలో రాత్రి వేళ అధిక వెలుగులు విరజిమ్మేలా వీధి దీపాలను అమరుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సహజసిద్ధమైన గాలి, వెలుతురు వినియోగించుకుంటూ తక్కువ విద్యుత్ వినియోగం జరిగేలా విదేశీ సాంకేతికతతో నిర్మాణాలు చేపట్టనున్నారు. పోల్స్ కనిపించకుండా పవర్.. జగనన్న కాలనీల్లో ప్రత్యేక విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.6,475.41 కోట్లు ఖర్చు కానుందని అంచనా వేశారు. 500 ఇళ్ల కన్నా ఎక్కువ ప్లాట్లు ఉండే లే అవుట్లలో పూర్తిగా భూగర్భ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల కాలనీల్లో వీధి దీపాలకు మినహా పెద్దగా విద్యుత్ పోల్స్ అవసరం ఉండదు. భూగర్భ విద్యుత్ వ్యవస్థ వల్ల ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోనూ అంతరాయాలు చోటు చేసుకునే అవకాశం ఉండదని ఉన్నతాధికారులు తెలిపారు. తక్కువ ఇళ్లు ఉండే లే అవుట్లలో మాత్రం విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరో 2,271 లేఅవుట్లకు నెలాఖరుకు డీపీఆర్ కోర్టు వివాదాల్లో ఉన్నవి, వ్యక్తిగతంగా ఇంటి స్థలం ఉన్నవారిని మినహాయిస్తే ఇప్పటివరకూ 17,005 లే అవుట్లకు సంబంధించి 18,77,263 ఇళ్ల విద్యుదీకరణపై అధికారులు దృష్టి పెట్టారు. 17,92,225 ఇళ్లకు సంబంధించి 14,734 లేఅవుట్ల పరిధిలో విద్యుదీకరణకు సమగ్ర నివేదికలు (డీపీఆర్) రూపొందించారు. ఇందులో భూగర్భ విద్యుత్ సరఫరా చేసే లే అవుట్లు 432, ఇళ్లు 8,36,705 ఉన్నాయి. మరో 2,271 లేఅవుట్లకు సంబంధించి 85,038 ఇళ్లకు విద్యుదీకరణ డీపీఆర్ ఈ నెలాఖరుకు సిద్ధం కానున్నట్లు అధికారులు తెలిపారు. 50 శాతం భూగర్భ విద్యుత్తే జగనన్న కాలనీల్లో 50 శాతం వరకూ భూగర్భ విద్యుదీకరణకే ప్రాధాన్యమిస్తున్నాం. ఇప్పటికే 90 శాతం డీపీఆర్లు పూర్తయ్యాయి. మిగతా డీపీఆర్లు ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. రెండు దశల విద్యుదీకరణ ప్రక్రియను 2023కి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. విద్యుదీకరణకు అయ్యే మొత్తాన్ని రుణంగా తీసుకుని డిస్కమ్లకే అందిస్తాం. దీనికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. – అజయ్జైన్ (గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి) -
Andhra Pradesh: ఇన్ని లక్షల ఇళ్ల నిర్మాణం ప్రపంచంలోనే అరుదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల కోసం ఏకంగా 17,005 కాలనీల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం ప్రపంచంలోనే అరుదైన అంశమని కేంద్ర పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ప్రశంసించారు. పేదల ఇళ్ల నిర్మాణాల కోసం జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ను ప్రత్యేకంగా నియమించడం అంటే ప్రభుత్వం పేదలకు ఎంత ప్రాధాన్యత ఇస్తోందో స్పష్టం అవుతోందని అన్నారు. ఇటీవల ఆయన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఇళ్ల నిర్మాణంపై ఆరా తీశారు. ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చేపట్టారని తెలుసుకుని, స్వయంగా రాష్ట్రానికి వచ్చి పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల కాలనీలను చూస్తానని తెలిపారు. సంతృప్త స్థాయిలో ఇళ్ల నిర్మాణం దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో పేదలందరికీ సంతృప్త స్థాయిలో అంటే 30.76 లక్షల మంది అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులను యజ్ఞంలా కొనసాగిస్తోంది. తొలి దశలో వైఎస్సార్–జగనన్న కాలనీల్లో నిర్మించే పేదల ఇళ్లకు ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు అంటే ఈ నెల 10వ తేదీ వరకు పండుగ వాతావరణంలో ఏకంగా 1.72 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. సెప్టెంబర్ నెలాఖరు కల్లా పూర్తి స్థాయిలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా గృహ నిర్మాణ శాఖ చర్యలను చేపట్టింది. పేదల ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ గట్టి పట్టుదలతో ఉండటమే కాకుండా అందుకోసం ప్రత్యేకంగా జిల్లాకో జాయింట్ కలెక్టర్ను నియమించిన విషయం తెలిసిందే. 13 జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. దీంతో అన్ని ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. తొలి దశలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్ నాటికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను రూ.28,084 కోట్ల వ్యయంతో ప్రభుత్వం చేపట్టింది. మెటీరియల్ సరఫరాలో జాప్యం ఉండదు ఇళ్ల నిర్మాణాలకు మెటీరియల్ సరఫరాలో జాప్యం ఉండదు. ఇసుక, స్టీలు, సిమెంట్ను ఇప్పటికే గ్రామ, మండల స్థాయిల్లోని గోదాముల్లో నిల్వ చేశాం. ప్రత్యేకంగా జిల్లాకో జాయింట్ కలెక్టర్ బాధ్యత తీసుకున్నందున పేదల ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగంగా కొనసాగుతాయి. ఒక్క వారంలోనే 1.72 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. వీలైనంత త్వరగా అన్ని ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించి ముఖ్యమంత్రి నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేస్తాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ -
కొత్తగా 45 ఏళ్లు నిండే మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’
సాక్షి, అమరావతి: ఈ ఏడాది కొత్తగా 45 ఏళ్లు నిండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు కూడా వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా 45 ఏళ్ల వయస్సు నిండిన అర్హులైన మహిళలను వలంటీర్ల ద్వారా గుర్తించే ప్రక్రియను మొదలు పెట్టారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే అర్హులైన మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది మొదటి విడతలో 24 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం దాదాపు రూ.4,500 కోట్ల మొత్తాన్ని చెల్లించింది. కాగా, గత ఏడాది 44 ఏళ్ల వయస్సు పూర్తయి పథకానికి అర్హత పొందలేకపోయిన వారిని ఈ ఏడాది అధికారులు గుర్తిస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఏడాది 60 ఏళ్ల వయస్సు పూర్తయిన వారిని కూడా వలంటీర్లు గుర్తిస్తారు. ఇకపై వీరు పెన్షన్ పథకం కిందకు వస్తారు. ఈ మేరకు రెండో ఏడాది పథకం అమలుకు వలంటీర్ల ద్వారా ఆయా వయస్సు వారిని ప్రత్యేకంగా గుర్తించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులో ఉంచారు. వలంటీర్ల ద్వారా ఈ ప్రక్రియను చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్కు లేఖ రాశారు. -
వైఎస్సార్–జగనన్న కాలనీల్లో రూ.920 కోట్లతో నీటిసరఫరా
సాక్షి, అమరావతి: పేదల కోసం పెద్ద ఎత్తున నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించిన వైఎస్సార్–జగనన్న కాలనీల్లో తొలిదశలో 8,679 లే అవుట్లలో రూ.920 కోట్లతో నీటిసరఫరా పనులను ప్రభుత్వం చేపట్టింది. తొలిదశలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 8,905 లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిలో 8,679 లే అవుట్లలో (గ్రామీణ ప్రాంతాల్లో 8,207, పట్టణ ప్రాంతాల్లో 472) నీటిని సమకూర్చాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే 8,268 లే అవుట్లలో 8,483 నీటిసరఫరా పనులను మంజూరు చేయగా 6,410 లే అవుట్లలో 7,420 పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో ఇప్పటికే 1,730 లే అవుట్లలో 1,730 నీటిసరఫరా పనులు పూర్తయ్యాయి. 4,680 లే అవుట్లలో 5,690 నీటి సరఫరా పనులు పురోగతిలో ఉన్నాయి. పేదలకు సంబంధించి తొలిదశ ఇళ్ల నిర్మాణాల్లో ప్రత్యేకంగా నీటిసరఫరా కోసం ఏకంగా రూ.920 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. గతంలో ఏ ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణాల ప్రారంభానికి ముందే నీటిసరఫరా వసతిని కల్పించిన దాఖలాల్లేవు. దీన్నిబట్టి చూస్తే పేదల ఇళ్ల నిర్మాణాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో స్పష్టం అవుతోందని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నెలాఖరుకు నీటిసరఫరా పనులు పూర్తి వచ్చే నెల 1వ తేదీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోను వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందేనని సీఎం ఆదేశించారు. దీంతో ఈ నెలాఖరుకల్లా ఈ కాలనీల్లో నీటిసరఫరా పనులను పూర్తిచేస్తాం. లే అవుట్ల సైజు ఆధారంగా ఒక్కోచోట రెండేసి చొప్పున, పెద్ద లే అవుట్లలో అయితే 3 లేదా 4 బోర్లు వేస్తున్నాం. దీంతో పాటు మోటారు కనెక్షన్ ఇవ్వడమే కాకుండా లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాల దగ్గరకు నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇళ్ల నిర్మాణాల కోసమే ఈ బోర్లు వేస్తున్నాం. ఆ తరువాత ఇవే బోర్లు ఆయా కాలనీల్లో ప్రజలకు ఉపయోగపడతాయి. రూ.920 కోట్లతో చేపట్టిన నీటిసరఫరా పనుల్లో రూ.641 కోట్ల పనులను గ్రామీణ నీటిసరఫరా ఇంజనీరింగ్ విభాగం, రూ.279 కోట్ల పనులను ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం చేపట్టాయి. – అజయ్జైన్, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ -
జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు అదుర్స్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ – జగనన్న పేదల ఇళ్ల కాలనీల్లో మధ్య తరగతి కాలనీల స్థాయిలో మౌలిక వసతులు కల్పించే దిశగా కార్యాచరణ సిద్ధమైంది. ఈ విషయంలో రాజీ పడేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలనీల్లో ఇరుకు రహదారులు, మొక్కుబడిగా మౌలిక వసతులు కల్పించి చేతులు దులుపుకుంటే కుదరదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీంతో మధ్యతరగతి ప్రజల కాలనీల్లో ఏ స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తున్నారో అదే స్థాయిలో ఈ కాలనీల్లో కూడా మౌలిక వసతుల కల్పనకు శాఖల వారీగా ప్రాథమిక అంచనాలను సిద్ధం చేశారు. పేదల కాలనీల్లో తొలుత 20 అడుగుల్లోపు రహదారులను అధికారులు ప్రతిపాదించగా ముఖ్యమంత్రి తిరస్కరించారు. ఓపెన్ ఏరియా 13 శాతం ఉండాల్సిందేనని ఆదేశించారు. దీంతో 20 అడుగుల నుంచి 60 అడుగుల వరకు రహదారుల నిర్మాణానికి, కాలనీల్లో 13 శాతం మేర ఓపెన్ స్పేస్కు అదనంగా అవసరమైన భూ సేకరణకు అధికారులు చర్యలను చేపట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు వర్షపు నీరు కూడా వెళ్లేలా నిర్మాణాలు ఉండాలని, ఫుట్పాత్పై టైల్స్ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద పారిశుధ్యం, పరిశుభ్రత, గ్రీనరీ కోసం కూడా చర్యలు తీసుకోనున్నారు. అదనంగా 950 ఎకరాలు అవసరం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రహదారుల సైజు పెంచడం, ఓపెన్ ఏరియా 13 శాతం మేర ఉంచేందుకు చర్యలు తీసుకోవడం వల్ల అదనంగా 950 ఎకరాలు అవసరం అవుతుందని అంచనా వేయడంతో పాటు ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు గృహ నిర్మాణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్–జగనన్న పేదల ఇళ్ల కాలనీల్లో ఏకంగా 11,412 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ రహదారుల వెంబడే అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్, ఎలక్ట్రిఫికేషన్ కేబుల్స్ రానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 17,005 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్ల నిర్మాణాలను రెండు దశల్లో చేపట్టనున్న విషయం తెలిసింది. ఈ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.30,958 కోట్లు వ్యయం అవుతుంది. ఇందుకు అదనంగా సామాజిక మౌలిక వసతుల కల్పనకు మరో రూ.2,715 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మధ్యతరగతి కాలనీలకు ఏమాత్రం తీసిపోవు మధ్యతరగతి ప్రజల కాలనీలకు తీసిపోని స్థాయిలో వైఎస్సార్–జగనన్న పేదల ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పన ఉండాల్సిందేనన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రహదారులు, ఓపెన్ ఏరియా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటర్నెట్, ఎలక్ట్రిఫికేషన్ రీ–డీజైన్ చేశాం. శాఖల వారీగా ప్రాథమిక అంచనాలను రూపొందించాం. ఇందులో ఇంకా మార్పులు జరిగే అవకాశం ఉంది. కాలనీల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా, అత్యంత నాణ్యతతో పనులు చేపడుతున్నాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ -
ఇళ్లు కట్టుకునేందుకు 7.69 లక్షల మంది సంసిద్ధత
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడాలేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 7.69 లక్షల మందికి పైగా లబ్ధిదారులు తామే ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు. వీరిలో ఇప్పటికే 41వేల మందికి పైగా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాక అందులో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటి స్థలం పట్టాల మంజూరు సమయంలో గృహ నిర్మాణ శాఖ లబ్ధిదారులకు మూడు ఆప్షన్లను ఇచ్చి ఏ ఆప్షన్ కావాలంటూ వారి అభిప్రాయాన్ని తెలుసుకుంది. అవి.. ► తొలి ఆప్షన్గా.. ప్రభుత్వం చూపిన నమూనా ప్రకారం ఇంటి నిర్మాణానికి నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్ చార్జీలనూ చెల్లిస్తుంది. లబ్ధిదారులు దగ్గరుండి ఇల్లు కట్టుకోవచ్చు. ► రెండో ఆప్షన్గా.. లబ్ధిదారుడు ఇంటి సామాగ్రి తెచ్చుకుని కట్టుకోవచ్చు. పనుల పురోగతి ఆధారంగా దశల వారీగా డబ్బులు లబ్ధిదారులకు ఇస్తామని తెలిపింది. అవసరమైతే ఇళ్ల స్థలాల దగ్గరకే తక్కువ ధరకు సిమెంట్, ఇసుక కూడా సరఫరా చేస్తుంది. ► మూడో ఆప్షన్గా.. లబ్ధిదారుడు ఇల్లు కట్టించి ఇవ్వమని కోరితే, ప్రభుత్వమే స్వయంగా కట్టి ఇస్తుంది. లే అవుట్లలో కట్టి చూపుతున్న మోడల్ ఇంటి తరహాలో, నాణ్యమైన మెటేరియల్తో కట్టించి ఇస్తారు. లబ్ధిదారులు ఎలా కోరుకుంటే అలా చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో.. అత్యధికంగా 7,69,204 మంది లబ్ధిదారులు రెండో ఆప్షన్ను ఎంచుకున్నారు. వీరిలో ఇప్పటికే ఈ నెల 10 నాటికి 41,535 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. వీరికి అవసరమైతే స్థలాల వద్దకే సిమెంట్, ఇసుకను తక్కువ ధరకే ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మిగతా సామాగ్రి కూడా సరఫరా చేయమంటే ప్రభుత్వం చేస్తుంది. లేదంటే లబ్ధిదారులే సామాగ్రి తెచ్చుకుని నిర్మాణాలు చేసుకుంటుంటే పనుల పురోగతి ఆధారంగా దశల వారీగా డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు కాలనీల్లో నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. రెండో ఆప్షన్ లబ్ధిదారులకు సిమెంట్, ఇసుక సరఫరా తొలిదశలో.. అత్యధిక మంది రెండో ఆప్షన్ ఎంచుకున్నారు. వారే నిర్మాణ సామాగ్రి తెచ్చుకుని నిర్మాణాలు చేసుకుంటే పనులు పురోగతి ఆధారంగా దశల వారీగా డబ్బులిస్తాం. వారు కోరుకుంటే ఇళ్ల స్థలాల దగ్గరకే తక్కువ ధరకు సిమెంట్, ఇసుక కూడా సరఫరా చేస్తాం. ఇంకా ఏమైనా సామాగ్రి సరఫరా చేయమని లబ్ధిదారులు అడిగితే చేస్తాం. ఇళ్ల నిర్మాణాలు చేసుకునే వారికి అన్ని విధాలా సహకారం అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మంచి రోజు చూసుకుని మే తొలి వారంలో మరికొంత మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. –అజయ్ జైన్ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
సచివాలయాల్లో రోజూ ‘స్పందన’
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రజల సమస్యలను నిత్యం తెలుసుకుని, త్వరితగతిన పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాల బాధ్యతలు నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పని దినాల్లో గ్రామ, వార్డు సచివాలయాలన్నింటిలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు సిబ్బంది అంతా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండేలా చూడాలని గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్జైన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిబ్బంది కార్యాలయం నుంచి వెళ్లే ముందు తప్పనిసరిగా బయోమెట్రిక్ పంచ్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందరికీ బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని, ఈ హాజరు ఆధారంగానే వారికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఉత్తర్వులోని ముఖ్యాంశాలు ఇంకా ఇలా ఉన్నాయి. 2.6 లక్షల మంది వలంటీర్లకు గుర్తింపు కార్డులు ► గ్రామ, వార్డు వలంటీర్లందరికీ గుర్తింపు కార్డులతో పాటు నవరత్నాల లోగోతో కూడిన బ్యాడ్జిలను వీలైనంత త్వరగా ఇవ్వాలి. సంబంధిత శాఖ వలంటీర్ల బ్యాడ్జ్ను రూపొందించి సీఎం కార్యాలయం ఆమోదం పొందిన వెంటనే 2.6 లక్షల మంది వలంటీర్లకు వాటిని అందజేయాలి. ► గ్రామ, వార్డు వలంటీర్ల క్లస్టర్ల వారీగా లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల్లో తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి. దీని వల్ల ఆయా వలంటీర్ల పరిధిలో లబ్ధిదారులు తమకు ఏయే పథకాలు అందింది.. లేనిది తెలుసుకోగలుగుతారు. ► రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నిర్ణీత కాల వ్యవధిలోగా బియ్యం, పెన్షన్, ఆరోగ్య శ్రీ కార్డులతో పాటు ఇంటి స్థలం పట్టా ఇవ్వాలనేది తప్పనిసరిగా నూటికి నూరు శాతం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. నిర్ణీత సమయంలో పథకాలందాలి ► అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే ఆరోగ్య శ్రీ కార్డు మంజూరు చేయాలి. దరఖాస్తు చేసుకున్న అర్హులకు పది రోజుల్లోనే బియ్యం కార్డు మంజూరు చేయాలి. అర్హులైన వారికి 21 రోజుల్లోనే (గతంలో పది రోజులు) పెన్షన్ కార్డులను మంజూరు చేయాలి. 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టాను మంజూరు చేయాలి. ► ఈ నాలుగు.. నిర్ణీత కాల వ్యవధిలోగా అర్హులైన వారికి మంజూరయ్యేలా చూసేందుకు సంబంధిత శాఖల అధికారులు, జిల్లా స్థాయి అధికారులు తరుచూ సమావేశమై అవసరమైన చర్యలు తీసుకోవాలి. ► ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉన్నందున కొత్త మంజూరులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కోడ్ ముగిసిన తర్వాత యధావిధిగా అర్హులైన వారికి నిర్ణీత కాల వ్యవధిలో ఆయా పథకాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలి. ► వలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. తమ పరిధిలోని ప్రజల సమస్యలు, అవసరాల పట్ల సరిగా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వలంటీర్లను తొలగించాలి. -
ఆ కాలనీలు 'కళకళ'
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేలా వైఎస్ జగన్ సర్కారు అడుగులు ముందుకు వేస్తోంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అర్హులైన పేదలందరికీ సంతృప్త స్థాయిలో.. 30 లక్షల మందికిపైగా ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వడంతో పాటు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆయా కాలనీల్లో ఇళ్లు నిర్మించి, చేతులు దులుపుకోకుండా ఆ కాలనీల జనాభా ఆధారంగా సకల సామాజిక మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,215.25 కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించింది. పేదల కోసం నిర్మిస్తున్న ఈ కాలనీల్లో అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్స్, కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, షాపింగ్ మాల్స్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అన్ని సౌకర్యాలతో నివాస యోగ్యంగా ఉండేలా కాలనీలను తీర్చిదిద్దాలని, ఈ కాలనీలు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోవాలని సీఎం గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ రూపొందించింది. ఇందులో భాగంగా కొత్తగా 980 గ్రామ, వార్డు సచివాలయాలు, 639 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, 771 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, 3,061 షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు కానున్నాయి. ఇళ్ల నిర్మాణంతో సమాంతరంగా సామాజిక వసతులు మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లలో ఏ విధమైన సామాజిక వసతులు కల్పిస్తారో అందుకు దీటుగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలుండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మేరకు కాలనీల్లో ఇళ్ల నిర్మాణంతో పాటు సమాంతరంగా సామాజిక మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నాం. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు వెళుతున్నాం. కాలనీల్లో పార్కులతో పాటు, స్కూల్స్, డిజిటల్ లైబ్రరీలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి -
జియో ట్యాగింగ్ బాధ్యత పీడీలదే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పురోగతి, గృహాల జియో ట్యాగింగ్, ఇతర వసతులకు సంబంధించిన పురోగతిపై జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే మొదట కృష్ణాజిల్లాలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. మిగిలిన 12 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహించే విషయమై ప్రణాళికను సిద్ధం చేశారు. రాష్ట్రంలో మొదటి దశలో పేదలకు 15.60 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 90 శాతానికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు కూడా పంపిణీ చేశారు. వీటి నిర్మాణాలు వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇప్పటికే మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించిన జియో ట్యాగింగ్ను వెంటనే పూర్తిచేయాల్సి ఉంది. ఈ బాధ్యత ప్రాజెక్టు డైరెక్టర్లు (పీడీ) తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్తగా భారీస్థాయిలో ఏర్పాటవుతున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కల్పించాల్సిన వసతులపై కలెక్టర్లు పరిశీలించి వివరాలు పంపాలని జిల్లాస్థాయి అధికారులను అజయ్ జైన్ ఇప్పటికే కోరారు. జియో ట్యాగింగ్లో వెనుకబడ్డ జిల్లాల్లో ముందుగా ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇప్పటివరకు సాధించిన పురోగతి తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించేందుకు పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఇప్పటికే జిల్లా అధికారులకు సమాచారం పంపారు. తక్కువ ధరకే నిర్మాణ సామగ్రి లబ్ధిదారులు సమ్మతిస్తే ఇంటి నిర్మాణానికి అవసరమైన నాణ్యతతో కూడిన నిర్మాణ సామగ్రిని మార్కెట్ ధర కంటే తక్కువ రేట్లకు పంపిణీ చేసే విషయమై ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని సమావేశంలో అజయ్ జైన్ సూచించారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విడతల వారీగా ఇవ్వనున్న నిర్మాణ సామగ్రి సమాచారం, ఇతర వివరాలను లబ్ధిదారులకు ప్రత్యేకంగా ఇచ్చే పాసుపుస్తకంలో నమోదు చేస్తారు. ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది మొబైల్ నంబర్లు ఇందులో పొందుపరుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులందరికీ ఉపాధి హామీ జాబ్ కార్డులు ఇస్తారు. గృహ నిర్మాణ దశల ఆధారంగా జాబ్ కార్డున్న ప్రతి లబ్ధిదారునికి 90 రోజుల పని దినములకు సమానమైన వేతనాన్ని చెల్లిస్తారు. -
పేదల గూటికి టీడీపీ గండి!
