cancer treatment
-
కార్డులు చెల్లవ్.. కాసుల వైద్యమే!
ఆరోగ్యశ్రీ అంటే రానివ్వడం లేదుతిరుపతి కొర్లగుంటలో ఉంటున్నాం. ఆటో డ్రైవర్గా పనిచేసే నా భర్తకు కడుపు నొప్పి రావడంతో స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లగా కడుపులో గడ్డ ఉందని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించగా ఆరోగ్యశ్రీ అయితే ఆపరేషన్ చేయమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు రూ.3 లక్షల విలువ చేసే సేవలు ఉచితంగా పొందాం. ఇప్పుడేమో ఆస్పత్రి లోపలకు కూడా అనుమతించడం లేదు. – రమణమ్మ, తిరుపతి⇒ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక కావేరి డెంగీ బారిన పడటంతో ఈ ఏడాది ఆగస్టు 23న తల్లిదండ్రులు కర్నూలులోని ఓ నెట్వర్క్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందకపోవడంతో చేతి నుంచి రూ.లక్షల్లో చెల్లించారు. బాధిత బాలిక చికిత్స పొందుతూ అదే నెల 26న మృతి చెందింది.⇒ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాగేశ్వరరావుకు కొద్ది రోజుల క్రితం ఛాతీలో నొప్పి రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. వైద్య పరీక్షలు, యాంజియో చేయాలని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని నాగేశ్వరరావు చెప్పడంతో.. ‘ఇక్కడ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లవు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. డబ్బు కడితేనే వైద్యం చేస్తాం’ అని అనడంతో చేసేదేమీ లేక చేతి నుంచి రూ.20 వేలు చెల్లించారు.⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామానికి చెందిన పామర్తి వీరవెంకట సత్యనారాయణ (55) రైతు కూలీ. ఎరువుల బస్తాతో సైకిల్పై వెళ్తుండగా జారి పడిపోవడంతో చువ్వలు వెన్నెముకకు గుచ్చుకుని తీవ్ర గాయాలయ్యాయి. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించలేమని చేతులెత్తేశారు. దీంతో తెలిసిన వారి వద్ద అప్పుతెచ్చి కుటుంబ సభ్యులు అరకొర వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం అందక అనంతరం ఆయన మృతి చెందారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందించి ఉంటే పెద్ద దిక్కును కోల్పోయే వాళ్లం కాదని సత్యనారాయణ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెడుతున్నారు.సాక్షి, అమరావతి: గత ఐదేళ్లూ ప్రజారోగ్యానికి భరోసా కల్పించిన ఆరోగ్యశ్రీ పథకానికి సుస్తీ చేసింది. చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య నెలకొన్న పరిస్థితులు మళ్లీ దాపురిస్తున్నాయి. ఆరోగ్యశ్రీని నీరుగార్చడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు వైద్యం కోసం అప్పుల పాలవుతూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఒకపక్క ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడం.. మరోపక్క శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే సమయంలో జీవన భృతి కింద గత ప్రభుత్వం అందించిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా సాయం అందక అల్లాడుతున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు స్థానంలో బీమా కంపెనీని ప్రవేశపెట్టేందుకు ఆరునెలల్లో ఆరోగ్యశ్రీని కూటమి సర్కారు అంపశయ్య ఎక్కించింది. ఆరోగ్యశ్రీని అమలు చేసేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవని టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే కుండబద్ధలు కొట్టారు. ప్రజలు ఉచిత వైద్యం కోసం రూ.25 లక్షల వరకూ పరిమితి ఉండే ఆరోగ్యశ్రీని కాకుండా.. కేంద్రం అమలు చేసే పీఎం జన్ ఆరోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్) పథకాన్ని వినియోగించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు టీడీపీ కూటమి ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయడం లేదు. నెట్వర్క్ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్ల మేర బకాయి పడటంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. పెద్ద మొత్తంలో బిల్లులు రాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ అనారోగ్యం పాలైతే నిరుపేదలు, మధ్య తరగతి వర్గాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో లబ్ధిదారులు ఆస్పత్రులకు వెళితే.. ‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఉచితంగా చికిత్సలు చేయలేం..’ అని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఖరాకండిగా చెబుతున్నాయి. చికిత్స కోసం చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. ఉచిత వైద్యం కలే..అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వస్తున్న రోగులు తమకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని మొత్తుకుంటున్నా ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు ఆలకించడం లేదు. వాస్తవానికి నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలతో పాటు వైద్య పరీక్షలు, అవసరమైన సర్జరీలు, అనంతరం వాడాల్సిన మందులను ఉచితంగా ఇవ్వాలి. కార్డుదారుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. అయితే చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం.. నిర్వహణ భారంగా మారడంతో ఆస్పత్రులు నిక్కచ్చిగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి. ఓపీ, రకరకాల పరీక్షలు, మందులు కొనాలంటూ పేదల జేబులు గుల్ల చేస్తున్నాయి. కడుపులో గడ్డ, ప్రసవం, చిన్నపాటి ఎముకల ఫ్రాక్చర్ లాంటి సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లిన వారి నుంచి కొన్ని చోట్ల రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక గుండె, న్యూరో, కిడ్నీ, క్యాన్సర్ సంబంధిత అనారోగ్య బాధితులైతే రూ.50 వేల నుంచి రూ.లక్షలకు పైబడి వసూలు చేస్తున్నారు.ప్రజారోగ్యానికి పెద్దపీటప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి అండగా నిలిచారు. కిడ్నీ, గుండె సంబంధిత, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బుల బాధితులు, సీజనల్ వ్యాధుల బారిన పడిన వారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి భరోసా కల్పించారు. వైరల్ జ్వరాలు, డెంగీ బారినపడిన వారికి పథకం ద్వారా ఉచితంగా చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైరల్ జ్వరాలు, డెంగీ బాధితులకు ఉచిత చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో అనారోగ్యం పాలైన ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సివస్తుంది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స లభించకపోవడంతో బాధిత కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి.ప్రభుత్వానికి ఆస్పత్రుల లేఖ..ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో అప్లోడ్ చేసినవి, చేయాల్సినవి కలిపితే రూ.3 వేల కోట్ల వరకూ ప్రభుత్వం బిల్లులు బకాయిపడింది. నెలల తరబడి చెల్లింపులు నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి లేఖ రాసింది. త్వరితగతిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది.రోగులపై మందుల భారంరాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. అనారోగ్యం బారినపడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్థోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై చంద్రబాబు సర్కారు మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత నెలకొంది. ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీఎస్)లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో లేవు. బీపీ, షుగర్, గ్యాస్ బాధితులకు పూర్తి స్థాయిలో మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఇచ్చే హ్యూమన్ మిక్సా్టర్డ్ ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. ఏపీఎంఎస్ఐడీసీ నుంచి కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయింది. సర్జికల్ గ్లౌజులు కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. శస్త్ర చికిత్సల సమయంలో, అనంతరం గాయాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇచ్చే అనస్తీషియా మందుల కొరత తీవ్రంగా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి వినియోగించే స్టోమా బ్యాగ్స్, కుట్లు వేసే దారాలు, మూత్ర నమూనాలు సేకరించే బాటిల్స్ కూడా అందుబాటులో లేక వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఉచిత వైద్యం లేదన్నారుగత నెలలో వైరల్ జ్వరం వచ్చింది. ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఆస్పత్రికి వెళ్లగా ఈ సమస్యకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స లేదని చెప్పడంతో చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. రూ.20 వేలకు పైగానే ఖర్చు అయింది. – పి.వాణి, కాకినాడ జిల్లారూ.30 వేలు డిమాండ్ చేశారు ప్రమాదవశాత్తు కింద పడటంతో మోకాలికి తీవ్ర గాయమైంది. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేస్తారని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లా. పథకం కింద ఉచితంగా సర్జరీ వర్తించినా రూ.30 వేలు అదనంగా ఇవ్వాలన్నారు. డబ్బు కట్టే స్థోమత లేక అనంతపురం జీజీహెచ్కు వెళ్లా. రూ.వేలు ఇవ్వాలంటే నాలాంటి పేదల పరిస్థితి ఏమిటి?– చంద్రశేఖర్, పోతులగాగేపల్లి, శ్రీసత్యసాయి జిల్లాకార్డున్నా ఆపరేషన్ చేయలేదునా భర్త రఫీ కొద్ది నెలల క్రితం ప్రమాదవశాత్తు కింద పడటంతో ఎడమచేతికి గాయమైంది. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే ఫ్రాక్చర్ అయిందన్నారు. మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఆ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ఉన్నప్పటికీ ఉచిత చికిత్సకు నిరాకరించారు. – ఆసియా, అనంతపురంఆరోగ్యశ్రీలో క్యాన్సర్ వైద్యం బంద్!సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పేద క్యాన్సర్ రోగులకు పెద్ద కష్టం వచ్చిపడింది. విశాఖలో క్యాన్సర్ చికిత్సను అందించే ప్రముఖ ఆస్పత్రి హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) ద్వారా అందించే క్యాన్సర్ చికిత్సలను నిలిపివేసింది. ఆరోగ్యశ్రీ కింద ఈ ఆస్పత్రికి భారీగా బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అధునాతన పరికరాలతోపాటు వైద్య నిపుణులు, సిబ్బంది ఉన్న ఈ ఆస్పత్రికి ప్రధానంగా ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. వారం రోజులుగా ఆరోగ్యశ్రీ కింద సేవలు నిలిపివేయడంతో పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దివంగత సీఎం వైఎస్ చొరవతో... ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు గతంలో క్యాన్సర్కు చికిత్స కోసం హైదరాబాద్ లేదా ముంబైకి వెళ్లాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోనే క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్ణయించారు. హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) ద్వారా 77 ఎకరాలను కేటాయించారు. రూ.540 కోట్లతో ఏర్పాటైన ఈ ప్రముఖ సంస్థలో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన అధునాతన పరికరాలతోపాటు మంచి వైద్య నిపుణులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్, టాటా మెమోరియల్ సెంటర్ల సంయుక్త సహకారంతో ఈ క్యాన్సర్ ఆస్పత్రి 2014 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 200 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం సేవలు నిలిచిపోవడంతో క్యాన్సర్ బాధిత పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు మూడు రోజుల క్రితం మా మామయ్యని తీసుకుని ఆస్పత్రికి వెళ్లాం. క్యాన్సర్ స్టేజ్–2లో ఉందని వైద్యులు చెప్పారు. దీంతో హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. డబ్బులు చెల్లిస్తేనే సేవలు అందుతాయని సిబ్బంది చెప్పారు. చేసేదేమీ లేక వెనుదిరిగాం. ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించకపోవడం వల్లే నిలిపివేశామని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. నిరుపేద రోగులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూడాలి. – ఎస్.శంకరరావు, అగనంపూడి నిర్వాసిత కాలనీ, విశాఖపట్నం -
ఆయుష్షు పెంచే ‘ఏఐ’
సాక్షి, విశాఖపట్నం: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ).. అన్ని రంగాల్లోనూ ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సమూల మార్పులు తెస్తోంది. అత్యంత వేగంగా, కచ్చితత్వంతో కూడిన ఫలితాలతో ప్రపంచాన్ని మార్చేస్తోంది. వైద్య రంగంలోనూ వేగంగా చొచ్చుకు వస్తున్న ఈ కృత్రిమ మేధ మనిషి ఆయుష్షును పెంచడానికి కూడా దోహద పడుతుందని ప్రఖ్యాత వైద్య నిపుణులు, అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ ప్రెసిడెంట్ డా. ప్రతీక్ శర్మ తెలిపారు. భవిష్యత్తులో వైద్య రంగాన్ని కృత్రిమ మేధ (ఏఐ) శాసిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలు ప్రజలకు చేరువ చేసే విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయని ఆయన చెప్పారు. విశాఖలో జరిగిన డీప్టెక్ సదస్సులో పాల్గొన్న డా. ప్రతీక్ శర్మ వైద్య రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.ఇప్పుడు 6% మాత్రమే ఉపయోగిస్తున్నాంకృత్రిమ మేధ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నా.. వైద్య రంగంలో మాత్రం అట్టడుగున ఉంది. వైద్య సేవల రంగంలో ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు కీలక ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రంగంలో ఏఐ వినియోగం పెంచడానికి అన్ని దేశాలూ సంస్కరణలు కూడా తెస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే హెల్త్ కేర్లో ఏఐ సేవలు 6 శాతమే. 2022కి యూఎస్లో ఏఐ అడాప్షన్ రేట్ 19 శాతమే ఉంది.2047కి 85 శాతం వరకూ పెరిగే సూచనలున్నాయి. ఇది వైద్య సేవల్ని వేగవంతం చేయడమే కాకుండా మనిషి ఆయుష్షును పెంచేందుకు కూడా దోహదపడుతుందని భావిస్తున్నాం. ఏఐ వినియోగంతో రోగ నిర్థారణ, సలహాలు, చికిత్సల్లో కచ్చితత్వం వస్తుంది. చాలా సమయం ఆదా అవుతుంది. ఔషధ పరిశోధనల్లోనూ ఏఐ సేవలు విస్త్రృతమవుతున్నాయి.హెల్త్కేర్ ఏఐలోభారీ పెట్టుబడులు..హెల్త్ కేర్లో ఏఐ వినియోగం కోసం అన్ని దేశాలూ పెట్టుబడులు భారీగా పెంచుతున్నాయి. అమెరికా ప్రస్తుతం 28.24 బిలియన్ డాలర్లు మాత్రమే వెచ్చిస్తోంది. 2030కి 187.85 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టాలని నిర్ణయించింది. హెల్త్ కేర్లో ఏఐ వినియోగంలో భారత్ కూడా పురోగమిస్తోంది. భారత్లో 2022కి 0.13 బిలియన్ డాలర్లు మాత్రమే పెట్టుబడులుండగా.. 2030కి 2.92 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ఇది శుభపరిణామమే అయినా.. భారత్ మరింతగా దృష్టి సారిస్తే అద్భుతమైన ఫలితాలు అందుకుంటుంది.వైద్యంలో ఏఐ అప్లికేషన్స్ వినియోగం ఇలా..హెల్త్కేర్లో ఏఐ ఆధారిత అప్లికేషన్లు చాలా వరకూ వినియోగంలో ఉన్నాయి. డయాగ్నసిస్ను మరింతగా మెరుగుపరిచేందుకు, రోగి వైద్య రికార్డుల నిర్వహణ, వ్యక్తిగత వైద్య సేవల అభివృద్ధి, వైద్యులపై పనిభారం తగ్గించడం మొదలైన అంశాలకు సంబంధించిన యాప్స్ ఉన్నాయి. ఇప్పటికే వీటిని అమెరికా, చైనా, రష్యా, జపాన్ వంటి దేశాల్లో ఉపయోగిస్తున్నారు. భారత్లో పేరొందిన ఆస్పత్రుల్లో ఇప్పుడిప్పుడే ఇవి ప్రారంభమవుతున్నాయి.క్యాన్సర్ చికిత్సలో అద్భుత ఫలితాలుక్యాన్సర్ చికిత్సలో ఆంకాలజీ విభాగంలో ఏఐ అద్భుత ఫలితాలు అందిస్తోంది. ప్రాథమిక దశలో బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించడం కష్టతరం. కానీ, అమెరికాలో అతి తక్కువ సమయంలోనే ఏఐ ద్వారా రొమ్ము క్యాన్సర్ని గుర్తించారు. సెర్టిస్ ఏఐ యాప్ ద్వారా ఇది సాధ్యమవుతోంది. ఏఐ–డ్రివెన్ ఆంకాలజీ డ్రగ్ డిస్కవరీతో ఫలితాలు రాబడుతున్నారు. ఊపిరితిత్తులు, మెదడు, మెడ, చర్మ సంబంధమైన క్యాన్సర్ల గుర్తింపు ఫలితాలు కూడా వీలైనంత త్వరగా అందించేలా యాప్ల అభివృద్ధి జరుగుతోంది.మారుమూల పల్లెలకూ వైద్య సేవలుఏఐ ద్వారా మారుమూల గ్రామాలకూ వైద్య సేవలు చేరువవుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఈ ఫోన్లో ఏఐ ఉంటే.. ఆ ఫోన్ కూడా ఒక డాక్టర్గా మారిపోతుంది. ఏఐ డ్రివెన్ రిమోట్ కేర్ యాప్తో మారుమూల పల్లెల్లో ఉన్న రోగితో డాక్టర్ నేరుగా మాట్లాడి.. బీపీ, పల్స్ చెక్ చేసే వ్యవస్థ అందుబాటులోకి వచ్చేసింది. వైద్యుల అపాయింట్మెంట్, వైద్య సలహాలు, సూచనల్ని చాట్బాట్ ద్వారా అందించే రోజులు కూడా వచ్చేశాయి. -
చికిత్స ఏదైతేనేం... సాంత్వనే ముఖ్యం!
కేన్సర్ వ్యాధిపై మరోసారి చర్చ మొదలైంది. అల్లోపతి పద్ధతులు మేలైనవా? లేక ప్రాచీన ఆయుర్వేదమే గట్టిదా అన్న ఈ చర్చకు ప్రముఖ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కారణమయ్యారు. సిద్ధూ భార్య, స్వయానా అల్లోపతి డాక్టర్ అయిన నవజోత్ కౌర్ సిద్ధూ ఆయుర్వేద పద్ధతు లను అవలంబించిన కారణంగానే కేన్సర్ నుంచి విముక్తు రాలినైనట్లు చెప్పడం ఒక రకంగా తేనెతుట్టెను కదిపి నట్లయింది. దేశంలోనే ప్రముఖ కేన్సర్ చికిత్సా కేంద్రం ‘టాటా మెమోరియల్ హాస్పిటల్’ ఇప్పటికే సిద్ధూ మాటలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనీ, శాస్త్రీయ పద్ధతుల్లో నిరూపణ అయిన చికిత్స పద్ధతులకే ప్రాధాన్య మివ్వాలనీ హెచ్చరించగా... తామేం చేశామో, ఎలా చేశామో వివరించేందుకు సిద్ధూ కూడా రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో రెండు వైద్యవిధానాల మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈ వ్యాసం.పిండంతో మొదలై మరణించేంతవరకూ జరిగే కణ విభజన ప్రక్రియలో వచ్చే తేడా ఈ కేన్సర్ మహమ్మారికి కారణం. అదుపు తప్పి విచ్చలవిడిగా విభజితమయ్యే కణాలు కణితిగా ఏర్పడటం లేదా అవయవాల పనిని అడ్డుకునే స్థాయిలో మితిమీరి పెరిగిపోవడం జరుగుతూంటుంది. శతాబ్దాలుగా మనిషిని పట్టిపీడిస్తున్న ఈ వ్యాధికి అల్లోపతి సూచించే వైద్యం... శస్త్రచికిత్స, రేడియేషన్, కీమో థెరపీ! వ్యాధి ముదిరిన స్థాయిని బట్టి, ఏ అవయ వానికి సోకిందన్న అంశం ఆధారంగా ఈ మూడింటిని లేదా విడివిడిగా, రెండింటిని కలిపి వాడుతూంటారు. అయితే శస్త్రచికిత్స తరువాత కూడా కేన్సర్ మళ్లీ తిరగ బెట్టవచ్చు.రేడియేషన్, కీమోథెరపీలు శరీరాన్ని గుల్ల బార్చేంత బాధాకరమైన ప్రక్రియలు. అందుకే చాలామంది చెప్పేదేమిటంటే... కేన్సర్ వ్యాధితో కంటే దానికి చేసే చికిత్సతోనే ఎక్కువమంది మరణిస్తూంటారూ అని! కొన్ని దశాబ్దాలుగా పాటిస్తున్న ఈ మూడు రకాల ఆధునిక వైద్య పద్ధతులకు ఇటీవలి కాలంలో కొన్ని వినూత్నమైన చికిత్స పద్ధతులు వచ్చి చేరాయి. రోగ నిరోధక శక్తినే కేన్సర్ కణాలపై దాడి చేసేలా చేయడం (ఇమ్యూనో థెరపీ), కణితులను లక్ష్యంగా చేసుకుని ఆ ప్రాంతానికి మాత్రమే రేడియేషన్ అందించడం (ప్రిసిషన్ ఆంకాలజీ), తక్కువ డోసు కీమోథెరపీ మందులను ఎక్కువసార్లు ఇవ్వడం (భారత్లో ఆవిష్కృతమైన పద్ధతి) మునుపటి వాటి కంటే కొంత మెరుగైన ఫలితాలిస్తున్నాయి. అయితే ఈ రోజు వరకూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంచనా ఏమిటీ అంటే... కేన్సర్కు చికిత్స లేదు అని! కాకపోతే మరణాన్ని కొన్నేళ్లపాటు వాయిదా వేయడం మాత్రం సాధ్యమైంది. అది ఐదేళ్లా? (సర్వైవల్ రేట్) పదేళ్లా అన్న చర్చ వేరే!ప్రత్యామ్నాయ పద్ధతుల మాటేమిటి?వేల సంవత్సరాల మానవజాతి పయనంలో ఎంతో ప్రగతి సాధించినమాట నిజమే. కానీ ఇప్పటికీ కనీసం మనిషి తాను నివసిస్తున్న భూమిని పూర్తిగా అర్థం చేసుకో గలిగాడా? లేదనే చెప్పాలి. చేసుకోగలిగి ఉంటే... వాతా వరణ కాలుష్యం లాంటి సమస్యకైనా... కేన్సర్ లాంటి వ్యాధి చికిత్సకైనా ఎప్పుడో పరిష్కారాలు దొరికి ఉండేవి. దొరకలేదు కాబట్టే ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కొత్త కొత్త పద్ధతులు, మందులు కనుక్కుంటున్నారు. వ్యాధులను జయించే దిశగా ప్రయాణిస్తు న్నారు. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త సుబ్రమణ్యం చంద్ర శేఖర్ మాటలను ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిఉంటుంది. సైన్స్... సత్యాన్వేషణకు జరిగే నిరంతర ప్రయాణమంటారాయన. విశ్వ రహస్యాలను ఛేదించేందుకు ఈ ప్రయాణంలో ఎప్పటికప్పుడు మనం కొత్త మైలు రాళ్లను చేరుకుంటూ ఉంటామే తప్ప... అంతిమ సత్యాన్ని ఆవిష్కరించలేము అని మనం అర్థం చేసుకోవాలి.కేన్సర్ విషయానికే వద్దాం... అల్లోపతి విధానాల్లోని లోటుపాట్లను గుర్తించిన చాలామంది వైద్యులు ప్రత్యా మ్నాయ మార్గాలపై కూడా చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఆయుర్వేదం కూడా వీటిల్లో ఒకటి. కానీ... ఆయుర్వేదంలో ఉన్న చిక్కు గురించి ఐఐసీటీ మాజీ డైరెక్టర్ ఒకరి మాటలు వింటే సమస్య ఏమిటన్నదికొంత అవగతమవుతుంది. ఆయుర్వేదంలో ఉపయోగించే మొక్కల్లో కొన్ని వందలు, వేల రసాయనాలు ఉంటాయి. వాటిల్లో ఏ రసాయనం, లేదా కొన్ని రసాయనాల మిశ్రమం వ్యాధి చికిత్సలో ఉపయోగపడిందో తెలుసు కోవడం కష్టమని ఆయన చెబుతారు. నిజం కావచ్చు కానీ... పాటించే పద్ధతీ, ఏ రసాయనం ఉపయోగపడిందో కచ్చితంగా మనకు తెలియాల్సిన అవసరముందా? రోగికి మేలు జరిగితే చాలు కదా? పైగా ఆయుర్వేదాన్ని, ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులను కూడా శాస్త్రవేత్తలు అను మానపు దృష్టితోనే చూశారు. చాలా కొద్దిమంది అందు లోని సైన్స్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పాలి. అల్లోపతి వైద్యం ఫూల్ ప్రూఫా? కానేకాదు. ఒక మందు తయారయ్యేందుకు పది పన్నెండేళ్లు పట్టడం ఒక విషయమైతే... దాదాపు ప్రతి మందుతోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొన్ని కేన్సర్కూ కారణమవుతూండటం చెప్పు కోవాలి.అల్లోపతితోనే వినూత్నంగా...కేన్సర్ విషయంలో అల్లోపతి, ఆయుర్వేదాల మధ్య చర్చ ఒకపక్క ఇలా నడుస్తూండగానే... అమెరికాలో ఇంకో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. డా‘‘ ఇల్యెస్ బాగ్లీ, పియెరిక్ మార్టినెజ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఐవర్ మెక్టిన్, మెబెండజోల్, ఫెన్బెండజోల్ వంటి మాత్రలను కేన్సర్పై ప్రయోగించారు. ఈ మందులు మామూలుగా పేవుల్లోని హానికారక పరాన్నజీవులను నాశనం చేసేందుకు వాడుతూంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమి టంటే... ఐవర్ మెక్టిన్, మెబెండజోల్ మాత్రలతో కొంత మంది వైద్యులు అభివృద్ధి చేసిన చికిత్స పద్ధతి అద్భుతంగా పనిచేయడం. పైగా... శాస్త్రవేత్తలు కొందరు ఈ పద్ధతి, ఫలితాలను ధ్రువీకరించడం. ఫలితంగా ఈ పద్ధతి ‘జర్నల్ ఆఫ్ ఆర్థో మాలిక్యులర్ మెడిసిన్’లో ‘టార్గెటింగ్ ద మైటోకాండ్రియల్ స్టెమ్ సెల్ కనెక్షన్ ఇన్ కేన్సర్ ట్రీట్మెంట్’ పేరుతో ఈ ఏడాది సెప్టెంబరు 19న ప్రచురి తమైంది.ఇల్యెస్ బాగ్లీ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఆర్థో మాలిక్యులర్ మెడిసిన్ అధ్యక్షుడు. అల్జీరియా దేశస్థుడు. పియెరిక్ మార్టినెజ్ కేన్సర్ పరిశోధనల్లో బాగ్లీతో కలిసి పనిచేశారు. థైరాయిడ్ కేన్సర్తో పాటు నవ్జోత్ కౌర్ సిద్ధూను వేధించిన రొమ్ము కేన్సర్, పాంక్రియాస్ కేన్సర్లపై ఈ రెండు మందులు ప్రభావం చూపుతున్నట్లు ప్రస్తుతా నికి ఉన్న సమాచారం. మరిన్ని కేన్సర్లపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.ఒకప్పుడు గుర్రాల్లో పురుగులను తొలగించేందుకు వాడిన ఐవర్ మెక్టిన్లో కేన్సర్ కణాలను మట్టుబెట్టగల కనీసం 15 మూలకాలు ఉన్నట్లు తాజా పరిశోధనలు చెబుతున్నాయి. డా‘‘ బాగ్లీ, డా‘‘ మార్టినెజ్ వంటి వారు సంప్రదాయవాదుల మాటలకే కట్టుబడి ఈ ప్రయోగం చేసి ఉండకపోతే... కేన్సర్ చికిత్సకు ఇతర మార్గాలూ ఉన్నాయన్న విషయం ఎప్పటికీ తెలిసి ఉండేది కాదేమో.చివరగా... ఒక్క విషయం: కేన్సర్ చికిత్సకు ఐవర్ మెక్టిన్, ఫెన్బెండజోల్ల వాడకానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అనుమతులూ లేవు. కాబట్టి.. పరిశోధన ఫలితాలను రూఢి చేసుకోవడంతోపాటు మరిన్ని చేప ట్టడం కూడా అవసరం. అంత వరకూ మనం కేన్సర్ మహ మ్మారికి అణిగిమణిగి ఉండా లన్నది నిష్ఠుర సత్యం!– గిళియారు గోపాలకృష్ణ మయ్యాసీనియర్ జర్నలిస్ట్ -
క్యాన్సర్ చికిత్సలో జుట్టుకు శ్రీరామరక్ష
క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ అక్షరాలా నరకప్రాయం. శరీరమంతటినీ నిస్తేజంగా మార్చేస్తుంది. పైగా దాని సైడ్ ఎఫెక్టులు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ముఖ్యమైనది జుట్టు రాలడం. కనీసం 65 శాతానికి పైగా రోగుల్లో ఇది పరిపాటి. రొమ్ము క్యాన్సర్ బాధితుల్లోనైతే చికిత్ర క్రమంలో దాదాపు అందరికీ జుట్టు పూర్తిగా రాలిపోతుంటుంది. ఈ బాధలు పడలేక కీమోథెరపీకి నిరాకరించే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్లందరికీ ఇది శుభవార్తే. కీమోథెరపీ సందర్భంగా హెల్మెట్ వంటి ఈ హెడ్గేర్ ధరిస్తే చాలు. జుట్టు రాలదు గాక రాలదు!స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీ ఐర్లండ్కు చెందిన ల్యూమినేట్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న హెల్మెట్ను తయారు చేసింది. దీన్ని స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీగా పిలుస్తున్నారు. చికిత్స జరుగుతన్నంతసేపూ రోగి ఈ హెడ్గేర్ ధరిస్తాడు. దాన్ని ఓ యంత్రానికి అనుసంధానిస్తారు. దానిగుండా తల మొత్తానికీ చల్లని ద్రవం వంటిది సరఫరా అవుతూ ఉంటుంది. అది తలలోని జుట్టు కుదుళ్లకు రక్త సరఫరాను బాగా తగ్గిస్తుంది. తద్వారా ఆ ప్రాంతానికి చేరే క్యాన్సర్ ఔషధాల పరిమాణం చాలావరకు తగ్గుతుంది. దాంతో వాటి దు్రష్పభావం జుట్టుపై పడదు. కనుక అది ఊడకుండా ఉంటుంది. ‘‘ఈ హెడ్గేర్ను ఇప్పటికే యూరప్లో ప్రయోగాత్మకంగా పరీక్షించగా 75 శాతానికి పైగా రోగుల్లో జుట్టు ఏ మాత్రమూ ఊడలేదు. మిగతా వారిలోనూ జుట్టు ఊడటం 50 శాతానికి పైగా తగ్గింది. రొమ్ము క్యాన్సర్ రోగుల్లోనైతే 12 సెషన్ల కీమో థెరపీ అనంతరం కూడా జుట్టు దాదాపుగా పూర్తిగా నిలిచి ఉండటం విశేషం’’ అని కంపెనీ సీఈవో ఆరన్ హానన్ చెప్పారు. అంతేగాక వారి లో ఎవరికీ దీనివల్ల సైడ్ ఎఫెక్టులు కని్పంచలేదన్నారు. రొ మ్ము క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టంతా పోగొట్టుకున్న ఓ యువ తిని చూసి ఆయన చలించిపోయారట. ఆ బాధలోంచి పురు డు పోసుకున్న ఈ హెల్మెట్కు లిలీ అని పేరు కూడా పెట్టారు! వచ్చే ఏడాది యూరప్, అమెరికాల్లో దీని క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టనున్నారు. అవి విజయవంతం కాగానే తొలుత యూఎస్ మార్కెట్లో ఈ హెల్మెట్ను అందుబాటులోకి తెస్తారట. దీనికి క్యాన్సర్ రోగుల నుంచి విశేషమైన ఆదరణ దక్కడం ఖాయమంటున్నారు.లోపాలూ లేకపోలేదు అయితే ఈ స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీలో కొన్ని లోపాలూ లేకపోలేదు. కీమో సెషన్ జరిగినప్పుడల్లా చికిత్సకు ముందు, సెషన్ సందర్భంగా, ముగిశాక హెడ్గేర్ థెరపీ చేయించుకోవాలి. ఇందుకు కీమోపై వెచి్చంచే దానికంటే కనీసం రెండు మూడు రెట్ల సమయం పడుతుందని హానన్ వివరించారు. ముఖ్యంగా చికిత్స పూర్తయిన వెంటనే హెల్మెట్ను కనీసం 90 నిమిషాల పాటు ధరించాల్సి ఉంటుందని చెప్పారు. పైగా దీనివల్ల తలంతా చెప్పలేనంత చల్లదనం వ్యాపిస్తుంది. ఇలాంటి లోటుపాట్లను అధిగమించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు హానన్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేన్సర్ కణాలపై అణువుల సుత్తి!
