end lives
-
కరోనా సోకిందని తల్లి, కుమార్తె బలవన్మరణం
తిరువొత్తియూర్: మలేషియాలో నివాసం ఉంటున్న తమిళ కుటుంబానికి కరోనా సోకడంతో విరక్తి చెంది తల్లి, కుమార్తె మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా, ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ తండ్రి మృతిచెందాడు. కడలూరు జిల్లా దిట్టకుడి కి చెందిన రవిరాజా (40) కంప్యూటర్ ఇంజినీర్. 12ఏళ్లకు పైగా మలేషియాలో భార్య సత్య (37), కుమార్తె గుహదరాణి (5)తో నివాసముంటున్నారు. గత వారం రవిరాజా సహా భార్య, కుమార్తెకు కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది. రవిరాజా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. సత్య, గుహదమణి హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో విరక్తి చెందిన సత్య, గుహదమణి నాలుగు రోజుల ముందు ఇంటి మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి రవిరాజా ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం సాయంత్రం మృతిచెందాడు. రవిరాజా బంధువులు మాట్లాడుతూ మృతదేహాలను ఇవ్వడానికి మలేషియా ప్రభుత్వం తిరస్కరించిందని, భారత ప్రభుత్వం అనుమతిస్తే వారి అస్తికలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారన్నారు. భారత రాయబార కార్యాలయం చర్చలు జరిపి అస్తికలు సొంత గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
ఒకేసారి చనిపోవాలనుకున్నా..!
పేదింట పుట్టినా ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తూ తనకంటూ గుర్తింపు సాధించుకున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘రోజూ చనిపోవడం కంటే ఒకసారే చనిపోవాలనుకున్నాను’ అంటూ సూసైడ్ నోట్లో పేర్కొనడం హృదయాలను కలిచివేస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు ప్రేమ విఫలం కావడమే కారణమని పోలీసులు చెబుతున్నారు. గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్ సమాచారం ప్రకారం ఇందుకు సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు గ్రామానికి చెందిన వంకబోయిన గాలయ్య, నాగమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు. చిన్న కొడుకు వంకరబోయిన శ్రీనివాసులు(27) గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్టవేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ప్రైవేట్ ఉద్యోగిగా పని చేసే అన్న కృష్ణమూర్తితో కలిసి సుదర్శన్నగర్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కృష్ణమూర్తి నైట్ డ్యూటీకి వెళ్లి గురువారం ఉదయం 8.30 గంటలకు తిరిగి వచ్చాడు. ఇంట్లోకి రాగానే బెడ్రూమ్ గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. (ప్రేమ వ్యవహారం నడిపి.. పెళ్లి చేసుకోవడానికి..!) ఎంత పిలిచినా తమ్ముడు శ్రీనివాసులు పలుకలేదు. దీంతో తలుపు విరగ్గొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్కు నైలాన్ తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కాల్ చేయగా 108 వచ్చి చూసి శ్రీనివాసులు అప్పటికే మృతి చెందారని ధ్రువీకరించారు. దీంతో గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సూసైడ్ నోట్తో పాటు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు శ్రీనివాసులు ‘తన చావుకు ఎవరు కారణం కాదని... బతకాలని లేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని... రోజు చావడం కంటే ఒకే సారి చస్తున్నా’నని సూసైడ్ నోట్లో రాశాడు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రేమ విఫలమే కారణమా? మేస్త్రీ పని చేసే గాలయ్య, కూలీ పనులు చేసే నాగమ్మల చిన్న కొడుకు శ్రీనివాసులు ఉన్నత చదువు చదివి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ యువతిని ప్రేమించగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నట్లు సోదరుడు కృష్ణమూర్తి పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఆరు నెలలుగా మాట్లాడుకోవడం లేదు. లాక్డౌన్ సమయంలో ఊరికి వెళ్లిన సోదరుడు ఇంటి నుంచే కొద్ది రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేశారని తెలిపారు. యువతి కుటంబ సభ్యులతో తాను వెళ్లి మాట్లాడతానని చెప్పినా తన తమ్ముడు శ్రీనివాసులు అంగీకరించలేదన్నారు. మూడు నెలల క్రితం నుంచి ఇద్దరు అన్నదమ్ములు కలిసి సుదర్శన్నగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రేమించిన అమ్మాయిని మరువలేకనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడాదిగా తండ్రి ఇంటి వద్దే.. ఆత్మహత్య
తూర్పుగోదావరి ,కాకినాడ రూరల్: కాకినాడ అర్బన్ పరిధి రాజేశ్వరి నగర్కు చెందిన వల్లభాపురపు దుర్గాప్రసాద్ (53), వెంకట పద్మావతి (45) దంపతులు సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి పడక గదిలో సీలింగ్కు చీరతో వెంకట పద్మావతి, వంట గదిలో సీలింగ్ హుక్కు చీరతో దుర్గాప్రసాద్ ఉరివేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమై బెంగళూరులో ఉంటోంది. చిన్న కుమార్తె రాధిక బీటెక్ చదువుతూ ఇంటివద్దే ఉంటోంది. ఆదివారం ఇంద్రపాలెంలోని అమ్మమ్మ ఇంటికి రాధిక వెళ్లింది. ఆ రాత్రి భార్యభర్తలిద్దరే ఇంట్లో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 సమయంలో తల్లిదండ్రులకు రాధిక తన అమ్మమ్మ ఇంటి నుంచి ఫోన్ చేయగా సమాధానం రాలేదు. దీంతో ఆమె ఇంటికి వచ్చి కిటికీలోంచి చూడగా తల్లి ఉరి వేసుకుని కనిపించింది. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు తెరచి లోపలికి వెళ్లి చూడగా వంటగదిలో తండ్రి ఉరి వేసుకుని మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న సర్పవరం ఎస్సై కృష్ణబాబు, సిబ్బంది శవ పంచానామాలు నిర్వహించారు. రాధిక ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. ఏడాదిగా తండ్రి ఖాళీగా ఇంటి వద్దే ఉండడంతో తరచూ తల్లిదండ్రులు గొడవ పడేవారని, ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని రాధిక పోలీసులకు తెలిపింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జీజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహితుడు, బాలిక ఆత్మహత్య
తూర్పుగోదావరి ,ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): పక్క పక్క బిల్డింగ్లు వారివి... ఏం జరిగిందో ఏమో.. ఓ వివాహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. అతని మృతదేహం వద్ద రోదించిన బాలిక కొద్ది సేపటికే ఇంటికెళ్లి ఉరేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధి 16వ డివిజన్లోని వాంబే కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ పది నిమిషాల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడటం మిస్టరీగా మారింది. మృతి చెందిన వివాహితుడికి భార్య, ఐదేళ్ల పాప ఉండగా బాలిక తల్లి దుబాయ్లో పనికి వెళ్లగా తమ్ముడితో కలసి ఆమె ఇక్కడ ఉంటోంది. బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి, ఎస్సై కె.శివాజీలు సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరి కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రాజానగరం మండలం రామస్వామిపేటకు చెందిన రౌతు శివ (29) ఏడేళ్ల కిందట సత్యశ్రీని వివాహం చేసుకోగా ఐదేళ్ల రోషిణి సాయి కుమార్తె ఉంది. నాలుగేళ్ల నుంచి వారంతా వాంబే కాలనీలో ఉంటున్నారు. శివ, అతని భార్య సత్యశ్రీ నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్నారు. గురువారం ఉదయం సత్యశ్రీ బయటకు వెళ్లి వచ్చే సరికి ఇంటి లోపల గడియపెట్టి ఎంత కొట్టినా భర్త శివ తీయకపోవడంతో పక్కింటి వారిని, ఇతరులను పిలిచింది. తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని ఉండడంతో అతన్ని కిందకు దించి చూసే సరికి మృతి చెందాడు. శివ మృతదేహం వద్దకు బ్లాక్ నంబరు–6లో తమ్ముడితో కలసి ఉంటున్న దుర్గాదేవి (17) వచ్చి రోదించింది. ఈ లోగా ఆమెను అక్కడున్న వారిలో ఒకరు మందలించడంతో పరుగెత్తుకుని ఇంటికి వెళ్లి తలుపు వేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమె ఇంటికి వెళ్లారు. తలుపు తీయకపోవడంతో బద్దలు గొట్టి లోపలకు వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని ఉండగా దుర్గాదేవిని కిందకు దించారు. చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందింది. ఆర్థిక సమస్యలే కారణం ఆర్థిక సమస్యలతోనే తన భర్త రౌతు శివ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సత్యశ్రీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరం వస్త్ర దుకాణంలో పని చేస్తున్నామని, కరోనా వైరస్ నేపథ్యంలో కొంత ఆర్థిక సమస్య ఏర్పడిందని, దాని వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె చెప్పింది. ఈ మేరకు ఎస్సై శివాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొట్టడం వల్లే మనస్తాపం చెంది.. అన్నగా పిలిచే శివ మృతదేహం వద్దకు దారా దుర్గాదేవి వెళ్లినప్పుడు ఒక వ్యక్తితో పాటు మరో ముగ్గురు కొట్టడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని బాలిక మేనమామ రమణ బొమ్మూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దుర్గాదేవి ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లే డాడీ లే... అంటూ రౌతు శివ మృతదేహం వద్ద అతని భార్య సత్యశ్రీతో పాటు ఐదేళ్ల కుమార్తె రోషిణి సాయి కూర్చుని ‘లే డాడీ లే...’ అని అనడం అక్కడున్న వారిని కంట తడి పెట్టించింది. ఆ చిన్నారికి తామేం సమాధానం చెప్పాలంటూ సత్యశ్రీ, శివ తండ్రి రౌతు శ్రీను రోధిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ పాపతో కలసి జీవిస్తున్న తరుణంలో శివ ఆత్మహత్యకు పాల్పడడం మింగుడు పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తల్లికి ఏం చెప్పాలి దుర్గాదేవి మృతి చెందడంతో దుబాయ్లో ఉన్న ఆమె తల్లి సుజాతకు ఏం సమాధానం చెప్పాలని పిన్ని పగడాల సీతామహాలక్ష్మి రోదించింది. దుర్గాదేవిని తనకు అప్పగించి వెళ్లిన ఆమెకు తన ముఖం ఎలా చూపించాలంటూ బాధపడింది. అన్యాయంగా కొంతమంది కొట్టడంతోనే బాలిక మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేసింది. -
కరోనా కంటే చావే శరణ్యమని..
ఇల్లందకుంట(హుజురాబాద్): మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆశ్రమ నిర్వాహకులు, పోలీసులు, అధికారుల కథనం ప్రకారం.. జమ్మికుంట మండలం కోరపల్లి పంచాయతీ పరిధి కాపులపల్లి గ్రామానికి చెందిన పోరెడ్డి అంకిరెడ్డి(77)కి యుక్త వయస్సులోనే వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తగదాతో విడిపోయారు. అప్పటినుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. గ్రామంలో తన సోదరి కుమారులతో కలిసి జీవనం సాగించేవాడు. ఇంటివద్ద తనను సరిగా పట్టించుకునేవారు లేకపోవడంతో అల్లుళ్ల సహాయంతో మొదట కరీంనగర్లోని వృద్ధాశ్రమంలో కొద్ది రోజులు ఉన్నాడు. అనంతరం ఇల్లందకుంట మండల కేంద్రంలో రామసాయి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడంతో 2017లో చేరాడు. సదరు ట్రస్ట్లో ఇటీవల ముగ్గురికి కరోనా సోకింది. దీంతో వృద్ధుల బంధువులకు నిర్వాహకులు సమచారం ఇచ్చారు. పీహెచ్సీలో పరీక్షలు చేయించారు. అంకిరెడ్డితో రూంలో ఉన్నవారు ఇంటికి వెళ్లిపోయారు. తనతో పాటు ఉన్నవారు ఇంటికి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉండలేక మనస్తాపం చెంది సోమవారం రాత్రి ఆశ్రమంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంకిరెడ్డి ఆత్మహత్యకు ఆశ్రమ నిర్వాహకులే కారణమంటూ అఖిలపక్ష నాయకులు ఆశ్రమం ఎదుట ఆందోళన చేశారు. అయితే ఆశ్రమంలో కరోనా రావడంతో అందరి కుటుంబ సభ్యులకు సమాచా రం ఇచ్చామని, అంకిరెడ్డి బంధువులకు సమాచారం ఇస్తే స్పందన లేదని, కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేసి ఆశ్రమంలో నే ఉంచుకోవాలని, ఇక్కడ చూసుకునేవారు లేరని అన్నట్లు ఆశ్రమ నిర్వాహకుడు ముక్కా వెంకన్న పేర్కొన్నారు. ముందుగా చెప్పినట్లుగానే.. మూడురోజుల క్రితం వృద్ధాశ్రమంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు పరిశీలనకు వచ్చారు. వృద్ధులందరినీ ఇంటికి పంపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంటికి వెళ్తే తనను పట్టించుకునేవారు ఎవరూ లేరని, దీని కంటే నాకు చావు శరణ్యమని అక్క డే ఉన్న అంకిరెడ్డి విలపించాడు. తను అన్నట్టుగానే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. -
భార్యను చంపి.. గొంతు కోసుకుని..
చిత్తూరు ,వి.కోట: భార్యను హతమార్చి అనంతరం తానూ గొంతుకోసుకున్న సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పాముగానిపల్లెకు చెందిన ప్రభాకర్రెడ్డి (37)కి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా అల్కీల్æ గ్రామానికి చెందిన అరుణ(29)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి దిలీప్(7), మౌనిక (6) పిల్లలు ఉన్నారు. ప్రభాకర్ గొరెల్రు మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య అరుణపై అనుమానం పెంచుకుని మద్యం సేవించి గొడవ పడేవాడు. గ్రామపెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ చేసినా ఫలితం లేదు. సోమవారం దంపతులు ఇద్దరూ గొర్రెలకు మేతకోసం ఉదయాన్నే తమ పొలం వద్దకు వెళౠ్లరు. అక్క డ ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ప్రభాకర్ క్షణి కావేశంతో తన వద్ద ఉన్న కొడవలితో భార్య మెడపై నరికి హతమార్చాడు. అనంతరం అదే కత్తితో తానూ గోంతుకోసుకుని ఆత్మహత్యకుయత్నించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ మహేష్బాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ప్రభాకర్ను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ ఆరిపుల్లా గ్రామస్తులతో మాట్లాడి సమాచారం సేకరించారు. -
కరోనా వచ్చిందంటూ హేళన.. ఆత్మహత్య
బ్రహ్మసముద్రం: అనుమానం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కరోనా వైరస్ వచ్చిందంటూ హేళన చేయడంతో ఆ వ్యక్తి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండల పరిధిలోని ముప్పులకుంటలో గత ఐదు రోజుల క్రితం బోయ రామచంద్రప్ప కరోనా వైరస్తో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన చాకలి నాగన్న అతన్ని గ్రామంలో చనిపోకముందు పలకరించాడని అతనితో గ్రామస్తులు దూరంగా ఉంటూ వచ్చారు. ‘నీకు కూడా కరోనా వైరస్ సోకింది’దంటూ హేళన చేశారు. దీంతో మనస్థాపానికి గురైన నాగన్న.. గురువారం మధ్యాహ్నం ముప్పులకుంట – కళ్యాణదుర్గం అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో పడి ఉండగా అటుగా వెళ్లిన పశువుల కాపరులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. స్థానికులు 108 వాహనంలో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లైన నెలకే వేధింపులతో..