సాక్షి, అమరావతి: ఇప్పటి వరకు దేశ, రాష్ట్ర చరిత్రలో వేలాది ఎకరాల భూమిని పారిశ్రామిక వేత్తలకు కేటాయించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి గానీ, గూడు లేని పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన దాఖలాలు లేవు. అలాంటిది తొలి సారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్లు లేని పేదలందరికీ సంతృప్త స్థాయిలో ఏకంగా 62 వేల ఎకరాల భూమిని 30.60 లక్షల మందికి పంపిణీ చేశారు. తొలి దశలో 15.60 లక్షల మంది పేదలకు ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తొలి దశలో 55,230 మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు జరగకుండా తాత్కాలికంగా గండి కొట్టింది. వివిధ సాకులతో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కాకుండా ఆ పార్టీ పెద్దల సూచనలతో కొందరు నేతలు న్యాయ స్థానాలను ఆశ్రయించారు. దీంతో తొలి దశలో తొమ్మిది జిల్లాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 55,230 పేదల ఇళ్ల నిర్మాణాల మంజూరు నిలిచిపోయింది. టీడీపీ నేతలు తాత్కాలికంగా పేదల ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్నారే తప్ప శాశ్వతంగా అడ్డుకోలేరని, న్యాయస్థానాల్లో కేసులను పరిష్కరించి.. అర్హులందరికీ లబ్ధి కలిగేలా చూస్తామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కోర్టు కేసుల వల్ల ఆగిపోయిన ప్రాంతాల్లో లబ్ధిదారుల మనసులో అలజడి ఏర్పడకుండా వారికి భరోసా కల్పించేలా కేసులు పరిష్కారం కాగానే ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణాలు చేపడతామని సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారులు లేఖలు రాశారు. పక్షం రోజుల్లో వివాదాల పరిష్కారానికి చర్యలు న్యాయ స్థానాల్లో కేసుల కారణంగా ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వని కారణంగా తొలి దశ ఇళ్ల నిర్మాణాల మంజూరు పత్రాలను 55,230 మంది పేదలకు ఇవ్వలేకపోయామని గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. వారం పది రోజుల్లోగా న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని చెప్పారు. ఆ దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. వీలైనంత త్వరగా న్యాయ స్థానాల్లో కేసుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ల సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇంకా ఎక్కువ రోజులు జాప్యం అయితే రెండో దశ ఇళ్ల నిర్మాణాల్లో తొలి దశలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని సీఎం ఆదేశించారని తెలిపారు. -
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి సర్వీసు రూల్స్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవస్థీకరించిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల ముంగిట సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి సర్వీసు రూల్స్ రూపొందించి, వారికి ఉద్యోగపరమైన ప్రయోజనాలు అందజేయాల్సిన అవసరం ఉందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. ఆయన అధ్యక్షతన విజయవాడ ఆటోనగర్లోని గ్రామ, వార్డు సచివాలయాల కమిషనరేట్లో గురువారం సమావేశం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి సర్వీసు రూల్స్, సెలవుల నియమావళి, ప్రొబేషన్, ఉద్యోగుల ఆరోగ్య పథకం, కారుణ్య నియామకాలు, సర్వీసు పుస్తకం నిర్వహణ, శిక్షణ, శిక్షణ సంబంధిత పరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు, డ్రెస్ కోడ్ తదితర అంశాలపై చర్చించారు. మార్చి 30లోపు ఆయా శాఖలు సర్వీసు పుస్తకాలు ప్రారంభించాలన్నారు. సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల కమిషనర్ డా.నారాయణ భరత్గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్పై కసరత్తు
సాక్షి, అమరావతి: గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసేందుకు గురువారం వివిధ శాఖాధిపతులతో సమావేశం నిర్వహించనుంది. గ్రామ వార్డు సచివాలయ ముఖ్య కార్యదర్శి అజయ్జైన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ, పట్టణాభివృద్ది, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, సీసీఎల్ఏ, మహిళా శిశు సంక్షేమ, సర్వే అండ్ ల్యాండ్ రికారŠుడ్స, సాంఘిక సంక్షేమ శాఖల కమిషనర్లు, డైరెక్టర్లు సమావేశంలో పాల్గొంటారు. జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ జరగని రీతిలో కేవలం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలో కొత్తగా 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి అప్పటికప్పుడే వాటిని భర్తీ చేసిన విషయం తెలిసిందే. కాగా, సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్కు ప్రభుత్వం వెంటనే కసరత్తు ప్రారంభించడం శుభపరిణామమని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య పేర్కొంది. -
జోరుగా ఇళ్ల మంజూరు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఇళ్ల మంజూరు కార్యక్రమం కొనసాగుతోంది. గృహ నిర్మాణశాఖ అధికారులు పట్టాలు పొందిన లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించి ఇళ్లు మంజూరు పత్రంతో పాటు ప్రత్యేకంగా పాసు పుస్తకం అందజేస్తున్నారు. లబ్ధిదారుడి పేరు, మంజూరైన స్కీమ్, ఇంటి విలువ, హౌసింగ్ ఐడీ నంబర్, లే అవుట్ పేరు, కేటాయించిన ప్లాటు నంబర్, బ్యాంకు ఖాతా తదితర వివరాలను పాసు పుస్తకంలో పొందుపరిచారు. ఇంటి నిర్మాణానికి మార్కింగ్ అనంతరం బేస్మెంట్, రూఫ్ లెవల్, స్లాబ్ లెవల్, ఫినిషింగ్ స్థాయిల్లో ఎంత మేరకు స్టీలు, సిమెంట్ వాడారనే వివరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి ఇబ్బందులున్నా ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు టోల్ఫ్రీ నంబర్ 1902కి ఫోన్ చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే ఆయా జిల్లాలకు చెందిన గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లకు సమాచారం ఇచ్చి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. పరికరాల కొనుగోలుకు 15లోగా టెండర్లు సొంతంగా ఇళ్ల పట్టాలు, పొసెషన్ సర్టిఫికెట్ కలిగి ఉండి సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చే లబ్ధిదారులకు వర్క్ ఇన్స్పెక్టర్లు మార్కింగ్ ఇస్తున్నారు. నియోజకవర్గాల మార్కింగ్ వివరాలను ఏఈలు సేకరించి రోజూ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు అందజేయాలి. ఇంటి నిర్మాణాలకు సంబంధించిన పరికరాల కొనుగోలు టెండర్లను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి లేఅవుట్ వద్ద పరికరాలు, ధరల వివరాలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టెండర్లు పూర్తి కాగానే నిర్మాణాలు.. ఇళ్ల నిర్మాణాల కోసం పరికరాలు కొనుగోలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో టెండర్లను ఆహ్వానించాం. ఈ ప్రక్రియ త్వరలో పూర్తి చేయాలని ఆదేశించాం. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే గృహ నిర్మాణాలను వేగవంతం చేస్తాం. –అజయ్ జైన్, గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి -
5.01 లక్షల మంది చిరు వ్యాపారులకు జగనన్న తోడు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు ‘జగనన్న తోడు’ పథకం కింద 5.01 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.10వేల వరకు వడ్డీ లేని రుణాలు అందాయి. ఈ పథకాన్ని గత ఏడాది నవంబర్ 25న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ పథకం పురోగతిపై ఆయన ఈ నెల 18వ తేదీన సమీక్ష నిర్వహించారు. సుమారు 5.82 లక్షల మంది చిరు వ్యాపారులకు బ్యాంకులు వడ్డీ లేని రుణాలను మంజూరు చేశాయి. ఇందులో 5.01 లక్షల మంది చిరు వ్యాపారులకు రుణాలను కూడా అందజేశారు. అర్హులైన మొత్తం 9.65 లక్షల మందికి దరఖాస్తులను బ్యాంకర్లకు పంపించారు. అర్హత ప్రమాణికంగా లబ్ధిదారులను గ్రామ, వార్డు వలంటీర్లు గుర్తించి వారి దరఖాస్తులను బ్యాంకులకు సమర్పించారు. అర్హులైన మిగతావారికి కూడా మార్చి నెలాఖరులోగా రుణాలను మంజూరు చేయిస్తామని గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఇటీవల సీఎం సమీక్ష సందర్భంగా మిగతా దరఖాస్తులకు కూడా బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను మార్చి ఆఖరుకు మంజూరు చేయించాలని ఆదేశించారని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంబంధిత బ్యాంకు బ్రాంచ్లను తరచూ జిల్లా అధికారులు సందర్శించి, బ్యాంకు అధికారులతో మాట్లాడి చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసేలా చూస్తున్నామన్నారు.ప్రతివారం జేసీలతో సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ అప్పుల నుంచి ఉపశమనం ► అసలు చిరు వ్యాపారులు చెల్లిస్తే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. వడ్డీ లేని రుణం కోసం గుర్తించిన చిరు వ్యాపారులకు గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నారు. ► ఫుట్ పాత్లపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వారు, తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునే వారు, రహదారుల పక్కన తినుబండారాలు అమ్ముకునే వీరు, కలంకారీ పనులు, ఏటి కొప్పాక బొమ్మలు, మట్టి పాత్రలు, తోలుతో బొమ్మలు చేసే వారు, బొబ్బిలి వీణల తయారీదారులు వంటి సంప్రదాయ హస్తకళలపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఈ పథకం కింద పది వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తున్నారు. ► ఇలాంటి చిరు వ్యాపారులు రోజు వారీగా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుంచి ఎక్కువ వడ్డీకి పెట్టుబడి తీసుకోవడం వల్ల.. వారు రోజంతా పడిన శ్రమ, సంపాదనలో ఎక్కువ మొత్తం వడ్డీలు చెల్లించేందుకే పోతోంది. వీరి కష్టాన్ని స్వయంగా పాదయాత్రలో గమనించిన వైఎస్ జగన్ వారి కష్టాన్ని తీర్చేందుకు ఈ పథకం ప్రారంభించారు. రుణాలు మంజూరైన చిరు వ్యాపారుల వివరాలు -
పేదల ఇళ్లలో నాణ్యతకు పెద్దపీట
సాక్షి, అమరావతి: ఎన్నో ఏళ్లుగా పేదలు ఎదురు చూస్తున్న సొంతింటి కల త్వరలో సాకారం కానుంది. రెండేళ్లలో పేదల కోసం ప్రభుత్వం 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.28,080 కోట్లతో 15.60 లక్షల ఇళ్లు పూర్తి చేసేందుకు అవసరమైన పనులు ప్రారంభమయ్యాయి. గతంలో ఉన్న 224 చదరపు అడుగులకు బదులుగా ప్రస్తుతం కొత్తగా చేపట్టనున్న ఇళ్లను 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న దృష్ట్యా అందుకు అవసరమయ్యే సామగ్రి, ఇతర పరికరాలను రివర్స్ టెండరింగ్ ద్వారా కొనుగోలు చేసేందుకు గృహ నిర్మాణ సంస్థ టెండర్లను ఆహా్వనించిన విషయం తెలిసిందే. స్టీల్, ఆర్సీసీ డోర్లు, విండో ఫ్రేమ్స్, డోర్ షట్టర్స్, పీవీసీ టాయిలెట్ డోర్, గ్లేజ్డ్ విండో షట్టర్స్, వైట్ లైమ్, పెయింట్స్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, శానిటరీ, నీటి సరఫరా పరికరాలు, ఏసీ షీట్స్, గాల్వాల్యూమ్ షీట్స్, మైల్డ్ స్టీల్ సెక్షన్స్, ఒరిస్సా పాన్ ఫ్రీ టాప్ సేకరణ కోసం రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా టెండర్లు పిలిచారు. నాణ్యతతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన ప్రీ–బిడ్ సమావేశాలు ఈ నెల 2వ తేదీతో ముగియనున్నాయి. మండలాల వారీగా బాధ్యతలు ► నిర్ణీత సమయంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు వీలుగా ఖాళీగా ఉన్న స్థానాల్లో టెక్నికల్ సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నారు. డివిజనల్ ఇంజనీర్ స్థాయి నుండి అసిస్టెంట్ ఇంజనీర్, వర్క్ ఇన్స్పెక్టర్లకు అవసరమైతే మరికొన్ని మండలాల బాధ్యతలను అప్పగించేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. ► సగం జిల్లాల్లో ఇప్పటికే సిబ్బంది సర్దుబాటు పని పూర్తి చేసి, ఇళ్ల నిర్మాణాలకు సిద్ధమయ్యారు. మరికొంత మందికి పదోన్నతులు కూడా కల్పించారు. పునాదుల కోసం మార్కింగ్ వేయడం మొదలు.. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ► ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం పేదల కోసం నిర్మించే ప్రతి ఇంటిలో ఒక బెడ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్, సింటెక్స్ ట్యాంక్, రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తారు. నాణ్యత పరిశీలనకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ► ఇళ్ల నిర్మాణానికి వినియోగించే పరికరాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు. ► గృహ నిర్మాణ శాఖ అధికారులే కాకుండా ఇతర శాఖలకు చెందిన సిబ్బంది కూడా ఈ కమిటీలో ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయిలో కలెక్టర్ కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తారు. ప్రతి 25 ఇళ్లకు ఒక క్లస్టర్ – అజయ్ జైన్, ముఖ్యకార్యదర్శి, గృహ నిర్మాణశాఖ ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రతి 25 ఇళ్లను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి, క్షేత్ర స్థాయిలో పరిశీలన కోసం ఒక కమిటీ వేస్తాం. కమిటీ పర్యవేక్షణలోనే ఆ 25 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. కొత్తగా నిర్మించే ప్రతి లే అవుట్ వద్ద గృహ నిర్మాణానికి ఉపయోగించే వస్తువులను డిస్ ప్లే చేస్తాం. వాటి వివరాలను, ధరలను తెలియజేసే పట్టికనూ అందుబాటులో ఉంచుతాం. నాణ్యతపై ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చాం. -
గ్రామ సచివాలయాలకు పక్కా శాశ్వత భవనాలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలకు పక్కా శాశ్వత భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. తద్వారా గ్రామాల్లో ఆస్తిని సమకూర్చనుంది. ఇందుకోసం రూ.3,825.15 కోట్లను వెచ్చిస్తోంది. గ్రామాల్లో శాశ్వత మౌలిక వసతులకు ఒక్క గ్రామ సచివాలయాలపైనే ఇంత మొత్తంలో వ్యయం చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు భవన నిర్మాణాలతో గ్రామాలకు కూలీలకు చేతినిండా పని దొరుకుతోంది. ముమ్మరంగా పనులు గ్రామ సచివాలయాల భవన నిర్మాణాల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి వీటి నిర్మాణం పూర్తి చేస్తాం. బిల్లులు చెల్లించక ఎక్కడా గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు ఆగిపోలేదు. ప్రతి వారం వీటి పురోగతిని సమీక్షిస్తున్నాం. – గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ -
పేదలకు నాణ్యమైన ఇళ్లు
సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్ట నున్న గృహ నిర్మాణాల్లో ఎక్కడా లోపాలు ఉండరా దని, నాణ్యంగా ఉండాలని ఇంజనీరింగ్ సిబ్బందిని గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో కీలకంగా వ్యవహరించే ఇంజనీరింగ్ సిబ్బందితో మంగళవారం తాడేపల్లిలోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో సెమినార్ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్జైన్, గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.యస్.నవీన్ కుమార్, చీఫ్ ఇంజనీర్ మల్లికార్జునరావు పలు సూచనలు చేశారు. నాణ్యతపై ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు ఈ నెల 26న సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నవరత్నాల అమలులో భాగంగా ప్రభుత్వం ఈ పథకాన్ని డిసెంబర్ 25న లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు మరోసారి స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన రోజే గృహ నిర్మాణాలు ప్రారంభించేలా యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. డ్యాష్బోర్డులో పురోగతి వివరాలు.. ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభించే సమయానికి లబ్ధిదారునికి గృహం మంజూరు పత్రంతోపాటు సీఎం సందేశం, పూర్తి వివరాలు అందించాలని ఉన్నతాధికారులు సెమినార్లో సూచించారు. డిసెంబర్ 25న సీఎం జగన్ పథకాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఐరన్, మెటల్, ఇసుక తదితరాలను లేఅవుట్ల సమీపంలోని గోడౌన్లలో భద్రపరిచేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య మంత్రి ఆదేశాల ప్రకారం పూర్తి పారదర్శకంగా నిర్మాణాలు చేపట్టాలని, ఎక్కడా అవినీతికి ఆస్కారం ఇవ్వరాదని, ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులో పొందు పరచాలని పేర్కొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: అర్హులందరికీ తప్పనిసరిగా సంక్షేమ పథకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను ప్రకటించింది. దీని ప్రకారం అర్హత ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు అందలేదని ఎవరైనా దరఖాస్తు చేస్తే.. దానిని ఆరు పాయింట్ల ఆధారంగా ధ్రువీకరణ చేయాలి. భూ రికార్డులు, విద్యుత్ బిల్లు, 4 చక్రాల వాహనం, ఆదాయ పన్ను, ప్రభుత్వ ఉద్యోగి, పట్టణాల్లో ఆస్తి డేటాను పరిశీలించి అర్హులా లేదా అనర్హులా అనేది తేల్చాలి. ఒకవేళ అనర్హులని తేలినా కూడా.. వారు మళ్లీ తమకు 4 చక్రాల వాహనం లేదని గానీ లేదా భూమి లేదని గానీ దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించాలి. దరఖాస్తుదారుడు చెప్పింది నిజమేనని తేలితే.. అతన్ని అర్హుడిగా ప్రకటించి 17 రోజుల వ్యవధిలో సంక్షేమ ఫలాలను మంజూరు చేయాలి. అలాగే డేటాలో కూడా రికార్డులను సవరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు.. ► గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు స్పందన లేదంటే 1902కు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే దాన్ని నమోదు చేయాలి. ► సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ఆ ఫిర్యాదును ఒక్క రోజులోనే.. సచివాలయంలోని సంబంధిత సంక్షేమ సహాయకుడికి పంపాలి. ► ఆ సహాయకుడు 3 పనిదినాల్లో క్షేత్రస్థాయి తనిఖీ చేసి.. నివేదికను గ్రామ, వార్డు కార్యదర్శికి అందజేయాలి. ► దానిని గ్రామ, వార్డు కార్యదర్శి మరోసారి పరిశీలించి నివేదికను మరో 3 పనిదినాల్లో ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్కు పంపాలి. ► వాటిని ఎంపీడీవో లేదంటే మున్సిపల్ కమిషనర్ పరీశీలించి.. 3 పనిదినాల్లో నివేదికను జిల్లా జేసీ(అభివృద్ధి విభాగం)కి అందజేయాలి. ► జాయింట్ కలెక్టర్ వాటిని పరిశీలించి.. 4 పనిదినాల్లో ఆ ఫిర్యాదుకు సంబంధించిన ఆదేశాలివ్వాలి. ► ఆ ఆదేశాలు అందిన తర్వాత.. ఆ ఫిర్యాదుదారుడు అర్హుడని తేలితే 3 పనిదినాల్లో సంబంధిత శాఖ డేటాను సవరించి, అర్హుల జాబితాలో చేర్చాలి. ఈ ప్రక్రియ అంతా 17 రోజుల్లో పూర్తి చేయాలి. ► ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు ర్యాండమ్గా 10 శాతం కేసులను, జేసీలు కనీసం ఒక శాతం కేసులను వ్యక్తిగతంగా తనిఖీ చేయాలి. అందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకే.. డేటాలో తప్పులుంటే.. ఆ తప్పులను సరి చేసి అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అర్హులెవ్వరూ సంక్షేమ పథకాలు అందకుండా మిగిలిపోకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు అనుగుణంగా ఆరు పాయింట్స్ ధ్రువీకరణను తీసుకువచ్చాం. క్షేత్రస్థాయి పరీశీలన చేసి.. అర్హులకు 17 రోజుల్లో సంక్షేమ పథకాలను మంజూరు చేస్తాం. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి -
33 లక్షల వినతుల పరిష్కారం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటివరకు 33 లక్షల వినతులను పరిష్కరించారని గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన వ్యవహారాలలో ముఖ్యమంత్రి సలహాదారు ఆర్.ధనుంజయ్రెడ్డి తెలిపారు. సచివాలయాల వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్జైన్, కమిషనర్ అండ్ డైరెక్టర్ జీఎస్ నవీన్కుమార్తో కలిసి శుక్రవారం ఆయన రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ధనుంజయ్రెడ్డి ఏమన్నారంటే.. ► స్థానిక సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న 540 రకాల సేవలపై ప్రజలందరికీ అవగాహన కల్పించి మరింత మంది ఈ సేవలను వినియోగించుకునేందుకు తోడ్పడాలి. ► ప్రజల నుంచి నేరుగా అందే వినతులతో పాటు వలంటీర్ల ద్వారా అందే వినతుల పరిష్కారం విషయంలో సచివాలయాల సిబ్బంది అలసత్వం చూపవద్దు. ► సీఎం వైఎస్ జగన్ సూచించిన విధంగా నిర్ణీత గడువులోగానే వినతుల పరిష్కారం పూర్తవ్వాలి. సేవల్లో ఆలస్యమైతే సంబంధీకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకు పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ► సీఎం జగన్మోహన్రెడ్డి గ్రామాల పర్యటనకు వచ్చినప్పుడు సచివాలయాల ద్వారా అందజేసే సేవల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చే పరిస్థితి రాకూడదు. ► ప్రతి వార్డు, గ్రామ సచివాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు, వాటికి అర్హత, దరఖాస్తు చేసుకునే విధానం వంటి సమాచారం తెలియజేస్తూ నోటీసు బోర్డులు తప్పనిసరిగా ఉండాలి. ► ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ఉపయోగపడే అన్ని ముఖ్యమైన ఫోన్ నంబర్ల జాబితా, సంక్షేమ కార్యక్రమాల అమలు క్యాలెండర్, సచివాలయాల ద్వారా అందుబాటులో ఉన్న సేవల వివరాలతో కూడిన డిస్ప్లే బోర్డులు ఉంచాలి. -
పేదల ఇళ్లకు స్విస్ టెక్నాలజీ
సాక్షి, అమరావతి: పేదల కోసం నిర్మించే ఇళ్లకు ఇండో–స్విస్ సాంకేతికతతోపాటు ఇంధన సామర్థ్య టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల విద్యుత్ ఆదాతోపాటు కొత్తగా నిర్మించే ఇళ్లల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 8 డిగ్రీల వరకు తగ్గుతాయని గుర్తించారు. ఈ ప్రాజెక్టు గురించి వివరించేందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) అధికారులు ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్తో భేటీ అయ్యారు. రాష్టంలో బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్ (బీప్) అమలు చేసేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు. దేశంలో తొలిసారిగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ రెసిడెన్షియల్ (ఈసీబీసీఆర్) ప్రకారం.. ఇండో స్విస్ ఇంధన సామర్థ్య సాంకేతికతను బలహీనవర్గాల గృహాలకు అందజేస్తామని తెలిపారు. హౌసింగ్, రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ, బీప్ అధికారులతో అజయ్ జైన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో మీడియాకు వెల్లడించారు. గృహ నిర్మాణ వ్యయం తగ్గుతుంది: బీఈఈ ఈసీబీసీఆర్ వినియోగించడం వల్ల గృహ నిర్మాణ వ్యయం కూడా కొంత వరకు తగ్గుతుందని బీఈఈ పేర్కొంది. 30 లక్షల ఇళ్లలో ఎల్ఈడీ లైట్లు, అత్యుత్తమ ఇంధన సామర్థ్యం కలిగిన ఫ్యాన్లు, ఇతర ఎనర్జీ సామర్థ్య ఉపకరణాలను అమర్చేందుకు సహకరించాల్సిందిగా ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషిఎన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ సీడ్కో) కోరినట్టు చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఈసీబీసీ రెసిడెన్షియల్ కోసం కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలను నామినేట్ చేయగా, వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అసలేంటీ ప్రాజెక్ట్? - పేదలు, బలహీనవర్గాలకు 14,097 జగనన్న కాలనీల పేరుతో 30 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్లో ప్రారంభమయ్యే ఈ గృహ నిర్మాణ పథకం దేశంలోనే అతిపెద్దది. - నిర్మించే ఇళ్లల్లో పెద్ద హాల్, బెడ్ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఇంటి మొత్తం విస్తీర్ణంలో 16.66 శాతం ఓపెన్ ఏరియా ఉంటుంది. ఇంటి నిర్మాణంలో కొన్ని రకాల మెటీరియల్స్ వాడటం, సాంకేతిక చర్యలు చేపట్టడం ద్వారా ఇంట్లోని ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 8 డిగ్రీల వరకు తగ్గుతాయి. సీలింగ్ దగ్గరలో గ్లాస్ ఫిట్టింగ్ ఉండే కిటికీలు, ఇంటి పైకప్పు, గోడలను పర్యావరణహితంగా నిర్మించడం ఇండో–స్విస్ టెక్నాలజీలో ముఖ్యాంశాలు. - ఇండో–స్విస్ టెక్నాలజీతో ఇళ్లు కట్టడం వల్ల పగటిపూట ఇంటి లోపల సహజసిద్ధమైన వెలుతురు పెరుగుతుంది. కానీ చల్లదనం మాత్రం ఉంటుంది. - అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఇంధన ఆదా చేయగల విద్యుత్ ఉపకరణాలనే అమరుస్తారు. ఇల్లు చల్లగా ఉండటం, ఇంకోవైపు వాడే ఉపకరణాలు విద్యుత్ను ఆదా చేయడం వల్ల తక్కువ విద్యుత్ బిల్లులు వచ్చే వీలుంది. - స్విట్జర్లాండ్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ.. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఈ సాంకేతికతను ఆంధ్రప్రదేశ్కు అందిస్తుంది. ఏంటీ స్విస్ టెక్నాలజీ? స్విస్ టెక్నాలజీలో భాగంగా ప్రకృతిసిద్ధమైన గాలి, వెలుతురు విస్తారంగా లోనికి ప్రవేశించేలా ఇళ్లను డిజైన్ చేస్తారు. పై కప్పు, గోడల నిర్మాణంలో చల్లదనం ఎక్కువగా ఉండేలా, వేడిని లోనికి రానివ్వకుండా ప్రత్యేక పదార్థాలు వాడతారు. కిటికీలకు వాడే అద్దాలను కూడా ప్రత్యేకంగా రూపొందిస్తారు. దీంతో కాంతి మరింత ఎక్కువగా ప్రసరిÜ్తుంది. మరోవైపు ఇంధన సామర్థ్యం గల పరికరాలు, అతి తక్కువ కరెంట్ను వినియోగించుకునే ఉపకరణాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎల్ఈడీ బల్బులు, స్టార్ రేటెడ్ ఫ్యాన్లు వంటివి వాడటం వల్ల 20 శాతం కరెంట్ ఆదా అవుతుంది. స్విస్ టెక్నాలజీ వల్ల ఇంట్లో ఉష్ణోగ్రత 4 నుంచి 8 డిగ్రీల వరకు తగ్గుతుంది. కాబట్టి ఏసీలు, కూలర్లు అంతగా వాడాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు స్విట్జర్లాండ్ కంపెనీలు అక్కడి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందిస్తాయి. -
చంద్రబాబు ప్రత్యేక విమానాలకు మరో రూ.10.36 కోట్లు
-
చంద్రబాబు ప్రత్యేక విమానాలకు మరో రూ.10.36 కోట్లు
సాక్షి, అమరావతి: ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణాల కోసం ఓటాన్ అకౌంట్ నాలుగు నెలల బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.10.36 కోట్లు విడుదల చేసింది. దేశంలో ఏ రాష్ట్రానికైనా లేదా రాష్ట్రంలోని ఏ జిల్లాకైనా చంద్రబాబు ప్రత్యేక విమానం, హెలికాప్టర్లోనే వెళ్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా సింగపూర్ పర్యటనకు వెళ్లారు. సింగపూర్కు కూడా ప్రత్యేక విమానంలో వెళ్లిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. ఇతర దేశాలకు ఎప్పుడు వెళ్లినా ప్రత్యేక విమానాలే వాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి రెగ్యులర్ విమానాలున్నప్పటికీ గత ఐదేళ్లుగా ప్రత్యేక విమానంలోనే ప్రయాణాలు చేశారు. అధికార పర్యటనలైనా, పార్టీ పర్యటనలైనా ప్రత్యేక విమానాల్లోనే చంద్రబాబు వెళ్తూ వచ్చారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం రెవెన్యూ లోటు భారీగా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రెగ్యులర్ విమానాలున్న నగరాలకు కూడా ప్రత్యేక విమానాల్లో వెళ్లడాన్ని అధికారులు తప్పుపట్టారు. అయినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. ఎన్నికల ముందు ధర్మపోరాట దీక్షల పేరుతో పలు జిల్లాలకు వెళ్లారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల మధ్య ఉండాల్సిన గీతను చెరిపేశారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. చంద్రబాబు ఉపయోగించే ప్రత్యేక విమానం, హెలికాప్టర్కు గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేకంగా పార్కింగ్ కేటాయించారు. ఈ పార్కింగ్ చార్జీలను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. అలాగే పైలెట్, ఇతర సిబ్బందికి స్టార్ హోటళ్లలో బసకు అయ్యే చార్జీలను కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉంది. గత ఐదేళ్లగా చంద్రబాబు ప్రత్యేక విమానాల కోసం ఖజానా నుంచి ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టారు. బాబు గారి ప్రత్యేక విమాన చార్జీలను చెల్లించేందుకు నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్కు మరో రూ.10.36 కోట్లు విడుదల చేస్తూ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్జైన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. -
రూ.1,000 కోట్ల భారీ విద్యుత్తు కుంభకోణం
-
విద్యుత్తు కుంభకోణం.. రూ. 1,000 కోట్లు..!