కేన్సర్... పేరు చెప్పగానే మరణం ఖాయమన్న ఆలోచనలు అందరిలోనూ మెదులుతాయి. అయితే అత్యాధునిక టెక్నాలజీ, పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు కేన్సర్ వ్యాధి నిర్వహణ ఎంతో సులువైంది. కాకపోతే ప్రస్తుతం అనుసరిస్తున్న వైద్య పద్ధతులు మూడింటితోనూ బోలెడన్ని సమస్యలు, దుష్ప్రభావాలైతే ఉన్నాయి. అందుకే అతితక్కువ దుష్ప్రభావాలున్న చికిత్స పద్ధతి కోసం శాస్త్రవేత్తలు చాలా చోట్ల పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా రైస్ యూనివర్శిటీ Rice University శాస్త్రవేత్తలు విజయం సాధించారు కూడా. ప్రత్యేకమైన కాంతి, కొన్ని అణువుల సాయంతో 99 శాతం కేన్సర్ కణాలను చంపేయవచ్చునని వీరు నిరూపించారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు ప్రధానంగా మూడు రకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు. ► శస్త్రచికిత్స కణితిని తొలగించేందుకు చేసే శస్త్రచికిత్స(సర్జరీ) ఇది శరీరాన్ని బలహీన పరిచే ప్రక్రియ. ►ఇక రెండోది కీమో థెరపీ ఇందులో రేడియోధార్మిక రసాయనాల సాయంతో శరీరంలోని కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారు. జుట్టు ఊడిపోవడం, వాంతులు, విరేచనాలు, అలవిగాని అలసట.. ఇలా రకరకాల దుష్ప్రభావాలు తప్పవు. ► మూడో పద్ధతి.. రేడియో థెరపీ రేడియో ధార్మిక పదార్థాలతో నేరుగా కణితులను నాశనం చేసేందుకు వాడే పద్ధతి ఇది కీమోథెరపీతో వచ్చే ఇబ్బందులే ఇక్కడ కూడా కనిపిస్తాయి ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ప్రిసిషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ వంటివి మునుపటి పద్ధతుల కంటే కొంత మెరుగ్గా ఉన్నా... శాస్త్రవేత్తలు వీటిపై మరింత పట్టు సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్తగా ఏం చేశారంటే.. చాలా సింపుల్. అమైనో సయనైన్ అణువులు కొన్నింటిని తీసుకున్నారు. పరారుణ కాంతి కిరణాల ద్వారా వాటిని ఉత్తేజపరిచారు. ఫలితంగా ఈ అణువులు కంపించడం మొదలుపెట్టాయి. ఇలా కంపిస్తున్న అణువులను దగ్గరగా ఉంచడం ద్వారా కేన్సర్ కణాల పైపొరలు విచ్ఛిన్నమై నాశనమయ్యేలా చేశారు. అంతే!! ఈ అమైనో సయనైన్ అణువులను శరీరం లోపలి అవయవాల ఫొటోలు తీసేందుకు ఒక రకమైన రంగు మాదిరిగా ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. పరారుణ కాంతి పడినప్పుడు వీటిల్లోని అణువులు ఉత్తేజితమై ప్లాస్మాన్లుగా మారుతున్నాయి. అణువు లోపలే కంపిస్తూ ఉంటాయి. ఈ కంపనాలు కాస్తా కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమయ్యేందుకు కారణమవుతున్నాయి. పరారుణ కాంతి వినియోగానికీ ప్రాముఖ్యత ఉంది. ఈ కాంతి శరీరం లోపలికి దృశ్యకాంతి కంటే లోతుగా చొచ్చుకుపోగలదు. శరీరం లోపలి అవయవాలు మాత్రమే కాకుండా.. ఎముకలకు వచ్చే కేన్సర్లకు కూడా ఈ కాంతి ద్వారా చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నమాట. ఈ పద్ధతి పనితీరుపై రైస్ యూనివర్శిటీ రసాయన శాస్త్రవేత్త జేమ్స్ టూర్ మాట్లాడుతూ.. కంపనాలన్నీ క్రమ పద్ధతిలో ఒకేలా ఉండేలా చేయడం వల్ల కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమవుతున్నాయని తెలిపారు. ‘‘నిజానికి ఈ పద్ధతిని కేన్సర్పై అణువుల సుత్తి దెబ్బ’’ అనాలి అంటారు ఆయన. ఎలుకల్లో కేన్సర్ మాయం.. రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గాజు పాత్రలో కేన్సర్ కణాలను ఉంచి అమైనో సైనైన్ అణువులను ప్రయోగించారు. ఆశ్చర్యకరమైన రీతిలో 99 శాతం వరకూ కేన్సర్ కణాలు నశించిపోయాయి. మెలనోమా కేన్సర్ కణితులున్న ఎలుకలపై వాడినప్పుడు కూడా కొంత కాలం తరువాత దాదాపు సగం ఎలుకల్లో కేన్సర్ కణాలన్నవి లేకుండా పోయాయి. ఈ పరిశోధనల్లో రైస్ యూనివర్శిటీతోపాటు టెక్సస్ ఏ అండ్ ఎం, యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్లు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే... నేడో రేపో.. ప్రాణాంతక కేన్సర్ను ఎలాంటి దుష్ప్రభావాలు, శస్త్రచికిత్సల అవసరం లేకుండానే నయం చేసుకోవచ్చునన్నమాట!!! -
రాగితో చౌకగా క్యాన్సర్ మందులు తయారు చేయొచ్చు: సైంటిస్టులు
ఆరోగ్యపరంగా రాగి లోహానికి ఉన్న ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్లుగా ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలో రాగిని వాడుతున్నారు. అయితే ఇప్పుడు రాగిని ఉపయోగించి క్యాన్సర్ డ్రగ్స్ మెడిసిన్స్ను చవకగా తయారు చేయొచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ సైంటస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది. సాధరణంగా క్యాన్సర్ చికిత్సకు వాడే మందులు తయారు చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ. 2 లక్షల 60 వేలకు పైగా ఖర్చు అయితే, రాగిని ఉపయోగించి మెడిసిన్స్ చేయడం వల్ల ఒక గ్రాముకు కేవలం రూ. 250 రూపాయలే అవుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్లో తేల్చారు. దీని వల్ల భవిష్యత్తులో చవకగా ఔషధాలు తయారు చేసేందుకు మార్గం సుగుమం అయ్యింది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే. మనిషి మొదటగా కనుక్కొని వాడిన లోహం రాగి. కొన్ని వేల ఏళ్లుగా మనం రాగి వస్తువులను, రాగి పాత్రలను వాడుతూనే ఉన్నాం. దీన్ని తామ్రము అని, క్యూప్రమ్ అని కూడా అంటారు. రాగితో చేసిన పాత్రలను వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పలు అధ్యయనాల్లో ఇప్పటికే రుజువైంది. నీటిలో ఉండే బాక్టీరియాను నశింపజేసే శక్తి కూడా రాగికి ఉందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. రాగి లోహాలను వాడటం వల్ల అనేక రోగాలు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా,చవకగా దొరికే లోహాల్లో రాగి ఒకటి. దీనికి ఉండే ఔషధ గుణాల రీత్యా క్యాన్సర్ చికిత్సలోనూ వాడేందుకు అనువుగా ఉందని ప్రొఫెసర్ ఓహ్యున్ క్వాన్ అన్నారు. క్యాన్సర్ చికిత్సలో సాధారణంగా వాడే మందుల తయారీకి ఒక గ్రాముకు రూ. 2లక్షల 60 వేల(3వేల డాలర్లు)ఖర్చవగా, రాగిని ఉపయోగించి అదే ఔషధాన్ని తయారు చేసేందుకు కేవలం రూ.250 మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా క్యాన్సర్ వ్యతిరేక c-Jun N- టెర్మినల్ కినేస్ ఇన్హిబిటర్ను కేవలం మూడు దశల్లోనే ఉత్పత్తి చేయగలిగారు. సాధారణంగా దీనికి 12 రసాయనిక చర్యలు అవసరం అవుతాయి. ఇందులో అడెనోసిన్, N6-మిథైలాడెనోసిన్ను సులువుగా అమైన్గా మార్చగలదు. కణాలు, వ్యాధి ప్రక్రియలు మరియు అభివృద్ధిలో జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో ఈ అమైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతమున్న క్యాన్సర్ చికిత్సలో దీన్ని ఉత్పత్తి చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ.8వేల 500($103)కు పైగా ఖర్చవుతుంది. అదే రాగిని ఉపయోగించడం వల్ల చాలా చవకగా ఔషధాలను తయారు చేయొచ్చని, భవిష్యత్తులో ఈ పద్దతి మరింత సులభతరం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక ట్రీట్మెంట్.. మొదటి హాస్పిటల్గా గుర్తింపు
అపోలో క్యాన్సర్ సెంటర్ సరికొత్త మైలురాయిని చేరుకుంది.దక్షిణాసియాలో మొట్టమొదటి సైబర్నైఫ్(CyberKnife® S7™ FIM) రోబోటిక్ రేడియో సర్జరీ సిస్టమ్ను అపోలో క్యాన్సర్ సెంటర్లో ప్రవేశపెట్టారు.సైబర్నైఫ్ సిస్టమ్ అనేది క్యాన్సర్, చికిత్స చేయలేని క్యాన్సర్ కణితులకు రేడియేషన్ థెరపీని అందించే నాన్-ఇన్వాసివ్ చికిత్స. ఇది మెదడు, ఊపిరితిత్తులు, వెన్నెముక, ప్రోస్టేట్ ,పొత్తికడుపు క్యాన్సర్లతో సహా శరీరం అంతటా క్యాన్సర్ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయంగా ఈ విధానం అందుబాటులో ఉంది. గతంలో రేడియేషన్తో చికిత్స పొందిన రోగులు, మెటాస్టాటిక్ గాయాలు పునరావృత క్యాన్సర్లు ఉన్నవారు కూడా సైబర్నైఫ్ చికిత్స తీసుకోవచ్చు. సైబర్నైఫ్ సిస్టమ్ అనేది రేడియేషన్ డెలివరీ పరికరాన్ని కలిగి ఉన్న ఏకైక రేడియేషన్ డెలివరీ సిస్టమ్. దీన్ని లీనియర్ యాక్సిలరేటర్ అని పిలుస్తారు, రేడియేషన్ థెరపీలో ఉపయోగించే హై-ఎనర్జీ X-కిరణాలు లేదా ఫోటాన్లను పంపిణీ చేయడానికి నేరుగా రోబోట్పై అమర్చబడుతుంది. ఇది వేలాది బీమ్ కోణాల నుంచి మోతాదులను అందించడానికి,శరీరంలో ఎక్కడైనా డెలివరీ ఖచ్చితత్వానికి కొత్త ప్రమాణాన్ని సెట్ చేయడానికి రోబోట్ను ఉపయోగిస్తారు. అపోలో క్యాన్సర్ సెంటర్లో గత 15 సంవత్సరాలుగా సైబర్నైఫ్ టెక్నాలజీని ఉపయోగించడంలో నైపుణ్యం కలిగిన నిపుణుల బృందం ఉంది. ఇప్పటివరకు, ఇక్కడ మూడు వేల క్యాన్సర్ కేసులను పర్యవేక్షించారు.ఇప్పుడు సైబర్నైఫ్ సిస్టమ్ను ప్రారంభించి క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన విధానాన్ని విప్లవాత్మకంగా ప్రారంభించి దక్షిణాసియాలో మొదటి సంస్థగా నిలిచింది.సైబర్నైఫ్లో సర్టిఫైడ్ ఫెలోషిప్ శిక్షణా కార్యక్రమాన్ని అందించినందుకు గానూ అపోలో క్యాన్సర్ సెంటర్ దేశంలోనే మొదటి సంస్టగా గుర్తింపు పొందింది. సీనియర్ కన్సల్టెంట్ – రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ మహదేవ్ పోతరాజు మాట్లాడుతూ..సైబర్నైఫ్ చికిత్సలుసాధారణంగా 1-5 సెషన్లలో నిర్వహించబడతాయి. చికిత్స వ్యవధి సాధారణంగా 30-90నిమిషాల వరకు ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో అనస్థీషియా లేదా కోతలు అవసరం లేదు.చాలా మంది రోగులు చికిత్స సమయంలో రోజువారీ కార్యకలాపాలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది అని అన్నారు. -
క్యాన్సర్ బాధితులకు ‘ఆరోగ్యసిరులు’
క్యాన్సర్ బారినపడిన పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ కొండంత అండగా ఉంటోంది. 2019 నుంచి ఇప్పటివరకు 2.64 లక్షల మంది బాధితులకు జగన్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఉచితంగా చికిత్స అందించింది. ఇందుకోసం రూ.1,801 కోట్లు ఖర్చుచేసింది. ఈ ఫొటోలో మంచంపై ఉన్న మహిళ పేరు కె. సువార్త. ఈమెది పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెం గ్రామం. పొదుపు సంఘాల ఆర్పీగా పనిచేస్తోంది. భర్త ఆటో డ్రైవర్. కొద్దినెలల క్రితం గొంతులో సమస్య మొదలైంది. క్రమంగా ఆ సమస్య తీవ్రమై ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా మారింది. దీంతో వైద్యులను సంప్రదిస్తే.. గొంతు క్యాన్సర్గా నిర్ధారించారు. ఉన్నంతలో సంతోషంగా జీవించే ఆ కుటుంబంలో ఆందోళన మొదలైంది. ఇంతలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్కు ఉచిత వైద్యం లభిస్తుందని తెలియడం రాజేశ్కు ఎంతో ఊరటనిచ్చింది. దీంతో విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి భార్యను తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకూ నా కుటుంబానికి సీఎం జగన్ ప్రభుత్వం అనేక పథకాలు అందించింది. ఇప్పుడు నా ఇల్లాలు క్యాన్సర్తో బాధపడుతుంటే ఉచిత వైద్యం కూడా అందిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే ఈ రోజున నా భార్యను బతికించుకునేందుకు నేను ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చేదో’’.. అని అంటున్నాడు. – సాక్షి, అమరావతి ఇలా సువార్తలాగే క్యాన్సర్ బారినపడ్డ పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం కొండంత అండగా ఉంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకం పరిధిని సీఎం జగన్ విస్తరించారు. టీడీపీ ప్రభుత్వంలో 1,059గా ఉన్న ప్రొసీజర్స్ను ఏకంగా 3,257కు పెంచారు. అలాగే, టీడీపీ హయాంలో 200లోపు మాత్రమే క్యాన్సర్ ప్రొసీజర్లు ఉండగా ప్రస్తుతం 400కు పైగా క్యాన్సర్ ప్రొసీజర్లు పథకం పరిధిలోకి వచ్చాయి. లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) బాధితులకు నిర్వహించే అత్యంత ఖరీదైన బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ను ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారు. అలాగే, రూ.10 లక్షలు, ఆపైన ఖర్చయ్యే ఈ ప్రొసీజర్ను పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఇలా ఏ తరహా క్యాన్సర్కైనా ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స లభిస్తోంది. ఒక్క క్యాన్సరే కాకుండా.. క్యాన్సర్కే కాక.. హృద్రోగాలు, కిడ్నీ, లివర్ ఇలా వివిధ రకాల చికిత్సలు ఆరోగ్యశ్రీ ద్వారా బాధితులకు ఉచితంగా అందుతున్నాయి. అదే టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంతో అప్పట్లో పేదలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. కానీ, ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం తీసుకొస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలతో పేద, మధ్యతరగతి ప్రజలకు భారీ మేలు చేకూరుతోంది. ప్రొసీజర్లను 3,257కి పెంచి 2019 నుంచి ఇప్పటికి 40 లక్షల మందికి ఉచిత వైద్యం అందించారు. చికిత్స అనంతరం విశ్రాంత సమయానికి ఆరోగ్య ఆసరా కింద కూడా అండగా నిలుస్తున్నారు. ఇలా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం 2019 నుంచి ఇప్పటికి రూ.10వేల కోట్లకు పైగా జగన్ సర్కార్ ఖర్చుచేసింది. ప్రభుత్వమే నా మనవరాలిని బతికించింది.. నా మనవరాలికి బ్లడ్ క్యాన్సర్. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. మమ్మల్ని ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంది. ఒకరోజు జీవచ్ఛవంలా పడిపోయిన పాపను ఎత్తుకుని విజయవాడలోని హెచ్సీజీ ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పాపకు వైద్యం మొదలుపెట్టారు. ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది. ఈరోజు నా మనవరాలి ప్రాణాలను సీఎం జగన్ ప్రభుత్వం కాపాడింది. – శాంతకుమారి, విజయవాడ 2.64 లక్షల మందికి వైద్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కింద 2,64,532 మంది క్యాన్సర్ బాధితులకు ఉచితంగా వైద్యం అందించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.1,801.30 కోట్లు ఖర్చుచేసింది. ఇదే 2014–19 మధ్య టీడీపీ హయాంలో క్యాన్సర్ చికిత్సకు కేవలం రూ.751.56 కోట్లు ఖర్చుచేశారు. అంటే.. నాలుగేళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం టీడీపీ కంటే రూ.1,049.74కోట్లు అదనంగా ఖర్చుచేసింది. ప్రభుత్వమే నా మనవరాలిని బతికించింది.. నా మనవరాలికి బ్లడ్ క్యాన్సర్. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. మమ్మల్ని ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంది. ఒకరోజు జీవచ్ఛవంలా పడిపోయిన పాపను ఎత్తుకుని విజయవాడలోని హెచ్సీజీ ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పాపకు వైద్యం మొదలుపెట్టారు. ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది. ఈరోజు నా మనవరాలి ప్రాణాలను సీఎం జగన్ ప్రభుత్వం కాపాడింది. – శాంతకుమారి, విజయవాడ ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే.. మా నాన్నకు గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆయన కౌలు రైతు. వ్యవసాయం మీద వచ్చే ఆదాయంతో వాళ్లు జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ చికిత్సకు సొంతంగా ఖర్చుపెట్టే స్థోమత లేదు. ఆరోగ్యశ్రీ పథకం మా నాన్నను ఆదుకుంది. పథకం లేకపోయి ఉంటే ఎంతో కష్టంగా ఉండేది. ఈ మేలును ఎప్పటికీ మరువలేం. – ప్రశాంతి, శృంగవృక్షం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా పూర్తి ఉచితంగా వైద్యం.. అన్ని రకాల క్యాన్సర్తో పాటు, రూ.వెయ్యి వైద్యం ఖర్చు దాటే ప్రతి ప్రొసీజర్ను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. అర్హులైన లబ్దిదారులకు ఉచితంగా వైద్యం అందేలా చూస్తున్నాం. చికిత్స అనంతరం రోగుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. మెజారిటీ శాతం సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పథకాన్ని మరింతగా మెరుగుపరచడానికి నిరంతరం కసరత్తు చేస్తున్నాం. – ఎంఎన్ హరేంధిరప్రసాద్, సీఈఓ, డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
లెవల్–1 క్యాన్సర్ సెంటర్గా గుంటూరు
సాక్షి, అమరావతి : ప్రభుత్వరంగ ఆస్పత్రుల్లోనే క్యాన్సర్కు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ముమ్మరం చేసింది. వ్యాధి నియంత్రణ, నివారణకు సీఎం వైఎస్ జగన్ ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ వైద్యం కోసం బాధితులు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పనిలేకుండా అన్ని ప్రాంతాల్లో 50 కి.మీ పరిధిలోనే వైద్య సదుపాయాలను కల్పించేలా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ రోడ్ మ్యాప్ను రాష్ట్ర వైద్యశాఖ రూపొందించింది. తొలిదశ కింద.. గుంటూరు జీజీహెచ్లోని క్యాన్సర్ విభాగాన్ని లెవల్–1 సెంటర్గా, కర్నూలు, విశాఖపట్నంలో లెవల్–2 క్యాన్సర్ సెంటర్లను అభివృద్ధి చేయనుంది. రెండో దశలో కాకినాడ, అనంతపురం జీజీహెచ్లలోని విభాగాలను లెవెల్–2 క్యాన్సర్ సెంటర్లుగా అభివృద్ధిచేస్తుంది. ఇందుకుగాను రూ.119.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అధునాతన పరికరాల ఏర్పాటు గుంటూరు, కర్నూలు, విశాఖ క్యాన్సర్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వైద్య పరికరాలను సమకూరుస్తోంది. నాట్కో సహకారంతో గుంటూరు జీజీహెచ్లో క్యాన్సర్ సెంటర్ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది. క్యాన్సర్ బాధితులకు రేడియేషన్ థెరపీ అందించడానికి ఆధునిక వైద్య పరికరాల్లో ఒకటైన లీనియర్ యాక్సిలేటర్ (లినాక్) ఇక్కడ అందుబాటులో ఉంది. దీనిని లెవెల్–1 సెంటర్గా అభివృద్ధి చేపట్టడానికి వీలుగా పెట్ స్కాన్ మిషన్ను సర్కార్ సమకూరుస్తోంది. మరోవైపు.. రూ.120 కోట్లతో కర్నూలులో కొత్తగా ఏర్పాటుచేస్తున్న స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ భవన నిర్మాణ పనులు వచ్చేనెలలో పూర్తవుతాయి. విశాఖపట్నంలో ఇప్పటికే భవనం అందుబాటులో ఉంది. ఈ రెండు చోట్లకు లినాక్, హెచ్డీఆర్ బ్రాకీ, సీటీ సిమ్యులేటర్ పరికరాల కొనుగోలుకు అధికారులు పర్చేజింగ్ ఆర్డర్లు(పీఓ) ఇచ్చారు. అదే విధంగా.. సర్జికల్, మెడికల్, రేడియేషన్ అంకాలజీ పరికరాల కొనుగోలు ప్రక్రియ ముగిసింది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా పరికరాలను సమకూర్చే ప్రక్రియ పూర్తిస్థాయిలో పూర్తవుతుంది. అనంతపురం, కాకినాడల్లో లినాక్, సీటీ సిమ్యులేటర్ పరికరాల ఏర్పాటుకు బంకర్ల నిర్మాణం, ఇతర పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా అండగా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స మౌలిక సదుపాయాలను ఏపీ కోల్పోయింది. దీనికితోడు.. టీడీపీ సర్కార్ హయాంలో ప్రభుత్వాస్పత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా.. క్యాన్సర్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులపైనే మెజారిటీ శాతం ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ చికిత్స సదుపాయాల కల్పన, ఆయా ఆస్పత్రుల బలోపేతం, వ్యాధి నియంత్రణ చర్యలపై దృష్టిసారించారు. అలాగే, క్యాన్సర్కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి బాధితులకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు. గత ఏడాది క్యాన్సర్ బాధితుల చికిత్స కోసం పథకం కింద ఏటా రూ.600 కోట్లు ఖర్చుచేశారు. ప్రణాళికాబద్ధంగా క్యాన్సర్కు కళ్లెం క్యాన్సర్కు వైద్యం, వ్యాధి నియంత్రణ చర్యల విషయంలో ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వ రంగంలోనే ఇందుకు మెరుగైన వైద్యం అందాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ మేరకు చర్యలు ప్రారంభించాం. ఈ ఏడాది ఆఖరుకు లెవల్–1 సెంటర్గా గుంటూరు.. లెవల్–2 కేంద్రాలుగా కర్నూలు, విశాఖపట్నం క్యాన్సర్ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం. మరోవైపు.. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్సీజీ) ఏపీ చాప్టర్ను ప్రారంభించాం. దీని పరిధిలోకి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ క్యాన్సర్ ఆస్పత్రులను తీసుకొచ్చి చికిత్స విషయంలో నిర్దేశిత ప్రొటోకాల్స్ను పాటించేలా చూస్తున్నాం. క్యాన్సర్ రిజిస్ట్రీని కూడా ప్రారంభించాం. – ఎం.టి. కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ -
క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడిన టెన్నిస్ దిగ్గజం
మహిళల టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడింది. మూడు నెలల క్రితం నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ క్యాన్సర్కు గురైనట్లు వైద్యులు పేర్కొన్నారు. అప్పటినుంచి క్యాన్సర్తో పోరాడిన ఆమె ఎట్టకేలకు దాని నుంచి విముక్తి పొందినట్లు స్వయంగా ప్రకటించింది. ''క్యాన్సర్ మహమ్మారి నుంచి ఇంత త్వరగా కోలుకుంటానని అనుకోలేదు. చికిత్స సందర్భంగా 15 పౌండ్ల బరువు తగ్గాను. ఆ సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. అన్ని భరించి ఇవాళ మహమ్మారి నుంచి విముక్తి సంపాదించా. ఇక క్యాన్సర్ నుంచి విముక్తి కలగగానే టీవీ చానల్ బాధ్యతల్లో లీనమయ్యా.'' అంటూ తెలిపింది. ప్రస్తుతం 66 ఏండ్ల నవ్రతిలోవా మియామీ ఓపెన్లో టీవీ చానల్ ప్రజెంటర్గా వ్యవహరిస్తుంది. అమెరికాకు చెందిన మార్టినా నవ్రతిలోవా 18 సింగిల్స్ , 31 మహిళల డబుల్స్, 10 మిక్స్డ్ డబుల్స్తో మొత్తంగా 59 గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గి చరిత్ర సృష్టించింది. 1970,80వ దశకంలో ఆమె సమకాలీకురాలు క్రిస్ ఎవర్ట్తో పోటీ పడిన నవ్రతిలోవా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్గా రికార్డులకెక్కింది.1981లో అమెరికా పౌరసత్వం రాగానే తనను తాను లెస్బియన్గా ప్రకటించుకున్న నవ్రతిలోవా అప్పటి నుంచి ఎల్జీబీటీ(LGBT) హక్కుల కోసం పోరాడుతూ వచ్చింది. చదవండి: దేశం క్లిష్ట పరిస్థితుల్లో.. వాళ్లకు ప్లాట్లు, ఖరీదైన ఫోన్లు? అంతర్జాతీయ క్రికెట్కు సీనియర్ క్రికెటర్ గుడ్బై -
క్యాన్సర్ను జయించిన వలంటీర్ మహమ్మద్
క్రోసూరు: క్యాన్సర్ బారిన పడిన వలంటీర్కు ప్రభుత్వం సాయం చేయడంతో అతడు పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లో చేరాడు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన షేక్ ఉమ్మర్ ఖయ్యుం ఆటో నడుపుతుంటాడు. వారి పెద్ద కుమారుడు షేక్ మహమ్మద్ డిగ్రీ పూర్తి చేసి వలంటీర్గా పనిచేస్తున్నాడు. మహమ్మద్ 2021లో బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు. సమాచారం తెలుసుకున్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అతని ఇంటికి వెళ్లి పరామర్శించి వెంటనే ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించారు. సీఎం వైఎస్ జగన్కి వినతి పెట్టారు. వెంటనే స్పందించిన సీఎం జగన్..మహమ్మద్కు ఎంత ఖర్చు అవుతుందో అంతా ప్రభుత్వమే భరాయించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమ్మద్కు ప్రభుత్వం రూ.78 లక్షలు మంజూరు చేసింది. పూర్తిస్థాయిలో చికిత్స పొంది మహమ్మద్ ఇంటికి చేరుకున్నాడు. వైఎస్సార్ ఆసరా ద్వారా నెలకు రూ.5,000 చొప్పున 6 నెలల పాటు అందించి మందులను కూడా ఉచితంగా అందజేసింది. సీఎం జగన్ లాంటి నేత ఉండటంతోనే తాము ఈ సమస్య నుంచి బయటపడ్డామని, ఆయనకు తాము ఎంతగానో రుణపడి ఉన్నామని ఖయ్యుం కుటుంబసభ్యులు తెలిపారు. మహమ్మద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చొరవతో సీఎం జగన్ వెంటనే స్పందించి తనను ఆదుకున్నారని, జీవితంలో ఒక్కసారి సీఎం జగన్ని కలిసి కృతజ్ఞతలు తెలపాలని తన కోరిక అని చెప్పాడు. -
క్యాన్సర్ నివారణలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుంది
సాక్షి, గుంటూరు: రాబోయే పదేళ్లలో.. క్యాన్సర్ నివారణకుగానూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. క్యాన్సర్ నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఏపీ బడ్జెట్లో.. రూ.400 కోట్లను క్యాన్సర్ నివారణకు కేటాయించారు. క్యాన్సర్ స్క్రీనింగ్కి హోమీబాబా క్యాన్సర్ కేర్ సెంటర్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందంద కుదుర్చుకుంది. కర్నూల్లో రూ.120 కోట్లతో కేన్సర్ యూనిట్ ఏర్పాటు జరుగుతోంది. అలాగే విశాఖ కేజీహెచ్లో రూ.60 కోట్లతో క్యాన్సర్ క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం అని ఆమె తెలిపారు. 2030 నాటికి క్యాన్సర్ నివారణలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆమె.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల బట్టి కోటి 60 లక్షల మంది ప్రతి ఏటా క్యాన్సర్ కు గురవుతున్నారన్నారు. 2030 నాటికి 30 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్వో హెచ్చరించిందని మంత్రి విడదల రజని ఈ సందర్భంగా తెలిపారు. -
క్యాన్సర్కు మెరుగైన వైద్య సేవలందిస్తాం
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా, జాతీయంగా ప్రసిద్ధి చెందిన వైద్య సంస్థల సహకారంతో రాష్ట్రంలోని క్యాన్సర్ రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. గురువారం మంగళగిరిలోని మంత్రి కార్యాలయంలో దేశంలోనే ప్రతిష్టాత్మక క్యాన్సర్ వైద్య సంస్థ అయిన హెల్త్ కేర్ గ్లోబల్ సంస్థతో రాష్ట్ర వైద్య శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ అతిపెద్ద నెట్వర్క్ కలిగిన హెల్త్కేర్ గ్లోబల్ సంస్థ అంతర్జాతీయ వైద్యులతో క్యాన్సర్కు చికిత్స అందిస్తోందని చెప్పారు. క్యాన్సర్లను గుర్తించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులకు శిక్షణ ఇవ్వడం, న్యూట్రిషన్, యోగా తదితర అంశాలపై తర్ఫీదు అందించడంతోపాటు ప్రతి నెలా జిల్లా ఆస్పత్రుల్లో 30 క్యాంపులు నిర్వహించడం వంటివాటిపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. క్యాన్సర్ రోగుల విషయంలో సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని మంత్రి రజిని వివరించారు. ప్రతి రోగికి అత్యాధునిక వైద్యం పూర్తి ఉచితంగా మన రాష్ట్రంలోనే అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇందుకోసం కడప, కర్నూలులో రాష్ట్ర స్థాయి క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో క్యాన్సర్ వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్క క్యాన్సర్ రోగానికి సంబంధించే 400కు పైగా ప్రొసీజర్లను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ వైద్యానికే రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నవీన్కుమార్, జె.నివాస్, డాక్టర్ వినోద్కుమార్, డాక్టర్ బి.వల్లీ, హెచ్సీజీ ప్రతినిధులు డాక్టర్ ఈఎస్ విశాల్రావు, డాక్టర్ రవికిరణ్, డాక్టర్ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
Pele: 'నాకేం కాలేదు బాగానే ఉన్నా.. భయపడకండి'
బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్వయంగా స్పష్టతనిచ్చాడు. తాను బాగానే ఉన్నానని.. తిరిగి కోలుకుంటున్నట్లు ప్రకటించాడు. 82 ఏళ్ల పీలేకు గతేడాది క్యాన్సర్ కారణంగా పెద్ద పేగులో కణతిని తొలగించారు. అప్పటినుంచి తరచూ చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నాడు. తాజాగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబసభ్యులు సావో పౌలో పట్టణంలోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆదివారం ఉదయం పీలే పరిస్థితి విషమంగా ఉందని.. కీమో థెరపీకి కూడా స్పందించడం లేదని.. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. తన ఆరోగ్యంపై వచ్చిన తప్పుడు ప్రచారంపై ఇన్స్టాగ్రామ్ వేదికగా పీలే స్పందించాడు. తాను బాగానే ఉన్నట్లు వెల్లడించాడు. తన కోసం ప్రార్థిస్తున్న వాళ్లంతా ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని.. తాను బాగానే ఉన్నానని ప్రకటించాడు. తాను సానుకూల దృక్పథంతో ఉన్నట్లు.. చికిత్స కొనసాగుతున్నట్లు చెప్పాడు. దేవుడిపై తనకు విశ్వాసం ఉందని.. మీరు చూపిస్తున్న ప్రేమ నాకు మరింత శక్తినిస్తోందని తెలిపాడు. ఈ సందర్భంగా తన కోసం ప్రార్థిస్తున్న అభిమానులకు, చికిత్స అందిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. కాగా పీలేకు గతేడాది క్యాన్సర్ సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. తర్వాత ఆయన కోలుకున్నారు. తిరిగి ఇటీవల క్యాన్సర్ సంబంధిత సమస్యతోనే ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆసుపత్రిలో ఉన్న ఆయన ఆరోగ్యంపై రోజుకో రకంగా వార్తలు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Pelé (@pele) చదవండి: దిగ్గజం పీలే పరిస్థితి అత్యంత విషమం.. మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన? -
పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్సీల్లో చికిత్స
సాక్షి, హైదరాబాద్: సాధారణ చికిత్సలకే పరిమితమయ్యే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో ఆరోగ్యశ్రీ కింద క్రిటికల్ కేర్, గ్యాస్ట్రో, గుండె, కేన్సర్ వంటి పెద్ద జబ్బులకు కూడా చికిత్సలు చేస్తున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే ఉండే పీహెచ్సీల్లో, కొన్నిచోట్ల పీజీ కోర్సు పూర్తయిన స్పెషలిస్ట్ వైద్యులు ఉండటంతో పెద్ద జబ్బులకు చికిత్సలు చేయడం సాధ్యమవుతోందని వైద్య వర్గాలు అంటున్నాయి. అంతేకాక చిన్నచిన్న జబ్బులకు పెద్దాసుపత్రులకు వెళ్లకుండా స్థానికంగానే వాటిని నయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పీహెచ్సీలలో ఆరోగ్యశ్రీ కింద సేవలు ప్రారంభించిన రెండున్నర నెలల కాలంలోనే వేలాది మంది చికిత్సలు పొందారు. వీటిల్లో వైద్య సేవలన్నీ ఉచితమే అయినా, ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించడం వల్ల డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. దీంతో వైద్య సిబ్బంది రోగులకు సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. పెద్ద ఆసుపత్రులపై తగ్గిన భారం.. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఈ ఎనిమిదేళ్లలో రూ.5,817 కోట్లు కేటాయించింది. 2014 నుంచి ఇప్పటి వరకు 13.31 లక్షల మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలు పొందారు. అందులో అత్యధికంగా 2015–16లో 1.88 లక్షల మంది పేదలు ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల వైద్య సేవలు పొందారు. అలాగే ఇదే కాలంలో ఉద్యోగులు, జర్నలిస్ట్ల ఆరోగ్య పథకం కింద 3.31 లక్షల మంది చికిత్సలు పొందగా, అందుకోసం ప్రభుత్వం రూ.1,346 కోట్లు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా చికిత్సకు అవకాశం ఉన్నా పైస్థాయి ఆసుపత్రికి రిఫర్ చేయకుండా కట్టడి చేయడం, వైద్య సేవలను వికేంద్రీకరించడం వల్ల పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాక ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించడం వల్ల ప్రైవేట్లో అనవసర చికిత్సలకు బ్రేక్ వేసినట్లు అవుతుందని చెపుతున్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని అడ్డంపెట్టుకుని అనవసర చికిత్సలు చేస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రెండున్నర నెలల్లో 9,292 చికిత్సలు ఈ ఏడాది మే నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అంటే దాదాపు రెండున్నర నెలల కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల చికిత్సలు చేశారు. ఈ కాలంలో ఆరోగ్యశ్రీ కింద మొత్తం 9,292 వైద్య చికిత్సలు అందించగా, అందులో అత్యధికంగా జనరల్ మెడిసిన్కు సంబంధించి 6,492 చికిత్సలు చేశారు. 2,077 గ్యాస్ట్రిక్ సంబంధిత జబ్బులకు చికిత్సలు చేశారు. అలాగే 233 జనరల్ సర్జరీలు జరిగాయి. 195 ఎండోక్రైనాలజీకి చెందిన చికిత్సలు జరిగాయి. ఇవిగాక ఆరోగ్యశ్రీ కింద వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించామని వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. అందులో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పీహెచ్సీల్లో మూడు గుండె సంబంధిత చికిత్సలు జరిగాయి. క్రిటికల్ కేర్కు సంబంధించి మేడ్చల్ జిల్లాలో 12, నిర్మల్ జిల్లాలో రెండు, రంగారెడ్డి జిల్లాలో నాలుగు చికిత్సలు చేశారు. డెర్మటాలజీకి సంబంధించి వివిధ జిల్లాల్లో 9 చికిత్సలు జరిగాయి. అలాగే ఆయా జిల్లాల్లో 10 ఈఎన్టీ సర్జరీలు, 41 ప్రసూతి చికిత్సలు, 76 ఇన్ఫెక్షన్ వ్యాధులకు వైద్యం, రెండు కేన్సర్ చికిత్సలు కూడా జరిగాయి. కిడ్నీ వైద్యం కూడా 9 చోట్ల చేశారు. మూడు న్యూరాలజీ, 13 ఆర్థోపెడిక్ సర్జరీలు, 54 పీడియాట్రిక్ చికిత్సలు, 8 ఫల్మనరీ, ఒక తలసేమియా, 5 పాలీ ట్రామా చికిత్సలు జరగడం గమనార్హం. కాగా, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నచోట్ల మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. (క్లిక్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి.. మరో అరుదైన ఘనత) -
కన్నీరు తుడిచి.. బాసటగా నిలిచి..
వినుకొండ (నూజెండ్ల): క్యాన్సర్తో బాధపడుతున్న బాలుడికి బోన్మారో చికిత్సకు రూ.50 లక్షలు మంజూరు చేయించి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ఆ పేదకుటుంబం కన్నీరు తుడిచారు. వినుకొండ రూరల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు అశోక్బాబు పరిస్థితిని స్వయంగా చూసిన మంత్రి వెంటనే ఆస్పత్రిలో చేర్చించాలని సూచించారు. అశోక్బాబు తండ్రి మూడేళ్ల కిందట చనిపోయాడు. తల్లి కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో అశోక్కు క్యాన్సర్ అని, చికిత్సకు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని తల్లికి తెలిసి హతాశురాలైంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె ప్రమాదవశాత్తు గాయపడింది. గ్రామ సర్పంచి సురేష్ ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బాలుడి తల్లికి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం వినుకొండ వచ్చిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రజనికి బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే వివరించి సహాయం చేయాలని కోరారు. అశోక్బాబును తీసుకొచ్చిన బంధువులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. బాలుడి పరిస్థితి చూసి సీఎంవో అధికారులతో మాట్లాడిన మంత్రి వైద్యానికి అయ్యే ఖర్చు రూ.50 లక్షలను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బాలుడిని ఆస్పత్రిలో చేర్పించాలని బంధువులకు సూచించారు. -
క్యాన్సర్కు కళ్లెం.. గ్రామ, వార్డు క్లినిక్స్ స్థాయిలో స్క్రీనింగ్
సాక్షి, అమరావతి: మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లతో విస్తరిస్తున్న క్యాన్సర్ కేసులను పసిగట్టి సరైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రామ, వార్డు క్లినిక్స్ స్థాయిలోనే క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించి అవగాహన కల్పించనున్నారు. ఈ మేరకు క్యాన్సర్ స్క్రీనింగ్పై సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. లైనాక్ మెషిన్లు, 3 చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లు క్యాన్సర్ కేసుల్లో 60 – 70 శాతం వరకు చివరి దశలో గుర్తించడంతో వ్యయ ప్రయాసలతో చికిత్స పొందినా ఫలితం దక్కడం లేదు. విస్తృత స్క్రీనింగ్ ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే చాలా ప్రాణాలను కాపాడవచ్చు. గ్రామ, వార్డు క్లినిక్స్తో పాటు మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ద్వారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ప్రభుత్వం అమల్లోకి తేనుంది. తద్వారా క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్సలు అందించనున్నారు. క్యాన్సర్ గుర్తింపు, చికిత్సపై సమర్థ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఇటీవల వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కొత్తగా ఏర్పాటయ్యే వాటితో కలిపి మొత్తం 27 మెడికల్ కాలేజీల్లో క్యాన్సర్ నివారణకు రెండు చొప్పున లైనాక్ మెషిన్లు ఉండేలా బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. విశాఖ, తిరుపతి, గుంటూరు కాలేజీల్లో క్యాన్సర్ నివారణకు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుకు పూర్తి స్థాయి ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. మూడో దశలో గుర్తిస్తే సంక్లిష్టం క్యాన్సర్లలో 33.2 శాతం ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందిస్తే నయం అవుతోంది. మహిళల్లో రొమ్ము, నోటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో 49.2 శాతం ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే తక్కువ ధరతోనే నయం అవుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే రూ.71 వేల లోపే వ్యయంతో 99 శాతం నయం అవుతోంది. అదే మూడో దశలో గుర్తించి రూ.1.76 లక్షలు వ్యయం చేసినా 29 శాతమే నయంఅవుతోంది. లక్షల్లో మరణాలు.. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఏటా పెరిగిపోతున్నాయి. మన దేశంలో 2020లో కొత్తగా 13.24 లక్షలకుపైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 6.8 లక్షలు మహిళల్లో క్యాన్సర్ కేసులు కాగా 6.5 లక్షలు పురుషుల్లో క్యాన్సర్ కేసులున్నాయి. 2020లో క్యాన్సర్తో 8.5 లక్షల మంది మృతి చెందగా రాష్ట్రంలో 34 వేల మంది మృత్యువాత పడినట్లు అంచనా. 2030 నాటికి దేశంలో క్యాన్సర్ కేసులు 28 శాతం మేర పెరగవచ్చని అంచనాలు పేర్కొంటున్నాయి. ఆరోగ్యశ్రీలో పెరిగిన చికిత్స వ్యయం రాష్ట్రంలో కొత్త క్యాన్సర్ కేసులు 70 వేల వరకు ఉండవచ్చని అంచనా. పురుషుల్లో అత్యధికంగా నోటి క్యాన్సర్, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 39,768 క్యాన్సర్ కేసులుండగా అత్యధికంగా ఉమ్మడి తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 13 శాతం చొప్పున నమోదయ్యాయి. 16 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులున్నాయి. 2030 నాటికి రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు 70 వేల వరకు పెరగవచ్చని అంచనా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 2019 నుంచి 2021 వరకు క్యాన్సర్ చికిత్స వ్యయం 37.3 శాతం మేర పెరిగింది. 2021–22లో ఆరోగ్యశ్రీలో 1,18,957 క్యాన్సర్ కేసులకు చికిత్స అందించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్సలు 24 శాతం పెరిగాయి. -
క్యాన్సర్ కణాలపై విద్యుత్ఛార్జ్!!