పెద్దపల్లి,ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన జక్కుల సమత (23) అనే వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక బుధవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రేమ్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన సమతను నాలుగు నెలల క్రితం వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన జక్కుల మహేశ్కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే పెళ్లైన నెల రోజుల నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భర్త మహేష్తో పాటు అత్తమామ మల్లవ్వ, చంద్రయ్య, ఆడపడుచు సునీత శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారు. అంతే కాకుండ మహేశ్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని వేధించేవాడని మృతురాలి సోదరుడు జెల్ల అనిల్ తెలిపాడు. అనిల్ ఫిర్యాదు మేరకు రామగుండం ఏసీపీ ఉమేందర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిద్రపట్టడం లేదని.. ఉరేసుకుని
మోత్కూరు : నిద్ర పట్టడం లేదని మనోవేదనతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరులోలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన కొండకింది సోమిరెడ్డి (52) అలియాస్ థామస్రెడ్డి స్థానిక ఓ జువెల్లరి షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఇతను ఆరు నెలలుగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడు. ఉదయం భార్య జోనమ్మ, కుమారుడు జోసెఫ్రెడ్డి కూలి పనులకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమిరెడ్డి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చే సరికి తండ్రి విగతజీవిగా కనిపించాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఏఎస్ఐ అంకిరెడ్డి యాదయ్య తెలిపారు. -
భార్య మృతి.. భర్త ఆత్మహత్య
పంజగుట్ట: అనుమానాస్పద స్థితిలో భార్య మరణించింది. భవనంపై నుంచి దూకి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల బంధువుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లగడపు నాగేశ్వర రావు(37), రోజా (29) దంపతులు. వీరికి అర్చక్ (9), భరత్(6) ఇద్దరు కొడుకులున్నారు. ఆరు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి బీఎస్ మక్తాలో నివాసం ఉంటున్నారు. నాగేశ్వర రావు, రోజా ఇద్దరూ కూలీ పనులకు వెళ్తుండగా పిల్లలు స్థానికంగా ఉన్న సంతోషి మాతా స్కూల్లో ఒకరు మూడవ తరగతి, మరొకరు ఒకటవ తరగతి చదువుతున్నారు. మంగళవారం తెల్లవారు జామున సుమారు 5 గంటల ప్రాంతంలో వీరు ఉండే భవనం ఐదవ అంతస్తుకు వెళ్లిన నాగేశ్వరరావు ఎలివేషన్ రేలింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమీపంలోనే రోజా తల్లిదండ్రులు ఉండటంతో వారు సమాచారం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే నాగేశ్వరరావు మృతి చెందాడు. వీరు నివాసం ఉండే మూడవ అంతస్తుకు వెళ్లిచూడగా మంచంపై రోజా మృతి చెంది ఉండగా ఇద్దరు పిల్లలు రోజాకు అటు ఒకరు, ఇటువైపు ఒకరు పడుకుని ఉన్నారు. రోజా మరణంపై అనుమానాలు రోజా మరణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా నాగేశ్వర్రావు మేస్త్రీ పనిచేస్తుండగా, రోజా కూడా అతనితో పాటు కూలీ పనికి వెళ్లేదని, ఇద్దరూ కలిసి రోజు కనీసం రూ. 1500 వరకు సంపాదించేవారని బంధువుల ద్వారా తెలిసింది. పిల్లలను అడిగితే నాలుగు రోజులుగా తల్లిదండ్రుల మధ్య స్వల్ప ఘర్షణలు అవుతున్నట్లు అవి ఎందుకో తెలియవని చెపుతున్నట్లు తెలిసింది. కాగా రోజా బాడీపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. రోజాను చంపి భయంతో నాగేశ్వర రావు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరే కారణమేమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనాథలైన పిల్లలు... తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. ఇద్దరు చిన్న పిల్లలకు తల్లిదండ్రులు లేరు అని తెలియక ఆడుకుంటున్నారు. పిల్లల అమ్మమ్మ వారిని పట్టుకుని ఏడుస్తున్న తీరు చూపరుల హృదయాలను కలచివేసింది. -
తమ్మునికి కరోనా, అన్న ఆత్మహత్య
కర్ణాటక,కోలారు: తమ్మునికి కరోనా సోకగా, ఆ భయంతో అన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కోలారు నగరంలోని గాంధీనగర్ కాలనీలో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన నాగరాజ్ (37) అనే తాపీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. శనివారం మధ్యాహ్నం తమ్మునికి కరోనా పాజిటివ్గా రావడంతో ఆరోగ్య శాఖ అధికారులు అతనిని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. దీంతో తనకు కూడా కరోనా సోకి ఉంటుందేమోననే అన్న నాగరాజ్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అజయ్, శ్రావణిల ప్రేమ విషాదాంతం
మేడిపల్లి: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు పెద్దల నిర్ణయాన్ని అడిగారు. వివాహానికి వారు నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన బుధవారం మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పిర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్క్లేవ్లో నివసిస్తున్న బోరెండల్ కిరణ్కుమార్ కూతురు శ్రావణి (23) స్థానికంగా ఉన్న బిగ్బజార్ సేల్స్ విభాగంలో పని చేస్తోంది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోల్కొండ గ్రామానికి చెందిన తుమ్మల చంద్రయ్య కుమారుడు అజయ్ ఉప్పల్లోని బజాజ్ వెహికల్ షోరూంలో పని చేస్తున్నాడు. శ్రావణి, అజయ్లకు రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇటీవల వీరు తమ ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.(మేడ్చల్: ఓయో లాడ్జిలో దారుణం!) శ్రావణి కుటుంబికులు ఇందుకు అంగీకరించినా.. అజయ్ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదని పోలీసులు చెప్పారు. వారిని ఒప్పించేందుకు ప్రేమికులిద్దరూ కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో మంగళవారం ఉదయం మేడిపల్లిలోని ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు రాత్రి బాత్రూంలో నీళ్ల చప్పుడు రావడంతో హోటల్ సిబ్బంది డోర్ను తట్టారు. అప్పటికే ఇద్దరూ క్రిమిసంహారక మందును తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న అజయ్ డోర్ తీసి కిందపడిపోయాడు. అంతకు ముందే బెడ్పై శ్రావణి మృతిచెంది ఉంది. అజయ్ను చికిత్స నిమిత్తం ఉప్పల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఎంత కాలం నటిస్తావు..?
శంషాబాద్: మూడు వారాల క్రితం ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి.. ఆత్మహత్యకుకు ముందు భర్త వెంకటేశ్వరావును ఉద్దేశించి మాట్లాడిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అతడి ప్రవర్తనతో విసిగి జీవితంపై విరక్తితో ఆత్మహత్య నిర్ణయం తీసుకుంటున్నాని లావణ్య లహరి గతంలోని ఓ వీడియో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.. అదే రోజు ఆ వీడియోకు ముందు వెంకటేశ్వర్రావును ఉద్దేశించి కూడా లావణ్య మాట్లాడిన మరికొంత వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది ‘సమాజాన్ని మోసం చేయడానికి ముసుగు వేసుకుని నటిస్తున్నావు.. ఎంత కాలం నటిస్తావు..? నీ కుటుంబ చరిత్ర కూడా ఎంతో హీనమైంది.. నిన్ను కూడా అదే దారిలో నడిపించాలని వారు చూస్తున్నారు. ప్రేమ.. ప్రేమ అని వెంటపడి నన్ను మోసం చేశావు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘డబ్బుతో ఏ నీచానికైనా ఒడిగట్టాలనే మనస్తత్వం నీది.. మన మధ్యన ఒక్క తీపి జ్ఞాపకం కూడా లేదు. ఏడు నెలల గర్భం పోయి నేను బెడ్పై ఉన్నప్పుడు మరో ఆడదానితో చాటింగ్ చేశావు. రేపు దానిని కూడా నువ్వు మోసం చేస్తావు’ అని లావణ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నీవు నన్ను కొట్టిన ప్రతి దెబ్బలను ప్రతి గోడ చెబుతుంది.. అంతలా నన్ను శారీరకంగా హింసించావు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, గతంలోని వీడియోకి అనుబంధంగానే ఈ వీడియో ఉన్నప్పటికీ.. అప్పుడు బయటికి వచ్చిన వీడియో మధ్యలోంచి ఉంది.. ఇందులో ఆమె భర్తను నేరుగా ప్రశ్నించి.. ఆవేదన వ్యక్తం చేసినట్లు ఉంది. -
రమ్య ఆత్మహత్య.. శివభార్గవ్ కోసం గాలింపు
నెల్లూరు(క్రైమ్): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రమ్య ఆత్మహత్య కేసులో నిందితుడు శివభార్గవ్ కోసం వేదాయపాళెం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రమ్య ఆత్మహత్య చేసుకున్న సమయంలో నిందితుడు స్నేహితులతో కలిసి వారి ఇంటికి సమీపంలోని ఓ కళాశాలలో క్రికెట్ ఆడినట్లు, అనంతరం పరారైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని నిందితుడి ఆచూకీ కోసం విచారిస్తున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులను, బంధువులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. (ఆత్మహత్యకు ముందు యువతి సెల్ఫీ వీడియో ) -
అంగన్వాడీ ఆయా ఆత్మహత్య
ఖమ్మంరూరల్: ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మండల పరిధిలోని నాయుడుపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేటలోని తాళ్ళగడ్డకు చెందిన రేణుక(35)కు, నాయుడుపేటకు చెందిన పోలేబోయిన నాగేశ్వరరావుతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లులు ఉన్నారు. రేణుక అంగన్వాడీ ఆయాగా పని చేస్తోంది. భర్త నాగేశ్వరరావు ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుమారుడికి కూడా మాటలు సరిగా రావు. దీనికి తోడు ఆర్థిక పరిస్థితులు కూడా సరిగాలేకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. ఈ నెల 11న ఎవరూ లేని సమయంలో ఇంట్లోని ఇనుప పైపునకు ఉరి వేసుకుంది. కుటుంబీకులు గమనించి ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి అపస్మారస్థితిలోనే చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందింది. మృతురాలి సోదరుడు రావుల నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం రూరల్ ఎస్సై బాణాల రాము తెలిపారు. -
తన సొంత ఊర్లో వివాహం ఇష్టం లేక
నెల్లూరు(క్రైమ్): తన సొంత ఊర్లో వివాహం చేసుకునేందుకు ఇష్టం లేని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమా చారం మేరకు.. తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చెందిన మణికి ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరు కుమార్తెలకు నెల్లూరులో వివాహం చేశాడు. చిన్నకుమార్తె రాజేశ్వరి(23) కోయంబత్తూరులోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. లాక్డౌన్కు ముందు ఆమె నెల్లూరు నగరంలోని కొత్తూరులో నివాసం ఉంటున్న తన అక్క విజయలక్ష్మి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటోంది. ఈ క్రమంలో రాజేశ్వరికి తంజావూరులోనే సమీప బంధువుతో వివాహం చేసేందుకు ఆమె అవ్వ, కుటుంబసభ్యులు నిర్ణయించారు. తనకు తంజావూరులో వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, నెల్లూరు లో చేస్తే అక్కలతో కలిసి ఉంటానని రాజేశ్వరి వారికి చెప్పింది. వారు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన విజయలక్ష్మి, ఆమె కుటుంబసభ్యులు ఇంటి బయట మాట్లాడుకుంటుండగా రాజేశ్వరి ఇంట్లోని దూలానికి చీరతో ఉరివేసుకుంది. కొద్దిసేపటికి ఇంట్లోకి వచ్చిన విజయలక్ష్మి తన సోదరి దూలానికి వేలాడుతుండటాన్ని గమనించి పెద్దగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, స్థానికులు హుటాహుటిన రాజేశ్వ రిని కిందకు దించారు. చికిత్సనిమిత్తం జీజీహెచ్కు తరలించా రు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని పేర్కొన్నారు. ఈ మేరకు రాజేశ్వరి అక్క భర్త శరవణ్కుమార్ బుధవారం అర్ధరాత్రి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సంతానం లేదని దంపతుల ఆత్మహత్య
బాసర:పెళ్లయి మూడేళ్లవుతున్నా పిల్లలు పుట్టడం లేదనే మనస్తాపంతో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన బాసర మండలం టాక్లీలో విషాదం నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మేశెట్టి రంజితను మహారాష్ట్రకు చెందిన సంతోష్కు ఇచ్చి పెళ్లి చేశారు. సంతోష్ ఇల్లరికం వచ్చాడు. అప్పటినుంచి దంపతులిద్దరూ టాక్లీలోనే ఉంటున్నారు. అయితే వారితోపాటు పెళ్లయిన వారికి పిల్లలు కలగడంతో కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. పిల్లల కోసం నిజామాబాద్, బాసరలోని వైద్యులను సంప్రదించారు. పిల్లలు లేకుంటే సమాజంలో చిన్నచూపు చూస్తారన్న భావనతో కొద్దిరోజులుగా భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదుగానీ.. బుధవారం రాత్రి బాసరలోని గోదావరిలో ఇద్దరూ దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం మృతదేహాలు నీటిలో తేలగా.. జాలర్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రాజు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దంపతులిద్దరినీ సంతోష్ (26), రంజిత (22)గా గుర్తించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
మేడిపల్లి : మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు తెలిపిన మేరకు..మూలుగు జిల్లా వాజేడు మండలం తగుళ్లపల్లి గ్రామానికి చెందిన సూరిబాబు కుమారుడు నాగసాయిచందు (27). నగరంలోని మేడిపల్లి పరిధిలోని విహారిక కాలనీలో ఉంటూ మేడిపల్లి పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత పదిహేను రోజులుగా నాగసాయిచందు లీవ్లో ఉన్నాడు. గురువారం మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో పాటు పని చేసే కానిస్టేబుల్ ప్రసన్న గమనించి కిందికి దించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.పెళ్లి విషయంలో తల్లిదండ్రులకు, నాగసాయిచందుకు మధ్య వివాదం ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించలేదని
బొమ్మనహళ్లి : ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన బుధవారం సాయంత్రం ఆనేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆనేకల్ పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన బి.తనూజ(22) ఇదే పట్టణంలోని కళాశాలలో ద్వితీయ పీయూసీ చదువుతోంది. తల్లిదండ్రులు మగ్గం ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. సదరు యువతి తాను చదివే కళాశాలలోనే ఓ యువకుడిని ప్రేమించింది. తమకు వివాహం చేయాలని తల్లిదండ్రులను కోరింది. వారు అంగీకరించకపోవడంతో బుధవారం రాత్రి ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఎంతపని చేశావు నాయనా!
బొండపల్లి: తనకు ఇష్టంలేని గ్రూపును ఎంచుకొని చదవమనందుకు ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కన్నవారికి గర్భశోకాన్ని మిగిల్చాడు. ఈ విషాద సంఘటన దేవుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై డి.సాయికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దేవుపల్లి గ్రామానికి చెందిన మూకల శ్రావణ్ కుమార్ (15) గుడివాడలోని విశ్వభారతి పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. కరోనా కారణంగా ఇంటి వద్ద ఉంటున్నాడు. అయితే ఇంటర్లో తనకు ఇష్టంలేని ఎంపీసీ గ్రూపును ఎంచుకొని తల్లిదండ్రులు చదవమన్నారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణ్కుమార్ ఈ నెల ఐదో తేదీ ఆదివారం నాడు ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు విద్యార్థి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇంతలో శ్రావణ్ కుమార్ దేవుపల్లి గ్రామ శివారు.. కోరాడ కృష్ణమూర్తికి చెందిన మామిడి తోటలో ఉన్న బావిలో శవమై తేలి ఉన్నట్టు వీఆర్వో నాగరాజు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి విద్యార్థి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. మృతునికి తల్లిదండ్రులు రామారావు, కోండమ్మ, సోదరుడు ఉన్నారన్నారు. అదృశమైన కుమారుడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని ఎదురుచూశామని.. శవమై దర్శనమిస్తాడని అనుకోలేదని తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. -
నవ వధువు బలవన్మరణం
పెగడపల్లి(ధర్మపురి): వరకట్నం కోసం అత్తారింటి వేధింపులు భరించలేక ఓ వి వాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బతికపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ స భ్యులు, పోలీసులు తెలిపిన వివరాలప్ర కారం..గ్రామానికి చెందిన ఐలేని అంజి రెడ్డి–శోభారాణి దంపతుల చిన్న కూతురు దివ్య(22) హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ది వ్యకు అదే గ్రామానికి చెందిన పెయ్యాల రాజిరెడ్డి–అంజలి దంపతుల కుమారుడు ప్రవీన్రెడ్డితో 2020 ఫిబ్రవరి 22న వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.10 ల క్షల నగదు, 20 తులాల బంగారం, ఎకరం భూమిని కట్నం కింద ముట్టజెప్పారు. ఈనేపథ్యంలో దివ్య హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా ప్రవీన్రెడ్డి స్థానికంగా వ్యవసాయం చేస్తున్నాడు. (ప్రేమజంట ఆత్మహత్య) కొద్ది రోజుల నుంచి అదనపు కట్నం తేవాలని లేదా కట్నం కింద ఇచ్చిన వ్యవసాయ భూమిని విక్రయించి డబ్బులు ఇవ్వాలని అత్త, మామ రాజిరెడ్డి, అంజలిలతో పాటు భర్త వేధిస్తున్నారు. అంతే కాకుండా ప్రవీన్రెడ్డి శారీరకంగా, మానసికంగా దివ్యను ఇబ్బందులను గురి చేయడంతో పాటు వాట్సప్ ద్వారా అసభ్యకరమైన మెస్సెజ్లు పంపించేవాడు. నాలుగు రోజులు క్రితం హైదరాబాద్ నుంచి తల్లి గారింటికి వచ్చిన దివ్య అత్తింటి పోరును తల్లిదండ్రులతో మొరపెట్టుకుంది. దీంతో మంగళవారం ఉదయం దివ్యను ఆమె తల్లిదండ్రులు అత్తారింటికి తీసుకు వచ్చి వారితో మాట్లాడుతుండగా తిరిగి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో మనస్తాపానికి గురైన దివ్య ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులోని తన తల్లిగారి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం వేధింపులు భరించలేక తమ కూతరు ఆత్మహత్య చేసుకుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ రాజమనోహర్రెడ్డి, ఎస్సై నవతలు ఘటనా స్థలాన్ని సందర్శించి శవ పంచనామ నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రేమజంట ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): ఇబ్రహీంపట్నంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో గ్రామ శివారులో పురుగుల మందు తాగి అనంతరం చెట్టుకు ఉరేసుకున్నారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గుండేటి రమ్య (22), మండలోజి ప్రణీత్చారి(22) రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరు వేర్వేరు కులాలకు చెందినవారు. ఇటీవల రమ్యకు పెళ్లి నిశ్చయమైంది. తమ ప్రేమ విఫలం కావడం, మరొకరితో పెళ్లి ఇష్టంలేక రమ్య, ప్రణీత్చారి మంగళవారం వేకువజామున ఇంటి నుంచి వెళ్లి గ్రామశివారులో పురుగుల మందు తాగి అనంతరం చెట్టుకు ఉరేసుకోగా రమ్య ఉరితాడు తప్పి కిందపడింది. తన తండ్రి ల క్ష్మణ్కు ఫోన్ చేసి పురుగుల మందు తాగానని చెప్పింది. వెంటనే అతడు మెట్పల్లిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రణీత్చారి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మృతురాలి తండ్రి లక్ష్మణ్, మృతుడి తల్లి మండలోజు సరోజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. -
నాన్నా.. తాగొద్దు.. అమ్మను బాగా చూసుకో
కర్నూలు(సెంట్రల్): నాన్నా తాగొద్దు. అమ్మను బాగా చూసుకో అంటూ లెటర్ రాసి పెట్టి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కల్లూరులోని జానకీ నగర్కు చెందిన విజయకుమార్ జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి అనారోగ్య సమస్యలతోపాటు ఇంట్లో తండ్రి మందుకు అలవాటుపడడంతో చదువుపై దృష్టి సారించలేకపోయేవాడు. ఈక్రమంలో శుక్రవారం ఇంట్లో వాళ్లు బంధువుల ఇంటికి వెళ్లడంతో ఫ్యాన్కు ఉరి వేసుకొనిఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలుతెలియాల్సి ఉంది. -
బిర్యానీ కోసం భర్తపై అలిగి..