ప్రైవేట్ పవనాలపై ప్రభుత్వ ప్రేమ.. ప్రజలపై పెను భారం.. ‘ముఖ్య’నేతకు భారీ ప్రయోజనం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ విద్యుత్తు కొనుగోలు కుంభకోణానికి తెరలేచింది. ఒక ప్రైవేట్ పవన విద్యుత్ కంపెనీకి భారీ ఆర్థిక ప్రయోజనం కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతుందని తెలిసినా పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ అభ్యంతరాలను ఖాతరు చేయలేదు. విద్యుత్ వినియోగదారులపై పెనుభారం పడుతుందని తెలిసినా లెక్కచేయలేదు. అవసరం లేకపోయినా పవన విద్యుత్ కొనుగోలు చేయడమంటే ఇటు వినియోగదారులను, అటు డిస్కమ్లను ముంచేయడమేనని ఇంధనశాఖ ఉన్నతాధికారి వ్యాఖ్యానించగా, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే డిస్కమ్లకు ఆత్మహత్యా సదృశం అవుతుందని సీఎస్ ఘాటుగా చెప్పారు. అయినా సరే భారీ ముడుపులకోసం రాష్ట్ర ప్రజలపై రూ.1000 కోట్లకు మించి భారాన్ని మోపడానికి సర్కారు సిద్ధమైంది. తమిళనాడుకు చెందిన పవన విద్యుత్ ప్రాజెక్టు యూనిట్ 3.46 రూపాయలకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా, సుజ్లాన్ పవన విద్యుత్ యూనిట్ రూ.4.84గా ఏపీఈఆర్సీ నిర్థారించింది. దీనివల్ల రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై పెనుభారం పడనుండగా, ప్రైవేట్ విద్యుత్ కంపెనీతో పాటు ‘ముఖ్య’ నేతకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతోందని తెలుస్తోంది. గతంలో అధికారంలో ఉండగా ప్రైవేట్ విద్యుత్ కంపెనీలతో ఏ తరహాలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను చేసుకున్నారో ఇప్పుడు అదే తరహాలో పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరతీశారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏపీ జెన్కోకు విదేశీ బొగ్గు కొనుగోలులో రూ.500 కోట్లు, సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో రూ.755 కోట్లు, కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల పనుల్లో రూ.2,680 కోట్లు, ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లలో రూ.15వేల కోట్లు అవకతవకలకు పాల్పడి వందలాది కోట్లు ముడుపులు అందుకున్న రీతిలోనే పవన విద్యుత్తు విషయంలోనూ వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా చంద్రబాబు ప్రభుత్వం అధిక ధరలకు కొనుగోలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తుందన్న విషయాన్ని దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ట్రేడింగ్ కార్పొరేషన్ అయిన ఇండియన్ ఎనర్జీ ఎక్సే్చంజ్ (ఐఈఎక్స్) ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు గతంలోనే లేఖ రాసిన విషయం గమనార్హం. అభ్యంతరాలు కాదని మంత్రి మండలి ఆమోదం సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, యాక్సిస్ వెంచర్స్ లిమిటెడ్ అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 3000 మెగావాట్ల పవన్ విద్యుత్, 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. దీంతోపాటు పవన విద్యుత్ పరికరాలకు చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం 2015 పవన, సోలార్ విద్యుత్ విధానంతో పాటు నూతన పారిశ్రామిక విధానం మేరకు ఆ కంపెనీలకు రాయితీలను వర్తింపచేసింది. ఈ మేరకు గత ఏడాది జనవరి 11వ తేదీన ప్రాజెక్టు అమలు ఒప్పందాన్ని డిసెంబర్ 2022 వరకు చేసుకుంది. ఏపీ ట్రాన్స్కో, డిస్కమ్లు సమన్వయంతో ప్రాజెక్టు అమలు చేయాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సుజ్లాన్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ)కి లేఖ రాశారు. అలాగే దీర్ఘకాలిక విద్యుత్ అవసరాలు, విద్యుత్ కొనుగోలుకు ప్రణాళికను రూపొందించి ఏపీఈఆర్సీ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి అనుమతి పొందాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 11వ తేదీన ట్రాన్స్కో, డిస్కమ్లకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన ఏపీ డిస్కమ్లతో పాటు ఏపీ ట్రాన్స్కో కూడా సుజ్లాన్తో ప్రాజెక్టు అమలు ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ మేరకు ఈ ఏడాది మార్చి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిలోకి వస్తున్న 837.20 మెగావాట్ల పవన విద్యుత్తును కొనుగోలు చేయాల్సిందిగా సుజ్లాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కో–ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన సమావేశమై ఈ అంశంపై చర్చించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకునేందుకు ఈ సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ నిరాకరించింది. జాతీయ టారిఫ్ పాలసీ (ఎన్టీపీ) 2016లో నిర్ధారించిన మేరకు సంప్రదాయేతర ఇంధన వనరులను టెండర్ల ద్వారానే (కాపిటేటివ్ బిడ్డింగ్) కొనుగోలు చేయాలని కేంద్రం స్పష్టం చేసిందని, అయితే ఇందుకు ఇంకా మార్గదర్శకాలను ఖరారు చేయలేదని పేర్కొంది. కాంపిటేటివ్ బిడ్డింగ్ మార్గదర్శకాలను సూచించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయడమే కాకుండా, 1000 మెగావాట్ల పవన్ విద్యుత్ కొనుగోలుకు బిడ్స్ను ఆహ్వానించింది. తమిళనాడుకు చెందిన పవన విద్యుత్ ప్రాజెక్టు యూనిట్ రూ.3.46కు పంపిణీ చేసేందుకు బిడ్ దాఖలు చేసింది. అయితే ఏపీఈఆర్సీ పవన విద్యుత్ యూనిట్కు రూ.4.84గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి పరిస్థితిని సమీక్షించడమే కాకుండా విద్యుత్ వినియోగదారులు, డిస్కమ్ల ఆర్థిక పరిస్థితి నేపధ్యంలో సుజ్లాన్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోరాదని నిర్ణయించారు. ఇదే విషయాన్ని డిస్కమ్లకు ఆదేశాల రూపంలో జారీ చేశారు. ఇంధనశాఖ అభిప్రాయంతో ఆర్థికశాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ కూడా ఏకీభవించారు. సుజ్లాన్తో ఒప్పందాలను చేసుకోరాదంటూ గత నెల 3వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశానికి ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలను కేబినెట్ తిరస్కరించింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి సూచన మేరకు సుజ్లాన్ విద్యుత్తు కొనుగోలు చేయాలంటూ ఈ నెల 9వ తేదీ జరిగిన మంత్రిమండలి సమావేశం ఆమోదించడం గమనార్హం. రూ.1000 కోట్ల అదనపు భారం ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్జైన్ విద్యుత్ వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరులు ఉండాలనే ఏపీఈఆర్సీ నిబంధనలను ఇప్పటికే అమలు చేసినందున కొత్తగా పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ స్పష్టంచేశారు. సంప్రదాయేతర ఇంధన వనరులను తప్పనిసరిగా డిస్కమ్లు కొనుగోలు చేయాలంటే తక్కువ ధరకు వస్తున్న, ఇప్పటికే ఉన్న విద్యుత్ ప్రాజెక్టులను మూసివేయాల్సి వస్తుందని తెలిపారు. దీనివల్ల డిస్కమ్లపై అదనపు ఆర్థిక భారం పడుతుందని, విద్యుత్ వినియోగదారులపై ఆ భారం పడుతుందని చెప్పారు. సుజ్లాన్ సంస్థ నుంచి 837.20 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తే ఏటా రూ.250 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.1000 కోట్లు అదనపు భారం డిస్కమ్లపై పడుతుందన్నారు. సుజ్లాన్కు పారిశ్రామిక విధానం మేరకు రాయితీలు కల్పించినందున పవన విద్యుత్ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 12,014 మిలియన్ యూనిట్లు మిగులు ఉందని, మూడేళ్ల వరకు అదనపు విద్యుత్ కొనాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ డిస్కమ్లు సుజ్లాన్తో పాటు ఏ కంపెనీతో కూడా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్లో కొనాల్సి వస్తే టెండర్ల ద్వారానే చేయాలని సూచించారు. డిస్కమ్లకు సూసైడల్ సీఎస్ దినేశ్ కుమార్ ఇప్పటికే డిస్కమ్లు ఏడాదికి రూ.2000 కోట్ల రూపాయల నష్టాల్లో కొనసాగుతున్నాయని, పవన విద్యుత్ యూనిట్ను రూ.4.84కు కొనుగోలు చేయాలంటూ ఒప్పందాలు చేసుకుంటే డిస్కమ్లకు ఆత్మహత్యా సదృశం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఘాటుగా చెప్పారు. ఇప్పటికే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ఒప్పందాలను సమీక్షించి తక్కువ ధరకు కొనుగోలు చేయడంపై ట్రాన్స్కో, డిస్కమ్స్ దృష్టి సారించాలని సూచించారు. సుజ్లాన్తో ఒప్పందాలను చేసుకోరాదంటూ గత నెల 3వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశానికి ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలను తిరస్కరించి కేబినెట్, ఈ నెల 9వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొనుగోళ్లను ఆమోదించడం గమనార్హం. మొదటినుంచీ ముడుపుల బాటే... విద్యుత్ ప్రాజెక్టులను, కొనుగోళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటినుంచీ ముడుపులకు మార్గాలుగానే చూస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ఒప్పందాలు చేసుకుంటూ భారీగా ముడుపులు అందుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి నిర్వాకం వల్లనే విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోతున్నాయని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయినా కానీ పట్టించుకోకుండా పవన విద్యుత్ కొనుగోలు చేస్తూ మరో రూ.1000 కోట్ల భారం మోపేందుకు సిద్ధం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జరిగిన ఒప్పందాల వివరాలు.. - విదేశీ బొగ్గు కొనుగోలులో అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే 20.55 డాలర్లు అధికంగా చెల్లించిన అంశంలో రూ.వందల కోట్లు ముడుపులు చేతులు మారిన అంశంపై కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ సమన్లు జారీ. - అనంతపురం తలారిచెరువు సోలార్ పవర్ ప్రాజెక్టులో మెగావాట్కు రూ.1.51 కోట్లు అధికంగా చెల్లించడంవల్ల ఖజానాపై రూ.755 కోట్ల భారం. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో టెండర్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేయాల్సి వచ్చింది. - కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో పనుల అంచనావ్యయాన్ని రూ.2,680 కోట్లు పెంచి రూ.500 కోట్లు ముడుపులు పొందారు. దీనిపైనా పిల్ దాఖలు కావడంతో కాంట్రాక్టుల అప్పగింతకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. - అధికారం చేపట్టిన మరుక్షణమే చంద్రబాబు రెండువేల మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు ఆర్డర్లు ఇచ్చి డిస్కమ్ల నెత్తిన భారం మోపారు. ఆ తర్వాత కూడా అదే తీరును కొనసాగిస్తూ అవసరం లేకున్నా ముడుపుల కోసం ప్రైవేటు సంస్థలనుంచి 13 వేల మిలియన్ యూనిట్లు కొనుగోలు జరిపి డిస్కమ్లు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణమయ్యారు. - బయట మార్కెట్లో యూనిట్ రూ.2.71కి దొరుకుతున్నా ఆంధ్రప్రదేశ్ రూ.5.11 చెల్లించి కొనుగోలు చేయడంపై దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ట్రేడింగ్ కార్పొరేషన్ అయిన ఇండియన్ ఎనర్జీ ఎక్సే్చంజ్ (ఐఈఎక్స్) ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు లేఖ రాసింది. -
గుణదల భూమి గుటకాయస్వాహా..!