అల్లరిమూకలపై లాఠీఛార్జి!! అందరూ ఈ మాట అనేక సార్లు వినే ఉంటారు. దాదాపు క్యాన్సర్ కణాలూ అంతే. అయితే ‘లాఠీచార్జీ’కి బదులు... ఈ సరికొత్త చికిత్స ప్రక్రియలో ‘విద్యుత్ ఛార్జీ’ ప్రయోగిస్తారు. తలపైనున్న క్యాప్ నుంచి ‘ఛా...ర్జ్’ అంటూ ఆదేశాలు రాగానే... అపాయకర క్యాన్సర్కణాలన్నీ చెల్లాచెదురైపోతాయి. అంతేకాదు... ఆ విద్యుత్షాక్ కారణంగా వాటి పెరుగుదలా ఆగిపోతుంది. అదెలాగో చూద్దామా? సాధారణంగా మెదడులో క్యాన్సర్ గడ్డలు వస్తే ప్రధానంగా సర్జరీతో తొలగిస్తారు. కానీ మెదడులో శస్త్రచికిత్స కాస్త కష్టమైన ప్రక్రియ. క్యాన్సర్ గడ్డ వరకే తొలగించాలి. లేదంటే... దేహంలో అది నియంత్రించే ఏదైనా కేంద్రానికి ఏ కొంత దెబ్బ తగిలినా... ఆ ప్రాంతం చచ్చుబడిపోతుంది. అయితే ఇటీవల ‘ఆప్ట్యూన్ థెరపీ’ అనే సరికొత్త ప్రక్రియకు అమెరికాకు చెందిన ఎఫ్డీఏ అనుమతి ఇచ్చింది. టోపీలా ధరించాల్సిన ‘ఆప్ట్యూన్ డివైజ్’ అనే ఓ పరికరం కొన్ని విద్యుత్ క్షేత్రాలను పుట్టిస్తుంది. ఆ క్షేత్రాల్లో ప్రసారమయ్యే విద్యుత్తు... విస్తృతంగా పెరగబోయే క్యాన్సర్ కణజాలాన్ని చెల్లాచెదురు చేస్తుంది. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త చికిత్స ప్రక్రియ గురించి అవగాహన కోసమే ఈ కథనం. మెదడులో వచ్చే గ్లయోబ్లాస్టోమా అనే రకానికి చెందిన క్యాన్సర్ గడ్డలకు చికిత్స అందించేందుకు ఉద్దేశించిన పరికరమే ‘ఆప్ట్యూన్ డివైజ్’. దీన్ని తలకు తొడిగాక అది తలచుట్టూ ‘ట్యూమర్ ట్రీటింగ్ ఫీల్డ్’ అనే విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ క్షేత్రం ఫలితంగా కొత్తగా పెరగాల్సిన క్యాన్సర్ కణాలు పెరగకుండా పోతాయి. అంతేకాదు... ఆ ప్రాంతంలోని క్యాన్సర్ కణాలన్నీ చెల్లాచెదురైపోతాయి. అయితే కొత్త చికిత్స గురించి తెలుసుకోడానికి ముందర అది చికిత్స చేసే ‘గ్లయోబ్లాస్టోమా క్యాన్సర్’ గడ్డలు గురించి తెలుసుకుందాం. గ్లయోబ్లాస్టోమా అనేవి చాలా వేగంగా పెరిగే ఒక రకం క్యాన్సర్ కణుతులు. ఇవి నాడీకణాల ఆధారంగా పెరిగేవి. కాబట్టి అవి సాధారణంగా మెదడులో లేదా కాస్త అరుదుగా వెన్నుపాము మీద వస్తుంటాయి. ఇవి చాలా చురుగ్గా, వేగంగా, తీవ్రంగా పెరుగుతాయి. ఈ తరహా క్యాన్సర్ ఎందుకు వస్తుందనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అయితే అరుదైన కొన్ని రకాల జన్యురుగ్మతలు ఉన్నవారిలో ఈ క్యాన్సర్ గడ్డలు రావడం వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వేగంగా విస్తరించే క్యాన్సర్ కావడంతో... ఒకసారి దీని బారిన పడ్డాక బాధితులు సాధారణ ఆయుఃప్రమాణంతో చాలాకాలం పాటు బతికే అవకాశాలు కాస్తంత తక్కువే. సాధారణంగా క్యాన్సర్లో ఉపయోగించే సంప్రదాయ చికిత్సలైన శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కీమో వంటి వాటితోనే ఇప్పటివరకూ దీనికి చికిత్స ఇస్తూ వస్తున్నారు. అయితే... ఈ క్యాన్సర్కు ఇప్పుడు ఈ ‘ఆప్ట్యూన్’ అనే సరికొత్త పరికరం అందుబాటులోకి రావడం చాలామంది బాధితుల పాలిట ఇదో ఆశారేఖగా మారింది. ఇప్పుడిప్పుడే అందుబాటులోకి రావడం వల్ల ఇది చాలా ఎక్కువ ఖరీదైన చికిత్సగానే ఉంది. పైగా అమెరికాలో మినహాయించి చాలా యూరోపియన్ దేశాల్లోకీ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ భారత్లోని కొన్ని పెద్ద పెద్ద క్యాన్సర్ సెంటర్లలో ఇప్పుడిప్పుడే ఈ చికిత్స అందుబాటులోకి వస్తోంది. ఏమిటీ ఆప్ట్యూన్ పరికరం...? గ్లయోబ్లాస్టోమా కోసం ఉపయోగించే ’ఆప్ట్యూన్’ ప్రక్రియలో తలచుట్టూ బ్యాండేజీల్లాగా కనిపించే కొన్ని పరికరాలను అతికిస్తారు. ఇందుకు వీలుగా తొలుత బాధితుల తలవెంట్రుకలు తీయిస్తారు. (గుండు చేస్తారు). ఆ గండుకు వీటిని అంటుకుపోయేలా వీటిని రూపొందించారు. వీటిల్లో ‘ట్రాన్స్డ్యూసర్ అర్రేస్’ అని పిలిచే సిరామిక్ డిస్క్లు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ బ్యాండేజీలా కనిపించే ఉపకరణాన్ని ‘స్కల్ క్యాప్’లా తొడుగుతారు. ఈ అర్రేస్ – అంటే ఎన్నో అద్దాల్లాంటి సముదాయం అని అర్థం) అన్నింటినుంచీ వచ్చే వైర్లన్నీ ఒక పోర్టబుల్ బ్యాటరీకి కలిపి ఉంటాయి. ఆ బ్యాటరీని భుజం దగ్గరగానీ లేదా బ్యాక్ప్యాక్లోగానీ పెడతారు. ఈ బ్యాటరీ సహాయంతో తలచుట్టూ ఓ విద్యుత్ క్షేత్రాన్ని రూపొందిస్తారు. ఈ క్షేత్రాన్ని ‘ట్యూమర్ ట్రీటింగ్ ఫీల్డ్’ అంటారు. ‘టీటీఎఫ్’ అంటే...? ‘ట్యూమర్ ట్రీటింగ్ ఫీల్డ్’లో చాలా తక్కువ తీవ్రతతో ఉన్న విద్యుత్ తరంగాలు ఉత్పన్నమవుతుంటాయి. ఈ తరంగాలు హానికారక క్యాన్సర్ కణాలను ఎటుపడితే అటు చెల్లాచెదురుగా చెదరగొట్టడంతో పాటు... వాటిల్లో కణవిభజన జరగకుండా నిరోధిస్తాయి. ఏ ఫ్రీక్వెన్సీలో ఈ విద్యుత్తరంగాలను ప్రయోగిస్తే... గ్లయోబ్లాస్టోమా కణాలన్నీ చెదిరిపోతాయో... ఆ ఫ్రీక్వెన్సీలో విద్యుత్తరంగాలు ఉత్పన్నమయ్యేలా ఆప్ట్యూన్ పరికరాన్ని సెట్ చేస్తారు. ఎంతకాలం పాటు...? చికిత్సలో భాగంగా ఇలా ఎంతకాలంపాటు ఈ టోపీలాంటి ఉపకరణాన్ని తొడిగి ఉండాలన్నది ట్యూమర్ల తీవ్రత ఆధారంగా డాక్టర్లు నిర్ణయిస్తారు. దుస్తులన్నింటిలాగే క్యాప్ ధరించడమూ ఒకరకంగా ఓ తొడుగు లాంటిదే కాబట్టి ఇది రోజువారీ పనులకూ అడ్డురాదు. ఒక్కోసారి ఈ క్యాప్లాంటి తొడుగును రోజుల్లో 18 గంటల పాటు కూడా ధరించాల్సి రావచ్చు. అలాగే తలలోని గడ్డలకు ఈ విద్యుత్ తరంగాల ప్రభావం ఉండటానికి, క్యాప్ను గుండుతో సరిగా అంటుకుపోయేలా ఉంచడానికి వారంలో రెండుసార్లు వెంట్రులకను తీసేయాల్సి వస్తుంటుంది. ఎందుకు అందుబాటులోకి రావాల్సి వచ్చింది? ఈ పరికరం ఎందుకు అందుబాటులోకి రావాల్సి వచ్చిందో కూడా చూద్దాం. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ (ఈవోఆర్టీసీ) అనే అంతర్జాతీయ పరిశోధన సంస్థ... ‘గ్లయోబ్లాస్టోమా’ బాధితులు వివిధ చికిత్సలతో ఎంత కాలం పాటు మనుగడ సాగించగలరనే అంశాలపై విస్తృతంగా పరిశోధనలు చేసింది. ఏడు అంశాల ఆధారంగా ఇందుకోసం మూడు మోడల్స్ను కూడా రూపొందించిది. ఆ ఏడు అంశాలేమిటంటే... బాధితులకు ఇస్తున్న చికిత్స, అతడి వయసు, శస్త్రచికిత్స ఏ మేరకు సాధ్యమైందనే అంశం, మినీ మెంటల్ స్కోర్ ఎగ్జామినేషన్ అనే పరీక్ష, కార్టికోస్టెరాయిడ్స్ ఏమైనా ఇస్తున్నారా అనే అంశం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాలకు అనుగుణంగా బాధితుడి సామర్థ్యాలు, ఎంజీఎమ్టీ ప్రమోటర్ మిథైలేషన్ స్టేటస్... అనే ఈ ఏడు అంశాల సహాయంతో ఆయా అంశాలను మూడు రకాల మోడల్స్ (సూత్రాల్లాంటివి)లో ప్రతిక్షేపించి లెక్కగడతారు. ఇలా లెక్కగట్టినప్పుడు అననుకూలతలు ఎక్కువగా ఉన్న కొందరు బాధితులు బతికే కాలం చాలా తక్కువగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఇలాంటి వారి ఆయుష్షునూ పెంచడానికి అనేక మార్గాల్లో పరిష్కారాలను వెతుకుతున్నప్పుడు ఈ ఆప్ట్యూన్ పరికరం అందుబాటులోకి వచ్చింది. దాదాపుగా పదకొండు నెలలు కూడా బతకరని నిర్ణయించిన చాలామంది రోగుల ఆయుష్షును దాదాపు మూడు నుంచి ఐదేళ్లకు మించి బతికేలా చేసింది ఈ చికిత్స. దీన్ని ఇంకా మెరుగుపరిస్తే... బాధితులు మరింతకాలం బతికే అవకాశం ఉన్నందున అననుకూలురైన చాలామందికి ఇదో ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఒకసారి గ్లయోబ్లాస్టోమా నిర్ధారణ అయ్యాక... సంప్రదాయ క్యాన్సర్ చికిత్సలతో రోగి బతికే అవకాశాలను (ప్రోగ్నోసిస్ను) దాదాపుగా మూడేళ్లుగా చెబుతుంటారు. కానీ ఈ ఉపకరణంతో నిర్వహించిన ట్రయల్స్లో తర్వాత ఆ రోగుల ఆయుష్షు దాదాపు ఐదేళ్ల వరకు పెరగడాన్ని వైద్యనిపుణులు చూశారు. ఈ పరిశీలనలన్నింటినీ చూశాకే... కొత్త మందులకూ, కొత్త చికిత్స ప్రక్రియలకు అనుమతులిచ్చే ‘ఎఫ్డీఏ’ దీన్ని ఆమోదించింది. సాధారణంగా ఇది నోటిలోకి తీసుకునే మందు కానందున సైడ్ఎఫెక్ట్స్ పెద్దగా లేవుగానీ... బాధితుల్లో మరికొన్ని రకాల ఇబ్బందులను నిపుణులు గమనించారు. రోజూ మాడుకు క్యాప్లా ధరించి ఉండాల్సి రావడంతో మాడు–చర్మం మీద ఇబ్బందిగా (ఇరిటేషన్లా) అనిపించడం, మరికొందరిలో తలనొప్పి కనిపించాయి. కీమోథెరపీ తీసుకుంటూనే దీన్ని ధరించివారిలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం, వికారం, వాంతులు, మలబద్ధకం, అలసట వంటి స్వల్ప అనర్థాలను వైద్యనిపుణులు చూశారు. దీనికి తోడు కాస్తంత అరుదుగా కొందరిలో కాస్త పెద్దస్థాయి అనర్థాలైన మూర్ఛ (ఫిట్స్/సీజర్స్), డిప్రెషన్ వంటి మానసిక సమస్యలనూ గమనించారు. ఇక రోజూ దీన్ని ధరించాల్సి రావడంతో తలపైన చర్మంలో కొన్నిచోట్ల కాస్తంత బిగుతుగా/బిగుసుకుపోయినట్లుగా అనిపించడం (ట్విచ్చింగ్), తలమీద పుండ్లు, జ్వరం వచ్చినప్పుడు కనిపించే నీరసం వంటివి కూడా కనిపించాయి. చదవండి: Tomato Fever: ఒళ్లంతా దురద.. జ్వరం, అలసట.. టొమాటో ఫీవర్ అంటే? -
క్యాన్సర్ చికిత్సపై సీఎం జగన్ ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు: కృష్ణబాబు
సాక్షి, అమరావతి: హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి, తిరుపతి స్విమ్స్, విజయవాడ చినకాకాని ఆసుపత్రిలో క్యాన్సర్ ట్రీట్మెంట్పై ఒప్పందం జరిగినట్లు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఈ మేరకు కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఏపీలో క్యాన్సర్ చికిత్సకు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తోంది. గత ఏడాది లక్షా 30 వేల మందికి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి 50 కిలోమీటర్లకు క్యాన్సర్ వైద్యం అందే స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిదశలోనే క్యాన్సర్ను గుర్తించి వైద్యం అందించాలనే ఆలోచన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు క్యాన్సర్కి సంబంధించి టెలి కన్సల్టెన్సీ సర్వీస్ ఏర్పాటు చేశామని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో సుమారు 120 మంది క్యాన్సర్తో బాధపడుతున్నట్టు ఓ అంచనా. ఈ సంఖ్య భవిష్యత్లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన వైద్య విధానాలతో రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స వనరులను సమకూర్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ విశాఖపట్నం హోమీ బాబా ఆస్పత్రి నుంచి సాంకేతిక సహకారం పొందనుంది. వ్యాధి గుర్తింపునకు స్క్రీనింగ్, పలు రకాల క్యాన్సర్ ప్రమాదాల గుర్తింపు, జిల్లాల్లో ప్రివెంటివ్ అంకాలజీ, క్యాన్సర్ డే కేర్ సేవలు అందుబాటులోకి తేవడం, రిజిస్ట్రీ, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి నైపుణ్యాల పెంపునకు శిక్షణ అందించడం వంటివి హోమీ బాబా ఆస్పత్రి అందించనుంది. ప్రభుత్వాస్ప త్రుల్లో పొగాకు విరమణ కేంద్రాల ఏర్పాటు, స్క్రీనింగ్లో నిర్ధారించిన క్యాన్సర్ రోగులు, హైరిస్క్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు రెఫరల్ విధానం రూపకల్పనకు సంబంధించి హోమీ బాబా ఆస్పత్రి సహకారం అందించనుంది. విభజన అనంతరం క్యాన్సర్ చికిత్స వనరులను ఏపీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్యాన్సర్ వ్యాధి కట్టడి, ప్రభుత్వ రంగంలో చికిత్స వనరులను మెరుగుపరచడంపై సీఎం వైఎస్ జగన్ సర్కార్ దృష్టి సారించింది. భవిష్యత్లో క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు ప్రజలు వెళ్లకుండా రాష్ట్రంలోనే చికిత్స వనరులను మెరుగుపరచనున్నారు. చదవండి: (టీడీపీ ఆరిపోయే దీపం: మంత్రి జోగి రమేష్) -
మరింత సమర్థంగా క్యాన్సర్ కట్టడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్యాన్సర్ను సమర్థంగా నియంత్రించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థలను భాగస్వామ్యం చేస్తోంది. ఆయా సంస్థల సలహాలు, సూచనలు, సహకారం తీసుకుంటూ క్యాన్సర్పై యుద్ధానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా క్యాన్సర్ చికిత్సకు ప్రసిద్ధి చెందిన టాటా మెమోరియల్ సెంటర్కు చెందిన విశాఖలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్తో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎంవోయూ చేసుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో సుమారు 120 మంది క్యాన్సర్తో బాధపడుతున్నట్టు ఓ అంచనా. ఈ సంఖ్య భవిష్యత్లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన వైద్య విధానాలతో రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స వనరులను సమకూర్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ విశాఖపట్నం హోమీ బాబా ఆస్పత్రి నుంచి సాంకేతిక సహకారం పొందనుంది. వ్యాధి గుర్తింపునకు స్క్రీనింగ్, పలు రకాల క్యాన్సర్ ప్రమాదాల గుర్తింపు, జిల్లాల్లో ప్రివెంటివ్ అంకాలజీ, క్యాన్సర్ డే కేర్ సేవలు అందుబాటులోకి తేవడం, రిజిస్ట్రీ, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి నైపుణ్యాల పెంపునకు శిక్షణ అందించడం వంటివి హోమీ బాబా ఆస్పత్రి అందించనుంది. ప్రభుత్వాస్ప త్రుల్లో పొగాకు విరమణ కేంద్రాల ఏర్పాటు, స్క్రీనింగ్లో నిర్ధారించిన క్యాన్సర్ రోగులు, హైరిస్క్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు రెఫరల్ విధానం రూపకల్పనకు సంబంధించి హోమీ బాబా ఆస్పత్రి సహకారం అందించనుంది. విభజన అనంతరం క్యాన్సర్ చికిత్స వనరులను ఏపీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్యాన్సర్ వ్యాధి కట్టడి, ప్రభుత్వ రంగంలో చికిత్స వనరులను మెరుగుపరచడంపై సీఎం వైఎస్ జగన్ సర్కార్ దృష్టి సారించింది. భవిష్యత్లో క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు ప్రజలు వెళ్లకుండా రాష్ట్రంలోనే చికిత్స వనరులను మెరుగుపరచనున్నారు. -
క్యాన్సర్ను చంపే ‘ముసుగు మందు’..!
క్యాన్సర్కు చేసే చికిత్సలు చాలా కష్టంగా అనిపిస్తుంటాయి. దానికి కారణమూ ఉంది. క్యాన్సర్కు వాడే కీమో మందులైనా, రేడియేషన్ ఇచ్చినా... క్యాన్సర్ కణాలతో పాటు ఎన్నో కొన్ని / ఎంతో కొంత ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతింటాయి. చికిత్స తర్వాత సైడ్ఎఫెక్ట్స్ ఎలాగూ ఉండనే ఉంటాయి. ఆఖరికి శస్త్రచికిత్స చేసినా సరే... మళ్లీ పెరగకుండా ఉండేందుకు కొంత మార్జిన్ తీసుకుని, క్యాన్సర్ గడ్డకు ఆనుకుని ఉన్న మంచి కణాలనూ కొంతమేరకు తొలగిస్తుంటారు. చివరకు వ్యాధి నిరోధకతను పెంచడం ద్వారా క్యాన్సర్ కణాలనే నశింపజేసి, బాధితుల ఆయుష్షును పెంచే ఇమ్యూనోథెరపీల విషయంలోనూ ఇలాంటి నష్టం ఎంతో కొంతమేర జరుగుతుంది. ఒకవేళ మంచి కణాలకు ఏమాత్రం హాని చేయకుండా, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే వెదికి వెదికి పట్టి తుదముట్టించే చికిత్స ప్రక్రియను కనుగొంటే ఎలా ఉంటుందన్న ఆలోచన చాలామంది శాస్త్రవేత్తల్లో ఉన్నప్పటికీ... యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన ప్రిట్జ్కర్ స్కూల్ ఆఫ్ మాలెక్యులార్ ఇంజనీరింగ్కు చెందిన కొంతమంది పరిశోధకులు ఓ ప్రయత్నం చేశారు. దాని ఫలితమే ఈ ముసుగు మందు!! దాని వివరాలివి... ముసుగు మందు పని తీరు ఇది క్యాన్సర్ కణాలకూ, ఆరోగ్యకరమైన కణాలకూ ఓ తేడా ఉంది. ఆరోగ్యకరమైన కణాలు క్రమపద్ధతిలో, నియమిత వేగంతో మాత్రమే పెరుగుతాయి. కానీ క్యాన్సర్ కణాల పెరుగుదల ఓ పద్ధతి లేకుండా చాలా వేగంగా కొనసాగుతుంది. ఇలా పెరగడానికి కొన్ని ఎంజైములు ఉత్పత్తి అవుతుంటాయి. కానీ అదే ఆరోగ్యకరమైన కణాలతో ఈ ఎంజైముల ఉత్పత్తి పరిమితంగా ఉంటుంది. ఈ తేడాలనే మరింత సురక్షితమైన ‘ఐఎల్–12’ వర్షన్ను రూపొందించడానికి శాస్త్రవేత్త లు ఉపయోగించుకున్నారు. దీని ఆధారంగా విపరీతంగా ప్రవర్తించే ఈ ‘ఐఎల్–12’ కణాలకు ఓ ‘మాలెక్యులార్ ముసుగు’ తొడిగారు. అవి క్యాన్సర్ గడ్డను చేరేవరకు వాటిపై ఆ ముసుగు అలాగే ఉంటుంది. చాలా వేగంగా ఉత్పత్తయ్యే కణజాలం ఎంజైములు తగిలినప్పుడు ఆ ముసుగు తొలగిపోతుంది. అంటే ఆ ఎంజైమే ఈ ముసుగును ఛిద్రం చేస్తుంది. అంటే... ‘ఐఎల్–12’ కణాలు క్యాన్సర్ గడ్డను చేరగానే ముసుగు తొలగిపోతుందన్నమాట. అక్కడ అవి తమ తీవ్రతా, వైపరీత్యం వంటి గుణాన్ని కోల్పోకుండా... అక్కడే తమ ప్రభావాలను చూపుతాయి. ఫలితంగా అక్కడ కిల్లర్ టీ–సెల్స్ను విపరీతంగా పెరిగేలా చేస్తాయవి. దాంతో క్యాన్సర్ గడ్డపై మాత్రమే ఆ తీవ్రత ప్రభావం తీక్షణంగా ఉంటుంది. మిగతా ఆరోగ్యకరమైన కణాలు సురక్షితంగా ఉంటాయి. ఒక క్లినికల్ పరీక్షలో ఈ అంశాన్ని ప్రయోగాత్మకంగా చూశారు. ‘ట్రోజెన్ డ్రగ్ డెలివరీ’ అనే కొత్త చికిత్సగా... ముసుగు వేసుకుని... లక్ష్యాన్ని చేరాక అక్కడ తీవ్రస్థాయిలో ప్రభావవంతంగా జరిగే ఈ చికిత్సనే ‘ట్రోజెన్ డ్రగ్ డెలివరీ’గా కూడా అభివర్ణిస్తారు. తమ యుద్ధతంత్రంలో భాగంగా... ఓ పెద్ద చెక్క గుర్రాన్ని తయారు చేసి, అందులో రహస్యంగా సైనికులను నింపి ఉంచి... శత్రువులకు బహూకరించాక... అందులోంచి ఒక్కపెట్టున సైనికులు వచ్చి దాడి చేసిన‘ట్రోజన్ వార్’ కథ తెలిసిందే. అందుకే ఈ చికిత్స ప్రక్రియకు ఆ పేరు పెట్టారు. అయితే... ఎంత ముసుగు వేసుకుని పోయినా కొన్నిసార్లు ఇది కొన్నిచోట్ల (మైక్రో ఎన్విరాన్మెంట్లో) అక్కడి కణాల కన్నుకప్పలేకపోవచ్చు. ఆ ఇబ్బందిని గనక అధిగమిస్తే... ఇమ్యూనోథెరపీనీ, కార్–టీ సెల్ థెరపీ (కైమరిక్ యాంటీజెన్ రీకాంబినెంట్ టీ సెల్ థెరపీ)ని... రెండింటినీ కలగలుపుకున్న ఈ థెరపీ మరింత సమర్థంగా రూపొందే అవకాశం ఉందనేది నిపుణుల భావన. అదే జరిగితే (జరిగే అవకాశాలే ఎక్కువ) ఇది తిరుగులేని చికిత్సగా ఆవిర్భవిస్తుందన్నది వైద్యశాస్త్రవేత్తలూ, నిపుణుల మాట. క్యాన్సర్ కణంపై రోగనిరోధక వ్యవస్థ పని చేసేదిలా! మన రోగనిరోధక వ్యవస్థలో సైటోకైన్స్ అనే ప్రోటీన్లు ఒక్కసారిగా దాడి చేసి హానికారక కణాలను తుదముట్టించడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రయత్నంలో భాగంగా సైటోకైన్లు... తెల్లరక్తకణాల్లో ఒక రకానికి చెందిన ‘కిల్లర్ టీ–సెల్స్’ను పెద్ద ఎత్తున ప్రేరేపిస్తాయి. అప్పుడా ‘కిల్లర్ టీ–సెల్స్’ క్యాన్సర్ కణాలపై దాడి ప్రారంభిస్తాయి. ఈ దాడి ప్రభావపూర్వకంగా ఎలా జరగాలన్న అంశంపై ఈ సైటోకైన్ ప్రోటీన్లే... ‘కిల్లర్ టీ–సెల్స్’కు శిక్షణ అందిస్తాయి. ఇలా అవి క్యాన్సర్ కణాలనూ, గడ్డలనూ ఎదుర్కొని వాటిని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇలాంటి సైటోకైన్లలో ఒక రకమే ‘ఇంటర్ల్యూకిన్–12’. దీన్ని సంక్షిప్తంగా ‘ఐఎల్–12’ అని కూడా అంటారు. వాటి ప్రభావం ఇలా ఉంటుంది... ఐఎల్– 12ను కనుగొని దాదాపు 30 ఏళ్లయ్యింది. కానీ వీటిని చికిత్సలో ఉపయోగించినప్పుడు అవి వాపు, మంట కలిగించే అంశాలనూ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తాయి. అంటే ఇన్ఫ్లమేటరీ మాలెక్యుల్స్ను పుట్టిస్తాయి. ఇవి దేహంలోని ఇతర కణాలను, ముఖ్యంగా కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే... వీటిని ఉపయోగించాక కలిగే అనర్థాలూ, దుష్ప్రభావాల కారణంగా, ముఖ్యంగా కాలేయం వంటి కీలక అవయవాలకు జరిగే నష్టాల వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని... ఎఫ్డీఏ వీటిని చికిత్స ప్రక్రియలకు అనుమతించలేదు. ఆనాటి నుంచి శాస్త్రవేత్తలు ఒక ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. క్యాన్సర్ కణాల పట్ల ఈ ‘ఐఎల్–12’ కణాల ప్రభావం తగ్గకూడదు. కానీ దేహం తట్టుకోగలిగేలా వాటిని రూపొందించాలి. ప్రయోగాత్మకంగా రెండు కేస్–స్టడీలివి... రొమ్ముక్యాన్సర్ వచ్చిన కొందరు బాధితులను పరిశీలించగా... సాధారణంగా ఇమ్యూనోధెరపీలో ఉపయోగించే ‘చెక్పాయింట్ ఇన్హిబిటార్’తో కేవలం 10 శాతం ఫలితాలు కనిపించగా... ఈ ‘మాస్క్డ్ ఐఎల్–12’తో 90 శాతం ఫలితాలు కనిపించాయి. ఇక ఒక పెద్దపేగు (కోలన్) క్యాన్సర్ కేస్–స్టడీలో ఈ ‘మాస్క్డ్ ఐఎస్–12’తో 100 శాతం ఫలితాలు కనిపించడం మరో విశేషం. డాక్టర్ సురేష్. ఏవీఎస్. మెడికల్ ఆంకాలజిస్ట్ -
అన్ని క్యాన్సర్లకూ ఆరోగ్యశ్రీ
దేశంలో క్యాన్సర్ చికిత్స ప్రాముఖ్యతను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. క్యాన్సర్ బాధితుల సంరక్షణ, చికిత్సపై సీఎం జగన్ దూరదృష్టి అభినందనీయం. రాష్ట్రవ్యాప్తంగా మూడు సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. – డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు సాక్షి ప్రతినిధి, తిరుపతి: క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసి, పేదలందరికీ ఉచితంగా వైద్య సౌకర్యం అందించాలనేదే తమ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో టాటా సంస్థ అద్భుతమైన క్యాన్సర్ ఆస్పత్రిని తిరుపతిలో ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. తిరుపతి జూపార్క్ రోడ్లో టీటీడీ సహకారంతో టాటా సంస్థ ఆధ్వర్యంలో రూ.190 కోట్లతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (స్వీకార్)ను గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రేడియాలజీ విభాగంలో రోగుల కోసం అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన క్యాబిన్లు, వైద్య పరికరాలను, చికిత్సా విధానాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వడమే లక్ష్యమని, రానున్న రోజుల్లో ఆంకాలజీ విభాగంలో అన్ని రకాల సేవలు వర్తింపజేయాలని భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సమగ్రమైన క్యాన్సర్ చికిత్స అందించాలన్నది తమ లక్ష్యమని, ఇందులో భాగంగా అన్ని రకాల క్యాన్సర్లకు ఒకే గొడుగు కింద ఉచితంగా చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క రోగి కూడా క్యాన్సర్తో చనిపోకూడదని, చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకూడదనేది తమ అంతిమ లక్ష్యమని చెప్పారు. క్యాన్సర్ కేర్, అడ్వాన్స్డ్ ఆసుపత్రిని ప్రారంభిస్తున్న సీఎం జగన్, చిత్రంలో మంత్రులు, ఆసుపత్రి బృందం క్యాన్సర్ చికిత్సపై దృష్టి పెట్టిన ఏకైక రాష్ట్రం ఏపీ ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మూడు సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. క్యాన్సర్ సంరక్షణ, చికిత్సపై సీఎం దూరదృష్టి అభినందనీయమన్నారు. పీడియాట్రిక్ ఆంకాలజీ సెంటర్, ప్రివెంటివ్ ఆంకాలజీ, సెంటర్ ఫర్ పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ను ఏర్పాటు చేయాలని భావిస్తూ.. భారతదేశంలో క్యాన్సర్ చికిత్స ప్రాముఖ్యతను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని చెప్పారు. టాటా ట్రస్ట్ సీఈవో ఎన్.శ్రీనాథ్, స్వీకార్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వీఆర్.రమణన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్కు అత్యుత్తమ వైద్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని క్యాన్సర్ బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలందించేలా ప్రభుత్వాస్ప త్రులను బలోపేతం చేయడంపై వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. క్యాన్సర్ చికిత్స కోసం బాధితులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా.. ఏపీలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నట్టు సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ప్రస్తుతమున్న బోధనాస్పత్రుల్లోని క్యాన్సర్ విభాగాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసే క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనిని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోంది. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఇప్పటివరకు అత్యధిక మంది క్యాన్సర్ బాధితులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం తీసుకుంటున్నట్టు ప్రత్యేక బృందం పరిశీలనలో వెల్లడైంది. క్యాన్సర్ చికిత్సలో కీలకమైన లీనియర్ యాక్సిలరేటర్ పరికరం గుంటూరు జీజీహెచ్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అందుబాటులోకి రావడం గమనార్హం. ప్రభుత్వాస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం, ఇతర కారణాల వల్ల రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని ప్రత్యేక బృందం గుర్తించింది. -
‘కీమో’నుంచి కోలుకున్నా.. క్యాన్సర్ ట్రీట్మెంట్పై నటి రియాక్షన్
Actress Hamsa Nandini Shares About Her Cancer Treatment: ప్రముఖ టాలీవుడ్ నటి హంసా నందిని ఇటీవలె క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా తన పరిస్థితిపై ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోస్ట్ను షేర్ చేసింది. 16సైకిల్స్ పాటు కీమో థెరపీ చేశారు. ఇప్పుడు నేను అధికారికంగా కీమో నుంచి కోలుకున్నాను. కానీ చికిత్స ఇంకా పూర్తి కాలేదు. నేను ఇంకా గెలవలేదు. తదుపరి పోరాటానికి నేను సన్నద్దం కావాల్సిన తరుణం ఇది. సర్జరీలకు సమయం ఆసన్నమైంది అంటూ ఇన్స్టాలో ఓ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మీరు మరింత బలంగా తిరిగొస్తారు. గెట్ వెల్ సూన్ అంటూ పేర్కొన్నారు. కాగా ఆర్యన్ రాజేశ్ హీరోగా వచ్చిన ‘అనుమానస్పదం’ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో హీరోయిన్గా పరిచయమైన హంసానందిని.. ‘మిర్చి, అత్తారింటికి దారేది’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్తో గుర్తింపు పొందింది. కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) -
Cancer: కొత్తకొత్తగా, చెత్తచెత్తగా... తెలుసుకోవాల్సిన విషయాలు!
క్యాన్సర్ కూడా ఒక కణమే. అది కొత్తకొత్తగా, చెత్తచెత్తగా ప్రవర్తిస్తుంది. కొత్తగా ఎలా ఉన్నా ఇలా చెత్తగా ప్రవర్తించడమే దాన్ని మిగతా ఆరోగ్యకరమైన కణాల నుంచి వేరు చేస్తుంది. చెడ్డ లక్షణాలుగా ఆపాదిస్తున్న ఆ గుణాలు ఎనిమిది. అందుకే క్యాన్సర్ను ఎనిమిది వంకర్ల ‘అష్టావక్ర’ కణంగా చెప్పవచ్చు. ఆ ఎనిమిది గుణాలకు తోడుగా ఈ ఏడాది (2022లో) తాజాగా ఇప్పుడు మరిన్ని దుష్ట గుణాలను నిపుణులు కనుగొన్నారు. కొత్త చికిత్స ప్రక్రియలను కనుగొనేందుకు ఇవి తోడ్పడుతున్నందున వీటిని గురించి తెలుసుకోవడం అవసరం కూడా. అవేమిటో తెలుసుకుందాం. 1. సస్టెయిన్డ్ ప్రోలిఫరేటివ్ సిగ్నలింగ్ : కణాలన్నీ తమలోని జీవరసాయనాలతో ఒకదానితో ఒకటి సంప్రదింపులు జరుపుకోవడం, ఒకదానితో ఒకటి అనుసంధానితమై ఉండటం చేస్తుంటాయి. క్యాన్సర్ కణాలు విచిత్రంగా తమ సొంత సిగ్నలింగ్ వ్యవస్థను కలిగి ఉండటమే కాదు... ఆరోగ్యకరమైన కణాలు సంభాషించుకున్నట్లుగా, ఒక క్రమబద్ధమైన రీతిలో అనుసంధానితమై ఉన్నట్లుగాను ఉండవు. పక్కవాటితో నిమిత్తం లేకుండా తాము స్వతంత్రంగా, ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ ఉంటాయి. ఈ గుణాన్ని సస్టెయిన్డ్ ప్రోలిఫరేటివ్ సిగ్నలింగ్గా నిపుణులు పేర్కొంటుంటారు. 2. దేహపు సిగ్నల్స్ స్వీకరించకపోవడం : దేహంలో ఎక్కడైనా చెడు కణాలు ఉంటే వాటిని తుదముట్టించేందుకు శరీరం నుంచి ఆజ్ఞలు వెలువడతాయి. వాటి ఆధారంగా ఆ చెడు కణాలన్నీ మిగతా ఆరోగ్యకరమైన కణాలకు చేటు చేయకుండా తమను తాము ధ్వంసం చేసుకుని అంతర్గత అవయవాల ఆరోగ్యం కాపాడాలి. కానీ క్యాన్సర్ కణాలు ఈ సిగ్నల్స్ను లెక్క చేయవు. 3. రెసిస్టింగ్ సెల్ డెత్ : ప్రతి కణం ఒక నిర్ణీత సమయం తర్వాత మరణిస్తుంటుంది లేదా అంతమైపోతుంటుంది. కానీ క్యాన్సర్ కణం అలా మరణించడానికి ఇష్టపడదు. అందుకే చావు లేని వరం పొందిన రాక్షసుల్లా అది రెచ్చిపోతుంటుంది. 4. ఎనేబిలింగ్ రిప్లికేటివ్ ఇమ్మోర్టాలిటీ: ముందు పేర్కొన్న (‘రెసిస్టింగ్ సెల్ డెత్’) అంశంలో చెప్పినట్లుగా లోపభూయిష్టమైన కణం... ఇతర కణాలకు నష్టం చేయకుండా ఉండేందుకు అంతమైపోవాలి. కానీ క్యాన్సర్ కణం అలా అంతమైపోకుండా ఉండటమే కాదు... తనలాంటి లోపభూయిష్టమైన కణాలను ఉత్పత్తి చేస్తుంది. అది కూడా ఒకటి రెండుగానూ... రెండు నాలుగుగానూ కాకుండా... కణవిభజన నిబంధలను అతిక్రమించి ఒకటి నాలుగుగానూ... ఆ నాలుగు అరవై నాలుగుగా.. ఇలా ఇష్టం వచ్చినట్లు అపరిమితంగా పెరిగిపోతుంది. అందుకే క్యాన్సర్ గడ్డలు ఒక క్రమతతో కాకుండా... గడ్డల్లా (ట్యూమర్స్లా) అసహ్యం గా పెరుగుతాయి. 5. ఇండ్యూసింగ్ / యాక్సెసింగ్ వాస్క్యులేచర్ : అన్ని కణాలకు నిర్ణీతమైన రీతిలో ఆక్సిజన్ లేదా పోషకాలు అందాలి. కానీ క్యాన్సర్ గడ్డలు... కణాల నిబంధనలన్నీ తోసిరాజంటూ తాము స్వయంగా రూపొందించుకున్న మార్గాల ద్వారా ఆరోగ్యకరమైన కణాలకు అందనివ్వకుండా... అన్ని పోషకాలను తామే స్వీకరిస్తాయి. అందుకే క్యాన్సర్ వచ్చిన రోగి బలహీనంగా మారిపోతుంటాడు. ఇలా క్యాన్సర్ కణాలు సొంత రక్తప్రసరణ మార్గాలను ఏర్పాటు చేసుకోవడాన్నే ‘ఇండ్యూసింగ్ / యాక్సెసింగ్ వాస్క్యులేచర్’ అని నిపుణులు చెబుతుంటారు. 6. యాక్టివేటింగ్ ఇన్వేజన్ అండ్ మెటాస్టాసిస్: ఒక నిర్ణీత క్రమంలో కాకుండా... తానున్న ప్రాంతాన్ని వదిలి... వేరే అవయవాల కణాల్లోకి వలస వెళ్లి... అక్కడ స్థిరపడటం, అక్కడ మళ్లీ పెరిగిపోవడాన్నే ‘మెటాస్టాసిస్’ / ‘మెటస్టాటిక్ గ్రోత్’ అంటారు. ఉదాహరణకు కాలేయానికి క్యాన్సర్ వచ్చిందనుకుందాం. అది అక్కడికే పరిమితమై పోకుండా పక్కన ఉన్న అన్ని అవయవాలకు పాకడాన్ని మెటాస్టాసిస్ అంటారు. ఇలా క్యాన్సర్ పక్కకణాలపై దాడి చేసినట్లుగా అన్నిచోట్లకు పాకే ప్రక్రియను ‘యాక్టివేటింగ్ ఇన్వేషన్ అండ్ మెటాస్టాసిస్’ అంటారు. 7. రీ–ప్రోగ్రామింగ్ సెల్యులార్ మెటబాలిజమ్ : ఓ కణంలో క్రమబద్ధమైన రీతిలో జీవక్రియలు జరగడాన్ని మెటబాలిజమ్ అంటారు. ఈ కార్యక్రమాన్ని దెబ్బతీయడమే కాకుండా... తనకు ఇష్టమైన రీతిలో అక్కడి కార్యకలాపాలు జరిగేలా క్యాన్సర్ కణం జీవక్రియలను రీ ప్రోగ్రామింగ్ చేస్తుంది. ఇది కణానికి తీవ్రనష్టం కలిగిస్తుంది. 8. అవాయిడింగ్ ఇమ్యూన్ డిస్ట్రక్షన్: మన దేహంలో చెడు కణం పుట్టగానే రోగనిరోధక వ్యవస్థ రంగంలోకి దిగి దాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది. కానీ క్యాన్సర్ కణం ఈ ఇమ్యూన్ వ్యవస్థను తోసిరాజని పెరుగుతుంది. ఇమ్యూన్ వ్యవస్థ తనను నాశనం చేయకుండా మనుగడ సాగిస్తుంది. ఈ గుణాలను కనుగొన్న కారణంగా క్యాన్సర్ను తుదముట్టించేందుకు లేదా ఎదుర్కొనేందుకు ఇదివరలో మనకు తెలిసిన మార్గాలతో పాటు... ఇతర మార్గాలను కనుగొనేందుకు దారి సుగమమైంది. అయితే ఇంకా అదనం గా ఏవైనా గుణాలన్నాయా..? అనే అంశంతో పాటు... ఇదివరలో కనుగొన్న ఎనిమిది అంశాలపై మరింత అవగాహన కోసం పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి. తద్వారా మరింత సమర్థమైన, మెరుగైన చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆశిస్తున్నారు. ఇక్కడ పేర్కొన్న ఎనిమిది గుణాలతో పాటు ఈ ఏడాది అంటే 2022లోనే మరిన్ని గుణాలను నిపుణులు కనుగొన్నారు. ఉదాహరణకు జన్యుపరమైన చంచల స్వభావంతో ప్రవర్తించడం (జీనోమ్ ఇన్స్టెబిలిటీ అండ్ మ్యూటేషన్స్), అన్ని నిబంధనలను తోసిరాజని తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం (అన్లాకింగ్ ఫీనోటైపిక్ ప్లాస్టిసిటీ), దేహపు ఆజ్ఞలను తనకు అనుగుణంగా వ్యాఖ్యానించుకుని అన్ని విధాల చెరుపుగా చేసేవిధంగా కార్యకలాపాలు నిర్వహించడం (నాన్ మ్యూటేషనల్ ఎపీజెనెటిక్ రీ–ప్రోగ్రామింగ్), చెడు కోసం పాటుపడటం (ట్యూమర్ ప్రమోషన్ ఇన్ఫ్లమేషన్), కాలం చెల్లిన కణాలూ ఇంకా జీవించే ఉండటమే కాకుండా మంచి కణాలను తమ కార్యకలాపాలు నిర్వహించనివ్వకుండా చేయడం (సెనెసెంట్ సెల్స్), మన దేహానికి అవసరమైన మంచి బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా చేసి, చెడు సావాసాలతో చెడు బ్యాక్టీరియా దేహంలో పెరిగిపోయేలా చేయడం (పాలీమార్ఫిక్ మైక్రోబయోమ్) వంటివి కొన్ని. -
Cancer: క్యాన్సర్ గురించి అవి కేవలం అపోహలు మాత్రమే.. వాస్తవాలేమిటి?
