failure
-
Delhi Election 2025: ఆప్ ఓటమి బాట.. ఐదు కారణాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (శనివారం) కొనసాగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ట్రెండ్స్.. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి బాటలో ఉందని చూపిస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సీట్ల కంటే వెనుకంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.2015లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు గెలుచుకుంది. కానీ 2020లో ఈ సంఖ్య 62కి తగ్గింది. మరోవైపు బీజేపీ 2015లో 3 సీట్లు, 2020లో 8 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఆ పార్టీ సీట్లు గణనీయంగా పెరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి బాట వెనుక అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి:1. అవినీతి ఆరోపణలు-చట్టపరమైన సమస్యలు: పార్టీ అగ్ర నేతలు.. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లపై అవినీతి ఆరోపణలు, అరెస్టులు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ చట్టపరమైన వివాదాలు ఆప్ ప్రతిష్టను బలహీనపరిచాయి. యమునా నదిని శుభ్రపరచడం, ఢిల్లీ రోడ్లను అందంగా తీర్చిదిద్దడం, పరిశుభ్రమైన నీటిని అందించడం లాంటి కేజ్రీవాల్ హామీలు నెరవేరలేదు.2. నాయకత్వ అస్థిరత: కేజ్రీవాల్ అరెస్టు.. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం పార్టీ నాయకత్వంలో అస్థిరతకు దారితీసింది. కొత్త ముఖ్యమంత్రిగా అతిషి నియమితులైనప్పటికీ, నాయకత్వ మార్పు పార్టీకి సవాలుగా మారింది. అరవింద్ కేజ్రీవాల్పై జనాల్లో విశ్వసనీయత విపరీతంగా తగ్గింది.3. ఓట్లను చీల్చిన కాంగ్రెస్: వాస్తవానికి సీట్ల పరంగా ఢిల్లీలో కాంగ్రెస్ ఒక సీటు మాత్రమే గెలుచుకోవచ్చనే అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చింది. 2013 తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మళ్లింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆప్ ఢిల్లీలోని ఏడు సీట్లనూ కోల్పోవడం, పంజాబ్లో కేవలం మూడు సీట్లలో మాత్రమే విజయం సాధించడం కారణంగా పార్టీ బలహీనపడింది.4. అంతర్గత కలహాలు- రాజీనామాలు: పార్టీ లో అంతర్గత కలహాలు, కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ తదితర ప్రముఖ నేతల రాజీనామాలు పార్టీని దెబ్బతీశాయి. అలాగే పార్టీ సంస్థాగత బలహీనతను బహిర్గతం చేశాయి.5. ప్రతిపక్ష పార్టీల ఆరోపణల ప్రభావం: ఆప్పై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు ఉపయోగించుకున్నాయి. ఇది పార్టీ ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. మహిళలు, కొత్త ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి దూరమయ్యారు. -
బాబు కవరింగ్..!
-
చెయ్యలేను చేతకాదు.. ఒప్పుకోలేక తప్పుకోలేక చంద్రబాబు సతమతం
-
కష్టాలు చెబితే కస్సు బస్సు..
-
ఇద్దరు బిడ్డల తల్లి : ఒకే రోజు ఆరు బ్యూటీ సర్జరీలు.. చివరికి!
ఐశ్వర్య అంత అందంగా కనిపించాలి, ఎత్తుపెరగాలి.. ఆరడుగులు డార్లింగ్గా మారిపోవాలి...ఆధునిక యువతలో ఇదో పెద్ద క్రేజ్. ఈ పిచ్చినే కొంతమంది స్వార్థపరులు క్యాష్ చేసుకుంటున్నారు. అందంకోసం ఆరాటపడి ప్రాణాలనే పొగొట్టుకున్న షాకింగ్ సంఘటన ఒకటి చైనాలో చోటు చేసుకుంది. దీంతో ఉన్నదానితో సంతృప్తి పడే కాలం పోయింది. లేని దాని కోసం అర్రులు చాచడం ఒక వేలం వెర్రిగా మారిపోయిందంటన్న నెటిజన్లు కామెంట్లు వైరల్గా మారాయి.దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్లోని గుయిగాంగ్లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళ 24 గంటల వ్యవధిలో ఆరు కాస్మెటిక్ సర్జరీలు చేసుకుంది. కానీ తన అందాన్ని తనివి తీరా చూసుకోకముందే తనువు చాలించింది. సుమారు రూ. 4.7 లక్షలు ( 40వేల యువాన్లు) అప్పు చేసి మరీ నన్నింగ్లోని ఒక క్లినిక్లో చేరింది.. ఒకే రోజు కళ్లు, ముక్కు, ఉదరం కోసం సర్జరీలు చేయించుకుంది. తరువాత ఆమె తొడలలోని కొవ్వును తీసి ముఖం, రొమ్ములలోకి ఇంజెక్ట్ చేసే లైపోసక్షన్ సర్జరీలు చేయించుకుంది. అయితే ఆ మహిళ డిశ్చార్జి కాగానే క్లినిక్లోని లిఫ్ట్ ముందేఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వైద్యులు చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. లైపోసక్షన్ తర్వాత పల్మనరీ ఎంబోలిజం కారణంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్య రావడంతో చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఆమెకు ఎనిమిదేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.మరోవైపు మహిళ మరణంపై కుటుంబ సభ్యులు తమకు న్యాయం కావాలంటూ క్లినిక్పై కేసు వేశారు . అయితే 2 లక్షల యువాన్ల నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించింది. అయితే, అతను కనీసం 10 లక్షల యువాన్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆమె భర్త కోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన కోర్టు చివరికి సుమారు 70 లక్షల రూపాయలు (590,000 యువాన్ల ) నష్టపరిహారంచెల్లించాలని ఆసుపత్రిని ఆదేశించింది. పరిస్థితిని సరిగ్గా గమనించకుండా, కొన్ని వైద్యపరమైన తప్పులు చేసిందని న్యాయమూర్తి లి షాన్ వ్యాఖ్యానించారు. తపుడు వాగ్దానాలతో అప్పు చేసి మరీ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రేరేపించిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.2020ల నాటి ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అందంకోసం అతిగా పోతే అనర్థం తప్పదంటూ కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించగా , డబ్బులు కోసం ఎంతకైనా తెగిస్తారా అంటూ క్లినిక్పై కొందరు, ఒకే రోజులో ఆరు సర్జరీలు? క్లినిక్కి ఇంగితజ్ఞానం లేదా? ముఖ్యంగా రక్తం గడ్డకట్టడానికి దారితీసే లైపోసక్షన్తో సమస్యల ప్రమాదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అంటూ మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. (వైరల్ వీడియో: కీరవాణిగారూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్)చైనాలో లైపోసక్షన్ ఆపరేషన్లు చాలా సాధారణంగా మారిపోతున్నాయి. అందంగా, స్లిమ్గా ఉండాలనే కోరికతో మహిళలు కాస్మొటిక్ సర్జరీలవైపు మొగ్గు చూపుతున్నారు. చాలామంది చనిపోతున్నారు. మరికొంతమంది తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. -
KSR Live Show: ఇసుక మాఫియా.. మద్యం మాఫియా.. ఇంత అరాచక పాలన దేశంలో ఎక్కడ లేదు
-
అంజుమ్ కేసులో.. పోలీసుల వైఫల్యం
పుంగనూరు : చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల బాలిక అశి్వయ అంజుమ్ను కిడ్నాప్ చేసి, దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటముంచి హత్యచేసిన కేసును ఛేదించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, పలువురు పార్టీ నేతలతో కలిసి శనివారం అశి్వయ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కాగితాలు కాలిపోతే తమపై ఆరోపణలు చేస్తూ హెలికాప్టర్లో డీజీపీ, సీఐడీ చీఫ్లను ఉన్నపళంగా పంపిన సీఎంచంద్రబాబు.. మైనార్టీ బాలిక కిడ్నాప్, హత్య కేసులో ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు.న్యాయం జరిగే వరకు తమ పార్టీ తరఫున ఉద్యమిస్తామన్నారు. హత్య కేసులో సీసీటీవీ పుటేజ్ కానీ, ఆధారాలు కానీ లేవని.. పోస్టుమార్టంలో ఏం వచ్చిందన్న విషయాలు కూడా వెల్లడించడంలో పోలీసులు విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఈ విషయంలో ఏం చేస్తున్నారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఇక బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 9న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుంగనూరుకు రానున్నట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు. పోలీసులు స్పందించడంలేదు : మిథున్రెడ్డి గత కొద్దిరోజుల్లో ఇద్దరు మైనర్ బాలికలు హత్యకు గురైన సంఘటనలో నిందితులను ఎందుకు అరెస్టుచేయలేదని, దీని వెనుక ఉన్న లోగుట్టు వెల్లడించాలని ఎంపీ మిధున్రెడ్డి డిమాండ్ చేశారు. చిన్నారి అశ్వియ అంజుమ్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ బాలిక కిడ్నాప్, హత్య కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. వారం రోజులుగా బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. పట్టణ ప్రజలు నిద్రహారాలు మాని ఆందోళనలు చేస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడంలేదని విమర్శించారు. ఈనెల 9న బాధిత కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఉన్నపళంగా పుంగనూరు పర్యటనకు రావడం విస్మయానికి గురిచేస్తోందని.. వారం రోజులుగా స్పందనలేని ముఖ్యమంత్రికి, మంత్రులకు జగనన్న వస్తున్నారనే వార్త స్పందన కలిగించిందని మిథున్రెడ్డి ఎద్దేవా చేశారు. -
స్పేస్ఎక్స్ మిషన్లో... స్వల్ప సమస్య
వాషింగ్టన్: స్పేస్ఎక్స్ సంస్థ క్రూ–9 డ్రాగన్ అంతరిక్ష ప్రయోగంలో చిరు వైఫల్యం చోటుచేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ శనివారం ఈ మిషన్ చేపట్టడం తెలిసిందే. అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి ఫాల్కన్9 రాకెట్ ద్వారా క్రూ–9 డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ను ప్రయోగించింది. ఇది విజయవంతమైనట్టు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. అయితే, ‘‘డ్రాగన్ వ్యోమనౌక రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి ఐఎస్ఎస్ వైపు సాగింది. అనంతరం ఫాల్కన్9 రాకెట్ క్షేమంగా భూమిపైకి తిరిగివచి్చంది. అందులోని రెండో దశ మాత్రం సముద్రంలో పడాల్సిన చోటికి కాస్తంత దూరంలో పడిపోయింది’’ అని స్పేస్ఎక్స్ వెల్లడించింది. ఇందుకు కారణాలపై పరిశోధన చేస్తున్నట్లు పేర్కొంది. ఫాల్కన్9 పునరి్వనియోగ రాకెట్. ఇందులోని రెండో దశ విఫలం కావడం ఇది రెండోసారి. ఇది స్పేస్ఎక్స్కు ఇబ్బందికరంగా మారింది. పొరపాట్లు సరి చేసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చెబుతోంది. క్రూ–9 రాకెట్లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మాస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఐఎస్ఎస్కు పయనమయ్యారు. సునీత, విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు వీలుగా రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. వారిద్దరూ జూన్లో స్టార్లైనర్ తొలి ప్రయోగంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోవడం తెలిసిందే. -
వినేశ్కు ‘నాడా’ నోటీసులు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నోటీసులు జారీ చేసింది. ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే అంశంపై 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఈనెల 9న హరియాణాలోని ఖర్ఖోడ గ్రామంలో డోప్ టెస్టు నిర్వహించాలనుకుంటే ఆ సమయంలో వినేశ్ అందుబాటులో లేకపోవడంతో ‘నాడా’ ఈ నోటీసులు జారీ చేసింది. పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు చేరిన వినేశ్ ఫొగాట్... వంద గ్రాములు అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. ఆ తర్వాత కెరీర్కు వీడ్కోలు పలికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేశ్... హరియాణాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న వినేశ్ హరియాణాలో విసృతంగా పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే వివరాలు అందించనందుకు గానూ వినేశ్కు నోటీసులు అందించాం. డోప్ నిరోధక అధికారి హాజరైన సమయంలో వినేశ్ అందుబాటులో లేదు. అందుకే ఈ నోటీసులు జారీ చేశాం’ అని ‘నాడా’ నోటీసులు పేర్కొంది. నిబంధనల ప్రకారం ఏడాది కాలంలో మూడుసార్లు వివరాలు అందించడంలో విఫలమైన అథ్లెట్లపై ‘నాడా’ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. -
అన్నమో రామ‘చంద్రా’..
సాక్షి, అమరావతి/సాక్షి బృందం విజయవాడ: బుడమేరు ముంపు వచ్చి నాలుగు రోజులైంది. ముంపునీటిలో ఆరున్నర లక్షల మంది విలవిల్లాడుతున్నారు. ఇన్ని రోజులైనా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం కారణంగా బాధితులు అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు. దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నా వారికి సరిగ్గా దిశానిర్దేశం చేయడంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. గుక్కెడు నీళ్లు, పట్టెడన్నం కూడా ఇవ్వలేకపోవడంతో బాధితుల ఆక్రందనలకు అంతులేకుండాపోతోంది. మరోవైపు.. ఆకలితో అలమటిస్తూ పలువురు మృత్యువాత పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయినా సరే ప్రభుత్వంలో చలనం కని్పంచడంలేదు. కొద్దోగొప్పో ఆహార పంపిణీ చేస్తున్నప్పటికీ ఫొటోలకు ఫోజులిచ్చేందుకు అందరూ పాకులాడుతున్నారు. ఇక హెలికాçప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ పెద్ద ప్రహసనంగా తయారైంది. బురదమయమైన చోట జార విడుస్తున్న ఆహార పొట్లాల కోసం బాధితులు కొట్టుకుంటున్న పరిస్థితి. ఆకలి తీర్చే యంత్రాంగమేది? దాతలు అందించే విరాళాలతో పలుచోట్ల ఆహారం తయారుచేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ, ఆ ఆహారాన్ని అవసరమైన వారికి అందించడంలో ఘోరంగా విఫలమవుతోంది. నగరంలో ఏ ఏ డివిజన్లలో ఎంతమంది బాధితులున్నారో ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం ఉన్నా వారికి ఎంతమేర ఆహారం అవసరమవుతుందో అంచనా వేయలేకపోతున్నారు. దీంతో.. మంచినీరు, ఆహార పొట్లాలను తీసుకెళ్తున్న వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలిపివేసి అక్కడకు వచి్చన వారికి మాత్రమే అందిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రధాన రోడ్లకు లోపలగా ఉన్న ప్రాంతాలకూ వచ్చి ఆహార పొట్లాలు అందించాలని వేడుకుంటున్నా పట్టించుకునే దిక్కులేదు. చాలాచోట్ల ఆహారం సరిగా లేకపోవడం, తినడానికి పనికిరాకుండా పాడైపోవడం వంటి కారణాలతో ప్యాకెట్లు రోడ్డుపాలవుతున్నాయి. బాధితులకు ఛీత్కారాలు.. చీదరింపులు ఇదిలా ఉంటే.. సితార సెంటర్, లేబర్ కాలనీ, కబేళా ప్రాంతాల్లో ఆహారం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న బాధితులు అధికారులు, సిబ్బంది నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. వాహనాల్లో ఆహారాన్ని పంపిణీ చేసేందుకు వస్తున్న వారు బాధితులను చులకనగా చూస్తూ మనసు గాయపడేలా మాట్లాడుతున్నారు. కానీ, కొందరు సిబ్బంది పంపిణీ ప్రక్రియను వదిలేసి సెలీ్ఫలు, వీడియోలపైనే ఆసక్తి కనబరుస్తున్నారు.దాతలకు గైడ్ చేసే నాథుల్లేరు.. ఇక బాధితుల ఆకలి తీర్చేందుకు పెద్ద సంఖ్యలో దాతలు ముందుకొస్తున్నా వారికి దిశానిర్దేశం చేసే నాథులు కని్పంచడంలేదు. నగరానికి చెందిన వారే కాదు.. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో దాతలు సొంతంగా ఆహారం తయారుచేయించుకుని విజయవాడ తీసుకొస్తున్నారు. బాధితులను చేరుకోవాలంటే ఎటువైపు వెళ్లాలో వారికి తెలీడంలేదు. దీంతో వారు ఉన్నచోటే పంచేసి మిగిలిపోయిన ఆహారాన్ని అక్కడే వదిలేస్తున్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసినా అధికారులు స్పందించడంలేదని చెబుతున్నారు.కంపుకొడుతున్న ఆహారం.. ఇక నగరంలోని వరద ముంపు ప్రాంతాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహారం వాసనొచ్చి తినేలాలేదని.. వీటిని పిల్లలకు ఎలా పెట్టాలని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అర్థరాత్రి వేళ భోజన ప్యాకెట్లు వస్తున్నాయని.. వాటిని ఇక్కడ పడేసి రేపు ఉదయం తినాలని సూచిస్తున్నారని.. పొద్దున చూస్తే అవి పాడైపోయి కనిపిస్తున్నాయంటున్నారు. ఇలా బస్తాల బస్తాల ఆహార పొట్లాలు నేలపాలవుతున్నాయి. పలువురు వీటిని తిని వాంతులు చేసుకున్నారు.రెండ్రోజుల నుంచి ఖాళీ కడుపుతోఆకలితో అలమటిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. రెండ్రోజుల నుంచి ఖాళీ కడుపుతోనున్న వారు ఎందరో. హెలికాప్టర్ నుంచి విసురుతున్న పొట్లాలు ఎక్కడో దూరంగా పడి ఎవరికీ అందకుండాపోతున్నాయి. పేదల ఆకలంటే అందరికీ అలుసుగా ఉంది. – గిరికే ఏడుకొండలు, వాంబే కాలనీ తిండి, నీరులేక నాలుగు రోజులు విలవిల కుటుంబమంతా వరద నీటిలో చిక్కుకుని నాలుగు రోజులుగా తిండి, తాగునీరు లేక విలవిల్లాడిపోయాం. చివరికి టైర్ ట్యూబుల సాయంతో బుధవారం నున్న గ్రామానికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి గన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాం. – ఎస్. నారాయణరావు, పాయకాపురం, విజయవాడ ముసలివాళ్లకు ఆహారం అందడంలేదు.. ఇంట్లో నేను, నా భార్య ఇద్దరమే ఉంటున్నాం. నాలుగు రోజులుగా తినడానికి తిండి దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాం. ఆహార పొట్లాలు నాలాంటి ముసలివాళ్లకు అందడంలేదు. నా ముసలిదాని ఆకలి తీర్చాలని ఈరోజు కష్టపడి ఆహార పొట్లాన్ని అందుకున్నా. – గుంజ వెంకటయ్య, రాజీవ్నగర్ -
Gun Shot: ఆంధ్రాను ఆఫ్ఘాన్ చేసిన చంద్రబాబు
-
పుణే ఘటన! ఎవరిది ఈ పాపం? ఇది పేరెంటింగ్ వైఫల్యమేనా..?
పుణెలో మైనర్ బాలుడి డ్రైవింగ్ కారణంగా ఇద్దరు యువ ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు. కారుని గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతేగాదు ఈ ప్రమాదానికి ముందు పంబ్లో సంబరాలు చేసుకోవడమే గాక ఏకంగా రూ. రూ. 48 వేలు ఖర్చు పెట్టి మరీ మందు తాగినట్లు తేలింది. నిజానికి మహారాష్ట్రలో 25 ఏళ్లు దాటిన వారికే మద్యం సేవించేందుకు అనుమతి ఉంది. ఇక్కడ నిందితుడికి కొద్ది గంట్లలోనే షరతులతో కూడిన బెయిల్ రావడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు నిందుతుడి తండ్రిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ దిగ్బ్రాంతికర ఘటన యావత్తు దేశాన్ని ఒక్కసారిగా ఉలక్కిపడేలా చేసింది. ఇక్కడ సరిగాలేని చట్టాలది తప్పా? లేక నిందితుడిని అలా పెంచిన తల్లిదండ్రులది తప్పా? దీనికి ఎవరు బాధ్యులు? ఎవరదీ ఈ పాపం..?యావత్తు దృష్టిని ఆకర్షించిన ఈ ప్రమాదం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో జరిగిన భయానక దిగ్బ్రాంతికర ఘటనగా చెప్పొచ్చు. 17 ఏళ్లు మైనర్ రూపంలో మృత్యువు ఎన్నోకలలతో ఉన్న ఇద్దరు యువతీయుకుల జీవితాలను బలితీసుకుంది. రెండు కుంటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంత ఘోరానికి పాల్పడ్డ నిందితుడు కొద్ది గంటల్లోనే బెయిల్పై రావడమే గాక మేజర్ కాదు కాబట్టి శిక్షార్హడు అని కోర్టు పేర్కోనడమే అత్యంత కలిచివేసే విషయం. ఇక్కడ మైనర్ ఎంత పెద్ద నేరం చేసిన శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతున్నందుకు బాధపడాలో లేక తల్లిదండ్రుల పెంపకానికి రెండు నిండు జీవితాలు బలైనందుకు కలత చెందాలో తెలియని స్థితి. ఈ ఘటన ఒక్క విషయం చెప్పకనే చెప్పింది. తల్లిదండ్రుల పెంపక వైఫల్యతకు నిదర్శనమే ఈ ఘటన అని చెంపదెబ్బ కొట్టినట్లు చెప్పకనే చెబుతోంది. మేజర్ కానివాడికి విలావంతమైన కారు ఇవ్వడం ఒక తప్పు అయితే..ఖర్చుపెట్టుకోమని అంతంత డబ్బు ఇస్తున్నారంటే..తల్లిదండ్రులుగా వాళ్లకు ఏం చెబుతున్నారో అర్థమవుతోంది. ఇక్కడ తల్లిదండ్రులు మేము ఒళ్లు గుల్ల చేసుకుని డబ్బులు సంపాదించేస్తాం..మీరు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి తాగితందనాలు ఆడి బీభత్సం సృష్టించమని చెబుతున్నారా? అని అనలా. ఏదైనా మొక్కగా ఉన్నప్పుడే సరిచేయాలి. విలాసవంతమైన వస్తువులు కొనివ్వగలిగే స్తోమత ఉన్న తల్లిదండ్రులు రెండు విషయాలు తప్పక గుర్తించుకోవాలి. కొన్నింటికి నో చెప్పడం ముఖ్యం..ఒకటి దీనివల్ల వాడికి ప్రయోజనం ఉంటుందా లేదా గ్రహించాలి. రెండు ఎంత వరకు ఆ లగ్జరియస్ వస్తువు పిల్లలకు అవసరం అనేది కూడా గమనించాలి. స్నేహితుల ప్రభావంతో స్టేటస్ ఆఫ్ సింబల్గా విలాస వస్తువులు కావాలనుకుంటున్నారా? అన్నది కూడా తల్లిదండ్రులుగా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. ప్రతి తల్లిదండ్రులు స్తోమత ఉన్నా లేకపోయినా విలావంతమైన వస్తువులకు 'నో' చెప్పాలి. అంతేగాదు తల్లిదండ్రులుగా ప్రతిదానికి 'ఎస్' అని చెప్పడం కాదు నో అని చెప్పి కట్టడి చేయడం వంటివి కూడా చేయాలి. ఒక వస్తువు కొనేందుకు ఖర్చు అవుతున్న డబ్బులు అందుకోసం మీరు పడుతున్న కష్టం గురించి విడమరిచి చెప్పాలి. చాలామంది చేసే ప్రధానమైన తప్పు ఏంటంటే..ప్రతీది కాదంటే వారు నొచ్చుకుంటారు,స్నేహితుల ముందు చిన్నబోతారని భావిస్తుంటారు. పైగా పిల్లలు కదా..!పోనీలే అనే భావన కూడా అస్సలు వద్దు. మీ ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఎంత ఖరీదైనదేనా కొనిచ్చేస్తారు..ఆ తర్వాత ఏంటీ..? అనేది అతిపెద్ద ప్రశ్న..?. అనేది గుర్తుపెట్టుకోండి.. పిల్లల భవిష్యత్తు భద్రమైన వస్తువులు కొనివ్వండి. గారాభంగా పెంచడం తప్పుకాదు. ముద్దుగా, గారాభంగా పెంచుతూనే బాధ్యతలను, విలువలను నేర్పించాలి. ముఖ్యంగా ప్రయోజకులుగా మారకపోయిన పర్లేదు గానీ ఇతరులకు హాని తలపెట్టే వారిగా, అందరూ అసహ్యించుకునేవారిలా మాత్రం తయారవ్వనివ్వకండి. (చదవండి: ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు!) -
గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
రాజస్థాన్లోని నీమ్ కా థానా జిల్లాలో మంగళవారం రాత్రి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ప్రమాదం సంభవించింది. సంస్థకు చెందిన 14 మంది అధికారులు, విజిలెన్స్ బృందం సభ్యులు గనిలో చిక్కుకున్నారు.ఉద్యోగులను గని లోపలికి, బయటికి తరలించేందుకు ఉపయోగించే వర్టికల్ షాఫ్ట్ పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మైనింగ్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం గనిలో చిక్కుకున్న అధికారులను బయటకు తీసుకువచ్చే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోలిహన్ గని వద్ద విజిలెన్స్ బృందం కంపెనీ సీనియర్ అధికారులతో కలిసి తనిఖీలు చేసేందుకు వందల మీటర్ల మేర గనిలోకి దిగింది. వారు పైకి వస్తున్న సమయంలో షాఫ్ట్ (కేజ్) వైర్ తెగిపోయింది. దీంతో గని లోపల తనిఖీ చేయడానికి వెళ్లిన 14 మంది అధికారులు లోపలే చిక్కుకుపోయారు.సమాచారం అందుకున్న వెంటనే ఖేత్రికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ధరంపాల్ గుర్జార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో పలువురు అధికారులతో పాటు ఏడు అంబులెన్స్లు ఉన్నాయి. అధికారులను బయటకు తీసుకువచ్చే పనిలో రెస్క్యూ టీమ్ నిమగ్నమైంది. ప్రస్తుతానికి ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. -
చిలకలూరిపేట సభపై ఎల్లో మీడియా వక్రభాష్యం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహంలోకి వెళుతున్నట్లుగా ఉంది. ఒకవైపు జనసేన, BJPలను బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్న ఆయన, వ్యవస్థలపై దృష్టి సారించినట్లుగా ఉంది. 58 నెలలపాటు న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని నిత్యం కేసులు వేస్తూ , ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు కీలకమైన ఈ రెండు నెలలు తన మిత్రపక్షం బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి వీలైనంతమేర YSR కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అన్ని రాజకీయ పార్టీలకు ఈ రెండు నెలలు కీలకం అవుతాయి. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న కూటమి సభ విఫలం అవడంతో , ఆ నెపం మొత్తాన్ని పోలీసులపైన తోసేసి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు ఆరంభించారు. DGPతో పాటు కొందరు IPS అధికారులను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముఖ్య అదికారి మీనాకు ఫిర్యాదు చేసింది. దానిపై జనసేన, BJP ప్రతినిధులు కూడా సంతకాలు చేసి ఆ పాపంలో పాలు పంచుకున్నారు. నిజంగా ప్రధాని మోడీ సభ అంత నాసిరకంగా జరగడానికి కారణం ఎవరు? నిర్వహణ బాధ్యతలన్నీ తెలుగుదేశం నేతలే తీసుకున్నారు కదా! అలాంటప్పుడు వైఫల్యానికి కూడా వారే బాద్యత వహించాలి కదా! దానిని కప్పిపుచ్చే ప్రయత్నం స్పష్టంగా కనబడుతోంది. (సభ ఏర్పాట్లను పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షించిన లోకేష్) మిత్రపక్షంగా బిజెపి అయిందో లేదో, వెంటనే చంద్రబాబు నాయుడు తన మేనేజ్ మెంట్ స్కిల్ ఉపయోగించి ఎన్నికలను నెల రోజులు ఆలస్యంగా జరిగేలా చేశారన్నది ఎక్కువ మంది భావన. ఇక ఇప్పుడు ఎపిలో చిత్తశుద్దితో పనిచేస్తున్న పోలీసు అధికారులపై దాడి చేసి వారిని భయోత్పాతానికి గురి చేయడం ద్వారా లబ్ది పొందాలన్న కుట్రకు తెరలేపారు. అందుకే మోడీ సభకు సంబందించి టిడిపి ఫిర్యాదు చేసిందన్న భావన ఏర్పడింది. ఆ ఫిర్యాదు పత్రంలో పేర్కొన్న అంశాలు చూడండి. తాము ముందస్తుగానే పోలీసులకు భద్రత ఏర్పాట్ల గురించి లేఖ రాసినా, అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని, భద్రత ఏర్పాట్లలో లోపాలకు డిజిపి బాద్యుడని ఎన్నికల ముఖ్య అధికారికి టిడిపి రాసిన లేఖలో తెలిపింది. జన సమూహాన్ని నియంత్రించడం, ట్రాఫిక్ను క్రమబద్దం చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని టిడిపి ఆరోపణ. అందువల్లే కూటమి బహిరంగ సభలో ప్రజలు తోసుకుంటూ ముందుకు వచ్చారని, అలాగే మైక్ సౌండ్ సిస్టమ్ వైపు కూడా వచ్చారని టిడిపి పేర్కొంది. దానివల్ల మోడీ స్పీచ్ ఇస్తున్నప్పుడు పలుమార్లు మైక్ ఆగిపోయిందని ఆ పార్టీ ఫిర్యాదుగా ఉంది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని ఆ పార్టీ ఆరోపించింది. ప్రధాని పలుమార్లు టవర్ల నుంచి దిగాలని సభకు వచ్చినవారిని కోరినా, పోలీసులు చొరవ తీసుకోలేదని పార్టీ ఆరోపించింది. మోడీని సత్కరించడానికి తెచ్చిన పుష్పగుచ్చాన్ని కాని, శాలువాని కాని పోలీసులు అనుమతించలేదని చిత్రమైన ఫిర్యాదు చేసింది. ఇదంతా YSRCPతో పోలీసులు కుమ్మక్కయి కుట్ర చేశారని టిడిపి అభియోగం. ఇక సభకు వస్తున్న వాహనాలను జాతీయ రహదారిపై కావాలని ఆపేశారని మరో ఆరోపణ చేసింది. సభకు వచ్చిన వారి అత్యుత్సాహం వల్లే మైక్ సిస్టమ్ పని చేయకుండా నిలిచిపోయిందని మాత్రం టిడిపి అంగీకరించడం విశేషం. డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, ఐజి పాలరాజు, పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డిలపై ఆరోపణలు గుప్పిస్తూ టిడిపి ఈ లేఖ రాసింది. (సభలో పరిస్థితి) ఈ లేఖలోని ఆరోపణలపై జాగ్రత్తగా పరిశీలన చేసినా, విచారణ జరిపినా కొన్ని విషయాలు తేలికగా తెలిసిపోతాయి. లేఖ ఆసాంతం పరిశీలిస్తే.. తెలుగుదేశం పార్టీ డొల్లతనం బయటపడుతుంది. ప్రధాని మోడీ పాల్గొన్న సభకు భద్రత ఏర్పాట్ల నిమిత్తం నాలుగువేల మంది పోలీసులను నియమించారు. అయినా తక్కువ మందిని పెట్టారని అసత్యపు ఆరోపణను కూటమి నేతలు చేశారు. కరెంటు పోయిందన్నది అబద్దమని చెబుతున్నారు. సభా ప్రాంగణానికి ప్రత్యేకంగా విద్యుత్ లైనే లేదట. సభ అంతా జనరేటర్ పై ఆధారపడి ఏర్పాటు చేసుకున్నారట. అలాంటప్పుడు కరెంటు పోయే సమస్య ఎక్కడ నుంచి వస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మైక్ సిస్టమ్ సరైనది ఎంపిక చేసుకునే బాధ్యత టిడిపి వారిదే కాని, పోలీసులకు ఏమి సంబంధం? చిలకలూరిపేట ప్రాంతంలో రికార్డింగ్ డాన్స్ లకు వాడే మైక్ సిస్టమ్ను తెలుగుదేశం నేతలు తీసుకురావడంతోనే ఈ సమస్య వచ్చిందన్నది స్థానికుల అభిప్రాయంగా ఉంది. ఒకసారి ప్రధాని భద్రత కోసం వచ్చే ప్రాంగణాన్ని SPG అధీనంలోకి తీసుకున్న తర్వాత స్థానిక పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఉండవు. SPG అనుమతి ఇచ్చి ఉంటే ప్రధాని కోసం టిడిపి తెచ్చిన పుష్పగుచ్ఛం, శాలువాను స్థానిక పోలీసులు అనుమతించకుండా ఎలా ఉంటారు? (మోదీని సన్మానిస్తారని ప్రకటన చేయగా.. శాలువాలు, పూలబోకే లేక దిక్కులు చూస్తోన్న బాబు, పవన్) టిడిపి నేతలు చేసినవన్నీ అబద్దపు ఆరోపణలని పోలీసు అధికారుల సంఘం నేతలు చెబుతున్నారు. పోలీసులకు రాజకీయ రంగు పులమడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సభ ఎజెండా ఖరారు చేసుకునేటప్పుడు అన్ని సిద్ధంగా ఉన్నాయా ? లేదా? అన్నది చూసుకోవల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉంటుంది. వారు వాటిని ఎందుకు చెక్ చేసుకోలేదు? ఇదే టైమ్ లో బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఒక విగ్రహ జ్ఞాపికను వేదిక మీదకు ఎలా తీసుకు వెళ్లగలిగారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేతులూపుకుంటూ వెళ్లి కూర్చున్నారే కాని, ప్రధానిని సత్కరించడానికి అవసరమైన ఏర్పాట్ల గురించి ఎందుకు ఆరా తీయలేదో తెలియదు. రోడ్లపై ట్రాఫిక్ ను రెగ్యులేట్ చేయలేదని ఇంకో తప్పుడు ఆరోపణ చేశారు. నిజానికి ఈ సభ కోసం భారీగా ఏమీ వాహనాలు రాలేదు. ఆ విషయం గమనించిన తెలుగుదేశం వారు రోడ్డుపై కొన్ని వాహనాలను అడ్డంగా నిలిపి, చాలా వాహనాలు ఆగిపోయినట్లు కలరింగ్ ఇస్తూ దానిని డ్రోన్ ద్వారా వీడియో తీశారు. కాని ఆ విషయం బయటపడిపోవడంతో ఈ దిక్కుమాలిన ఫిర్యాదు చేశారు. ఎప్పుడూ ఏదో ఒక అబద్దపు ప్రచారంతో నెట్టుకువచ్చే తెలుగుదేశం పార్టీ ఈ రకంగా కూడా ప్రజలను మోసం చేసే యత్నం చేసింది. RTC బస్ లు తగినన్ని ఇవ్వలేదని టిడిపి మీడియా ప్రచారం చేసింది. విషయం ఏమిటంటే 2500 RTC బస్లను రిజర్వు చేసుకున్న టిడిపి వాటిలో 1500 బస్ లను ఎందుకు కాన్సిల్ చేసిందో కూడా వివరించాలి కదా! అసలు రాష్ట్రంలో వారివల్ల ఎక్కడ ఏ తప్పు జరిగినా, ముందుగా ఎదుటివారిపై తోసేయడం చంద్రబాబు బృందానికి అలవాటేనన్నది రాజకీయ వర్గాల విమర్శగా ఉంది. ప్రధాని మోడీ సభలో ఏదైనా అలజడి జరిగితే దానిని ప్రభుత్వంపై నెట్టి రాజకీయ లబ్ది పొందాలన్నది వారి లక్ష్యం కావచ్చని అనుమానిస్తున్నారు. సభలో ప్రజలు ఎవరూ టవర్లు ఎక్కకుండా అక్కడ పార్టీ వలంటీర్లనో, కార్యకర్తలనో పెట్టుకోవలిసిన టిడిపి ఎందుకు ఆ పని చేయలేదు? ఆయా టిడిపి సభలలో ఒక యాంకర్ మాదిరి వైర్ లెస్ కార్డు సిస్టమ్ వాడి ప్రసంగం చేసే చంద్రబాబుకు పాతపద్దతిలో మైక్ సిస్టమ్ ఎలా అనుమతించారు? గతంలో కందుకూరు వద్ద ఇరుకు రోడ్డుపై సభ పెట్టి తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించిన ఏం చేశారు? గుంటూరులో చంద్రబాబు సభకు వచ్చేవారికి చీరలు ఇస్తామని ప్రకటించి,వేలాది మంది వచ్చేలా చేసి, అక్కడ సరిగా నిర్వహించకుండా తొక్కిసలాట జరిగినప్పుడు ఏం చేశారు? మనుష్యులు మరణించినప్పుడు ఆ నెపాన్ని పోలీసులపైనే నెట్టేయలేదా? గోదావరి పుష్కరాలలో చంద్రబాబు ప్రచార యావవల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించినప్పుడు చంద్రబాబు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడింది గుర్తు లేదా? కుంభమేళాలలో చనిపోవడం లేదా? రోడ్డు ప్రమాదాలలో పోవడం లేదా అని ప్రశ్నించి అందరిని విస్తుపరిచారు. ఇప్పుడు తమ పార్టీ ప్రయోజనాల కోసం అలాంటి ఘటన ఏదైనా జరిగితే ప్రయోజనం అని ఏమైనా భావించారా అన్న విమర్శను కొందరు చేస్తున్నారు. కేవలం పోలీసు ఉన్నతాధికారులను భయపెట్టి , తమ పార్టీ అభ్యర్ధులు చేసే డబ్బు పంపిణీ, కానుకల పంపిణీ వంటి వాటికి అడ్డు రాకుండా చూసుకోవాలన్న ఆలోచనతో వారిపై ఈ ఆరోపణలు చేశారా అన్న సందేహం వస్తుంది. దానికి తగినట్లే ఈనాడు మీడియా ఇదంతా పోలీసుల వైఫల్యం అని, కేంద్రం నిఘా అధికారులు నివేదిక పంపించారంటూ కధనాన్ని కూడా ప్రచారం చేసింది. పైగా పల్నాడు ఎస్పిపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవచ్చంటూ రాసేసింది. అసలు విచారణ చేసిందెప్పుడు, సంబందిత అధికారుల వివరణ కోరిందెప్పుడు? నివేదికను కేంద్రానికి పంపిందెప్పుడు? అదే నిజమైతే ఈనాడు మీడియాకే ఎందుకు ఇచ్చారు? అంటే ఇదంతా ఒక కుట్రగా కనిపించడం లేదా!ఇంతకాలం కోర్టులను అడ్డంపెట్టుకుని ఇలాంటి కధలను నడిపిన టిడిపి, ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియా, ఇప్పుడు కొత్త తరహా కుట్రలకు తెరలేపినట్లుగా ఉంది. అందులో భాగంగానే ఇలాంటి తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారనుకోవాలి.ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. జనం అంతా సభ విఫలం అయిందని, మోడీకి అవమానకరంగా సభ నడిచిందని అనుకుంటుంటే, ఈనాడు మాత్రం అందుకు భిన్నంగా టీవీలో ఒక ప్రచారం చేసింది. సభ ముగిసిన వెంటనే ప్రధానిని చంద్రబాబు, పవన్ కలిశారని, ఆ సందర్భంగా మోడీ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారని టీవీలో వార్తలు ఇచ్చింది. అది నిజమే అయితే ఇప్పుడు ఆ వైఫల్యం..ఈ వైఫల్యం అంటూ కొత్తబాణి ఎందుకు అందుకున్నట్లు? - కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు -
సెప్టిక్ షాక్: నటుడు శరత్బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!
