andarapradesh
-
ఏపీలో కొత్తగా 319 కరోనా కేసులు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 59,671 కరోనా పరీక్షలు నిర్వహించగా, 319 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 884490కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. (చదవండి: కోవిడ్ భయం: విమానం మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు) కోవిడ్ బారిన పడి గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7127కి చేరింది. గడచిన 24 గంటల్లో 308 మంది కోవిడ్ కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,74,531 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 2,832 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షలు కోటి 22 లక్షలు దాటాయి. రికార్డు స్థాయిలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి వరకు 1,22,24,202 శాంపిల్స్ను పరీక్షించారు. (చదవండి: మా వ్యాక్సిన్ చాలా డేంజర్: చైనా ఎక్స్పర్ట్) -
ఏపీ: కరోనా కేసులు భారీగా తగ్గుముఖం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 29,714 కరోనా పరీక్షలు నిర్వహించగా, 128 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 883210కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.(చదవండి: కోవాగ్జిన్ : భారత్ బయెటెక్ క్లారిటీ) కరోనా బారినపడి గత 24 గంటల్లో చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, ఇప్పటివరకు 7118 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో 252 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 8,73,149 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో కరోనా పరీక్షలు రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్నారు. నేటివరకు రాష్ట్రంలో 1,20,02,494 శాంపిల్స్ను పరీక్షించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 2,943 యాక్టివ్ కేసులు ఉన్నాయి. -
ఏపీలో కొత్తగా 232 కరోనా కేసులు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 40,177 కరోనా పరీక్షలు నిర్వహించగా, 232 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో ఏపీలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 88,3082కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. (చదవండి: కరోనా టీకా: డీసీజీఐ కీలక ప్రకటన) కోవిడ్ బారినపడి గడచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు మృతిచెందగా, ఇప్పటివరకు 7115 మంది మరణించారు. గత 24 గంటల్లో 352 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 8,72,897 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 3,070 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటివరకు 1,19,72,780 శాంపిల్స్ను పరీక్షించారు.(చదవండి: కరోనా వల్ల మేలెంత? కీడెంత?) -
సంక్రాంతికి 4,981 స్పెషల్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ బి.వరప్రసాద్ తెలిపారు. ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 4,981 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు. రద్దీ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ బస్సులను మహాత్మా గాంధీ, జూబ్లీ బస్స్టేషన్, సీబీఎస్, ఉప్పల్, లింగంపల్లి, ఎల్బీనగర్, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెచ్బీ, టెలిఫోన్ భవన్ తదితర ప్రాంతాల నుంచి నడపనున్నట్లు తెలిపారు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుడివాడ, ఏలూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలకు ఈ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. కరీంనగర్ వైపు వెళ్లే బస్సులు జూబ్లీ బస్స్టేషన్ నుంచి, వరంగల్ వైపు వెళ్లే వాటిని ఉప్పల్ నుంచి నడపనున్నారు. విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎల్బీ నగర్ నుంచి, కర్నూల్, మహబూబ్నగర్ వైపు వెళ్లే బస్సులు గౌలిగూడ సీబీఎస్ నుంచి బయలుదేరుతాయి. మిర్యాలగూడ, నల్లగొండ, కోదాడ వైపు వెళ్లే వాటిని దిల్సుఖ్నగర్ నుంచి నడుపుతారు. ఎంజీబీఎస్లోని 35, 36 ప్లాట్ఫామ్ల నుంచి విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు రాకపోకలు సాగిస్తాయి. టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి సీట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. వివరాలకు 9959226245, 9959224910 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ఏపీ: విజయవంతంగా ముగిసిన వ్యాక్సిన్ డ్రై రన్
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన ‘కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్’ విజయవంతంగా ముగిసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 13 జిల్లాల్లో జిల్లాకు మూడు చోట్ల చొప్పున 39 చోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించారు. మొత్తం 956 మంది పాల్గొన్నారు. ఈ డ్రై రన్ ప్రక్రియ వీడియో ద్వారా చిత్రీకరించారు. కార్యాచరణ నివేదికను జిల్లా, రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్కు అందించనున్నారు. (చదవండి: కొత్త కరోనా టెన్షన్: ఈ మార్గదర్శకాలు తప్పనిసరి) కోవిడ్–19 వ్యాక్సినేషన్కు సన్నద్ధతలో లోటుపాట్లు పరిశీలించి సరిదిద్దుకోవడానికి డ్రై రన్ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రై రన్లో భాగంగా డిసెంబర్ 28న విజయవాడలోని ఐదు కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. శనివారం కూడా ఏపీ వ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించారు. -
రేపు ఏపీవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రేపు (శనివారం) 13 జిల్లాల్లో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. ప్రతి జిల్లాలోని మూడు ఆస్పత్రుల్లో డ్రై రన్కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వాస్పత్రి, ప్రైవేట్ ఆస్పత్రి, అర్బన్/రూరల్ పీహెచ్సీలో డ్రై రన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే గత నెల 28న కృష్ణా జిల్లాలోని ఐదు ఆస్పత్రుల్లో డ్రై రన్ విజయవంతం అయిన సంగతి తెలిసిందే. (చదవండి: కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్కు గ్రీన్ సిగ్నల్) డ్రై రన్ అంటే? నామమాత్ర పు(డమ్మీ) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను డ్రై రన్గా వ్యవహరిస్తారు. ఇదొక మాక్ డ్రిల్ లాంటిదే. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు.(చదవండి: కరోనా వైరస్ : చైనా గుడ్న్యూస్) -
‘ఆ వాహనాలు.. ముంబై తర్వాత ఏపీలోనే..’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిబద్దతతో పనిచేస్తోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఇచ్చిన వాహనాలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ, అత్యంత సాంకేతికతతో కూడిన సామర్థ్యం ఎస్పీఎస్డీఆర్ఎఫ్ వాహనాల్లో ఉందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఈ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. పడవ, రోడ్డు ప్రమాదాలు, ఫైర్ యాక్సిడెంట్లు, భవనాలు కూలినప్పుడు రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టాన్ని నియంత్రించవచ్చని చెప్పారు. ముంబాయి తర్వాత దేశంలో మన రాష్ట్రంలోనే ఈ వాహనాలు వచ్చాయని పేర్కొన్నారు. (చదవండి: తగ్గిన నేరాలు.. పెరిగిన కేసులు) 2020లో కోవిడ్ను సమర్థంగా ఎదుర్కొన్నామని, పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేశామని తెలిపారు. టెక్నాలజీ వినియోగాన్ని విస్తృత పరిచి 2021లో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో కేంద్రం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ఇంటివద్దే వేడుకలు జరుపుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు.(చదవండి: అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్) -
ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు...
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 50,794 కరోనా పరీక్షలు నిర్వహించగా, 326 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 881599కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.(చదవండి: కరోనా కొత్త స్ట్రెయిన్పై ఏపీ అప్రమత్తం) గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి అనంతపురం, కృష్ణాలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 7100 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 364 డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 871116 డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 3,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,17,08,678 శాంపిల్స్ను పరీక్షించారు.(చదవండి: భారత్లో కొత్త స్ట్రెయిన్ కేసులు) -
ఏపీ: యూకే నుంచి వచ్చిన 11 మందికి కరోనా
సాక్షి, అమరావతి: యూకే నుంచి ఆంధ్రప్రదేశ్కు ఇప్పటివరకు వచ్చిన వారి సంఖ్య 1363కి చేరింది. యూకే నుంచి ఏపీ వచ్చిన వారు.. వారి కాంటాక్ట్స్లో 23 మందికి కరోనా పాజిటివ్గా గుర్తించారు. ఇప్పటివరకు 1,346 మందిని అధికారులు ట్రేస్ చేయగా, మరో 17 మంది కోసం ట్రేసింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. యూకే నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 11 మందికి కరోనా నిర్థారణ అయ్యింది.(చదవండి: మరి కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్ : సీరం) అనంతపురం, నెల్లూరులో ఒక్కొక్కరు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ముగ్గురు, గుంటూరులో నలుగురికి పాజిటివ్గా తేలింది. యూకే నుంచి ఏపీ వచ్చిన వారి కాంటాక్ట్స్లో 5,784 మందికి పరీక్షలు నిర్వహించారు. యూకే రిటర్న్స్తో కాంటాక్ట్ అయిన 12 మందికి పాజిటివ్గా గుర్తించారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఎనిమిది మందికి పాజిటివ్ కాగా, తూ.గో.జిల్లాలో ముగ్గురికి, నెల్లూరులో ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. (చదవండి: ఎంత కాలంలో కరోనా ఖతం...?) -
ఏపీలో కొత్తగా 212 కరోనా కేసులు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 37,381 కరోనా పరీక్షలు నిర్వహించగా, 212 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 88,1273కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి పశ్చిమ గోదావరిలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున నలుగురు మృతిచెందగా, దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7098కి చేరుకుంది. (చదవండి: దేశంలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా) గత 24 గంటల్లో 410 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 870752 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 3423 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,16,57,884 నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.(చదవండి: కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా ముగిసిన ‘డ్రై రన్’) -
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,911 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 282 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 88,0712కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. (చదవండి: కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ ‘డ్రై రన్’) గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా కడపలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7092కి చేరింది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 442 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 86,9920 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటివరకు 1,15,74,117 శాంపిల్స్ను పరీక్షించారు. -
ఆన్లైన్ కాల్మనీపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారాలపై పోలీస్శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. యాప్ల ద్వారా అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చిన వారిపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీలకు, సీఐడీ, సైబర్ క్రైమ్ విభాగానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. కాల్ మనీ వేధింపులకు పాల్పడితే ఉపేక్షించమని డీజీపీ హెచ్చరించారు. ఆన్లైన్ కాల్మనీ బాధితులకు పోలీస్శాఖ అండగా ఉంటుందని పేర్కొన్నారు. చట్టబద్ధత లేని యాప్ల ద్వారా రుణాలు స్వీకరించొద్దని సూచించారు. వేధింపులకు పాల్పడే యాప్లపై డయల్ 100, 112లకు ఫిర్యాదు చేయాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. -
ఏపీ: వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి
క్రైం న్యూస్: ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరిలో ఒకరు, విజయనగరంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తిరుపతిలో ఒకరు మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. తూర్పుగోదావరి: ఐ.పోలవరం మండలం కొత్త మురమళ్ల లైన్పేట లాకులు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మురమళ్ల గ్రామానికి చెందిన లంక శ్రీనివాస్ (41)గా గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైకులను ఢీకొన్న కారు: ఇద్దరు మృతి విజయనగరం: గరుగుబిల్లి మండలం రావివలస శివారులో రెండు బైకులను కారు ఢీకొన్న ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న రావివలసకు చెందిన ఇద్దరు మృతి చెందారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా బైకు దగ్ధమైమైంది. మరో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలు కాగా, పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు. ప్రాణం మీదకు తెచ్చిన ఈత సరదా.. తిరుపతి: స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన తొమ్మిదవ తరగతి విద్యార్థి నీట మునిగి మృత్యువాత పడ్డాడు. రేణిగుంట మండలం గాజులమండ్యం వద్ద స్వర్ణముఖి నదిలో దిగిన అమరనాథ్ (14) ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు ఇద్దరు మృతి.. శ్రీకాకుళం జిల్లా: వీరఘట్టం మండలం కెడకల్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. నలుగురికి గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. సముద్రంలో ఇద్దరు యువకులు గల్లంతు.. నెల్లూరు జిల్లా: వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతయ్యారు. ఆదివారం ఆటవిడుపుగా 8 మంది యువకులు సముద్ర స్నానానికి వెళ్లారు. గల్లంతైన వారిలో నెల్లూరుకు చెందిన గోపీ మృతదేహం లభ్యం కాగా, కడపకు చెందిన హసన్ కోసం మెరైన్ పోలీసులు, మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. వారిని నాయుడుపేట మేనకురు సెజ్లోని అరవిందో ఫార్మసీలో ఉద్యోగులుగా గుర్తించారు. -
ఏపీ: ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి తీపి కబురు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలోని డిపోలు, యూనిట్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దీన్ని అమలు చేయబోతోంది. ఆర్టీసీలో మొత్తం 5 వేల మంది ఔట్ సోర్సింగ్లో పనిచేస్తున్నారు. వీరు ప్రతి రోజూ తమ నివాసం నుంచి డిపో/యూనిట్లకు సొంత ఖర్చులతో ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని గత కొద్ది కాలంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. (చదవండి: ఈనెల 24 నుంచి స్థానికులకు టీటీడీ టిక్కెట్లు) ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్ధేశంతో ఈ ఉచిత బస్పాస్లు మంజూరు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ బస్ పాస్లు చెల్లుబాటవుతాయి. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారు తమ నివాసం నుంచి 25 కి.మీ.లోపు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. (చదవండి: రేపు అర్ధరాత్రి వరకు వెబ్ఆప్షన్లకు గడువు..) -
ఏపీలో కొత్తగా 534 కరోనా కేసులు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 63,821 కరోనా పరీక్షలు నిర్వహించగా, 534 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడినవారి సంఖ్య 877348కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.(చదవండి: ఈ మాస్క్ వెరీ స్పెషల్..ధర 69వేలకు పైనే..) గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా బారినపడి అనంతపురం, పశ్చిమగోదావరి లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 7069 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో 498 మంది కోవిడ్నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 865825 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 4454 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి వరకు 1,10,65,297 శాంపిల్స్ను పరీక్షించారు. (చదవండి: ఎల్ఈడీ లైట్లతో కరోనా ఖతం!) -
‘పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు’
సాక్షి, ప్రకాశం జిల్లా: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ కేటగిరీలలో కొన్ని స్థానాలు బ్లాక్ చేయడం గతం నుంచి వస్తున్న విధానమేనని.. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన వివరించారు. (చదవండి: జనవరి 9న జగనన్న అమ్మఒడి సాయం) ‘‘కేటగిరీ 4లో కూడా కొన్ని స్థానాలు బ్లాక్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీలలో బదిలీలకు 48 వేల 897 ఖాళీలను గుర్తించాం. వెబ్ కౌన్సిలింగ్లో సర్వర్ల సమస్యను దృష్టిలో ఉంచుకుని రేపటి వరకూ ఆప్షన్ల నమోదుకు గడువు ఇచ్చాం. బదిలీలకు సంబంధించి పూర్తి వివరాలు ట్రాన్స్ ఫర్ పోర్టల్లో ఉంచాం. బ్లాక్ చేసిన స్థానాలను డీఎస్సీ నియామకాల సమయంలో భర్తీ చేస్తాం. అప్పుడు మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని’’ మంత్రి పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియ పై ఉపాధ్యాయ సంఘాలు, అధికారులతో పూర్తిగా చర్చించామని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్షాలు మాట్లాడటం సబబు కాదని మంత్రి సురేష్ హితవు పలికారు. (చదవండి: ‘జూమ్లో చంద్రబాబు.. ట్విట్టర్లో లోకేష్’) -
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖంపడుతున్నాయి. గత 24 గంటల్లో 44,935 కరోనా పరీక్షలు నిర్వహించగా, 305 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 87,5836కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. (చదవండి: మనోధైర్యమే మందు: ఓల్డ్ ఈజ్ గోల్డ్!) గడచిన 24 గంటల్లో 541 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 864049 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి నెల్లూరులో ఇద్దరు మరణించగా, ఇప్పటివరకు కరోనా సోకి 7059 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4728 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటివరకు 1,08,75,925 శాంపిల్స్ను పరీక్షించారు. (చదవండి: నయాసాల్... ‘మాల్’!) -
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 63,873 కరోనా పరీక్షలు నిర్వహించగా, 506 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 87,5531కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 613 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 863508 మంది డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: వ్యాక్సినేషన్కు 4 అంచెల వ్యవస్థ!) గత 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతిచెందగా, ఇప్పటి వరకు 7057 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4966 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,08,30,990 శాంపిల్స్ను పరీక్షించారు.(చదవండి: జనవరి 15 తర్వాత సెకండ్ వేవ్!) -
కేటాయింపులు ఘనం.. వ్యయం అంతంతే
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు సంవత్సరం వ్యవసాయం, సంక్షేమం, నీటిపారుదల తదితర రంగాలకు బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసిన చంద్రబాబు సర్కారు ఆ సొమ్మును ఖర్చు చేయడంలో విఫలమైంది. కేటాయింపులు, వ్యయాల మధ్య ఉన్న భారీ తేడాను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక బహిర్గతం చేసింది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, సహాయం, రోడ్లు భవనాలు, పౌరసరఫరాలు, పరిశ్రమల రంగాలకు భారీగా కేటాయింపులు చేసినా వ్యయం అంతంత మాత్రంగానే చేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. కొన్ని రంగాల్లో మిగుళ్లకు నిర్దిష్టమైన కారణాలను ప్రభుత్వం తెలియజేయలేదని కూడా వ్యాఖ్యానించింది. సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ రంగాల కేటాయింపుల్లో సగం కూడా వ్యయం చేయలేదని తెలిపింది. బడ్జెట్లో కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప వాస్తవరూపం దాల్చలేదని కాగ్ స్పష్టం చేసింది. కేటాయింపులు చేసినా ఆ పనులు చేపట్టడానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇవ్వలేదు. కేటాయింపులకు వ్యయానికి పొంతన లేకపోవడంతో బడ్జెట్ ప్రక్రియకు అర్థం లేకుండా పోయిందని కాగ్ నివేదిక పేర్కొంది. పౌరసరఫరాల కేటాయింపుల్లో ఏకంగా 81 శాతం మేర వ్యయం చేయలేదు. అలాగే రహదారులు, భవనాలశాఖకు కేటాయించినదాన్లో 75 శాతం మేర ఖర్చుచేయలేదు. మొత్తం 11 రంగాలకు కలిపి రూ.1,05,579.16 కోట్లు కేటాయించగా రూ.57,908.50 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. రూ.47,670.66 కోట్ల రూపాయలను వ్యయం చేయలేదు. 11 రంగాలకు కేటాయింపులు, ఖర్చుచేసిన, చేయని సొమ్ము వివరాలు.. రంగం కేటాయింపు (రూ.కోట్లలో) ఖర్చుచేసిన సొమ్ము(రూ.కోట్లలో) ఖర్చు చేయని మొత్తం 1.రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సహాయం 6,942.26 3886.61 3,055.65 2. పాఠశాల విద్య 23,192.58 17,479.29 5,713.33 3. పురపాలక, పట్టణాభివృద్ధి 8,629.99 5,243.03 3,386.96 4. సాంఘిక సంక్షేమం 4,221.64 2,121.06 2,100.58 5. బీసీ సంక్షేమం 6,278.36 2,804.39 3,473.97 6. వ్యవసాయం 15,569.41 8,020.53 7,548.88 7. పంచాయతీరాజ్ 7,367.03 4,880.90 2,486.13 8. పరిశ్రమలు, వాణిజ్యం 4,696.67 1,010.12 3,686.55 9. పౌరసరఫరాలు 3,673.00 697.69 2,975.31 10. రోడ్లు, భవనాలు 4,369.72 1,087.60 3,282.12 11. నీటిపారుదల 20,638.50 10,677.32 9,961.18 మొత్తం 1,05,579.16 57,908.54 47,670.66 -
భర్త బాధితులకు ‘దిశ’ భరోసా
పోలీసుల స్పందనతో నిలిచిన ప్రాణం.. తూర్పుగోదావరి జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వివాహిత అర్ధరాత్రి 1:59 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసు సాయం కోరింది. తన భర్త వేధింపుల కారణంగా తాను నిద్రమాత్రలు మింగినట్టు తెలిపింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఐదు నిమిషాల్లోనే ఆమె వద్దకు చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను, ఆమె భర్తను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకుంటానని భర్త చెప్పడంతో వారి కాపురాన్ని పోలీసులు నిలబెట్టినట్లయింది. బెదిరించిన యువకుడి అరెస్ట్.. కర్నూలు జిల్లాలోని ఆస్పరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు తనతో వివాహేతర సంబంధం పెట్టుకోమని ఒక యువతిని వేధించాడు. అందుకు అంగీకరించని ఆమె పెళ్లి చెడగొట్టేందుకు లెటర్ రాస్తానని బెదిరించాడు. దీనిపై బాధితురాలు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. బాలికను వేధించినందుకు కేసు.. గుంటూరు జిల్లా వట్టిచెరుకురు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక (12)ను ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో పొరుగింటి యువకుడు చొరబడి వేధించాడు. ఇది గమనించిన స్థానికులు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి బాలికను కాపాడటంతోపాటు ఆమెను లైంగికంగా వేధించిన యువకుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు... ఇలా భర్త చేతిలో దెబ్బలు తిని కాపాడమని కోరిన గృహిణులతోపాటు ఆకతాయిల వేధింపులకు గురైన విద్యార్థినులు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్లలో అపరిచితుల అసభ్య ప్రవర్తనతో విసిగిపోయిన యువతులకు దిశ యాప్ వరంలా మారింది. సాక్షి, అమరావతి: భర్త బాధితులైన పలువురు గృహిణులు దిశ యాప్ను ఆశ్రయిస్తున్నారు. దిశ కాల్ సెంటర్కు ఫిర్యాదు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు స్పందిస్తున్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో కౌన్సెలింగ్ ద్వారా కాపురాలు చక్కదిద్దుతున్నారు. దిశ కాల్ సెంటర్కు వచ్చిన కాల్స్ను పోలీసులు విశ్లేషించగా.. భర్త బాధితులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లు తెచ్చిన సంగతి తెల్సిందే. దిశ బిల్లులో భాగంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 8న దిశ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ను దాదాపు 12 లక్షలమంది డౌన్లోడ్ చేసుకోగా, ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. దిశ యాప్లో వస్తున్న ఫిర్యాదుల్లో భర్త బాధితలు సైతం ఉండటం గమనార్హం. అనేకమంది గృహిణులు ‘భర్త పెట్టే బాధలు భరించలేకపోతున్నాం కాపాడండి’ అంటూ వేడుకుంటున్నారు. గడిచిన పదినెలల కాలంలో 675 మంది మహిళలు, బాలికలు దిశ కాల్ సెంటర్కు ఫోన్ చేశారు. వీరిలో భర్త వేధింపులు తాళలేకపోతున్నామంటూ 267 మంది కాల్ చేశారు. ఈ ఘటనల్లో మద్యం తాగి వచ్చి భార్యను కొట్టిన ప్రబుద్ధులే ఎక్కువగా ఉన్నారు. దీనికితోడు అధిక కట్నం కోసం వేధిస్తున్న వారున్నారు. రాత్రివేళ 10.30 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల మధ్య ఈ తరహా వేధింపులు జరిగినట్టు దిశ కాల్స్లో రికార్డయ్యాయి. భర్త కొడుతున్న సమయంలో తమ మొబైల్స్లోని దిశ యాప్ను ఓపెన్ చేసి ఎస్వోఎస్ బటన్ ప్రెస్ చేసే అవకాశం లేకపోవడంతో తమ చేతిలోని సెల్ ఫోన్ను అటు ఇటు ఊపి (షెక్ చేయడం) ఆపదలో ఉన్నాం ఆదుకోండి.. అని సమాచారం అందించడం విశేషం. దిశ కాల్ సెంటర్కు సమాచారం వచ్చిన వెంటనే సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేయడంతో భర్త బాధితులను కాపాడుతున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాలు చక్కదిద్దుతున్నారు. పదినెలల్లో దిశ యాప్కు వచ్చిన ఫిర్యాదులు భర్త వేధింపులు: 267 బయటివారి వేధింపులు: 115 గుర్తుతెలియనివారి వేధింపులు: 69 పనిచోసేచోట వేధింపులు: 67 బంధువుల వేధింపులు: 68 తప్పుడు ఫిర్యాదులు: 22 అసభ్య ప్రవర్తన: 19 మహిళ అదృశ్యం: 13 బాలికలపై అకృత్యాలు: 9 సివిల్ వివాదాలు: 8 బాలికల అదృశ్యం: 8 ప్రమాదాలు: 6 పురుషుల అదృశ్యం: 3 వెంటపడి వేధింపులు: 1 మొత్తం: 675 తక్షణం స్పందిస్తున్నాం దిశ యాప్ ద్వారా కాల్ సెంటర్కు వస్తున్న సమాచారంపై తక్షణం స్పందించి సమీపంలోని పోలీసులను అప్రమత్తం చేస్తున్నాం. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు, యువతులకు తక్షణ సహాయం అందించేందుకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందిస్తున్న పోలీసులు 5 నుంచి 12 నిమిషాల్లోనే ఘటన ప్రాంతానికి చేరుకుని సహాయం అందిస్తున్నారు. చాలావరకు తక్షణ సహాయం, కౌన్సెలింగ్లతో సరిపెడుతున్నాం. తీవ్రత ఉన్న వాటిపై గృహహింస, పోక్సో, నిర్భయ కేసులు నమోదు చేస్తున్నాం. భర్తల వేధింపులపై 267 మంది ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ అనంతరం అనేక కాపురాలు చక్కబడ్డాయి. అప్పటికీ మాటవినని 20 మంది పురుషులపై కేసులు నమోదు చేశాం. - దీపికా పాటిల్, దిశ ప్రత్యేక అధికారి -
ఏపీలో కొత్తగా 510 కరోనా కేసులు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67,495 కరోనా పరీక్షలు నిర్వహించగా, 510 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 87,5025కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని 665 డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 86,2895 మంది డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: 20 వేల కోట్లతో రెండో విడత వ్యాక్సిన్) గత 24 గంటల్లో కరోనా బారినపడి గుంటూరు, వైఎస్సార్ కడప, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు మృతిచెందగా, ఇప్పటివరకు ఏపీలో 7052 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5078 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,07,67,117 పరీక్షలు నిర్వహించారు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్లతో సరికొత్త ప్రయోగం) -
ఏపీలో కొత్తగా 520 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 64,425 కరోనా పరీక్షలు నిర్వహించగా, 520 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు ఏపీలో కరోనా బారినపడివారి సంఖ్య 874515కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 519 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,62,230 మంది డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: నెల రోజుల్లో మనకు వ్యాక్సిన్: సీఎం) గత 24 గంటల్లో కోవిడ్ బారినపడి కృష్ణా, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతిచెందగా, ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7049కి చేరుకుంది.ప్రస్తుతం ఏపీలో 5,236 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. నేటి వరకు 1,06,99,622 శాంపిల్స్ను పరీక్షించారు. (చదవండి: అందుకే భారత్లో కరోనా ఉధృతి తగ్గుముఖం) -
ఏపీలో కొత్తగా 538 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 64,354 కరోనా పరీక్షలు నిర్వహించగా, 538 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 87,3995కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 558 మంది కోవిడ్ నుంచి క్షేమంగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 86,1711 డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: కాచుకున్న కరోనా!) గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి గుంటూరు,కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతిచెందారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7047కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5237 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరుకు 1,06,35,197 శాంపిల్స్ను పరీక్షించారు. (చదవండి: అలర్జీ ఉంటే వ్యాక్సిన్ వద్దు) -
నేటి ప్రధానాంశాలు..