సాక్షి, చెన్నై: తనకు బిర్యానీ కొనివ్వలేదన్న మనస్తాపంతో భర్తపై అలిగి ఓ వివాహిత ఆత్మాహుతి చేసుకుంది. మహాబలిపురంలో ఈ ఘటన వెలుగు చూసింది. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో మనోహరన్, శరణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 11 ఏళ్ల కుమారుడు, తొమ్మిదేళ్ల కుమార్తె ఉన్నారు. మహాబలిపురంలోని శిల్ప తయారీ సంస్థలో మనోహరన్ పనిచేస్తున్నాడు. గురువారం తనకు బిర్యానీ తినాలని ఆశగా ఉందని, కొనిపెట్టాలని భర్తను శరణ్య కోరింది. అంతంత మాత్రమే నగదు ఉందని, మళ్లీ చూద్దామన్నట్టు చెప్పి ఇంటి నుంచి మనోహరన్ బయటకు వెళ్లాడు. మనస్తాపానికి గురైన శరణ్య భర్త మీద కోపంతో ఆయన బైక్లో ఉన్న పెట్రోల్ను తీసి, తనపై పోసుకుని నిప్పు అంటించుకుంది. మంటల్ని ఆర్పి ఆమెను చెంగల్పట్టు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో శరణ్య మృతిచెందింది. -
మనోవేదనతో సర్పంచ్ ఆత్మహత్య
పూడూరు: మనోవేదన, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ సర్పంచ్ ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పరిగి సీఐ లక్ష్మీరెడ్డి కథనం ప్రకారం.. పూడూరు మండలంలోని కొత్తపల్లికి చెందిన కావలి ఆనందం(35) గత ఎన్నికల్లో సర్పంచ్గా ఎన్నికయ్యాడు. అయితే, ఆయన మంగళవారం రాత్రి కుటంబీకులతో కలిసి భోజనం చేసి ఓ గదిలో నిద్రించాడు. బుధవారం తెల్లవారినా నిద్రలేవలేదు. పడుకొని ఉండొచ్చని భావించిన ఆయన తమ్ముడు శ్రీహరి పొలానికి వెళ్లాడు. (అక్కా.. నాకు బతకాలని లేదు!) గంట తర్వాత అతడు తిరిగి వచ్చినా గది తలుపులు తెరవకపోవడంతో అనుమానంతో గదికి వెనుక ఉన్న తలుపులను తీసి చూడగా ఆనందం దూలానికి ఉరివేసుకొని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. కొంతకాలంగా తన సోదరుడికి ఆరోగ్యం సహకరించడం లేదని శ్రీహరి తెలిపారు. ఈక్రమంలో మానసికంగా వేదనకు గురై తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుఆనందం రాసిన ఓ సూసైట్ నోట్ను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని అందులో సర్పంచ్ పేర్కొన్నాడు. వచ్చే నెలలోతనకు వివాహం నిశ్చయమైందని, అంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. మృతుడి సోదరుడు శ్రీహరి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, సర్పంచ్ల సంతాపం.. కొత్తపల్లి సర్పంచ్ ఆనందం ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి, మండలంలోని పలువురు సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆనందం మృతికి సంతాపం వ్యక్తం చేశారు. -
అక్కా.. నాకు బతకాలని లేదు!
సారంగాపూర్(జగిత్యాల): బీర్పూర్ మండల కేంద్రం శివారు గ్రామం సిరిపురంలో ఆదివారం ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘అక్కా నాకు బతకాలని లేదు..బావిలో దూకి చనిపోతున్నా’ అంటూ తన అక్కకు చివరగా ఫోన్లో సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన పర్స లింగన్న–కళావతి దంపతులకు అజయ్ (21), ముగ్గురు కూతుళ్లు సంతానం. అజయ్ జగిత్యాలలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసి, ప్రస్తుతం రెండో సంవత్సరం చదవాల్సి ఉంది. లింగన్న ముగ్గురు కూమార్తెల్లో ఇద్దరికి వివాహం చేశాడు. రెండో కుమార్తె కుటుంబం మంచిర్యాలలో ఉంటుంది. ఈక్రమంలో అజయ్కు కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగా లేక భిన్నంగా ప్రవర్తిస్తున్నట్లు లింగన్న తెలిపాడు. (‘అమ్మ’మ్మలే హతమార్చారు.. ) ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అజయ్ మంచిర్యాలలో ఉంటున్న అక్కకు ఫోన్ చేసి ‘అక్కా నాకు బతకాలని లేదు, నేను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని తెలిపి జైశ్రీరాం అంటూ ఫోన్ స్విచ్చాఫ్ చేసి బావిలో దూకాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. మంచిర్యాలలో ఉన్న అజయ్ అక్క తల్లితండ్రులకు సమాచారం ఇవ్వడంతో సమీపంలోని బావిలన్నింటినీ గాలించారు. బీర్పూర్ ఎస్సై మనోహర్రావుకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్సై తన సిబ్బందితో పాటు, గ్రామస్తులతో బావుల వద్దకు చేరుకుని గాలించారు. చివరకు ఓ బావి వద్ద అజయ్ చెప్పులు కనిపించడంతో బావిలో గాలించారు. కొక్కాలు వేసి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అజయ్ మృతదేహం కోసం ఎస్సై, ఏఎస్సై వెంకటయ్యతో పాటు ఎంపీపీ మసర్తి రమేష్, సర్పంచ్ గర్షకుర్తి శిల్ప, ఉపసర్పంచ్ హరీష్, గ్రామస్తులు బావి వద్ద అవసరమైన చర్యలు తీసుకున్నారు.(మాతృదేవతా మన్నించు! ) -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల బలవన్మరణం
పెద్దకొత్తపల్లి/గూడూరు/కుల్కచర్ల/గజ్వేల్రూరల్: తక్కువ మార్కులు, ఫెయిల్ కావడాన్ని తట్టుకోలేక ఐదుగురు ఇంటర్ విద్యార్థులు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగర్కర్నూల్, మహబూబాబాద్, వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు.. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన సుధాకర్, రాజేశ్వరి కుమార్తె సోని (16) వనపర్తిలోని స్కాలర్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. గురువారం వెలువడిన ఫలితాల్లో మొదటి సంవత్సరం 314 మార్కులు వచ్చాయి. దీంతో తక్కువ మార్కులు వచ్చాయని తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. (ఇంటర్ ఫలితాలు బాలికలే టాప్) అలాగే.. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని చెంద్రుగూడెంకు చెందిన సోలం జంపయ్య, నాగమణి దంపతుల దత్తత కూతురు సోలం సరయు (16) నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లిలోని గిరిజన గురుకుల ఆశ్రమ కళాశాలలో చదువుతోంది. ఈమె మూడు సబ్జెక్టుల్లో తప్పినట్లు తెలిసింది. తీవ్ర మనస్తాపానికి గురైన సరయు.. శుక్రవారం ఉదయం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని భజ్యానాయక్ తండాకు చెందిన విస్లావత్ హన్మంతు, సక్రిబాయిల కూతురు నిఖిత (18) ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ అయింది. దీంతో రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారం గ్రామానికి చెందిన అగుళ్ల సాయిలు, మంగ దంపతుల కూతురు శ్రావణి (17) ఫెయిల్ అయినందుకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అలాగే. గజ్వేల్ పట్టణానికి చెందిన బద్రీనాథ్ అలియాస్ అభి (17) ఇంటర్లో ఫెయిలయ్యాడు. ఇది తట్టుకోలేక శుక్రవారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
సౌదీలో జిల్లా వాసి ఆత్మహత్య
సంతబొమ్మాళి: నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబంతో సంతోషంగా గడపాలని బతుకుదెరువుకు విదేశాలకు వెళ్లాడు. అనారోగ్య సమస్యల కారణంగా అక్కడే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన బత్సల శంకరరావు (38) గత ఏడాది మార్చిలో సౌదీ అరేబియా వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో వెల్డింగ్ పని చేస్తున్నాడు. నెల రోజుల నుంచి కిడ్నీ, నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావడంతో స్వదేశానికి రావాలని ప్రయత్నించాడు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనల కారణంగా రావడానికి వీలులేకుండా పోయింది. దీంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ నెల 15న ఆస్పత్రిలో చేరి కరోనా, ఇతర పరీక్షలు చేయించుకున్నాడు. తర్వాత ప్రత్యేక రూమ్లో ఉంచడంతో మరింత మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ నెల 16, 17 తేదీల్లో బంధువులకు ఫోన్ చేసి అనారోగ్య సమస్యల కారణంగా చనిపోతానని చెప్పాడు. అలాంటి పని చేయవద్దని, త్వరలోనే లాక్డౌన్ ఎత్తివేస్తారని, స్వదేశానికి వచ్చేయవచ్చని బంధువులు భరోసా కల్పించారు. అయినా ఒత్తిడికిలోనై గురువారం రూమ్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు తెలిపారు. భర్త మరణవార్త విని భార్య కుసుమ, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు, జిల్లా అధికారులకు కుటుంబ సభ్యులు కోరారు. -
‘వాడు లేకుండా బతకలేను రాజేశ్వరీ..’
రాజమహేంద్రవరం క్రైం/ కడియం: శ్రమను నమ్ముకున్న కుటుంబమది. తల్లి, తండ్రి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమాడితో జీవితం సాఫీగా సాగుతోంది. కుమార్తెలిద్దరికీ వివాహాలు జరిగాయి. ఒక్కగానొక్క వారసుడి జీవితానికి కూడా స్థిరత్వం ఏర్పరచాలన్న తలంపులో ఉన్న ఆ తల్లిదండ్రుల ఆశలపై క్యాన్సర్ మహమ్మారి నీళ్లు చల్లింది. తన కొడుకు క్యాన్సర్ బారిన పడ్డాడనే విషయం తెలిసింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన కొడుకుని చూసి ఆ కన్నతండ్రి తట్టుకోలేకపోయాడు. తన గారాలపట్టీ బతకడని తెలిసి కుమిలిపోయాడు. తను లేని జీవితం వ్యర్థమనుకొన్నాడు. తనతో పాటే తానూ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. కొడుకు కళ్ల ముందే చనిపోతే ఎలాగంటూ మానసికంగా కుంగిపోయాడు. ఇక లాభం లేదనుకుని తనకున్న ఆస్తిపాస్తుల వివరాలు భార్య, కుటుంబసభ్యులకు చెబుతూ వస్తున్నాడు. వారు అటువంటి పిచ్చిపనులేవీ చేయవద్దంటూ వారిస్తున్నారు. ఇలా వారం రోజులుగా తీవ్ర తర్జనభర్జన పడుతున్నారు. చివరికి మంగళవారం కొడుకుతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏపీ టూరిజం శాఖ సిబ్బంది, జాలర్లు రక్షించడంతో ప్రాణాలతో తాను ప్రాణాలతో బయటడినా.. కుమారుడిని తన కళ్లముందేనిజంగా కోల్పోయాడు. వైద్యం చేయించినా దక్కడనే ఆందోళనతో.. కడియం మండలం మురమండ పంచాయతీ పరిధిలోని దొరగారితోటలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అధికారి రాజబాబు, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెల తరువాత అధికారి సత్తిబాబు (23) పుట్టాడు. అతడికి ప్రేగు క్యాన్సర్ అని ఇటీవలే తెలిసింది. రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో వారి శక్తికి మించి ఖర్చు చేసి వైద్యం కూడా చేయిస్తున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. మరింత మెరుగైన వైద్యం కోసం భారీగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబంలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు తెలిసిన వారి వద్ద నుంచి డబ్బులు పోగేసుకుని హైదరాబాదు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా ‘నా కొడుకు బతకకపోతే నేను కూడా బతకను’ అంటూ చెప్పే తండ్రి రాజబాబు తన మాటలను నిజం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బుధవారం ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పి రాజబాబు అతడి కుమారుడు సత్తిబాబు ఇంటి నుంచి బైక్పై బయలుదేరారు. నేరుగా రాజమహేంద్రవరం పరిధిలోని రోడ్డుకం రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకుని గోదావరి నదిలోకి దూకేశారు. రోడ్డు కం రైల్వే బ్రిడ్జి పై నుంచి ఇద్దరు వ్యక్తులు దూకడం గమనించి గోదావరిలో చేపలు పట్టుకునే జాలర్లు, ఒడ్డున ఉన్న ఏపీ టూరిజం శాఖ సిబ్బంది హుటాహుటిన బోట్లలో సంఘటన స్థలానికి చేరుకొని గోదావరిలో కొట్టుకుపోతున్న తండ్రి అధికారి రాజబాబును రక్షించి ఒడ్డుకు చేర్చారు. కుమారుడు అధికారి సత్తిబాబు గోదావరిలో గల్లంతయ్యాడని రాజమహేంద్రవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గ్రామంలో విషాదఛాయలు.. ఒక్కగానొక్క మగసంతానానికి స్థిరత్వం ఏర్పరచాలన్న తలంపుతో ఇటీవలే ఇల్లు కూడా నిర్మించుకున్న రాజబాబు తన కొడుకుతో కలసి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం స్థానికుల్లో తీవ్ర విషాదం నింపింది. ఎప్పుడూ కొడుకు ఆరోగ్యం గురించే ఆలోచించేవాడని, అతడి వైద్యం కోసం తన శక్తికి మించి ఖర్చు చేశాడని స్థానికులు తెలిపారు. తండ్రీ కొడుకులిద్దరూ నదిలోకి దూకేశారని తెలిసి గ్రామస్తులు, స్నేహితుల హృదయాలు బరువెక్కాయి. స్నేహతులతో ఎప్పుడూ సరదాగా ఉండే సత్తిబాబు కూడా తండ్రితో కలిసి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అతని స్నేహ బృందాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. విషయం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో గోదావరి వద్దకు చేరుకుని నదివెంబడి అతడి ఆచూకీ కోసం అన్వేషించడం చూపరుల్ని కంటతడి పెట్టించింది. తండ్రికి మాదిరిగానే ఎక్కడొక చోట ప్రాణాలతో సత్తిబాబు ఉండకపోతాడా? అన్న ఆశతో అతడి స్నేహితులు వెతికే ప్రయత్నం చేయబోగా పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి వారిని పంపేశారు. వారం రోజులుగా తర్జనభర్జన అధికారి రాజబాబు తన కుమారుడు బతకడని, కొడుకుతో పాటే చనిపోతానని వారం రోజులుగా ఇంట్లో భార్య, కుటుంబ సభ్యులతో చెప్పాడు. తన ఆస్తుల వివరాలు సైతం భార్యకు చెప్పాడు. వారు ఎటువంటి పిచ్చిపని చేసుకోవద్దని, వారించారు. అయినా వినకుండా మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం హాస్పిటల్కు తీసుకువెళుతున్నట్టు ఇంట్లో చెప్పి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి పైకి మోటారు సైకిల్పై చేరుకొని అక్కడి నుంచి ఇద్దరూ గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో తన కళ్లముందే కుమారుడు మృతి గోదావరి నదిలో కొట్టుకుపోవడాన్ని తట్టుకోలేక తండ్రి రాజబాబు పొగిలిపొగిలి రోదించాడు. -
భార్య వేధింపులకు తాళలేక భర్త ఆత్మహత్య
దేవరాజుగట్టు (పెద్దారవీడు): తరుచూ భార్య వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన భర్త చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని దేవరాజుగట్టులో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కటికల దావీదు (50)కు ఆయన భార్యతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. స్థానికులు ఉదయం ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లారు. కాలనీలో ఎవరూ లేని సమయంలో గ్రామం సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు వెనుక వేప చెట్టుకు ఉరేసుకుని దావీదు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు దావీదు తన చిన్న తమ్ముడికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. వెంటనే బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడికి భార్య బాలకుమారి, వివాహమైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. పురుగుమందు తాగి .. కొండపి: మండలం గోగినేనివారిపాలెం గ్రామానికి చెందిన గోనెల వెంకటేశ్వర్లు (21) బుధవారం పొలాల్లో మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బేల్దారి పనులు చేసుకుని జీవనం సాగించే వెంకటేశ్వర్లు కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుమందు తాగాడు. కుటుం బసభ్యులు సమాచారం అందుకుని అతడిని కొండపి వైద్యశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం 108లో ఒంగోలు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తండ్రి ఏడుకొండలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ హనుమంతురావు తెలిపారు. మరో యువకుడు కూడా.. ఉలవపాడు: పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రం ఉలవపాడులో బుధవారం రాత్రి జరిగింది. వివరాలు.. స్థానిక దర్గా సెంటర్కు చెందిన మున్వర్బాషా (25) మంగళవారం రాత్రి పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆయన్ను స్థానిక వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఒంగోలు జీజీహెచ్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మున్వర్ బాషా మృతి చెందాడు. ఇటీవల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. మృతుడికి వివాహం కాలేదు. హోటల్ వ్యాపారంలో తండ్రికి అండగా ఉంటున్నాడు. ఎస్ఐ దేవకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత బలవన్మరణం మద్దిపాడు: కడుపునొప్పి తాళలేక వివాహిత ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని నేలటూరు ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి జరగగా బుధవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. సంతనూతలపాడు మండలం మంగమూరుకు చెందిన ఎలీసమ్మకు నేలటూరు ఎస్సీ కాలనీకి చెందిన వడేల సుబ్బారావుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త పనికి వెళ్లిన తర్వాత కడుపునొప్పి విపరీతంగా రావడంతో భరించలేక ఎలీసమ్మ (28) ఇంట్లోని ఫ్యాన్కు ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. -
గన్నేరు ఆకుల రసం సేవించి..