క్యాన్సర్ గడ్డపై కత్తి ఆనిస్తే అది మరింతగా విజృంభించి విస్తరిస్తుందనీ, క్యాన్సర్ ఏదైనా... సర్జరీ చేయకూడదనే అపోహలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయి. అయితే తొలిదశ లో క్యాన్సర్ను కనుగొంటే దాన్ని నూరు శాతం నయం చేయడానికి శస్త్రచికిత్సే ప్రధాన ప్రక్రియ అనీ, దాదాపు అరవై శాతానికి పైగా క్యాన్సర్లు నయం చేయవచ్చని అంటున్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్రావు (సీఎస్ రావు). క్యాన్సర్పై ఉన్న అపోహా వాస్తవాల గురించి ఆయన ఏమన్నారో చదవండి. కొన్ని క్యాన్సర్లకు (ముఖ్యంగా రొమ్ముక్యాన్సర్ల వంటివాటికి) కేవలం శస్త్రచికిత్సే అసలైన చికిత్స అంటారు కదా. అది ఎంతవరకు వాస్తవం? జ. హార్మోన్ల తేడాలతో వచ్చే అనేక రకాల క్యాన్సర్లతో పాటు ముఖ్యంగా రొమ్ముక్యాన్సర్ వంటి వాటికి శస్త్రచికిత్సే ప్రధాన చికిత్స. నిజానికి సరైన రీతిలో శస్త్ర చికిత్స చేసినప్పుడు తొలిదశ రేడియేషన్ అవసరమే ఉండకపోవచ్చు. కాకపోతే అప్పటికే వేరేచోటికి క్యాన్సర్ కణాలు పాకి ఉండవచ్చుననే అభిప్రాయంతోనే రేడియేషన్ లేదా కీమో ఇవ్వాల్సి వస్తుంటుంది. లేదంటే కేవలం శస్త్ర చికిత్సతోనే మొత్తం రొమ్ముక్యాన్సర్ పూర్తిగా నయమవుతుంది. శస్త్రచికిత్స వల్ల వ్రణాన్ని తొలగించడం వల్ల దేహంలో కొన్ని చోట్ల సొట్టలు కూడా పడే అవకాశముంది కదా... వాటిని సరిదిద్దడానికి ఏవైనా మార్గాలున్నాయా? జ. శస్త్రచికిత్స తర్వాత పడే సొట్టలు రెండు రకాలు. అవి... 1. బయటకు కనిపించేవి 2. బయటకు కనిపించనివి. బయటకు కనిపించే వాటికే ప్లాస్టిక్ సర్జరీ అవసరం వస్తుంది. బయటకు కనిపించని వాటి కారణంగా మనలో... అంటే మనం నిర్వహించే పనుల్లో ఏవైనా లోపాలు (ఫంక్షనల్ లాస్) తలెత్తినప్పుడు మరికొన్ని శస్త్రచికిత్సల సహాయంతో వాటిని అధిగమించవచ్చు. ఇలాంటి సందర్భాల్లోనూ మళ్లీ మనకు పనికి వచ్చేది ‘శస్త్రచికిత్స’ ప్రక్రియే. ‘కత్తి ఆనిస్తే చాలు... క్యాన్సర్ మరింతగా రెచ్చిపోతుంది. ఇంకా ఎక్కువగా పాకుతుంది’ అంటారు అందుకే క్యాన్సర్పై కత్తే పెట్టకూడదు అనే మాట చాలామందిలో ఉంది. అది కేవలం అపోహా? ఇందులో ఏదైనా వాస్తవం ఉందా? జ: నిజానికి క్యాన్సర్గురించి వైద్యశాస్త్ర పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని కాలంలో క్యాన్సర్ బాగా ముదిరిపోయిన దశలో శస్త్రచికిత్స చేస్తుండేవారు. అప్పటికే క్యాన్సర్ కణాలు వేర్వేరు అవయవాలకు విస్తరించి ఉండటంతో, అసలు క్యాన్సర్ గడ్డను (ప్రైమరీని) తొలగించినప్పటికీ... ఇతర ప్రాంతాలకు విస్తరించిన గడ్డలు (సెకండరీ ట్యూమర్స్) పెరుగుతుండేవి. ఫలితంగా క్యాన్సర్కు కత్తి పెట్టకూడదనే దురభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఇప్పుడు మొదటి, రెండో దశలోనే క్యాన్సర్లను కనుగొంటున్నందున శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా నయమైపోయిన రోగులెందరో ఆరోగ్యంగా జీవిస్తున్నారు. కత్తి పెట్టలేని మారుమూల ప్రదేశాల్లో ఉండే క్యాన్సర్ గడ్డలకీ , లేదా కత్తి ఆనించడమే సమస్య గా మారే మెదడు వంటి కీలకమైన అవయవాల్లోని లోపలి భాగాల్లో ఉండే క్యాన్సర్ గడ్డలను తొలగించడానికి శస్త్రచికిత్సల్లో ఏవైనా అధునాతన ప్రక్రియలు ఉన్నాయా? జ. మనం శస్త్రచికిత్స ద్వారా చేరలేని ప్రాంతాల్లో ఉన్న క్యాన్సర్ గడ్డల (డీప్ సీటెడ్ ట్యూమర్స్)ను తొలగించేందుకు... ఎమ్మారై గైడెడ్ సర్జరీ, సింటిగ్రఫీ గైడెడ్ సర్జరీ, అల్ట్రా సౌండ్ గైడెడ్ సర్జరీ వంటి కొన్ని ప్రక్రియలు సమర్థంగా ఉపయోగపడతాయి. వాటి సహాయంతో దేహంలోని మారుమూల ప్రాంతాల్లో చాలా లోతుగా ఉన్న గడ్డలనూ తొలగించవచ్చు. భవిష్యత్తులో శస్త్రచికిత్స విషయంలో రాబోయే విప్లవాత్మకమైన మార్పులు ఏవైనా ఉన్నాయా? జ. గతంలో క్యాన్సర్ను చాలా ఆలస్యంగా కనుగొనేవారు. కానీ ఇటీవల క్యాన్సర్ తొలిదశలో ఉండగానే లేదా అంతకు చాలా ముందుగానే కనుగొనడమే ఓ విప్లవవాత్మకమైన మార్పు. కేవలం ఈ కారణంగానే కొన్ని క్యాన్సర్లు సమూలంగా నయమయ్యే అవకాశం దక్కింది. అందుకే మూడు దశాబ్దాలకు ముందు... క్యాన్సర్లలో 85 శాతం నయం కానివి ఉండేవన్న అపప్రథ ఉండేది. కానీ ఇప్పుడు 85 శాతం పూర్తిగా నయమైపోతున్నాయి. ప్రధానంగా శస్త్రచికిత్స వల్లే సమూలంగా తొలగించడం సాధ్యమవుతోంది. దీనికి తోడు రేడియో గైడెడ్ లోకలైజెషన్, రేడియోలాజికల్ లోకలైజెషన్, ఇంట్రా ఆపరేటివ్ కీమో థెరపీ, ఇంట్రా ఆపరేటివ్ రేడియో థెరపీ, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ లాంటి విప్లవాత్మకమైన ప్రక్రియల ద్వారా మరింత సమర్థమైన చికిత్సకు అవకాశం దక్కింది. క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్స ప్రాధాన్యమేమిటి? పరిమితులు ఏమిటి? జ: క్యాన్సర్కు మొట్టమొదటి వైద్యం శస్త్ర చికిత్సయే. ఇది ఎక్కువగా గడ్డల రూపంలో కనిపించే క్యాన్సర్ వ్రణాల్లో (సాలిడ్ ట్యూమర్స్) బాగా ఉపయోగపడుతుంది. ఉదా: థైరాయిడ్, ఊపిరితిత్తుల క్యాన్సర్, జీర్ణాశయం, పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ఎముకల్లో వచ్చే సార్కోమా, సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్. అంటే దాదాపు 60 శాతం క్యాన్సర్ లకు శస్త్రచికిత్స అవసరమవుతుంది. శస్త్ర చికిత్స వల్ల వ్యాధి ఏయే దశలలో ఉందన్న సమాచారమూ తెలుస్తుంది. తొలి దశలలో ఉన్న క్యాన్సర్లన్నింటినీ శస్త్రచికిత్స సహాయంతో పూర్తిగా నయం చేయవచ్చు. కొన్ని సందర్భాలలో ముదిరి పోయిన క్యాన్సర్లో శస్త్ర చికిత్స వల్లనే ఉపశమనం లభిస్తుంది. ఉదా: వాసన వచ్చే పుండు, పేగుకు రంధ్రం పడినప్పుడు, శ్వాస తీసుకునేందుకు అంతరాయం కలుగుతున్న సందర్భాల్లో శస్త్ర చికిత్సతోనే రోగికి ప్రాణదానం చేయవచ్చు. -డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ చదవండి: Gas Problem Solution: గ్యాస్ సమస్యా... పాస్తా, కేక్ బిస్కెట్స్, ఉల్లి, బీట్రూట్స్ తింటే గనుక అంతే! -
టీడీపీ నేత కుమారుడికి ప్రభుత్వం పునర్జన్మ
ముమ్మిడివరం: క్యాన్సర్తో బాధపడుతున్న ఓ టీడీపీ నేత కుమారుడికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆదుకుంది. సకాలంలో డబ్బులు అందజేసి యువకుడిని కాపాడింది. వివరాలు.. తూర్పు గోదావరి జిల్లా టి.కొత్తపల్లికి చెందిన టీడీపీ నేత నక్కా రామకృష్ణ కుమారుడు దిలీప్ సదన్య(18) బోన్ కేన్సర్తో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కుమారుడి వైద్య ఖర్చుల కోసం రామకృష్ణ తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కు తెలిసింది. ఆయన వెంటనే స్పందించి.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.7.50 లక్షలు మంజూరు చేయించారు. ఈ సొమ్ముతో నెల రోజుల కిందట హైదరాబాద్లోని సిటిజన్ హాస్పిటల్లో దిలీప్కు వైద్యం చేయించారు. అతడు ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఇంటికి క్షేమంగా చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో నక్కా రామకృష్ణ కుటుంబసభ్యులు సోమవారం ఎమ్మెల్యే పొన్నాడను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం చేసిన ఈ సాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. -
కీమోతో సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువ కదా.. తీసుకోవాలా వద్దా?
మందుల ద్వారా క్యాన్సర్కు చేసే చికిత్సనే కీమోథెరపీ లేదా కీమో అంటారు. దేహంలో కొన్ని ప్రాంతాల్లో వచ్చే క్యాన్సర్ సర్జరీ ద్వారా తొలగించడానికి అంత అనువుగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కీమోలో ఇచ్చే రసాయనాల ద్వారా వాటిని నాశనం చేయ?డానికి ప్రయత్నిస్తారు. కీమోథెరపీలో 100పైగా మందులను వివిధ కాంబినేషన్లలో వినియోగిస్తుంటారు. ఒక్కోసారి ఒకేమందునే వాడవచ్చు కూడా. అయితే సాధారణంగా వివిధ రకాల మందుల సమ్మేళనంతో ఒక క్రమపద్ధతి లో కీమోలో ఇస్తుంటారు. ఈ రకరకాల మందులన్నీ వాటి ఉమ్మడి ప్రభావంతో క్యాన్సర్ కణాలపై పోరాడి వాటిని తుదముట్టిస్తాయి. ఒకే మందు వాడటం వల్ల క్యాన్సర్ కణాలు దానికి లొంగకుండా తయారయ్యే ప్రమాదం ఉన్నందున కీమోథెరపీలో కాంబినేషన్స్కు ప్రాధాన్యమిస్తుంటారు. ఆ రోగిలో ఉన్న క్యాన్సర్ రకాన్ని, అతడి కండిషన్ను బట్టి ఏయే మందులు ఎంతెంత మోతాదులో, ఎంతకాలంపాటు ఇవ్వాలన్నది డాక్టర్లు నిర్ణయిస్తుంటారు. క్యాన్సర్లలో చాలా రకాలు ఉన్నాయి. అవి శరీరంలో ఒక్కో భాగంలో ఒక్కో విధంగా పెరుగుతుంటాయి. కాబట్టి అవి పెరిగే విధానాన్ని అనుసరించి, వాటిని లక్ష్యంగా చేసుకొని అనేక కీమోథెరపీ మందుల రూపకల్పన జరిగింది. అందువల్ల ప్రతి మందు వేర్వేరుగా పనిచేస్తుంటుందని గుర్తుంచుకోవాలి. ఇక కీమోథెరపీ వల్ల క్యాన్సర్ కణాలతో పాటు శరీరంలోని సాధారణ కణజాలం సైతం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కీమో వల్ల పేషెంట్ కొంత అసౌకర్యానికి, ఇబ్బందికి గురవుతుంటారు. ఈ సైడ్ఎఫెక్ట్స్ వల్ల ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తి మోతాదులో మందు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కీమో సైడ్ఎఫెక్ట్స్లో భాగంగా... వాంతులు, వికారం, అలసట, జుట్టు రాలిపోవడం (ఇది తాత్కాలికం) వంటివి కలగవచ్చు. రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోవడం మాత్రం కాస్త తీవ్రమైన పరిణామం. అయితే... ఇటీవల సైడ్ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే కీమోథెరపీ మందులనూ రూపొందిస్తున్నారు. అందుకే క్యాన్సర్ పేషెంట్లు... డాక్టర్ సూచించినప్పుడు అపోహలు తొలగించుకుని, కీమో తీసుకోవడమే మంచిది. -
'ప్లీజ్.. పప్పను బతికించండి.. లేకపోతే నేను ఒంటరి వాన్నవుతాను'
సాక్షి, నిజామాబాద్(మోర్తాడ్): ‘అందరికీ నమస్కారం.. నాకు నా పప్పా కావాలి.. ఎలాగైనా మీరే మా పప్పాను కాపాడాలి... లేకపోతే నేను ఒంటరి వాన్ని అయిపోతాను.. అందరికి చేతులెత్తి మొక్కుతున్నా.. ప్లీజ్ ప్లీజ్’ అంటూ వచ్చిరాని మాటలతో నాలుగేళ్ల అరింద్ర తన తండ్రి కోసం వేడుకుంటున్న వీడియో కన్నీళ్లను పె ట్టిస్తోంది. తన తండ్రి ఆరోగ్యం కోసం బాలుడు వేడుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న మోర్తాడ్కు చెందిన రాజేంద్రప్రసాద్కు క్యాన్సర్ సోకింది. అస లే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడాలంటే మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరి స్థితి బాగాలేకపోవడంతో ఆపన్నహస్తం కోసం అత ని కుటుంబం ఎదురుచూస్తోంది. రాజేంద్రప్రసాద్ ఉపాధి కోసం టైలరింగ్ పని చేస్తుండేవాడు. కొన్ని నెలల కింద కడుపులో క్యాన్సర్ సోకడంతో తీవ్ర అ నారోగ్యానికి గురయ్యాడు. మెరుగైన వైద్యం కోసం అవస్థలు పడుతున్న సమయంలోనే క్యాన్సర్ మహ మ్మారి లీవర్కు పాకింది. అతనికి ఆపరేషన్ చేయాలంటే కనీసం రూ. 15 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చారు. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్న రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం కరీంనగర్లో చికిత్స పొందుతున్నాడు. దాతలు సంప్రదించాల్సిన వివరాలు అకౌంట్ నంబర్ : 62255754401 పేరు : రాజేంద్రప్రసాద్, బ్యాంకు : ఎస్బీఐ ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఆఐN0020268 ఫోన్ పే నంబర్ : 9010767362 -
‘నాకు ఇద్దరు కొడుకులు.. అందులో ప్రమాదంలో ఒకరి ప్రాణం’
అమ్మా.. ఇంటికి తీసుకెళ్లమ్మా.. నాకు ఇక్కడ ఉండబుద్ది కావడం లేదు. ఇంట్లో అన్నయ్యతో అడుకోవాలని ఉందమ్మా అంటూ ఒక్కతీరుగా బతిమాలుతున్నాడు రమేశ్. కానీ అతనికి ఎలా చెప్పను? ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితిలో లేనని ! అప్పుడు ఐదేళ్లు నిండిన నా కొడుకు రమేశ్ మళ్లీ ఇంటి ముఖం చూడగలడా? పిల్లలే ప్రపంచం నా భర్త ఆది నెలంత కష్టపడి పని చేస్తే వచ్చే డబ్బులు నాకు. నా ఇద్దరు పిల్లలకు ఉండటానికి ఇళ్లు , తినడానికి తిండికి సరిపోతుంది. ఆస్థిపాస్తులు లేవన్న దిగులు మాకు పెద్దగా లేదు. ఎందుకంటే ఆటపాటలతో ఇంటికి అందం తెచ్చే ఇద్దరు పిల్లలు మాకు ఉన్నారు. వాళ్ల అల్లరితో మా ఇంట్లో ఎప్పుడు పండగే అన్నట్టుగా ఉండేది. ఆస్పత్రికి వెళితే నా చిన్న కొడుకు రమేశ్ కొంత కాలంగా నీరసంగా ఉంటున్నాడు. పదేపదే జ్వరం వచ్చి పోతుంది. దగ్గరల్లో డాక్టరుకు చూపిస్తే నయమవడం లేదు. అందుకే విశాఖపట్నం తీసుకుపోయాను. అక్కడ రమేశ్కు మరికొన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు గుండె పగిలే వార్తను చెప్పారు. బోన్మ్యారో తప్పనిసరి రమేశ్ హెల్త్ రిపోర్టులు పరిశీలించిన డాక్టర్లు.. ‘ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా’ అనే క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టుగా చెప్పారు. ఈ వ్యాధి నయం కావాలంటే మజ్జా మార్పిడి (హాప్లో- ఐడెంటికల్ అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ / బోన్మ్యారో, స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంటేషన్) ఆపరేషన్ చేయాలని చెప్పారు. ట్రీట్మెంట్కి రూ. 20 లక్షలు రమేశ్ ప్రాణాలు దక్కాలంటే తాము సూచించిన ట్రీట్మెంట్ చేయక తప్పదని డాక్టర్లు చెప్పారు. ఈ ట్రీట్మెంట్కి 30 రోజుల సమయం పడుతుందని, అందుకు రూ. 20 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. ఎలాగైనా నా బిడ్డ ప్రాణాలు దక్కించుకోవాలని పొదుపు చేసిన డబ్బులు, లోనుగా తీసుకున్న నగదుతో పాటు తెలసిన అందరి దగ్గర చేబదులు తీసుకున్నాం. అంతా ట్రీట్మెంట్కే ఖర్చయి పోయింది. కాపాడండి ఇప్పుడు రమేశ్ ప్రాణాలు దక్కాలన్నా .. ఐదేళ్ల వయస్సు ఉన్న వాడు రేపటి భవిష్యత్తును చూడాలన్నా ఖరీదైన ట్రీట్మెంట్ చేయించకతప్పదు. కానీ ఇప్పుడు అంత ఖర్చుతో ట్రీట్మెంట్ చేయించే స్థోమత మాకు లేదు. అలా అని నా బిడ్డను చూస్తూ.. చూస్తూ.. చావు ఒడికి చేర్చలేను. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజ్ చేసే కెట్టో గురించి తెలిసి, వారిని కలిశాను. నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి. రమేశ్కి రేపటి రోజులను అందించండి. కొడిగట్టుకుపోతున్న వాడి ప్రాణాలను కాపాడండి. (అడ్వటోరియల్) సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
క్యాన్సర్ను జయించే క్రమంలో... మీరు విజేత కావాలంటే..?
మునపటి జవజీవాలూ, జీవితం పట్ల అనురక్తి, బతికే క్షణాలను ఆస్వాదించడం లేకుండా ఓ వ్యక్తి జీవితాన్ని కొన్ని రోజులూ, కొన్నేళ్లూ అంటూ పొడిగించడం సబబేనా? ఓ జీవచ్ఛవంలా బాధితుడు తన బతుకును వెళ్లదీయడం సరైనదేనా? ఇలాంటిదే గతకాలపు చికిత్సల్లో చాలావరకు ఉండేది. దీన్ని దృష్టిలో పెట్టుకునే... బాధితుడి జీవితాన్ని కేవలం కొద్దికాలం పొడిగించడానికి బదులుగా... క్యాన్సర్ను జయించాక కూడా అతడు ఇంచుమించు ‘మునపటి జీవననాణ్యత’నే అనుభవించేలా చేయడమే మంచి చికిత్స లక్ష్యం. ఇలా జరిగేలా ఇటీవలి చికిత్స ప్రక్రియలను మెరుగుపరస్తున్నారు. దీన్ని బట్టి... క్యాన్సర్ను జయించడం లేదా అధిగమించడమంటే (ఇంగ్లిష్లో చెప్పాలంటే క్యాన్సర్ సర్వైవర్షిప్ అంటే) ‘‘క్యాన్సర్ను కనుగొన్ననాటి నుంచి అతడి జీవితపర్యంతమూ... బాధితుడికి మునపటి జీవితాన్నీ, ఒకప్పటి సంపూర్ణ ఆరోగ్యాన్నీ ఇచ్చేలా చేయడమే’’ క్యాన్సర్ వైద్యమంటూ ఈ చికిత్సను పునర్నిర్వచించారు. అలా జరిగే క్రమంలో రోగి ఏయే దశలు దాటాల్సి వస్తుందో తెలుసుకోవడం అవసరం. క్యాన్సర్ అంటే... అప్పట్లో తొలినాళ్లలో కేవలం 20 శాతం మంది మాత్రమే దాన్ని జయించేవారు. 80 శాతం మంది దాని బారినపడేవారు. కానీ వైద్యవిజ్ఞాన పురోగతితో అత్యాధునిక పరిశోధనల వల్ల ఇవాళ 85శాతం మంది దాన్ని పూర్తిగా జయిస్తున్నారు. కేవలం 15 శాతం మంది మాత్రమే దాని నుంచి తప్పించుకోలేకపోతున్నారు. అంటే... క్యాన్సర్ చికిత్స విషయానికి వస్తే... గతం తాలూకు సన్నటి నల్లమబ్బుల వెండి అంచు స్థానంలో... ఇప్పుడు చాలావరకు కాంతిమంతమైన వెలుగురేకలు వ్యాపించాయి. కానీ ఇంకా అక్కడా ఇక్కడా ఇంకా కొన్ని కారుమేఘాలు కప్పే ఉన్నాయి. ‘‘ముందే కనుగొంటే క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుంద’’ని భరోసా ఇవ్వడం అందరూ చెప్పేదే. కానీ క్యాన్సర్ సోకాక ప్రతి దశలోనూ రోగి ఆవేదన, మనోభావాల గురించి ఇప్పటివరకు ఎవరూ పెద్దగా ఎవరూ చర్చించడంలేదు. చికిత్స సమయంలో బాధితులు క్యాన్సర్ను జయించే క్రమంలో కొన్ని మైలురాళ్లు దాటాల్సి వస్తుంటుంది. ఆ దశలెలా ఉంటాయి, మాజీ రోగుల గత అనుభవాలతో ప్రస్తుత బాధితులు ఆ వేదనను ఎలా అధిగమించవచ్చో, క్యాన్సర్నెలా జయించవచ్చో తెలిపే కథనమిది. క్యాన్సర్తో పోరాటం ఒకింత గమ్మత్తయినది. ఒక్కోసారి పూర్తిగా తగ్గుతుంది. కానీ గత కాలపు శిథిలాల గుర్తుల్లా కొంత వేదననూ మిగుల్చుతుంది. దీన్ని ఎలా చెప్పవచ్చంటే... ‘గాయం మానింది... గాటు మిగిలింది’ లాంటి అనుభవంతో మిగిలిపోయిన మచ్చ కనిపిస్తూ మనసును సలుపుతూ ఉంటుంది. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! క్యాన్సర్ను జయించే క్రమంలో దశలివి... క్యాన్సర్ను పూర్తిగా జయించి, మునపటి మంచి జీవితాన్ని పొందే క్రమంలో ఈ కింది నాలుగు దశలను బాధితుడు దాటాల్సివస్తుంది. ►క్యాన్సర్ను కనుగొనగానే (డయాగ్నోజ్ కాగానే) బాధితుడికి కలిగే షాక్ తొలిదశ. ఇందులో... క్యాన్సర్ అన్న మాట వినగానే ఎంతవారికైనా ఊహించని దెబ్బ తగిలినట్లవుతుంది. ►చికిత్సకూ... వ్యాధి నయమవడానికి మధ్యకాలపు సంధిదశ (ట్రాన్సిషనల్ సర్వైవర్షిప్): ఈ దశలో బాధితుడు జబ్బు నయమయ్యే దిశగా పురోగమిస్తున్నప్పటికీ ఎంతో కొంత ఉద్విగ్నతతో (యాంక్షియస్గా), వ్యాకులతతో, కుంగుబాటుకు లోనై (డిప్రెస్డ్గా) ఉంటాడు. ఈ దశలో వారినో సందేహం వేధిస్తుంటుంది. ఒకవేళ తగ్గినట్టే తగ్గినా ఇది మళ్లీ తిరగబెడుతుందా అన్న సంశయంలో ఉంటారు. ►జబ్బును అధిగమించాక దొరికిన జీవితం : (దీన్ని ఎక్స్టెండెడ్ సర్వైవర్షిప్గా చెప్పవచ్చు) మూడు రకాలుగా ఉంటుంది. అది (1) క్యాన్సర్ తగ్గిన దశ; (2)క్యాన్సర్ అంటూ ఉండదుగానీ... దానికోసం నిత్యం నిర్వహణ కార్యకలాపాలు (మెయింటెనెన్స్) ఉండాలి. ఆ మెయింటెనెన్స్ ఉన్నంతసేపూ క్యాన్సర్రహిత స్థితి ఉంటుంది. (3) క్యాన్సర్ ఉంటుంది గానీ... చివరి వరకూ కాస్త సాధారణ జీవితమే కొనసాగుతుంటుంది. ►క్యాన్సర్నుంచి సంపూర్ణ, శాశ్వత విముక్తి (పర్మనెంట్ సర్వైవర్షిప్): ఈ దశలోనూ మళ్లీ మూడు చిన్న చిన్న దశలుంటాయి. మొదటిది... క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోతుంది. దాని తాలూకు ఎలాంటి లక్షణాలూ లేకుండా మటుమాయమవుతుంది. రెండోది... క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుంది. కానీ ఎవో కొన్ని అంశాలు మాత్రం దీర్ఘకాలం బాధిస్తుంటాయి. ఉదాహరణకు... కాస్తంత కుంగుబాటు (డిప్రెషన్) లేదా ఎప్పుడూ అలసటగా ఉండటం (ఫెటీగ్). మూడోది... అసలు క్యాన్సర్ తగ్గడం... కానీ దాని కారణంగా కొన్ని ఇతర అనుబంధ సమస్యలు బాధించడం. నాలుగోది... అసలు క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుంది. కానీ అది ఇతర అవయవాలకు వ్యాపించి అనుబంధ క్యాన్సర్లకు కారణమవుతుంది. దాంతో మళ్లీ చికిత్స కొనసాగాల్సి వస్తుంటుంది. బాధితుడు ఈ నాలుగు దశలూ దాటక తప్పదని రోగులూ, వారి బంధువులూ, మిత్రులూ తెలుసుకోవాలి. అందుకు తగినట్టుగా అతడికి తగిన నైతిక మద్దతు అందిస్తే పూర్తిగా కోలుకోవడం తప్పక జరుగుతుంది. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. మరి రోగి, బంధువులు ఏం చేయాలి? ముందు చెప్పిన దశలన్నీ వచ్చే సమయంలో... అవి అనివార్యంగా రోగిపైనా, అతడి బంధుమిత్రులపైన కొంత ‘ఉద్వేగపూరితమైన’ భారాన్ని (ఎమోషనల్ బ్యాగేజ్ను) తప్పక మోపుతాయి. వాళ్లు ఆ బరువును ఎలా దించుకోవాలో తెలిపే సూచనలివి. ►వారు గతంలో అనుభవించని కొత్త కొత్త ఉద్విగ్నతలకు, భావనలకు లోనవుతుంటారు. అది ప్రతిరోజూ, ప్రతి గంటా, ప్రతి నిమిషమూ కావచ్చు. అది చికిత్స జరుగుతున్నప్పుడూ లేదా చికిత్స పూర్తయ్యాకా అనుభవంలోకి రావచ్చు. అతడికే కాదు. అతడి బంధుమిత్రులూ దీనికి గురికావచ్చు. ఇదంతా పూర్తిగా నార్మల్. ►అనేక భావోద్వేగాలు కమ్మేయవచ్చు. తెలియని ఆగ్రహాలు, భయాలు, ఆందోళనలు, ఒత్తిళ్లు, ఆవేదనలు, అపరాధభావనలు, ఒంటరిదనం... లాంటి ఎన్నో ఫీలింగ్స్ వచ్చేస్తుంటాయి. ఇవి బాధిస్తున్నాయనే దానికి బదులుగా... వాటి నుంచి బయటపడటం ఎలా అనే దాని గురించే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. ►అన్నిటికంటే ప్రధానమైనది ఏమిటంటే... బాధితుడు తనలోని భావాలూ, అనుభూతులూ, ఆవేదనలను వ్యక్తపరచడం చాలా ముఖ్యం. అలా చేయడం వల్ల వాటినుంచి దూరం కావడం చాలా తేలిక. ఈ పనిని అతడు తనకు తానుగానూ చేయవచ్చు. లేదా కొన్నిసార్లు ఒకేలాంటి క్యాన్సర్తో అలాంటి చికిత్సనే తీసుకుంటున్నవారంతా ఒక గ్రూప్గా కూడా మంచి ఫలితం ఇస్తుంది. సాధ్యమైతే ఒక్కోసారి తాము అనుభూతిస్తున్న భావనలను మంచి శైలిలో రాయడం కూడా మేలైన ఫలితాలిస్తుంది. ఇలా బాధితుడు తన భావనల వ్యక్తీకరణకు ఎలాంటి మార్గమైనా ఎంచుకోవచ్చు, కాకపోతే వ్యక్తీకరించడమే ముఖ్యం. ►ఈ క్రమంలో బాధితుడి అత్యంత వేదనాభరితమైన దశల్లో... కలిగింది చిన్నపాటి ప్రయోజనమైనా అది కొండంత అండ అవుతుంది. ఒకేమాటలో చెప్పాలంటే... ‘‘చిన్నపాటి మేలే తనకు చిరునవ్వు తెచ్చిపెడుతుంది’’. ►క్యాన్సర్ బాధితులు చాలామంది చేసే పని... తాము చేయని తప్పుకు తమను నిందించుకుంటూ ఉంటారు. ‘‘మేం అప్పట్లో చేసిన ఆ పనివల్లనే ఈ పర్యవసానం. అదే పనిచేసినా... చేస్తున్నవారు హాయిగానే ఉన్నారు. మేమేం పాపం చేశామని మాకీ శిక్ష’’అంటూ బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పటికీ క్యాన్సర్ ఎందుకు వస్తుందో వైద్యవిజ్ఞానానికీ తెలియదు. ఇందులో బాధితుడి తప్పేమీ లేదు. అతడికా అపరాధభావన అవసరమే లేదు. తమ గతకాలపు పనులకు తమను తాము నిందించుకోవడం కంటే... అన్నీ మరచి హాయిగా, ఆనందంగా ఉండటానికి ప్రయత్నించడమే మంచి జీవననాణ్యతకు మెరుగైన మార్గం. - డాక్టర్ సురేష్ ఏవీఎస్, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
Science Facts: క్యాన్సర్ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి..