టాలీవుడ్ నటుడు శరత్ బాబు తెలుగు , కన్నడతో సహా వివిధ భాషలలో హీరోగా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అలా ఆయన దాదాపు 230కి పైగా చిత్రాల్లో నటించారు . ఆయన క్యారెక్టర్ రోల్స్లో కూడా ప్రేక్షకులను అలరించారు. చివరికి 71 ఏళ్ల వయసులో ఈ మహమ్మారి సెప్సిస్ బారిన పడి మృతి చెందారు. ఆఖరి దశలో తీవ్ర ఇన్ఫెక్షన్కు గురై చాల రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఆయనకు వచ్చిన సెప్సిస్ ప్రాణాంతకమా? ఎందువల్ల వస్తుంది..? సెప్టిక్ షాక్ అనేది సెప్సిస్కి సంబంధించిన తీవ్ర దశ. దీని కారణంగా శరీరంలో ఒక్కసారిగా రక్తపోటు పడిపోయి శరీరం తీవ్ర ఇన్ఫెక్షన్కు గురవ్వుతుంది. ఈ పరిస్థితి ప్రాణాంతకమైనది. ఈ దశలో మెదడు నుంచి సమస్త అవయవాలు వైఫల్యం చెంది పరిస్థితి విషమంగా మారిపోతుంది. దీన్ని బహుళ అవయవాల వైఫల్యానికి దారితీసే వైద్య పరిస్థితి అని అంటారు. సెప్సిస్ అంటే.. సెప్సిస్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)గా పిలుస్తారు. అంటే.. ఇన్ఫెక్షనకు శరీరం తీవ్ర ప్రతిస్పందించడం అని అర్థం. ఈ పరిస్థితి ఎప్పుడు సంభవిస్తుందటే..శరీరం అంతటా ఇన్షెక్షన్ చైన్ రియాక్షన్లా వ్యాపించడం జరిగితే ఈ సెప్సిస్ బారిన పడటం జరుగుతుంది. చాలా వరకు రోగిని ఆస్పత్రికి తీసుకు వెళ్లే ముందు ప్రారంభమవుతాయి. ఈ సెప్సిస్ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులు, మూత్రనాళాలు, చర్మం లేదా జీర్ణశయాంతర ప్రేగుల నుంచి ప్రారంభమవుతాయి. కారణం.. సూక్ష్మక్రిములు ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తాయి.ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపించడం ప్రారంభిస్తుంది. అయితే దీనికి చికిత్స తీసుకుంటూ ఆపేసినా లేక తీసుకోకపోయినా సెప్సిస్ బారిన పడటం జరుగుతుంది. చాలా వరకు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సెప్సిస్కు కారణం. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కూడా సంభవించవచ్చు. ఈ సెప్సిస్ని శరీరంలో అభివృద్ధి చేసే వ్యక్తులు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల లేదా బలహీనమైన రోగనిరోధక వ్యకవస్థతో తీవ్ర వైద్య పరిస్థితిని కలిగి ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్తో బాధపడే వారిలో దాదాపు పావు నుంచి ఒక వంతు దాక ఆస్పత్రిని సందిర్శించిన ఒక్క వారంలోనే మళ్లీ ఆస్పత్రిలో చేరడం జరుగుతుంది. సెప్సిస్ దశలు.. మూడు దశలు సెప్సిస్: ఇది రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్కు అతిగా స్పందించే పరిస్థితి. తీవ్రమైన సెప్సిస్: సెప్సిస్ అవయవాలు పనిచేయకపోవడానికి కారణమవుతుంది. ఇది సాధారణంగా తక్కువ రక్తపోటు, వాపు ఫలితంగా జరుగుతుంది. సెప్టిక్ షాక్: సెప్టిక్ షాక్ అనేది సెప్సిస్ చివరి దశ. చాలా IV (ఇంట్రావీనస్) ద్రవాలు ఉన్నప్పటికీ, ఇది అత్యంత తక్కువ రక్తపోటు ద్వారా నిర్వచించబడింది. ఈ దశ ప్రాణాంతకమని చెప్పొచ్చు. లక్షణాలు.. వేగవంతమైన హృదయ స్పందన రేటు జ్వరం లేదా అల్పోష్ణస్థితి (ఉష్ణోగ్రతలు పడిపోవడం) వణుకు లేదా చలి వెచ్చగా, తడిగా లేదా చెమటతో కూడిన చర్మం గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి హైపర్వెంటిలేషన్ (వేగవంతమైన శ్వాస) శ్వాస ఆడకపోవుట. సెప్టక్ షాక్ లేదా చివరి దశకు చేరినప్పుడు.. చాలా తక్కువ రక్తపోటు కాంతిహీనత మూత్ర విసర్జన తక్కువగా లేదా లేదు గుండె దడ అవయవాలు పనిచేయకపోవడం చర్మ దద్దుర్లు (చదవండి: దంగల్ నటి సుహాని భట్నాగర్ మృతికి ఆ వ్యాధే కారణం! వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
బీజేపీ విజయానికి.. కాంగ్రెస్ ఓటమికి.. ఐదు కారణాలివే!
రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో ఏడు డివిజన్లలో భిన్నమైన తీరుతెన్నులు కనిపించాయి. జైపూర్ డివిజన్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. డివిజన్లోని 50 స్థానాలకు గాను గతసారి బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధించగా, ఈసారి 26 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ను వెనక్కు నెట్టివేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ విజయానికి కారణాలేమిటి? కాంగ్రెస్ ఓటమికి కారణాలేమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయ నిపుణులు దీనిపై విశ్లేషణ అందించారు. బీజేపీ విజయానికి ఐదు కారణాలు పార్టీలో ఐక్యత నెలకొంది. నేతలంతా అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా చూసుకున్నారు. ప్రధాని మోదీ పాలనే అజెండాగా రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీకి దిగడం లాభదాయకంగా మారింది. టికెట్ల కేటాయింపులో రాష్ట్రానికి చెందిన నేతలందరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం ప్రయోజనకరంగా మారింది. ఎన్నికల ప్రచారంలో జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నేతలు కూడా అన్ని ప్రాంతాలలో పర్యటించారు. ‘సనాతనం’ అంశంతో ఓట్లర్లను ఆకర్షించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం కలిసివచ్చింది. కాంగ్రెస్ ఓటమికి ఐదు కారణాలు రాష్ట్రంలోని సీనియర్ నేతల మధ్య తలెత్తిన వర్గపోరు కారణంగా కార్యకర్తల ఐక్యతలో చీలిక ఏర్పడింది. టిక్కెట్ల కేటాయింపులో సీనియర్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రత్యక్షంగా నష్టపోయారనే వాదన వినిపిస్తోంది. బ్యాడ్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా టిక్కెట్లు కేటాయించారు. పార్టీ నేతలు మితిమీరిన ప్రకటనలు చేయడంతో ప్రజలు వాటిని నమ్మలేదు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరగడం కాంగ్రెస్ పాలనపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇది కూడా చదవండి: రాజస్థాన్కు యూపీ సీఎం.. కారణమిదే! -
మీ నవ్వులు చూడాలనుకుంటున్నా– విజయ్ దేవరకొండ
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా సక్సెస్లో, ఫెయిల్యూర్స్లో ఇంత ప్రేమ ఇచ్చిన మీకు(ఫ్యాన్స్) థ్యాంక్స్. జీవితంలో చాలా మారాయి. ఎత్తు, పల్లాలు చూస్తున్నా. నా చుట్టూ మనుషులు మారుతున్నారు.. నా గురించి ఏదో మాట్లాడతారు. కానీ, మీ (ఫ్యాన్స్) ప్రేమ స్థిరంగా ఉంటుంది.. అందుకే సెప్టెంబర్ 1న మీ మొహాల్లో నవ్వులు చూడాలనుకుంటున్నా’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలవుతోంది. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘నీ మొహంలో నవ్వు చూడాలని మాత్రమే పనిచేస్తున్నా’ అంటూ గత నెల రోజులుగా చెబుతున్నాడు శివ నిర్వాణ. నాక్కూడా నవ్వులు చూడాలని ఉంది. కానీ, నాకంటే ఎక్కువగా సమంత మొహంలో నవ్వులు చూడాలని ఉంది. తను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. అలాగే శివ నిర్వాణలోనూ నవ్వులు చూడాలనుంది’’ అన్నారు. సమంత మాట్లాడుతూ–‘‘మీ కోసం(అభిమానులు, ప్రేక్షకులు) కష్టపడుతున్నాను.. తిరిగి ఆరోగ్యంగా వస్తాను.. ‘ఖుషి’తో బ్లాక్ బస్టర్ ఇస్తానని మీకు మాట ఇస్తున్నాను’’ అన్నారు. శివ నిర్వాణ మాట్లాడుతూ–‘‘ఖుషి’ చూస్తే మీకు(ప్రేక్షకులు) విజయ్, సమంత కనిపించరు.. విప్లవ్, ఆరాధ్య మాత్రమే కనిపిస్తారు. సినిమా చూసి బయటికెళ్లేటప్పుడు ఈ మూవీని మరోసారి చూద్దామనిపిస్తుంది’’ అన్నారు. ‘‘డియర్ కామ్రేడ్’ మేము అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ ‘ఖుషి’ పెద్ద హిట్ కాబోతోంది’’ అన్నారు నవీన్ యెర్నేని. ‘‘శివ నిర్వాణతో మా బ్యానర్లో మరో సినిమా చేయనున్నాం’’ అన్నారు వై.రవిశంకర్. ‘‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’కి విచ్చేసిన విజయ్, సమంతలకి థ్యాంక్స్. ఈ వేడుకని గ్రాండ్గా చేసేందుకు సహకారం అందించిన నవీన్, రవిశంకర్, దినేశ్గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీస్ సీఈవో చెర్రీ, కెమెరామేన్ జి.మురళి, డైరెక్టర్ అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. -
తప్పులు చేయకపోతే...???
సర్వసాధారణంగా లోకంలో ..ఎవరయినా విజయం సాధిస్తే..దానికి వారు ఎంత కష్టపడిందీ పదేపదే చెప్పుకుని పొంగిపోతుంటారు. అది సహజం కూడా. కానీ అపజయం ఎదురయితే మాత్రం... ‘మనం చేయాల్సింది చేశాం కానీ ఫలితం లేకపోయింది’ అంటారు.. అంటే విజయం అయితే తన స్వంతం. అదే వైఫల్యం చెందితే అందరినీ కలుపుకుంటారు. తన వైఫల్యాన్ని అంగీకరించరు..ఇది కూడా ఎక్కువగా చూస్తుంటాం. కానీ విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ విజేత, రామన్ ఎఫెక్ట్ సష్టికర్త సర్ సివి రామన్ ఏమంటారంటే... ‘‘ఎక్కడ నేను వైఫల్యం చెందానో దానికి యజమానిని నేను. నేనే కర్తను, నేనే భోక్తను, నేనే దానికి పూర్తిగా బాధ్యుణ్ణి. అసలు నేను వైఫల్యం చెందకపోతే .. నేను నేర్చుకోవడం ఎలా సాధ్యపడుతుంది!!!’’– అని. దిద్దుకుందామన్న స్పృహ లేకపోతే దోషం కానీ, దిద్దుకోవడానికి సిద్ధంగా ఉండి.. తాను పొందిన వైఫల్యాలను అనుభవంగా స్వీకరించి, అది నేర్పిన పాఠాలతో మరింత జాగ్రత్తగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తానంటే... ఇక సమస్యే ముంది!!! నిజానికి అందరిలో ఉండాల్సిన లక్షణం అది. సుందరకాండలో స్వామి హనుమ... ‘‘నాలుగు అంగుళాలు కూడా వదలకుండా లంకా పట్టణమంతా గాలించేసాను. సీతమ్మ కనబడలేదు. అంటే సీతమ్మ ఇక్కడ లేదేమో.. సీతమ్మ క్షేమ సమాచారం లేకుండా నేను తిరిగి వెడితే..అక్కడ రాముడు శరీరం వదిలేస్తాడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల రాజ్య ప్రజలు, వానర రాజ్యంలో ఉన్నవాళ్ళు...అందరూ హతాశులైపోతారు. నేను వెళ్ళి సీతమ్మ సమాచారం దొరకలేదని చెప్పి ఇంతమందిని బాధపెట్టడం కంటే ఈ సముద్రపు ఒడ్డున కూర్చుని ప్రాయోపవేశం చేస్తాను. శరీరం వదిలేస్తాను’’ అన్నాడు... హనుమ అంత బలశాలి లంకంతా వెతికి సీతమ్మజాడ తెలియకపోతే... ఎంత నిరాశ, ఎంత నిస్పృహæ... అది కొద్దిసేపే... వెంటనే తన బాధ్యతలను గుర్తు చేసుకున్నాడు.. ‘అసలు మనిషికి శోకం పొందకుండా ఉండడం, బాధ పడకుండా ఉండడం, వైఫల్యానికి బాధపడినా దాన్ని విడిచి మళ్లీ... దిద్దుకుని ఉత్సాహం పొంది ఎక్కడ వైఫల్యం చెందాడో అక్కడ తిరిగి విజయం అందుకోవడానికి సాధన మొదలుపెట్టడం ముఖ్యం’ అనుకున్నాడు. ఎక్కడ వస్తువు పోగొట్టుకున్నామో అక్కడ వెతికితే ఫలితం... ఎక్కడ వైఫల్యం చెందామో అక్కడ విజయం సాధిస్తే అది ఇచ్చే తృప్తి, అది నేర్పిన పాఠం, అది నేర్పిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతాయి... అటువంటి పరిస్థితులు ఎదురయినప్పుడు మరింత స్ఫూర్తినిస్తాయి... అన్న వివేకం మనల్ని ముందుకు నడిపించడమే గాక మరిన్ని విజయాలను రుచి చూపిస్తుంది. అంతే తప్ప నేనేది చేసినా ఇంతే... అయినా నాకా శక్తి ఎక్కడిది.. అని నిరాశపడితే జీవితం ముందుకు కదలదు. మేడమీద ఉన్న కిటికీలోంచి ఇద్దరు వ్యక్తులు బయటికి చూస్తే... ఒకడికి కింద ఉన్న బురదనేల, మురికి కనిపించి నిరాశ పరిస్తే.. మరొకడికి ఆకాశంలో నక్షత్రాలు, చంద్రుడు, వెలుగులు కనిపించి మురిపిస్తాయి. వాళ్ళ దక్పథాల్లోనే తేడా.. ఆశావాదం ఉన్న వాళ్లు జీవితంలో వృద్ధిలోకి వస్తారు... నిరాశావాదులు నిరాశను ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవాలి. రామన్ చెప్పినట్లు వైఫల్యాలను మనసారా అంగీకరిస్తే... అది మనల్ని ఎన్నటికీ నిరాశపరచకపోగా... కొత్త శక్తినిస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
టీడీపీ బస్సు యాత్ర అట్టర్ప్లాప్.. ఎందుకిలా జరుగుతోంది?
అదేంటో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ఫెయిల్ అవుతోంది. తాజాగా భవిష్యత్ గ్యారెంటీ అనే పేరుతో ఐదు ప్రాంతాల నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు పచ్చ నేతలు. ఎక్కడా జనం ఈ పచ్చ బస్సుని పట్టించుకోవడంలేదు. అనంతపురం నుంచి ప్రారంభమైన యాత్ర కూడా సేమ్. అయితే ఈ జిల్లాలో బస్సు యాత్రను టీడీపీ నేతలే బ్రేకులు వేస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది? ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం బస్సు యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ చేపట్టిన ఈ బస్సు యాత్రకు ఆ పార్టీ శ్రేణులే ఆటంకాలు కల్పిస్తున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఈనెల 23న ప్రారంభమైన బస్సు యాత్ర 30వ తేదీ వరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సాగాల్సి ఉంది. అయితే గ్రూపు రాజకీయాల కారణంగా మడకశిర నియోజకవర్గంలో బస్సు యాత్రను టీడీపీ అధిష్టానం రద్దు చేసింది. 26వ తేదీన మడకశిరలో బస్సు యాత్ర జరగాల్సి ఉంది. ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కొనసాగుతున్నాయి. మడకశిర నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఈరన్న ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగాల్సి ఉంది. ఈరన్న నాయకత్వంలో తాము పనిచేసేది లేదని గుండుమల తిప్పేస్వామి వర్గం పార్టీ నాయకత్వానికి స్పష్టం చేసింది. బస్సుయాత్రలో ఈరన్న పాల్గొంటే ఖచ్చితంగా అడ్డుకుంటామని తిప్పేస్వామి వర్గం అల్టిమేటం జారీ చేసింది. యాత్ర ఆగిపోయి పరువు ఎక్కడ పోతుందో అని భయపడిన టీడీపీ నాయకత్వం ఏకంగా మడకశిర నియోజకవర్గంలో బస్సు యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాప్తాడు నియోజకవర్గంలో యాత్రను దారి మళ్లించి బ్రతికిపోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాస్తవానికి బస్సు యాత్ర ప్రారంభం నుంచే టీడీపీ నేతల గ్రూపు రాజకీయాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. చదవండి: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్సీపీదే జయభేరీ కదిరి నియోజకవర్గంలో అత్తార్ చాంద్ భాషా అసంతృప్తిగా ఉన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారది, స్థానిక నేత సవితమ్మ ఢీ అంటే ఢీ అంటున్నారు. పెనుకొండలో జరిగిన బస్సు యాత్రలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పరస్పర నినాదాలు, తోపులాటలతో బీకే, సవిత వర్గాలు ఆధిపత్యాన్ని చాటుకునేందుకు యత్నించాయి. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో రెండు వర్గాలవారిని పోలీసులు చెదరగొట్టారు. అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీలో రెండు మూడు గ్రూపులు ఉండటంతో బస్సు యాత్ర ఉద్దేశం దారి తప్పుతోంది. భవిష్యత్తు గ్యారెంటీ ప్రజలకు కాదు...ముందు తమకు ఇవ్వాలని టీడీపీ అసమ్మతి నేతలు స్పష్టం చేస్తూ ఉండటంతో పచ్చ పార్టీ పరువు బజారున పడుతోంది. చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..! మరోవైపు బస్సు యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. ప్రజలే పట్టించుకోనపుడు ఈ యాత్ర వల్ల ఉపయోగం ఏముందని టీడీపీ సీనియర్లే ప్రశ్నించుకుంటున్నారు. అనవసరంగా యాత్ర ప్రారంభించామని, మధ్యలో ఆపలేమని లోలోన మదనపడుతున్నట్లు టాక్ నడుస్తోంది. -
టైటాన్ మిస్సింగ్.. ఎలాన్ మస్క్కు బిగ్ ఫెయిల్యూర్..?
111 ఏళ్ల కిత్రం సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన జలాంతర్గామి మంగళవారం గల్లంతయ్యింది. ఓషన్గేట్ ఎక్స్పెడిషన్స్ నిర్వహిస్తున్న ఈ టూరిస్ట్ క్రాఫ్ట్ ఆదివారం యాత్రను ప్రారంభించింది. మొదలైన రెండు గంటలలోపే కమ్యూనికేషన్ కోల్పోయింది. అయితే.. ప్రముఖ స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ సర్వీస్ టైటాన్ యాత్రకు కమ్యునికేషన్ సర్వీస్ను అందిస్తోంది. దీంతో స్టార్లింక్ సర్వీస్ నిర్వాహణ తీరుపై కూడా విమర్శలు ఎదురువుతున్నాయి. Despite being in the middle of the North Atlantic, we have the internet connection we need to make our #Titanic dive operations a success - thank you @Starlink! pic.twitter.com/sujBmPr3JD — OceanGate Expeditions (@OceanGateExped) June 1, 2023 సాంకేతిక సమస్యా..? జలాంతర్గామి గల్లంతవడానికి ఇంటర్నెట్ ఒకటే సమస్య అని ఖచ్చితంగా చెప్పలేం. ఇతర సాంకేతిక సమస్యలు కూడా ఉండొచ్చు. కమ్యునికేషన్ కోల్పోయిన తర్వాత కూడా సబ్మెరైన్ పైకి రావడానికి కావాల్సిన వ్యవస్థ అందులో ఉంది. కానీ ఇప్పటివరకు జలాంతర్గామి జాడ తెలియకపోవడం ఇతర టెక్నికల్ సమస్యలను సూచిస్తోంది. The wreck of the Titanic lies about 400 miles off the coast of Newfoundland. Without any cell towers in the middle of the ocean, we are relying on @Starlink to provide the communications we require throughout this year’s 2023 Titanic Expedition. More: https://t.co/F7OtKI0En7 pic.twitter.com/wr7HeKlGjj — OceanGate Expeditions (@OceanGateExped) June 14, 2023 ఈ ప్రమాదంపై కమాండ్ షిప్లో విధులు నిర్వహించిన డేవిడ్ పోగ్ మరో కోణాన్ని వెల్లడించారు. జలాంతర్గామికి కమ్యూనికేషన్ పోయిన తర్వాత కూడా షార్ట్ మెసేజ్ చేయడానికి అవకాశం ఉంటుందని పోగ్ తెలిపారు. కానీ అదేమీ జరగలేదని చెప్పారు. అయితే.. సబ్మెరైన్ పరిస్థితులను బయటకు చెప్పకుండా కమాండ్ షిప్లో ఇంటర్నెట్ను నిలుపుదల చేస్తారని చెప్పారు. ఇదీ చదవండి: టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన సబ్ మెరైన్ గల్లంతు.. అందులో పాక్ అత్యంత ధనవంతుడు ఖాతరు చేయలేదు..? జలాంతర్గామి వెల్లదలచిన లోతుపై గతంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఓషన్గేట్కు చెందిన ఉద్యోగి డేవిడ్ లిచర్డ్ తెలిపారు. గతంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన షాంపిల్స్లో కూడా ఆయన అనేక లోపాలను గుర్తించినట్లు చెప్పారు. 4 వేల మీటర్ల వరకు జలాంతర్గామిని తీసుకువెళ్లడానికి సంస్థ నిర్ణయించింది. కానీ 1300 మీటర్ల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంపై మాట్లాడిన ఉద్యోగులను సంస్థ తొలగించినట్లు డేవిడ్ తెలిపారు. చర్చలతో ఆ వివాదం ముగిసినట్లు వెల్లడించారు. Wow. OceanGate, the company that owns the missing submersible, fired an employee a few years ago after he filed safety complaints against them. The employee specifically said the sub was not capable of descending to such extreme depths before he was fired.https://t.co/c3s2H3eVEr — Caroline Orr Bueno, Ph.D (@RVAwonk) June 20, 2023 స్టార్ లింక్కూ వైఫల్యమే..? ఏదేమైనా ప్రస్తుతం జలాంతర్గామి గల్లంతవడంతో అనేక లోపాలు బయటపడుతున్నాయి. ఈ అంశంపై స్టార్ లింక్ సంస్థ గానీ, ఎలాన్ మస్క్ గానీ ఇప్పటివరకు స్పందించలేదు. మరి.. కమ్యునికేషన్ అంశంలో లోపాలపై ఎలాన్ మస్క్ సంస్థ స్టార్ లింక్కు కూడా ఇది పెద్ద వైఫల్యంగా మారుతుంది. ఇదీ చదవండి: టైటాన్ మిస్సింగ్కి రెండురోజులు.. ఆక్సిజన్ అయిపోతోంది.. కొన్ని గంటలే! వాళ్ల జాడేది? -
ఇండిగో విమానం ఇంజీన్ ఫెయిల్: అత్యవసర ల్యాండింగ్!
