indian hockey team
-
ప్రొ లీగ్తో భారత హాకీ జట్ల ఆట షురూ
భువనేశ్వర్: భారత హాకీ జట్లు ఈ సీజన్ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్తో ప్రారంభించనున్నాయి. భారత్ అంచె పోటీలు వచ్చేనెల 15 నుంచి భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరుగుతాయి. ఇందులో తొలిరోజు భారత పురుషుల జట్టు స్పెయిన్తో పోటీపడనుండగా, మహిళల జట్టు ఇంగ్లండ్ను ‘ఢీ’ కొట్టనుంది. ప్రస్తుతమైతే భారత జాతీయ క్రీడాకారులంతా (మహిళలు, పురుషులు) హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)తో బిజీగా ఉన్నారు. రూర్కేలా, రాంచీలలో జరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్ టోర్నీలో భారత ప్లేయర్లు ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతరం ఫిబ్రవరిలో భారత జట్ల అంతర్జాతీయ సీజన్ ఆరంభం కానుంది. వచ్చే నెల 15 నుంచి 25 వరకు జరిగే భారత్ అంచె ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ పోటీల్లో పురుషుల జట్టు స్పెయిన్, ఇంగ్లండ్, జర్మనీ ఐర్లాండ్లతో ముఖాముఖి పోటీల్లో తలపడుతుంది. అమ్మాయిల జట్టు ఇంగ్లండ్తో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్లతో పోటీపడుతుంది. ఒక్కో జట్టుతో రెండేసి లీగ్ మ్యాచ్లు ఆడుతుంది. మ్యాచ్లన్నీ కళింగ స్టేడియంలోనే నిర్వహిస్తారు. భారత్ అంచెకంటే ముందు ఆస్ట్రేలియాలో ఎఫ్ఐహెచ్ తొలి అంచె మొదలవుతుంది. సిడ్నీలో ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు జరిగే ఆసీస్ అంచె పోటీల్లో భారత జట్లకు మ్యాచ్ల్లేవు. ‘ఆస్ట్రేలియాలో మ్యాచ్లు ముగిసిన వెంటనే రోజుల వ్యవధిలోనూ భారత్ అంచె పోటీలు మొదలవుతాయి. హాకీని ఆదరించే భారత్లో ఈ పోటీలు రసవత్తరంగా సాగుతాయి.11 రోజుల పాటు 24 మ్యాచ్లు జరుగనున్నాయి. ఇది ముగిసిన తర్వాత తుది అంచె పోటీలు సాంటియాగో డెల్ ఈస్టెరోలో జరుగుతాయి. దీంతో అన్ని జట్లకు ఎనిమిదేసి మ్యాచ్లు పూర్తవడంతో ఫైనల్స్కు చేరే నాకౌట్ జట్లేవే తేలిపోతాయి. గత సీజన్లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు, నెదర్లాండ్స్ మహిళల జట్టు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ టైటిల్స్ నెగ్గాయి. -
‘మట్టి’లో మాణిక్యాలు
ఏ దేశంలోని మైదానంలోనైనా సరే.. ప్రత్యర్థి జట్టును మట్టికరిపిస్తూ దూసుకెళ్లే భారత హాకీ జట్టు అంటే ప్రపంచ దేశాలకు హడల్.. ఆసియా ఛాంపియన్ ట్రోఫీలతో పాటు ఒలింపిక్స్లోనూ భారత్ సత్తాచాటి ఎన్నో మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.. క్రికెట్తో పోలిస్తే మన దేశంలో జాతీయ క్రీడ హాకీకి ఆదరణ అంతంత మాత్రమే.. హాకీలో మహిళలు సైతం పతకాల పంట పండిస్తుండటంతో ఉత్తరాది రాష్ట్రాల్లో క్రీడాకారులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తూ శిక్షణ అందిస్తున్నారు. దీంతో కొందరు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇక మన రాష్ట్రంలో హాకీ క్రీడకు కనీస సదుపాయాలు లేకపోయినా క్రీడాకారులు మాత్రం తగ్గేదే లే అన్నట్లు పక్క రాష్ట్రాలకు వెళ్లిమరీ కోచింగ్ తీసుకుంటున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. టర్ఫ్ గ్రౌండ్స్ను అభివృద్ధి చేస్తే మరింత ప్రాక్టీస్ చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాల వేట కొనసాగిస్తామంటున్నారు హైదరాబాదీలు.. సికింద్రాబాద్ ఆర్ఆర్సీ గ్రౌండ్లో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు 14వ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ చాంపియన్షిప్ –2024 పోటీలు జరుగుతున్నాయి. హైదరాబాద్కు చెందిన లాలస తెలంగాణ జట్టుకు కెప్టెన్గా, మరో ఇద్దరు సోదరీమణులు భవిష్య, చరిత్ర తెలంగాణ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లాలస ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) క్యాంపులో ఉంటూ ప్రాక్టీస్ చేస్తోంది. భవిష్య, చరిత్ర కేరళలో సాయ్ క్యాంపులో శిక్షణ పొందుతున్నారు. హాకీ పట్ల ఉన్న మక్కువతో జాతీయ స్థాయికి ఎదిగిన క్రమంలో వీరు పడ్డ కష్టాలు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే..కేరళలో శిక్షణ పొందుతున్నాం: భవిష్య, చరిత్ర మల్కాజిగిరికి చెందిన సందీప్ రాజ్ తెలంగాణ మాస్టర్స్ హాకీ టీమ్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన ఆయన ఇద్దరు కుమార్తెలు భవిష్య, చరిత్ర తెలంగాణ బాలికల జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక కీస్ హైసూ్కల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన భవిష్య, చరిత్ర తొలినాళ్లలో జింఖానా మైదానంలో కోచ్ కామేశ్ శిక్షణలో హాకీ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. కేరళలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ శిబిరానికి ఎంపిక కావడంతో ప్రస్తుతం అక్కడే ఉండి శిక్షణ తీసుకుంటున్నారు. 9, 10వ తరగతి చదువుతున్న వీరు అక్కడి రాష్ట్ర భాష మళయాళీ నేర్చుకుని మరీ పరీక్షలకు హాజరవుతున్నారు. తన ఇద్దరు కూతుళ్లు ఇప్పటి వరకు 6 జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. ఆట కోసం ఒడిశా వెళ్లా: లాలస సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్లోని ఆక్సిల్లమ్ స్కూల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నాను. స్థానిక జింఖానా మైదానంలో హాకీ శిక్షణ తీసుకున్నా. కోచ్ కామేశ్ ప్రోత్సాహంతో ఆటలో నైపుణ్యం సాధించా.. హైదరాబాద్లో టర్ఫ్ కోర్టులు అందుబాటులో లేకపోవడంతో గ్రావల్ (కంకర మట్టి) కోర్టుల్లోనే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. ఉత్తమమైన శిక్షణ కోసం తొలుత బెంగళూరుకు వెళ్లా. పదో తరగతి పరీక్షలు అక్కడే రాయాల్సి వచ్చింది. స్థానిక భాష కన్నడ నేర్చుకుని మరీ పదో తరగతిలో పాసయ్యా. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లోని నవల్ టాటా క్రీడాప్రాంగణంలో శిక్షణ తీసుకుంటున్నాను. ప్రముఖ హాకీ క్రీడాకారుడు భారత జాతీయ జట్టు మాజీ కెపె్టన్, గోల్ కీపర్ శ్రీజేశ్ ద్వారా స్ఫూర్తి పొంది గోల్ కీపర్గా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నదే లక్ష్యం. తండ్రి జగన్, తల్లి ప్రోత్సాహం ఉంది. ఇప్పటి వరకు మూడు జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. -
హర్మన్ప్రీత్కు 78 లక్షలు
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్కు హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వేలంలో భారీ ధర పలికింది. ఆదివారం ప్రారంభమైన హెచ్ఐఎల్ లీగ్ తొలి రోజు జేఎస్డబ్ల్యూ గ్రూప్కు చెందిన సూర్మా హాకీ క్లబ్ రూ. 78 లక్షలు పెట్టి హర్మన్ప్రీత్ సింగ్ను కొనుగోలు చేసుకుంది. వేలం మొదటి రోజు భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్ల కోసం ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అభిషేక్ కోసం బెంగాల్ టైగర్స్ ఫ్రాంచైజీ రూ. 72 లక్షలు వెచ్చించగా.. యూపీ రుద్రాస్ ఫ్రాంచైజీ హార్దిక్ సింగ్ను రూ. 70 లక్షలకు పెట్టి కొనుగోలు చేసుకుంది. తమిళనాడు డ్రాగన్స్ జట్టు అమిత్ రోహిదాస్ కోసం రూ. 48 లక్షలు వెచి్చంచగా... బెంగాల్ టైగర్స్ ఫ్రాంచైజీ జుగ్రాజ్కు అంత మొత్తమే ఇచ్చి తీసుకుంది. హైదరాబాద్ తూఫాన్స్ ఫ్రాంచైజీ తొలి రోజు వేలంలో అత్యధికంగా సుమిత్ కోసం రూ. 46 లక్షలు ఖర్చు చేసింది. తొలి రోజు వేలంలో భారత్ నుంచి 54 మంది ప్లేయర్లతో పాటు 18 మంది విదేశీ ప్లేయర్లు అమ్ముడుపోయారు. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు 16 కోట్ల 88 లక్షల 50 వేలు ఖర్చు చేశాయి. ఎనిమిది ఫ్రాంచైజీల్లో కళింగ లాన్సర్స్ వద్ద అత్యధికంగా రూ. 2.57 కోట్లు ఇంకా మిగిలి ఉండగా... అత్యల్పంగా బెంగాల్ టైగర్స్ వద్ద రూ. 1.44 కోట్లు పర్స్ మనీ ఉంది. హైదరాబాద్ తూఫాన్స్ ఫ్రాంచైజీ వద్ద ఇంకా రూ. 2.04 కోట్లు ఉన్నాయి. జర్మనీకి చెందిన గొంజలో పైలట్ అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్గా నిలిచాడు. అతడికోసం తమిళనాడు డ్రాగన్స్ జట్టు రూ. 68 లక్షలు వెచ్చించింది. నెదర్లాండ్స్కు చెందిన జిప్ జాన్సెన్ను రూ. 54 లక్షలు పెట్టి తమిళనాడు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. -
అజేయంగా ‘ఆసియా’ విజేతగా
డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగినట్టుగానే టోర్నీలో ఆడిన ప్రతి మ్యాచ్లోనూ జయకేతనం ఎగురవేసిన భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. టైటిల్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్కు చైనాతో తుదిపోరు అందరు అనుకున్నంత సులువుగా సాగలేదు. భారత్ స్థాయికి ఏమాత్రం సరితూగని చైనా ప్రతి క్వార్టర్లోనూ ఊహించని విధంగా ప్రతిఘటించింది. దీంతో భారత్ గోల్ చేసేందుకు ఆఖరి క్వార్టర్ దాకా నిరీక్షించక తప్పలేదు. చివరకు జుగ్రాజ్ చేసిన గోల్తో టీమిండియా ఏసీటీలో ఓవరాల్గా ఐదో టైటిల్ను కైవసం చేసుకుంది. హలుంబుయిర్: పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. చైనాలో జరిగిన ఈ ఈవెంట్లో పరాజయం ఎరుగని టీమిండియా జైత్రయాత్ర టైటిల్ నిలబెట్టుకునేదాకా అజేయంగా సాగింది. మంగళవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా 1–0తో చైనా జట్టుపై గెలిచి టోర్నీ చరిత్రలో ఐదోసారి చాంపియన్షిప్ను సాధించింది. ఇప్పటి వరకు 8 ఏసీటీ ఈవెంట్లు జరిగితే ఇందులో అత్యధికంగా ఐదుసార్లు భారత్ 2011, 2016, 2018 (పాక్తో కలిసి సంయుక్త విజేత), 2023లలో విజేతగా నిలవడం విశేషం. డిఫెండర్ జుగ్రాజ్ సింగ్ ఆఖరి క్వార్టర్లోని 51వ నిమిషంలో చేసిన ఫీల్డ్ గోల్తో భారత్ విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో గానీ, ఆటతీరులో గానీ సాటిరాని చైనా జట్టు ఫైనల్లో హర్మన్ప్రీత్ సేనకు ఊహించని విధంగా పోటీ ఇచ్చింది. ఈ టోర్నీలో లీగ్ దశ పోటీల్లో 3–0తో చైనా, 5–1తో జపాన్, 8–1తో మలేసియా, 3–1తో కొరియా, 2–1తో పాకిస్తాన్లను ఓడించిన భారత్ సెమీస్లో 4–1 కొరియాను ఓడించి టైటిల్పోరుకు చేరింది. దీంతో సులువైన ప్రత్యర్థి చైనాపై కనీసం రెండు, మూడు గోల్స్ తేడాతో విజయం ఖాయమని విశ్లేషకులు, అభిమానులు భావించారు. కానీ వారి అంచనాలన్నీ తారుమారయ్యాయి. తుదిపోరులో కేవలం ఒకే ఒక్క గోల్ తేడాతో భారత్ గెలిచింది. చైనా డిఫెండర్లు భారత స్ట్రయికర్లను సమర్థంగా నిలువరించారు. దీంతో ఈ టోర్నీలోనే అతి తక్కువ గోల్స్ తేడాతో, భారత్ గెలిచిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం! మూడు క్వార్టర్ల పాటు... చైనా డిఫెండర్ల ఆటతీరు భారత ఫార్వర్డ్ లైన్కు గోడకట్టినట్లుగా సాగింది. మూడు క్వార్టర్ల పాటు ప్రత్యర్థి రక్షణ శ్రేణి భారత సేనను సమర్థవంతంగా నిలువరించింది. భారత్ ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా చేసిన దాడులన్నీ చైనా ఆటగాళ్ల పోరాటపటిమతో విఫలమయ్యాయి. నిజానికి ఇప్పటివరకు ఎన్నో ఫైనల్స్ ఆడిన చరిత్ర భారత్ది కాగా... చైనాకు మాత్రం ఇది రెండో టైటిల్ పోరు. 2006 ఆసియా క్రీడల ఫైనల్లో చైనా 1–3తో కొరియా చేతిలో ఓడింది. ఫైనల్స్ మ్యాచ్ల అనుభవం తక్కువే అయినా ప్రదర్శనతో చైనా ఆకట్టుకుంది. ఆట ఆరంభం నుంచి భారత స్ట్రయికర్లను ఎక్కడికక్కడ నిలువరించడంతో రాజ్ కుమార్, కెపె్టన్ హర్మన్ప్రీత్, నీలకంఠ శర్మ తొలి క్వార్టర్లో కొట్టిన టార్గెట్ షాట్లు నిరీ్వర్యమయ్యాయి. రెండో క్వార్టర్లోనూ ఇదే ఆటతీరు కొనసాగింది. 27వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచేందుకు సుఖ్జీత్ సింగ్, హర్మన్ప్రీత్లు చేసిన ప్రయత్నాల్ని చైనా గోల్కీపర్ వాంగ్ వీహావొ చాకచక్యంగా అడ్డుకున్నాడు. ఎట్టకేలకు ఆఖరి క్వార్టర్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ వద్దకు వచ్చిన బంతిని నేర్పుగా చైనా డిఫెండర్లను ఏమార్చుతూ డి ఏరియా వద్ద అప్రమత్తంగా ఉన్న జుగ్రాజ్కు పాస్ చేశాడు. అతను ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా బంతిని గోల్పోస్టులోకి తరలించడంతో భారత్ శిబిరం ఎట్టకేలకు సంబరాల్లో మునిగింది. వర్గీకరణ పోరులో పాకిస్తాన్ 5–2తో కొరియాను ఓడించి మూడో స్థానంలో నిలిచింది. వైఎస్ జగన్ ప్రశంస: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత జట్టును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. -
Manpreet Singh: ‘లాస్ట్’ ఏంజెలిస్!
న్యూఢిల్లీ: ఒకవేళ ఫిట్నెస్ సహకరిస్తే...2028లో జరిగే లాస్ ఏంజెలిస్ (ఎల్ఏ) ఒలింపిక్స్లోనూ ఆడి కెరీర్కు గుడ్బై చెబుతానని భారత హాకీ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ తెలిపాడు. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మూడేళ్ల క్రితం టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకాన్ని గెలిచిన భారత జట్టుకు మన్ప్రీత్ సింగ్ నాయకత్వం వహించాడు. తాజా పారిస్ ఒలింపిక్స్లో హర్మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ కాంస్య పతకాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయంలోనూ కీలకపాత్ర పోషించిన మన్ప్రీత్ వరుస ఒలింపిక్స్ పతకాల్లో భాగమయ్యాడు. ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడిన మన్ప్రీత్ దిగ్గజాలు ఉధమ్ సింగ్, లెస్లీ క్లాడియస్, ధనరాజ్ పిళ్లై, ఇటీవలే రిటైరైన గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ సరసన నిలిచాడు. భారత హాకీకి శ్రీజేశ్ చేసిన సేవలు అందరికీ తెలుసని అన్నాడు. అతనో గ్రేటెస్ట్ ప్లేయర్ అని కితాబిచ్చాడు. సరిగ్గా ఒలింపిక్స్కు ముందు స్విట్జర్లాండ్లో మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన శిబిరం జట్టుకు బాగా ఉపకరించిందన్నాడు. ఓ ఇంటర్వ్యూలో 32 ఏళ్ల స్టార్ మిడ్ఫీల్డర్ తన భవిష్యత్ లక్ష్యాలతో పాటు వరుస ఒలింపిక్ పతకాలపై తన మనోగతాన్ని వివరించాడు. లక్ష్యం ఎల్ఏ–2028 ‘లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ను లక్ష్యంగా పెట్టుకున్నాను. అయితే ఇది సాధించాలంటే నేను పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉండాలి. నేను ఇలాగే ఫామ్ను కొనసాగిస్తూ... ఫిట్నెస్ను కాపాడుకుంటేనే లక్ష్యం చేరుకోగలను. ఇప్పుడు హాకీలో ఫిట్నెస్ ప్రధాన భూమిక పోషిస్తోంది. మైదానంలో చురుకైన పాత్రకు ఇదే కీలకం. ఆ తర్వాతే మిగతావన్నీ’ అని మన్ప్రీత్ చెప్పాడు. అదృష్టవశాత్తూ ఈ వెటరన్ స్టార్ సుదీర్ఘ కెరీర్లో చెప్పుకోదగ్గస్థాయిలో గాయాల బారిన పడలేదు. 378 అంతర్జాతీయ హాకీ మ్యాచ్లాడిన అతను 44 గోల్స్ చేశాడు. వరుస ఒలింపిక్ పతకాలు ‘ఏ అథ్లెట్ లక్ష్యమైనా ఒలింపిక్ పతకమే! అది ప్రతిఒక్కరి కల. మేం మూడేళ్ల క్రితం టోక్యోలో... ఇప్పుడేమో పారిస్లో ఇలా వరుస ఒలింపిక్స్లో పతకాలు సాధించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల తర్వాతే భారత్... హాకీలో ఇలా వరుస విశ్వక్రీడల్లో పతకాలు గెలిచింది. నేను ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడాను. తొలి రెండు మెగా ఈవెంట్లలో పతకాల్లేవు. కానీ తర్వాత రెండు ఈవెంట్లలో పతకం కల నెరవేరడంతో నా ఆనందానికి హద్దుల్లేవు’ అని హర్షం వ్యక్తం చేశాడు. జట్టు కోసం ఏ పాత్రకైనా... పారిస్లో బ్రిటన్తో జరిగిన కా>్వర్టర్ ఫైనల్ పోరులో అమిత్ రోహిదాస్కు ‘రెడ్ కార్డ్’ పడటంతో జట్టు పది మందితోనే ఆడాల్సి వచి్చంది. అప్పుడు మన్ప్రీత్ డిఫెండర్గా రక్షణపంక్తిలో ఉండి జట్టును ఆదుకున్నాడు. ‘నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను. జట్టు అవసరాల కోసం నా స్థానం మారినా, ఎక్కడ సర్దుబాటు చేసినా సరే! జట్టు ఏం డిమాండ్ చేస్తే అదే పని నేనూ చేస్తాను. ఇందుకోసం నేను శిక్షణ తీసుకున్నా. ప్రొ లీగ్ హాకీ మ్యాచ్ల్లో ఆదే చేశాను. కాబట్టే నా స్థానం మారినా నాకే బెంగ ఉండదు. కష్టమని అనిపించదు. జట్టులో నేను ఎంత కీలకమో... నా బాధ్యతలెంటో నాకు బాగా తెలుసు. మా ప్రణాళికల్ని అమలు చేసేందుకు ఎల్లప్పుడు రెడీగా ఉంటాను’ అని అన్నాడు. మెడలో పతకం... పక్కన భార్యాపిల్లలు! భార్యాపిల్లల సమక్షంలో పతకం గెలుపొందడం చాలా ఆనందాన్నిచి్చందని చెపుకొచ్చాడు. ‘పతకాల ప్రదానోత్సవం ముగిసిన వెంటనే నా భార్య ఇలి నజ్వా సాదిక్ (మలేసియన్), కుమార్తె జాస్మిన్ గ్రౌండ్లోకి రావడం... వారితో నేను సాధించిన పతకం, నా సంతోషం పంచుకోవడం చాలా గొప్ప అనుభూతినిచి్చంది’ అని మన్ప్రీత్ చెప్పాడు. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో తాను సాధించిన కాంస్య పతకాన్ని తల్లి మెడలో వేసిన మన్ప్రీత్ ‘పారిస్’ నుంచి తిరిగి వచి్చన వెంటనే అలాగే చేశాడు. -
భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం.. వీడియో వైరల్
ఒలింపిక్స్ కాంస్య పతకంతో స్వదేశానికి చేరుకున్న భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం లభించింది. శనివారం ప్యారిస్ నుంచి ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన భారత హాకీ జట్టుకు అభిమానులు పుష్ప గుచ్చాలతో ఆపూర్వ స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ విశ్వ క్రీడల్లో భాగంగా గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్పై భారత్ విజయం సాధించింది.అంతకుముందు సెమీఫైనల్లో జెర్మనీ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. కానీ కాంస్య పతక మ్యాచ్లో హర్మన్ ప్రీత్ సేన పంజా విసిరింది. ఇక కాంస్య పతకం విజయంతో భారత స్టార్ గోల్ కీపర్ శ్రీజేష్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు విడ్కోలు పలికాడు. 🇮🇳Indian Men's Hockey Team players arrive at Delhi airport after winning a bronze medal at the #Paris2024 🥉#Hockey #HarmanpreetSingh #Olympics pic.twitter.com/6O7BTlOy4u— InsideSport (@InsideSportIND) August 10, 2024 -
ఈసారీ గెలిచేద్దాం
పారిస్: టోక్యో ఒలింపిక్స్లో తాము సాధించిన కాంస్య పతకాన్ని నిలబెట్టుకోవాలంటే భారత జట్టు ముందుగా క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటాలి. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్లో ఎదురైన ప్రత్యర్థి బ్రిటన్ జట్టుతోనే పారిస్ ఒలింపిక్స్లోనూ భారత్ క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. నేడు జరిగే ఈ నాకౌట్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్ బృందం విజయం సాధిస్తేనే సెమీఫైనల్కు చేరుకొని పతకం రేసులో నిలుస్తుంది. ఓడిపోతే మాత్రం టీమిండియా ఇంటిదారి పడుతుంది. ‘టోక్యో’ క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–1 గోల్స్ తేడాతో బ్రిటన్ జట్టును ఓడించింది. ‘పారిస్’ గేమ్స్లో భారత హాకీ జట్టు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. గ్రూప్ ‘బి’లో ఉన్న భారత జట్టు తొలి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్పై 3–2తో గెలిచింది. రెండో లీగ్ మ్యాచ్లో మాజీ ఒలింపిక్ విజేత అర్జెంటీనాతో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. మూడో లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్పై 2–0తో గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. నాలుగో లీగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ బెల్జియం జట్టు చేతిలో 1–2తో ఓడిన టీమిండియా చివరి లీగ్ మ్యాచ్లో పటిష్ట ఆస్ట్రేలియా జట్టును 3–2తో ఓడించి సంచలనం సృష్టించింది. ఒలింపిక్స్ క్రీడల్లో ఆ్రస్టేలియా జట్టుపై 52 ఏళ్ల తర్వాత భారత జట్టు విజయాన్ని అందుకుంది. లీగ్ దశ మ్యాచ్ల ఫలితాలు, ప్రదర్శన ప్రస్తుతం గతంతో సమానం. నాకౌట్ మ్యాచ్ కావడంతో తప్పనిసరిగా గెలిస్తేనే జట్లు ముందుకు సాగుతాయి. 1988 సియోల్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం నెగ్గిన తర్వాత బ్రిటన్ జట్టు మళ్లీ ఒలింపిక్స్లో పతకం సాధించలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న బ్రిటన్ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా భారత జట్టు ఆద్యంతం నిలకడగా ఆడాల్సి ఉంటుంది. గోల్ చేసేందుకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దక్కిన పెనాల్టీ కార్నర్లను లక్ష్యానికి చేర్చాలి. అందుబాటులో ఉన్న ముఖాముఖి రికార్డు ప్రకారం భారత్, బ్రిటన్ జట్లు ఇప్పటి వరకు 23 సార్లు తలపడ్డాయి. 13 సార్లు బ్రిటన్ నెగ్గగా... 9 సార్లు భారత్ గెలిచింది. ఒక మ్యాచ్ ‘డ్రా’ అయింది. ఒలింపిక్స్లో మాత్రం బ్రిటన్పై భారత్దే పైచేయిగా ఉంది. విశ్వ క్రీడల్లో ఈ రెండు జట్లు తొమ్మిదిసార్లు తలపడగా... ఆరుసార్లు భారత్, మూడుసార్లు బ్రిటన్ గెలుపొందాయి. నేడు జరిగే ఇతర మూడు క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్తో బెల్జియం; నెదర్లాండ్స్తో శ్రీఆ్రస్టేలియా; జర్మనీతో అర్జెంటీనా తలపడతాయి. యాదృచ్చికంగా ‘పారిస్’ గేమ్స్లోనూ 2020 టోక్యో ఒలింపిక్స్లో నాలుగు క్వార్టర్ ఫైనల్స్లో ఎదురెదురుగా తలపడిన జట్లే ఈసారి పోటీపడుతున్నాయి. -
Olympics 2024: బెల్జియం చేతిలో భారత హాకీ జట్టు ఓటమి
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత పురుషుల హాకీ జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. బెల్జియంతో హోరాహోరీగా సాగిన గురువారం నాటి మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్ సేన ఓటమిపాలైంది. దీంతో పూల్-బిలో భారత్ రెండోస్థానానికి పడిపోగా.. తాజా విజయంతో బెల్జియం టాప్లోకి దూసుకువెళ్లింది.కాగా భారత పురుషుల హాకీ జట్టు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, బలాబలాలను పరీక్షించుకునే క్రమంలో గ్రూపు దశలో.. నాలుగో మ్యాచ్లో భాగంగా వరల్డ్ నంబర్ వన్ బెల్జియంతో తలపడింది. నాకౌట్ దశకు ముందు ధీటైన ప్రత్యర్థిని ఎదుర్కొన్న భారత్.. గెలుపొంది ఉంటే ఆత్మవిశ్వాసం ఇనుమడించి ఉండేది.ఉత్కంఠగా సాగిన మ్యాచ్అయినప్పటికీ టోక్యో గోల్డ్ మెడలిస్ట్ బెల్జియంకు భారత్ గట్టిపోటీనిచ్చింది. భారత్ తరఫున అభిషేక్ గోల్(18వ నిమిషంలో)తో మెరవగా.. బెల్జియం ప్లేయర్లలో తిబియూ స్టాక్బ్రోక్స్(33వ నిమిషంలో), జాన్-జాన్ డొమెన్(44వ నిమిషం) చెరో గోల్ సాధించారు. ఫలితంగా 1-2తో భారత జట్టు బెల్జియం చేతిలో ఓటమిపాలైంది. ఇక బెల్జియం కూడా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇదిలా ఉంటే.. తదుపరి మ్యాచ్లో భారత్ ఆఖరిగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.ఐర్లాండ్ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోగత ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి... పూర్వవైభవాన్ని గుర్తు చేసిన భారత పురుషుల హాకీ జట్టు ప్యారిస్లోనూ శుభారంభం అందుకుంది. ఆడిన తొలి మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు, ఒక ‘డ్రా’ నమోదు చేసుకున్న టీమిండియా 7 పాయింట్లతో క్వార్టర్ ఫైనల్కు చేరింది. పూల్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ జట్టు 2–0తో ఐర్లాండ్ను ఓడించింది.ఇక మంగళవారం ఐర్లాండ్తో మ్యాచ్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ (13వ, 19వ నిమిషాల్లో) రెండు గోల్స్తో సత్తా చాటాడు. మ్యాచ్ మొత్తంలో భారత్కు 9 పెనాల్టీ కార్నర్ అవకాశాలు రాగా.. అందులో కేవలం ఒక్క దాన్ని మాత్రమే గోల్గా మలచగలిగింది. మరోవైపు ఐర్లాండ్ 10 పెనాల్టీ కార్నర్ లను వృథా చేసింది. తొలి రెండు క్వార్టర్స్లో ఒక్కో గోల్ చేసిన టీమిండియా... ద్వితీయార్థంలో గోల్ కొట్టలేకపోయింది. మన డిఫెండర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చగా.. గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడలా నిలిచి ప్రత్యర్థి ప్రయత్నాలను భగ్నం చేశాడు. గ్రూప్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన ఐర్లాండ్ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా రెండు గ్రూప్ల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్కు చేరుతాయి.ప్యారిస్ ఒలింపిక్స్-2024 పురుషుల హాకీ పూల్స్పూల్-ఏ: నెదర్లాండ్స్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, సౌతాఫ్రికాపూల్-బి: బెల్జియం, భారత్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్.చదవండి: Paris Olympics 2024: షూటింగ్లో కాంస్య పతకం.. ఎవరీ స్వప్నిల్ కుసాలె..? -
‘ఏడు’ దాటి ఎంత వరకు?
టోక్యో ఒలింపిక్స్లో భారత్ 7 పతకాలు గెలుచుకుంది. భారత హాకీ జట్టుతోపాటు వ్యక్తిగత విభాగంలో పతకాలు నెగ్గిన నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, సింధు, లవ్లీనా పారిస్ ఒలింపిక్స్లో కూడా పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. గత ఒలింపిక్స్లో రజత, కాంస్యాలు నెగ్గిన రెజ్లర్లు రవి దహియా, బజరంగ్ ఈసారి అర్హత సాధించలేదు. మళ్లీ సత్తా చాటేందుకు... ఒలింపిక్ స్వర్ణపతకంతో పాటు ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కూడా అయిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో మళ్లీ పతకం సాధిస్తాడని అభిమానులంతా ఆశలు పెట్టుకున్నారు. టోక్యో తర్వాత ఎక్కడా ఉదాసీనతకు తావు ఇవ్వకుండా ప్రధాన ఈవెంట్లలో నిలకడగా విజయాలు సాధిస్తూ వచ్చి ఎక్కడా వైఫల్యం లేకపోవడం నీరజ్పై అంచనాలు పెంచుతోంది. పీవీ సింధు వరుసగా మూడో ఒలింపిక్ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నేడు జరిగే ప్రారంభ వేడుకల్లో టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్తో కలిసి సింధు పతాకధారిగా పాల్గొంటుంది. టోక్యో రజతం తర్వాత మీరాబాయి చాను వరుస గాయాలతో ఇబ్బంది పడింది. కోలుకున్న తర్వాత కీలక విజయాలతో క్వాలిఫై అయింది. బాక్సింగ్లో వరల్డ్ చాంపియన్గా ఉన్న లవ్లీనా గత ఒలింపిక్స్కంటే మెరుగైన ప్రదర్శన ఇస్తాననే నమ్మకంతో ఉంది. భారత హాకీ జట్టు కూడా మరో పతకాన్ని సాధించగలమనే నమ్మకాన్ని పెంచుతోంది. అన్ని రకాలుగా టీమ్ సన్నద్ధమై ఉంది. తొలి పతకం కోసం... కెరీర్లో ఎన్నో ఘనతలు ఉన్నా ఒలింపిక్ పతకం లేని లోటును తీర్చుకునేందుకు మరికొందరు ప్రయతి్నస్తున్నారు. ఈ జాబితాలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అగ్ర స్థానంలో ఉంది. ఢిల్లీలో నిరసనల తర్వాత మళ్లీ ఆటపై దృష్టి పెట్టి ఆమె అర్హత సాధించిన తీరు అసమానం. ఇటీవల మంచి ఫామ్లో ఉంది. టోక్యోలో కీలక సమయంలో తుపాకీ మొరాయించడంతో పతకం కోల్పోయిన షూటర్ మను భాకర్ నాటి వైఫల్యాన్ని మరచి తనేంటో చూపించాలని పట్టుదలగా ఉంది. వరుసగా నాలుగో ఒలింపిక్స్ ఆడుతున్న ఆర్చర్ దీపికా కుమారి అన్నీ గెలిచినా కీలక సమయాల్లో ఒలింపిక్స్లో ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. ఈ సారైనా దానిని దాటి తొలి పతకాన్ని గెలుచుకుంటుందా చూడాలి. ఇక బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి అద్భుత ఫామ్ వారు కచ్చితంగా పతకం గెలవగలరనే నమ్మకాన్ని పెంచుతోంది. కొత్త ఆశలతో... వరల్డ్ చాంపియన్ అయిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, ప్రపంచ రికార్డు స్కోరు సాధించిన షూటర్ సిఫ్ట్ కౌర్, ప్రపంచ అండర్–23 చాంపియన్ రెజ్లర్ అమన్ తమ తొలి ఒలింపిక్స్లోనే పతకం సాధించాలనే లక్ష్యంతో సిద్ధమయ్యారు. -
కెప్టెన్ గా హర్మన్ప్రీత్ సింగ్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టును ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు కెపె్టన్గా హర్మన్ప్రీత్ సింగ్... వైస్ కెప్టెన్గా హార్దిక్ సింగ్ వ్యవహరిస్తారు. గత టోక్యో ఒలింపిక్స్లో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లతో భారత్ ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లో నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా జట్లున్నాయి. గోల్కీపర్ శ్రీజేశ్, మిడ్ ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ వరుసగా నాలుగో ఒలింపిక్స్ ఆడనున్నారు. భారత హాకీ జట్టు: హర్మన్ప్రీత్ సింగ్ (కెపె్టన్), హార్దిక్ సింగ్ (వైస్ కెపె్టన్), శ్రీజేశ్ (గోల్ కీపర్), జర్మన్ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సుమిత్, సంజయ్, రాజ్కుమార్, షంషేర్ సింగ్, మన్ప్రీత్ సింగ్, వివేక్ ప్రసాద్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, క్రెయిగ్ ఫుల్టన్ (హెడ్ కోచ్). -
భారత హాకీ జట్టుకు ‘హ్యాట్రిక్’ ఓటమి
ఆ్రస్టేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. పెర్త్లో బుధవారం జరిగిన మూడో మ్యాచ్లో టీమిండియా 1–2 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున జుగ్రాజ్ సింగ్ (41వ ని.లో) ఏకైక గోల్ చేయగా... ఆస్ట్రేలియా జట్టుకు జెరెమి హేవార్డ్ (44వ, 49వ ని.లో) రెండు గోల్స్ అందించి గెలిపించాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియా 3–0తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ రేపు జరుగుతుంది. -
భారత హాకీ జట్టు శిక్షణ బృందంలో ప్యాడీ ఆప్టన్
పారిస్ ఒలింపిక్స్ సమయంలో భారత పురుషుల హాకీ జట్టు సభ్యుల మానసిక దృఢత్వం కోసం... దక్షిణాఫ్రికాకు చెందిన విఖ్యాత మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ సేవలు తీసుకోవాలని హాకీ ఇండియా నిర్ణయం తీసుకుంది. 2011లో వన్డే ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత క్రికెట్ జట్టుకు ప్యాడీ ఆప్టన్ మెంటల్ కండీషనింగ్ కోచ్గా ఉన్నారు. ఇటీవల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా క్రీడల సమయంలోనూ ఆప్టన్ భారత హాకీ జట్టు వెంబడి ఉన్నారు. -
భారత్కు మరో విజయం
రాంచీ: భారత అమ్మాయిల హాకీ జట్టు ఎదురులేని ప్రదర్శనతో దూసుకెళుతోంది. ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ 5–0తో మలేసియాపై ఘనవిజయం సాధించింది. వందన కటారియా (7, 21వ నిమిషాల్లో) చక్కని ఆటతీరుతో రెండు గోల్స్ చేసింది. సంగీత కుమారి (28వ ని.), లాల్రెమ్సియామి (28వ ని.) క్షణాల వ్యవధిలోనే చెరో గోల్ సాధించిపెట్టారు. మూడో క్వార్టర్లో జ్యోతి (38వ ని.) కూడా గోల్ చేయడంతో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. తొలి లీగ్లో భారత్ 7–1తో థాయ్లాండ్పై నెగ్గింది. -
Asian Games: జపాన్ను చిత్తు చేసి.. పసిడి గెలిచి! ఒలంపిక్స్ బెర్తు ఖరారు
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. చైనాలోని హోంగ్జూలో శుక్రవారం నాటి ఫైనల్లో జపాన్ను చిత్తు చేసింది. 5-1తో ప్రత్యర్థిని మట్టికరిపించి స్వర్ణ పతకం సాధించింది. అద్భుత విజయంతో ప్యారిస్ ఒలంపిక్స్-2024 టోర్నీ బెర్తును ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజా పతకంతో 19వ ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణాల సంఖ్య 22కు చేరింది. సెంచరీ దిశగా భారత్ అదే విధంగా.. ఇప్పటి వరకు 34 వెండి, 39 కాంస్య పతకాలను మన క్రీడాకారులు దేశానికి అందించారు. ఇప్పటి వరకు మొత్తంగా 95 మెడల్స్ సాధించిన భారత్ సెంచరీ దిశగా దూసుకుపోతోంది. ఆర్చరీలో ఇంకో మూడు, కబడ్డీలో రెండు, క్రికెట్లో ఒక పతకం ఖాయం కావడంతో రికార్డు స్థాయిలో కనీసం 101 మెడల్స్ సాధించనుంది. అక్టోబరు 6(శుక్రవారం) నాటి పతకాలు ►మెన్స్ హాకీ: స్వర్ణం ►మెన్స్ బ్రిడ్జ్ టీమ్: రజతం ►మెన్స్ 57 కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్: అమన్ సెహ్రావత్- కాంస్యం ►వుమెన్ 76కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్: కిరణ్ బిష్ణోయి- కాంస్యం ►వుమెన్ 62కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్: సోనం మాలిక్- కాంస్యం ►సెపాక్టక్రా వుమెన్స్ టీమ్: కాంస్యం ►బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్: హెస్ ప్రణయ్కు కాంస్యం ►ఆర్చరీ రికర్వ్ మెన్స్ టీమ్: అతాను, ధీరజ్, తుషార్- రజతం ఖాయమైనవి ►ఫైనల్కు చేరిన కబడ్డీ పురుషుల జట్టు- స్వర్ణం దిశగా అడుగులు ►ఫైనల్కు చేరిన భారత పురుషుల క్రికెట్ జట్టు- స్వర్ణంపై ధీమా తొలిసారి పతకం మహిళల సెపక్తక్రాలో తొలిసారి భారత్కు పతకం ఆసియా క్రీడల సెపక్తక్రా ఈవెంట్లో భారత మహిళల జట్టు తొలిసారి పతకంతో తిరిగి వస్తోంది. మహిళల రెగూ టీమ్ ఈవెంట్లో ఐక్పమ్ మైపాక్ దేవి, ఒయినమ్ చవోబా దేవి, ఖుష్బూ, ఎలాంగ్బమ్ ప్రియాదేవి, ఇలాంగ్బమ్ లెరెంతోంబి దేవిలతో కూడిన భారత జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. థాయ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 10–21, 13–21తో ఓడిపోయింది. బ్రిడ్జ్లో రజతంతో సరి... గత ఆసియా క్రీడల్లో బ్రిడ్జ్ క్రీడాంశంలో ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలు గెలిచిన భారత బృందం ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. హాంగ్జౌలో శుక్రవారం జరిగిన పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 152–238.1 పాయింట్ల తేడాతో హాంకాంగ్ చేతిలో ఓడిపోయింది. సందీప్ ఠక్రాల్, జగ్గీ శివ్దసాని, రాజు తొలాని, అజయ్ ప్రభాకర్ రజత పతకం గెలిచిన భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. రికర్వ్లో తొలిసారి రజతం ఆసియా క్రీడల ఆర్చరీ రికర్వ్ విభాగంలో భారత్ 13 ఏళ్ల పతక నిరీక్షణకు హాంగ్జౌలో తెర పడింది. చివరిసారి 2010 గ్వాంగ్జౌ ఏషియాడ్లో రికర్వ్ ఈవెంట్ టీమ్ ఈవెంట్లో భారత్కు కాంస్య పతకాలు లభించాయి. ఆ తర్వాతి రెండు ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో భారత్కు నిరాశే ఎదురైంది. తాజా ఏషియాడ్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్, తుషార్లతో కూడిన జట్టు రికర్వ్ టీమ్ విభాగంలో భారత్కు తొలిసారి రజత పతకం అందించింది. ఫైనల్లో భారత్ 1–5తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్లో 5–4తో మంగోలియాపై, సెమీఫైనల్లో 5–3తో బంగ్లాదేశ్పై గెలిచి ఫైనల్ చేరింది. మరోవైపు సిమ్రన్జిత్ కౌర్, అంకిత, భజన్ కౌర్లతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు కాంస్యం గెలిచింది. కాంస్య పతక మ్యాచ్లో భారత్ 6–2తో వియత్నాంపై నెగ్గింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో భారత్ 6–2తో జపాన్పై గెలిచి, సెమీఫైనల్లో 2–6తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. నేడు కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం కోసం జ్యోతి సురేఖ, కాంస్యం కోసం అదితి... పురుషుల వ్యక్తిగత విభాగంలో అభిషేక్, ఓజస్ ప్రవీణ్ స్వర్ణ, రజత పతకాల కోసం పోటీపడతారు. Indian athletes are on 🔥 Team India beat Japan 5-1 in Asian Games 2022 and won the medal🥇#Asiangames23 #Hockey#PAKvNED #PAKvsNED pic.twitter.com/0kNk3q8EiJ — Saurabh Singh (@100rabhsingh781) October 6, 2023 -
హాకీ ఫైవ్స్ విజేత భారత్
సలాలా (ఒమన్): ఆసియా కప్ హాకీ ఫైవ్స్ టోర్నమెంట్లో భారత పురుషుల హాకీ జట్టు విజేతగా నిలిచింది. ఐదుగురు సభ్యులు ఆడే ఈ టోర్నీని ఈ ఏడాదే ప్రారంభించగా... శనివారం జరిగిన ఫైనల్లో భారత్ ‘షూటౌట్’లో 2–0తో పాకిస్తాన్పై గెలిచింది. చాంపియన్గా నిలిచిన భారత్ వచ్చే ఏడాది జరిగే హాకీ ఫైవ్స్ ప్రపంచకప్కు అర్హత సంపాదించింది. తుదిపోరులో నిర్ణీత సమయంలో రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. భారత జట్టులో మొహమ్మద్ రహీల్ (19వ, 26వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (7వ ని.లో), మణిందర్ సింగ్ (10వ ని.లో) గోల్స్ చేశారు. పాక్ తరఫున రెహా్మన్ (5వ ని.లో), అబ్దుల్ (13వ ని.లో), హయత్ (14వ ని.లో), అర్షద్ (19వ ని.లో) గోల్ చేశారు. విజేతగా నిలిచిన భారత జట్టులోని సభ్యులకు రూ. 2 లక్షలు చొప్పున, శిక్షణ సహాయక సిబ్బందికి రూ. ఒక లక్ష చొప్పున హాకీ ఇండియా నగదు పురస్కారం ప్రకటించింది. -
మూడో ర్యాంక్లో భారత హాకీ జట్టు
న్యూఢిల్లీ: స్వదేశంలో తొలిసారి జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టు ర్యాంక్ కూడా మెరుగైంది. ఆదివారం విడుదల చేసిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) తాజా ర్యాంకింగ్స్లో భారత జట్టు ఒక స్థానం పురోగతి సాధించి నాలుగు నుంచి మూడో ర్యాంక్కు ఎగబాకింది. హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఖాతాలో 2771.35 పాయింట్లు ఉన్నాయి. 2021 తర్వాత భారత జట్టు మరోసారి మూడో ర్యాంక్లో నిలిచింది. 2021లో టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తర్వాత భారత జట్టు మూడో ర్యాంక్కు చేరింది. నెదర్లాండ్స్ జట్టు 3095.90 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా, 2917.87 పాయింట్లతో బెల్జియం రెండో ర్యాంక్ను నిలబెట్టుకుంది. ఇంగ్లండ్ మూడు నుంచి నాలుగో స్థానానికి చేరగా... జర్మనీ, ఆ్రస్టేలియా వరుసగా ఐదు, ఆరో ర్యాంక్ల్లో ఉన్నాయి. తొలిసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్గా నిలిచిన మలేసియా జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. హాకీ ఇండియా నజరానా ఆసియా చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 3 లక్షల చొప్పున... శిక్షణ బృందంలోని ప్రతి సభ్యుడికి రూ. లక్షా 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేస్తారు. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
చెన్నై: ఫైనల్ బెర్తే లక్ష్యంగా భారత హాకీ జట్టు సన్నద్ధమైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో శుక్రవారం జరిగే సెమీఫైనల్లో హర్మన్ప్రీత్ బృందం జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ టోరీ్నలో ఇప్పటివరకు ఓటమెరుగని భారత జట్టే ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో అందరిపై అధిపత్యం కనబరిచింది... గెలిచింది. కానీ ఇలాంటి అజేయమైన భారత్ను నిలువరించింది మాత్రం జపానే! లీగ్ దశలో ఇరుజట్ల పోరు 1–1తో డ్రాగా ముగిసింది. ఇప్పుడు నాకౌట్ దశలో జరిగే ఈ పోరులో ఎవరు గెలిస్తే వాళ్లే టైటిల్ ఫేవరెట్ కావడం ఖాయం. గతంలో జపాన్ చేతిలో భారత్కు చేదు అనుభవం ఉంది. 2021లో బంగ్లాదేశ్లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో టీమిండియా 6–0తో జపాన్ను చిత్తు చేసినప్పటికీ తీరా సెమీస్కు వచ్చేసరికి వారి చేతిలో 3–5తో ఓడి ఇంటికొచ్చింది. ఇప్పుడు సమష్టి ఆటతీరుతో బదులు తీర్చుకుంటుందా లేదంటే స్వదేశంలోనూ గత అనుభవాన్నే చవిచూస్తుందా అనేది ఇంకొన్ని గంటల్లో తేలుతుంది. చివరి లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ను 4–0తో చిత్తు చేసి జోరుమీదున్న భారత్ పట్టుదలగా ఆడితే విజయం ఏమంత కష్టం కానేకాదు. మరో సెమీఫైనల్లో మలేసియాతో దక్షిణ కొరియా తలపడుతుంది. 5–6 స్థానాల కోసం పాకిస్తాన్, చైనా జట్లు తలపడతాయి. -
Ind Vs Pak: పాకిస్తాన్ను చిత్తుగా ఓడించిన భారత్
చెన్నై: గత ఏడేళ్లుగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు చేతిలో ఓటమి ఎరుగని భారత హాకీ జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం పాకిస్తాన్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 4–0 గోల్స్తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ (15వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జుగ్రాజ్ (36వ ని.లో), ఆకాశ్దీప్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు రాగా ఇందులో మూడింటిని గోల్స్గా మలి చింది. ఇతర లీగ్ మ్యాచ్ల్లో జపాన్ 2–1తో చైనాపై, మలేసియా 1–0తో కొరియాపై నెగ్గాయి. పాక్పై విజయంతో ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక భారత్ 13 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచింది. 12 పాయింట్లతో మలేసియా రెండో స్థానంలో, 5 పాయింట్లతో దక్షిణ కొరియా, జపాన్, పాకిస్తాన్ సంయుక్తంగా మూడో స్థానంలో, ఒక పాయింట్తో చైనా చివరి స్థానంలో నిలిచాయి. కొరియా, జపాన్, పాక్ ఐదు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరంతో కొరియా, జపాన్ జట్లకు సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. దాంతో మాజీ చాంపియన్ పాకిస్తాన్ సెమీఫైనల్ చేరలేకపోయింది. శుక్రవారం 5–6 స్థానాల కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్లో చైనాతో పాకిస్తాన్...సెమీఫైనల్స్ లో కొరియాతో మలేసియా; జపాన్తో భారత్ ఆడతాయి. -
మన హాకీ... మళ్లీ మొదటికి!
కొన్నేళ్ల క్రితం వరకు భారత హాకీ జట్టుకు కొత్త విదేశీ కోచ్ రావడం... కొన్నాళ్లు ఆ పదవిలో కొనసాగడం... అభిప్రాయభేదాలు రావడం... ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడం తరచూ జరిగేది. కానీ నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహమ్ రీడ్ మాత్రం సుదీర్ఘంగానే ఈ పదవిలో కొనసాగారు. ఆయన ఆధ్వర్యంలో భారత్ చెప్పుకోదగ్గ విజయాలే అందుకుంది. కానీ తాజాగా స్వదేశంలో జరిగిన ప్రపంచకప్లో భారత జట్టు వైఫల్యం నేపథ్యంలో ఆయన చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా హాకీ ఇండియా (హెచ్ఐ) కొత్త కోచ్ను వెదికే పనిలో పడింది. ఈ ఏడాది ఆసియా క్రీడలు... వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ ఉండటంతో హాకీ ఇండియా మళ్లీ విదేశీ కోచ్ వైపు మొగ్గు చూపుతుందా లేక స్వదేశీ కోచ్కు ప్రాధాన్యత ఇస్తుందా వేచి చూడాలి. న్యూఢిల్లీ: నాలుగేళ్లుగా నిలకడగా కొనసాగుతున్న భారత పురుషుల హాకీ జట్టు శిక్షణ బృందంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. స్వదేశంలో అట్టహాసంగా జరిగిన ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత హాకీ జట్టు కనీసం క్వార్టర్ ఫైనల్ చేరకపోవడం... చివరకు తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవడంతో హాకీ ఇండియా (హెచ్ఐ) దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదే పారిస్ ఒలింపిక్స్ ఉండటం... ఈ సంవత్సరం ఆసియా క్రీడల టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు నేరుగా పారిస్ ఒలింపిక్ బెర్త్ దక్కనున్న నేపథ్యంలో హెచ్ఐ ప్రస్తుతం ఉన్న శిక్షణ బృందాన్ని మార్చాలని నిశ్చయించింది.v హెచ్ఐ భవిష్యత్ ప్రణాళికల్లో తన పేరు ఉండే అవకాశం లేదని గ్రహించిన ప్రస్తుత చీఫ్ కోచ్ గ్రాహమ్ రీడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు ఎనలిటికల్ కోచ్ గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైజర్ మిచెల్ డేవిడ్ పెంబర్టన్ కూడా తమ రాజీనామా లేఖలను హెచ్ఐ అధ్యక్షుడు దిలీప్ టిర్కీకి సమర్పించారు. ఆస్ట్రేలియాకు చెందిన 58 ఏళ్ల రీడ్ 2019 ఏప్రిల్లో భారత జట్టుకు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టారు. ఒప్పందం ప్రకారం ఆయన 2024 జూలై–ఆగస్టులో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల వరకు పదవిలో ఉండాలి. అయితే స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు కనీసం క్వార్టర్ ఫైనల్ కూడా చేరకపోవడం... స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోవడం... పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంలో వైఫల్యం...ఆటగాళ్ల మధ్య సమన్వయలేమి... వెరసి రీడ్ రాజీనామాకు దారి తీశాయి. భారత్ 1975 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన తర్వాత మరోసారి ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. ఒలింపిక్ పతకం వచ్చినా... రీడ్ నాలుగేళ్ల శిక్షణ కాలంలో భారత హాకీ జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. భారత జట్టు 41 ఏళ్ల ఒలింపిక్ పతక నిరీక్షణకు తెరదించడంలో రీడ్ సఫలమయ్యారు. ఆయన శిక్షణలోనే భారత్ 2021 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించింది. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో రజతం గెలిచింది. 2021–2022 ప్రొ లీగ్ సీజన్లో మూడో స్థానం సంపాదించింది. 2019లో చీఫ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన ఏడాదే భువనేశ్వర్లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత్ గెలిచి టోక్యో ఒలింపిక్స్కు అర్హత పొందింది. ‘చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకొని ఆ బాధ్యతలు వేరేవారికి అప్పగించే సమయం వచ్చింది. భారత జట్టుతో, హాకీ ఇండియాతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉంది. ఈ నాలుగేళ్ల కాలంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. భవిష్యత్లో భారత జట్టుకు మంచి విజయాలు లభించాలని కోరుకుంటున్నాను’ అని రీడ్ వ్యాఖ్యానించారు. రీడ్, గ్రెగ్ క్లార్క్, మిచెల్ డేవిడ్ రాజీనామాలను ఆమోదించినట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ తెలిపారు. గతంలోనూ... భారత హాకీ జట్టుకు తొలి విదేశీ కోచ్గా వ్యవహరించిన ఘనత జర్మనీకి చెందిన గెరార్డ్ రాచ్కు దక్కుతుంది. ఆయన 2004 జూలైలో టీమిండియాకు తొలి విదేశీ కోచ్ అయ్యారు. 2007 ఫిబ్రవరిలో ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. 2009 మేలో స్పెయిన్కు చెందిన జోస్ బ్రాసా కోచ్గా వచ్చి 2010 నవంబర్ వరకు ఆ పదవిలో కొనసాగారు. 2011 జూన్లో ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ నాబ్స్ ఐదేళ్ల కాలానికి భారత జట్టుకు కోచ్గా వచ్చారు. కానీ ఆయన రెండేళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగి 2013 జూన్లో వెళ్లిపోయారు. అనంతరం ఆస్ట్రేలియాకే చెందిన టెర్రీ వాల్‡్ష 2013 అక్టోబర్ నుంచి 2014 అక్టోబర్ వరకు... నెదర్లాండ్స్కు చెందిన పాల్ వాన్ యాస్ 2015 జనవరి నుంచి జూన్ వరకు... నెదర్లాండ్స్కు చెందిన రోలంట్ ఆల్ట్మన్స్ 2015 జూన్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు... నెదర్లాండ్స్కే చెందిన జోయెర్డ్ మరీన్ 2017 సెప్టెంబర్ నుంచి 2018 మే వరకు భారత జట్టుకు కోచ్లుగా వ్యవహరించారు. -
Hockey World Cup 2023: హతవిధి!.. ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్లో భారత్ బోల్తా
మన హాకీ ఘనం... కానీ ఇది గతం! మరిప్పుడు... సొంతగడ్డపై ఆడుతున్నా... వేలాదిమంది ప్రేక్షకులు మైదానంలోకి వచ్చి మద్దతిస్తున్నా... భారత జట్టు పేలవమైన ప్రదర్శనతో మళ్లీ నిరాశపరిచింది. 2018 ప్రపంచకప్ హాకీలో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరిన టీమిండియా... ఈసారి ‘క్రాస్ ఓవర్’తోనే సరిపెట్టుకుంది. క్వార్టర్ ఫైనల్లో బెర్త్ కోసం న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్లో భారత్ అన్ని రంగాల్లో విఫలమై ఓడిపోయింది. దాంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత పతక నిరీక్షణ మరో నాలుగేళ్లు కొనసాగనుంది. 1975 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత్ ఆ తర్వాత ఏనాడూ సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత పతకం కథ కంచికి చేరింది. కళింగ స్టేడియంలో ఆదివారం జరిగిన ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్లో భారత్ ‘షూటౌట్’లో 4–5తో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో పతకం బరిలో లేని భారత్ ఇప్పుడు 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్లు ఆడనుంది. ఈనెల 26న జపాన్తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే 9 నుంచి 12 స్థానాల కోసం 28న రెండో మ్యాచ్ ఆడుతుంది. జపాన్ చేతిలో భారత్ ఓడిపోతే 13 నుంచి 16 స్థానాల కోసం ఆడుతుంది. న్యూజిలాండ్తో కీలకమైన సమయంలో రక్షణ శ్రేణి నిర్లక్ష్యం భారత జట్టు కొంపముంచింది. మూడో క్వార్టర్ వరకు 3–2తో ఆధిక్యంలో ఉన్న భారత్ నాలుగో క్వార్టర్లో పెనాల్టీ కార్నర్ అవకాశాలు ఎన్నో వచ్చినా... ఒక గోల్ చేయకపోగా... ప్రత్యర్థి గోల్నూ అడ్డుకోలేకపోయింది. దీంతో నిర్ణీత సమయం (నాలుగు క్వార్టర్లు) ముగిసే సమయానికి 3–3తో మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. టీమిండియా జట్టులో లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ (17వ ని.లో), సుఖ్జీత్ సింగ్ (25వ ని.లో), వరుణ్ కుమార్ (41వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. న్యూజిలాండ్ తరఫున సామ్ లేన్ (29వ ని.లో), కేన్ రసెల్ (44వ ని.లో), సీన్ ఫిండ్లే (50వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మ్యాచ్ మొత్తంలో భారత్కు 10 పెనాల్టీ కార్నర్లు రాగా రెండింటిని సద్వి నియోగం చేసుకొని మిగితా ఎనిమిదింటిని వృథా చేసుకుంది. న్యూజిలాండ్ జట్టుకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలిచింది. ఆట 54వ నిమిషంలో న్యూజిలాండ్ ప్లేయర్ నిక్ రాస్కు ఎల్లో కార్డు లభించడంతో ఆ జట్టు చివరి ఆరు నిమిషాలు పది మంది ఆటగాళ్లతోనే ఆడింది. ఈ అవకాశాన్నీ భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. హోరాహోరీ షూటౌట్... నిర్ణీత సమయంలో రెండు జట్లు సమంగా నిలువడంతో ఫలితం తేలడానికి ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో తొలి ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో ‘సడెన్ డెత్’ అనివార్యమైంది. ‘సడెన్ డెత్’ నిబంధనల ప్రకారం ఒక జట్టు ప్లేయర్ గోల్ చేసి.. ఆ వెంటనే మరో జట్టు ప్లేయర్ విఫలమైనా... ఒక జట్టు ప్లేయర్ విఫలమై... ఆ వెంటనే మరో జట్టు ప్లేయర్ సఫలమైనా మ్యాచ్ ముగుస్తుంది. ‘సడెన్ డెత్’ తొలి షాట్లో న్యూజిలాండ్ ప్లేయర్ నిక్ వుడ్స్ విఫలమయ్యాడు. ఫలితంగా తదుపరి షాట్లో గోల్ చేస్తే భారత్కు విజయం దక్కేది. కానీ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ తడబడ్డాడు. రెండో షాట్లో రెండు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యారు. మూడో షాట్లో కివీస్ ప్లేయర్ హేడెన్ ఫిలిప్స్ విఫలం కావడంతో గెలిచేందుకు భారత్కు రెండో అవకాశం దక్కింది. అయితే మూడో షాట్లో భారత ప్లేయర్ సుఖ్జీత్ విఫలమయ్యాడు. నాలుగో షాట్లో కివీస్ ఆటగాడు సామ్ లేన్ గోల్ చేయగా... భారత ప్లేయర్ షంషేర్ సింగ్ గోల్ చేయకపోవడంతో న్యూజిలాండ్ విజయం ఖరారైంది. అంతకుముందు మరో ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్లో స్పెయిన్ ‘షూటౌట్’లో 4–3తో మలేసియాను ఓడించింది. ఈనెల 24న జరిగే క్వార్టర్ ఫైనల్స్లో ఆస్ట్రేలియాతో స్పెయిన్; బెల్జియంతో న్యూజిలాండ్ ఆడతాయి. -
టీమిండియాకు పరాభవం.. వరల్డ్కప్ నుంచి నిష్క్రమణ
పురుషుల హాకీ వరల్డ్కప్-2023 బరిలో నుంచి టీమిండియా నిష్క్రమించింది. న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 22) జరిగిన హోరాహోరీ క్రాస్ ఓవర్ సమరంలో భారత్ పెనాల్టీ షూటౌట్లో 4-5 (3-3) తేడాతో ఓటమిపాలై క్వార్టర్స్ చేరకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. క్వార్టర్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఓటమిని కొని తెచ్చుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 3-3 గోల్స్ తేడాతో సమానంగా నిలువగా.. పెనాల్టీ షూటౌట్లో ఆఖరి ఛాన్స్ను షంషేర్ మిస్ చేయడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. న్యూజిలాండ్.. జనవరి 24న జరిగే క్వార్టర్ ఫైనల్లో బెల్జియంతో తలపడనుంది. కాగా, పూల్-డిలో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ (3 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ డ్రా) నేరుగా క్వార్టర్స్కు చేరుకోగా.. రెండో స్థానంలో నిలిచిన భారత్ (3 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ డ్రా).. పూల్-సిలో మూడో ప్లేస్ ఉన్న న్యూజిలాండ్తో క్రాస్ ఓవర్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన మరో క్రాస్ ఓవర్ మ్యాచ్లో స్పెయిన్ జట్టు మలేషియాను 2(4)-2(3) గోల్స్ తేడాతో ఓడించి, ఈ నెల 24న జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు అర్హత సాధించింది. రేపు జరుగబోయే మరో రెండు క్రాస్ ఓవర్ మ్యాచ్ల్లో (జర్మనీ వర్సెస్ ఫ్రాన్స్, అర్జెంటీనా వర్సెస్ దక్షిణ కొరియా) విజేతలు ఈ నెల 25న జరిగే రెండు, మూడు క్వార్టర్ ఫైనల్లలో ఇంగ్లండ్, నెదర్లాండ్స్ జట్లతో తలపడతాయి. -
WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి
FIH Men’s Hockey World Cup- భువనేశ్వర్: ప్రపంచ కప్ హకీ టోర్నీలో నెదర్లాండ్స్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్టును అత్యధిక గోల్స్ తేడాతో ఓడించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఒడిశా వేదికగా గురవారం నాటి పూల్ సి మ్యాచ్లో భాగంగా చిలీని 14-0తో చిత్తు చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. తద్వారా ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును డచ్ జట్టు బద్దలు కొట్టింది. 2010 వరల్డ్కప్ ఎడిషన్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 12-0తో ఓడించింది. కాగా భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో.. నెదర్లాండ్స్ ఆటగాళ్లు హ్యాట్రిక్ వీరడు జిప్ జాన్సెస్, డెర్క్ డి విల్డర్, తిజ్స్ వాన్ డ్యామ్, కెప్టెన్ తెర్రీ బ్రింక్మన్, టెరెన్స్ పీటర్స్, కొయెన్ బీజెన్, జస్టెన్ బ్లాక్, ట్యూన్ బీన్స్ గోల్స్ సాధించారు. ఇక చిలీపై విజయంతో ఈ ఎడిషన్లో క్వార్టర్స్ చేరిన తొలి జట్టుగా నెదర్లాండ్స్ నిలిచింది. The Netherlands are the first team to be qualified for the quarterfinals of the FIH Odisha Hockey Men's World Cup 2023 in Bhubaneswar-Rourkela. Here are some moments from the game. 🇳🇱NED 14-0 CHI🇨🇱 pic.twitter.com/WISn5Vnhqh — Hockey India (@TheHockeyIndia) January 19, 2023 క్రాస్ ఓవర్’కు భారత్.. ఇక ప్రపంచ కప్ హాకీ టోర్నీలో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరుకునే లక్ష్యంతో గురువారం వేల్స్తో మ్యాచ్లో బరిలోకి దిగిన భారత్... కనీసం 8 గోల్స్ తేడాతో గెలిస్తే ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్ అవసరం లేకుండా నేరుగా క్వార్టర్స్లో అడుగుపెట్టే అవకాశం. కానీ భారత జట్టు అంతటి అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. బలహీన జట్టే అయినా వేల్స్ బాగా పోటీ ఇచ్చింది. భారత హాకీ జట్టు PC: Hockeyindia Twitter చివరకు 4–2తో గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. భారత్ తరఫున షంషేర్ సింగ్ (21వ నిమిషం), ఆకాశ్దీప్ సింగ్ (32వ నిమిషం, 45వ నిమిషం), హర్మన్ప్రీత్ సింగ్ (59వ నిమిషం) గోల్స్ సాధించగా...వేల్స్ ఆటగాళ్లలో ఫర్లాంగ్ గ్యారెత్ (42వ నిమిషం), డ్రేపర్ జాకబ్ (44వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు. గ్రూప్ ‘డి’లో ఇంగ్లండ్తో సమానంగా 7 పాయింట్లతో నిలిచినా...ఆడిన 2 మ్యాచ్లలో కలిపి మెరుగైన గోల్స్ ప్రదర్శన ఆధారంగా (ఇంగ్లండ్ 9, భారత్ 6) మన జట్టు రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే.. నిజానికి బలమైన ప్రత్యర్థి కాకపోయినా వేల్స్ ఒక దశలో భారత్ను బెంబేలెత్తించింది. మన టీమ్ కూడా అంది వచ్చిన అవకాశాలను గోల్స్గా మలచడంలో విఫలమైంది. 7 పెనాల్టీ కార్నర్లతో పాటు ఆరు సార్లు గోల్ చేసే అవకాశం వచ్చినా మనవాళ్లు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. తొలి క్వార్టర్లో గోల్స్ నమోదు కాకపోగా, రెండో క్వార్టర్లో ఒక గోల్తో భారత్ ముందంజ వేసింది. మూడో క్వార్టర్లో రెండు నిమిషాల వ్యవధిలో పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచి వేల్స్ స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్ తొలి నిమిషంలోనే భారత్కు పెనాల్టీ లభించగా, కెప్టెన్ హర్మన్ప్రీత్ దానిని ఉపయోగించుకోలేకపోయాడు. అనంతరం హర్మన్ప్రీత్ డ్రాగ్ ఫ్లిక్ డిఫెండర్ స్టిక్కు తగిలి రీబౌండ్ అయి రాగా, ఈ సారి షంషేర్ దానిని గోల్ పోస్ట్లోకి పంపించగలిగాడు. మేం సంతృప్తిగా లేము అమిత్ రోహిదాస్ కూడా సరైన సమయంలో స్పందించడంలో విఫలమయ్యాడు. మూడో క్వార్టర్ 11వ నిమిషంలో లభించిన పెనాల్టీని అత ను కూడా విఫలం చేశాడు. చివర్లో కాస్త దూకుడు పెంచిన భారత్ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఊపిరి పీల్చుకుంది. ‘ఈ విజయంతో మేం సంతృప్తిగా లేము. ఇది మా అత్యుత్తమ ప్రదర్శన కాదు. మరింత బాగా ఆడాల్సింది’ అని మ్యాచ్ అనంతరం కెప్టెన్ హర్మన్ప్రీత్ వ్యాఖ్యానించాడు. ఇక ఆదివారం జరిగే ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడే భారత్ ఆ మ్యాచ్లో గెలిస్తే క్వార్టర్స్ చేరుకుంటుంది. ఇతర మ్యాచ్లలో మలేసియా 3–2తో న్యూజిలాండ్పై, ఇంగ్లండ్ 4–0తో స్పెయిన్పై విజయం సాధించాయి. చదవండి: Michael Bracewell: కుటుంబంలో అంతా క్రికెటర్లే! లేట్ అయినా సంచలనాలు సృష్టిస్తూ! కానీ ‘ఈరోజు’ నీది కాదంతే! సెలక్టర్లకు తలనొప్పి! పాపం గిల్! కిషన్తో రోజూ గొడవే.. అందుకే తనని బాగా తిడతా.. అయినా కూడా.. It’s time to celebrate the victory. 🤩🕺🏻#IndiaKaGame #HockeyIndia #HWC2023 #StarsBecomeLegends #HockeyWorldCup #INDvsWAL @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/c1ZqtXbR0Q — Hockey India (@TheHockeyIndia) January 19, 2023 -
ఫైనల్లో ఓటమి.. భారత హాకీ జట్టుకు రజతం
కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత పురుషుల హాకీ జట్టు రజత పతకం సాధించింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో 0-7 తేడాతో భారత్ ఓటమిపాలైంది. తద్వారా భారత్ సిల్వర్ మెడల్ సాధించింది. తొలి క్వార్టర్ నుంచే భారత్పై ఆస్ట్రేలియా అధిపత్యం చెలాయించింది. ఏ దశలోను ఆస్ట్రేలియాకు భారత్ పోటీ ఇవ్వలేకపోయింది. నాలుగు క్వార్టర్స్లో ఆస్ట్రేలియా 7 గోల్స్ సాధించగా.. భారత్ కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. ఆస్ట్రేలియా తరపున టామ్ విక్హామ్, బ్లేక్ గోవర్స్, ఫిన్ ఒగిల్వీ, నాథన్ ఎఫ్రామ్స్, నాథన్ ఎఫ్రామ్స్ గోల్స్ సాధించారు. దీంతో ఆస్ట్రేలియా బంగారు పతకం తమ ఖాతాలో వేసుకుంది. కాగా కామన్వెల్త్ గేమ్స్ హాకీలో ఇది ఆస్ట్రేలియాకు ఏడో పతకం కావడం గమనార్హం. ఇక కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత మ్యాచ్లు ముగిశాయి. కామన్వెల్త్ గేమ్స్-2022 పతకాల పట్టికలో 61 మెడల్స్తో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. వాటిలో 22 గోల్డ్ మెడల్స్,16 రజత, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: CWG 2022:: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి -
టీమిండియాను వదలని మహమ్మారి.. తాజాగా మరొకరికి పాజిటివ్
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందాన్ని కరోనా మహమ్మారి వీడటం లేదు. ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు ప్లేయర్లు (సబ్బినేని మేఘన, పూజా వస్త్రాకర్) మహమ్మారి బారిన పడగా.. తాజాగా మహిళా హాకీ జట్టు మిడ్ ఫీల్డర్ నవ్జోత్ కౌర్కు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నవ్జోత్కు ఇవాళ (జులై 30) ఉదయం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఐసోలేషన్కు తరలించారు. ఆమెకు మరో రెండు రోజుల్లో మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని భారత బృందానికి సంబంధించిన అధికారి తెలిపారు. ఒకవేళ అప్పటికీ ఆమెకు నెగిటివ్ రిపోర్ట్ రాకపోతే కామన్వెల్త్ విలేజ్ నుంచి స్వదేశానికి పయనం కావాల్సి ఉంటుందని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా, కామన్వెల్త్ క్రీడా గ్రామంలో రోజు పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగుచూడటం పరిపాటిగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఓ చోట కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ క్రీడల్లో భాగంగా ఘనాతో జరిగిన మొదటి మ్యాచ్లో భారత మహిళా హాకీ జట్టు 5-0 తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: CWG 2022: భారత్ ఖాతాలో మరో పతకం.. గురురాజ పూజారి కాంస్యం -
జర్మనీ జట్టులో కోవిడ్ కలకలం.. భారత్తో జరగాల్సిన మ్యాచ్లు వాయిదా
భువనేశ్వర్: పురుషుల ప్రో హాకీ లీగ్ 2022లో భాగంగా భారత్, జర్మనీ జట్ల మధ్య ఈ వారాంతం జరగాల్సిన డబుల్ హెడర్ మ్యాచ్లు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. విజిటర్స్ క్యాంప్లో కరోనా కేసులు నమోదు కావడంతో మ్యాచ్లను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) గవర్నింగ్ బాడీ మంగళవారం వెల్లడించింది. భువనేశ్వర్ వేదికగా ఈ మ్యాచ్లు మార్చి 12, 13 తేదీల్లో జరగాల్సి ఉండింది. వాయిదాపడ్డ మ్యాచ్లను నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎఫ్ఐహెచ్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ప్రో హాకీ లీగ్ 2022లో భారత పురుషుల జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ రెండు మ్యాచ్ల్లో టీమిండియానే విజయం సాధించింది. మరోవైపు ఇదే టోర్నీలో భారత మహిళల జట్టు ఈ వారాంతంలోనే జర్మనీతో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందు కోసం ఇరు జట్లు ఇదివరకే భువనేశ్వర్లోని కళింగ స్టేడియంకు చేరుకున్నాయి. చదవండి: PAK Vs AUS: రెండో ఇన్నింగ్స్లోనూ శతక్కొట్టిన పాక్ ఓపెనర్ -
అత్యుత్తమ ర్యాంక్కు చేరుకున్న భారత హాకీ జట్టు
లుసానే: ప్రపంచ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ర్యాంకింగ్స్లో భారత్ అత్యుత్తమంగా మూడో ర్యాంక్తో ఈ ఏడాదిని ముగించనుంది. గురువారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో 2,296.038 పాయింట్లతో భారత్ మూడో ర్యాంక్ను కాపాడుకుంది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత పురుషుల జట్టు ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించింది. ఎఫ్ఐహెచ్ ర్యాంకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాక భారత్ మూడో ర్యాంక్తో ఏడాదిని ముగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మహిళల ర్యాంకింగ్స్లో భారత హాకీ జట్టు తొమ్మిదో ర్యాంక్తో ఈ ఏడాదిని ముగించింది. టోక్యో ఒలింపిక్స్లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. -
పాక్పై నెగ్గిన భారత్.. కాంస్యం కైవసం
పురుషులు హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కాంస్య పతకం గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్.. పాకిస్తాన్ను 4-3 తేడాతో ఓడించి కాంస్యం కైవసం చేసుకుంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మన్ప్రీత్ సింగ్ నిలిచాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత్ తరపున హర్మన్ప్రీత్, అక్షదీప్సింగ్, వరుణ్ కుమార్, గుర్సాహిబిజిత్ సింగ్లు గోల్ చేశారు. చదవండి: BWF Rankings: అదరగొట్టిన కిదాంబి శ్రీకాంత్.. రెండేళ్ల తర్వాత..! ఇక పాకిస్తాన్ తరపున అర్ఫాజ్, అబ్దుల్ రాణా, అహ్మద్ నదీమ్లు గోల్ చేశారు. ఇక లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలతో గ్రూఫ్ టాపర్గా నిలిచిన భారత్ సెమీఫైనల్లో మాత్రం జపాన్ చేతిలో చతికిలపడింది. అయితే కాంస్య పతక పోరు కోసం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం భారత్ విజయం సాధించింది. లీగ్ దశలోనూ భారత్ పాకిస్తాన్ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. -
Asian Champions Trophy Hockey: తిరుగులేని భారత్.. జపాన్పై ఘన విజయం
ఢాకా: పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత జట్టు హవా కొనసాగుతోంది. ఇవాళ జపాన్తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్.. 6-0 గోల్స్తో చెలరేగిపోయింది. తద్వారా గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన ఏకైక జట్టుగా నిలిచి సెమీస్కు దూసుకెళ్లింది. హర్మన్ప్రీత్ సింగ్ మరోమారు అదరగొట్టాడు. 10, 53వ నిమిషాల్లో గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దిల్ప్రీత్ సింగ్ 23వ నిమిషంలో, జరామన్ప్రీత్ సింగ్ 34వ నిమిషంలో, సుమిత్ 46వ నిమిషంలో, షంషేర్ సింగ్ 54వ నిమిషంలో గోల్స్ సాధించి భారత్కు అద్భుత విజయాన్ని అందించారు. రౌండ్ రాబిన్ స్టేజ్లో భారత్(10 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో కొరియా (6), జపాన్ (5), పాకిస్థాన్ (2) ఉండగా.. ఆతిథ్య బంగ్లాదేశ్ ఖాతా కూడా తెరవలేకపోయింది. చదవండి: BWF World Championships 2021 Finals: పోరాడి ఓడిన శ్రీకాంత్.. -
Manpreet Singh: తండ్రి కాబోతున్న భారత జట్టు కెప్టెన్!
Indian Hockey Skipper Manpreet Singh: భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నాడు. తొలిసారి తండ్రి కాబోతున్న అనుభూతిని ఆస్వాదిస్తూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బతవుతున్నాడు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన మన్ప్రీత్... గర్భవతి అయిన భార్యతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. తెలుపు రంగు టీషర్టులు వేసుకుని ట్విన్నింగ్ లుక్లో చిరునవ్వులు చిందిస్తున్న ఈ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా మన్ప్రీత్ సింగ్ గతేడాది డిసెంబరులో మలేషియా దేశానికి చెందిన తన స్నేహితురాలు ఇలి నజ్వా సిద్ధిఖీని వివాహం చేసుకున్నాడు. పంజాబీ సంప్రదాయ పద్ధతిలో జలంధర్లో వీరి పెళ్లి జరిగింది. అయితే, ఆ సమయంలో కరోనా వ్యాప్తి కారణంగా విమాన రాకపోకల్లో ఆంక్షలు ఉన్న విషయం విదితమే. ఈ క్రమంలో నజ్వా ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అయితే, తమకు సమాచారం లేకుండా నజ్వా పంజాబీ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం తప్పుగానే పరిగణిస్తామని మలేసియా ఉప ప్రధాని(మత వ్యవహారాలు) మర్జుక్ అప్పట్లో పేర్కొన్నారు. ఇక ఆట విషయానికొస్తే... టోక్యో ఒలింపిక్స్లో భాగంగా మన్ప్రీత్ నేతృత్వంలోని భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుపొందిన సంగతి తెలిసిందే. చదవండి: Viral Video: ఇదేం ఫీల్డింగ్రా బాబు.. స్లిప్స్లో ఎనిమిది మంది ఫీల్డర్లు.. తొలి బంతికే! If you don’t know, now ya know! A grand adventure is about to begin in November 💖 #babyIM #babyontheway @illisaddique pic.twitter.com/BuFxlUekUs — Manpreet Singh (@manpreetpawar07) October 1, 2021 -
ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో పదేళ్లు హాకీకి స్పాన్సర్షిప్
భువనేశ్వర్: భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన స్పాన్సర్గా కొనసాగుతుందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెల్లడించారు. మంగళవారం ఇరు జట్లను ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మరో పదేళ్ల పాటు స్పాన్సర్షిప్ చేస్తామని చెప్పారు. ‘రెండు జట్లు తమ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్లో కొత్త చరిత్ర లిఖించాయి. దేశం యావత్తు గర్వపడేలా హాకీ జట్లు మైదానంలో పోరాడాయి. అసామాన పోరాట పటిమ చూసి భారత్ భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది. జాతీయ క్రీడ హాకీతో మా అనుబంధం కొనసాగుతుంది’ అని అన్నారు. ఒక్కో ప్లేయర్కు రూ. 10 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 5 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతిగా అందజేసిన ఒడిషా ప్రభుత్వం హాకీ ఇండియాకు కూడా రూ. 50 లక్షలు అందించింది. 2018 నుంచి భారత హాకీ జట్లకు ‘టీమ్ స్పాన్సర్’గా ఒడిశా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇటీవల ముగిసిన ఒలింపిక్స్లో పురుషుల జట్టు 41 ఏళ్ల పతక నిరీక్షిణకు కాంస్యంతో తెరదించిన సంగతి తెలిసిందే. మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. -
ఈ విజయం... నూతన శుభోదయం
ప్రపంచ క్రీడారంగంలో ఎన్నో ఆశలతో అడుగుపెడుతున్న దుర్బలులకు 1970లలో హాకీ, 1980ల వరకు క్రికెట్ ఓ గర్వకారణంగా, ఒక సామాజిక హోదాగా ప్రాతినిధ్యం వహించేవి. ఆనాటి భారతీయ హాకీ మా తరానికీ, మన జాతీయ గర్వానికీ ప్రతీకగా నిలిచి ఉండేది. ప్రస్తుతం క్రికెట్ చుట్టూ అలుముకుంటున్న జనబాహుళ్యపు ఉన్మాదం మన సాంస్కృతిక మొరటుదనానికి ప్రతీకగా ఉంటోంది. అవమానాల పాలైన భారతీయులకు – నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దేశం పొందుతూ వచ్చిన అన్ని వైఫల్యాలకు చికిత్సలాగా అప్పట్లో క్రికెట్ హీరోలు రంగంమీది కొచ్చారు. కానీ నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడు భారతీయ హాకీ సాధించిన ఈ పునరుజ్జీవనం... మరొక ప్రగాఢమైన, సానుకూల జాతీయవాదం మనలో ఇప్పటికీ మనగలుగుతోందని అందరికీ హామీనిచ్చింది. మరుగునపడి ఉండవచ్చు కానీ అది మన జాతీయ చైతన్యం నుంచి మాత్రం తొలగిపోలేదు. సాధారణంగా నేను పెందలకడనే లేచే వ్యక్తిని కాదు. కానీ ఈ మంగళవారం ఉదయం నాకు భిన్నంగా కనిపించింది. ఒలింపిక్ హాకీ సెమీ ఫైనల్లో భారత్–బెల్జియం మ్యాచ్ చూడటం కోసం నేనూ నాతోపాటు కుటుంబం మొత్తంగా త్వరగా నిద్రలేచాం. ఇరు జట్లమధ్య జరిగిన పోటీ అసంఖ్యాక భారతీయ అభిమానులకు లాగే మమ్మల్ని కూడా పరవశం నుంచి, ఆందోళన, బాధవరకు అనేక అనుభూతులతో కదిలించివేసింది. నిజానికి భారత హాకీ జట్టు గొప్పగా ఆడింది. కానీ ఆ పోటీలో ఓడిపోవడం మాకు అవమానం కలిగించలేదు. అంతకుముందు హార్దిక్ సింగ్ బ్రిటన్ జట్టుపై చేసిన ఏకైక, అద్భుతమైన గోల్ను చూస్తున్నప్పుడు కలిగిన ఆ మొదటి ఆనందం ఇప్పటికీ మనసులోంచి తొలిగిపోలేదు. లేదా మన మహిళల హాకీ జట్టు ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు కలిగిన చక్ దే మూమెంట్ గర్వాతిశయాన్ని కూడా మర్చిపోలేదు. ఆ ఘటన నాకు దాదాపు 50 ఏళ్ల క్రితం నాటి నా పాఠశాల రోజులను గుర్తుకు తెచ్చింది. నేను చదువుకున్న శ్రీ గంగానగర్ లోని ఎస్జీఎన్ ఖల్సా హయ్యర్ సెకండరీ స్కూల్లో గ్రామీణ సిక్కు అబ్బాయిలు ఎక్కువగా ఉండి ఆటలకు ఎంతో పేరుపొందింది. ఆ రోజుల్లో రాజస్తాన్ తరపున ఆడుతున్న 11 మందిలో 6 నుంచి 8 మంది సభ్యులు మా స్కూలుకి చెందినవారే. తర్వాత నేను చదివిన ఎస్జీఎన్ ఖల్సా కాలేజీ కూడా హాకీ, అథ్లెటిక్స్లో అదే రకమైన పేరు కలిగి వుండేది. నా తోటివారి లాగే నేను కూడా అప్పట్లో హాకీకి పెద్ద అభిమానిగా ఉండేవాడిని. అప్పటికే భారతీయ హాకీ తన స్వర్ణ యుగాన్ని దాటేసింది కానీ అంతర్జాతీయ ప్రతిష్ట, గుర్తింపు నుంచి ఇంకా దూరం కాలేదు. 1975లో కౌలాలంపూర్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన గేమ్లో అస్లామ్ షేర్ ఖాన్ చివరి నిమిషంలో చేసిన గోల్ మన హాకీ వైభవాన్ని నిర్వచించిన ఘటనగా మిగి లిపోయింది. ఆనాటి భారతీయ హాకీ మా తరానికీ, మన జాతీయ గర్వానికీ ప్రతీకగా నిలిచి ఉండేది. అలాగని మన జట్టు కచ్చితంగా గెలుస్తుందని చెప్పలేం కానీ దానికి ఒక ప్రతిష్ట అంటూ ఉండేది. నా తరంలో చాలామందికి లాగే, హాకీ పట్ల నా అనురక్తి మెల్లగా క్రికెట్ వైపుకు మళ్లింది. 1974–75 శీతాకాలం సీజన్లో క్లైవ్ లాయిడ్ జట్టు భారత్కు రావడంతో అది మొదలైంది. ఈ సీరీస్లోనే గార్డన్ గ్రీనిడ్జ్, వివియన్ రిచర్డ్స్, ఆండీ రాబర్ట్స్ తమ తొలి మ్యాచ్ ఆడారు. నాకు వ్యక్తిగతంగా జి. విశ్వనాథ్, బ్రిజేష్ పటేల్, బీఎస్ చంద్రశేఖర్ అంటే చాలా ఇష్టం. వీరంతా కర్ణాటకకు చెందినవారే. ఆ పోటీలో భారత్ సిరీస్ కోల్పోయింది కానీ తన గౌరవాన్ని మాత్రం నిలబెట్టుకుంది. 1976 ఒలింపిక్స్లో ఆస్ట్రో టర్ఫ్ని ప్రవేశపెట్టడంతో భారతీయ హాకీ ప్రాభవం మళ్లీ పుంజుకోలేనంతగా పతనమార్గం పట్టింది. 1980 నాటి మాస్కో ఒలింపిక్స్లో సులభంగా మన జట్టు స్వర్ణం సాధించిం దనుకోండి. ఆ సమయంలోనే క్రికెట్ ఆటకు ప్రాచుర్యం పెరగడం, 1983 ప్రపంచ కప్లో భారత క్రికెట్ జట్టు డ్రీమ్ విక్టరీ సాధించడం కాకతాళీయంగా జరిగిపోయింది. మా స్నేహితులు కొందరు ముందుకొచ్చి స్థానిక క్రికెట్ టీమ్ను నెలకొల్పారు. దానికి ఎలెవన్ స్టార్ క్లబ్ అని మహా గొప్ప పేరుండేది. అప్పటికింకా ప్రారంభించని నూతన ఏపీఎంసీ మైదానం మా క్రికెట్ గ్రౌండ్గా ఉండేది. క్రమంగా క్రికెట్ స్టార్లు (ఈ జాబితాలో నేను కపిల్ దేవ్ను చేర్చాను) కొత్త జాతీయ హీరోలు అయ్యారు. భారతజట్టు అప్పటికీ ప్రాధాన్యత లేని జట్టుగానే ఉండేది. ప్రత్యర్థులను అçప్పుడప్పుడూ ఓడిస్తూ మన గర్వాన్ని కాస్త పెంచుతూ వచ్చేది. భారత్ ఆడనప్పుడు నేను వెస్టిండీస్కి చెందిన వివియన్ రిచర్డ్స్, పాకిస్తాన్ ఆటగాడు జహీర్ అబ్బాస్ను ఆరాధించేవాడిని. మూడో ప్రపంచ దేశాలకు, అలీనోద్యమానికి సంఘీభావం తెలుపుతున్న రోజులవి. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు నేను క్రీడా ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాను. క్రికెట్ పట్ల నా ఆసక్తిని నా వృత్తిపట్ల అనురక్తి కనుమరుగు చేస్తూ వచ్చింది. హాకీ గతించిన జ్ఞాపకంలా ఉండేది. అలాంటి సమయంలో ‘లగాన్’ మళ్లీ ప్రేరణ కలిగించింది కానీ క్రికెట్ పట్ల నా ఆసక్తిని మాత్రం పెంచలేకపోయింది. ‘చక్ దే! ఇండియా’ భారత్ని ఆనందభాష్పాలతో ముంచెత్తింది కానీ వాస్తవ ప్రపంచంలో అలాంటిది ఏదీ మిగలలేదు. ఆ తర్వాత నా కుమారుడు కొన్నేళ్ల క్రితం నాలోని క్రీడాసక్తిని తిరిగి వెలిగించిన సమయానికి క్రికెట్ కొత్త గేమ్గా అవతరించింది. ట్వంటీ 20 టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ని, పేస్ని కూడా మార్చేసింది. ఈ సరికొత్త మార్పులను నేను చిన్నచూపు చూడలేదు. టీ20 మ్యాచ్లంటే నాకు ఇష్టం. సిక్సర్ల విందును మనం ఎందుకు ఆస్వాదించకూడదు? బ్యాట్స్మన్ల కోసం రూపొందిన ఒక ఫార్మాట్ ఇప్పుడు బౌలర్లకు స్వర్గధామం కావడం చూసి ఆశ్చర్యపడుతుంటాను. ఇప్పుడు భారతీయ క్రికెట్లోని ఈ టాలెంట్ పూల్ని చూసి నిజంగానే దిగ్భ్రాంతి చెందుతున్నాను. ఇప్పుడు క్రికెట్ ఒక విస్తరించిన వినోద పరిశ్రమగా మారిపోయింది. మనం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ హబ్కి చెందినవారమని నాకు తెలుసు. కానీ నా జాతీయ స్వీయగౌరవానికి అది అదనంగా దేన్నీ జోడించదు. ముఖానికి రంగు పూసుకుని, టీషర్టులు ధరించి ఇంటా బయటా క్రికెట్ చూస్తున్న భారతీయ అభిమానులను చూస్తుంటాను. కానీ వారి ఆనందపు అరుపులు, హోరుకేకల్లో నేను భాగం కాలేదు. 2007లో టీ20 ప్రపంచ కప్లో మన విజయం 1983 ప్రపంచకప్, 1975 ప్రపంచ హాకీ కప్ విజయంతో సమానమైంది కాదని నా అభిప్రాయం. ఈసారి ఒలింపిక్స్లో మన హాకీ జట్లపై కూడా నా అభిప్రాయం ఇదే. హాకీ కూడా మారిందనడంలో సందేహమే లేదు. నాలుగు క్వార్టర్ల ఫార్మాట్, గేమ్ తీరు, కొత్త నిబంధనలు చోటు చేసుకున్నప్పటికి మౌలికంగా అది ఒకనాటి క్రీడనే తలపిస్తుంది. ఆస్ట్రేలియా జట్టుపై భారత మహిళా జట్టు నెగ్గినప్పుడు 46 ఏళ్ల క్రితం అజిత్ పాల్ సింగ్ నేతృత్వంలోని జట్టు సాధించిన విజయానుభూతులను మళ్లీ గుర్తుకు తెచ్చాయి. ఇప్పటి మన మహిళా హాకీ ప్లేయర్ల విజయగాథలు 1970ల నాటి భారతీయ హాకీ క్రీడాకారుల విజయగా«థలకు తీసిపోవు. ఒలింపిక్ పతకాలు మనవాళ్లు గెలవకపోయినా నేను లెక్క చేయను. (భారత పురుషుల హాకీ టీమ్ కాంస్యం దక్కించుకోగా, శుక్రవారం గ్రేట్ బ్రిటన్తో జరిగిన ఉత్కంఠభరిత పోటీలో మన మహిళల టీమ్ తృటిలో కాంస్యం చేజార్చుకుంది.). ఒకటి మాత్రం నిజం మన పురుషులు, మహిళల హాకీ టీమ్ గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఇప్పుడు మన జాతీయ సంకేతాలుగా నిలుస్తారు. ఇది నా కథ మాత్రమే కాదు. వలస పాలనానంతర జాతీయవాదం నుంచి కఠినమైన అల్ట్రా జాతీయవాదం పెరుగుతున్న ప్రస్తుత సమయంలో ఇది ఒక తరం గాథ కూడా. క్రికెట్ చుట్టూ వలసవాద రాజకీయాల కథపై రాసిన ఆశీష్ నంది మనకో విషయం గుర్తుచేశారు. ‘మూలాలు మర్చిపోయిన, అవమానాల పాలైన, సంస్కృతి కోల్పోయిన భారతీయులకు– నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దేశం పొందుతూ వచ్చిన అన్ని వైఫల్యాలకు చికిత్సలాగా క్రికెట్ హీరోలు రంగంమీదికొచ్చారు’. ఈ నేపథ్యంలో భారతీయ హాకీ పునరుజ్జీవనం మరొక ప్రగాఢమైన, సానుకూల జాతీయవాదం మనలో ఇప్పటికీ మనగలుగుతోం దని నాకు హామీ ఇస్తోంది. అది మరుగున పడి ఉండవచ్చు కానీ మన జాతీయ చైతన్యం నుంచి మాత్రం తొలగిపోలేదు. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ సంస్థాపకులు (‘ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మరో స్వర్ణ యుగానికి శ్రీకారం
సంకల్పం... మనిషిని ఉన్నత శిఖరాలకు మోసుకువెళ్ళే ఐరావతం. నమ్మకం... కోరిన విజయాన్ని అందించే కల్పవృక్షం. భారత హాకీ స్త్రీ, పురుష జట్లు రెండూ తాజా టోక్యో ఒలింపిక్స్లో అది మరోసారి రుజువు చేశాయి. జాతీయక్రీడ హాకీలో భారత్ది వట్టి గత వైభవం కాదని ప్రపంచ వేదికపై చాటాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అనేక దేశాలు బహిష్కరించిన 1980 మాస్కో ఒలింపిక్స్లో హాకీలో మనకు స్వర్ణం వచ్చింది. మళ్ళీ 41 ఏళ్ళ తర్వాత మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని పురుషుల జట్టు ఈసారి కాంస్యంతో ఒలింపిక్ పతకాల పట్టికనెక్కడం చిరస్మరణీయం. రాణీ రామ్పాల్ కెప్టెన్సీలోని మహిళల హాకీ జట్టు వెంట్రుక వాసిలో పతకం చేజార్చుకున్నా, హోరాహోరీ పోటీలలో సత్తా చాటి, ప్రజల మనసు గెలుచుకోవడం మరో చరిత్ర. ధ్యాన్చంద్ లాంటి దిగ్గజాల ఆటతో 8 ఒలింపిక్ స్వర్ణాలు గెలిచిన ప్రాభవం ఒకప్పుడు మన హాకీ జట్టుది. 2008 బీజింగ్ ఒలింపిక్స్కు అర్హత కూడా సంపాదించుకోలేక, అభిమానుల్ని క్రమంగా క్రికెట్కు కోల్పోయిన మన పురుషుల జట్టు 2016 నుంచి పుంజుకున్న తీరు ప్రశంసనీయం. రియో ఒలింపిక్స్లో 12వ స్థానంలో నిలిచి, ఘోర పరాభవం పాలైన మహిళల జట్టు ఇప్పుడు ఏకంగా విశ్వవేదికపై నాలుగో స్థానంలో నిలవడం గణనీయమైన పురోగతి. భారత హాకీ చరిత్రలో ఇది ఓ కొత్త శకం. ఒక దశలో అంపశయ్యపై ఉందని భావించిన భారత హాకీకి ఇప్పుడు మళ్ళీ స్వర్ణయుగం వస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ సువర్ణ స్వప్నం నిజం కావాలంటే, చేయాల్సింది చాలా ఉంది. కానీ, ఈ లోగా తాజా క్రీడా విజయాలను సర్కారు రాజకీయంగా వాడుకొనేందుకు ప్రయత్నిస్తోందని విమర్శలొస్తున్నాయి. ఆగస్టు 5న భారత పురుషుల హాకీ జట్టు కాంస్య విజయాన్ని సందర్భంగా తీసుకొని, ఓ ఉత్తరప్రదేశ్ సభలో మోదీ చేసిన వర్చ్యువల్ ప్రసంగమే అందుకు తార్కాణమంటున్నారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370వ అధికరణం రెండేళ్ళ క్రితం ఆగస్టు 5నే రద్దు అయిందనీ, సరిగ్గా ఏడాది క్రితం అయోధ్య రామాలయానికి భూమిపూజ చేసిందీ, ఇప్పుడు హాకీ పతకం వచ్చిందీ అదే తేదీన అంటూ, భారత నవోదయానికి ఇది నాంది అన్నట్టు మోడీ మాట్లాడడాన్ని విమర్శకులు తప్పుబట్టారు. 85 ఏళ్ళ క్రితం 1936లో ఇదే తేదీన బెర్లిన్ ఒలింపిక్స్లో ఆఫ్రికన్ – అమెరికన్ అథ్లెట్ జెస్సీ ఓవెన్స్ గెలిచారు. ఆర్యులే గొప్ప అని చాటాలనుకున్న హిట్లర్ ఆశల్ని తుంచేశారు. మరి, ఆ సంగతి మోదీ మర్చిపోయారా అని వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. ఇక, క్రీడాకారులకిచ్చే అత్యున్నత పురస్కారం పేరును ‘రాజీవ్ ఖేల్ రత్న’ నుంచి ‘ధ్యాన్చంద్ ఖేల్ రత్న’గా మార్చాలన్న మోదీ తాజా నిర్ణయం మరో వివాదమైంది. ఇది ‘రాజకీయ ప్రతీకార చర్య’ అని ప్రతిపక్షం నిరసిస్తోంది. నిజానికి, పార్టీలకు అతీతమైన క్రీడలకు ఇలా రాజకీయ రంగులు అద్దడం ఏ ప్రభుత్వం చేసినా అది తప్పే! ‘చక్ దే’ లాంటి కలల్ని వెండితెరపై విక్రయించడమే తప్ప, వాస్తవంలో ఐపీఎల్ లాంటి లాభసాటి క్రికెట్ వ్యాపారాల వైపే మన దేశంలో షారుఖ్ ఖాన్ సహా సోకాల్డ్ తారల మొగ్గు. ఇలాంటి చోట పాలకులు ఏం చేయాలన్నదానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓ ఉదాహరణ. హాకీ జట్టుకు స్పాన్సరర్ బాధ్యత నుంచి 2018లో ‘సహారా’ సంస్థ తప్పుకున్నప్పుడు, ఆయన అండగా నిలిచిన వైనాన్ని దేశమంతా ఇప్పుడు వేనేళ్ళ ప్రశంసిస్తోంది అందుకే! స్వయంగా హాకీ మాజీ గోల్ కీపరైన నవీన్ తమ ప్రభుత్వ పక్షాన భారత హాకీ జట్ల కోసం వంద కోట్ల పైనే వినియోగించిన వైనం ఇప్పుడు ఓ ఆసక్తికర స్ఫూర్తిగాథ. ఇలాంటి అవిరళ కృషే ఇవాళ హాకీలో మన కొత్త శకానికి శుభారంభం పలికింది. 2023లో పురుషుల హాకీ ప్రపంచకప్కు ఆతిథ్యమివ్వడానికి సైతం ఒడిశా సర్కారు సిద్ధమవుతోంది. రూర్కేలాలో అంతర్జాతీయ స్టేడియమే కడుతోంది. స్వార్థం చూసుకోకుండా పాలకులు శ్రద్ధ పెడితే, ఏ రంగంలోనైనా ప్రతిభా పురోగమనం సాధ్యమనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. పాలకుల సహకారం మాటెలా ఉన్నా, ప్రతిభావంతుల ప్రయత్నాలు ఆగలేదు. టోక్యో ఒలింపిక్స్తో ఆ విషయం స్పష్టమైంది. దుర్భర దారిద్య్రం, లింగ, కుల వివక్ష, పక్షపాతం, కనీస వసతుల లేమి లాంటి ఎన్నో ఆటంకాలు ఉన్నా, పట్టుదల ఉంటే ప్రపంచ వేదికపై రాణించగలమని మన గ్రామీణ క్రీడాకారులు నిరూపించారు. పతకాల వేటలో నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నామని భావిస్తున్న వేళ దేశం నలుమూలల నుంచి మట్టిలో మాణిక్యాలెన్నో మెరిశాయి. నిజానికి, ఈసారి కూడా మన దేశానికి పతకాల సంఖ్య గణనీయంగా ఏమీ పెరగలేదు. కానీ, మనవాళ్ళు విశ్వక్రీడా సంరంభంలో పోటాపోటీ ప్రతిభ చూపడం, భవిష్యత్తుపై ఆశలు రేపడం కచ్చితంగా విశేషమే! హాకీ సహా అనేక ఆటల్లో వెల్లువెత్తిన ఈ కొత్త ఉత్సాహం ఆసరాగా, రాగల కాలంలో బలమైన క్రీడాశక్తిగా భారత్ అవతరించడానికి ఇదే సరైన తరుణం. అయితే, ఇప్పుడిక తగిన దిశానిర్దేశంతో ప్రభుత్వాలు, క్రీడాసంస్థలు దీర్ఘకాలిక ప్రణాళికా రచన చేయాలి. క్రికెట్లో ఐపీఎల్ లాగా హాకీలో జాతీయస్థాయి లీగ్ లాంటివి మొదలుపెట్టడం లాంటివి చేయవచ్చు. అన్నిటి కన్నా ముఖ్యంగా చదువుతో పాటు ఆటల్ని అంతర్భాగం చేసే మంచి పద్ధతుల్ని పునఃప్రతిష్ఠించాలి. శిక్షణ నిమిత్తం నగరాలకు వెళ్ళలేని ప్రతిభావంతులైన గ్రామీణుల కోసం స్థానిక స్థాయిలో, వీలుంటే ప్రతి జిల్లాలో క్రీడా సముదాయాలు నెలకొల్పాలి. జాతీయ, అంతర్జాతీయ పోటీలకు తగిన తర్ఫీదు నివ్వాలి. ఇలా కింది స్థాయి నుంచి దృఢసంకల్పంతో కృషి మొదలుపెట్టి, ఆటగాళ్ళలో నమ్మకం పెంపొందిస్తే – ఒక్క హాకీలోనే కాదు... అనేక క్రీడల్లో అంతర్జాతీయ యవనికపై మన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది. మెడలో పతకాల హారంతో దేశం మెరిసిపోతుంది, మురిసిపోతుంది. -
41ఏళ్ల కలను నిజం చేశారు: స్పీకర్ ఓంబిర్లా
-
గత మూడేళ్ళుగా మన ఆటతీరు మెరుగైంది: ముకేశ్ కుమార్
-
చక్ దే ఇండియా.. తొలిసారి సెమీస్లో అడుగు!
-
టోక్యో ఒలింపిక్స్ : పతకాల వేటలో భారత్ గమనం ఎటు?
నాలుగేళ్లకోసారి జరిగే విశ్వక్రీడలు.. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులు ఒకే వేదికపై తలపడే సమరం ఇది. అటువంటి ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ మళ్లీ మన ముందుకొచ్చేశాయి. ఈసారి టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ వాస్తవానికి గతేడాదే జరగాల్సింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. ఈసారి కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికి జపాన్ ప్రభుత్వం మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఒలింపిక్స్ విలేజ్ను తయారు చేశామని చెప్పుకొస్తుంది. ఇప్పటికే ఒలింపిక్స్ జరుగుతున్న ప్రాంతంలో కరోనా కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగించే అంశమైనప్పటికి జపాన్ ప్రభుత్వం మాత్రం పకడ్బందీ చర్యలతో సిద్ధమవుతుంది. ఈ విషయం కాసేపు పక్కనపెడితే.. ఈసారి కూడా భారత్.. ఒలింపిక్స్ క్రీడలకు సిద్ధమైంది. 135 కోట్లకు పైగా జనాభా ఆశలను మోసుకుంటూ 119 మంది అథ్లెట్లు ఈసారి విశ్వక్రీడల్లో పాల్గొంటున్నారు. ప్రతీసారి నూతనోత్సాహంతో బరిలోకి దిగే భారత్ జట్టు పట్టుమని పది పతకాలు కూడా సాధించలేక చతికిలపడుతోంది. - సాక్షి, వెబ్డెస్క్ మరి అలాంటి ప్రపంచ ఒలింపిక్స్ చరిత్రలో మనదేశ స్థానం ఏంటి? చిన్న చిన్న జనాభా ఉన్న దేశాలు కూడా పతకాలను కొల్లగొడుతుంటే భారత్ మాత్రం ఎందుకు వేటలో వెనుకబడిపోయింది. మరి ఈసారి పతకాల వేటలో భారత్ గమనం ఏ విధంగా ఉండబోతుంది. 1900 సంవత్సరం నుంచి చూసుకుంటే భారత్ సాధించిన పతకాల సంఖ్య 28. ఇందులో 9 స్వర్ణాలు, 7 రజతాలు, 12 క్యాంస్య పతకాలు ఉన్నాయి. 1980 తర్వాత భారత్ ఒలింపిక్స్లో క్రమంగా ప్రాభవం కోల్పోతూ వస్తుంది. 135 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ప్రతిభకు కొదువ లేదు. మరి ఒలింపిక్స్లో ఎందుకు వెనుకడుగు వేస్తున్నామనేదానిపై ఇంతవరకు సరైన సమాధానం రాలేదు. భారత హాకీ జట్టు(1980 ఒలింపిక్స్) ఇక 1900 సంవత్సరంలో భారత్ ఒలింపిక్స్లో తొలిసారిగా ప్రాతినిధ్యం వహించింది. అయితే ఆ ఒలింపిక్స్ నుంచి ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు నార్మన్ ప్రిచర్డ్. అథ్లెటిక్స్ విభాగంలో నార్మన్ ప్రిచర్డ్( పురుషుల 200 మీటర్ల పరుగు, పురుషుల 200 మీటర్ల హార్డిల్స్) విభాగాలలో రెండు రజత పతకాలు సాధించాడు. కాగా 1920లో తొలిసారి భారత జట్టు ఒలింపిక్స్ క్రీడలకు వెళ్లింది. అప్పటినుంచి ప్రతీ వేసవి ఒలింపిక్స్లో భారత్ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఒలింపిక్స్లో 28 పతకాలు సాధించినప్పటికి.. అందులో అత్యధికంగా హాకీ నుంచి గెలిచినవే. 1928 నుంచి 1980 మధ్య కాలంలో మన దేశ హాకీ క్రీడ ఒలింపిక్స్లో స్వర్ణయుగం చూసింది. ఈ మధ్య కాలంలో జరిగిన 12 ఒలింపిక్ క్రీడలలో భారత హాకీ జట్టు 11 పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. అందులో 1928 నుంచి 1956 వరకు వరుసగా ఆరుసార్లు స్వర్ణం గెలవడం విశేషం. ఆ తర్వాత కూడా 1960 రోమ్ ఒలింపిక్స్లో రజతం, 1964 టోక్యో ఒలింపిక్స్లో మళ్లీ స్వర్ణం, 1968 మెక్సికో ఒలింపిక్స్లో కాంస్యం, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో క్యాంస్యం.. ఇక చివరగా 1980 మాస్కో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన భారత హాకీ జట్టు మళ్లీ ఆ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. ఇక వ్యక్తిగత విభాగంలో భారత్కు వచ్చిన పతకాలు అంతంత మాత్రమే. 1952 హెల్సింకి ఒలింపిక్స్లో కె.డి. జాదవ్ వెయిట్లిఫ్టింగ్లో క్యాంస్యం గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అంతకముందు నార్మన్ ప్రిచర్డ్ వ్యక్తిగత విభాగంలో పతకం గెలిచినప్పటికి అతను బ్రిటీష్ ఇండియన్ కావడంతో తొలి భారతీయుడిగా పరిగణించలేదు. ఇక అప్పటినుంచి చూసుకుంటే 1996 అట్లాంటా ఒలింపిక్స్ వరకు అంటే దాదాపు 44 సంవత్సరాల తర్వాత భారత్ ఒలింపిక్స్లో రెండో వ్యక్తిగత పతకాన్ని సాధించింది. టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ పురుషుల సింగిల్స్లో ఫెర్నాండో మెలిజెని ఓడించి క్యాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఇక ఆ తర్వాత 2000 సిడ్నీ ఒలింపిక్స్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన కరణం మల్లీశ్వరీ వెయిట్లిఫ్టింగ్ విభాగంలో క్యాంస్య పతకం సాధించింది. అలా భారత్ నుంచి పతకం సాధించిన తొలి మహిళగా రికార్డులకెక్కింది. ఇక హాకీ జట్టు తర్వాత మనకు ఒలింపిక్స్లో పతకాలు ఎక్కువగా వచ్చింది షూటింగ్ విభాగంలో. ఈ విభాగంలో మొత్తం నాలుగు పతకాలు వచ్చాయి. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో రాజవర్థన్ సింగ్ రాథోడ్ పురుషుల డబుల్స్ ట్రాప్ విభాగంలో రజతం గెలవగా... 2008 బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం గెలిచి మువ్వన్నెల పతాకాన్ని బీజింగ్ గడ్డపై రెపరెపలాడించాడు. హాకీ జట్టు తర్వాత స్వర్ణం సాధించడం మళ్లీ ఇదే. వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణం సాధించిన క్రీడాకారుడిగా అభినవ్ బింద్రా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్లో గగన్ నారంగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో క్యాంస్యం, పురుషుల 25మీ ఫైర్ పిస్టల్ విభాగంలో విజయ్ కుమార్ క్యాంస్య పతకం గెలిచారు. ఇక క్రీడల వారిగా చూసుకుంటే హాకీ(11), షూటింగ్(4) తర్వాత రెజ్లింగ్ విభాగంలో ఐదు పతకాలు, బాక్సింగ్ విభాగంలో రెండు, బాడ్మింటన్ విభాగంలో రెండు, అథ్లెట్ విభాగంలో రెండు, టెన్నిస్ విభాగంలో ఒకటి, వెయిట్లిఫ్టింగ్ విభాగంలో ఒకటి సాధించింది. ప్రస్తుతం ఎన్నో రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్ ఒలింపిక్స్లో మాత్రం వెనుకబడిపోవడం క్రీడాభిమానులను నిరాశకు గురిచేస్తుంది. ఇక ప్రతీ ఒలింపిక్స్లో చైనా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు సత్తా చాటుతున్నాయి. ఏ ఒలింపిక్స్ చూసిన ఈ మూడు దేశాలే తొలి మూడు స్థానాలు నిలుస్తున్నాయి. మరి రెండు రోజుల్లో మొదలుకానున్న టోక్యో ఒలింపిక్స్లోనైనా భారత్ ఆశించిన విజయాలు సాధిస్తుందా అన్నది చూడాలి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1731380308.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టూర్ క్యాన్సిల్: భారత జట్టుకు నిరాశ
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో అంతర్జాతీయ సిరీస్ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తోన్న భారత పురుషుల హాకీ జట్టు నిరీక్షణ మరికొంత కాలం కొనసాగనుంది. కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో కేప్టౌన్ వేదికగా ఈనెల 10 నుంచి 27 వరకు జరగాల్సిన ‘సమ్మర్ సిరీస్’ను రద్దు చేసినట్లు దక్షిణాఫ్రికా హాకీ సంఘం (ఎస్ఏహెచ్ఏ) సీఈఓ మరిస్సా లాంజెనీ ప్రకటించారు. బెల్జియం, బ్రిటన్, ఫ్రాన్స్, భారత్ పాల్గొనే ఈ సిరీస్ను తాజా పరిస్థితుల్లో సిరీస్ను నిర్వహించడం ప్రమాదంతో కూడుకున్నదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని హాకీ ఇండియా మంగళవారం ధ్రువీకరించింది. భారత జట్టు చివరగా గతేడాది ఫిబ్రవరి 21–22 తేదీల్లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్లు ఆడింది.(చదవండి: పాక్ మరో 354 పరుగులు చేస్తేనే.. లేదంటే ) ఎదురులేని ముంబై మార్గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఎదురు లేకుండా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఆరింటిలో నెగ్గిన ముంబై తాజాగా మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో ముంబై 3–1 గోల్స్ తేడాతో బెంగళూరు ఎఫ్సీపై గెలుపొందింది. ముంబై ఆటగాళ్లు ఫాల్ (9వ నిమిషంలో), బిపిన్ సింగ్ (15వ నిమిషంలో), ఒగ్బెచె (84వ నిమిషంలో) తలా ఓ గోల్ చేశారు. బెంగళూరు తరఫున చెత్రి (79వ నిమిషంలో) పెనాల్టీ ద్వారా గోల్ చేశాడు. నేటి మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్తో ఎఫ్సీ గోవా తలపడుతుంది. -
భారత హాకీ ఆటగాళ్లకు సోకిన కరోనా వైరస్
-
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
భువనేశ్వర్: ఈ ఏడాది చివర్లో జరిగే టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్కు అర్హత సాధించేందుకు భారత హాకీ జట్టు విజయం దూరంలో నిలిచింది. ఆసియా క్రీడల చాంపియన్ జపాన్తో నేడు జరిగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ సెమీఫైనల్లో భారత్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సొంత ప్రేక్షకుల మధ్య ఆడనుండటం భారత్కు కలిసొచ్చే అంశం. కొత్త కోచ్ గ్రాహమ్ రీడ్ శిక్షణలో ఇప్పటికే గ్రూప్ మ్యాచ్లను భారీ గోల్స్ తేడాతో గెలవడం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. గ్రూప్ మ్యాచ్లలో రష్యా, ఉజ్బెకిస్తాన్లపై 10–0తో, పోలాండ్పై 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. ముఖ్యంగా భారత మిడ్ఫీల్డ్ చురుకుగా కదులుతూ గోల్స్ చేసే అవకాశాలను సృష్టిస్తోంది. అయితే ఆ అవకాశాలను గోల్స్గా మలచడంలో కాస్త ఇబ్బంది పడుతున్నా సెమీఫైనల్ మ్యాచ్లో భారతే ఫేవరెట్గా కనబడుతోంది. ‘మా జట్టు ఆటతీరు పట్ల నేను సంతోషంగా ఉన్నాను. గోల్స్ చేసే అవకాశాలను సృష్టిస్తున్నా కొన్నిసార్లు వాటిని లక్ష్యానికి చేర్చడంలో తడబడుతున్నారు. ఈ అంశంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’ అని కోచ్ గ్రాహమ్ అన్నారు. చివరిసారిగా జపాన్తో ఈ ఏడాది జరిగిన అజ్లాన్ షా టోర్నీలో తలపడిన భారత్ 2–0తో విజయాన్ని అందుకుంది. -
ఏషియన్ గేమ్స్: అదరగొట్టిన భారత హాకీ జట్టు
జకర్తా: ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. ఏకంగా 26 గోల్స్ చేసి ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. బుధవారం గ్రూపు రౌండ్ మ్యాచ్లో భారత్26-0తేడాతో హాంకాంగ్పై ఘనవిజయం సాధించింది. భారత ఆటగాళ్లు పోటీపడి గోల్స్ చేస్తుంటే అనుభవంలేని ప్రత్యర్థి జట్టు చూస్తూ ఉండిపోయింది. ఆట ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే టీమిండియా ఆటగాళ్లు నాలుగు గోల్స్ చేశారు. ఇక ప్రథమార్థం ముగిసే సరికి భారత ఆటగాళ్లు 14 గోల్స్ నమోదు చేయడం విశేషం. ఆట ప్రారంభం నుంచి దూకుడుగా కనిపించిన భారత్ చివరి వరకు ఆదే ప్రదర్శన కొనసాగించింది. భారత ఆటగాళ్లలో అక్షదీప్, రూపిందర్, లలిత్ చెరో మూడు గోల్స్తో చెలరేగగా.. హర్మన్ ప్రీత్ అత్యధికంగా 4 గోల్స్ సాధించాడు. ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లలో భారత్కు ఇదే అతి పెద్ద విజయం. 1932లో ధ్యాన్చంద్ నాయకత్వంలోని భారత జట్టు అమెరికాను 24-1 తేడాతో చిత్తుచేసింది. తాజాగా ఆసియా క్రీడల్లో భారత జట్టు ఆ రికార్డును తిరగరాసింది. ఇక తొలి మ్యాచ్లో కూడా భారత్17-0తో ఇండోనేషియాపై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. FT| The Indian Men's Hockey Team score 26 goals against Hong Kong China in their third game of the @asiangames2018 which saw 4 players claim hat-tricks and a sublime team effort to achieve the large score-line on 22nd August 2018.#IndiaKaGame #AsianGames2018 #INDvHKG pic.twitter.com/UiqYtgzbsq — Hockey India (@TheHockeyIndia) 22 August 2018 -
ఏషియాడ్ స్వర్ణం... ఒలింపిక్స్ టికెట్
హాకీ... ఒక తరంలో భారత కీర్తి పతాక. మన జట్టు పేరు చెబితే చాలు... బరిలో దిగకముందే ప్రత్యర్థులు బేజారెత్తిపోయేవారు. తర్వాతర్వాత పరిస్థితులు మారాయి. మిగతా దేశాలు పుంజుకోవడంతో పాటు, టీమిండియా వెనుకబాటుతో అంతరం పెరిగిపోయింది. ప్రధాన టోర్నీల్లో ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఆసియా క్రీడల్లో తళుక్కున మెరిసింది టీమిండియా. ఉత్కంఠను తట్టుకుని చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మట్టికరిపించి స్వర్ణం ఒడిసిపట్టింది. అటు నుంచి అటే ఒలింపిక్స్ బెర్త్ కూడా కొట్టేసింది. అలాంటి అవకాశమే మళ్లీ వచ్చింది. మరి... డిఫెండింగ్ చాంపియన్గా అడుగిడుతోన్న శ్రీజేష్ సేన నాటి ప్రదర్శనను పునరా వృతం చేస్తుందా...? మరోసారి నేరుగా ఒలింపిక్స్ టికెట్ సంపాదిస్తుందా...? సాక్షి క్రీడా విభాగం :పదహారేళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గింది భారత హాకీ జట్టు. అది కూడా పెనాల్టీ షూటౌట్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించి...! మరపురాని ఈ విజయం అనంతరం టీమిండియా ఆత్మవిశ్వాసం పెరిగింది. కొంతకాలంగా ఆటతీరులో పురోగతి కనిపిస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా ఎదుర్కొనగలమని చాటుతోంది. ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కు చేరడమే దీనికి నిదర్శనం. కోచ్గా భారత్కే చెందిన హరేంద్ర సింగ్ నియామకంతో ఆటగాళ్లకు భాష సమస్య తీరి సమన్వయం కుదురుతోంది. దీంతోపాటు కీలక ఆటగాళ్లు ఫామ్లో ఉండటంతో ఏషియాడ్లో రాణింపుపై అంచనాలు నెలకొన్నాయి. ఇక్కడ ‘టాప్’లో నిలిస్తే 2020 టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖాయమైపోతుంది. మిగతా విషయాలన్నీ మర్చిపోయి ఈ రెండేళ్ల సమయాన్ని సన్నాహాలపై వెచ్చించే సౌలభ్యం కలుగుతుంది. సమతూకంతో... డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్ పునరాగమనం, మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ నిలకడ, యువ ఆటగాళ్లు మన్ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్... గోల్పోస్ట్ వద్ద గోడ కట్టే కీపర్, కెప్టెన్ శ్రీజేష్లతో భారత హాకీ జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. ఇద్దరు, ముగ్గురు మినహా... మిగతా ఆటగాళ్లకు వంద మ్యాచ్ల అనుభవం ఉండటం విశేషం. దీనిని దృష్టిలో ఉంచుకునే కెప్టెన్ శ్రీజేష్... తమది సమతూకమైన జట్టని, ఏషియాడ్లో ఫేవరెట్లమని పేర్కొన్నాడు. అయితే, గోల్ అవకాశాలను ఎంతమేరకు సద్వినియోగం చేసుకుంటుంది అనే దానిపైనే టీమిండియా టైటిల్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ముందుగా స్కోరు చేసి ప్రత్యర్థిపై పైచేయి సాధించడంతో పాటు పెనాల్టీ కార్నర్లను గోల్గా మలచడమూ కీలకమే. పెనాల్టీల విషయంలో జట్టు మెరుగు పడాలని అందరూ సూచిస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ, కామన్వెల్త్ క్రీడల్లో ఈ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు రూపిందర్పాల్ సింగ్ రాకతో ఈ ఆందోళన తీరినట్లే అనిపిస్తోంది. మరోవైపు కీలక సమయంలో ఆధిక్యాన్ని చేజార్చుకునే బలహీనతను అధిగమించాల్సి ఉంది. నాలుగో స్వర్ణం వేటలో... ఏషియాడ్ హాకీలో భారత్ మొత్తం 14 పతకాలు సాధించింది. 1966, 1988, 2014లో స్వర్ణాలు కైవసం చేసుకుంది. 9 సార్లు రన్నరప్గా నిలవడం విశేషం. రెండుసార్లు కాంస్యంతో సంతృప్తి పడింది. పురుషుల హాకీని 1958 ఏషియాడ్ నుంచి ప్రవేశపెట్టగా భారత్ ఒక్కసారి (2006) మాత్రమే ఏ పతకమూ సాధించకుండా వెనుదిరిగింది. ఈసారి బంగారు పతకం నెగ్గితే... దక్షిణ కొరియాతో సమానంగా నాలుగు సార్లు ఈ ఘనత సాధించిన జట్టుగా రికార్డులకెక్కుతుంది. మహిళలకూ మహదవకాశమే... ఇటీవల ప్రపంచకప్లో భారత మహిళల హాకీ జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. కఠిన పరిస్థితులకు నిలిచి క్వార్టర్స్ వరకు వచ్చింది. అదే ఊపు కొనసాగిస్తే ఏషియాడ్లోనూ మంచి ఫలి తాలు ఆశించవచ్చు. ఇక స్వర్ణం సాధిస్తే... నేరుగా ఒలింపిక్స్ టికెట్ దక్కినట్లే. అదే జరిగితే అద్భుతం సృష్టించిన జట్టవుతుంది. 1980 మాస్కో ఒలింపిక్స్లో తొలిసారి ఆడాక భారత మహిళల జట్టు తడబడింది. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2016లో రియో ఒలింపిక్స్కు మరోసారి అర్హత పొందింది. ఈసారి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించి ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకోవాలని రాణి రాంపాల్ నాయకత్వంలోని భారత జట్టు పట్టుదలతో ఉంది. టాప్–4లో 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో మహిళల హాకీని తొలిసారి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత మహిళల జట్టు కనీసం టాప్–4లో నిలుస్తోంది. 1982లో స్వర్ణం నెగ్గిన భారత మహిళల జట్టు... ఆ తర్వాత రజతం (1998), మూడుసార్లు కాంస్యం (1986, 2006, 2014) సాధించింది. 1990, 1994, 2002, 2010లలో నాలుగో స్థానంలో నిలిచింది. చాంపియన్స్ ట్రోఫీని కొద్దిలో చేజార్చుకున్నాం. ఇప్పుడు మా లక్ష్యం ఏషియాడ్ స్వర్ణం నెగ్గి తద్వారా ఒలింపిక్స్ బెర్తు కొట్టేయడమే. ప్రస్తుత ఫామ్ ప్రకారం మేం దానిని సాధించగలం. – శ్రీజేష్, భారత కెప్టెన్ వరుసగా రెండుసార్లు ఏషియాడ్ స్వర్ణం నెగ్గిన హాకీ జట్టుగా రికార్డులకెక్కే అర్హత, టైటిల్ నిలబెట్టుకునే సత్తా పటిష్ఠమైన ఈ జట్టుకుంది. ఇక్కడ స్వర్ణం సాధిస్తే... ఈ ఏడాది భారత్లో జరుగనున్న ప్రపంచ కప్నకు సరైన స్ఫూర్తిగా నిలుస్తుంది. – హరేంద్ర సింగ్, కోచ్ -
సర్దార్పై వేటు
న్యూఢిల్లీ: అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో నిరాశాజనక ప్రదర్శనతో పాటు కెప్టెన్గా జట్టు వైఫల్యంలో భాగంగా నిలిచిన సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్పై హాకీ ఇండియా (హెచ్ఐ) నమ్మకం కోల్పోయింది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత జట్టు నుంచి సర్దార్ను తప్పించింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో ఏప్రిల్ 7 నుంచి జరిగే ఈ పోటీల కోసం మంగళవారం జట్టును ప్రకటించారు. సర్దార్తో పాటు మరో సీనియర్ ప్లేయర్ రమణ్దీప్ సింగ్ను కూడా ఎంపిక చేయలేదు. 18 మంది సభ్యుల జట్టుకు మన్ప్రీత్ సింగ్ కెప్టెన్గా వ్యవహరించనుండగా... చింగ్లెన్సనా సింగ్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. మన్ప్రీత్ సారథ్యంలోనే ఆసియా కప్ గెలుచుకున్న భారత్, హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్లో కూడా కాంస్యం సాధించింది. గాయం నుంచి కోలుకున్న మరో సీనియర్ ఆటగాడు, మేటి గోల్కీపర్ శ్రీజేశ్కు జట్టులో చోటు లభించింది. ఇటీవల జరిగిన అజ్లాన్ షా టోర్నీలో సర్దార్ ఆట తర్వాత అతనిపై వేటు ఖాయమనే కనిపించింది. అయితే ఇదే టోర్నీలో మెరుగ్గా ఆడిన రమణ్దీప్ను కూడా తప్పించడం ఆశ్చర్యపరచింది. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన కుర్రాళ్లు దిల్ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్లకు కామన్వెల్త్ అవకాశం దక్కింది. ‘2017 ఆసియా కప్తో మొదలు పెట్టి వేర్వేరు టోర్నీల్లో ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని జట్టును ఎంపిక చేశాం. మా దృష్టిలో కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించగల అత్యుత్తమ జట్టు ఇది’ అని భారత కోచ్ జోయెర్డ్ మరీనే చెప్పారు. భారత హాకీ జట్టు: పీఆర్ శ్రీజేశ్, సూరజ్ కర్కేరా (గోల్ కీపర్లు), రూపిందర్పాల్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, కొతాజిత్ సింగ్, గురీందర్ సింగ్, అమిత్ రోహిదాస్ (డిఫెండర్లు), మన్ప్రీత్ సింగ్, చింగ్లెన్సనా సింగ్, సుమీత్, వివేక్ సాగర్ ప్రసాద్ (మిడ్ఫీల్డర్లు), ఆకాశ్దీప్ సింగ్, ఎస్వీ సునీల్, గుర్జంత్ సింగ్, మన్దీప్ సింగ్, లలిత్కుమార్ ఉపాధ్యాయ్, దిల్ప్రీత్ సింగ్ (ఫార్వర్డ్లు). -
భారత్ జోరు కొనసాగేనా!
భువనేశ్వర్: ఆసియా కప్లో ఇటీవలే విజేతగా నిలిచి సత్తా చాటిన భారత హాకీ జట్టు ముందు మరో పెద్ద సవాల్ నిలిచింది. అగ్రశ్రేణి జట్లు బరిలో నిలిచిన హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్లో భారత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేటినుంచి జరిగే ఈ టోర్నమెంట్లో ప్రపంచ టాప్–8 జట్లు పాల్గొంటున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్లో ఈ టోర్నీ డిఫెండింగ్, ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఉపఖండంలో జరిగే ఏ టోర్నీలోనైనా భారత్ మెరుగైన ప్రదర్శనే చేస్తోంది. కానీ ఈ లీగ్లో పరిస్థితులు భిన్నం. ప్రపంచ మేటి జట్లు పాల్గొంటున్న ఈ లీగ్లో భారత్ గెలవాలంటే అద్భుతంగా పోరాడాల్సి ఉంటుంది. ఆసియా కప్ దక్కించుకొని మన జట్టు మంచి ఊపు మీద ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లలో మన జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చాంపియన్స్ ట్రోఫీ, అజ్లాన్ షా కప్, కామన్వెల్త్ గేమ్స్లో ఆ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఆ పరాజయాలకు బదులు తీర్చుకునే అవకాశం ప్రస్తుతం భారత్ ముందుంది. కోచ్కు పరీక్ష... రెండు నెలల క్రితమే భారత జట్టు కోచ్ పగ్గాలు చేపట్టిన జోయెర్డ్ మరీనేకు ఇది అసలు సిసలు పరీక్ష. వచ్చే ఏడాది పెద్ద పెద్ద టోర్నీలు జరగనున్న నేపథ్యంలో జట్టు బలాబలాలను పరీక్షించుకునేందుకు కోచ్కు ఈ టోర్నీ ఉపయోగపడనుంది. మరీనే కోచ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పెను మార్పుల జోలికి వెళ్లకుండా.. డిఫెన్స్తో పాటు, వ్యూహాత్మక శిక్షణ పైనే దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్కప్ జరగనుండటంతో.. ఈ టోర్నీలో మన ఆటగాళ్ల లోపాలతో పాటు సత్తా పై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. మరీనే కోచ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మన జట్టు ఆసియా కప్ ఫైనల్లో 2–1తో మలేసియాపై విజయం సాధించింది. సర్దార్ సింగ్ లేకపోవడంతో మిడ్ఫీల్డర్గా కెప్టెన్ మన్ప్రీత్పై బాధ్యత మరింత పెరిగింది. కెప్టెన్తో పాటు గతేడాది జరిగిన జూనియర్ వరల్డ్ కప్లో ఆకట్టుకున్న హర్మన్ప్రీత్ సింగ్, సుమిత్, దిప్సన్ టిర్కీ, గుర్జంత్ సింగ్, వరుణ్కుమార్ లాంటి యువ ఆటగాళ్లపైనే అందరి దృష్టి ఉండనుంది. జట్టులో సీనియర్లు రూపిందర్ పాల్ సింగ్, బీరేంద్ర లక్డా గాయాల నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చారు. వారు తమని తాము నిరూపించుకోవడానికి ఇది చక్కటి అవకాశం. హాకీ ఇండియా లీగ్–2017లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అమిత్ రోహిదాస్ జట్టులో ఉండటం అదనపు బలాన్ని చేకూర్చనుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఈ టోర్నీ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. దూకుడుగా ఆడుతూ.. ట్రోఫీని నిలబెట్టుకునే లక్ష్యంతోనే ఆసీస్ బరిలోకి దిగుతోంది. గతేడాది జరిగిన రియో ఒలింపిక్స్లో వైఫల్యం తర్వాతినుంచి ఆ జట్టు నిలకడగా రాణిస్తోంది. పూల్ ‘బి’: భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ పూల్ ‘ఎ’: అర్జెంటీనా, నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్ మ్యాచ్ సా.7.30 గం. నుంచి స్టార్స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
రెండేళ్లుగానే నేను 'రజని'ని!
సాధారణ కుటుంబం, ఏమాత్రం సౌకర్యాలు లేని గ్రామం నుంచి వచ్చిన నేపథ్యం... అయితే పట్టుదలే పెట్టుబడిగా ముందుకు సాగిన ఆ అమ్మాయి భారత హాకీ జట్టు స్థాయికి ఎదిగింది. ప్రపంచకప్, ఒలింపిక్స్ సహా ప్రఖ్యాత టోర్నీలలో భాగమైంది. ఎనిమిదేళ్ల క్రితమే భారత జట్టులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరపు రజని ఇటీవల మరోసారి తన సత్తాను ప్రదర్శించింది. ప్రతిష్టాత్మక ఆసియా కప్ గెలిచిన జట్టులో గోల్కీపర్గా కీలక పాత్ర పోషిం చింది. భారత జట్టులో సభ్యురాలే అయినా... చాలా కాలంగా తగిన గుర్తింపు దక్కించుకోలేకపోయిన రజని, ఇప్పుడు హాకీకి లభిస్తున్న ఆదరణతో పాటు తనకు కూడా లభిస్తున్న ప్రోత్సాహం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది. సాక్షి, హైదరాబాద్:ఇతిమరపు రజని తొలిసారి భారత జట్టు తరఫున 2009లో ఆడింది. మధ్యలో గాయంతో కొంత కాలం మినహా రెగ్యులర్ సభ్యురాలిగా ఉన్న ఆమె 67 అంతర్జాతీయ మ్యాచ్లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. జపాన్లో ఇటీవల జరిగిన ఆసియా కప్ టోర్నీలో టీమిండియా విజయంలో భాగస్వామిగా ఉన్న రజని, ప్రస్తుత జాతీయ జట్టులో దక్షిణ భారతానికి చెందిన ఏకైక క్రీడాకారిణి కావడం విశేషం. ‘నా కెరీర్లో అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. 13 ఏళ్ల తర్వాత ఆసియా కప్ గెలిచిన జట్టులో సభ్యురాలిని కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి అజేయంగా నిలవగలిగాం. గత రెండేళ్లుగా మహిళల హాకీ మంచి విజయాలతో అందరి దృష్టిలో పడింది. 2015కు ముందు నాకు ఆరేళ్ల అంతర్జాతీయ కెరీర్ ఉన్నా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే నన్ను గుర్తు పట్టేవాళ్లు. ఇప్పుడు ‘హాకీ రజని’ అని పెద్ద సంఖ్యలో అభిమానిస్తుంటే గర్వంగా అనిపిస్తోంది’ అని రజని వ్యాఖ్యానించింది. చిత్తూరు జిల్లా నుంచి... తిరుపతి సమీపంలో యెర్రవారిపాలెం మండలంలోని యెనుమలవారి పల్లి రజని స్వస్థలం. తండ్రి కార్పెంటర్ వృత్తిలో ఉన్నారు. పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో హాకీపై పెరిగిన ఆసక్తి ఆమెను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. టీమ్ గేమ్తో పాటు అమ్మాయి కావడం వల్ల కొంత అభ్యంతరాలు వ్యక్తమైనా కుటుంబ సభ్యుల అండదండలు రజనిని ముందుకు వెళ్లేలా చేశాయి. స్కూల్ గేమ్స్లో ప్రదర్శన తర్వాత 2005లో తిరుపతిలోని ‘శాప్’ హాకీ అకాడమీలో చేరడం రజని కెరీర్ను మలుపు తిప్పింది. ఆ తర్వాత దూసుకుపోయిన ఈ అమ్మాయి 2008లో తొలిసారి భారత జూనియర్ జట్టు క్యాంప్లోకి ఎంపికైంది. గోల్కీపర్గా ఈ దశలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ నిలకడగా రాణించడంతో ఏడాది తిరిగే సరికి సీనియర్ టీమ్లో భాగం కావడం విశేషం. ‘గోల్ కీపర్గా అనుభవం పెరిగిన కొద్దీ నేను మరింత రాటుదేలాను. దాంతో పాటు కీపింగ్ను బాగా ఆస్వాదించాను. మైదానంలో నేను కీపర్గా ఐదు నిమిషాలు నిలబడిన సమయంలో ఒక్క గోల్ ఆపగలిగినా కూడా జట్టు విజయానికి నేను ఉపయోగపడినట్లే. అదే పట్టుదల ప్రతీ మ్యాచ్లో కనబరుస్తాను’ అని రజని తన గురించి చెప్పింది. బెస్ట్ గోల్కీపర్గా... అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన ఏడాదికే ప్రపంచ కప్లో పాల్గొనే భారత జట్టులో రజనికి అవకాశం లభించింది. అయితే ఈ టోర్నీలో జట్టు సమష్టి వైఫల్యం కారణంగా పెద్దగా గుర్తింపు లభించలేదు. అదే ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా జట్టులో భాగంగా ఉన్నా ఫలితం మాత్రం రాలేదు. అయితే 2013 మాత్రం ఆమె కెరీర్లో కీలకంగా నిలిచింది. ముందుగా ఆసియా కప్లో కాంస్యం సాధించిన జట్టులో భాగంగా ఉన్న రజని... కొద్ది రోజులకే జపాన్లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో సత్తా చాటింది. భారత్ రజత పతకం గెలవడంతో కీలక పాత్ర పోషించి ‘బెస్ట్ గోల్ కీపర్’ అవార్డును సొంతం చేసుకుంది. అయితే తర్వాతి ఏడాదే గాయంతో ఆమె జట్టుకు దూరమైంది. ‘గాయంతో ఆటకు దూరమై కోలుకుంటున్న సమయంలో తీవ్ర వేదన అనుభవించాను. అయితే అంతే పట్టుదలగా పోరాడి ఏడాదిలోపే మళ్లీ స్థానం సాధించాను. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్కు అర్హత సాధించిన జట్టులో ఉండటం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది’ అని రజని నాటి రోజులు గుర్తు చేసుకుంది. అదే లక్ష్యంతో... భారత జట్టులాగే రజని కెరీర్ కూడా ఆరంభంలో ఒడిదుడుకులకు లోనైంది. అయితే 2015లో ఎఫ్ఐహెచ్ వరల్డ్ లీగ్ రౌండ్ మొదలు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజయం, రియో ఒలింపిక్స్, ఆ తర్వాత వరల్డ్ లీగ్, తాజాగా ఆసియా కప్ టైటిల్... ఇలా జట్టు ప్రదర్శన ఆకట్టుకునేలా సాగుతోంది. వీటన్నింటిలో రజని భాగంగా ఉంది. తాజాగా ఆసియా కప్ విజయంతో భారత జట్టు వచ్చే ఏడాది లండన్లో జరిగే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించింది కూడా. ‘వచ్చే సంవత్సరం ప్రపంచకప్లాంటి పెద్ద టోర్నీలో బాగా ఆడటమే జట్టు లక్ష్యం. కొత్త కోచ్ హరీంద్ర సింగ్ జట్టును సమర్థంగా నడిపిస్తున్నారు. ఇక 2018లోనే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించాలని పట్టుదలగా ఉన్నాం. అయితే నా కెరీర్కు సంబంధించి అంతిమ లక్ష్యం 2020 టోక్యో ఒలింపిక్స్. అక్కడ పతకం గెలవగలిగితే కెరీర్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది’ అని రజని పేర్కొంది. 26 ఏళ్ల రజని ప్రస్తుతం సెంట్రల్ రైల్వే (ముంబై)లో జూనియర్ టికెట్ కలెక్టర్ (టీసీ)గా పని చేస్తోంది. స్పోర్ట్స్ కోటాలోనే ఆమెకు ఈ ఉద్యోగం దక్కింది. గత ఏడాది రియో ఒలింపిక్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు నగదు ప్రోత్సాహకం అందించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంచి ఉద్యోగాన్ని కూడా ఆమె ఆశిస్తోంది. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి భారత జట్టు తరఫున సుదీర్ఘ కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు ఇతరత్రా కూడా సహకారం అందించాలని కూడా రజని కోరుకుంటోంది. హాకీని ఎంచుకున్న సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. పురుషుల హాకీకే అంతంత మాత్రం గుర్తింపు లభిస్తున్నప్పుడు మహిళల హాకీ గురించి చెప్పేదేముంది. కానీ ఆటపై ఆసక్తి, సన్నిహితుల సహకారంతో గట్టిగా నిలబడ్డాను. మా ఊరు వెళ్లాలంటే ఇప్పటికీ కనీసం మూడు కిలోమీటర్ల నడక తప్పదు. కొన్నాళ్లుగా లభించిన గుర్తింపు వల్ల నేను టూర్ నుంచి వచ్చాక ఏదైనా వాహనం అందుబాటులో ఉంటోంది. అంతకుముందు నా కిట్ బ్యాగ్, లగేజీ చూసి కనీసం బస్సు కూడా ఆపకుండా వెళ్లిపోయేవాళ్లు. అలాంటప్పుడు ఎంత బాధ పడ్డానో! భారత జట్టులో సభ్యురాలే అయినా టోర్నీలు జరిగే సమయంలో రోజువారీ అలవెన్స్ మినహా మ్యాచ్ ఫీజులాంటివేమీ మాకు లేవు. కానీ హాకీపై పిచ్చిప్రేమతో ముందుకు వెళ్లాను. భారత జట్టు సభ్యురాలిగా ఉండటమే అన్నింటికంటే గర్వపడే విషయం. –‘సాక్షి’తో ఇతిమరపు రజని -
భారత్కు కొరియా సవాల్
ఢాకా: కొరకరాని కొరియాతో భారత హాకీ జట్టు ‘సూపర్ ఫోర్’ సమరానికి సిద్ధమైంది. ఆసియా కప్ హాకీలో కొత్తగా సెమీఫైనల్కు బదులుగా ఈ రౌండ్ రాబిన్ స్టేజ్ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ప్రపంచ ఆరో ర్యాంకర్ భారత్ తమ తొలి మ్యాచ్లో 13వ ర్యాంకులో ఉన్న దక్షిణ కొరియాను ఎదుర్కోనుంది. ఈ టోర్నమెంట్లో పూల్ ‘ఎ’లో భారత్ అజేయంగా లీగ్ దశను ముగించింది. వరుస విజయాలు సాధించడమే కాకుండా టీమిండియా ఆటగాళ్లు ప్రతీ మ్యాచ్లోనూ అసాధారణ ప్రదర్శన కనబరిచారు. కొత్త కోచ్ జోయెర్డ్ మరిన్ మార్గదర్శకంలో కుర్రాళ్లు రాణిస్తున్నారు. స్ట్రయికర్లు రమణ్దీప్ సింగ్, ఆకాశ్దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, చింగ్లేన్సన సింగ్ దూకుడు కనబరుస్తున్నారు. వీళ్లతో పాటు మిడ్ఫీల్డర్లు సర్దార్ సింగ్, కెప్టెన్ మన్ప్రీత్ సింగ్లతో భారత్ ఇప్పుడు అత్యంత పటిష్టంగా ఉంది. అయితే అందివచ్చిన పెనాల్టీ కార్నర్లను గోల్గా మలచలేకపోవడంపై కోచ్ మరిన్ దృష్టిపెట్టారు. మరోవైపు కొరియా పూల్ ‘బి’లో రెండో స్థానంలో నిలువడం ద్వారా సూపర్ ఫోర్కు చేరింది. గతంలో భారత్కు చేడు ఫలితాలిచ్చిన అనుభవం కొరియాది. అటాకింగ్ గేమ్లో, మ్యాచ్ ముగిసే దశలో కొరియన్ల ఆటతీరు ప్రమాదకరంగా ఉంటుంది. భారత్ ఫామ్ దృష్ట్యా దక్షిణ కొరియాను ఓడించే సత్తా ఉన్నప్పటికీ అదేమంత సులభం మాత్రం కాదు. మరో సూపర్ ఫోర్ మ్యాచ్లో పూల్ ‘బి’ టాపర్ మలేసియాతో పాకిస్తాన్ తలపడనుంది. ►సాయంత్రం 5 గం. నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
మరో భారీ విజయంపై దృష్టి
ఢాకా: తొలి మ్యాచ్లో జపాన్పై 5–1తో నెగ్గిన భారత హాకీ జట్టు అదే జోరులో మరో భారీ విజయంపై దృష్టి పెట్టింది. ఆసియా కప్లో భాగంగా శుక్రవారం జరిగే పూల్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్లో ఆతిథ్య బంగ్లాదేశ్తో టీమిండియా తలపడుతుంది. కొత్త కోచ్ మారిన్ జొయెర్డ్ ఆధ్వర్యంలో తొలి టోర్నీ ఆడుతోన్న భారత్ మొదటి మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. సునీల్, లలిత్ ఉపాధ్యాయ్, రమణ్దీప్ సింగ్, ఆకాశ్దీప్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్ మంచి సమన్వయంతో ఆడుతూ వరుస విరామాల్లో గోల్స్ చేశారు. అదే జోరును బంగ్లాదేశ్పై పునరావృతం చేస్తే మన ఖాతాలో మరో విజయం చేరడం ఖాయమే. -
మహిళల కోచ్ పురుషులకు...
భారత హాకీ జట్టు చీఫ్ కోచ్గా జియోర్డ్ మరీజినే ►హాకీ ఇండియా ఆశ్చర్యకర నిర్ణయం ►2020 ఒలింపిక్స్ వరకు బాధ్యతలు ►మాజీల విమర్శ న్యూఢిల్లీ: పురుషుల సీనియర్ హాకీ జట్టు కొత్త కోచ్ ఎంపికపై హాకీ ఇండియా (హెచ్ఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు కోచ్గా వ్యవహరిస్తున్న జియోర్డ్ మరీజినేను పురుషుల సీనియర్ జట్టుకు ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. నెదర్లాండ్స్కు చెందిన మరీజినేకు గతంలో ఏ పురుషుల సీనియర్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన అనుభవం లేదు. ఈ బాధ్యతల కోసం హెచ్ఐ ఇటీవలే తమ వెబ్సైట్లో దరఖాస్తులను కోరుతూ ఈనెల 15న తుది గడువు విధించింది. అయితే అంతలోనే మనసు మార్చుకుని నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంది. కొన్ని నెలలుగా హాకీ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నెదర్లాండ్స్కే చెందిన రోలంట్ ఓల్ట్మన్స్ను కోచ్ పదవి నుంచి హాకీ ఇండియా తొలగించించింది. మరోవైపు జూనియర్ టీమ్ కోచ్గా ఉన్న హరేంద్ర సింగ్ను మహిళల సీనియర్ జట్టు హై పెర్ఫామెన్స్ స్పెషలిస్ట్ కోచ్గా నియమించారు. హరేంద్ర సింగ్కు గతంలో ఏ స్థాయిలోనూ మహిళల జట్టుకు కోచింగ్ ఇచ్చిన అనుభవం లేకపోవడం కూడా మరో ఆశ్చర్యకర విషయం. గురువారం సాయ్, హాకీ ఇండియా మధ్య జరిగిన సంయుక్త సమావేశంలో ఈ ఎంపిక జరిగిందని క్రీడా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రెండు నిర్ణయాలను క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ట్విట్టర్లో వెల్లడించారు. తొలిసారి ఫెడరేషన్నుంచి కాకుండా క్రీడా మంత్రి కోచ్ పేరును ప్రకటించడం కూడా అనూహ్యం. కోచ్లు ఇద్దరూ 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్ వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ముందుగా ఇష్టపడలేదు.. పురుషుల జట్టు కోచ్గా ఉండేందుకు ముందుగా 43 ఏళ్ల మరీజినే అంతగా ఇష్టపడలేదని సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన మహిళల జట్టు కోచ్గా ఎంపికయ్యారు. అయితే హెచ్ఐ, ‘సాయ్’ మాత్రం అతడినే తగిన వ్యక్తిగా భావించి తనే ఉత్తమ అభ్యర్థిగా నిర్ణయించి చివరికి ఒప్పించగలిగారు. కానీ రాబోయే 16 నెలల కాలంలో భారత జట్టు కామన్వెల్త్, ఆసియా గేమ్స్తో పాటు ప్రపంచకప్ టోర్నీల్లో ఆడాల్సి ఉంది. దీంతో ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆయన జట్టును ఎలా ముందుకు తీసుకెళతారనే చర్చ ప్రారంభమైంది. అయితే ఆయన ఆధ్వర్యంలోనే నెదర్లాండ్స్ మహిళల అండర్–21 జట్టు ప్రపంచకప్, సీనియర్ మహిళల జట్టు హాకీ వరల్డ్ లీగ్ సెమీస్ (2015)లో స్వర్ణం సాధించింది. 2011–14 వరకు నెదర్లాండ్స్ అండర్–21 పురుషుల జట్టుకు కోచ్గా పనిచేశారు. నిజానికి పురుషుల జట్టుతో హరేంద్ర సింగ్కు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే తను ఈ పదవిపై కూడా ఆశపడ్డారు. గతేడాది ఆయన ఆధ్వర్యంలోనే జూనియర్ జట్టు ప్రపంచకప్ను నెగ్గింది. కొత్త కోచ్ ఎంపికపై మాజీల విమర్శలు సీనియర్ పురుషుల జట్టు కోచ్గా మరీజినే నియామకంపై హాకీ మాజీ ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. ఇది హాకీ ఇండియా మతిలేని నిర్ణయంగా మాజీ కెప్టెన్ అజిత్పాల్ సింగ్ అభివర్ణించారు. ‘నా దృష్టిలో ఇదో చెత్త నిర్ణయం. మరీజినేకు గతంలో సీనియర్ పురుషుల జట్టుతో పనిచేసిన అనుభవం లేదు. పైగా భారత ఆటగాళ్ల గురించి పెద్దగా ఆయనకేమీ తెలీదు. ఇక హరేంద్ర సింగ్ను తీసుకెళ్లి మహిళా జట్టు బాధ్యతలు ఇచ్చారు. ఆయనకు కూడా వారితో కలిసి పనిచేసిన అనుభవం లేదు. ఇప్పటికే ఒలింపిక్స్కు సిద్ధమయ్యే ప్రక్రియ ప్రారంభమైంది. వారు సెటిల్ కావాలంటే తగిన సమయం కావాల్సి ఉంటుంది. నిజానికి ఓల్ట్మన్స్ హయాంలో భారత జట్టు చాలా మెరుగైంది. ఆయన ఉద్వాసన సరైనది కాదు. హాకీ వరల్డ్ లీగ్ సెమీస్లో మలేసియా, కెనడా జట్లతో ఓటమి ఆయనపై ప్రభావం చూపినట్టుంది’ అని అజిత్పాల్ తెలిపారు. అలాగే మరీజినే కన్నా హరీందర్ సింగ్ కోచ్గా ఉంటే బావుండేదని మాజీ ఆటగాడు ధన్రాజ్ పిళ్లై అభిప్రాయపడ్డారు. హాకీ ఇండియా కేవలం విదేశీ కోచ్లంటేనే ఇష్టపడుతోందని అన్నారు. దరఖాస్తుల ఆహ్వానం పేరిట హెచ్ఐ డ్రామా ఆడిందని, చాలా మంది ఔత్సాహికులు కోచ్ పదవిపై ఆశపడ్డారని మరో మాజీ ఆటగాడు జఫర్ ఇక్బాల్ అన్నారు. -
విజయంతో ముగించారు
ఆస్ట్రియాపై 4–3తో నెగ్గిన భారత్ అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): తమ యూరోప్ పర్యటనను భారత హాకీ జట్టు విజయవంతంగా ముగించింది. గురువారం ఆస్ట్రియాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో టీమిండియా 4–3తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున రమణ్దీప్ సింగ్ (25వ, 32వ నిమిషాల్లో), చింగ్లెన్సన సింగ్ (37వ, 60వ నిమిషాల్లో) రెండేసి గోల్స్తో చెలరేగారు. టూర్ ఆరంభంలో బెల్జియం చేతిలో వరుసగా రెండు పరాజయాలు ఎదురైనా... ఆ తర్వాత ప్రపంచ నాలుగో ర్యాంకర్ నెదర్లాండ్స్పై భారత్ రెండు విజయాలు సాధించి సిరీస్ను 2–0తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
భారత హాకీ జోరుగా...
రెండో మ్యాచ్లోనూ నెదర్లాండ్స్పై విజయం 2–0తో సిరీస్ సొంతం ఆమ్స్టర్డామ్: యూరోప్ పర్యటనలో భారత హాకీ జట్టుకు చక్కటి విజయం లభించింది. ప్రపంచ నాలుగో ర్యాంకర్ నెదర్లాండ్స్తో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్ను భారత్ 2–0తో సొంతం చేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 2–1 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ను బోల్తా కొట్టించింది. భారత జట్టులో 9 మంది జూనియర్ ఆటగాళ్లు ఉన్నా... పటిష్టమైన నెదర్లాండ్స్పై మనదే పైచేయి కావడం విశేషం. 4వ నిమిషంలో గుర్జంత్ సింగ్, 51వ నిమిషంలో మన్దీప్ సింగ్ ఒక్కో గోల్ చేసి భారత్ను విజేతగా నిలిపారు. మ్యాచ్ నాలుగో నిమిషంలో వరుణ్ డ్రాగ్ ఫ్లిక్ ద్వారా గోల్ చేసే ప్రయత్నం చేయగా డచ్ కీపర్ దానిని అడ్డుకున్నాడు. అయితే రీబౌండ్లో రివర్స్ స్టిక్తో బంతిని పోస్ట్లోకి పంపించిన గుర్జంత్ అంతర్జాతీయ హాకీలో తన తొలి గోల్ నమోదు చేశాడు. ఆ తర్వాత భారత్ పదే పదే ప్రత్యర్థిపై ఎదురుదాడి చేసింది. అర్మాన్ ఖురేషీకి గోల్ చేసేందుకు మంచి అవకాశం వచ్చినా... దురదృష్టవశాత్తూ బంతి గోల్పోస్ట్కు కాస్త దూరంగా వెళ్లింది. చివరి క్వార్టర్లో పెనాల్టీని మన్దీప్ గోల్గా మలచడంతో ఆధిక్యం 2–0కు పెరిగింది. చివరకు 58వ నిమిషంలో నెదర్లాండ్స్ ఆటగాడు సాండర్ గోల్ సాధించినా... అది ఆ జట్టును పరాజయం నుంచి కాపాడలేకపోయింది. -
భారత హాకీ జట్టుకు మలేసియాలో సత్కారం
ఇపో: సుల్తాన్ అజ్లాన్ షా కప్ టోర్నీలో భారత్ కాంస్య పతకం సాధించిన సందర్భంగా మలేసియాలోని ఇండియన్ ఎంబసీ, ప్రవాస భారతీయులు, మలేసియా తెలంగాణ అసోసియేషన్ సభ్యులు భారత హాకీ ప్లేయర్లకు విందును ఏర్పాటు చేశారు. ఇపోలోని స్పైస్ గార్డెన్స్లో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్లేయర్లకు చిన్నపాటి కానుకలు అందజేసి సత్కరించారు. టోర్నీలో అద్భుతంగా ఆడిన ప్లేయర్లకు అభినందనలు తెలియజేశారు. -
చోటు కోసం పోటీ పెరిగింది
బెంగళూరు: భారత హాకీ జట్టులో చోటు కోసం సీనియర్, జూనియర్ ఆటగాళ్ల మధ్య ఆరోగ్యకర పోటీ ఉండడం శుభసూచకమేనని కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ అన్నాడు. జూనియర్ ఆటగాళ్లకు మెంటార్గా తగిన సలహాలివ్వాల్సిన అవసరం సీనియర్ ఆటగాళ్లకు ఉందని అభిప్రాయపడ్డాడు. అలాగే జట్టులో చోటు కోసం వారు కూడా కఠినంగా శ్రమించాల్సి ఉంటుందని చెప్పాడు. ‘ప్రాబబుల్స్లో చాలా మంది జూనియర్ ఆటగాళ్లు కూడా ఉంటున్నారు. ఇది శుభపరిణామం. జాతీయ జట్టులో చోటు కోసం సీనియర్లు కూడా వీరితో పోటీపడాల్సి వస్తోంది. అయితే శిక్షణ శిబిరంలో జూనియర్ ఆటగాళ్లు తమ ప్రతిభకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం నిరంతరం శ్రమిస్తుండాలి. జాతీయ జట్టులో తాము చోటు దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలి. ఇక సీనియర్ ఆటగాళ్లు తమ ఫిట్నెస్ కాపాడుకుంటూ జూనియర్లకు పోటీ ఇవ్వగల స్థాయిలో ఉండాలి. 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్ కోసం జూనియర్ ఆటగాళ్లే భవిష్యత్గా చెప్పవచ్చు. అయితే చోటు అదే వస్తుందిలే అనే భావన లేకుండా శ్రమించి సాధించుకోవాల్సిన అవసరం ఉంది’ అని జాతీయ శిబిరంలో పాల్గొన్న శ్రీజేష్ పేర్కొన్నాడు. -
భారత హాకీ జట్టుకు ఘనస్వాగతం
బెంగళూరు: చిరకాల శత్రువు పాకిస్తాన్ను ఓడించి ఆసియా చాంపియన్స ట్రోఫీ నెగ్గిన భారత హాకీ జట్టుకు స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. జట్టు కెప్టెన్ పీఆర్ శ్రీజేష్, నికిన్ తిమ్మయ్య గత రాత్రి కౌలాలంపూర్ నుంచి బెంగళూరు చేరుకున్నారు. వీరికి విమానాశ్రయంలో అభిమానుల నుంచి భారీ ఆదరణ లభించింది. మరోవైపు ఈ విజయాన్ని ఉడీ ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమర జవాన్ల కుటుంబాలకు అంకితమిస్తున్నట్టు శ్రీజేష్ తెలిపాడు. ‘భారత సైనికులకు దీపావళి బహుమతిగా ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. కచ్చితంగా వారు ఈ విజయాన్ని చూసి పొంగిపోరుు ఉంటారు. పాక్తో ఆడేటప్పుడు మాలో భావోద్వేగాలున్నా మ్యాచ్పై ఎక్కువగా దృష్టి పెట్టాం. అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాం. మొత్తం ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలు, ఓ డ్రా చేసుకున్న భారత జట్టు ఆసియా స్థారుులో అత్యంత పటిష్టంగా ఉంది’ అని శ్రీజేష్ పేర్కొన్నాడు. -
కొరియాతో భారత్ అమీతుమీ
ఆసియా చాంపియన్ ట్రోఫీ హాకీ సెమీస్ నేడు క్వాంటన్ (మలేసియా): లీగ్ దశలో కనబరిచిన జోరును నాకౌట్ మ్యాచ్లోనూ పునరావృతం చేయాలనే పట్టుదలతో భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స ట్రోఫీ సెమీస్కు సమాయాత్తం అరుుంది. దక్షిణ కొరియాతో శనివారం జరిగే మ్యాచ్లో భారత్ తలపడనుంది. లీగ్ దశలో కొరియాతో జరిగిన మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న భారత్ ఈ నాకౌట్ పోరులో మాత్రం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కెప్టెన్, గోల్కీపర్ శ్రీజేష్ గాయం నుంచి కోలుకోకపోవడం, డిఫెండర్ సురేందర్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడటం భారత శిబిరానికి ఆం దోళన కలిగిస్తోంది. అరుుతే రూపిందర్ పాల్ సింగ్, జస్జీత్, ఆకాశ్దీప్, రమణ్దీప్ సింగ్, సర్దార్ సింగ్ సమన్వయంతో ఆడితే మాత్రం భారత్కు విజయం దక్కడం కష్టమేమీకాదు. శ్రీజేష్ స్థానంలో గోల్కీపింగ్ చేస్తున్న ఆకాశ్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. మలేసియా తో జరిగిన మ్యాచ్లో చివరి సెకన్లలో ఆకాశ్ ప్రత్యర్థి జట్టు పెనాల్టీ కార్నర్ను అడ్డుకున్నాడు. ‘కొరియా శక్తి అంతా వారి డిఫెన్సలోనే ఉంది. వారి రక్షణశ్రేణిని దాటుకొని ముందుకు వెళ్లడంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది’ అని భారత కోచ్ ఒల్ట్మన్స అన్నారు. మరో సెమీఫైనల్లో పాకిస్తాన్తో మలేసియా ఆడుతుంది. ఆదివారం ఫైనల్ జరుగుతుంది. -
భారత్ను గెలిపించిన రూపిందర్
మలేసియాపై విజయంతో అగ్రస్థానం ఆసియా హాకీ చాంపియన్స ట్రోఫీ క్వాంటన్ (మలేసియా): అందుబాటులో ఉన్న కొందరు అగ్రశ్రేణి ఆటగాళ్లతోనే బరిలోకి దిగినప్పటికీ ఆసియా చాంపియన్స ట్రోఫీ టోర్నమెంట్లో భారత హాకీ జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. ఆతిథ్య మలేసియా జట్టుతో బుధవారం జరిగిన చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. రూపిందర్ పాల్ సింగ్ (12వ, 57వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. మలేసియా జట్టుకు రజీ రహీమ్ 18వ నిమిషంలో ఏకై క గోల్ను అందించాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో రూపిందర్ 10 గోల్స్ చేయడం విశేషం. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో లీగ్ దశలో భారత్ నాలుగు విజయాలు, ఒక ‘డ్రా’తో కలిపి మొత్తం 13 పారుుంట్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది. ఇప్పటికే సెమీస్కు చేరుకున్న టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరో గురువారం చివరి రౌండ్ లీగ్ మ్యాచ్లు ముగిశాక తెలుస్తుంది. శుక్రవారం విశ్రాంతి దినం తర్వాత శనివారం సెమీఫైనల్స్ జరుగుతారుు. గురువారం జరిగే లీగ్ మ్యాచ్ల్లో పాకిస్తాన్తో చైనా; దక్షిణ కొరియాతో మలేసియా తలపడతారుు. మలేసియా 9 పారుుంట్లతో రెండో స్థానంలో, కొరియా 7 పారుుంట్లతో మూడో స్థానంలో, 6 పారుుంట్లతో పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉన్నారుు. ప్రస్తుత సమీకరణాల ప్రకారం కొరియా లేదా పాకిస్తాన్తో భారత్ సెమీస్లో ఆడే అవకాశాలున్నారుు. మలేసియాతో జరిగిన మ్యాచ్లో చివరి 27 సెకన్లలో భారత్ పెనాల్టీ కార్నర్ను సమర్పించుకుంది. అరుుతే మలేసియా ప్లేయర్ రజీ రహీమ్ డ్రాగ్ ఫ్లిక్ స్కూప్ షాట్ను భారత గోల్కీపర్ ఆకాశ్ నిలువరించి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. -
భారత హాకీ జట్టు ఆశలు ఆవిరి
క్వార్టర్ ఫైనల్లో బెల్జియం చేతిలో ఓటమి రియో డి జనీరో: రక్షణ శ్రేణిలో లోపాలు... ఫార్వర్డ్ శ్రేణిలో దూకుడు లోపించడంతో... రియో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 1-3 గోల్స్ తేడాతో బెల్జియం చేతిలో ఓడిపోయింది. బెల్జియం 96 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్ హాకీలో సెమీఫైనల్కు చేరుకుంది. ఆట 15వ నిమిషంలో ఆకాశ్దీప్ సింగ్ చేసిన గోల్తో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్ ముగిసేవరకు భారత్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. అయితే మూడో క్వార్టర్లో బెల్జియం ఆటగాళ్లు దూకుడు పెంచారు. వరుస దాడులతో భారత్పై ఒత్తిడి పెంచారు. 34వ, 45వ నిమిషాల్లో సెబాస్టియన్ డాకీర్ రెండు గోల్స్ చేయడంతో బెల్జియం 2-1తో ఆధిక్యాన్ని సంపాదించింది. 50వ నిమిషంలో టామ్ బూన్ గోల్తో బెల్జియం 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. -
స్వర్ణం నా చివరి కోరిక: బల్బీర్
చండీగఢ్: శ్రీజేశ్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు ఒలింపిక్ పతకం సాధిస్తుందనే నమ్మకముందని హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. హాకీ జట్టు ఒలింపిక్స్ స్వర్ణం సాధిస్తే చూడాలనేదే తన చివరి కోరికని ఈ 92 ఏళ్ల మాజీ క్రీడాకారుడు పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక వరుసగా మూడు ఒలింపిక్స్లో (1948, 1952, 1956) పసిడిని సాధించిన హాకీ జట్టులో బల్బీర్ సభ్యుడు. అంతేకాకుండా భారత హాకీ జట్టుకు చీఫ్ కోచ్గా, మేనేజర్గా సేవలందించారు. -
'ఈసారి ఒలింపిక్స్ పతకం ఖాయం'
ముంబై: భారత పురుషుల హాకీ జట్టుపై మాజీ కెప్టెన్ ధన్రాజ్ పిళ్లై ప్రశంసలు కురిపించాడు. ఇటీవల కాలంలో విశేషమైన ఆట తీరుతో అదరగొట్టిన భారత జట్టు చరిత్రను తిరగరాయడానికి సిద్ధంగా ఉందని కొనియాడాడు. గత నాలుగు ఒలింపిక్స్ల్లో భారత్కు అందని ద్రాక్షగా ఉన్న పతకం ఈసారి ఖాయమన్నాడు. 'భారత జట్టుకు ముందుగా అభినందనలు. చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కు చేరి తొలిసారి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఫైనల్లో వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు గట్టిపోటీ ఇచ్చారు. భారత ప్రదర్శన అమోఘం. గెలుపు, ఓటములు అనేవి ఆటలో సహజం. నేను ఆడేటప్పుడు ఎప్పుడూ కూడా భారత జట్టు ఇంత నిలకడగా లేదు. ఫీల్డ్లో 70 నిమిషాల పాటు అత్యంత నిలకడతో భారత జట్టు ఆకట్టుకుంది. గతంలో ఆస్ట్రేలియాను వారి దేశంలోనే ఓడించాం. అయినప్పటికీ దాని కంటే మొన్న జరిగిన ఫైనల్లో ఆడిన తీరే అబ్బురపరిచింది. భారత జట్టు ప్రస్తుత ఆట తీరు చూస్తుంటే రియో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టుకు పతకం ఖాయం'అని ధనరాజ్ పిళ్లై అభిప్రాయపడ్డాడు. -
‘ఫైనల్ బెర్త్’ సాధించేనా?
* నేడు ఆస్ట్రేలియాతో భారత్ పోరు * చాంపియన్స్ ట్రోఫీ హాకీ లండన్: మూడున్నర దశాబ్దాలుగా ఊరిస్తోన్న చాంపియన్స్ ట్రోఫీ ‘ఫైనల్ బెర్త్’ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు భారత హాకీ జట్టు నేడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ను డ్రా గా ముగించినా భారత్కు ఫైనల్లో తలపడే అవకాశాలు సజీవంగానే ఉంటాయి. ఒకవేళ భారత్ ఓడి తర్వాత జరిగే మ్యాచ్లో బ్రిటన్... బెల్జియంపై నెగ్గితే భారత్ మూడో స్థానంలో నిలుస్తుంది. ఈ సందర్భంలో భారత్ కాంస్య పతకం కోసం పోరాడాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో 10 పాయింట్లతో ఆసీస్ మొదటి స్థానంలో ఉండగా, 7 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. బ్రిటన్ (5పాయింట్లు), బెల్జియం (4 పాయింట్లు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
ఫైనల్లో భారత్కు నిరాశ
ఇఫో(మలేషియా): సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ తుది పోరులో భారత జట్టు చతకిలబడింది. శనివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ 0-4 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. లీగ్ దశలో ఆసీస్ చేతిలో ఘోర పరాజయ చవిచూసిన భారత్ అదే ఆటను ఫైనల్లో పునరావృతం చేసి రన్నరప్గా సరిపెట్టుకుంది. ఆసీస్ ఆటగాళ్లలో థామస్ విలియమ్స్ క్రెయిగ్(29వ, 35 వ నిమిషాల్లో), మాట్ గోడ్స్(43వ, 58వ నిమిషాల్లో) గోల్స్ సాధించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. దీంతో ఆసీస్ తొమ్మిదో సారి టైటిల్ ను కైవసం చేసుకుంది. తొలి క్వార్టర్లో పటిష్టమైన ఆసీస్ ను భారత్ నిలువరించడంతో ఎటువంటి గోల్ నమోదు కాలేదు. కాగా ఆ తరువాత విజృంభించిన ఆసీస్ రెండో క్వార్టర్ లో రెండు గోల్స్ చేసి ఆధిక్యం సాధించింది. ఆపై మూడో క్వార్టర్ లో ఒక గోల్, చివరి క్వార్టర్ లో మరో గోల్ సాధించడంతో ఆసీస్ విజయం సంపూర్ణమైంది. -
భారత్ తడాఖా...
♦ మలేసియాపై 6-1తో గెలుపు ♦ అజ్లాన్ షా కప్లో ఫైనల్కి చేరిక ♦ నేడు ఆస్ట్రేలియాతో టైటిల్ పోరు ఇపో (మలేసియా): తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో భారత హాకీ జట్టు తమ తడాఖా చూపించింది. ఆతిథ్య మలేసియా జట్టును హడలెత్తించింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన టీమిండియా 6-1 గోల్స్ తేడాతో మలేసియా జట్టును చిత్తుగా ఓడించింది. తద్వారా సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో ఆరోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున నికిన్ తిమ్మయ్య (3వ నిమిషంలో), హర్జీత్ సింగ్ (7వ ని.లో), డానిష్ ముజ్తబా (27వ ని.లో), తల్విందర్ సింగ్ (50వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... రమణ్దీప్ సింగ్ (25వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. మలేసియా జట్టుకు షారిల్ సబా (46వ ని.లో) ఏకైక గోల్ను అందించాడు. శుక్రవారం జరిగిన ఇతర లీగ్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా 3-0తో కెనడాపై, పాకిస్తాన్ 4-1తో జపాన్పై గెలిచాయి. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాక ఆస్ట్రేలియా ఆరు మ్యాచ్ల్లోనూ గెలిచి 18 పాయిం ట్లతో అగ్రస్థానంలో నిలువగా... 12 పాయింట్ల తో భారత్ రెండో స్థానాన్ని సంపాదించింది. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచినందుకు శనివారం జరిగే టైటిల్ పోరులో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. 3-4 స్థానాల కోసం జరిగే మ్యాచ్లో మలేసియాతో న్యూజిలాండ్; 5-6 స్థానాల కోసం జరిగే మ్యాచ్లో కెనడాతో పాకిస్తాన్ తలపడతాయి. ఆడిన ఆరు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన జపాన్ చివరిదైన ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. 33 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత్ ఐదుసార్లు విజేతగా నిలువగా.. ఒకసారి రన్నరప్గా, ఆరుసార్లు మూడో స్థానంలో నిలిచింది. 2010 తర్వాత టీమిండియా ఈ టోర్నీలో ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. ఫైనల్కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ సమష్టిగా ఆడి సత్తా చాటుకుంది. గతేడాది మలేసియా చేతిలో కీలక మ్యాచ్లో ఓడిపోయి ఫైనల్ అవకాశాలను చేజార్చుకున్న టీమిండియా ఈసారి ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మూడో నిమిషంలోనే తిమ్మయ్య గోల్తో భారత్ ఖాతా తెరిచింది. నాలుగు నిమిషాలు గడిచాక హర్జీత్ సింగ్ రివర్స్ షాట్తో భారత్కు రెండో గోల్ను అందించాడు. రెండో క్వార్టర్లోనూ భారత ఆటగాళ్లు చురుకైన కదలికలతో అవకాశం దొరికినపుడల్లా మలేసియా రక్షణ వలయంలోకి దూసుకెళ్లారు. ఫలితంగా రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించారు. మూడో క్వార్టర్లో మరో గోల్ను చేసిన సర్దార్ సింగ్ బృందం, చివరి క్వార్టర్లోనూ మరో గోల్ చేసింది. రెండు గోల్స్ సాధించిన రమణ్దీప్ సింగ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది. సాయంత్రం గం. 6.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
భారత్ను ఆదుకున్న ఆకాశ్దీప్
జర్మనీని నిలువరించిన టీమిండియా హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ రాయ్పూర్: తొలి మ్యాచ్లో నిరాశపరిచిన భారత హాకీ జట్టు రెండో మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేసింది. హాకీ వరల్డ్ లీగ్ (హెచ్డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్లో భాగంగా ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో శనివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్ను భారత్ 1-1తో ‘డ్రా’గా ముగించింది. ఆట ఆరో నిమిషంలో నిక్లాస్ వెలెన్ గోల్తో జర్మనీ ఖాతా తెరువగా... భారత్ తరఫున 47వ నిమిషంలో ఆకాశ్దీప్ సింగ్ గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఆట మొదలైన తొలి నిమిషం నుంచే సమన్వయంతో ఆడుతూ జర్మనీ గోల్పోస్ట్పై దాడులు చేశారు. మూడో నిమిషంలో భారత్కు గోల్ చేసే అవకాశం వచ్చినా చింగ్లెన్సనా సింగ్ కొట్టిన షాట్ను జర్మనీ గోల్కీపర్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత సర్దార్ సింగ్ అందించిన పాస్ను ‘డి’ ఏరియాలో తల్వీందర్ సింగ్ అందుకోలేకపోయాడు. అయితే జర్మనీ జట్టు కూడా దూకుడుగా ఆడేందుకే ప్రయత్నించింది. ఆరో నిమిషంలో మథియాస్ ముల్లర్ ముగ్గురు భారత ఆటగాళ్లను తప్పిస్తూ కుడి వైపు నుంచి దూసుకెళ్లి ‘డి’ ఏరియాలో సహచరుడు నిక్లాస్ వెలెన్కు పాస్ ఇచ్చాడు. నిక్లాస్ మిగతా కార్యాన్ని పూర్తి చేసి జర్మనీకి తొలి గోల్ను అందించాడు. గోల్ సమర్పించుకున్నప్పటికీ భారత ఆటగాళ్లు డీలా పడకుండా ఉత్సాహంతో ఆడారు. ఫినిషింగ్ లోపం వెంటాడినా చివరకు ఆకాశ్దీప్ గోల్తో భారత్ స్కోరును సమం చేయగలిగింది. మంగళవారం జరిగే లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్తో భారత్ తలపడుతుంది. -
భారత్ జోరు కొనసాగేనా?
రాయ్పూర్: ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతున్న భారత హాకీ జట్టు మరో ప్రతిష్టాత్మక పోరుకు సిద్ధమవుతోంది. నేటి (శుక్రవారం) నుంచి జరిగే హాకీ వరల్డ్ లీగ్ (హెచ్డబ్ల్యుఎల్) ఫైనల్స్ టోర్నీ ప్రారంభ మ్యాచ్లో అర్జెంటీనాతో ఢీకొననుంది. ప్రపంచ స్థాయిలో టాప్-8 దేశాల జట్లు పాల్గొనే ఈ టోర్నీకి రాయ్పూర్లో కొత్తగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత్ జట్టు ఇటీవలి కివీస్ పర్యటనలో ఆతిథ్య జట్టును 2-1తో ఓడించి జోరు మీదుంది. ప్రస్తుత టోర్నీలో బలమైన జట్లు ఉన్న పూల్ ‘బి’లో భారత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది. ఇదే గ్రూపులో ప్రపంచ రెండవ ర్యాంకులో ఉన్న నెదర్లాండ్స్, జర్మనీ (3వ ర్యాంకు), అర్జెంటీనా (5వ ర్యాంక్) ఉన్నాయి. 18 మందితో కూడిన భారత జట్టుకు డిఫెండర్లు బీరేంద్ర లక్రా, వీఆర్ రఘునాథ్, రూపిందర్ పాల్ సింగ్ కీలకం కానున్నారు. మిడ్ఫీల్డ్లో సర్దార్, దేవేందర్ వాల్మీకి, మన్ప్రీత్ సింగ్, ధరమ్వీర్ సింగ్, ముజ్తబా.. అటాకింగ్లో ఎస్వీ సునీల్, రమన్దీప్ సింగ్, ఆకాశ్దీప్ సింగ్ సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా పూర్తి స్థాయిలో రాణిస్తే అర్జెంటీనాపై పైచేయి సాధించొచ్చు. ఈ టోర్నీలో ఆడే దేశాలన్నీ ఒలింపిక్స్కు అర్హత సాధించినవే కావడంతో ప్రత్యర్థుల బలాబలాలపై అంచనాకు రానున్నాయి. -
సర్దార్ సింగ్కే పగ్గాలు
కివీస్ పర్యటనకు భారత హాకీ జట్టు ప్రకటన న్యూఢిల్లీ : న్యూజిలాండ్తో జరిగే ఆరు మ్యాచ్ల హాకీ సిరీస్లో పాల్గొనే భారత పురుషుల జట్టును ప్రకటించారు. 21 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి సర్దార్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. గోల్ కీపర్ శ్రీజేష్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. అక్టోబరు 2 నుంచి 11 వరకు జరిగే ఈ పర్యటనలో ఆక్లాండ్, నెల్సన్, క్రైస్ట్చర్చ్ నగరాల్లో మ్యాచ్లను నిర్వహిస్తారు. తొలి రెండు మ్యాచ్లను న్యూజిలాండ్ ‘ఎ’తో ఆడనున్న భారత్, తర్వాతి నాలుగు మ్యాచ్లను న్యూజిలాండ్ జాతీయ జట్టుతో తలపడుతుంది. స్థానిక మేజర్ ధ్యాన్చంద్ జాతీయ స్టేడియంలో నిర్వహించిన శిక్షణ శిబిరం అనంతరం ఈ జట్టును ఎంపిక చేశారు. ‘గత రెండు వారాల్లో సమన్వయం, పాస్లు ఇచ్చి పుచ్చుకోవడం అంశాలపై సాధన చేశాం. ‘డి’ ఏరియాలోకి వెళితే గోల్ చేసే అవకాశాలను వదులుకోవద్దనే అంశంపై కూడా కసరత్తు చేశాం’ అని హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్, జట్టు చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్మన్స్ తెలిపారు. భారత హాకీ జట్టు: పీఆర్ శ్రీజేష్, హర్జోత్ సింగ్ (గోల్ కీపర్లు), బీరేంద్ర లాక్రా, కొతాజిత్ సింగ్, వీఆర్ రఘునాథ్, జస్జీత్ సింగ్ కులార్, రూపిందర్ పాల్ సింగ్, గుర్జిందర్ సింగ్ (డిఫెండర్లు), సర్దార్ సింగ్, చింగ్లెన్సనా సింగ్, ఎస్కే ఉతప్ప, సత్బీర్ సింగ్, దేవిందర్ వాల్మీకి, మన్ప్రీత్ సింగ్, ధరమ్వీర్ సింగ్ (మిడ్ ఫీల్డర్లు), ఎస్వీ సునీల్, రమణ్దీప్ సింగ్, ఆకాశ్దీప్ సింగ్, మన్దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, నికిన్ తిమ్మయ్య (ఫార్వర్డ్స్). -
న్యూజిలాండ్తో హాకీ టెస్టు సిరీస్
ఆరు మ్యాచ్లు ఆడనున్న భారత్ న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న రియో ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా భారత హాకీ జట్టు... న్యూజి లాండ్తో ఆరు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 2 నుంచి 11 వరకు ఆక్లాండ్, నెల్సన్, క్రైస్ట్చర్చ్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. తొలి రెండు మ్యాచ్లు కివీస్ ‘ఎ’ జట్టుతో మిగతా నాలుగు సీనియర్ టీమ్తో జరుగుతాయని హాకీ ఇండియా (హెచ్ఐ) వెల్లడించింది. ఈ ఏడాది చివర్లో రాయ్పూర్లో జరగనున్న ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్కు సిద్ధమయ్యేందు కూడా ఈ టోర్నీని ఉపయోగించుకోనున్నారు. 2009 తర్వాత భారత పురుషుల జట్టు కివీస్లో పర్యటించడం ఇదే తొలిసారి. -
భారత హాకీ జట్టుకు నిరాశ
చాంగ్జౌ (చైనా) : జూనియర్ మహిళల ఆసియా కప్లో భారత జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆదివారం మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత్ 2-3 గోల్స్ తేడాతో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. దీంతో వచ్చే సంవత్సరం జరగనున్న జూనియర్ వరల్డ్ కప్కు టీమిండియా అర్హత సాధించలేకపోయింది. భారత్ తరఫున నమితా టోపో, లిలిమా మిన్జ్లు గోల్స్ చేశారు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ చైనా మరోసారి టైటిల్ను నిలబెట్టుకుంది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో చైనా పెనాల్టీ షూటౌట్లో 3-1తో జపాన్పై నెగ్గింది. -
రాణీ రాంపాల్ హ్యాట్రిక్: సెమీస్లో భారత్
చాంగ్జౌ : జూనియర్ మహిళల ఆసియా కప్లో భారత హాకీ జట్టు సెమీస్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో భారత్ 9-1తో మలేసియాను ఓడించింది. భారత్ తరఫున రాణీ రాంపాల్ హ్యాట్రిక్ గోల్స్ తో చెలరేగగా, జస్ప్రీత్ కౌర్ రెండు, ప్రీతి, పూనమ్ గోల్స్ చేశారు. సైటీ నార్ఫిజా మలేసియాకు ఏకైక గోల్ అందించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత్ 8వ నిమిషంలోనే తొలి గోల్ సాధించింది. 15వ నిమిషంలో పెనాల్టీని జస్ప్రీత్ గోల్గా మల్చడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి అర్ధభాగాన్ని 2-1 స్కోరుతో ముగించిన భారత్... రెండో అర్ధభాగంలో మరింత రెచ్చిపోయింది. ఆరు నిమిషాల వ్యవధిలో ఐదు గోల్స్ చేసింది. ఇక ఆట చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను జస్ప్రీత్ గోల్గా మల్చడంతో భారత్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. -
భారత్ గోల్స్ వర్షం
చాంగ్జౌ (చైనా) : మహిళల జూనియర్ ఆసియా కప్లో భారత హాకీ జట్టు సూపర్ షోతో అదరగొడుతోంది. ఆదివారం జరిగిన తమ రెండో మ్యాచ్లో సింగపూర్ను 12-0 తేడాతో చిత్తు చేసింది. తొలి మ్యాచ్లో ఉత్తర కొరియాను 13-0తో ఓడించిన భారత అమ్మాయిలు ఈ మ్యాచ్లోనూ అదే రీతిన చెలరేగారు. తొలి నిమిషం నుంచే ఎదురుదాడికి దిగి ఫలితాన్ని రాబట్టారు. ఆరో నిమిషంలో పూనమ్ బార్లా తొలి గోల్ సాధించింది. 10వ నిమిషంలో అనూపా బార్లా, ప్రీతీ దూబే (15), జస్ప్రీత్ (25) గోల్స్తో తొలి అర్ధభాగంలో జట్టు 4-0తో ఆధిక్యం సాధించింది. ద్వితీయార్ధంలో లిలీ మయేబ్గమ్ (49) గోల్తో పాటు 52, 59, 61, 64, 65, 68, 70 నిమిషాల్లో వచ్చిన గోల్స్తో భారత్ విజయకేతనం ఎగురవేసింది. 9న చైనాతో తదుపరి మ్యాచ్ ఆడనుంది. -
భారత్ ఘనవిజయం
ఆసియాకప్ జూ. మహిళల హాకీ చాంగ్జూ (చైనా) : మహిళల జూనియర్ ఆసియా కప్లో భారత హాకీ జట్టు తమ తొలి మ్యాచ్లో దుమ్ము రేపింది. శనివారం డీపీఆర్ కొరియాతో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ రాణీ రాంపాల్ ఐదు గోల్స్తో రెచ్చిపోవడంతో భారతజట్టు ఏకంగా 13-0 తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రీతీ దుబే 11వ నిమిషంలో తొలి గోల్ చేయగా ఆ తర్వాత జస్ప్రీత్ కౌర్ (20వ నిమిషంలో), నవ్నీత్ కౌర్ (24), రాణీ రాంపాల్ (28), లిల్లీ చాను (31), పూనమ్ బార్లా చేసిన గోల్స్తో తొలి అర్ధభాగంలో 6-0తో తిరుగులేని ఆధిక్యాన్ని అందుకుంది. ఇక ద్వితీయార్ధంలో రాణీ రాంపాల్ సూపర్ షోతో ఉత్తర కొరియా జట్టు చేతులెత్తేసిం ది. 43, 44, 46వ నిమిషాల్లో వరుస ఫీల్డ్ గోల్స్తో తను ప్రత్యర్థి గోల్పోస్టుపై విరుచుకుపడి హ్యాట్రిక్ సాధించింది. లిలిమా మింజ్ (51) పదో గోల్ సాధించగా మిగతా మూడు గోల్స్ 52, 64, 70వ నిమిషాల్లో వచ్చాయి. -
భారత్దే హాకీ సిరీస్
స్పెయిన్పై ఆఖరి మ్యాచ్లో విజయం టెరాసా (స్పెయిన్): స్పెయిన్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను భారత హాకీ జట్టు 2-1తో గెలుచుకుంది. తొలి మ్యాచ్లో ఓడిన సర్దార్ సింగ్ సేన వరుసగా రెండు మ్యాచ్లు నెగ్గి సత్తా చాటింది. గురువారం జరిగిన మూడో మ్యాచ్లో భారత జట్టు 4-2తో గెలిచింది. మ్యాచ్ 24వ నిమిషంలో రూపిందర్ పాల్ సింగ్ భారత్కు ఆధిక్యం అందించాడు. అయితే తర్వాతి నిమిషంలోనే స్పెయిన్ తరఫున జేవియర్ గోల్ చేశాడు. అనంతరం 45వ నిమిషంలో ఆకాశ్దీప్ సింగ్ గోల్తో జట్టు 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే తేరుకున్న స్పెయిన్ 49వ నిమిషంలో జేవియర్ చేసిన మరో గోల్తో స్కోరును సమం చేసుకుంది. అయితే భారత ఫార్వర్డ్ ఆటగాడు రమణ్దీప్ సింగ్ 50, 51వ నిమిషాల్లో పటిష్ట స్పానిష్ డిఫెన్స్ను ఛేదిస్తూ మెరుపు వేగంతో రెండు గోల్స్ అందించడంతో జట్టు చక్కటి విజయాన్ని సాధించింది. -
భారత్ X పాకిస్తాన్
హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్లో నేడు అమీతుమీ యాంట్వర్ప్ (బెల్జియం): వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం... ఇప్పటికే ఒలింపిక్స్కు అర్హత సాధించినందున ధీమా... వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్లో భారత్ ఆటతీరు ఇది. ఇలాంటి ఉత్సాహంతో భారత హాకీ జట్టు మరో కీలక మ్యాచ్కు సిద్ధమైంది. నేడు జరిగే పూల్ ‘ఎ’ మ్యాచ్లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో సర్దార్సింగ్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు పాక్ ఇప్పటివరకూ రెండు మ్యాచ్లు ఆడి ఒక్కటి గెలిచింది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్లో గెలిస్తే క్వార్టర్స్ బెర్త్ను ఖరారు చేసుకున్నట్లే. ఈ రెండు జట్ల మధ్య చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ భారత్లోనే జరిగింది. అందులో గెలిచిన పాక్ ఆటగాళ్లు మ్యాచ్ తర్వాత ప్రేక్షకులను ఉద్దేశించి అసభ్యంగా సంజ్ఞలు చేశారు. దీంతో అప్పట్లో కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తర్వాత మళ్లీ భారత్, పాక్ మ్యాచ్ జరగనుండటం ఇప్పుడే. దీంతో ఈ మ్యాచ్పై ఆసక్తి బాగా పెరిగింది. -
భారత్ హ్యాట్రిక్
జపాన్తో హాకీ సిరీస్ భువనేశ్వర్ : మ్యాచ్ మ్యాచ్కూ పురోగతి సాధించిన భారత హాకీ జట్టు జపాన్తో జరిగిన సిరీస్ను విజయంతో ముగించింది. సిరీస్లో చివరిదైన నాలుగో మ్యాచ్లో భారత్ 4-0 గోల్స్ తేడాతో జపాన్ను ఓడించింది. భారత్ తరఫున ఆకాశ్దీప్ సింగ్ రెండు గోల్స్ చేయగా... రఘునాథ్, ధరమ్వీర్ సింగ్ ఒక్కో గోల్ అందించారు. తొలి మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న సర్దార్ సింగ్ బృందం తర్వాతి మూడు మ్యాచ్ల్లో గెలుపొంది సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. గత మూడు మ్యాచ్ల్లో గట్టిపోటీనిచ్చిన జపాన్ ఈసారి మాత్రం తేలిపోయింది. తొలి క్వార్టర్లో గోల్ చేయడంలో విఫలమైన భారత్ ఆ తర్వాత జోరు పెంచింది. తొలి పెనాల్టీ కార్నర్ను వృథా చేసిన భారత్ 27వ నిమిషంలో లభించిన రెండో పెనాల్టీ కార్నర్ను రఘునాథ్ లక్ష్యానికి చేర్చాడు. ఆ తర్వాతి నిమిషంలోనే ఆకాశ్దీప్ భారత్కు రెండో గోల్ను అందించాడు. 37వ నిమిషంలో ధరమ్వీర్, 54వ నిమిషంలో ఆకాశ్దీప్ ఒక్కో గోల్ చేయడంతో భారత విజయం ఖాయమైంది. -
భారత్కు తొలి విజయం
జపాన్తో హాకీ సిరీస్ భువనేశ్వర్ : జపాన్తో జరుగుతున్న హాకీ టెస్టు సిరీస్లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ను డ్రా చేసుకున్నప్పటికీ... రెండో మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 2-0 గోల్స్ తేడాతో నెగ్గింది. ఎస్కే ఉతప్ప, ధరమ్వీర్ సింగ్ భారత జట్టు తరఫున గోల్స్ చేశారు. తొలి క్వార్టర్ నుంచే ఇరు జట్లు దూకుడు కనబరచడంతో ఎవరి నుంచీ గోల్స్ నమోదు కాలేదు. రెండో క్వార్టర్లో పూర్తి రక్షణాత్మక ఆటతీరును కనబరిచారు. 29వ నిమిషంలో యువరాజ్ వాల్మీకి ఇచ్చిన పాస్ను వృథా చేయకుండా ఎస్కే ఉతప్ప గోల్ సాధించడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో క్వార్టర్లో జపాన్పై ఆధిక్యం చూపిన భారత్ 48వ నిమిషంలో ధరమ్వీర్ సాధించిన గోల్తో విజయాన్ని ఖాయం చేసుకుంది. -
భారత్, జపాన్ మ్యాచ్ డ్రా
భువనేశ్వర్ : జపాన్తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ను భారత హాకీ జట్టు డ్రాతో ప్రారంభించింది. పేలవ డిఫెన్స్ ఆటతీరుతో పలు అవకాశాలను వృథా చేసుకున్న సర్దార్ సింగ్ సేన ఆదివారం జరిగిన తొలి టెస్టును 1-1తో ముగించింది. జపాన్ తరఫున కురోగవా ైడె చీ (19వ ని.లో), భారత్ తరఫున రఘునాథ్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్తో భారత ప్లేయర్ కొతాజిత్ సింగ్ కెరీర్లో 100 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. -
భారత్ను ఆదుకున్న రఘునాథ్
కొరియాతో మ్యాచ్ ‘డ్రా’ అజ్లాన్ షా హాకీ టోర్నీ యాజమాన్యం : సన్ నెట్వర్క్ కెప్టెన్ : డేవిడ్ వార్నర్ ప్రధాన కోచ్: టామ్ మూడీ బౌలింగ్ కోచ్: మురళీధరన్ మెంటార్లు: వీవీఎస్ లక్ష్మణ్, కె. శ్రీకాంత్ గతంలో ఉత్తమ ప్రదర్శన: విజేత (2009), సెమీస్ (2010, 2013) ఇఫో (మలేసియా) : కొత్త కోచ్ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్ సుల్తాన్ అజ్లాన్ షా కప్ను భారత హాకీ జట్టు ‘డ్రా’తో ఆరంభించింది. దక్షిణ కొరియాతో ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్ను సర్దార్ సింగ్ బృందం 2-2 గోల్స్ వద్ద ‘డ్రా’గా ముగించింది. భారత్ తరఫున నికిన్ తిమ్మయ్య (10వ నిమిషంలో), వీఆర్ రఘునాథ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించగా... కొరియాకు హైసుంగ్ హున్ (24వ నిమిషంలో), సియోంగ్కు లీ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. మ్యాచ్ మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా రఘునాథ్ చేసిన గోల్తో టీమిండియా ‘డ్రా’ చేసుకోగలిగింది. రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. సోమవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. గతేడాది ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సెమీఫైనల్లో కొరియాను ఓడించిన భారత్ అదే ఫలితాన్ని ఈసారి పునరావృతం చేయడంలో విఫలమైంది. కేవలం ఒక పెనాల్టీ కార్నర్ను సంపాదించడం... కీలకదశలో గోల్స్ చేసే అవకాశాలను జారవిడవడంతో తుదకు భారత్ ‘డ్రా’తో సరిపెట్టుకుంది. మరోవైపు కొరియా నాలుగు పెనాల్టీ కార్నర్లు సంపాదించినా భారత గోల్కీపర్ శ్రీజేష్ అప్రమత్తత కారణంగా ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. -
ఒలింపిక్స్ సన్నాహకాలే లక్ష్యంగా...
♦ ఆజ్లాన్ షా కప్ బరిలోకి భారత్ ♦ తొలి మ్యాచ్లో కొరియాతో ఢీ ఇపో (మలేసియా) : ఆసియా క్రీడల్లో చాంపియన్గా నిలిచిన భారత హాకీ జట్టు రియో డి జనీరో ఒలింపిక్స్ (2015)కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో పెద్ద అడ్డంకిని అధిగమించిన సర్దార్ సింగ్ సేన... నేటి (ఆదివారం) నుంచి జరిగే ఆజ్లాన్ షా కప్ హాకీ టోర్నీని ఒలింపిక్స్కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. ముఖ్యంగా జట్టులోని యువ ఆటగాళ్ల ప్రావీణ్యాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది. ఆరు దేశాలు ఆడే ఈ టోర్నీలో... అందుబాటులో ఉన్న పటిష్ట జట్టునే బరిలోకి దింపుతామని టీమ్ మేనేజిమెంట్ చెబుతోంది. మరోవైపు నూతన కోచ్ పాల్ వాన్ ఆస్కు జట్టు తరఫున ఇదే తొలి అంతర్జాతీయ టోర్నీ కావడంతో ఆయనపై కూడా కాస్త ఒత్తిడి ఉంది. ఆటగాళ్లతో ఇప్పటికే కావాల్సినంత సమయం గడిపానని, వారి లోపాలను తెలుసుకున్నట్టు ఆయన చెప్పారు. ఆదివారం నాటి ప్రారంభ మ్యాచ్లోనే భారత్.. పటిష్ట కొరియా జట్టును ఢీకొనాల్సి ఉంది. యువ స్ట్రయికర్ ఆకాశ్దీప్ సింగ్, పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్స్ వీఆర్ రఘునాథ్, రూపిందర్ పాల్ సింగ్ రాణింపుపై జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. టోర్నీలో డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియా, కెనడా జట్లు కూడా బరిలోకి దిగుతున్నాయి. -
18 ఏళ్ల తర్వాత..
భువనేశ్వర్:హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు బోణీ చేసింది. గ్రూప్ బి లో భాగంగా ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ 3-2 తేడాతో నెదర్లాండ్స్ పై విజయం సాధించింది. వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన భారత హాకీ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ప్రపంచ కప్ విజేత, ఒలింపిక్ కాంస్య పతక విజేత నెదర్లాండ్స్ ను మట్టికరిపించింది. పటిష్టమైన నెదర్లాండ్స్తో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ అత్యద్భుత ఆటతీరును ప్రదర్శించింది. 1996 బార్సిలోనా ఒలింపిక్స్ లో నెదర్లాండ్స్ ను ఓడించిన భారత్ తరువాత ఆ జట్టుపై విజయాన్ని సాధించలేదు. ప్రస్తుత సర్దార్ సింగ్ నేతృత్వంలోని భారత్.. నెదర్లాండ్స్ పై పోరాడి గెలిచి పరువు దక్కించుకుంది. తొలి మ్యాచ్లో జర్మనీ చేతిలో, రెండో మ్యాచ్లో అర్జెంటీనా చేతిలో ఓడిన టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పటిష్టమైన నెదర్లాండ్స్ తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్ 3-0తో అర్జెంటీనాపై, రెండో మ్యాచ్లో 4-1తో జర్మనీపై విజయం సాధించింది. అయితే లీగ్ మ్యాచ్లతో సంబంధం లేకుండా ఈ టోర్నీ బరిలో ఉన్న ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి.గ్రూప్ ‘ఎ’లో టాప్గా నిలిచే అవకాశమున్న ఇంగ్లండ్తో సర్దార్ సింగ్ బృందం ఆడే అవకాశం ఉంది. -
భారత్కు మరో పరీక్ష
- నేడు నెదర్లాండ్స్తో మ్యాచ్ - చాంపియన్స్ ట్రోఫీ భువనేశ్వర్: వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన భారత హాకీ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో మంగళవారం మరో పోరుకు సిద్ధమైంది. పటిష్టమైన నెదర్లాండ్స్తో జరిగే ఈ మ్యాచ్లో భారత్ నెగ్గాలంటే అత్యద్భుత ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్లో జర్మనీ చేతిలో; రెండో మ్యాచ్లో అర్జెంటీనా చేతిలో ఓడిన టీమిండియా ఈ మ్యాచ్నైనా ‘డ్రా’ చేసుకుంటే పరువు దక్కించుకుంటుంది. అయితే లీగ్ మ్యాచ్లతో సంబంధం లేకుండా ఈ టోర్నీ బరిలో ఉన్న ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఒకవేళ మంగళవారం జరిగే మ్యాచ్లో భారత్ ఓడిపోతే గ్రూప్ ‘బి’లో చివరిదైన నాలుగో స్థానంలో నిలుస్తుంది. క్వార్టర్ ఫైనల్లో గ్రూప్ ‘ఎ’లో టాప్గా నిలిచే అవకాశమున్న ఇంగ్లండ్తో సర్దార్ సింగ్ బృందం ఆడే అవకాశం ఉంటుంది. మరోవైపు నెదర్లాండ్స్ జట్టు తామాడిన రెండు లీగ్ మ్యాచ్ల్లోనూ నెగ్గింది. తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్ 3-0తో అర్జెంటీనాపై, రెండో మ్యాచ్లో 4-1తో జర్మనీపై విజయం సాధించింది. -
మహిళా అథ్లెట్లకు, హాకీ జట్టుకు మోడీ అభినందన
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు, మహిళా అథ్లెట్లకు ప్రధాని నరేంద్రమోడీ అభినందన తెలిపారు. దేశ ప్రతిష్టను భారత క్రీడాకారులు మరింత పెంచారని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత దేశానికి స్పూర్తి నిచ్చిన రోజు అని వ్యాఖ్యానించారు. 4x400 మీటర్ల రిలే విభాగంలో భారత మహిళా అథ్లెట్లు బంగారు పతకం సాధించడంపై మోడీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 4-2 తేడాతో విజయం సాధించింది. 16 ఏళ్ల తర్వాత భారత జట్టు బంగారు పతకం సాధించి.. 2016 లో రియోలో జరిగే ఒలింపిక్ క్రీడలకు భారత హాకీ జట్టు అర్హత సాధించింది. -
ఫైన ల్లో భారత మహిళలు
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో దూసుకెళుతోంది. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని సాధించి మరో లీగ్ మ్యాచ్ మిగిలుండగానే ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. జపాన్లోని కకామిగహరాలో జరుగుతున్న ఈ ఈవెంట్లో సోమవారం మలేసియా జట్టును 5-1 తేడాతో భారత్ ఓడించింది. 15వ నిమిషంలోనే మలేసియా తొలి గోల్ సాధించి ఆధిక్యం సాధించింది. అయితే తొమ్మిది నిమిషాల అనంతరం భారత్ తరఫున పూనమ్ రాణి పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి స్కోరును సమం చేసింది. ద్వితీయార్థంలో భారత మహిళలు అద్భుత ఆటతీరును కనబరిచారు. నమిత టొప్పో (44వ ని.), రితూ రాణి (52 వ ని.), అమన్దీప్ కౌర్ (54వ ని.), దీప్ గ్రేస్ ఎక్కా (65వ ని.) వరుసగా గోల్స్ సాధించిన ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు. మరోవైపు జపాన్ 5-1తో చైనాను ఓడించి ఫైనల్కు చేరింది. భారత్ తన చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లో జపాన్తో గురువారం తలపడుతుంది. శనివారం ఫైనల్ కూడా ఈ రెండు జట్ల మధ్యనే జరుగుతుంది. -
భారత హాకీ కోచ్గా వాల్ష్
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాకు చెందిన టెర్రీ వాల్ష్ను భారత హాకీ జట్టు కోచ్గా నియమించినట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) మంగళవారం ప్రకటించింది. ఆయనకు నాలుగు ప్రపంచకప్లు, మూడు ఒలింపిక్స్లు ఆడిన అనుభవముంది. కెరీర్ అనంతరం కోచ్గాను విశేష అనుభవజ్ఞుడైన వాల్ష్ భారత సీనియర్ పురుషుల జట్టుకు సేవలందిస్తారని హెచ్ఐ కార్యదర్శి నరీందర్ బాత్రా తెలిపారు. తదుపరి కీలకమైన టోర్నీల దృష్టా టీమిండియాను ఆయన గాడిన పెడతారనే విశ్వాసాన్ని బాత్రా వెలిబుచ్చారు. వరల్డ్ లీగ్ రౌండ్-4తో పాటు తదుపరి చాంపియన్స్ ట్రోఫీ వరకు భారత్ మూడు ప్రధాన ఈవెంట్లలో పాల్గొననుంది. ప్రపంచకప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్లో టీమిండియా తలపడనుంది. భారత జట్టుతో కలిసి పనిచేసే అవకాశం లభించడం పట్ల వాల్ష్ సంతోషం వ్యక్తం చేశారు. 1990లో కోచింగ్ కెరీర్ మొదలుపెట్టిన ఆయన మలేసియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల ప్రధాన కోచ్గా పనిచేశారు.