ఏలూరులో సీఎం వైఎస్ జగన్ అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో అస్వస్థతకు గురైన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీయిచ్చారు. సీఎం జగన్ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు... భారత్ బంద్కు విపక్షాల మద్దతు ఢిల్లీ: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో రైతు సంఘాలు ప్రకటించిన ‘భారత్ బంద్’కు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ దేశవ్యాప్త బంద్కు కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఆప్ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, 10 కార్మిక సంఘాల ఐక్య కమిటీ తమ మద్దతు తెలిపాయి. పూర్తి వివరాలు... పెట్రోల్, డీజిల్ ధరల మంట పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోసారి రెక్కలొచ్చాయి. సగటున లీటర్ పెట్రోల్పై 30-33 పైసలు, డీజిల్ లీటర్పై రూ. 25-31 పైసల చొప్పున పెరిగాయి. పూర్తి వివరాలు.. తెలుగు మహిళ ఘనత పదిహేనుసార్లు మారథాన్ రన్.. పదిభాషల్లో ప్రావీణ్యం.. ఎనిమిది దేశాల్లో అమెరికన్ ఎంబసీల్లో కొలువు.. 22 ఏళ్ళకే ఇరాక్ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్ ఎక్స్’ మిషన్ హెడ్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు.. సునీత నిశ్చితార్థం ప్రముఖ సినీ నేపథ్య గాయనీ సునీత నిశ్చితార్థం హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో నిరాబండరంగా జరిగింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వస్తున్న వదంతులకు ఫుల్స్టాప్ పడింది. పూర్తి వివరాలు.. వరంగల్ జిల్లాలో దారుణం వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గొండి మండలం రేపల్లెలో అత్యాచార ఘటన కలకలం రేపింది. తీవ్ర రక్తస్రావం జరిగి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. పూర్తి వివరాలు.. కరోనాతో బాలీవుడ్ టీవీ కరోనా వైరస్ బారిన పడి బాలీవుడ్ టీవీ నటి దివ్య భట్నాగర్(34) సోమవారం మృతి చెందారు. అధిక రక్తపోటుతో పాటు కరోనా మహమ్మారితో పోరాడి ఈ రోజు తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాలు.. నోకియా లేటెస్ట్ స్మార్ ఫోన్ ఈ నెల రెండు లేదా మూడో వారంలో నోకియా లేటెస్ట్ స్మార్ ఫోన్ 3.4 దేశీ మార్కెట్లో విడుదల కానుంది. దేశీయంగా దీని ధర సుమారు రూ. 12,000- 12,800 స్థాయిలో ఉండవచ్చని విశ్లేషకుల అంచనా. పూర్తి వివరాలు.. 58 అంతస్థులు చేతులతోనే ఎక్కేశాడు! వైరల్: పారిస్ మోంట్పార్నాస్సేలోని ఓ యూట్యూబర్ 58 అంతస్తుల భవంతిని చకాచకా చేతులతోనే ఎక్కేశాడు. ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పూర్తి వివరాలు.. మా రాష్ట్రంలో బంద్ పాటించం: విజయ్ రూపాని నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు డిసెంబర్ 8న తలపెట్టిన భారత్ బంద్ను తమ రాష్ట్రం పాటించదని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. ఈ చట్టాల విషయంలో రైతులలో అసంతృప్తి లేదని భావిస్తున్నానన్నారు. పూర్తి వివరాలు.. -
ఏపీలో కొత్తగా 667 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 60,329 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 667 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 87,1972కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి క్షేమంగా కోలుకుని 914 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,59,029 మంది డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: దేశంలో తగ్గుతున్న కరోనా కొత్త కేసులు) గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది మరణించగా, ఇప్పటి రాష్ట్రంలో 7,033 మంది మృతిచెందారు. ఏపీలో ప్రస్తుతం 5,910 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,04,10,612 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. (చదవండి: కోటిన్నర మంది చనిపోయినా... ఒక్క టీకా పడలేదు) -
ఏపీలో రేపు, ఎల్లుండి వర్షాలు
సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజులు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రేపు(సోమవారం) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు.. కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి (మంగళవారం) నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు భారీ వర్షాలు.. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు తెలిపారు. -
ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 57,132 కరోనా పరీక్షలు నిర్వహించగా, 630 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 871305కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 882 మంది కరోనా నుంచి క్షేమంగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటివరకు 8,58,115 మంది డిశ్చార్జ్ అయ్యారు. (చదవండి: అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా..) గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి కృష్ణా జిల్లాలో ఇద్దరు.. చిత్తూరు, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు మరణించగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 7024 మంది మృతిచెందారు. రాష్ట్రంలో 6,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు ఏపీలో 1,03,50,283 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. (చదవండి: కరోనా వైరస్కు రుణపడి ఉన్నా: వర్మ) -
హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదంటూ పిటిషన్లో పేర్కొంది. ఎస్ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. పిటిషన్లో ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని ప్రభుత్వం చేర్చింది. కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే కరోనాతో 6వేల మంది మరణించారని, ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. గతంలో కరోనా అంటూ ఎన్నికలు వాయిదా వేసి.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనడంపై పిటిషన్లో ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. (చదవండి: సీఎం జగన్పై దాఖలైన పిటిషన్లు కొట్టివేత..) -
ఏపీలో కోటి దాటిన కరోనా పరీక్షలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటింది. నేటి వరకు రాష్ట్రంలో 1,00,57,854 మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 40,728 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 381 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 868064కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. (చదవండి: కరోనా : మోడర్నా మరో గుడ్ న్యూస్ చెప్పింది) గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకుని 934 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,53,232 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి అనంతపురం,చిత్తూరు, కృష్ణా,విశాఖపట్నంలో ఒక్కరి చొప్పున మొత్తం నలుగురు మృతిచెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6992కి చేరుకుంది. ప్రస్తుతంలో ఏపీలో 7,840 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి: ఇక రూ.800కే కరోనా టెస్ట్..!)| -
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న సమావేశాల్లో ప్రభుత్వం పలువురి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనుంది. శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలు చర్చించాలో బీఏసీ నిర్ణయించనుంది. తొలిరోజు వ్యవసాయ రంగంపై చర్చించనున్నారు. నివర్ తుపాను ప్రభావంపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించనుంది. నివర్ తుపాను ప్రభావంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. 19 బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. (చదవండి: ఆ ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: కొడాలి నాని) ఎకానిమల్ ఫీడ్, ఫిష్ ఫీడ్ యాక్ట్, ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్, ఏపీ ఫిషరీష్ వర్సిటి బిల్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అసైన్డ్ భూముల చట్ట సవరణ, అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్, ఏపీ వ్యాట్ బిల్, ఏపీ ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్స్ ట్రేడ్స్ సవరణ బిల్, ఏపీ స్పెషల్ కోర్ట్స్ ఫర్ ఉమెన్, మోటార్ వెహికల్ చట్టం, ఆన్లైన్ గేమింగ్ నిషేధితచట్టం, స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీరాజ్ చట్ట సవరణ, ఏపీ ఎఫ్ఆర్బిఎం సవరణ బిల్లు, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు బిల్లు, మున్సిపల్ లా సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 20 ప్రధాన అంశాలను ప్రభుత్వం చర్చించనుంది. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతీ అంశాన్ని చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. (చదవండి: పేర్నినానిపై హత్యాయత్నం: కొత్త కోణం..) -
ఆ ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: కొడాలి నాని
సాక్షి, విజయవాడ: రేషన్ డీలర్లను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలు తినే రేషన్లో మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చే వాటికన్నా..క్వాలిటీతో ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వంపై 350 కోట్ల భారం పడ్డా నాణ్యమైన బియ్యం ఇస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలపై భారం పడకుండా డీలర్లకు 22 కోట్లు కమీషన్ రూపంలో ప్రభుత్వం ఇచ్చిందని వెల్లడించారు. ఉచిత రేషన్ రూపంలో డీలర్లు ఇచ్చే కమీషన్ 270 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించిందని, రేషన్ డీలర్లకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని కొడాలి నాని తెలిపారు. (చదవండి: ‘అది తెలిసే మొహం చాటేశారు’) -
ఏపీ: రాగల మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు-పాండిచ్చేరి మధ్య తీరందాటే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 3 రోజుల్లో దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
ఏపీ: కరోనా కేసులు తగ్గుముఖం
సాక్షి, అమరావతి: ఆంధ్రపదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 49,348 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 625 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 867063కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. (చదవండి: కరోనాకు వ్యాక్సిన్లు రావడం ఓ భ్రమేనా!?) గడచిన 24 గంటల్లో కరోనాతో కృష్ణాలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒక్కరు.. మొత్తం ఐదుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 6981కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి క్షేమంగా కోలుకుని 1,186 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు మొత్తం 848511 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుత్తం 11571 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 99,62,416 శాంపిల్స్ను పరీక్షించారు. (చదవండి: కరోనా ఎఫెక్ట్: నల్లకోడికి ఫుల్లు డిమాండ్) -
ఏపీ వైపు విదేశీ వర్సిటీల చూపు
సాక్షి, అమరావతి: పలు అంతర్జాతీయ విశ్వ విద్యాలయాలు రాష్ట్రం వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో ముఖ్యంగా ఉన్నత విద్యా రంగంలో తెస్తున్న విప్లవాత్మక మార్పులు, విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం ఆయా వర్సిటీలను ఆకట్టుకుంటోంది. దీంతో రాష్ట్రంలో తమ వర్సిటీల క్యాంపస్లు ఏర్పాటు చేయాలని అవి భావిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలోని ప్రతిష్టాత్మక జార్జియాటెక్ యూనివర్సిటీ, అలబామా స్టేట్ యూనివర్సిటీ, క్లెమ్సన్ యూనివర్సిటీ, అస్ట్రేలియాకు చెందిన మరో ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయం ఆంధ్రప్రదేశ్లో తమ ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చాయి. ఆయా వర్సిటీల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. త్వరలోనే ఇవి ఒక కొలిక్కి రానున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు రాష్ట్ర విద్యార్థులు విదేశీ విద్య సులభంగా పొందడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా విదేశీ విద్యా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర విద్యార్థికి సులభంగా విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించడం, అక్కడి విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు, అధ్యాపకులతో పాటు పరిశోధనల్లో బాగస్వాముల్ని చేయడానికి వారధిగా పనిచేసేలా విదేశీ విద్యా విభాగాన్ని రూపొందించారు. విదేశీ విశ్వ విద్యాలయాలతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం ద్వారా మన రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలకు విదేశీ నిధులు తెప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు పరిశోధన, విద్యా బోధన తదితర రంగాల్లో విదేశీ వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని 36 ప్రతిష్టాత్మక వర్సిటీలు ఏపీతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో కాకినాడలోని జేఎన్టీయూ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి మధ్య కుదిరిన ఎంవోయూతో పరిశోధన కార్యక్రమాల కోసం 44 వేల అమెరికా డాలర్ల (రూ.32.80 లక్షలు) నిధులు మంజూరు అయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యకు చర్యలు అలాగే విద్యార్థులకు అపారమైన ఉపాధి అవకాశాలను కల్పించడానికి వీలున్న ఏరోస్పెస్, సౌర, ఇంధన, వ్యవసాయం, ఆతిథ్య రంగం, బయోకెమిస్ట్రీ విభాగాల్లో విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆయా రంగాల్లో రాష్ట్ర విద్యార్థులకు సహకారం అందించడానికి జార్జియాటెక్, క్లెమ్సన్ వర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్, ఎ అండ్ ఎం కాలేజ్ స్టేషన్, లూసియానా స్టేట్ యూనివర్సిటీ, లామర్ , డ్యూక్ వర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, ఎమ్రార్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కార్పస్క్రిస్టీ తదితర విశ్వవిద్యాలయాలు ముందుకు వచ్చాయి. మరోవైపు రాష్ట్ర విదేశీ ఉన్నత విద్యా విభాగం రాష్ట్రంలోని 1,000 మంది విద్యార్థులకు ఉచిత విదేశీ ఆన్లైన్ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సులు పూర్తి చేసినవారికి సర్టిఫికెట్లు ఇవ్వనుంది. -
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 57,752 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 733 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 866438కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కృష్ణాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరంలో ఒక్కరి చొప్పున మొత్తం ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 6976కి చేరుకుంది. (చదవండి: హెటెరో కీలక డీల్..మరో రెండు నెలల్లో వ్యాక్సిన్!) గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 1205 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8లక్షల 47వేల 325 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 12,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 99,13,068 శాంపిల్స్ను పరీక్షించారు. (చదవండి: కరోనా నిర్ధారణలో ‘ర్యాపిడ్’ విప్లవం) -
సీఎం సహాయనిధికి రూ.51 లక్షల విరాళం
సాక్షి, అమరావతి: సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను పలువురు అభినందిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం వ్యాపారవేత్తలు, సొసైటీలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తరపున రూ.51 లక్షల 86 వేల రూపాయల విరాళాన్ని అందించారు. విరాళం చెక్కును సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు అందజేశారు. (చదవండి: కరోనా నిర్ధారణలో ‘ర్యాపిడ్’ విప్లవం) -
కరోనా నిర్ధారణలో ‘ర్యాపిడ్’ విప్లవం
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్లు కీలక భాగస్వామ్యం నెలకొల్పాయి. కొత్త వైరస్ కావడానికి తోడు, వ్యాప్తి అత్యంత వేగంగా ఉండటం వల్ల అపార నష్టం సంభవించింది. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ నుంచి తక్షణమే బయట పడేందుకు ర్యాపిడ్ కిట్లు ఉపయోగపడిన తీరు అమోఘమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు డెంగీ జ్వరాలకు మాత్రమే ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడారు. ఇది పూర్తిగా దోమకాటు జ్వరాలకు వాడేది. కోవిడ్ సోకిన తొలి రోజుల్లో ర్యాపిడ్ కిట్లు అందుబాటులో లేవు. ఇవి బాగా అందుబాటులోకి వచ్చింది 2020 ఆగస్ట్ నుంచే. ఆ తర్వాతే కరోనా వ్యాప్తి తగ్గినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: వాటికి తొలి ప్రాధాన్యత: సీఎం జగన్) తక్కువ సమయంలో ఫలితం ♦కోవిడ్ వైరస్ను కనుగొనడంలో ఆర్టీపీసీఆర్ టెస్టును గోల్డెన్ స్టాండర్డ్ అని చెబుతారు. అయితే ఈ టెస్టు ఫలితం కనీసం 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లోకి వచ్చిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లు 10 నిమిషాల్లో అక్కడికక్కడే ఫలితం ఇచ్చాయి. పైగా సేకరించిన నమూనాలను ల్యాబ్లకు పంపాల్సిన అవసరం ఉండదు. పెద్దగా నైపుణ్యం కూడా అక్కర్లేదు. ♦ఇంటి వద్దకే వెళ్లి పరీక్ష చేసే అవకాశం ఉండటం వల్ల మొత్తం టెస్టుల్లో 38 శాతం ర్యాపిడ్ టెస్టులే ఉన్నాయి. ఇంటివద్దకే వెళ్లి టెస్టులు చేయడంలో ఏపీలో అద్భుత ఫలితాలు వచ్చాయి. (చదవండి: విజృంభిస్తున్న కరోనా : రికార్డు పెళ్ళిళ్లు) వీలైనంత త్వరగా అప్రమత్తం ♦ఫలితం వెంటనే తేలడంతో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడే వీలు కలిగింది. సత్వరమే హోం ఐసొలేషన్, లేదా ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందించడానికి సాధ్యమైంది. ♦హై రిస్క్ ప్రాంతాలు లేదా హైరిస్క్ గ్రూపులో ఉన్న వారిని గుర్తించడంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కీలక పాత్ర వహించాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లలో తక్షణమే టెస్టులు చేసి పాజిటివ్ వ్యక్తులను గుర్తించే వీలు కలిగింది. ♦వాస్తవానికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంటే ర్యాపిడ్ యాంటీజెన్ ఎక్కువ ఖరీదు అయినప్పటికీ, సత్వర ఫలితం వస్తుండటంతో దీనికి ప్రాధాన్యమిస్తున్నారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లలో సత్ఫలితాలు ఓవైపు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తూనే మరో వైపు ర్యాపిడ్ టెస్ట్ కిట్లతోనూ పరీక్షలు చేస్తూ వచ్చాం. ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో సత్వర ఫలితాలు రావడం వల్ల బాధితులను వెంటనే ఐసొలేషన్ (ఇంట్లో లేదా ఆస్పత్రిలో) చేయగలిగాం. దీనివల్ల వైరస్ వ్యాప్తి పెరగకుండా చూశాం. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పరీక్ష చేయగలగడం వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలిగాం. - కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ ఈ నెల 22 నాటికి మొత్తం టెస్టులు 96,62,220 మొత్తం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు 35,66,496 వీటిలో పాజిటివ్గా వచ్చినవి 4,08,668 నెగిటివ్గా వచ్చినవి 31,55,092 వెయిటింగ్లో ఉన్నవి 472 ఆగస్ట్లో ర్యాపిడ్ టెస్ట్ కిట్ ధర రూ.410 నవంబర్లో ర్యాపిడ్ టెస్ట్ కిట్ ధర రూ.272 -
30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాలపై నోటిఫికేషన్ గురువారం విడుదలయ్యింది. డిసెంబర్ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే నిర్ణయంపై స్పష్టత రానుంది. (చదవండి: వాటికి తొలి ప్రాధాన్యత: సీఎం జగన్) ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఎర్రచందనం, డ్రగ్స్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి వరకు కేవలం అక్రమ ఇసుక, మద్యం అమ్మకాలకు మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిమితమైంది. ఇకపై గ్యాంబ్లింగ్, ఆన్ లైన్ బెట్టింగ్, డ్రగ్స్, ఎర్రచందనం, ఇతర నిషేధిత పదార్ధాలు ఏస్ఈబి పరిధిలోకి తీసుకువచ్చింది.(చదవండి: పన్నులపై రెండు పత్రికల దుష్ప్రచారం) -