న్యూఢిలీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న ఇండిగో విమానం ఇంజన్ ఒకటి ఫెయిల్ కావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజీన్ లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారమిచ్చిన పైలట్ అత్యవసర ల్యాండింగ్ అనుమతి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టర్న్బ్యాక్కు కారణాన్ని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
కిమ్కు తొలిసారి షాక్! ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం
సియోల్: ఉత్తర కొరి యోలో కిమ్ ప్రభు త్వం మిలటరీ కార్యక లాపాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరస పెట్టి క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఆ దేశం తొలిసారిగా ప్రయోగించిన నిఘా ఉపగ్రహం విఫలమైంది. ఉపగ్రహాన్ని తీసుకువెళుతున్న రాకెట్ రెండో దశ సమయంలో కనెక్షన్ తెగిపోయినట్టు ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఉపగ్రహ ప్రయోగం వైఫల్యానికి గల కారణాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్టుగా వెల్లడించింది. ఉపగ్రహం శకలాలు కొరియాలోని ఉత్తరంవైపు సముద్ర జలాల్లో పడినట్టుగా తెలిపింది. ప్రయోగం విఫలమై రాకెట్ భూమిపైకి దూసుకువచ్చే సమయంలో అసాధారణంగా ప్రయాణించడంతో దక్షిణ కొరియా, జపాన్లు వణికిపోయాయి. రాకెట్ ఎక్కడ తమ భూభాగం మీద పడుతుందోనన్న భయంతో దేశ ప్రజలు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపొమ్మంటూ హెచ్చరించాయి. చివరికి రాకెట్ సముద్రంలో పడడంతో ఆ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. -
జయాపజయాలు
మానవ జీవితం ద్వంద్వాలమయం. కష్టసుఖాలు, కలిమిలేములు, జయాపజయాలు జీవన గమనంలో సహజ పరిణామాలు. జయాపజయాల గురించి మన సమాజంలో పట్టింపు మోతాదు కంటే ఎక్కువే! విజేతలకు వీరపూజలు చేయడం, పరాజితులను విస్మృతిలోకి తోసిపారేయడం సర్వ సాధారణం. అయితే, జయాపజయాలు దైవాధీనాలని ఆధ్యాత్మికవాదుల విశ్వాసం. ఎవరెన్ని సూక్తులు చెప్పినా, ఎవరూ గెలుపు కోసం ప్రయత్నాలను మానుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు గెలుపు దక్కాలనుకునే పట్టుదలతో పగ్గాలు విడిచిన గుర్రాల్లా దూసుకుపోయేవారు కొందరు ఉంటారు. గెలుపు కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా, ఎంతటి నీచానికి దిగజారడానికైనా తెగబడేవారు ఇంకొందరు ఉంటారు. శక్తికి మించిన విజిగీషతో రగిలిపోయేవారు చరిత్రను రక్తసిక్తం చేస్తారు. అడ్డదారుల్లో పడి అడ్డదిడ్డంగా పరుగులు తీసి, అడ్డు వచ్చినవాళ్లను నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేసి అందలాలెక్కుతారు. విజయోన్మత్తతను తలకెక్కించుకుని విర్రవీగుతారు. కాలం ఎప్పుడూ ఒక్కలాగానే ఉండదు. మార్పు దాని సహజ స్వభావం. కాలం మారి, పరిస్థితులు వికటించినప్పుడు విజేతలమనుకుని అంతవరకు విర్రవీగిన వారు పెనుతుపాను తాకిడికి కుప్పకూలిన తాటిచెట్లలా నేలకూలిపోతారు. మన పురా ణాల్లో దుర్యోధనుడు, మన సమీప చరిత్రలో హిట్లర్ వంటి వారు అలాంటి శాల్తీలే! ‘అజ్ఞానపు టంధయుగంలో/ తెలియని ఏ తీవ్రశక్తులో/ నడిపిస్తే నడిచి మనుష్యులు/ అంతా తమ ప్రయోజకత్వం/ తామే భువి కధినాథులమని/ స్థాపించిన సామ్రాజ్యాలూ/ నిర్మించిన కృత్రిమ చట్టాల్/ ఇతరేతర శక్తులు లేస్తే/ పడిపోయెను పేకమేడలై’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అజ్ఞానపుటంధ యుగంలోనే కాదు, వర్తమాన అత్యాధునిక యుగంలోనూ పరిస్థితుల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. మొరటు బలం, మూర్ఖత్వం, మోసం, కుట్రలతో సాధించిన అడ్డగోలు విజయాలను తలకెక్కించుకుని, అదంతా తమ ప్రయోజకత్వంగా తలచి విర్రవీగే విజయోన్మత్తులలో దేశాధి నేతల మొదలుకొని చిల్లరమల్లర మనుషుల వరకు నేటికీ ఉన్నారు. ఇలాంటి వాళ్లలోనే దుర్యోధ నుడికి గుడి కట్టి పూజించేవాళ్లు, హిట్లర్ను ఆరాధించే వాళ్లు, లేని సుగుణాలను కీర్తిస్తూ నిరంకు శులకు బాకాలూదే వాళ్లు కనిపిస్తారు. గోబెల్స్కు బాబుల్లాంటి దుష్ప్రచార నిపుణులు నిర్విరామంగా ఊదరగొడుతూ, జీవితానికి గెలుపే పరమార్థమనే భావనకు ఆజ్యం పోస్తున్నారు. వీళ్ల ప్రభావం కారణంగానే ఓటమిని జీర్ణించుకోలేని తరం తయారవుతోంది. మనుషుల స్థితిగతులను గెలుపు ఓటములతోనే అంచనా వేయడం మన సమాజానికి అలవాటైపోయింది. గెలవాలనే ఒత్తిడి ఒకవైపు, ఓటమి భయం మరోవైపు బతుకుల్లో ప్రశాంతతను ఆవిరి చేస్తున్నాయి. పరీక్షలను ఎదుర్కొనే విద్యార్థుల నుంచి ఎన్నికలను ఎదుర్కొనే రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరికీ ఈ ఒత్తిడి తప్పడం లేదు. గెలుపు ఒత్తిడి కొందరిని మానసికంగా కుంగదీస్తుంది. ఇంకొందరిని అడ్డదారులు తొక్కిస్తుంది. సమాజంలో ప్రబలుతున్న ఈ ధోరణిని సొమ్ముచేసుకోవడానికి కొందరు మేధావి రచయితలు విజయ సోపానమార్గాలను పుస్తకాలుగా అచ్చోసి జనాల మీదకు వదులుతారు. నానావిధ ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ వికాస ప్రవచనాలతో ఊదరగొడతారు. ‘విజయానికి కావలసినది పదిశాతం ప్రేరణ, తొంభైశాతం కఠోర శ్రమ’ అన్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. విద్యుత్తు బల్బును కనుక్కొనే ప్రయత్నంలో ఆయన వెయ్యి వైఫల్యాలను చవిచూశాడు. ‘విద్యుత్ బల్బును కనుక్కోవడంలో వెయ్యిసార్లు విఫలమై, ఇప్పుడు సాధించారు కదా! ఇప్పుడు మీకేమనిపిస్తోంది?’ అని ఒక పాత్రికేయుడు ఆయనను ప్రశ్నించాడు. ‘వెయ్యిసార్లు నేను విఫలమవలేదు. వెయ్యి అంచెల తర్వాత విద్యుత్ దీపాన్ని కనుక్కోగలిగాను’ అని బదులిచ్చాడాయన. వైఫల్యాలే విజయానికి సోపానాలని గ్రహించడానికి ఎడిసన్ అనుభవమే మంచి ఉదాహరణ. గెలుపు కోసం ప్రయత్నించే వాళ్లు ఓటమికి కూడా మానసిక సంసిద్ధతతో ఉండాలి. ఓటమి ఎదురైనప్పుడు రెట్టించిన పట్టుదలతో పునఃప్రయత్నం చేయడానికి తగిన శక్తి యుక్తులను సమకూర్చుకోవడానికి తగిన ఓరిమితో ఉండాలి. ఈ రెండూ లోపించడం వల్లనే పరీక్షల్లో వైఫల్యం ఎదురైనప్పుడు అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారెందరో! స్వేచ్ఛగా జీవితాన్ని జీవించడమే ఒక సాఫల్యం. ఈ ఎరుక లేకనే చాలామంది జీవితాలను వ్యర్థం చేసుకుంటారు. చిల్లర గెలుపుల కోసం, పదవుల కోసం, పదవులను పదిలపరచుకోవడం కోసం అధికార బలసంపన్నుల ముందు సాగిలబడతారు. ‘వాని జన్మంబు సఫల మెవ్వాడు పీల్చు/ ప్రాణవాయువు స్వాతంత్య్ర భరభరితమొ/ పరుల మోచేతి గంజికై ప్రాకులాడు/ వాని కంటెను మృతుడను వాడెవండు?’ అన్నాడో చాటు కవి. ‘విజయమే అంతిమం కాదు. వైఫల్యమేమీ ప్రాణాంతకం కాదు’ అని తేల్చేశాడు బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్. కాబట్టి వైఫల్యం ఎదురైనంత మాత్రాన ముంచుకొచ్చే ముప్పేమీ ఉండదు. విజయం సాధించినంత మాత్రాన అమాంతంగా ఒరిగిపడే ఆకాశమూ ఉండదు. ‘వైఫల్యాల నుంచి ఏమీ నేర్చుకోకపోవడమే మన అసలు పొరపాటు’ అంటాడు అమెరికన్ పారిశ్రామికవేత్త హెన్రీ ఫోర్డ్. వైఫల్యాలే మనకు గుణపాఠాలు నేర్పే గురువులు. గురువులను గౌరవించడం మన సంప్రదాయం. వైఫల్యాలను గౌరవించడం, విజయాలను వినయంగా శిరసావహించడమే మన కర్తవ్యం! -
అఫ్ఘాన్ నుంచి యూఎస్ సేనల నిష్క్రమణలో వైఫల్యానికి కారణం అదే!
అఫ్ఘనిస్తాన్ నుంచి యూఎస్ బలగాలు నిష్క్రమిస్తున్న సమయంలో చోటు చేసుకున్న విషాద ఘటనలకు సంబంధించి సమీక్షను వైట్హౌస్ విడుదల చేసింది. సుదీర్థకాల నిరీక్షణల అనంతరం విడుదల చేసిన ఈ సమీక్షలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సరిగ్గా ఆగస్టు 2021 నాటి బలగాల ఉపసంహరణ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ వైపల్యాలపై దర్యాప్తు చేపట్టింది అమెరికా భద్రతా మండలి. ఈ మేరకు జాదీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ నాటి నిష్క్రమణలో పొరపాట్లు జరిగాయిని అంగీకరించారు. అందువల్లే కొద్ది వారల్లోనే తాలిబాన్లు అఫ్ఘనిస్తాన్ను నియంత్రణలోకి తెచ్చుకుని స్వాధీనం చేసుకుంది. చివరికి అమెరికన్ బలగాలు, దాని మిత్ర దేశాలు అప్పటికప్పుడూ అకస్మాత్తుగా నిష్క్రమించక తప్పలేదంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. ఏ యుద్ధమైన ముగించడం అనేది అంత తేలికైన పని కాదన్నారు. ఈ నిష్క్రమణలో దారితీసిన పరిస్థితులకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని పేర్కొన్నారు. అలాగే అమెరికా గూఢచార్యం అఫ్ఘాన్లోని తాలిబాన్లు బలాన్ని, అక్కడి ప్రభుత్వ బలహీనతలను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. అందుకు సంబంధించి ఇంటిలిజెన్స్ సరైన స్పష్టత ఇవ్వకపోవడంతోనే అలాంటి ఘటనలు తలెత్తాయని కిర్బీ చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన పరిపాలన హయాంలో 2020లో తాలిబాన్లతో చేసుకున్న ఒప్పందంలో పలు లోపాలున్నాయని , ఇది ఒకరకంగా బైడెన్ పాలనను ఏ నిర్ణయం తీసుకోలేని సందిగ్ధంలో పడేసిందన్నారు. దీంతో బైడెన్కి నిష్క్రమణ అనే పదాన్ని వెనక్కి తీసుకోలేని విపత్కర పరిస్థితి ఎదురవ్వడంతో.. ఆయన మరికొంత మంది యూఎస్ బలగాలను అఫ్ఘాన్ పంపించే సాహసం చేయలేకపోయినట్లు తెలిపారు. అలాగే ట్రంప్ తన పదవికాలం ముగింపు సమయంలోని చివరి 11 నెలలు నుంచి అఫ్ఘాన్లో యూఎస్ బలగాల ఉనికిని క్రమంగా తగ్గించారని, తదనంతరం జనవరిలో బైడెన్ అధ్యక్షుడిగా చేపట్టే సమయానికి కేవల 2500 మంది సిబ్బంది మాత్రమే ఉన్నట్లు నివేదిక పేర్కొంది . కాగా, కాబుల్లో ఆగస్టు 26న యూఎస్ బలగాల నిష్క్రమణ సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో సుమారు 13 యూఎస్ దళాలు, 170 మంది అఫ్ఘాన్లు మరణించిన సంగతి తెలిసింది. దీంతో యూఎస్ కొన్ని విమానాలను పంపించి బలగాలను వెనక్కి తీసుకొస్తున్న క్రమంలో..అక్కడి అఫ్ఘాన్ పౌరుల తాలిబాన్లను నుంచి తప్పించుకునేందుకు విమానాలను చుట్టుమట్టిన దిగ్బ్రాంతికర దృశ్యాలు అందర్నీ కలిచి వేశాయి. (చదవండి: కిడ్నాప్ నాటకంతో డబ్బుల కాజేయాలనుకుంది..కానీ చివరికీ ఆ భార్య..) -
చేష్టలుడిగిన భద్రతా మండలి: కొరోసీ
ఐరాస: అత్యంత శక్తిమంతమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పూర్తిగా చేష్టలుడిగిందని ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడు సబా కొరోసీ వాపోయారు. వర్తమాన కాలపు వాస్తవాలను అది ఎంతమాత్రమూ ప్రతిబింబించడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధాలను నివారించి అంతర్జాతీయ శాంతిభద్రతలను పరిరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మండలి ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతోంది. దానికి కారణమూ సుస్పష్టం. దాని శాశ్వత సభ్య దేశాల్లోనే ఒకటి పొరుగు దేశంపై దురాక్రమణకు పాల్పడి ప్రపంచాన్ని తీవ్ర ప్రమాదంలోకి, సంక్షోభంలోకి నెట్టింది. ఈ దుందుడుకుతనానికి గాను రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాల వీటో పవర్ కారణంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడింది. అందుకే మండలిని సంస్కరించాల్సిన అవసరం చాలా ఉంది. మండలి కూర్పు రెండో ప్రపంచ యుద్ధానంతరపు అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో జరిగింది. దాన్నిప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంస్థల పనితీరు ఎలా ఉండాలనే విషయంలో రష్యా దురాక్రమణ పెద్ద గుణపాఠంగా నిలిచిందన్నారు. భారత పర్యటనకు వచ్చిన కొరోసీ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. -
ప్లీజ్.. తమ్ముళ్లూ ప్లీజ్.. టీడీపీ నేతలకు చంద్రబాబు లాలింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధఃపాతాళానికి కూరుకుపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దారుణ ఓటములు. విపక్ష పార్టీగా అన్నీ వైఫల్యాలు. పార్టీ, అగ్రనేతలపై జనం ఏవగింపు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచే అవకాశాల్లేవని అర్థం చేసుకున్న నేతలు. నియోజకవర్గాల వైపు చూడని వైనం. ఏతావాతా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబులో తీవ్ర ఆందోళన. దయచేసి నియోజకవర్గాలకు వెళ్లాలని వేడుకొంటున్నారు. వారిని పిలిచి బుజ్జగిస్తున్నారు. చదవండి: టీడీపీలో వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తున్న వాసు, బీటెక్ రవి పార్టీ కోసం పనిచేయాలని, మున్ముందు పార్టీకి ఊపు వస్తుందని నమ్మబలుకుతున్నారు. అయినా నేతల్లో పెద్దగా మార్పు కనిపించడంలేదని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో, ఆ తర్వాత స్థానిక ఎన్నికల దెబ్బకు టీడీపీ ముఖ్య నేతలందరూ ప్రజల్లోకి వెళ్లడం మానేశారు. మూడేళ్లుగా వారంతా స్తబ్దుగా ఉన్నారు. చంద్రబాబు మరీ ఒత్తిడి తెస్తే అప్పుడప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, తాము ఉన్నామని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తనకు అనుకూలం గా ఉండే ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారానే చంద్రబాబు పార్టీని నడుపుకుంటూ వస్తున్నారు. రకరకాల అంశాలపై ఆందోళనలు చేయాలని ఇస్తున్న పిలుపులకు కూడా పార్టీ నేతల నుంచి అస్సలు స్పందన ఉండడంలేదని సమాచారం. బాదుడే బాదుడు పేరుతో అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ఆందోళనలు చేయాలని చంద్రబాబు పదేపదే చెప్పినా నాయకులు పెద్దగా పట్టించుకోలేదు. మీడియాలో కనపడటం కోసం చేసే హడావుడి తప్ప ప్రజల్లోకి వెళ్లడంలేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు యువతకు 40 శాతం సీట్లిస్తామనే పల్లవి అందుకున్నారు. యువతను ప్రోత్సాహించేందుకు ఈ నిర్ణయమని బయటకు చెప్పుకుంటున్నా.. నాయకుల కొరత వల్లే నిర్ణయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గాల్లో స్పందన కరువు ఈ మూడేళ్లలో చంద్రబాబు ఇచ్చిన కార్యక్రమాలకు కనీసం సగం నియోజకవర్గాల నుంచి కూడా స్పందన రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 175 నియోజకవర్గాలకుగాను 70కి పైగా నియోజకవర్గాలకు ఇన్చార్జిలే లేరు. కొన్నిచోట్ల ఇన్చార్జిలు ఉన్నా అలంకారం కోసమే. కృష్ణా జిల్లా గన్నవరం ఇన్చార్జిగా ఉన్న పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అసలు నియోజకవర్గానికి వెళ్లడమే లేదని పార్టీ నేతలే చెబుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి బాధ్యుడి నియామకమే జరగలేదు. టీడీపీకి పట్టున్నట్లుగా చెప్పుకునే ఈ రెండు కీలక నియోజకవర్గాల్లోనే పార్టీ పరిస్థితి ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, నారాయణ వంటి అనేక మంది నేతలు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని చంద్రబాబు చేయించిన సర్వేల్లో కూడా తేలినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రోజుకు 4 నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమావేశమవుతున్నారు. పారీ్టకి మంచి భవిష్యత్తు ఉందని, నియోజకవర్గంలో పనిచేయాలని కోరుతున్నారు. నియోజకవర్గాల్లో సమస్యలపై ఆందోళనలు చేయాలని సూచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ మీదేనంటూ ఇన్చార్జిలకు హామీ ఇస్తున్నారు. ఇప్పటివరకు 60కి పైగా నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. అయినా, పెద్దగా ఉపయోగం కనిపించడంలేదని, చంద్రబాబు ఎంత బతిమిలాడినా భవిష్యత్తుపై నమ్మకం లేక ముఖ్య నేతలు నియోజకవర్గాలకు రావడంలేదని కొందరు నేతలు తెలిపారు. -
హెచ్సీఏ ఘోర వైఫల్యం.. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి?
సాక్షి, హైదరాబాద్: ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. చదవండి: ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్.. అభిమానులతో ఆటలా! ‘‘ఒక్కరోజే ఇన్ని టిక్కెట్లు ఎలా అమ్ముదామనుకున్నారు. ఆన్లైన్లో అని చెప్పి ఆఫ్లైన్లోకి ఎందుకెళ్లారు?. హెచ్సీఏలో అజారుద్దీన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తొక్కిసలాటకు ఆయనే బాధ్యత వహించాలి. 32 వేల టిక్కెట్లు అందుబాటులో ఉండాలి. టికెట్ల విక్రయానికి అన్ని చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలి. ఒక్కచోటే కౌంటర్ పెట్టడం సరికాదు. ఒక్కరోజే టికెట్లు విక్రయించడం సరికాదు. కనీసం నాలుగైదు రోజులు టికెట్లు విక్రయించాలి. ఆన్లైన్లో అమ్మిన టికెట్లలో అక్రమాలు జరిగాయి. ఎవరికి టికెట్లు అమ్మారో వివరాలు బయటపెట్టాలి’’ అని శేష్ నారాయణ్ డిమాండ్ చేశారు. -
సమస్యలను పక్కదారి పట్టించడానికే వైషమ్యాలు
మోదీ ప్రభుత్వం తన విధానాలతో దేశ ప్రజలను ఎనిమిదేళ్లుగా నానా తిప్పలు పెడుతోంది. ‘అచ్ఛే దిన్’ అంటూ అధికారంలోకి వచ్చారు. తమ పాలనతో ‘బురే దిన్’ చేశారు. నిత్యావసర ధరలు వంద శాతం పెరిగాయి. ఈ సమస్యలను పక్కదారి పట్టించడానికి మైజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ‘‘ఎక్కువ తక్కువలు, కులమత భేదాలుండటం మానవజాతికి అవమానకరం’’ – మహాత్మా గాంధీ నేడు దేశాన్ని పాలిస్తున్నవారు జాతిపిత గాంధీజీ చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా వ్యవహరి స్తున్నారు. కుల, మత భేదాలు సృష్టించి దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారు. దేశాభివృద్ధిని కోరు కుంటున్న ఏ ప్రభుత్వమైనా ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తుంది. కానీ దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్నవారి ఎజెండానే వేరు. ప్రజల మధ్య ఎంత వైషమ్యాలు పెరిగితే అది అంతగా తమకు లాభమనేది వారి ఆలోచన! ఇదేదో గాలికి చేస్తున్న విమర్శ కాదు. దేశంలో కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే అర్థమవుతుంది. ఓ వర్గం లక్ష్యంగా ఎప్పుడూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే జాతీయ పార్టీ నాయ కులు, వారికి తగ్గట్టు... ‘80 శాతం ఉన్న మనం’ అంటూ రాష్ట్రంలో యువత మెదళ్లలో మతతత్వపు పురుగును చొప్పిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి నెలకో ఇష్యూ చొప్పున తెరపైకి తెస్తున్నారు. జనవరిలో కర్ణాటకలో ‘హిజాబ్’ ఇష్యూతో దుమారం రేగింది. ఆ వివాదం నడుస్తుండగానే ‘హలాల్ మాంసం’ తినొద్దనీ, ముస్లింల షాపుల్లో వస్తువులు కొనొద్దనీ బీజేపీ పాలిత కర్ణాటకలో తీర్మానాలు చేశారు. అది సద్దుమణిగే లోపే ఫిబ్రవరిలో ‘కశ్మీరీ ఫైల్స్’ సినిమాతో మరో అగ్గి రాజేశారు. కశ్మీర్లో పండిట్లు, ఇతర వర్గాల మధ్య ఓ స్పష్టమైన విభజన రేఖను సృష్టించారు. ఈ సినిమాకు ప్రధానమంత్రి, హోంమంత్రి, కేంద్ర మంత్రులు ప్రచారకర్తలయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచితంగా సినిమా షోలు నడిపించాయి. దీనిని బట్టి... బీజేపీది విభజన వాదమనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏప్రిల్లో మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా, లౌడ్ స్పీకర్లు అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మే నెలలో ఢిల్లీ షాహీన్ బాగ్ కూల్చి వేతలు మొదలు, తాజ్ మహల్, జ్ఞానవాపి మసీదు ఇష్యూ... వరకు అన్నీ ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తున్న అంశాలే! ఎందుకీ రాద్ధాంతం? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ), నోట్ల రద్దు, కార్పొరేట్ల అనుకూల విధానాలు వంటివాటితో గత ఎనిమిదేళ్లలో ఘనత వహించిన మోదీ ప్రభుత్వం చేసిందేం లేదు. 8 ఏళ్ల క్రితం ‘అచ్ఛే దిన్’ (మంచిరోజులు) అంటూ అధికారంలోకి వచ్చారు. ఈ కాలంలో... ఉన్న అచ్చే దిన్ కాస్తా ‘బురే దిన్’ (చెడ్డ దినాలు) అయ్యాయి. పేదవాడు ఓ పూట బుక్కెడు బువ్వ తినాలంటే ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన దుస్థితి దాపురించింది. నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ ఇప్పటివరకు చూసుకుంటే వంట నూనె, పెట్రోల్, డీజిల్ ధరలు వంద శాతం పెరిగాయి. రూపాయి విలువ దిగజారిపోయింది. వంట గ్యాస్ సిలిండర్ ధర 2014లో రూ. 414 గా ఉంటే... ఇప్పుడు రూ. 1,052కు పెరిగింది. లీటర్ పెట్రోల్ ధర 2014లో రూ. 71 ఉంటే ఇప్పుడు రూ. 120కి పెరిగింది. లీటర్ డీజిల్ ధర 2014లో రూ. 55 ఉంటే ఇప్పుడు రూ.105కు పెరిగింది. ఇటీవల నామ్ కే వాస్తే కొంత తగ్గించారు. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. 42 ఏళ్లలో దేశ ఆర్థికవ్యవస్థ ఎన్నడూ లేనంత అత్యంత దారుణమైన పరిస్థితికి పడి పోయింది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠానికి పెరిగింది. కరోనా కాలంలో ఇచ్చిన ఉచిత రేషన్ తప్ప... కేంద్రం నుంచి పేదవాడికి వచ్చింది ఏమీ లేదు. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వస్తున్న ధనమంతా ఎక్కడపోతోంది? దాదాపు 25 ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేశారు. మొత్తం 36 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉప సంహరణ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం తలమునకలై ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ ఆమ్దానీ అంతా ఎటు పోయింది? ఇప్పుడు దేశ ప్రజలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు మోదీ సర్కారు దగ్గర సమాధానం లేదు. జవాబు చెప్పలేనప్పుడు... జవాబు చెబితే పదవి పోయే పరిస్థితి అయినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మోదీ సర్కారు చేస్తున్న పనే చేయాలి. అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలి. కొత్తగా బలమైన అంశాన్ని తెరపైకి తీసుకురావాలి. అది కూడా మెజార్టీ ప్రజలకు సంబంధించిన అంశమై ఉండాలి. సున్నితమైన అంశమైతే పాత విషయం మరిచిపోవడమే కాదు... మైలేజీ పెరుగుతుంది. ఇప్పుడు మోదీ సర్కారు నూటికి నూరు శాతం చేస్తున్నది ఇదే. (👉🏾చదవండి: ఇవాళ మనకు కావాల్సింది ఇదీ!) బీజేపీ చేస్తున్న ఈ మతరాజకీయాన్ని ఆదిలోనే తుంచేయకుంటే దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. భరతమాతకు మతం పేరుతో బీజేపీ వేస్తున్న సంకెళ్లను తెంచడం మనందరి బాధ్యత. (👉🏾చదవండి: కోటి ఎకరాల మాగాణి కల నిజమౌతుంది!) - వై. సతీష్ రెడ్డి తెరాస రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ -
డివిలియర్స్ చెత్త రికార్డు.. కలిసి రాని యూఏఈ
AB De Villiers Failure In IPl 2021 UAE.. ఐపీఎల్ 2021లో భాగంగా కేకేఆర్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కరోనా విరామం తర్వాత సెకండ్ఫేజ్లో ఆర్సీబీ బ్యాటింగ్ విభాగంలో పడిక్కల్, కోహ్లి, మ్యాక్స్వెల్, కేఎస్ భరత్ కీలకపాత్ర పోషించారు. అయితే సీనియర్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్కు మాత్రం యూఏఈ గడ్డ ఏమాత్రం కలిసిరాలేదు. ప్లేఆఫ్స్తో కలిపి డివిలియర్స్ 8 మ్యాచ్ల్లో 17.66 సగటుతో 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 0,12,11,4, 23, 19, 26,11 ఇవి డివిలియర్స్ యూఏఈ గడ్డపై నమోదు చేసిన స్కోర్లు. ఇందులో ఒక గోల్డెన్ డక్ ఉండడం విశేషం. చదవండి: Virat Kohli: కెప్టెన్గా ఇదే చివరిసారి.. అంపైర్తో కోహ్లి వాగ్వాదం ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎలిమినేటర్ మ్యాచ్లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. కేకేఆర్ బ్యాటింగ్లో సునీల్ నరైన్ 26 పరుగులతో గేమ్ చేంజర్ కాగా.. గిల్ 29, వెంకటేశ్ అయ్యర్ 26, నితీష్ రాణా 23 పరుగులు చేశారు. అంతకముందు ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సునీల్ నరైన్(4/21) బౌలింగ్లో మెరవడంతో ఆర్సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కోహ్లి 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. పడిక్కల్ 21 పరుగులు చేశాడు. చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా ముగిసిన కథ pic.twitter.com/4duozs0Vnk — Cricsphere (@Cricsphere) October 11, 2021 -
‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ను అదుపు చేయడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. కరోనా కట్టడిపై చర్చించేందుకు అత్యవసరంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించండి మోదీజీ అంటూ సోనియా విజ్ఞప్తి చేశారు. ఈ విపత్కర కాలంలో ప్రజలకు కావాల్సిన ఆక్సిజన్, వ్యాక్సిన్, వెంటిలేటర్ అందించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ (సీపీపీ) సమావేశం శుక్రవారం నిర్వహించగా ఆ సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులందరూ కలిసి పని చేయాలని సూచించారు. కొత్త రికార్డులు సృష్టిస్తూ కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో పార్లమెంటరీ కమిటీ ఉమ్మడిగా కలిసి పని చేయాలని చెప్పారు. ఇది వ్యవస్థ పతనం కాదు మోదీ ప్రభుత్వ పరాజయం అని పేర్కొన్నారు. ప్రజలకు కావాల్సిన ఆక్సిజన్, వ్యాక్సిన్, వెంటిలేటర్ అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సెంట్రల్ విస్టాలాంటి అవనసర ఖర్చులకు మోదీ ప్రభుత్వం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందని మండిపడ్డారు. వ్యాక్సినేషన్ విషయంలో మోదీ వివక్ష చూపుతున్నారని, దళితులు, బీసీలు, గిరిజనులకు వ్యాక్సిన్ వేయడం లేదని ఆరోపించారు. కరోనా కాలంలో యువజన కాంగ్రెస్ ఉత్సాహంగా పని చేస్తోందని సోనియా అభినందించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కూడా కాంగ్రెస్ సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. I say this categorically - India is crippled by a political leadership today that has no empathy for the people. The Modi govt has failed the people of our country. - Congress President Smt. Sonia Gandhi at Congress Parliamentary Party Meeting#COVID19India pic.twitter.com/qY6GBmOomx — Congress (@INCIndia) May 7, 2021 -
బీటీ పత్తి.. ఓ సాగు వైఫల్యం
సాక్షి, హైదరాబాద్: బీటీ పత్తి.. ఓ సాగు వైఫల్యమని ప్రపంచ స్థాయి వ్యవ సాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ తొలి జన్యు మార్పిడి బీటీ పత్తి పంట దేశ పరిస్థితులకు అనుగుణంగా లేదని వారు పేర్కొంటున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ), జతన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్లో దేశంలో 18 ఏళ్ల బీటీ పత్తి సాగుపై సాక్ష్యాలతో కూడిన సమీక్ష చేపట్టారు. ఈ వెబినార్లో అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రూ పాల్ గుటిఎరేజ్, కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ మాజీ డైరెక్టర్ డాక్టర్ కేశవ్ క్రాంతి, ఎఫ్ఏవో మాజీ ప్రతినిధి డాక్టర్ పీటర్ కెన్మోర్లతో పాటు 500 మంది వరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1960, 70లలో కాలిఫోర్నియాలో పురుగు మందులను వాడటం వల్ల తెగుళ్లు ప్రబలాయని, దీని నుంచి భారతదేశం గుణపాఠం నేర్చుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానిం చారు. 2005లో 11.5 శాతం, 2006లో 37.8 శాతం, 2011లో దాదాపు అత్యధిక విస్తీర్ణానికి బీటీ పత్తి సాగు పెరిగినా పురుగు మందుల వాడకంలో నియంత్రణ రాలేదని, దిగుబడి పెంపులో కూడా ఎలాంటి మార్పు బీటీతో సాధ్యం కాలేదన్నారు. పురుగు మందుల వాడకం, తెగుళ్ల నియం త్రణలో భాగంగా పర్యావరణ సమ స్యలు తీవ్రంగా తలెత్తుతున్నాయని, దీని వల్ల రైతులు కూడా ఇతర విత్తనాల వైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు. ఈ వెబినార్ నిర్వహణకు అలయన్స్ ఫర్ సస్టైనబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చ రల్ (ఆషా), ఇండియా ఫర్ సేఫ్ ఫుడ్ సంస్థలు సహకారం అందించాయి. -
నా తొలి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అదే: సచిన్
ముంబై : ఏ కంటి వెనుక ఏ కన్నీరు దాగుందో ఎవరికి తెలుసు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అనగానే అత్యధిక పరుగులు, ఎక్కువ సెంచరీలు, సుదీర్ఘ క్రికెట్, క్రికెట్ గాడ్, విజయాలకు కేరాఫ్ ఆడ్రస్ ఇవి మాత్రమే అందరికీ తెలుసు. అయితే సచిన్ జీవితం పూల బాట కాదని ముళ్లదారని కొందరికి మాత్రమే తెలుసు. క్రికెట్లో, లైఫ్లో విజయం తప్ప అపజయం లేదని అందరూ భావిస్తారు. కానీ తన జీవితానికి సంబంధించి తొలి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ను సచిన్ తెలిపాడు. పశ్చిమ మహారాష్ట్రలోని ఓ పాఠశాలకు సచిన్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో మూడు కొత్త తరగతి గదులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు స్టేజ్, గ్రౌండ్ నిర్మాణం కోసం తన ఎంపీ నిధులను మంజూరు చేశాడు. కాగా ఆ పాఠశాలలోని కొత్త తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సచిన్ విద్యార్దులతో సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓటములు ఎదురైనప్పుడు నిరుత్సాహపడుకుండా ధైర్యంగా ముందుకెళ్లాలన్నాడు. తన తొలి సెలక్షన్ ట్రయల్స్లోనే తీవ్ర నిరాశ ఎదురైందని పేర్కొంటూ తన చిన్నతనంలో జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. ఫైల్ ఫోటో ‘నాకు ఊహతెలిసినప్పట్నుంచి భారత్ తరుపున క్రికెట్ ఆడాలనేది నా కల. అందుకోసం నిరంతరం శ్రమించాను. నాపై నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే అప్పటికీ బ్యాటింగ్ బాగా చేస్తున్నావని కోచ్లతో సహా సీనియర్లు మెచ్చుకున్నారు. దీంతో సులువుగా అండర్-11కు సెలక్ట్ అవుతానని భావించాను. కానీ నా ఆట ఇంకా పరిణితి చెందలేదని, ఇంకా తీవ్రంగా కష్టపడాలని సెలక్టర్లు నన్ను పక్కకు పెట్టారు. దీంతో తొలి సెలక్షన్ ట్రయల్స్లోనే నిరాశ ఎదురవడంతో.. టీమిండియాకు ఆడతానా లేదా అనే భయం మనసులో కలిగింది. తీవ్ర నిరాశకు గురయ్యాను. అయితే బాధపడుతూ కూర్చోకుండా నా బ్యాటింగ్ లోపాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇంకాస్త ఎక్కువగా కష్టపడ్డాను. టీమిండియాకు ఆడాను విజయం సాధించాను. ఈ విజయాల పరంపరలో నా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్యా పిల్లల సహకారం మర్చిపోలేనిది. నా సోదరి బహుమతిగా ఇచ్చిన బ్యాట్ ఇప్పటికీ నాకు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తాను. గురువు ఆచ్రేకర్ లేనిదే నేను ఈ స్థాయికి వచ్చే వాడిని కాదు. ఫైనల్గా విద్యార్థులందరికీ చెప్పదల్చుకునేది ఒకటే. విజయం సాధించాలంటే నిరంతరం కష్టపడాల్సిందే.. విజయానికి షార్ట్ కట్స్ ఉండవు’అంటూ సచిన్ పేర్కొన్నాడు. -
‘పుల్వామా’ను రాజకీయం చేయడం కాదా?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘కశ్మీర్ లోయలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం స్వేచ్ఛగా సంచరించిందంటే ఇది కచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యమే’ అని 44 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు అంటే, శుక్రవారం నాడు జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్య ఇది. అదే రోజు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించగా, ఈ విషయంలో ఏ నిర్ణయానికైనా ప్రభుత్వానికి అండగా ఉంటామని యావత్ ప్రతిపక్షం ప్రకటించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకాకపోవడం గమనార్హం. (‘పుల్వామా’ సూత్రధారి ఫొటో మార్ఫింగ్) పుల్వామా దాడి సంఘటనను తాము రాజకీయం చేయదల్చుకోలేదని, అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నామని బీజేపీ అధిష్టానం శుక్రవారం నాడు ప్రకటించింది. ఆ మేరకు శుక్రవారం ఒడిశా, చత్తీస్గఢ్లలో జరగాల్సిన తన సభలను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రద్దు చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇటార్సిలో జరగాల్సిన తన సభను కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రద్దు చేసుకున్నారు. అయితే అదే రోజు ఝాన్సీలో జరగాల్సిన బహిరంగ సభను మాత్రం మోదీ రద్దు చేసుకోలేదు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం కోసం వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలిపించండంటూ ఆ సమావేశంలో మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు. మోదీ శనివారం మహారాష్ట్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావించడంతోపాటు పల్వామా సంఘటన గురించి ప్రస్తావించి ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతికారం తీర్చుకుంటామని ప్రకటించారు. అదివారం అస్సాం ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ ‘ కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కనుక జవానుల ప్రాణ త్యాగాన్ని వృధా పోనీయం’ అని వ్యాఖ్యానించారు. గుజరాత్ బీజేపీ నాయకుడు భరత్ పాండ్యా సోమవారం నాడు వడోదరలో మాట్లాడుతూ కేంద్రంలో ఇంతకుముందున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జాతీయ భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోక పోవడం వల్ల నేడు జవాన్ల ప్రాణాలు పోయాయని అన్నారు. ‘నేడు జాతీయవాదాన్ని నింపుకున్న హృదయాలతో యావత్ జాతి ఐక్యంగా నిలబడింది. ఈ ఐక్యతను ఓట్లుగా మలుచుకోవడం మన బాధ్యత’ అని పాండ్య పిలుపునిచ్చారు. సీఆర్పీఎఫ్ జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొనాల్సిందిగా దేశంలోని బీజేపీ ముఖ్యమంత్రులను, రాష్ట్ర మంత్రులను బీజేపీ అధిష్టానం శుక్రవారం నాడే ఆదేశించింది. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఆదివారం నాడు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసింది. నిరసన సభల్లో పార్టీ జెండాలకు బదులుగా పార్టీ ఎన్నికల గుర్తయిన కమలాన్ని ఎక్కువ ప్రదర్శించాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. శవం పక్కన చిద్విలాసంగా బీజేపీ ఎంపీ ఉత్తరప్రదేశ్లోని ఉన్నావోలో శనివారం నాడు సీఆర్పీఎఫ్ జవాను అజిత్ కుమార్ అంతిమ యాత్రలో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ పాల్గొన్నారు. తాను అంతిమ యాత్రలో పాల్గొంటున్నానని, పైగా సైనికుడి భౌతికకాయం పక్కనున్నననే విషయాన్ని కూడా విస్మరించిన బీజేపీ ఎంపీ, పార్టీ ర్యాలీలో పాల్గొన్నట్లుగా చిద్విలాసంగా నవ్వుతూ ప్రజలకు అభివాదం చేస్తూ, చేతులూపుతూ వెళ్లారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా విమర్శలు వెల్లువెత్తాయి. పుల్వామా ఉగ్ర దాడికి సంబంధించి అనేక వైఫల్యాలు వెలుగులోకి వచ్చిన వాటిపై చర్య తీసుకోవాల్సిందిగా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఇదే విషయమై ఆ పార్టీ సీనియర్ నేతలను ప్రశ్నించగా, బీజేపీకి ప్రచార బలగాలు ఎక్కువున్నాయని, ఈ సమయంలో తాము ఏం మాట్లాడినా ‘జాతి వ్యతిరేకులు’ అంటూ ముద్ర వేసే ప్రమాదం ఉందని వారన్నారు. ఈ విషయంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే ధైర్యంగా మాట్లాడుతున్నారు. -
అంతర్మథనం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేదు ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం చేపట్టింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో కేవలం మూడు సీట్లకే పరిమితం కావడంతో నైరాశ్యంలో కూరుకుపోయిన ఆ పార్టీ.. ఓటమిపై విశ్లేషణ ప్రారంభించింది. మహేశ్వరం, ఎల్బీనగర్, తాం డూరు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. సిట్టింగ్ స్థానాలతో సహా ఏడు సీట్లను కోల్పోవడంతో పార్టీ నాయకత్వం బిత్తరపోయింది. టీడీపీతో జతకట్టడంతో మెజార్టీ సీట్లు దక్కించుకుంటామని గంపెడాశతో ఉన్న తమకు ఆ పొత్తే కొంపముంచినట్లు తాజాగా వెలువడ్డ ఫలితాలు స్పష్టం చేస్తుండడంతో కాంగ్రెస్ నేతలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. తాండూరులో మంత్రి మహేందర్రెడ్డి ఓడించడం ఊరట కలిగించే అంశమే అయినా సులువుగా గెలుస్తామని భావించిన సీట్లలో కూడా భారీ మెజార్టీతో ఓటమి పాలవడంతో సీట్ల సర్దుబాటు వ్యవహారం కూడా పార్టీకి నష్టం చేకూర్చుందనే వాదన వినిపిస్తోంది. సంస్థాగతంగా బలంగా ఉన్న సెగ్మెంట్లను టీడీపీకి కేటాయించడం.. ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కూడా అంచనా వేయకపోవడం దారుణ ఓటమి కారణాలుగా కాంగ్రెస్ నాయకత్వం విశ్లేషించింది. చంద్రబాబునాయుడు ప్రచారాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో టీఆర్ఎస్ సఫలమైందని, అలాగే ఏపీ ఓటర్లలోనూ ఇది చీలికకు దారితీసిందని అభిప్రాయపడింది. అంతేగాకుండా చంద్రబాబు రావడం వల్ల మరోసారి ప్రాంతీయభావం పెరిగి అది ప్రజాకూటమికి వ్యతిరేక ఓటుగా మారిందని తేల్చింది. దీనికితోడు టీఆర్ఎస్కు సంక్షేమ పథకాలు కలిసివచ్చాయని అంచనా వేసింది. వికారాబాద్లో పార్టీ అభ్యర్థి ప్రసాద్కుమార్ బలంగా ఉన్నా.. బలమైన సామాజికవర్గం ఆయనకు మద్దతు ఇవ్వలేదని గుర్తించింది. అలాగే స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ బరిలో నిలవడంతో పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా తేల్చింది. ఇబ్రహీంపట్నం స్థానాన్ని మహాకూటమికి కేటాయించకపోతే ఈజీగా గెలిచేవాళ్లమని అభిప్రాయపడింది. కేవలం స్వల్ప ఓట్ల తేడాతో ఆ స్థానాన్ని కోల్పోయామని, టీడీ పీ బరిలో లేకపోతే అక్కడ ఆ పార్టీకి పడ్డ 17వేల ఓట్లు కూడా అదనంగా వచ్చేవనే అభిప్రాయానికొచ్చింది. శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం త్వరలో జరిగే స్థానిక సంస్థలు, సహకార ఎన్నికలపై ఉంటాయని, వీటిని అధిగమించడం ఎలా అనేదానిపై లోతుగా ఆలోచించాలని అధినాయకత్వం భావిస్తోంది. -
మద్యం తాగి విమానం ఎక్కబోయిన పైలట్
ముంబై: విమానం ఎక్కడానికి ముందు జరిపిన శ్వాస విశ్లేషణ పరీక్షల్లో పైలట్ విఫలం కావడంతో అతణ్ని ప్రభుత్వ సంస్థ ఎయిరిండియా విధుల నుంచి తప్పించింది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాల్సిన ఏఐ–111 విమానానికి కెప్టెన్ ఏకే కఠ్పాలియా పైలట్గా వ్యవహరించాల్సి ఉంది. అయితే అతను మద్యం తాగినట్లు రెండుసార్లు పరీక్షల్లో తేలడంతో అతని స్థానంలో మరో పైలట్ను విధులకు రప్పించాల్సి వచ్చింది. దీంతో విమానం 55 నిమిషాలు ఆలస్యమై ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని ఎయిరిండియా అధికారి చెప్పారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం విమానంలో ప్రయాణించాల్సిన సిబ్బంది ఎవ్వరూ ప్రయాణ సమయానికి 12 గంటల ముందు నుంచి మద్యం సేవించకూడదు. కాగా, ఆదివారమే ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన మరో ఎయిరిండియా విమాన పైలట్ పొరపాటున శ్వాస విశ్లేషణ పరీక్షలో పాల్గొనకపోవడంతో విమానం ఆరు గంటలు ఆలస్యమైంది. 200 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి విమానం సరైన సమయానికే బయలుదేరినా, శ్వాస విశ్లేషణ పరీక్ష కోసం మళ్లీ ఢిల్లీ విమానాశ్రయానికి విమానాన్ని తీసుకురావాల్సి వచ్చింది. -
ముంబై ఎయిర్పోర్ట్లో గందరగోళం
సాక్షి, ముంబై: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో కంప్యూటర్ వ్యవస్థ స్థంభించడంతో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమాన రాకపోకలకు దాదాపు గంట ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు. దీంతో విమాన ప్రయాణీకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కంప్యూటర్ సేవల్లో వైఫల్యంగా కారణంగా దేశీయంగా, అంతర్జాతీయంగా అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన ముంబై ఎయిర్ పోర్ట్లో చెక్-ఇన్ సేవలకు బాగా ఆలస్యం మవుతోంది. కార్యక్రమాలను, సేవలను మాన్యువల్గా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. #9Wupdate: Due to a LAN Network failure at #Mumbai International airport, check-in systems are impacted for all airlines and departure delays up to 1 hour are expected at Mumbai airport. — Jet Airways (@jetairways) July 31, 2018 -
రాజమౌళికి బిగ్ షాక్
దర్శక ధీరుడు రాజమౌళికి ఊహించని షాక్ తగిలింది. బాహుబలి-2 చైనా వర్షన్ దారుణమైన ఫలితాన్ని రాబడుతోంది. ఇప్పటిదాకా కనీసం రూ. 100 కోట్లు కూడా వసూలు చేయకపోవటం విశేషం. అమీర్ ఖాన్ దంగల్ చిత్రం చైనాలో రూ. 1200 కోట్లు వసూలు చేయగా(ఫుల్ రన్లో).. ఇక్కడ యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చిత్రం సైతం రూ. 700 కోట్లు రాబట్టడం గమనార్హం. అంతెందుకు బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై విజయం సాధించిన హిందీ మీడియం కూడా చైనాలో రూ. 200 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి-2 కూడా మంచి వసూళ్లనే రాబడుతుందని రిలీజ్కు ముందు మేకర్లు భావించారు. బాహుబలి మొదటి భాగం ఫలితం తేడా కొట్టడంతో జాగ్రత్త పడ్డ జక్కన్న హాలీవుడ్ టెక్నీషియన్ విన్సెంట్ టబైల్లాన్ను రంగంలోకి దించారు. విన్సెంట్(ది ఇన్క్రిడబుల్ హల్క్, క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ చిత్రాల ఫేమ్) ఎడిటింగ్ వర్క్తో చిత్రం బాహుబలి-2 ష్యూర్ హిట్ అని అంతా భావించారు. కానీ, సీన్ ఇప్పుడు పూర్తిగా రివర్స్ కావటంతో ఖంగుతినటం రాజమౌళి అండ్ నిర్మాతల వంతు అయ్యింది. మే 4వ తేదీన 7 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజైన బాహుబలి-2.. మంగళవారం వరకు చిత్రం రూ.63 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పటిదాకా వచ్చిన వసూళ్లతో త్రీ ఇడియట్స్, ధూమ్-3 చిత్రాల వసూళ్లను మాత్రం అధిగమించింది. కాగా, ఎస్ ఎస్ రాజమౌళి సృష్టించిన కళాఖండం బాహుబలి సిరీస్ ఇండియాలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. భారత బాక్సాఫీస్ వద్ద వేగంగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన చిత్రంగా బాహుబలి ది కంక్లూజన్ రికార్డు సృష్టించింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 18 వందల కోట్లు వసూళ్లు చేసింది. హిందీ వర్షన్ ఇండియాతోపాలు విదేశాల్లోనూ భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ మధ్యే బాహుబలి-2 జపాన్లో విడుదలై ఘన విజయం సాధించింది. #Baahubali2 continues to struggle... Remains on the lower side in CHINA... Fri $ 2.43 mn Sat $ 2.94 mn Sun $ 2.30 mn Mon $ 0.89 mn Tue $ 0.82 mn Total: $ 9.38 mn [₹ 63.19 cr] — taran adarsh (@taran_adarsh) 9 May 2018 -
రైతులను ఆదుకోవటంలో ఘోర వైఫల్యం
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం శనగలు పండించిన రైతులను ఆదుకోవటంలో ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తన విలాసాలు, విహారయాత్రలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పంటలు పండించిన రైతులకు మద్దతు ధరను ప్రకటించి వారిని ఆదుకునేందుకు ఏమాత్రం శ్రద్ధ చూపించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసరావుపేట మార్కెట్ యార్డులో ప్రభుత్వం తూతూ మంత్రంగా వారం రోజులపాటు మాత్రమే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రం నడిపి గత నెల 30వ తేదీతో ముగించిందన్నారు. రైతులు ఈ క్రాప్, సర్టిఫికెట్ ఆఫ్ కల్టివేషన్ (సీవోసీ)లతో రిజిస్ట్రేషన్ల ద్వారా నమోదు చేసుకున్న పంటను కొనుగోలు చేయలేదన్నారు. రొంపిచర్ల మండలంలో 5200 ఎకరాల్లో శనగలు వేసి సీవోసీ తీసుకోగా, నరసరావుపేట మండలంలో 3400ఎకరాల్లో శనగలు వేశారన్నారు. మొత్తంగా 8600 ఎకరాల్లో పంటలు వేసినట్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఎకరానికి కనీసంగా 8 క్వింటాళ్లు చొప్పున 68,800 క్వింటాళ్లు పండించారన్నారు. అయితే ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా ఏప్రిల్ 30 వరకు నియోజకవర్గంలో కేవలం 3011 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. ప్రభుత్వం రూ.4450 మద్దతు ధర ప్రకటించగా బయట మార్కెట్లో రూ.3,200కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటంతో రైతులు బయటమార్కెట్లో విక్రయించటం ద్వారా క్వింటాలుకు కనీసంగా రూ.1250 కోల్పోవాల్సి వస్తోందన్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి ఖర్చులను పరిశీలిస్తే వారికి మిగిలేది ఈ రూ.1250 మాత్రమే అన్నారు. రొంపిచర్లలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించి అందరివద్దా కొనుగోలు చేయకపోతే తాము చేసిన పోరాటం ద్వారా ప్రతి రైతు నుంచి కందులను కొనుగోలు చేశారన్నారు. వ్యవసాయంలో 16 శాతం వృద్ధిరేటు సాధించామని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన శనగలు కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించి వారిని ఆదుకునేందుకు ఎందుకు ప్రయత్నించటం లేదని ప్రశ్నించారు. ధర్మపోరాటానికి రూ.60 కోట్లు, విహార యాత్రలకు కోట్లాది రూపాయలు దుబారా ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి నివాసాలకు హైదరాబాదులో రూ.40 కోట్లు, విజయవాడలో వందల కోట్లు దుబారా చేశారన్నారు. ఇంత దుబారా చేస్తూ రైతులను ఆదుకోవటంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రైతులు పండించిందే మెట్ట పైర్లు అయితే కనీస మద్దతు ధర రాకపోతే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నాగార్జునసాగర్లో నిండుగా నీరున్నా కనీసం రైతులకు ఒక పంటకైనా నీరివ్వకుండా గుడ్డిగా వ్యవహరించిందన్నారు. కొంతమంది రైతులు ధైర్యంచేసి బావులు, చెరువుల కింద మాగాణి వరివేస్తే ఎకరాకు 50 బస్తాల వరకు ధాన్యం పండిందన్నారు. కనీసంగా ఆ నీరు ఇచ్చినా ప్రతి రైతు ఒక పంట వేసుకొని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేవారన్నారు. వారిని మాగాణి వేసుకోనీయకుండా, వేసిన మెట్టపైర్లకు మద్దతు ధర రానీయకుండా చేయటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వెల్లడించారు. రైతులే మీడియా ముందుకు వచ్చి తాము పండించిన పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నా పట్టించుకునే ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు కరువయ్యారని దుయ్యబట్టారు. -
‘జీశాట్–6ఏ’ విఫల ప్రయోగమే!
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ నుంచి మార్చి 29న సాయంత్రం 4.56 గంటలకు ప్రయోగించిన జీశాట్–6ఏ ఉపగ్రహంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. పలు దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో జీశాట్–6ఏతో సంబంధాల పునరుద్ధరణకు ఇస్రో యత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో ఈ ఉపగ్రహ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తల్లో నైరాశ్యం నెలకొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రూ.260 కోట్లతో నిర్మించి ప్రయోగించిన ఈ ఉపగ్రహం మరో అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోనుందని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. మొబైల్ టెక్నాలజీతో పాటు సమాచార రంగం బలోపేతం కోసం జీఎస్ఎల్వీ–ఎఫ్08 రాకెట్ ద్వారా జీశాట్–6ఏను 170 కి.మీ పెరిజీ (భూమికి దగ్గరగా) 35,975 కి.మీ అపోజీ (భూమికి దూరంగా) భూ బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం కక్ష్యను 3 దశల్లో పెంచాలని హసన్లో ఉన్న ఉపగ్రహ నియంత్రణా కేంద్రం శాస్త్రవేత్తలు నిర్ణయించారు. 2,140 కిలోల బరువున్న ఈ ఉపగ్రహంలోని ఇంజిన్లను మండించి మార్చి 30, 31 తేదీల్లో జీశాట్–6ఏ కక్ష్యను రెండుసార్లు విజయవంతంగా పెంచారు. ఏప్రిల్ 1న మూడోసారి కక్ష్యను పెంచే క్రమంలో ఉపగ్రహంలోని ఎలక్ట్రిక్ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో జీశాట్–6ఏ మూగబోయింది. దీంతో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించామన్న ఆనందం శాస్త్రవేత్తలకు రెండ్రోజులు కూడా నిలవలేదు. ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు సాంకేతిక కారణాలతో అంతరిక్షంలో వ్యర్థాలుగా మిగిలిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇస్రో ప్రయోగించిన ఇన్శాట్–4సీ ఉపగ్రహం కూడా కక్ష్యలోకి ప్రవేశించడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురుకావడంతో అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోయింది. అలాగే గతేడాది పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్–1 హెచ్ హీట్షీల్డ్ తెరుచుకోకపోవడంతో ఆ ఉపగ్రహం ప్రస్తుతం అంతరిక్షంలో చక్కర్లు కొడుతోంది. ఇస్రో చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన డా.కె.శివన్కు తొలి ప్రయోగంలోనే వైఫల్యం ఎదురుకావడం గమనార్హం. -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం
వరంగల్ : టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో చేçపడుతున్న రెండో విడత ‘ప్రజా పరిరక్షణ చైతన్య బస్సుయాత్ర’ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 3న ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. హన్మకొండలోని కాంగ్రెస్ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 3న (మంగళవారం) సాయంత్రం బస్సుయాత్ర భూపాలపల్లికి చేరుకుంటుందన్నారు. 4న మధ్యాహ్నం 2గంటలకు స్టేషన్ ఘనపూర్, అదే రోజు సాయంత్రం 6గంటలకు పాలకుర్తిలో యాత్ర కొనసాగుతుందన్నారు. 5వ తేదీ సాయంత్రం 6గంటలకు నర్సంపేటలో కొనసాగించి వరంగల్లో రాత్రి బస చేస్తారని తెలిపారు. 6న పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలలో, 7వ తేదీన కొత్తగూడెం జిల్లా ఎల్లందు టేకులపల్లి, పినపాక మండలంలో యాత్ర కొనసాగుతుందన్నారు. 8న డోర్నకల్, మహబూబా బాద్లో యాత్ర నిర్వహిస్తారన్నారు. 9వ తేదీ ఉదయం భద్రాచలం వెంకటాపురంలో బిల్ట్ కార్మికులతో పీసీసీ బృందం చర్చిస్తుందని తెలిపారు. సాయంత్రం 5గంటలకు ములుగు సభలో పాల్గొంటారని, 10వ తేదీ సాయంత్రం 4 గం టలకు వర్ధన్నపేటలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం బస్సు యాత్ర ముగుస్తుందన్నారు. బస్సుయాత్రను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విజయరామారావు, వేం నరేందర్రెడ్డి, కొండేటి శ్రీధర్, సీతక్క, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, నాయకులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నమిండ్ల శ్రీనువాసు, రవళీ, రహత్ పర్వీన్, మహ్మద్ అయూబ్, కొత్తపెల్లి శ్రీనివాస్, బిన్ని లక్ష్మన్, రమణారెడ్డి, రోహిత్సింగ్ఠాకూర్, మండల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ బస్సు యాత్ర సందర్భంగా ఏర్పాటు చేయనున్న సభ జరిగే కేడీసీ మైదానాన్ని నాయకులు సందర్శించి పరిశీలించారు. -
హోదా కోసం కౌన్సిల్ నుంచి వాకౌట్
నరసరావుపేట: ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు విఫలమయ్యారని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు విమర్శించారు. ఈ మేరకు కౌన్సిల్ హాల్లో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కౌన్సిల్ సమావేశం వాకౌట్ చేసి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం ఎదురుగా ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ నినాదాలు చేశారు. శనివారం చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంకాగానే కౌన్సిలర్లు అందరూ ప్రత్యేక హోదా జిందాబాద్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మాజీ ప్లోర్ లీడర్ మాగులూరి రమణారెడ్డి, కౌన్సిలర్ మాడిశెట్టి మోహనరావు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్నాళ్లు పట్టించుకోనందువల్లనే రాష్ట్రానికి హోదా రాలేదన్నారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్ పోకా శ్రీనివాసరావు మాట్లాడుతూ హోదా కోసం చిత్తశుద్ధితో సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చైర్మన్ గుప్తా మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ, ముఖ్యమంత్రి, స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటు అంతా హోదా కోసం పోరాడుతున్నారని చెప్పారు. ముందుగా అజెండాలోని అంశాలపై మాత్రమే మాట్లాడి చర్చించాలని సూచించారు. దీనిపై మాడిశెట్టి మాట్లాడుతూ పార్లమెంటులోనే ఎంపీలు అందరూ హోదా కోసం పోరాడుతున్నారని చెప్పారు. తామంతా హోదా కోసం కౌన్సిల్ను వాకౌట్ చేస్తున్నామంటూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
నువ్వేం చేసినా ఇండియాలోనే కదా.. పాస్పోర్ట్ అవసరమా?
పాస్పోర్ట్ రెన్యువల్ కోసం రోహిత్ శర్మ వెళితే అక్కడి అధికారి నువ్వేం చేసినా ఇండియాలోనే కదా, విదేశాలకు వెళ్లి చేసేదేముంది, నీకు రెన్యువల్ అవసరమా అని బదులిచ్చాడు. గల్లీ క్రికెట్లో ట్రయల్ బాల్ వేసి ఆ తర్వాత ఆట మొదలు పెడతారు కదా! ఈ సిరీస్లో రోహిత్ బ్యాటింగ్ చేయడం కూడా అలాంటిదే. రోహిత్ పెళ్లి రోజు, భార్య పుట్టిన రోజు సిరీస్కు ఒకసారి వస్తే ఎంత బాగుంటుంది కదా! రోహిత్ తన కిట్లో భారత పిచ్ను కూడా తీసుకువెళ్లి ఆడుకునేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస వైఫల్యాల తర్వాత భారత ఓపెనర్ రోహిత్ శర్మపై వస్తున్న అసంఖ్యాక వ్యంగ్య వ్యాఖ్యానాల్లో ఇవి కొన్ని! వన్డే క్రికెట్ అనగానే చెలరేగిపోయే అతనికి సఫారీ గడ్డ ఏమాత్రం అచ్చి రావడం లేదు. నాలుగు మ్యాచ్లలో వరుసగా చేసిన 20, 15, 0, 5 స్కోర్లు రోహిత్ స్థాయికి ఏమాత్రం తగనివి. మొత్తానికి రెగ్యులర్ ఓపెనర్ ఫామ్ భారత టీమ్ మేనేజ్మెంట్కు కొత్త సమస్యగా మారింది. సాక్షి క్రీడా విభాగం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో రోహిత్ శర్మ 11, 10, 10, 47 పరుగులు మాత్రమే చేశాడు. అయితే టెస్టుల్లో రోహిత్ ఆటపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. అతడిని తుది జట్టులోకి తీసుకోవడంపైనే అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. చివరకు మూడో టెస్టులో జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది. పైగా దక్షిణాఫ్రికా భీకర పేస్ బౌలింగ్లో కోహ్లి మినహా మిగతా బ్యాట్స్మెన్ అందరూ విఫలమైన చోట రోహిత్ వైఫల్యాలు కూడా పెద్దగా కనిపించలేదు. కానీ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన మొనగాడు అదే ఫార్మాట్లో తడబడుతున్న తీరు అమితాశ్చర్యం కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో రోహిత్కిది మూడో పర్యటన. 2011, 2013లలో ఇక్కడ ఆడిన వన్డేల్లో కూడా అతను ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఏడు వన్డేల్లో అతను వరుసగా 11, 9, 23, 1, 5, 18, 19 చొప్పున పరుగులు చేశాడు. గత సిరీస్లో జొహన్నెస్బర్గ్ వన్డేలోనైతే 16వ బంతికి గానీ అతను కనీసం బ్యాట్ను బాల్కు తాకించలేకపోయాడు! అయితే నాటి రోహిత్తో పోలిస్తే ఈ నాలుగేళ్ళలో అతను ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ప్రపంచ వ్యాప్తంగా పరుగులు చేశాడు. దీన్ని బట్టి చూస్తే అతని తాజా వైఫల్యం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2013 డిసెంబర్లో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత 2014, 15, 16, 17 సంవత్సరాలలో కలిపి అతను 59.49 సగటుతో 3250 పరుగులు సాధించాడు. ఇలాంటి ఫామ్తో సఫారీ గడ్డపైకి వచ్చిన అతను అనూహ్యంగా విఫలమయ్యాడు. ఇక్కడ మాత్రమే... రోహిత్ భారత్లో మాత్రమే బాగా ఆడతాడనే విమర్శలో కూడా వాస్తవం లేదు. ఆస్ట్రేలియా గడ్డపై అతను నాలుగు సెంచరీలు సహా 51.95 సగటుతో పరుగులు చేయగా, ఇంగ్లండ్ మైదానాల్లో కూడా 53.30 సగటుతో పరుగులు రాబట్టాడు. న్యూజిలాండ్ పిచ్లపై కూడా ఎనిమిది ఇన్నింగ్స్లలో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికాకు వచ్చే సరికి మాత్రం అతని ఆట గతి తప్పుతోంది. దీనిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ కెప్టెన్ వెసెల్స్ ... ‘రోహిత్ ఫుట్వర్క్లోనే సమస్య ఉంది. దక్షిణాఫ్రికాలో సహజంగానే వేగం, బౌన్స్ కలగలిసి బంతులు వస్తాయి. ఆఫ్సైడ్ వైపు జరిగి ఆడేటప్పుడు అతని స్టాన్స్ సరిగా ఉండటం లేదు. దాని వల్లే అతను విఫలమవుతున్నాడు. ఆస్ట్రేలియాలో బౌన్స్ మాత్రమే ఉంటుంది. దానికి తగినట్లుగా బ్యాట్స్మెన్ తనను తాను మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ బౌన్స్కు పేస్ తోడైతే కష్టం’ అని విశ్లేషించారు. మరోవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో ఇటీవల చాలా వరకు పిచ్లు పూర్తి స్థాయిలో బ్యాటింగ్కు అనుకూలంగా మారిపోగా, సౌతాఫ్రికాలో ఇంకా అలాంటి పరిస్థితి లేకపోవడం కూడా రోహిత్కు ప్రతికూలంగా మారిందనేది మరో రకమైన విశ్లేషణ. నేర్చుకుంటాడా! తాజా సిరీస్లో అతను నాలుగు సార్లు ఔటైన తీరు చూస్తే రోహిత్ ఒకే తరహాలో ఔటవుతున్నాడని కూడా చెప్పలేం. మొదటి రెండు వన్డేల్లో షార్ట్ పిచ్ బంతులను హుక్ చేయబోయి అతను వెనుదిరిగాడు. బౌన్స్ తక్కువగా ఉండే పిచ్లపై అతని షాట్ భారీ సిక్సర్గా మారేదేమో గానీ ఇక్కడ కాదు. మూడో వన్డేలో వేగంగా దూసుకొచ్చిన ఇన్స్వింగర్ రోహిత్ పాత సమస్యను బయట పెట్టింది. ఆ బంతిని ఆడాలా వద్దా తేల్చుకునే లోపే బ్యాట్కు తగిలి కీపర్ చేతుల్లో పడింది. నిజానికి ఇదే బలహీనత అతడిని టెస్టులకు పనికి రాకుండా చేసింది. శనివారం వన్డేలో సమర్థంగా డిఫెన్స్ ఆడలేక రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. వన్డేల్లో అత్యద్భుత రికార్డులు తన పేరిట ఉన్నా టెక్నిక్ పరంగా రోహిత్లో చాలా సమస్యలు ఉన్నాయనేది వాస్తవం. చీఫ్ కోచ్గా రవిశాస్త్రి పాత్ర గురించి చెప్పలేం కానీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఇలాంటి లోపాలను సరిదిద్దడంలో సిద్ధహస్తుడు. కాబట్టి దానిపై దృష్టి పెడితే తనేంటో చూపించుకునేందుకు రోహిత్కు మరో రెండు వన్డేలు ఉన్నాయి. ఓవరాల్గా దక్షిణాఫ్రికాలో రోహిత్ శర్మ 11 వన్డే ఇన్నింగ్స్లలో కలిపి 126 పరుగులే చేయగలిగాడు. సగటు 11.45 కాగా అత్యధిక స్కోరు 23 మాత్రమే. -
‘యాంటీ బయాటిక్’ బాంబు!
లండన్: బహుళజాతి ఫార్మాసూటికల్ సంస్థలు ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే మిలియన్ల కొద్దీ యాంటీ బయాటిక్స్ను భారత్లో అమ్ముతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. వీటిని విచ్చలవిడిగా వాడటం ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు యాంటి బయాటిక్స్ను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని బ్రిటన్లోని క్వీన్ మేరీ వర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకులు తెలిపారు. బహుళజాతి ఫార్మా కంపెనీలు భారత్లో ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్ను ఉత్పత్తి చేయకుండా నిలువరించడంలో ఔషధ నియంత్రణ సంస్థలు విఫలమయ్యాయన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా 2007 నుంచి 2012 వరకూ భారత ఔషధ నియంత్రణ సంస్థ రికార్డులతో పాటు దేశవ్యాప్తంగా యాంటీ బయాటిక్స్ అమ్మకాల వివరాలను సేకరించినట్లు పరిశోధనలో పాల్గొన్న మెక్గెట్టిగన్ తెలిపారు. భారత్లో 118 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్డీసీ)ను అమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ సంఖ్య అమెరికా, బ్రిటన్లలో కేవలం ఐదుగానే ఉందన్నారు. మొత్తం 118 రకాల ఎఫ్డీసీల్లో 63 శాతం డ్రగ్స్ను ఎలాంటి అనుమతులు లేకుండానే భారత్లో అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా మొత్తం 86 సింగిల్ డ్రగ్ ఫార్ములేషన్(ఎస్డీఎఫ్)ల్లో 93 శాతం మందులకు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఉందన్నారు. -
ఏదో అనుకుంటే..
-
హామీలు అమలు చేయడంలో విఫలం
రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ ఒంగోలు టౌన్ : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ఎన్నికల సమయంలో రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ ధ్వజమెత్తారు. రైతు కూలీల సమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఈమనిపాలెంలో నిర్మించిన జిల్లా రైతు కూలీ సంఘం (తరిమెల నాగిరెడ్డి) భవనాన్ని ఆదివారం ఆమె ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఏఐఎఫ్టీయూ(న్యూ) నాయకుడు డీవీఎన్ స్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టసభలను, ఎన్నికలను కూడా పోరాట వేదికలుగా ఉపయోగించుకున్న మార్కిస్టు, లెనినిస్టు మేధావిగా నాగిరెడ్డి చరిత్రలో నిలిచిపోయారన్నారు. తరిమెల నాగిరెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన రైతు కూలీ సంఘం కేంద్రాలు ప్రతి పట్టణంలో ఏర్పాటు కావాలని ఏఐఎఫ్టీయూ(న్యూ) జాతీయ అ«ధ్యక్షుడు గుర్రం విజయకుమార్ పిలుపునిచ్చారు. ప్రజాతంత్ర, హేతువాద భావజాలాలను పెంపొందించే కేంద్రంగా విరజిల్లాలన్నారు. రాష్ట్రంలోని టీడీపీ పోలవరం ప్రాజెక్టు పరిధిలో అర్హులైన పేదలకు నష్టపరిహారం ఇవ్వకుండా భూస్వాములకు ఇస్తుందని విమర్శించారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలితకుమారి మాట్లాడుతూ జిల్లాలోని రైతులు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, చిన్నతరహా గ్రానైట్ పరిశ్రమల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యర్రంనేని కోటేశ్వరరావు, భవన నిర్మాణ కమిటీ నాయకుడు పంగులూరి గోవిందయ్య, జిల్లా అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చుండూరి రంగారావు, సుపరిపాలన వేదిక నాయకులు టీ గోపాల్రెడ్డి, షంషీర్అహ్మద్, సీపీఎం జిల్లా కార్యదర్శి జాలా అంజయ్య, సీపీఐ నాయకుడు ఉప్పుటూరి ప్రకాశరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎంఎల్) నాయకుడు కొంగర నరసింహం తదితరులు పాల్గొన్నారు. -
అన్న రిక్త హస్తం
ఆసక్తి చూపని బాలింతలు, గర్భిణులు అమలు చేయలేమంటున్న అంగన్వాడీలు ఆలమూరు : అన్న అమృత హస్తం పథకం అన్న రిక్తహస్తంగా మారింది. ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా అమల్లోకి తీసుకురావడంతో జిల్లాలో ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదు. జిల్లాలోని కొన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టులతో అన్న అమృత హస్తం అరకొరగా అమలు చేస్తుంటే మరికొన్ని ప్రాజెక్టుల్లో సౌకర్యాలు లేవంటూ పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఈ పథకంపై సరైన పర్యవేక్షణ లేకపోవడమూ నిరాదరణకు కారణమైంది. ప్రభుత్వానికి సరిౖయెన ప్రణాళిక లేకపోవడం, కనీస వసతుల లేమి, అధికారుల నిర్లిప్తత వల్ల పథకం ప్రారంభించిన నెలరోజులకే అభాసుపాలైంది. అంగన్వాడీ కేంద్రాల వద్ద వండించిన నాసిరకం సరకులతో తయారు చేసిన పౌష్టికాహారాన్ని తినలేమని మహిళలు చెప్తున్నారు. జూలై ఒకటిన అట్టహాసంగా ప్రారంభమైన పథకం అంతలోనే విఫలమైంది. జిల్లాలో 28 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా 5546 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 3.46 లక్షల మంది చిన్నారులు, 33,184 మంది బాలింతలు, 39,657 మంది గర్భిణులు ఉన్నారు. తొలి రోజు ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో గర్భిణులు, బాలింతలు ఆ మరుసటి రోజు నుంచి రావడం, తినడం మానేశారు. ఈ పరిస్థితిపై ఐసీడీఎస్ ఆందోళనలో పడింది. ఎలా వండాలి–ఎలా భుజించాలి? సుదూర ప్రాంతాల్లో ఉండే అంగన్వాడీ కేంద్రాలకు ప్రతి రోజు నడిచి వెళ్లి అక్కడ ఆహారాన్ని భుజించలేమని గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు చెబుతున్నారు. అయితే బాలింతలు కూడా నాసిరకమైన ముతక బియ్యం, వంటనూనెలతో వండుతున్న అహారం తినలేమంటున్నారు. అంగన్వాడీల సహాయ నిరాకరణ జిల్లాలోని అంగన్వాడీలు ఈ పథకం అమలులో సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 15 సెక్టార్ల పరిధిలోని అంగన్వాడీలు తమకు కనీస సౌకర్యాలు, నిధులు మంజూరు చేయకుండా విధి విధానాలు ఖరారు కాకుండా పథకాన్ని కొనసాగించలేమంటూ నిస్సహాయత వ్యక్తంచేస్తున్నారు. వంట పాత్రలు, గ్యాస్ కనెక్షన్, గ్లాసులు, ప్లేట్లు లేకుండా పథకాన్ని అమలు చేయలేమంటూ తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఇదే డిమాండుతో కలెక్టరేట్, ఐసీడీఎస్ ప్రాజెక్టులను మట్టడించినా ఫలితం లేకపోయింది. రేషన్ లేదు–పౌష్టికాహారం లేదు అన్న అమృత హస్తం పథకం కింద కొన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టులతో పౌష్టికాహార పంపిణీ అమలు చేయడం కాని, రేషన్ సరకుల పంపిణీ కాని జరగడం లేదు. దీనిపై ఐసీడీఎస్ శాఖ ఏవిధమైన చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండటం వల్ల లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆయా ప్రాజెక్టుల్లో అన్న అమృత హస్తం అమలులోని కేంద్రాల్లో రేషన్ పంపిణీకి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా ప్రభుత్వం సత్వరమే స్పందించి గతంలో మాదిరిగా రేషన్ను పంపిణీ చేయాలని బాలింతలు, గర్భిణులు కోరుతున్నారు. సౌకర్యాలు కల్పించాకే అమలు చేస్తాం అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు అమలు చేస్తే అన్న అమృత హస్తం పథకాన్ని అమలు చేసేందుకు ఇబ్బంది లేదు. బాలింతలు, గర్భిణులకు ముందుగా ఈ పథకంపై అవగాహన కల్పించి పౌష్టికాహారానికి అవసరమైన సరుకులను సమకూర్చాలి. యు.సుశీల, మండల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అధ్యక్షురాలు, ఆలమూరు. సమర్థంగా అమలు చేస్తాం అన్న అమృత హస్తం పథకం సక్రమంగా అమలయ్యేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో తగిన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నాం. జిల్లాలో కొన్నిచోట్ల పథకం అమలు కాని విషయం దృష్టికి వచ్చింది. అలాంటి చోట్ల తప్పని పరిస్థితుల్లో రేషన్ పంపిణీకి చర్యలు చేపడతాం. తొలి వారంలో అన్ని ప్రాజెక్టుల అధికారులు, యూనియన్లతో సమావేశం నిర్వహిస్తాం టి.శారదాదేవి, ఐసీడీఎస్ పీడీ, కాకినాడ -
వండి వార్చింది.. ఒక్క రోజే..
-అసలుకే ఎసరు - ఆరంభ శూరత్వంగా ‘అన్న అమృతహస్తం’ - రెండు వారాలుగా అందని పౌష్టికాహారం - గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఇక్కట్లు - రూ.23.6 కోట్ల బిల్లులు చెల్లించని సర్కారు - ఇలాగైతే వండి పెట్టేదెలాగని ప్రశ్నిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు - ఏదోలా వండాలంటున్న అధికారులు ‘అన్న అమృతహస్తం’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అసలుకే ఎసరు పెట్టినట్టుంది. ఇప్పటివరకూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నేరుగా ఇళ్లకే పోషకాహార దినుసులను అందించేవారు. వాటిని వారు ఇళ్లవద్దనే వండుకొని తినేవారు. ‘అన్న అమృతహస్తం’ పథకం ఆరంభించాక ఇళ్లకు కాకుండా.. ఆయా అంగన్వాడీ కేంద్రాల్లోనే పౌష్టికాహారం వండి వారికి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపింది. ఫలితంగా అటు ఇళ్లకు పోషకాహార దినుసులు రాక.. ఇటు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందక.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కట్లు పడుతున్నారు. మండపేట : ‘అన్న అమృతహస్తం’ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ఇచే్చందుకు ఉద్దేశించిన ఈ పథకం ఒక్క రోజుతోనే ముగిసిపోయి ఆరంభశూరత్వంగా మిగిలింది. ‘వండి పెట్టేందుకు గిన్నెలు లేవు. కూరగాయలు కొనేందుకు డబ్బులు లేవు. పాత బిల్లుల విడుదల లేదు. ఇలాగైతే ఎలా వండిపెట్టేది?’ అని అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.23.6 కోట్ల మేర బిల్లు బకాయిలున్నట్టు వారు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ పథకాన్ని అట్టహాసంగా పథకాన్ని ప్రారంభించిన పాలకులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పథకం అమలు మాట ఎలా ఉన్నా నెలవారీ ఇచ్చే పౌష్టికాహారం పంపిణీకే ప్రభుత్వం ఎసరు పెట్టిందని లబ్ధిదారులు మండిపడుతున్నారు. హడావుడి.. ఒక్క రోజుతో సరి! జిల్లాలో 5,546 అంగన్వాడీ కేంద్రాలుండగా.. వీటిలో 3,46,876 మంది చిన్నారులు, గర్భిణులు 38,281 మంది, బాలింతలు 35,563 మంది ఉన్నారు. చిన్నారులకు కేంద్రాల్లోనే పౌష్టికాహారం అందిస్తుండగా, గర్భిణులు, బాలింతలకు వారానికి నాలుగు గుడ్లు, నెలకు మూడు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, అరలీటరు నూనె చొప్పున ఇప్పటివరకూ పంపిణీ చేసేవారు. ఆ దినుసులను రెండు మూడు రోజుల్లోనే కుటుంబమంతా వినియోగించేస్తున్నారని, ఫలితంగా బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందడం లేదన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో వారికి అంగన్వాడీ కేంద్రాల్లోనే వండి పెట్టాలని, అదనంగా పాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 28 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా, ఇప్పటికే ఏజెన్సీ పరిధిలోని ఎనిమిది ప్రాజెక్టులతో పాటు కోరుకొండ, శంఖవరం, తుని ప్రాజెక్టుల పరిధిలో ఈ విధానం అమలులో ఉంది. దీనినే ఈ నెల 1 నుంచి ‘అన్న అమృతహస్తం’ పేరిట కాకినాడ, రాజమహేంద్రవరం, తాళ్లరేవు, కపిలేశ్వరపురం, కోనసీమ తదితర ప్రాంతాల్లోని 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 3,934 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని 30,304 మంది గర్భిణులు, 25,331 మంది బాలింతలకు ఈ పథకం కింద పౌష్టికాహారం అందించనున్నట్టు పాలకులు ప్రకటించారు. ప్రతి రోజూ అన్నం, గుడ్డు, పాలతోపాటు వారంలో రెండు రోజులు పప్పు, కాయగూరలతో కూర, రెండు రోజులు కాయగూరలతో సాంబారు, రెండు రోజులు ఆకుకూర పప్పు వండి పెడతామని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ పథకం అమలుకు అవసరమైన వంట సామగ్రి, కిరాణా, కూరగాయలు, గ్యాస్, గర్భిణులు, బాలింతలు కూర్చుకునేందుకు వీలుగా కుర్చీలు, టేబుళ్లు తదితర వాటిని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందజేయలేదు. పైగా నిధులు కూడా కేటాయించ లేదు. పథకం ప్రారంభం సందర్భంగా అధికారుల ఒత్తిళ్లతో తొలి రోజు సొంత ఖర్చులతో వండి పెట్టిన అంగన్వాడీ కార్యకర్తలు మరుసటి రోజే చేతులెత్తేశారు. దీంతో అధిక శాతం కేంద్రాల్లో ఈ పథకం అమలు ఒక్క రోజుకే పరిమితమైంది. అంగన్వాడీలకు అన్నీ బకాయిలే.. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రభుత్వం రెండు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు. జిల్లాలో ఈ బకాయి సుమారు రూ.12 కోట్లు ఉంది. దీనికితోడు అంగన్వాడీ కేంద్రాల అద్దె బకాయిలు దాదాపు రూ.1.8 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. మరోపక్క చిన్నారులకు వండుతున్న పౌష్టికాహారానికిగాను కార్యకర్తలకు దాదాపు రూ.9.8 కోట్ల మేర ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సి ఉంది. మొత్తం అన్నీ కలిపితే బకాయిలు రూ.23.6 కోట్లకు చేరాయి. అయినప్పటికీ ఏదోవిధంగా వండి పెట్టాలంటూ అంగన్వాడీ కార్యకర్తలపై ప్రాజెక్టు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ఇప్పటికే పెట్టుబడులు పెట్టి అప్పుల పాలైపోయమని, ఆ బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించకపోతే కొత్తగా వండిపెట్టేదెలాగని అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. నిలిచిపోయిన రేషన్ పంపిణీ ప్రస్తుత పరిస్థితితో ప్రతి నెలా గర్భిణులు, బాలింతలకు ఇంటికి పంపిణీ చేసే రేషన్ సరఫరా నిలిచిపోయింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సరుకులను ఆయా కేంద్రాల్లోనే ఉంచాలని ప్రాజెక్టు అధికారులు చెబుతుండటంతో.. సరుకులు పంపిణీ చేయడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ‘అన్న అమృతహస్తం’ అమలుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో దూరంగా ఉన్న కేంద్రానికి ఆహారం కోసం గర్భిణులు, బాలింతలు ఎంతవరకూ వస్తారన్నది ప్రశ్నార్థకంగా తయారైంది. సాధారణంగా బాలింతలకు పాత బియ్యంతో అన్నం, గానుగ నూనెతో కూరలు వండుతుంటారు. కాగా కేంద్రాల్లో వంటకు మామూలు బియ్యం, పామాయిల్ నూనె వినియోగిస్తుంటారు. దీనిని బాలింతలు ఎంతవరకు తింటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాత బిల్లులు విడుదల చేయాలి అద్దెలు, జీతాలు, కూరగాయలు, ఇతర ఖర్చులకు సంబంధించి సుమారు రూ.23.6 కోట్ల మేర బకాయిలు విడుదల కావాల్సి ఉంది. వాటిని విడుదల చేయకుండా ఏదోవిధంగా వండి పెట్టాలంటూ అధికారులు ఒత్తిడి చేయడం సరికాదు. - కె.కృష్ణవేణి, జిల్లా కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సదుపాయాలు కల్పించాలి ఇప్పటికే పాత బిల్లులు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం వండి పెట్టేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. వంట సామగ్రి, కూరగాయలను కేంద్రాలకు అందజేయాలి. - రాణి, అంగన్వాడీ కార్యకర్త -
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
21న జిల్లా ప్లీనరీని విజయవంతం చేయండి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు శంకరనారాయణ మడకశిర : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ విమర్శించారు. ఆయన బుధవారం మడకశిరకు వచ్చిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. రైతులు, మహిళలు, పేదలు, విద్యార్థులు తదితర అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదన్నారు. అనంతపురంలో ఈనెల 21న నిర్వహించనున్న వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీ సమావేశంలో జిల్లా సమస్యలతోపాటు ప్రజలు పడుతున్న ఇబ్బందులపైనా లోతుగా చర్చిస్తామన్నారు. ప్రధాన సమస్యలపై ఈ ప్లీనరీలో తీర్మానాలు చేసి రాష్ట్ర పార్టీకి పంపనున్నట్లు తెలిపారు. ఈ ప్లీనరీ సమావేశాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన నియోజకవర్గ ప్లీనరీలు విజయవంతమయ్యాయని, విశేష స్పందన లభించిందని చెప్పారు. పార్టీ కార్యక్రమాలను వైఎస్సార్సీపీ శ్రేణులు కలిసికట్టుగా ఉండి ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మడకశిర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామికి సహాయ సహకారాలు అందించి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏడీసీసీ బ్యాంక్ ఉపాధ్యక్షుడు ఆనంద రంగారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖర్రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ఎస్ఆర్ అంజినరెడ్డి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు అనంతరాజు, సోమనాథ్రెడ్డి, ఉగ్రప్ప, మడకశిర మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ ఈచలడ్డి హనుమంతరాయప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఫెయిల్యూరా.. ఫీలవ్వొద్దు..
చరిత్ర ఎప్పుడూ విజేతలనే గుర్తుపెట్టుకుంటుంది.. పరాజితులను పట్టించుకునేవారెవరు? మేం పట్టించుకుంటాం అని అంటున్నారు శామ్యూల్ వెస్ట్. శామ్యూల్ ఓ సైకాలజిస్ట్. ఒక కొత్త ఆవిష్కరణ వెనుక వందలాది విఫలయత్నాలు ఉంటాయని చెబుతున్న శామ్యూల్.. ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీల కోసం ఓ మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నాడు. వచ్చే నెలలో స్వీడన్లో ‘మ్యూజియమ్ ఆఫ్ ఫెయిల్యూర్స్’ ప్రారంభమవనుంది. గత ఏడేళ్లుగా జయాపజయాలు.. వాటి గురించి జనం ఏమనుకుంటున్నారు? అనే అంశంపై శామ్యూల్ పరిశోధన చేశారు. ‘ఏదైనా కొత్త విషయం ఆవిష్కృతమయ్యే ముందు.. దానికి సంబంధించి 80 నుంచి 90 శాతం ప్రాజెక్టులు ఫెయిలవుతుంటాయి. ప్రతి విజయం వెనుక ఓ అపజయం ఉంటుందని తెలియజెప్పడానికే ఈ మ్యూజియం. అపజయం అంటూ భయపడితే.. నువ్వు కొత్త చరిత్రను సృష్టించలేవు’ అని శామ్యూల్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఫెయిలయిన 60 ఉత్పత్తులు, సేవల వివరాలను ఈ మ్యూజియంలో ఉంచుతారు. ఈ విఫల ఉత్పత్తుల్లో కోకోకోలా తెచ్చిన కాఫీ ఫ్లేవర్డ్ డ్రింక్, టూత్పేస్ట్ కంపెనీ కోల్గేట్ తెచ్చిన ఆహార ఉత్పత్తులు, హార్లే డేవిడ్సన్ పర్ఫ్యూమ్, మొబైల్ కమ్ గేమింగ్ కోసం నోకియా తెచ్చిన ఎన్గేజ్ వంటివి ఉన్నాయి. -
నిలదీతలు.. నిరసనలు..
‘జన్మభూమి’లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు తప్పని సెగ జనం ప్రశ్నలకు జవాబివ్వలేక సభల నుంచి నిష్క్రమణ కొన్ని చోట్ల తూతూమంత్రంగానే కార్యక్రమం నిర్వహణ సాక్షి ప్రతినిధి, కాకినాడ :నాలుగో విడత జన్మభూమి గ్రామసభలు అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి. ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలాయనమంత్రం పఠిస్తున్నారు. కొన్ని సభల్లో పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, అధికారపార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భర్తలు పెత్తనం చెలాయిస్తున్న తీరుతో విస్తుపోవడం అధికారుల వంతవుతోంది. కొందరు ఎమ్మెల్యేలైతే నిలదీసే జనాన్ని సమాధానపరచలేక, సొంత పార్టీ నేతల మధ్య అంతర్గత పోరుతో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించ లేక ప్రతిపక్షంపై అవాకులుచెవాకులు పేలుతూ సభలను మమ అనిపించేస్తున్నారు. రాజానగరంలో బుధవారం జరిగిన జన్మభూమి గ్రామభలో అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జనిపెళ్ళ సత్తిబాబు ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఆందోళన చేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నివాసం ఉంటున్నవారికి జీఓ 270 ప్రకారం నామమాత్రపు ధరకు ఇవ్వాలని కోరారు. సమాధానం చెప్పాల్సిన ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తగు విధంగా స్పందించకపోవడంతో స్థానికులు మీ ప్రభుత్వం ఇచ్చిన జీవోనే అమలు చేయమంటున్నామని నిలదీశారు. అధికారులతో మాట్లాడి చెపుతానంటూ ఎమ్మెల్యే వెళ్లి పోబోగా అడ్డగించిన జనం రెండున్నరేళ్లయినా ఇళ్ల పట్టా హామీ అమలు చేయలేదని నిలదీశారు. ‘మరో రెండేళ్లు ఉంటాను. అప్పుడు చూద్దా’మంటూ ఎమ్మెల్యే నిష్క్రమించారు. ‘సాక్షి’పై అయితాబత్తుల అక్కసు అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం గోపవరం జన్మభూమిలో అక్కడి అధికారపారీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు జన్మభూమిలో వచ్చిన సమస్యల పరిష్కారం కంటే మంగళవారం సన్నవిల్లిలో జరిగిన వివాదాన్ని ప్రజల ముందుంచిన ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కేందుకే ప్రాధాన్యమిచ్చారు.ఇది చూసి విస్తుపోవడం జనం వంతైంది. సహనం కోల్పోయి తిట్లపురాణం అందుకున్న ఎమ్మెల్యే ‘సాక్షి’లో ప్రచురితమైన సన్నవిల్లి, నంగవరం గ్రామాల నేతల మధ్య వివాదాన్ని చివరకు రాజీ చేయడం కొసమెరుపు. ముమ్మిడివరంలో పార్టీ సభలా.. ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం పాత ఇంజరం జన్మభూమి గ్రామ సభకు అక్కడి అధికారపార్టీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు హాజరు కాలేదు. ఆయన స్థానే అధికారపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద హాజరవడమే కాక ఆధ్వర్యం కూడా వహించడం ద్వారా జన్మభూమి సభను టీడీపీ సభగా మార్చేశారు. పింఛన్లు, రేషన్కార్డులు అనర్హులకు కేటాయించడంపై స్థానికులు సభను అడ్డుకుని ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జన్మభూమి నిర్వహించడమేమిటని జనం ముక్కున వేలేసుకున్నారు. చివరకు రేషన్కార్డులు ఇవ్వకుండానే అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది. దాదాపు ఇదే పరిస్థితి ఏజెన్సీలోని చింతూరు మండలం మోతుగూడెం జన్మభూమి సభలో కనిపించింది. అక్కడ జన్మభూమి కమిటీ సభ్యులు వేదిక అలంకరించడంపై సర్పంచ్ ఆకేటి సీత ఎంపీడీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా, టీడీపీ కార్యక్రమమా అని నిరసన తెలియచేసి జెడ్పీటీసీ సోయం అరుణతో కలసి కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఐటీడీఏ పీవో చినబాబు వారిని సముదాయించి జన్మభూమి కమిటీ సభ్యులను వేదికకు దూరంగా కూర్చోబెట్టడంతో కార్యక్రమం కొనసాగింది. పోలీసుల పహరా మధ్య.. ఎటపాక మండలం చోడవరం, రాయనపేట పంచాయతీల్లో గ్రామసభలు పోలీసుల పహరా నడుమ నిర్వహించారు. స్థానికులు సమస్యలపై నిలదీస్తారని పోలీసులు మోహరించారు. అనుకున్నట్టే గత జన్మభూమి సమస్యలు పరిష్కరించక పోవడంపై స్థానికులు నిలదీశారు. కూనవరం మండలం కరకగూడెంలో అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నా పింఛన్లు మంజూరు కాలేదని, ఏడాది క్రితం దరఖాస్తు చేసినా రేషన్కార్డులు ఇవ్వకపోవడంపై అధికారులను నిలదీశారు. రాజవొమ్మంగి మండలం వంతంగిలో జన్మభూమిని వాల్మీకిలు అడ్డుకున్నారు. గతంలో ఇచ్చే కులధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎస్టీలు కాదంటూ వారికి ఎల్ఈడీ బల్బులు కూడా ఇవ్వని విషయం ప్రస్తావించి నిలదీశారు. తహసీల్దార్ పద్మావతి, అధికారులను ఊరి పొలిమేరలోనే గిరిజనులు ఆపేశారు. ట్రాక్టర్, మోటారు సైకిళ్లు అడ్డుపెట్టి మరీ నిరసన వ్యక్తం చేశారు. ఈ రకంగా ప్రతి జన్మభూమిసభలో ప్రజాగ్రహంతో అధికారపార్టీకి చెమటలు పడుతున్నాయి. -
ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతాం
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి కర్నూలు (ఓల్డ్సిటీ): గ్రామాల్లో తిరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కళావెంకట్రావ్ భవనంలో డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో జాతీయ ఆహార భద్రత పథకం ప్రవేశపెట్టిందని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆ పథకాన్ని ఏర్పాటు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. పెద్దనోట్లు రద్దు చేసి సామాన్య ప్రజలను కష్టనష్టాలకు గురి చేశారన్నారు. బీజేపీ, టీడీపీలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. కా -
దిశ మారిన డిమానిటైజేషన్
-
వైద్యం వికటించి బాలుడి మృతి
మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన రౌతులపూడి : రౌతులపూడిలో విజయ ప్రైవేటు ఆసుపత్రిలో మూడురోజులుగా చికిత్సపొందుతున్న బలరామపురానికి చెందిన బొప్పన శ్రీరామత్రినా«థ్(3) బాలుడు వైద్యం వికటించటంతో గురువారం మృతిచెందాడని బంధువులో ఆరోపించారు. ఈ మేరకు మృతిని తల్లిదండ్రులు బొప్పన వీరవెంకటనాగ సత్యనారాయణ, దుర్గాదేవి దంపతులు, వారి కుటంబసభ్యులతో కలిసిచిన్నారి మృతదేహంతో ఆస్పత్రి ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. మృతిని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని బలరామపురం గ్రామానికి చెందిన బొప్పన వీరవెంటకట నాగసత్యనారాయణ, దుర్గాదేవి దంపతుల ఏకైక కుమారుడు శ్రీరామత్రినా«థ్. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో కుక్కర్లో మరుగుతున్న పాలు బాలుడిపై ఒలిగిపోయాయి. శరీరమంతా గాయమై పిల్లాడు గుక్కపెట్టి యడవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రౌతులపూడిలోని విజయక్లినిక్ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలోని వైద్యుడు కె.విజయ్కుమార్(అబ్బులు) బాలుడుకి పరీక్షలు నిర్వహించి మూడురోజుల్లో గాయాలు తగ్గిపోతాయని చెప్పి, చికిత్స ప్రారంభిచారు. బుధవారం బాలుడు పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇక్కడ నయం కాకపోతే చెప్పండి వేరే ఆసుపత్రికి తీసుకెళతామని వైద్యుడిని అడిగారు. ఏం పర్వాలేదు నేను బాగుచేస్తానని చెప్పడంతో వారు ఊరట చెందారు. బుధవారం రాత్రి చనిపోయిన బాలుడిని గురువారం తెల్లవారుజామున ఐదుగంటలకు బాలుడు కోమాలోకి వెళ్లిపోయాడు వెంటనే వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని బంధువులకు, ఇతర కుటుంబ సభ్యులకు వైద్యుడు విజయకుమార్ సూచించారు. దీంతో ఆందోళన చెందిన వారు తునిలోని ఒక ప్రైవేట్ ఆప్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు బాలుడిని పరీక్షించి మృతిచెంది చాలా సమయమైందని తెలిపారు. దీంతో కంగుతిన్న కుటుంబ సభ్యులు రౌతులపూడి సినిమాసెంటర్లో ఉన్న ఆస్పత్రి ఎదుట బాలుడి మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దారు వీరేష్, వీఆర్వో నాగు ఘటన స్థలానికి వచ్చి విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారమిస్తామని బంధువులు తెలిపారు. -
చంద్రబాబు పతనం ఆరంభమైంది
దమ్ముంటే ఏలేరు ఆధునికీకరణకు రూ.100 కోట్లు విడుదల చేయండి ఆర్బీ కొత్తూరు సభలో జక్కంపూడి రాజా ఆర్బీ కొత్తూరు(పెద్దాపురం) : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పతనం ఆరంభమైందని వైఎస్సార్ సీసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. పెద్దాపురం మండలం ఆర్బీ కొత్తూరులో గురువారం నిర్వహించిన గడపగడపకు వైఎస్సార్ సీపీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సభలో రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పతనమవుతుందని చెప్పడానికి ఈ గ్రామానికి చేరువలో ఉన్న మధురపూడి గ్రామమేనన్నారు. చిన్న గ్రామం నుంచి ఆరంభమైన పార్టీ పతనం రాష్ట్రస్థాయికి చేరుకుని దేశం పార్టీ ఖతమ్ కావడం తథ్యమన్నారు. ఏలేరు ఆధునికీకరణకు కోట్లు ఖర్చుపెడుతున్నామని చెప్పి, మంజూరు చేసిన రూ.100 కోట్లు విడుదల చేసి చూపించాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని చెబుతూ కనీసం చాగల్నాడు, ఏలేరు, వెంకటనగరం వంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోతున్నారని రాజా అన్నారు. సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణ చూడలేక చంద్రబాబు కుటిల ప్రయత్నాలు సాగిస్తున్నారని, అయినా ప్రజల్లో వైఎస్సార్ పార్టీ దూసుకుపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. అనంతరం గ్రామ నాయకులు పల్లా శ్రీనివాస్ యాదవ్, వల్లూరి కుట్టయ్యచౌదరి, రెడ్డి జయబాబు, పాము గోవిందుల ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళలు పార్టీలో చేరారు. వారికి జక్కంపూడి రాజా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్సీపీ నాయకులు ఆవాల లక్ష్మినారాయణ, జిగిని వీరభద్రరావు, యినకొండ వీరవిష్ణుచక్రం, ఆదారపురెడ్డి శ్రీనివాస్ (బ్రహ్మనాయుడు), జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బంగారు కృష్ణ, మాజీ ఎంపీపీ మేడిశెట్టి భద్రం, గవరసాని సూరిబాబు, గోపు సత్యకృష్ణ (మురళి), ఘంటా వీర్రారజు(శేషు), గంపా శివ, డేగల భాస్కరరావు, నల్లల గోవిందు, పెదిరెడ్ల రామకృష్ణ, రమేష్రెడ్ది, ఏలేటి రాజేంద్రప్రసాద్, మామిడి ఈశ్వరరావు, కొండేపూడి రవిబాబు (లంబూ), గుర్రాల యాకోబ్బాబు, నరాలశెట్టి త్రినాద్, గొందేశి భద్రరావు, పలువురు మహిళలు పాల్గొన్నారు. -
డెంగీ పంజా!
* జిల్లాలో 15 మంది మృత్యువాత * జ్వరపీడితులతో ఆస్పత్రులు కిటకిట * గుంటూరు జీజీహెచ్లో ఒక్కరోజే 11 డెంగీ పాజిటివ్ కేసులు * దోమలపై దండయాత్ర ఆర్భాటమేనా! డెంగీ మహమ్మారి దెబ్బకు జిల్లావాసులు విలవిల్లాడుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో జనం విషజ్వరాలతో బాధపడుతూ మంచాలపై మూలుగుతున్నారు. మీరెన్ని దండయాత్రలైనా చేసుకోండి... మా పని మేము కాని చేస్తామన్న రీతిలో దోమల దండు విజృంభిస్తోంది. జిల్లాలో డెంగీ బారిన పడి ఇప్పటివరకు సుమారు 15 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. సాక్షి, గుంటూరు : రోజురోజుకూ పెరుగుతున్న డెంగీ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు 11,078 మంది జ్వర పీడితులకు రక్తపరీక్షలు చేయగా.. 1,546 మందికి డెంగీ పాజిటివ్ ఉన్నట్లు నిర్థారించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న మెడాల్ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రభుత్వానికి అధికారికంగా ఇచ్చిన నివేదిక ఇది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఈ ఏడాది జనవరి నుంచి నేటివరకు 175 డెంగీ కేసులు, 269 మలేరియా కేసులు మాత్రమే నమోదైనట్లు కాకి లెక్కలు చెబుతున్నారు. జిల్లాలో 169 హైరిస్క్ ప్రాంతాలను ప్రకటించినప్పటికీ డెంగీ ప్రబలకుండా తగు నివారణ చర్యలు చేపట్టడంలో వైద్య శాఖ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో ఈ నెల 15వతేదీన 40 మంది జ్వరంతో బాధపడుతూ ఆపత్రిలో చేరగా.. 22 మందికి డెంగీ ఉన్నట్లు అనుమానించారు. వీరిలో 11 మందికి డెంగీ పాజిటివ్ ఉందని ధ్రువీకరించారు. 16న 11 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎంఈకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఒక్క జీజీ హెచ్లోనే రోజుకు పదికి పైగా డెంగీ కేసులు నమోదవుతుంటే జిల్లా వ్యా ప్తంగా వీరి సంఖ్య ఏ స్థాయిలో ఉం టుందో అర్థం చేసుకోవచ్చు. డెంగీని నిర్థారించాలంటే గుంటూరు వైద్య కళాశాలలో ఉన్న మైక్రోబయాలజీ వార్డుకు సీరంను పంపి ఎలిసా పరీక్ష చేయాలి. ఈ తతంగమంతా పూర్తయి డెంగీ నిర్థారణ కావాలంటే వారానికి పైగా పడుతుండడంతో ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు ఈ ల్యాబ్కు సీరంను పంపేందుకు వెనుకాడుతున్నారు. అధ్వానంగా పారిశుద్ధ్యం.. జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు, గుంటూరు నగరంతో సహా అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమలపై దండయాత్ర పేరుతో హడావుడి చేయడం మినహా అధికారులు ఏమీ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డెంగీ, మలేరియా సంచార వాహనాల పేరుతో మొబైల్ వాహనాలను తిప్పుతున్నారు. కనీసం ఫాగింగ్ కూడా చేయకపోవడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. డెంగీతో చనిపోయింది ఇద్దరే.. జిల్లాలో 175 డెంగీ కేసులు, 269 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు డెంగీతో తాడేపల్లి, ఫణిదం గ్రామాల్లో ఇద్దరు మాత్రమే చనిపోయారు. మెడాల్ సంస్థ స్ట్రిప్ ఆధారంగా డెంగీ పాజిటివ్ కేసులు నిర్ధారించారు. ఎలిసా టెస్ట్ ద్వారా మాత్రమే డెంగీని పక్కాగా నిర్థారించవచ్చు. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో డెంగీ నివారణ చర్యలు చేపట్టాం. – డాక్టర్ పద్మజారాణి, డీఎంహెచ్వో -
హామీల అమలులో టీడీపీ విఫలం
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల నేతల ధ్వజం గుంటూరు (పట్నంబజారు): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరచలేని టీడీపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయటం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు ధ్వజమెత్తారు. అరండల్పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పార్టీ యువజన, సేవాదళ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వాణిజ్య విభాగాల జిల్లా అధ్యక్షులు వనమా బాలవజ్రబాబు, కొత్తా చిన్నపరెడ్డి, బండారు సాయిబాబు, మొగిలి మధు, కోవూరి సునీల్కుమార్, షఫాయితుల్లా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నేతలు సత్యాలు మాట్లాడాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు వ్యాఖ్యలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసత్యవాదులు ఎవరో ప్రజలకు బాగానే తెలుసన్నారు. అసత్యం, అబద్ధం, అవినీతి టీడీపీ మరో పేర్లని ఎద్దేవా చేశారు. 600 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయని టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీని విమర్శించటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. -
మీకు చేతకాక.. విమర్శలా?
– ఉమ, బుద్దాలపై విష్ణు ధ్వజం – కేవీపీ కృషితోనే హోదాపై కదలిక విజయవాడ : వారి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, బుద్దా వెంకన్నలు కేవీపీ రామచంద్రరావుపై విమర్శలు చేస్తున్నారని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు అన్నారు. శనివారం ఆంధ్రరత్నభవనంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు కేవీపీని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై కేవీపీ రాజ్యసభలో ప్రైవేటు బిల్లుగా ప్రవేశపెట్టాకే కదలిక వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు చేతకానివారని తేలిందన్నారు. కార్పొరేషన్కు బోగస్ అవార్డులు నగరం అనేక సమస్యలతో అల్లాడుతుంటే నగర పాలక సంస్థకు బోగస్ అవార్డులు తెచ్చి, లేనిపోని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఒక పక్క డంపింగ్ యార్డులేక ప్రజలు అగచాట్లు పడుతున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన నగర పాలక సంస్థ పాలకవర్గం తమ ౖÐð ఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై విమర్శలు చేయటం తగదన్నారు. కార్యక్రమంలో పీసీసీ నేత కొలనుకొండ శివాజీ పాల్గొన్నారు. -
జ్వరాల నియంత్రణలో ప్రభుత్వం విఫలం
వైఎస్సార్ సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ విజయవాడ (లబ్బీపేట) : రాష్ట్రంలో సీజనల్ వ్యాధులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ పేర్కొన్నారు. డెంగీ, విషజ్వరాలతో ప్రజలు మరణిస్తున్నా.. కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆయన బుధవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. జ్వరాల అదుపునకు క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాల్సి ఉండగా, దోమలపై యుద్ధం.. అంటూ ప్రచార కార్యక్రమాలకే పరిమితం కావడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో వేలాది మంది జ్వరపీడితులు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పలువురు మరణించారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని నగరమైన విజయవాడలోనే జ్వరం వస్తే నిర్ధారణ పరీక్షలు చేయలేని దుస్థితిలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. -
డెంగీ విజృంభణ
జిల్లాలో పెరుగుతున్న కేసులు పీడితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు ఇప్పటికే జిల్లాలో ఐదుగురు మృతి లెక్కలు తక్కువ చూపే యత్నాల్లో వైద్యాధికారులు జిల్లాలో 1586 డెంగీ పాజిటివ్ కేసులు జ్వరం.. జ్వరం.. జ్వరం.. నేడు ఎవరి నోట విన్నా పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఇదే మాట వినిపిస్తోంది. జిల్లా వాప్తంగా జనం విషజ్వరాలతో మంచం పడుతున్నారు. ప్రభుత్వ వైద్యాధికారుల నిర్లక్ష్యం, ప్రైవేటు ఆస్పత్రుల అడ్డగోలు దోపిడీతో జనం దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 1586 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్టు మెడాల్ హెల్త్కేర్ కంపెనీ ఇచ్చిన నివేదికలో స్పష్టం కావటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. సాక్షి, గుంటూరు : విషజ్వరాలు జిల్లాను వణికిస్తున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా జ్వరాలు అంతటా వ్యాపించాయి. జిల్లా వాప్తంగా అన్ని ప్రాంతాల్లో జనం విష జ్వరాల బారినపడి మంచాలపై మూలుగుతున్నారు. ఈ సీజన్లో జ్వరాలు రావడం సాధారణమైనప్పటికీ, డెంగీ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. జిల్లాలో ఇప్పటికే డెంగీ జ్వరంతో బాధపడుతూ ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. జిల్లాలో కేవలం ప్రభుత్వాస్పత్రుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 24 వరకు 11,078 మందికి నిర్వహించిన పరీక్షల్లో 1,586 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు నిర్ధారించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న మెడాల్ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రభుత్వానికి అధికారికంగా ఇచ్చిన నివేదిక ఇది. తప్పుదోవ పట్టించే యత్నం... డెంగీ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం లెక్కలు తక్కువ చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో ఈ నెల 12 నుంచి 23 వరకు కృష్ణా పుష్కరాలు జరగడంతో కృష్ణా నదిలో నీరు సైతం కలుషితమైంది. వైద్య శిబిరాల్లో చికిత్సలు పొందినవారిలో జ్వరపీడితులే అధికంగా ఉండటం గమనార్హం. గుంటూరు వైద్య కళాశాల మైక్రో బయాలజీ విభాగంలో ప్రభుత్వం తరఫున అధికారికంగా చేస్తున్న డెంగీ నిర్ధారణ పరీక్షల నివేదికలను బయటకు రానీయకుండా తొక్కిపెడుతూ జిల్లాలో డెంగీ కేసులు లేవంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఇచ్చే నివేదికల్లో సైతం డెంగీ కేసులను తక్కువ చేసి చూపి వారిని సైతం తప్పుదోవ పట్టించారు. జ్వరం మూడు రోజులకు మించితే... నేడు జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్లా విషజ్వరాల కేసులు ఉన్నాయి. ఈ జ్వరం మూడు రోజుల నుంచి వారం రోజులు ఉంటుంది. వారానికి మించి జ్వరం ఉంటే తప్పక అన్ని రకాల పరీక్షలు చేయించాలి. జ్వరంతో పాటు వచ్చే నొప్పులు సాధారణంగా 15 రోజుల నుంచి నాలుగు నెలల పాటు ఉంటాయి. దీనిని వైద్య పరిభాషలో ‘వైరల్ ఆర్థ్రాలజీ’గా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. దోమల నివారణ చర్యలేవీ? దోమలు, వాటి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏమీ లేవని విమర్శలు వస్తున్నాయి. ఏటా జూన్ నుంచి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా సర్వే నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదని జనం మండిపడుతున్నారు. జిల్లా మలేరియా అధికారి అనారోగ్యం కారణంగా తరచూ సెలవులు పెడుతుండటంతో ఆ విభాగం పనితీరు పడకేసింది. జ్వరాలు వ్యాపించిన ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్సలు చేయాల్సి ఉండగా వైద్యాధికారులు ఆ మేరకు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజలకు ఇంటింటా తిరిగి అవగాహన కల్పించే కార్యక్రమాలూ చేపట్టడం లేదు. మరోపక్క ప్లేట్లెట్లు తగ్గిపోయాయంటూ ప్రైవేటు వైద్య శాలల్లో జనం నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. జనం జేబులు గుల్ల చేస్తున్నారు. సాధారణంగా ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్లెట్లు తగ్గడం సహజమని వైద్యులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ప్లేట్లెట్లపై అపోహలు వీడండి.. ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్లెట్లు తగ్గటం సహజం. అంతమాత్రానికే కంగారు పడకూడదు. సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్లు ఉంటాయి. వీటి సంఖ్య 20 వేల కన్నా తక్కువగా ఉన్నా ఎలాంటి ప్రమాదం సంభవించదు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడి అవి పగిలి వాటి ద్వారా రక్తం వస్తే, మూత్రంలో, దగ్గుతున్నప్పుడు కళ్లె ద్వారా రక్తం పడిపోతూ ఉంటే అప్పుడు ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. దోమల ద్వారా డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలు, ఫైలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని దోమల నుంచి రక్షణకు దోమ తెరలు వాడటం చాలా మంచిది. డాక్టర్ కె.రాజేంద్రకుమార్, జ్వరాల ఆస్పత్రి ప్రొఫెసర్ -
రైతు ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వాలు విఫలం
మిర్యాలగూడ అర్బన్l: రైతుల ఆత్మహత్యలను నివారించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట టెయిల్ పాండ్ నిర్వాసితుల రిలే నిరాహార దీక్ష ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముంపు బాధితులకు పరిహారం ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం దారుణమన్నారు. ప్రభుత్వాల విధానాల వలన రైతులు పంటలు పండిచాలంటేనే భయపడుతున్నారన్నారు. అదే జరిగితే వ్యవసాయం కుంటుపడి దేశ ఆర్థిక ప్రగతి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓలతో కాలం కడుపుతున్న ప్రభుత్వం నష్టపరిహారం విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. పుష్కరాలు, దేవుని గుళ్లు అంటూ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఎగకొడుతున్న కోటీశ్వరులకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని, పంటలు పండించే రైతులకు రుణాలు ఇవ్వకుండా బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రైతులు సంఘటితంగా ఉండి సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం దీక్ష చేస్తున్న రైతులకు నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, వస్కుల మట్టయ్య, జగదీష్చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
గిరిచేరని.. విద్యాసిరి
మూతపడుతున్న గిరిజన ప్రాథమిక పాఠశాలలు నానాటికీ తగ్గుతున్న విద్యార్థుల అడ్మిషన్లు ఇళ్లకే పరిమితమవుతున్న చిన్నారులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇలాకాలో దయనీయ పరిస్థితి ‘విద్యారంగానికే తొలి ప్రాధాన్యం’ ‘కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తాం’ ‘గిరిజనుల సంక్షేమమే లక్ష్యం’.. రాష్ట్ర మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు నిత్యం చెప్పే మాటలివి. ఇవన్నీ నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ ప్రకటనలు కార్యరూపు దాల్చడం లేదు. గిరిజన బాలల జీవితాల్లో చదువులు వెలుగులు నింపడం లేదు. ఇందుకు సాక్ష్యం ఐటీడీఏ పరిధిలోని విద్యా విభాగం పర్యవేక్షణలో నడిచే గిరిజన ప్రాథమిక పాఠశాలలు(జీపీఎస్). ఒకప్పుడు మెుత్తం 173 జీపీఎస్లు ఉండేవి. ఇప్పటిదాకా వివిధ కారణాలతో 36 పాఠశాలలను మూతపడ్డాయి. ప్రస్తుతం 137 మాత్రమే నిర్వహణలో ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 1,319 మంది విద్యార్థులు మాత్రమే చదువుతుండగా.. సంబంధిత అధికారులు మాత్రం ఇటీవల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి అందజేసిన జీబీ నోట్లో మెుత్తం జీపీఎస్లలో 4,528 మంది విద్యార్థులు చదువుతున్నట్లు ప్రస్తావించడం గమనార్హం. గిరిజన ప్రాథమిక విద్యా కేంద్రాలు దీనస్థితిని కప్పిపుచ్చే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమయ్యారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా ప్రస్తుతం జీపీఎస్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? మౌలిక వసతుల లేమి ఎలా ఉంది? ఉపాధ్యాయుల కొరత వివరాలేంటి? అనే అంశాలతో డిప్యూటీ సీఎంకు నివేదించి ఉంటే వాస్తవ పరిస్థితులు ఆయన దృష్టికి వెళ్లి ఉండేవి. తద్వారా సంస్కరణలకు శ్రీకారం చుట్టి జీపీఎస్ల బలోపేతానికి సరికొత్త భవిష్యత్ ప్రణాళికను రూపొందించేందుకు ఆస్కారం ఉండేది. జీపీఎస్లు మూసివేసిన ప్రాంతాల్లో అందులోని పిల్లలు పలుచోట్ల తల్లిదండ్రులతో కలిసి కూలీ పనులకు వెళ్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఇంటిపట్టునే ఉంటున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు, అధికారులు చొరవచూపి పలువురు విద్యార్థులను హాస్టళ్లకు తరలించారు. తద్వారా ఆ చిన్నారులు బాలకార్మికులుగా మారకుండా మంచి ప్రయత్న ం చేశారు. జీపీఎస్లు మూతపడిన పలు గొత్తికోయ గూడేల్లో విద్యార్థులు మండల పరిషత్ పాఠశాలలకు వెళ్తున్నారు.ఇటీవల ఏటూరునాగారం ఐటీడీఏలో జరిగిన 58వ పాలక మండలి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాఠశాలల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. అయినా ఆ దిశగా అధికారులు దృష్టిసారించడం లేదు. -
అర్హులకు సంక్షేమ ఫలాలు దక్కడం లేదు
♦ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ యాడికి : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన నిరుపేదలకు దక్కడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ ధ్వజమెత్తారు. యాడికిలో మంగళవారం నిర్వహించిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘోరంగా విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. టీడీపీ పాలన అంతా అవినీతిలో కూరుకుపోయిందని నిప్పులు చెరిగారు. మోసపూరిత హామీలతో అన్ని వర్గాల వారిని ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల టీడీపీ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు మరెంతో దూరంలో లేవన్నారు. అనంతరం ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి పాల్గొన్నారు. -
కంటి వైద్యం కోసం వెళితే కన్నే పోయింది..
గుంటూరు ఈస్ట్: శారదా కాలనీ 2వ లైనులో నివసించే∙షేక్ బాజీ బీ అనే వృద్ధురాలు కంటి వైద్యం కోసం ఆసుపత్రికి పోతే కన్ను పోయిందని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సోమవారం గ్రీవెన్స్లో ఆశ్రయించింది. కుడి కన్నులో పొర ఏర్పడటంతో కాటూరి మెడికల్ కళాశాలకు వెళ్లి మే 2వ తేదీ పరీక్ష చేయించుకున్నాక 3వ తేదీ ఆపరేషన్ చేశారంది. ఇంటికి వెళ్లిన దగ్గర నుంచి కన్ను విపరీతమైన నొప్పి ఏర్పడి కన్ను నీరు కారిందని వాపోయింది. ఒకటి రెండు సార్లు అదే ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా కన్ను పోయిందని కన్నీళ్లు పెట్టుకుంది. కాకానిలోని శంకర్ ఐ ఆసుపత్రికి వెళ్లమని ఉన్నతాధికారులు సూచించారంది. జూన్ నెల 15వ తేదీ శంకర్ ఐ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా కాటూరి మెడికల్ కళాశాల వైద్యుల నిర్లక్ష్యంతోనే కన్ను పోయినట్లు నిర్ధారించారంది. ఈ నెల 8వ తేదీన అపరేషన్ చేసి కన్నును తొలగించారని గోడు వెల్లబోసుకుంది. విచారణ చేపట్టి న్యాయం చేయాలని అర్బన్ ఎస్పీని కోరింది. -
మూకుమ్మడిగా విషం సేవించి, తాడుతో..
ఒకరి తరువాత మరొకరికి ముగ్గురు కొడులకూ మాయదారి రోగం వచ్చింది. ఒకరికి మించి మరొకరికి రోగ తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాన్ని వారు తట్టుకోలేకపోయారు. కళ్లెదుటే చెట్టంత ఎదిగిన బిడ్డలు రోగగ్రస్తులు కావడం ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కన్న బిడ్డలు అనారోగ్యంతో తన ముందే కళ్లు మూస్తే ఇక తాను బతికుండి ఏం ప్రయోజనం అనుకుందో ఏమో ముగ్గురు కొడుకులతో కలిసి ఆ తల్లి ఆత్మహత్యకు ఒడిగట్టింది. మృత్యువు దరి చేరేటప్పుడు విడిపోతే ఎలాగనుకున్నారో ఏమో నలుగురూ విడిపోకుండా తాడుతో కట్టుకొని, పురుగుల మందు సేవించి ఉప్పుటేరులో దూకి బుధవారం రాత్రి ఉసురు తీసుకున్నారు. గురువారం ఉదయం మత్స్యకారులు ఉప్పుటేరులో చేపలు పట్టేందుకు వల వేయగా మృతదేహాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. పిఠాపురం/ కొత్తపల్లి : కొత్తపల్లి మండలం అమరవిల్లికి చెందిన రాగాల రాము, భూలక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఆరేళ్ల క్రితం వివాహం చేశారు. ముగ్గురు కొడుకులు ప్రభు ప్రకాష్ (22), అనిల్ కుమార్ (20), ప్రేమసాగర్ (18). పెద్దవారిద్దరూ డిగ్రీ వరకు చదువుకొని తండ్రికి వ్యవసాయంలో సాయపడుతున్నారు. ప్రేమసాగర్ పదోతరగతి చదువుతుండగా ఆరోగ్యం బాగోలేక చదువు మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆఖరి వాడితో మొదలైంది నాలుగేళ్ల క్రితం చిన్న కుమారుడు ప్రేమసాగర్ అస్వస్థతకు గురికాగా కాకినాడలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. అతనికి కిడ్నీలు పాడయ్యాయని, ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారు. కొంత కాలం వరకు డయాలసిస్ చేయించాలని వారు అనడంతో ఆమేరకు నాలుగేళ్లుగా వైద్యం చేయిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మిగిలిన ఇద్దరు కుమారులు ప్రభు ప్రకాష్, అనిల్ కుమార్ కూడా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆస్పత్రిలో చూపించగా పరీక్షలు చేసిన వైద్యులు వారి కిడ్నీలు కూడా పాడయ్యాయని, ఆపరేషన్ చేయించక తప్పదని చెప్పారు. ఉన్న కిడ్నీ ఇచ్చైనా కాపాడుకోవాలనుకున్నా...! చిన్న కుమారుడికి కిడ్నీలు పాడయ్యాయని, రెండు కిడ్నీలు మార్చాలన్న వైద్యుల సూచనలతో తన కిడ్నీ ఇచ్చైనా వాడిని కాపాడాలని తండ్రి రాము వైద్యులను వేడుకున్నట్టు బంధువులు తెలిపారు. ఒకరికి తన కిడ్నీ ఇవ్వాలని అనుకుంటున్న తరుణంలో మరో ఇద్దరు కుమారులకు అదే పరిస్థితి ఎదురవ్వడంతో వారిని ఎలా కాపాడుకోవాలో ఆ తల్లిదండ్రులకు తోచలేదు. తల్లిదండ్రులిద్దరు చెరో కిడ్నీ ఇచ్చినప్పటికీ మరొకరికి కిడ్నీ ఇచ్చే వారు లేక పోవడంతో ఇక తమకు దిక్కెవరని రోదించే వారని స్థానికులు చెబుతున్నారు. శోకసంద్రంగా అమరవిల్లి తల్లి, ముగ్గురు కుమారులు మరణించడంతో అమరవిల్లి గ్రామం శోకసంద్రంగా మారింది. అందరితో కలిసిమెలిసి ఉండే ఆకుటుంబ సభ్యులు ఇప్పుడు లేరన్న చేదు నిజాన్ని ఆగ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. కన్న కొడుకులు, కట్టుకున్న భార్య లేకుండా నేనెందుకు బతకాలంటూ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న రాముని ఆపడం ఎవరితరమూ కావడం లేదు. ఈ సంఘటనతో షాక్గురై రాము స్పృహ తప్పడంతో స్థానిక డాక్టర్ వైద్యసేవలందిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కొత్తపల్లి ఎస్సై చైతన్యకుమార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న కాకినాడ డీఎస్పీ ఎస్. వెంకటేశ్వరరావు, ఆర్డీఓ డేవిడ్ రాజు, పిఠాపురం సీఐ ఎండీ ఉమర్ అక్కడకు చేరుకున్నారు. సీఐ ఆధ్వర్యంలో ఎస్సై చైతన్యకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మృతదేహాలు స్వగ్రామానికి చేరుకున్నాయి. మాయదారి రోగమే ముంచిందా..? భూలక్ష్మి సోదరులు కిడ్నీసమస్యతోనే మృతి చెందారు. అదే రోగం తన ముగ్గురు కుమారులకు సోకడంతో ఇది వంశపారంపర్యంగా వచ్చి ఉండొచ్చని వైద్యులు చెప్పడంతో ఆమె తన కడుపున పుట్టడం వల్లే ముగ్గురు కొడుకులకు ఈరోగం వచ్చిందని భావించి ఇంత దారుణానికి ఒడిగట్టి ఉంటుందని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ఆదుకోదని..! ఈ కిడ్నీ సమస్యకు ఆరోగ్యశ్రీ పథకంలో కొంత వరకే వైద్యం చేయగలమని, మిగిలిన ఖర్చులు మీరే పెట్టుకోవాలని ఆస్పత్రి వర్గాలు తేల్చి చెప్పాయి. ముగ్గురు కుమారులకు పెద్దమొత్తంలో ఖర్చు చేయడం తమ శక్తికి మించిందని ఆకుటుంబ సభ్యులు బాధపడేవారని మృతుల బంధువులు తెలిపారు. -
వదలని పీడ!
ఫ్లోరైడ్ బారి నుంచి కనిగిరి వాసులకు విముక్తి ఎప్పుడో.. ♦ వాడుకకూ పనికిరాని భూగర్భ జలాలు ♦ 124 గ్రామాలకు అందని సాగర్ జలాలు ♦ ముందుకు సాగని కుడికాల్వ రెండో దశ పనులు ♦ రక్షిత మంచినీటి పథకానికి గ్రహణం ♦ రెండేళ్లుగా నిలిచిన రూ.88 కోట్ల నిధులు ♦ అమలు కాని సీఎం చంద్రబాబు హామీలు ♦ నిధుల సాధనలో నాయకుల వైఫల్యం ‘ఇక్కడి భూమిలో నీరు 40 అడుగుల లోతు దాటితే తాగేందుకు పనికిరాదు. ఫ్లోరైడ్ తీవ్రంగా ఉందని నివేదికలున్నాయి. భూగర్భ జలం తాగొద్దు.. మీకు వెలిగొండ, సాగర్ జలాలు అందిస్తా.. ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పిస్తా’.. - గతేడాది శీలంవారిపల్లి సభలో కనిగిరి వాసులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ కనిగిరి ప్రాంతంలోని భూగర్భ జలాలు తాగేందుకు కాదు కదా.. కనీసం వాడుకునేందుకు కూడా పనికిరావు. ఇక్కడ పండించిన కూరగాయలు, పండ్లు సైతం వాడరాదు. వాటిలో ఫ్లోరైడ్ అత్యధికంగా ఉంది. టూత్ పేస్ట్ సైతం ప్రత్యేకమైనది ఉండాల్సిందే.. పారుదల నీటితోనే ఫ్లోరైడ్ నుంచి విముక్తి. - జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి యాస్మిన్ చెప్పిన మాటలు కనిగిరి: కనిగిరి ప్రాంతం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఫ్లోరైడ్. ఎటు చూసిన ఫ్లోరోసిస్ బాధితులే కనిపిస్తారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడా శాశ్వత నీటి వనరులు లేవు. ఆరు మండలాల్లోని 135 పంచాయతీల పరిధిలో ఉన్న 467 గ్రామాలకూ వర్షపు నీరు, భూగర్భజలాలే దిక్కు. ఈ ప్రాంతం నుంచి కాలువ నీరు పారాలంటే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలి. అప్పుడే కనీసం నాలుగు మండలాలకు తాగు, సాగు నీరు లభిస్తుంది. సాగర్ కుడి కాలువ రెండో దశ పనులు చేపడితే నియోజకవర్గానికి తాగు, సాగు నీటి సమస్య తీరుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కాలువ కురిచేడు వరకు వచ్చింది. 59 కిలో మీటర్లు కాలువను పొడిగిస్తే కనిగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో తాగు నీటితో పాటు 6 లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు అందుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇక్కడి భూ గర్భ జలాలు తాగేందుకు కాదు కదా కనీసం వాడుకకు కూడా పనికిరావని వైద్యాధికారులు ధ్రువీకరిస్తున్నా ప్రజలకు రక్షితనీరు అందించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే సొంత మండలంలోనూ అదే తీరు.. ఫ్లోరోసిస్ బాధ నుంచి కనిగిరి ప్రజలకు విముక్తి కల్గించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో రూ.175 కోట్లతో కనిగిరి రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. మొదటి విడత రూ.91 కోట్ల నిధులు విడుదల చేశారు. తిరిగి రెండోవిడత నిధులు కూడా రూ.61 కోట్లు మంజూరై పనులు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో పథకానికి గ్రహణం పట్టింది. దీంతో రెండేళ్ల నుంచి మూడో విడత నిధులు రూ.88 కోట్లు రాలేదు. ప్రస్తుతం దాని వ్యయం రూ.100 కోట్లకు పెరిగినట్లు తెలిసింది. నిధుల సాధనకు ప్రభుత్వంపై వత్తిడి తేవడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యూరనే విమర్శలున్నాయి. ఫలితంగా నియోజకవర్గంలోని 124 గ్రామాల్లో రామతీర్థం ప్రాజెక్టు నీటి సరఫరా లేదు. ఎమ్మెల్యే సొంత మండలంలో ఒక్క గ్రామానికి కూడా సాగర్ జలాలు ఇవ్వలేని దుస్థితి. ఫ్లోరైడ్ శాతం 5 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) నుంచి 7పీపీఎం వరకు ఉందని గత ఏడాది శీలంవారి పల్లెలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సెలవిచ్చారు. వెలిగొండ, సాగర్ జలాలు అందించడం ద్వారా ఇక్కడి ప్రజలను ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పిస్తానని వాగ్దానాలు చేశారు. కనీసం రక్షిత పథకానికి మూడో విడత అందించాల్సిన రూ.88 కోట్లు కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం. -
అపజయాలు శాశ్వతం కాదు: సోనియా
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో అపజయంతో నిరాశలో కూరుకుపోయిన పార్టీ శ్రేణుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఓటపోటములు శాశ్వతం కాదనీ, కార్యకర్తలు విలువలకు కట్టుబడిపనిచేయాలని ఉద్భోధించారు. నీతిని వదిలిపెట్టి సాధించిన విజయాలు శాశ్వతంగా ఉండవన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. అస్పాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం మళ్లీ పునరావృతం కాదన్నారు. రాజీవ్ గాంధీ తన చివరి రక్తం బొట్టు వరకు సామాజిక సమరసత కోసం పాటుపడ్డారని, ఆయన చూపిన ఆధునికత, సామాజిక సమరసతలకు అంకితమయి పనిచేయాలని సూచించారు. రాజీవ్ గాంధీ దేశాభివృద్ధిలో తనదైన ముద్రవేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దిగ్విజయ్ సింగ్, గులాంనబీ ఆజాద్, జనార్ధన్ ద్వివేది, అజిత్ జోగి హాజరయ్యారు. రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏకే అంటోని, చిదంబరంలు హాజరు కాకపోవడం గమనార్హం. -
'హోదా సాధనలో బీజేపీ, టీడీపీ విఫలం'
► వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డిమాండ్ ► ప్రత్యేకహోదా కోసం రేపు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు ► కాకినాడ ఆందోళనలో పాల్గొననున్న పార్టీ అధినేత జగన్ కాకినాడ: ప్రత్యేక హోదా సాధనపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్ష నేతల్ని వెంటబెట్టుకుని ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రత్యేక హోదా సాధనకోసం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఈనెల 10న ధర్నాలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునివ్వడం, ఆ రోజున కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో ఆయన పాల్గొననుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం కాకినాడ వచ్చిన విజయసాయిరెడ్డి, పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు ధర్నా నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై పార్టీ తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పార్టీ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, సిటీ ప్రెసిడెంట్ రాగిరెడ్డి ఫ్రూటీకుమార్లతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. హోదా సాధనలో బీజేపీ, టీడీపీ విఫలం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రత్యేక హోదా సాధనలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ ఒక్కటే పోరాడుతోందన్నారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల మాదిరిగా రాష్ర్టం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా వస్తేనే సాధ్యమవుతుందనే విషయం బాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదించే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని, 15 ఏళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు హోదా విషయంలో మాట మార్చడం ఎంతవరకు సమంజసమన్నారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడుల తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. చంద్రబాబు కృషి చేయకుండా ప్రతిపక్షాలు ఢిల్లీ వెళ్లి ఆందోళనలు చేయాలనడం హోదా సాధన నుంచి తనకు తాను తప్పుకోవడంగానే కనిపిస్తోందని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ మొదటి నుంచీ హోదా విషయంలో తన వంతు పాత్ర పోషిస్తున్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో దీక్ష, గుంటూరులో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణదీక్ష చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ గుర్తున్నా చంద్రబాబుకు గుర్తు లేకపోవడం విడ్డూరమన్నారు. హోదా సాధించే వరకు తమ పార్టీ ప్రజల వెన్నంటే ఉంటుందన్నారు. -
అవి పొగడ్తలా... తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త!!!
మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయం, వైఫల్యం అని ఉంటుంటాయి. ఒక చోట విజయం వరిస్తే ఇక నా అంతటి వాడు లేడని రొమ్మువిరుచుకుని తిరగకూడదు, అక్కరలేని భేషజాలకు పోయి పాడయిపోకూడదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం ఫెయిల్ అయినట్లు కనబడుతుంటుంది. అలా ఫెయిలవడం నీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం కావాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరిదైనా వైఫల్యం సంభవిస్తే బెంగపెట్టుకుని స్తంభించి పోకూడదు. మళ్ళీ ఉత్సాహంగా పూనికతో వృద్ధిలోకి రావాలి. విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైస్ఛాన్స్లర్గా పనిచేసిన డాక్టర్ ఐవిరావుగారి సోదరుడికి ఒకప్పుడు ఏదో పరీక్షలో ఒక పేపర్లో రెండు మార్కులు తక్కువొచ్చాయి. ఆయన మళ్ళీ కొంతకాలం చదవవలసి వచ్చింది. ఆయనేం బెంగపెట్టుకోలేదు. శ్రద్ధగా చదువుకున్నారు. అలా చదువుకున్నందుకు ఫలితం - భారతదేశంలో ఎవరూ పొందని కీర్తిని ఆయన పొందారు. చిన్నపిల్లల్లో వచ్చే ఒక ప్రత్యేకమైన వ్యాధి మీద ఆయన నిష్ణాతుడై ప్రపంచవ్యాప్తంగా కీర్తిగడించిన డాక్టరయ్యారు. ఒకప్పుడు పదోతరగతి ఫైనల్ పరీక్షలకు ముందు ఒక టాలెంట్ పరీక్షలాంటిది పెట్టేవారు. అలా ఒక పాఠశాల పెట్టి విజేతలకు బహుమతి ప్రదానం చేయడానికి నన్ను పిలిచారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి రాష్ర్టస్థాయిలో ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉన్న వారిని గుర్తించేవారు. దీనిలో ప్రథమ బహుమతి గెలుచుకున్న విద్యార్థి మొత్తం బంధుగణాన్ని అంతటినీ ఏకంగా ఒక బస్సులో తీసుకువచ్చాడు. నేను దాన్ని తప్పుపట్టడం లేదు. కానీ ఆ పిల్లవాడిని ఆ బంధువులు ఏ స్థితిలో చూశారంటే... వాడు జీవితంలో ఇక చేరవలసిన పైస్థానాన్ని చేరినట్లుగా భావించారు. వాడికి ప్రైజ్ ఇస్తున్నప్పుడైతే వాడి అతిశయం, వాడి అహంకారం చూస్తే వీడికొక మంచిమాట చెప్పకపోతే తప్పుచేసిన వాడినవుతాననిపించి ‘బాబూ! నీతో ఒక్కమాట మాట్లాడవచ్చా’ అన్నాను. వాడు ’చెప్పండి’ అన్నాడు. ‘‘ జీవితానికి ఇది చివరి పరీక్ష కాదు, కానీ ఈ పరీక్షలో పొందిన విజయం తర్వాతి పరీక్షలో బాధకు కారణం కాకుండా చూసుకో’’ అన్నాను. నేను చెప్పిన మాట వాడికేమేరకు అర్థమైందో నాకు తెలియదు. ఈలోగా రెండోబహుమతి పొందిన విద్యార్ధి ఎంతో బాధగా వచ్చి నిలబడ్డాడు. ‘ఎందుకలా ఉన్నావు’ అని అడిగితే వాడన్నాడు కదా... ‘‘నాకు రెండు మార్కులే తక్కువ వచ్చాయి. ఫస్ట్ రావాలని ఎంతో ప్రయత్నం చేశా’’ అని చాలా బాధగా చెప్పాడు. నేనన్నానూ... ‘‘ఇదేం ఫైనల్ పరీక్ష కాదుకదా, ఒక ప్రయత్నం చేశావు. అంతే! రేపటి పరీక్షకు బాగా చదివి పేపర్లో నీ ఫొటో పడేటట్లు ఇక నుంచి బాగా ప్రిపేర్కా’’ అన్నాను. మొదటి బహుమతి అందుకున్న విద్యార్థి ఆ తర్వాత పుస్తకం పట్టుకున్నాడని నేననుకోవడం లేదు. కారణం ఫైనల్ ఫలితాల్లో మొదటి వేల ర్యాంక్స్లో లేడు. రెండోబహుమతి విద్యార్థి స్టేట్ ఫస్ట్ వచ్చాడు! పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొక కారణం కూడా కనిపించదు. అందుకే ఇటువంటి సందర్భాల్లో దక్షిణ దేశంలో ఇప్పటికీ ఒక సంఘటన గురించి చెబుతుంటారు. జంబుకేశ్వరం అని ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం అర్చకులు మహారాజదర్శనానికి కూడా వెళ్ళేవారుకారు. అవసరమనిపిస్తే మహారాజుగారే వారి దర్శనానికి వస్తారు. ఒకప్పుడు ఒక యువరాజుకు పట్టాభిషేకం అయింది. జంబుకేశ్వరం తప్ప అన్ని దేవాలయాల నుంచి అర్చకులు వెళ్ళి ఆశీర్వచనం చేశారు. జంబుకేశ్వరం ఆలయం అర్చకులు ఎందుకు రాలేదని అడిగితే ‘‘వారేమీ ఆశించరు. వారు రారు. వాళ్ళ దగ్గరకు మనమే వెళ్ళాలి’’ అని మంత్రి చెప్పాడు. కొత్త రాజు కొద్దిసేపు ఆలోచించి ఒక అద్భుత సన్మానపత్రం రాయించి అది పట్టుకుని వెళ్ళాడు. అర్చకులకు కబురుపంపి ఆలయ సమీపంలోని ఒక చెట్టుకింద కూర్చున్నాడు. అర్చకులను స్వాగత సత్కారాలతో గొడుగులుపట్టి తీసుకువచ్చి వారికా సన్మాన పత్రం చదివి వినిపించి సత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆ పత్రాన్ని రోజూ చదువుకున్న అర్చకులకు రాసినవాడిమీద ప్రీతి అంకురించి, నియమ నిష్ఠలను వదిలేసి ఆ తర్వాత వారే రాజుగారి దగ్గరకు వెళ్ళిపో యారు. అందుకే నిబద్ధత కలిగిన ఒక పండితుణ్ణి పాడుచేయాలంటే ఏం చేయాలని అడిగితే... ఒక సన్మానం చేయండి చాలు’’ అంటారు. జీవితంలో పొగడ్త అన్నది ఎంత మోతాదులో పుచ్చుకోవాలో అంతే మోతాదులో పుచ్చుకోవాలి. మందులే కదా అని మోతాదుకు మించి తీసుకుంటే విషమై చచ్చిపోతారు. నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తున్నది. మా ఊళ్ళో ఒక పశువుల కాపరికి ఓరోజు బాగా దగ్గువస్తే డాక్టర్గారి దగ్గరకు తీసుకుపోయారు. ఆయన ఒక ద్రావకం ఇచ్చి ‘‘మూడుపూటలా ఒక చెంచా చొప్పున తాగు. మూడురోజుల తర్వాత వచ్చి ఎలా ఉందో చెప్పు’’ అన్నారు. వాడింటికి వెళ్ళి మొత్తం సీసామందు ఒక్కసారే తాగేశాడు. వెంటనే కింద పడిపోతే డాక్టర్ దగ్గరకు తీసికెళ్ళారు. ఆయనేదో విరుగుడు మందిస్తే లేచి కూర్చున్నాడు. అప్పుడు డాక్టర్గారు ఎందుకలా తాగావని అడిగారు. ‘మూడుపూటలా ఒక చెంచా చొప్పున మూడు రోజులకు 9 చెంచాలు తాగితే ఒక్కసారే తగ్గుతుందని అలా తాగేశానండీ’ అన్నాడు వాడు. అది మూర్ఖత్వం కాదు, అమాయకత్వం. అలాగే మీకు బాగా మార్కులొచ్చి, ఉన్నత స్థితికి వెళ్ళి, జీవితంలో బాగా వృద్ధిచెంది, నా దగ్గరకు వచ్చి - ‘‘సార్, మీ ప్రసంగానికి ప్రభావితులమై జీవితంలో నిలదొక్కుకోవడం వచ్చింది. ఇప్పుడు మేం జీవితంలో ఎటువంటి క్లిష్ట సంఘటనలకు భయపడడంలేదు’’ అన్నారనుకోండి.. ‘‘ఎంతవాడివయ్యావునాయనా... నా మాట విని ... ఇంత వృద్ధిలోకి వచ్చావు’’ అని అనకూడదు నేను. ‘‘ఇలాగే జీవితంలో వృద్ధిలోకి రా. అంతా గురు కటాక్షం. నీ గురువుల అనుగ్రహం నీయందు ఎల్లవేళలా నిలబడుగాక’’ అనో లేదా ‘‘అంతా ఈశ్వర కటాక్షం. వృద్థిలోకి వస్తున్నావు’’ అని మాత్రమే అనాలి. అలాగాక ఉత్తినే పొగిడితే అది మత్తు అయి కూర్చుంటుంది. మీరు పెద్ద డాక్టర్లయినా, పెద్ద ఇంజనీర్లయినా లేక అందమైన ఆడపిల్లయినా మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నప్పుడు అది ఎందుకో అర్థంచేసుకోలేకపోతే మాత్రం ఆ తరువాత విలపించి ప్రయోజనం ఉండదు. -
నేర్చుకోవడంలో మొదటి మెట్టు ఫెయిల్యూర్!
విద్య - విలువలు శ్రీరామాయణం ఉంది. సీతమ్మతల్లిని రావణాసురుడు అపహరించాడు. ఈ విషయం రాముడికి తెలియదు. రాముడు దేముడని రామాయణం ఎక్కడా చెప్పదు. రాముడు మనుష్యుడిగా వచ్చాడు. మీరు కూడా రాముడు మనుష్యుడనే భావనతోనే రామాయణం చదవండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. అది నరుడి కథ. సీతాపహరణం జరిగింది. లక్ష్మణస్వామి వెనక్కి వచ్చేశాడు. ఎవరెత్తుకెళ్ళారో ఆయనకి తెలియదు. ఏం జరిగిందని రాముడు గోదావరినడిగాడు. చెట్లను అడిగాడు. అరణ్యాన్ని అడిగాడు. మృగాలను అడిగాడు. ఏవీ పలకలేదు. ఎత్తుకుపోయినవాడు రావణాసురుడని వాటికి తెలుసు. అన్నీ చూశాయి. కానీ అవి రావణాసురుడికి భయపడ్డాయి. చెప్తే చంపేస్తాడు. ఎవరూ చెప్పకపోయేసరికి రాముడికి విపరీతమైన కోపమొచ్చింది. ఎవరికైనా ఆ క్షణంలో కోపమొస్తుందా, రాదా ! ’’నా భార్యను ఎవడో ఎత్తుకుపోయాడు. నేనింతకాలం ధర్మానికి కట్టుబడ్డాను. నా భార్యను ఎత్తుకుపోయిన వాడు ధర్మం విడిచిపెట్టాడు. అయినా వాడికి ఇవి భయపడుతున్నాయి. నేను ధార్మికంగా బతుకుతుంటే నన్ను చేతకానివాడినని అనుకుంటున్నాయి. అంటే ధర్మానికి ఇవి రోజులు కావు. నేనూ ధర్మాన్ని కాసేపు పక్కనబెట్టేస్తా. ఇప్పుడు నా విలువిద్య ఏపాటిదో చూపిస్తా. తమ్ముడా, లక్ష్మణా! నా బాణాలు ప్రయోగిస్తున్నాను. వాటితో శరపంజరాన్ని కడతాను. పక్షులు కాదుకదా, దేవతలు కూడా తిరగలేరు. ఈ భూమ్మీద ప్రాణి అనేది ఉండదిక. సమస్త ప్రాణులనూ లయం చేసేస్తాను’’ అంటూ ఊగిపోతున్నాడు రాముడు. ధర్మానికి రోజులు కావు అని మనమూ నిత్యవ్యవహారంలో అంటూంటాం. కోపమొస్తే ఎవరికైనా అంతే. రాముడు బాణ ప్రయోగం మొదలుపెడితే ఆయన భుజా లు తాండవం చేస్తాయి. ఒక గంటా 48 నిమిషాల్లో 14 వేలమంది రాక్షసులను మట్టుబెట్టాడు ఒకానొక సమయంలో. ఆయనకు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఎంత అస్త్రవిద్య ఇచ్చారంటే... మీరు బాలకాండ చదివితే తెలుస్తుంది. సంకల్పంచేసి మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే చాలు, సమస్త లోకాల్ని నాశనం చేసేస్తాయి. ఊగిపోతున్నాడు కోపంతో.. బాణంతీసి ఎక్కుపెడుతున్నాడు. ఇంతలో లక్ష్మణస్వామి వచ్చి కాళ్ళమీద పడి ఒక్కటే ఒక్కమాట అడిగాడు - ‘‘అన్నయ్యా! వదిన కనబడడంలేదని లోకాన్నంతటినీ చంపేయటానికా గురువులయిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మనకు విద్య ఇచ్చింది? అన్నయ్యా! నీ స్వార్థంకోసం ఈ అస్త్రాలను ఎన్నటికీ వాడవనీ, లోక క్షేమం కోసం మాత్రమే వాడతావని గురువులు ఈ విద్యను నీకిచ్చారు. వదిన కనబడనప్పుడు, ఎత్తుకు పోయినవాడు ఎవడో వాడిని వెతికి పట్టుకుని చంపకుండా, వీళ్ళెవరూ నీ ప్రశ్నలకు జవాబు చెప్పలేదనే కోపంతో లోకాలనన్నిటినీ చంపేస్తావా? దానిని లోక క్షేమానికే ఉపయోగించాలన్నయ్యా, వద్దు, వాటి జోలికెళ్ళొద్దు’’ అన్నాడు ప్రాథేయపడుతూ. రాముడు వెంటనే ఏమన్నాడో తెలుసా... ‘‘తమ్ముడా! మంచి మాట చెప్పావు. నిజంగా ఈ విద్యను గురువుగారు మనకు అందుకు ఇవ్వలేదు. ఎవడు సీతమ్మను అపహరించాడో వాడిని వెతుకుదాం పద. నేనిక ఈ అస్త్రాన్ని ప్రయోగించను’’ అని వెనక్కి తీసుకున్నాడు. ఒక్కటి ఆలోచించండి. సైంధవుడికి ధర్మరాజు ప్రాణభిక్ష పెడితే పరమశివుడి గురించి తపస్సుచేసి ఒక అక్కరలేని కోరిక కోరి తాను నాశనమవడమే కాకుండా శాశ్వతమైన అపకీర్తి తెచ్చుకున్నాడు. రాముడు మాత్రం ఒక్క క్షణం కోపానికి వివశుడైపోయినా, లోకాన్ని నాశనం చెయ్యకుండా వెంటనే నిగ్రహించుకున్నాడు. రావణుడిని వెతికాడు, చివరకు సంహరించాడు. అందుకే త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం పోయి కలియుగం కూడా వచ్చేసింది. అయినా ఇప్పటికీ రాముడే ఆదర్శవంతుడయ్యాడు. ఆయనకు దేవాలయం కట్టి పూజ చేస్తున్నాం. నామం జపిస్తున్నాం. ఎందుకంటే... రాముడు దైవమనుకోకండి. ఒకానొక క్లిష్ట సమయం వచ్చినప్పుడు దారుణమైన పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటే శాశ్వతకీర్తి పొందుతాడో అటువంటి అడుగువేశాడు తప్ప, ఆవేశంలో ఊగిపోయినా నిగ్రహించుకుని వెనకముందులాలోచించాడు తప్ప దానికి వశమైపోలేదు. ఒక్క సంఘటనతో పాతాళమంత కిందకు వెళ్ళవలసినవాడు అలా వెళ్ళకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచించి విచక్షణా శక్తిని ఉపయోగించిన ఫలితం ఎలా ఉందో చూసారుగా. ఇటువంటి సందర్భంలోనే ఆవేశాన్ని నిగ్రహించుకోలేని సైంధవుడు ఎంతగా దిగజారిపోయాడో యుగాలు మారినా అతని బలహీనతని లోకం ఎలా గుర్తుంచుకుని అలా బతకవద్దని తమ పిల్లలకు తరతరాలుగా ఎలా చెబుతూ వస్తుందో చూశారుగా... అలాగే కేవలం గురువుగారికిచ్చిన మాటకోసం ఒక్క రూపాయి కూడా పుచ్చుకోకుండా లక్షా 76వేల పోలియో ఆపరేషన్లు చేసిన ఒక డాక్టర్ ఎందరికో ఆరాధ్యుడయ్యాడు. లోకక్షేమంకోసం గురువుగారికి, పెద్దలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఎవరినైనా ఎంత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందో చూశారుగా. ఇది విస్ఫోటనా శక్తి. మీరు పిల్లలు. మీలో అంత తేజస్సు, అంత బలం ఉంటుంది అయితే జీవితంలో ఏ పొరబాటు జరిగినా మీరు కోపంతోటి, ఉద్రేకంతోటి పదిమందిని బాధపెట్టే నిర్ణయాలు ఎప్పుడూ చేయకండి. పరిశీలించుకుని - ‘‘నా పొరబాటు దిద్దుకుంటాను, ఎవడు ఏమన్నా అనుకోనీయండి. జీవితంలో పైకి వస్తాను’’ అని సంకల్పించుకుని అలా రావడానికి ప్రయత్నించండి. మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాంగారంతటివాడి జీవితం ఫెయిల్యూర్తోనే స్టార్టయింది. ఆయన కోరుకున్న ఉద్యోగానికి సెలక్ట్ కాలేదు. వేరొకదానికి సెలక్టయి, నిరాశపడి తర్వాత ఒక స్వామీజీ ఉద్బోధంతో వెళ్ళి జాయినయ్యారు. అంతే ఇక మళ్ళీ వెనకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆయన తన అనుభవంతో ఫెయిల్యూర్ను అద్భుతంగా నిర్వచించారు. ఎవరికోసమో తెలుసా! మీ పిల్లలందరికోసం. ఫెయిల్యూర్ అంటే జీవితంలో నీవెందుకూపనికిరావని తలుపులు మూసివేయడం కాదు. అది F.A.I.L. - First Attempt In Learning. అంటే నేర్చుకునే క్రమంలో అది మొదటి ప్రయత్నం అని. విఫలమయ్యావు - మళ్ళీ ప్రయత్నించు. అంతేకానీ అదే తలచుకుని నీరుకారిపోకూడదు. -
ఇది వీసీ వైఫల్యమే
- హెచ్సీయూపై కేంద్రానికి నిఘా విభాగం నివేదిక - వర్సిటీని వీసీ అప్పారావు పూర్తిగా గాలికొదిలేశారు - నాలుగు నెలలుగా అరాచక పరిస్థితులు నెలకొన్నా పట్టించుకోలేదు.. సమస్యలను పరిష్కరించలేదు - తనను కలిసేందుకు విద్యార్థులకు అవకాశం ఇవ్వలేదు - విద్యార్థులు వర్గాలుగా చీలిపోయి ఘర్షణలకు దిగినా చూసీచూడనట్టు ఉన్నారు... వీసీ నిర్లక్ష్యం వల్లే గతేడాది ఆగస్టులో పరిణామాలు చినికిచినికి పెద్దవయ్యాయి - ప్రొఫెసర్లు కూడా మూడు వర్గాలుగా చీలిపోయారు.. కొందరు విద్యార్థి సంఘాల మధ్య చిచ్చుపెట్టారు - రోహిత్ సహా పలువురు రీసెర్చ్ స్కాలర్లకు ఏడెనిమిది నెలలుగా ఫెలోషిప్ చెల్లించలేదు - ఇది కూడా విద్యార్థుల్లో అసహనానికి కారణమైంది సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అవాంఛనీయ పరిణామాలను నివారించడంలో వైస్ చాన్స్లర్ అప్పారావు విఫలమయ్యారని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. గడచిన నాలుగు మాసాలుగా విశ్వవిద్యాలయంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించేందుకు వైస్ చాన్స్లర్ ప్రయత్నించలేదని తెలిపింది. రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వర్సిటీలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఐబీ సీనియర్ అధికారి ఒకరు సోమవారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. రెండ్రోజులపాటు ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థి సంఘాల కార్యకలాపాలతో సంబంధం లేని దాదాపు వంద మంది విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లతో మాట్లాడారు. వైస్ చాన్స్లర్గా అప్పారావు నియామకానికి ముందు, తర్వాత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తనపై విధించిన సస్పెన్షన్ రద్దు చేయాలని వీసీకి రాసిన లేఖ కాపీ విశ్వవిద్యాలయం ఇన్వార్డ్ డివిజన్లో నమోదు చేయని విషయాన్ని గుర్తించారు. మామూలుగా ఏ వర్సిటీలో అయినా వైస్ చాన్స్లర్ ప్రతిరోజూ ఏదో సమయంలో విద్యార్థుల సమస్యలు వినేందుకు కొంత సమయం కేటాయిస్తారు. కానీ హెచ్సీయూ వైస్ చాన్స్లర్ తనను కలిసేందుకు వ చ్చే విద్యార్థులకు సమయం ఇచ్చేవారు కాదని వీసీ కార్యాలయం సిబ్బంది పూసగుచ్చినట్లు వివరించారు. ఒక్క సమస్యను పట్టించుకోలేదు సెంట్రల్ యూనివర్సిటీలో గొడవలు కొత్తవి కాకపోయినా.. బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిలో ఏ ఒక్కదాన్ని పరిష్కరించేందుకు కూడా వీసీ చొరవ చూపలేదని ఐబీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ‘‘విద్యార్థులు మూడు నాలుగు వర్గాలుగా విడిపోయి విశ్వవిద్యాలయంలో పలుమార్లు ఘర్షణలకు పాల్పడుతున్నా వీసీ చూసీ చూడనట్టు వ్యవహరించారు. విశ్వవిద్యాలయంలో బలంగా ఉన్న విద్యార్థి సంఘాల నేతలను చర్చలకు పిలిచి వారి మధ్య సామరస్య వాతావరణం నెలకొనేలా చూడలేదు. విశ్వవిద్యాలయంలో బోధనా సిబ్బంది కొందరు అక్కడ జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలను వీసీ దృష్టికి తీసుకువెళ్తే అవే సర్దుకుంటాయన్న ధోరణిలో నిర్లక్ష్యం కనబరిచారు’’ అని ఐబీ తన నివేదికలో వివరించింది. గడచిన సంవత్సరం ఆగస్టు మొదటివారంలో చోటు చేసుకున్న పరిణామాలు చినికిచినికి పెద్దవి కావడానికి వీసీ అలసత్వమే కారణమని పేర్కొంది. బోధనా సిబ్బందితో కమిటీ వేసి విద్యార్థులతో చర్చలు జరిపితే పరిష్కారమయ్యే సమస్యల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం వహించారని వివరించింది. కలవాలంటే రెండ్రోజుల ముందు మెయిల్ విద్యార్థులు అప్పుడప్పుడు క్షణికావేశానికి లోనవుతుంటారు. తమ సమస్యను అప్పటికప్పుడు బాధ్యులైన వారి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తారు. కానీ వీసీ.. తనను కలిసేందుకు పెట్టిన ఆంక్షల ఫలితంగా విద్యార్థులతో సమన్వయం పూర్తిగా లేకుండా పోయింది. ఎవరైనా వీసీని కలవాలనుకుంటే.. ఏ కారణాలతో కలువాలనుకుంటున్నారో రెండ్రోజుల ముందుగానే వీసీ కార్యాలయానికి మెయిల్ పెట్టాలి. ఇలా మెయిల్ పెట్టిన విద్యార్థులకు కూడా వీసీ సమయం ఇవ్వలేదు. ఫలితంగా విద్యార్థుల్లో అసహనం పెరిగిపోయింది. విద్యార్థి సంఘాలు సైతం వీసీ వైఖరి కారణంగా ఏ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లలేదు. వర్సిటీలో తరచూ ఘర్షణలకు కారణమవుతున్న ఏబీవీపీ, ఏఎస్ఏ (అంబేద్కర్ విద్యార్థి సంఘం) నేతలను విశ్వాసంలోకి తీసుకుని వారి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. బోధన, బోధనేతర సిబ్బందిలోనూ అసంతృప్తి బోధన సిబ్బంది పట్ల కూడా వీసీ వ్యవహారశైలి బాగా లేకపోవడం విశ్వవిద్యాలయంలో అవాంఛనీయ పరిణామాలకు ఆజ్యం పోసిందని ఐబీ తన నివేదికలో పేర్కొంది. బోధనా సిబ్బంది తన దృష్టికి తీసుకువచ్చిన ఏ అంశంపైనా వీసీ సానుకూల దృక్పథంతో వ్యవహరించలేదని, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదని వివరించింది. ఈ కారణంగా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు కూడా మూడు వర్గాలుగా చీలిపోయారని తెలిపింది. ‘‘కొందరు ప్రొఫెసర్లు విద్యార్థి సంఘాల మధ్య మరింత చిచ్చుపెట్టారు. వారి మధ్య విద్వేషాలు పెరిగేలా చూశారు. బోధన సిబ్బంది సైతం కుల ప్రాతిపదికన విడిపోయారు. ఇన్ని విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నా వీసీ దేన్నీ సీరియస్గా తీసుకోలేదు. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ సహా కొందరు రీసెర్చ్ స్కాలర్లకు ఏడెనిమిది మాసాలుగా ఫెలోషిప్ చెల్లించకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. విశ్వవిద్యాలయానికి ఏ రకమైన నిధుల కొరత లేదు. వారికి ఇవ్వాల్సిన ఫెలోషిప్ ఇవ్వకపోవడం వల్ల కూడా వారిలో అసహనం పెరిగిపోవడానికి కారణమైంది’’ అని ఐబీ తన నివేదికలో వివరించింది. -
మరణించినా.. హీరోగా మారాడు!
ఒకవైపు మృత్యువు దూసుకొస్తోంది. ఆ విషయం విమానంలో ఉన్నవాళ్లెవరికీ తెలియదు.. పైలట్కు మాత్రం తెలుసు. అయినా ఎలాగోలా ఇతరుల ప్రాణాలు కాపాడాలని చివరి క్షణం వరకు ప్రయత్నించాడు. దగ్గర్లోనే ఆయిల్ ట్యాంకర్, రైల్వే ట్రాక్ ఉన్నా.. విమానం వాటి మీదకు పడకుండా దూరంగా చెట్ల మీద పడేలా చూశాడు. బీఎస్ఎఫ్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఆ పైలట్.. హీరోగా నిలిచాడు. సూపర్ కింగ్ బి200 విమాన ప్రమాదంలో 10 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది మరణించిన ఘటనలో పైలట్.. నష్టాన్ని తగ్గించేందుకు తీవ్రంగా కృషిచేశాడు. టేకాఫ్ తర్వాత కొన్ని సెకన్లకే విమానంలో ఒక ఇంజన్ ఫెయిల్ అవ్వడాన్ని గుర్తించిన అతడు.. విమానాశ్రయం సరిహద్దు గోడ దగ్గర ఉన్న చెట్టుపై పడేలా చేసి భారీ నష్టాన్ని తగ్గించాడు. ఉదయం బయలుదేరిన క్షణంలోనే పైలట్ కెప్టెన్ భగవతి ప్రసాద్ ఇంజన్లో సమస్య ఉందని గ్రహించాడు. ఇంతలోనే కూలిపోతున్న పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించి భారీ నష్టాన్ని నియంత్రించగలిగాడు. కానీ కేవలం 60 సెకన్లలోనే పైలట్ ప్రసాద్, కో పైలట్ రాజ్ దేశ్ సహా పదిమంది బీఎస్ఎఫ్ సిబ్బంది జీవితాలు ఆహుతైపోయాయి. ప్రమాదం జరుగుతోందని తెలిసినా సిబ్బందిని రక్షించే సమయం లేకపోయింది. ఇంజన్లో సాంకేతిక లోపం రావడంతో నేలపై పడబోయిన విమానాన్ని 180 డిగ్రీల్లో యు టర్న్ తీసుకొన్నాడు. భారీనష్టం వాటిల్లకుండా చూసేందుకు పైలట్ తీవ్రంగా ప్రయత్నించి, విమానాన్ని బలవంతంగా చెట్టుకు గుద్దించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విమానంలో సాంకేతిక లోపం వచ్చిందని గమనించగానే పైలట్ ఏటీసీ అనుమతితో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడని కొందరు అధికారులు, ఇతర ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'పటాస్' పేలుతుందా"!
తడబడుతున్న భారత ఓపెనర్ తొలి టెస్టులో ఘోర వైఫల్యం ధావన్ స్థానానికి ముప్పు! రాహుల్నుంచి గట్టి పోటీ ఒక్కసారి అతను క్రీజ్లో నిలదొక్కుకుంటే తన మాట తానే వినడు. అతని బ్యాటింగ్ హైడ్రోజన్ బాంబులా విధ్వంసం సృష్టిస్తుంది. దీపావళి టపాసుల మోతంతా ఆ షాట్లలోనే కనిపిస్తుంది. సిక్సర్లు తారాజువ్వల్లా శిఖరాన్ని తాకుతాయి. బౌలర్ ఎలాంటివాడైనా, స్పిన్నర్ బంతిని భూచక్రంలా తిప్పినా దానిని సమర్థంగా అతను తిప్పికొట్టేయగలడు. అదీ శిఖర్ ధావన్ బ్రాండ్ అంటే. ఇప్పుడు ఆ బ్రాండ్ బ్యాండ్ బజాయించలేకపోతోంది. గత టెస్టులో రెండు ఇన్నింగ్స్లలో సున్నాకే వెనుదిరిగిన ఈ మీసాలరాయుడిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. మరో వైపునుంచి కేఎల్ రాహుల్లాంటి యువ ఆటగాడు ఓపెనింగ్కు సిద్ధంగా ఉన్న తరుణంలో ధావన్ తన సత్తాను మరోసారి ప్రదర్శించాలి. చిన్నస్వామి స్టేడియంలోనైనా చిచ్చుబుడ్డిలా చెలరేగి పరుగుల మోత మోగించాలి. తొలి టెస్టు విజయం తర్వాత భారత క్రికెటర్లంతా టీవీల్లోకి వచ్చి దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వారిలో శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. ఆ వెంటనే ‘టపాసుల శబ్దం లేకుండా ఈ సారి దీపావళి జరుపుకుంటున్న ఏకైక క్రికెటర్ ధావన్’ అంటూ సోషల్ నెట్వర్కింగ్లో కామెంట్స్ వెల్లువెత్తాయి. హాస్యంగా కనిపిస్తున్నా ఇందులో వాస్తవం ఉంది. మొహాలీ పిచ్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న వేళ తన వైఫల్యం కచ్చితంగా ధావన్ను ఆలోచనలో పడేసి ఉంటుంది. ఎందుకంటే స్పిన్నర్లు చెలరేగిన చోట తాను మాత్రం రెండు సార్లు పేస్ బౌలింగ్కే వికెట్ సమర్పించుకున్నాడు. అదీ పెద్దగా ప్రమాదకరం కాని... దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి మరీ రీప్లేలా ఒకే తరహాలో అవుటయ్యాడు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం తొలి మ్యాచ్లోనే వేగవంతమైన సెంచరీతో రికార్డు ఇన్నింగ్స్ ఆడిన ఇదే మైదానంలో ఇప్పుడు ‘పెయిర్’తో పునరాగమనం చేయడం నిరాశపర్చే విషయం. నాటి సెంచరీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్నే బలి తీసుకుంటే... ఇప్పుడు ఈ ప్రదర్శన స్వయంగా ధావన్నే ఇబ్బందుల్లోకి నెట్టింది. ఫామ్కు ఏమైంది? ధావన్ వన్డే, టెస్టు ఫామ్లను వేర్వేరుగా చూస్తే అతను మొహాలీ మ్యాచ్లోనే విఫలమైట్లు కనిపిస్తుంది. అంతకు ముందు అతను ఆడిన రెండు టెస్టుల్లో (ఫతుల్లా, గాలే) సెంచరీలు చేయడంతో గాయంనుంచి కోలుకున్నాక టెస్టులకు ఫామ్తోనే వచ్చినట్లు లెక్క. అయితే దానికి ముందు కూడా ధావన్ గొప్పగా ఆడలేదు. 13 టెస్టు ఇన్నింగ్స్లలో ఒకే ఒక అర్ధ సెంచరీ, అదీ బ్రిస్బేన్ టెస్టులో జట్టు పరాజయం ఖరారైన తర్వాత చేసినది. కాబట్టి నిలకడ లేదని మాత్రం స్పష్టమవుతుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ చాలా కఠినంగా ఉండబోతోందంటూ సిరీస్కు ముందు వ్యాఖ్యానించిన ధావన్, తాను భయపడినట్లే బ్యాటింగ్లో తడబడ్డాడు. వన్డేల్లో తొలి నాలుగు మ్యాచ్లలో విఫలమైన తర్వాత చివరి వన్డేలో అతను ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ చేసినా అది జట్టును ఘోర పరాజయంనుంచి రక్షించలేకపోయింది. వన్డే ప్రపంచకప్లో 412 పరుగులతో భారత్ టాప్ స్కోరర్గా నిలిచిన అనంతరం బంగ్లాదేశ్లోనూ వన్డే సిరీస్లో రాణించిన ధావన్, సొంతగడ్డపై మాత్రం తేలిపోయాడు. మొదటి టెస్టులో పిచ్ను అంచనా వేయకుండా, కొద్ది సేపు ఓపిక ప్రదర్శించకుండా ఆడిన షాట్లు ఆత్మహత్యా సదృశ్యమని కామెంటేటర్లు అతని ఆటను విశ్లేషించారు. మరో అవకాశం దక్కుతుందా! విమర్శలు వచ్చిన ప్రతీ సారి ఒక చక్కటి ఇన్నింగ్స్తో సత్తా చాటడం ధావన్కు కొత్త కాదు. కెరీర్కు శుభారంభం దక్కిన తర్వాత వరుసగా ఏడు ఇన్నింగ్స్లలో ఘోర వైఫల్యంతో ‘వన్ మ్యాచ్ వండర్’ అని అందరూ అనుకున్న సమయమది. ఆ దశలో న్యూజిలాండ్ గడ్డపై ఆక్లాండ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో డకౌటైనా, రెండో ఇన్నింగ్స్లో అద్భుత సెంచరీ చేయడం అతని పట్టుదలకు నిదర్శనం. చాంపియన్స్ ట్రోఫీలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన తర్వాత వచ్చిన విమర్శలను అతను జైపూర్ ఇన్నింగ్స్ (95)తో తిప్పి కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టక ముందే అతని పోరాటం ఆరంభమైంది. తొమ్మిదేళ్ల పాటు 81 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి దాదాపు 6 వేల పరుగులు చేసిన తర్వాత గానీ అతనికి అదృష్టం తలుపు తట్టలేదు. లోకేశ్ రాహుల్ రూపంలో ప్రత్యామ్నాయంగా మరో ఓపెనర్ అందుబాటులో ఉండటంతో ధావన్ను తప్పించి సొంతగడ్డపై రాహుల్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. ‘ధావన్ను తప్పించాలనే ఆలోచన సరైంది కాదు. అతని గత రికార్డుతో పాటు ఓపెనింగ్లో లెఫ్ట్ హ్యండ్, రైట్ హ్యండ్ కాంబినేషన్ అవసరాన్ని బట్టి చూసినా ధావన్కు మరో అవకాశం ఇవ్వడమే మం చిది. అవసరమైతే నెట్స్లో మరింత కఠోర సాధనతో సిద్ధం కావాలి’ అనేది సునీల్ గవాస్కర్ అభిప్రాయం. దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రారంభానికి ముందు ధావన్ బెంగళూరులోనే బంగ్లాదేశ్ ‘ఎ’తో మూడు రోజుల మ్యాచ్లో చెలరేగి శతకం బాదాడు. రెండో టెస్టులో అతను తిరిగి ఫామ్లోకి వస్తాడా...సెంచరీ చేయగానే హెల్మెట్ తీసి చేతులు బార్లా చాపి మీసం మెలేసే ‘గబ్బర్ మూమెంట్’ మళ్లీ చూడగలమా! కోహ్లి మద్దతిస్తాడా? నిజానికి ఇప్పుడు శిఖర్ ధావన్పై విమర్శలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు స్టార్ ఆటగాళ్లకు కెప్టెన్ అండగా నిలబడతాడు. ఇప్పుడు కోహ్లి కూడా ‘గబ్బర్’కు మద్దతుగానే మాట్లాడాడు. ‘ఒక్కసారి కుదురుకుంటే ఒంటిచేత్తో మ్యాచ్లు గెలిపిస్తాడు’ అంటూ సహచరుడిని వెనకేసుకొచ్చాడు. అయితే రెండో టెస్టు వేదిక బెంగళూరు కేఎల్ రాహుల్కు సొంత మైదానం. ఫామ్ పరంగా కూడా తాను ధావన్కంటే మెరుగ్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మార్పు జరగాలనే ఒత్తిడి రావచ్చు. ఇలా ఆఖరి నిమిషంలో ఏదైనా తేడా వస్తే తప్ప ధావన్ రెండో టెస్టుకు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. -
ఆ ప్రకటనలే బిహార్ కథను మార్చాయి
- ఇది మోదీ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం అనటం సరికాదు: జైట్లీ న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల సందర్భంగా పలువురు నేతలు చేసిన బాధ్యతారహిత ప్రకటనలు.. ఎన్నికల క్రమాన్ని మార్చేశాయని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అరుణ్జైట్లీ అంగీకరించారు. ఎన్డీఏ ఓటమికి.. ప్రత్యర్థులు ఏకం కావటం, వారి ఓట్లు పరస్పరం బదిలీ కావటమే కారణమని అభిప్రాయపడ్డారు. ఈ ఓటమికి ఏ ఒక్కరూ బాధ్యులు కాదంటూ.. పార్టీ సంయుక్తంగా గెలుస్తుందని, సంయుక్తంగా ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయమన్న విమర్శలను ఆయన తిరస్కరించారు. ఆదివారం వెల్లడైన బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ దారుణ పరాజయం చవిచూసిన నేపథ్యంలో.. ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. ప్రధానమంత్రి మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్షాలు కూడా పాల్గొన్న ఈ భేటీలో.. బిహార్లో ఓటమికి గల కారణాలపై సమీక్షించారు. దానికన్నా ముందుగా.. బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్భగవత్ను కలిశారు. బిహార్ ఎన్నికల ఫలితాలు, ఇతర అంశాలపై చర్చిం చినట్లు సమాచారం. ఆ తర్వాత జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం అరుణ్జైట్లీ మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ప్రభావమెంతో తెలియదు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కొన్ని బాధ్యతారహిత ప్రకటనలు నిజంగానే పరిస్థితిని మార్చివేశాయి. పార్టీ నేతలు ప్రతి ఒక్కరూ మర్యాదగా మాట్లాడాలి. పరిస్థితి మళ్లీ పట్టాలెక్కించేందుకు నేను పదే పదే జోక్యం చేసుకున్నా. అయితే.. ప్రణాళికకు సంబంధించినంత వరకూ ఇవి చెదురుమదురు కారణాలే. అవి బిహార్పై ఎంత మేర ప్రభావం చూపాయనేది నాకు తెలియదు. దాద్రీలో బీఫ్ తిన్నాడన్న నెపంతో వ్యక్తిని కొట్టి చంపటం, కర్ణాటకలో హేతువాది ఎం.ఎం.కల్బుర్గిని హత్య చేయటం వంటి ఘటనలు చెదురుమదురుగా సంభవించే అరుదైన ఘటనలు.. దేశవ్యాప్తంగా ఉండే సరళి కాదు. ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారికి.. ఊరకే నోరు జారి మాట్లాడే వారికి మధ్య తేడా చూడాలి. ఓట్ల శాతంలో పెద్ద మార్పు లేదు... 2014 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 38.8 శాతం ఓట్లు సంపాదించింది. ఆ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన మహాకూటమిలోని మూడు పార్టీలూ కలిపి 45.3 శాతం ఓట్లు పొందాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకి 34.1 శాతం ఓట్లు, మహాకూటమికి 41.9 శాతం ఓట్లు వచ్చాయి. రెండు కూటముల మధ్య ఓట్ల తేడా అటూ ఇటూగా అంతే ఉంది. మామూలుగా కూటమి ఏర్పడినపుడు.. భాగస్వామ్య పక్షాలన్నీ తమ భాగం ఓట్లు మొత్తాన్నీ పరస్పరం పంచుకోవటం సాధ్యం కాదన్న అభిప్రాయం ఉంది. అవి కూడా (ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్లు) అలా చేయలేవని మేం భావించాం. మా అంచనా పొరపాటయింది. వారి ఓట్ల బదిలీ చాలా బాగుంది. వారి సామాజిక సమీకరణాల పరిమాణం.. మా దానికన్నా పెద్దదయింది. ఎన్నికల ప్రచార సారథి ప్రధానమంత్రే అయినందున.. బిహార్ ఫలితాలను కేంద్రంలో మోదీ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయంగా చూడాలనడం సరికాదు. ఒక రాష్ట్ర ఎన్నికలు కేంద్రంపై ప్రజాభిప్రాయం కాబోవు. అన్ని ఎన్నికలూ విభిన్న అంశాలపై జరుగుతుంటాయి. బిహార్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవటానికి మాకు సరైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. బీజేపీ మిత్రపక్షాలైన మూడు పార్టీలు పోటీ చేసిన 84 సీట్లలో కేవలం ఐదు సీట్లనే గెలుచుకున్నప్పటికీ.. అది పెద్ద విషయం కాదు. ఆ పార్టీలు తమ ఓట్లను బీజేపీకి బదలాయించగలిగాయి. గెలుపు, ఓటములు ఆటలో భాగం ‘‘బిహార్లో ఓటమికి బాధ్యత అంటే.. పార్టీ ఉమ్మడిగా గెలుస్తుంది.. ఉమ్మడిగా ఓడిపోతుంది. గెలవటం, ఓడటం అనేవి ఆటలో భాగం. లోక్సభ ఎన్నికల్లో విజయం తర్వాత అమిత్షా అధ్యక్షతన బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. పలు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలిచింది. కులాల ప్రాతిపదికగా ఉన్న రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలంటూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్భగవత్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేశాయన్న వాదనను మేం అంగీకరించబోం. బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్లో టపాసులు కాలుస్తారంటూ అమిత్షా చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీకి చేటు చేశాయనటం సరికాదు.. ఒకే ఒక్క వ్యాఖ్య ఎన్నికల ఫలితాలను నిర్ణయించజాలదు. -
బాబు వైఫల్యం వల్లే ఏపీలో భక్తులు మృతి
* వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి * తెలంగాణ సర్కార్, అధికారుల పనితీరు భేష్ భద్రాచలం నుంచి సాక్షి బృందం/బూర్గంపాడు: ఏపీలోని రాజమండ్రిలో జరుగుతున్న పుష్కరాల్లో సీఎం చంద్రబాబు వైఫల్యం వల్లే 27 మంది భక్తులు చనిపోయారని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలం స్నానఘట్టాలు, సారపాకలోని ఐటీసీ అతిథి గృహంలో బుధవారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాజమండ్రిలో భక్తుల మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాట్లు తక్కువ, ప్రచార ఆర్భాటం ఎక్కువ కావడంతోపాటు అపర అనుభవశాలినని, మేధావినని భావించే ఏపీ సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే భక్తుల ప్రాణాలు గోదావరి తల్లి వద్దకు చేరాయన్నారు. తాను ఈ విషయాన్ని రాజకీయంగా మాట్లాడటం లేదన్నారు. ఏ పార్టీ అయినా.. ఏ రాష్ట్రం అయినా ఏర్పాట్ల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే బలయ్యేది భక్తులేనన్నారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కనీసం బాధిత కుటుంబాలకు మెరుగైన ఎక్స్గ్రేషియా అందించాలన్నారు. తెలంగాణలోని భద్రాచలం పుష్కర స్నానాలకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి, ఎస్పీ షానవాజ్ ఖాసీం, ఉద్యోగులందరూ శ్రమించారన్నారు. పుష్కర ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నా.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంను అంటిపెట్టుకుని ఉండి అధికారుల సమన్వయంతో పుష్కరాలను సక్సెస్ చేస్తున్నారన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గోదావరి నదిపై పుష్కర ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయన్నారు. స్నానఘట్టాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. ఆయన వెంట ఎంపీ సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్రెడ్డి, పాలేరు, ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జీలు సాధు రమేష్రెడ్డి, డాక్టర్ రవిబాబునాయక్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమా శ్రీధర్, నేతలు తుంబూరి దయాకర్రెడ్డి, బూర్గంపహాడ్ ఎంపీపీ రోశిరెడ్డి, నేతలు వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి పాల్వంచ రూరల్: పక్షం రోజులుగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్నా.. వారి సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బుధవారం ఖమ్మం జిల్లా పాల్వంచలో మున్సిపల్ కార్మికులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు కార్మికులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. -
ఏపీ సర్కారుకు క్యాట్లో ఎదురుదెబ్బ
-ఎస్పీ శ్యాంప్రసాద్ సస్పెన్షన్ ఉత్తర్వులు కొట్టివేత సాక్షి, హైదరాబాద్: విజయవాడ రైల్వే ఎస్పీ పి.శ్యాంప్రసాద్ సస్పెన్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలకు విరుద్దంగా ఆయన్ను సస్పెండ్ చేశారని స్పష్టం చేసిన కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)...సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ మేరకు క్యాట్ సభ్యులు వెంకటేశ్వర్రావు, రంజనాచౌదరిల నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. సస్పెన్షన్ కారణంగా ఆయన నష్టపోయిన అన్ని బెనిఫిట్స్ను ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. విజయవాడ రైల్వే ఎస్పీగా పనిచేస్తున్న శ్యాంప్రపాద్ను గత ఏడాది బదిలీ చేస్తున్నట్లు మౌఖికంగా చెప్పిన డీజీపీ కార్యాలయం అధికారులు వెంటనే ఆయన్ను హైదరాబాద్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన క్యాట్ను ఆశ్రయించారు. ఈ ఆదేశాలను తప్పుబట్టిన క్యాట్...ఆయన్ను అక్కడే కొనసాగించాలని ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేయడం ఇష్టం లేని ఏపీ సర్కారు ... రైల్వే క్వార్టర్లో ఉంటూ అదనంగా హెచ్ఆర్ఏ తీసుకున్నారంటూ తప్పుడు అభియోగాలు మోపి సస్పెండ్ చేసింది. రైల్వే ఎస్పీగా కొనసాగించాలన్న ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయలేదు’’ అని శ్యాంప్రసాద్ తరఫు న్యాయవాది సుధాకర్రెడ్డి తెలిపారు. అయితే చివరికి ఏపీ సర్కారు తీరును చట్టవిరుద్దమని క్యాట్ ప్రకటించిందని ఆయన తెలిపారు. -
'గవర్నర్ పూర్తిగా విఫలమయ్యారు'
సాక్షి,తిరుమల: ఓటుకు కోట్లు ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర విమర్శలకు దిగటం సరికాదని, ఈ పరిస్థితులను చక్కదిక్కదిద్దడంలో ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆదివారం శ్రీవారి సందర్శన కోసం తిరుమల వచ్చిన ఆయన.. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీలో గెలిచినవారు మరొకపార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన సందర్భంలోనూ గవర్నర్ రాజ్యాంగ పరంగా వ్యవహరించలేదని ప్రజలు భావిస్తున్నారని పొన్నం అన్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇరు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు ఆయా ముఖ్యమంత్రులు, నేతలకు వత్తాసు పలకడం సరికాదన్నారు. ఇలాంటి తరుణంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం మిన్నకుండటం దారుణమని, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాటవేసేందుకు ఇద్దరు సీఎంలు పరస్పరం విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు. వీరి దూకుడుతో భవిష్యత్ తరాల్లో వైషమ్యాలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీవారి ఆలయ జీయర్లు, ప్రధాన అర్చకులు రమణదీక్షితులు వంటి ధార్మిక పెద్దలు జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
‘ఫన్ హైదరాబాద్’.. వాయిస్ ఆఫ్ ఫెయిల్యూర్స్
‘విజయం’ ఆనందాల మత్తులో ముంచుతుంది.. ‘ఫెయిల్యూర్’ మనం ఎక్కడున్నామో చూపిస్తుంది. కానీ వేదికలన్నీ విజయానివే.. ప్రచారమూ దానికే.. అందుకే ప్రతి గెలుపు వెనక దాగున్న ఓటమి మరుగున పడిపోయి ఓటమి గొంతు మూగబోతుంది. ఈ విషయాన్ని గ్రహించిన అయిదుగురు మెక్సికన్ కుర్రాళ్లు ‘ఫెయిల్యూర్’కి డయాస్ ఇవ్వాలనుకున్నారు. అందుకు ఓ సంస్థను ఏర్పాటు చేశారు. దీని స్ఫూర్తితో మన హైదరాబాద్లోనూ ఫెయిల్యూర్ వేదిక వెలసింది. అదే ‘ఫన్ హైదరాబాద్’. ఇటీవల నగరంలోని ఓ ప్రాంతంలో ఓ కో వర్కింగ్ ప్లేస్లో 45 మంది సమావేశమయ్యారు. అందులో స్టూడెంట్స్ నుంచి ప్రొఫెషనల్స్ దాకా భిన్న వయసువారున్నారు. ఒకొక్కరూ వేదికనెక్కి ఆత్మీయులతో మాట్లాడుతున్నట్టు వారి మనసులో ఉన్నదంతా చెప్పుకున్నారు. అంతకుముందు వాళ్లంతా స్నేహితులు కాదు. కనీసం తెలిసిన వాళ్లూ కారు. అప్పుడే పరిచయం. వీరందరినీ కలిపిన కామన్ పాయింట్ ‘ఫెయిల్యూర్’. ఒక్క సమావేశంలోనే ఆప్తమిత్రులుగా చేసింది. గెలుపునకు లేని శక్తి ఇదే! అక్కడ చేరిన వారంతా జీవితాల్లో ఏయే దశల్లో ఓటమిని చూశారో చెప్పుకున్నారు. తమ లాంటి పరాజితులు చాలామంది ఉన్నారన్న ధైర్యాన్ని కలిగించింది. ఆ కథలను తమ విజయానికి సోపానాలుగా మార్చుకునే శక్తిని పెంచింది. ఇదీ ‘ఫన్ హైదరాబాద్’ చేసే పని. ఈ సంస్థకు నగరంలో స్థానం కల్పించింది చంద్రకాంత్ పొలిశెట్టి. ఇలా పుట్టింది.. మెక్సికో దేశంలో 2012లో ఓ సంస్థ ప్రాణం పోసుకుంది. ఈ మూడేళ్లలో 35 దేశాల్లోని వంద నగరాలకు విస్తరించింది. అలా ఈ యేడు జనవరిలో హైదరాబాద్కు చేరుకుంది. అయితే ఇక్కడ సంస్థ మెక్సికన్ పేరును ఇక్కడ ఉచ్చరించడానికి ఇబ్బంది పడతారని.. 'fun hydrabad' పేరుతో ప్రచారమవుతోంది. ప్రపంచంలోని ఈ సంస్థ సభ్యులు నెలకోసారి సమావేశమవుతున్నా ఇక్కడ మాత్రం మూడు నెలలకు ఓ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు చంద్రకాంత్ అండ్ టీమ్. మొదటి ఈవెంట్కి 30 మంది హాజరైతే మొన్న జరిగిన రెండో ఈవెంట్కి 45 మంది వచ్చారు. ‘ఫన్ హైదరాబాద్’ మెక్సికన్ సంస్థ పేరుతోనే ఫేస్బుక్ పేజీ ఉంది. తమ ఫెల్యూర్ స్టోరీస్కి ఓ వేదిక కావాలనుకునే వారు, తమ ఓటమి కథలను ఇతరులతో పంచుకోవాలనుకునేవారు, ఇతరుల కథలను గెలుపు పాఠాలుగా మలచుకోవాలనుకునే వారంతా ఈ ఫేస్బుక్ పేజీ ద్వారా తమ పేరును రిజిష్టర్ చేయించుకుంటారు. ఇలా ఇప్పటికి నగరంలో 150 మంది నమోదయ్యారు. వీరిలో విద్యార్థులు, బిజినెస్, పారిశ్రామికవేత్తలు, రచయితలు, కళాకారులు, సాఫ్ట్వేర్ నిపుణులు.. ఇలా అన్ని రంగాలవారూ ఉన్నారు. ఓటమి గెలుపునకు తొలిమెట్టు అంటారు. ఈ సంస్థ ఆ సూత్రాన్నే ఫాలో అవుతోంది. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే.. ‘ఇన్ఫోసిస్లో సీనియర్ సిస్టమ్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. హైదరాబాద్లో స్టార్టప్ కల్చర్ బాగా పెరిగింది. ఆ ఈవెంట్స్ అన్నిటికీ అటెండ్ అయ్యేవాడిని. పార్టిసిపెంట్స్ తమ సక్సెస్ స్టోరీస్నే షేర్ చేసుకునేవారు. ఆ జర్నీలో ఎన్నో మలుపులు.. ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. కానీ ఆ ఫెయిల్యూర్స్ని ఎవరూ ప్రస్తావించేవారు కాదు. అప్పుడే ఫెయిల్యూర్కి ఓ వేదిక ఉండాలి.. ఆ వాయిస్ని వినిపించాలి అనుకున్నా. ఈ సమయంలోనే మెక్సికో సంస్థ గురించి తెలిసి సంప్రదించా. దానికి అనుబంధంగా దేశంలో మొదటిసారి హైదరాబాద్లో నేనే స్టార్ట్ చేశా. మామూలుగా ఇలాంటి మీటింగ్స్, ఈవెంట్స్ అన్నీ వీకెండ్స్కి ప్లాన్ చేసుకుంటారు. కానీ మేం గురువారం ఖాయం చేసుకున్నాం. ఎందుకంటే వీకెండ్స్లో ఫ్యామిలీస్తో ఉంటారు.. ఏవో ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఆ ఒత్తిడిలో మీటింగ్స్కి వచ్చినా సీరియస్గా ఉండరు. కాబట్టి మిడ్ వీకైతే ఆసక్తిగా వస్తారని గురువారం పెట్టాం. మొదటి ఈవెంట్కి కేవలం మౌత్ పబ్లిసిటీతోనే 30 మంది వచ్చారు. రెండో ఈవెంట్కి ఫేస్బుక్ పబ్లిసిటీ పనిచేసింది. మా ఈవెంట్ గురించి తెలుసుకున్న బిట్స్ పిలానీ వాళ్లు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. రెస్పాన్స్ బాగా వస్తోంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా పెద్దగా చేయాలనుకుంటున్నాం. దానికి తగ్గ స్పాన్సర్స్ కోసమూ చూస్తున్నాం. స్పీకర్స్గా కూడా సీనియర్ మోస్ట్ పీపుల్ వచ్చే అవకాశం ఉంది’ అని చెప్పారు చంద్రకాంత్. -
ఇద్దరు ముఖ్యమంత్రులూ విఫలం
కార్మిక సమస్యల పరిష్కారంపై పొంగులేటి కేసీఆర్, చంద్రబాబులవన్నీ ఉత్తమాటలేనని విమర్శ జిల్లా కేంద్రాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులేవని ప్రశ్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేసి కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి కార్మికులకు వెన్నుదన్నుగా వైఎస్సార్ సీపీ నిలుస్తుందని వెల్లడి హైదరాబాద్: కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్సార్సీపీ కార్యాల యంలో కార్మిక దినోత్సవం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ కార్మికుల కోసం కోటలు దాటే హామీలు ఇచ్చారని విమర్శిం చారు. కేసీఆర్ సీఎం పదవి చేపట్టి 11 నెలలు దాటిందని.. ఎంత మంది కొత్తవారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాల్లో కార్మికుల కోసం ఈఎస్ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్నారని.. అది ఎంతవరకు వచ్చిందో చెప్పాలన్నారు. దక్షిణ భారతదేశంలో పారిశ్రామిక రాజధానిగా హైదరాబాద్కు పేరుందని.. ఆటో నుంచి ఆటోమెటిక్ ఎనర్జీ తయారీ వరకు ఇక్కడ పరిశ్రమలు ఉండటం తెలుగువారికి గర్వకారణమని చెప్పారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్సార్ పాలన కార్మికులకు స్వర్ణయుగమని పొంగులేటి చెప్పారు. 2004కు ముందు సీఎంగా ఉన్న చంద్రబాబు 56 పరిశ్రమలను నామినేషన్ రేటుకు అమ్మకానికి పెట్టారని గుర్తుచేశారు. అదే వైఎస్సార్ సీఎం అయ్యాక ప్రభుత్వ పరిశ్రమలను సమర్థంగా నడిపించి, లాభాలు తీసుకువచ్చారన్నారు. కార్మికుల పక్షాన వైఎస్సార్ సీపీ సమరశీల ఉద్యమాలు చేపడుతుందని పొంగులేటి చెప్పారు. పార్టీ తెలంగాణ కార్మిక విభాగం అధ్యక్షుడు నర్రా భిక్షపతి మాట్లాడుతూ.. కేసీఆర్ అన్ని రకాల కాంట్రాక్టు కార్మికుల్ని పర్మనెంట్ చేసి మాట నిలబెట్టుకోవాలన్నారు. కాగా, పొంగులేటి జెండాను ఎగురవేశారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, గట్టు శ్రీకాంత్రెడ్డి, రెహవూన్, కె.శివకుమార్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, మహిళా విభాగం నేత ఎం.శ్యామల, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూని యన్ నేతలు భాస్కర్రావు, శివకుమార్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రైతన్న పరువు వేలం !
తాళ్లూరు: ప్రభుత్వ వైఫల్యంతో రైతుల పరువు బజారున పడుతోంది. పాలకుల హామీలు నమ్మిన వారికి చివరకు అవమానాలు మిగులుతున్నాయి. బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వ్యవసాయం కోసం రుణాలు తీసుకున్న రైతుల బంగారాన్ని బహిరంగ వేలం వేస్తామంటూ బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తుండటం..వారి పేర్లతో ప్రకటనలు ఇవ్వడాన్ని అన్నదాతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రుణమాఫీపై రోజుకో మాట చెబుతూ తీవ్ర జాప్యం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ రెండో విడత జాబితా విడుదలలో మీనమేషాలు లెక్కిస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. రుణమాఫీపై ఆశలు పెట్టుకుని బకాయిలు సకాలంలో తిరిగి చెల్లించని రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రుణమాఫీ రెండో విడత జాబితా కోసం ఎదురుచూస్తున్న రైతులకు బ్యాంకర్లు నోటీసులతో షాకిస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో 45,773 మంది రైతులకు వివిధ బ్యాంకుల్లో రూ.326.63 కోట్ల బ కాయిలున్నా యి. అందులో రూ.99 కోట్ల బంగారం రుణాలున్నాయి. బంగా రం రుణం తీసుకున్న రైతులు తమ బంగారాన్ని కాపాడుకోవడం కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొంత సొమ్ము చెల్లించినా.. నోటీసులకు స్పందించి ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అందిన కాడికి వడ్డీలకు తెచ్చి కొంత మొత్తం బ్యాంకు రుణాల వడ్డీ కింద జమేసినా..వేలాన్ని ఆపడం లేదని రైతులు వాపోతున్నారు. సరిపడా మొత్తానికి జమ పడటం లేదని బంగారాన్ని వేలం వేస్తున్నారు. దీంతో ఇదేమి పద్ధతి అని రైతులు బ్యాంకర్లతో ఘర్షణకు దిగుతున్నారు. కనీసం వేలం రోజైనా తమకు సమాచారం ఇవ్వాలి కదా అని రైతులంటే..నోటీసులు పంపాం..పేపర్లలో ప్రకటనలు ఇచ్చామని బ్యాంకర్లు సమర్ధించుకుంటున్నారు. పూర్తిగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన తమకు నోటీసుల విషయం తెలి యదని రైతులు వాపోతుంటే..అప్పటికే బంగారం బహిరంగ వేలం పూర్తికావడంతో తామేమీ చేయలేమని బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక రైతులు దిగాలు చెందుతున్నారు. పరువు బజారు పాలవుతోంది.. పంటలు సాగు చేసుకుంటూ ఉన్నదాంట్లో పరువుగా బతుకుతున్న తాము..చంద్రబాబు హామీలు నమ్మి బజారు పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీకి సాకులు చూపుతూ రెండో జాబితా ప్రకటనలో జాప్యం, స్పష్టత లేక పోవటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డామని అంటున్నారు. రుణమాఫీలో అన్ని అర్హతలు ఉన్నాయని, రెండవ జాబితాలో తమ పేర్లు ఉంటాయన్న ధీమాతో ఉన్నామని ఈలోపు ప్రభుత్వం వైఫల్యం వలన తమ పరువు బ్యాంకర్లు తీస్తున్నారంటూ రైతన్నలు లబోదిబోమంటున్నారు. హామీలు ఇచ్చిన పాలకులు మాట మీద నిలబడకపోవటంతో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను నిలువునా మోసం చేశారు రైతులను భారీ ప్రకటనలతో, వార్తలతో ఎన్నికల సమయంలో నిలువునా మోసం చేశారు. నేడు ఒక్కరు కూడా రైతుల కష్టాలపై మాట్లాడిన దాఖలాలు లేవు. రుణమాఫీ పేరుతో రైతులకు ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.400 వ రకు ఖర్చులు అయ్యాయి. ఉపయోగం లేదు. -చెన్నారెడ్డి, రజానగరం రైతుల నోట్లో మట్టే రుణ మాఫీ చేస్తానని ప్రకటించి రైతులు ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం సరికాదు. రుణమాఫీ వెరిఫికేషన్ జాబితాల విషయంలో రైతులను నానా ఇబ్బందులు పెట్టారు. తాజాగా పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తాన ని చెప్పటం చంద్రబాబు నాయుడు ద్వంద్వ విధానాలకు నిదర్శనం. - ఐ.రమణారెడ్డి, కొత్తపాలెం జమ చేసివా వేలం ఆగటం లేదు చంద్రబాబు మాటలు విని రైతన్నలు పరువు పోగొట్టుకుంటున్నారు. పేపర్లలో పేర్లు వస్తే చూసుకొని బాధపడుతున్నారు. అప్పులు చేసి కొంత జమ చేసినా వేలం ఆగటం లేదు. సొమ్ము వచ్చిన తర్వాత జమ చేద్దామని బ్యాంకర్ల వద్దకు వె ళితే అప్పటికే వేలం వేసి ఉంటున్నారు. దీంతో రైతులు బాధలు వర్ణానాతీతం. రుణ మాఫీ సాధ్యం అంటూ ఊదర కొట్టిన వాళ్లు మాత్రం రైతుల కష్టాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. - అనిల్ కుమార్రెడ్డి, ఎన్బీపాలెం వాయిదాలోపు చెల్లించకపోతే వేలం తప్పదు బంగారంపై ఇచ్చిన రుణాలను వాయిదా లోపు చెల్లించకపోతే వేలం తప్పదు. ముందుగా లాయర్ నోటీసు పంపుతాం. తర్వాత పేపరు ప్రకటన ఇస్తాం. చివరిగా వేలం వేస్తున్నాం. రుణమాఫీ జాబితాలోకి అర్హత ఉండి ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తాం. ముందుగా రైతులకు తమ బకాయిలు ఎంత, రుణం ఎంత అన్న విషయాలపై స్పష్టత ఉండాలి. బ్యాంకర్లను నిందించటం తగదు. - జగదీష్, ఏపీజీబీ మేనేజర్, తూర్పుగంగవరం. -
కేంద్ర బలగాల వైఫల్యం వల్లే..
కొహిమా/న్యూఢిల్లీ: నాగాలాండ్లోని దిమాపూర్లో రేప్ నిందితుడిని కొట్టి చంపిన ఘటన అస్సాం-కేంద్ర ప్రభుత్వం మధ్య చిచ్చుకు దారితీస్తోంది. జైలు కేంద్ర బలగాల అధీనంలో ఉందని, ఆందోళనకారులు కారాగారంపైకి దూసుకురాకుండా నిలువరించడంలో ఆ బలగాలు విఫలమయ్యాయని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోపించారు. ఈ ఘటనకు కేంద్ర బలగాలే కారణమని మండిపడ్డారు. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినందుకు అస్సాంకు చెందిన సయ్యద్ ఫరీద్ ఖాన్ను గురువారం రాత్రి దిమాపూర్లో స్థానికులు సెంట్రల్ జైలు నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టి చంపడం తెలిసిందే. 'ఆ జైల్లోని ఖైదీల రక్షణ కేంద్రం బాధ్యత. కానీ కేంద్ర బలగాలు విఫలమవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుంది. నాగాలాండ్లోని అస్సాం ప్రజలకు తగిన భద్రత కల్పించాలి' అని గొగోయ్ శనివారం పేర్కొన్నారు. నాగాలాండ్లో అస్సామీల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర సీఎం టీఆర్ జెలియాంగ్కు, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్కు లేఖలు రాశారు. అస్సాంలో నాగాలాండ్ వాసులపై ప్రతీకార దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అటు నాగాలాండ్లోనూ అస్సామీల భద్రత కోసం రాష్ట్ర సర్కారు పెద్దఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించింది. దిమాపూర్లో పరిస్థితి అదుపులోనే ఉన్నా భద్రతా బలగాలు 144 సెక్షన్ కొనసాగిస్తున్నాయి. ఫరీద్ను కొట్టి చంపిన కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి, దోషులను శిక్షించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత విభాగం డిమాండ్ చేసింది. అస్సాం అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఈ ఘటనను ప్రస్తావిస్తూ.. నాగాలాండ్లో రాష్ట్రవాసుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. మరోవైపు రాజ్నాథ్సింగ్... నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. నిందితుడిని కొట్టి చంపినవారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సొంతూరుకు నిందితుడి భౌతికకాయం దిమాపూర్లో స్థానికుల చేతిలో మరణించిన ఫరీద్ ఖాన్ మృతదే హాన్ని శనివారం అస్సాంలోని అతడి స్వస్థలం కరీంగంజ్కు తరలించారు. అస్సాం ప్రభుత్వం ప్రత్యేక హెలికాప్టర్లో మృతదేహాన్ని తీసుకువచ్చి ఆయన బంధువులకు అప్పగించింది. ఖాన్ను చంపేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ కరీంగంజ్తోపాటు అస్సాంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు. మేం బంగ్లాదేశ్ నుంచి వలస రాలేదు: ఫరీద్ సోదరుడు నాగాలాండ్కు వలస వచ్చినవారిని టార్గెట్ చేసిన గ్రూపులే ఫరీద్ను చంపేశాయని ఆయన సోదరుడు జమాలుద్దీన్ ఆరోపించారు. తన సోదరుడిని వారు జైలు నుంచి బయటకు తీసుకువచ్చిన సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. తాము బంగ్లాదేశ్ నుంచి వలస రాలేదని, తనతోపాటు మరో సోదరుడు కమాల్ ఖాన్ భారత సైన్యంలోని అస్సాం రెజిమెంట్లో పనిచేస్తున్నామని చెప్పారు.