fake notes
-
రాష్ట్రమంతా నకిలీ రూ.500 నోట్లు.. పోలీసుల అలర్ట్
రాష్ట్రమంతా నకిలీ 500 రూపాయల నోట్లు (Fake 500 rupee notes) చెలామణి అవుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని బిహార్ (Bihar) పోలీస్ హెడ్ క్వార్టర్స్ అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పోలీస్ హెడ్క్వార్టర్స్ ఐజీ (స్పెషల్ బ్రాంచ్) డీఎంలు, ఎస్ఎస్పీలు, ఎస్పీలు, రైల్వే ఎస్పీలందరికీ లేఖ రాశారు.నకిలీ నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెల్లింగ్లో తప్పు ఉందని, స్మగ్లర్లు విడుదల చేసిన 500 రూపాయల నోటుపై ఇంగ్లిష్లో ‘Reserve Bank of India’ అని కాకుండా ‘Resarve Bank of India’ అని రాసి ఉంటుందని ఐజీ లేఖలో వివరించారు.ఈ నేపథ్యంలో నకిలీ నోట్లను గుర్తించడంతోపాటు ప్రత్యేక పాలనాపరమైన నిఘాను నిర్వహించేందుకు ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లేఖతో పాటు నకిలీ 500 రూపాయల నోటు చిత్రాన్ని కూడా జత చేశారు.నకిలీ నోటును ఎలా గుర్తించాలి?అసలైన నోట్లు విలక్షణమైన ఆకృతిని, స్పర్శను కలిగి ఉంటాయి. నకిలీ నోట్లు అలా ఉండవు.అసలైన నోట్లు మంచి రంగు, ప్రింటింగ్ నాణ్యతను కలిగి ఉంటాయి. కానీ నకిలీ నోట్లుపై రంగుల్లో తేడాను, అస్పష్టమైన ముద్రణను గమనించవచ్చు.అసలైన నోట్లలో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. ఇది నోటు చిరిగిపోయినప్పుడు కనిపిస్తుంది. నకిలీ నోట్లలో ఈ థ్రెడ్ ఉండదు.అసలు నోట్లు వాటర్మార్క్ని కలిగి ఉంటాయి. నోట్ను నీటిలో ముంచినప్పుడు అది కనిపిస్తుంది. నకిలీ నోట్లలో ఈ వాటర్మార్క్ ఉండదు.బ్యాంకులు, ఇతర వ్యాపారాల వద్ద నకిలీ నోట్లను గుర్తించగల నోట్-చెకింగ్ పరికరాలు ఉంటాయి.అసలైన నోట్లు యూవీ-కాంతి ఉద్గార మూలకాలను కలిగి ఉంటాయి. నకిలీ నోట్లలో అవి ఉండవు.ఇక నకిలీ నోట్లను గుర్తించే అనేక మొబైల్ యాప్లు కూడా అందుబాటులో ఉన్నాయి.మీకు వద్ద ఉన్నది నకిలీ నోటని అనుమానం వస్తే బ్యాంక్కు వెళ్లి తనిఖీ చేయించుకోవచ్చు.అసలు నోటు లక్షణాలుఅసలు 500 రూపాయల నోటు మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో ముద్రించి ఉంటుంది. దేవనాగరిలో 500 అని రాసి ఉంటుంది.అసలు 500 రూపాయల నోటులో కలర్ సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. నోటును వాలుగా చూస్తే ఆకుపచ్చ నుండి నీలం రంగులోకి మారినట్లు కనిపిస్తుంది.అసలు 500 రూపాయల నోటుపై ఎలక్ట్రోటైప్ వాటర్మార్క్ ఉంటుంది. ఈ నోటుకు కుడి వైపున అశోక స్తంభం గుర్తును కూడా చూడొచ్చు.ఈ నోట్లో మహాత్మా గాంధీ, అశోక చిహ్నం చిత్రాలను చేత్తో తాకితే తగిలేలా ముద్రించి ఉంటారు. దృష్టి లోపం ఉన్నవారి కోసం ఈ ఏర్పాటు చేశారు. -
పోలీసులపై దొంగనోట్ల ముఠా దాడి
-
అనుపమ్ ఖేర్ బొమ్మ కరెన్సీతో బురిడీ
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు. చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు. ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్రంగ్పుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఆ గుర్తు ఉన్న రూ. 500 నోట్లు ఫేక్? ఇదిగో క్లారిటీ..
సోషల్ మీడియాలో నిత్యం రకరకాల మెసేజ్లు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ప్రతి సందేశం నిజమైనది కాదు. అందులో చాలామటుకు ఫేక్ సందేశాలే ఉంటాయి. ఒక్కోసారి ఫేక్ మెసేజ్లతో చాలా మంది మోసపోతుంటారు. ప్రస్తుతం రూ. 500 నోట్ల గురించి అలాంటి ఫేక్ మెసేజ్ ఒకటి వైరల్ అవుతోంది. రూ. 500 నోటుపై ఉన్న సీరియల్ నంబర్లో స్టార్ (*) గుర్తు ఉంటే అలాంటి నోట్లు నకిలీవని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ రంగ వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - పీఐబీ (PIB) ఫాక్ట్ చెక్ ప్రకారం.. రూ. 500 నోటు గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు. అందులో ఉన్నట్లుగా స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవి కావు. ఇదీ చదవండి ➤ Bank Holidays in August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకుల మూత! సెలవుల జాబితా ఇదిగో.. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఆర్బీఐ స్టార్ (*) గుర్తుతో ఉన్న నంబర్ సిరీస్ నోట్లను ప్రవేశపెట్టింది. కాబట్టి అలాంటి నోట్లు నకిలీవని వచ్చే మెసేజ్లను నమ్మవద్దు. భారతీయ కరెన్సీకి సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. -
RBI Report: అలర్ట్.. నకిలీ నోట్లపై ఆర్బీఐ కీలక రిపోర్ట్
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక విలువ కలిగిన రూ.2 వేల నోటు కంటే.. రూ.500 నోట్లే అత్యధికంగా నకిలీవి చలామణి అవుతున్నాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. రూ.200 నోట్ల కంటే కూడా రూ.100 నకిలీ నోట్లే ఎక్కువ మార్కెట్లోకి ప్రవేశించాయని తెలిపింది. ఆర్బీఐ తాజాగా ఉపసంహరించిన రూ.2 వేల నోట్లు నకిలీ నోట్లలో 5వ స్థానంలో ఉన్నాయి. 2022–23లో దేశంలో నకిలీ నోట్లపై ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు గుర్తించే నకిలీ నోట్లపై ఆర్బీఐ ఏటా నివేదిక విడుదల చేస్తుంది. జాతీయ బ్యాంకులు, ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తాము గుర్తించిన నకిలీ నోట్లను ఆర్బీఐకి పంపిస్తాయి. ఆ విధంగా గుర్తించిన నోట్ల గణాంకాలను ఆర్బీఐ ఏటా విడుదల చేస్తుంది. నోట్ల ముద్రణకు రూ.4,682.80 కోట్లు ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2022–23లో కరెన్సీ నోట్ల ముద్రణ కోసం (సెక్యూరిటీ ప్రింటింగ్) ఆర్బీఐ రూ.4,682.80కోట్లు వెచ్చించింది. ♦ దేశవ్యాప్తంగా 2022–23లో మొత్తం 2,25,769 నకిలీ నోట్లను గుర్తించారు. వాటిలో 4.6 శాతం నోట్లను ఆర్బీఐ నేరుగా గుర్తించగా.. 95.4 శాతం నోట్లను దేశంలోని వివిధ బ్యాంకులు గుర్తించాయి. ♦ 2021–22తో పోలిస్తే 2022–23లో దేశంలో గుర్తించిన నకిలీ నోట్లు 5,202 తగ్గాయి. 2021–22లో దేశంలో 2,30,971 నకిలీ నోట్లను గుర్తించారు. ♦ గత ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన నకిలీ నోట్లలో రూ.500 నోట్లు మొదటి స్థానంలో ఉన్నాయి. 91,110 నకిలీ రూ.500 నోట్లను గుర్తించారు. 2021–22 కంటే నకిలీ రూ.500 నోట్లు 14 శాతం పెరిగాయి. ♦ నకిలీ నోట్లలో రూ.100 నోట్లు రెండో స్థానంలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 78,699 నకిలీ రూ.100 నోట్లను గుర్తించారు. ♦ రూ.200 నకిలీ నోట్లు మూడో స్థానంలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 27,258 నకిలీ రూ.200 నోట్లను గుర్తించారు. ♦ నాలుగో స్థానంలో రూ.50 నోట్లు ఉన్నాయి. 2022–23లో 17,755 నకిలీ రూ.50 నోట్లను గుర్తించారు. ♦ దేశంలో ఎక్కువ విలువైన రూ.2 వేల నోట్లు నకిలీ నోట్లలో 5వ స్థానంలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 9,806 నకిలీ రూ.2 వేల నోట్లను గుర్తించారు. ♦ గుర్తించిన మిగిలిన నకిలీ నోట్లలో రూ.2, రూ.5 నోట్లతో పాటు రూ.500, రూ.1,000 విలువ గల స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్లు (2016కు ముందు చలామణిలో ఉన్న నోట్లకు నకిలీవి) ఉన్నాయి. -
యూ ట్యూబ్ వీడియోలు చూసి దొంగ నోట్లు ముద్రించిన యువకుడు
-
తూ.గో. జిల్లా కు చెందిన మహిళ తో ట్రాప్ చేయించిన ముట్ట
-
ఆస్పత్రి బెడ్పై దిండు, సంచి ఉంచి పరారైన దొంగ
గురజాల: తాను చికిత్స పొందుతున్న ఆస్పత్రి బెడ్పై దిండు, కర్రల సంచి ఉంచి పైన దుప్పటి కప్పి.. పోలీసుల కళ్లుగప్పి సినీపక్కీలో ఓ దొంగ పరారయిన ఘటన గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పల్నాడు జిల్లా చర్లగుడిపాడు గ్రామానికి చెందిన ఉద్దగిరి అలేఖ ఇంట్లో దొంగనోట్లు తయారు చేస్తున్నాడనే సమాచారం రావడంతో నవంబర్ 17వ తేదీ 2022న పోలీసులు సోదా చేస్తుండగా.. అతను గోడ దూకి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో అలేఖ రెండు కాళ్లు దెబ్బతిన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఈ ఏడాది జనవరి 3న అలేఖతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అలేఖకు రిమాండ్ విధించగా సబ్ జైల్ అధికారులు అలేఖ రెండు కాళ్లకు చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఆపరేషన్ చేసిన అనంతరం గురజాల వైద్యశాలకు తరలించారు. అప్పటి నుంచి గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో అలేఖకు కాపలాగా ఏఆర్ కానిస్టేబుళ్లు పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 8 గంటలకు ఏఆర్ సిబ్బంది మంచం వద్దకు వెళ్లి చూడగా దిండు, కర్రల సంచి ఉంచి పైన దుప్పటి కప్పి అలేఖ పరారైనట్లు గుర్తించారు. వీల్ చైర్తో సహా పరారీ..? నిందితుడు ఉద్దగిరి అలేఖ వైద్యశాలలో ఉన్న వీల్ చైర్తో సహా పరారైనట్లు పోలీసులు తెలుపుతున్నారు. అలేఖ రెండు కాళ్లు దెబ్బతినడంతో నడవడం కష్టంగా ఉంటుందని వైద్యశాలలో ఒక వీల్ చైర్ కూడా కనిపించడం లేదని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పట్టణంలోని పలు కూడళ్లలో ఉన్న సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. -
భార్యను చంపి 5 ముక్కలుగా నరికి..
బిలాస్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బిలాస్పూర్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను చంపి, మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికి, ఇంట్లోని ఖాళీ నీళ్ల ట్యాంకులో పడేశాడు. సక్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉలాస్పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి నకిలీ నోట్లను ముద్రిస్తున్నాడనే అనుమానంతో ఓ ఇంట్లో సోదాలు జరిపారు. బాత్రూం మూలన ఉన్న ట్యాంకులో టేప్ వేసి పాలిధీన్ కవర్లో చుట్టిన శరీర భాగాలు కనిపించడంతో షాక్కు గురయ్యారు. అక్రమ సంబంధం అనుమానంతో భార్యను జనవరి 6న గొంతు పిసికి చంపినట్లు విచారణలో అతడు వెల్లడించాడు. అనంతరం కట్టర్తో మృతదేహాన్ని ఐదు ముక్కలు కోసి, కొనుక్కొచ్చిన ట్యాంకులో పడేసినట్లు తెలిపాడు. ఇంట్లో నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్ను స్వాధీనం చేసుకున్నారు. -
సాక్షి కార్టూన్ 31-05-2022
మరొక్కసారి నోట్ల రద్దు చేస్తే..! -
గోల్కొండ నకిలీ నోట్ల వ్యవహారంలో కొత్త ట్విస్ట్
-
కూకట్ పల్లి లో నకిలీ నోట్ల కలకలం
-
సూరత్లో రూ. 5.44 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం
సూరత్ : రూ. 5.44 లక్షల నకిలీ నోట్లను రాజస్తాన్ నుంచి గుజరాత్లోని సూరత్కు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పూణే పోలీసులు శనివారం సూరత్లో అరెస్టు చేశారు. కాగా నిందితులిద్దరూ రాజస్థాన్ నుంచి బస్సులో ప్రయాణిస్తుండగా నియోల్ చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డారు. కాగా పట్టుబడిన వారిని చునిలాల్ సుతార్, చంద్రకాంత్ షాగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల వద్ద మొత్తం 642 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. వీటిలో రూ. 2000,రూ. 500,రూ. 200,రూ.100 నోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
సకుటుంబ కరెన్సీ ముద్రణ!
మహబూబాబాద్ రూరల్: చిన్నచిన్న వ్యాపారాలు చేసినా కలిసి రాలేదు. దీంతో డబ్బుల కోసం దొంగ నోట్లు ముద్రించాలని నిర్ణయించుకున్నాడు. యూ ట్యూబ్లో తయారీ విధానం నేర్చుకుని దొంగ నోట్లు ముద్రించాక చలామణి ప్రారంభించాడు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడగా భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు కుమారులను మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో సామల శ్రీనివాస్ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేసేవాడు. భార్య, ఇద్దరు కుమారులతో హైదరాబాద్లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన పెద్ద కుమారుడు సాయిచరణ్ డిగ్రీ చదువుతూ సినిమా రంగం వైపు మళ్లాడు. షార్ట్ ఫిల్మ్లు, ప్రైవేటు సాంగ్ ఆల్బమ్ లు తయారు చేస్తున్నాడు. ఇంతలో ఓ పెద్ద సినిమాలో నటించేందుకు సినీ నిర్మాత బండ్ల గణేశ్ దగ్గర పనిచేసే పేట శ్రీనివాస్ అవకాశం ఇచ్చినా పెట్టుబడి కావాలనడంతో మరోమా ర్గంలేక యూట్యూబ్లో నకిలీ నోట్లు తయారీ విధానం నేర్చుకుని ఒక కలర్ ప్రింటర్, రెవెన్యూ స్టాంప్లకు ఉపయోగించే పేపర్లను కొనుగోలు చేసుకుని రూ.200, రూ. 500, రూ.2వేల నకిలీ నోట్లను తయారు చేశాడు. గ్రామాల్లోనైతే సులువు నకిలీ నోట్లు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో మార్పిడి చేస్తే గుర్తు పడతారని భావించిన శ్రీనివాస్ గ్రామాలను ఎంచుకున్నాడు. ఇందుకు ఓ మహింద్రా జైలో వాహనాన్ని సమకూర్చుకుని మూడు నెలల నుంచి వరంగల్, ఖమ్మం, నల్ల గొండ ఉమ్మడి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతా ల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 19వ తేదీ సాయంత్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లిలో బెల్టు షాపులో రూ.500 నోటు, మరో మహిళ వద్ద రూ.500 నోటు మార్పిడి చేద్దామని యత్నించాడు. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసముద్రం ఎస్సై బి.సతీశ్ విచారణ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కేసముద్రం వద్ద మహింద్రా జైలో వాహనంలో వెళ్తున్న సామల శ్రీనివాస్, ఆయన భార్య నాగలక్ష్మి, వారి కుమారులు సాయిచరణ్, అఖిల్ పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.69,900 నకిలీ నోట్లు, రూ.29,870 అసలైన నోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
వీటిలో ఏ ఒక్కటి లేకున్నా అది దొంగనోటే..
సాక్షి, హైదరాబాద్ : నకిలీ నోట్ల చలామణీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. వీటిని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యున్నత ప్రమాణాల్లో కరెన్సీని ముద్రిస్తోంది. అయినప్పటికీ దొంగ నోట్లు మార్కెట్లో చలామణీ అవుతూనే ఉన్నాయి. మార్కెట్లో విచ్చలవిడిగా దొంగనోట్లు చెలామణీ అవుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే దొంగనోట్లను నివారించడానికి ఆర్బీఐ 2016లోనే పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులోని 17 అంశాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా అది దొంగనోటేననే నిర్ధారణకు రావొచ్చు. ఆర్బీఐ ప్రకారం నోట్లలోని ప్రధాన గుర్తులను తెలుసుకుంటే ఏది అసలు.. ఏది నకిలీ అని తేలిపోతుంది. రూ.2000, రూ.500, రూ.200, రూ.100 కరరెస్సీ నోట్లలో గుర్తించాల్సిన అంశాలను పరిశీలిస్తే.. రూ.2వేలు నోటు ముందు 1. లైటు వెలుతురులో రూ.2000 అంకెను గమనించవచ్చు. 2. 45 డిగ్రీల కోణంలో చూస్తే రూ.2000 అంకెను గమనించొచ్చు. 3. దేవనాగరి లిపిలో రూ.2000 సంఖ్య ఉంటుంది 4. మధ్య భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది 5. చిన్న అక్షరాల్లో ఆర్బీఐ, 2000 అని ఉంటుంది 6. నోటును కొంచెం వంచితే విండోడ్ సెక్యూరిటీ త్రెడ్ ఆకుపచ్చ నుంచి నీలానికి మారుతుంది. మధ్యలో భారత్, ఆర్బీఐ, రూ.2000 అంకె ఉంటుంది. 7. గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మార్పు 8. మహాత్మాగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్ (2000) వాటర్ మార్క్ ఉంటుంది 9. పైభాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలతో కూడిన నంబర్ సైజ్ ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది. 10. కుడి వైపున కింది భాగంలో రంగు మారే ఇంక్ (ఆకుపచ్చ నుంచి నీలం)లో రూపాయి సింబల్తో పాటు 2000 సంఖ్య ఉంటుంది 11. కుడివైపున అశోక స్తూపం చిహ్నం ఉంటుంది. అంధుల కోసం..మహాత్మాగాంధీ బొమ్మ, అశోక స్తూపం చిహ్నం, బ్లీడ్ లైన్స్, గుర్తింపు చిహ్నం చెక్కినట్లుగా లేదా ఉబ్బెత్తుగా ఉంటాయి. 12. కుడి వైపున దీర్ఘ చతురస్రాకారంలో ఉబ్బెత్తుగా 2000 అని ముద్రించి ఉంటుంది. 13. కుడి,ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముద్రించిన ఏడు బ్లీడ్ లైన్స్ ఉంటాయి. వెనుక వైపు 14. నోటు ముద్రణ సంవత్సరం ఎడమవైపున ఉంటుంది. 15. నినాదంతో సహా స్వచ్ఛభారత్ లోగో ఉంటుంది 16. మధ్య భాగంలో భాషల ప్యానల్ ఉంటుంది 17. మంగళయాన్ చిత్రం ఉంటుంది. -
ఆర్టీసీకి నకిలీ నోట్ల బెడద
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీని నకిలీ నోట్ల బెడద వెంటాడుతోంది. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్సుల్లో ఈ నోట్ల చలామణి ఎక్కువగా జరుగుతోంది. సంతరోజైన బుధవారం జనాల రద్దీ మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది. బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఉంటారు. ఇదే అదనుగా భావించి కేటుగాళ్లు కండక్టర్లకు నకిలీనోట్లు ఇస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో నోట్లను సరిగా గమనించని కండక్టర్లు వారికి టికెట్లను ఇచ్చి తిరిగి చిల్లర డబ్బులను ఇస్తున్నారు. డ్యూటీ దిగి డిపోలోని క్యాష్ కౌంటర్లో డబ్బులను కండక్టర్లు ముట్టజెప్పి వెళ్తున్నారు. ఆ తర్వాత డిపో క్యాష్ క్లర్క్ డబ్బులను లెక్కించే క్రమంలో ఈ నకిలీ నోట్లు బయటపడుతున్నాయి. బుధ, గురువారల్లో ఈ నోట్ల అధికంగా వస్తున్నట్లు డిపో అధికారి ఒకరు తెలిపారు. ఒకే సిరీస్ నంబర్తో మూడు నాలుగు నోట్లు వచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా రద్దీగా ఉండే పాన్షాపుల్లో కూడా ఈ నోట్లు వస్తున్నట్లు ఓ యాజమాని తెలిపారు. ఓరిజనల్ నోట్లను పోలీనట్లుగానే ఉండటంతో ఈ నోట్లను వెంటనే గుర్తించడం ఇబ్బందిగా మారింది. నకిలీనోట్లు వస్తున్నాయి ఆర్టీసీ బస్సుల్లో నకిలీ నోట్లు వస్తున్నాయి. రద్దీగా ఉండే బస్సుల్లోనే దుండగులు నకిలీ నోట్లను విడిపిస్తున్నారు. బుధ, గురువారల్లో ఇవి ఎక్కువ వస్తున్నాయి. క్యాష్ కౌంటింగ్ మిషన్కు కూడా ఈ నోట్లు చిక్కడం లేదు. బ్యాంకుకు వెళ్తే ఫెక్ నోట్ అంటూ చెబుతున్నారు. – యాదయ్య, ఆర్టీసీ డిపో క్లర్కు -
ఎన్నికల ఇంకు గురించి తెలుసా..?