మైనార్టీలకు సంక్షేమ నజరానా
సాక్షి, అమరావతి: ముస్లిం మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా రూ.3,428 కోట్ల మేర లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే మైనార్టీలకు పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. ఇంత భారీ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వాలు చేయూత అందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల మైనార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. నేరుగా నగదు బదిలీ... అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, సున్నా వడ్డీ, పెన్షన్ కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, చేదోడు, వైఎస్సార్ ఆసరా, నేతన్న నేస్తం, లా నేస్తం తదితర పథకాల ద్వారా గత నెల వరకు నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.2,585 కోట్లు ప్రభుత్వం అందించింది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణ పథకాల ద్వారా కూడా ఆదుకుంటోంది. త్వరలో ఇవ్వనున్న ఇళ్ల స్థలాల పట్టాలు, మరికొన్ని పథకాల ద్వారా రూ.843 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. తద్వారా 17 నెలల వ్యవధిలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ముస్లిం మైనారిటీలకు రూ.3,428 కోట్ల మేర లబ్ధి కలగనుంది. మదర్సాల్లోనూ మధ్యాహ్న భోజనం రాష్ట్రంలోని 900 మదర్సాలలో చదువుతున్న 33 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేసింది. మదర్సాలకు కూడా అమ్మ ఒడి, విద్యా కానుక పథకాలు అమలవుతున్నాయి. వక్ఫ్ ఆస్తులపై రీ సర్వేలు వక్ఫ్బోర్డు, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర, చర ఆస్తులను రీసర్వే చేసి ఆస్తులు కాపాడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండో విడత సర్వే ద్వారా ఇప్పటికే దాదాపుగా ఆస్తుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావచ్చింది. ప్రత్యేకించి సర్వే కమిషనరేట్ను ఏర్పాటు చేయడం ద్వారా రీ సర్వే జరుగుతోంది. హజ్ యాత్రికులకు సాయం పెంపు హజ్యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయాన్ని రూ.30 వేల నుంచి రూ.60 వేలకు పెంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.60 వేలు, అంతకు మించి ఆదాయం ఉన్న వారికి రూ.30 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది. ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనం ఇమామ్లకు రూ.5 వేలు, మౌజన్లకు రూ.3 వేల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తోంది. ఇటీవలే వారికి బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించింది. మరోవైపు ఇమామ్లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ పెంచిన మొత్తం త్వరలోనే అమలులోకి రానుంది. టీడీపీ పాలనలో.... టీడీపీ ఐదేళ్ల పాలనలో ముస్లిం మైనార్టీలకు అందించిన సాయం వేళ్ల మీద లెక్కించవచ్చు. మొత్తం 5 ఏళ్లలో కలిపి ఇచ్చింది కేవలం రూ.2,661 కోట్లు మాత్రమే. ఇవి అప్పటి ప్రభుత్వ లెక్కలు కాగా సాయం లబ్ధిదారుల చేతికందేలోపు జన్మభూమి కమిటీలు, దళారులు కాజేసింది పోగా లబ్ధిదారులకు అందింది చాలా స్వల్పమే. ఒక కుటుంబంలో మూడు పథకాలు.. ‘నా భర్తకు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా సాయం అందుతోంది. నా మనవరాలికి జగనన్న అమ్మ ఒడి పథకం వర్తిస్తోంది. నాకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 అందాయి. గతంలో మాకు ఎప్పుడూ ఇలా సాయం అందలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా’ - షేక్ హసన్బీ, బ్రాహ్మణపల్లి, పిడుగురాళ్ల మండలం, గుంటూరు జిల్లా. చదివిస్తూ డబ్బులివ్వడం గొప్ప పని... ‘చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చదువులకు డబ్బులు ఇవ్వడం గొప్ప పని. ఇంతవరకు ఇలా ఎవరూ చేయలేదు. ప్రభుత్వం 1వ తరగతి నుంచే పిల్లల చదువుల కోసం డబ్బులు ఇవ్వడమే కాకుండా పుస్తకాలు, బట్టలు, చెప్పులు కూడా సమకూరుస్తోంది. మూడో తరగతి చదువుతున్న నా కూతురు పేరుతో అమ్మ ఒడి డబ్బులు అందాయి. వైఎస్సార్ ఆసరా ద్వారా మా అప్పులను కూడా ప్రభుత్వం తీరుస్తోంది’ - ఎస్కే సబియా, వన్టౌన్, విజయవాడ చెప్పినట్లుగా సాయం చేస్తున్నారు.. ‘వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 అందాయి. వైఎస్సార్ ఆసరా తొలి విడత సాయాన్ని సెప్టెంబరులో అందించారు. నాలుగు విడతల్లో మొత్తం రుణం తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇంతకంటే ఏం కావాలి? చెప్పినట్లు సాయం చేసిన ముఖ్యమంత్రి జగనన్న ఒక్కరే’ - షేక్ కరీమున్నీసా, వన్టౌన్, విజయవాడ -
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 47,130 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 545 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 86,2758కి చేరింది. గత 24 గంటల్లో 1,390 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,42,416 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. (చదవండి: కరోనా విజృంభణ: సుప్రీం కీలక ఆదేశాలు) గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి కృష్ణాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు.. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, పశ్చిమగోదావరిలో ఒక్కరి చొప్పున మొత్తం 10 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 6948కి చేరుకుంది. ఏపీలో ప్రస్తుతం 13,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 96,62,220 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. (చదవండి: భారత్ బయోటెక్ మరో గుడ్న్యూస్) -
ఏపీలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఎం.వి.శేషగిరిబాబు, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా కె.ప్రవీణ్కుమార్ రెడ్డి.. ఏపీ టవర్స్ లిమిటెడ్ సీఈవోగా ఎం.రమణారెడ్డి, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్గా ఎస్బిఆర్.కుమార్లకు బాధ్యతలు అప్పగించారు. -
సీట్ల కొరత లేదు: ఇంటర్ బోర్డు
సాక్షి, విజయవాడ: ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియలో ఎటువంటి గందరగోళం లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ అడ్మిషన్లపై మార్చి నెలలోనే సర్క్యులర్ ఇచ్చామని పేర్కొన్నారు. సీట్ల కొరత ఉందని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇంటర్లో చేరడానికి ఎక్కడా సీట్ల కొరత లేదని తెలిపారు. కొత్తగా మంజూరైన 208 కళాశాలలతో కలిపి మొత్తం 7,42,780 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. (చదవండి: విదేశాల్లోనూ యువతకు ఉపాధి కల్పన) పదవ తరగతి పాసైన ప్రతీ ఒక్కరికి సీటు లభిస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో అగ్నిమాపకశాఖ ఎన్ఓసి లేని కళాశాలలకు కూడా 60 రోజుల గడువుతో అనుమతులిచ్చామని చెప్పారు. కోర్టు ఉత్తర్వులకి లోబడి ఇంటర్ అడ్మిషన్లు కొనసాగింపు, సీట్ల సంఖ్య ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రామకృష్ణ పేర్కొన్నారు. (చదవండి: ప్రణయ్ ఆత్మహత్య.. సంచలన విషయాలు) -
ఏపీ: భారీగా కరోనా కేసులు తగ్గుముఖం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 43,044 శాంపిల్స్ను పరీక్షించగా.. 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 854764కు చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో ఇద్దరు.. కృష్ణాలో ఇద్దరు.. విశాఖపట్నంలో ఇద్దరు.. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి ఒక్కరు చొప్పున మొత్తం 13 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 6881కు చేరింది. (చదవండి: సంచలన వ్యాఖ్యలు చేసిన సత్యేంద్ర జైన్) గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకుని 1507 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 829991 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17892 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 91,97,307 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.(చదవండి: వ్యాక్సిన్పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు) -
ఆ విషయంలో పునరాలోచన చేయాలి
సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలని ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు పోలాకి శ్రీనివాస్ కోరారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తగదని, కరోనా తగ్గిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని పేర్కొన్నారు. రోజుకి మూడు, నాలుగు వేలు కరోనా కేసుల నేపథ్యంలో ఎన్నికల వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో ఉద్యోగులను బలి చేయొద్దని కోరారు. -
ఏపీ: రేపటి నుంచి మోగనున్న బడి గంటలు
సాక్షి, ప్రకాశం: రేపటి నుంచి రాష్ట్రంలో బడి గంటలు మోగబోతున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటగా 9,10 విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 23 నుంచి 6, 7, 8 తరగతులకు క్లాస్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దశలవారీగా అన్ని తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం స్కూల్స్ నిర్వహించనున్నామని చెప్పారు. తగ్గించిన సిలబస్తో విద్యా సంవత్సరం పూర్తిచేస్తామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం ఒక పూట మాత్రమే తరగతులు నిర్వహిస్తామని, మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు ఇళ్లకు పంపిస్తామని మంత్రి సురేష్ పేర్కొన్నారు. -
ఏపీలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ ‘పోస్కో’ తెలిపింది. గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్తో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో తమ సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వారు ముఖ్యమంత్రి జగన్కు చెప్పారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, ఇవి పారిశ్రామిక రంగానికి మేలు చేస్తాయని సీఎం జగన్ ఈ సందర్భంగా వారికి బదులిచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సహజవనరుల పరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమల అభివృద్ధికి తగిన తోడ్పాటునం దిస్తాయన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పోస్కో ఇండియా గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంగ్ లై చున్, చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ గూ యంగ్ అన్, సీనియర్ జనరల్ మేనేజర్ జంగ్ లే పార్క్ తదితరులున్నారు. -
దసరా టూర్కు ‘ఆర్టీసీల’ బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి తర్వాత ఘనంగా జరుపుకొనే వేడుక. ఈ పండుగ వేళ హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు ఏడెనిమిది లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారు. పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి వారి ప్రయాణాలు మొదలవుతాయి. ఆర్టీసీకి కూడా దసరా సీజన్ కలెక్షన్లు కురిపిస్తుంది. పెద్దెత్తున ఆదాయం వస్తుంది. ఈ సమయంలో చార్జీలు అధికారికంగా 50 శాతం పెంచినా ప్రజలు దాన్ని అంతగా పట్టించుకోరు. అయితే.. ఈసారి తెలంగాణలో ఉండే ఏపీ ప్రజలకు పెద్ద సమస్యే వచ్చిపడింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం కుదరకపోవడంతో బస్సులు సరిహద్దులు దాటడం లేదు. రెండు నెలలుగా అధికారులు కుస్తీ పడుతున్నా సయోధ్య కుదరలేదు. పండుగలోపు కుదురుతుందో.. లేదో.. తెలియని పరిస్థితి. దీంతో ఈసారి ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి ప్రయాణం కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు కోవిడ్ నిబంధనలతో రైళ్లు కూడా తక్కువ సంఖ్యలోనే నడుస్తున్నాయి. వాటిల్లో రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి. దీంతో విధిలేక ప్రజలు ప్రైవేటు బస్సుల కోసం పరుగుపెట్టాల్సి వస్తోంది. దొరికిందే అదునుగా వారు టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆర్టీసీ చార్జీ రూ.290 ఉంటే.. ప్రైవేట్లో రూ.500కుపైగా వసూలు చేస్తున్నారు. ఆదాయ నష్టం ఐదారు కోట్లు.. ప్రతీ సంవత్సరం పండుగ వేళ తిరిగే అదనపు బస్సుల్లో 50 శాతం చార్జి ఎక్కువ ఉంటుంది. దసరా సమయంలో తెలంగాణ ఆర్టీసీకి ఏపీకి తిప్పే స్పెషల్ బస్సుల ద్వారా రోజుకు అదనంగా రూ.70 లక్షల ఆదాయం వస్తుంది. ఒప్పందం కుదరక ఈ సారి బస్సులు తిరిగే అవకాశం లేకపోవడంతో దాదాపు రూ.ఐదారు కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ఈ సంవత్సరం ఇలా ఉంటే.. గతేడాది తెలంగాణ ఆర్టీసీ కార్మికులు దసరా వేళ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో టీఎస్ఆర్టీసీ బస్సులు సరిగాలేక ప్రజలు అప్పుడు కూడా ఇబ్బందులు పడ్డారు. లాక్డౌన్కు ముందు.. ►తెలంగాణ పరిధిలో ఏపీ ఆర్టీసీ బస్సులు తిరిగే కి.మీ.: 2.64 లక్షలు ►తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఏపీ భూభాగంలో తిరిగే కి.మీ.: 1.61 లక్షలు తెలంగాణ వాదన: తెలంగాణ పరిధిలో ఏపీ బస్సు లు.. ఏపీలో తిరిగే తెలంగాణ బస్సుల పరిధి కంటే 1.03 లక్షల కి.మీ. ఎక్కువ తిరుగుతున్నాయి. దాన్ని తగ్గించుకోవాలి. ఏపీ వాదన: తెలంగాణతో పోలిస్తే ఏపీ బస్సులు ఎక్కువ తిరుగుతున్న మాట వాస్తవమే. కాలం గడిచేకొద్దీ సర్వీసుల సంఖ్య పెంచుకోవాలి కాబట్టి.. టీఎస్ ఆర్టీసీ కూడా ఏపీలో అంతమేర పెంచుకుంటే సరిపోతుంది. కాదంటే మేం 50 వేల కి.మీ. తగ్గించుకుంటాం.. తెలంగాణ అంతమేర పెంచుకున్నా చాలు. పెంచుకోవడం సాధ్యం కాదు.. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది. బస్సులు పెంచుకోవడం సాధ్యం కాదు. ఇక లాభదా యకంగా ఉండే విజయవాడ–హైదరాబాద్, కర్నూలు–హైదరాబాద్, గుంటూరు–హైదరాబాద్, ఒంగోలు–హైదరాబాద్ తదితర ప్రాంతాల మధ్య ఏపీ బస్సులను తగ్గించుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఆదాయం కోల్పోవడమే సమస్య... తెలంగాణకు పెద్ద సంఖ్యలో బస్సులు తిప్పడం ద్వారా ఏపీ ఆర్టీసీ సాలీనా రూ.575 కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. తెలంగాణ వాదన మేరకు సంఖ్య తగ్గించుకుంటే దాదాపు రూ.260 కోట్ల ఆదాయం తగ్గుతుంది. అసలే నష్టాల్లో ఉండే ఆర్టీసీలు ఇంత ఆదాయం కోల్పోవటం పెద్ద సమస్యనే. కానీ ఏపీ బస్సులు ఎక్కువ తిరగటం వల్ల టీఎస్ ఆర్టీసీకి 250 కోట్ల కంటే ఎక్కువ నష్టమొస్తోందని తెలంగాణ వాపోతోంది. ఇద్దరికి రూ.1,100... దసరా వేళ హైదరాబాద్ నుంచి గుడివాడ వెళ్లాలంటే ప్రైవేట్ బస్సులో ఇద్దరికి కలిపి టికెట్ ధర రూ.1,100 అడిగారు. రైళ్లు ఫుల్ అయ్యాయి. ఆర్టీసీ బస్సుల్లేవు. దీంతో మాలాంటోళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. – సీతారామ్, యశ్వంత్, గుడివాడ మేం సిద్ధమే.. కానీ.. దసరాకి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా బస్సులు తిప్పేందుకు మేం సిద్ధం. కానీ.. ఏపీఎస్ ఆర్టీసీ మా ప్రతిపాదనకు అంగీకరించాలి. మా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రతిపాదన చేశారు. బస్సులు, కిలోమీటర్లు, రూట్లు.. ఈమూడింటిలో రెండు ఆర్టీసీలు సమంగా అనుసరించాలన్నారు. దాని ప్రకారమే మేం ప్రతిపాదించాం. మా ప్రతిపాదనతో రెండు ఆర్టీసీలు సమంగా లాభపడతాయి. – పువ్వాడ అజయ్కుమార్, రవాణాశాఖ మంత్రి -
నేటి ముఖ్యాంశాలు
ఏపీ/తెలంగాణ: ►నేటి నుంచి ఏపీ, తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ►ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ►ఏపీ వ్యాప్తంగా 1411 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ►తెలంగాణ వ్యాప్తంగా 1339 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ►ఏపీలో పరీక్షకు హాజరుకానున్న 5 లక్షల 18 వేల 788 మంది విద్యార్థులు ►ఏపీ: నేటి ఇంటర్ సెకండియర్ పరీక్షకు సెట్ నంబర్-2 ఎంపిక తిరుపతి: తిరుమలలో నేటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ►ఈనెల 9 వరకు కొనసాగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జాతీయం: ఢిల్లీ: నిర్భయ దోషుల డెత్వారెంట్పై నేడు పటియాల హౌస్ కోర్టులో విచారణ స్పోర్ట్స్: ►నేడు మహిళల టీ-20 వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్లు ►ఇంగ్లండ్ Vs భారత్ (ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ►ఆస్ట్రేలియా Vs దక్షిణాఫ్రికా (మ.1:30 గంటలకు మ్యాచ్ నగరంలో నేడు ►కల్చరల్ ప్రోగ్రామ్స్, అవార్డ్స్ ఫంక్షన్ బై మమత రఘువీర్ వేదిక: రవీంద్ర భారతి సమయం: ఉదయం 10 గంటలకు ►కిసి ఔర్ క సప్న : హిందీ ప్లే సుత్రదార్ వేదిక: లమాకాన్, బంజారాహిల్స్ సమయం: రాత్రి 8 గంటలకు ►తెలుగు , హిందీ ఫిల్మ్ సాంగ్స్ బై డీఏ మిత్ర , వి శశికళ స్వామి, డి. సురేఖ మూర్తి తదితరులు వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ , చిక్కడ్ పల్లి సమయం: సాయంత్రం 4:30 గంటలకు ►నట సామ్రాట్ : డ్యాన్స్ కాన్సర్ట్ బై ప్రతిభ రాజ్ గౌడ్ వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ , చిక్కడ్ పల్లి సమయం: సాయంత్రం 6 గంటలకు ►మాథ్ క్లాసెస్ విత్ మీణా సుబ్రమణ్యం వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్ , సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 5 గంటలకు ►లేబల్ లవ్ : ఎగ్జిబిషన్ , సేల్ బై శశి నహత వేదిక: హయత్ ప్లేస్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►హిందీ క్లాసెస్ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►వర్క్ షాప్ ఆన్ ఐఎల్ఇఏ వేదిక: శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, బాచుపల్లి సమయం: ఉదయం 9 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై జొగెన్ చౌదరి, రాంకుమార్ వేదిక: కళాకృతి, రోడ్ నం.3, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై నరసింహ గౌడ వేదిక: సాలార్జంగ్ మ్యూజియం సమయం: ఉదయం 10 గంటలకు ►ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ►సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్ డక్కన్ , బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►ఛాంపియన్ బ్రంచ్ వేదిక: రడిషన్ హైదరాబాద్ , హైటెక్ సిటీ సమయం: మధ్యామ్నం 12:30 గంటలకు ►చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ ఆండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ , మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు -
ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ
సాక్షి, తాడేపల్లి: చైనాలోని వూహాన్ సిటీలో చిక్కుకున్న 35 మంది ఏపీ యువకులను తిరిగి రప్పించేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ఆప్టో డిస్ల్పే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్కు ఎంపికయిన 35 మంది యువకులను శిక్షణ కోసం సంస్థ.. చైనా పంపించింది. యువకులు శిక్షణ పొందుతున్న వూహాన్ సిటీలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని.. వారిని వెనక్కి పిలిపించాలని సీఎం వైఎస్ జగన్ లేఖలో కోరారు. వీలైనంత త్వరగా వారిని భారత్కు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. -
మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు
సాక్షి, అమరావతి: మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను ఆశిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని కీలక శాఖలను ఒకే మంత్రిత్వశాఖ కిందకు తీసుకువచ్చింది. దీంట్లో భాగంగానే మంత్రి మోపిదేవి వద్దనున్న మార్కెటింగ్శాఖను, అలాగే మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి వద్దనున్న ఫుడ్ ప్రాససింగ్ శాఖను.. వ్యవసాయ, సహకార శాఖలను చూస్తున్న మంత్రి కె.కన్నబాబుకు అప్పగించారు. పరిపాలనా పరమైన సౌలభ్యంతో పాటు మరింత మేలు జరిగే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మంత్రి మోపిదేవి వద్ద ప్రస్తుతం పశుసంవర్థక, మత్స్యశాఖలు ఉన్నాయి. మరో శాఖను మోపిదేవికి అప్పగించాలని సీఎం యోచిస్తున్నారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. అలాగే బదలాయించిన ఫుడ్ ప్రాసెసింగ్ పోనూ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వద్ద పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖలున్నాయి. కొద్దిరోజుల కిందటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్డెవలప్మెంట్ శాఖను మంత్రి గౌతంరెడ్డికి అప్పగించారు. -
కౌన్సిల్ అవసరమా?