చెన్నేకొత్తపల్లి: జీవితంపై విరక్తి చెంది భార్యాభర్తలు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన చెన్నేకొత్తపల్లి మండలం హరియాన్చెరువు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... హరియాన్చెరువుకు చెందిన నిచ్చెనమెట్ల సుధాకర్(60) భార్య రామలీల (55)లు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరికున్న ఇద్దరు కుమార్తెలకు వివాహాలు కావడంతో తమకున్న అనారోగ్య సమస్యలపై తరచూ ఆస్పత్రులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి ఆహారంలో పురుగుల మందు కలుపుకుని తిన్నారు. అయితే ఉదయాన్నే వారు ఎంతకూ తలుపులు తెరుచుకోకపోవడంతో తలుపులు తెరవగా విగతజీవులై పడి ఉన్నారు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రమేష్బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో జంట ఆత్మహత్యాయత్నం రొద్దం: మండల పరిధిలోని నారనాగేపల్లి గ్రామంలో భూ వివాదం కారణంగా బుధవారం భార్యభర్తలు గన్నేరు ఆకుల రసం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలమేరకు... నారనాగేపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు చెన్నారెడ్డికి ముగ్గురు కుమారులు. అయితే ఇటీవల వారు తమ భూములను పంచుకున్నారు. అయితే రెండో కుమారుడు వీరచిన్నయ్యరెడ్డి తనకు భూ పంపిణీలో అన్యాయం జరిగిందని మనస్థాపానికి గురై భార్య యశోదతో కలిసి గన్నేరు ఆకుల రసం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని అపస్మారకస్థితిలో ఉన్న ఇద్దరిని పోలీస్ వాహనంలో పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించినట్లు హెడ్కానిస్టేబుల్ చంద్రశేఖర్ తెలిపారు. -
ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య
నవాబుపేట: ‘ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. మా పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. మీనకు ఇష్టం లేని పెళ్లి చేశారు. కలిసి బతకలేమని తెలుసుకున్నాం. కలిసి చావాలని నిర్ణయించుకున్నాం. మా చావుకు ఎవరూ కారణం కాదు. ఎవరూ బాధపడవద్దు’ అని సూసైడ్ నోట్ రాసి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం ఉదయం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం నారెగూడ(పూలపల్లి)లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన సార్ల కార్తీక్ (21), ఇదే గ్రామానికి చెందిన కటికె రాజారాం కూతురు మీన(21) ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కార్తీక్ ఇంటర్ వరకు చదివి కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. మీన 10 వరకు చదివి ఇంటవద్దే ఉంటోంది. ఇరువురి ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి కులాలు వేరు కావడంతో ఇరువురి పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. రోదిస్తున్న మీన తల్లిదండ్రులు అయినా ఫోన్ల ద్వారా తరచూ మాట్లాడుకునేవారు. ఇది గమనించిన మీన తల్లిదండ్రులు నెల రోజుల క్రితం మహేశ్వరం మండలం గట్టుపల్లికి చెందిన ఓ యువకునికి ఇచ్చి అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేశారు. అయినా మీన.. కార్తీక్లు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. మంగళవారం మీన అత్తవారింటి నుంచి (గట్టుపల్లి నుంచి) ఎవరికి చెప్పకుండా వచ్చేసింది. అనంతరం కార్తీక్ ఆమెను తీసుకొని తన బైక్(టీఎస్ 07 ఎఫ్కే3871)పై నారెగూడకు చేరుకున్నారు. ఎలాగూ కలిసి బతకలేం కాబట్టి కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. నైలాన్ తాడుతో నారెగూడ(పూలపల్లి) శివారులోని ప్రభుత్వ భూమిలో ఉన్న వేప పెట్టుకు ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు పూలపల్లి గ్రామానికి చెందిన హరిజన మల్లయ్య పొలానికి వెళ్తుండగా ఇరువురూ వేలాడుతూకనిపించారు. విషయాన్ని సర్పంచ్ నర్సింహ్మరెడ్డికి చేరవేయగా అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ క్రిష్ణ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా కార్తిక్.. మీనగా గుర్తించి వారి ఇరువురు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వికారాబాద్ డీఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వీఆర్ఓ సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రిష్ణ తెలిపారు. (నువ్వులేని లోకం నాకెందుకని..!) పెళ్లి చేసుకొని అనంతరం ఆత్మహత్య.... కార్తిక్.. మీన ఆత్మహత్యకు ముందు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మీనకు ఇంతకు ముందు పెళ్లి కావడంతో ఆమె ఒంటిపై ఉన్న పుస్తెల తాడు, గాజులు, మెట్టెలు, 4 సెల్ ఫోన్లను తీసి ఒక నల్ల గుడ్డలో కట్టి పక్కన పెట్టారు. కానీ మీన మెడలో నూతన పుస్తె ఉంది. పసుపు కొమ్ముదారంతో పుస్తె ఉండటాన్ని గమనించి వీరు చనిపోవడాకిని ముందు పెళ్లి చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. -
‘ఇక మీకెవరికీ మేము కనిపించం’
తూర్పుగోదావరి, కాకినాడ రూరల్: వారు ఏ రోజుకారోజు కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. సోమవారం రాత్రి స్నేహితులతో కలసి మద్యం సేవించారు. వారితో సరదాగా గడిపారు. ఇక మేమెవరికీ కనిపించబోమని, కువైట్ వెళ్లిపోతున్నామని చెప్పారు. తీరా మంగళవారం ఉదయం విగతజీవుల్లా పొలాల్లో పడి ఉన్నారు.. కరప మండలం కొంగోడు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిన సంఘటన ఇది.. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు నొక్కు సుబ్రహ్మణ్యం(19), అల్లంపల్లి దుర్గారావు(24) మృతి చెందారు. ఎస్సీపేటకు చెందిన దుర్గారావు, సుబ్రహ్మణ్యం స్నేహితులు. కూలిపని చేసుకుని జీవనోపాధి పొందే వీరు సోమవారం రాత్రి స్నేహితులతో మద్యం సేవించి జల్దీఫైవ్ ఆట కొద్ది సేపు ఆడారు. మీకెవరికి కనిపించబోమని కువైట్ వెళిపోతున్నామని స్నేహితులతో చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయారు. మంగళవారం ఉదయం పొలం మడిలో విగతజీవుల్లా పడి ఉండడంతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మద్యం మత్తులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వకుండా మృత దేహాలకు గ్రామంలో అంత్య క్రియలను నిర్వహించారు. వివరాలు తెలిపేందుకు గ్రామస్తులు నిరాకరించారు. దీనిపై ఎస్సై రామారావును వివరణ కోరగా కొంగోడులో ఇద్దరు యువకులు మృతి చెందారని విన్నాం కానీ, తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదన్నారు. -
పెళ్లయిన ఐదు రోజులకే నవవధువు..!
కరీంనగర్, రామగుండం: పెళ్లయిన ఐదురోజులకే నవ వధువు అత్తారింట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం అంతర్గాం మండల పరిధిలోని పొట్యాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు..మండలంలోని ముర్మూర్ గ్రామానికి చెందిన పెసరు రాజమల్లు–మల్లమ్మ దంపతులకు నలుగురు కూతుర్లు కాగా మమత చిన్నకూతురు. పొట్యాల గ్రామానికి చెందిన మస్కం రాయమల్లు అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఏకైక కుమారుడు మస్కం స్వామి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇచ్చి ఈ నెల 11వ తేదీన కట్నకానుకలతో వివాహం జరిపించారు. (నా చావుకు ఎవరూ బాధ్యులు కారు) ఈ నేపథ్యంలో పెళ్లయిన ఐదురోజుల్లోనే పొట్యాలలోని అత్తారింట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మృతురాలు చివరగా తన సెల్ఫోన్ వాట్సప్లో చాటింగ్ చేసిన మెసేజ్, ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారిస్తున్నారు. కాగా యువతికి, యువకుడికి గతంలో వివాహం అయి విడాకులు అయినట్లు తెలిసింది. గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, రామగుండం సీఐ తాండ్ర కరుణాకర్రావు, అంతర్గాం ఏఎస్సై పురుషోత్తంరెడ్డి తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించి యువతి మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. (అప్పుడే పెళ్లి: వాంతి వస్తోందని చెప్పి వధువు..) -
నా చావుకు ఎవరూ బాధ్యులు కారు
కర్నూలు: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. ఇంట్లో వారిని ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు. బతకడం ఇష్టం లేకే చనిపోతున్నా. నా అవయవాలు దానం చేయండి’. అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కర్నూలులో కలకలం రేపింది. 1వ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని జొహరాపురంలో నివాసముంటున్న వెంకటరెడ్డి, శకుంతల రెండవ కుమారుడు గోవర్ధన్ చౌదరి(22) బీటెక్ పూర్తిచేశాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి గోవర్ధన్చౌదరి ఇంటి వద్దే ఉంటూ ఎప్పుడూ సెల్ఫోన్ చూసుకుంటూ మౌనంగా ఉండేవాడు. వీరు నివాసముంటున్న ఇంటిపైన రెండో అంతస్తు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి మిద్దెపైకెక్కి సూసైడ్ నోట్ రాసి సమీపంలో పెట్టి నిర్మాణంలోనున్న గది ఇనుపరాడ్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి 1వ పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాల గురించి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.(ఉసురుతీసిన క్షణికావేశం) ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కర్నూలు: కర్నూలు నగరం ధర్మపేటకు చెందిన మాధన్న కూతురు సుజాత(17) ఇంటర్ సెకండియర్ ఫెయిలైనందుకు మనస్తాపంతో కేసీ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు...మాధన్న కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. ఇందులో మూడో కుమార్తె సుజాత పత్తికొండలోని గురుకుల పాఠశాలలో ఇంటర్ చదివింది. అయితే రెండ్రోల క్రితం విడుదలైన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకుని తల్లి సుజాత మందలించడంతో మనస్తాపానికి గురైంది. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో బయటికెళ్లి కాలనీ శివారులోని కేసీ కెనాల్లో దూకింది. సుజాత రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై కాలనీ అంతా గాలించినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మధ్యాహ్నం కేవీఆర్ కాలేజీ సమీపంలో సుజాత ధరించిన పైట నీటిపై కన్పించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. నీటిలో మునిగివున్న బిడ్డ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే 2వ పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడకు చేరుకుని నీటిలోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. -
లాక్డౌన్ ప్రభావం క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య
పహాడీషరీఫ్: లాక్డౌన్ ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులకు గురైన ఓ క్యాబ్ డ్రైవర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన మేరకు.. మల్లాపూర్ గ్రామానికి చెందిన పోరెడ్డి నర్సింహా రెడ్డి (39)క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. లాక్డౌన్ నుంచి కారు నడవకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నాడు. ఈ సమయంలోనే ఇంటి నిర్మాణం పెట్టుకోవడం....చిట్టీలు కూడా కట్టలేని పరిస్థితి నెలకొంది. (జీవితం చావడానికి కాదు: ఐశ్వర్య ) ఈ క్రమంలోనే శనివారం రాత్రి భార్య పిల్లలతో కలిసి నిద్రించిన నర్సింహా రెడ్డి అర్ధరాత్రి గదిలో నుంచి బయటికి వచ్చి గదికి బయటి నుంచి గొళ్లెం పెట్టాడు. కొద్ది సేపటి అనంతరం నిద్రలేచిన భార్య....భర్త లేకపోవడంతో డోర్ తీసేందుకు ప్రయత్నించింది. బయటి నుంచి లాక్ చేసి ఉందని గ్రహించి స్థానికులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి పరిశీలించగా హాల్లోనే తాడుతో ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు సంతానం. (సుశాంత్ మృతిపై అనుమానం: సీబీఐ విచారణ) -
పెళ్లి కోసం మూడెకరాలు అమ్మి..
హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది దాదాపు 85 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని రైతు స్వరాజ్య వేదిక తెలిపింది. పంట నష్టం, అప్పుల భారంతోనే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించింది. మెదక్, నల్గొండ, అదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో అత్యధిక రైతు బలవన్మరణాలు సంభవించినట్లు బి. కొండల్రెడ్డి నిర్వహించిన సర్వేలో తేలిందని ఆర్ఎస్వీ నివేదిక పేర్కొంది. ఐదు ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న భూపాలపల్లి జిల్లాకు చెందిన కొమురయ్య అనే రైతు అప్పులు తీర్చలేక మే 5న పురుగుల మందు తాగి చనిపోయినట్లు తెలిపింది. అదే విధంగా కామారెడ్డి జిల్లా డోంగ్లి గ్రామానికి చెందిన ఆశాబాయి అనే మహిళా రైతు ఆశించిన దిగుబడి రాక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది. పెళ్లి కోసం మూడు ఎకరాలు అమ్మి.. రైతు ఆత్మహత్యలపై సర్వే నిర్వహించిన కొండల్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి దాదాపు 4,600 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కానీ 1600 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్లు గణాంకాల్లో పొందుపరిచారు. వీటిపై మరింత స్పష్టత రావాలి. కౌలు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో పత్తి రైతులే ఎక్కువ మంది ఉన్నారు. ఖమ్మంలోని లచ్చిరాం తండాకు చెందిన రైతు దంపతులు మే 17న ప్రాణాలు తీసుకున్నారు. బిడ్డ పెండ్లి కోసం ఉన్న ఆరు ఎకరాల్లో మూడు ఎకరాలు అమ్మారు. మిగిలిన భూమిలో వ్యవసాయం చేయగా నష్టాలు, అప్పులే మిగిలాయి. దీంతో వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో మంది రైతులు వీరిలాగే బలవంతంగా తనువు చాలిస్తున్నారు’’అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రైతు ఆత్మహత్యలపై స్టేట్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఇంతవరకు ఎటువంటి నివేదిక విడుదల చేయలేదు. ఆర్ఎస్వీ నివేదికపై వారు స్పందించలేదు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. -
ఉసురుతీసిన క్షణికావేశం
కృష్ణాజిల్లా, వీరులపాడు(నందిగామ): ఒకరికొకరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు.. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు.. అయితే క్షణికావేశంలో భార్య ఆత్మహత్యకు పాల్పడగా చూసి తట్టుకోలేక భర్త కూడా పురుగుల మందు తాగి తుది శ్వాస విడిచాడు. మృత్యువులోను ఒకటిగానే నిలిచారు. ఎస్ఐ శ్రీహరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... వీరులపాడు మండలం అల్లూరు గ్రామానికి చెందిన గుంజి వెంకటేశ్వరరావు (24), నవాబుపేటకు చెందిన శ్రావణి (21) ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 2019 అక్టోబర్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వెంకటేశ్వరరావు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.(పోలీస్ స్టేషన్లో 'మూగ ప్రేమ' వివాహం) ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఉదయం తన పుట్టింటికి వెళ్లి వస్తానని శ్రావణి భర్త వెంకటేశ్వరరావును కోరింది. భర్త నిరాకరించటంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. క్షణికావేశంలో శ్రావణి ఇంటిలోని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త వెంకటేశ్వరరావు హుటాహుటిన నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లాడు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో తట్టుకోలేని వెంకటేశ్వరరావు ఈ నెల 11న గుంటూరు ప్రభుత్వాస్పత్రి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు. కాగా శ్రావణి శుక్రవారం ఉదయం మృతిచెందగా వెంకటేశ్వరరావు శుక్రవారం సాయంత్ర తుది శ్వాస విడిచాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి) -
దేవుడా నాకెందుకీ శిక్ష!