ప్రాచీనకాలం నుంచి పసుపు మన జీవితాలతో ముడిపడి ఉంది. తాపనివారణ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ వరకు దీనిలోని ఔషధగుణాలను శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. ఏదిఏమైనప్పటికీ దీని ప్రయోజనాలు లెక్కకుమించి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐతే తాజాగా వివిధ రకాల క్యాన్సర్లకు చికిత్స చేయడానికి, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో పసుపు ఏ విధంగా ప్రభావం చూపుతుందనే అంశంపై అనేక పరిశోధన అధ్యయనాలు దృష్టి సారించాయి. దీర్ఘకాలిక తాపం, క్యాన్సర్ అభివృద్ధికి మధ్య సహసంబంధం ఉన్నందువల్ల, పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వ్యాధితో పోరాడడంలో ప్రయోజనకరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చదవండి: The Singing Ringing Tree: ఈ చెట్టు మధురంగా పాడుతుందట..!.. వినాలంటే.. 2019లో న్యూట్రియంట్స్ అనే సైంటిఫిక్ జర్నల్ ప్రచురించిన నివేధికలో కూడా.. పసుపు రొమ్ము క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధిస్తుందని, కణితి పెరుగుదల మందగించేలా ప్రేరేపిస్తుందని పేర్కొంది. అంతేకాకుండా ఊపిరితిత్తులు, పెద్దపేగు, క్లోమ.. వంటి కొన్ని ఇతర రకాల క్యాన్సర్లకు చికిత్సగా పసుపును వినియోగించడంపై పరిశోధనలు జరుగుతున్నాయని తెల్పింది. ఇప్పటికీ పరిశోధనల ఫలితాలు ఒక కొలిక్కిరాన్పటికీ, టెస్ట్ ట్యూబ్, జంతు అధ్యయనాల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు ఈ నివేదిక తెల్పింది. చదవండి: పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..! క్యాన్సర్ చికిత్సలో పసుపును ఉపయోగించడంలో అతిపెద్ద అడ్డంకి ఏంటంటే.. పసుపును ఎక్కువ మోతాదులో మానవ శరీరం గ్రహించలేకపోవడం. ఈ అడ్డంకిని అధిగమించడానికి ఫార్మకాలజిస్టులు కృషి చేస్తున్నారు. ఐతే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకు... పసుపును క్యాన్సర్కు చికిత్సగా ఉపయోగించడం కుదరదు. చదవండి: Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే.. -
3 ప్రాంతాల్లో క్యాన్సర్ ఆస్పత్రులు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకంగా ఆస్పత్రులను ఏర్పాటు చేయడంతో పాటు అందులో ఒకటి అత్యాధునికంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారని ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో ఆయన సమావేశమయ్యారు. ప్రజారోగ్యం, ముఖ్యంగా క్యాన్సర్ నివారణ, చికిత్సలు, ఆధునిక విధానాలపై సుదీర్ఘ సమాలోచనలు జరిగాయి. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్ నోరిని ఈ సందర్భంగా సీఎం కోరారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం డాక్టర్ నోరి దత్తాత్రేయుడు వివరాలను వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా... రాష్ట్రంలో ప్రజారోగ్యరంగంపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వాసుపత్రులలో చేపడుతున్న నాడు – నేడు, వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించాం. క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సుదీర్ఘంగా చర్చించడంతోపాటు పరస్పరం ఆలోచనలు పంచుకున్నాం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్స కోసం ఆస్పత్రులు నెలకొల్పి అందులో ఒకటి అత్యాధునికంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ సంకల్పించారు. వివిధ మెడికల్ కాలేజీలు, జిల్లా ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్సలను దీనికిందకు తేవాలన్నది ముఖ్యమంత్రి ప్రణాళిక. క్యాన్సర్ రోగులందరికీ చికిత్సలు అందుబాటులోకి తీసుకు రావాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. చిన్న గ్రామంలో క్యాన్సర్ రోగి ఉన్నా చికిత్స కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్నది ముఖ్యమంత్రి ఆశయం. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏపీలోనే చికిత్స లభ్యమయ్యేలా చూడాలన్న ప్రధాన లక్ష్యంగా చర్చ కొనసాగింది. రాష్ట్రానికి తగిన సహాయ సహకారాలు అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నట్లు తెలియచేయడంతో ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో సమావేశం కావడం ద్వారా రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్సకు గొప్ప అడుగు పడింది. సీఎం జగన్ ఆరోగ్య రంగంలో తీసుకున్న చర్యలన్నీ నాకు చాలా నచ్చాయి. మెడికల్ కాలేజీలు, జిల్లా ఆస్పత్రులను బాగు పరచడం, కొత్తవి ఏర్పాటు చేస్తుండటం చాలా ఆనందాన్నిస్తోంది. -
క్యాన్సర్.. ఫాలో అప్ల ప్రాధాన్యమెంత? ఇదిగో ఇంత!
Importance Of Follow-Up Care: క్యాన్సర్ అన్న పదం వింటేనే ఎంతో ఆందోళన. అయితే.. త్వరగా వ్యాధి నిర్ధారణ జరిగి.. రకాన్ని బట్టి చికిత్స రేడియోథెరపీనా, కీమోథెరపీనా లేక శస్త్రచికిత్సా అన్నది నిర్ణయించాక, ఆ తర్వాత ఫాలో అప్లన్నీ సరిగ్గా జరుగుతుంటే దాన్ని తేలిగ్గానే అదుపు చేయవచ్చు. క్యాన్సర్ చికిత్సలో ఫాలోఅప్ల ప్రాధాన్యమేమిటో తెలుసుకుందాం. క్యాన్సర్కు ఇదమిత్థంగా ఇలాగే అంటూ నిర్దిష్ట చికిత్స ఇవ్వడం సాధ్యం కాదు. క్యాన్సర్ రకంతో పాటు మరెన్నో అంశాలు చికిత్స జరగాల్సిన తీరును నిర్ణయిస్తాయి. ఫాలో అప్ అంటే డాక్టర్లు నిర్ణయించిన సమయాల్లో తర్వాత్తర్వాతి చికిత్సలకు హాజరుకావడంగా చెప్పవచ్చు. అవి... ప్రధాన చికిత్స తర్వాత... నిర్ణీత వ్యవ«ధుల్లో అంచెలంచెల్లో జరుగుతుంటాయి. ఇవి కేవలం ప్రధానంగా చికిత్స విషయంలోనే కాదు... బాధితుడికి మానసికంగా, సామాజికంగా... వ్యాధి ముదరకుండా చూడటం ద్వారా ఆర్థికంగా కూడా సాంత్వన ఇస్తాయి. చదవండి: ఆర్థరైటిస్ నొప్పులకు పెయిన్ కిల్లర్స్ వద్దు! ఈ ఫాలో అప్లో రక్తపరీక్షల వంటివి మాత్రమే కాకుండా... దేహంలో వచ్చే ఇతరత్రా మార్పులను పసిగట్టడానికి రకరకాల పరీక్షలు అవసరమవుతూ ఉంటాయి. సాధారణంగా మిగతా వ్యాధుల చికిత్సలతో పోలిస్తే ఇవి చాలాకాలం పాటు అలా కొనసాగుతూ ఉండటమనే అంశం కూడా రోగి మానసిక స్థైర్యానికి పరీక్ష పెడుతుంటుంది. అందుకే క్యాన్సర్ బాధితులకు మానసిక బలం కూడా చాలా అవసరమని అందరూ గుర్తించాలి. ఫాలో అప్ ప్లాన్ ఎలా ఉంటుందంటే.. క్యాన్సర్ రోగులందరికీ చికిత్స ఒకేలా ఉండనట్లే... ఫాలో అప్లు కూడా నిర్ణీతంగా ఉండవు. అవి చాలా అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు.. బాధితుడికి ఉన్న క్యాన్సర్ రకం, అతడికి ఇచ్చే చికిత్స (రేడియోథెరపీయా / కీమోథెరపీనా / శస్త్రచికిత్సా?... మొ.) రోగి సాధారణ ఆరోగ్యం /చికిత్స ఇచ్చాక అతడిక పరిస్థితులు మొదలైనవి. అందరి విషయంలో ఒకేలా ఉండకపోయినా.. ఫాలో అప్లలోనూ కొన్ని సాధారణ సామ్యతలు కనిపిస్తాయి. ఉదాహరణకు... చికిత్స పూర్తయిన మొదట్లో నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధిలో మొదటిసారీ, ఆ తరువాత ప్రతీ 3 – 4 నెలలకు ఒకసారి చొప్పున ఆంకాలజిస్టులను కలవాల్సి రావచ్చు. ఆ తర్వాత ప్రతి మూడు లేదా నాలుగు నెలలకోసారి చొప్పున కలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెరుగుదలను బట్టి ప్రతి ఏడాదికోసారి లేదా రెండుసార్లు ఉండవచ్చు. చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్గా.. చికిత్స తర్వాత ఉద్భవించే ప్రశ్నలు... ప్రధాన చికిత్స తర్వాత ఫాలో అప్ల సమయంలో రోగిలో వచ్చే కొన్ని సందేహాలివి... ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ డాక్టర్ను తప్పక అడిగి తెలుసుకోవాలి. ► పూర్తిగా కోలుకోడానికి ఎంత సమయం పట్టవచ్చు? ►ఎలాంటి లక్షణాలూ లేదా చిహ్నాలు కనిపిస్తే డాక్టర్ను వెంటనే కలవాలి? ►చికిత్స తర్వాత తరచూ చేయించాల్సిన ప్రధాన పరీక్షలేమిటి? అవెంత తరచుగా చేయించాలి? ►ప్రధాన చికిత్స తర్వాత దీర్ఘకాలంలో కనిపించే సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి? ►మళ్లీ తిరగబెట్టడానికి అవకాశం ఉందా? అయితే... అవకాశం ఎంత? ►ఏయే డాక్యుమెంట్లు / ఏయే పరీక్షల ఫలితాల రిపోర్టులు జాగ్రత్తగా ఉంచాలి? ►మళ్లీ మునపటిలాంటి ఆరోగ్యం పొందడం సాధ్యమా? పొందాలంటే ఏం చేయాలి? ►గ్రూప్హెల్ప్ పొందడానికి తమలాంటి వాళ్లు ఇంకెవరైనా ఉన్నారా? ఫాలో అప్ సమయంలో డాక్టర్తో చెప్పాల్సినవి... ఫాలో అప్ సమయంలో డాక్టర్ను కలిశాక బాధితుడు తమ సమస్యలన్నీ ఏమీ దాచకుండా... పూర్తిగా పారదర్శకంగా డాక్టర్తో మాట్లాడాలి. కేవలం లక్షణాల గురించే కాదు... శారీరక, మానసిక బాధలు, వ్యాధి సంబంధిత కష్టాలు, ఉద్వేగాలు... ఇవన్నీ దాచకుండా చెప్పాలి. అంతకు ముందు కనిపించని కొత్త లక్షణాలు ఏమైనా ఉంటే అవి కూడా వివరించాలి. అయితే అవన్నీ క్యాన్సర్కు సంబంధించినవేనా అనే ఆందోళన ముందే వద్దు. అవి క్యాన్సర్వి కాకపోవచ్చు కూడా. ఎందుకంటే కొందరిలో చికిత్సకు సంబంధించిన కొన్ని అంశాలు/ప్రభావాలు చికిత్స పూర్తయిన చాలా కాలం తర్వాత బయటకు కనిపించవచ్చు. అందుకే అవి క్యాన్సర్ సంబంధించినవా / సంబంధించనివా, లేదా అన్న సంశయానికి తావివ్వకుండా అన్నీ చెబితే... రోగి చాలా ఆందోళన పడేది అసలు సమస్యే కాదనే విధంగా దూదిపింజలా ఎగిరిపోవచ్చు. డాక్టర్కు ఇంకా చెప్పాల్సినవి... ►బాధితుడికి రోజువారీ ఎదురయ్యే సమస్యలు... ఉదాహరణకు తన ఆకలి, అలసట, మూత్రసంబంధిత అంశాలు, లైంగికంగా ఎదురయ్యే సమస్యలూ, సందేహాలు, ఏకాగ్రత కుదురుతుందా, జ్ఞాపకశక్తిలో మార్పులేమైనా వచ్చాయా, నిద్రకు సంబంధించినవి, బరువు పెరుగుతున్నారా/తగ్గుతున్నారా... లాంటివి. ►ఇతరత్రా సమస్యలకు సంబంధించి వాడుతున్న మందులు / మార్పు చేసిన మందులు, మూలికలూ, ఔషధమొక్కలకు సంబంధించినవి (హెర్బ్స్) ఏమైనా వాడారా? ►కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్ర (మెడికల్ హిస్టరీలో) వచ్చిన మార్పులు ►భావేద్వేగాల విషయంలో వచ్చిన మార్పులు / వ్యాకులత / కుంగుబాటు వంటి మానసిక బాధల గురించి అడగాలి. ►ఇవన్నీ అడుగుతూ... జీవనశైలి విషయంలో ఆరోగ్యకరమైన అలవాట్లతో, చెడు వ్యసనాలకు పూర్తిగా దూరం గా ఉంటే... మిగతా అందరిలాగే క్యాన్సర్ బాధితులు కూడా పూర్తి ఆరోగ్యంతో, దాదాపు సాధారణ వ్యక్తుల ఆయుఃప్రమాణాలకు తగ్గకుండా జీవించవచ్చు. -డాక్టర్ అజయ్ చాణక్య వల్లభనేని,కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ -
చైనా పెను సంచలనం
సంచలనానికి చైనా సిద్ధపడింది. సొంత స్పేస్ స్టేషన్ ‘టియాన్గోంగ్’ ద్వారా అరుదైన ప్రయత్నానికి సిద్ధపడింది. త్వరలో ప్రారంభం కానున్న(పూర్తి స్థాయిలో) ఈ స్పేస్ స్టేషన్ ద్వారా ఒకేసారి వెయ్యి ప్రయోగాలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందులో క్యాన్సర్కి ‘స్పేస్ ట్రీట్మెంట్’ సంబంధిత ప్రయోగాలు కూడా ఉండడం విశేషం. బీజింగ్: మెడికల్ రీసెర్చ్, సాంకేతిక అధ్యయనాలతో పాటుగా వెయ్యి ప్రయోగాలను అదీ ఒకేసారి స్పేస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ స్టేషన్లో నిర్వహించాలని చూస్తోంది. భూమి నుంచి 388.9 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఈ స్పేస్ ఏజెన్సీలోకి ఇంటర్నేషనల్ స్పేష్ ఏజెన్సీ(ఐఎస్ఎస్), రష్యా స్పేస్ ఏజెన్సీ మిర్ లాగా ఇతర దేశాల స్పేస్ సైంటిస్టులకు అనుమతి ఇవ్వకూడాదని నిర్ణయించుకుంది. మైక్రోగ్రావిటీ ప్రయోగాలు ఇక స్పేస్ స్టేషన్ ద్వారా ప్రయోగాలకు డిఫరెంట్ మాడ్యూల్స్ను(ఇప్పటికే మూడు ఉన్నాయి) ఏర్పాటు చేయబోతోంది డ్రాగన్ కంట్రీ. నేచర్ కథనం ప్రకారం.. హై ఎనర్జీ కాస్మిక్ రేడియేషన్ను గుర్తించడానికి 1-2బిలియన్ల యువాన్లను(దాదాపు 310 బిలియన్ డాలర్లు)దాకా ఖర్చు చేయబోతోంది. తద్వారా కాస్మిక్ కిరణాలు, చీకటి సంబంధిత అధ్యయనాలను సులువుగా కొనసాగించనుంది. అంతరిక్షంలో చికిత్స? స్పేస్ క్రోగ్రావిటీలో క్యాన్సర్ మీద కూడా అధ్యయనం చేపట్టాలని చైనా నిర్ణయించుకుంది. త్రీడీ బ్లాబ్స్ను పంపడం ద్వారా ఆరోగ్యవంతమైన వాటితో పాటు క్యాన్సర్ కణజాలాల మీద ఏకకాలంలో ప్రయోగాలు నిర్వహించనుంది. తద్వారా.. తక్కువ గ్రావిటీ వాతావరణంలో(అంతరిక్షంలో) క్యాన్సర్ కణాల పెరుగుదల నెమ్మదించడమో లేదంటే పూర్తిగా ఆగిపోవడమో నిర్ధారించుకునే దిశగా ప్రయోగాలు చేయనుంది. ఈ ప్రయోగాలు ఫలిస్తే.. The China Manned Space Agency ‘అంతరిక్ష వైద్యానికి బీజం వేయనుంది. అంటే క్యాన్సర్ పేషెంట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లి చికిత్స అందించడమో లేదంటే అక్కడ తయారు చేసిన మందుల్ని ఉపయోగించడమో(భూ వాతావరణానికి తగ్గట్లు పనిచేసే విధంగా) ద్వారా సంచలనానికి తెర తీయాలనుకుంటోంది. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా.. ‘వ్యోమగాముల ఆరోగ్యం కోసం’ అనే హింట్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తుల్లో క్యాన్సర్ పేషెంట్లకు స్పేస్ ట్రీట్మెంట్ అందించే ఆలోచన చేస్తున్నట్లు డ్రాగన్ కంట్రీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు ఓ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు గ్లోబల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రెండు స్పేస్ ల్యాబ్లు స్పేస్ స్టేషన్లో కొత్తగా రెండు ల్యాబ్లను ప్రారంభించాలని చైనా భావిస్తోంది. అయితే ఐఎస్ఎస్ లాగా కాకుండా.. ఒకేసారి వంద మంది చేరుకునే ప్రయోగానికి రెడీ అయ్యింది. ఇంకా చాలా ప్రయోగాలు అనుమతుల కోసం సిద్ధంగా ఉన్నాయని, చైనా ఆస్ట్రోఫిజిస్ట్ జాంగ్ షువాంగ్ నాన్ ‘నేచర్’తో వ్యాఖ్యానించాడు. వీటిలో చాలావరకు(తొమ్మిది ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు కలిపి) ఇతర దేశాల సహకారంతోనూ నిర్వహించనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు 40 దేశాల నుంచి అభ్యర్థనలు రాగా.. అమెరికా-రష్యాలతో పోటీపడి నిలబడేందుకు చైనాకు మంచి అవకాశమే దొరికినట్లయ్యింది. -
ఒక జెర్సీ.. 11 మంది ఆటగాళ్లు; 8 ఏళ్ల చిన్నారి ప్రాణాలు
ఆక్లాండ్: న్యూజిలాండ్ క్రికెటర్ టిమ్ సౌథీ ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు వేసుకున్న జెర్సీని వేలం వేయనున్నాడు. క్యాన్సర్తో పోరాడుతున్న 8 ఏళ్ల బాలికను రక్షించడానికి సౌథీ ఈ పని చేయనున్నాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన 11 మంది ఆటగాళ్లతో ఇప్పటికే జెర్సీపై సంతకాలు చేయించగా.. తాజాగా ఆ జెర్సీని వేలం వేయనున్నట్లు ప్రకటించాడు. వేలం ద్వారా వచ్చే డబ్బును చిన్నారి చికిత్సకు ఉపయోగించనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాలో షేర్ చేసుకున్న సౌథీ స్పందిస్తూ..' హోలీ బీటీ అనే 8 ఏళ్ల బాలిక మూడేళ్లుగా న్యూరోబ్లస్టోమా క్యాన్సర్తో పోరాడుతుంది. రెండున్నరేళ్లుగా చికిత్స తీసుకుంటున్న బెట్టీ రెండున్నర సంవత్సరాలుగా చికిత్స తీసుకుంటుంది. కాగా ఇటీవలే ఆమె మెదుడులో మూడు సెంటీమీటర్ల ట్యూమర్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని నాకు మా కుటంబసభ్యులు తెలిపారు. నా కుటుంబసభ్యులు కూడా చిన్నారి చికిత్సకు అవసరమైన మందులు, పరికరాలు సమకూర్చారు. ఇక ఆ చిన్నారిని బతికించేందుకు నేను డబ్ల్యూటీసీ ఫైనల్లో వేసుకున్న జెర్సీని వేలం వేయాలని నిర్ణయించుకున్నా. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బెట్టీ కుటుంబానికి అందజేస్తాను. నా జెర్సీని దక్కించుకోవాలనే వాళ్లు బిడ్ వేయండి అంటూ చెప్పుకొచ్చాడు. సౌథీ జెర్సీ వేలంపై అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఇక డబ్ల్యూటీసీ టోర్నీలో భాగంగా 2019-21 కాలంలో 11 టెస్టులు ఆడిన సౌథీ 56 వికెట్లు తీసి న్యూజిలాండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఇక భారత్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌథీ రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: ఊహించని విధంగా బౌన్సర్ వేశాడు.. దాంతో View this post on Instagram A post shared by Tim Southee (@tim_southee) -
క్యాన్సర్ నిస్సత్తువను జయిద్దాం రండి!
క్యాన్సర్ వ్యాధితో పోరు జరపడం రోగికి సవాలే. కానీ అంతకంటే పెద్ద సవాలు మరోటుంది. అదే క్యాన్సర్ వ్యాధి కారణంగానూ, చికిత్సతోనూ వచ్చే తీవ్రమైన నిస్సత్తువ. వ్యాధిగ్రస్తుణ్ణి తీవ్రమైన నీరసం అనుక్షణం కుంగదీస్తూ ఉంటుంది. ఏమాత్రం చురుగ్గా ఉండనివ్వదు. ఈ నీరసం నిస్సత్తువ, అలసటగా అనిపించే భావన రోగిని మందకొడిగా చేసి... కొన్నిసార్లు మరింత కుంగుబాటుకు గురిచేస్తుంది. దాంతో క్యాన్సర్పై పోరు కంటే... ఈ నిస్సత్తువతో పోరే మరింత పెద్ద సవాలుగా మారుతుంది. కొంతమంది రోగులు తొలుత కాస్త కుంగిపోయినా... క్రమంగా తమ మానసిక బలాన్ని కోల్పోని వారు క్యాన్సర్ పోరుపై తప్పక విజయం సాధిస్తారు. డిసెంబరు నెలను ‘క్యాన్సర్ ఫెటీగ్ అవేర్నెస్ మాసం’ గా పేర్కొంటారు. ఈ సందర్భంగా వ్యాధిగ్రస్తుల నీరసం, నిస్సత్తువ (క్యాన్సర్ ఫెటీగ్)పై అవగాహన, వాటిని అధిగమించే తీరుతెన్నులను తెలుసుకుని, వ్యాధిపై విజయం సాధించడం కోసం ఉపయోగపడేందుకే ఈ కథనం. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో నీరసం, నిస్సత్తువ (క్యాన్సర్ ఫెటీగ్) చాలా సాధారణం. కానీ చాలామందికి దీనిపై అవగాహన ఉండదు. దీనివల్ల కలిగిన వ్యాకులత, కుంగుబాటు వల్ల రోగి జీవనశైలిపై తీవ్ర ప్రభావం పడుతుంది. రోగి తన రోజువారీ పనులను చురుగ్గా చేసుకోలేడు. దాంతో జీవితాన్ని ఆస్వాదించలేడు. ఈ నిస్సత్తువకు చాలా కారణాలే ఉంటాయి. నిర్దిష్టంగా ఫలానా అంశమే దీనికి కారణం అని చెప్పడానికి వీలుకాదు. అయితే చాలామంది రోగులు వ్యాధి కారణంగా తాము అనుభవించే షాక్లో ఈ అంశాన్ని విస్మరిస్తారు. దీన్ని అధిగమించగలమనే ధ్యాసే వారికి కరవవుతుంది. కానీ కొన్ని పరిమితుల మేరకు దీన్ని అధిగమించడానికి చాలా మార్గాలున్నాయి. ఆ కారణాలనూ, మార్గాలను చూద్దాం. కారణాలు రక్తహీనత (అనీమియా): అనీమియా అనే కండిషన్ క్యాన్సర్ నిస్సత్తువకు ఒక ప్రధాన కారణం. సాధారణంగా క్యాన్సర్ రోగుల్లో (అందునా ప్రధానంగా బ్లడ్ క్యాన్సర్లలో) వారి ఎముక మూలుగ ఎక్కువగా ప్రభావితమై ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గుతుంది. ఈ ఎర్రరక్తకణాలే దేహంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్ను తీసుకెళ్తాయన్న విషయం తెలిసిందే. దాంతో కణాలకు అందే ఆక్సిజన్ తగ్గి నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. శరీరంలో విషాలు తొలగకపోవడం: ఆక్సిజన్ అందించడంతో పాటు ఎర్రరక్తకణాలు దేహంలో తయారైన కార్బన్డయాక్సైడ్, ఇతర విషాల (టాక్సిన్స్)ను బయటకు పంపుతాయి. కానీ ఎర్రరక్తకణాలు తగ్గడంతో కణానికి అందాల్సిన ఆక్సిజన్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు బయటకు విసర్జించాల్సిన విషాలను తీసుకెళ్లే సామర్థ్యమూ తగ్గుతుంది. దేహంలో ఉండిపోయిన ఈ విషాలు జీవక్రియలకు ఆటంకంగా కూడా పరిణమిస్తాయి. ఫలితంగా రోగిలో తీవ్రమైన నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. రోగి ఎప్పుడూ అలసట తో ఉన్నట్లుగా ఉంటాడు. బ్లడ్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్లలో తగినంత ఆక్సిజన్ అందక ఈ పరిస్థితి సాధారణం. క్యాన్సర్ చికిత్సల వల్ల : కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ రోగులకు అందించే కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సల కారణంగానూ, బోన్ మ్యారో క్యాన్సర్లకు అందించే మందుల కారణంగా కూడా రోగుల్లో తీవ్రమైన నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. ఈ చికిత్సల్లో భాగంగా క్యాన్సర్ కణాల్ని తుదముట్టించడానికి టార్గెట్ చేస్తున్నప్పుడు... ఆరోగ్యవంతమైన కణాలు కూడా అంతో ఇంతో దెబ్బతినడం జరుగుతుంది. ఈ కారణంగా క్యాన్సర్ రోగుల్లో నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో చికిత్సలో కలిగే నొప్పి, యాంగై్జటీ/ డిప్రెషన్కు గురికావడం, మందకొడిగా ఉండాల్సిరావడం (ఇనాక్టివిటీ), తరచూ నిద్రాభంగం కావడం, నిద్రలో అంతరాయాలు, సరిగా భోజనం తీసుకోకపోవడం వంటివి కూడా నీసరం, నిస్సత్తువకు కారణమవుతాయి. ► అధిగమించడం ఇలా ... నీరసం, నిస్సత్తువ ఉన్నప్పటికీ తొలి దశల్లో మనోబలంతో క్రమంగా మంచి ఆహారానికీ, క్రమబద్ధంగా వ్యాయామానికీ ఉపక్రమించడంతో ‘క్యాన్సర్ ఫెటీగ్’ను అధిగమించవచ్చు. క్రియాశీలంగా ఉండటం (ఇంక్రీజింగ్ యాక్టివిటీ) : రోగులు తమలో ఉన్న నీరసం, నిస్సత్తువలకు లొంగిపోకుండా... ఎంతోకొంత చురుగ్గా ఉండటానికి ప్రయత్నించాలి. అలసట కలిగించని తేలికపాటి వ్యాయామాలు చేయడానికి ఉపక్రమించాలి. దాంతో దేహంలోనూ, మెదడులోనూ చురుకు పుట్టించే ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు స్రవిస్తాయి. ఫలితంగా మూడ్స్ కూడా మెరుగుపడతాయి. రోగిలో సంతోషభావనలు కలుగుతాయి. న్యూట్రిషన్ కౌన్సెలింగ్ : క్యాన్సర్ రోగుల్లో చాలామంది తమ బరువు కోల్పోయి... చాలా సన్నబడతారు. రోగులు తమ వ్యాకులత కారణంగా తినకపోవడంతో పాటు... చికిత్సలో భాగంగా కనిపించే ఆకలిలేమి, వికారం, వాంతుల వల్ల కూడా తినలేకపోతారు. దాంతో ఆహారం తీసుకోకపోవడం, ఫలితంగా దేహానికి కావాల్సిన పోషకాలు అందకపోవడం జరుగుతాయి. దేహంలోకి పోషకాలు అందేందుకు, నోటికి రుచిగా ఉండేలా ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చు అనే అంశంపై అవగాహన కలిగించుకునేందుకు ‘న్యూట్రిషన్ కౌన్సెలర్’ను సంప్రదించాలి. అపుడు ఆహార నిపుణులు దేహానికి అవసరమైనన్ని క్యాలరీలూ, ద్రవాహారాలు, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లతో పాటు ఇతర పోషకాలు అందేందుకు అవసరమైన డైట్ప్లాన్ను సూచిస్తారు. మానసిక బలం కోసం తోడ్పాటు చాలామంది రోగులు తమకు క్యాన్సర్ ఉందని తెలియగానే తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతారు. నిజానికి ఈ రోజుల్లో క్యాన్సర్లు దాదాపు 90 శాతానికి పైగా రకాలను పూర్తిగా నయం చేయవచ్చు. మొదటి, రెండో దశలో ఉన్న క్యాన్సర్లన్నింటినీ దాదాపుగా పూర్తిగా నయం చేయవచ్చు. అందుకే రోగులు తమ మానసిక బలాన్ని పెంపొందించుకోడానికి అవసరమైన రిలాక్సేషన్ టెక్నిక్స్, కాగ్నిటివ్, సోషల్ థెరపీల కోసం మానసిక నిపుణుల సహాయం తీసుకోవచ్చు. మానసిక చికిత్సలతో కూడా క్యాన్సర్ ఫెటీగ్ను చాలావరకు అధిగమించవచ్చు. విశ్రాంతి : క్రియాశీలంగా ఉండటానికి ప్రయత్నించడంతో పాటు... కొన్ని సందర్భాల్లో తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. ఈ విశ్రాంతి మళ్లీ మన శక్తిసామర్థ్యాలను (ఎనర్జీని) ఆదా చేసుకోడానికీ... దాంతో మరింత శక్తి పుంజుకుని మళ్లీ క్రియాశీలం కావడానికి ఉపయోగ పడుతుందని గ్రహించాలి. అందుకే తమ నిస్సత్తువ కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోందని అనుకోకుండా... అలాంటి విశ్రాంతి సమయాల్లో ఇతరులపై ఆధారపడుతున్నామని సిగ్గుపడకుండా... విశ్రాంతి సమయాన్ని ఎనర్జీని ఆదా చేసుకునే టైమ్గా పరిగణించాలి. ఇలా ఈ సానుకూల దృక్పథంతో రోగి మళ్లీ శక్తి పుంజుకుని చురుగ్గా మారగలుగుతాడు. ఇతర విషయాలపైకి దృష్టి మళ్లించడం (డిస్ట్రాక్షన్) ఎప్పుడూ తనకు వచ్చిన వ్యాధి గురించే ఆలోచించకుండా... తమ దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లించాలి. మంచి పుస్తకాలు చదవవచ్చు. హాస్యభరితమైన, వినోదాత్మకమైన సినిమాలు చూడవచ్చు. ఫ్రెండ్స్తో సంభాషించవచ్చు (ఈ కోవిడ్ సమయంలో వ్యక్తిగతంగా కలవలేకపోయినా... మొబైల్స్లో, వాట్సాప్ ద్వారా ఇతరులతో సంభాషణలు చేయవచ్చు. ఇలా రోగులు తమ సరదా సమయాన్ని గడపవచ్చు. ఇలా ఎప్పుడూ సంతోషంగా ఉండటం అంటే వ్యాధిపై సగం విజయాన్ని సాధించడమే. కంటికి తగిన నిద్ర చాలామంది క్యాన్సర్ రోగులకు ఉండే ప్రతికూలత ‘నిద్ర’. రోగుల్లో చాలామందికి తరచూ నిద్రాభంగమవుతుంటుంది. దాంతో రోగి మరింత నిస్సత్తువగా మారిపోతాడు. రోగుల్లో ఫెటీగ్కు ‘నిద్ర’ అనే అంశం చాలా ప్రధానమైంది. చిన్న చిన్న టెక్నిక్స్తో ఈ సమస్యను అధిగమించవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా రోగులు తమలోని వ్యాకులతను, కుంగుబాటును అధిగమించడం ద్వారా కంటినిండా నిద్రపోవచ్చు. కాఫీ లేదా కెఫిన్ ఉండే ద్రవాహారాలను కేవలం ఉదయం పూటకు మాత్రమే పరిమితం చేయడం, నిద్రకు ముందు తీసుకోకపోవడం, నిద్ర వచ్చినప్పుడో లేదా మధ్యానం పూటో కాస్తంత చిన్న చిన్న కునుకులు తీయడం, పవర్న్యాప్ను అలవరచుకోవడం, వేళకు పెందలాడే నిద్రించి పెందలాడే లేవడం లాంటి మంచి నిద్ర అలవాట్లను అలవరచుకోవడం లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా కూడా రోగులు తమ నిద్రాభంగాలనూ, నిద్రలో అంతరాయాల సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు. కంటినిండా నిద్రపోవడం అనే అంశం కూడా రోగిలో వ్యాధి నివారణశక్తిని పెంపొందిస్తుందన్న విషయం తెలిసిందే. ఇది కూడా రోగి త్వరగా కోలుకునేలా చేసే అంశమే. అవసరాన్ని బట్టి మందులు ఒకవేళ రోగిలోని అలసట భావన చాలా ఎక్కువగానూ, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ ఉంటే రోగి కారణాలనూ, పరిస్థితిని బట్టి డాక్టర్లు కొన్ని మందులను సూచిస్తారు. రక్తహీనత తక్కువగా ఉన్నవారికి ఐరన్ సప్లిమెంట్లూ, పోషకాహార లోపాలను బట్టి ఇతర మందులు, మానసిక కారణాలున్నవారికి యాంటీ డిప్రెసెంట్లు, సైకో స్టిమ్యులెంట్ల వంటి ఔషధాలను ఇస్తారు. క్యాన్సర్ రోగులెవరైనా క్యాన్సర్ ఫెటీగ్తో బాధపడుతుంటే పైన సూచించిన సూచనలను పాటించడం ద్వారా తమకు తామే సమస్యను అధిగమించవచ్చు. ఒకవేళ అప్పటికీ కుదరకపోతే వైద్యనిపుణుల సహాయం తీసుకోవచ్చు. అయితే ఈ సమస్య అధిగమించలేని సమస్యేమీ కాదని గ్రహించడం చాలా ప్రధాన అంశం. దీన్ని గ్రహిస్తే సగం సమస్య పరిష్కారమైనట్లే. సగం వ్యాధి తగ్గినట్లే. డా. అజయ్ చాణక్య కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ -
మేమెప్పుడూ ఇలానే ఉండాలి
శుక్రవారం సంజయ్ దత్ దుబాయ్ వెళ్లారు. చికిత్స కోసమా? కాదు.. వాళ్ల చిన్నారుల కోసం అని తెలిసింది. లాక్డౌన్ సమయంలో సంజయ్ దత్ భార్య మాన్యతా దత్, ఆయన పిల్లలు దుబాయ్లోనే ఉండిపోయారు. సంజయ్ దత్ ముంబైలోనే ఉన్నారు. ఇటీవలే సంజయ్ దత్కు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తేలింది. ఆ విషయం తెలిసిన వెంటనే సంజయ్ దత్ భార్య దుబాయ్ నుంచి ముంబై వచ్చారు. మొన్నటి వరకూ ముంబైలో చికిత్స పొందారు సంజయ్. తాజాగా చాలా నెలల తర్వాత పిల్లల్ని చూడటం కోసం దుబాయ్ వెళ్లారు. ఈ సందర్భంలో దిగిన ఫోటోను మాన్యతా దత్ షేర్ చేసి, ‘ఇలాంటి కుటుంబాన్ని నాకు ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. కేవలం కృతజ్ఞతలు మాత్రమే. జీవితం పట్ల నాకెలాంటి ఫిర్యాదులు లేవు. మేమెప్పుడూ ఇలానే కలిసుండాలి... ఎప్పటికీ’ అన్నారు. త్వరలోనే చికిత్స నిమిత్తం అమెరికా వెళ్తారట సంజయ్దత్. -
హాయ్ అంటూ షూటింగ్కి...
‘‘మా సంజూ బాబా బ్యాక్’’ అని అభిమానులు ఆనందపడుతున్నారు. సంజయ్ దత్కి లంగ్ కేన్సర్ అని తెలియగానే ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, మొదటి సెషన్ కీమోథెరపీని ముంబైలో సక్సెస్ఫుల్గా ముగించుకున్నారట సంజయ్ దత్. చికిత్స మొత్తం పూర్తయ్యాకే ఆయన షూటింగ్స్లో పాల్గొంటారని చాలామంది ఊహించారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సంజయ్ దత్ షూటింగ్లో పాల్గొన్నారు. మంగళవారం ‘షంషేరా’ షూటింగ్కి వెళుతూ కెమెరాలకు చిక్కారాయన. కారు అద్దాలు దించి, ‘హాయ్’ అంటూ యాక్టివ్గా చెయ్యి ఊపారు కూడా. ఈ సినిమా చిత్రీకరణలో రెండు రోజుల పాటు పాల్గొననున్నారట. తర్వాత మళ్లీ చికిత్స చేయించుకుంటారని సమాచారం. మొత్తం ఎన్ని సిట్టింగ్స్లో ట్రీట్మెంట్ పూర్తవుతుందనేది బయటకు రాలేదు కానీ, మధ్య మధ్యలో షూటింగ్స్లో పాల్గొనాలని మాత్రం నిర్ణయించుకున్నారని సమాచారం. -
ఆరోగ్యశ్రీలో కేన్సర్ను చేర్చేందుకు ప్రయత్నిస్తా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ దేశంలోని అత్యధిక మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తోందని.. అత్యంత క్లిష్టమైన కేన్సర్ల చికిత్సకూ ఇందులో అవకాశం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం లేదని, తమదైన ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ లో కేన్సర్ చికిత్సను కూడా చేర్చేందుకు ప్రయత్నిస్తానని ఆమె చెప్పారు. హైదరాబాద్లో శుక్రవారం మొదలైన ఇండియన్ కోఆపరేటివ్ ఆంకాలజీ నెట్వర్క్ (ఐకాన్) సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై గవర్నర్ మాట్లాడారు. కేన్సర్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి 42 ఏళ్లుగా కేన్సర్ విషయంలో విశేష కృషి చేస్తున్న ఐకాన్ సంస్థ ప్రజా చైతన్యం విషయంలో మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఐకాన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పర్వేశ్ పారీఖ్, ఎంఎన్జే కేన్సర్ ఆసుపత్రి డాక్టర్ సాయిరామ్, సీనియర్ ఆంకాలజిస్ట్ కేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. గవర్నర్ అధికారిక కార్యక్రమాలు రద్దు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో శనివారం నుంచి తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు. -
ఆసుపత్రికి సుమతి..