చినబాబు కోసం ఎంతకైనా సిద్ధం అది ప్రభుత్వ భూమి అంటూ కొత్త వాదన ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి తిరిగి తీసుకుంటుందట! గుట్టు చప్పుడు కాకుండా కదులుతున్న ఫైల్ సాక్షి, అమరావతి: విజయవాడ గుణదలలోని భూమిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్రభుత్వం పన్నాగం పన్నుతోంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా విద్యుత్ సంస్థల అధీనంలో ఉన్న భూమి అది. అయినా సరే చినబాబు కోసం ఆ భూమిని లాగేసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వమే ఇచ్చింది కనుక తిరిగి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందనే కొత్త వాదన తెరపైకి తెస్తోంది. ఆ మేరకు నివేదికలు కూడా తయారు చేయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలకు ఉన్న భూములన్నీ చాలావరకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములే. అలాగని అవసరం వచ్చినప్పుడో, సొంత ప్రయోజనాల కోసమే తిరిగి వాటిని లాగేసుకుంటే ప్రభుత్వ సంస్థలకు ఎక్కడా భూమి మిగిలే అవకాశం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ట్రాన్స్కో, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)కు చెందిన సుమారు రూ.200 కోట్ల విలువైన 4.80 ఎకరాల భూమిని బినామీల ముసుగులో దక్కించుకునేందుకు చినబాబు, ప్రభుత్వ పెద్దలు పథకం వేసిన సంగతి తెలిసిందే. తొలుత రాజధానిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే పేరిట ఓ స్టార్ హోటల్ నిర్మించేందుకు ప్రైవేటు వ్యక్తులకు ఈ భూమిని అప్పగిస్తారు. హోటల్ నిర్మించి కొన్నాళ్లు నడిపిన తర్వాత ముందుగా కుదుర్చుకున్న ఒప్పంద ప్రకారం ఆ హోటల్ను చినబాబుకు అప్పగించేస్తారు. ఇదీ స్కెచ్. స్కెచ్లో భాగంగా వారం రోజుల క్రితం పర్యాటక శాఖ విద్యుత్ సంస్థల భూమిని సర్వే చేసింది. అయితే విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఆ సర్వేను అడ్డుకున్నాయి. తమ అనుమతి లేకుండా తమ భూమిలో సర్వే ఏంటని ప్రశ్నించాయి. దీంతో వెనుదిరిగిపోయిన పర్యాటక శాఖ తాజాగా అసలుకే ఎసరు పెట్టింది. విద్యుత్ సంస్థల భూమే కాదట గుణదల భూమి విద్యుత్ సంస్థలదే కాదంటూ పర్యాటక శాఖ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినట్టు సమాచారం. దీన్ని అడ్డుపెట్టుకుని ఆ స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఫైల్ కూడా సిద్ధమైనట్లు సమాచారం. ప్రభుత్వ ఒత్తిడి నేపథ్యంలో.. గతంలో ప్రభుత్వమే ఇచ్చిన స్థలం కాబట్టి తిరిగి ఎప్పుడైనా తీసుకునే హక్కు ఉందని ఉన్నతాధికారులు చెప్పడం విశేషం. 1954లో ఏపీఎస్ఈబీకి ప్రభుత్వం ఈ స్థలం ఇచ్చిన మాట నిజమేనని, ఒక్క ఏపీఎస్ఈబీకే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో అనేకచోట్ల విద్యుత్ సంస్థలకు ప్రభుత్వమే భూమి ఇచ్చిందని, అంతమాత్రాన తిరిగి తీసుకుంటామంటే ఎలా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలను ఉన్నతాధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వమే ఇస్తే తీసుకునే హక్కు ఉంటుంది: అజయ్ జైన్ ఈ భూమి ప్రభుత్వం ఇచ్చినదే అయితే తిరిగి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. ఇప్పటివరకు ఈ భూమిని ఎవరికీ అప్పగించలేదని, గుణదలలో ఉన్న భూమి విద్యుత్ సంస్థలు కొనుగోలు చేశాయా? ప్రభుత్వం ఇచ్చిందా? అనేది తెలుసుకోవడానికే సర్వే జరిగిందని తెలిపారు. -
రిలీవ్డ్ విద్యుత్ ఉద్యోగులకు మొండిచెయ్యి
ఏపీ సంస్థల్లోకి తీసుకునేందుకు సర్కార్ విముఖత సాక్షి, అమరావతి: ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు తొలగించిన 1,252 మంది విద్యుత్ ఉద్యోగులకు మరోసారి నిరాశ ఎదురైంది. వారిని ఏపీ విద్యుత్ సంస్థల్లోకి తీసుకునేందుకు ఆస్కారం లేదని విద్యుత్ అధికారులకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్జైన్ స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్న సంకేతాలు పంపారు. తమను ఏపీ సంస్థల్లోకి తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రిలీవ్ చేసిన ఉద్యోగులు 12 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థల పాలన వ్యవహారాలపై బుధవారం విజయవాడలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల అంశాన్ని అధికారులు అజయ్జైన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమవ్వాలని గవర్నర్ చేసిన సూచనపైనా అధికారులు చర్చించారు.అజయ్ జైన్ మాట్లాడుతూ.. ఇది రెండు ప్రభుత్వాలు రాజకీయంగా తేల్చుకోవాల్సిన అంశమని, వారిని తీసుకునేందుకు సీఎం సానుకూలంగా లేరని స్పష్టం చేసినట్టు తెలిసింది. అనంతరం ఇతర అంశాలపై చర్చించారు. -
విద్యుత్ పొదుపుపై సర్వే
రాష్ట్రంలో విద్యుత్ పొదుపుపై మలివిడత థర్డ్పార్టీ సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్జైన్ తెలిపారు. ఇప్పటికే తొలిదశలో నాలుగు జిల్లాల్లో సర్వే నిర్వహించామని, మరో తొమ్మిది జిల్లాల్లో త్వరలో చేపడతామని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కోటి ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశామని, ఇంధనపొదుపు సామర్థ్యం ఉన్న స్టార్ రేటెడ్ ఫ్యాన్లు, విద్యుత్ ఉపకరణాలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. వీటి ఫలితాలపై విశ్లేషించేందుకు ఈ నెల 6వ తేదీన ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతామని తెలిపారు. -
కాకినాడ పోర్ట్ డెరైక్టర్గా ప్రసన్న
కాకినాడ పోర్ట్స్ డెరైక్టర్గా ప్రసన్న వెంకటేష్ను నియమిస్తూ రాష్ట్ర మౌలిక వసతులు, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ సోమవారం జీవో జారీ చేశారు. ప్రస్తుతం ఈయన పార్వతీపురం ఐటీడీఏ పీవోగా ఉన్నారు. పోర్ట్స్ డెరైక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్ను బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. -
తిరుపతికి అంతర్జాతీయ విమాన సర్వీసులు
- అక్టోబర్లో గన్నవరం నుంచి... - విలేకరుల సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ విజయవాడ సిటీ: వచ్చే నెల తిరుపతి విమానాశ్రయం నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. న్యూఢిల్లీ మీదుగా దుబాయ్, అమెరికా, మధ్య తూర్పు దేశాలకు సర్వీసులకు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ) ఆమోదం తెలిపిందన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్లో విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడపనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని అన్ని విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశంలో విమాన ప్రయాణికుల వృద్ధిరేటు 17శాతం ఉండగా రాష్ట్రంలో 61 శాతం ఉందన్నారు. తిరుపతిలో 48 శాతం, రాజమండ్రిలో 44 శాతం, విశాఖలో 64 శాతం, విజయవాడలో 69 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు. తిరుపతిలో కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చిందని, రాజమండ్రిలో టెర్మినల్ విస్తరణ పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. కడప నుంచి విజయవాడకు విమాన సర్వీసులు నడుపుతున్నట్టు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, అది అందుబాటులోకి వస్తే విశాఖ విమానాశ్రయం మూసివేస్తామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి భూసేకరణతో పాటు నిధుల సమస్య ఉందని అంగీకరించారు. మెరుగైన విద్యుత్ సరఫరా, తక్కువ ధరకే గ్యాస్, సోలార్, విండ్ విద్యుత్ ఉత్పాధనపై పరిశోధనలు నిర్వహించేందుకు అనంతపురంలో ఇంధన యూనివర్సిటీని, కాకినాడలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో లాజిస్టిక్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖ జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ 4వేల మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పాదనకు రాష్ట్రంలో 10 ప్లాంటులు ఏర్పాటు చేస్తామని, ఉభయగోదావరి జిల్లాల్లో ఇంటింటికి సబ్సిడీ గ్యాస్ సరఫరా కోసం కొవ్వూరులో ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ఫైబర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తే కొత్తగా తిరిగి సెట్అప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ స్తంభాలకు ఫైబర్నెట్ను అనుసంధానం చేసి ప్రతి ఇంటికి రూ.100కే 15ఎంబి ఇంటర్నెట్తో పాటు టీవీ చానల్స్, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. జూలై నుంచి ఈ సేవలు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నట్టు అజయ్ జైన్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ పోర్ట్సు రవికుమార్, భావనంపాడు పోర్టు ఎండీ వెంకటేశ్వరరావు, స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ సీఈఓ చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
'కొత్త సెట్టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలి'
విజయవాడ : జూలై నాటికి ఫైబర్ ఆప్టికల్ గ్రిడ్ పనులు పూర్తవుతాయని.. అయితే వాటికి ప్రస్తుతం ఉన్న సెట్ టాప్ బాక్సులు పనిచేయవు కాబట్టి కేబుల్, ఇంటర్నెట్, మొబైల్ సౌకర్యం కోసం కొత్త సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కొత్త సెట్ టాప్ బాక్సుల కోసం చైనా పరిశ్రమను సంప్రదిస్తున్నామని అన్నారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టుకు భూ సేకరణ చేస్తామని, జూన్ 30 నాటికి ఎయిర్ పోర్టు భూములు సేకరిస్తామని అజయ్ జైన్ చెప్పారు. -
అనంతపురంలో ఎనర్జీ యూనివర్సిటీ
2017-18 నుంచి ప్రారంభం విజయవాడ సిటీ: అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. దీనికి ఉన్నత విద్యా శాఖ అనుమతి ఇచ్చిందని, 2017-18 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. -
విద్యుత్ పొదుపుపై రెండు రోజుల అవగాహన సదస్సు
విజయవాడ : ఇంధన పొదుపుపై ఏప్రిల్ 7,8 తేదీల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. శనివారం విజయవాడలో అజయ్ జైన్ విలేకర్లతో మాట్లాడుతూ... ఈ సదస్సుకు 35 దేశాల నుంచి దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.87 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశామన్నారు. దీంతో ఇప్పటి వరకు 35 శాతం విద్యుత్ ఆదా అయిందని చెప్పారు. వినియోగదారులకు తక్కువ ధరలకే ఎల్ఈడీ బల్బులు అందజేస్తామన్నారు. రాష్ట్రంలోని 30 మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేస్తున్నట్లు అజయ్ జైన్ వివరించారు. -
క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బందికి ప్రోత్సాహకాలు
వందశాతం విద్యుద్ధీకరణ, ఎల్ఈడీ బల్బుల వాడకం, జీరోశాతం పంపిణీ నష్టాలు సాధించే దిశగాకృషి చేసే క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందికి ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దిశగా అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారిని జిల్లాకు ముగ్గురిని ఎంపిక చేస్తామని, వారికి ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తామని వెల్లడించారు. 2016 జూన్ నాటికి రాష్ట్రంలో అన్ని గ్రామాలకు విద్యుత్ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. అదే విధంగా మరిన్ని సోలార్ పంపుసెట్లను రైతులకు ఇస్తామని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన 24 గంటల్లో కొత్తవాటిని అమర్చాలని సిబ్బందిని ఆదేశించినట్టు వెల్లడించారు. -
సీఆర్డీఏ వర్సెస్ ట్రాన్స్కో