తిండిపోతును కాదు.. తాగుబోతును, తిరుగుబోతును అసలే కాదు.. పెద్దగా ఆశల్లేవు.. ఆర్భాటాలకు పోలేదు. నాకు తెలిసి ఎవరికీ అన్యాయం చేసిన వాడ్ని కాదు. కానీ, ఆ దేవుడు నాకే ఎందుకు వేశాడీ శిక్ష? సాగు చేయడం తప్ప నాకు మరో ప్రపంచమే తెలియదు. ఇంటిల్లాపాదీ పొలం పనుల్లో చెమటోడ్చడం తప్ప ఏనాడూ సుఖ పడింది లేదు. వ్యవసాయంలో పిల్లలకు సంపాదించి పెట్టిందేమీ లేకపోగా చేసిన అప్పులకు తాతలిచ్చిన గడ్డంతా కరిగించేస్తున్నాను. మళ్లీ మళ్లీ పొలం అమ్మాలంటే మనసొప్పడం లేదు. ఉన్నదంతా అమ్మేస్తే బిడ్డల భవిష్యత్తేంటా అనే ప్రశ్న మెదడునుతొలిచేస్తోంది. నాతోపాటు కుటుంబ సభ్యులనూకష్టపెడుతున్నాననే బాధ గుండెల్ని పిండేస్తోంది. ఎంత మదనపడ్డానో.. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో.. నాకూఅందరిలా బతకాలని ఉంది. జనంలో దర్జాగా తిరగాలనుంది. కానీ, దేవుడు నాకా అదృష్టం ఇవ్వలేదు. ఇది భూమిని నమ్ముకున్న ఓ అన్నదాత కన్నీటి కథ. ఈ అప్పుల భారం నేనిక మోయలేనంటూ ప్రాణార్పణ చేసిన రైతన్న వ్యథ. పెద్దారవీడు పంచాయతీ సిద్దినాయునిపల్లెకు చెందిన రైతు శింగారెడ్డి సత్యనారాయణరెడ్డి తాను ఆత్మహత్య చేసుకునే ముందు చెప్పుకున్న బాధలు వింటే మనసున్న ఎవరికైనా కడుపు తరుక్కుపోవాల్సిందే..! ప్రకాశం, పెద్దారవీడు: పెద్దారవీడు పంచాయతీ సిద్దినాయునిపల్లెకు చెందిన శింగారెడ్డి సత్యనారాయణరెడ్డి(50), వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, వివాహమైన ఒక కుమార్తె ఉంది. వ్యవసాయాన్నే నమ్ముకున్న శింగారెడ్డి తన తొమ్మిది ఎకరాల పొలంలో పత్తి, మిరప పంటలు సాగు చేస్తూ వచ్చాడు. అతడి తల్లి, భార్యకు పొలం పనులలో కష్టపడడం తప్ప మరో ప్రపంచం తెలియదు. వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో నష్టం వాటిల్లింది. సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పంటలు బతికించుకునేందుకు పొలాల్లో మొత్తం 16 బోర్లు వేశాడు. పెట్టుబడుల కోసం దాదాపు రూ.25 లక్షల దాకా అప్పులు చేశాడు. అప్పులకు వడ్డీలకు వడ్డీలు పెరిగాయి. అప్పిచ్చిన వారి ఒత్తిళ్లు అధికమయ్యాయి. మంగళవారం రాత్రి ఇద్దరు కుమారులు కొండారెడ్డి, సుబ్బారెడ్డిలను దగ్గర కుర్చోపెట్టుకొని తన పరిస్థితి చెప్పాడు. మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. పొలం అమ్మి అప్పులు తీర్చాలని చెప్పాడు. తనలా పొలం మీద ఆధారపడకుండా ఏదో ఒక పని చేసుకొని జీవించాలని, పొలాన్ని నమ్ముకుంటే తనలా అప్పుల పాలవుతారని హితబోధ చేశాడు. సూసైడ్ నోట్లో అప్పుల వివరాలు.. ఆ రాత్రి అందరూ నిద్రించాక తనకు అప్పులు ఇచ్చిన వారి పేర్లు, నగదు, ఏ బ్యాంక్లో ఎంత అప్పు తీసుకుంది ఓ కాగితంలో వివరంగా రాసి పెట్టాడు. మరో కాగితంపై తన మృతికి తానే కారణమని సూసైట్ నోటు రాసి రాసి సంతకం పెట్టాడు. అప్పులెలా తీర్చాలో అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, కుటుంబ భారాన్ని మోయలేక, అప్పుల వారికి సమాధానం చెప్పలేక మనోవేదన అనుభవించానని అందులో పేర్కొన్నాడు. ఇప్పటికే కొంత పొలం అమ్మాను ఉన్న పొలమంతా అమ్మి అప్పులకు కడుతుంటే పిల్లల భవిష్యత్ ఏమిటని ప్రశ్నించుకున్నాని ఆవేదన వ్యక్త పరిచాడు. ఏదారి లేక ఇక నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాని, కష్టం చేయడం తప్ప ఇంకేమి తెలియని అమ్మ, జేజిని బాగా చూసుకోవాలని కుమారులను కోరాడు. మిమ్మల్నందరిని విడిచిపెట్టి పోతున్నందుకు బాధగా ఉందని పేర్కొన్నాడు. అనంతరం బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సత్యనారాయణరెడ్డి సూసైడ్ నోట్లో రాసిన అంశాలు ఆ గ్రామస్తులను ఎంతగానో కలచివేశాయి. -
డాక్టర్ అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు
వేలూరు: చెన్నైలో ఆత్మహత్య చేసుకున్న మహిళా డాక్టర్ మృతదేహానికి సొంత గ్రామంలో అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్తులు వ్యతిరేకించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెలితే తిరుపత్తూరు జిల్లా అంబూరు తాలుకా కృష్ణాపురం పనకార వీధికి చెందిన రాజంద్రన్ కుమార్తె సుధ(32). ఈమె చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా పనిచేస్తుంది. ఈమెకు రాణిపేటకు చెందిన దంత డాక్టర్ సత్యకు గత కొద్ది రోజుల క్రితం వివాహమై జరిగి ఇద్దరు పిల్లలున్నారు. సుధ, సత్యలు కలిసి చెన్నైలోని షోళింగనల్లూరులో ఉంటూ ఆసుపత్రికి వెళ్లి వచ్చే వారు. దంపతుల మధ్య తరచూ చిన్న చిన్న ఘర్షణలు జరిగేవి. దీంతో మనో వేదనతో ఉన్న సుధ గత సోమవారం ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో షోలింగనల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అనంతరం మృత దేహానికి పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. దీంతో సుధ తండ్రి రాజంద్రన్ మృత దేహాన్ని అంబులెన్స్ ద్వారా ఆంబూరులోని సొంత గ్రామంలో దహన క్రియలు చేసేందుకు తీసుకొచ్చాడు. కరోనా నేపథ్యంలో స్థానికులు అంత్యక్రియలను అడ్డుకునే యత్నం చేశారు. వీఏఓ దినగరన్ ఫిర్యాదుతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతురాలి బంధువులను పూర్తిగా అక్కడ నుంచి పంపంచి 12 మందితో ఆంబూరు పాలారులో అంత్యక్రియలు నిర్వహించారు. -
వాట్సాప్లో పెళ్లి ఫోటోలు.. మనస్తాపంతో..
రంగారెడ్డి ,దౌల్తాబాద్: ఓ యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని కుదురుమళ్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మొసట్ల శైలేందర్, సరోజిని దంపతుల పెద్ద కుమార్తె స్రవంతి(23) మహబూబ్నగర్లో బీఈడీ మొదటి సంవత్సరం చదువుతుండేది. ఆమె, కుదురుమళ్ల గ్రామానికి చెందిన తిరుపతయ్య మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్నిరోజుల క్రితం వివాహం చేసుకొని ఫొటోలు కూడా దిగారు. లాక్డౌన్ నేపథ్యంలో స్రవంతి గ్రామానికి వచ్చింది. ఆమెకు రెండు రోజుల క్రితం కర్ణాటకకు చెందిన యువకుడితో వివాహం కుదిరింది. కుటుంబీకులు ఈనెల 30న పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. (ప్రేమ వివాహం.. బాలిక బలవన్మరణం ) ఈ విషయం తెలుసుకున్న తిరుపతయ్య స్రవంతిని వివాహం చేసుకునే అబ్బాయి గ్రామానికి వెళ్లి తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిపాడు. అలాగే ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేశాడు. ఈ విషయం అబ్బాయి తల్లిదండ్రులకు తెలియడంతో స్రవంతిని నిలదీశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం తన ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం కొడంగల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. అయితే, స్రవంతి, తిరుపతయ్య ప్రేమకు అదే గ్రామానికి చెందిన కోస్గి వెంకటయ్య సహకరించాడు. మృతురాలి తండ్రి శైలేందర్ ఫిర్యాదు మేరకు తిరుపతయ్య, కోస్గి వెంకటయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విశ్వజాన్ తెలిపారు. -
ప్రేమ.. పెళ్లి.. వేధింపులు!
మల్కాజిగిరి: ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.. డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఆ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. వినాయకనగర్కు చెందిన సమీనాభాను (20), నేరేడ్మెట్కు చెందిన సాయిచరణ్ ప్రేమించుకున్నారు. గత ఏడాది నవంబర్లో వివాహం చేసుకున్నారు. మూడు నెలలుగా వీరు వసంతపురి కాలనీలో నివాసముంటున్నారు. సమీనాభాను మూడు నెలల గర్భిణి. ఉద్యోగం లేకుండా ఇంటి పట్టునే ఉంటున్న సాయిచరణ్ కొన్ని రోజులుగా డబ్బుల కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. (అమ్మా.. ఇక్కడ ఉండలేకపోతున్నా! ) మంగళవారం వీరి ఇంటి పక్కన ఉండే వారు సమీనాభాను సోదరి మెహ్రాభానుకు ఫోన్ చేసి ఆమె సూసైడ్ చేసుకుందని సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకున్న సమీనాభానును కిందికి దించి సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన వైద్యుడిని పిలిపించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యుడు చెప్పారు. సాయిచరణ్ వేధింపుల కారణంగా సమీనాభాను మృతికి కారణమని ఆమె సోదరి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.(మధుర ఫలం.. చైనా విషం!) (పెళ్లి ఒకరితో.. ప్రేమ మరొకరితో) -
భార్యను హత్యచేసి తానూ ఆత్మహత్య.. ఏమైంది?
తిరువొత్తియూరు: పుదుచ్చేరిలో కుమారుల ముందే భార్యను హత్యచేసి భర్త తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుదుచ్చేరి ముత్యాలపేటనగర్ సౌత్అడ్రస్కు చెందిన సుబ్రమణి (41) జాలరి. ఇతని భార్య మేనక (36). వీరికి పదేళ్ల కుమార్తె, ఐదు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. సుబ్రమణి మానసిక రుగ్మతతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారం రోజులుగా సుబ్రమణి భార్య మేనకతో తరచూ గొడవపడుతూ వస్తున్నాడు. సోమవారం ఉదయం భార్యాభర్తలిద్దరూ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ను కలుసుకున్నారు. ఉదయం 11.30 గంటలకు తిరిగి ఇంటికి వచ్చారు. సుబ్రమణి పైన ఉన్న గదికి వెళ్లాడు. 1.45 గంటలకు కిందకు దిగివచ్చి నిద్రపోతున్న మేనక మీద గ్యాస్ సిలిండర్తో దాడిచేశాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయమై ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఇదిచూసిన అతని కుమారుడు, కుమార్తె భోరున విలపించారు. వెంటనే పైకి పరుగెత్తిన సుబ్రమణి గది తలుపులు వేసుకున్నాడు. చిన్నారులు కేకలు విని అక్కడికి వచ్చిన ఇరుగుపొరుగు వారు ముత్యాలపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మిద్దెపైకి వెళ్లి గది తలుపులు పగులగొట్టి చూడగా సుబ్రమణి ఉరి వేసుకుని శవంగా వేలాడుతున్నాడు. సుబ్రమణి మానసిక ఒత్తిడి కారణంగా భార్యను హత్య చేశాడా? లేదా వేర్వేరు కారణాలా..? తెలియాల్సి ఉంది. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ప్రేమ వివాహం.. బాలిక బలవన్మరణం
రంగారెడ్డి, దోమ: భర్త వేధింపులు తాళలేక ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దోమ మండల పరిధిలోని గుండాల్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై సురేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల్ గ్రామానికి చెందిన గుడిసె నర్సింహులు, లక్ష్మి దంపతుల కూమార్తె నవనీత(17)ను అదే గ్రామానికి చెందిన జన్మండ్ల హన్మంతురెడ్డి కుమారుడు శివకుమార్రెడ్డి మూడు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. అనంతరం వీరిరువురు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. ఈ క్రమంలో తనను భర్త తరచు వేధింపులకు గురిచేస్తున్నాడని నవనీత తల్లికి పలుమార్లు తెలిపింది. నెల రోజుల క్రితం శివకుమార్రెడ్డి నవనీతను తల్లిగారి ఇంట్లో వదిలేసి వెళ్లగా ఆదివారం రాత్రి ఆమె తల్లిగారి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబీకులు వచ్చి చూసేసరికి ఆమె మృతిచెందింది. వెంటనే పోలీసులు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.(తల్లితో గొడవపడి... మూడురోజులకు బావిలో) బాలల హక్కుల సంఘం తీవ్ర విచారం. బాలిక ఆత్మహత్య చేసుకోవడంపై బాలల హక్కుల సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేస్తుందని బాలల హక్కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు పేర్కొన్నారు. మైనర్లు ఇలాంటి చర్యలకు పాల్పడడం కేవలం సినిమా, టీవీ సీరియల్స్ ప్రభావమని, మైనర్ల వివాహం చెల్లదని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారాలు జరపాలని డిమాండ్ చేశారు. -
నాలుగేళ్లక్రితం ప్రేమ వివాహం అంతలోనే..
రామాయంపేట(మెదక్): వారిద్దరూ పెద్దలను ఎదిరించి నాలుగేళ్లక్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు సంతానం. పెళ్లయి నాలుగేళ్లు గడిచినా ఆమెకు అత్తింటివారి వేధింపులు తప్పలేదు. పెద్దల సూటిపోటిమాటలే ఇద్దరి ప్రాణాలను బలిగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ప్రగతి (దొంగల) ధర్మారం గ్రామానికి చెందిన ముస్కుల విజయ్ కుమార్రెడ్డి (27) వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన బోరెడ్డి రాజిరెడ్డి, వెంకటలక్ష్మి పెద్ద కూతురు రుచిత (25)ను ప్రేమ వివాహాం చేసుకున్నాడు. ఈపెళ్లి విజయకుమార్రెడ్డి తల్లిదండ్రులకు ఎంతమాత్రం ఇష్టంలేకపోయినా వారికి నచ్చచెప్పి చేసుకొని ఒకే ఇంట్లో ఉంటున్నారు. వారికి రెండేళ్లలోపు బాబుతోపాటు పాప సంతానం కలిగారు. కాగా అత్తింటివారు తరచూ రుచితను వేధింపులకు గురి చేస్తుండేవారు. దీనితో ఆమె తల్లిదండ్రులు పలుమార్లు గ్రామంలో పంచాయతీ నిర్వహించినా ఫలితం లేకపోయింది. (లాక్డౌన్ లవ్: యాచకురాలితో ప్రేమ, ఆపై) బుధవారం రాత్రి విజయ్కుమార్రెడ్డి తండ్రి, తల్లితో పాటు, ఇంట్లోనే ఉన్న ఆడపడుచు రుచితను దూషించారు. దీంతో ఆవేదనకు లోనైన విజయ్కుమార్రెడ్డి, రుచిత పురుగుల మందు తాగారు. అనంతరం రుచిత ఈవిషయమై తన తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించింది. తాము మందు తాగామని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. వెంటనే అదే రాత్రి రాజిరెడ్డి మరోవ్యక్తితో కలిసి బైక్పై ధర్మారం వచ్చి కూతురు, అల్లున్ని రామాయంపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమించగా, సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో గురువారం రాత్రి పది గంటల ప్రాంతంలో రుచిత, శుక్రవారం తెల్లవారుజామున విజయకుమార్రెడ్డి మృతిచెందారు. కాగా చిన్నారులను చూసి గ్రామంలో కంటతడి పెట్టనివారు లేరు. రుచిత తండ్రి ఫిర్యాదు మేరకు విజయ్కుమార్రెడ్డి, తల్లితండ్రులతోపాటు ఆడపడుచుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మహేందర్ తెలిపారు. -
నువ్వులేని లోకం నాకెందుకని..!
మంచిర్యాల, జైపూర్(చెన్నూర్): వారిద్దరికి కళాశాలలో పరిచయం అయ్యింది. అదికాస్త ప్రేమగా మారింది. ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పి పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో ప్రియుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని జీర్ణించుకోలేని ప్రియురాలు సైతం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. శ్రీరాంపూర్కు చెందిన తగరం మణెమ్మ, స్వామి దంపతుల రెండో కూతురు మల్లిక.. రామకృష్ణాపూర్లోని అల్లూరిసీతారామరాజునగర్కు చెందిన షేరు సంతోష్ మంచిర్యాలలోని ఓ కళాశాలలో చేరారు. ఇంటర్లోనే పరిచయం ఏర్పడడంతో డిగ్రీలో అది ప్రేమగా మారింది. ఈ విషయం ఇరు కుటుంబాల్లోనూ తెల్సింది. (కొత్త జంటను క్వారంటైన్ పాలు చేసిన కరోనా! ) వారు కూడా పెద్దగా అడ్డు చెప్పలేదని సమాచారం. సంతోష్ చదువు మానేసి కొద్దికాలంగా ఇంటివద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆన్ లైన్ గేమ్స్ ఆడేవాడని, ఈ నేపథ్యంలో అప్పులు కూడా అయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు మందలించారో..? ఏమోగానీ.. ఈనెల 21న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న మల్లిక.. అప్పటినుంచే మనస్తాపానికి గురికాగా.. కుటుంబ సభ్యులు పెద్దపల్లిలోని వారి బంధువుల ఇంటికి తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈనెల 25న ఆటోలో తీసుకెళ్తుండగా.. ఇందారం గోదావరి బ్రిడ్జిపైకి చేరుకోగానే ఆటోలోంచి దూకిన మల్లిక(20).. గోదావరిలో దూకింది. 26న రాత్రివరకు మృతదేహాన్ని పోలీసులు బయటకు తీయించారు. ప్రియుడి లేని లోకంలో తాను ఉండలేననే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్సై గంగరాజ్గౌడ్ తెలిపారు. (ప్రియురాలి వైద్యం కోసం దోపిడీ డ్రామా) -
తండ్రికి భారం కావొద్దని..
బోయినపల్లి(చొప్పదండి): ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబంలో తండ్రికి భారం కావొద్దని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.. మండలకేంద్రం బోయినపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థి బొడ్డు పూజ (20) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డినట్లు ఎస్సై జి. శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఆయన వివరాల మేరకు.. పూజ డిగ్రీ రెండోసంవత్సరం చదువుతోంది. తండ్రి దుర్గేశ్ దివ్యాంగుడు. సోదరి కూడా చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆర్థికఇబ్బందులు పెరిగాయి. వీరి తల్లి మృతిచెందగా పూజకు బెంగతో తరచూ ‘నేను అమ్మ వద్దకు పోతా’ అని అంటూ ఉండేది. శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఆదివారం మృతిచెందింది. మృతుడి తండ్రి బొడ్డు నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
భార్యను హత్య చేసిన భర్త
కుషాయిగూడ: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కాస్తా హత్యకు దారితీసింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు భర్త. కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగు చూసింది. శుక్రవారం ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం, తేజ్పూర్కు చెందిన సంతోష్ చౌహాన్ (35), దీపాలి (26) దంపతులు జీవనోపాధి కోసం మూడేళ్ల క్రితం నగరానికి వచ్చారు. చర్లపల్లిలోని ఓ కంపెనీలో పని చేస్తూ వెంకట్రెడ్డినగర్లో నివాసముంటున్నారు. సంతోష్చౌహాన్ గురువారం కంపెనీలో పని ముగించుకొని రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో జీతం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. పిల్లలు ఇంట్లో ఉండగానే భార్య దీపాలిని గదిలోకి తీసుకెళ్లి పట్కార్తో కొట్టి, గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భార్య మెడకు చున్నీకట్టి సీలింగ్ ఫ్యాన్కు వేలాడదీశాడు. తాను మందలించడంతో ఆత్మహత్య చేసుకుందని స్థానికులను, పోలీసులను నమ్మించాడు. అయితే...పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. -
భార్య మీద కోపంతో.. కూతురితో కలిసి
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: భార్య మీద కోపంతో ఒక వ్యక్తి కన్న కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన రామనగర తాలూకా కటమానదొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. కటమానదొడ్డి గ్రామం నివాసి రామచంద్ర (38), కుమార్తె వర్ష (5)ఆత్మహత్యకు పాల్పడ్డారు. రామచంద్ర భార్య, కుమార్తెతో కలిసి రామనగరలో నివసించేవాడు. బుధవారం రాత్రి భార్యతో గొడవపడ్డ రామచంద్ర, కుమార్తెను తీసుకుని స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలోని ఇంట్లో మొదట కుమార్తెకు ఉరివేసి తరువాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు రామచంద్ర సెల్ఫీ వీడియో తీసుకుని తన భార్య ప్రవర్తన వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సందేశం రికార్డు చేశాడు. మిగతా కుటుంబ సభ్యులను క్షమాపణ కోరాడు. విషయం కాస్త బయటకు పొక్కడంతో భార్య పరారైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మా.. నేనూ నీవెంటే!