సాక్షి, కోదాడ : ఎన్నికల సమయంలో దొంగ ఓట్లను నివారించడానికి, ఒకరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయకుండా ఉండడానికి ఎన్నికల సంఘం ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై ఇంకు గుర్తును వేస్తుంది. ఇది దాదాపు నెల రోజుల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. ఈ ఇంకుకు పెద్ద చరిత్రనే ఉంది. దేశంలో జరిగిన 3వ సాధారణ ఎన్నికల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశం మొత్తానికి అవసరమైన ఈ ఇంకును ఒక్క కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. 1937 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పట్టణంలో ఈ ఇంకు తయారీ పరిశ్రమను ‘‘ మైసూర్ ల్యాక్ అండ్ పెయింట్స్ ’’ పేరుతో స్థాపించారు. మహా రాజ నల్వాడీ కృష్ణరాజ వడయార్ దీని వ్యవస్థాపకుడు. తర్వాత దీన్ని మైసూర్ పెయింట్స్ వార్నిష్గా పేరు మార్చారు. ప్రస్తుతం ఈ కంపెనీ కర్ణాటక ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. 1962 నుంచి ఎన్నికల సంఘం తమకు అవసరమయ్యే ఇంకును ఈ పరిశ్రమ నుంచి మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఇది 5, 7, 5, 20, 50 మిల్లీలీటర్ల బాటిళ్లలో దొరుకుతుంది. 5 ఎంఎల్ బాటిల్ 300 మంది ఓటర్లకు సరిపోతుంది. ఈ పరిశ్రమ ఈ ఇంకును ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తుంది. మారుతున్న కాలంతో పాటు ఈ పరిశ్రమ కూడా ఆధునికీకరణ చెందింది. ఈ ఇంకుతో సులువుగా ఉపయోగించడానికి మార్కర్ పెన్నులను కూడా తయారీ చేస్తుంది. ఇతర దేశాలలో వీటిని వాడుతున్నారు. కానీ మనదేశంలో మాత్రం ఇంకా ఇంకును మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ ఇంకు తయారీ అత్యంత రహస్యంగా సాగుతుంది. దీని తయారీలో ఉపయోగించే రసాయన ఫార్ములాను నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ ఆఫ్ ఇండియా అత్యంత రహస్యంగా రూపొం ది స్తుంది. ఇతరులకు దీని తయా రీ తెలియనీయరు. -
పాక్లో మన కరెన్సీ ప్రింటింగ్!
భారత ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే ఉద్దేశంతో భారీగా నకిలీ కరెన్సీని ముద్రించి, దేశంలోకి పంపుతున్న పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ.. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రెస్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెలలో హైదరాబాద్లోని పాతబస్తీలో దొరికిన కరెన్సీ అక్కడే ముద్రితమై బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమబెంగాల్కు వచ్చినట్లు భావిస్తున్నారు. పాక్లోని బలూచిస్తాన్ లో ఉన్న క్వెట్టాలో ప్రత్యేకంగా ‘భారత్ పవర్ ప్రెస్’ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ ముద్రితమైన నకిలీ నోట్లు అసలు వాటిని తలదన్నేలా ఉన్నా.. అసలు నోట్లపై ఉండే కొన్ని భద్రతా ప్రమాణాలను మాత్రం ఐఎస్ఐ కాపీ చేయలేకపోయింది. – సాక్షి, హైదరాబాద్ రూటు మార్చి భారత్కు.. క్వెట్టాలో ముద్రితమవుతున్న ఈ నకిలీ కరెన్సీ తొలుత ఆ దేశ రాజధాని కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్ఐ ప్రత్యేక పార్సిల్స్ ద్వారా పలు మార్గాల్లో భారత్కు వస్తోంది. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి విమానాల ద్వారా దుబాయ్/సౌదీ అరేబియాలకు తరలించే వారు. అక్కడున్న ఏజెంట్ల సహకారంతో జలమార్గంలో ఓడల ద్వారా గుజరాత్, మహారాష్ట్రల్లోని వివిధ ఓడ రేవులకు చేర్చేవారు. చిత్తుకాగితాలు, ముడిసరుకుల పేరుతో వచ్చేవి. కొన్నాళ్లుగా ఈ మా ర్గం ద్వారా తీసుకురావడం కష్టంగా మారడంతో ఐఎస్ఐ రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్కు చేరవేస్తోంది. అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాకు తీసుకొచ్చి ఏజెంట్ల ద్వారా చెలామణీ చేయిస్తోంది. క్వాలిటీతో పాటే పెరిగిన కమీషన్ కరాచీ నుంచి మాల్దా వరకు వివిధ దశల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ఐఎస్ఐ వారికి కమీషన్లు చెల్లిస్తోంది. హైదరాబాద్కు చేరే నకిలీ కరెన్సీ మార్పిడి రేటు 1:3గా ఉండేది. అంటే రూ.30 వేలు అసలు నోట్లు ఇస్తే ఏజెంట్లు రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చే వారు. ఇటీవల ఏజెంట్లకు ఇచ్చే ఈ కమీషన్ పెరిగింది. నోట్లను పక్కాగా ముద్రిస్తున్న నేపథ్యంలో కమీషన్ పెంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల చిక్కిన కరెన్సీని పాతబస్తీకి చెందిన గౌస్కు, మాల్దాకు చెందిన బబ్లూ రూ.50 వేల అసలు కరెన్సీకి రూ.లక్ష నకిలీ నోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా వచ్చే నిధులను పాకిస్తాన్ పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలు ఉన్నాయి. చిక్కిన గౌస్.. పరారీలో బబ్లూ.. బండ్లగూడకు చెందిన మహ్మద్ గౌస్ పండ్ల వ్యాపారి. 1991లో పోలీసులకు బాంబులతో పట్టుబడటంతో బాంబ్ గౌస్గా మారాడు. ఇతడిపై పోలీసులు ఉగ్రవాద చర్యల వ్యతిరేక చట్టం (టాడా) కూడా ప్రయోగించారు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు 2011 నుంచి నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్ నుంచి పలు మార్గాల్లో హైదరాబాద్కు తెప్పించి చెలామణీ చేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా మాల్దాలో ఉన్న కృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన అమీనుల్ రెహ్మాన్ అలియాస్ బబ్లూతో పరిచయం ఏర్పడింది. ఇతడికి రూ.40 వేలు చొప్పున చెల్లిస్తూ రూ.లక్ష నకిలీ కరెన్సీ తెప్పించి చెలామణి చేసేశాడు. బబ్లూ గౌస్తో పాటు అనేక మందికి సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. బబ్లూ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ మూడు గమనించుకోవాలి.. 1. సెక్యూరిటీ థ్రెడ్ కరెన్సీ నోటుకు ముందు వైపు మధ్యలో కుడివైపుగా నోటు విలువ అంకెల్లో ముద్రితమై ఉంటుంది. దీనికి కుడివైపున నోటు లోపలకు, బయటకు కనిపిస్తూ చిన్న పట్టీ ఉంటుంది. సిల్వర్ బ్రోమైడ్తో తయారయ్యే దీనిపై ఆర్బీఐ అంటూ ఆంగ్లం, హిందీ భాషల్లో చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది. ఇది నీలం, ఆకుపచ్చ రంగుల్లో మెరుస్తూ ఉంటుంది. నకిలీ కరెన్సీపై ఆర్బీఐ మార్క్ ఉన్నా.. ఈ థ్రెడ్ సిల్వర్ కోటెడ్ అయి ఉండి, ఆకుపచ్చ రంగు మాత్రమే ఉంటుంది. 2. బ్లీడ్ లైన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించే రూ.2 వేల కరెన్సీ నోటుకు కుడి, ఎడమ వైపుల్లో పైభాగంలో కొన్ని గీతలు ఉంటాయి. బ్లీడ్ లైన్స్గా పిలిచే ఇవి కాస్త ఎత్తుగా, ఒక్కో వైపు ఏడు చొప్పున ఉంటాయి. సాధారణ నోటును చేతితో తడిమితే ఇవి తగులుతాయి. నకిలీ నోట్లలో ఈ ఫీచర్ను కాపీ చేయడం సాధ్యం కాదు. నకిలీ నోట్లపై కూడా లైన్లు ఉన్నా అవి చేతికి తగిలేలా పైకి ఉండవు. 3. వాటర్ మార్క్ కరెన్సీ నోటుకు ముందు భాగంలో కుడి వైపు ఖాళీ ప్రదేశం ఉంటుంది. పైకి కనిపించని విధంగా గాంధీ బొమ్మ ఉంటుంది. దీనికి పక్కగా ఆ నోటు విలువ వేసి ఉంటుంది. ఈ వాటర్ మార్కును వెలుతురులో పెట్టిచూస్తే అందులోనూ గాంధీజీ ఫొటో కనిపిస్తుంటుంది. దాదాపు సగం ప్రాంతానికి సరిపోతూ ఉంటుంది. నకిలీ నోట్లలోనూ ఈ వాటర్మార్క్లో గాంధీజీ ఫొటో ఉన్నా.. దాని చుట్టూ ఖాళీ ఎక్కువగా ఉంటుంది. -
నకిలీ నోట్ల చలామణి
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : ఒరిజినల్ రూ.2 వేల నోట్లను స్కాన్ చేసి .. అదేరీతిలో ఫేక్ రూ.2 వేల నోట్లను జిరాక్స్ తీసి మార్కెట్లోకి చలామణి చేస్తోన్న ఒక వ్యక్తిని ఏలూరు పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం ఏలూరు వన్టౌన్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు, సీసీఎల్ డీఎస్పీ టీ.సత్యనారాయణ వివరాలను వెల్లడించగా వన్టౌన్ ఇన్ఛార్జ్ సీఐ జి.మధుబాబు సమావేశంలో ఉన్నారు. ఏలూరు వన్టౌన్ చిరంజీవి బస్టాండ్ దక్షిణపువీధి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీఎస్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ మధుబాబు, వన్టౌన్ ఎస్ఐ కిషోర్బాబు, సిబ్బంది అతనిని అరెస్టు చేశారు. అతని వద్ద రూ.2 వేల ఫేక్ నోట్లు 50 స్వాధీనం చేసుకున్నారు. రూ.లక్ష విలువ చేసే ఫేక్ నోట్లు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. జిరాక్స్ తీసి చలామణి మెదక్ జిల్లాకు చెందిన ఉప్పరి రాజు ప్రసాద్ అలియాస్ రాజు హైదరాబాద్ పటాన్చెరువు ప్రాంతంలోని శ్రీరామ్నగర్, దుర్గగుడి వద్ద నివాసం ఉంటున్నాడు. రాజు గత కొంతకాలంగా రూ.2 వేల నోట్లను జిరాక్స్ మెషిన్పై కలర్ జిరాక్స్ తీసి ఫేక్ రూ.2 వేల నోటును తీస్తున్నాడు. చిన్నచిన్న తేడాలు మినహా ఒరిజినల్ నోటు మాదిరిగానే కలర్ జిరాక్స్ తీస్తూ మార్కెట్లో చలామణి చేస్తున్నాడు. గతంలో హైదరాబాద్లోనూ కృష్ణా జిల్లా కైకలూరులోనూ రూ.2 వేల ఫేక్ నోట్లను మార్కెట్లోకి చలామణి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ రాజుపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో అధికంగా ఆక్వా, చేపల రైతులు అధిక మొత్తంలో డబ్బులు చేతులు మారుతూ ఉండడం, ఫేక్ కరెన్సీ సులువుగా మార్చుకునే అవకాశం ఉండడంతో రాజు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కైకలూరులో చేపల రైతుల వద్ద ఫేక్ నోట్లు మార్పు చేసే క్రమంలో దొరికిపోవటంతో ఏలూరు కేంద్రంగా మరోసారి ఫేక్ నోట్లు చలామణి చేసేందుకు ప్రయత్నం చేశాడు. రూ.50 వేలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే రూ.2 లక్షల వరకూ ఫేక్ కరెన్సీ ఇచ్చేలా కొందరు వ్యక్తులతో మంతనాలు సైతం చేసినట్టు తెలుస్తోంది. కైకలూరు నుంచి ఏలూరుకు మకాం మార్చటంతో పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారంతో పోలీసులు రాజును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.2 వేల ఫేక్ నోట్లు, జిరాక్స్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై 266/18 489 (సీ) (డీ) ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రాజు ఇప్పటి వరకూ సుమారు రూ.3 లక్షల వరకూ ఫేక్నోట్లు మార్పిడి చేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. నకిలీ నోట్లతో మోసపోవద్దు ఈ ఫేక్ నోట్లు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. రూ.500, రూ.2,000 నోట్లు విషయంలో జాగ్రత్తలు పాటించకుంటే నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అధికంగా డబ్బు చలామణి అయ్యే బార్లు, మద్యం దుకాణాలు, హోటల్స్, మాల్స్, చేపల వ్యాపారాల వద్ద ఫేక్ నోట్లు చలామణి చేసేందుకు ఇలాంటి ముఠాలు ప్రయత్నాలు చేస్తుంటాయని తెలిపారు. రూ.2 వేల నోటు వైట్స్పాట్లో గాంధీ బొమ్మ ఉంటుందని, లోపల రూ.2,000 అని అడ్డంగా రాసి ఉంటుందని, ఈ రెండు లేకుంటే ఫేక్నోటుగా భావించాల్సి ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఫేక్ నోట్లలో రెండు, మూడు నోట్లు ఒకే సీరీస్తో ఉంటున్నాయని, ఇలా ఒకే సీరిస్తో ఏవైనా నోట్లు ఉన్నట్లు గమనిస్తే దొంగనోట్లుగా గుర్తించాలని కోరారు. అధికమొత్తంలో డబ్బులు ఆశచూపించి మోసం చేసేందుకు ప్రయత్నిస్తారని, అటువంటి మోసాలకు, ప్రలోభాలకు లొంగిపోవద్దని సీసీఎస్ డీఎస్పీ సత్యనారాయణ ప్రజలకు సూచించారు. -
ఏటీఎంలో నకిలీ నోట్లు.!
ఎదులాపురం(ఆదిలాబాద్): జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంకు ఏటీఎం కేంద్రం నుంచి వచ్చిన రూ.500ల నోట్లు నకిలీవిగా కలకలం రేగింది. దక్కన్ గ్రామీణ బ్యాంకు సమీపంలో ఉన్న ఓ బ్యాంకు ఏటీఎంలో ఆదివారం పట్టణానికి చెందిన శంకర్గౌడ్, గంగాధర్ అనే వ్యక్తులు డబ్బులు డ్రా చేశారు. ఆ సమయంలో ఎర్రా సిరాతో రాసిన.. ప్రింట్ కనిపించకుండా.. ఇతర రంగుతో కూడిన నోట్లు వచ్చాయి. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. బ్యాంకుల్లో సిరాతో రాయబడిన, ఇతర రంగుల్లో ఉన్న నోట్లను తీసుకోవడం లేదని, ఏటీఎం ద్వారా ఇలాంటి నోట్లు రావడం ఏంటని వాపోయారు. సంబంధిత బ్యాంకు అధికారులు స్పందించి ఇకనైనా ఇలాంటి నోట్లు రాకుండా చూడాలని వినియోగదారులు కోరారు. -
ఏటీఎం నుంచి చెల్లని నోట్లు
సాక్షి, విశాఖపట్నం, నాతవరం: ఇండియా వన్ ఏటీఎం ద్వారా రూ.500 నోట్లుపై రంగులు పడిన చెల్లని నోట్లు రావడంతో వినియోగదారులు అందో ళన చెందుతున్నారు. మర్రిపాలెం గ్రామానికి చెందిన సత్తిబాబు అనే వ్యక్తి సోమవారం నర్సీపట్నం ఆస్పత్రికి వెళ్తూ మార్గమధ్యంలో డి.యర్రవరం జంక్షన్లో గల ఇండియా వన్ ఏటీఎంకు వెళ్లి తన కార్డు ద్వారా రూ. మూడు వేలు నగదు తీశాడు. అయితే వచ్చిన ఆరు రూ.500 నోట్లుపై ఎర్రటి పసుపు రంగుతో కూడిన రంగులు ఉన్నాయి. నోట్లన్నిటిపైనా రంగులు పడి ఉండడంతో అవి ఎక్కడా చెల్లలేదు. దీంతో ఏం చేయాలో తెలియక లబో దిబో మన్నాడు. ఇదే విధంగా తూర్పుగోదా వరి జిల్లా కోటనందూరుకు చెందిన మరో వ్యక్తి కూడా ఇదే ఏటీఎంలో డబ్బులు తీశా రు. అయనకు కూడా రంగులు పడిన రూ. 500 నోట్లు రావడంతో అందోళన చెందారు. -
కృష్ణా జిల్లాలో దొంగనోట్ల కలకలం..!
సాక్షి, విజయవాడ: జిల్లాలోని నందిగామలో దొంగనోట్లు ముద్రిస్తున్నారనే వార్త కలకలం రేపింది. పాత బైపాస్ రోడ్డులో గల ఓ ఇంట్లో దొంగ నోట్లు ముద్రిస్తున్నారనే పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం ఉదయం దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నోట్లు ముద్రించే సాధనంగా భావిస్తున్న ప్రింటర్ స్కానర్, మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటికి తాళం వేసి సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎన్కేపాడులో.. విజయవాడ రూరల్ మండలంలోని ఎన్కేపాడులో దొంగనోట్లు ముద్రిస్తున్న షేక్ బాబు, షేక్ సుభాని, షేక్ జానీలను గురువారం ఉదయం టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 75 వేల రూపాయలు విలువగల రూ. 100 నోట్లను, కంప్యూటర్, ప్రింటర్ను స్వాధీనం చేసుకున్నారు. -
మన్యంలో దొంగనోట్లు
విశాఖ, చింతపల్లి(పాడేరు):మన్యంలో దొంగనోట్ల చలామణీ జోరుగా సాగుతోంది. వారపుసంతలు వేదికలుగా చేసుకుని వ్యాపారులు నోట్ల మార్పిడికి పాల్పడుతున్నారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన వారపుసంతలో తమ్మంగులకు చెందిన ఓ గిరిజన రైతు అటవీఉత్పత్తులను తీసుకువచ్చి విక్రయించాడు. గుర్తు తెలియని వ్యాపారి అధిక ధరకు ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. అత్యాశకు పోయిన గిరిజనుడు రూ.2 వేల నోటు తీసుకుని ఉత్పత్తులను విక్రయించాడు. నిత్యావసర సరుకుల కోసం కిరాణ దుకాణానికి వెళ్లి రెండు వేల నోటు ఇవ్వగా సదరు వ్యాపారి నోటు నకిలీదని తెలిపాడు. రెండు వేల నోటు మిగతా నోట్లకు భిన్నంగా ఉండండతో గిరిజనుడు ఆ నోటును చించివేసి వెళ్లిపోయాడు. -
4 వేలకు ఆశ పడితే..
హైదరాబాద్ : నాలుగు వేల రూపాయల అదనపు కమిషన్కు ఆశపడిన ఓ ఏజెంట్ రూ.25 లక్షలకు మోసపోయిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 35 వేల అమెరికన్ డాలర్లను తీసుకుని తెల్ల కాగితాలు ఇచ్చి అతడిని బురిడీ కొట్టించాడో ఘరానా మోసగాడు. దీంతో బాధితుడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరాంఘర్కు చెందిన ఆటోడ్రైవర్ మోహిన్ అమెరికా డాలర్లు కావాలంటూ వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తిని రెండ్రోజుల క్రితం పాతబస్తీకి చెందిన రఫీక్ అనే ఏజెంట్ వద్దకు తీసుకొచ్చాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి 2,700 అమెరికా డాలర్లను తీసుకుని నగదు చెల్లించాడు. మార్కెట్ రేటు కంటే అదనంగా కమీషన్ చెల్లించాడు. బుధవారం మరో 35 వేల డాలర్లు కావాలంటూ ఆ వ్యక్తి మోహిన్, రఫీక్ను సంప్రదించాడు. ఈ వ్యవహారం ఫోన్లో సాగింది. రఫీక్ వద్ద అంత మొత్తంలో అమెరికన్ డాలర్లు లేకపోవడంతో మరో ఏజెంట్ జాఫర్కు సమాచారం ఇచ్చాడు. జాఫర్ 35 వేల డాలర్లు సమకూరుస్తానని గురువారం మధ్యాహ్నం వరకు టైం తీసుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి డబ్బు రెడీగా ఉందని డాలర్లు అత్యవసరంగా కావాలంటూ రఫీక్కు ఫోన్ చేశాడు. తాను గచ్చిబౌలిలోని కాఫీ డెల్ వద్ద కలుస్తానని సమాచారం ఇచ్చాడు. 4.30 గంటల ప్రాంతంలో రఫీక్, మోహిన్, జాఫర్లు 35 వేల డాలర్లను తీసుకుని హోటల్కు చేరుకున్నారు. అప్పటికే హోటల్లో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి.. వారి నుంచి డాలర్లను తీసుకుని రూ.25 లక్షల నగదు ఉన్న బ్యాగును వీరికి అందించాడు. డబ్బు బండిళ్లలో పైన అసలైన నోట్లు పెట్టి లోపల తెల్లకాగితాలను అమర్చాడు. డబ్బు లెక్కిద్దామని ముగ్గురూ అడగ్గా.. గుర్తుతెలియని వ్యక్తి వారిని తుపాకీతో బెదిరించి కారులో వెళ్లిపోయాడు. ముగ్గురూ కారులో నార్సింగి వచ్చి డబ్బు సరి చూసుకోగా తెల్ల కాగితాలు కనిపించాయి. మోసపోయామని గుర్తించిన జాఫర్ నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం జాఫర్ ఒక్కడే పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. మోహిన్, రఫీక్ ఎక్కడికి వెళ్లారనే దానిపై పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు జాఫర్ను విచారిస్తున్నారు. బాధితుడి కాల్ డేటా సేకరణ.. జాఫర్ నుంచి నార్సింగి పోలీసులు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. జాఫర్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. పాతబస్తీ నుంచి ఎప్పుడు వెళ్లాడు, ఎవరెవ్వరితో మాట్లాడాడు అనే విషయాలను సెల్ సిగ్నల్స్ ద్వారా సేకరిస్తున్నారు. ఓఆర్ఆర్పై నుంచి వచ్చామని జాఫర్ తెలపడంతో గచ్చిబౌలి, పుప్పాలగూడ, కోకాపేట, హిమాయత్సాగర్ తదితర ప్రాంతాలలోని సీసీ ఫుటేజీలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కాఫీ డెల్ హోటల్ సీసీ ఫుటేజీనీ పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితుడు తెలిపిన వివరాలతోపాటు సీసీ ఫుటేజీలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి పాత నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు ఎక్కడున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ కరెన్సీ నోట్ల హల్చల్
గుర్రంకొండ: మండల కేంద్రమైన గుర్రంకొండలో నకిలీ కరెన్సీ నోట్ల చెలామణి జోరుగా సాగుతోంది. రూ.100, రూ.50 నకిలీ కరెన్సీ నోట్లు ఎక్కువగా చలామణీ జరుగుతోంది. రూ.50 నోట్లలో సాధారణంగా ఉన్న సహజ రంగుల కంటే నకిలీ నోట్లు భిన్నంగా కనిపిస్తున్నాయి. నోటు దళసరి కూడా సాధారణ నోటు కంటే చాలా పలుచగా ఉంటోంది. జనం రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండు, వారపు సంతల్లో నకిలీ నోట్లు చలామణీ ఎక్కువగా జరుగుతోంది. రూ. 100 నోట్లు కూడా నకిలీవి హాల్చల్ చేస్తున్నాయి. బస్టాండులోని చిల్లరు దుకాణంలో ప్రతి నిత్యం ఈ నోట్లు కనిపిస్తున్నాయి. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వ్యాపారస్తులు కోరుతున్నారు. -
కేరళ నటి నకిలీ నోట్ల రాకెట్ గుట్టు రట్టు
పెరబూరు (చెన్నై): కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బుల్లితెర నటి సూర్య శశికుమార్ నకిలీ నోట్ల ముద్రణ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఇరుక్కి సమీపంలోని అణక్కరై ప్రాంతంలో గత కొన్ని రోజుల క్రితం కేరళ పోలీసులు చేసిన శోధనల్లో రూ.2.5 లక్షల నకిలీ నోట్లతో లియో, కృష్ణకుమార్, రవీంద్రన్ అనే ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా సూర్య శశికుమార్(36) ఇంట్లో నకిలీ నోట్లు ముద్రిస్తున్న విషయం బయటపడింది. పోలీసులు సూర్య శశికుమార్ ఇంటిలో సోదాలు నిర్వహించగా రూ.57 లక్షల నకిలీనోట్లు, వాటిని ముద్రిస్తున్న కంప్యూటర్, ప్రింటర్ లభించాయి. దీంతో సూర్య శశికుమార్ను, ఆమె తల్లి రమాదేవి, చెల్లెలు శృతిలను అరెస్ట్ చేసి విచారించారు. సూర్య శశికుమార్కు బీజూ అనే దొంగ స్వామీజీ ద్వారా దొంగనోట్ల ముఠాతో సంబంధాలు ఏర్పడినట్లు విచారణలో తెలిసింది. ఆమెకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లు వెల్లడైంది. సూర్య శశికుమార్ దొంగనోట్లను కేరళ రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడులోనూ విస్తరింపజేయడానికి ఏజెంట్లతో ఒప్పందం కుదుర్చుకుందని తేలటంతో కేరళ పోలీసులు తమిళనాడులోనూ దర్యాప్తు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
ఏటీఎం కేంద్రంలో చెల్లని నోట్లు
నర్సీపట్నం: ఏటీఏం కేంద్రాల్లో చెల్లని నోట్లు వస్తుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా బ్యాంకు సిబ్బందికి తెలిసే జరుగుతుందని ఖాతాదారులు ఆరోపిస్తుండగా, దీనికి ఏటీఎం కేంద్రాల్లో నగదు పెట్టే ఏజెన్సీ నిర్వాహకులే బాధ్యులని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. సోమవారం పట్టణంలోని చింతపల్లి రోడ్డులో ఉన్న సెంట్రల్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో నగదు డ్రా చేసిన వారు ఈ సమస్యను ఎదుర్కొన్నారు.ఉదయం 11 గంటల నుంచి డ్రా చేసిన వారందరికీ కాలిపోయిన, ఇంకు మచ్చలతో చిరిగిన రూ.2 వేల నోట్లు వచ్చాయి. డ్రా చేసిన వారందరికీ ఈ సమస్య ఎదురైంది. పట్టణంలో శివపురానికి చెందిన నందకిషోర్ తన భార్య నాగేశ్వరి ఏటీఎం కార్డు నుంచి రూ.10 వేలు డ్రా చేశారు. వీటిలో ఐదు రెండు వేల నోట్లలో నాలుగు నోట్లు చిరిగిన, ఇంకు మచ్చల నోట్లు ఉన్నాయి. పెళ్లి ఖర్చుల నిమిత్తం డబ్బులు డ్రాచే సేందుకు నర్సీపట్నం మండలం మొండిఖండి నుంచి వచ్చిన రామలక్ష్మికి ఇదే సమస్య ఎదురైంది. రూ.20 వేలు డ్రాచేస్తే రెండు రెండు వేల నోట్లు చెల్లనివి ఉన్నాయి. వీరికన్నా ముందు రూ.40 వేలు డ్రా చేసిన ఖాతాదారునికి మొత్తం చెల్లని నోట్లు రావడంతో కంగుతిన్నాడు. వీరంతా ఆందోళనకు గురవడంతో ఏటీఏం కేంద్రం సెక్యూరిటీ సిబ్బంది సూచన మేరకు కిలోమీటరు దూరంలోని సెంట్రల్ బ్యాంక్ బ్రాంచికి వెళ్లారు. బ్యాంకు మేనేజర్ నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఆగ్రహించారు. ఒక దశలో బ్యాంకుకు సంబంధం లేదని చెప్పిన మేనేజర్ మోహన్రాజ్ బాధితుల సంఖ్య పెరగడంతో మెట్టు దిగారు. ఏటీఏం కేంద్రంలో నగదు పరిశీలించారు. డ్రా చేసిన రశీదు ఆధారంగా నగదు చెల్లించారు. ఎందుకిలా... ఏటీఎం కేంద్రాల్లో చెల్లని నోట్లు రావడం వెనుక పెద్ద రాకెట్ ఉందని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఏటీఎం కేంద్రాల్లో సంబంధిత బ్యాంకు అధికారులు లేదా ఏజెన్సీ నిర్వాహకులు నగదు ఏర్పాటు చేస్తారు. బ్యాంకు అధికారుల విషయానికొస్తే రిజర్వ్బ్యాంకు సూచనలకు అనుగుణంగా ఉన్న నోట్లను మాత్రమే కౌంటర్లలో ఖాతాదారులనుంచి తీసుకుంటారు. అందువల్ల ఏటీఎం కేంద్రాల్లో చెల్లని నోట్లు రావడం వెనుక కరెన్సీ ఏజెన్సీ ప్రమేయం ఉందన్న విమర్శలున్నాయి. నర్సీపట్నంలోని సెంట్రల్ బ్యాంకు ఏటీఏం కేంద్రంలో డైవోల్డ్ ప్రైవేట్ ఏజెన్సీ నగదు ఏర్పాటు చేసింది. చెల్లని నోట్లు రావడంతో బ్యాంకు మేనేజర్ ఏజెన్సీ ప్రతినిధిని రప్పించి ప్రశ్నించారు. తాము ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తెచ్చిన నగదును ఏటీఎం కేంద్రంలో ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం ఉందనే దానిపై బ్యాంకు ఉన్నతాధికారులు పోలీసులతో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. -
నకిలీ చలా‘మనీ’!
సాక్షి, సిటీబ్యూరో : పాత కరెన్సీ పెద్ద నోట్లను రద్దు చేస్తే జన బాహుళ్యంలో ఉన్న దొంగనోట్ల బెడద తప్పుతుందని భావిస్తే.. నకిలీగాళ్లు మాత్రం ‘కొత్త’గా చెలరేగిపోతున్నారు. ప్రభుత్వం సరికొత్త కరెన్సీ నోట్లను అమల్లోకి తెచ్చాక కూడా రాజధాని నగరంలో ఫేక్ కరెన్సీ ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతోంది. డీమానిటైజేషన్ అమలులోకి వచ్చిన 2016లో నకిలీ నోట్ల చలామణిపై 88 కేసులు నమోదు కాగా, గతేడాది 76 కేసులు, ఈ ఏడాది మే వరకు 34 కేసులు సీసీఎస్లో నమోదయ్యాయి. ఫేక్ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ నోట్లకు సంబంధించిన ప్రతి ఉదంతాన్నీ హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా బ్యాంకులను ఆదేశించింది. దేశ భద్రతతో ముడిపడిన అంశం కావడంతో ప్రతి కేసుకూ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కచ్చితంగా ఫిర్యాదు చేయాల్సిందే.. వినియోగదారుల నుంచి బ్యాంకులకు కొన్ని నకిలీ నోట్లు రావడం ఎప్పటి నుంచో ఉంది. కేవలం ఒకటిరెండు నోట్లు వస్తే ఒకప్పుడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే ఆర్బీఐ గతేడాది కీలక ఆదేశాలు జారీ చేసింది. నకిలీ నోట్లు వెలుగులోకి వచ్చిన ప్రతి ఉదంతం పైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేసింది. రాజధానిలో బయటపడే కరెన్సీకి సంబంధించి కేసుల నమోదు, దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్ పోలీసులు చేపడుతున్నారు. దీంతో బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని కచ్చితంగా పోలీసుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తున్న సీసీఎస్ అధికారులు.. బ్యాంకునకు వచ్చిన వినియోగదారుడి వద్ద ఒక లావాదేవీలో నాలుగు అంతకంటే తక్కువ నకీలీ కరెన్సీ నోట్లు వస్తే దాన్ని నాన్–ఎఫ్ఐఆర్ కేసుగా, ఐదు అంతకంటే ఎక్కువ నోట్లు వస్తే ఎఫ్ఐఆర్ కేసుగా పరిగణిస్తున్నారు. బ్యాంకులు గుర్తించకుండా, అసలు వాటికి చేరకుండా చెలామణిలో ఉంటున్న ఫేక్ కరెన్సీ.. గుర్తించిన దానికంటే కొన్ని రెట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. క్వాలిటీ బాగుంటే ‘యూఏపీఏ’ కింద ఆర్బీఐ సహా వివిధ బ్యాంకులు తమ ఫిర్యాదుతో పాటు గుర్తించిన నకిలీ నోట్లను సైతం తీసుకువచ్చి సీసీఎస్ అధికారులకు అప్పగిస్తాయి. నాన్ ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్.. వీటిలో ఏ తరహా కేసు అయినప్పటికీ పోలీసుల ప్రాథమికంగా ఆ నకిలీ నోట్లను మైసూర్లోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్కు పంపిస్తారు. నోట్లను అక్కడి నిపుణులు పరీక్షించి నకిలీ కరెన్సీ క్వాలిటీ నిర్దేశిస్తూ నివేదిక ఇస్తారు. నకిలీ నోట్లు హై క్వాలిటీతో ఉన్నట్లు నివేదిక వస్తే సీసీఎస్ పోలీసులు అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) ను సైతం జోడిస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టు ఉత్తర్వులకు లోబడి సీసీఎస్ పోలీసులు ఆయా నకిలీ నోట్లను ధ్వంసం చేయడానికి ఆర్బీఐకే అప్పగిస్తున్నారు. ఈ నకిలీ కరెన్సీలో రూ.2 వేల డినామినేషన్లో ఉన్నవే ఎక్కువగా ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ‘చెస్ట్’ కేసుల్లో దర్యాప్తు కష్టమే.. సీసీఎస్ అధికారులకు బ్యాంకులతో పాటు ఆర్బీఐ నుంచీ ఈ నకిలీ కరెన్సీపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఓ వినియోగదారుడు చేసిన లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదుల కేసుల్లో పురోగతి ఉంటోంది. ఆ వ్యక్తిని పిలిచి వాంగ్మూలం నమోదు చేస్తున్న పోలీసులు.. మరికాస్త ముందుకు వెళ్లి కూపీ లాగుతున్నారు. ఇలా బ్యాంకు స్థాయిలో గుర్తించలేని నకిలీ కరెన్సీని ఆయా బ్యాంకులకు చెందిన చెస్ట్లకు పంపినప్పుడు అక్కడి సిబ్బంది గుర్తిస్తున్నారు. ఇక్కడా సాధ్యం కాకుంటే ఆర్బీఐ అధికారులు గుర్తిస్తున్నారు. అయితే సదరు కరెన్సీ ఏ బ్యాంకు శాఖ నుంచి వచ్చిందో బ్యాంకు చెస్ట్ నుంచి వచ్చిందో ఆర్బీఐ చెస్ట్ అధికారులు చెప్పగలుగుతున్నారు. ఇంతకు మించి మరే వివరాలు దొరకడం లేదు. ఫలితంగా దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఇలాంటి కేసుల్లో మూతపడుతున్నవే ఎక్కువగా ఉంటున్నాయి. (చెస్ట్ అంటే.. ఒక బ్యాంకు చెందిన అన్ని శాఖల నుంచి వచ్చిన నగదు నిల్వ కేంద్రం. ఇక్కడి నుంచే కొత్త నోట్లు ఆయా శాఖలకు సరఫరా చేస్తారు) సీసీఎస్ గణాంకాల ప్రకారం ఫేక్ కరెన్సీపై నమోదైన కేసులు ఇవీ.. ఏడాది ఎఫ్ఐఆర్ నాన్– ఎఫ్ఐఆర్ గుర్తించిన నోట్లు 2016 9 79 70,823 2017 4 72 22,867 2018 (మే) 3 31 17,740 -
వృద్ధురాలిని ఏమార్చి...దొంగనోటును అంటకట్టి..!!
తిరుపతి రూరల్: ఈమె పేరు కన్నమ్మ... వయస్సు 78 ఏళ్లు...ఊరు పాకాల మండలం దామలచెరువు. ప్రతిరోజూ అక్కడి నుంచి మామిడి కాయల తట్టతో తిరుపతికి వస్తుంది. ఎర్రటి ఎండలో ఫుట్పాత్పైన పెట్టుకుని వాటిని విక్రయిస్తుంది. రెండు రోజులుగా ఇలాగే కష్టపడి తిరుపతికి వచ్చి వ్యాపారం చేస్తోంది. మంగళవారం ఉదయం 7.50 గంటలకు తిరుపతి అన్నమయ్య సర్కిల్కు మామిడికాయల తట్టతో చేరుకున్న ఆమె ఫుట్పాత్పై కాయల విక్రయానికి సిద్ధమైంది. అంతలోనే ఓ నడివయస్కుడు బైక్పై వచ్చాడు. మూడు కేజీల కాయలు కావాలని అడిగాడు. కేజీ రూ.30 చొప్పున మూడు కేజీలకు రూ.90 అని చెప్పింది. ఇప్పుడే వచ్చాను...కాయలు వేయడానికి కవర్లు కూడా లేవు. ఉండు ఇప్పడే వస్తాను అంటూ లేని ఓపికను తెచ్చుకుని లేవబోయింది. ఇంతలో అతను రూ.500 కాగితం తీసి ఇచ్చాడు. రూ.500 కాగితం చూడగానే ఆ వృద్ధురాలు తబ్బిఉబ్బిపోయింది. నాయనా....నీదే తొలిబేరం....ఆరోగ్యం సరిగా లేదు.... కాయలు అమ్ముడు పోయి త్వరగా ఇంటి వెళ్లాలి...అసలే కళ్లు తిరుగుతున్నాయి.... అంటూ సంతోషంతో రూ.500 నోటు చేతికి తీసుకుంది. చేతితో తాకగానే ఏదో... తేడా కొట్టడంతో, అయ్యా.... ఈ నోటు... అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఏంది అవ్వ....అనుమానమా? అదిగో ఆ షాపు ఆమే ఇచ్చింది...ఏదైనా ఇబ్బంది అంటే వాళ్లకే ఇచ్చేయ్...అంటూ దబాయించాడు. ఎక్కడ తొలిబేరం పోతుందో...అనే ఆత్రుతలో ఆ నోటును తీసుకుని..రూ.410, మూడు కిలోల మామిడికాయల కవర్ను ఇచ్చింది. మరో బేరం రావడంతో చిల్లర కోసం వెళ్లిన ఆమెకు అది దొంగనోటు అని చెప్పడంతో అవాక్కయింది. తాను మోసపోయిన విషయం తెలిసి గుండెలు బాదుకుంది. వెక్కివెక్కి ఏడ్చింది. ఏడ్చి..ఏడ్చి స్పృహతప్పిపోయింది. ఆమె దీనవస్థను చూసి, చలించిన చుట్టుపక్కల వాళ్లు ఆమెకు సహాయం చేయాలని ప్రయత్నించారు. ఆత్మాభిమానం కలిగిన ఆమె వాటిని సున్నితంగా తిరస్కరించింది. సీసీ కెమెరాల్లో నిందితుడు... దొంగనోటు ఇచ్చి వృద్ధురాలిని ఏమార్చిన వ్యక్తిని పట్టుకోవాలని స్థానికులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈస్ట్ పోలీస్స్టేషన్లోని కమెండ్ కంట్రోల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితుడిని గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దొంగనోట్లు అతని వద్దకు ఎలా వచ్చాయి? అతనేనా, అతనితో పాటు ముఠా ఉందా? అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. -
షాకింగ్: ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు
సాక్షి, లక్నో: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఒకవైపు నో క్యాష్ బోర్డులతో పలు ఏటీఎంలు వెక్కిరిస్తోంటే..మరోవైపు అరకొరగా పనిచేస్తున్న ఏటీఎంలలో నకిలీ నోట్ల హంగామా వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో నకిలీ రూ.500నోట్లు ఆందోళనలో పడేశాయి. సుభాష్ నగర్లో ఏర్పాటు చేసిన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో నకిలీ 500 రూపాయల నోట్లు దర్శనమిచ్చాయి. 'చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా', 'భారతీయ మనోరంజన్ బ్యాంకు', 'చురాన్ లేబుల్' పేరుతో ఉన్న ఈ నకిలీ కరెన్సీ నోట్లు స్థానికుల్లో కలవరం పుట్టించాయి. అశోక్ కుమార్ పాథక్ అనే రిటైర్డ్ ఉద్యోగికి ఆదివారం ఉదయం ఈ షాకింగ్ ఘటన ఎదురైంది. ఏటీఎం నుంచి 4500 రూపాయలను విత్ డ్రా చేయగా దాంట్లో ఒక నోటుపై 'చిల్డ్రన్ బ్యాంక్ అఫ్ ఇండియా' రాసి వుండటాన్ని ఆయన గుర్తించారు. ఈయనతో పాటు మరికొందరికికూడా ఇలాంటి అనుభవమే ఎదురుకావడంతో టోల్ఫ్రీ నెంబర్ ద్వారా బ్యాంకు వారికి ఫిర్యాదు చేశారు. అయితే తాము అన్ని ఏటీఎంలలో కరెన్సీ నోట్లను తనిఖీ చేశామని, ఎలాంటి నకిలీ నోట్లను తాము గుర్తించలేదని బ్యాంకు మేనేజర్ బచన్ షా చెప్పారు. సంబంధిత ఏజెన్సీపై చర్య తీసుకోవాలని కలకత్తాలోని తమ ప్రధాన కార్యాలయానికి ఒక నివేదికను పంపినట్టు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై సమాజ్వాద్ పార్టీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.. దేశంలోని చాలా ఏటీఎంలు నకిలీ కరెన్సీ నోట్లను పంపిణీ చేస్తున్నాయని ఎస్పీ జిల్లా కార్యదర్శి ప్రమోద్ యాదవ్ ఆరోపించారు. -
దొంగనోట్ల చలామనీపై అప్రమత్తం : ఏఎస్పీ
రామభద్రపురం: సాలూరు పరిధిలో దొంగనోట్లు చలామనీ అవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం డివిజన్ ఏఎస్పీ దీపికాపాటిల్ సూచించారు. స్థానిక పోలీసుస్టేషన్లో గురువారం ఆమె మాట్లాడారు. ఇటీవల సాలూరు ప్రాంతంలో దొంగనోట్లు చలామనీ చేసిన ముఠాను పట్టుకొన్నామని, వారి నుంచి కొంత మొత్తాన్ని రికవరీ చేశామన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దొంగనోట్లలో వాటర్ మార్క్ కనిపించదని, అటువంటి నోట్లు ప్రజలు గమనించి తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య ఉన్న అన్ని ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రామభద్రపురం, సాలూరు, పి.కోనవలస వద్ద ఘాట్ రోడ్డు, పార్వతీపురం, తోటపల్లి ప్రాజెక్టు, కొత్తవలస రైల్వేగేట్ తదితర ప్రాంతాల వద్ద ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని ఈ సమస్యను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రామభద్రపురంలో రహదారి విస్తరణపై ఎస్పీకి లేఖ రావామని, రోడ్లు భద్రతా కమిటీకి కలెక్టర్ చైర్మన్గా ఉన్నందున నిధులు సమకూర్చుతామని తెలిపినట్టు పేర్కొన్నారు. ఆమె వెంట ఎస్ఐ డీడీ నాయుడు ఉన్నారు. -
కొత్త పంథాలో నకిలీ నోట్ల మార్పిడి..
సాలూరు: జిల్లాలో దొంగనోట్ల చెలామణి జోరుగా సాగుతోంది. అసలు నోట్లకు రెట్టింపు నకిలీ నోట్లు ఇస్తామని నమ్మిస్తూ కొందరు వరుస మోసాలకు పాల్పడుతుండగా.. ఇంకొందరు ఎంచక్కా అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞాణాన్ని వినియోగించుకుంటూ బ్యాంకులను సైతం బురిడీ కొట్టిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఏటీఎంల వద్ద బ్యాంకులు ఏర్పాటు చేసిన క్యాష్ డిపాజిట్ మిషన్లు (సీడీఎం)ను మార్పిడికి సురక్షిత మార్గంగా ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. డిపాజిట్ మిషన్లు దొంగ నోట్లను గుర్తించలేకపోవడంతో అక్రమార్కులు ఎంచక్కా అందులో నగదును జమ చేసుకుని, వేరే ఏటీఎంల ద్వారా తీసేస్తున్నారు. స్థానికంగా కొంతమంది వ్యాపారులు ఇదే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. గతంలో దొంగనోట్ల చెలామణీలో కీలకపాత్ర వహించి ఒక్కసారిగా లక్షాధికారులైన వారే ఈతరహా దోపిడీకి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సీడీఎం మిషన్లలో వేసినవి అసలు నోట్లా.. నకిలీవా అని బ్యాంక్ సిబ్బంది తెలుసుకోవచ్చు. కాని మిషన్లలో జమ చేస్తున్న నగదు బ్యాంక్ సిబ్బందికి చేరడం లేదు. అక్రమార్కులు సొమ్ము డిపాజిట్ చేస్తుంటే అదే మిషన్ నుంచి మిగతా ఖాతాదారులు డబ్బులు విత్డ్రా చేస్తుండడంలతో నకిలీ నోట్లు వారికి చేరిపోతున్నాయి. పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, హోమ్గార్డు ఇదిలా ఉండగా విజయనగరంలో జీపు డ్రైవర్గా పనిచేస్తున్న హోమ్గార్డుతో పాటు సాలూరు గొర్లెవీధికి చెందిన శకుంతల, పెదకుమ్మరివీధి సమీపంలోని చెరువుగట్టుకు చెందిన శ్యామల దొంగనోట్ల చలామణి చేస్తున్నారనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వీరిని ఏఎస్పీ దీపికాపాటిల్ విచారణ నిమిత్తం శుక్రవారం విజయనగరానికి తరలించినట్లు తెలిసింది. దొంగనోట్లు తెచ్చుకుందామని వెళ్లి... ఇచ్చిన డబ్బులకు రెట్టింపు దొంగనోట్లు తెచ్చుకునే క్రమంలో ఇద్దరు మహిళలు పట్టుబడినట్లు సమాచారం. ఇదే తరహా వ్యవహారంలో హోమ్గార్డు కూడా చిక్కుకోవడంతో వీరిని పోలీసులు విచారిస్తున్నారు. -
దేవరపల్లిలో దొంగనోట్ల ముఠా హల్చల్
దేవరపల్లి: దేవరపల్లిలో దొంగనోట్లు మార్పిడి చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను బుధవారం సాయంత్రం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దేవరపల్లి–గోపాలపురం రోడ్డులోని టుబాకో బోర్డు సమీపంలో గల హోటల్ వద్ద దొంగనోట్లు మార్పిడి చేసే ముఠా ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై పి.వాసు సిబ్బందితో హోటల్ వద్దకు చేరుకుని ముఠా సభ్యులను చుట్టుముట్టారు. దీంతో ముఠా సభ్యులు ఎదురుదాడికి దిగి తప్పించుకొనే ప్రయత్నం చేయగా ఎస్సై గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.2,10,900 విలువైన రూ.2,000, 500, 200, 100 దొంగ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, సీఐ సి.శరత్రాజ్కుమార్ దేవరపల్లి పోలీస్స్టేషన్కు చేరుకుని ఇద్దరు ముఠా సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వీరు తూర్పు గోదావరి, కృష్ణాజిల్లాకు చెందినవారిగా తెలిసింది. అయితే విజయవాడ కేంద్రంగా పెద్ద ముఠా దొంగనోట్లు చలామణి చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల యర్నగూడెంలో దొంగనోట్లతో ముఠా సభ్యులు కారులో ఏలూరు వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కారు ఆపి వివరాలు సేకరిస్తుండగా ముఠా సభ్యులు అతివేగంగా కారుతో ఉడాయించినట్టు తెలిసింది. దేవరపల్లి అడ్డాగా చేసుకుని కొన్నేళ్లుగా ఉభయగోదావరి, కృష్ణా, తెలంగాణకు చెందిన ముఠా దొంగనోట్లు చలామణి చేస్తున్నట్టు సమాచారం. -
నకిలీ నోట్ల కేసులో న్యాయవాది అరెస్ట్
తిరుపతి క్రైం: తిరుపతి నగరంలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఓ న్యాయవాదితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఈస్టు సబ్ డివిజనల్ ఇన్చార్జి డీఎస్పీ సుధాకర్రెడ్డి తెలిపారు. ఆయన శనివారం ఈస్టు పోలీసు స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. రాయలచెరువు రోడ్డులోని పళణి థియేటర్ సమీపంలో దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్టు సమాచారం వచ్చిందన్నారు. ఈస్టు సీఐ శివప్రసాద్, ఎస్ఐలు షేక్షావలి, ప్రవీణ్కుమార్ తమ సిబ్బందితో దాడి చేశారని పేర్కొన్నారు. ఇందులో దొంగనోట్లు చెలామణి చేస్తున్న వైఎస్సార్ జిల్లాకు చెందిన న్యాయవాది రామచంద్రరావును అరెస్టు చేశామన్నారు. అతను తిరుపతి నగరంలోని చెన్నారెడ్డి కాలనీలో నివాసముంటూ స్థానిక కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలిపారు. స్నేహితుడి సాయంతో దొంగనోట్లను చెలామణి చేస్తున్నట్టు వివరించారు. అతని వద్ద ఉన్న దొంగనోట్లు రూ.17,500తోపాటు చెన్నారెడ్డికాలనీలో ఉన్న ఇంట్లో ఉంచిన రూ.4.80 లక్షల విలువైన దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అవి వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం నూనెవారిపల్లికి చెందిన నాగాహరిప్రసాద్ ద్వారా వచ్చినట్టు విచారణలో చెప్పాడన్నారు. దీంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. అతని నుంచి రూ.2 లక్షల ఒరిజినల్ నోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరి వద్ద నుంచి మొత్తం రూ.4,97,500 దొంగనోట్లు, రూ.3.28 లక్షల ఒరిజినల్ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
తిరుపతిలో దొంగ నోట్లు ముఠా అరెస్ట్
-
రూ.50 నకిలీ నోట్ల చలామణి
చేబ్రోలు: మండలంలో రూ.50ల నకిలీ నోట్ల చెలామణీ యథేచ్ఛగా కొనసాగుతుంది. రూ.500, రూ. వెయ్యి నోట్ల నకిలీ నోట్లు విచ్చలవిడిగా వస్తున్నాయనే కారణంతో 2016 నవంబర్లో వాటిని రద్దు చేసి కొత్త నోట్లను చలామణిలో తీసుకువచ్చారు. రూ.2వేలు, రూ.500ల నోట్ల మీద ప్రతి ఒక్కరికి నిఘా ఉండటం బ్యాంకుల్లోను యంత్రాల్లో పరిశీలిస్తుండటంతో పెద్ద నోట్లను వదిలిపెట్టి అక్రమార్కులు చిన్నపాటి నోట్లపై దృష్టి సారించారు. పెట్రోలు బంకులు, కిళ్లీ బంకులు, కిరాణా షాపులు, మెడికల్ షాపులు, బట్టల షాపులు ఇలా ప్రతి షాపుల్లోనూ నకిలీ నోట్ల చలామణి సాఫీగా సాగిపోతుంది. చేబ్రోలులో ఒక షాపులో నకిలీ రూ.50ల నోట్లను షాపు యజమాని గుర్తించి తీసుకోకపోవటంతో విషయం వెలుగులోకి వచ్చింది.నకిలీ నోట్లు అసలు నోటు మాదిరిగానే ఉండటంతో అధికారులు, ఉద్యోగులు కూడా గుర్తించలేని విధంగా అక్రమార్కులకు తయారు చేస్తున్నారు. బ్యాంకుల్లో, షాపుల్లో కూడా నకిలీ నోట్లు మారుతుండటం విశేషం. నకిలీ నోట్లు గుర్తించడం ఇలా... రూ.50 నోటు గాంధీ బొమ్మ వైపు ఆర్బీఐ పేరుతో వెండిగీత కనిపిస్తుండగా నకిలీ నోటుపై ఇవి కనిపించటం లేదు. అసలు నోటుపై భాగంలో చుక్కలు కనిపిస్తుండగా నకిలీ నోటులో ఉండటం లేదు. రూ.50ల అసలు నోటుకు పక్కన చుక్కలు, పద్మం లాగా ఉంది. కింద తయారీ సంవత్సరం ఉంది. నకిలీ నోటుకు అంచున పువ్వు గుర్తు మాత్రమే ఉండి చుక్కలు లేకుండా ఉన్నాయి. పార్లమెంటు బొమ్మ కింద ఉండాల్సిన ప్రింట్ అయిన సంవత్సరం ఉండటం లేదు. ఇలా తీక్షణంగా పరిశీలిస్తే అసలు నోటు నకిలీ నోటును గుర్తించవచ్చు. -
రూ.2 వేల దొంగనోట్లు.. ఎప్పుడొచ్చాయంటే?!
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి, నల్లధనం, దొంగనోట్లపై ఉక్కుపాదం అంటూ ప్రధాని ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు గురించి రోజుకో సమాచారం బయటకు వస్తోంది. తాజాగా ఒళ్లు గగుర్పొడిచే విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 8న ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు ప్రకటన జరిగిన రోజులు గడవకముందే భారీగా కొత్త రెండువేల రూపాయల దొంగనోట్లను అధికారులు పట్టుకున్నారు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు జరిగితే.. నవంబర్30న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) అధికారులు 2,272 దొంగనోట్లను పట్టుకున్నారు. ఇవన్నీ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన రెండువేల రూపాయల నోట్లే కావడం గమనార్హం. ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన కరెన్సీని సైతం దొంగనోట్ల ముఠా రోజుల్లోనే వాటిని ముద్రించింది. ముద్రించిన కొత్త కరెన్సీని దేశవ్యాప్తంగా సరఫరా చేసే ప్రయత్నంలో ఉండగా.. ఎన్సీఆర్బీ అధికారులు వాటిని పట్టుకున్నారు. పెద్ద నోట్లు రద్దు జరిగిన నవంబర్8 నుంచి డిసెంబర్31 మధ్యలో అత్యధికంగా గుజరాత్లో 1300, పంజాబ్లో 548, కర్నాటక 254, తెలంగాణ 114, మహారాష్ట్ర 27, మధ్యప్రదేశ్ 8, రాజస్తాన్ 6, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో 3 నోట్ల చొప్పున అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. రెండువేల రూపాయల దొంగనోట్లతో సహా, రూ.1000, రూ. 500, రూ. 100 విలువగల 2 లక్షల, 82 వేల 839 దొంగనోట్లను అధికారులు పట్టుకోవడం విశేషం. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దొంగనోట్లలో 82,494 నోట్లు రూ. 1000వేకావడం విశేషం. రూ. 500 దొంగనోట్లు లక్ష, 32 వేల 227ను అధికారులు పట్టుకున్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రభుత్వ అధికారులు పట్టుకున్న దొంగనోట్ల విలువ.. రూ. 10 1,222,821. దేశంలో అత్యంత తక్కువగా కేవలం 21 దొంగనోట్లు గోవాలో పట్టుపడ్డాయి. -
10 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు.. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు 10 వేల కిలోలకు పైగానే ఉంటాయని భద్రతా దళాలు చెబుతున్నాయి. వీటి ధర అంతర్జాతీయ మార్కెట్లో 49.44 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మాదక ద్రవ్యాలతో పాటు 1.20 లక్షల రూపాయల దొంగనోట్లను తమ సిబ్బంది పట్టుకున్నట్లు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను బీఎస్ఎఫ్ బలగాలు బారీగా స్వాధీనం చేసుకున్నాయి. మొత్తంగా 8,807 కిలోల డ్రగ్స్ను అధికారులు పట్టుకోవడం జరిగింది. అలాగే పాకిస్తాన్ నుంచి దేశంలోకి అక్రమంగా దిగుమతి అవుతున్న 439.21 కిలోల డ్రగ్స్ను సైన్యం స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్తో పాటు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.20 లక్షల రూపాయల దొంగనోట్లను సైతం బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. -
గుజరాత్లో నకిలీ నోట్ల భాగోతం
సాక్షి, అహ్మదాబాద్: దేశంలో జ(పె)రుగుతున్న అవినీతి, నల్లధనాన్ని నిరోధించడానికి ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దును(రూ.500, 1000) చేస్తున్నట్లు 2016 నవంబర్ 8న ప్రకటించారు. అదే విధంగా భారత ఆర్థిక వ్యవస్థ పాలిట శాపంలా తయారైన నకిలీనోట్ల దందాకు చెక్ పెట్టొవచ్చు అని భావించారు. అయితే ఇది ఏమాత్రం ప్రభావం చూపడంలేదు. ప్రధాని స్వరాష్ట్రంలోనే నకిలీ నోట్లను భారీ మొత్తంలో పట్టుకున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. కేంద్ర హోం శాఖ తాజా నివేదికల ప్రకారం గుజరాత్లో ఇప్పటి వరకూ చలామణిలో ఉన్న నకిలీ రూ.2000 నోట్లలో సుమారు 40శాతం నోట్లను సీజ్ చేసినట్లు ప్రకటించింది. 2016 నవంబర్ 9 నుంచి 2017 మార్చి 7 వరకు ఒక్క గుజారాత్లోనే సుమారు రూ.26 లక్షల 42 వేలు విలువైన రూ. 2000 నోట్లను పట్టకున్నట్లు ప్రకటించింది. దేశం మొత్తం మీద సుమారు రూ.67లక్షల విలువ చేసే నకిలీ నోట్లను పట్టుకున్నారు. గుజరాత్ నుంచి దేశ వ్యాప్తంగా నకిలీ నోట్ల సరఫరా చేస్తున్న 12మందిని అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా 64 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు హోంశాఖ ప్రకటించింది. దేశంలో చలామణి అవుతున్న నకిలీ నోట్లు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాళ్ నుంచి వస్తున్నట్లు గుజరాత్కు చెందిన పోలీసు అధికారి తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, కోల్కతా నగరాల్లోనకిలీ నోట్లు చలామణి అధికంగా ఉందన్నారు. -
తిరుపతిలో రూ.500 నకిలీ నోట్ల చెలామణి
తిరుపతి: తిరుపతి నగరంలో రూ. 500 నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి. సోమవారం మహతి ఆడిటోరియం ఎదురుగా ఉన్న ఎంఆర్ఆర్ చికెన్ సెంటర్ యజమాని షేక్బాబ్జీకి వ్యాపారంలో రూ.500 నోటు వచ్చింది. చికెన్ సెంటర్లో పనిచేస్తున్న చాన్బాషాకు నాలుగు రూ.500 నోట్లను ఇచ్చి కిరాణా షాప్కు పంపించాడు. కిరాణా షాపు యజమాని వాటిని తన వద్ద ఉన్న కౌంటింగ్ మిషన్లో పెట్టి పరిశీలించాడు. అందులో ఒక రూ.500 నోటు నకిలీదిగా గుర్తించాడు. చాన్బాషా తెలిసిన వ్యక్తి కావడంతో నకిలీ నోటును తిరిగి పంపేశాడు. నోట్ల రద్దు తరువాత సరికొత్త టెక్నాలజీతో కొత్తనోట్లు ముద్రించిన రూ.500 కొత్తనోట్లకు బదులుగా నకిలీనోట్లు చెలామణి అవుతుండడంతో నగర వాసులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నకిలీ నోట్లు చెలామణి చేసేవారిపట్ల పోలీసులు నిఘా పెట్టి వాటిని అరికట్టాలని కోరుతున్నారు. -
మోదీ ఇలాకాలో భారీగా నకిలీ నోట్లు
న్యూఢిల్లీ: నల్లధనాన్ని వెలికితీయడంతో పాటు నకిలీ కరెన్సీని అరికట్టాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి, వీటి స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నకిలీ 2 వేలు, 500 రూపాయల నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లు ఎక్కువగా ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో వెలుగు చూశాయి. లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు దేశ వ్యాప్తంగా 28 వేల నకిలీ 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తెలియజేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా 6.20 కోట్ల రూపాయల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ దళాలు 7.56 లక్షల రూపాయల విలువైన 378 నకిలీ 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 22,677 నకిలీ 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకోగా.. వీటిలో 22,479 నకిలీ నోట్లను గుజరాత్లోనే స్వాధీనం చేసుకుంది. ఇక గుజరాత్ పోలీసులు 4251 నకిలీ 2 వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 95 శాతం నకిలీ 2 వేల రూపాయల నోట్లను గుజరాత్లోనే స్వాధీనం చేసుకున్నారు. ఇక 10 రాష్ట్రాల్లో 12,956 నకిలీ 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకోగా, గుజరాత్లోనే 8,720 నకిలీ నోట్లు వెలుగు చూశాయి. -
నకిలీ నోట్లు చలామణి... ఇద్దరు అరెస్టు
రంగారెడ్డి: నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు చెందిన సాకేత్వాలా రమేష్, మహ్మద్ రియాజ్లు నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారనే సమచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వారిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ, 6.20 లక్షల విలువైన నకిలీ రెండు వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే ముఠాకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతనికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. -
హైదరాబాద్లో ఫేక్నోట్ల కలకలం
మల్కాజిగిరి(హైదరాబాద్): మల్కాజిగిరి అలహాబాద్ బ్యాంకులో నకిలీ కరెన్సీ చలామణి చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రితమైన రూ.2,000, రూ.500 కరెన్సీ నోట్లు రూ.9.19 లక్షలను డిపాజిట్ చేసేందుకు యూసుఫ్ షేక్ అనే వ్యక్తి యత్నించగా బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్ గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుషాయిగూడ పోలీసులు వచ్చి అతడిని అరెస్టు చేశారు. మల్కాజిగిరి ఏసీపీ రంగంలోకి నిందితుడిని విచారిస్తున్నారు. స్పెషల్ ఆపరేషన్ టీం దర్యాప్తు చేస్తోంది. కాగా, అసలు నోటుకు, చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటుకు ఏ మాత్రం తేడా లేదని, గుర్తించడం అసాధ్యమని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. నోట్ల మార్పిడి చేస్తున్న 15మంది ముఠా అరెస్ట్ మరో ఘటనలో పాత నోట్లును మార్పిడి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్ బేగంపేటలోని వెంకట్ రెసిడెన్సీలో బిల్డర్ యాదగిరి ఇంటిపై బేగంపేట పోలీసులు దాగా చేశారు. పాత నోట్లను మార్పిడి చేస్తున్న 15మంది సభ్యులున్న ముఠాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి లక్ష రూపాయలకు పైగా పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. -
గుజరాత్లో 4.5 కోట్ల దొంగనోట్లు.. పట్టివేత
పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలోనే అత్యంత పెద్దమొత్తంలో దొంగనోట్లు బయటపడ్డాయి. దాదాపు రూ. 4.5 కోట్ల విలువైన రెండువేల నకిలీనోట్లను గుజరాత్లోని రాజ్కోట్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న నోట్లు చాలా పెద్దమొత్తంలో ఉండటంతో వాటిని లెక్కపెట్టడానికి రాత్రంతా పట్టింది. మొత్తం 22,479 నోట్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. వీటి విలువ సుమారు రూ. 4.49 కోట్లకు పైగా ఉంది. రాజ్కోట్కు చెందిన కేతన్ దవే అనే ఫైనాన్షియర్ను అరెస్టు చేసి విచారిస్తే.. తీగలాగితే డొంకంతా కదిలినట్లు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నితిన్ అజానీ అనే తుక్కు డీలర్ దవే మీద ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనను విచారించగా, మొత్తం వ్యవహారం బయటపడింది. ముందుగా దవే కార్యాలయంలో 2,858 నకిలీనోట్లు బయటపడ్డాయి. ఇప్పటికే తన సహచరులు పార్థ్ తెరియా, ఉమర్ గజ్జర్ అనే ఇద్దరు కలిసి దాదాపు కోటి రూపాయల విలువైన దొంనోట్లను తగలబెట్టేశారని దవే చెప్పాడు. కార్లలో దొంగనోట్లు దాచే అలవాటు దవేకు ఉందని గజ్జర్ చెప్పడంతో అతడివద్ద కనపడకుండా పోయిన చాలా కార్లను వెతకగా.. వాటిలో ఒకదాంట్లో మరిన్ని నోట్లు బయటపడ్డాయి. వాటిని లెక్కపెడితే రూ. 3.94 కోట్ల విలువైనవి కనిపించాయి. ఈ కేసులో ఇప్పటికి ఆరుగురిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
నకిలీ నోట్లు అక్కడక్కడే...
ఆందోళన అక్కర్లేదు: ఆర్బీఐ ముంబై: దేశంలో నకిలీ నోట్ల సమస్య చాలా చిన్నదని, ఇది అక్కడక్కడా వెలుగుచూస్తున్న అంశమని, దీనిపై ఆందోళన చెందాల్సింది ఏదీ లేదనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ పేర్కొన్నారు. అయితే ఇలాంటి సమస్యలనూ పూర్తిగా నిరోధించడానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందనీ, ఔట్సోర్డ్స్ క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీలకు మార్గదర్శకాలను పునఃపరిశీలించనుందని గాంధీ తెలిపారు. గడచిన వారంరోజుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్లలోని పలు ఏటీఎంలలో నకిలీ నోట్లు వచ్చాయన్న వార్తల నేపథ్యంలో గాంధీ ఈ ప్రకటన చేశారు -
నకిలీ నోట్లున్నాయని..
- తిరుమల పోలీసుల అత్యుత్సాహం - నకిలీ నోట్లున్నాయని ఢిల్లీకి చెందిన వృద్ధ దంపతుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు - ఒరిజినల్ నోట్లని తేలడంతో వదిలిపెట్టిన వైనం తిరుపతి (అలిపిరి): తిరుమల పోలీసుల అత్యుత్సాహం కారణంగా ఢిల్లీకి చెందిన వృద్ధ దంపతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తీర్థయాత్రల్లో భాగంగా శ్రీవారి దర్శనం కోసం ఢిల్లీకి చెందిన ప్రదీప్(65), ఆయన భార్య మంగళవారం తిరుమలకు వచ్చారు. లేపాక్షి నుంచి ఎంబీసీ–14కి జీపులో వెళ్లారు. దిగేటప్పుడు వాహన డ్రైవర్కు రూ.100 నోటు ఇచ్చారు. అది నకిలీ దంటూ ఆ డ్రైవర్ గొడవ చేశాడు. సమాచారం తెలుసుకున్న తిరుమల టూటౌన్ పోలీసులు ప్రదీప్, ఆయన భార్యను అదుపులోకి తీసుకొని, వారి వద్దనున్న రూ.12 వేల విలువైన రూ.100, రూ.50 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తీరా ఆ నోట్లను తిరుమలలోని ఓ బ్యాంకుకు పంపగా అవి ఒరిజినల్ నోట్లే అని తేలింది. దీంతో వారికి నగదు అప్పగించి పంపించేశారు. కాగా, ప్రదీప్ మీడియాతో మాట్లాడుతూ.. తాము మధుమేహ వ్యాధిగ్రస్తులమని, ఎక్కవ సమయం వేచి ఉండలేమని చెప్పినా పోలీసులు కనికరించలేదని వాపోయారు. -
నకిలీ నోట్లపై విచారణ జరుపుతాం: కేంద్రం
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని ఎస్బీఐ ఏటీఎంలో రూ.2000 నకిలీ నోట్లు వస్తున్నాయన్న విషయంపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ మీడియాకు తెలిపారు. నకిలీ కరెన్సీ చలామణిని ఆపడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఏటీఎం నుంచి రూ.2000 నకిలీ నోట్లు వచ్చాయని పత్రికల్లో వార్తలు వచ్చిన దరిమిలా ఆయన స్పందించారు. ‘ప్రభుత్వం నకిలీ కరెన్సీని అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. కొంత మంది దేశంలో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారో పూర్తి స్థాయి విచారణ తర్వాతే వెల్లడించగలం’ అని మంత్రి తెలిపారు. మరోవైపు తమ ఏటీఎంల నుంచి దొంగ నోట్లు రావడమన్నది చాలా అరుదని, నగదు క్వాలిటీని పరిరక్షించడంలో ఎంతో బలమైన వ్యవస్థ ఎస్బీఐ సొంతమని బ్యాంకు తెలిపింది. నగదును ఏటీఎంలకు తరలించిన వ్యక్తులపై విచారణ కొనసాగుతుందని ప్రకటించింది. ఎస్బీఐలో ఉండే సరికొత్త మెషిన్లు నోట్లలో చిన్నపాటి లోపాలున్నా పట్టేస్తాయనీ, అందువల్ల బ్యాంకు బ్రాంచీల్లో కానీ, ఏటీఎంల్లో కానీ నకిలీ నోట్లు వచ్చే అవకాశం లేదని స్టేట్ బ్యాంక్ స్పష్టం చేసింది. -
ఎస్బీఐ ఏటీఎంలో రూ.2000 దొంగనోట్లు
న్యూఢిల్లీ: నిత్యావసర ఖర్చులకోసం డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు బిత్తరపోయాడు. రూ.8000ను విత్ డ్రా చేయగా మొత్తం రూ.2000 దొంగ నోట్లు రావడంతో అవాక్కయ్యాడు. వాస్తవానికి నోటు అచ్చం కొత్త రూ.2000 నోట్ల మాదిరిగానే ఉన్నప్పటికీ దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అనే పేరిట నోట్లు ముద్రించి ఉన్నాయి. ఫిబ్రవరి 6న ఈ ఘటన ఢిల్లీలోని సంఘం విహార్లో గల ఎస్బీఐ ఏటీఎంనుంచి ఈ నోట్లు రావడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఒరిజినల్ నోటుపై ఎలాంటి అక్షరాలను ఉపయోగించారో అచ్చం అలాంటివే దొంగనోట్ల ముద్రణకు వాడారని, వాటర్ మార్క్ వద్ద చురాన్ పట్టి అని రాసి ఉందని, మిగితా అన్ని అంశాలు కూడా ఆర్బీఐ మాదిరిగానే ముద్రించారని ఆ వ్యక్తి తెలిపాడు. బ్యాంకు అధికారులను కూడా సంప్రదించి పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. -
దొంగనోట్ల ముఠా అరెస్టు
- చిరు వ్యాపారుల లక్ష్యంగా చెలామణి - రూ.2,17,100 విలువ చేసే నకిలీ నోట్లు స్వాధీనం - నిందితుల్లో ఒకరు పాత నేరస్తుడు కర్నూలు: కర్నూలు నగర శివారుల్లోని జొహరాపురం హౌసింగ్బోర్డు కాలనీలో నకిలీ నోట్లను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలులోని వివిధ దుకాణాల్లో చెలామణి చేస్తున్న దొంగనోట్ల ముఠా సభ్యులు దారం సునీల్, వలతాటి తారాకుమార్, పసుల శ్రీనివాసరెడ్డి, లొద్దిపల్లె బోయ శివకుమార్లను రెండో పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,17,100 విలువ చేసే రూ.2000, రూ.500, రూ.100 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకొని ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. నిందితుల్లో సునీల్ పాత నేరస్తుడు. 2012లో తాను కానిస్టేబుల్ను అంటూ ఎస్ఐ ఇంటికి వెళ్లి మహిళలను కత్తితో బెదిరించి చోరీకి పాల్పడ్డాడు. బంగారు, నగదు మూటకట్టుకొని ఉడాయించారు. 2013లో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆరు మాసాల పాటు జైలు జీవితం గడిపి బెయిల్పై బయటికి వచ్చాడు. రంగారెడ్డి జిల్లా తాండూరులో కొంతకాలం పాటు పాలిస్బండల కటింగ్ ఫ్యాక్టరీలో పని చేశాడు. అక్కడ పద్మ అనే మహిళతో పరిచయం పెరిగి పెళ్లి చేసుకొని, మళ్లీ కర్నూలుకు మకాం మార్చాడు. ఈ నేపథ్యంలో తారాకుమార్, శ్రీనివాసరెడ్డి, శివకుమార్లతో పరిచయం ఏర్పడింది. నలుగురు కలిసి ముఠాగా ఏర్పడి గుప్త నిధుల కోసం అనేక ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు. డిసెంబరు నెలలో కలర్ జిరాక్సు మిషన్ కొని జొహరాపురం శివారుల్లోని హౌసింగ్బోర్డులో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని నకిలీ నోట్లను తయారు చేశారు. రూ.60 వేలు తయారు చేసి చెలామణి చేసుకు రమ్మని సునీల్ తారాకుమార్కు అప్పగించాడు. ఇలా బయటపడింది.. కర్నూలు నగరంలోని ఫుట్పాత్లపై వ్యాపారాలు నిర్వహించే వారిని ఎంపిక చేసుకొని ఈ ముఠా సభ్యులు నకిలీ నోట్లను చెలామణి చేశారు. అబ్దుల్లాఖాన్ ఎస్టేట్లో ఫుట్పాత్ బట్టల వ్యాపారి దగ్గరికి వెళ్లి రూ.2వేల నకిలీ నోటు ఇచ్చి, రూ.200 విలువ చేసే బట్టలు కొనుగోలు చేశారు. ఇలా రెండు రోజులకు ఒకసారి వరుసగా 15 రోజుల పాటు బట్టల వ్యాపారికి నకిలీ నోట్లు కట్టబెట్టి చెలామణి చేశారు. వ్యాపారికి అనుమానం వచ్చి తన సమీప బంధువు కానిస్టేబుల్కు వాటిని చూపించగా, నకిలీ నోట్లుగా గుర్తించారు. మరుసటి రోజు కానిస్టేబుల్ దుకాణం వద్దనే మాటు వేసి ఉండగా, ముఠా సభ్యులు అక్కడికి చేరుకొని బట్టలు కొనుగోలు చేసి రూ.2వేల నకిలీ నోటు ఇస్తుండగా, కానిస్టేబుల్ వచ్చి వారిని పట్టుకొని మూడో పట్టణ పోలీసులకు అప్పగించారు. అయితే సంఘటన జరిగిన ప్రాంతం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో విచారించి వారికి అప్పగించారు. నేషనల్ హోటల్, పెట్రోల్బంకుతో పాటు, పలు బట్టల దుకాణాల్లో కూడా నకిలీ నోట్లను మార్పిడి చేసినట్లు ముఠా సభ్యులు విచారణలో అంగీకరించారు. తారాకుమార్, శ్రీనివాసరెడ్డి, శివకుమార్లు పాతబస్టాండు సమీపంలోని సుధాకర్రెడ్డి పెట్రోలు బంకు, రైల్వే స్టేషన్ దగ్గర్లో ఉన్న ఇమ్రాన్ హోటల్, హౌసింగ్బోర్డు కాలనీలో ప్లాట్ నెం.19లో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు సమాచారం అందడంతో వలపన్ని పట్టుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగ నోట్లు చెలామణి చేస్తున్న వ్యక్తులపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న సీఐ డేగల ప్రభాకర్, ఎస్ఐలు ఖాజావలి, చంద్రశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కరీంబాషా, కానిస్టేబుళ్లు ఆయూబ్ఖాన్, రామాంజనేయులు, వర కుమార్, బి.కృష్ణ తదితరులను ఎస్పీ ఆకె రవికృష్ణ అభినందించారు. నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించిన జిరాక్స్ మిషన్తో పాటు ఇతర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిపై చీటింగ్ కేసుతో పాటు సస్పెక్ట్సీట్స్ ప్రారంభించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ శివరామ్ప్రసాద్, ఇన్చార్జి డీఎస్పీ రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు. అనుమానం వస్తే సమాచారం ఇవ్వండి: ఎస్పీ జిల్లాలో నకిలీ నోట్ల తయారు చేసే ముఠాలు సంచరిస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రస్తుతం ఈ ముఠా సభ్యుల వెనుక ఇంకా ఎవరున్నారు. ఎక్కడెక్కడ చెలామణి చేశారనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కొత్త నోట్లను కూడా నకిలీ చేసి ముఠా సభ్యులు చెలామణి చేస్తున్నారు. అలాంటి వారు ఎక్కడ సంచరించినా అనుమానం వచ్చినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి. అలాంటివారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వెల్లడించారు. -
నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
నంద్యాల: నూనెపల్లెలోని పశువుల సంతలో నకిలీ నోట్లను మారుస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని త్రీటౌన్ సీఐ ఇస్మాయిల్ తెలిపారు. దూదేకుల రాజు, అతని సోదరుడు శ్రీనివాసులు రూ.100 నోటును కలర్ జిరాక్స్ యంత్రంతో కాపీలు తీసి నూనెపల్లె పశువుల సంతలో మార్చడానికి యత్నించారని చెప్పారు. ఈ మేరకు సమాచారం అందడంతో వీరిని అరెస్ట్ చేశారని చెప్పారు. వీరి నుంచి కలర్ జిరాక్స్ మిషన్, 8నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురిపై బైండోవర్ కేసు.. నంద్యాల త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవీన్, షేక్చాలీషా, అబ్దుల్ఖాదర్, చాకలి సంజీవరాయుడులపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు సీఐ ఇస్మాయిల్ తెలిపారు. వారి అదుపులోకి తీసుకొని తహసీల్దార్ శివరామిరెడ్డి ఎదుట హాజరు పరిచామని చెప్పారు. -
కలర్ ప్రింటర్తో రూ.రెండు లక్షల కొత్త నోట్లు
మధ్యప్రదేశ్: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ విడుదల చేసిన కొత్త రూ.2000 నోట్లు దేశంలో పెద్ద మొత్తంలోనే వెలుగు చూస్తున్నాయి. అది కూడా వెయ్యో రెండువేలో కాదు.. ఏకంగా లక్షల్లో. మధ్యప్రదేశ్లో పోలీసులు రూ.రెండు లక్షల దొంగనోట్ల స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా రూ.2000 నోట్ల ఫేక్ కరెన్సీనే. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని చత్తర్పూర్ జిల్లా లవ్ కుశ్ నగర్లో ఈ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే, వారి వద్ద నుంచి ఒక కలర్ ప్రింటర్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కొంత సగం మేరకు ముద్రించిన డబ్బును కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. అంతకుముందు బెంగళూరులో కూడా దొంగనోట్లను ముద్రిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారి వద్ద నుంచి 25 కొత్త నకిలీ రూ.2000 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
దొంగనోట్ల ముఠా అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: పెద్ద నోట్ల రద్దును అవకాశంగా తీసుకొని రూ.100, రూ.50, రూ.20, రూ.10 నకిలీ నోట్ల చెలామణి చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎనిమిది సభ్యులు గల ఈ ముఠాలో ఆరుగురిని అరెస్టు చేసి రూ.50వేల నగదు, జిరాక్స్ మెషీన్లు, రూ.2,22,310ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్లో జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి, ఎస్వోటీ ఇన్ స్పెక్టర్ నర్సింగ్రావులతో కలిసి కమిషనర్ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. హత్యకేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇబ్రహీంపట్నానికి చెందిన గణేశ్కు నకిలీ కరెన్సీ కేసులో పట్టుబడిన సిరిసిల్లా జిల్లాకు చెందిన అంజయ్యతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాత అతను తన మిత్రుడు సాయినాథ్తో కలిసి దొంగనోట్లు తెచ్చుకునేందుకు సిరిసిల్లా జిల్లా వెంకటపూర్ గ్రామానికి వెళ్లాడు. అంజయ్య లేకపోవడంతో అతని స్నేహితుడు సత్యం సూచన మేరకు నిజామాబాద్కు చెందిన శ్రీకాంత్ను కలిశాడు. అసలు కరెన్సీకి మూడింతలు నకిలీ కరెన్సీ ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకున్న శ్రీకాంత్ సాయినాథ్ నుంచి రూ.2,90,000 తీసుకున్నాడు. అనుకున్న సమయానికి అతను దొంగ నోట్లు ఇవ్వ లేకపోవడంతో ఈ ఏడాది జనవరి 10న అంజయ్యను కలిసి రూ.లక్ష ఇచ్చాడు. నకిలీ కరెన్సీ ఇచ్చేందుకు కొంత సమయం కావాలని చెప్పడంతో ఈ విషయాన్ని సాయినాథ్ సిరిసిల్లా జిల్లా పెద్దూర్కు చెందిన చీకోటి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లడంతో అతను తన మిత్రులు విజయ్కుమార్, కళ్యాణ్లను పరిచయం చేశాడు. వారు సికింద్రాబాద్లో ఒక కలర్ జిరాక్స్ మెషీన్ ను కొనుగోలు చేసి సిరిసిల్లలో నకిలీ కరెన్సీ ముద్రించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తమ మిత్రుడైన కొహెడకు చెందిన శ్రీధర్ గౌడ్తో కలిసి మరో చిన్న జిరాక్స్ మెషీన్ కొనుగోలు చేసి నకిలీ కరెన్సీని ముద్రించి మార్కెట్లో చెలామణి చేసేవారు. ఇదే సమయంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో దానిని అనుకూలంగా మలచుకుని పెద్ద మొత్తంలో చిన్న నోట్లను ముద్రించారు. వీటిని మార్కెట్లో చెలామణి చేసే విషయంలో అంజయ్య, సత్యనారాయణలతో చర్చించారు.అయితే అంజయ్యపై నిఘా వేసి ఉన్న రాచకొండ ఎస్వోటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో ఇబ్రహీంపట్నంలోని రమేశ్ ఇంటిపై దాడి చేసి ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న కళ్యాణ్, శ్రీకాంత్ల కోసం గాలిస్తున్నారు. -
అసలు నోట్లను గుర్తించండిలా..
కొత్త రెండు వేల రూపాయల నోట్లు ఇంకా చాలామందికి అందుబాటులోకి కూడా రాకముందే పలు చోట్ల నకిలీ నోట్లు చెలామణిలోకి రావడం సామాన్యులకు దడ పుట్టిస్తోంది. పెద్ద నోట్ల మార్పిడికి ప్రజలు ఓ వైపు బ్యాంకులు, పోస్టు ఆఫీసుల ముందు బారులు తీరుతుంటే.. కొందరు కేటుగాళ్లు ఇదే అదునుగా నకిలీ నోట్లను చెలామణిలోకి తెస్తున్నారు. దీంతో ఏవి అసలువో, ఏవి నకిలీవో తెలియక ప్రజలు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కింది సూచనలతో అసలు నోట్లను గుర్తించవచ్చు. ముందు భాగం కొత్త రూ.2 వేల నోటు ముదురు గులాబీ రంగులో ఉంటుంది. పొడవు 66 మి.మీ, వెడల్పు 166 మి.మీ.గా ఉంటుంది. ముందు భాగం 1. లైటు వెలుతురులో రూ.2000 సంఖ్యను గమనించవచ్చు. 2. నోటును కొంచెం వొంచి చూస్తే 2000 సంఖ్య కనిపిస్తుంది. 3. దేవ నాగరి లిపిలో రూ.2000 సంఖ్య రాసి ఉంటుంది. 4. మహాత్మా గాంధీ బొమ్మ మధ్య భాగం వైపునకు ఉంటుంది. 5. చిన్న అక్షరాల్లో ఆర్బీఐ, 2000 ఉంటారుు. 6. నోటును ఏటవాలుగా పట్టుకుంటే దారం పోగు ఆకుపచ్చ రంగు నుంచి నీలం రంగుకు మారుతుంది. 7. గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మార్చారు. 8. మహాత్మాగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్ వాటర్మార్క్ 9. పై భాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలు ఎడమ నుంచి కుడికి పెద్దవి అవుతూ కనిపిస్తారుు. 10. కింది భాగంలో కుడివైపున రూపారుు చిహ్నంతో సహా రంగు మారే సిరాతో (ఆకుపచ్చ నుంచి నీలం) 2000 ఉంటుంది. 11. కుడి వైపున అశోక స్థూపం చిహ్నం అంధుల కోసం 12. కుడివైపున ఉబ్బెత్తుగా ముద్రించిన రూ.2000 సంఖ్య ఉన్న దీర్ఘచతురస్రాకారం ఉంటుంది. 13. కుడి వైపున, ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముంద్రించిన ఏడు చిన్న చిన్న గీతలు ఉంటాయి. వెనుక భాగం 14. నోటు ముద్రించిన సంవత్సరం ఎడమ వైపున ఉంటుంది. 15. నినాదంతో సహా స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది. 16. మధ్య భాగంలో వివిధ భాషల ప్యానల్ ఉంటుంది. 17. మార్సపైకి ఇస్రో చేపట్టిన ప్రయోగాన్ని ప్రతిబింబిస్తూ మంగళయాన్ చిత్రం ముద్రించారు. -
బయటపడ్డ రూ.28 కోట్ల నకిలీనోట్లు!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది రూ.28 కోట్ల విలువైన నకిలీ నోట్లను గుట్టురట్టుచేశామని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ లోక్సభకు వ్రాతపూర్వక సమాధానమిచ్చారు. ఈ ఆర్థికసంవత్సరం సెప్టెంబర్ వరకు రూ.6.37 కోట్ల రూ.5, రూ.10 నకిలీ నాణేలను తవ్వి తీశామని, అదేవిధంగా రూ.27.79 కోట్ల విలువైన 5.74 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించామని అరుణ్జైట్లీ పేర్కొన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం గతేడాది బయటపడ్డ 8.86 లక్షల ఈ నకిలీ భారత కరెన్సీ నోట్ల విలువ రూ.43.83 కోట్లగా ఉందని. 2014లో ఈ విలువ రూ.40.58 కోట్లగా నమోదైందని చెప్పారు. గూఢచర్యం, ఆయుధాలు, మందులు, ఇతర సామాగ్రి అక్రమ రవాణాల వల్ల ఈ నకిలీ కరెన్సీ విజృంభిస్తుందని జైట్లీ తన సమాధానంలో పేర్కొన్నారు. దీనికి ప్రధానకారణం సమాంతరం నల్ల ఆర్థికవ్యవస్థేనని ఆరోపించారు. 2010 జూలైలో ప్రపంచబ్యాంకు అంచనాల ప్రకారం ఈ సమాంతర నల్ల ఆర్థికవ్యవస్థ, 2007 జీడీపీలో 23.2 శాతంగా ఉందని పేర్కొన్నారు. భారత ఆర్థికవ్యవస్థను, ఈ సమాంతర నల్ల ఆర్థికవ్యవస్థ దెబ్బతీస్తుందని తెలిపారు. ఇది ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదం చేస్తుందని, చట్టబద్ధమైన ఆదాయాలను ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుందని అరుణ్ జైట్లీ ఆవేదన వ్యక్తంచేశారు. తీవ్రవాదానికి నగదు సమకూరడాన్ని కట్టడి చేస్తూ.. బ్లాక్మనీని నిర్మూలించడానికి ప్రభుత్వం నవంబర్8న పెద్ద నోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుందని పునరుద్ఘాటించారు. కొత్త సెక్యురిటీ ఫీచర్లతో, కొత్త డిజైన్లో బ్యాంకు నోట్లను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా అన్ని రూ.500, రూ.2000 బ్యాంకు నోట్లు ప్రస్తుతం ప్రవేశపెట్టిన కొత్త డిజైన్లోనే ఉంటాయని చెప్పారు. -
బ్యాంకులో నకిలీ నోట్లు జమ చేయడానికొచ్చి..
-
బ్యాంకులో నకిలీ నోట్లు జమ చేయడానికొచ్చి..
వికారాబాద్: నకిలీ నోట్లను పట్టుకొని ఓ వ్యక్తి సరాసరి బ్యాంకుకే వెళ్లాడు. రూ 49 వేల నకిలీ నోట్లను జమ చేయడానికి ప్రయత్నిస్తుండగా బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు ఎస్బీఐ వద్ద చోటు చేసుకుంది. బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
బ్యాంక్లో నకిలీ నోట్లను జమ చేసేందుకు వెళ్లి..
భువనేశ్వర్: నకిలీ నోట్లను, నల్లధనాన్ని అరికట్టాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి, నోట్ల మార్పిడికి వీలు కల్పించగా.. ఓ ప్రబుద్ధుడు ఇదే అదునుగా భావించి నకిలీనోట్లను మార్చుకునేందుకు ప్రయత్నించాడు. ఒడిశాలోని ఖుద్రా పట్టణంలో సుమిత్ కుమార్ తుడు అనే యువకుడు నకిలీ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు. కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి, కొత్తగా 500, 2000 రూపాయల కరెన్సీని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. పాత నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకోవాలని, ఎక్కువ మొత్తం అయితే డిపాజిట్ చేయాలని సూచించడంతో ప్రజలు క్యూ కట్టారు. బ్యాంకులు రద్దీగా ఉండటంతో అధికారులు గుర్తించరని భావించిన సుమిత్ నకిలీ నోట్లను ఎస్బీఐ బ్రాంచిలో డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు. సుమిత్ మొత్తం 2.5 లక్షల రూపాయల నగదు తీసుకెళ్లాడు. వీటిలో 1000 రూపాయల నోట్లు 42, 500 నోట్లు 10 నకిలీవి ఉన్నాయి. మొత్తం 47 వేల రూపాయల విలువైన నకిలీ నోట్లు ఉన్నాయి. బ్యాంక్ అధికారులు ఈ విషయం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. సుమిత్ ఓ బ్యాంకు అధికారి కొడుకని పోలీసులు చెప్పారు. ఈ డబ్బులు తన తండ్రివి అని, ఆయన ఖాతాలో డిపాజిట్ చేసేందుకు వచ్చానని సుమిత్ పోలీసులకు చెప్పాడు. -
ఆధునిక హంగుల్లో రూ.500 నోటు
-
వచ్చే 72 గంటల్లో ఏం చేయాలి?
-
సామాన్యుడికి అవస్థలే అవస్థలు
- 500, 1000 నోట్లను అంగీకరించని వ్యాపారులు - అత్యవసర పనులకు డబ్బు చెల్లింపులో సమస్యలు - ఉన్న నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియని పరిస్థితి - చేతిలో డబ్బున్నా చెల్లించలేని దుస్థితి - ఏటీఎంల వద్ద క్యూలు, కొద్ది సేపటికే ‘నో క్యాష్’ బోర్డులు - కార్డుపై ఎక్స్ట్రా ట్యాక్స్ అంటున్న వ్యాపారస్తులు - సామాన్యుడి జీవితాన్ని స్థంభింపచేసిన కేంద్రం నిర్ణయం ► రామ్ ప్రసాద్ వాళ్ల నాన్నగారికి బుధవారం హస్పటల్లో బైపాస్ సర్జరీకి ప్లాన్ చేసుకున్నాడు. హాస్పటల్లో చేర్చి ఇప్పటికే రెండు రోజులరుు్యంది. ఆపరేషన్ ముందు లక్ష రూపాయలు డిపాజిట్ చేయమనడంతో ఉదయం ఏటీఎం నుంచి కానీ, బ్యాంకుకు వెళ్లి కానీ డ్రా చేసి చెల్లిద్దామనుకున్నాడు. కానీ రాత్రి ఒక్కసారిగా ఈ వార్త విన్నవెంటనే పరుగెత్తుకుంటూ ఏటీఎంకు వెళ్ళాడు. అప్పటికే ఏటీఎం దగ్గర జనం బారులు తీరి ఉన్నారు. కాసేపటికే నో క్యాష్ అని బోర్డు పెట్టేశాడు. బుధవారం బ్యాంకులు పనిచేయక... బుధ, గురువారాలు ఏటీఎంలు పనిచేయక, ఆ తర్వాత నుంచి పనిచేసిన నగదు తీసుకోవడంపై పరిమితులు ఉండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి. ► తిరుపతికి చెందిన ఆనంద్ తన కుమార్తె పెళ్లికోసం బుధవారం చెన్నై వెళ్లి నగలు, కంచిలో పట్టు చీరలు కొనేందుకు డబ్బు సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు అకస్మాత్తు నిర్ణయంతో ఏం చేయాలో పాలు పోవడంలేదు. వివాహ సమయం దగ్గర పడుతోంది. రేపట్నుంచి దుకాణాల వారు 500, 1000 నోట్లు అంగీకరించరు. బ్యాంకుకు వెళ్లి రూ.100 నోట్లకు మార్చుకుందామంటే రూ.నాలుగు వేలకంటే మార్చబోమంటున్నారు. ఈ గడ్డు సమస్యను ఎలా గట్టెక్కాలో తెలియక మిత్రులందరినీ సలహాలు అడుగుతున్నాడు. ► విశాఖపట్నానికి చెందిన సుందర్జ్రు కుమారుడికి కర్ణాటకలోని ఒక వైద్య కళాశాలలో సీటు వచ్చింది. ఫీజుతోపాటు అదనంగా కొంత చెల్లించాల్సి ఉంది. స్వంత ఊరిలో ఉన్న పొలం అమ్మి డబ్బు సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రధాని ప్రకటనతో ఆయన నివ్వెరపోయాడు. పొలం అమ్మి మరీ కూర్చుకున్న డబ్బు చెల్లదంటే ఎలా? అంటూ కూలిపోయాడు. బ్యాంకులో మార్చుకునే అవకాశమున్నా అందుకు సమయం పడుతుందనీ, ఈ లోపు తన కుమారుడి సీటు క్యాన్సిలైతే అతని భవిష్యత్తు అంధకారమ వుతుందని ఆందోళన చెందుతున్నాడు. ► విజయవాడకు చెందిన సత్యవాణి పదో తరగతి చదువుతున్న తన కొడుక్కి రూ.500 నోటు ఇచ్చి ఇంట్లోకి సరుకులు, పాలు ప్యాకెట్లు తేవాలని పంపింది. పాల బూత్ నుంచి కిరాణా షాపు వాళ్లు సైతం రూ.500 నోటు తీసుకోవడంలేదని చెప్పడంతో కాళ్లరిగేలా షాపులు తిరిగినా ఫలితంలేకపోవడంతో ఇంటికి చేరాడు. ప్రధాని ప్రకటన విషయాన్ని అప్పటికే టీవీల్లో చూసిన గృహిణి కొడుకు సరుకులు తేకుండా రావడంతో ఉదయం వాడిని స్కూల్కు పంపించేందుకు క్యారేజీ ఏం పెట్టాలంటూ దిగాలు పడుతోంది. సామాన్యుడికి ఇబ్బందులిలా! కేంద్రప్రభుత్వం మంగళవారం అర్థరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్ల చెలామాణీని రద్దుచేయడంతో సామాన్యుడి జీవితమిలా అతలాకుతలమవుతోంది. తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకోవడానికి తగినంత సమయం ఇచ్చినా... చెలామణీని వెంటనే రద్దు చేయడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పెరిగిన ధరల నేపథ్యంలో ప్రతీ ఒక్కరి జేబులో లేదా పర్సులో రూ. 500, రూ. 1000 నోట్లు ఉండటం అత్యంత సహజం. ఇప్పుడు వీటిని రద్దు చేయడంతో నేటి నుంచి పూర్తి లావాదేవీలు ఆగిపోయే పరిస్థితి. బయటకు వెళితే షాపు వాడు తీసుకోడు. ఏదైనా కొనుక్కొని తిందామంటే చిల్లర దొరక్క జేబులో డబ్బులున్నా కొనుక్కొని తినలేని పరిస్థితి. ప్రధానమంత్రి మంగళవారం అర్థ రాత్రి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పినా వ్యాపారస్తులు నిన్న రాత్రి నుంచే ఈ నోట్లను తీసుకోవడం మానేయడంతో సామాన్యుడు దిక్కుతోచని పరిస్థితి. పాలప్యాకెట్ నుంచి పెట్రోల్ వరకూ ఎలా కొనుక్కోవాలో తెలియక తల్లడిల్లుతున్నారు. నగరాలు, గ్రామీణా ప్రాంతాల్లో సైతం అందుబాటులో ఉన్న ఏటీఎం వద్ద రూ.500, రూ.1000 నోట్ల డిపాజిట్లు చేసి రూ.100 నోట్లు తీసుకునేందుకు చలికాలంలోను రాత్రి వేళలోనూ ప్రజలు క్యూలు కట్టారు. అరుుతే 500, 1000 నోట్లను భర్తీ చేసే స్థారుులో 100 నోట్లు లేకపోవడంతో కొద్ది సేపటికే ‘నో క్యాష్’ అని రావడంతో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి ఆకస్మిక నిర్ణయంతో ఇల్లు గడిచేది ఎలా అంటూ పేద, మధ్యతరగతి ప్రజలు శాపనార్ధాలు పెడుతున్నారు. ఎలా మార్చుకునేది..? మన దగ్గర ఉన్న నోట్లను మార్చుకోవడానికి తగినంత సమయం వచ్చినా, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉండే కూలీలు, గ్రామీణుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి బ్యాంక్ అకౌంట్లే లేవు. ఉన్న నోట్లను బ్యాంకులకు, పోస్టాఫీసులకు వెళ్ళి మార్చుకోవడంపై వీరికి అంతగా అవగాహన ఉండదు. వీరి నిరక్షరాస్యతను స్థానిక నాయకులు ఆసరాగా చేసుకొని వీరిని మోసం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నారుు. పోనీ బ్యాంకులు, పోస్టాఫీసులు వెళ్ళి మార్చుకోవాలంటే ఒక రోజు కూలిని వదులుకోవాల్సిందే. పదవ తారీఖు నుంచి కొత్త నోట్లు చెలామణీలోకి తీసుకొస్తున్నా... ఏటీఎంల నుంచి నగదు విత్డ్రాయల్స్పై పరిమితులు విధించడంతో భారీ లావాదేవీలు చేసే వీలుండదు. ఈ మేరకు మా వ్యాపారం దెబ్బతింటుందని వ్యాపారస్తులు వాపోతున్నారు. అసలే ఇది పెళ్లిల సీజన్ కావడంతో పెళ్లిలకు కావాల్సిన నగదును ఇప్పటికే చాలామంది విత్డ్రా చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు లాంఛనాల సమయంలో నగదు ఎలా ఇవ్వాలో అర్థంకాని పరిస్థితి. అసలు నల్లధనం ఉన్న వారు ఇప్పటికే తగిన జాగ్రత్తలు తీసుకున్నారని, కానీ నల్లధనం పేరుతో సామాన్యునులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని సామాన్యుడు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారేలేరు. ఎక్స్ట్రా ట్యాక్స్ నెట్ బ్యాంకింగ్, కార్డుల ద్వారా నగదు లావాదేవీలను ప్రభుత్వం అనుమతిస్తానంటోంది. కానీ ఇలా లావాదేవీలు అనుమతించే వ్యాపారస్తులు లెక్కలు తప్పక చూపించాల్సి ఉంటుంది. దీంతో కార్డులపై లావాదేవీలు అంటే రెండు నుంచి మూడు శాతం అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నగదు చెలామణిలో ఉన్నప్పుడే చాలామంది ఎక్స్ట్రా తీసుకునేవారని, ఇప్పుడు సమయం వచ్చిందని మరింత ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉండటంతో వీరిపై తగినంత దృష్టి పెట్టాలని వినియోగదారులు బ్యాంకులను కోరుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో.. మోదీ ప్రకటన తర్వాత ఏటీఎంల వద్ద క్యూలు చూస్తే భయం వేసింది. రేపు బ్యాంకుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో. ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని ఆందోళనగా ఉంది. డబ్బులు తీసుకోవటం ఇవ్వటం ఒక ప్రహసనంలా ఉంటుంది. - ఈశ్వర్ (విజయవాడ) బ్యాంకులోనే రోజులు గడపాలేమో నల్లధనాన్ని వెలికి తీసేం దుకు 500, వెరుు్య రూపాయల నోట్లను నిలిపివేయటం మంచి దే. అరుుతే మాకు ఎక్కువ మంది రూ.500, రూ.1,000 నోట్లను ఇస్తారు. మేము వాటిని తీసుకుని డ్యూటీ దిగిన తరువాత మార్చుకోవటానికి బ్యాంకుల చుట్టూ తిరిగాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. అంటే ఒక రోజు డ్యూటీ చేస్తే మరోరోజు రద్దీ కారణంగా బ్యాంకుకే సరిపోతుందేమోనని భయంగా ఉంది. - వేణు, డ్రైవర్ (మధురానగర్, విజయవాడ) పంటను కాపాడుకునేదెలా? ఈ ఫొటోలోని వ్యక్తి పేరు శివారెడ్డి. అనం తపురం జిల్లా శింగనమల మండలం సోదనపల్లి వాసి. ఐదెకరాల పొలం ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ చదువుకుంటున్నారు. పొలంలో కంది, పెసర సాగు చేశారు. ఇంట్లో ఖర్చులకు డబ్బు లేకపోతే ఆదివారం మరో వ్యక్తి వద్ద రూ.10వేలు అప్పు తెచ్చుకున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి అన్నీ రూ.500 నోట్లు ఇచ్చారు. మంగళవారం రాత్రి 8.45 గంటలకు పురుగుల మందు దుకాణానికి వెళ్లాడు. రూ.500 నోట్లు తీసుకోలేదు. ఎందుకంటే ‘ఈ రోజు అర్ధరాత్రి నుంచి చెల్లవు.. నువ్వు ఇస్తే నేనేం చేసుకోవాలి’ అని వ్యాపారి అన్నారు. అప్పటికప్పుడు వందనోట్లు శివారెడ్డికి దొరకవు. చేసేది లేక ఇంటికి వచ్చారు. రెండురోజులు బ్యాంకులు, ఏటీఎంలు సెలవని శుక్రవారం వందనోట్లు తీసుకుని పోవాలని ఇరుగు పొరుగువారు చెప్పారు. ఓవైపు పంట పొలానికి అర్జంటుగా మందులు కొట్టాలి. అప్పు తెచ్చిన నోట్లు పనికిరావు. రెండురోజులు ఇంటి ఖర్చులకు కూడా డబ్బు కావాలి. ఇరుగు పొరుగును అడిగితే వారి వద్ద వందనోట్లు ఉన్నాయో, లేదో? ఉన్నా ఈ పరిస్థితుల్లో ఇస్తారో.. లేదో? పిల్లోళ్ల ఖర్చులకు కూడా చేతిలో డబ్బు లేదని శివారెడ్డి వేదనప డుతున్నారు. పైగా తెచ్చిన పదివేలు తిరిగి ఇచ్చేందుకు వెళితే అప్పు ఇచ్చిన వ్యక్తి నాకు రూ.100 నోట్లు ఇవ్వు అని అడుతున్నారు. నల్లధనానికి దెబ్బ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నల్లధనం, నకిలీ కరెన్సీలపై పెద్ద దెబ్బ. దీనివల్ల అవినీతి, ఉగ్రవాదంపై పోరాటం మరింత పటిష్టమవుతుంది. ఇది సాహసోపేత నిర్ణయం. - రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అసంబద్ధంగా ఉంది నల్లధనాన్ని బయటికి తీసే చర్యలకు మా పార్టీ ఎప్పటికీ మద్దతు పలుకుతుంది. అరుుతే, నల్లధనం నియంత్రణపై గత రెండున్నరేళ్లుగా నోరు మెదపకుండా ఉండి, ఇప్పుడు అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం అసంబద్ధంగా ఉంది. ఇది చిన్న వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలపై పెను ప్రభావం చూపుతుంది. - మొహమ్మద్ సలీం, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు వారు బాధపడతారు భారీగా పోగుపడిన గుప్త నిధుల ముప్పును అరికట్టేందుకు ఈ చర్య దోహదపడుతుంది. ఇది మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం. పన్ను కట్టని ఆదాయాలు, ఆస్తులున్న వారు, నల్లధన వెల్లడికి తెచ్చిన రెండు పథకాలను వినియోగించుకోని వారు ఇప్పుడు చాలా బాధపడతారు. - ఎంబీ షా, సిట్ చైర్మన్ నల్లధనం పోదు పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం ముప్పు తీరదు. నల్లధనం సమస్యకు ఇది పరిష్కారం చూపదు. భారీ ఎత్తున నల్లధనం విదేశాల్లో పోగైఉంది. అది భారత బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి హవాలా ద్వారా విదేశాలకు చేరుతోంది. అలాగే బంగారు లాంటి ఖరీదైన వస్తువులు, బినామీ భూలావాదేవీల్లోనూ నల్లధనం దాగుంది. - కేరళ ప్రభుత్వం ద్రవ్యోల్బణం అదుపులోకి దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది నిర్మాణాత్మక మార్పులను తెస్తుంది. అలాగే నల్లధనంతోపాటు ద్రవ్యోల్బణాన్ని కూడా అదుపులోకి తెచ్చేందుకు దోహదపడుతుంది. - చందా కొచ్చర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ రాజకీయ డ్రామా అన్పిస్తోంది పైకి చూడ్డానికి ఇది చాలా బాగుందని అన్పించవచ్చు. నలుపు, తెలుపుల్లో ఈ పథకాన్ని పూర్తిగా పరిశీలించేవరకు ఇందులోని ఉద్దేశాలపై ఓ నిర్ణయానికి రాలేం. ఈ యావత్ పథకంలో ఏదో సస్పెన్స్ ఉన్నట్టుగా కన్పిస్తోంది. ఇంకా చెప్పాలంటే 2017 మార్చిలో ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆడుతున్న రాజకీయ డ్రామాలా ఉంది. -ఎం. నారాయణచార్యులు, చార్టర్డ్ అకౌంటెంట్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ మాజీ చైర్మన్. -
కరెన్సీ నోట్ల రద్దు ఇదే తొలిసారి కాదు!
న్యూఢిల్లీ: మన దేశంలో రూ.500, రూ.1,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించడం ఇదే తొలిసారి కాదు. స్వాతంత్య్రం రాకముందు నుంచి ఇలాంటి సందర్భాలు మన దేశంలో ఉన్నారుు. 1946లో తొలిసారిగా ఈ తరహా చర్య చేపట్టారు. అప్పుడు అమలులో ఉన్న రూ.1,000, రూ.10,000 నోట్లను చలామణి నుంచి తొలగించారు. ఆర్బీఐ ఇప్పటివరకు ముద్రించిన అత్యంత విలువైన నోటు రూ.10,000. దీనిని 1938లోనే ముద్రించారు. 1946లో వెనక్కు తీసుకుని మళ్లీ 1954లో ముద్రించారు. 1954లో రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను ముద్రించారు. మళ్లీ 1978 జనవరిలో ఉపసంహరించారు. రూ.500 నోటును 1987 అక్టోబరులో, 1,000 నోట్లను 2000 నవంబరులో మళ్లీ ప్రవేశపెట్టారు. రూ.2,000 నోటును ప్రవేశపెట్టనుండటం మాత్రం ఇదే తొలిసారి. మనం నిత్యం ఉపయోగిస్తున్న వివిధ మొత్తాల్లోని కరెన్సీ నోట్లు గతంలో అనేక మార్పులకు గురయ్యా రుు. 1967 నుంచి అశోక స్తంభం వాటర్మార్క్తో నోట్లను ముద్రించడం మొదలుపెట్టారు. నోట్లపై జాతీయ చిహ్నమైన మూడు సింహాల కింద ఉండే ‘సత్యమేవజయతే’ సూక్తిని 1980లో తొలిసారిగా ముద్రిం చారు. 1987 అక్టోబరులో గాంధీ చిత్రం, అశోకస్తంభాలతో రూ.500 నోటును ముద్రించారు. మహాత్మాగాంధీ సిరీస్ నోట్లను 1996 నుంచి ముద్రించడం మొదలు పెట్టారు. భద్రతా ప్రమాణాలు పెంచి ఎంజీ సిరీస్ కొత్త నోట్లను 2005 నుంచి తీసుకొచ్చారు. -
ఆధునిక హంగుల్లో..
ముంబై: రూ.500, 1,000 నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొత్త సిరీస్ల్లో రూ.500, రూ.2,000 నోట్లకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. కొత్త సైజుల్లో, ఆధునిక ఫీచర్లను జోడించి వీటిని రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. అత్యధిక డినామినేషన్ అరుున రూ.2000 నోటును ‘మహాత్మాగాంధీ (న్యూ) సిరీస్’ పేరుతో తెస్తోంది. ఈ నోటు వెనుక అరుణ గ్రహంపై ఇస్రో చేసిన చౌకయాత్రను తలపించే ‘మిషన్ టు మార్స్’ అరుున మంగళయాన్ను ముద్రించినట్లు ఆర్బీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మాజెంటా రంగులో ఉండే ఈ నోటు 66 మి.మీ.-166 మి.మీ. సైజులో ఉంటుందని పేర్కొంది. అలాగే రూ.500 నోటును వేరే రంగులో, వేరే సైజులో, వేరే థీమ్లో తెస్తున్నట్లు తెలిపింది. స్టోన్గ్రే రంగులో ఉండే ఈ నోటు 63 మి.మీ.-150 మి.మీ. సైజులో ఉంటుందని, దీనిపై ఢిల్లీలోని ఎరక్రోట చిత్రం ముద్రించి ఉంటుందని చెప్పింది. రూ.500, రూ.2000 నోట్ల కొత్త డిజైన్లు అంధులతోపాటు అందరూ సులువుగా గుర్తించేలా ఉంటాయని పేర్కొంది. కాగా, నోట్ల మార్పిడిలో ఏవైనా ఇబ్బందులున్నా, అనుమానాలున్నా నివృత్తి కోసం పౌరులు హెల్ప్లైన్ నంబర్లు 022-22602201 022-22602944కు ఫోన్చేయొచ్చని ఆర్బీఐ తెలిపింది. -
పెద్ద నోట్లు రద్దు..
రూ.500, రూ.1,000 నోట్లు ఇక చెల్లవు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమలు నల్లధనం, నకిలీ నోట్లు అరికట్టేందుకు కేంద్రం సంచలన నిర్ణయం వచ్చే 72 గంటల్లో ఏం చేయాలి? ప్రభుత్వాసుపత్రులు, రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు, ప్రభుత్వ బస్సులు, విమానాశ్రయాల్లోని ఎరుుర్లైన్స కౌంటర్లలో, ప్రభుత్వ రంగ సంస్థల అధీనంలో నడిచే పెట్రోల్, డీజిల్, గ్యాస్ స్టేషన్లలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో నడిచే సహకార కేంద్రాలు, పాల కేంద్రాల్లో.. శ్మశానాల్లోనూ 500, 1,000 నోట్లను స్వీకరిస్తారు. తర్వాత ఏం చేయాలి ఆర్బీఐ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.500, రూ.1,000 నోట్లను నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు ఎలాంటి పరిమితి లేకుండా అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ అకౌంట్లోకి సరైన ఆధారాలు చూపించి బదిలీ చేయవచ్చు. అరుుతే బ్యాంకుల్లోని కేవైసీ (నో యువర్ కస్టమర్) ఫారాలను అసంపూర్తిగా నింపిన వారు కేవలం గరిష్టంగా రూ.50 వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చు. ► కొద్ది రోజుల వరకు బ్యాంకుల నుంచి విత్ డ్రాయల్ పరిమితి రోజుకు రూ.10 వేలు, వారానికి రూ.20 వేలుగా నిర్ణరుుంచారు. నవంబర్ 24న సమీక్ష తర్వాత ఈ పరిమితిని పెంచనున్నారు. ► ఏటీఎంల్లో విత్ డ్రాయల్ (నవంబర్ 18 వరకు) కార్డుపై రోజుకు రూ.2 వేలు మాత్రమే. తర్వాత దీన్ని రూ.4 వేలకు పెంచనున్నారు. ► బ్యాంకులు, ప్రభుత్వ ఖజానా కార్యాలయాలు బుధవారం (నేడు) మూసి ఉంటారుు. ఏటీఎంలు నేడు, రేపు పనిచేయవు. ► నవంబర్ 24 వరకు ఐడీ ప్రూఫ్ చూపించి హెడ్ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో రోజుకు 500, 1000 నోట్లను రూ.4 వేల వరకు మార్చుకో వచ్చు. ఈ పరిమితిపై 15 రోజుల తర్వాత సమీక్షిస్తారు. ► చెక్, డీడీ, క్రెడిట్ కార్డులు, ఎలక్ట్రానిక్ ట్రాన్సఫర్ ద్వారా జరిగే లావాదేవీలపై ఆంక్షలు లేవు. ► డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేయలేని వారు మార్చి 31, 2017 వరకు ఆర్బీఐ కేంద్రాల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించి బదిలీ చేసుకోవచ్చు. ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్పారు? కొత్త రూ.500, రూ2000 నోట్ల తయారీ ఊపందుకుంది. మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్న నోట్ల స్థానంలో నవంబర్ 10 నుంచి వీటిని ప్రవేశపెడతాం. రూ.వెరుు్య నోట్లను త్వరలో ప్రవేశపెడతాం. నల్లధనం, ఉగ్రమూకలకు ఆర్థిక సాయాన్ని అరికట్టేందుకు ఇది చాలా గొప్ప నిర్ణయం. నోట్లు మార్చుకునే విషయంలో ప్రజల సౌకర్యార్థం అన్ని బ్యాంకుల్లో కొత్త కౌంటర్లు ఏర్పాటుచేస్తాం. దీనికితోడు బ్యాంకులు ఎక్కువ సమయం పనిచేస్తారుు. ప్రజల అపోహలు, ఆందోళనల పరిష్కారానికి ముంబై కేంద్రంగా కౌంటర్లు, కాల్ సెంటర్లు ఏర్పాటుచేస్తాం. బ్యాంకుల వద్ద కొత్త నోట్లు చేరే క్రమాన్ని బట్టి విత్ డ్రాయల్ పరిమితిని పెంచుతాం. అవినీతిని ఊడ్చేద్దాం.. రూ. 500, 1,000 చిత్తు కాగితాలతో సమానం: మోదీ ► నేడు(బుధవారం) బ్యాంకులు పనిచేయవు. ఇది మీకు ఇబ్బందే. అయితే దేశ చరిత్రలో జాతి నిర్మాణానికి సంబంధించిన ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్నే వస్తాయి. అందులో పాలు పంచుకునే క్రమంలో ఈ చిన్న చిన్న కష్టాలు పట్టించుకోకండి. ► {పభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్యాంకులు, పోస్టాఫీస్ సిబ్బంది సహకరించాలి. రాజకీయ పార్టీల కార్యకర్తలు, మీడియా, సామాజిక సంస్థలు సహకరిస్తాయని ఆశిస్తున్నాం. ► ఉగ్రవాదం, నల్లధనం, అవినీతిని కూకటివేళ్లతో పెకలించాలి. ఈ జాడ్యాలు దేశానికి మానని పుండులా మారాయి. జాతిని తొలిచేస్తున్నాయి. వీటిపై పకడ్బందీగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ► చట్ట వ్యతిరేక ఆర్థిక కార్యకలాపాలు దేశానికి అతిపెద్ద ముప్పు. న్యూఢిల్లీ : సంచలనం..! పెను సంచలనం..!! దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించే అత్యంత కీలక నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. నల్లధనం, నకిలీ కరెన్సీ నోట్లు, అవినీతి జాడ్యాలను కూకటివేళ్లతో పెకిలించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్ఘాటించారు. మంగళవారం తొలిసారిగా మోదీ టెలివిజన్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. బ్లాక్మనీ, అవినీతి, నకిలీ నోట్లపై దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడారు. రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేస్తున్నామని, నేటి రాత్రి(మంగళవారం) నుంచి అవి పనికిరాని చిత్తు కాగితాలతో సమానమని చెప్పారు. తమ వద్ద ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను ఈ నెల 10 నుంచి డిసెంబర్ 30లోపు(50 రోజుల గడువు) బ్యాంకులు, పోస్టాఫీసు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ప్రజలకు సూచించారు. రూ.100, రూ.50, రూ.20, రూ.10, రూ.5, రూ.2, ఒక రూపారుు నోట్లు, అన్ని నాణేలు ఎప్పట్లాగే చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు. కొత్తగా రూ.2,000, రూ.500 నోట్లను ప్రవేశపెడతామని తెలిపారు. ఏటీఎంల నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవడంపైనా ప్రధాని పలు ఆంక్షలను ప్రకటించారు. కొద్దిరోజులపాటు రోజుకు ఏటీఎం నుంచి గరిష్టంగా రూ.2 వేలు మాత్రమే తీసుకోవచ్చన్నారు. తర్వాత దీన్ని రూ.4 వేల వరకు పెంచుతామని చెప్పారు. అలాగే బ్యాంకుల ద్వారా కొద్దిరోజులపాటు ఒక్కరోజులో గరిష్టంగా రూ.10 వేలు, వారంలో రూ.20 వేలు మాత్రమే తీసుకోవచ్చని తెలిపారు. మున్ముందు ఈ పరిమితిని పెంచుతామన్నారు. కొత్త నోట్ల సరఫరాను దృష్టిలో ఉంచుకొని ఈ ఆంక్షలు విధించినట్లు వివరించారు. అలాగే బుధవారం బ్యాంకులు, ఏటీఎంలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కొన్నిచోట్ల గురువారం కూడా ఇవి పనిచేయవని తెలిపారు. బ్యాంకులు, పోస్టాఫీసు సిబ్బంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు, కార్యకర్తలు, మీడియా, సామాజిక సంస్థలు కూడా సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్పిడికి గుర్తింపు కార్డులివ్వాలి బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఖాతాలు ఉన్నవారు రూ.500, రూ,1,000 నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి ఏమీ ఉండదు. (రూ.50వేలు దాటితే పాన్కార్డు నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి జనం బ్యాంకుల్లో వేసే మొత్తం ఆదాయపు పన్ను లెక్కల్లోకి వస్తుంది) డిపాజిట్లు, నోట్ల మార్పిడికి వచ్చే జనం తాకిడికి అనుగుణంగా బ్యాంకులు అదనపు కౌంటర్లు తెరుస్తాయని ప్రధాని చెప్పారు. ‘‘బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న తర్వాత మీ డబ్బులు మీకే ఉంటారుు. దీనిపై ఏం ఆందోళన చెందనక్కర్లేదు. డిపాజిట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు’’ అని అన్నారు. ఇక ఖాతాలు లేనివారు నిర్దేశిత బ్యాంకులు, పోస్టాఫీసులో ఈ నెల 10 నుంచి 24వ తేదీ వరకు ఆ నోట్లను ఇచ్చి అంతేమొత్తంలో ఇతర నోట్లను పొందవచ్చని ప్రధాని సూచించారు. ఈ మార్పిడిపైనా ఆంక్షలు విధించారు. రోజుకు గరిష్టంగా రూ.4 వేలు మాత్రమే పొందవచ్చని తెలిపారు. నవంబర్ 25 తర్వాత ఎక్కువమొత్తం తీసుకోవచ్చని సూచించారు. అరుుతే అందుకు పాన్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు వంటి పత్రాలను సమర్పించాలన్నారు. తుది గడువు మార్చి 31 డిసెంబర్ 30లోగా 500, 1,000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోలేనివారు వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆ నోట్లను నిర్దేశిత ఆర్బీఐ కార్యాలయాల్లో జమ చేయవచ్చు. అరుుతే జాప్యానికి గల కారణాన్ని పక్కా ఆధారాలతో సహా వివరిస్తూ ఒక డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ నెల 11 వరకు నోట్ల చెల్లుబాటు విమాన టికెట్లు, రైల్వే టికెట్లు, ప్రభుత్వ బస్ టికెట్ కౌంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, పెట్రోలు, డీజిల్, సీఎన్జీ స్టేషన్లు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాల కేంద్రాలు, శ్మశాన వాటికల్లో ఈ నెల 11 అర్ధరాత్రి వరకు రూ.500, రూ.1,000 నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రధాని తెలిపారు. ఎరుుర్పోర్టుల్లో ప్రయాణికుల నుంచి రూ.5 వేలకు మించకుండా రూ.500, రూ.వెరుు్య నోట్లను తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు, ఆసుపత్రుల్లో రోగులు, ఇతర అత్యవసరమైన పనులు ఉన్నవారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే ఈ వెసులుబాటు కల్పించినట్లు వివరించారు. ఈ కష్టాలను పట్టించుకోకండి ‘‘రేపు(బుధవారం) బ్యాంకులు పనిచేయవు. ఇది మీకు ఇబ్బందే. అరుుతే దేశ చరిత్రలో జాతి నిర్మాణానికి సంబంధించిన ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్క రి జీవితంలో కొన్నే వస్తారుు. అందులో పాలుపంచుకునే క్రమంలో ఈ చిన్నచిన్న కష్టాలను పట్టించుకోకండి’’ అని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. ఆ జాడ్యాలను అంతమొందించాలి జాతిని పట్టిపీడిస్తున్న ఉగ్రవాదం, నల్లధనం, అవినీతి జాడ్యాలను కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఈ మూడు జాడ్యాలు దేశానికి మానని పుండులా మారారుు. లోపలి నుంచి జాతిని తొలిచేస్తున్నారుు. వీటిపై పకడ్బందీగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. చట్ట వ్యతిరేక ఆర్థిక కార్యకలాపాలు దేశానికి అతిపెద్ద ముప్పని చెప్పారు. గత రెండున్నరేళ్లుగా తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా అంతర్జాతీయ అవినీతి సూచీ ర్యాంకుల్లో భారత్ కేవలం 100వ స్థానం నుంచి 76వ స్థానానికి వచ్చిందని పేర్కొన్నారు. ‘‘దేశంలో అవినీతి ఎలా పాతుకుపోరుుందో చెప్పేందుకు ఈ ర్యాంకులే ఓ ఉదాహరణ. ఒకవైపు ఆర్థిక వృద్ధిలో మనం నంబర్-1 స్థానంలో ఉన్నాం. అదేసమయంలో అవినీతిలోనూ వందో ర్యాంకుకు దగ్గర్లో ఉన్నాం. ఈ అవినీతితో కొందరు అక్రమార్కులు లబ్ధిపొందుతున్నారు. అదే సమయంలో నిజారుుతీపరులైనవారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు’’ అని అన్నారు. ప్రభుత్వ చర్యల ద్వారా ఇప్పటివరకు దేశ, విదేశాల్లోని రూ.1.25 లక్షల కోట్ల నల్లధనం వెలికివచ్చిందన్నారు. నకిలీ కరెన్సీ ఉగ్రవాదానికి సంబంధం ఉందని, దీనిద్వారా కొందరు శత్రువులు దేశానికిహాని తలపెట్టాలని చూస్తున్నారని మోదీ పేర్కొన్నారు. బ్యాంకులకు సెలవెందుకు? పాత నోట్లను రద్దు చేస్తున్నారు సరే! మరి బ్యాంకులకెళ్లి కొత్తవి తెచ్చుకోవటానికి ఒకరోజు సమయం ఎందుకు? ఈ సందేహం చాలా మందికి వస్తోంది. అరుుతే బ్యాంకులన్నీ తమ దగ్గరున్న పాత నోట్లను రిజర్వు బ్యాంకుకు అందజేసి... కొత్తవి తెచ్చుకోవటానికి, వాటిని ఏటీఎంలలో పెట్టడానికి వాటికి కొంత సమయం కావాలి. అందుకే ఈ ఒకరోజు ప్రభుత్వం బ్యాంకులకు సెలవుగా ప్రకటించింది. ఏటీఎంలలో డబ్బు మార్చాలి కనక... ఏటీఎంలు కూడా రెండ్రోజులు పనిచేయవని స్పష్టం చేసింది. భయం వద్దు.. కొత్త నోట్లు సిద్ధం న్యూఢిల్లీ: కొత్తగా ప్రవేశ పెట్టనున్న రూ.500, రూ.2,000 నోట్ల ముద్రణ కొన్ని నెలల క్రితమే మొదలైందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారుు. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లను అకస్మాత్తుగా ఉపసంహరించాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచినట్లు అధికారులు సీఎన్ఎన్-న్యూస్ 18కు విశ్వసనీయ సమాచారమిచ్చారు. ఆ వివరాల ప్రకారం ‘కొత్త నోట్లు రెండు రోజుల క్రితమే ఆర్బీఐకి చేరారుు. గత ఆరు నెలల్లో అన్ని స్థాయిల్లోని బ్యాంకు సిబ్బందికి ఈ వ్యవహారంపై శిక్షణ కూడా ఇచ్చారు. మొదట్లో ప్రభుత్వంపై కొంత ఒత్తిడి ఉంటుంది. ఎదుర్కొనేందుకు యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉంది. చిన్న మొత్తాల్లో నోట్లు కావాల్సినన్ని చలామణిలో ఉన్నందున 4-6 వారాల్లో పరిస్థితులు సర్దుకుంటారుు. మరోవైపు ఈ చర్యతో బ్యాంకులకు డిపాజిట్లు వెల్లువెత్తుతాయనీ, పన్నులు వసూలు కావడంతోపాటు డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలు ఊపందుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది’. సాహసోపేత చర్య నోట్ల రద్దును స్వాగతించిన రాష్ట్రపతి ప్రజలు ఆందోళనకు గురికావద్దని పిలుపు న్యూఢిల్లీ: అర్ధరాత్రి నుంచి రూ.1,000, 500 నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నిర్ణయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వాగతించారు. సాయంత్రమే మోదీ తనను కలసి ప్రభుత్వ నిర్ణయం గురించి చెప్పారన్నారు. దీనివల్ల ఖాతాల్లో చూపని ధనం బయటికి రావడంతోపాటు నకిలీ కరెన్సీ చలామణి నియంత్రణలోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనివల్ల ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరంలేదని, తమ వద్ద ఉన్న రూ.500, 1000 నోట్ల మార్పిడికి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తే సరిపోతుందని చెప్పారు. ఇప్పుడు రూ.500 కంటే తక్కువ విలువ ఉన్న నోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతాయని గుర్తుచేశారు. ప్రభుత్వమిచ్చిన అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ప్రణబ్ సూచించారు. నల్లధనం కట్టడికి.. న్యూఢిల్లీ: 2011 నుంచి 2016 మధ్య దేశంలో చలామణీలో ఉన్న కరెన్సీ నోట్లు 40 శాతం పెరిగినట్లు గుర్తించామని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ. 500 నోట్లు 76 శాతం, రూ.వెరుు్య నోట్లు 109 శాతం పెరిగాయని తెలిపింది. భారత్లో అక్రమ నగదు కార్యకలాపాల విలువ జీడీపీలో 20.7 శాతం(1999), 23.2 శాతం(2007)గా ఉన్నట్లు జులై, 2010లో ప్రపంచ బ్యాంకు అంచనా వేసిందని ప్రకటించింది. గత రెండేళ్లలో నల్లధనం సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని, ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని, అలాగే భారత్-మారిషస్, భారత్-సైప్రస్ల మధ్య డబుల్ టాక్స్ మినహారుుంపు చట్టంలో సవరణలు చేశామని ఆర్థిక శాఖ పేర్కొంది. స్విట్జర్లాండ్లోని హెచ్ఎస్బీసీలో ఉన్న భారతీయుల ఖాతాల వివరాలు తెలుసుకునేందుకు ఆ దేశంతో అవగాహనకు వచ్చామని ప్రకటనలో వెల్లడించింది. నగదు రహిత, డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని, బినామీ వ్యవహారాల చట్టంలో సవరణలు చేశామని, ఆదాయ వెల్లడి పథకం అమలు చేశామని తెలిపింది. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే విదేశాల్లో పోగుబడిన నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్న హామీని నెరవేర్చలేక మోదీ డ్రామా ఆడుతున్నారు. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది పెద్ద ఆర్థిక గందరగోళాన్ని సృష్టిస్తుంది. వారానికి ఒక ఐదొందల నోటు సంపాదించిన పేద కూలీలు రేపు బియ్యం, గోధుమలు, పప్పు ఎలా కొనుక్కుంటారు. దీనికి మోదీ సమాధానం చెప్పాలి. - మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సాహసోపేత నిర్ణయం రూ.500, 1000 నోట్లను రద్దుచేయడం సాహసోపేత నిర్ణయం. ఇది నల్లధనంపై చేసిన సర్జికల్ దాడులు. నల్లధనం నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద, సాహసోపేత చర్య. పౌరులు దీన్ని అర్థం చేసుకొని నల్లధనంపై పోరుకు సహకారం అందించాలి. - హస్ముక్ అధియా, కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అవినీతినీ రూపుమాపొచ్చు నల్లధనాన్ని వ్యవస్థ నుంచి రూపుమాపడానికి మోదీ తీసుకున్న కీలక చర్య. ఇది అవినీతిని తరిమికొట్టడానికి కూడా దోహదం చేస్తుంది. సాహసోపేత నిర్ణయం తీసుకున్నందుకు మోదీకి కృతజ్ఞతలు. - వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి సర్జికల్ దాడుల్లాంటివి నల్లధనం, అవినీతిపై ఇది సర్జికల్ దాడుల్లాంటిది. మోదీ మరోసారి ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చి తన నిబద్ధతను చాటారు. హవాలా, నకిలీ కరెన్సీ రాకెట్ల గుట్టు రట్టు చేయడానికేం చేయాలో.. మోదీ సరిగ్గా అదే చేశారు. - అమిత్షా, బీజేపీ అధ్యక్షుడు -
ఆ నోట్లు చిత్తుకాగితాలే.. ప్రజలు ఏం చేయాలంటే?
ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. రూ. ఐదు వందలు, రూ. వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నోట్లు కేవలం కాగితాలు మాత్రమే ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కరెన్సీ నోట్లు ఉన్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. ఈ నోట్లు కలిగిన ప్రజలు రానున్న రోజుల్లో ఏం చేయాలంటే.. బుధవారం (నవంబర్ 9) నాడు అన్ని బ్యాంకులు పనిచేయబోవు. ప్రస్తుతం మీవద్ద ఉన్న రూ. 500, రూ. వెయ్యినోట్లను డిసెంబర్ 30, 2016లోపు బ్యాంకులు, పోస్టాఫీసులలో డిపాజిట్ చేయవచ్చు. ఇలా డిపాజిట్ చేసే నగదు విషయంలో ఎలాంటి పరిమితి లేదు. ఈ నెల 24 వరకు హేడ్ పోస్టాఫీస్ లేదా సబ్ పోస్టాఫీస్లలో గుర్తింపు కార్డు చూపించి పాత రూ. 500, రూ. వెయ్యినోట్లను బదిలీ చేసుకోవచ్చు. ఇక్కడ రూ. 4,000 పరిమితి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకు నుంచి ఉపసంహరించే నగదు విషయంలో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 20వేలు వరకు పరిమితి ఉంటుంది. దీనిని రానున్న రోజుల్లో పెంచవచ్చు. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్స్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపుల విషయంలో, ఇంటర్నెట్ బ్యాంకింగ్ విషయంలో ఎలాంటి పరిమితులు ఉండబోవు. ఆ నోట్లు ఇక్కడ 72 గంటల వరకు చెల్లుతాయి! అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ రూ. 500, రూ. వెయ్యినోట్ల చెలామణి అవుతాయి అదేవిధంగా రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు, ఆర్టీసీ బస్సులు, విమాన బుకింగ్ కౌంటర్లు, పెట్రోల్ బంకులలో 72 గంటల వరకు ఇవి చెలామణి అవుతాయి. -
పెద్ద నోట్లతో జాగ్రత్త: ఆర్బీఐ
ముంబై: దొంగనోట్ల చెలామణి పెరగడం పట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రూ.500, రూ.1000 వంటి పెద్ద నోట్లను స్వీకరించేటపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుధవారం హెచ్చరించింది. సాధారణ లావాదేవీల్లో ఇలాంటి నోట్లను జాగ్రత్తగా పరిశీలించడాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలని సూచించింది. అమాయక ప్రజలను మోసగించడానికి భారీగా దొంగనోట్లను చెలామణిలోకి తెస్తున్న సంగతి తన దృష్టికి వచ్చిందని వెల్లడించింది. జాగ్రత్తగా పరిశీలిస్తే నకిలీ నోట్లను పసిగట్టవచ్చని తెలిపింది. పెద్ద సంఖ్యలో నోట్లను వినియోగించే సమయంలో మరిన్ని భద్రతా ప్రమాణాలు ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ కసరత్తు చేస్తోంది. నకిలీ నోట్ల వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు, సంస్థల మద్దతు, సహకారం ఆశిస్తోంది. -
వేలల్లో ఒక ‘స్టార్’
మనం వినియోగిస్తున్న కరెన్సీ నోట్ల నంబర్ల మధ్యలో స్టార్ గుర్తులు అప్పడప్పుడూ కనిపిస్తాయి. స్టార్ ఉన్న నోట్లు నకిలీవని కొందరు ఆందోళనకు గురవుతుంటారు. అయితే ఆ స్టార్ గుర్తు ఉన్న నోట్లు మంచివే. ఇవి ప్రత్యేకమైనవి. వేల నోట్లలో ఒకటి మాత్రమే ఇటువంటివి ఉంటాయి. కరెన్సీ నోట్లు ముద్రించే విషయంలో రిజర్వు బ్యాంక్ సిబ్బంది అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. కరెన్సీ నోట్లపై సీరియల్ నంబర్లు కేటాయించే సమయంలో ముందుగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మూడు నంబర్లు ముద్రిస్తారు. వాటి నుంచి కొంత ఖాళీ ఉంచి తర్వాత ఆరు నంబర్లు ముద్రిస్తారు. సీరియల్ నంబర్ల ఆధారంగా వంద నోట్లను ఒక కట్టగా కడతారు. అయితే ముద్రణా లోపం వల్ల కొన్ని నోట్లు పాడైపోతాయి. అటువంటి నోట్ల స్థానంలో స్టార్ గుర్తు పెట్టి కొత్తనోటును ముద్రించి ఆ కట్టలో పెడుతారు. అటువంటి నోట్ ఉన్న కట్టపై ప్రత్యేకంగా స్టార్ గుర్తును కూడా ముద్రిస్తారు. తద్వారా ఆ కట్టలో స్టార్ గుర్తు ఉన్న నోటు ఉందని తెలుసుకోవచ్చు. అటువంటి నోట్లు వేలల్లో ఒకటి ఉంటాయి. అలా వచ్చిన అరుదైన రూపాయి, రూ.10, రూ.20, రూ.50 నోట్లను లక్కవరపుకోట స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఏఎస్ఎన్ రాజు సేకరించారు. తాను 15ఏళ్లుగా ఇటువంటి నోట్లు సేకరిస్తున్నానని ఆయన చెప్పారు. అప్పటి నుంచి ప్రారంభిస్తే ఇప్పటికి రూపాయి, రూ.10, రూ.20, రూ.50 నోట్లు లభించాయని తెలి పారు. - లక్కవరపుకోట -
నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
అనంతపురం పట్టణంలో నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన షేక్ ముజాహీన్ అలీ, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అన్వర్షేక్ బుధవారం పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో కొనుగోళ్ల అనంతరం నకిలీ వెయ్యి రూపాయల నోట్లను ఇచ్చారు. వాటిని పరిశీలించిన షాపు యజమాని మల్లికార్జున రెడ్డి నకిలీవని గుర్తించి వారిని పట్టుకుని వన్టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 33 నకిలీ వెయ్యి రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. -
నకిలీ కరెన్సీతో సెల్ఫోన్లు స్వాహా
అమలాపురం టౌన్ : ఆన్లైన్లో సెల్ఫోన్లు ఆర్డర్ చేసి, అవి తెచ్చిన వారికి నకిలీ నోట్లు ఇచ్చిన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.50 వేల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో అయినవిల్లి మండలం మాగం గ్రామానికి చెందిన యాళ్ల మోహన అయ్యప్ప అనే యువకుడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించినట్టు చెప్పారు. కేసు వివరాలను ఆయన చెప్పారు. ఆన్లైన్లో సెల్ఫోన్ల అమ్మకం ప్రకటనలు చూసి మోహన అయ్యప్ప ఆయా సంస్థలకు సెల్ఫోన్లు ఆర్డర్ ఇచ్చాడు. అతని వద్దకు కొత్త సెల్ఫోన్ తెచ్చిన వ్యక్తికి కలర్ జిరాక్సుతో ఉన్న వెయ్యి నోట్లను ఇచ్చాడు. ఆ వ్యక్తి నోట్లను పరిశీలిస్తున్నప్పుడు, సెల్ఫోన్ పట్టుకుని మోహన అయ్యప్ప పరారయ్యాడు. ఇలా అమలాపురంలో పలు చోట్ల మోసాలకు పాల్పడ్డాడు. ఈ తరహాలో పట్టణంలో ఐదు చోరీలకు పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు, కలర్ ప్రింటర్ను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.50 వేలు ఉంటుందిన సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
నకిలీనోట్లతో బ్యాంకుకు వెళ్లిన మహిళ
పెద్దేముల్ (రంగారెడ్డి జిల్లా) : రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ విజయా బ్యాంకులో ఒక మహిళ తన అకౌంట్లో జమచేసేందుకు నకిలీ నోట్లు తీసుకురావడంతో బ్యాంకు సిబ్బంది కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. పెద్దేముల్లో పాలిష్ కంపెనీలో పనిచేస్తున్న అలివేలు అనే మహిళ తన అకౌంట్లో జమ చేసేందుకు రూ. 40 వేలు విలువైన వెయ్యిరూపాయల నోట్లు తెచ్చింది. వాటిని పరిశీలించిన బ్యాంకు అధికారులు అవి నకిలీవని గుర్తించారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు తాను పనిచేసే యజమాని ఈ నోట్లు ఇచ్చాడని అలివేలమ్మ పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ నోట్ల ముఠా అరెస్టు
శృంగవరపుకోట రూరల: నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను శృంగవరపుకోట పట్టణ ఎస్ఐ కె.రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.15 లక్షల విలువైన నకిలీ ఐదొందల నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్.కోట సీఐ ఎం.లక్ష్మణమూర్తి, ఎస్ఐ కె.రవికుమార్లు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం చిననాగయ్యపేట గ్రామానికి చెందిన తమటపు దండునాయుడు, బుద్దల శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం), బొద్దు శ్రీనివాస్ (పిఠాపురం), యడ్ల గోపాలకృష్ణ (జగ్గంపేట), మండూరు రమేష్ (గణపవరం), కేసనాపల్లి రమేష్కుమార్(తాడేపల్లిగూడెం)లు ఒక ముఠాగా ఏర్పడి చిన్న పిల్లలు ఆడుకునే నకిలీ ఐదొందల నోట్లకట్టలకు పైనా.. దిగువున ఒరిజనల్ ఐదొందల నోట్లను పెట్టి ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి సిద్ధంగా ఉంచుకుంటారు. ఎవరైనా లక్ష ఒరిజనల్ నోట్లు ఇస్తే మూడు లక్షల దొంగనోట్లు ఇస్తామంటూ అమాయకులను ప్రలోభపెడతారు. ఈ నేపథ్యంలో ఎస్.కోట పట్టణ ంలోని వన్వే ట్రాఫిక్ సమీపంలో నివసిస్తున్న ఫిర్యాదుదారుడుకు ముఠా సభ్యుడు దండునాయుడు తారసపడి, అసలు నోట్లకు మూడింతలు దొంగనోట్లు ఇస్తామంటూ నమ్మబలికారు. దీంతో ఆయన అప్రమత్తమై ముఠా సభ్యుల ఆట కట్టించాలని భావించి ఎస్ఐ కె.రవికుమార్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన సూచనల మేరకు ఫిర్యాదుదారుడు ముఠాసభ్యుడికి రూ.30 వేలు ఒరిజనల్ నోట్లు అందజేసి లక్ష నకిలీ నోట్లు తీసుకున్నాడు. ఇదే సమయంలో ఎస్ఐ చాకచక్యంతో కానిస్టేబుల్ శ్రీనును సాధారణ వ్యక్తిగా ఆ ముఠా వద్దకు పంపించారు. బేరసారాలు జరుగుతుండగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రూ.15 లక్షల నకిలీ నోట్లతో పాటు ఆరుగురు ముఠాసభ్యులను అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురిని పెందుర్తి వద్ద, దండునాయుడును దేవరాపల్లి మండలం చిననాగయ్యపేటలో పట్టుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ లక్ష్మణ మూర్తి ప్రజలకు సూచించారు. నకిలీ నోట్ల సమాచారం తెలిస్తే తమకు విషయం తెలియజేయాలని కోరారు. కాగా, 20 రోజుల పాటు శోధన చేసి ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసిన ఎస్ఐను, పోలీసు సిబ్బందిని అభినందించారు. -
కరెన్సీ కలకలం
* రూ.40కు రూ.100 నోటు * యథేచ్ఛగా నకిలీ నోట్ల చెలామణి! గోరంట్ల(పెనుకొండ) : గోరంట్ల కేంద్రంగా నకిలీ నోట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. పొరుగున ఉన్న కర్ణాటక నుంచి ఇక్కడకు నకిలీ నోట్లు పెద్ద ఎత్తున వస్తున్నట్లు సమాచారం. గోరంట్లలోని ఆరు క్రియాశీలక కేంద్రాలకు తొలుత నకిలీ కరెన్సీ చేరుతోంది. అక్కడి నుంచి ఈ అక్రమ వ్యాపారాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 40 అసలు నోటు ఇస్తే రూ. 100 నకిలీ నోటు ఇస్తున్నారు. దీంతో చాలా మంది గ్రామీణులు, యువత ఈ అక్రమ వ్యాపారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఏకంగా దుబాయ్ నుంచే ఇక్కడకు నకిలీ కరెన్సీ దిగుమతి అవుతోందన్న ఆరోపణలున్నాయి. ఫైనాన్స్, చీటి నిర్వాహకుల ద్వారా నకిలీ నోట్లు మార్కెట్లోకి చెలామణి అవుతోందన్న విమర్శలున్నాయి. వీటిలో రూ. 500, రూ.1000 నోట్లే అధికంగా ఉండడం గమనార్హం. దీనిపై స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... నకిలీ నోట్ల చెలామణిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. -
సత్యదేవుని హుండీలో నకిలీ నోట్లు
అన్నవరం: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి హుండీ ద్వారా వచ్చిన నగదులో 72 నకిలీ వెయ్యి రూపాయల నోట్లను అధికారులు గుర్తించారు. శుక్రవారం జరిగిన హుండీ లెక్కింపులో ఈ నోట్లు వచ్చాయి. ఒకే సిరీస్తో వరుస నెంబర్లు గల ఈ నోట్లు కొత్తగా ఉండడంతో అనుమానించిన అధికారులు వాటిని నోట్లు లెక్కించే మెషీన్లో పెట్టగా తిరస్కరించింది. దీంతో నకిలీ నోట్లుగా నిర్ధారించి చించివేసినట్లు ఈవో నాగేశ్వరరావు తెలిపారు. -
బంగ్లాదేశ్ ముఠా అరెస్ట్
నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన ఓ ముఠా వీటిని నగరంలో చలామణి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ.3.85 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. కాగా.. పోలీసుల దాడి నుంచి ఇద్దరు వ్యక్తులు తప్పించుకుని పారిపోయారు. వీరు సుల్తాన్ బజార్ కేంద్రంగా నకిలీ నోట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న వ్యక్తి అరెస్ట్
నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ఓ వ్యక్తిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 31వేల విలువైన 62 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ 500 రూపాయల నోట్లు కావడం విశేషం. నకిలీ నోట్లతో పాటు.. 4 తులాల బంగారు ఆభరణాలు, కలర్ ప్రింటర్ తో పాటు సెల్ ఫోన్ ను సీజ్ చేశారు. -
అధిక స్థాయిలోనే ధరలు
ఆర్బీఐ గవర్నర్ రాజన్ అభిప్రాయం ♦ ఇటీవలి ద్రవ్యోల్బణం తగ్గుదల ♦ బేస్ ఎఫెక్ట్ ప్రభావమని విశ్లేషణ ♦ అల్లకల్లోల సముద్రంలో భారత్ ఒక ప్రశాంత దీవి అని వ్యాఖ్య న్యూఢిల్లీ : అమెరికా ఫెడ్ రేట్ల పెంపును వాయిదావేసిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు కోత సెప్టెంబర్ 29న ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో, దీనికి భిన్నమైన ధోరణిలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు చేశారు. రేటు కోత నిర్ణయం ‘ద్రవ్యోల్బణం అదుపు’పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆగస్టు నెల చరిత్రాత్మక కనిష్ట స్థాయి 3.6 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం పడిపోవడం- బేస్ ఎఫెక్ట్గా కూడా ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకించి ఈ వ్యాఖ్య సెప్టెంబర్ 29 రెపో రేటు కోతపై పలువురి అంచనాలపై నీళ్లు జల్లుతోంది. గత ఏడాదే ధరల పెరుగుదల శాతం అధికంగా వుండటం వల్ల... అప్పటితో పోల్చితే (క్రితం ఏడాది ప్రాతిపదిక) ఈ ఆగస్టు నెలలో పెరుగుదల శాతం తక్కువవుండటమే బేస్ ఎఫెక్ట్. కానీ మొత్తం మీద ఈ ఏడాదీ ధరలు పెరిగాయ్. బేస్ ఎఫెక్ట్ను తొలగిస్తే... వాస్తవ ద్రవ్యోల్బణం 5% వరకూ ఉం టుందని కూడా రాజన్ తాజాగా వ్యాఖ్యానించారు. ఇక్కడ జరిగిన సీకే ప్రహ్లాద్ నాల్గవ స్మారక కార్యక్రమంలో ఆయన పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ద్రవ్యోల్బణం అదుపులో ఉండడమే కీలకం. అయితే ఇది కేవలం ఇప్పుటికే సంబంధించిన అంశం కాదు. భవిష్యత్తుకూ ఇది అవసరమే.’ అని ఆయన అన్నారు. ‘ఇప్పుడు మీ కెమెరాలు అన్నీ దేనికోసం చూస్తున్నాయో నాకు తెలుసు. నా స్పందన యథాతథమే. మీరు రానున్న విధాన ప్రకటన వరకూ వేచి చూడాల్సి ఉంది. ఇంకా ఆయన ఏమన్నారంటే... ►అల్లకల్లోల సముద్రంలో భారత్ ఒక ప్రశాంత దీవి. పలు దేశాలు వృద్ధికి ఇబ్బందులు పడుతుంటే... భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రం మంచి పనితీరును కనబరుస్తోంది. ►వృద్ధి దిశలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇక్కడ మనం బ్రెజిల్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వేగంగా అభివృద్ధి చెందాలనుకున్న దేశం ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వ రుణ భారం, అవినీతి, కంపెనీల నష్టాలు, మొండిబకాయిల సమస్యల్లో బ్రెజిల్ కూరుకుంది. ►వృద్ధి ప్రగతిలో పటిష్ట వ్యవస్థల పాత్రా కీలకం. అధిక విలువ నోట్లు అందుకే ముద్రించడం లేదు పొరుగు దేశాలతో సంక్లిష్టమైన సంబంధాల కారణంగా నకిలీ నోట్లు వెల్లువెత్తవచ్చన్న ఆందోళన వల్లే అధిక విలువ గల నోట్ల ముద్రణ ఆర్బీఐకి కష్టంగా ఉంటోందని రాజన్ చెప్పారు. సిసలైనవిగా కనిపించే రూ. 500 నకిలీ నోట్లను తాను అనేకం చూశానని, ఇలాంటివి అరికట్టేందుకు ఎప్పటికప్పుడు అదనపు భద్రతా ఫీచర్లను జోడి స్తూనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు. -
నకిలీ కరెన్సీ అడ్డా.. ఏపీ!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పోలీసు సహా వివిధ నిఘా విభాగాలు స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీలో 17.91 శాతం ఆంధ్రప్రదేశ్లోనే దొరికినట్లు కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం రూ.3,03,54,604 విలువైన నకిలీ కరెన్సీ లభ్యమైంది. ఇందులో రూ.54,37,600 విలువైన కరెన్సీతో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో నిలిచినట్లు గణాంకాలు వెల్లడించాయి. రూ.87,47,820తో గుజరాత్ తొలిస్థానంలో, రూ.73,86,900తో ఛత్తీస్గఢ్ రెండో స్థానంలో ఉన్నాయి. స్వాధీనమవుతున్న నకిలీ కరెన్సీలో అత్యధిక భాగం పాకిస్థాన్ భూ భాగంలో ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లో ముద్రతమవుతున్నట్లు హోం శాఖ అనుమానిస్తోంది. నిపుణులు సైతం గుర్తించలేని విధంగా ఈ కరెన్సీ ముద్రితమవుతుండటమే దీనికి నిదర్శనమని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా నకలీ నోట్లలో రూ.1,000, రూ.500 నోట్లే అధికంగా ఉంటున్నాయి. దీంతో కరెన్సీ నోట్ల ముద్రణలో ఆర్బీఐ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. సెక్యూరిటీ ఫీచర్స్ను నానాటికీ పెంచుతోంది. అయినప్పటికీ పాక్లో ముద్రితమవుతున్న నకిలీ కరెన్సీ నోట్లు, అసలు నోట్ల మధ్య తేడాలు రానురాను తగ్గిపోతుండడం ఆందోళనకరమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. పాకిస్తాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పవర్ ప్రెస్లోనే ఫేక్ కరెన్సీని ముద్రిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న రూ.3,03,54,604 విలువైన నకిలీ కరెన్సీలో రూ.1,98,95,000 విలువైనవి రూ.1,000 డినామినేషన్ నోట్లే కావడం గమనార్హం. -
బీఎస్ఎఫ్ జవాన్ నుంచి నకిలీ నోట్లు స్వాధీనం
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆదివారం నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. బీఎస్ఎఫ్ కంపెనీ 125 బెటాలియన్లో జవాన్గా పనిచేస్తున్న నందిగాం మండలం దేవళభద్ర గ్రామానికి చెందిన పట్నాన వరప్రసాద్ నుంచి పోలీసులు రూ. 37 వేల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. టెక్కలిలో ఓ మద్యం దుకాణానికి వచ్చిన వరప్రసాద్ వద్ద నకిలీ నోట్లు ఉండడం గమనించిన దుకాణం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై రాజేష్తో పాటు సిబ్బంది అక్కడకు చేరుకుని వరప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. 37 వేల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో కాపలా ఉన్న సమయంలో తనకు నగదుతో ఉన్న బ్యాగు దొరికిందని విచారణలో వరప్రసాద్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు చెప్పారు. -
నకిలీ నోట్ల ఏజెంట్ అరెస్టు
ఖమ్మం క్రైం : నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఏజెంట్ను ఖమ్మం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ దక్షిణామూర్తి ఆదివారం విలేకరులతో తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. నగరంలోని బుర్హాన్పురంనకు చెందిన షేక్ అమీరుద్దీన్ పాన్షాప్ నడుపుతున్నాడు. గతనెల 29న అతని షాపునకు ఓవ్యక్తి వచ్చి హిందీలో మాట్లాడుతూ రూ. 1000 నోటు ఇచ్చి సిగరెట్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. మిగితా చిల్లర డబ్బులు తీసుకుని వెళ్లిపోయూడు. ఆ రూ. 1000 నోట్ను ఈనెల 1న అమీరుద్దీన్ సరుకులు కొనుగోలు చేసేందుకు ఓ షాపునకు వెళ్లాడు. షాపు యజమాని నకిలీ నోటు అని చెప్పడంతో అమీరుద్దీన్ అవాక్కయ్యాడు. టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చే శాడు. మరుసటి రోజు అమీరుద్దీన్ బస్టాండ్కు వెళ్లగా తనకు నకిలీ నోట్ ఇచ్చిన వ్యక్తి తారసపడ్డాడు. వెంటనే టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్టాండ్కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో పట్టుబడిన వ్యక్తిని బీహర్ రాష్ట్రంలోని బేగ్సరాయి జిల్లా పబ్ర గ్రామానికి చెందిన అమరజిత్ కుమార్గా గుర్తించారు. ఇతను పశ్చిబెంగాల్లోని వజీర్ అనే వ్యక్తికి రూ. 40 వేల అసలు నోట్లు ఇచ్చి రూ. లక్ష నకిలీ నోట్లను తీసుకున్నాడు.అనంతరం అమీరుద్దీన్ ఖమ్మం చేరుకుని కొంతకాలంగా ఇక్కడ పాన్ షాపులలో, చిల్లర దుకాణాలలో ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ నోట్లను మారుస్తున్నాడు. అతను తెచ్చిన రూ. 100, రూ. 1000 నోట్లు 44 నకిలీవి ఇప్పటికే మార్చాడు. పోలీసులు అతని వద్ద ఉన్న 56 నకిలీ రూ .100, రూ. 500 నోట్లను స్వాధీన పర్చుకోన్నారు. అదేవిధంగా తాను ఇప్పటి వరకు మార్చిన రూ. 25 వేలల్లో రూ. 10 వేలు బ్యాంకులో జమచేయగా మిగతావిసొంత ఖర్చులకు వాడుకున్నట్లు తెలిపాడు. అతని వద్ద అసలు నగదును కూడా పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నకిలీ కరెన్సీ నోట్ల పట్ల ముఖ్యంగా చిరు వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నకిలీ కరెన్సీని ఎక్కువగా చిన్న వ్యాపారాలు చేసే వారి వద్దనే నిందితులు చలామణి చేస్తున్నారని పేర్కొన్నారు. నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న వారిని గుర్తిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. నకిలీ నోట్ల నిందితుడిని పట్టుకున్న టూటౌన్ సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐలు సుబ్బయ్య, కుమార్ ఐడి పార్టీ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.వారికి రివార్డులు ప్రకటించారు. -
దొంగనోట్లు చెలామణి చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఖమ్మం: ఖమ్మం నగరంలో దొంగ నోట్లు చెలామణి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బీహార్కు చెందిన నజీర్ అనే వ్యక్తి బస్టాండ్ సమీపంలో దొంగ నోట్లు మార్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 25వేల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. -
ఆ ఎనిమిది లక్షలు దొంగ నోట్లే
కోల్కతా: భారత సరిహద్దు రక్షణ బలగం(బీఎస్ఎఫ్) దాదాపు రూ.ఎనిమిది లక్షల దొంగనోట్లను స్వాధీనం చేసుకొంది. వాటిని సీజ్ చేసింది. బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా సరిహద్దు వద్ద నుంచి తరలించేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా బలగాలు గుర్తించి నిలువరించాయి. బంగ్లాదేశ్కు చెందిన కొందరు చొరబాటుదారులు ఒక బ్యాగును బంగ్లా సరిహద్దు నుంచి భారత్ సరిహద్దులోకి విసిరేశారు. దీనిని బోర్డర్ బలగాలు గమనించడంతో వాటిని తీసుకునేందుకు ప్రయత్నించిన భారత్లోని చొరబాటుదారులు వీలుకాక చివరికి పారిపోయారు. దీంతో బ్యాగును స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ బలగాలు దానిని తెరిచి చూసి అందులో ఎనిమిది లక్షల రూపాయల దొంగనోట్లు ఉన్నట్లు గుర్తించారు.