కాంట్రాక్టుల కోసం పవర్ వార్ టెండర్లు పిలిచే విషయంలో పోటాపోటీ సీఎం వద్దకు పంచాయితీ రాజీ కోసం అజయ్జైన్ రంగ ప్రవేశం సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి పరిధిలో ప్రతిపాదిత విద్యుత్ ప్రాజెక్టుల వ్యవహారం రెండు ప్రభుత్వ శాఖల మధ్య వివాదాస్పదమైంది. రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ (సీఈఆర్డీఏ), ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మధ్య కాంట్రాక్టుల విషయంలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. అన్నీ తమ పరిధిలోకే వస్తాయని సీఆర్డీఏ చెబుతుంటే, విద్యుత్ విషయంలో వాళ్ళకేం సంబంధమని ట్రాన్స్కో వాదిస్తోంది. ఈ పంచాయితీ చివరకు ముఖ్యమంత్రి వరకూ వెళ్ళడం విశేషం. రెండు శాఖల మధ్య రాజీ కుదిర్చే బాధ్యతను ఇంధన కార్యదర్శి అజయ్ జైన్కు అప్పగించినట్టు తెలిసింది. అమరావతిలో 2019 నాటికి 5 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని సింగపూర్ కంపెనీలు అంచనా వేశాయి. ఏపీ విద్యుత్ సంస్థలు మాత్రం మూడు వేల మెగావాట్లే ఎక్కువని చెబుతున్నారు. ఈ వివాదం అలా ఉంటే... తొలి దశలో 1500 మెగావాట్ల మేర విద్యుత్ను అందుబాటులోకి తేవడానికి కొన్ని ప్రాజెక్టులను ప్రతిపాదించారు. రాజధాని వలయం చుట్టూ భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్), ఏపీ ట్రాన్స్కో రూపొందించాయి. సీఆర్డీఏ అనుమతి ఇస్తే ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని విద్యుత్ సంస్థలు భావించాయి. ఈ మేరకు సీఆర్డీఏకు లేఖ కూడా రాశాయి. అయితే సీఆర్డీఏ పరిధిలోని ప్రతీ టెండర్పైన తమకే పిలిచే హక్కుందని సీఆర్డీఏ అంటోంది. విద్యుత్ లైన్లు వేయడం, ట్రాన్స్ఫార్మర్లు, భూగర్భ కేబుల్ వేయడం, వాటి నిర్వహణ సీఆర్డీఏకి ఏం తెలుసు? అని ట్రాన్స్కో వాదిస్తోంది. భవిష్యత్లోనూ విద్యుత్ లైన్ల నిర్వహణను చూసేది ట్రాన్స్కో కాబట్టి టెండర్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై తమకే అధికారం ఉండాలంటోంది. ఆరంభంలోనే రెండు శాఖలు వీధికెక్కడం వెనుక స్వప్రయోజనాలున్నాయనే విమర్శలొస్తున్నాయి. దాదాపు రూ. 1500 కోట్ల కాంట్రాక్టులను దక్కించుకునేందుకు ఇప్పటికే ట్రాన్స్కో అధికారులతో ఓ కంపెనీ లోపాయికారి ఒప్పందాలు చేసుకుందని తెలిసింది. అదే విధంగా మరో కంపెనీ సీఆర్డీఏ అధికారులతో లాలూచీ వ్యవహారం నడుపుతోందనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే పరస్పరం వాదులాడుకుంటున్నారని ట్రాన్స్కో వర్గాల సమాచారం. -
ఎంటర్ ద డ్రాగన్
♦ అమరావతి అభివృద్ధికి చైనా కంపెనీతో అవగాహన ఒప్పందం ♦ నూతన రాజధానిలో చైనా పరిశ్రమల జోన్ ♦ ఈ నెల 11న ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం సాక్షి, హైదరాబాద్: అమరావతి అభివృద్ధి బరిలోకి మరో పుంజు వచ్చింది. నూతన రాజధాని అభివృద్ధికోసం తాజాగా చైనా కంపెనీతో ఒప్పందం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇప్పటికే సింగపూర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం విడిపోయిన తరువాత తొలి భాగస్వామ్య సదస్సు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు విశాఖపట్టణంలో జరగనుంది. ఈ సదస్సులో నూతన రాజధాని అమరావతి అభివృద్ధికి చైనాకు చెందిన గుజూయ్ మారిటైమ్ స్కిల్ రోడ్డు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (జీఐఐసీ)తో ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీసీఆర్డీఏ) అవగాహన ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుమతించాల్సిందిగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సీఆర్డీఏ కార్యదర్శి అజయ్ జైన్ కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లభిస్తే భాగస్వామ్య సదస్సులో ఈ నెల 11వ తేదీన అవగాహన ఒప్పందంపై ఏపీసీఆర్డీ కమిషనర్ శ్రీకాంత్, జీఐఐసీ సీఈఓ జాంగ్ జాయ్ సంతకాలు చేయనున్నారు. నూతన రాజధాని నిర్మాణంలో చైనా కంపెనీల పెట్టుబడులను రాబట్టేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తామని జీఐఐసీ కోరినట్లు కేంద్ర అనుమతి కోరుతూ రాసిన లేఖలో అజయ్ జైన్ పేర్కొన్నారు. అమరావతిలో చైనీస్ పారిశ్రామిక జోన్ ఏర్పాటు చేయనున్నామని, ఆ జోన్లోకి చైనా కంపెనీలను జీఐఐసీ తీసుకువస్తుందని ఆ లేఖలో వివరించారు. ఏపీసీఆర్డీఏ ప్రాజెక్టులకు చైనా ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణాలను కూడా మంజూరు చేయిస్తామని జీఐఐసీ పేర్కొనట్లు ఆ లేఖలో జైన్ తెలిపారు. ఏపీసీఆర్డీఏ, జీఐఐసీ మధ్య బృహత్తర ప్రణాళిక, మౌలిక వసతుల కల్పన ప్రణాళిక, ఏరియా డెవలప్మెంట్ ప్రణాళికపై సంప్రదింపులతో పాటు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎటువంటి సమాచారాన్ని కూడా ఒకరి అనుమతి లేకుండా మరొకరు మూడో పార్టీకి ఎట్టిపరిస్థితుల్లోను వెల్లడించరాదని, రహస్యంగా ఉంచాలని ఒప్పందంలో పేర్కొననున్నారు. భాగస్వామ్య సదస్సులో 18 ఒప్పందాలు... భాగస్వామ్య సదస్సులో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, మలేషియా, ైచె నా దేశాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో పాటు అనిల్ అంబానీ, బాబా కళ్యాణి, ఆది గోద్రెజ్, రాకేశ్ భారతి మిట్టల్కు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. స్కిల్ డెవలప్మెంట్ రంగంలో 18 అవగాహన ఒప్పందాలను చేసుకోనున్నారు. ముఖ్యంగా రిటైల్, పర్యాటక, స్కిల్ డెవలప్మెంట్, ఫుడ్ ప్రోసెసింగ్, ఐటీ, ఇంధన రంగాల్లో అవగాహన ఒప్పందాలు జరుగుతాయి. అయితే నిర్దిష్టంగా ఎక్కడ ఏ పరిశ్రమను స్థాపించడం ద్వారా ఎన్ని పెట్టుబడులు పెడతారనే వివరాలు మాత్రం ఒప్పందాల్లో ఉండవు. సదస్సు చివరి రోజు బీచ్ రోడ్డులో నడుచుకుంటూ మాట్లాడుకుంటారు. సదస్సులో ఒప్పందాల వివరాలు కొన్ని ఈ విధంగా ఉన్నాయి. ► స్కిల్ డెవలప్మెంట్ రంగంలో టీమ్ లీడ్ సర్వీసెస్ లిమిటెడ్తో ఒప్పందం ► హాస్పిటాలిటీ-సర్వీసెస్ రంగంలో ఓయో రూమ్స్తో ఒప్పందం ళీ ఇంధన రంగంలో విద్యుత్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్తో ఒప్పందం ళీ మౌలిక వసతుల రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్తో ఒప్పందం ► లాజిస్టిక్ రంగంలో లాజిస్టిక్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్తో ఒప్పందం ► ఐటీ అండ్ ఐటీఇఎస్ రంగంలో నాస్కామ్తో ఒప్పందం ళీ పరిశ్రమల రంగంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్తో ఒప్పందం ► మీడియా ఎంటర్టైన్మెంట్ రంగంలో మీడియా ఎంటర్టైన్మెంట్ స్కిల్ కౌన్సిల్తో ఒప్పందం ళీ స్కిల్ డెవలప్మెంట్ రంగంలో టాటా స్ట్రైవ్తో ఒప్పందం ళీ ఐటీఈ ప్లాట్ఫామ్ రంగంలో ఈ-కౌశల్తో ఒప్పందం ► ఐటీఈ స్కిల్ డెవలప్మెంట్ రంగంలో సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో ఒప్పందం ళీ ప్లేస్మెంట్ రంగంలో ఐఎస్ఎఫ్తో ఒప్పందం ళీ పరిశ్రమల రంగంలో కార్న్ ఫెర్రీతో ఒప్పందం ► ఐటీ అండ్ ఐటీఇఎస్ రంగంలో ఐబీఎంతో ఒప్పందం ళీ ఐటీ అండ్ ఐటీఈఎస్ రంగంలో సామ్సంగ్తో ఒప్పందం ళీ రవాణా రంగంలో యుబీఈఆర్తో ఒప్పందం ళీ పరిశ్రమల రంగంలో ఎఫ్టీఏపీసీసీఐతో ఒప్పందం -
సబ్సిడీపైనా మౌనమే
కేబినెట్ భేటీలో విద్యుత్తు చార్జీల పైనా వ్యూహాత్మక ధోరణే సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. పంపిణీ సంస్థల ప్రతిపాదనపై ఎలాంటి స్పష్టమైన వైఖరినీ వెల్లడించలేదు. ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ఎలాంటి దిశా నిర్దేశం చేయలేదు. పైగా చార్జీల పెంపు అనివార్యమన్న డిస్కమ్లనే ప్రజల ముందు విలన్గా చూపించే ప్రయత్నం చేసింది. డిస్కమ్లకు ప్రభుత్వంతో సంబంధం లేదన్నట్టుగా.. పేదలపై అవి విద్యుత్ భారం మోపుతుంటే మంత్రులు వ్యతిరేకించినట్టుగా వ్యూహాత్మకంగా వ్యహరించింది. ఏతావాతా చార్జీల మోత తప్పదని తెలుస్తుండటంతో, తద్వారా వె ల్లువెత్తే ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవడంపై దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో డిస్కమ్లు రూ.7,716 కోట్ల లోటును పూడ్చుకునేలా ప్రతిపాదనలు ఈఆర్సీకి సమర్పించేందుకు సిద్ధమవుతున్నాయి. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై కీలక చర్చ జరిగింది. ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ పరిస్థితిని ప్రభుత్వానికి వివరించారు.విశ్వసనీయ సమాచారం మేరకు డిస్కమ్ల ప్రతిపాదనలపై పలువురు మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేకత రాకుండా ఏం చేయాలనే దానిపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే బదులు ప్రస్తుతానికి వేచి చూడటమే సరైన విధానమని మంత్రివర్గం భావించినట్టు తెలుస్తోంది. -
విద్యుత్ చార్జీల మోతకు నేడు పచ్చజెండా!
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ చార్జీల ప్రతిపాదనల హైడ్రామాకు మంగళవారంతో తెరపడే వీలుంది. పంపిణీ సంస్థలు (డిస్కమ్లు) ఇదేరోజు విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి వార్షిక ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లు సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దీనికిముందు ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ సీఎండీలు, ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమని ఉన్నతాధికారులు చెప్పనున్నట్టు సమాచారం. రూ.7 వేల కోట్లకుపైగా రెవెన్యూ లోటు ఉందని, ఇందులో ప్రభుత్వం ఏ మేర సబ్సిడీ ఇస్తుందో వేచి చూడాలని వారంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని బట్టి ఏయే శ్లాబులకు చార్జీలు పెంచాలో డిస్కమ్లు నిర్ణయం తీసుకునే వీలుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు సబ్సిడీ మొత్తాన్ని వెల్లడించే అవకాశం లేదు. ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపేందుకు మాత్రమే సీఎం అనుమతించవచ్చని చెబుతున్నారు. -
నమ్మి పెట్టుబడి పెట్టేదెలా?
-
నమ్మి పెట్టుబడి పెట్టేదెలా?
జపాన్లో సీఎం చెప్పిన మాటలేమయ్యాయి? ఏపీ ప్రభుత్వ తీరుపై సాఫ్ట్బ్యాంక్ అసంతృప్తి 10వేల మెగావాట్ల ప్రాజెక్టు హుష్కాకి ప్రస్తుతం వెయ్యి మెగావాట్లేనట! అదీ షరతులకు అంగీకరిస్తేనే సాక్షి, హైదరాబాద్: ‘అక్కడలా చెప్పారు?.. ఇక్కడిలా అంటున్నారు? మిమ్మల్ని నమ్మేదెలా?’ అని జపాన్ సంస్థ సాఫ్ట్బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సందేహాలు వ్యక్తం చేసినట్టు సమాచా రం. సాఫ్ట్బ్యాంక్ ప్రతినిధి ఏపీ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్జైన్తో మంగళవారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సాఫ్ట్బ్యాంక్ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జపాన్ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రముఖ కంపెనీ సాఫ్ట్బ్యాంక్ చైర్మన్ మసయోషీసోన్తో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టు నెలకొల్పితే ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల ప్రాజెక్టును స్థాపించేందుకు సాఫ్ట్బ్యాంక్ సుముఖత వ్యక్తం చేసింది. జపాన్ వెళ్లాక తుది నిర్ణయం: సాఫ్ట్బ్యాంక్ ఆర్థిక నిపుణుడు రామన్ నందాతో మంగళవారం సమావేశం సందర్భంగా ఇంధనశాఖ అధికారులు సోలార్ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తాము అడిగిన ఆర్థికపరమైన ప్రశ్నలకు అధికారుల నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో సాఫ్ట్బ్యాంక్ ప్రతినిధి పెదవి విరిచినట్లు తెలిసింది. తొలి విడతలో 1,000 మెగావాట్ల ప్రాజెక్టునే స్థాపిస్తామని, జపాన్ వెళ్లాక తుది నిర్ణయం తెలియజేస్తామన్నారు. ఆ మాటలేమయ్యాయి?: రాష్ట్ర ప్రభుత్వంపై సాఫ్ట్బ్యాంక్ భారీ అంచనాలు పెట్టుకుంది. మెగావాట్ సోలార్ ప్రాజెక్టుకు ఐదు ఎకరాల చొప్పున 10 వేల మెగావాట్లకు 50 వేల ఎకరాలు అవసరం. దీన్ని ప్రభుత్వమే సమకూరుస్తుందని సాఫ్ట్బ్యాంక్ ఆశించింది. కొంత భాగమే ఇస్తామని, మిగతా భూమి సంస్థే సేకరించుకోవాలని తాజాగా చర్చల్లో అధికారులు స్పష్టం చేయటం తో సాఫ్ట్బ్యాంక్ పునరాలోచనలో పడింది. ఆ విద్యుత్ మా ఇష్టం!: తాము నెలకొల్పే కేంద్ర ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్లో కొంత ఇతర ప్రాంతాల్లో అమ్ముకునే వీలు కల్పించాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. నీటి వసతి, రవా ణా తదితర సదుపాయాలన్నీ ప్రభుత్వమే భరిం చాలన్న షరతు విధించినట్టు తెలిసింది. బాబుతో సాఫ్ట్బ్యాంక్ ప్రతినిధి భేటీ సాఫ్ట్ బ్యాంక్ ప్రతినిధి రామన్ నందా సచివాలయంలో సీఎం బాబుతో భేటీ అయ్యారు. సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు, ఉత్పాదన ఖర్చులు తగ్గించుకునేందుకు కలసి పనిచేస్తామన్నారు. -
ఆధార్ కోసం వేధించకండి: అజయ్ జైన్
సాక్షి, హైదరాబాద్: ఆధార్ సంఖ్య ఇవ్వని రైతుల వ్యవసాయ కనెక్షన్లు తొలగించవద్దని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించారు. సరఫరా నిలిపివేస్తే తమ దృష్టికి తేవాలని రైతులకు సూచించారు. అన్ని రకాల సమాచారం కోసమే కనెక్షన్లకు ఆధార్ లింకేజీ పెట్టామని, ఇది కేవలం వ్యవసాయ వినియోగదారులకే పరిమితం కాదని స్పష్టం చేశారు. దీనికి గడువు విధించడం సరికాదని, ఇలా చేసినందుకు డిస్కమ్ల అధికారులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ఇస్తామంటుంటే, ఆపివేసే అధికారం తమకెక్కడిదన్నారు. ‘ఆధార్ లేకుంటే ఉచిత విద్యుత్ కట్’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో వార్త ప్రచురితమైన నేపథ్యంలో అజయ్ జైన్ డిస్కమ్ల సీఎండీలతో చర్చించారు. అనంతరం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. రైతుల వ్యవసాయ కనెక్షన్లు తొలగించొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఆధార్కు, ఉచిత విద్యుత్కు ఎంతమాత్రం సంబంధం ఉండబోదని అన్నారు. అయినప్పటికీ రైతులు ఆధార్ నంబర్లు అందజేయాలని కోరారు. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ను శాస్త్రీయంగా లెక్కగట్టాలనే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. -
బీ అలర్ట్..
బృందాలను ఏర్పాటు చేయండి అవసరమైన మెటీరియల్ను సిద్ధం చేయండి తుపాను నేపథ్యంలో విద్యుత్ అధికారుల్ని అప్రమత్తం చేసిన సర్కారు డిస్కంలకు ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్జైన్ ఆదేశాలు సాక్షి, విజయవాడ బ్యూరో: హుద్హుద్ తుపాను కారణంగా ఉత్తరాంధ్రలో విధ్వంసమైన విద్యుత్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కాక ముందే మరో తుపాను విరుచుకు పడేందుకు సిద్ధంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారి విశాఖకు ఆగ్నేయ దిశగా 560 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో మరోసారి విద్యుత్ సరఫరాకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని అంచనాకు వచ్చిన ప్రభుత్వం గురువారం జిల్లాస్థాయి అధికారులను అప్రమత్తం చేసింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్జైన్ ఈ మేరకు ఏపీఎస్పీడీసీఎల్, ఈపీఎస్పీడీసీఎల్ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్లు, డిస్కంల డెరైక్టర్లు, అన్ని జిల్లాల పర్యవేక్షక ఇంజినీర్లకు ఫ్యాక్స్ మెసేజ్ పంపారు. హుద్హుద్ నేర్పిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ‘రాగల 24 గంటల్లో తుపాను ప్రభావంతో తీరంలోని జిల్లాల్లో గాలుల తీవ్రత పెరిగే అవకాశం వుంది. జిల్లా స్థాయి అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు తీర ప్రాంత గ్రామాల్లో ఉంటూ గాలుల తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ విద్యుత్ సరఫరాను పర్యవేక్షించాలి’ అని ఆదేశించారు. హుద్హుద్ సమయంలో ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపి వేయడంవల్ల ప్రాణనష్టాన్ని నివారించగలిగామన్న విషయాన్ని గుర్తుంచుకుని వచ్చే తుపానును కూడా సమర్థంగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు. గురువారం నుంచే విద్యుత్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలనీ, అవసరమైన విద్యుత్ సామగ్రిని ముందుగానే తీర ప్రాంత గ్రామాలకు తరలించాలని సూచించారు. ఈ సమాచారాన్ని అందుకున్న ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల విద్యుత్ అధికారులు ప్రతి 20 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసే పనుల్లో పడ్డారు. సముద్ర తీర మండలాల్లో పనిచేసే ఏఈల నుంచి విద్యుత్ సబ్స్టేషన్ల సమాచారాన్ని తెప్పించుకుని ఎక్కడెక్కడ పోల్స్ పడే అవకాశాలున్నాయో తెల్సుకుంటున్నారు. శుక్రవారం ఉదయానికి తుపాను తీరం దాటే దిశ స్పష్టంగా తెలిసే వీలున్నందున ఆ తరువాత మెటీరియల్ను చేరవేసే పనులు చేపట్టాలని నిర్ణయించారు. కాగా హుద్హుద్ తుపాను వల్ల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దే పనుల్లో తలమునకలవుతున్న ఉత్తరాంధ్ర విద్యుత్ ఉద్యోగులకు తాజా తుపాను కబురు ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటివరకూ ఎడతెరిపి లేని పునరుద్ధరణ పనులతో నీరసించిన ఉద్యోగులను మళ్లీ అప్రమత్తం చేసుకుని బృందాలుగా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని అక్కడి సర్కిల్ అధికారులు అంటున్నారు. -
కరెంటు లేని ప్రాంతాలకు సోలార్ లాంతర్లు
హుదూద్ తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన ఉత్తరాంధ్ర ప్రాంతంలో దీపావళి పండుగ లోగానే 90 శాతం వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. అయినా దీపావళి రోజుకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండకపోవచ్చని, అలాంటి ప్రాంతాలకు కూడా వెలుగులు అందించేందుకు తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఏయే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదో, అక్కడ నెడ్క్యాప్ ద్వారా పదివేల సోలార్ లాంతర్లు అందిస్తామని అజయ్ జైన్ వివరించారు. కొన్ని చోట్ల విద్యుత్ పునరుద్ధరణ పనులు చాలా మందకొడిగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసులను అందించే విషయంలో సిబ్బంది ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
3రోజుల్లో వైజాగ్కు పూర్తి స్థాయిలో విద్యుత్
-
హుదూద్తో విద్యుత్ శాఖకు వెయ్యి కోట్ల నష్టం
విశాఖపట్నం : తుపాను కారణంగా విద్యుత్ వ్యవస్థకు రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. ఆ నష్టంలో 80 శాతం విశాఖ నగరంలోనే జరిగిందని తెలిపారు. బుధవారం విశాఖపట్నంలో అజయ్ జైన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఈ రోజు రాత్రికి 50 నుంచి 70 వేల మందికి విద్యుత్ ఇవ్వగలమన్నారు. పూర్తి స్థాయిలో కరెంట్ సరఫరాకు మరో నాలుగు రోజుల సమయం పడుతుందని వెల్లడించారు. రేపు ఉదయం స్టీల్ ప్లాంట్, ఎయిర్ పోర్ట్లకు కరెంట్ ఇస్తామన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్ఫార్మర్లను తెప్పిస్తున్నామని చెప్పారు. విశాఖ ఒక్క నగరంలోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు 2 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారన్నారు. గాజువాక సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ను ఇప్పటికే పునరుద్ధరించామన్నారు. ఈ రోజు సాయంత్రంలోగా నక్కవారిపాలెం సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ను పునరుద్ధరిస్తామని తెలిపారు. విశాఖ జిల్లాలో పలు 130 కేవీ సబ్ స్టేషన్లను పునరుద్ధరించినట్లు చెప్పారు. ముందస్తు చర్యల వల్ల ప్రాణనష్టం బాగా తగ్గించ గలిగామని అజయ్ జైన్ వెల్లడించారు. హుదూద్ తుపాన్తో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైనాయి. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో గత మూడు రోజులుగా విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాలలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో కరెంట్ సరఫరాను పునరుద్దరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
ఇంకా అంధకారమే..
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాంధ్రలో విద్యుత్ పరిస్థితి ఇప్పట్లో మెరుగయ్యేలా కనిపించడం లేదు. మరికొన్ని గంటలు అంధకారం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పునరుద్ధరణ సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. తుపాను కారణంగా మొత్తం వెయ్యి కోట్ల నష్టం వాటిల్లినట్టు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. ఇందులో రూ.700 కోట్లు డిస్కమ్లు, రూ.300 కోట్లు ట్రాన్స్మిషన్ సంస్థలు నష్టపోయాయని తెలిపారు. తొలుత విశాఖ నగరానికి విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదీ అత్యవసర సర్వీసుల కోసం మాత్రమే. ఆ తర్వాత విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కేంద్రాల్లో సరఫరా పునరద్ధరణకు మార్గాలను అన్వేషిస్తున్నారు. తక్షణ ఏర్పాట్ల కోసం విద్యుత్ సిబ్బంది అహోరాత్రులు శ్రమిస్తున్నా ఇంతవరకు మెరుగైన పరిస్థితి కనిపించలేదు. హుదూద్ తుపాను మునుపెన్నడూ లేనంతగా ఉత్తరాంధ్రను కుదిపేసింది. ఈ నష్టం విద్యుత్ శాఖపై భారీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రోజూ 135 మిలియన్ యూనిట్లు విద్యుత్ డిమాండ్ ఉంటుంది. తుపాను కారణంగా ఇది 108 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. ఉత్తరాంధ్రలో ఒక్క యూనిట్ కూడా సరఫరా చేయలేని పరిస్థితే ఇందుకు ప్రధాన కారణం. ఈ మూడు జిల్లాల్లో విద్యుత డిమాండ్ 24 మిలియన్ యూనిట్లు ఉంటుంది. అంధకారంలో జనం: మూడు జిల్లాలూ ప్రస్తుతం అంధకారంలోనే ఉన్నాయి. ఇక్కడ సాధారణ జనజీవనం కారుచీకట్లో బిక్కుబిక్కుమంటోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 7,410 గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అత్యవసర వైద్యసేవలు ఆగిపోయి రోగులు హైరానా పడుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో ఆస్పత్రుల్లో ప్రాణాప్రాయ సేవలకూ ఆటంకం కలుగుతోంది. కొద్దిగంటలు జనరేటర్ల మీద నడిచినా, ఇప్పుడు ఆ వెసులుబాటూ లేదు. రవాణ వ్యవస్థ లేకపోవడం, డీజిల్ బంకులు మూతబడటంతో ఎమర్జెన్సీ సేవలకు ఆటకం ఏర్పడింది. తాగునీరు లేదు. విద్యుత్ లేకపోవడంతో ఓవర్ హెడ్ ట్యాంకులను నింపే మోటార్లు పనిచేయడం లేదు. సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సెల్ఫోన్ టవర్లు ఒక్కటీ పనిచేయడం లేదు. చిన్నాచితక పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. చీకట్లోనే భయపడుతూ కాలం గడుపుతున్నారు. నెట్వర్క్ పూర్తిగా దెబ్బతినడంతో, పాలన వ్యవస్థల మధ్య సమన్వయం లేకుండాపోయింది. కూలిన స్తంభాలు.. కొట్టుకుపోయిన ట్రాన్స్ ఫార్మర్లు విద్యుత్ సంస్థలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ట్రాన్స్ఫార్మర్లు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 75 ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినట్టు అంచనా. 1,100 స్తంభాలు పూర్తిగా వంగిపోయాయి. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ విరిగిపడ్డ స్తంభాల సంఖ్య 20 వేలకు పైమాటే. ఎక్కడికక్కడ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ప్రత్యామ్నాయ సరఫరాకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. యథాతథ పరిస్థితి నెలకొనడానికి కనీసం వారం రోజులైనా పట్టొచ్చని అధికారులే చెబుతున్నారు. రెండుచోట్ల 400 కె.వి. సబ్స్టేషన్లు కుప్పకూలాయి. 225 కె.వి. సబ్స్టేషన్లు 10 వరకు పనికిరాకుండా పోయాయి. 132 కె.వి. సబ్ స్టేషన్లు 25 వరకు నేలమట్టమయ్యాయి. గాజువాకలోని సింహాద్రి ఎన్టీపీసీ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పోలాకి, సంతబొమ్మాళి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో విద్యుత్ స్తంభాలు కూలడం, తీగలు తెగిపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. 100కు పైగా ట్రాన్స్ఫార్మర్లు నేలకూలడం, నీట మునగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. విశాఖపట్నంలోని పెందుర్తి ఉప కేంద్రం వద్ద సాంకేతిక లోపం ఏర్పడంతో జిల్లాలో సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని ఈపీడీసీఎల్ అధికారులు చెప్పారు. దీంతో పెందుర్తి నుంచి గరివిడికి సరఫరా నిలిచిపోయింది. పెందుర్తి సాంకేతిక లోపం సరిదిద్దతేగానీ జిల్లాకు సరఫరా రావడం కష్టం. విశాఖ జిల్లాలో 33 కె.వి. విద్యుత్ స్తంభాలు 22, 11 కె.వి. విద్యుత్ స్తంభాలు 3,339, ఎల్టీ విద్యుత్ స్తంభాలు 533, ట్రాన్స్ఫార్మర్లు 75 కూలిపోయాయని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా పరిస్థితిపై అధికారులకూ స్పష్టమైన అవగాహన లేదు. ఫోన్లు పనిచేయకపోవడంతో ఉన్నతాధికారులకు ఎలాంటి నివేదికలూ రాలేదు. 80 ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగినట్లు తెలుస్తోంది. 7,657 కిలోమీటర్ల విద్యుత్ లైన్లను పునరుద్ధరించాల్సి ఉంది. పునరుద్ధరణకు చర్యలు : తాజా పరిస్థితి నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విశాఖ నగరానికి విద్యుత్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో సిబ్బంది ఉత్తరాంధ్రకు రప్పించారు. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ నుంచి స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్లు, వైర్లు తరలించారు. తాజా పరిస్థితిపై ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ట్రాన్స్, జెన్కో సీఎండీ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. విజయానంద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే మకాం వేశారు. సింహాద్రి ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ను దారికి తెచ్చేందుకు కొంత వరకు ప్రయత్నాలు జరిగాయి. ఇది పనిచేయడానికి అవసరమైన విద్యుత్ను వేమగిరి ప్లాంట్ నుంచి పంపాలని నిర్ణయించారు. సింహాద్రి ఉత్పత్తి ప్రారంభిస్తే విశాఖ సిటీకి కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు మరో నాలుగు మార్గాల్లో విద్యుత్ సరఫరాకు ప్రయత్నాలు చేస్తున్నారు. తునిలోని 132 కె.వి. సబ్స్టేషన్ ద్వారా కొరుప్రోలు, పరవాడ, గాజువాక ద్వారా విద్యుత్ అందించాలని భావిస్తున్నారు. మరోవైపు పిఠాపురంలోని 132 కె.వి. సబ్స్టేషన్ ద్వారా గాజువాకకు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.గాజువాక నుంచి 80 మెగావాట్లు అందించే వీలుందని తెలుస్తోంది. మొత్తం మీద విశాఖ నగరానికి మంగళవారం సాయంత్రానికి ఒక స్థాయిలో విద్యుత్ అందించే వీలుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారీగా సిబ్బంది : ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో విద్యుత్ పరిస్థితిని మెరుగు పరిచేందుకు కడప, అనంతపురం, తిరుపతి, విజయవాడ నుంచి రెండువేలమంది సిబ్బందిని పంపినట్టు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా సెలవుల్లో ఉన్నవాళ్లను కూడా రప్పిస్తున్నారు. తెలంగాణ సాయం : ఉత్తరాంధ్రలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ విద్యుత్ సంస్థలు సాయం చేసేందుకు ముదుకొచ్చాయి. తెలంగాణ జెఎండీ కార్తికేయమిశ్ర సోమవారం ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్జైన్తో మాట్లాడారు. రూ.13 కోట్ల విద్యుత్ ఉపకరణాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. విద్యుత్ వైర్లు, స్తంభాలు ఉత్తరాంధ్రకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాయానికి ముందుకొచ్చాయి.