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): నవ మాసాలు కనిపెంచిన తల్లి దూరమైందనే ఆవేదన... ఇన్ని నాళ్లు తన ఆలనా పాలనా చూసిన తల్లి విగత జీవిగా పడి ఉండటం ఆ బాలుడిని కలచి వేసింది. తల్లి లేని జీవితం వద్దనుకుని ఇంటిలోకి వెళ్లి బంగారం శుద్ధి చేసే రసాయనాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో వారం రోజులలో పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్న ఆ కుటుంబంలో ఈ ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. రోజు వ్యవధిలోనే తల్లీ, బిడ్డ ఆత్మహత్యకు పాల్పడటంతో కాలనీలో విషాదం నెలకొంది. ఈ ఘటన కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని వైఎస్సార్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్సార్ కాలనీ బ్లాక్ నెం: 134కు చెందిన షేక్ షంషుద్దీన్, కరీమా భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు నూరుద్దీన్ (16) భవానీపురం నేతాజీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆర్థిక పరిస్థితులు, లాక్డౌన్కు ముందు పెద్ద కుమార్తె రుకియాకు వివాహం చేయడం, రెండు నెలలుగా పనులు లేకపోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కరీమా ఆందోళన చెందుతూ వస్తుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆమె బంగారం మెరుగు పెట్టే రసాయనాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడింది.(ఎంత పనిచేశావు తండ్రీ!) తల్లి మరణం తట్టుకోలేక... తల్లితో ఎంతో ప్రేమగా, అప్యాయతగా ఉండే నూరుద్దీన్ తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయాడు. సోమవారం తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించగా.. తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యాడు. తెల్లవార్లు కన్నీరుమున్నీరుగా విలపించాడు. మంగళవారం ఉదయం తల్లి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండటంతో తండ్రి, ఇతర బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఇంట్లో తన ఇద్దరు అక్కలతో ఉన్న నూరుద్దీన్కు మధ్యాహ్నం సమయంలో తల్లి మృతదేహం ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువస్తున్నారనే విషయం తెలిసింది. దీంతో ఇంటిలోని బాత్రూంలోకి వెళ్లి తల్లి తాగిన రసాయనాన్ని తాను కూడా తాగి బయటకు వచ్చాడు. కొద్దిసేపటికే నూరుద్దీన్ నోటి నుంచి నురగలు రావడంతో ఇంటిలో ఉన్న ఇద్దరు అక్కలు వెంటనే తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అప్పటికే మార్గమధ్యంలో ఉన్న వారు కరీమా మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వచ్చే సరికి నూరుద్దీన్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే నూరుద్దీన్ను భవానీపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే నూరుద్దీన్ మృతిచెందాడు. (సడలింపులు.. ‘తొలి’ కేసు ) తల రాతను మార్చిన ప్రమాదం.. ముగ్గురు పిల్లలు, చేతి నిండా పని, ఎంతో సంతోషంగా ఉండే ఆ కుటుంబాన్ని గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం వారి గతినే మార్చేసింది. గత ఏడాది షంషుద్దీన్ భార్యతో కలిసి మచిలీపట్నం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో భార్యభర్తలిద్దరికి గాయాలు కావడంతో చికిత్స చేయించుకున్నారు. ప్రమాదం కారణంగా భార్యకు మానసిక పరిస్థితి సరిగా ఉండకపోవడంతో వైద్యం చేయిస్తున్నారు. అప్పటి నుంచి అప్పులు, మానసిక ఆందోళనలు పెరిగిపోయాయి. ఇటీవల పెద్ద కుమార్తెకు రుకియాకు వివాహం చేశారు. వివాహానికి అప్పు చేయడం, మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పాటు రెండు నెలలుగా పనులు లేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో కుటుంబ పరిస్థితిపై ఆందోళన చెందుతూ వస్తోంది. ఇప్పుడు రెండు మరణాలు ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఎంత పనిచేశావు తండ్రీ!
తిరువొత్తియూరు: శ్రీపెరంబదూరు సమీపంలో ముగ్గురు పిల్లలను హత్య చేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు సమీపం వడమంగళంకు చెందిన ఆర్ముగం (37) కూలీ కార్మికుడు. అతని భార్య గోవిందమ్మాళ్ (32). వీరికి రాజేశ్వరి (12), షాలిని (10), సేతురామన్ (08) పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ ఏర్పడింది. గోవిందమ్మాళ్ శ్రీపెరంబదూరు సమీపంలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పారిశుద్ధ్య పనులకు వెళ్లింది. పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పెద్ద కుమార్తె రాజేశ్వరి స్పృహతప్పి పడి ఉంది. కుమార్తెను లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు తెలుసుకుంది. భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో లేకపోవడంతో దిగ్భ్రాంతి చెందింది. ఇంటి సమీపంలో గాలించింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చింది. వడమంగళం ప్రాంతంలోని వ్యవసాయబావి సమీపంలో ఉన్న ఒక చెట్టుకు ఆర్ముగం ఉరి వేసుకుని తనవు చాలించాడు. శ్రీపెరంబదూరు పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా పిల్లలు కనిపించలేదు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బావిలో గాలించగా షాలినీ, సేతురామన్ మృతదేహాలు బయటపడ్డాయి.ఇద్దరూ ఒకే దారంతో కాళ్లు కట్టివేసి ఉండడం చూపరులను కంటతడి పెట్టించింది. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం శ్రీపెరంబదూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణలో భార్యతో గొడవపడిన ఆర్ముగం జీవితంపై విరక్తి చెంది పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తెలిపారు. (విడాకుల కేసులో ఉత్తమ నటుడు) తండ్రి, కుమారుడు హత్య తూత్తుకుడి జిల్లా ఒట్టపిడారం సమీపం తెర్కు బొమ్మయాపురానికి చెందిన కరుప్పుస్వామి కుమారుడు కాళిస్వామి (40). ఇతను కూలీ కార్మికుడు. అదే ప్రాంతానికి చెందిన కాళిపాండియన్ కుమారుడు బాలమురుగన్ (22). అతను, కాళిస్వామి ఆదివారం రాత్రి అదే ప్రాంతంలోని విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద మద్యం మత్తులో నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహం చెందిన బాలమురుగన్ సమీపంలో ఉన్న ఇంటికి వెళ్లి కత్తిని తీసుకొచ్చి కాళిస్వామిపై దాడి చేసినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న కరుప్పుస్వామి దిగ్భ్రాంతి చెంది అక్కడికి చేరుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ కుమారుడిని చికిత్స నిమిత్తం పసువందనై ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. (డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగుతాం) తరువాత కరుప్పుస్వామి చిన్న కుమారుడు మహారాజ (26) మోటారు సైకిల్పై బాలమురుగన్ ఇంటికి వెళ్లాడు. అక్కడ మద్యం మత్తులో ఉన్న బాలమురుగన్, అతని తండ్రి కాళిపాండియన్ తదితరులు కరుప్పుస్వామి, మహరాజన్పై కత్తితో దాడిచేశారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అదే అక్కడికక్కడే మృతిచెందారు. తరువాత బాలమురుగన్ అక్కడి నుంచి పారిపోయాడు. మణియాచ్చి ఎస్పీ రవిచంద్రన్ పసువందనై పోలీసు ఇన్స్పెక్టర్ మణిమొళి, ఎస్ఐ ఎవనేషన్ ఆదిలింగం తదితరులు కేసు నమోదు చేసి మృతదేహాలను శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి బాలమురుగన్ తండ్రి కాళిపాండియన్ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బాలమురుగన్ కోసం గాలిస్తున్నారు. -
రెండో పెళ్లికి పెద్దల నిరాకరణ..
వరంగల్ రూరల్,పరకాల / నడికూడ / కమలాపూర్ : పదేళ్ల క్రితం ప్రేమ వ్యవహారం నడిచింది.. అప్పట్లో పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో కుటుంబ సభ్యులు చూసిన సంబంధాలనే పెళ్లి చేసుకున్నారు... ఇంతలోనే మహిళ భర్త అనారోగ్యంతో మరణించగా మళ్లీ ఇద్దరి మధ్య ప్రేమయాణం మొదలైంది. ఈ మేరకు రెండో పెళ్లికి సిద్ధపడగా ఇరు కుటుంబాల నుంచి వ్యతిరేకత రావడంతో చెరువు కుంటలో దూకి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం ధర్మారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.(ప్రేమ పెళ్లి.. దంపతుల ఆత్మహత్య) వరంగల్ అర్బన్ జిల్లా కమాలాపూర్ మండలం అంబాలకు మంత్రి రమ్య(29), అదే గ్రామానికి చెందిన గండ్రకోట రాజు(30) పదేళ్ల క్రితం ప్రేమించుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అయితే, పెళ్లికి అడ్డంకులు రావడంతో పోలీసులను ఆశ్రయించగా పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం రమ్యకు వెలగొండకు చెందిన తిరుపతితో వివాహం జరిపించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి రమ్య భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్లగా రమ్య అంబాలలోనే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఇక రాజు వివాహం కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్వాయికి చెందిన మహిళలతో జరగగా వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, పది నెలల క్రితం రమ్య భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంతలోనే హైదరాబాద్లో ఉంటున్న రాజు భార్యాపిల్లలతో కలిసి స్వగ్రామంలో ఇల్లు కట్టుకునేందుకు వచ్చాడు. ఇక్కడ మళ్లీ రమ్యతో ప్రేమాయణం మొదలుకాగా, రాజు భార్యతో పాటు రమ్య కుటుంబీకులు మందలించారు. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం రమ్య, రాజు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. దీంతో రాజుపై అనుమానంతో రమ్య కుటుంబీకులు కమలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు విచారణ జరుపుతుండగానే ధర్మారం శివారులోని చెరువుకుంటలో మృతదేహాలు తేలాయి. సమాచారం అందుకున్న పరకాల పోలీసులు చెరువు వద్దకు చేరుకొని మృతదేహాలను తీయించి ఆస్పత్రులకు తరలించారు. కాగా, వీరిద్దరూ ఆటోలో చెరువు వద్దకు వచ్చారని కేసు విచారణ జరుపుతున్నామని పరకాల ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. -
ప్రేమ పెళ్లి.. దంపతుల ఆత్మహత్య
చెన్నై,వేలూరు(తిరువణ్ణామలై): తానియంబట్టు సమీపంలో ప్రేమ పెళ్లి చేసుకున్న నెల రోజుల్లోనే యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పలువురిని కలిసి వేసింది. వివరాల్లోకి వెలితే తిరువణ్ణామలై జిల్లా తానియంబట్టు తాలుకా మోదకాల్ గ్రామానికి చెందిన వేటియప్పన్ కుమారుడు జయకుమార్, క్రిష్ణగిరి జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన విజయలక్ష్మిలు గత మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. మొదట్లో ఇద్దరి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి నిరాకరించారు. దీంతో విజయలక్ష్మి జయకుమయార్ తప్ప మరెవరినీ వివాహం చేసుకోనని పట్టుబట్టడంతో ఇద్దరు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గత నెల 6వ తేదీన ఓ ఆలయంలో వివాహం జరిపించారు. ప్రస్తుతం ఈ యువ జంట మోదకాల్ గ్రామంలో నిసిస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దంపతులు ఇద్దరూ ఇంటి నుంచి బయటకు రాక పోవడంతో అనుమానించిన స్థానికులు ఇంటి తలుపులు తెరిచి చూశారు. ఆ సమయంలో ఇద్దరూ ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతదేహాలుగా వేలాడుతున్న వాటిని గమనించారు. దీంతో స్థానికులు తానేపాడి పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్డీఓ శ్రీదేవి ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. -
కౌలు రైతు దంపతుల ఆత్మహత్య
వైఎస్ఆర్ జిల్లా , గాలివీడు : గోరాన్చెరువు గ్రామం బీసీ కాలనీకి చెందిన పందికుంట యర్రంరెడ్డి(59), రెడ్డమ్మ(50) సోమవారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు.. మృతుడు యర్రంరెడ్డి కౌలుకు తీసుకున్న 5 ఎకరాలతో పాటు తన తల్లిపేరుతో ఉన్న రెండు ఎకరాల భూమిలో టమాట, వేరుశనగ పంటలు సాగు చేశాడు. ఇందుకోసం రూ, 6 లక్షలు అప్పు చేశాడు. నాలుగు సంవత్సరాల నుంచి సరైన వర్షాలు లేవు. సాగు చేసిన పంట చేతికి రాలేదు. అప్పుల భారం ఎక్కువైంది. మరోవైపు రూ లక్ష వ్యయంతో రెండేళ్ల కిందట మూడు పాడి ఆవులు కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నాడు. సంవత్సరం కిందట పాడి ఆవులు మృత్యువాతపడ్డాయి. అప్పు చెల్లించాల్సిన గడువు సమీపించడంతో ఏమి చేయాలో దిక్కుతోచలేదు. దీంతో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఊరిబయట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి ముగ్గురు కుమారులు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రహంతుల్లా, సీఐ యుగంధర్, ఎస్ఐ ఇనాయతుల్లా, ఏఓ మధుసూధన్ మంగళవారం సంఘటన స్ధలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. -
ప్రేమ జంట ఆత్మహత్య
నార్నూర్(ఆసిఫాబాద్): ప్రేమ జంట మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఖంపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఖంపూర్ గ్రామానికి సోయం సీతాబాయి(20) ఉట్నూర్ మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన పెందూ గణేశ్(22) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా ఇరువురి నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి చేద్దామని మాట్లాడుకున్నట్లు తెలిపారు. పెందూర్ గణేశ్ సీతాబాయి స్వగ్రామమైన ఖంపూర్లోనే కొన్ని రోజులుగా ఉంటున్నాడు. గురువారం పొలం పనుల కోసం అని వెళ్లి లాక్డౌన్ ముగుస్తుందో.. లేదో.. పెళ్లి జరగదేమోనని మనస్థాపానికి గురైన వారు అమ్మాయి సోదరుడికి ఫోన్ ద్వారా తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నటు తెలిపారు. ఆమె సోదరుడు అక్కడకు వెళ్లి చూడగా చనిపోయి ఉన్నట్లు పేర్కొన్నారు. స్థానిక ఎస్సై పంచనామా నిర్వహించి పోస్టుమార్టమ్ నిమిత్తం ఉట్నూర్ తరలించి అమ్మాయి తండ్రి సోయం గంగారాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.(లాక్డౌన్: ట్రక్కులో దొరికిన ప్రేమికులు) -
ఈ జీవితం ఇష్టం లేకే నేను చనిపోతున్నా..
మహబూబ్నగర్ క్రైం: ‘నేను తీసుకున్న ఈ నిర్ణయంతో ఏ ఒక్కరికీ సంబంధం లేదు.. కుటుంబసభ్యులు, స్నేహితులను ఇబ్బంది పెట్టొద్దు.. ఈ ఉద్యోగం, జీవితం ఇలా గడపటం ఇష్టం లేకే నేను చనిపోతున్నా.. నా మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అవయవాలను ఇతరులకు దానం చేయండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ పంచాయతీ కార్యదర్శి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్నగర్ రూరల్ ఎస్ఐ రమేశ్, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మహబూబ్నగర్లోని మర్లులో నివాసం ఉంటున్న పంచాయతీ కార్మదర్శి అరుణ్చంద్ర(25) గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఉదయం 6.30 ప్రాంతంలో గదిలో ఫ్యాన్కు వేలాడుతున్న తమ్ముడిని చూసిన ఫణీంద్రబాబు గట్టిగా కేకలు వేయటంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలకొట్టి కిందికి దించి చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అరుణ్చంద్ర కొంతకాలంగా హన్వాడ మండలం యారోనిపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. అయితే.. సర్పంచ్ సుధారాణి భర్త అనంతరెడ్డి, వార్డుసభ్యుడు తిరుపతయ్య ఆరునెలలుగా వేధించటంతో పాటు విధులకు ఆటంకం కలిగిస్తుండటంతో మానసిక వేదనకు గురై తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 25 నుంచి మే 1వ తేదీ వరకు విధులకు వెళ్లడం లేదని, ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. విచారణ జరిపించాలి.. యారోనిపల్లి పంచాయతీ కార్యదర్శి అరుణ్చంద్ర ఆత్మహత్య వెనుక తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నాయని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలోని రెండు వర్గాలు నిత్యం ఒత్తిళ్లకు గురిచేయటంతో పాటు అదనంగా సర్పంచ్, వార్డుసభ్యులు ధూషించటంతోనే ఆత్మహత్య చేసున్నాడని పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. -
నా కూతురు మరణానికి వేధింపులే కారణం
గచ్చిబౌలి: కట్టుకున్న భర్త, అత్త వేధింపుల కారణంగానే తన కూతురు పెళ్లైన 76 రోజుల్లోనే ఆత్మహత్య చేసుకుందని ఖమ్మం జిల్లాకు చెందిన అయ్యదేవర వెంకట రమణ కన్నీళ్ల పర్యంతమయ్యారు. వివరాలు.. కొండాపూర్లోని సుబ్బ య్య అర్చిడ్స్లో శేష సంతోషిణి బుధవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి తన కూతురు ఆత్మహత్యకు ఆమె భర్త, అత్త మామలే కారణమని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం గచ్చిబౌలి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత ఫిబ్రవరి 15న తన కూతురు శేష సంతోషిణి కుమారిని పాతర్లపాడు, సూర్యపేట జిల్లాకు చెందిన పాండురంగారావుతో వివాహం జరిపించామని తెలిపారు. అదనపు కట్నం కోసం భర్త, అత్త పెట్టిన చిత్రహింసలకు తట్టుకోలేక భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని రోదించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు సూసైడ్ నోట్ నా చిన్న కూతురు వాట్సాప్కు పంపిందని, ఫోన్ చేసినా అల్లుడు స్పందించలేదన్నారు. రాత్రి 7 గంటలకు తన కూతురు చనిపోయిందన్న సమాచారం వచ్చిందని తెలిపాడు. -
మొదటి భర్తను మరిచిపోలేక..