మన రాష్ట్రంలో విధాన పరిషత్తు (లెజిస్లేటివ్ కౌన్సిల్) భవితవ్యంపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతున్నది. విధాన పరి షత్తు స్వభావ స్వరూపాలను ఈ సందర్భంలో చర్చించుకొనడం అవసరం. విధాన పరిషత్తుల చట్టం ద్వారా 1958 జూలై మొదటి తేదీ నుండి మన రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటు చేయబడింది. మనకు జూలై 1958లో కౌన్సిల్ ఏర్పడింది. అంతకు ముందు లేదు. కర్నూలు రాజధానిగా అవతరించిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంలో కూడా లేదు. శాసనమండలికి వాస్తవంలో ఏవిధమైన అధికారాలు లేవు. శాసనసభ అంగీకరించిన బిల్లుకు శాసనమండలి సవరణలు చేసినా, తిరస్కరించినా, లేక పరిషత్తుకు సమర్పిం చబడిన తేదీ నుండి ఆ బిల్లు ఆమోదింపబడకనే మూడు మాసాలు దాటిపోయినా తిరిగి శాసనసభ దానిని పరిశీలించి మార్పులు చేర్పులతో లేదా యధాతధంగా తిరిగి ఆ బిల్లును రెండవసారి పాస్ చేసి మళ్ళీ పరిషత్తుకు పంపడం జరుగుతుంది. అప్పుడు ఆ బిల్లును పరిషత్తు త్రోసిపుచ్చినా, లేక ఆ బిల్లు పాస్ చేయకుండా ఒక మాసం పాటు అలాగే మిగిలిపోయినా శాసనసభ అంగీకరించని సవరణలతో పరిషత్తు దానిని పాస్ చేసినా శాసనసభ రెండవమారు బిల్లును ఏ రూపంలో పాస్ చేసిందో అదే రూపంలో శాసనమండలిలో కూడా పాస్ చేయబడినట్లు భావించబడుతుందని రాజ్యాంగంలోని 197వ అనుచ్ఛేదము చెబుతున్నది. అయితే ద్రవ్య సంబంధమైన బిల్లుల విషయంలో ఇంతమాత్రం ప్రాముఖ్యత కూడా శాసనమండలికి లేదు. విధాన పరిషత్తు సభ్యుల జీతభత్యాలకు అమితమైన వ్యయం తప్పదు. నెల జీతం రూ. 600, నియోజకవర్గం అలవెన్సు 300, ఫోనుకు వంద రూపాయలు. సభ్యుల దంపతులకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మొదటి తరగతికి ఒకటిన్నర రెట్లు ప్రయాణ భత్యం. రోజుకు రూ.45 దినభత్యం. సంవత్సరానికి మూడువేల రూపాయలు కిమ్మత్తు చేసే రైల్వే కూపనులు, వైద్య సౌకర్యం, ప్రభుత్వ అతిథి గృహాలలో వసతుల వంటి సౌకర్యాలనేకం. ఎం.ఎల్.ఎ. హాస్టళ్ళలో వీరికి జాగా చూపవలసిందే. రైల్వే కూపనులకు మారుగా నెలకు రూ.300 రొక్కంగా ఇవ్వమంటున్నారీ మధ్య. ఇవికాక, శాసనమండలి సమావేశాల ఏర్పాటుకు, ప్రసంగాలను అచ్చు వేయడానికి, సిబ్బందికి, ఇతరత్రా మరింత వ్యయం. ఇంకా శాసనమండలికొక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉంటారు. వారికి కారు, ఫోను, సిబ్బంది వంటి సదుపాయాల కోసం మరొక మోపెడు ఖర్చులు. రాష్ట్ర ప్రజానీకం అసలు ఆశయాలు, అభీ ష్టాలు నెరవేర్చాలనే మహదాశయంతో నందమూరి నాయకత్వాన ‘తెలుగుదేశం’ విశేష జనాదరణతో అధికారంలోనికొచ్చింది. అయితే ప్రస్తుతం శాసనమండలిలో ప్రభుత్వ పక్షానికి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టే సభ్యుడు కూడా లేడు. ఉమా వెంకట్రామిరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి జి. జగన్నాథరావు ఖాళీ చేసే స్ధానాలు త్వరలో అధికార పక్షానికి రాగలవు. పెద్దఎత్తున పార్టీ మార్పిడులు జరగకపోతే ప్రస్తుత ప్రభుత్వం చేపట్టనున్న అభ్యుదయ పథకాలన్నిం టికి శాసనమండలి పెద్ద ప్రతిబంధకంగా తయారయ్యే అవకాశం లేకపోలేదు. పార్టీ మార్పిడులను ఎంతమాత్రం ప్రోత్సహించని వజ్రసంకల్పుడు ముఖ్యమంత్రి నందమూరి. అటువంటప్పుడు ఈ యిబ్బందిని అధిగమించడానికి శాసనమండలిని రద్దు గావించడం వినా మార్గాంతరం లేదు. కొత్త మంత్రివర్గంలో అధిక శాతం యువకులు, కొత్తవారు, అనుభవం లేనివారు, కల్మశం అంతకన్నా లేనివారు. ఇక శాసనమండలిలో మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామిరెడ్డితో సహా పెక్కుమంది మాజీలు ఉన్నారు. వారికి పాలనా రంగంలోని లొసుగులన్నీ కరతలామలకం. తమ వాగ్ధాటితో, కొంటె ప్రశ్నలతో యువకులైన మంత్రులను వీరు ఇబ్బంది పెట్టే అవకాశం లేక పోలేదు.అందువల్ల ఏ కోణం నుండి చూసినా శాసనమండలి రద్దు అనేది అత్యంత అభిలషణీయం. కొత్త ప్రభుత్వానికి దీనివల్ల వెసులుబాటు ఎక్కువవడమే కాక ప్రజాధనం పన్ను చెల్లించే పేదవాని ధనం దుబారా కాకుండా కొంతవరకైనా నివారణకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ చర్యకు జనాదరణ మిక్కుటంగా లభిస్తుందనడంలో సందేహం లేదు. (నాటి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయ డంపై అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేసిన విస్పష్ట ప్రకటనపై స్పందిస్తూ వ్యాసకర్త 19–01–1983న ఒక పత్రికలో రాసిన వ్యాసానికి సంక్షిప్త రూపం) డా. యలమంచిలి శివాజి వ్యాసకర్త రాజ్యసభ మాజీ ఎంపీ మొబైల్ : 98663 76735 -
సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ది ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తెలిపారు.శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని పేర్కొన్నారు. వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అభివృద్ది అంతా ఒకే చోట జరిగితే ఏం జరుగుతుందో హైదరాబాద్ విషయంలో ప్రత్యక్షంగా చూశామని.. మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదని తెలిపారు. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ఇచ్చిన పరిశ్రమల రాయితీ వల్ల రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని.. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పరిశ్రమల రాయితీలను నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన 8 నెలల లోపే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని..అందుకే ఆయనపై నమ్మకం ఉందని ప్రతినిధులు పేర్కొన్నారు. -
26 నుంచి సచివాలయ సేవలు..
సాక్షి, విజయవాడ: ఈ నెల 26 నుంచి వార్డు సచివాలయాల్లో సేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్కుమార్ వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పౌర సేవలు సచివాలయాలు ద్వారా అందిస్తామని.. దేశంలో ఇన్ని సేవలు.. గ్రామాలు, వార్డుల్లో అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. సచివాలయాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించామని.. వచ్చే నెల నుంచి వార్డు సచివాలయాలు,వాలంటీర్ల ద్వారా పింఛన్ల చెల్లింపులు చేస్తామని చెప్పారు. రెండు నెలల్లో మొత్తం సేవలన్నీ అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 24 గంటల్లో కొన్ని, 72 గంటల్లో కొన్ని సేవలను అందిస్తామని వివరించారు. ప్రతి రోజు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. దరఖాస్తులు సచివాలయంలోనే చేసుకోవచ్చని తెలిపారు. మున్సిపాలిటీల్లో ప్రజలకు ఈ సచివాలయాలు ద్వారా తక్షణ సేవలు అందుతాయని కమిషనర్ పేర్కొన్నారు. -
ఏపీ: అవినీతిపరుల భరతం పడుతున్న ఏసీబీ
సాక్షి, విజయవాడ: సీఎం ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ప్రక్షాళనకు ఏసీబీ నడుంబిగించింది. అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో లంచావతారాల భరతం పట్టేందుకు ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా చిత్తూరు, పశ్చిమ, తూర్పుగోదావరి, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు నిర్వహించింది. బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు చేపట్టింది. 14400 స్పందన టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు స్పందించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో బీరువాలు, సిబ్బంది బ్యాగులను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. రికార్డులు పరిశీలించి సిబ్బందిని ఆరా తీస్తున్నారు. కార్యాలయాలకు పనులపై వచ్చిన ప్రజలను విచారించి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. చిత్తూరు: జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. రేణిగుంట, వడమాలపేట, పుత్తూరు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. వివిధ సమస్యల మీద వచ్చిన ఫిర్యాదులు ఎంత వరుకు పరిష్కారం అయ్యాయి. పెండింగ్ ఉన్న ఫిర్యాదులు, పరిష్కారం చేయకపోవడానికి కారణాలపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి: జిల్లాలోని చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలో పలు దస్ర్తాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. కృష్ణా: జిల్లాలోని అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రికార్డులను పరిశీలించడంతో పాటు, అధికారులు, సిబ్బంది బ్యాగులను కూడా తనిఖీ చేస్తున్నారు. కార్యాలయాలకు పనుల మీద వచ్చిన ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. తూర్పుగోదావరి: జిల్లాలోని పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు,సిబ్బందిని విచారిస్తున్నారు. రికార్డులను పరిశీలించడంతో పాటు, తహసీల్ధార్ కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అనంతపురం జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా దాడుల్లో భాగంగా ఏసీబీ అధికారులు జిల్లాలోని ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎచ్చెర్ల తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రకాశం జిల్లా: పొన్నలూరు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా కార్యాలయంలో ఏసీబీ అధికారులు అపర్ణ, వెంకటేశ్వర్లు, రాఘవరావు, ప్రసాద్ రికార్డులను పరిశీలించారు. పాసు పుస్తకాలు జారీ అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శ్రీకాకుళం: జిల్లాలోని కొత్తూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్ధార్ కార్యాలయంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రికార్డులను పరిశీలించారు. విజయనగరం జిల్లా: జిల్లాలో వేపాడ తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. కార్యాలయంలోని అధికారులు,సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రికార్డులు పరిశీలించి ఆరా తీస్తున్నారు.ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. నెల్లూరుజిల్లా: సూళ్లూరుపేట తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించాయి. అవినీతిపై ఆరోపణలపై అధికారులను, సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు కార్యాలయాలకు వచ్చిన ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
మధ్యాహ్న భోజనంలో.. కొత్త రుచులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మెనూ కొత్త రుచులు సందడి చేయనున్నాయి. మారిన ఈ కొత్త మెనూ మంగళవారం నుంచి అమల్లోకి రానుండడంతో విద్యార్థిలోకం సంతోషం వ్యక్తం చేస్తోంది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారంతోపాటు శుచి, శుభ్రతతో ఉండాలన్న లక్ష్యంతో ఆçహార పట్టికలో పలు మార్పులు చేశారని అధికారులు చెబుతున్నారు. ఐదు రోజులు గుడ్డుతోపాటు మూడు రోజులు బెల్లం, వేరుసెనగ, చక్కీలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటితోపాటు రోజూ ఒక్కోరకం రుచులు వడ్డించేలా ఆహార పట్టిక రూపొందించారు. జిల్లా, మండల స్ధాయిలో కొత్త మెనూపై అధికారులు ఇప్పటికే వర్క్షాపు నిర్వహించి వారికి అవగాహన కల్పించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 2,961, ప్రాథమికోన్నత 376, ఉన్నత పాఠశాలలు 581 వరకూ ఉన్నాయి. వీటిలో 3,89,565 వేల మంది విద్యార్థుల వరకూ విద్యను అభ్యసిస్తున్నారు. కొత్తగా అందించే చిక్కీకి కిలోకు రూ.135 చొప్పున నిర్వహకులకు చెల్లించనున్నారు. ప్రతి విద్యార్థికీ 25 గ్రాముల చొప్పున చక్కీ ఇవ్వనున్నారు. దశల వారీగా మార్పులు... ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం 2003–04వ సంవత్సరంలో ఆరంభమైంది. మొదట్లో అన్నంతోపాటు సాంబారు లేదా పప్పు వడ్డించేవారు. తర్వాత చట్నీ మరి కొన్ని రోజులు కూర జత చేశారు. క్రమేణా పప్పు, సాంబారుతో పాటు కూర, వారానికో గుడ్డు, తరువాత రెండు ఇలా మార్పులు చేస్తూ వచ్చారు. తాజాగా వారానికి ఐదు గుడ్లు ఇవ్వాలన్నది జగన్ ప్రభుత్వ నిర్ణయం. అంతేగాక వంట తయారీ చేసే ఏజెన్సీ వాళ్లకు గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచి వారి డిమాండ్ నేరవేర్చారు. ప్రతి విద్యార్థీ తినాలి... ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోవడానికి సమయం లేక బాక్సు తెచ్చుకుంటున్నారు. ఆ పద్ధతికి స్వస్తి పలికి ప్రస్తుత ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి విద్యార్థీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎస్.అబ్రహం, జిల్లా విద్యాశాఖాధికారి -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ►విజయవాడ: అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతుగా నేడు వైఎస్సార్సీపీ ర్యాలీ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి మధురానగర్ వరకు శాంతి ర్యాలీ హాజరుకానున్న మంత్రి వెల్లంపల్లి,ఎమ్మెల్యే విష్ణు, వైఎస్సార్సీపీ నేతలు ►నేడు తెలుగు రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం తెలంగాణ హైదరాబాద్: నేడు ప్రొఫెసర్ కాశింను సీజే ముందు హాజరుపర్చనున్న పోలీసులు కాశిం అరెస్ట్పై హైకోర్టులో పిటిషన్ దాఖలు జాతీయం ►మహారాష్ట్ర: నేడు షిర్డీ బంద్ ►బాబా ఆలయం తెరిచే ఉంటుందన్న సాయి ట్రస్ట్ ►దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేదన్న ట్రస్ట్ ►భక్తులకు ఇబ్బందిలేకుండా షిర్డీ బంద్కు స్థానికుల పిలుపు ►మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు షిర్డీలో స్థానికుల నిరసనలు స్పోర్ట్స్ ►నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే ►బెంగుళూరు వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ►మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు ►ఇరు జట్లకు కీలకంగా మారిన చివరి వన్డే ►నేడు కివీస్తో టెస్ట్, వన్డే సిరీస్కు భారత్ జట్టు ఎంపిక ►టెస్టు జట్టులోకి కేఎల్ రాహుల్ను ఎంపిక చేసే అవకాశం నగరంలో నేడు ►మ్యూజిక్ ప్రోగ్రాం బై శృతిలయ ఆర్ట్ అకాడమీ వేదిక : రవీంద్ర భారతి సమయం: సాయంత్రం 6 గంటలకు ►ఎస్టీ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్లే ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ వేదిక: రవీంద్ర భారతి సమయం: ఉదయం 10 గంటలకు ►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ మెకానికల్ రోబోటిక్స్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వేదిక: బెస్ట్ వెస్టర్న్ అశోక, లక్డీకాపూల్ సమయం: ఉదయం 9 గంటలకు ►శ్రీ త్యాగరాజ ఆరాధన క్లాసికల్ మ్యూజిక్ బై శివపార్వతి టీం వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి సమయం: సాయంత్రం 6 గంటలకు ►చిత్రహార్ సండేస్ విత్ డీజే ప్రీత్ వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్, బేగంపేట్ సమయం: రాత్రి 8 గంటలకు అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ఫ్లూట్ క్లాసెస్ బై షషాంక్ రమేష్ సమయం: ఉదయం 11 గంటలకు ►క్రొచెట్, ఎంబ్రాయిడరీ రెగ్యులర్ క్లాసెస్ సమయం: ఉదయం 10 గంటలకు ►ఫ్రీ యోగా క్లాసెస్ సమయం: ఉదయం 11 గంటలకు ►పెయింటింగ్ క్లాసెస్ సమయం: మధ్యాహ్నం 1 గంటలకు ►వీకెండ్ చెస్ క్లాసెస్ సమయం: ఉదయం 10 గంటలకు ►జ్యువెలరీ మేకింగ్ వర్క్షాప్ సమయం: ఉదయం 11 గంటలకు ►లాటిన్ డ్యాన్స్ క్లాసెస్ సమయం: సాయంత్రం 6 గంటలకు ►వీణ క్లాసెస్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►పోయెట్రీ క్లాసెస్ సమయం: ఉదయం 10:30 గంటలకు ►డ్రాయింగ్ క్లాసెస్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►లైఫ్ స్కిల్స్ వర్క్షాప్ సమయం: ఉదయం 10 గంటలకు ►భరతనాట్యం, కూచిపూడి డ్యాన్స్ ఫర్ఫామెన్స్ వేదిక: శిల్పారామం సమయం: సాయంత్రం 5–30 గంటలకు ►తెలుగు కల్చర్ సంక్రాంతి సమ్మేళనం విత్ తెలంగాణ గవర్నర్ వేదిక: ఓం కన్వెన్షన్, నార్సింగి సమయం: ఉదయం 11 గంటలకు ►సాక్షం సైకిల్ డే –2020 వేదిక: అథ్లెటిక్ స్టేడియం, గచ్చిబౌలి సమయం: ఉదయం 7 గంటలకు ►దుబాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో వేదిక: తాజ్కృష్ణ , బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►తెలుగు ఫుడ్ ఫెస్టివల్ వేదిక: బంజారా ఫంక్షన్హాల్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11–30 గంటలకు ►క్లాసికల్ ఒడిస్సీ డ్యాన్స్ వర్క్షాప్ వేదిక:అనాహతయోగా జోన్,సికింద్రాబాద్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బై సూత్ర వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ సమయం: ఉదయం 10 గంటలకు ►భరతనాట్యం వర్క్షాప్ వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ సమయం: రాత్రి 8 గంటలకు ►ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ బై గో స్వదేశీ వేదిక: శ్రీ రాజ రాజేశ్వరీ రూఫ్ గార్డెన్స్, సికింద్రాబాద్ సమయం: ఉదయం 11 గంటలకు ►ఇండియా ఇంటర్నేషనల్ హలాల్ ఎక్స్ ఫో వేదిక: హైటెక్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ వేదిక: కార్వీ కన్సల్టెన్సీ లిమిటెడ్, రోడ్ నం.1, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►మిస్టర్ అండ్ మిస్ ఫర్ఫెక్ట్ హైదరాబాద్ 2020 వేదిక: సీఎంఓఎఫ్ గ్లోబల్, మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ►పెయింటింగ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ డా, అవనీ రావ్ ఆర్టిస్ట్ స్టూడియో, సమయం: ఉదయం 11 గంటలకు ►ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వేదిక: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి సమయం: ఉదయం 10 గంటలకు. -
నేటి ముఖ్యాంశాలు..
తెలంగాణ ► హైదరాబాద్: బైంసా మున్సిపల్ ఎన్నికలపై నేడు నిర్ణయం ►రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందిన పరిశీలకుడి నివేదిక ►నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన ►మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ►చిత్తూరు: నేటి నుంచి హార్సిలీహిల్స్పై అడ్వెంచర్ ఫెస్టివల్ ►రెండు రోజుల పాటు సాహస క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలు ►అమరావతి: నేటి నుంచి ప్రారంభం కానున్న రహదారి భద్రతా వారోత్సవాలు ►ఈ నెల 25 వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జాతీయం ►న్యూఢిల్లీ: నేడు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ►ఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్ ►న్యూఢిల్లీ: ఢిల్లీలో చిన్నారిపై లైంగిక దాడి కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది ►2013లో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు దుండగులు పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు స్పోర్ట్స్ ►నేడు హోబర్ట్ ఇంటర్నేషనల్ మహిళల టెన్నిస్ ఫైనల్ ►షువై పెంగ్-షువై ఝంగ్తో సానియా మీర్జా-నదియా జోడీ ఢీ భాగ్యనగరంలో నేడు.. ►త్యాగరాయ ఆరాధనోత్సవం వేదిక: రవీంద్ర భారతి సమయం: ఉదయం 10 గంటలకు ►యాక్షన్ నెట్వర్క్ వర్క్షాప్ వేదిక: ట్రిబుల్ఐటీ హైదరాబాద్ క్యాంపస్, గచ్చిబౌలి సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ లలిత కళా ప్రదానోత్సవం వేదిక: రవీంద్ర భారతి సమయం: సాయంత్రం 6 గంటలకు ►ఎంటీఆర్ ఫుడ్స్ తెలుగు రుచులు వేదిక: బంజారా ఫంక్షన్హాల్, రోడ్ నం.1, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►శ్రీ త్యాగరాజ ఆరాధన క్లాసికల్ మ్యూజిక్ బై వై రామప్ప వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్పల్లి సమయం: సాయంత్రం 6 గంటలకు ►కామెడీ నైట్ వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్ సమయం: రాత్రి 8 గంటలకు ►ఫ్రెంచ్ క్లాసెస్ విత్ సుపర్ణ గుహ వేదిక: బుక్స్ ఆండ్మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 5 గంటలకు వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ►వీణ క్లాసెస్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►పోయెట్రీ క్లాసెస్ సమయం: ఉదయం 10:30 గంటలకు ►ల్యాంప్ షేడ్ మేకింగ్ వర్క్షాప్ సమయం: ఉదయం 11 గంటలకు ►డ్రాయింగ్ క్లాసెస్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►లైఫ్ స్కిల్స్ వర్క్షాప్ సమయం: ఉదయం 10 గంటలకు ►క్లాసికల్ ఒడిస్సీ డ్యాన్స్ వర్క్షాప్ వేదిక:అనాహతయోగాజోన్,సికింద్రాబాద్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►భరతనాట్యం వర్క్షాప్ వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ సమయం: రాత్రి 8 గంటలకు ►ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ బై గో స్వదేశీ వేదిక: శ్రీ రాజ రాజేశ్వరీ రూఫ్ గార్డెన్స్, సికింద్రాబాద్ సమయం: ఉదయం 11 గంటలకు ►ఇండియా ఇంటర్నేషనల్ హలాల్ఎక్స్ ఫో వేదిక: హైటెక్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ వేదిక: కార్వీ కన్సల్టెన్సీ లిమిటెడ్, రోడ్ నం.1, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►మిస్టర్ అండ్ మిస్ ఫర్ఫెక్ట్ హైదరాబాద్ 2020 వేదిక: సీఎంఓఎఫ్ గ్లోబల్, మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ►పెయింటింగ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ డా, అవనీ రావ్ ఆర్టిస్ట్ స్టూడియో, సమయం: ఉదయం 11 గంటలకు ►ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వేదిక: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి సమయం: ఉదయం 10 గంటలకు ►ఆస్ట్రేలియా ఫెయిర్ వేదిక: తాజ్ డక్కన్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► నేడు క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్తో హైపవర్ కమిటీ భేటీ ►ఇప్పటికే జీఎన్రావు, బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్ కమిటీ ►అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం జగన్కు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్న హైపవర్ కమిటీ ►ఇప్పటికే మూడు సార్లు సమావేశమై విస్తృతంగా చర్చలు జరిపిన హైపవర్ కమిటీ జాతీయం ►ఢిల్లీ: రాత్రి 7 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ ►ఢిల్లీ: నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్ స్పోర్ట్స్ ►నేడు భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ►రాజ్కోట్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ►ఇప్పటికే మూడు వన్డేల సిరీస్లో 0-1 ఆధిక్యంలో ఉన్న ఆసీస్ ►కేప్టౌన్: నేడు నుంచి అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ ►19న లంక, 21న జపాన్, 24న కివీస్తో తలపడనున్న భారత్ నగరంలో నేడు ►భరత నాట్యం వర్క్షాప్ వేదిక : టీఎస్ఐఐసీ, హైటెక్ సిటీ సమయం: ఉదయం 8 గంటలకు ►స్పేస్ట్రిప్ ఫెస్టివల్ వేదిక: ది పార్క్ హోటల్, రాజ్ భవన్ రోడ్ సమయం : రాత్రి 7గంటలకు ►సాక్ష్యం 2020 ప్రారంభోత్సవం వేదిక : రవీంద్ర భారతి సమయం : ఉదయం 11 గంటలకు ►నిర్మల జ్ఞాన ప్రోగ్రామ్ వేదిక : వెస్ట్ రమలానగర్, మేడిపల్లి సమయం : ఉదయం 10 గంటలకు ►ఈ లైవ్ కచేరీకి వెళ్లండి.. తర్వాత మీరే మాకు థ్యాంక్స్ చెబుతారు వేదిక:అలియన్స్ఫ్రాంసెస్ హైదరాబాద్ సమయం : రాత్రి 7.30 గంటలకు ►4వ ఇంటర్నేషనల్ సెమినార్ అండ్ డాన్ గ్రేడింగ్ వేదిక : శ్రీ సాయి నగర్, చింతలకుంట సమయం : ఉదయం 9.00 గంటలకు ►వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ హైదరాబాద్ వేదిక: వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్, రావిరాల సమయం: ఉదయం 5.30 గంటలకు ►స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ ఇనాగ్యురేషన్ వేదిక : సీఏఆర్ ప్రధాన కార్యాలయం, పరేడ్ గ్రౌండ్ సమయం : ఉదయం 9.30 గంటలకు ►మైట్ లిటిల్ భీమ్ వేదిక: గ్రీన్ గోల్డ్ యానిమేషన్ కార్యాలయం, గచ్చిబౌలి సమయం : ఉదయం 10.30 గంటలకు ►ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా వేదిక : శిల్పారామం, మాదాపూర్ సమయం : సాయంత్రం 5 00 గం. ►శ్రీ త్యాగరాజ ఆరాధన శాస్త్రీయ సంగీత కార్యక్రమం. వేదిక : శ్రీ త్యాగరాజ గాన సభ. సమయం: సాయంత్రం 6 00గం ►సూత్రా ఎగ్సిబిషన్ సేల్ వేదిక: నొవాటెల్ హైద్రాబాద్ కన్వెన్షన్ సెంటర్ సమయం :ఉదయం 11 00గం. ►ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ వేదిక: పరేడ్ గ్రౌండ్స్ సమయం : ఉదయం 9 30 గం. ►లిటరరీ ఫెస్టివెల్–లైవ్ కాన్సర్ట్ వేదిక : ఫొనిక్స్ ఎరీనా సమయం: సాయంత్రం 7 30 ►చిత్రకళా ప్రదర్శన వేదిక: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ సమయం: ఉదయం 11 30 ►అష్టభుజి ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక : గ్యాలరీ78 సమయం: ఉదయం 11 00. -
‘ఫాస్ట్’గా వెళ్లొచ్చు!
సాక్షి, విశాఖపట్నం: వాహనదారులకు టోల్ ప్లాజాల వద్ద కష్టాలు తప్పనున్నాయి. దీనికి కారణం ఫాస్టాగ్ విధానం అమల్లోకి రానుండడమే. సాధారణంగా టోల్ ఫీజు చెల్లించడానికి ఒక్కో వాహనానికి కనీసం ఐదు నిమిషాలు పడుతోంది. ఈ పరిస్థితిల్లో టోల్ప్లాజా వద్ద ఆగకుండానే వాహనాలు వెళ్లిపోవడానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఎలక్ట్రానిక్ టోల్ వసూలు చేసేందుకు ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. విశాఖ శివారులోని అగనంపూడి సహా జిల్లాలోని నాలుగు టోల్ప్లాజాల వద్ద ప్రత్యేక “ఫాస్టాగ్’లైన్లు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ నగదు రూపేణా టోల్ చెల్లించి వెళ్లడానికి ఉన్న క్యాష్ లైన్లు తగ్గించేశారు. ఉదాహరణకు అగనంపూడి టోల్ప్లాజా వద్ద రాక, పోక మార్గాల్లో నాలుగేసి చొప్పున మొత్తం ఎనిమిది మార్గాలు ఉన్నాయి. వాటిలో రాక, పోక మార్గాల్లో ఒక్కొక్కటి మాత్రమే క్యాష్ లైన్ ఉంటుంది. మూడేసి చొప్పున ఆరు లైన్లు ఫాస్టాగ్ ఉన్న వాహనాల కోసం కేటాయించారు. ఇప్పటివరకూ ఈ లైన్లలో ఫాస్టాగ్ ఉన్న వాహనాలే గాక నగదు రూపేణా టోల్ చెల్లించే వాహనాలనూ అనుమతిస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి అలా కుదరదు. ఫాస్టాగ్ ఉన్న వాహనాలనే సంబంధిత లైన్లలోకి అనుమతిస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఫాస్టాగ్ లేని వాహనాలు ఆ మార్గాల్లో వెళ్తే రెట్టింపు టోల్ (రుసుం) వసూలు చేస్తారు. సంక్రాంతికి వాహనాల తాకిడి.. నక్కపల్లి, విశాఖ నగరంలో అగనంపూడి, పోర్టు అనుసంధాన మార్గంలోని పంచవటి, డాక్యార్డు టోల్ప్లాజాలు ఉన్నాయి. నక్కపల్లి టోల్ప్లాజా రాజమండ్రి రీజియన్లో ఉండగా.. మిగతా మూడు విశాఖ పరిధిలో ఉన్నాయి. జిల్లాలోని టోల్ప్లాజాల్లో అగనంపూడి, నక్కపల్లి జాతీయ రహదారి (ఎన్హెచ్ 16)పై ఉండటంతో ఇవెంతో కీలకమైనవి. అక్కడ సగటున రోజుకు 35 వేల నుంచి 40 వేల వాహనాలకు సంబంధించిన టోల్ చెల్లింపులు జరుగుతున్నాయి. రాక, పోక మార్గాల్లోని ఎనిమిది లైన్లలో ప్రయాణించే వాహనాలకు సంబంధించి టోల్ చెల్లించడానికి ఒక్కో వాహనానికి కనిష్టంగా ఐదు నిమిషాల సమయం పడుతోంది. దీంతో సాధారణ రోజుల్లో టోల్ప్లాజా దాటడానికి పది నిమిషాల సమయం పడుతోంది. సంక్రాంతి, దసరా వంటి పండుగల సమయాల్లో వాహనాల తాకిడి మూడు రెట్లు పెరుగుతుండాయి. ఇప్పటికే సంక్రాంతి సెలవులు ఇచ్చేయడంతో ఆదివారం నుంచి రోజూ లక్ష వాహనాల వరకూ రాకపోకలు సాగిస్తాయని ఎన్హెచ్ఏఐ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫాస్టాగ్ లేకుంటే ఇబ్బందే... జిల్లాలోని నాలుగు టోల్ప్లాజాల వద్ద గత డిసెంబరు ఒకటో తేదీ నుంచే ఫాస్టాగ్ లైన్లను పక్కాగా అమలు చేయడానికి ఎన్హెచ్ఏఐ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందుకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. కానీ ప్రజాప్రతినిధులు, వాహనదారుల సంఘాల వినతి మేరకు ఆ గడువు పెంచుకుంటూ వచ్చారు. ఈనెల 15 నుంచి టోల్ప్లాజాల వద్ద రాక, పోక మార్గాల్లో ఒక్కొక్కటి చొప్పున మాత్రమే టోల్ రుసుం చెల్లింపు కౌంటర్లు ఉంటాయి. మిగతావన్నీ ఫాస్టాగ్ లైన్లే. ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల్లో ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. లేని వాహనాలకు రాక, పోక మార్గాల్లో క్యాష్ లైను ఒక్కొక్కటి మాత్రమే ఉండటంతో టోల్ప్లాజా దాటడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఎంత రద్దీ ఉన్నా ఫాస్టాగ్ లైనులోకి మాత్రం వెళ్లకూడదు. 70 శాతానికి చేరిన ‘ఫాస్టాగ్’ ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనదారులకు ప్రత్యేక స్టిక్కర్ ఇస్తున్నారు. దీన్ని ఏ వాహనం నంబరుతో కొనుగోలు చేశారో ఆ వాహనం కోసమే వినియోగించాలి. ఈ స్టిక్కర్ను వాహనం అద్దంపై కుడివైపు పైభాగంలో అతికించాలి. ఈ స్టిక్కర్పైనున్న చిప్ను, బార్ కోడ్ను స్కాన్ చేయడానికి శక్తివంతమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ (ఆర్ఎఫ్ఐడీ)లను టోల్ప్లాజాల వద్ద ఏర్పాటు చేశారు. వాహనం టోల్ప్లాజా సమీపంలోకి వస్తున్నప్పుడే ఇవి స్కాన్ చేస్తాయి. దీంతో ఆ వాహనానికి చెల్లించాలి్సన టోల్ ఫాస్టాగ్కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపు క్షణాల్లో జరిగిపోతుంది. ఆ సమాచారం వాహనదారుని సెల్ఫోన్కు వస్తుంది. ప్రస్తుతం టోల్ప్లాజా వద్దకు వస్తున్న వాహనాల్లో ఫాస్టాగ్ ఉన్నవి 70 శాతం వరకూ ఉంటున్నాయి. వీటిని వంద శాతం చేసేలా అధికారులు కృషి చేయాలని ఇటీవల విశాఖలో జరిగిన పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. రిజిస్ట్రేషన్కు పలు మార్గాలు... ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్కు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లతో పాటు వాహనదారుడి బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ సమర్పించాలి. ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇందుకోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో రూ.100 స్టిక్కర్ (ట్యాగ్) ఖరీదు కాగా మిగిలిన మొత్తంలో రూ.200 బ్యాంకులో సెక్యూరిటీ డిపాజిట్కు, రూ.200 టాప్అప్కు కేటాయిస్తారు. ఈ స్టిక్కర్ జాతీయ రహదారులపైనున్న అన్ని టోల్ప్లాజాల్లోనూ పనిచేస్తుంది. టోల్ప్లాజాలు, పలు పబ్లిక్ పాయింట్ల వద్ద ఫాస్టాగ్ల విక్రయానికి అధీకృత బ్యాంకులు ప్రత్యేక కౌంటర్ల (పాయింట్ ఆఫ్ సేల్ – పీవోఎస్)ను ఏర్పాటు చేశాయి. ఇది కొనుగోలు చేసిన తర్వాత వాహనదారులు ‘మై ఫాస్టాగ్ యాప్’ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. వాహన రిజిస్ట్రేషన్ నంబరుతో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలి. డీలర్లూ ఫాస్టాగ్ ఇవ్వాలి మోటారు వాహనాల చట్టానికి 2017లో చేసిన సవరణ ప్రకారం కొత్త కార్లు, భారీ వాహనాల కొనుగోలు సమయంలోనే డీలర్లు ఫాస్టాగ్ ఇవ్వాలి. ఈ దృష్ట్యా వాహల కొనుగోలుదారులకు ఫాస్టాగ్ స్టిక్కర్ ఇచ్చేందుకు డీలర్లంతా సహకరించాలి. ప్రస్తుతం టోల్ప్లాజాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం 70 శాతం వాహనాలు ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ ఉన్నవి వస్తున్నాయి. మిగతా వాహనదారులంతా ఈ విధానంలోకి వస్తే జాతీయ రహదారిపై టోల్ప్లాజాల వద్ద ఇబ్బంది ఉండదు. – పి.శివశంకర్, ప్రాజెక్టు డైరెక్టరు, ఎన్హెచ్ఏఐ విశాఖ రీజియన్ -
ఏపీ సచివాలయానికి సంక్రాంతి సంబరాలు
-
ఏపీ సచివాలయంలో సంక్రాంతి సంబరాలు
సాక్షి, అమరావతి: సంక్రాంతి విశిష్టత తెలిపే రంగుల రంగుల రంగవల్లులు, హరిదాసుల సంకీర్తనలు, డూడూ బసవన్నల నృత్యాలు, కోలాటాలతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా గురువారం ఏపీ సచివాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంక్రాంతి వేడుకల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు.. సచివాలయానికి మరింత సంక్రాంతి శోభను తెచ్చాయి. ఈ ముగ్గుల పోటీల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఘనంగా సంబరాలు జరుపుకున్నామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. కొత్త ప్రభుత్వంలో కొత్త ఉత్సాహంతో ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలకు అనుగుణంగా ఉద్యోగులంతా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతి ముందుగానే వచ్చిందని.. ఉద్యోగులంతా చాలా సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. -
ఏపీకి 84.. తెలంగాణకు 140
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లలో కనీస నీటి మట్టాలకు ఎగువన అందుబాటులో ఉన్న జలాల్లో ఆంధ్రప్రదేశ్కు 84, తెలంగాణకు 140 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. వరద వచ్చిన రోజుల్లో వినియోగించుకున్న నీటిని లెక్కలోకి తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేసిన ప్రతిపాదనపై మరోసారి చర్చిద్దామని సూచించింది. బోర్డు వర్కింగ్ మ్యాన్యువల్ (కార్యనిర్వాహక నియమావళి)ని కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని కృష్ణా బోర్డు చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. హైదరాబాద్లోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా అధ్యక్షతన బోర్డు గురువారం సమావేశమైంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటిదాకా ఏపీ 511, తెలంగాణ 159 టీఎంసీలు వినియోగించుకున్నాయని బోర్డు సభ్య కార్యదర్శి ఎ. పరమేశం వివరించారు.. దీనిపై ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ స్పందిస్తూ.. ఈ ఏడాది శ్రీశైలానికి కృష్ణా నది నుంచి ఎనిమిది దఫాలుగా భారీగా వరద ప్రవాహం రావడంవల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది 800 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశామన్నారు. సముద్రంలో కలుస్తున్న వరద జలాలను వినియోగించుకున్నామని.. వాటిని లెక్కలోకి తీసుకోవద్దని బోర్డుకు విఙ్ఞప్తి చేశారు. ఈ అంశంపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోలేమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ తెలిపారు. ఈ నెల 13న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉండే అవకాశం ఉందని.. అప్పుడు వారిరువురూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. -
ఫలించిన ఎంపీ విజయసాయి ప్రయత్నాలు
సాక్షి, విజయవాడ: పాకిస్తాన్ చెరలో ఉన్న ఆంధ్రా జాలర్ల విడుదలకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖకు సమాచారం అందింది. ఈ నెల 6న వాఘా సరిహద్దు వద్ద భారత్ అధికారులకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మొత్తం 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్ అప్పగించనుంది. మత్స్యకారుల జాబితాను పాక్ ప్రభుత్వం.. భారత విదేశాంగ శాఖకు పంపించింది. పొట్టకూటి కోసం గుజరాత్ వలస వెళ్ళిన ఆంధ్రా జాలర్లు 2018 డిసెంబర్లో పొరపాటున గుజరాత్ తీరం వద్ద పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ దృష్టికి ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు, బాధితులు తీసుకొచ్చారు. తక్షణమే విడుదలకు కృషి చేయాల్సిందిగా వైఎస్ జగన్.. ఎంపీ విజయసాయిరెడ్డికి ఆదేశాలిచ్చారు. అప్పటి నుంచి విదేశాంగ శాఖపై ఎంపీ విజయసాయిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆంధ్ర జాలర్లను విడిచిపెట్టాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి పలుమార్లు ఆయన లేఖలు రాశారు. విజయసాయి రెడ్డి లేఖతో కేంద్ర విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. పాకిస్తాన్తో చర్చలు జరిపి ఆంధ్రా జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకుంది. దీంతో ఆంధ్ర జాలర్లను విడిచి పెట్టేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. ►పాకిస్తాన్ విడుదల చేసిన ఆంధ్రా జాలర్ల జాబితా.. ఎస్.కిశోర్ , తండ్రి అప్పారావు నికరందాస్ ధనరాజ్, తండ్రి అప్పన్న గరమత్తి, తండ్రి రాముడు ఎం. రాంబాబు, తండ్రి సన్యాసిరావు ఎస్. అప్పారావు, తండ్రి రాములు జి. రామారావు, తండ్రి అప్పన్న బాడి అప్పన్న, తండ్రి అప్పారావు ఎం. గురువులు, తండ్రి సతియా నక్కా అప్పన్న, తండ్రి లక్ష్మయ్య నక్క నర్సింగ్, తండ్రి లక్ష్మణ్ వి. శామ్యూల్, తండ్రి కన్నాలు కె.ఎర్రయ్య, తండ్రి లక్ష్మణరావు డి. సురాయి నారాయణన్, తండ్రి అప్పలస్వామి కందా మణి, తండ్రి అప్పారావు కోరాడ వెంకటేష్, తండ్రి నరసింహులు శేరాడ కళ్యాణ్, తండ్రి అప్పారావు కేశం రాజు, తండ్రి అమ్మోరు భైరవుడు, తండ్రి కొర్లయ్య సన్యాసిరావు, తండ్రి మీసేను సుమంత్ తండ్రి ప్రదీప్ -
బందరు ఫిషింగ్ హార్బర్కు మహర్దశ!
సాక్షి, అమరావతి: బందరు ఫిషింగ్ హార్బర్కు మహర్దశ పట్టనుంది. గత కొన్నేళ్లుగా అలంకారప్రాయంగా మారిన హార్బర్ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. హార్బర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి రూ. 280 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది. సముద్ర ముఖద్వారం వద్ద తరచూ ఇసుక మేటలు వేస్తుండటంతో అన్ని వేళల్లో మర పడవలు వేటకు వెళ్లే అవకాశాలు ఉండటం లేదు. కేవలం సముద్రానికి పోటు వచ్చిన సమయంలోనే వేటకు వెళ్లే వీలు ఉండటంతో నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకసారి మర పడవ ఒడ్డుకు వస్తే మళ్లీ సముద్రానికి పోటు వచ్చినప్పుడు మాత్రమే వేటకు వెళ్లే అవకాశం ఉంటోంది. ఇలా పోటు వచ్చినప్పుడే సముద్రంలోకి వెళ్లాలంటే కనీసం 12 గంటల పాటు నిర్వాహకులు ఒడ్డున నిరీక్షించాల్సి వస్తోంది. పదేళ్ల క్రితం గిలకలదిండిలో రూ.4.70 కోట్లతో నిర్మించిన హార్బర్తో నిర్వాహకులకు పెద్దగా లబ్ధి చేకూరడం లేదు నాడు సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేటల తొలగింపునకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేదు. ఇసుక మేటలు ఏర్పడే పరిస్థితులున్న హార్బర్ల వద్ద నిత్యం డ్రెడ్జింగ్ నిర్వహించాలని నిపుణులు సూచించినా.. ఆ కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఇసుక మేటల సమస్య యథాతథంగానే ఉండటంతో మర పడవల నిర్వాహకులు బందరు ఫిషింగ్ హార్బర్ నుంచి కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం హార్బర్లకు తరలివెళ్లిపోతున్నారు. హార్బర్లోని సమస్యలను బందరు ఎమ్మెల్యే, మంత్రి పేర్ని నాని, మరో మంత్రి మోపిదేవి వెంకట రమణారావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాల కల్పన బందరు హార్బర్లో ప్రస్తుత పరిస్థితులు, హార్బర్ విస్తరణకు చేపట్టాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాల అంచనాలపై డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక) రూపొందించే బాధ్యతను వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వ్యాప్కోస్)కి అప్పగించారు. ఈ సంస్థ.. సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేటల తొలగింపుతోపాటు ఎగుమతి, దిగుమతి సౌకర్యాలు, పరిపాలనా భవనం, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, రేడియో కమ్యూనికేషన్ టవర్, బోట్ బిల్డింగ్, ఐస్ ప్లాంట్లు, దాదాపు 350 మర పడవలు లంగరు వేసుకోవడానికి అనువుగా కీవాల్ విస్తరణ, రక్షిత మంచినీటి సరఫరా, తదితర సౌకర్యాల కల్పనకు అంచనాలు రూపొందిస్తోంది. అన్ని అనుమతులు వచ్చాక హార్బర్ విస్తరణకు టెండర్లు ఆహ్వానించనున్నామని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు. -
ఏపీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: ఏపీ వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (ఏపీ సెట్స్) షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం తాడేపల్లిలో విడుదల చేశారు. ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశపరీక్షలను నిర్వహించనున్నారు. ఐసెట్ను ఏప్రిల్ 27, ఈసెట్ ఏప్రిల్ 30న, పీజీ ఈసెట్ మే 2,3,4, తేదీల్లో నిర్వహిస్తారు. లాసెట్ను మే 8, ఎడ్సెట్ 9న నిర్వహించనున్నారు. ఏపీబీ ఆర్కిటెక్చర్ కోర్సుల కోసం నేరుగా అడ్మిషన్లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సురేష్ వెల్లడించారు. -
నేటి ముఖ్యాంశాలు..
తెలంగాణ ►హైదరాబాద్: నేడు బండ్లగూడలో సరస్వతి విద్యాపీఠం.. పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యుల ఆత్మీయ సమ్మేళనం హాజరుకానున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ►హైదరాబాద్: మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ కోర్ కమిటీ సమావేశం మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ ఆంధ్రప్రదేశ్ ►విశాఖపట్నం: నేటితో ముగియనున్న విశాఖ ఉత్సవ్ ముగింపు కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యే అవకాశం జాతీయం ►నేడు జార్ఖండ్ సీఎం గా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం ►రాంచీ మొరాబాదీ గ్రౌండ్లో జేఎంఎం చీఫ్ హేమంత్ ప్రమాణం ►హేమంత్ సోరెన్తో పాటు ఇద్దరు మంత్రుల ప్రమాణ స్వీకారం ►హాజరుకానున్న రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ, శరద్పవార్ ►సీఎంలు కమల్నాథ్, కేజ్రీవాల్,భూపేశ్,అశోక్ గెహ్లాట్, ఉద్ధవ్ ఠాక్రే ►జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, అర్జేడీ కూటమి విజయం భాగ్యనగరంలో నేడు ►డా. మర్రి చెన్నా రెడ్డి జయంతి వేడుకలు వేదిక : శిల్పాకళా వేదిక, హైటెక్ సిటీ సమయం : ఉదయం 11 గంటలకు ►అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా వేడుకలు వేదిక : రవీంద్ర భారతి సమయం : మధ్యాహ్నం 3 గంటలకు ►శ్రీ సరస్వతీ విద్యాపీఠం పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం వేదిక: శ్రీ శారదాధామం, బండ్లగూడ జాగీర్ సమయం : ఉదయం 9.30 గంటలకు ►జమాతే ఇస్లామీ హింద్ వేదిక: మీడియా ప్లస్, గన్ఫౌండ్రీ, అబిడ్స్ సమయం : మధ్యాహ్నం 1.30 గంటలకు ►ప్రముఖ కార్మిక నాయకులు టీఎస్.రామారావు 85వ పుట్టిన రోజు వేడుక వేదిక : భారతీయ విద్యాభవన్ ఆడిటోరియం, కింగ్కోఠి సమయం : సాయంత్రం 3.30 గంటలకు ►పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ వేదిక : లస్నం హౌస్, జూబ్లీహిల్స్ సమయం : ఉదయం 10. 00 గంటలకు ►బంజారా గిరిజన ఆత్మీయ సమ్మేళనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వేదిక : శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ హాల్ సమయం : మధ్యాహ్నం 2.30 గంటలకు ►తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ సమావేశం వేదిక : సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ! సమయం : ఉదయం 11 గంటలకు ►ఎల్డర్స్ ప్రైడ్ సెలబ్రేషన్స్ వేదిక : సన్షైన్ హాస్పిటల్, ప్యారడైజ్ సర్కిల్ సమయం : సాయంత్రం 5 గంటలకు ►సయ్యద్ షేక్ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: రైయిన్బో ఆర్ట్ గ్యాలరీ, బేగంపేట సమయం : సాయంత్రం 5.30 గంటలకు ►ఆర్గానిక్ ఫెస్ట్ వేదిక : అడ్డగుట్ట సొసైటీ, కూకట్పల్లి సమయం : ఉదయం 10 గంటలకు ►పబ్లిక్ స్పీకింగ్ కమిటీ ఈవెంట్ వేదిక : ఎన్టీఆర్ గార్డెన్స్, సమయం : మధ్యాహ్నం 3.30 గంటలకు ►గోల్కొండ బగ్నాగర్ హైదరాబాద్ పుస్తకావిష్కరణ వేదిక : లామకాన్, బంజారాహిల్స్ సమయం : సాయంత్రం 4 గంటలకు ►బీహెచ్ఈఎల్ కాఫీ రైడ్ వేదిక : హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్, గచ్చిబౌలి, సమయం : ఉదయం 6 గంటలకు ►పెయింట్ ఎన్ ఎంజాయ్ వేదిక : లామకాన్, బంజారాహిల్స్ సమయం : ఉదయం 11 గంటలకు ►మధుబని పెయింటింగ్ వర్క్ షాప్ వేదిక : లామకాన్, బంజారాహిల్స్ సమయం : మధ్యాహ్నం 3 గంటలకు -
టీడీపీ పాలనలో విద్యుత్ రంగం నిర్వీర్యం
సాక్షి, విజయవాడ: గత టీడీపీ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పీపీఏ లు ద్వారా తక్కువ ధరకు సోలార్ పవర్ వస్తున్న అధిక మొత్తం లో కోట్ చేశారన్నారు. విద్యుత్ చార్జీల పెంపు లేదని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యుత్ను వినియోగదారులకు అందించడమే ధ్యేయం అని పేర్కొన్నారు. రైతులకు పగటి పూట 9 గంటలు విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. దీని కోసం రూ.1700 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు రంగం 70వేల కోట్లు అప్పుల్లో ఉందని చెప్పారు. ఏపీసీపీడీఎల్ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని ఇంధన శాఖ సెక్రటరీ శ్రీకాంత్ తెలిపారు. పీపీఏలు తగ్గించుకుంటూ తక్కువ ధరకు విద్యుత్ను అందిస్తున్నామని తెలిపారు. రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ► నేడు విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన ►మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నుంచి విశాఖకు బయల్దేరనున్న సీఎం జగన్ ►మధ్యాహ్నం 3.50కి కైలాసగిరి వద్ద అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన ►సాయంత్రం 4.40కి వైఎస్సార్ సెంట్రల్ పార్క్ వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన ►సాయంత్రం 5.30కి ఆర్కేబీచ్ వద్ద విశాఖ ఉత్సవ్ ప్రారంభించనున్న సీఎం జగన్ ►రాత్రి 7.40కి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్ తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్న టీటీడీ తెలంగాణ హైదరాబాద్: నేటితో ముగియనున్న రాష్ట్రపతి శీతాకాల విడిది మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ►నేడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం గాంధీభవన్లో ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష ► ఉదయం 11.30 గంటలకు రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం భేటీ మున్సిపల్ ఎన్నికలపై చర్చించనున్న ఎన్నికల సంఘం జాతీయం ఢిల్లీ: నేడు ప్రభుత్వ బ్యాంకుల సీఈఓలతో నిర్మలా సీతారామన్ భేటీ ప్రభుత్వ బ్యాంకుల పనితీరు,ఆర్థిక స్థితిగతులపై చర్చ ఢిల్లీ: నేడు మేరికోమ్,నిఖత్ జరీన్ మధ్య బాక్సింగ్ ట్రయల్స్ ఫైనల్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్కు అర్హత సాధించనున్న ఫైనల్ విజేత -
నేటి ముఖ్యాంశాలు..
►తెలంగాణ హైదరాబాద్: నేడు రాజ్భవన్లో రాష్ట్రపతి కోవింద్కు గవర్నర్ విందు రాత్రి 8 గంటలకు విందు ఇవ్వనున్న గవర్నర్ తమిళిసై ఇండియన్ రెడ్క్రాస్ మొబైల్ యాప్ ఆవిష్కరించనున్న రాష్ట్రపతి ►ఆంధ్రప్రదేశ్ కర్నూలు: నేడు కర్నూలు జిల్లాలో గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ పర్యటన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్న గవర్నర్ ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించనున్నగవర్నర్ హరిచందన్ మధ్యాహ్నం కర్నూలులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న గవర్నర్ ►జాతీయం న్యూఢిల్లీ: నేడు రాజ్ఘాట్ దగ్గర కాంగ్రెస్ సత్యాగ్రహం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా అసోం: డిబ్రూగఢ్లో నేడు కర్ఫ్యూ సడలింపు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరుకు కర్ఫ్యూ సడలింపు కటక్: నేడు భారత్-వెస్టిండీస్ మధ్య మూడో వన్డే కటక్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా నిలిచిన జట్లు భాగ్యనగరంలో నేడు.. ►ది సండే ఫ్యామిలీ బ్రంచ్ వేదిక– ది గోల్కొండ సమయం– మధ్యాహ్నం 12 గంటలకు లమాకాన్ , బంజారాహిల్స్ ►పైథాన్ కోడింగ్ వర్క్షాప్ సమయం– ఉదయం 10–30 గంటలకు ►ట్రైల్స్ ఆఫ్ డీసెంట్ – బుక్ రిలీజ్ సమయం– సాయంత్రం 4 గంటలకు అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ►స్పానిష్ క్లాసెస్ ఉదయం 9 గంటలకు ►వీణ క్లాసెస్ మధ్యాహ్నం 3 గంటలకు ►పోయెట్రి క్లాసెస్ ఉదయం 10–30 గంటలకు ►క్రొచెట్ , ఎంబ్రాయిడరీ క్లాసెస్ ఉదయం 10 గంటలకు ►ఫ్రీ యోగా క్లాసెస్ ఉదయం 11 గంటలకు ►పెయింటింగ్ క్లాసెస్ మధ్యాహ్నం 1 గంటలకు ►చెస్ క్లాసెస్ ఉదయం 10 గంటలకు ►కార్డ్ మేకింగ్ వర్క్షాప్ మధ్యాహ్నం 3 గంటలకు ►మాయాబజార్ నాటక ప్రదర్శన వేదిక– పబ్లిక్ గార్డెన్, సురభి థియేటర్, సమయం–సాయంత్రం 6–30 గంటలకు ►క్రిస్మస్ వర్క్షాప్ వేదిక– రంగ్మంచ్, హిమాయత్ నగర్ సమయం– మధ్యాహ్నం 1 గంటకు ►సోలో ఆర్ట్ పెయింటింగ్ వర్క్షాప్ వేదిక– తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్ సమయం– ఉదయం 10 గంటలకు ►పెయింటింగ్ వర్క్షాప్ వేదిక– ఫోనిక్స్ ఎరినా, హైటెక్సిటీ సమయం– సాయంత్రం 4 గంటలకు ►ఫుడ్ ఫెస్టివల్ వేదిక– మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్స్, కొండాపూర్ సమయం– సాయంత్రం 6 గంటలకు ►షిబొరి వర్క్షాప్ వేదిక– క్లోవర్క్, హైటెక్సిటీ సమయం– సాయంత్రం 4 గంటలకు ►డిజైనర్ ఎగ్జిబిషన్ వేదిక– తాజ్ కృష్ణ, బంజారాహిల్స్ సమయం– ఉదయం 9 గంటలకు ►బనారస్ శారీ ఎగ్జిబిషన్ వేదిక–సప్తపర్ణి,రోడ్నం.8,బంజారాహిల్స్ సమయం– ఉదయం 10 గంటలకు వేదిక– అలయన్స్ ఫ్రాంఛైజ్, రోడ్ నం.3, బంజారాహిల్స్ ►ఆర్ట్ ఎగ్జిబిషన్ సమయం– ఉదయం 9–30 గంటలకు ►లైవ్ ఆర్ట్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ సమయం– సాయంత్రం 4 గంటలకు ►సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక– కళాకృతి, రోడ్ నం.10, బంజారాహిల్స్ సమయం– సాయంత్రం 6–30 గంటలకు ►థాలి – ఫుడ్ ఫెస్ట్ వేదిక– నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, కొండాపూర్ సమయం– మధ్యాహ్నం 12 గంటలకు ►పెట్ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్ వేదిక– హ్యాత్ హైదరాబాద్, గచ్చిబౌలి సమయం మధ్యాహ్నం 12–30 గంటలకు ►థాయ్లాండ్ టు చైనా ఫుడ్ ఫెస్టివల్ వేదిక– వివంట బై తాజ్, బేగంపేట్ సమయం: మధ్యాహ్నం12–30 గంటలకు ►కర్రసాము వర్క్షాప్ వేదిక– రవీంద్ర భారతి సమయం– మధ్యాహ్నం 2.30 గంటలకు ►వన్ టైమ్ పేమెంట్ – బుక్ ఎగ్జిబిషన్ వేదిక– మారుతి గార్డెన్స్, లఈక్డ కా పూల్ సమయం– ఉదయం 10 గంటలకు ►డిజైనర్ జ్యువెల్లరీ ఫెస్ట్ వేదిక– జోయాలుకాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పంజాగుట్ట సమయం– ఉదయం 11 గంటలకు ►డైమండ్ కార్నివల్ వేదిక– జోస్ ఆలుక్కాస్, పంజాగుట్ట సమయం– ఉదయం 11 గంటలకు ►వింటర్ షాపింగ్ ఎగ్జిబిషన్ సేల్ వేదిక– ప్రసాద్ మల్టీప్లెక్స్, సమయం– ఉదయం 10 గంటలకు ►ఈవెనింగ్ బఫెట్ వేదిక– లియోన్య హోలిస్టిక్ డెస్టినేషన్, శామిర్పేట్ సమయం– రాత్రి 7–30 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక– అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం– ఉదయం 10 గంటలకు -
రేషన్ అక్రమాలకు సర్కార్ చెక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రేషన్ బియ్యంలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థ ద్వారా రేషన్ డిపోల్లో జరుగుతున్న అక్రమాలను చాలావరకు నియంత్రించింది. చనిపోయిన, కార్డుల నుంచి విడిపోయిన వారి బియ్యం దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసింది. ఇప్పుడేకంగా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటోంది. రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా, మిల్లర్ల ద్వారా మళ్లీ ప్రభుత్వం రాకుండా నడుం బిగించింది. గతంలో అటు రేషన్ డిపో డీలర్లు, ఇటు మిల్లర్ల ద్వారా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పక్కదారి పట్టేది. దీనికంతటికీ గతంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, అధికారులు, డీలర్లు, మిల్లర్లు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కవడమే ప్రధాన కారణం. అవినీతికి తావు లేకుండా ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. గత సెప్టెంబర్లో వలంటీర్ల ద్వారా సరుకులు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. దీంతో గతంలో జరిగిన అక్రమాలన్నీ వరుసుగా వెలుగు చూస్తున్నాయి. గతంలో జరిగిన అక్రమాలివీ.. జిల్లాలో 18 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ దుకాణాలకు 13,243 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. పచ్చి బియ్యం, దొడ్డు బియ్యం, నూకల శాతం ఎక్కువగా ఉండటం, నాణ్యతలేమి కారణంగా అధిక శాతం మంది లబి్ధదారులు వీటిని తినేందుకు ఇష్టపడలేదు. ఇదే అదునుగా రేషన్ మాఫియా కార్డుదారుల నుంచి ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి రైస్మిల్లుల్లో పాలిష్ పట్టించి అధిక ధరకు అమ్ముకుంటూ కోట్లు దండుకునేవారు. కొందరు డీలర్లు దళారుల అవతారమెత్తి కార్డుదారుల నుంచి బియ్యాన్ని కొని రైస్మిల్లులకు అమ్ముకునేవారు. వాస్తవానికి ప్రభుత్వం ఈ బియ్యాన్ని కిలో రూ.30కిపైగా కొని, కార్డుదారులకు ఒక్క రూపాయికి అందజేసేది. ఈ బియ్యాన్నే తిరిగి రేషన్ డిపో డీలర్లు రూ.9 నుంచి రూ.10లకు కొనుగోలు చేసేవారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యం మిలర్ల వద్దకు కిలో రూ.15 నుంచి రూ.20 ధరతో చేరేవి. పాలిష్ అనంతరం ఇదే బియ్యాన్ని మాఫియా కిలో రూ.50 వరకు అమ్మి సొమ్ము చేసుకునేది. ఇక మిల్లర్లయితే ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి బదులు సీఎంఆర్గా ఈ రేషన్ బియ్యాన్నే తిరిగి అప్పగించే సంస్కృతి కొనసాగేది. దీనివల్ల ప్రభుత్వ నిధుల దురి్వనియోగం, డీలర్లు, మిల్లర్లకు సొమ్ము తెచ్చి పెట్టడం తప్ప ప్రయోజనం ఉండేది కాదు. వలంటీర్లతో కొంతమేర కట్టడి.. ఎప్పుడైతే ప్రస్తుత ప్రభుత్వం ఒక్కొక్క క్లస్టర్కి 50 నుంచి 60 వరకు కుటుంబాలను కేటాయించి, వాటికొక వలంటీర్ను నియమించి, వారి ద్వారా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందో అప్పటి నుంచి గత అక్రమాలు బయట పడుతూనే ఉన్నాయి. తొలుత బోగస్ కార్డుల బాగోతం గుట్టు రట్టయింది గతంలో 8,32,636 రేషన్కార్డులుంటే ఇప్పుడవి 8,16,412కు చేరాయి. అలాగే గతంలో 13,243 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుండగా, ఇప్పుడది 12,335మెట్రిక్ టన్నులకు చేరింది. ఈ లెక్కన 16,224 కార్డులు తగ్గి 908 మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అయింది. దాదాపు 40 వేల యూనిట్లు కూడా తగ్గాయి. ఇవి కాక నవశకం సర్వేలో వేలాది బోగస్ కార్డులను గుర్తించినట్టు సమాచారం. ఫోర్టి ఫైడ్ రైస్తో మరింత అడ్డుకట్ట రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మర ఆడేందుకు ప్రభుత్వం మిల్లర్లకు పంపిస్తోంది. ఇలా ఇచ్చిన ధాన్యంలో 67 శాతం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద ప్రభుత్వానికి మిల్లర్లు అందించాల్సి ఉంది. ఇక్కడే తేడా జరుగుతున్నది. ప్రభుత్వానికి ఇవ్వవల్సిన సీఎంఆర్లో ప్రజల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని మిక్స్ చేసి కొంతమంది మిల్లర్లు తిరిగి ఇచ్చేవారు. రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని మర ఆడించి బహిరంగ మార్కెట్కు విక్రయించేవారు. ఇప్పుడా పరిస్థితికి చెక్ పెట్టేందుకు.. మిల్లర్లకు ఏ ధాన్యమైతే ఇస్తున్నారో అదే రకమైన బియ్యాన్ని మళ్లీ సీఎంఆర్ కింద ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం షరతు పెట్టింది. దానికి తోడు ఇకపై పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో ‘బలవర్థకమైన బియ్యంతో పోలి ఉండే గింజలను కలిపిన బియ్యాన్ని’ కలపనుంది. ఇలా చేసి ఫోరి్టఫైడ్ రైస్ను ఇకపై వలంటీర్ల ద్వారా ప్రజలకు పంపిణీ చేయనుండటంతో అవే బియ్యాన్ని ఒకవేళ ప్రజల నుంచి సేకరించి, సీఎంఆర్ కింద మిల్లర్లు ఇస్తే దొరికిపోతారు. ఫోరి్టఫైడ్ రైస్ వలన మిక్సింగ్ చేశారా.. లేదా అన్నది తేలిపోనుంది. నాణ్యమైన బియ్యం ప్యాకింగ్కు నరసన్నపేట, పొందూరులలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే రేషన్ బియ్యంలో ఫోరి్టఫైడ్ రైస్ మిక్సింగ్ చేయనున్నారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు అనేక చర్యలు రేషన్ బియ్యం ద్వారా జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు అనేక రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా, సీఎంఆర్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఏ రకం ధాన్యం ఇస్తే ఆ రకం పోలిన బియ్యం మిల్లర్లు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ప్యాకింగ్ యూనిట్లలో రేషన్ బియ్యంలో బలవర్థకమైన బియ్యంతో పోలి ఉండే గింజలను కలిపిన బియ్యాన్ని మిక్సింగ్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేసింది. – కృష్ణారావు, డీఎం, పౌరసరఫరాల సంస్థ -
పంచాయతీలకు నిధులు ఫుల్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను పక్కదారి పట్టించడంతో కేంద్రం కన్నెర్ర చేసింది. మంజూరైన నిధులకు యూసీలు సమర్పించకపోవడంతో తదు పరి నిధుల మంజూరుకు బ్రేక్ వేసింది. దీంతో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనులకు కూడా నిధుల కొరత ఏర్పడింది. సాధారణంగా ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధులలో 60 శాతం వేతన పనుల కింద, 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ పనుల కింద ఖర్చు పెట్టాలి. ఈ రకంగా చేయాల్సిన గత ప్రభుత్వం వచ్చిన ఉపాధి నిధులను నిబంధనలకు విరుద్ధంగా వేరే వాటికి వినియోగించడం వలన పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాని దుస్థితి చోటు చేసుకుంది. దీంతో 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ పనులకు నిధుల సమస్య ఏర్పడింది. దీంతో ఆ పనులు చేపట్టిన కొందరు కాంట్రాక్టర్లు బిల్లులు రావడం లేదని కొన్ని పనులు నిలిపివేయగా, మరికొందరు ఇష్టారీతిన, నాణ్యత లేకుండా పనులు చేపట్టి మమ అనిపించేశారు. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనులకు దాదాపు రూ.80 కోట్ల బకాయిలున్నట్టు సమాచారం కొత్త ప్రభుత్వంలో కదలిక.. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది, మిగిలిపోయిన మెటీరియల్ కాంపోనెంట్ పనులతో కలిపి కొత్త పనులు చేపట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన రూ.300 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులతోపాటు మరో రూ.700 కోట్ల పనులు (మొత్తం రూ.1000 కోట్ల) పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు, అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం వెలగపూడిలోని సచివాలయం 5వ బ్లాక్లో సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మూడు నెలల్లోగా పనులు పూర్తి చేయాలని టార్గెట్ కూడా ఇచ్చారు. పంచాయతీలకు తగ్గిన భారం.. గతంలో మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపట్టాలంటే నిర్దేశించిన అంచనా వ్యయంలో గ్రామ పంచాయతీలు మ్యాచింగ్ గ్రాంటుగా కొంత చెల్లించాల్సి వచ్చేది. 2 వేల జనాభా ఉన్న పంచాయతీలోనైతే 90 శాతం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు, 10 శాతం గ్రామ పంచాయతీలతో పనులు చేపట్టే పరిస్థితి ఉండేది. 2 వేల నుంచి 5 వేల జనాభా గల పంచాయతీల్లోనైతే 70 శాతం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు, 30 శాతం గ్రామ పంచాయతీలు భరించాల్సి ఉండేది. 5 వేల జనాభా దాటిన పంచాయతీల్లోనైతే 50 శాతం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు, 50 శాతం గ్రామ పంచాయతీలు తమ మ్యాచింగ్ గ్రాంటుగా సమకూర్చాల్సి ఉండేది. అంటే గ్రామ పంచాయతీల్లో మెటీరియల్ కాంపోనెంట్ పనులు జరగాలంటే పంచాయతీలు కొంత భారాన్ని మోయాల్సి ఉండేది. ఈ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉండేది. అసలే నిధుల్లేక సతమతమవుతున్న పంచాయతీలకు ఇది అదనపు భారమయ్యేది. తమ వాటాగా ఇస్తేనే మెటీరియల్ కాంపోనెంట్ పనులు ఆయా పంచాయతీలకు దక్కేవి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పంచాయతీలపై భారం మోపకుండా కన్వర్జెన్సీ లేకుండా మొత్తం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతోనే పనులు చేపట్టుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో పంచాయతీలకు ఆర్థిక భారం తొలగినట్టయింది. -
మధ్యాహ్న భోజనం.. వెరీ ‘గుడ్డు’
సాక్షి, విశాఖపట్నం : మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్ల సరఫరాలో పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు మధ్యాహ్న భోజనంతోపాటు నాణ్యమైన కోడిగుడ్డు అందజేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలన్నింటినీ రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనాన్ని పరిశుభ్ర వాతావరణంలో రుచిగా అందించడంతోపాటు నాణ్యతని పరిశీలించేందుకు శాస్త్రీయ పద్ధతులు అవలంబించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విమర్శలకు చెక్ చెప్పేందుకు యత్నం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై ఇప్పటికీ అనేక విమర్శలు ఎదురవుతున్నాయి. పరిశుభ్రమైన వాతావరణంలో వంట చెయ్యడం లేదనీ, రుచిపచీ లేకుండా పిల్లలకు భోజనం పెడుతున్నారనీ, ఉడకని అన్నం, నీళ్ల చారు అందిస్తున్నారంటూ ఎక్కడో ఒక చోట నిత్యం ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతోపాటు అందించే గుడ్లు కూడా నాణ్యమైనవి కావనే విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ చెప్పేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందించడంతోపాటు నిర్వాహకులకు డ్రెస్ కోడ్ ఉండాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీంతోపాటు నాణ్యతని పరిశీలించేందుకు మైక్రో స్కోప్లని వినియోగించాలని సూచించింది. తాజాగా భోజనంలో అందించే గుడ్లు కూడా నాణ్యమైనవి అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీలకు మేలు జరిగేలా.. ఇప్పటిదాకా కోడిగుడ్ల టెండర్ల దాఖలు అర్హతలో రకరకాల నిబంధనలు ఉండేవి. బడా వ్యాపార వేత్తలు మాత్రమే టెండర్లలో పాల్గొనేవారు. నిజమైన పౌల్ట్రీ ఫాం నిర్వాహకులు, రైతులు టెండర్లలో పాల్గొనేందుకు వీలుండేది కాదు. ఈ ప్రక్రియలో అనేక లోపాలున్నాయని, రవాణా ఖర్చులు అధికంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుత విధానంలో కొనుగోలు చేయడం ద్వారా ప్రతి కోడిగుడ్డుకు అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. వీటన్నింటినీ పరిశీలించిన ముఖ్యమంత్రి లోపభూయిష్టమైన అంశాలను సవరించి సన్నకారు రైతులు కూడా కోడిగుడ్ల సరఫరాలో పాల్గొనే విధంగా చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో రైతుల నుంచే కోడిగుడ్లు సరఫరా చేస్తున్నామని డీఈవో లింగేశ్వరరెడ్డి తెలిపారు. ప్రభుత్వం తాజాగా కోడిగుడ్ల సరఫరాలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ నుంచి వెలువడే ఉత్తర్వులు మేరకే తదుపరి కార్యచరణ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విద్యా డివిజన్ యూనిట్గా టెండర్లు జిల్లాలో 5,397 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 1 నుంచి పదో తరగతి వరకూ 6,48,162 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మంచి భోజనం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వారానికోసారి స్కూళ్లకు గుడ్లు సరఫరా చేయాలనే నిబంధన దాదాపు ఎక్కడా అమలు కావడం లేదనే విమర్శలు ఎదురవుతున్నాయి. అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా.. కోడిగుడ్ల సరఫరాపై పలు ఆరోపణలు వస్తున్నాయి. సైజు, నాణ్యత, సరఫరాపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా యూనిట్గా కాకుండా విద్యా డివిజన్ యూనిట్గా టెండర్లు అప్పగించేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా సరఫరా చేస్తున్న గుడ్డు కనీసం 50 గ్రాముల బరువు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఏజెన్సీల ఎంపికలో రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లా యూనిట్గా కాకుండా డివిజన్ యూనిట్గా ఏజెన్సీని ఎంపిక చేయనున్నారు. జిల్లాలో నాలుగు (విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు) విద్యా డివిజన్లు ఉన్నాయి. ఇందుకోసం డివిజన్కో టెండర్ ప్రొక్యూర్మెంట్ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీకి జాయింట్ కలెక్టర్ చైర్మన్గా, డీఈఓ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఐసీడీఎస్ నుంచి ఒకరు, డిప్యూటీ డీఈఓ, ఒక ఎంఈఓ, హెచ్ఎం (ఆయా డివిజన్లలో డీఈఓ నియమిస్తారు), రవాణా శాఖ నుంచి ఒకరు (జేసీ నియమిస్తారు) సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఏజెన్సీలను ఖరారు చేయనుంది. అయితే ఏజెన్సీలకు అర్హత, ఇతర విధివిధానాలు రావాల్సి ఉంది. -
చెప్పేటందుకే నీతులు..
వారు మాత్రం తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదివిస్తారట... ఎదుటివారికి మాత్రం దానిని అందనివ్వరట... అందుకే సర్కారు బడుల్లో ఆ మీడియం వద్దంటూ నానా రాద్ధాంతం చేస్తున్నారు. నిరుపేదలకు ఆ మీడియం దూరం చేయాలన్నదే వారి లక్ష్యం. అందుకే తెలుగుపై తమకే వల్లమాలిన ప్రేమ ఉన్నట్టు... సర్కారు దానిని కనుమరుగు చేసేస్తున్నట్టు తెగ బాధపడిపోతున్నారు. ఇదీ తెలుగుదేశం నేతల తీరు. రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో దానిపై లేనిపోని అడ్డంకులు సృష్టిస్తున్న టీడీపీ తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు తన ఇద్దరు కుమార్తెలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విద్యావతీదేవిలను ఇంగ్లిష్ మీడియంలోనే హైదరాబాద్లోని విద్యారణ్య ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివించారు. అదితి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అశోక్ కూ డా ఇంగ్లిష్ మీడియంలోనే గ్యాలియర్లో చదివారు. తెలుగు పలకడానికి కూడా వీరు ఇబ్బంది పడుతుంటారు. సాక్షి, ప్రతినిధి విజయనగరం: ప్రతి ఒక్కరికీ తమ పిల్లలపై బోలెడు ఆశలుంటాయి. వారు ఉన్నతంగా ఎదగాలనీ... తమకు ఆసరాగా నిలవాలనీ... జీవితంలో ఏ మాత్రం వారు కష్టపడకూడదని ఆకాంక్షిస్తారు. దీనికి నిరుపేదలేమీ మినహాయింపు లేదు. ముఖ్యంగా వారిలోనే ఎక్కువ ఉబలాటం ఉంటుంది. అందుకోసమే తమ పిల్లలను కాన్వెంట్లలో, కార్పొరేట్ స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు చెల్లించి చదివించడానికి అప్పులు చేస్తూ కష్టపడుతున్నారు. ఇంకా నిరుపేదలైతే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారు. అలా చదివిన వారు ఆంగ్లం విషయంలో కార్పొరేట్ విద్యార్థులతో పోటీపడలేకపోతున్నారు. మల్టీ నేషన్ కంపెనీలకు ఇంటర్వ్యూలకు వెళ్లినపుడు, పోటీ పరీక్షలకు హాజరైనప్పుడు ఇంగ్లిష్తో ఇబ్బంది పడుతున్నారు. వారి కష్టాన్ని చూసి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్య మం తీసుకువస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ దీని కి మతాన్ని ముడిపెట్టి ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వారికి మరో పార్టీ నాయకులు వంతపాడుతున్నారు. అసలు వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ఆరా తీస్తే జిల్లాలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేల కుమారులు, కుమార్తెలు ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారనే విషయం బయటపడింది. విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లోని కార్పొరేట్ స్కూళ్లలో టీడీపీ నేతల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీల పిల్లలది ఇంగ్లిష్ మీడియమే టీడీపీ మాజీ రాష్ట్ర మంత్రి సుజయ్కృష్ణ రంగారావు తన కుమారుడు విశాలకృష్ణ రంగారావు, కుమార్తె కృతీ గోపాల్ను విశాఖపట్నంలోని ఓక్రిడ్జ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివించారు. సుజయ్ కూడా తెలుగు మీడియంలో చదవలేదు. టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తన కుమార్తె ప్రణతిని, కుమారుడు పృథీ్వని సాలూరులోని లయన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివించారు. టీడీపీ సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి భంజ్దేవ్ కుమారుడు బ్రీజేష్కుమార్ కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు కుమార్తె దీక్షిత, కుమారుడు వంశీ విజయనగరంలోని సెంట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లోనే చదివారు. శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కవల కుమార్తెలు అని్వతానాయుడు, అమితానాయుడు కొత్తవలసలోని జిందాల్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివారు. ప్రస్తుతం విశాఖలో చైతన్య కళాశాలలో చదువుతున్నారు. మీసాల గీత కుమారుడు కిరీటి విజయనగరం భాష్యం స్కూల్లో, కుమార్తె సువర్ణ బొబ్బిలి అభ్యుదయ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివారు. చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని తన కుమారుడు కిమిడి నాగార్జునను శ్రీకాకుళంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో విద్యాభ్యాసం చేయించారు. వీరి పోరాటం ఎవరికోసం? తమ పిల్లలను ఎంచక్కా ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటున్న టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని, మాతృ భాషను మంట గలుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు వీరి పోరాటం ఎవరికోసమన్న చర్చకూ దారితీస్తోంది. తమ పిల్లలు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని ఎంబీబీఎస్, పీజీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులకు పంపిస్తూ... సామాన్యుల పిల్లలు చదువుకునే పాఠశాలల్లో మాత్రం ఇంకా తెలుగు మీ డియంనే కొనసాగించాలని కోరుకోవడం ఏమి టన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తోంది. -
నాయకులకేనా ఇంగ్లిష్ చదువులు..
వీధి బడి ఏళ్లుగా తల వంచుకునే బతికేస్తోంది. ప్రైవేటు స్కూళ్ల వేగం అందుకోలేక కన్నీరు పెడుతూనే ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి కూడా అంతే. ఇంటర్వ్యూలలో, గ్రూప్ డిస్కషన్లలో, పోటీ పరీక్షల సమయంలో ‘కార్పొరేట్’ పిల్లలతో పోటీ పడలేక చతికిలపడుతూనే ఉన్నారు. ఎంత మేధస్సు ఉన్నా ఆంగ్లంలో సంభాషించలేక అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇన్నాళ్లకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్ బోధించాలని సర్కారు సంకలి్పంచింది. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి ఊహించని ఎదురుదాడి కనిపిస్తోంది. వాస్తవానికి విమర్శించే వారి పిల్లలంతా ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతుండడం గమనార్హం. ఇంటిలో పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ సామాన్యుల పిల్లల విషయంలో మాత్రం కొత్త భాష్యాలు పలుకుతున్నారు. వీరి ద్వంద్వ నీతి రాజకీయాలపై జనంలో అసహనం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఏ తల్లిదండ్రులైనా పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటారు. వారు జీవి తంలో స్థిరపడాలని కలలు కంటారు. దాని కోసం కష్టనష్టాలను భరించి పిల్లల్ని చదివిస్తుంటారు. స్థోమత ఉన్నోళ్లు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తుండగా, పేదవారు సర్కారు బడుల్లో చదువుతున్నారు. కాకపోతే మాధ్యమం సమస్యతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెట్టుకురాలేకపోతున్నారు. కంప్యూటర్ యు గంలో ఇంగ్లిష్ రాకపోతే ఉపాధి, ఉన్నతి రెండూ లేవన్నది జగమెరిగిన సత్యం. ఎక్కడకు వెళ్లి రాణించాలన్నా ఇంగ్లిష్ లో ప్రావీణ్యం తప్పనిసరిగా మారుతోంది. ఇంతటి ప్రాధాన్యత గల విద్యను నాణ్యతతో పేదలందరికీ ఉచితంగా అందించేందుకు సర్కార్ సంకల్పిస్తుంటే ప్రతిపక్ష నాయకులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అభ్యుదయవాదులు, విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే అపోజిషన్ లీడర్లు మాత్రం అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఓ వైపు వ్యతిరేకిస్తూనే తమ పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. నాయకులు ప్రదర్శిస్తున్న ద్వంద్వ నీతి జనాలకు తెలిసి ఛీ కొడుతున్నారు. నిగ్గుదీయండి.. పోటీ ప్రపంచంలో ఆంగ్ల మాధ్యమం ఆవశ్యకత ఎక్కువైంది. ఉన్నత అవకాశాలను పొందాలంటే ఆంగ్లం తప్పనిసరి. దాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంలో తమ పిల్లల్ని చదివించుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ స్థోమత లేక ఆలోచన దగ్గరే ఆగిపోతున్నారు. విద్యార్థులు పోటీ పరీక్షల వరకు కాస్తో కూస్తో నెట్టుకొస్తున్నా ఇంటర్వ్యూలకొచ్చే సరికి కమ్యూనికేషన్ స్కిల్స్ లోపంతో విఫలమవుతున్నారు. దగ్గరగా వచ్చి ఉద్యోగాలను పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పేదవాళ్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సర్కారు ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లంలో బోధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెలువడినప్పటి నుంచి టీడీపీ, జనసేన నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. కానీ అచ్చె న్న వంటి వారంతా పిల్లలను మాత్రం ఎంచక్కా కార్పొరేట్ స్కూళ్లలో, ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటున్నారు. దీనిపై ప్రజలే నాయకులను నిగ్గదీసి అడగాలని అభ్యుదయవాదులు చెబుతున్నారు. టీడీపీ నేతల పిల్లలు చదువుతున్నదిక్కడే.. ►ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాల్యం నుంచి బీడీఎస్ పూర్తి అయ్యేవరకు ఇంగ్లిష్ మీడియం లోనే చదువుకున్నారు. ఆయన ఇద్దరు చెల్లెళ్లు కూడా ఆయనతో పాటుగానే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదువులు సాగించారు. ►మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పిల్లలు నీలి మ, రేష్మ శ్రీకాకుళంలోని సెయింట్ జోసఫ్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివారు. ►టీడీపీ నేత కోండ్రు మురళీమోహన్కు ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. అక్కడే పిల్లల చదువులు కోసం ఉంటూ రా జాం తాత్కాలికంగా వస్తుంటారు. ఇటీవల ఆయన ఓ కార్పొరేట్ ఇంగ్లీషు మీడియం స్కూల్ను రణస్థలం హైవే పక్కన పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కూడా. ►టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు కావలి ప్రతిభాభారతి కుమారుడు నానిబాబు, కుమార్తె గ్రీష్మాప్రసాద్ విశాఖపట్నం, హైదరాబాద్లలో ఇంగ్లీషు మీడియంలో చదివారు. నానిబాబు పిల్లలు కూడా ప్రస్తుతం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతున్నారు. ►మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమార్తె హారిక, కుమారుడు కె.సాగర్, ఇంగ్లిష్ మీడియంలోనే చదివించారు. వారిద్దరూ గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీలో చదివారు. ►టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ కుమారుడు అవినాష్ శ్రీకాకుళంలోని న్యూ సెంట్రల్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివారు. కుమార్తె చైతన్య కూడా అదే స్కూల్లో చదివారు. ►మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఇద్దరు పిల్లలు శివగంగాధర్, విశ్వనాథం ఇంగ్లిష్ మీడియంలోనే చదివారు. ►మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇద్దరు పిల్లలు ఆంగ్ల మాధ్యమంలోనే చదువు సాగించారు. ►మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ఇద్దరు కుమార్తెలు ఇంగ్లిష్ మీడియంలోనే చదివారు. ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష కూడా ఇంగ్లిష్ మీడియంలోనే విద్యాభ్యాసం చేశారు. వారి ఇద్దరు పిల్లలు విశాఖలో ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. జనసేన నేతల పిల్లలు.. ►మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసిన మెట్ట రామారావు తన ఇద్దరు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివించారు. కుమారుడు కళ్యాణ్కృష్ణను న్యూఢిల్లీలో ఇంజినీరింగ్ చదివించగా, కుమార్తె వైష్ణవిని ఢిల్లీలోనే ఇంటర్ చదివించారు. ►పలాసలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోత పూర్ణచంద్రరావు కూడా తన కుమార్తెను కాశీబుగ్గ లిటిల్ ఏంజిల్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియం చదివించారు. ►శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోరాడ సర్వేశ్వరరావు కూడా తన కుమారుడ్ని హైదరాబాద్లో ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారు. ►ఆమదాలవలసలో పోటీ చేసిన పేడాడ రామమోహన్ తన కుమారుడు చైతన్యస్వా మిని శ్రీకాకుళంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారు. ►ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాదాన వెంకట జనార్దనరావు తన ఇద్దరు కుమార్తెలు చాందిని, జాహ్నవిలను శ్రీకాకుళంలోని శ్రీచైతన్యలో ఇంగ్లిష్ మీడియంలో చదివారు. ►రాజాం నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన మచ్చా శ్రీనివాసరావు తన ఇద్దరు పిల్లల్ని విశాఖపట్నంలో ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నారు. -
ఆ ‘దిశ’గా అతివకు అండగా...
సాక్షి, విశాఖపట్నం, అల్లిపురం(విశాఖ దక్షిణం): మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ఉద్ధేశించిన చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా బిల్లు చట్టంగా మారితే..అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి మరణశిక్ష విధిస్తారు. అత్యాచారాన్ని నిర్ధారించే ఆధారాలు లభ్యమైతే కేవలం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చట్టంలో మార్పులు తీసుకువస్తున్నారు. వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, మరో 14 రోజుల్లో విచారణ జరిపించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చట్టంలో మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. అత్యాచారం, సామూ హిక అత్యాచారం, యాసిడ్ దాడు లు, వేధింపులు, లైంగిక వేధింపులు వంటి నేరాలకు విచారణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కో ర్టులు ఏర్పాటు చేయా లని మంత్రి వర్గం తీర్మానించింది. మహిళా భద్ర తపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తోంది. పోక్సో చట్టం... 18 ఏళ్లలోపు ఉన్న మైనర్లపై అత్యాచారం, అత్యాచారానికి యత్నించడం, నగ్నంగా చిత్రీకరించడం లాంటి వాటికి పాల్పడితే వారికి ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. లైంగిక దాడి చేసినా.. నగ్నంగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించినా మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు ఖైదు తప్పదు. ఒక్కోసారి జీవితఖైదు కూడా విధించవచ్చు. అక్రమ రవాణా నిరోధక చట్టం.. బాలికలు, యువతులను అక్రమంగా రవాణా చేయడం, మాయమాటలు చెప్పి.. ఆశచూపి వారిని వ్యభిచార గృహాలకు అమ్మేయడం, బలవంతంగా వ్యభిచారం చేయించడం వంటివి నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనల్లో నిందితులకు రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. కేసు తీవ్రతను బట్టీ ఒక్కోసారి ఏడేళ్ల నుంచి జీవితఖైదు కూడా పడే అవకాశం ఉంది. బాల్య వివాహాల నిషేధ చట్టం... 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేయాలని చూడడం చట్టరీత్యానేరం. బాల్య వివాహాలు చేయాలని ప్రయతి్నంచిన వారికి రెండు ఏళ్ల జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. నిర్భయ చట్టం.. ►మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారికి ఏడేళ్ల పాటు జైలుశిక్ష లేదా.. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. శిక్ష అనుభవించి బయటకు వచ్చిన అనంతరం మరోసారి అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష తప్పదు. ►మహిళలను లైంగికంగా వేధించడం, వీడియోలు, ఫొటోలు తీసి బెదిరించిన వారికి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ►సామూహికంగా లైంగికదాడికి పాల్పడిన వారికి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష, మరోసారి అదేపని చేస్తే వారికి ఉరిశిక్ష తప్పదు. ►యాసిడ్ దాడికి పాల్పడిన వారికి పదేళ్ల జైలుశిక్ష, యాసిడ్ దాడికి ప్రయతి్నంచిన, బెదిరించిన వారికి ఐదేళ్ల పాటు ఖైదు తప్పదు. ► పనిచేసే ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా తాకడం, వేధించడం చేస్తే మూడేళ్ల పాటు జైలుశిక్ష, మహిళను వివస్త్రను చేసి వేధిస్తే మూడేళ్ల జైలు, జరిమానా విధిస్తారు. గృహహింస చట్టం.. భార్యను భౌతికంగా, లైంగికంగా, మానసికంగా, ఆర్థికంగా హింసిస్తే గరిష్టంగా 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. మద్యం తాగి భార్యను కొట్టడం, హింసించడం, వరకట్నం కోసం వేధించడం, చిత్రహింసలు పెట్టడం, ఇళ్లలో నిర్భంధించి కొట్టడంతో పాటు, భర్త, అతని తల్లి, తండ్రి, బంధువులు కుటుంబసభ్యులు ఎవరైనా గృహహింసకు పాల్పడితే వారికి ఈ చట్టం కింద 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తారు. సైబర్మిత్ర... వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో మహిళలు, యువతులను కొందరు ఆకతాయిలు వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారు. వారి ఫొటోలను మారి్ఫంగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు పోలీసుశాఖ సైబర్ మిత్రను అందుబాటులోకి తీసుకువచ్చింది. తమ సమస్యలను తెలియజేసేందుకు సైబర్ మిత్ర ఫోన్ నంబరు 91212 11100కు వాట్సప్ చేయవచ్చు. లొకేషన్ షేర్ చేయడం ద్వారా తాము ఆపదలో ఉన్నామని పోలీసులకు తెలియజేసి వెంటనే సాయం పొందవచ్చు. ఈ నెంబరు 24 గంటలూ పనిచేస్తుంది. డయల్ 182.. మహిళలు, ఒంటరిగా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా వేధింపులకు గురిచేసినా, ఆపదలో చిక్కుకున్న సందర్భాల్లో 182 నంబర్కు ఫోన్ చేయాలి. ఆ కాల్ రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే రక్షకదళం(ఆర్పీఎఫ్) కంట్రోల్ రూమ్కు చేరుతుంది. బాధితులు అందించిన వివరాల ఆధారంగా ఆ రైల్లో ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే బోగీలోకి చేరుకుని సాయం అందిస్తారు. డయల్ 112 ఆపదలోవున్న మహిళల కోసం కేంద్రహోంశాఖ 112 నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బాధితులు దేశంలో ఎక్కడినుంచైనా ఈ నంబర్కు కాల్ చేసి సమస్యను తెలియజేస్తే ఏ రాష్ట్రం నుంచి కాల్ వచ్చిందో ఆ రాష్ట్ర పోలీసు కంట్రోల్రూమ్కు విషయాన్ని తెలియజేస్తారు. అక్కడి సిబ్బంది వెంటనే సంబంధిత పోలీసులను అప్రమత్తం చేసి బాధితులకు సాయం అందిస్తారు. అవసరమైతే గస్తీ వాహనాలను సంఘటనాస్థలానికి పంపుతారు. ఈ ప్రక్రియ అంతా నిమిషాల వ్యవధిలోనే జరుగుతుంది. డయల్ 100 రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా 100 నంబర్కు డయల్ చేస్తే అది పోలీసు కంట్రోల్ రూమ్కు చేరుతుంది. ఫోన్ చేసిన వారు తామెదుర్కొంటున్న సమస్యను వివరిస్తే చాలు.. సిబ్బంది అప్రమత్తమవుతారు. సంబంధిత ప్రాంతంలోని పోలీసులకు సమాచారం అందిస్తారు. అలాగే గస్తీ వాహనాలను కూడా అప్రమత్తం చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో 4 నుంచి 6 నిమిషాలలోపు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుంటారు. జీపీఎస్ లోకేషన్ ఆధారంగా బాధితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కాపాడతారు. అవసరమైతే ఘటనా స్థలానికి చేరుకునేంత వరకు పోలీసులు బాధితులతో ఫోన్లో మాట్లాడుతూ సూచనలు, సలహాలు ఇస్తూ ధైర్యం చెబుతారు. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలి. సంపూర్ణ రక్షణ దిశగా... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీలో మహిళల భద్రతకు చేపడుతున్న చర్యలు దేశ చరిత్రలో ప్రథమంగా నిలుస్తాయి. దిశ చట్టం ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆనందదాయకం. ఈ చట్టం రాష్ట్రంలో మహిళలకు రక్షణ చట్రంగా మారుతుంది. సంపూర్ణ రక్షణకు దోహదపడుతుంది. మన రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం ప్రభుత్వం స్పందించిన తీరు ఆదర్శనీయం. అలాగే సోషల్మీడియాలో మహిళలను కించపరిచినా.. కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం శుభపరిణామం. – చెట్టి పాల్గుణ, అరకు ఎమ్మెల్యే నిజమైన మహిళా రక్షకుడు... మహిళల రక్షణ కోసం చర్యలు చేపట్టి సీఎం జగన్మోహన్రెడ్డి దేశ చరిత్రలోనే మహిళా రక్షకుడిగా నిలిచారు. అసెంబ్లీలో మహిళా భద్రతకు సంబంధించిన బిల్లుకు∙ కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు, పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయం. తెలంగాణలో జరిగిన దిశ హత్యాచార ఘటనతో సీఎం జగన్ తీవ్రంగా కలత చెందారు. ఏపీలో మహిళల రక్షణకు దిశ చట్టంను తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇది శుభ పరిణామం. దిశ చట్టం మహిళలకు కొండంత రక్షణగా నిలుస్తుంది. విచారణ పేరుతో సాగదీత ఉండదు. కేవలం 21 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా చట్టం రూపొందించాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరుగుతుంది. మహిళలు స్వేచ్ఛగా జీవించడం కోసం సీఎం కీలక నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయం. చాలా సంతోషంగా ఉంది. – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి , పాడేరు ఎమ్మెల్యే చట్టాలు తెలుసుకోండి... ప్రభుత్వం తాజా నిర్ణయం అభినందనీయం. చిన్నారులు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు చేయాలంటే మృగాళ్ల గుండెల్లో వణకు పుట్టాలి. జిల్లాలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు తప్పు చేసిన వారికి త్వరగా శిక్ష పడుతుంది. నేరాలు తగ్గుతాయి. మహిళలందరూ చట్టాలను తెలుసుకోవాలి. మహిళలు క్లిష్ట పరిస్థితుల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. ఆపదని తెలిస్తే పోలీస్ హెల్ప్లైన్ నెంబర్లకు ఫోన్చేయాలి. –ప్రేమ్కాజల్, ఏసీపీ, ఉమెన్ పోలీస్ స్టేషన్ -
విద్యుత్ ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం స్పష్టత
సాక్షి, అమరావతి: విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. విద్యుత్పై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చే పరిస్థితిలో ఉందని, పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం నిజనిజాలపై పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలుపై గత ప్రభుత్వం హడావుడిగా నిర్ణయం తీసుకుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్పై ఒక కమిటీ వేసిందని.. ఆ నివేదిక రాగానే అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. పద్ధతి ప్రకారం జరగాలంటే సమయం పడుతుందని వివరించారు. పవన్ విద్యుత్, సౌర విద్యుత్ వాడకం మంచిదేనని.. పెట్రోలు,డీజీల్ నిల్వలు వాడకం మంచిది కాదన్నారు. పీపీఏల్లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు. కేబినెట్ సబ్కమిటీ పర్యవేక్షిస్తుంటే.. టీడీపీకి ఆతృత ఎందుకని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఏ దోపిడీ చేసినా మేం ఊరుకుంటే వాళ్లకు సంతోషమని, వాస్తవాలు చెబితే టీడీపీ పట్టించుకోదని విమర్శించారు. 2014-15లో డిస్కమ్ల నష్టాలు రూ.9వేల కోట్లు అని, 2018-19లో ఆ నష్టాలు రూ.29 వేల కోట్లకు చేరాయన్నారు. గత ఐదేళ్లలో డిస్కమ్లను రూ.20 వేల కోట్ల నష్టాల్లో పడేశారన్నారు. ఎక్కువ రేట్లకు ఇచ్చిన వాటిపై మరోసారి ఆలోచించాలని కోరితే గొడవ చేస్తున్నారన్నారు. అవినీతి జరిగితే చర్యలు తీసుకోమని కేంద్రం కూడా చెప్పిందని వివరించారు. విద్యుత్ కోసం రైతులు ఇబ్బందులు పడకూడదనే సీఎం జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని బుగ్గన పేర్కొన్నారు. -
‘వాటిపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు’
సాక్షి, అమరావతి: ప్రత్యేకహోదా, విభజన హామీల గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదని మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం గురించి టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారని.. ఈ రాష్ట్రంలో పార్టీలు ఇచ్చి పుచ్చుకోవడం టీడీపీకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదన్నారు. పార్టీలే కాదు, బీ ఫారాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారన్నారు. 2014 నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ ఒక్కరేనని తెలిపారు. ఢిల్లీ, గుంటూరులో దీక్షలు చేశారని, ధర్నాలు, యువభేరీ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. పార్టీ ఎంపీల చేత కూడా వైఎస్ జగన్ రాజీనామాలు కూడా చేయించారన్నారు. వైఎస్సార్సీసీ ఎంపీలు కన్నా.. టీడీపీ ఎంపీలు అప్పట్లో ఎక్కువ మంది ఉన్నారని, కాని చీమ కుట్టినట్టుకూడా వారికి అప్పుడు లేదన్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే బెటరని అప్పట్లో బల్ల గుద్దినట్టు చంద్రబాబు చెప్పారన్నారు. అప్పట్లో ఆర్థిక మంత్రికి శాలువాలు కప్పి, స్వీట్లు పంచుకున్న చరిత్ర వారిదని.. ఇప్పుడు అదే వ్యక్తులు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. అలా చేయకపోతే కేంద్రం ఆలోచించేంది.. ఆరోజు నుంచి నేటి వరకూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా కావాలంటూ మడమ తిప్పకుండా మాట్లాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత రాత్రికి రాత్రి యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసి, ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా సరిపెట్టుకుంటారన్న ఒక మైండ్సెట్ని క్రియేట్ చేసింది చంద్రబాబేనన్నారు. అలా చేయకపోతే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఉండేదన్నారు. ‘షీలా బీడే కమిటీ ఈ జనవరితో అయిపోయింది. వాళ్లు 89 రికమెండేషన్లు ఇస్తే.. ఈ ప్రభుత్వం వచ్చాక 68 రికమెండేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. మేం అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఏ అభ్యంతరాలు పెట్టకుండా 68 సిఫార్సులకు సానుకూలత తెలిపింది. కాని ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది. రాజకీయం చేసింది. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన తర్వాత పారిపోయి ఈ రాష్ట్రానికి వచ్చేశారు. హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని అయితే... కట్టుబట్టలతో పారిపోయి వచ్చారని’ కన్నబాబు దుయ్యబట్టారు. హైదరాబాద్లో ఉన్న ఏపీ ప్రజలు బాధపడే పరిస్థితి ఏర్పడిందని.. చేసిందంతా చేసి ఇవాళ నీతి కథలు, పిట్ట కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు నాడు అలా..నేడు ఇలా... టీడీపీకి ప్రత్యేక హోదాపైన, విభజన హామీలపైన మాట్లాడే హక్కులేదని.. ఐదేళ్ల పాటు ఏమీ చేయకపోగా, ఆరునెలల్లో ఏదో జరిగిపోయిందన్నట్టుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినప్పుడే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే ఫలితం ఉండేదని, కాని అలా చేయకుండా మోదీ అన్యాయం చేశారని ఎన్నికల ముందు మాట్లాడి, ఇప్పుడు మళ్లీ మోదీతో జతకట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించి మళ్లీ ఇక్కడ మరోలా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నిసార్లు నాలుకలు మడతపెట్టారో వారికే తెలియాలి.. ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి, ఆస్తుల పంపిణీ గురించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణ ఇచ్చిన భవనాల్లో ఏదీ కూడా విభజన చట్టంలోని పరిధిలోనిది కాదని.. విభజన చట్టంలో భవనాల్లోని ఒక్క గదిని కూడా అప్పగించలేదని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా... విభజన చట్టంలోని భవనాలను ఆక్రమిస్తే ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. అక్కడ సచివాలయంలో భవనాలు ఎందుకు వృథాగా పడి ఉన్నాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం అభివృద్ది చేసిన దాన్ని కూడా విడిచిపెట్టారని.. ఇప్పుడు అక్కడ ఉండకపోయినా, బూజు పట్టినా.. కరెంటు బిల్లుల రూపేణా కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఐదేళ్లపాటు వాళ్లు చేసిన నిర్వాకానికి మరో ఐదేళ్ల పాటు కష్టపడితే తప్ప తీరని విధంగా సమస్యలు సృష్టించారన్నారు. మనకు కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వం ఆక్యుపై చేసినా.. అడగలేకపోయారని.. కారణం ఓటుకు నోటు కేసులో అప్పటి ముఖ్యమంత్రికి ఉన్న బలహీనత అని తెలిపారు. ఢిల్లీతో సంబంధాల విషయంలో ఎన్నిసార్లు నాలుకలు మడతపెట్టారో టీడీపీ వాళ్లకే తెలియాలని ఎద్దేవా చేశారు. -
శ్రీజకు ప్రభుత్వం అండ
రేగిడి: రేగిడి ఆమదాలవలస మండలం నాయిరాల వలస గ్రామానికి చెందిన తలసేమియా బాధితురాలు కొవ్వాడ శ్రీజకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ముందుకువచ్చింది. ఈ నెల 6వ తేదీన సాక్షి దిన పత్రికలో ‘చిన్నారి ప్రాణానికి ఆపద’ అనే శీర్షికపై వెలువడిన కథనానికి దాతలతోపాటు ప్రభుత్వం నుంచి కూడా స్పందన లభించింది. సీఎం కార్యాలయం నుంచి శ్రీజ తల్లి జ్యో తితో ఫోన్లో మాట్లాడారు. శ్రీజకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పారని జ్యోతి ఆదివారం ‘సాక్షి’కి వెల్లడించారు. కుమార్తె అనారోగ్య స్థితిని, మెడికల్ సరి్టఫికెట్లను సీఎం కార్యాలయానికి పంపించామని ఆమె తెలిపారు. జిల్లాలోనూ చాలా మంది మానవతావాదులు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, సాయం కూడా చేశారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
పేదల కోసం భూసేకరణ
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉగాది పండగ నాటికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం పెద్ద మొత్తంలో భూ సేకరణ చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ఇళ్లు లేని పేదలందరికీ స్థలాలు అందివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకలి్పంచారు. ఈ విషయంపై అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉగాది నాటికి జిల్లాలో మూడు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న లక్ష్యంతో రెవెన్యూ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటు భూములు సేకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లా మొత్తం మీద 800 ఎకరాల నుంచి వెయ్యి ఎకరాల స్థలాన్ని సేకరించాలన్న ఆలోచనతో అధికార యంత్రాంగం ఉంది. సబ్ రిజి్రస్టార్ విలువ(ఎస్ఆర్) ప్రకారం మూడు రెట్ల అదనపు ధరతో జిరాయితీ భూములు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా భూ సేకరణ ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంత మేర స్థలం అవసరమన్న దానిపై యంత్రాంగం అంచనా వేస్తోంది. జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్బన్ పరిధిలో ఉండే నాలుగు మండలాలు మినహా.. మిగిలిన 11 మండలాల్లో వివరాలు సేకరిస్తున్నారు. అరకు, పాడేరు మండలాల్లో అక్కడ గిరిజనులకు ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన 9 మండలాల్లో అసలు ప్రభుత్వ స్థలాలు ఎంత మొత్తంలో ఉన్నాయి, ప్రైవేటు భూములు ఎంత మేర సేకరించాలి, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాల పరిస్థితిపై సర్వే చేసి తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వినయ్చంద్ ఇటీవల తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లో శివారు కొండలు, గుట్టలు, పోరంబోకు స్థలాలు ఎంత మేర ఉన్నాయన్న దానిపై రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. 3 లక్షల మందికి పట్టాల పంపిణీ ఉగాది నాటికి మూడు లక్షల మంది పేదలకు పట్టాలు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో అనువైన భూములను గుర్తించేందుకు తహసీల్దార్లు స్వీయ పర్యవేక్షణలో రెవెన్యూ బృందాలు రంగంలోకి దిగాయి. వీటిని ఆర్డీవోలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భూములు అందుబాటులో ఉన్నా.. అవి గ్రామాలకు శివారులోనూ, కొండలు, గెడ్డలు, గుట్టలకు అనుకుని ఉన్నాయి. ఇక అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, విశాఖ రెవెన్యూ డివిజన్లలో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు ఉన్నారు. ఇళ్ల స్థలాలు కేటాయింపులో స్పందన కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ దరఖాస్తులను విచారణ చేసి తగు నిర్ణయం తీసుకుంటున్నారు. ల్యాండ్ పూలింగ్ కోసం.. ప్రభుత్వ, జిరాయితీ భూముల సేకరణ తర్వాత.. అవసరమైతే అసైన్డ్ భూములపై తీసుకుని వారికి ల్యాండ్ పూలింగ్ ద్వారా తిరిగి భూములు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఎకరానికి 900 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నగర పరిధిలోని మండలాల్లో అసైన్డ్ భూములు లభ్యతపై అన్వేషణ జరుగుతోంది. విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో విశాఖ రూరల్, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం మండలాల్లో ఏ మేర అసైన్డ్ భూములు ఉన్నయన్న దానిపై రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. భూసేకరణలో నిర్లక్ష్యం వద్దు పేద ప్రజలకు ఉపయోగ పడే స్థలాలను సేకరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వద్దని కలెక్టర్ వినయ్చంద్ ఇటీవల జరిగిన సమీక్షలో తహసీల్దార్లకు సూచించారు. భూములను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయడానికి సిద్ధం అని కూడా చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిబ్బంది పని చేయాలని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం ఉగాది పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయాలన్నారు. సొంత ఇళ్లు కట్టుకోవడానికి ఎలాంటి స్థలం తీసుకుంటామో.. అదే పద్ధతిలో ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలం ఉండాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. -
మెట్రో రీ టెండరింగ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు డిజైన్లలో మార్పులకు కసరత్తు జరుగుతోంది. ఫస్ట్ ఫేజ్లో అదనంగా 4 కిలోమీటర్లు పెరగడంతో అంచనా వ్యయం కూడా పెరిగింది. ఈ మేరకు పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించేందుకు అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్(ఏఎంఆర్సీ) సన్నద్ధమవుతోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో నిర్మించే బా«ధ్యతను గత ప్రభుత్వం 2017లో ఏఎంఆర్సీకి అప్పగించింది. అదే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వీఎంఆర్డీఏ భవన్లో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. టెండర్లు దాఖలు చేయాలనుకుంటున్న ఆయా దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పీపీపీ విధానంలో సాధ్యాసాధ్యాలపై ఆర్ఎఫ్పీకి ఆహ్వానించగా 5 సంస్థలను 2017లో ఎంపిక చేశారు. డీపీఆర్లో మార్పులు తీసుకొచ్చి, మెట్రో రైల్ కాకుండా లైట్ మెట్రోగా ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. లైట్ మెట్రో వల్ల వ్యయం తగ్గింది. గతంలో రూ.12,500 కోట్లుగా ప్రాజెక్టును సిద్ధం చేయగా లైట్ మెట్రో ప్రాజెక్టు వల్ల రూ.8,300 కోట్లకు అంచనా వ్యయం తగ్గింది. లైట్ మెట్రో వల్ల ప్రాజెక్టు స్వరూపం మారకపోయినా రైళ్లలో మార్పులు వస్తాయి. మెట్రో కోచ్లు తగ్గుతాయి. సాధారణంగా ఒక మెట్రో రైల్ సామర్ధ్యం 600 ఉంటే.. లైట్ మెట్రోలో 400 ప్రయాణికులు ఏక కాలంలో ప్రయాణించగలరు. ఈ విధంగా మార్పులు తీసుకొచి్చన ప్రాజెక్టుపై 5 సంస్థలు పీపీపీ పద్ధతిలో ఆసక్తి చూపించాయి. వచ్చిన 5 సంస్థలకు ప్రాజెక్టు చేపట్టేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ని 2018 మార్చిలో అన్ని సంస్థల నుంచి స్వీకరించిన ఏఎంఆర్సీ.. జనవరి 2019లో అగ్రిమెంట్కు వెళ్లాలని నిర్ణయించింది. త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు పట్టాలెక్కించాలి్సన చంద్రబాబు ప్రభుత్వం మెట్రోపై అశ్రద్ధ చూపించింది. ఫలితంగా ప్రాజెక్టు ఆలస్యమైంది. తాజాగా మెట్రో రైలు ప్రాజెక్టుల్లో పలు మార్పులు చేసింది. కొత్తగా టెండర్ల ప్రక్రియ.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పాత టెండర్లని రద్దు చేసి.. కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. చేసిన మార్పులకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి దశలో గతంలో 42 కిలోమీటర్లు మాత్రమే ప్రపోజల్స్ ఉండేవి. కానీ గాజువాకతోనే ఆపెయ్యకుండా స్టీల్ ప్లాంట్ వరకూ పొడిగించాలన్న డిమాండ్ మేరకు ప్రాజెక్టును మరో 4 కి.మీ మేర విస్తరించారు. దీంతో పాటు గతంలో 8 కారిడార్లు మాత్రమే ఉండేవి. పెరుగుతున్న జనాభా, అవసరాల దృష్ట్యా కారిడార్ల సంఖ్య కూడా 10కి చేరుకుంది. మొత్తం 140 కి.మీ వరకూ మెట్రోరైలు పొడిగించారు. దీంతో పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా రీటెండర్లను పిలవాలని ఏఎంఆర్సీ సిద్ధమవుతోంది. ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో కొత్త సంస్థల్ని ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు అదనంగా కిలోమీటర్లు, కారిడార్లు ఏర్పాటు చెయ్యడంతో గతంలో ఉన్న రూ.8,300 కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా పెరిగి రూ.9 వేల కోట్లకు చేరుకుంది. రీటెండర్ ప్రక్రియకు సిద్ధమవుతున్నాం.. విశాఖ మెట్రో ప్రాజెక్టుని వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకనుగుణంగా ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేస్తున్నాం. గతంలో ఉన్న డీపీఆర్ని కూడా మారుస్తున్నాం. ఫస్ట్ ఫేజ్లో అదనంగా 4 కిలోమీటర్లు పెరగడంతో అంచనా వ్యయం కూడా పెరిగింది. దీనివల్ల పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించేందుకు కసరత్తులు చేస్తున్నాం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. – రామకృష్ణారెడ్డి, అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ భోగాపురం వరకూ పెంచేందుకు కసరత్తు మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. ముందుగా ఫస్ట్ ఫేజ్పై ప్రధాన దృష్టి సారించాం. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఏఎంఆర్సీ, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ సంయుక్త కార్యచరణ రూపొందించి ముందుకు వెళ్తున్నాం. భోగాపురం వరకూ కారిడార్ని పొడిగించాలన్నది సీఎం జగన్మోహన్రెడ్డి సూచించారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా కసరత్తు చేస్తున్నాం. ఆరో కారిడార్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనని రూపొందించాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్