పలమనేరు (చిత్తూరు జిల్లా): క్యాన్సర్ బారిన పడి మంచానికే పరిమితమైన తల్లిని కాపాడుకునేందుకు చిన్నారి కొడుకు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’ దినపత్రికలో ‘అమ్మకు ప్రేమతో..’ శీర్షికన శుక్రవారం వచ్చిన కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన ఆదేశాలతో పలమనేరు మున్సిపల్ కమిషనర్ విజయసింహా రెడ్డి తన సిబ్బంది, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు బాధితురాలు సుమతి ఇంటికి వెళ్లారు. ఆరోగ్య వైద్యశాఖ సిబ్బంది, ఆరోగ్యమిత్ర ఆమెను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్య సేవలందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సుమతి సమస్య, ఆమెకు వైద్యం ఎలా అందించాలి, ఆమె కుమారుడు పవన్ కుమార్ను ఎలా చదివించాలి.. తదితరాలపై నివేదికను రియల్టైమ్ గవర్నెన్స్కు పంపినట్లు ఆయన తెలిపారు. దేశ విదేశాల నుంచి స్పందిస్తున్న దాతలు ఇదిలా ఉంటే.. సుమతి పరిస్థితి తెలుసుకుని ఆదుకుంటామని.. ఆమె కుమారుడ్ని చదివిస్తామని ప్రవాస భారతీయులు అనేకమంది ముందుకు వస్తున్నారు. ఈ మేరకు పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. అమెరికాలోని చికాగోకు చెందిన ఎన్ఆర్ఐ తిరుమలరెడ్డి జోజిరెడ్డి వారి ఆకలి తీర్చేందుకు తక్షణ సాయంగా రూ.5 వేలను హైదరాబాద్లోని తమ బంధువుల ద్వారా మున్సిపల్ కమిషనర్కు అందించారు. మరింత సాయమందిస్తామని జోజిరెడ్డి అక్కడ నుంచి తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఇంకో ఐటీ ఉద్యోగి కూడా సాయం అందించారు. ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమతి పరిస్థితిపై స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు చిత్తూరు కలెక్టర్ నారాయణ్ భరత్గుప్త ఆదేశాలతో విచారణ జరిపారు. ఆమెకు వైద్య సౌకర్యంతోపాటు ఉండేందుకు పక్కా ఇల్లు, రేషన్కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం వీఆర్వోలతో కలిసి రూ.5 వేల నగదు, దుప్పట్లు, పండ్లను ఆమెకు అందజేశారు. దాతలెవరైనా వీరికి సాయం చేయాలనుకుంటే.. పి.సుమతి, W/O శ్రీనివాసులు, ఆంధ్రా బ్యాంకు ఖాతా నంబరు : 181810100022142 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ANDB00011408కు జమచేయవచ్చునని తెలిపారు. మరోవైపు.. సుమతికి సీఎం సహాయ నిధి ద్వారా వైద్యసాయం అందించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తామని స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. -
జగన్ అంకుల్.. అమ్మకు సాయం చేయరూ!
పలమనేరు (చిత్తూరు జిల్లా) : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అర్ధంతరంగా వదిలేశాడు.. అప్పటికి ఆమెకు పదినెలల కొడుకు.. బతుకు బండి లాగేందుకు పనులకు వెళ్లేది.. పిల్లాడు ఐదో క్లాస్కు వచ్చాడు.. ఇంతలో ‘భయంకరమైన’ నిజం క్యాన్సర్ రూపంలో ఆవహించింది.. కళ్లెదుటే రోజురోజుకీ క్షీణిస్తున్న తల్లికి అన్ని సపర్యలు చేస్తూ ఆ బాలుడు నిస్సహాయ స్థితిలో మూగగా రోదిస్తున్నాడు. చుట్టుపక్కల వారు చేస్తున్న చిన్నాచితకా సాయం ఏ మూలకూ చాలడంలేదు.. లేవలేకపోతున్న అమ్మను చూసి ఆ పసి హృదయం తల్లడిల్లుతోంది.. ఆమెను ఆదుకోవాలంటూ సమాజాన్ని అర్థిస్తోంది.. ముఖ్యమంత్రినీ వేడుకుంటోంది. అందరినీ కదిలిస్తున్న ఈ ఉదంతం వివరాలివీ.. చిత్తూరు జిల్లా పలమనేరు ఏడో వార్డులోని అంకిశెట్టి వీధికి చెందిన టీకొట్టు నిర్వాహకులైన లేట్ ఎత్తిరాజులు, విశాలాక్షిల ఏకైక కుమార్తె సుమతి (38). విశాఖపట్నం నుంచి బతుకుతెరువు కోసం ఇక్కడకొచ్చిన శ్రీనివాసులు అనే వంటమాస్టర్ సుమతిని 13 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పవన్కుమార్ అనే కొడుకు çపుట్టాడు. బిడ్డకు పది నెలల వయసుండగానే తాగుడుకు భార్య డబ్బులివ్వలేదని ఆమెపై దాడిచేసి వెళ్లిపోయాడు. అంతే.. అప్పటి నుంచి శ్రీనివాసులు పత్తాలేకుండా పోయాడు. దీంతో సుమతి హోటళ్లు, ఇళ్లల్లో పనిచేసుకుంటూ కొడుకును పోషించుకుంటోంది. ఇంతలో.. కంబళించిన క్యాన్సర్.. మూడేళ్ళక్రితం ఆమె ఆనారోగ్యంతో ఆస్పత్రికెళ్తే సుగర్ ఉందని తేలింది. ఆ తర్వాత ఏడాది క్రితం కడుపులో గడ్డలు రావడంతో వైద్యులు క్యాన్సర్గా తేల్చారు. చికిత్స చేయించుకునేందుకు స్థోమత లేకపోవడంతో సుమతి ఇంటికే పరిమితమైంది. దీంతో రోగం రోజురోజుకీ ముదిరిపోయింది. లేవలేని స్థితికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో బంధువులు పట్టించుకోకపోవడంతో అయిదో తరగతి చదువుతున్న కొడుకు పైనే తల్లి ఆలనాపాలన భారం పడింది. ఆమె కోసం బడి మానేశాడు. ఇంట్లోనే ఉండి అన్ని రకాల సపర్యలు దగ్గరుండి స్వయంగా చేస్తున్నాడు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఆ గుడిసెలో రోజూ వీరు పడుతున్న కష్టాలు చూసి చుట్టుపక్కల వారు భోజనం అందిస్తున్నారు. దాతలకు చెప్పి ఎంతోకొంత సాయం ఇప్పిస్తున్నారు. కానీ, ఒంటరి మహిళ పింఛన్ కోసం ఆమె దరఖాస్తు పెట్టుకున్నా ఇంకా మంజూరు కాలేదు. కనీసం రేషన్ పొందుదామన్న ఆమె ఆశ కూడా ఆడియాశే అయింది. వేలిముద్రలు పడలేదనే కారణంతో కార్డు ఇన్యాక్టివ్ అయింది. ఆరోగ్యశ్రీ ద్వారా అయినా చికిత్స పొందాలనుకుంటున్నట్లు ఆమె చెబుతోంది. ఇవేవీ అర్థకాక రోజూ తల్లడిల్లుతున్న ఆ పసి మనసు అమాయకంగా చూస్తున్న చూపులు అందరి గుండెల్నీ పిండేస్తున్నాయి. ఆస్తుల కోసం కన్నతల్లిని సైతం కడతేర్చే కొడుకులున్న నేటి సమాజంలో తన తల్లి ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని అంతచిన్న వయస్సులో ఆ బాలుడు పడుతున్న తాపత్రయం చూస్తే ఎవరికైనా కన్నీరొస్తుంది. జగన్ అంకుల్.. అమ్మకు సాయం చేయరూ! నేను ఐదో తరగతికి గండికోట స్కూల్కెళ్తుండేవాణ్ణి. మా అమ్మను చూసుకునేందుకు బడికి మానేసా. పైకి లేవలేని అమ్మకు అన్ని పనులూ నేనే చేస్తుంటా. జగన్ అంకుల్.. కనికరించి మా అమ్మకు వైద్యం చేయించరూ.. – పవన్కుమార్, సుమతి కుమారుడు -
డాక్టర్ రెడ్డీస్ నుంచి కేన్సర్ ఇంజక్షన్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో కేన్సర్ చికిత్సకు అవసరమైన ఇంజక్షన్ను డాక్టర్ రెడ్డీస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు బొర్టెజొమిబ్ 3.5 ఎంజీ ఇంజక్షన్ను యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) ఆమోదించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వయోజన రోగులలో వివిధ రకాల కేన్సర్ చికిత్స కోసం దీని ప్రవేశపెట్టినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నార్త్ అమెరికా జనరిక్స్ సీఈఓ మార్క్ కికుచీ తెలిపారు. యుక్త వయసున్న కేన్సర్ పేషెంట్లకు ఇంట్రావీనియస్ వినియోగం కోసం మాత్రమే యూఎస్ఎఫ్డీఏ ఈ కొత్త డ్రగ్ 505 (బీ)(2)కు అనుమతిచ్చిందని పేర్కొన్నారు. -
జబ్బుల మాటున ఇన్ఫెక్షన్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కువ జబ్బులు ఇన్ఫెక్షన్ల ద్వారానే వస్తున్నాయని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) వెల్లడించింది. గతేడాది జూన్ వరకు నిర్వహించిన సర్వే వివరాలను ఎన్ఎస్వో అధికారికంగా తాజాగా ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం దేశంలో ఎక్కువ జబ్బులు ఇన్ఫెక్షన్ల ద్వారానే వస్తున్నాయని తేలింది. ఇన్పేషెంట్లుగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 31.4 శాతం మంది ఇన్ఫెక్షన్ సంబంధిత రోగాలతోనే వస్తున్నారని వెల్లడైంది. ఇన్ఫెక్షన్ల తర్వాత ఎక్కువ మంది గాయాలతో వస్తున్నారని, ఆ తర్వాతి స్థానాల్లో పేగు, గుండె సంబంధిత రోగులు ఉన్నారని సర్వే వెల్లడించింది. అయితే ఇన్ఫెక్షన్ల బారినపడుతున్న వారిలో పురుషులకన్నా మహిళలే ఎక్కువని సర్వే తేల్చింది. సర్వే గణాంకాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో 31.4 మంది మగవారు, 31.8 శాతం మంది మహిళలు ఇన్ఫెక్షన్ సంబంధిత జబ్బులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 31.3 శాతం మంది పురుషులు, 31.4 శాతం మంది మహిళలు ఇన్ఫెక్షన్ జబ్బులకు గురువుతున్నారని వెల్లడైంది. కేన్సర్కే అత్యధిక ఖర్చు... ఖర్చుల విషయానికి వస్తే అన్నింటికన్నా కేన్సర్ చికిత్స కోసం ఎక్కువ ఖర్చవుతోందని సర్వే వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన రోగులు ఇచ్చిన సమాచారం ప్రకారం సగటున ప్రతి కేన్సర్ రోగికి కనీసం రూ. 61,216 ఖర్చవుతోందని సర్వే తేల్చింది. ఆ తర్వాత గుండె జబ్బులకు ఎక్కువ ఖర్చవుతుండగా రోగాల సంఖ్యలో ఎక్కువగా ఉన్న ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధులకు అతితక్కువ ఖర్చుతో వైద్యం అందుతోందని వెల్లడించింది. -
కేన్సర్ ముందే గుర్తిస్తే 90 శాతం సేఫ్
విమలమ్మ... 81 ఏళ్లవృద్ధురాలు. హైదరాబాద్కు చెందిన ఈమె రొమ్ము కేన్సర్తో ఆరేళ్ల క్రితం ఎంఎన్జే ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు సంపూర్ణంగా వైద్యం చేశారు. ఇప్పుడుఉత్సాహంగా ఉంటోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన వినయ్ రాయుడుకు నాలుగేళ్లప్పుడు కేన్సర్ వచి్చంది. 2009 ఫిబ్రవరిలో ఎంఎన్జేకు తీసుకొచ్చారు. వైద్యులు ఆ బాలుడి కేన్సర్ను పూర్తిగా నయం చేశారు. ఇప్పుడతను ఇతర విద్యార్థుల్లానే తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: కేన్సర్ వచ్చినా బయటపడి జీవించొచ్చు అనేందుకు ఇలాంటి వారెందరో ఉదాహరణ. తొలి రెండు దశల్లో కేన్సర్ను గుర్తించి వైద్యం చేయించుకున్న వారిలో 10 నుంచి 15 ఏళ్లు బతికినవారు ప్రభుత్వ రికార్డుల్లో చాలా మందే ఉన్నారు. కొన్ని కేన్సర్లు ఏ దశలో ఉన్నా 80% బతికే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. కేన్సర్ వచ్చినవారు చికిత్స అనంతరం 15 ఏళ్ల వరకు బతకడం సర్వసాధారణం. 10 శాతం పిల్లలకు... మొత్తం కేన్సర్ రోగుల్లో 10% మంది పిల్లలు ఉంటున్నారు. పిల్లల్లో ఎక్కువగా ఒకటి నుంచి పదేళ్లలోపు వారే అధికంగా ఉంటా రు. వీరికి రక్త సంబంధిత కేన్సర్ అధికంగా వస్తుంటుంది. జెనిటిక్ మ్యుటేషన్ వల్ల పిల్లల్లో కేన్సర్ వస్తుంటుంది. పిల్లలకు వచ్చే కేన్సర్లలో 70 నుంచి 80% వరకు నయం చేయడానికి వీలుంటుంది. ఎందుకంటే పిల్లల్లో వైద్యానికి స్పందించే లక్షణం ఎక్కువ ఉంటుంది. పిల్లల్లో 3వ దశలో వచ్చే కేన్సర్ రోగుల్లోనూ సగం మందిని బతికించవచ్చు. నాలుగో దశలో వస్తే 25% మందిని బతికించవచ్చు. అదే ఒకట్రెండు దశల్లో వస్తే 80 నుంచి 90% మంది పిల్లల క్యాన్సర్లను నయం చేయడానికి వీలుంటుంది. 35 ఏళ్లు దాటితే స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి... గతంలో 50 ఏళ్లు దాటిన వారిలోనే కేన్సర్ను చూసేవారం. ఇప్పుడు 35 ఏళ్లు దాటిన వారిలోనూ ఎక్కువగా వస్తోంది. కేన్సర్లో 25 శాతం సరై్వకల్, 25 శాతం రొమ్ము, 40 శాతం పొగాకుతో వచ్చే గొంతు, ఊపరితిత్తులు వంటివి కాగా, 10 శాతం జీవనశైలిలో మార్పుల ద్వారా, జన్యుపరమైన కారణాల ద్వారా వస్తుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 35 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ ప్రతీ ఏడాది కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. 8 నుంచి 18 ఏళ్లలోపు ఆడ పిల్లలకు సర్వైకల్ టీకా వేయించడం ద్వారా సరై్వకల్ కేన్సర్ రాకుండా నియంత్రించవచ్చు. 50 ఏళ్లు దాటినవారికి మలంలో రక్తం పడితే కొలనోగ్రఫీ చేయించుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతం మంది కేన్సర్ చివరి దశలో ఉండగా ఆసుపత్రులకు వస్తున్నారు. అయినా రాష్ట్రంలో కేన్సర్ వచి్చనవారిలో 60 శాతం మందికి నయమై సాధారణ జీవితం అనుభవిస్తున్నారు. లక్షణాలివి... మూడు వారాలకు మించి ఎక్కువ రోజులు జ్వరం ఉండటంతోపాటు తరచుగా రావడం. ఆకలి లేకపోవడం, బరువు గణనీయంగా తగ్గిపోవడం ఏదైనా వ్యాధి వస్తే రొటీన్ మందులకు తగ్గకపోవడం నిత్యం దగ్గు రావడం, రక్తం పడటం రక్తంతో కూడిన వీరేచనాలు పీరియడ్స్ తర్వాతా రక్తస్రావం అవడం కేన్సర్ను గుర్తించడానికి అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు రాష్ట్రంలో ఎక్కడైనా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మేమే అన్ని రకాల పరీక్ష పరికరాలను వెంట తీసుకొచ్చి చేస్తాం. వివిధ సంస్థలు కూడా మమ్మల్ని సంప్రదిస్తే పరీక్షలు చేస్తాం. స్క్రీనింగ్తో ముందస్తు గుర్తిస్తే ప్రమాదం ఉండదు. – డాక్టర్ జయలత, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి, హైదరాబాద్. థైరాయిడ్ కేన్సర్ వస్తే పూర్తిగా నయం చేయవచ్చు. రొమ్ము క్యాన్సర్ను మొదటి దశలో తీసుకొస్తే 95% బతికించడానికి వీలుంటుంది. 2వ దశలో 80%, 3వ దశలో 60% వరకు బతికించడానికి వీలుంటుంది. – డాక్టర్ సౌమ్య కోరుకొండ, సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద ఆసుపత్రి, సికింద్రాబాద్. రొమ్ము కేన్సర్ వస్తే గతంలో పూర్తిగా తీసేసేవారు. ఇప్పుడు ఎంతవరకు కేన్సర్ సోకిందో అంతవరకే సర్జరీ చేయడం ద్వారా తీసేస్తున్నాం. మూడు నాలుగో దశలోనూ రొమ్ము కేన్సర్ను నయం చేయడానికి వీలుంటుంది. – డాక్టర్ ఉమాకాంత్గౌడ్, సర్జికల్ ఆంకాలజిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్, ఎంఎన్జే. -
క్యాన్సర్ను జయించి..ముంబైలో కాలుమోపి..
ముంబై : న్యూయార్క్లో ఏడాది పాటు క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందిన బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ నీతూ కపూర్తో కలిసి మంగళవారం ఉదయం ముంబైకు చేరుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో న్యూయార్క్కు వెళ్లిన రిషీ కపూర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అక్కడే ఉన్నారు. అమెరికాలో చికిత్స పొందుతున్న రిషీ కపూర్ ఈ ఏడాది ఏప్రిల్లో క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ప్రకటించగా, న్యూయార్క్లోనే ఇప్పటివరకూ ఆయన సేదతీరారు. గతంలో న్యూయార్క్ను సందర్శించిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు రిషీ కపూర్ను పరామర్శించారు. రణ్బీర్ కపూర్ తన గర్ల్ఫ్రెండ్ అలియా భట్తో కలిసి పలుమార్లు రిషీ కపూర్ను కలుసుకున్నారు. -
సీఎం సారూ.. మీకు రుణపడి ఉంటాం
సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : అసలే పేదరికం. ఆపై కేన్సర్తో సతమతం... ఆ కుటుంబం పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇక పెట్టుబడి పెట్టలేక మరణమే శరణ్యమనుకుంటున్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారిని ఆదుకున్నారు. సీఎం సహాయ నిధినుంచి పెద్ద మొత్తం కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు వారికి కొండంత బలం చేకూరింది. మళ్లీ బతికి మామూలుగా తిరుగాడుతామన్న నమ్మకం కలిగింది. ఇదీ చీపురుపల్లి పట్టణంలో ఓ కుటుంబం దీన గాథ. చీపురుపల్లి పట్టణం కొద్దగవిడి వీధికి చెందిన రవికుమార్ ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయన తండ్రి సీతారామమూర్తి ఆర్ఈసీఎస్లో ఉద్యోగ విరమణ చేయగా ఆయనకు పింఛన్ సౌకర్యం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో దాదాపు ఎనిమిది నెలల క్రితం రవికుమార్ భార్య ఉషారాణికి బ్లడ్ కేన్సర్ మహమ్మారి సోకింది. ఆస్పత్రుల్లో చూపిస్తే బోన్మేరో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలనీ, అందుకు రూ.16 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఆ స్థాయిలో వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ అప్పులు చేసి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం రూ.2 లక్షలు కేటాయిస్తున్నట్టు ప్రకటించినా ఆ నిధులు వచ్చేలోగానే ఎన్నికలు రావడం, గడువు ముగిసిపోవడంతో ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. వైఎస్సార్సీపీ నేతల అండతో... రవికుమార్, ఆయన తండ్రి సీతారామ్మూర్తి జూన్ నెలాఖరున మండల వైఎస్సార్సీపీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇప్పిలి అనంతంలను ఆశ్రయించారు. వారు జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వకర్త మజ్జి శ్రీనివాసరావు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఆయన ఎలాంటి జాప్యం చేయకుండా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు సమస్య వివరించారు. అంతే జూలై 1న అమరావతి చేరుకుని అక్కడ మంత్రి బొత్సను కలిసి, ఆయన లేఖతో బాటు బాధితురాలు ఉషారాణికి వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలతో పూర్తి నివేదిక అందించారు. జూలై 2న తేదీ సాయంత్రం సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆ ఫైల్ను ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యాలయానికి సమర్పించారు. జూలై 4న బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎంతో రుణపడి ఉంటాం.. నా భార్యకు కేన్సర్సోకి చికిత్స చేయించేందుకు నానా అవస్థలు పడుతున్నాం. మా నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, మంత్రి బొత్ససత్యనారాయణ చొరవ చూపడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఇంత త్వరగా మా సమస్యపై ముఖ్యమంత్రి స్పందించడం చాలా గొప్ప విషయం. జగన్మోహన్రెడ్డి మాటల మనిషి కాదు చేతల మనిషి అని రుజువైంది. 48 గంటల్లో సహాయం అందించడం గతంలో ఎప్పుడూ వినలేదు. మాకు చాలా పెద్ద సహాయం ప్రభుత్వం నుంచి వచ్చింది. రూ.9 లక్షలు అవసరమని కోరగా అందులో యాభై శాతం కంటే ఎక్కువగా రూ.5 లక్షలు మంజూరు చేశారు. సిఎం జగన్మోహన్రెడ్డి చేసిన మేలు జీవితంలో మరిచిపోలేము. – రవికుమార్, ఉషారాణి దంపతులు -
తిరిగొస్తున్నా
ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా న్యూయార్క్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బాలీవుడ్ నటుడు రిషీ కపూర్. క్యాన్సర్ చికిత్స కోసమే వెళ్లారని సమాచారం. ఆ మధ్య దర్శకుడు రాహుల్ రవైల్ ‘రిషీ కపూర్ క్యాన్సర్ నుంచి పూర్తిగా నయం అయ్యారు’ అని పేర్కొన్నారు. తాజాగా రిషీ ఇండియా తిరిగి రావడానికి రెడీ అయ్యారని తెలిసింది. ‘ఆగస్ట్ నెలాఖరుకల్లా నేను ఇండియా రావొచ్చు. డాక్టర్ ఏమంటారో చూడాలి. కోలుకుంటున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. తిరిగొచ్చేసరికల్లా 100శాతం ఫిట్గా ఉంటాను’ అని పేర్కొన్నారు రిషీ. ట్రీట్మెంట్ తీసుకుంటున్న కాలంలో ఆయన కుటుంబం, ఇండస్ట్రీ సభ్యులు ఎప్పటికప్పుడు ఆయన్ను న్యూయార్క్ వెళ్లి పలకరిస్తున్న సంగతి తెలిసిందే. -
పోరాడే శక్తినిచ్చిన ప్రయాణం ఇది
‘‘నా కోసం ఇంత ప్రేమను, ఇన్ని ప్రార్థనలను, ఇన్ని శుభాకాంక్షలను అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నేను, నా కుటుంబం మీ ప్రేమకు రుణపడి ఉంటాం’’ అని ఇర్ఫాన్ ఖాన్ అన్నారు. న్యూరో ఎండోక్రైన్ డిజార్డర్తో ఇర్ఫాన్ బాధపడిన సంగతి తెలిసిందే. లండన్లో ట్రీట్మెంట్ తీసుకుని ఇండి యా తిరిగొచ్చి, మళ్లీ సినిమాలు చేస్తున్నారాయన. తాను తిరిగి రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలంటూ ప్రేమతో ఓ లేఖ రాశారు. ‘‘క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి గడిచిన కొన్ని నెలల ప్రయాణంలో సాగింది. ఈ ప్రయాణంలో మళ్లీ జీవితంతో తిరిగి పోరాటం చేసే శక్తిని, రియల్, రీల్ లైఫ్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని తిరిగి తెచ్చుకున్నాను. నా జర్నీని అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారని నాకు తెలుస్తూనే ఉంది. కానీ ఈ ప్రయాణాన్ని నేనే ఇంకా అర్థం చేసుకుంటూనే ఉన్నాను. ఈ జర్నీ తాలూకు బాధను నా పనితో నయం చేయాలనుకుంటున్నాను. నా జర్నీని మీరు గౌరవించి నేను నయం కావడానికి నాకు సమయం ఇచ్చారు. మీ ఓపికకు, ఓదార్పుకు థ్యాంక్స్. నా లైఫ్ని ఎప్పటికప్పుడు భూమి నుంచి ఆకాశం వరకూ విస్తరింపజేసుకోవాలని కోరుకునే వ్యక్తిని నేను. ఆకాశంలో కూడా విస్తరించగలనో లేదో నాకు తెలియదు కానీ ప్రయత్నమైతే చేస్తాను. చేస్తూనే ఉంటాను’’ అంటూ ‘నాకింకా తెలియదు నేను గద్దనో, తుఫానునో, ఇంకా పూర్తి కాని పాటనో’ (‘వైడనింగ్ సర్కిల్స్’ అనే కవిత నుంచి తీసుకున్న వాక్యాలు)’’ అని పేర్కొన్నారు ఇర్ఫాన్ఖాన్. -
బతికే అవకాశం తక్కువన్నారు
క్యాన్సర్తో పోరాడి గెలిచారు నటి సోనాలీ బింద్రే. తన పోరాట ప్రయాణం గురించి ఆమె పలు సందర్భాల్లో పలు విషయాలను వెల్లడించారు. తాజాగా ఓ మ్యాగజీన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు సోనాలి. వాటిలోని సారాంశం ఈ విధంగా... ‘‘మన అనుభవాలు మనల్ని ఎలా మార్చాయని వివరించడానికి ప్రత్యేకమైన విధానం ఏదీ లేదు. మనలో వచ్చిన ప్రతి పరివర్తనకు దృశ్యరూపం ఉండకపోవచ్చు. క్యాన్సర్ చికిత్స కోసం గోల్డీ బెహల్ (సోనాలీ భర్త) నన్ను న్యూయార్క్ తీసుకుని వెళ్లారు. అక్కిడికి వెళ్లిన తర్వాతి రోజే డాక్టర్లను సంప్రదించాం. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాన్ చేయించుకున్నాక తెలిసింది.. నాకు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉందని. పైగా నా పొత్తి కడుపు అంతా క్యాన్సర్ వ్యాప్తి చెందిందని, నేను బతికే అవకాశం ముప్పైశాతమే ఉందని డాక్టర్లు చెప్పారు. ఒక్కసారిగా మనసు బద్ధలైంది. కలత చెందాం. కానీ అధైర్య పడలేదు. చికిత్సలో భాగంగా చాలా కాలం కష్టపడాల్సి వస్తుందనుకున్నాను. అయితే నేను చనిపోబోతున్నాననే ఆలోచన నాకు రాలేదు’’ అంటూ తాను కోలుకోవడానికి కారణం భర్త, స్నేహితులు, సన్నిహితులు అని పేర్కొన్నారు సోనాలీ బింద్రే. -
మళ్లీ మీ ముందుకు వస్తున్నా
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ఖాన్ తిరిగి ముంబై చేరుకున్నారు. న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ కారణంగా ఆయన కొంతకాలంగా అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిగా లండన్లో చికిత్స తీసుకుంటున్న ఇర్ఫాన్ ఆరోగ్యం బాగా మెరుగుపడిందట. ఈ సందర్భంగా ఆయన ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ను ట్వీటర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘‘బహుశా జీవితంలో గెలవాలనే తాపత్రయంలో మనల్ని ప్రేమిస్తున్న, అభిమానిస్తున్న వారిని గుర్తుపెట్టుకోం. మనం జీవితంలో అసహాయులమైనప్పుడు వారందరూ జ్ఞప్తికి వస్తారు. సాగిపోతున్న నా ఈ జీవితంలో ఒక్క క్షణం ఆగి నన్ను ప్రేమిస్తున్న, అభిమానిస్తున్న వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ప్రేమ, అభిమానమే నన్ను కోలుకునేలా చేశాయి. మళ్లీ మీ ముందుకు రాబోతున్నాను’’ అని ఇర్ఫాన్ఖాన్ పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... హిందీ మూవీ ‘హిందీ మీడియం’ (2017) సీక్వెల్లో ఇర్ఫాన్ నటించబోతున్నారన్న వార్తలు బీటౌన్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
క్యాన్సర్ – చికిత్సలు
క్యాన్సర్ చికిత్సలు అన్నవి వయసు, క్యాన్సర్ దశ, గ్రేడింగ్, వారి ఇతర ఆరోగ్య లక్షణాలు ఇలా అనేక విషయాల మీద ఆధారపడి ఉంటాయి. శరీర తత్వాన్ని బట్టి కూడా ఈ చికిత్స విధానాలు మారుతూ ఉంటాయి. సర్జరీ, రేడియేషన్, కీమో థెరపీలతో పాటు క్యాన్సర్కు నేడు సెల్ టార్గెటెడ్ థెరపీ, ఫొటోడైనమిక్, లేజర్ థెరపీ, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీ వంటి అనేక కొత్త చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికి ఇవి ఖరీదైనవే అయినా మున్ముందు కొంతవరకు తగ్గవచ్చు. క్యాన్సర్ చికిత్స తీసుకునేవారికి గుండె, మూత్రపిండాలు, కాలేయం పనితీరు సరిగా ఉండటం చాలా ముఖ్యం. ముందే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు వారు క్యాన్సర్ మందులు వాడాల్సి వస్తే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ మందుల ప్రభావం మిగతా అవయవాల మీద కూడా ఉంటుంది కాబట్టి డాక్టర్ సలహా మేరకు, నిర్ణీత కాల వ్యవధిలో బ్లడ్ టెస్ట్ వంటి పరీక్షలతో పాటు, ఆయా అవయవాల పనితీరును తెలుసుకునేందుకు అవసరమైన ఇతర పరీక్షలూ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే క్యాన్సర్ చికిత్సతో గుండె, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిని, అవి ఫెయిల్యూర్ స్థితికి వెళ్లి, ఒక్కోసారి రోగి మరణించడం కూడా జరగవచ్చు. అందుకే క్యాన్సర్ చికిత్స జరుగుతున్నప్పుడు ఆ మందుల ప్రభావం వల్ల చుట్టూ ఉండే ఇతర అవయవాల తాలూకు ఆరోగ్యకరమైన కణాలపై వీటి దుష్ప్రభావం ఉండకుండా చూసేందుకు, వీలైనంతగా తగ్గించేందుకు ఇప్పుడు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి ఫలితంగా నేడు క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే సెల్ టార్గెటెడ్ థెరపీలు, ఇతర అవయవాల మీద ప్రభావం పడకుండా చేసే వీఎమ్ఏటీ రేడియేషన్ థెరపీలు, వీలైనంత తక్కువ కోతతో చేయగలిగే కీహోల్ సర్జీల వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇంకా క్యాన్సర్ చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం. శస్త్రచికిత్స : రక్తానికి సంబంధించిన క్యాన్సర్ తప్పితే మిగతా ఏ క్యాన్సర్లోనైనా శస్త్రచికిత్సకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. చాలా సందర్భాల్లో క్యాన్సర్ను నయం చేయడానికి వీటిని నిర్వహించడంతో పాటు కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలను ముందే తెలుసుకొని, అవి రాకుండా నివారించడానికి కూడా సర్జరీలు చేయాల్సిన సందర్భాలుంటాయి. ఇతర ఏ భాగాలకూ వ్యాపించని దశలో క్యాన్సర్ను కనుగొంటే సర్జరీ వల్ల క్యాన్సర్ను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సర్జరీలను నేడు చాలా చిన్న కోతతోనే, ఒక్కోసారి ఆరోజే రోగి ఇంటికి వెళ్లేలా చేయగలుగుతున్నారు. ఆ సందర్భాలివే... ప్రివెంటివ్ సర్జరీ : పెద్దపేగు చివరిభాగం (కోలన్)లో పాలిప్ కనిపించినప్పుడు ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేకున్నా సర్జరీ చేసి తొలగిస్తారు. కుటుంబ చరిత్రలో రక్తసంబంధీకులకు రొమ్ము క్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉంటే బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 వంటి జీన్ మ్యుటేషన్ పరీక్షలతో క్యాన్సర్ వచ్చే ముప్పును ముందే తెలుసుకొని రొమ్మును (మాసెక్టమీ) తొలగిస్తారు. పాప్స్మియర్ పరీక్షలో తేడాలున్నప్పుడు హిస్టరెక్టమీ చేసి గర్భాశయాన్ని తీసివేస్తారు. ఇవన్నీ ముందే అనుమానించి జాగ్రత్తపడటానికి చేసే శస్త్రచికిత్సలు. క్యూరేటివ్ సర్జరీ : క్యాన్సర్ను తొలిదశలో కనుగొన్నప్పుడు ముందు రేడియేషన్, కీమో థెరపీ లేదా సర్జరీ తర్వాత ఇతర థెరపీలతో కలుపుకుని, దాన్ని పూర్తిగా నయం చేయడానికి చేసే సర్జరీలివి. పాలియేటివ్ సర్జరీ : క్యాన్సర్ను చాలా ఆలస్యంగా, చివరి దశలో కనుగొన్నప్పుడు ఆ కణితి పరిమాణాన్ని తగ్గించి, కొంతవరకు ఇబ్బందిని తగ్గించడానికి ఈ సర్జరీలను చేస్తుంటారు. ఒక్కోసారి ఇతర చికిత్సలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండేలా కూడా, ఈ తరహా సర్జరీలను... సపోర్టివ్ సర్జరీలుగా కూడా చేస్తారు. రిస్టోరేటివ్ (రీకన్స్ట్రక్టివ్) సర్జరీ: క్యాన్సర్ సర్జరీలలో క్యాన్సర్ వచ్చిన భాగంతో పాటు, చుట్టూ ఉన్న లింఫ్నోడ్స్నీ, ఇతర కణజాలాన్నీ తొలగించడం జరుగుతుంది. కానీ బయటకు కనిపించే అవయవాలైన రొమ్ము, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో నోటికి సంబంధించిన భాగాల్ని తొలగించినప్పుడు, ఆయా అవయవాల పనితీరు మెరుగుపడటానికీ, దాంతోపాటు రోగుల్లో ఆత్మన్యూనతా భావం రాకుండా ఉండటానికి శరీరంలోని ఇతర భాగాల నుంచి కణజాలాన్నీ, ఎముకలనూ సేకరించి, అలాగే వాటికి ఇతర మెటల్, ప్లాస్టిక్స్తో చేసిన ప్రోస్థటిక్స్ను ఉపయోగించి, ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలను చేస్తారు. వీటిని వెంటనే చేయవచ్చు లేదా చికిత్స పూర్తయ్యాక కూడా చేయవచ్చు. కీమోథెరపీ : క్యాన్సర్ చికిత్స అనగానే సర్జరీ కంటే కీమోథెరపీకి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వాంతులు, వికారం, బరువు తగ్గడం, అలసట, గొంతు రంగుమారడం, కనురెప్పలతో పాటు జుట్టంతా రాలిపోవడం... ఇలాంటి లక్షణాలవల్ల కీమో థెరపీ అంటే అందరికీ భయం. ఈ దుష్ప్రభావాలన్నీ తాత్కాలికమే. ఒక్కోసారి చికిత్స పూర్తయ్యాక పూర్తిగా ఇంతకు ముందులాంటి పరిస్థితే ఏర్పడుతుంది. ఈ థెరపీని 1950వ సంవత్సరం నుంచి చేస్తున్నారు. దాదాపు వందరకాలకు పైగా ఉన్న ఈ క్యాన్సర్ మందులను పిల్స్, లిక్విడ్స్, రక్తనాళంలోకి ఇచ్చే మందులు (ఐవీ), ఇంజెక్షన్స్, చర్మంపైన రుద్దేమందులు, వెన్నులోకి, పొట్టలోకి ఇచ్చే ఇంజెక్షన్లు... ఇలా అనేక రకాలుగా ఇస్తుంటారు. క్యాన్సర్ కణాలను చంపడానికి, మళ్లీ మళ్లీ అది తిరగబెట్టకుండా ఉండటానికి ఈ మందులను రకరకాల కాంబినేషన్లలో కూడా ఇస్తారు. ఇటీవలి కొత్త టార్గెటెడ్ థెరపీలతో కొంతవరకు సైడ్ఎఫెక్ట్స్ తగ్గినా ఈ చికిత్సలు అందరికీ అందుబాటులో లేకపోవడం బాధాకరం. రేడియేషన్ థెరపీ : వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రేడియేషన్ థెరపీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటివల్ల అరగంటపైగా సాగే చికిత్స ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఒక్కో క్యాన్సర్కు రేడియేషన్తో మాత్రమే చికిత్స కొనసాగుతుంది. రోగిని ఏమాత్రం కదిలించకుండా కొనసాగే త్రీ–డైమన్షనల్, స్టిరియోటాక్టిక్, బ్రాకీథెరపీ వంటి అనేక కొత్త చికిత్సల వల్ల తక్కువ వ్యవధిలోనే చికిత్స పూర్తవ్వడమే కాకుండా, దుష్ప్రభావాలు కూడా చాలావరకు తగ్గాయి. పై చికిత్సలే గాక... స్టెమ్సెల్ థెరపీలో, సర్జరీలలో లేజర్ ఉపయోగించడం, లైట్ను ఉపయోగించి చేసే ఫోటో డైనమిక్ థెరపీలు, అతివేడి లేదా అతి చల్లటి ఉష్ణోగ్రతలను ఉపయోగించి చేసే చికిత్సలు, మన రోగనిరోధకశక్తిని బలపరచి క్యాన్సర్ కణాల మీద దాడి చేసేటట్లు చేసే ఇమ్యూనోథెరపీలు, మాలిక్యులార్ టార్గెటెడ్ థెరపీలు క్యాన్సర్ చికిత్స రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయని చెప్పవచ్చు. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
నమ్మలేనట్టుగా అనిపిస్తోంది!
క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం సోనాలీ బింద్రే లండన్లో కొంత కాలం గడిపిన సంగతి తెలిసిందే. ఇటీవలే ముంబై వచ్చిన సోనాలి మళ్లీ షూటింగ్ లొకేషన్లో అడుగుపెట్టారు. అయితే ఇది సినిమా షూటింగ్ కాదు.. యాడ్ షూటింగ్ కోసం. చాలా కాలం తర్వాత సెట్లో అడుగుపెడుతుంటే నమ్మలేనట్టుగా అనిపిస్తోంది అని పేర్కొన్నారామె. ‘‘మళ్లీ పనిలో పడటం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను. మరింత బాధ్యతగా, అర్థవంతంగా సెట్లోకి అడుగుపెట్టాను. మళ్లీ కెమెరాను ఎదుర్కోవడం, ఎమోషన్స్ను పలికించడం హ్యాపీగా ఉంది’’ అంటూ పేర్కొన్నారు సోనాలి. యాడ్స్లో నటిస్తున్న ఆమె మళ్లీ సినిమాల్లోనూ నటిస్తారా? వేచి చూద్దాం. -
కేన్సర్ ఇక ఖతమే!
కేన్సర్ సోకిందంటే చాలు.. ఇక మరణమే అని అనుకునేవారు ఒకప్పుడు! సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులో..పరిశోధనల ఫలితమో కానీ ఇప్పుడు ఈ వ్యాధి సోకినా కొన్నేళ్లపాటు బతికేయొచ్చు అన్న భరోసా వచ్చింది.. ఇప్పటికీ సాధ్యం కాని విషయం ఏంటంటే..కేన్సర్ను నయం చేయడం! ఈ లోటును ఏడాదిలోపే తాము భర్తీ చేస్తామంటోంది ఏఈబీఐ అంతటి అద్భుతం ఈ కంపెనీ చేతిలో ఏముంది? ఏటా రెండు కోట్ల మంది ప్రాణాలు బలితీసుకుంటున్న కేన్సర్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఏఈబీఐ ఓ వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే.. హెచ్ఐవీ చికిత్సను ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. ఒకప్పుడు ఈ వ్యాధికి బోలెడన్ని మాత్రలు ఇచ్చేవారు. రోజుకు ఇరవై ముప్పై మాత్రలు వేసుకున్నా ప్రాణాలకు గ్యారంటీ ఉండేది కాదు. కానీ.. యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్ (ఏఆర్టీ) రంగ ప్రవేశంతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. మూడు మందులను కలిపివాడే ఈ ఏఆర్టీ మందుల వాడకంతో ఇప్పుడు హెచ్ఐవీతోనూ దశాబ్దాల పాటు బతకడం సాధ్యమవుతోంది. దాదాపు ఇలాంటి పద్ధతినే కేన్సర్ వ్యాధికి వర్తింప జేసింది ఇజ్రాయెల్ కంపెనీ ఏఈబీఐ. ఈ పద్ధతికి ఏఈబీఐ పెట్టిన పేరు ముటాటో. మల్టీటార్గెట్ టాక్సిన్కు క్లుప్తరూపం ఈ ముటాటో. కేన్సర్ చికిత్సకు ఇప్పటివరకూ వాడుతున్న వేర్వేరు పెప్టైడ్లను కలిపి వాడటం ఈ పద్ధతిలోని కీలకాంశం. ఇవన్నీ ఏకకాలంలో కేన్సర్ కణాలపై దాడి చేస్తాయి. ఫలితంగా కేన్సర్ కణాలు నాశనమవుతాయని ఏఈబీఐ సీఈవో ఇలాన్ మొరాద్ చెబుతున్నారు. ఈ కొత్త పద్ధతి కేన్సర్ కణాల సృష్టికి కారణమైన మూలకణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందని అంటున్నారు. కేన్సర్ కణాలు సాధారణంగా రోగ నిరోధక వ్యవస్థ కళ్లు కప్పేందుకు డీఎన్ఏలో మార్పులు జరుగుతుంటాయని.. తమ పద్ధతి ద్వారా ఇది కూడా వీలుకాదని వివరించారు. పరిశోధనకు నోబెల్.. ఏఈబీఐ అభివృద్ధి చేస్తున్న కొత్త కేన్సర్ చికిత్స పద్ధతి ఇంకో ఏడాదిలోపే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇలాన్ చెబుతున్నారు. ఎస్ఓఏపీ అనే ప్లాట్ఫాం ద్వారా అన్ని రకాల కేన్సర్లపై పోరాడే లక్షణాలు ఉన్న పెప్టైడ్లను గుర్తించడం ద్వారా ఈ కొత్త పద్ధతి తొలి రోజు నుంచి ప్రభావం చూపుతుం దని అంచనా. బ్యాక్టీరియాలపై దాడి చేసే వైరస్లోకి నిర్దిష్ట ప్రొటీన్లను ఉత్పత్తి చేసే డీఎన్ఏ పోగులను ప్రవేశపెట్టడం ద్వారా ఇది జరుగుతుంది. ఈ ప్రొటీన్ను సులువుగా గుర్తించవచ్చని, అదెలా పనిచేస్తుందో కూడా గమనిస్తుండవచ్చని చెబుతున్నారు. ఈ పద్ధతి ద్వారా కొత్త, వినూత్నమైన పెప్టైడ్లను సృష్టించొచ్చన్న పరిశోధనకే గతేడాది నోబెల్ బహుమతి దక్కింది. ఏఈబీఐ ఎలుకలపై ప్రయోగాలు చేసి సానుకూల ఫలితాలు రాబట్టింది. వ్యక్తిగత వైద్యం.. ముటాటో కేన్సర్ చికిత్స పద్ధతిలో ఉండే ఇంకో విశేషం ఇది అందరికీ ఒకే మందు ఇవ్వడం కుదరదు. కేన్సర్ కణితి నుంచి నమూనా సేకరించి అందులో ఎక్కువగా కనిపిస్తున్న కణ లక్ష్యాలను ముందుగా గుర్తిస్తారు. ఆ తర్వాత వాటికి విరుగుడుగా పనిచేసే పెప్టైడ్లను సిద్ధం చేసి అందిస్తారు. అంటే ఇది వ్యక్తిగత వైద్యం అన్నమాట. వేర్వేరు కేన్సర్లకు అవసరమైన పెప్టైడ్లన్నీ ఒకే ప్లాట్ఫాంపై ఏర్పాటు కావడం వల్ల కేన్సర్ కణాలకు మాత్రమే నష్టం జరుగుతుందని కంపెనీ చెబుతోంది. కేన్సర్కు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కీమోథెరపీ, రేడియేషన్ చికిత్స పద్ధతులు అనేక దుష్ప్రభావాలు చూపుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. బహుళ పెప్టైడ్ విధానం వల్ల ఈ సమస్యలేవీ ఉండవు. పైగా ముటాటో మందులు జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు. కొన్ని వారాల పాటు మందులు వాడితే సరిపోతుంది. అంతా బాగుందికానీ.. ఏఈబీఐ ప్రయోగాలకు సంబంధించి ఇప్పటివరకూ ఇతర శాస్త్రవేత్తల సమీక్ష జరగలేదు. ఈ లోటును కూడా పూరించుకుంటే కేన్సర్పై పోరులో కొత్త అధ్యాయం మొదలైనట్లే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘టైమ్’లో ఇండియన్ టీన్స్
హూస్టన్: టైమ్ మ్యాగజైన్ 2018 ఏడాదికి సంబంధించి ప్రకటించిన అత్యంత ప్రభావశీల టీనేజర్ల కేటగిరీలో ముగ్గురు భారత సంత తి విద్యార్థులు చోటు సంపాదించారు. వారి వారి విభాగాల్లో విశేష ప్రతిభ చూపించిన ఇండో–అమెరికన్ కావ్య కొప్పరపు, రిషబ్ జైన్, బ్రిటిష్–ఇండియన్ అమికా జార్జ్లు మొదటి 25 స్థానాల్లో నిలిచారు. ప్యాంక్రియాటిక్ కేన్సర్ను నయం చేయగలిగే సామర్థ్యం ఉన్న అల్గారిథమ్ను ఎనిమిదో తరగతి చదువుతున్న రిషబ్ జైన్ అభివృద్ధి చేశాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న కావ్య కొప్పరపు అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ మెదడు కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారి మెదడు కణజాలాన్ని క్షుణ్నంగా స్కాన్ చేయగలదు. ఈ సాఫ్ట్వేర్ సహాయంతో మెదడుకు సంబంధించిన కణజాల అమరిక, రంగు, సాంద్రత, ఆకృతి వంటి వాటిని పరిశీలించవచ్చు. ఈ వ్యాధికి సంబంధించి ప్రతి రోగికి విడివిడిగా చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తేవాలన్నదే కావ్య లక్ష్యం అని, ప్రస్తుతం ఆ దిశగా ఆమె పనిచేస్తోందని టైమ్ చెప్పింది. ఇక అమికా జార్జ్ మహిళల కోసం ఫ్రీ పీరియడ్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. రుతుక్రమ సమయంలో మహిళలకు అవసరమయ్యే సామగ్రిని ప్రభుత్వాలే వారికి అందజేసేలా అమికా కృషి చేస్తోంది. బ్రిటన్లో అనేకమంది బాలికలు పీరియడ్స్ సమయంలో స్కూళ్లకు రావడం లేదని, ఆ సమయంలో వారికి అవసరమైన సామగ్రి అందుబాటులో లేకపోవడమేనని కారణమని అమికా తెలిపింది. -
యుద్ధం ముగిసిపోలేదు!
నటి సోనాలీ బింద్రే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆమె న్యూయార్క్లో ఉంటూ కీమోథెరపీ చేయించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తన అనుభూతులను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంటారు. తాజాగా తాను ముంబై రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ను షేర్ చేశారామె. దాని సారాంశం ఇలా ఉంది.. ‘‘ఇంటికి దూరంగా న్యూయార్క్లో ఉన్నప్పుడు చాలా విభిన్నమైన స్టోరీలు నా చుట్టూ ఉన్నాయని తెలుసుకున్నాను. దేనికదే విభిన్నం. నా స్టోరీలో భాగంగా ఇప్పుడు నేను ఇంటికి వెళుతున్నాను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేక పోతున్నాను. నేను న్యూయార్క్లో ఉన్నప్పటికీ నా మనసు మాత్రం నా కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్యనే ఉంది. వారందర్నీ తిరిగి కలవబోతున్నందుకు హ్యాపీగా ఉంది. నా యుద్ధం ఇంకా ముగిసిపోలేదు (క్యాన్సర్ చికిత్సను ఉద్దేశిస్తూ). కానీ హ్యాపీగానే ఉన్నా. ఈ హ్యాపీ ఇంట్రవెల్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది. జీవితంలో నేను చేసే సాహసాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి’’ అన్నారు సోనాలి. -
నాతో పాటు మీరూ చదువుతారు కదూ?
క్యాన్సర్ వ్యాధికి న్యూయార్క్లో చికిత్స పొందుతున్నారు నటి సోనాలీ బింద్రే. తన ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారామె. ప్రస్తుతం ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవడానికే కేటాయిస్తున్నారు. అయితే, ఈ మధ్య పుస్తకాలు చదవడానికి చాలా కష్టంగా ఉంటోంది అంటున్నారామె. ‘‘ఇంతకు ముందు చదివిన పుస్తకాన్ని పూర్తిచేయడానికి చాలా సమయం పట్టింది. కీమో థెరపీ వల్ల కంటి చూపు సరిగ్గా సహకరించడం లేదు. అందుకే పుస్తకాలు చదవడానికి కొంచెం విరామం ఇచ్చాను. ఇప్పుడు మళ్లీ మామూలుగానే ఉంది. ‘ఎ లిటిల్ లైఫ్’ అనే కొత్త పుస్తకం చదవడం మొదలెట్టాను. నాతో పాటు మీరూ చదువుతారు కదూ’’ అంటూ ఈ ఫొటో పోస్ట్ చేశారు. -
సోనాలీని కలిసిన నమ్రత, గౌతమ్
క్యాన్సర్తో బాధపడుతోన్న హీరోయిన్ సోనాలీ బింద్రే ప్రస్తుతం న్యూయార్క్లో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు సోనాలిని సందర్శిస్తూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. సోనాలీ కూడా ఎప్పటికప్పుడు తన క్షేమ సమాచారన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రియాంక చోప్రా, అనుపమ్ ఖేర్, నీతూ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు సోనాలీని సందర్శించారు. ఇప్పుడు వీరి వరుసలోకి నమ్రత కూడా చేరారు. ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి మూవీ షూటింగ్ నిమిత్తం న్యూయార్క్ వెళ్ళిన నమ్రత సోనాలీని కలిశారు. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత ఈ విషయం గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ‘నేను, నా కుమారుడు గౌతమ్ సోనాలీ కుటుంబాన్ని కలిశాము. తను చాలా ధైర్యం గల మహిళ. ఆమె చాలా ఫిట్గా ఉన్నారు. త్వరలోనే మామూలు జీవితం గడపనున్నారు. నేను తనతో చాలా సేపు మాట్లాడాను. ఆమె తన అనారోగ్యం గురించి.. చికిత్స గురించి.. ఈ ప్రయాణంలో తనకు బలాన్నిచ్చిన అంశాల గురించి నాతో చర్చించారు. నేను తన కోసం ప్రార్ధిస్తానని తెలిపాను’ అంటూ నమ్రత చెప్పుకొచ్చారు. -
ఇర్ఫాన్ రిటర్న్స్
న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. దానికోసం ఆయన లండన్లో చికిత్స కూడా పొందుతున్నారు. అయితే ఆయన దీపావళికి ఇండియా తిరిగి రానున్నారనే వార్త షికారు చేస్తోంది. తిరిగి రాగానే ‘హిందీ మీడియం’ సీక్వెల్ ‘హిందీ మీడియం 2’ షూట్లో పాల్గొంటారని బాలీవుడ్లో చెప్పుకుంటున్నారు. తొలి భాగంలో ఆయనే నటించారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇర్ఫాన్ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ఖండించాయి. ‘‘డిసెంబర్ నుంచి ఇర్ఫాన్ మళ్లీ షూటింగ్స్లో పాల్గొంటాడన్నది అవాస్తవం. కానీ దీపావళి తర్వాత ఇర్ఫాన్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారట. తిరిగి వచ్చేస్తున్నారంటే ఇర్ఫాన్ ఆరోగ్యం మెరుగుపడినట్టే అని ఆయన అభిమానులు, సన్నిహితులు సంతోషపడుతున్నారు. -
భారత్కు తిరిగి రానున్న ఇర్ఫాన్
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన నటుడికి న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ అన్న విషయం తెలిసిన దగ్గర నుంచి అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంలో ఆందోళన చెందుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇర్ఫాన్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందట. అంతేకాదు ఈ దీపావళిని ఆయన భారత్లోనే జరుపుకోబోతున్నారన్న వార్త అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో ఇర్ఫాన్ భారత్కు తిరిగిరానున్నారు, త్వరలో హిందీ మీడియం సినిమా సీక్వెల్లో నటించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఇర్ఫాన్ సన్నిహితులు ప్రస్తుతానికి సినిమాలకు సంబంధించిన నిర్ణయం తీసుకోకపోయినా దీపావళి తరువాత ఇర్ఫాన్ ఖాన్ భారత్కు తిరిగి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. -
కేన్సర్కు బ్యాక్టీరియా చికిత్సతో సత్ఫలితాలు
ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధికి సమర్థమైన చికిత్స అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే హ్యూస్టన్లోని ఎండీ యాండర్సన్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ దిశలో ఓ కీలకమైన ముందడుగు వేశారు. కేన్సర్ కణితులు బాగా పెరిగినపోయిన దశలోనూ క్లాస్ట్రీడియం నోవీ అనే బ్యాక్టీరియా ద్వారా మెరుగైన చికిత్స కల్పించవచ్చునని వీరు నిరూపించారు. గతంలోనూ బ్యాక్టీరియాతో కేన్సర్ చికిత్సకు కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ తాజా ప్రయత్నం ద్వారా అతితక్కువ దుష్ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఫిలిప్ జాన్కూ తెలిపారు. ఎందుకంటే.. సి.నోవీ బ్యాక్టీరియా ఆక్సిజన్ తక్కువగా ఉన్న వాతావరణంలోనూ బాగా పెరుగుతుంది కాబట్టి. కేన్సర్ కణితులు ఉన్న ప్రాంతంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. 2013 – 17 మధ్య కాలంలో తాము మొత్తం 24 మంది కేన్సర్ రోగులను ఎంపిక చేసి ప్రయోగాలు చేశామని.. పదివేల నుంచి 30 లక్షల బ్యాక్టీరియాను ఇంజెక్షన్ల రూపంలో కణితుల్లోకి ఎక్కించినప్పుడు కణితుల సైజు పది నుంచి 23 శాతం వరకూ తగ్గినట్లు తెలిసిందని ఫిలిప్ తెలిపారు. ఇమ్యునోథెరపీతోపాటు బ్యాక్టీరియాను కూడా అందించడం ద్వారా కేన్సర్కు మెరుగైన చికిత్స కల్పించవచ్చునని తమ పరిశోధనలు చెబుతున్నాయని వివరించారు. -
కేన్సర్పై పోరాటానికి నోబెల్
స్టాక్హోం: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధి కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఇద్దరు శాస్త్రజ్ఞులను ఈ ఏడాది వైద్య నోబెల్ వరించింది. వ్యాధి నిరోధక శాస్త్రనిపుణులైన అమెరికా వైద్యుడు జేమ్స్ అలిసన్ (70), జపాన్కు చెందిన తసుకు హొంజో (76)లను నోబెల్ వైద్య బహుమతికి విజేతలుగా ఎంపిక చేసినట్లు జ్యూరీ సోమవారం ప్రకటించింది. కేన్సర్ రోగాన్ని నయం చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాల్లో నేరుగా కేన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అలిసన్, హొంజోలు మాత్రం ఇమ్యునోథెరపీ అనే కొత్త విధానంలో మరింత వేగంగా కేన్సర్ను తగ్గించేందుకు రోగి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి ఎలా సాయపడుతుందనే అంశంపై పరిశోధనలు చేసి విజయం సాధించారు. వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు ఉత్పత్తి చేసే ప్రొటీన్లను చికిత్సలో లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కేన్సర్ కణాలను వేగంగా చంపేసే విధానాన్ని జేమ్స్ అలిసన్, తసుకు హొంజోలు అభివృద్ధి చేశారు. బహుమతులను ప్రకటించిన అనంతరం నోబెల్ అసెంబ్లీ సభ్యులు మాట్లాడుతూ ‘వీరి చికిత్సా విధానం కేన్సర్ను నయం చేయడంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కేన్సర్ చికిత్స విషయంలో మన దృక్పథాన్ని సమూలంగా మార్చింది’ అని శ్లాఘించారు. ‘రోగ నిరోధక శక్తి కణాలకు కేన్సర్ కణాలపై పోరాడే సామర్థ్యం ఉందనే విషయాన్ని గుర్తించిన వ్యక్తి అలిసన్. అలాగే రోగ నిరోధక కణాలపై పీడీ–1 అనే ప్రొటీన్ను గుర్తించి అది కూడా కేన్సర్ కణాలపై పోరాటానికి బాగా ఉపయోగపడుతుందని తసుకు హొంజో తెలియజెప్పారు’ అని నోబెల్ జ్యూరీ ఓ ప్రకటనలో తెలిపింది. నోబెల్ బహుమతి విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, ఆ మొత్తాన్ని అలిసన్, హొంజోలు చెరిసగం పంచుకుంటారు. అల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న స్టాక్హోంలో స్వీడన్ రాజు కార్ల్–16 వీరికి బహుమతిని అందజేస్తారు. గౌరవంగా ఉంది: అలిసన్ ‘ప్రఖ్యాత నోబెల్ బహుమతి గెలుచుకోవడం ఆనందంగా, గౌరవంగా ఉంది. నా పరిశోధన ఇంత గొప్పగా అవుతుందని కలలో కూడా ఊహించలేదు. రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించి అందించిన చికిత్స ద్వారా కోలుకున్న రోగులను కలుసుకోవడం గొప్ప ఉద్విగ్నంగా ఉంటుంది. ప్రాథమిక విజ్ఞాన శాస్త్రానికి, కేన్సర్కు రోగ నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకున్న మా జిజ్ఞాసకు ఆ రోగులే సజీవ సాక్ష్యాలు’ అని జేమ్స్ అలిసన్ వెల్లడించారు. శరీర వ్యాధి నిరోధక శక్తిలో అత్యంత కీలకమైన టీ–సెల్స్ (తెల్ల రక్త కణాల్లో ఒక రకం)పై నిరోధక గ్రాహంగా సీటీఎల్ఏ–4 అణువు పనిచేస్తుందని 1995లో గుర్తించిన ఇద్దరు శాస్త్రజ్ఞుల్లో అలిసన్ ఒకరు. మరింత మందిని కాపాడుతా: హొంజో తసుకు హొంజో జపాన్లోని క్యోటో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. నోబెల్ బహుమతిని ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోగ నిరోధక వ్యవస్థను ఉపయోగించి గతంలో కన్నా అత్యంత ఎక్కువ మంది కేన్సర్ రోగులను కాపాడేందుకు తన పరిశోధనను కొనసాగిస్తానని చెప్పారు. ‘నా కృషి వల్లే రోగం నయమైందని ఎవరైనా రోగులు చెప్పినప్పుడు నా ఆనందానికి అవధులుండవు. నా గోల్ఫ్ క్లబ్లో సభ్యుడైన ఓ వ్యక్తి ఓ రోజు నా దగ్గరికి వచ్చి.. మీ వైద్యం వల్లే నేను బతికున్నాను. ఊపిరితిత్తుల కేన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డానని చెప్పారు. అంతకన్నా ఆనందం ఏముంటుంది?’ అని చెప్పారు. ఏమిటీ ఇమ్యునోథెరపీ? కేన్సర్ చికిత్సకు అందుబాటులోకి వచ్చిన కొత్త పద్ధతే ఈ ఇమ్యునోథెరపీ. అడ్డూఅదుçపూ లేకుండా విభజితమయ్యే కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు ప్రస్తుతం కీమోథెరపీ, లేజర్ సహా పలు రకాల చికిత్సలు వాడతున్నాం. ఇమ్యునోథెరపీలో శరీర రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలే (టీ–లింఫోసైట్స్–తెల్ల రక్తకణాల్లో ఓ రకం) కేన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసేలా చేస్తారు. ఇమ్యునోథెరపీలో మూడు రకాలు ఉన్నాయి. రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలు చెక్పాయింట్ ఇన్హిబిటర్స్ వీటిల్లో ఒకటి. ఆరోగ్యకరమైన కణాలు, కేన్సర్ కణాల మధ్య తేడాను టీ–కణాలు గుర్తించేందుకు కొన్ని ప్రత్యేకమైన ప్రొటీన్ రిసెప్టార్లను వాడతారు. వీటిని చెక్పాయింట్స్ అంటారు. సాధారణంగా కేన్సర్ కణాలు కూడా మామూలు కణాల్లాగే టీ–సెల్స్కు సంకేతాలు పంపుతుంటాయి. దీంతో కేన్సర్ కణాలేవో, ఆరోగ్యకరమైన కణాలేవో టీ–సెల్స్ గుర్తించలేవు. ఇమ్యునోథెరపీలో కొన్ని ప్రత్యేకమైన మందుల ద్వారా ఈ సంకేతాలను నిలిపివేసి టీ–కణాలు కేన్సర్ కణాలను గుర్తించేలా చేస్తారు. ఇక రెండో రకం ఇమ్యునోథెరపీలో సైటోకైన్స్ను వాడతారు. రోగ నిరోధక వ్యవస్థ తయారు చేసే ప్రత్యేక రసాయనాలే ఈ సైటోకైన్స్. ఈ ప్రత్యేక రసాయనాల ద్వారా టీ–సెల్స్ అధికమై అవి కేన్సర్ కణాలపై దాడి చేస్తాయని అంచనా. చివరగా మూడో పద్ధతి... వ్యాక్సిన్లు. కొన్ని కేన్సర్ల విషయంలో ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్లను ఉపయోగిస్తారు. మిగిలిన వాటిల్లో వ్యాధి సోకిన తరువాత కూడా టీ–కణాల్లో కొత్త శక్తిని నింపి కేన్సర్ కణాలపై దాడి చేసేలా చేసేందుకు వ్యాక్సిన్లు ఉపయోగపడతాయి. ఈ పద్ధతిలో రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తారు కాబట్టి దాని ప్రభావం కొన్ని ఆరోగ్యకరమైన కణాలపై కూడా పడుతూంటుంది. ఫలితంగా విపరీతమైన నీరసం, వికారం, ఆకలి మందగించడం, దగ్గు వంటి సమస్యలు ఉంటాయి. -
అలిసన్, హొంజొలకు మెడిసిన్లో నోబెల్
న్యూయార్క్ : జపాన్కు చెందిన తసుకు హొంజొ, అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ అలిసన్లకు మెడిసిన్లో 2018 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ ప్రైజ్ లభించింది. క్యాన్సర్ చికిత్సలో పరిశోధనకు గాను వీరికి అత్యున్నత పురస్కారం దక్కిందని నోబెల్ కమిటి పేర్కొంది. క్యాన్సర్ కణాలను నిరోధించేలా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేయడంపై వీరు సాగించిన పరిశోధన క్యాన్సర్కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో మైలురాయి వంటిదని, వీరు ప్రతిపాదించిన ఇమ్యూన్ చెక్పాయింట్ సిద్ధాంతం క్యాన్సర్ చికిత్సలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని కమిటీ వ్యాఖ్యానించింది. క్యాన్సర్ను ఎలా ఎదుర్కోగలమనే మన దృక్కోణాన్ని సైతం వీరి పరిశోధన సమూలంగా మార్చివేసిందని పేర్కొంది.యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్కు చెందిన ఎండీ అండర్సన్ క్యాన్సర్ సెంటర్లో ప్రొఫెసర్ అయిన అలిసన్ సాగించిన పరిశోధనా ఫలితాలు దీటైన క్యాన్సర్ చికిత్సకు మార్గం సుగమం చేశాయని నోబెల్ కమిటీ తెలిపింది. ఇక జపాన్లోని క్యోటో యూనివర్సిటీ ప్రొఫెసర్ హొంజొ చేపట్టిన పరిశోధనలు సైతం సమర్ధవంతమైన క్యాన్సర్ చికిత్సకు ఊతమిచ్చాయని పేర్కొంది. హొంజొ 34 సంవత్సరాలుగా క్యోటో యూనివర్సిటీ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. -
నేనే ముందు ఇంటికెళ్తా
ప్రస్తుతం కేన్సర్ చికిత్స పొందుతూ సోనాలీ బింద్రే లండన్లో ఉన్నారు. అప్పుడుడప్పుడు ఆమె ఫ్రెండ్స్ ఆమెను చూడటానికి వెళ్తూనే ఉన్నారు. రీసెంట్గా సోనాలీకి అనుపమ్ ఖేర్ వీకెండ్స్లో కంపెనీ ఇస్తున్నారట. అమెరికన్ టీవీ సిరీస్లో యాక్ట్ చేస్తున్నారు అనుపమ్. ఆ షూటింగ్ నిమిత్తం అక్కడున్నారాయన. ఈ విషయాన్ని తెలియజేస్తూ – ‘‘ఈ షో వల్ల ఇక్కడ నాకో స్నేహితుడు దొరికాడు. మనలో ఎవ్వరు ఫస్ట్ ఇంటికి వెళ్లిపోతామో అని మాట్లాడుకుంటూ ఉంటాం. అతని కంటే నేనే ముందు వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను. అనుపమ్ షోకి ఎక్కువ సీజన్స్ ఉండి తను ఇక్కడే ఉండిపోవాలి’’ అని పేర్కొన్నారు సోనాలి. -
అవసవరమే!
‘నచ్చి చేసే తప్పుల్లో అందంగా కనిపించాలనే ఆలోచన’ నాకు నచ్చినది అని దర్శకుడు ఆల్ ప్యాచినో ఎప్పుడో అన్నాడు. ఆయన చెప్పిన ఈ మంత్రాన్ని పాటిస్తున్నారు సోనాలీ బింద్రే. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ వ్యాధికి లండన్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా జుత్తు కత్తిరించుకుని, గుండు చేయించుకున్నా ఇబ్బంది పడకుండా ఫొటోలకు ఫోజులిచ్చారామె. లేటెస్ట్గా అందంగా కనిపించడం కోసం విగ్ (సవరం) ధరిస్తున్నారట. ఆ విషయాన్ని సోనాలి తెలియజేస్తూ ఓ లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఆల్ ప్యాచినో చెప్పినమంత్రంతో ఇప్పుడు ఏకీభవిస్తున్నాను. కానీ, అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు? మనం ఎలా కనిపిస్తున్నామో అన్న విషయం మనపై సైకలాజికల్ ఎఫెక్ట్ ఉండనే ఉంటుంది. కొంచెం అందంగా కనిపించాలనుకోవడం ఎవరికీ పెద్ద హాని కాదు. మనకి ఆనందాన్ని ఇచ్చేదేంటో తెలుసుకోవాలి. విగ్ వాడదాం అనుకున్నప్పుడు నాకో చిరు సందేహం వచ్చింది. ఆకర్షణీయంగా కనిపించడానికి నేను ఎందుకింత ఆరాటపడుతున్నానని. బహుశా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండటం వల్లనేమో? ఒక్క క్షణం ఆలోచించి, నాకు బావుంటుంది అనుకొని విగ్ ధరించదలిచాను. మనకేది సూట్ అవుతుందో.. ఏది నచ్చుతుందో అన్నదే ముఖ్యం. ఈ కొత్త హెయిర్ డ్రెస్సర్ని పరిచయం చేసినందుకు థ్యాంక్యూ ప్రియాంకా చోప్రా’’ అని పేర్కొన్నారు. -
మాటువేసిన మాయదారిరోగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఏడాదికి కొత్తగా 58 వేల మంది కేన్సర్ బారిన పడుతున్నారని టాటా ట్రస్టు తెలిపింది. తెలంగాణలో కేన్సర్ వ్యాధి వ్యాప్తిపై ‘టాటా ట్రస్ట్’సమగ్ర ప్రాజెక్టు నివేదిక–2018ను తాజాగా విడుదల చేసింది. కేన్సర్ బారిన పడుతున్న 58 వేల మందిలో 45 వేల మంది కింది మధ్యతరగతి ఆదాయ వర్గాలేనని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కేన్సర్ బారిన పడుతున్న వారి రేటు పురుషుల్లో లక్షకు 85, స్త్రీలలో 125గా ఉండటం గమనార్హం. అయితే అనేకచోట్ల కేన్సర్ రోగులు నమోదు కావటం లేదు. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే లక్షకు 143గా ఈ రేటు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. దేశం లో ఈ రేటు పురుషుల్లో 110, స్త్రీలలో 102గా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో కేన్సర్ రోగుల్లో అత్యధికంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ కేన్సర్కు గురవుతున్న వారు 23% మంది ఉన్నారు. పొగాకు కారణంగా 15%కేన్సర్కు గురవుతున్నారు. 12% మంది గైనిక్ సంబంధిత కేన్సర్కు గురవుతున్నారు. థర్డ్ స్టేజ్లోనే ఆసుపత్రులకు... ఇతర అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే ఇండియాలో కేన్సర్ పెరుగుదల రేటు తక్కువగా కనిపిస్తుంది. అయితే వాస్తవంగా ఆ పరిస్థితి ఉందని కాదు. తక్కువ కనిపిస్తుండ టానికి ప్రధాన కారణం కేన్సర్ను ముందస్తుగా గుర్తించకపోవడం, పరీక్షలు చేయించుకోకపోవడం, రోగం వచ్చినా కూడా నమోదు కాకపోవడంగా నివేదిక తెలిపింది. అంతేకాదు కేన్సర్ సోకిన వారిలో 50 శాతం మంది థర్డ్ స్టేజీలోనే మొదటిసారి వైద్యానికి వస్తున్నారు. దీంతో భారీగా మరణాల రేటు నమోదవుతోంది. పైగా వైద్య వసతి లేకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోంది. భారత్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేన్సర్ చికిత్సకు రూ.4 లక్షల నుం చి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇప్పు డున్న రోగులకు వైద్యం చేయాలంటేనే దేశవ్యాప్తంగా 850 సమగ్ర ఆసుపత్రులు అవసరం. కేవలం 400 మాత్రమే అందుబాటులో ఉండ గా.. 67 శాతం ప్రైవేట్ రంగంలోనే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణకు వస్తే మొత్తం 25 సమగ్ర కేన్సర్ ఆసుపత్రులుండగా, అం దులో 3 మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నా యి. నిమ్స్, ఎంఎన్జే కేన్సర్ ఆసుపత్రి, వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీల్లో కేన్సర్ చికిత్స అందుబాటులో ఉంది. 30 రేడియోథెర పీ మిషన్లు ఉంటే అందులో 25 ప్రైవేట్ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. విచిత్రమేమంటే రాష్ట్రంలో 800 ప్రభుత్వ ఆసుపత్రులుంటే, కేవ లం మూడింటిలోనే వ్యాధికి వైద్యం అందుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి... ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల కేన్సర్లకు చికిత్స అందుబాటులో ఉంది. రోగుల్లో ఎక్కువ మంది దిగువ మధ్య తరగతికి చెందిన వారే ఉంటుండటంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులపై పడుతోంది. అయితే ఆరోగ్యశ్రీ కింద రోగికి రూ.లక్షన్నర వరకే అనుమతి ఉండటంతో చాలావరకు ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ రోగులను పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు ఏడాదికి 12 వేల మంది కేన్సర్ రోగులకు చికిత్స చేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు 10 వేల మందికి చికిత్స చేస్తున్నాయి. 12 కేంద్రాల్లో చికిత్సకు ప్రతిపాదనలు... రోగుల సంఖ్యకు తగ్గట్లు కేన్సర్ చికిత్స అందుబాటులో లేకపోవడంతో టాటా ట్రస్ట్ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిమ్స్సహా 12 కేంద్రాల్లో కేన్సర్ చికిత్స అందజేయాలని ప్రతిపాదించింది. వాటి ద్వారా 70 శాతం రోగులకు చికిత్స అందిస్తారు. పైగా రాష్ట్రంలో ఎక్కడివారైనా ఒకట్రెండు గంటల్లో వెళ్లి వైద్యం చేయించుకునేలా పలుచోట్ల ఆయా కేంద్రాలను అభివృద్ధి చేస్తారు. అంతేకాదు టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణలో 250 పడకలతో కేన్సర్ ఆస్పత్రి నెలకొల్పాలని భావిస్తుంది. -
వైరలవుతున్న నటుడి ఫోటో
బాలీవుడ్ క్లాసిక్ హీరో ఇర్ఫాన్ ఖాన్ అరుదైన ‘న్యూరో ఎండోక్రైనో’ అనే క్యాన్సర్తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్లో చికిత్స పొందుతున్న ఈ హీరో ఆదివారం తన డీపీ(డిస్ప్లే పిక్చర్)ని చేంజ్ చేశారు. అయితే ఈ ఫోటో అభిమానులను విపరీతంగా కదిలించడమే కాక తెగ వైరల్ అవుతుంది. సాధరణంగా క్యాన్సర్ వ్యాధికి చికిత్స అంటే ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. కానీ ఇర్ఫాన్ ఫోటో చూసిన వారికి కూడా ఆ బాధ ఎలా ఉంటుందో బాగానే అర్ధం అవుతుంది. ఇర్ఫాన్ ఖాన్ షేర్ చేసిన ఈ ఫోటోలో అతను బాగా నీరసించి, బక్కచిక్కపోయి ఉన్నట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. కానీ ఇంతటి విచారాన్ని కూడా ఈ నటుడు చిరునవ్వుతో భరిస్తున్నాడు. శరీరం ఎంత బలహీన పడినా ఇర్ఫాన్ ధైర్యం మాత్రం తగ్గలేదు. అందుకు నిదర్శనం అతని మోముపైన చిరునవ్వే. ఇర్ఫాన్ న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు ఈ ఏడాది మార్చిలో తెలిసింది. దాంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తనకొచ్చిన అరుదైన వ్యాధి గురించి ఇర్ఫాన్ ఖాన్ ఒక భావోద్వేగపూరితమైన లేఖను రాశారు. ఈ లేఖలో ‘ఊహించని ఉపద్రవాలతో కూడిందే జీవితం. మనం ఏదో అనుకుంటాం, కానీ మనం అనుకోనిదేదో జరుగుతుంది. ఇలాంటి అనుకోని సంఘటనలే మన జీవితాన్ని మార్చివేస్తాయి. గత కొన్ని రోజుల్లోనే ఈ విషయం నాకు బాగా అర్ధమయ్యింది. నేను అరుదైన న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్తో బాధపడుతున్నాను. కానీ నా చుట్టూ ఉన్న వారి ప్రేమ, ఆశీస్సులే నాకు బలానిస్తున్నాయి. అవే నాకు నమ్మకాన్ని కల్గిస్తున్నాయి. ఈ ప్రయాణంలో భాగంగా(చికిత్స కోసం) నేను దేశం దాటి వెళ్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని కోరేది ఒక్కటే మీ ఆశీస్సులను నిరంతరం నాకు అందిస్తూనే ఉండండి. త్వరలోనే వచ్చి నా ఈ ప్రయాణానికి సంబంధించిన మరిన్ని కబుర్లు మీకు చెబుతాను అంటూ లేఖలో తెలిపారు. లండన్ వెళ్లిన తర్వాత ఈ నటుడు కర్వాన్లో తనతో పాటు నటించిన దుల్కర్ సల్మాన్, మిథిలా పాకర్కు శుభాకాంక్షలు తెలిపడం కోసం తొలిసారి సోషల్ మీడియాలోకొచ్చారు. ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది. -
ప్రముఖ నటుడి భావోద్వేగపూరిత లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : మనిషి జీవితం నీటిలో తేలియాడుతున్న బెండు లాంటిది. కెరటాల ధాటికి దాని ఉనికి ప్రశ్నార్థమవుతుంటే.. ప్రకృతి ప్రసాదించిన జీవితాన్ని నేర్పుతో తీర్చిదిద్దుకోవాలే గానీ, కెరటాల్నే అదుపు చేస్తామని భ్రమపడటం మూర్ఖత్వమే అవుతుందంటున్నారు బాలీవుడ్ క్లాసిక్ హీరో ఇర్ఫాన్ఖాన్. ఒక్క సంఘటనతో జీవితం తల్లకిందులు కావొచ్చని చెప్తున్నారు. అరుదైన న్యూరో ఎండోక్రైన్ అనే క్యాన్సర్ వ్యాధి బారిన పడిన ఆయన లండన్లో చికిత్స పొందుతున్నారు. తన జీవితం ముగుస్తుందనే భయానక పరిస్థితుల నుంచి తెలుసుకున్న కొన్ని విషయాలను ఇర్ఫాన్ సోదాహరణంగా ఒక లేఖలో పేర్కొన్నారు. ఒక జాతీయ పత్రికకు ఇర్ఫాన్ రాసిన భావోద్వేగపూరిత లేఖలో ఏముందంటే.. ‘రైలులో ప్రయాణిస్తున్నాను. నేను చేరుకోవాల్సిన గమ్యం మరెంతో దూరం ఉంది. జర్నీలో నా గతాన్ని, ఆశలతో కూడిన నా భవిష్యత్తును తలచుకుంటూ హాయిగా ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను. అనుకోకుండా నా ఊహాలోకంలో అలజడి. ఎవరిదో చేయి నా భుజంపై పడింది. తిరిగి చూస్తే.. టికెట్ కలెక్టర్..! ‘నువ్వు దిగాల్సిన స్టేషన్ వచ్చింది. సర్దుకో అని సూచన’. అదెలా..! నేను ప్రయాణించాల్సిన దూరం మరెంతో ఉంది అన్నాను. అయినా అతను వినిపించుకోవడం లేదు. ‘మీరు దిగాల్సిందే అంటూ నన్ను బలవంతంగా రైలులోంచి తోసేసే పరిస్థితి తలెత్తింద’ని పేర్కొన్నారు. ఊహించని ఉపద్రవాలతో కూడిందే జీవితం అని లేఖలో చెప్పుకొచ్చారు. దేవుడి దయ వల్ల, ఎందరో అభిమానుల ఆశిస్సుల వల్ల ఇంకా ప్రాణాలతో ఉన్నానని తెలిపారు. ‘ప్రసిద్ధ మక్కా పుణ్యక్షేత్రాన్ని దర్శించాలనేది నా చిన్ననాటి కల. కానీ, ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉన్నాను. ఆస్పత్రి నుంచి బయటికి చూసినప్పుడు.. లార్డ్స్ స్టేడియంలో వేలాడుతున్న వివిఎన్ రిచర్డ్స్ పోస్టర్ కనిపించింది. అందులో చిరునవ్వు చిందిస్తున్న రిచర్డ్స్ను చూసినప్పుడు అనిపించింది. భూమ్మీద నూకలు ఉంటే అంతా మంచే జరుగుతుందనే సత్యం బోధపడింది. చావు బతుకుల మధ్య పోరాటం ఎప్పటికీ ఉండేదే’ అంటూ క్యాన్సర్పై తన స్వీయ పోరాటాన్ని తెలిపారు ఇర్ఫాన్. -
వ్యక్తిగత కేన్సర్ చికిత్స మరింత చేరువ!
కేన్సర్ వ్యాధి నిర్ధారణ మొదలుకొని వ్యాధి కణాల జన్యుక్రమం ఆధారంగా వ్యక్తిగత స్థాయిలో చికిత్స కల్పించేందుకు కూడా ఉపయోగపడే ఓ వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేశారు నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ శాస్త్రవేత్తలు. కేన్సర్ కణితి నుంచి కొన్ని కణాలు విడిపోయి రక్తం ద్వారా శరీరం మొత్తం కలియదిరుగుతూంటాయని మనకు ఇప్పటికే తెలిసిందే. వీటిని సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ (సీటీసీ) అంటారు. వీటిని క్షుణ్ణంగా విశ్లేషిస్తే చికిత్స మరింత సులువు అవుతుంది. అదే సమయంలో కణితి తాలూకు కణజాలాన్ని పదేపదే సేకరించాల్సిన అవసరం ఉండదు. రక్తంలో సీటీసీల ఉనికిని గుర్తించడం ద్వారా కేన్సర్ను నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిని లిక్విడ్ బయాప్సీ అంటారు. ఈ లిక్విడ్ బయాప్సీతో పాటు ఒక్కో వ్యక్తికి ప్రత్యేకంగా ఉండే సీటీసీలను మెరుగ్గా ఎదుర్కోగల మందులను ఎంపిక చేసుకునేందుకు ఉపయోగపడేలా శాస్త్రవేత్తలు ఒక పరికరాన్ని తయారుచేశారు. దీంట్లో... మిల్లీమీటర్ కంటే తక్కువ సైజున్న గొట్టాలు ఉంటాయి. సీటీసీ కణాలు ఎదిగేందుకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ దీంట్లో ఉంటాయి. లిక్విడ్ బయాప్సీలు అందుబాటులోకి రాక మునుపు కణితి తాలూకు భాగాన్ని సేకరించడం ద్వారా వ్యాధి నిర్ధారణ జరిగేది. అంతేకాకుండా ఒక మందు పనిచేయకపోతే ఇంకోటి.. అది కూడా విఫలమైతే మూడో రకం మందు వాడటం చికిత్స పద్ధతి!! -
డీఎన్ఏ రోబోలతో కేన్సర్ వేట
కాగితాన్ని రకరకాల ఆకారాల్లోకి మడిచేసే ఒరిగామి.. రక్తాన్ని గడ్డకట్టించేందుకు వాడే మందు.. అప్పగించిన పని తు.చ. తప్పకుండా చేసే రోబో..! ఈ మూడు అంశాల్లో ఏమైనా సారూప్యం ఉందా? మామూలుగా చూస్తే అస్సలు ఉండదుగానీ.. ప్రాణాంతకమైన కేన్సర్ పనిపట్టేందుకు శాస్త్రవేత్తలు ఈ మూడింటిని ఒక దగ్గరకు చేర్చారు! అన్నీ సవ్యంగా సాగితే ఇంకొన్నేళ్లలో.. డీఎన్ఏ రోబోలు మన రక్తంలో ఈదుకుంటూ వెళ్లి.. కేన్సర్ కణితులను మాయం చేసేస్తాయి! సాక్షి హైదరాబాద్ : కేన్సర్.. పేరు వినగానే చాలామంది ఇక చావు తప్పదన్న నిర్ధారణకు వచ్చేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వ్యాధిబారిన పడినా.. ఏళ్లపాటు జీవించేందుకు అవకాశాలున్నాయి. అయితే ఆయుష్షు కొంతవరకూ పెంచగలమేమోగానీ.. పూర్తిస్థాయిలో చికిత్స అన్నది ఇప్పటికీ సాధ్యం కాదనే ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం చెబుతోంది. ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రయోగాలు పూర్తిస్థాయిలో విజయవంతమైతే ఈ పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. శరీరంలో కేన్సర్ కణితులు ఎక్కడున్నా గుర్తించి మరీ వాటికి రక్తం సరఫరా చేసే నాడులను అడ్డుకోగల అద్భుత వ్యవస్థను వీరు రూపొందించారు. కేన్సర్ కణితులు వేగంగా విభజితమవ్వాలంటే కణాలకు బోలెడంత శక్తి కావాలి. ఈ శక్తి కోసం కేన్సర్ కణాలు కొత్త కొత్త రక్తనాడులను సృష్టించుకుంటాయి. దీన్నే యాంజియోజెనిసిస్ అంటారు. ఇలా కొత్త రక్తనాళాలు పెరిగే వేగాన్ని తగ్గించగలిగితే కణితుల సైజును నియంత్రించడంతోపాటు వ్యాధి ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు చాలాకాలంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ పని ఎలా చేయాలన్న విషయంలో ఇప్పటివరకూ స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలోని బయోడిజైన్ ఇన్స్టిట్యూట్కు చెందిన సెంటర్ ఫర్ మాలిక్యులర్ డిజైన్ అండ్ బయో మిమిటిక్స్ విభాగపు ప్రొఫెసర్ హోయాన్ వినూత్నమైన రీతిలో పరిశోధనలు నిర్వహించారు. దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఒరిగామి అనే జపనీస్ కళ గురించి తెలసుకోవాల్సి ఉంటుంది. కాగితాన్ని మడత పెడుతూ రకరకాల ఆకృతులను సృష్టించడం ఒరిగామి ప్రత్యేకత. కాగితానికి బదులుగా మన కణాల్లోని డీఎన్ఏతో ఓ గొట్టం లాంటి ఆకారాన్ని తయారు చేశారు ప్రొఫెసర్ హోయాన్. ఈ గొట్టం లోపలిభాగంలో రక్తాన్ని గడ్డకట్టించేందుకు ఉపయోగించే థ్రోంబిన్ అనే మందును ఉంచారు. డీఎన్ఏ గొట్టంతో కలసి మందు రక్తనాళాల్లో కేన్సర్ కణాల పరిసరాల్లోకి చేరుతుంది. ఆ ప్రాంతాల్లో ఉండే ప్రత్యేకమైన ప్రొటీన్ మూలకాలకు స్పందించి డీఎన్ఏ గొట్టం విచ్చుకుంటే.. దాంట్లోని మందు పనిచేయడం మొదలుపెడుతుంది. ఇంకేముంది.. ఆ ప్రాంతంలోని రక్తనాళం పూడిపోవడం.. దాంతోపాటే కేన్సర్ కణితి నాశనమైపోవడం చకచకా జరిగిపోతాయి. తెలివైన డిజైన్.. మామూలుగా రోబో అనగానే మనకు యంత్రుడు గుర్తుకొస్తాడు గానీ.. దీనిని డీఎన్ఏనే చాలా తెలివిగా డిజైన్ చేసి తయారు చేసిన రోబోగా చెప్పాలి. చికిత్సకు ఉపయోగించే మందు కణితి వద్దకు వెళ్లకుండానే రక్తంలో కలిసిపోకుండా ఉండేందుకు డీఎన్ఏ పోగులతో చేసిన గొట్టం లాంటి నిర్మాణాన్ని ఉపయోగించారు. పైగా మందుల జీవితకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అది అవసరమైనప్పుడే కణితుల వద్ద విడుదలయ్యేలా ఈ డిజైన్ ఉపయోగపడింది. కేన్సర్ కణాలకే పరిమితమైన ప్రొటీన్ను గుర్తించి అతుక్కునేలా ఈ గొట్టం చివరల్లో ప్రత్యేకమైన మార్కర్లను ఏర్పాటు చేయడం వల్ల ఈ మందు ఆరోగ్యకరమైన కణాల వద్ద పనిచేసి దుష్ప్రభావాలు చూపే అవకాశాలను తగ్గించారన్నమాట. ఏఏ కేన్సర్లకు వాడవచ్చు.. ఈ కొత్త నానో డీఎన్ఏ రోబో విధానాన్ని ఎలుకల్లోని రొమ్ము కేన్సర్పై పరీక్షించి చూశారు. ఊపిరితిత్తుల కేన్సర్తోపాటు గర్భాశయ కేన్సర్లు ఉన్న ఎలుకల్లోనూ ఈ విధానం మెరుగైన ప్రభావం చూపినట్లు నేచర్ బయోటెక్నాలజీ టుడేలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. మూడు రోజుల్లో ఈ నానో డీఎన్ఏ రోబోలు కేన్సర్ కణితుల చుట్టూ ఉన్న రక్తనాళాలను మూసేయడంలో విజయం సాధించాయని, రక్త కేన్సర్ల విషయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రక్త కేన్సర్ల విషయంలో ఎనిమిది ఎలుకల్లో మూడింటిలో కణితులు పూర్తిగా తొలగిపోగా.. మిగిలిన వాటిలో సైజు గణనీయంగా తగ్గింది. అంతేకాకుండా వాటి జీవితకాలం కూడా రెట్టింపు అయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కణితులు ఉన్న ప్రాంతానికి దూరంగా రక్తనాళాలపై ఎలాంటి చెడు ప్రభావం చూపకపోవడం ఈ విధానం ఇంకో ప్రత్యేకత. ఎలుకలతోపాటు తాము పందులపై కూడా ప్రయోగాలు జరిపి మంచి ఫలితాలు సాధించామని ప్రొఫెసర్ హోయాన్ అంటున్నారు. ఈ నానో డీఎన్ఏ రోబోలను కేన్సర్కే కాకుండా ఇతర వ్యాధులకు చికిత్స అందించేందుకూ ఉపయోగించవచ్చని.. అవి మోసుకెళ్లే మందును మారిస్తే చాలని తాము అంచనా వేస్తున్నట్లు యాన్ చెప్పారు. -
పదేళ్లలో కేన్సర్ను జయిస్తాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కేన్సర్పై విజయం సాధించే రోజు ఎంతో దూరం లేదని, ప్రస్తుత పరిశోధనలు పరిశీలిస్తే పదేళ్లలోనే ఇది సాధ్యమవుతుందని ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ పరిశోధకుడు ప్రేమ్కుమార్రెడ్డి చెప్పారు. ఇరవై ఏళ్ల క్రితం కేన్సర్ సోకితే మరణమే అనుకునే వారని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని, ఒకట్రెండు రకాలు మినహా ఇతర కేన్సర్ల విషయంలో రోగులు 15–20 ఏళ్లు జీవిస్తున్నారని వివరించారు. కేన్సర్కు ఒకట్రెండు జన్యుమార్పులే కారణమని ఒకప్పుడు అనుకునేవారని, తాజా పరిస్థితులు గమనిస్తే వందకుపైగా మ్యూటేషన్స్ వ్యాధిని ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ సెల్ బయాలజీ–2018లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రేమ్కుమార్.. ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వైద్య రంగంలో ఇమ్యూనోథెరపీ ఓ అద్భుతమైన ఆవిష్కరణ అని.. మందులు, ఇమ్యూనోథెరపీ కలిపి వాడితే వ్యాధిని జయించవచ్చని పేర్కొన్నారు. క్రిస్పర్, జన్యు చికిత్స విధానాలతో పెద్దగా ప్రయోజనం ఉండదని.. కేన్సర్ సోకిందని గుర్తించే సమయానికే శరీరంలో 10 కోట్లకుపైగా కేన్సర్ కణాలు ఉంటాయని, అన్ని కణాల్లోని జన్యువులను మార్చ డం దాదాపు అసాధ్యమని చెప్పారు. పైగా జన్యు మార్పు లున్న కణాలు గుర్తించడమూ పెద్ద సమస్య అవుతుందని వివరించారు. అయితే కొన్ని రకాల వ్యాధులు.. ముఖ్యంగా జన్యువుల్లో వచ్చే మార్పులను సరి చేసేందుకు ఈ చికిత్స ఉపయోగపడొచ్చని పేర్కొన్నారు. కేన్సర్ చికిత్సకు సంబంధించి పురాతనమైన పద్ధతులపై ప్రయోగాలు చేయాల్సిన అవసరముందని ప్రేమ్కుమార్ అభిప్రాయపడ్డారు. పౌష్టికాహారంతో నివారణ.. పౌష్టికాహారం కేన్సర్ను నయం చేయకపోవచ్చుగానీ.. నివారణకు మాత్రం మెరుగ్గా ఉపయోగపడుతుందని ప్రేమ్కుమార్ చెప్పారు. కేన్సర్ చికిత్సకు అందించే ట్యాక్సాల్ ఔషధం శరీరంలో వేగంగా విభజితమవుతున్న కణాలను చంపేస్తుందని, ఈ ప్రక్రియలో కొన్ని ఆరోగ్యకర కణాలూ నాశనమవుతూంటాయని పేర్కొన్నారు. ఈ చికిత్స ఫలితంగా వెంట్రుకలు ఊడిపోతాయని.. కడుపు, పేగుల గోడలపై ఉండే పొర కణాలూ దెబ్బతింటాయని, తెల్ల రక్త కణాలు కూడా తగ్గిపోవడంతో రోగులు బలహీన పడతారని వివరించారు. కడుపు, పేగుల్లోని కొన్ని రకాల బ్యాక్టీరియా కేన్సర్పై ప్రభావం చూపుతాయని.. అందుకే బ్యాక్టీరియా, కేన్సర్ల మధ్య సంబంధం తెలుసుకోడానికి ఫార్మా కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయన్నారు. హోమియోపతితో పోలిస్తే ఆయుర్వేదం విస్తృతంగా అర్థం చేసుకున్న విధానమన్నారు. కొన్ని వ్యాధుల విషయంలో హోమియో పనిచేస్తుందని నమ్ముతానని చెప్పారు. ఈ రెండు విధానాలనూ అర్థం చేసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. -
క్యాన్సర్ సోకిన పిల్లలకు ఇక్కడ ఉచిత వైద్యం
పంజాబ్: పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ బారిన పడిన పిల్లలు( 18సంవత్సరాలలోపు) ఉచితంగా వైద్యం అందించేందుకు నిర్ణయించింది. క్యాన్సర్ వ్యాధిపై పత్ర్యేక అవగాహనా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం శుక్రవారం ఈ ప్రకటన చేసింది. ఈ పథకం అమలుకోసం లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ క్యాన్కిడ్స్తో పంజాబ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒక అవగాహనా ఒప్పందంపై సంతకం చేసింది. సీఎం క్యాన్సర్ రిలీఫ్ ఫండ్ పథకంలో క్యాష్ లెస్ ట్రీట్మెంటును రోగులుకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో రూ. 1.5లక్షల మేర చికిత్స కు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన ఈ క్యాష్లెస్ ట్రీట్మెంటును ఇకపై పిల్లలకుకూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. పీడియాట్రిక్ ఆంకాలజీ పై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో రాష్ట్ర ఆరోగ్య మంత్రి బ్రహ్మ మహీంద్రా ప్రకటించారు. రాష్ట్రంలో క్యాన్సర్తో బాధపడుతున్న ప్రతి శిశువుకు ఆరోగ్య సేవలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకు లాభాపేక్ష లేని సంస్థ స్వచ్ఛంద సంస్థ క్యాన్కిడ్స్తో పంజాబ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. క్యాన్సర్పై మరింత అవగాహన కల్పించడానికి వచ్చే వారం రాష్ట్ర వ్యాప్త కార్ల ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో పటియాలా, అమృత్సర్ మెడికల్ కాలేజీతో సహా ఇతర క్యాన్సర్ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగు పర్చేపథకాలను అమలు చేసినట్టు పేర్కొనన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు, మహిళలకు పరీక్షలు నిర్వహించడానికి వైద్య అధికారులు, సిబ్బంది నర్సులు, సహాయక నర్సింగ్ మంత్రసానులకు ఏఎన్ఎం ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణను అందిస్తోంది. -
హెల్త్ ల్యాబ్
రాత్రిపూట అతిగా తింటే స్థూలకాయం రోజులో పగటిపూట లేదా మధ్యాహ్నం వేళ కాస్త సుష్టుగా తిన్నా ఫర్వాలేదు గానీ, అదే పద్ధతిలో రాత్రిపూట కూడా భారీగా లాగించేస్తే స్వల్పకాలంలోనే స్థూలకాయం బారిన పడే ముప్పు ఉందని టెక్సాస్ వర్సిటీకి చెందిన వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పగటివేళ తీసుకునే ఆహారంతో పోలిస్తే రాత్రిపూట తీసుకునే ఆహారంలో కనీసం 30 శాతం కేలరీలు తక్కువగా ఉండేట్లు చూసుకుంటే స్థూలకాయం ముప్పు ఉండదని టెక్సాస్ వర్సిటీ నిపుణుడు డాక్టర్ జోసెఫ్ టకాహషీ చెబుతున్నారు. అలా కాకుండా రాత్రిపూట కూడా కడుపు పట్టనంతగా భారీగా లాగించేస్తే బాడీక్లాక్పై ప్రభావం పడుతుందని, ఫలితంగా త్వరలోనే స్థూలకాయం బారిన పడే అవకాశాలు ఉంటాయని ఆయన హెచ్చరిస్తున్నారు. లాబొరేటరీలో కొన్ని ఎలుకలపై పరీక్షలు జరిపిన తర్వాత రాత్రిపూట అతిగా తినే ఆహారం వల్ల స్థూలకాయం ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చామని డాక్టర్ టకాహషీ వివరించారు. గ్రీన్స్పాంజ్తో క్యాన్సర్ చికిత్స! అలాస్కా తీరం వద్ద పసిఫిక్ మహాసముద్రంలో దొరికే గ్రీన్స్పాంజ్తో పాంక్రియాటిక్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ను నయం చేసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాస్కా వద్ద పసిఫిక్ మహాసముద్రంలో మంచులాంటి చల్లని నీటి అట్టడుగున గోల్ఫ్ బంతి పరిమాణంలో ఉండే ‘లాట్రంకలియా ఆస్టినీ’ అనే ఈ గ్రీన్స్పాంజ్ కొన్ని రకాల క్యాన్సర్ల చికిత్సకు ఉపయోగపడుతుందని నేషనల్ ఓషానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) శాస్త్రవేత్త డాక్టర్ డగ్లస్ డి మాస్టర్ తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో గ్రీన్స్పాంజ్ ప్రభావంపై మరింతగా పరిశోధనలు సాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. డెట్రాయిట్ కేంద్రంగా పనిచేసే హెన్రీఫోర్డ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, సౌత్ కరోలినా మెడికల్ వర్సిటీలు కొనసాగిస్తున్న ఈ పరిశోధనల్లో ఎన్ఓఏఏ భాగస్వామిగా ఉంటోందని చెప్పారు. రెండు నెలలకో ఇంజెక్షన్తో హెచ్ఐవీకి చెక్ ఇప్పటి వరకు అనుసరిస్తున్న పద్ధతుల్లో హెచ్ఐవీ సోకిన రోగులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా మందులు తీసుకోవాల్సిందే. అయితే, ఇకపై ఆ బెడద ఉండదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. రెండు నెలలకో ఇంజెక్షన్... అంటే, ఏడాదికి ఆరు ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉన్నట్లయితే హెచ్ఐవీని పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చని అమెరికన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని ఒక ఫార్మా కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ కొత్త తరహా ఇంజెక్షన్ను 286 మంది హెచ్ఐవీ పాజిటివ్ రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. ఇతర యాంటీ రిట్రోవైరల్ మందులేవీ తీసుకోకపోయినా, కేవలం రెండు నెలలకో ఇంజెక్షన్ తీసుకున్న ఈ రోగుల పరిస్థితి రోజువారీ మందులు తీసుకునే మిగిలిన హెచ్ఐవీ రోగుల కంటే మెరుగ్గా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఇంజెక్షన్కు ప్రభుత్వ అనుమతి లభించి, మార్కెట్లో అందుబాటులోకి వస్తే హెచ్ఐవీ రోగులకు రోజువారీ మందుల బెడద తప్పుతుందని వారు అంటున్నారు. -
ఆరోగ్యశ్రీ పథకంపై ఏపీ సర్కార్ కొత్త నిబంధన
అమరావతి: ఆరోగ్యశ్రీ పథకంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడం కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ఇక నుంచి హైదరాబాద్లో వర్తించదని స్పష్టం చేసింది. అయితే ఒక్క క్యాన్సర్ ట్రీట్మెంట్కు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. ఎలాంటి అత్యవసర సేవలు అయినా ఇకనుంచి ఆంధ్రప్రదేశ్లో చేయించుకోవాల్సిందే. దీంతో రోగులు ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్యాన్సర్... ఆహార ప్రణాళిక!
గుడ్ఫుడ్ ⇒ క్యాన్సర్ చికిత్సలో కీమో థెరపీ, క్రమం తప్పకుండా మందుల వాడకం ఎంత అవసరమో... డైట్ చార్ట్ కూడా అంతే అవసరం. ఆహారం తీసుకోవడంలో పాటించే నిడివి తగ్గాలి. అలాగే ఏది తినాలి? ఎలా తినాలి? అనేది ప్రధానమైన అంశం. చికిత్సకు ముందు, చికిత్స సమయంలో, ఆ తర్వాత మంచి ఆహారం తీసుకోవడం రోగులను శారీరకంగా దృఢంగా ఉంచుతుంది. ⇒ క్యాన్సర్ వ్యాధిని మాన్పడం (హీలింగ్), ఇన్షెక్షన్లను ఎదుర్కోవడం, అవసరమైన శక్తిని సమకూర్చడం అనే విషయాల్లో ప్రొటీన్లు, క్యాలరీలదే కీలక భూమిక. కాబట్టి క్యాన్సర్ రోగుల ఆహారం తగినన్ని ప్రొటీన్లు, క్యాలరీలు అందేలా ఉండాలి. రోజూ మూడు పూటల తీసుకునేందుకు బదులుగా ప్రతి గంటా – రెండు గంటలకోమారు ఆహారం తీసుకునేలా ఆహార ప్రణాళిక ఉండాలి. ⇒ శాకాహారులైతే... క్యాలరీలు, ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలు, తక్కువ కొవ్వుండే పాల ఉత్పాదనలు (లో ఫ్యాట్ డైరీ ప్రాడక్ట్స్), స్కిమ్డ్ మిల్క్ పౌడర్, తేనె, చక్కెర, నెయ్యి, పెరుగు, పాలతో చేసిన స్వీట్స్, ఫ్రూట్ మిల్క్ షేక్స్, పనీర్ వంటివి ఆహారంలో ఉండాలి. మాంసాహారం తీసుకునే వారైతే... చికెన్, చేపలు, గుడ్లు వంటివి తినవచ్చు. డ్రైఫ్రూట్స్, నట్స్ వంటి వాటి ద్వారా కూడా ప్రోటీన్లు, క్యాలరీలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ సాధారణ సూచనలతో పాటు రోగి వ్యక్తిగత అంశాలను పరిగణనలోకి తీసుకొని న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ⇒ క్యాన్సర్ పేషెంట్లు... అన్ని పోషకాలు... (విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, నీరు) ఉండే సమతుల ఆహారం తీసుకోవాలనేది మర్చిపోకూడదు. ఎందుకంటే దేహం... చికిత్సను తట్టుకోవాలి, వ్యాధిని అరికట్టాలి... ఇందుకు మానసిక ధైర్యంతోపాటు శారీరక దృఢత్వం ఉండాలి. -
ఆస్పిరిన్ మాత్రలతో క్యాన్సర్ మాయం!
ప్రాణాంతకమైన క్యాన్సర్ జబ్బును తలనొప్పికి వాడే ఆస్పిరిన్ అనే చౌకైన మాత్రలతో నయం చేయొచ్చని మద్రాస్ ఐఐటీకి చెందిన పరిశోధక బృందం చెబుతోంది. ఆస్పిరిన్ మాత్రల్లోని క్యాల్షియం అయాన్లు క్యాన్సర్ కణాల్లోని మైటోకాండ్రియాల్లోకి వెళతాయని, అక్కడ అవి ఆహారాన్ని ఇంధనంగా మార్చకుండా మైటోకాండ్రియాను అడ్డుకుంటాయని, పర్యవసానంగా క్యాన్సర్ కణాలకు ఇంధనం అందక అవి మరణిస్తాయని పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన బయోటెక్నాలజీ ప్రొఫెసర్ అమల్ కాంతి బోరా మీడియాకు తెలిపారు. అయితే మరింత సమర్థంగా పనిచేసేలా ఆస్పిరిన్ మందును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. క్యాన్సర్ను శాశ్వతంగా నివారించేందుకు మందులు లేవని, మందుతో రోగి జీవితకాలాన్ని మాత్రమే పొడిగించవచ్చని, క్యాన్సర్ చికిత్స చాలా ఖరీదైనదనే అపోహలు పలు దేశాల ప్రజల్లో ఉన్నాయి. వీటిని పెంచి పోషిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు రోగుల నుంచి చికిత్స పేరిట కోట్లాది రూపాయలను గుంజుతున్నాయి. బీ–17 లోపం వల్లనే క్యాన్సర్లు వస్తాయని, వాటిని అరికట్టడం కూడా తేలికేనని కూడా ఇటీవల కొంతమంది నిపుణులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగానే ఆస్పిరిన్ మాత్రలతో క్యాన్సర్ను నయం చేయవచ్చన్నది పూర్తిస్థాయిలో రుజువైతే.. అది వైద్య చరిత్రలో పెద్ద ముందంజ అవుతుంది. భారత జాతీయ వైద్య మండలి లెక్కల ప్రకారం 2016 నాటికి దేశంలో 14.5 లక్షల మంది క్యాన్సర్ రోగులు ఉన్నారు. వీరి సంఖ్య 2020 నాటికి 17 లక్షలకు చేరుకుంటుందన్నది ఓ అంచనా. -
మెడిక్లెయిమ్కు పరిమితులుంటాయ్!
► అది ఆరోగ్య బీమా లాంటిది కాదు ► పాలసీ తీసుకునే ముందే నిబంధనలు చూడాలి ► చాలా ఖర్చులు, వ్యాధులు దీని పరిధిలోకి రావు ► క్యాష్లెస్కూ కొన్ని ఇబ్బందులుంటాయి ఆరోగ్య బీమాకు సంబంధించి మెడిక్లెయిమ్ పాలసీలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. చాలా మంది దీన్ని ఒకరకంగా జీవిత బీమా పాలసీగా కూడా భావిస్తారు. అయితే, రెండింటికీ మధ్య చాలా తేడా ఉంటుందన్న సంగతి చాలామందికి తెలియదు. అలాగే, చికిత్స వ్యయాలకు సంబంధించి పరిమితుల ప్రతిబంధకాలూ ఉంటాయన్న విషయమూ తెలియదు. పైగా మెడిక్లెయిమ్ విషయంలో అపోహలు అనేకం ఉన్నాయి. వాటిని నివృత్తి చేసేదే ఈ కథనం... అన్ని వ్యాధులకు కవరేజీ ఉంటుందా? అన్నింటికీ ఉండదు. కేవలం అనారోగ్యానికి సంబంధించిన చికిత్సకు మాత్రమే కవరేజి ఉంటుంది. ఒకవేళ అనారోగ్యం కారణంగా మీరు సంపాదించలేని పరిస్థితి ఏర్పడితే దీని ద్వారా పరిహారమేమీ లభించదు. ఉదాహరణకు క్యాన్సర్ చికిత్సకు చాలా ఖర్చవుతుంది. కానీ దీని కారణంగా చాలా ఏళ్ల పాటు ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు. ఇలాగే, సుఖవ్యాధులు, టీకా సంబంధ సమస్యలు మొదలైనవి మెడిక్లెయిమ్ పరిధిలోకి రావు. ఎన్ని ఆస్పత్రులు మారినా, రీయింబర్స్మెంట్ లభిస్తుందా? కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆస్పత్రి మారడానికి అవకాశం ఉంటుంది. 1) మరింత మెరుగైన చికిత్స కోసం 2) పాలసీ నియమ నిబంధనలకు అనుగుణంగా కేసును బట్టి థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) అనుమతిస్తేనే ఇలాంటివి సాధ్యపడతాయి. చికిత్సకు ఎంత ఖర్చయినా రీయింబర్స్ అవుతుందా? దేనికైనా అపరిమితమైన ఖర్చులు రీయింబర్స్ కావు. ఆరోగ్య సమస్యను బట్టి ఆస్పత్రి వ్యయాలకు సంబంధించి చాలా మటుకు మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఉపపరిమితులుటాయి. ఇవి తెలుసుకోకపోతే మన జేబు నుంచి అదనంగా పెట్టుకోవాల్సి రావొచ్చు. సమ్ అష్యూర్డ్ కన్నా తక్కువగానే ఉన్నప్పటికీ మొత్తం చికిత్స వ్యయాలను బీమా కంపెనీ క్లియర్ చేయకపోవచ్చు. గది అద్దె మొదలుకుని ఐసీయూ వ్యయాలు, డాక్టర్ ఫీజులు, ఎనస్థటిస్ట్, అంబులెన్స్ చార్జీలు, ఔషధాలు, ఆక్సిజన్, రక్తం, ఎక్స్రే వంటి పరీక్షలు మొదలైన వివిధ రకాల వ్యయాలకు మెడిక్లెయిమ్లో చాలావరకూ పరిమితులుంటాయి. సాధారణంగా ఒక రోజు వ్యవధి సమ్ అష్యూర్డ్ మొత్తంలో గది అద్దె వ్యయాలు ఒక్క శాతానికే పరిమితం. అదే ఐసీయూ చార్జీలపై పరిమితి రెండు శాతంగా ఉంటుంది. ఇవే కాకుండా ఆస్పత్రిలో చేరడానికి ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత ఎదురయ్యే వ్యయాలపైనా ఉప–పరిమితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెరుగైన ఆరోగ్యం కోసం ఈ రెండూ కీలకమే. క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ పాలసీనా? సాధారణంగా క్రిటికల్ ఇల్నెస్ పాలసీలతో.. తీవ్ర అనారోగ్యం వల్ల సంపాదించే సామర్ధ్యం తగ్గితే వాటిల్లే నష్టానికి కూడా పరిహారం లభిస్తుంది. ఆసుపత్రి బిల్లు ఎంతైనా సరే పూర్తి సమ్ అష్యూర్డ్ మొత్తం లభిస్తుంది. అయితే, మెడిక్లెయిమ్ అనేది ఆస్పత్రి చికిత్స వ్యయాల కవరేజీ కోసం మాత్రమే ఉద్దేశించినది. హాస్పిటలైజేషన్ సహా అన్ని ఖర్చులకు కవరేజీ ఉంటుందా? పూర్తిగా కాదు. దాదాపు ముప్ఫై రోజుల దాకా డాక్టర్లు, నర్సుల ఫీజులు, ఓటీ చార్జీలు, ఔషధాలు, రక్తం, ఆక్సిజన్, డయాగ్నస్టిక్ మెటీరియల్స్, ఎక్స్రే, కీమోథెరపీ, రేడియోథెరపీ, పేస్మేకర్, అవయవ మార్పిడి దాత ఖర్చులు మొదలైనవి నేరుగా ఆస్పత్రికి చెల్లించడం గానీ లేదా రీయింబర్స్ చేయడం గానీ జరుగుతుంది. ఈ ప్రక్రియలో మీకు ఆర్థికపరమైన ఆదాయమేమీ లభించదు. నిర్దిష్ట ప్రీ–హాస్పిటలైజేషన్, పోస్ట్–హాస్పిటలైజేషన్ చార్జీలు రీయింబర్స్ అవుతాయి. క్యాష్లెస్తో అంతా సులభమేనా? ఇది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముందుగా.. పాలసీదారు చేరిన ఆస్పత్రితో సదరు బీమా సంస్థకు ఒప్పందం ఉండాలి. అంతేకాదు ఆస్పత్రిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ డెస్క్ ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే అవకాశం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎప్పుడూ ఒకే నిబంధనలు ఉంటాయా? అలాంటిదేమీ ఉండదు. వయస్సు పెరిగే కొద్దీ రిస్కూ పెరుగుతుంది కాబట్టి మెడిక్లెయిమ్ ప్రీమియంలూ పెరుగుతుంటాయి. స్థూలంగా.. మెడిక్లెయిమ్ ఒక్కటే సరిపోదు. అలాగని హడావుడిగా అనేకానేక రైడర్లు, కవర్లు జోడించుకుంటే అనవసర గందరగోళం తప్ప అదనపు ప్రయోజనమేమీ ఉండదు. కనుక మీ కంపెనీ అందించే మెడిక్లెయిమ్ పాలసీని గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయండి. ఏవి వర్తిస్తాయో, ఏవి వర్తించవో తెలుసుకోండి. తద్వారా పూర్తి ప్రయోజనాలు పొందండి. చీఫ్ కస్టమర్, మార్కెటింగ్ ఆఫీసర్, అవీవా ఇండియా -
పాక్ బాలికకు అరుదైన క్యాన్సర్ చికిత్స
బెంగళూరు వైద్యుల ఘనత సాక్షి, బెంగళూరు: ప్రాణాంతక క్యాన్సర్తో బాధపడు తున్న పాక్ బాలికకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి భారతీయ వైద్యులు తమ గొప్పదనాన్ని చాటారు. పాకిస్తాన్కు చెందిన జీనియా అనే బాలికకు బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీ ఆస్పత్రిలో అరు దైన బోన్ మారో (ఎముక మూలుగ మార్పిడి) శస్త్రచికిత్స నిర్వహించారు. క్యాన్సర్తో బాధపడుతున్న జీనియాను ఆమె తల్లిదండ్రులు చికిత్స కోసం బెంగళూరు తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యులు ఆమెకు బోన్ మారో చికిత్స అ వసరమని నిర్ధారించారు. మూలుగ కోసం ఆమె కుటుంబంలో అందరికీ వైద్య పరీక్షలు జరిపి ఎనిమిది నెలల వయసున్న ఆమె తమ్ముడు రియాన్ మూలుగ జీనియాకు సరిపోవడంతో వైద్యులు బోన్ మారో చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. బాలిక కోలుకున్నట్లు శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. -
కేన్సర్ చికిత్సలో మరో ముందడుగు
కేన్సర్ చికిత్సను మరింత ప్రభావవంతం చేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, మూర్స్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు మరో కీలకమైన ఆవిష్కరణ చేశారు. శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గించే ఓ యంత్రాంగాన్ని కనుగొన్నారు. రోగ నిరోధక వ్యవస్థ ద్వారా కేన్సర్కు చికిత్స అందించే ప్రక్రియలకు ఈ పరిశోధన మరింత ఊతమివ్వనుంది. శరీరంలోకి హానికర సూక్ష్మజీవులు ప్రవేశించినప్పుడు తెల్లరక్త కణాలు రంగంలోకి దిగి కొన్ని రకాల ప్రొటీన్లను విడుదల చేస్తాయి. వీటి ద్వారా చైతన్యవంతమైన రోగ నిరోధక కణాలు సూక్ష్మజీవులపై దాడి మొదలుపెడతాయి. ముప్పు తొలగిందనుకున్నప్పుడు తెల్లరక్త కణాలు మరో రకమైన ప్రొటీన్లతో రోగనిరోధక కణాలు నెమ్మదించేలా చేసి కణజాలాన్ని మరమ్మతు చేయడం మొదలుపెడతాయి. అయితే కేన్సర్ వంటి వ్యాధుల్లో ఈ ప్రక్రియ సక్రమంగా నడవదు. తెల్లరక్త కణాలు చాలా ఎక్కువ స్థాయిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రొటీన్లను విడుదల చేస్తుంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి మందగించేలా చేయడంతో కణజాలాల మరమ్మతు ప్రక్రియ జరగదు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ద్వారా తెల్లరక్త కణాలలో ఉండే ఓ ఎంజైమ్.. రోగ నిరోధక శక్తి మందగించేలా చేస్తుందని స్పష్టమైంది. ఎలుకల్లో ఈ ఎంజైములను చైతన్యవంతం చేసినప్పుడు కేన్సర్ కణితుల పెరుగుదలను సమర్థంగా అడ్డుకోగలిగాయని పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఎజ్రా కోహెన్ తెలిపారు. పరిశోధన వివరాలు నేచర్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
రియో ఒలింపిక్ పతకం వేలానికి పెట్టాడు!