కర్ణాటక ,మైసూరు: రెండో పెళ్ళి చేసుకున్న మహిళ మొదటి భర్తను మరిచిపోలేక ఆవేదనకు లోనై ప్రాణాలు తీసుకుంది. బుధవారం మైసూరు నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హీనా కౌసర్ (27) ఆత్మహత్య చేసుకున్న మహిళ. మైసూరు ఉదయగిరి ప్రాంతంలోని గౌసియా నగరలో ఆమె నివసిస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వివాదాల వల్ల మొదటి భర్త నుంచి విడిగా ఉంటున్న మహిళ కొన్ని నెలల క్రితం మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. అయినప్పటికీ ఆమె ప్రతి రోజు మొదటి భర్తను గుర్తుకు చేసుకుంటూ బాధపడేది. బుధవారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొంది. ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
నాగోలు: భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ మహిళ మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రామ్రెడ్డిపల్లికి చెందిన జంపాల లక్ష్మమ్మ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎన్టీఆర్నగర్ కూరగాయల మార్కెట్లో పని చేస్తూ... పరిసర ప్రాంతాల్లోనే నివాసముంటుంది. రెండేళ్ల క్రితం లక్ష్మమ్మ పెద్ద కుమార్తె ధనమ్మ(20)కు తన బంధువు సురేష్తో వివాహం జరిపించింది. కానీ భార్యభర్తల మద్య వచ్చిన మనస్పర్థలతో మూడు నెలల క్రితం వారు విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ధనమ్మ మానసికంగా కుంగిపోయి బాధపడుతూ ఉండేది. సోమవారం తెల్లవారు జామున మార్కెట్ నుంచి వచ్చి ఆమె తల్లి, సోదరి ఇంటి తలుపులు ఎంతగా తట్టినా ధనమ్మ తలుపులు తీయలేదు. దీంతో తలుపులు పగులగొట్టి చూడగా ధనమ్మ ఇంటి పైకప్పుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్మకు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి మృతురాలి తల్లి లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కరోనా భయంతో అబుదాబిలో ఆత్మహత్య?
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రూరల్: బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అతని స్నే హితులు తెలిపిన వివ రాల ప్రకారం... ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి నీలాద్రిపేటకు చెందిన పైలా పరశురామ్ రెడ్డి(47) పద్దెనిమిది ఏళ్ల కిందట పొట్టకూటి కోసం అబుదాబి(యుఏఈ) వెళ్లి అక్కడే నేషనల్ పెట్రోలియం అండ్ కనస్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నారు. గత ఏడాది మేలో జరిగిన గ్రామదేవత ఉత్సవాలకు వచ్చిన పరశురామ్ జూన్లో మళ్లీ అబుదాబి వెళ్లిపోయాడు. ఈ ఏడాది జనవరిలో స్వగ్రామం రావాల్సి ఉండగా కరోనా వైరస్ అధికంగా ఉండటంతో వీసా దొరకలేదు. అంతే కాకుండా కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో గత కొన్ని రోజులుగా ఆ యనను క్వారంటైన్లో పెట్టినట్టు సమాచారం. ఈ పరిణామాలపై మనస్తాపం చెందిన పరశురా మ్ రెడ్డి సోమవారం క్వారంటైన్లోనే ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. లొద్దపుట్టిలో మా త్రం గుండెపోటుతో ఆయన మరణించినట్లు స మాచారం అందిందని బంధువులు చెబుతున్నా రు. మృతుడు పరశురామ్కు భార్య పైలా లక్ష్మితో పాటు కుమారుడు కేశవరావు, కుమార్తె పద్మలు ఉండగా మరో కుమార్తెకు పెళ్లైంది. -
భార్యను బెదిరిద్దామనుకుని.. ఆత్మహత్య
పశ్చిమ గోదావరి , తాళ్లపూడి: భార్యను బెదిరిద్దామనుకున్నాడో లేక టిక్ టాక్ వీడియో చేద్దాం అనుకున్నాడో కానీ ఉరి బిగుసుకుని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని మలకపల్లిలో గెడ్డం గణేష్(30) అనే యువకుడు ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తాళ్లపూడి ఎస్సై జి.సతీష్ సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడికి భార్య ఇద్దరు íపిల్లలున్నారు. భార్య కొంత కాలంగా ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటోంది. అయితే కొద్ది రోజులుగా ఆమె ఫోన్ చేయకపోవడంతో భార్యను బెదిరించడానికి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకుంటుండగా ప్రమాదం జరిగింది. గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని వీడియో తీసుకుంటుండగా ఉరి బిగుసుకుపోయింది. ఈఘటనకు సంబంధించి మొత్తం సెల్ ఫోన్లో 30 నిమిషాలు వీడియో రికార్డు అయినట్టు ఎస్సై చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.(మంటల్లో దూకి యువకుడి ఆత్మహత్య) -
తల్లి మందలించిందని..
వికారాబాద్, పెద్దేముల్: తల్లి మందలించిందని కూతురు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం పెద్దే ముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామానికి చెందిన శాంతమ్మ,బాలప్పకు కుమార్తె,కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా కుమార్తె శ్రీలత (25) కు మతిస్థిమితం లేదు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండేది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భోజనం చేసిన తరువాత ఇంటి ముందు శ్రీలత కూర్చిని ఉంది. పొద్దుపోయింది.. ఇంట్లోకి వచ్చి నిద్రించమని చెప్పగా తల్లితో వాగ్వాదం పడింది. ఈ క్రమంలో తల్లి ఆమెను మందలించి ఇంట్లో నిద్రించింది. కుటుంబసభ్యులంతా నిద్రిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్లిన శ్రీలత కిరోసిన్ డబ్బా తీసుకుని బయటకు వచ్చింది. కుటుంబసభ్యులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంటికి గడియ పెట్టింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని శ్రీలత ఆత్మహత్యకు పాల్పడింది. ఆ మంటలకు తాళలేక అరుపుకేకలు వేయడంతో స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే స్పందించారు. అప్పటికే ఆమె పూర్తిగా కాలిపోయి మృతిచెందింది. తల్లి శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహం అప్పగించినట్లు చెప్పారు. -
కూతురి పెళ్లిపై బెంగతో..
కామారెడ్డి క్రైం: ఆర్థిక స్థోమత లేకపోవడం, కూతురి పెళ్లి చేయలేక పోతున్నాననే బెంగతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్సై తావూనాయక్ కథనం ప్రకారం.. నిజామాబాద్కు చెందిన తిరునగరి శ్రీనివాస్ (47)కు భార్య అరుణ, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తె డిగ్రీ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. ఆర్థిక ఇబ్బందులతో శ్రీనివాస్ కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో తన కూతురికి వివాహం చేయలేక పోతున్నాని బెంగ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం కా మారెడ్డిలోని రైల్వే బ్రిడ్జికి సమీపంలో గూడ్స్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితులు తనతో మాట్లడం లేదని..
చిత్తూరు, కలకడ : మిత్రులు తనతో సక్రమంగా మాట్లడం లేదని మనస్తాపానికి గురైన విద్యార్థిని రంజిత(18) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం కలకడ ఇందిరమ్మ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... ఇందిరమ్మకాలనీకి చెందిన అంజనాదేవి మండలంలోని బాలయ్యగారిపల్లె పంచాయతీ సచివాలయంలో ఆరోగ్యకార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. ఆమె కుమార్తె రంజితను విజయవాడలోని చైతన్య కళాశాలకు చెందిన భవిష్య క్యాంపస్లో నీట్ కోచింగ్కు పంపింది. లాక్డౌన్ కారణంగా రంజిత ఇంటికి చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్రూంలో ప్యాన్కు ఉరి వేసుకుని, మరణించింది. తల్లి విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చి, చూడగా కుమార్తె మరణించి ఉండడాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవిప్రకాష్రెడ్డి తెలిపారు. -
తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడొద్దు అన్నందుకు..
నారాయణఖేడ్: బాలిక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మండలంలోని జూకల్లో చోటు చేసు కుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గైని మీనా(17) ఇంట ర్ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటోంది. రెండేళ్లు సంజీవన్రావుపేట్కు చెందిన బేగరి శ్రీకాంత్తో పరి చయం ఏర్పడింది. తరచుగా అతనితో ఫోన్లో మాట్లాడుతూ చాటింగ్ చేస్తోంది. రెండు నెలల క్రితం శ్రీకాంత్ జూకల్లో మీనా ఇంటికి రావడంతో కుటుంబీకులు రావద్దని పంపించి వేశా రు. మంగళవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా మీనా ఇంటి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి గైని బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.(మూఢనమ్మకాలకు కుటుంబం బలి) -
ప్రియుడి మోసం.. విధుల్లో ఉండగానే
తూర్పుగోదావరి, పెద్దాపురం: మండలంలోని వడ్లమూరు రోడ్డులోని అపెక్స్ రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న యువతి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం ఒడిశాకు చెందిన మాడపల్లి పద్మ (24) ఈ పరిశ్రమలో కార్మికురాలు. సహచర ఉద్యోగితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్థాపానికి గురైన పద్మ ఫాక్యరీలోనే విధుల్లో ఉండగానే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది . పద్మ అక్కడికక్కడే మృతి చెందగా ఈ ఘటనను చూసిన ఒడిశాకు చెందిన సహచర యువతులు సోనాలి, మనీషా, గంగీలు అపస్మారక స్థితిలోకి చేరారు. దీంతో స్థానికులు వారిని పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వి,సురేష్ మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మహత్యనా.. ఇతర కారణమా..?
కరీంనగర్క్రైం/కొత్తపల్లి(కరీంనగర్): మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గబ్బిలాలపేటలో ఇద్దరు మహిళలు, చిన్నారి మృతి ఘటన కరీంనగర్ పట్టణంతోపాటు కొత్తపల్లి మండలం చింతకుంటలో విషాదం మిగిల్చింది. మృతికి కుటుంబ కలహాలా, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాక్డౌన్ ఉండగా కరీంనగర్ నుంచి ఎలా వెళ్లారు..? ఎందుకు వెళ్లారు..? ఎవరు సహకరించారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నెల 10న కొత్తపల్లి మండలం రేకుర్తిలో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొన్న వీళ్లు ఏ కారణంతో వెళ్లారనేది మిస్టరీగా మారింది. కరీంనగర్ పట్టణంలో నివాసం ఉంటున్న అనూష(26), సుమతి(29) మృతదేహాలు సోమవారం ఉదయం మేడ్చల్ జవహర్నగర్ పరిసరాల్లో వేలాడుతూ కనిపించగా, అనూష కూతురు ఉమామహేశ్వరి(8) బాత్రూం శుభ్రం చేసే రసాయనాలు తాగి మృతిచెంది ఉంది. ఈ నెల 10న పేదకూలీలకు కరీంనగర్ శివారు రేకుర్తిలో మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన బియ్యం పంపిణీ వారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలస్యంగా ఇంటికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు మందలించారని తెలిసింది. అదే రోజు సాయంత్రం మేడ్చల్ జవహార్నగర్కు పయనమైనట్లు సమాచారం. కుటుంబ నేపథ్యం... ఖమ్మం ప్రాంతానికి చెందిన అనూషకు కరీంనగర్ కాపువాడకు చెందిన నాగరాజుతో వివాహం కాగా అదే ప్రాంతంలో నివాసం ఉండేది. ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం కోసం అనుమతి ప్రయత్నాలు కొనసాగించినట్లు తెలిసింది. అనూష రెండు నెలల క్రితం హైదరాబాద్ ప్రాంతంలో ఉద్యోగం చేసినట్లు తెలిసింది. అక్కడ పనిచేసే క్రమంలోనే జవహార్నగర్లోని గబ్బిలాలపేటలో ఒక చర్చి ఫాస్టర్ కొడుకుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే అనూష కూతురు, ఆమె స్నేహితురాలు సుమతి జవహార్నగర్కు వెళ్లడానికి కారణమైనట్లు సమాచారం. వెల్గటూర్ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన మోతె బానయ్య, నాగమ్మ కుటుంబం కొత్తపల్లి మండలం చింతకుంటలో నివాసం ఉంటోంది. వీరి కూతురు సుమతి డ్రైవర్ శ్యాంను ప్రేమ వివాహం చేసుకుంది. జ్యోతినగర్లో ఉండే వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. లాక్డౌన్ ఉండగా కరీంనగర్ నుంచి 160 కిలోమీటర్లు మేడ్చల్కు ఎలా వెళ్లారు.. ఎవరి సహకారంతో వెళ్లారు.. ఎందుకు వెళ్లారు.. అక్కడ ఏం జరిగిందనే విషయాలు తెలియరాలేదు. 10న కరీంనగర్ నుంచి వెళ్లిన తర్వాత వీరి కుటుంబ సభ్యులు పోలీసులకు ఎక్కడా ఫిర్యాదు చేయలేదని తెలిసింది. -
వాట్సాప్ వీడియోకాల్లో కడసారి చూపు
సాక్షి, హసన్పర్తి: ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని అంత్యక్రియలకు భార్య, కుమారుడు హాజరుకాలేకపోయారు. అమెరికాలో ఉండడం వల్ల కడసారి చూపును వాట్సాప్ వీడియోలో చూస్తూ రోధించసాగారు. కూతురే కుండ పట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ సంఘటన హసన్పర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన కందుకూరి సూర్య నారాయణ(65) కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ పొందాడు. ఆయనకు భార్య శాంతమ్మ, కుమారుడు కిరణ్, కూతురు కృష్ణవేణి ఉన్నారు. కిరణ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూతురు, అల్లుడు హైదరాబాద్లోని ఓ కంపెనీలో పని చేస్తున్నారు. రెండు నెలల క్రితం శాంతమ్మ అమెరికాలోని కుమారుడి వద్దకు వెళ్లగా ఇంట్లో సూర్యనారాయణ ఒక్కడే ఉన్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సూర్యనారాయణ మృతదేహాన్ని మరుసటిరోజు పోలీసులు రాయపర్తిలో కెనాల్ నుంచి బయటకు తీశారు. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు. ఇదిలా ఉండగా.. సూర్యనారాయణ ఇంటికి తాళం వేసి ఉండటంతో బంధువులు ఆయన కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో హసన్పర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే రాయపర్తిలో ఈనెల 9న గుర్తు తెలియని వ్యక్త మృతదేహం లభ్యమైనట్లు హసన్పర్తి పోలీసులు తెలపగా.. రాయపర్తి పోలీసులు పంపిన ఫొటోలను బంధువులకు చూపించారు. దీంతో మృతుడు సూర్యనారాయణగా గుర్తించారు. భార్యకు సమాచారం సూర్యనారాయణ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బంధువులు ఫోన్ ద్వారా అటు అమెరికాలో ఉంటున్న భార్య శాంత, కుమారుడు కిరణ్, ఇటు హైదరాబాద్లో ఉంటున్న కూతురు కృష్ణవేణికి అందించారు. అయితే అమెరికాలో ఉంటున్న వారు ఇక్కడికి రావడం సాధ్యం కాదని, దీంతో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కడసారి చూపులు చూశారు. ఇదిలా ఉండగా, ఆదివారం హైదరాబాద్ నుంచి కూతురు వచ్చి అంత్యక్రియలు నిర్వహించింది. -
మనస్తాపంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
కేపీహెచ్బీకాలనీ: సహజీవనం చేసిన యువతి వదిలి వెళ్లిపోవడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. చంద్రకిరణ్ (32) మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తూ ఓ యువతితో రెండు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. బేగంపేటలో నివాసమున్న చంద్రకిరణ్ ఇటీవల కేపీహెచ్బీ పరిధిలోని తులసినగర్లోని ఓ అపార్టుమెంట్కు మకాం మార్చారు. కాగా.. 25 రోజుల క్రితం ఆ యువతి చంద్రకిరణ్ను వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం సోదరుడు రాకేష్ ఫోన్చేస్తే ఎత్తకపోవటంతో అనుమానం రావడంతో వచ్చిచూడగా సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలం దొరికిన ఆత్మహత్య లేఖలో ‘ఆ అమ్మాయి లేనిదే నేను బ్రతకలేనని’ రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఇంటి పట్టున ఉండలేక.. ఆత్మహత్యాయత్నాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: దైనందిన జీవితంలో ఇంటిపనులతోపాటు బాహ్య ప్రపంచంలోని పనులను సైతం చక్కబెట్టుకోవడం దాదాపుగా అందరికీ నిత్యకృత్యం. ఉబుసుపోక ఊరకనే ఊరిలో తిరిగేవారు, షాపింగ్ పేరుతో చక్కర్లు కొట్టేవారు, స్నేహితులతో షికార్లు కొట్టేవారు కూడా కొందరుంటారు. అయితే ఇలాంటి వారందరికీ అకస్మాత్తుగా అమల్లోకి వచ్చిన లాక్డౌన్ ఒక శాపంగా మారింది. ఇంటిపట్టున కదలకుండా ఉండలేక ఉక్కిరిబిక్కిరవుతూ ఏకంగా ఊపిరితీసుకునే పరిస్థితికి చేరుకున్నారు. ఒక్క సేలం జిల్లాలోనే ఏడుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం వారిలో ఐదుగురు మహిళలు ఉండడం ఆందోళనకర పరిణామం. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రబలకుండా లాక్డౌన్ ఉత్తర్వులు అమల్లో ఉన్నందున ప్రజలు ఇళ్లను వదిలిబయటకు రాకుండా తమిళనాడు ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అకారణంగా రోడ్లపైకి వస్తే అరెస్ట్లు చేయడం, కే సులు పెట్టడం, వాహనాలను సీజ్ చేయడం వంటి కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉండగా, సేలం జిల్లా ఆత్తూరు సమీపం కాట్టుకోటై్ట ప్రాంతానికి చెందిన అయ్యనార్మలై (50) అనే వ్యక్తి విషపుమొక్కను పొడిచేసి నీళ్లలో కలుపుకుని సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇరుగూపొరుగూ వారు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా తీవ్రచికిత్స అందిస్తున్నారు. ఆత్తూరు సమీపం పెత్తనాయకన్పాళయంకు చెందిన మణికంఠన్ (24) అనే యువకుడు విషద్రావకం సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్తూరు సమీపం నరసింగపురానికి చెందిన గుణశేఖరన్ భార్య సుధ (32) ఎలుకల మందు సేవించి ప్రాణాలుతీసుకునే ప్రయత్నం చేయగా వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. తలైవాసల్ పట్టుదురై గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి భార్య ప్రియాంక (28) గన్నేరుపప్పు మింగి ఆత్యహత్యాయత్నం చేసింది. తలైవా ప్రాంతానికి చెందిన శివశంకరన్ భార్య తేన్మొళి (32) పురుగుల మందు తాగింది. ప్రాణాపాయ స్థితిలో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆత్తూరు సమీపం చతురంగపట్టికి చెందిన అర్ముగం కుమార్తె సుహాసిని (18) పొటాషియం సల్ఫేటు మిశ్రమాన్ని సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆత్తూరు నర్సింగ్పురం కలైంజ్ఞర్ కాలనీకి చెందిన దేశింగురాజా భార్య రాజేశ్వరి (35) విషద్రావకం సేవించి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయగా ఆసుపత్రిలో చేర్పించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారంతా లాక్డౌన్ మూలంగా ఇంటికే పరిమితమైనవారేగానీ కరోనా వైరస్ మూలంగా గృహనిర్బంధానికి గురికాలేదు. అయినా ఇంకా ఎన్నాళ్లు ఈ ఇంటి జైలు అనే బాధతో ప్రాణాలు తీసుకునేందుకు సిద్దపడినట్లు భావిస్తూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితుడు లేని లోకంలో ఉండలేక..
కర్నూలు,సంజామల: వారిద్దరూ మంచి మిత్రులు.. ఒకరినొకరు విడిచి ఉండేవారు కాదు. తరగతి గదిలో పక్కపక్కనే కూర్చునేవారు. ఏమైందో ఏమో నెలరోజుల క్రితం ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్నేహితుడు లేని లోకం తనకు వద్దని సోమవారం మరో విద్యార్థి బలవంతంగా తనువు చాలించాడు. ఈ విషాద ఘటన ముక్కమళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. నీలి చంద్ర(17) అవుకులో ఐటీఐ చదువుతున్నాడు. చంద్రతో పాటు చదువుతున్న మిత్రుడు నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్నేహితుడు ఫొటోను సెల్ఫోన్లో చూసుకుంటూ చంద్ర బాధపడుతుండేవాడు. స్నేహితుడు లేని లోకంలో తాను ఉండలేనని తోటి మిత్రులకు చెప్పేవాడు. నీళ్లకు వెళ్తున్నానని చెప్పి సోమవారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్లి.. బాత్రూంలో ఉరి వేసుకొని విగతజీవిగా మారాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. -
లాక్డౌన్ : మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
కృష్ణాజిల్లా ,పుట్లచెరువు(కైకలూరు): మండవల్లి మండలం పుట్లచెరువు గ్రామానికి చెందిన పి. శ్రీనివాసరావు(24) స్థానికంగా ఇంటర్ చదివి, తిరుపతిలో వైట్హౌస్ టీషర్టుల తయారీ దుకాణంలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో తిరుపతి నుంచి ద్విచక్ర వాహనంపై అతను ఇంటికి బయలుదేరాడు. మార్చి 31న గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో వెదుళ్లపల్లి చెక్పోస్టు వద్ద పోలీసులు ఆపి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసరావు బుధవారం రాత్రి గుంటూరు జిల్లా బాపట్ల కొత్త బస్టాండ్లో చెట్టుకు ఉరి వేసుకుని మరణించాడు. తనను పోలీసులు ఇబ్బందిపెట్టడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆత్మ హత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపాడు. యువకుడి ఆత్మహత్యపై డీజీపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించి, నివేదిక ఇవ్వాలని గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావును ఆదేశించారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారిగా ఏఎస్పీ చక్రవర్తిని నియమించారు. ఆయన బాపట్ల చేరుకుని వివరాలు సేకరించారు. -
పోలీసులు విచారణకు వెళ్తే..
అబిడ్స్: ఆత్మహత్యా చేసుకోవాడానికి యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన షాహినాత్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని చుడిబజార్లో చోటు చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ చాంద్పాషా తెలిపిన వివరాల ప్రకారం... చుడిబజార్లో నివాసం ఉండే పాపాలాల్కు స్థానికంగా ఉండే బస్తీవాసులకు కొన్నిరోజులుగా గొడవులు జరుగుతున్నాయి. 15రోజుల క్రితం ఓ మహిళలపై పాపాలాల్ దాడి చేశాడు. అనంతరం ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాపాలాల్పై 4–సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదే విధంగా వారం రోజుల క్రితం మరో మహిళ పాపాలాల్పై ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. దీంతో ఈ రెండు కేసుల్లో పాపాలాల్ను విచారించేందుకు ఈనెల 28వ తేదీన షాహినాత్గంజ్ పోలీసులు పాపాలాల్ ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసి పాపాలాల్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే పాపాలాల్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా పాపాలాల్పై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 12 కేసులు నమోదైనట్లు ఇన్స్పెక్టర్ చాంద్పాషా తెలిపారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కరోనా : ఇంట్లోకి రానివ్వకపోవడంతో
దౌల్తాబాద్: జీవితంపై విరక్తిచెంది ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉదయం మండలంలోని బిచ్చాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వడ్లమహేష్(32) ఏడాదిన్నర క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి భార్యభర్తలు హైదరాబాద్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం అమ్మాయి తల్లిదండ్రులు వివాహితను గ్రామానికి రప్పించుకున్నారు. అప్పటి నుంచి మహేష్ ఒక్కడే ఉన్నాడు. రెండు రోజుల క్రితం మహేష్ కరోనా వైరస్ నేపథ్యంలో తన సొంత ఇంటికి వచ్చాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కులాంతర వివాహం చేసుకున్నందుకు మహేష్ను ఇంట్లోకి రానివ్వకపోవడంతో జీవితంపై విరక్తి చెంది పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టు పక్కల వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి రాములు ఫిర్యాదు మేరకు అనుమానస్పదస్థితి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహిపాల్రెడ్డి తెలిపారు. -
మత్తు లేని జీవితం వ్యర్థమని..
సాక్షి, బెంగళూరు/ బనశంకరి/ రాయచూరు రూరల్: లాక్డౌన్ వల్ల మద్యం దొరక్క కొందరు మందుబాబులు తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారు. మైసూరు, దక్షిణ కన్నడ, తుమకూరు, బీదర్, హుబ్లీ జిల్లాల్లో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. లాక్డౌన్ వల్ల ఈ నెల 22వ తేదీ నుంచి మద్యం షాపులు, బార్లు మూతపడ్డాయి. నిత్యం తాగుడుకు అలవాటుపడినవారు ఆకస్మాత్తుగా మందు దూరమయ్యేసరికి తట్టుకోలేకపోయారు. ♦ తుమకూరు జిల్లా మధుగిరి తాలుకా చిక్కదాళపట్టె గ్రామంలో హనుమంతప్ప అనే వ్యక్తి గొంతు కోసుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ♦ మైసూరు జిల్లా హుణసూరులో ఓ మందుబాబు లక్ష్మణతీర్థ నదిలోకి దూకి చనిపోయాడు. ♦ బీదర్ జిల్లా భాల్కి పట్టణంలో బావిలో దూకి ఓ హోటల్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా పరిధిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు కడబ పోలీసులు తెలిపారు. ♦ హుబ్లీ హొసూరులోని గణేశ పార్కులో ఉరివేసుకుని ఓ మద్యంప్రియుడు ప్రాణాలు తీసుకున్నాడు. -
ప్రేయసి పెళ్లి చేసుకోమని అడిగిందని..
పశ్చిమగోదావరి, పాలకోడేరు: వారు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శారీరకంగా కలుసుకున్నారు. ప్రేయసి పెళ్లి చేసుకోమని అడిగిందని ఆ ప్రియుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్రం చేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి నమ్మించి మోసం చేశాడని ఆ ప్రేయసి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామానికి చెందిన గుమ్మళ్ల మార్తమ్మ ఇంటర్ వరకూ చదివి ఇంట్లో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన మాండ్రు చంద్రపాల్, మార్తమ్మ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చంద్రపాల్ పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో వారు భీమవరంంలో శారీరకంగా కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రపాల్ను పెళ్లి చేసుకోమని అడిగిందని మంగళవారం అతను పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బంధువులు చూసి అతడిని ఆస్పత్రిలో చేర్పించడంతో కోలుకుంటున్నాడు. చంద్రపాల్ పెళ్లి చేసుకోనని చెప్పడంతో మార్తమ్మ ఆమె తల్లి వాడే థైరాయిడ్ మందులు బుధవారం ఉదయం అధికంగా వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు తరలించారు. పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేసి భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ చేశారు. భీమవరం వన్టౌన్ సీఐ ఆళ్ల కృష్ణభగవాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు
మంచిర్యాల, కాగజ్నగర్రూరల్: ప్రేమించుకున్నాక పెద్దలు ఒప్పుకోకుంటే ఆత్మహత్య చేసుకున్న సంఘట నలు విన్నాం కానీ పెళ్లయి, ఒక అబ్బాయి కలిగాక పెళ్లి కానీ అమ్మాయితో అక్రమ ప్రేమ వ్యవహారం కొనసాగించి ఆఖరుకు ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ సంఘటన మండలంలోని అంకుశాపూర్ గ్రామ పొలిమేరలో ఉగాది రోజున చోటు చేసుకుంది. కాగజ్నగ ర్ రూరల్ ఎస్సై రాజ్కుమార్ కథనం ప్రకారం.. దహేగాం మండలం బీబ్రా గ్రామానికి చెందిన సంతోష్ (35), కాగజ్నగర్ మండలం కొత్తసార్సాల గ్రామానికి చెందిన యువతి డోకే శైలజ (20)లు బుధవారం తెల్ల వారుజామున అంకుశాపూర్ గ్రామం సమీపంలో రిజర్వు ఫారెస్టులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దహేగాం మండలం ఇట్యాల గ్రామానికి చెందిన జ్యోతితో సంతోష్కు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా వారికి 5సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కానీ ఇటీవల కాగజ్నగర్ మండలం సార్సాల గ్రామానికి చెందిన శైలజతో సంతోష్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. అయితే ఈ ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. -
వేధింపులే తల్లీబిడ్డల ప్రాణం తీశాయి
చిత్తూరు, పుంగనూరు : చెడు అలవాట్లకు బానిసైన భర్త వేధింపులు తాళలేక ముగ్గురు పిల్లలను బావిలో వేసి భార్య దూకి ఆత్మహత్య చేసుకుందని సీఐ గంగిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం రాత్రి పుంగనూరు సమీపంలోని ప్రసన్నయ్యగారిపల్లె వద్ద వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలను కనుగొన్నామన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టగా, అనేక విషయాలు వెలుగు చూశాయని చెప్పారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం పుంగనూరు మేలుపట్లకు చెందిన ఓబులేశుతో కర్ణాటక రాష్ట్రం కాడేపల్లె గ్రామానికి చెందిన పద్మావతికి పది సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు సంచారజీవులు. జీవనోపాధి కోసం పట్టణాలకు వెళ్లి గుడారాలు వేసుకుని జీవించేవారు. ప్రస్తుతం పలమనేరు పట్టణం పాలిటెక్నిక్ కళాశాల వద్ద గుడారాల్లో నివాసం ఉండేవారు. ఓబులేశు, అతని భార్య మారెమ్మ అనే పద్మావతి(30 ) దంపతులకు ముగ్గురు పిల్లలు. సంజయ్కుమార్ (6) ఒకటో తరగతి చదువుతున్నాడు. పవిత్ర (3), ఒకటిన్నర సంవత్సరం పాపకు పేరు ఇంక పెట్టలేదు. ఓబులేవు చెడు అలవాట్లకు బానిసయ్యాడు. భార్యను తరచూ కొట్టి, వేధించేవాడు. పద్మావతి ఎంతో సహనంతో ఉంటూ వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో పిల్లలను పోషించుకుంటుండేది. గత ఆదివారం పద్మావతి పిల్లలతో కలసి రామసముద్రం మండలం మినికి గ్రామంలో ఉన్న అమ్మమ్మ లక్ష్మమ్మ, మేనేత్త ఆంజమ్మ ఇళ్లకు వెళ్లింది. మేనత్తకు, అమ్మమ్మకు ఆమె భర్త వేధింపుల గురించి తెలిపింది. ఆంజమ్మ సూచనల మేరకు పద్మావతి పిల్లలను తీసుకుని పుంగనూరు జాతర చూసుకుని పలమనేరులోని ఇంటికి వెళ్తానని చెప్పి మంగళవారం బయలుదేరింది. మార్గం మధ్యలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె పలమనేరుకు వెళితే భర్త వేధింపులు తట్టుకుని జీవించలేమని భావించింది. పుంగనూరు పట్టణ సమీపంలోని బావి వద్దకు వెళ్లి బ్యాగును గట్టుపై పెట్టి, పిల్లలను బావిలో వేసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. నిందితుడు ఓబులేశు పరారీలో ఉన్నాడు. కుటుంబసభ్యులను విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. నలుగురి శవాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
నేనూ నీ వెంటే!
చెన్నై,తిరువొత్తియూరు: ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి. చిన్నపాటి గొడవలకే కుంగిపోయారు. భర్తలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. భార్య, బిడ్డ మృతికి కారణం తానేనని, వారు లేని జీవితం వ్యర్థమనుకున్న అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బన్రూట్టి సమీపం తిరువదిగైలో కలకలం సృష్టించింది. వివరాలు.. కడలూరు జిల్లా బన్రూట్టి సమీపం తిరువడిగై ప్రాంతానికి చెందిన అళగానందన్ కుమారుడు మణికంఠన్ (29). అన్నాడీఎంకే ప్రముఖుడు. ఇతను ఆలయాలలో గోపుర విగ్రహాలకు వర్ణం వేసే వృత్తిని చేస్తున్నాడు. అతని భార్య మహేశ్వరి (25). వీరిద్దరూ గత ఏడాది జూన్ 23న ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత అదే ప్రాంతంలో వేరుగా కాపురం ఉంటున్నారు. మహేశ్వరి మూడు నెలల గర్భిణి. దంపతుల మధ్య తరచూ సమస్యలు ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం మణికంఠన్ పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.(ప్రేమా.. ఇది నీకు న్యాయమా?) గురువారం బయటకు వెళ్లిన అతను రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చాడు. తరువాత భోజనం చేసి నిద్రపోయాడు. తెల్లవారుజామున మణికంఠన్ ఇంటి తలుపులు తెరి ఉన్నాయి. దీన్ని చూసిన ఇరుగుపొరుగు వారు వెళ్లి చూడగా మహేశ్వరి పడక గదిలో శవంగా పడి ఉంది. ఆమె భర్త ఫ్యాన్కు ఉరి వేసుకుని శవంగా వేలాడుతున్నాడు. సమాచారం అందుకున్న బన్రూట్టి పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. పడకగదిలో తనిఖీ చేయగా మణికంఠన్ రాసిన ఉత్తరం లభ్యమైంది. అందులో తాను గురువారం రాత్రి ఇంటికి వచ్చిన సమయంలో తన భార్య ఉరి వేసుకుని శవంగా వేలాడుతోందని, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఆమెను కిందకు దించి పడకపై పడుకోబెట్టానని తెలిపాడు. భార్యలేని జీవితం వద్దనుకుని తనువు చాలిస్తున్నట్టు పేర్కొన్నాడు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్ష కోసం విల్లుపురం ముండియంబాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ లోపు మహేశ్వరి తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు రేకెత్తించారు. తన కుమార్తెను కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, దీనిపై విచారణ జరిపించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రేమా.. ఇది నీకు న్యాయమా?
చెన్నై, వేలూరు: ఆంబూరు సమీపంలో రైలు పట్టాలపై పడుకొని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆలంగాయం సమీపంలోని పూంగాపుదూరు గ్రామానికి చెందిన ఉమాపతి కుమార్తె నందిని (22). గుడియాత్తం సామర్షికుప్పం గ్రామానికి చెందిన కోదండన్ కుమారుడు రామదాస్(29). ఇతను హోసూరులోని వెల్డింగ్ దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించనట్టు తెలుస్తోంది. ప్రేమ జంట గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చి ఆంబూరు సమీపంలోని పచ్చకుప్పంలో రైల్యే పట్టాల వద్దకు చేరుకుంది. రైలు పట్టాల పక్కన కూర్చొని ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. చెన్నై–బెంగళూరు వెళ్లే రైలు పట్టాలపై పడుకొని సెల్ఫీ తీసుకున్నారు. ఆ సమయంలో చెన్నై నుంచి వచ్చిన ఎక్స్ప్రెస్ రైలు అతి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రేమ జంట అక్కడికక్కడే మృతి చెందింది. శుక్రవారం ఉదయం ప్రేమ జంట రైలు పట్టాలపై మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి జోలార్పేట రైల్యే పోలీసులకు సమాచారం అందజేశారు. జోలార్పేట రైల్యే పోలీసులు, ఆంబూరు డీఎస్పీ సదానందం ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను పరిశీలించారు. ఆ సమయంలో మృతదేహాల సమీపంలో సెల్ఫోన్ ఉండడంతో వాటిని పరిశీలించారు. ప్రేమ జంట రైలు పట్టాలపై సెల్ఫీ తీసుకున్న చిత్రాలు కనిపించాయి. వెంటనే బంధువులకు సమాచారం అందజేసి మృత దేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైల్యే పోలీసులు కేసు నమోదు చేసి ప్రేమ జంట ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు.