Insurance Policy
-
ఆరోగ్య బీమా ఉంటే.. ఎన్ని ప్రయోజనాలో..
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అయితే, ఆసుపత్రుల కార్పొరేటీకరణ కారణంగా దేశీయంగా ఆరోగ్య సంరక్షణ, వైద్య చికిత్స వ్యయాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం ఆసియా మొత్తం మీద భారత్లో ఇందుకు సంబంధించిన ద్రవ్యోల్బణం అత్యధికంగా 14 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో పెరిగే వైద్య చికిత్స వ్యయాల భారాన్ని తట్టుకునేందుకు ఆరోగ్య బీమా అనేది ఎంతగానో ఉపయోగపడే సాధనంగా ఉంటోంది. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం, ఆర్థికంగా ఆదా చేసుకోవడం రెండూ ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ పథకాలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. పటిష్టమైన ఆరోగ్య బీమా పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పాలసీదారులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుకోవచ్చు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక ఆరోగ్య బీమా పథకాలు అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని: నగదురహిత చికిత్స: పాలసీదారులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా కేవలం తమ పాలసీ నంబరును ఇచ్చి, వైద్య చకిత్సలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. మెడికల్ ఎమర్జెన్సీల్లో పాలసీదారును ఇబ్బంది పెట్టకుండా బిల్లులను నేరుగా బీమా కంపెనీతో ఆసుపత్రి సెటిల్ చేసుకుంటుంది. నో క్లెయిమ్ బోనస్: క్లెయిమ్లేమీ చేయని పాలసీదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు చాలా కంపెనీలు నో–క్లెయిమ్ బోనస్ను ఆఫర్ చేస్తున్నాయి. తదుపరి సంవత్సరంలో ప్రీమియంను తగ్గించడమో లేదా సమ్ అష్యూర్డ్ను పెంచడం రూపంలోనో ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. టాప్–అప్, సూపర్ టాప్–అప్ ప్లాన్లు: బేసిక్ సమ్ ఇన్సూర్డ్ పరిమితి అయిపోతే, అదనంగా కవరేజీని పొందేందుకు టాప్–అప్, సూపర్ టాప్–అప్ ఉపయోగపడతాయి. తక్కువ ఖర్చులో అదనంగా కవరేజీని పొందేందుకు ఇవి సహాయకరంగా ఉంటాయి. వెల్నెస్, ప్రివెంటివ్ కేర్: బీమా సంస్థలు వెల్నెస్, ప్రివెంటివ్ కేర్పై మరింతగా దృష్టి పెడుతున్నాయి. పాలసీదారులు తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడేందుకు ఈ ప్రోగ్రాంల కింద ఉచితంగా హెల్త్ చెకప్లు, జిమ్ మెంబర్షిప్లు, డైట్ కౌన్సిలింగ్ మొదలైనవి అందిస్తున్నాయి. తద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించేలా బీమా సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. అవసరాలకు అనుగుణంగా కవరేజీ: పాలసీదారులు తమ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా కవరేజీని తీసుకునే విధంగా ఆధునిక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉంటున్నాయి. వీటికి అదనంగా రక్షణ కోసం రైడర్లను జోడించుకోవడం కావచ్చు లేదా నిర్దిష్ట కవరేజీ ఆప్షన్లను ఎంచుకోవడం కావచ్చు పాలసీదారులకు కొంత వెసులుబాటు ఉంటోంది. -
పిల్లల బీమా.. ఇవ్వదు ధీమా..!
తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాల్లో పిల్లల విద్య ఒకటి. విద్యా వ్యయాలు ఏటేటా 10 శాతానికి మించి పెరుగుతున్నాయి. సాధారణ ద్రవ్యోల్బణం 5.5 శాతంతో పోల్చితే రెట్టింపు స్థాయి ద్రవ్యోల్బణం విద్యారంగంలో చూడొచ్చు. దీని కారణంగా నేడు ఒక కోర్స్కు రూ. 25 లక్షలు ఖర్చవుతుంటే.. 13 ఏళ్ల తర్వాత (ఉన్నత విద్యకు వచ్చే సరికి) రూ.1.09 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ముందస్తు ప్రణాళికతోనే ఈ వ్యయాలను అధిగమించడం సులభమవుతుంది.పాఠశాల ప్రవేశం నాటి నుంచే పిల్లల విద్య కోసం పెట్టుబడులు ప్రారంభించాలి. భవిష్యత్లో ఎంత అవసరమో, ఆ మేరకు సమకూర్చుకునే విధంగా ప్రతి నెలా పొదుపు, మదుపు చేస్తూ వెళ్లాలి. ఇందుకు ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలకంగా మారతాయి. ఇక్కడ తప్పటడుగులు వేస్తే పిల్లల ఉన్నత విద్య కోసం రేపు అప్పు చేయాల్సి రావచ్చు. కేవలం చైల్ట్ ఇన్సూరెన్స్ పాలసీలతో విద్యా వ్యయాలను తట్టుకోవడం కష్టమే. ఈ దిశగా అవగాహన కల్పించే కథనమిది... తల్లిదండ్రుల్లో ఎంత మంది తమ పిల్లల భవిష్యత్ విద్యకు సన్నద్ధంగా ఉన్నారు? ఇదే తెలుసుకుందామని హెచ్ఎస్బీసీ సంస్థ ఓ సర్వే చేసింది. ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్ రిపోర్ట్ 2024’ పేరుతో నివేదిక విడుదల చేసింది. 53 శాతం తల్లిదండ్రులు తమ పిల్లల విద్య కోసం పెట్టుబడులు చేస్తున్నట్టు చెప్పారు. అవసరమైతే తమ పిల్లలే విద్యా రుణం తీసుకుంటారని 40 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. కొందరు ఆస్తులు అమ్మి చదివిస్తామని చెప్పగా, స్కాలర్íÙప్ మార్గాలు చూస్తామని కొంతమంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కానీ, పిల్లల పేరిట పెట్టుబడులు చేస్తున్న వారిలో ఎంత మంది మెరుగైన సాధనాలను ఎంపిక చేసుకున్నారన్నది ఈ సర్వే తేల్చలేదు. మొత్తానికి సగం మందికి ఆర్థిక ప్రణాళిక లేదని స్పష్టమవుతోంది. తల్లిదండ్రులకు ఏదైనా జరగరానిది జరిగితే... పిల్లల విద్యకు ఆరి్థక తోడ్పాటు అందించే చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు మార్కెట్లో క్రేజ్ ఉంది. బీమా ఏజెంట్లు వీటిని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు. నిజానికి వీటిలో చార్జీలు ఎక్కువ. దాంతో రాబడులు కొంత తక్కువ. పిల్లల పేరిట మార్కెటింగ్ చేసే ఉత్పత్తుల వలలో పడకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా బీమా, పెట్టుబడులను కలపడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఈ రెండింటినీ వేర్వేరుగానే చూడాలి.చైల్డ్ ప్లాన్లలో ఏముంది?పిల్లల పేరిట రెండు రకాల ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి. యూనిట్ లింక్డ్ చి్రల్డన్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యులిప్లు) ఇందులో ఒక రకం. చెల్లించిన ప్రీమియంలో బీమా రిస్క్, నిర్వహణ, ఇతరత్రా వ్యయాలు పోను మిగిలిన మొత్తాన్ని మార్కెట్ లింక్డ్ (ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత) సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. పాలసీదారుల ఎంపిక మేరకు డెట్లోనూ పెట్టుబడులు పెడతాయి. వచ్చిన రాబడులను పాలసీదారులకు అందిస్తాయి. ఎండోమెంట్ చిల్డ్రన్ ఇన్సూరెన్స్ రెండో రకం. ఇందులోనూ బీమా రిస్క్, ఇతర వ్యయాలు పోను మిగిలిన ప్రీమియాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి.పాలసీదారులకు హామీ మేరకు రాబడులు అందిస్తాయి. కానీ, వీటిలో రాబడులు 5–6 శాతం మించవు. ఈక్విటీ ఆధారిత యులిప్ ప్లాన్లలో రాబడులు కాస్త అధికంగా ఉంటాయి. కాకపోతే గ్యారంటీడ్ కావు. మార్కెట్ పనితీరుపైనే రాబడులు ఆధారపడి ఉంటాయి. ఈ రెండు రకాల ప్లాన్లలోనూ, పాలసీ కాల వ్యవధి ముగియక ముందే పాలసీదారు (తల్లి లేదా తండ్రి) మరణించినా లేక కాల వ్యవధి ముగిసేవరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీ కాల వ్యవధి మధ్యలో పాలసీదారు మరణించినట్టయితే, అప్పుడు బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి పెట్టుబడులను కొనసాగించి, యథాప్రకారం పాలసీ ప్రయోజనాలను అందిస్తుంది. దాంతో పిల్లల ఉన్నత విద్యకు ఆ నిధిని ఉపయోగించుకోవచ్చు. ‘‘దురదృష్టవశాత్తూ తల్లి లేదా తండ్రి మరణించినట్టయితే పరిహారం చెల్లించే ఈ పథకాలు పిల్లలకు ఉపయోగపడతాయి. ప్రీమియం వేవర్ ముఖ్యమైన సదుపాయం. పాలసీదారు మరణించినట్టయితే ఆ తర్వాత భవిష్యత్ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు. పాలసీ యాక్టివ్గా కొనసాగుతుంది. పిల్లల విద్యా లక్ష్యాలకు కావాల్సినంత మేర సమకూరుతుంది’’ అని ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్ యాక్చువరీ ఆదిత్య మాల్ వివరించారు. పాలసీదారు మరణించినప్పటికీ గడువు తీరిన తర్వాత సమ్ అష్యూర్డ్, ఇతర ప్రయోజనాలు యథావిధిగా అందుతాయని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మధుపం కృష్ట సైతం తెలిపారు. సమ్ అష్యూర్డ్ (బీమా) వెంటనే చెల్లించి, మిగిలిన ప్రయోజనాలను పాలసీ గడువు ముగిసిన తర్వాత చెల్లించేవి ఉన్నాయి.లాకిన్ పిరియడ్... ఎండోమెంట్, యులిప్ ప్లాన్లు లాకిన్ పీరియడ్తో వస్తాయి. సాధారణంగా ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే మొదటి ఐదేళ్లు ఉపసంహరణకు అనుమతి ఉండదు. ఈ కాలంలో పాలసీని సరెండర్ చేసినా వచ్చేదేమీ ఉండదు. లాకిన్ పీరియడ్ తర్వాత పాక్షికంగా ఉపసహరించుకోవచ్చు. నిర్బంధంగా పెట్టుబడిని కొనసాగించే లక్ష్యంతోనే ఈ ప్లాన్లలో లాకిన్ ఉంటుంది. వీటిలో ఏజెంట్లకు కమీషన్ మెరుగ్గా ఉంటుంది. ఎంత అధిక ప్రీమియానికి పాలసీలో చేరి్పస్తే ఏజెంట్కు అంత అధికంగా కమిషన్ ముడుతుంది. ‘‘టర్మ్ ప్లాన్లు, మ్యూచువల్ ఫండ్స్ గురించి సరైన అవగాహన లేకపోవడమే పెద్ద సమస్య. టర్మ్ ప్లాన్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. కనుక వీటిని ఏజెంట్లు విక్రయించేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు’’అని కృష్ణ వివరించారు.ఆరి్థక ప్రణాళికలో చేసే తప్పుల్లో బీమా, పెట్టుబడి కలపడం ఒకటని ఆనంద్రాఠి వెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిరాగ్ ముని తెలిపారు. ‘‘ఇన్సూరెన్స్, పెట్టుబడి పూర్తి భిన్నమైన ఆరి్థక ఉత్పత్తులు. ఇన్వెస్టర్లు వీటిని కలపకూడదు. ఊహించని నష్టం నుంచి రక్షణ కల్పించడమే బీమా ఉద్దేశం. పెట్టుబడి సాధనం ఉద్దేశం సంపద సమకూర్చుకోవడం’’ అని వివరించారు. ‘‘సంప్రదాయ ఎండోమెంట్ పాన్లలో రాబడులు 4–5 శాతం మేర ఉంటాయి. విద్యా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే సంప్రదాయ బీమా ప్లాన్లలో పెట్టుబడితో మిగిలేదేమీ ఉండదు.చైల్డ్ యులిప్ ప్లాన్లలో 9–11 శాతం మేర రాబడులు వస్తాయి. కాకపోతే ఆరి్థక సైకిల్, మార్కెట్ సైకిల్పైనే ఈ రాబడులు ఆధారపడి ఉంటాయి’’ అని కృష్ట తెలిపారు. కనుక సంప్రదాయ ఎండోమెంట్ ఆధారిత చైల్డ్ ప్లాన్లు పిల్లల భవిష్యత్కు భరోసా ఇవ్వమని స్పష్టమవుతోంది. ఇక యులిప్ ప్లాన్ల కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన ఎంపిక అవుతుంది. వీటిల్లో లిక్విడిటీ మెరుగ్గా ఉంటుంది. చార్జీలు చాలా తక్కువ. యులిప్ ప్లాన్లలో చార్జీల విషయమై పారదర్శకత తక్కువ. ప్రీమియం అలోకేషన్ చార్జీ, అడ్మిని్రస్టేటివ్ చార్జీ, మోర్టాలిటీ చార్జీ, సరెండర్ చార్జీ, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీ ఇన్నేసి చార్జీలు యులిప్లలో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లోనూ పారదర్శకత ఎక్కువ.మెరుగైన ప్రత్యామ్నాయాలు..చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మెరుగైన ప్రయోజనాన్ని ఇవ్వనప్పుడు వీటికి ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ఊహించనది జరిగితే వారసుల విద్య ఆగిపోకూడదు. కుటుంబ జీవనం ఇబ్బందుల పాలు కాకూడదు. అందుకని జీవిత బీమాతోపాటు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఎంపిక చేసుకోవడం మంచి మార్గం అవుతుంది. ‘‘టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తక్కువ ప్రీమియానికే అధిక కవరేజీని ఇస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చైల్డ్ ప్లాన్ల కంటే మెరుగైన రాబడులు వస్తాయి.చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో కవరేజీ తగినంత ఉండదు. అప్పుడే కుటుంబ జీవనంలోకి అడుగుపెట్టిన వారికి, తాజాగా రుణం తీసుకున్న వారికి మరింత కవరేజీ అవసరం ఏర్పడుతుంది’’ అని కృష్ట తెలిపారు. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే తమ రిస్క్, రాబడుల ఆకాంక్షలకు సరిపోలే పథకాలను ఎంపిక చేసుకోవచ్చని ఫింజ్ స్కాలర్జ్ వెల్త్ మేనేజర్ ప్రిన్సిపల్ అడ్వైజర్ రేణు మహేశ్వరి సూచించారు. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తికి రూ.కోటి టర్మ్ ఇన్సూరెన్స్ రూ.10–15 వేల ప్రీమియంకే వస్తుంది. కనుక చైల్డ్ ప్లాన్ల కోసం ఏటా భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించడానికి బదులు.. టర్మ్ ప్లాన్ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసు కోవాలి.విభిన్న ఫండ్స్...టర్మ్ప్లాన్లోనూ మరణం లేదా అంగవైకల్యం పాలైనప్పుడు చెల్లింపులు చేసే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. సమ్ అష్యూర్డ్లో 50 శాతం మేర తక్షణమే చెల్లించి, మిగిలినది ప్రతి నెలా 10 ఏళ్ల పాటు చెల్లింపుల సదుపాయాలతో టర్మ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు ఏటా 12 శాతం, అంతకంటే ఎక్కువే ఉన్నాయి. పదేళ్ల కాలంలో అయితే సగటు వార్షిక రాబడి 20 శాతంగా ఉంది. ఈక్విటీల్లోనూ ఇండెక్స్ ఫండ్స్ (సెన్సెక్స్, నిఫ్టీ, స్మాల్క్యాప్, మిడ్క్యాప్)ను ఎంపిక చేసుకోవాలి.ఇందులో చార్జీలు చాలా తక్కువ. సూచీల మాదిరే రాబడులు వీటిల్లో వస్తాయి. మరీ ముఖ్యంగా 7 ఏళ్లకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేస్తుంటే లార్జ్, మిడ్, స్మాల్క్యాప్స్ పెట్టుబడులు పెట్టే ఫ్లెక్సీక్యాప్ను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్, రిస్క్ తక్కువ కోరుకునే వారు మల్టీ అస్సెట్ ఫండ్స్, రిస్క్ ఇంకా తక్కువగా ఉండాలని కోరుకునే వారు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణుల సూచన. పన్ను ప్రయోజనంచైల్డ్ యులిప్ ప్లాన్లలో రాబడులపై పన్ను భారం లేకపోవడాన్ని సానుకూల అంశంగా చెప్పుకోవాలి. దీనికి బదులు టర్మ్ప్లాన్ విడిగా తీసుకుని, ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. ఈక్విటీ లాభాలపై స్వల్పకాల, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను కదపకుండా, ఒక పథకం నుంచి మరో పథకానికి మార్చకుండా.. స్థిరంగా ఒకే పథకంలో కొనసాగించడం వల్ల అనవసర పన్ను భారాన్ని తప్పించుకోవచ్చు. అయినా సరే ఈక్విటీ పెట్టుబడిని ఉపసంహరించుకున్నప్పుడు అది ఏడాది మించిన కాలం అయితే మొదటి రూ.లక్షకు మించిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి.ఏడాదిలోపు పెట్టుబడులపై వచ్చే లాభం నుంచి 20 శాతం మేర పన్ను కింద చెల్లించాలి. నిపుణుల పెట్టుబడి ప్రణాళికను అనుసరించినట్టయితే అప్పుడు మెరుగైన జీవిత బీమా రక్షణ, ఈక్విటీలపై అద్భుత రాబడులు అందుకోవడానికి అవకాశాలుంటాయి. పన్ను చెల్లింపులు పోను నికర రాబడులు చైల్డ్ ప్లాన్లతో పోల్చితే.. అధికంగానే ఉంటాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ పన్ను ప్రయోజనం కోసమని యులిప్ పాలసీకే మొగ్గు చూపేట్టు అయితే విడిగా టర్మ్ప్లాన్ తీసుకోవడం మర్చిపోవద్దు. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
పాలసీను సరెండర్ చేస్తే ఎంత వస్తుందంటే..?
జీవిత బీమా పాలసీని వెనక్కిచ్చేసినప్పుడు (సరెండర్) పొందే ప్రయోజనాలపై నూతన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం గతంలో కంపెనీలిచ్చే సరెండర్ వాల్యూ పెరగనుంది. ప్రస్తుతం కంపెనీలు అమలు చేస్తున్న నియమాలు ఎలా ఉన్నాయో, కొత్త విధానం అమలులోకి వస్తున్న నేపథ్యంలో ఎంతమేరకు సరెండర్ వాల్యూ వస్తుందో తెలుసుకుందాం.జీవిత బీమా పాలసీల గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, ముందస్తుగానే వైదొలగాలని భావించే వారికి మెరుగైన రాబడులు అందించడమే కొత్త నిబంధనల ఉద్దేశం. జీవిత బీమా పాలసీని తీసుకున్న తర్వాత నుంచి ఎన్నేళ్ల పాటు ప్రీమియం చెల్లించారు, అప్పటి వరకు ఎంత బోనస్లు జమయ్యాయన్న తదితర అంశాల ఆధారంగా సరెండర్ వ్యాల్యూని బీమా సంస్థలు నిర్ణయిస్తుంటాయి. ఇలా సరెండర్ చేసే పాలసీలపై బీమా సంస్థలు గతంలో తక్కువ ప్రయోజనాలనే పాలసీదారులకు చెల్లించేవి. ఉదాహరణకు ఎల్ఐసీలో వినయ్(35) వనే వ్యక్తి జీవన్ ఆనంద్ పాలసీను ఎంచుకున్నాడనుకుందాం. పాలసీ కాలం ముప్పై ఏళ్లు. పాలసీ మొత్తం రూ.10 లక్షలుగా భావిస్తే, వినయ్ నెలవారీ దాదాపు రూ.3,175 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏటా రూ.38,100 చెల్లించాలి. ఐదేళ్లు పాలసీ ప్రీమియం చెల్లించాలరనుకుందాం. రూ.38,100*5 మొత్తం రూ.1,90,500. ఐదేళ్ల తర్వాత వినయ్ తన పాలసీను సరెండర్ చేస్తే తనకు 30-35 శాతం సరెండర్, ఇతర ఛార్జీలు విధించి రూ.1,27,863 మాత్రమే కంపెనీ చెల్లిస్తుంది. మిగతా రూ.62,637 నష్టపోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: వాటర్ బాటిల్ ధర తగ్గనుందా..?కొత్త నిబంధనల ప్రకారం సరెండర్ చేసే పాలసీపై సరెండర్ ఛార్జీలు, ఇతర ఛార్జీలను తగ్గించనున్నారు. దాంతో పాలసీదారుడికి గతంలో కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు సమకూరుతుంది. ఇదిలాఉండగా, కేవలం డబ్బు కోసమే పాలసీను సరెండర్ చేయాలనుకునేవారికి మరో అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పైన తెలిపిన ఉదాహరణలో వినయ్ చెల్లించిన ఐదేళ్ల పాలసీ ప్రీమియంను ఉపయోగించి లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది. పాలసీను సరెండర్ చేస్తే రూ.1,27,863 వస్తుంది కదా. అదే తన పాలసీపై లోన్కు వెళితే సుమారు రూ.89,500 వరకు పొందే అవకాశం ఉంది. దాంతో పాలసీ కొనసాగించేలా జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు. -
బీమా పాలసీ.. అత్యవసర నిధి!
ఉన్నట్టుండి నిధుల అవసరం ఏర్పడిందా..? వ్యక్తిగత రుణానికి తక్కువ క్రెడిట్ స్కోర్ అడ్డు పడుతోందా? లేదంటే వ్యక్తిగత రుణంపై అధిక వడ్డీ రేటు చూసి వెనుకాడుతున్నారా..? ఇలాంటి సందర్భాల్లో బీమా పాలసీయే మిమ్మల్ని ఆదుకుంటుంది. అదెలా అంటారా? ఎండోమెంట్ బీమా ప్లాన్లపై బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. పైగా పర్సనల్ లోన్తో పోలిస్తే వడ్డీ రేటు తక్కువే.డబ్బులు అవసరం పడితే బీమా పాలసీని సరెండ్ చేసే వారూ ఉన్నారు. ఇలా ఇన్సూరెన్స్ పాలసీని సరెండర్ చేయడానికి బదులు, దానిపై రుణం తీసుకుని అవసరం గట్టెక్కడమే మంచి మార్గం అవుతుంది. దీనివల్ల బీమా రక్షణను ఎప్పటి మాదిరే కొనసాగించుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందన్నది తెలియజేసే కథనమే ఇది. రుణ సదుపాయం అన్ని రకాల బీమా పాలసీలపై వస్తుందనుకుంటే పొరపాటు. కేవలం కొన్ని రకాల పాలసీలకే ఇది పరిమితం. ‘‘పొదుపుతో కూడిన సంప్రదాయ బీమా పాలసీ (ఎండోమెంట్, మనీ బ్యాక్ ప్లాన్లు) కలిగి ఉన్నవారు వాటిపై పలు రకాల ఆర్థిక అవసరాల కోసం రుణాన్ని పొందొచ్చు’’అని ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విఘ్నేష్ సహానే తెలిపారు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కేవలం మరణ పరిహారాన్నే అందిస్తాయని, ఎలాంటి రాబడి హామీ ఉండదు కనుక వాటిపై రుణం పొందలేరని స్పష్టం చేశారు. యూనిట్ లింక్డ్ ప్లాన్ల (యులిప్)లోనూ రాబడులు మార్కెట్పై ఆధారపడి ఉంటాయి కనుక వాటిపైనా రుణ సదుపాయం ఉండదని తెలిపారు. ఎక్కడ తీసుకోవచ్చు? పాలసీ మంజూరు చేసిన జీవిత బీమా కంపెనీ నుంచే రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. నేడు చాలా బీమా సంస్థలు పాలసీలపై రుణాలను కూడా ఇస్తున్నాయి. అలాగే, బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు ఈ తరహా రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. అయితే, బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల కంటే పాలసీ మంజూరు చేసిన బీమా సంస్థను సంప్రదించడమే మెరుగైన మార్గమని నిపుణులు అంటున్నారు. ‘‘ఇన్సూరెన్స్ కంపెనీతో పోలిస్తే బ్యాంక్లు బీమా ప్లాన్లపై తక్కువ రుణ మొత్తాన్ని ఆఫర్ చేస్తాయి. అదే మాదిరి బీమా సంస్థలతో పోలిస్తే బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు రుణాలపై కొంచెం అధిక రేటును వసూలు చేస్తుంటాయి’’అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ‘ప్లాన్ ఆర్’ వ్యవస్థాపకుడు అజయ్ ప్రుతి తెలిపారు. బ్యాంక్లు సాధారణంగా బీమా పాలసీపై రుణాన్ని నేరుగా కాకుండా.. కరెంట్ అకౌంట్పై ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద అందిస్తుంటాయి. ‘‘తరచుగా నిధుల అవసరం ఏర్పడేవారు ఇలా కరెంట్ అకౌంట్పై (సెక్యూరిటీ కింద బీమా పాలసీ జమ చేసి) ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని పైసా బజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సహిల్ అరోరా సూచించారు. చౌక రుణం ‘‘బీమా పాలసీలపై రుణ రేటు చాలా తక్కువగా ఉండడాన్ని గమనించొచ్చు. సాధారణంగా వీటిపై 9–9.5 శాతం వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తుంటారు. అదే వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్) అయితే 12 శాతం అంతకంటే ఎక్కువే ఉంటుంది’’అని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజేష్ కృష్ణన్ తెలిపారు. ఇక బీమా పాలసీలపై రుణం ఎంతొస్తుందంటే.. రుణం తీసుకునే నాటికి ఉన్న స్వా«దీనపు విలువ (సరెండర్ వ్యాల్యూ)లో 90 శాతం వరకు. బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల నుంచి రుణం మంజూరునకు సాధారణంగా నాలుగు నుంచి ఏడు రోజులు పడుతుంది. అదే బీమా సంస్థల నుంచి రుణం మూడు రోజుల్లోనే పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు ఇంతకంటే వేగంగా ఆన్లైన్లోనే పాలసీలపై రుణాలను మంజూరు చేస్తున్నాయి. ‘‘జీవిత బీమా పాలసీలపై రుణం దరఖాస్తు మదింపు, రుణం మంజూరు చాలా వేగంగా ఉంటుంది. బీమా సంస్థ నుంచే రుణం తీసుకునేట్టు అయితే ఎలాంటి అదనపు తనిఖీలు, పరిశీలనలు అవసరం పడవు’’అని రాజేష్ కృష్ణన్ వివరించారు.బీమా పాలసీపై రుణం తీసుకోవడం ఎంతో సౌకర్యమైనదిగా పాలసీఎక్స్ సీఈవో నావల్ గోయల్ సైతం అంగీకరించారు. ‘‘దరఖాస్తు చేసుకోవడం ఎంతో సులభం. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారు సైతం పాలసీపై రుణానికి అర్హులే. ఎందుకంటే పాలసీపై రుణం జారీకి క్రెడిట్ స్కోర్ తనిఖీలు అవసరం పడవు’’అని కృష్ణన్ తెలిపారు. ఈ రుణం తిరిగి చెల్లింపు నిబంధనలు కూడా సులభమే. ‘‘రుణం చెల్లించడం వీలు కానప్పుడు కేవలం రుణంపై వడ్డీ వరకే చెల్లించొచ్చు. అసలు రుణాన్ని ఎప్పుడైనా తిరిగి తీర్చివేయవచ్చు’’అని ప్రుతి వివరించారు. ఎంత వీలైతే అంత అసలు రుణంలో చెల్లించుకుంటూ వెళ్లడం కూడా మంచి ఆలోచనే. దీనివల్ల ప్రతి నెలా చెల్లించే వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. అత్యవసర నిధి బీమా పాలసీ అత్యవసర నిధిగానూ అక్కరకొస్తుంది. ప్రతి కుటుంబానికి విధిగా అత్యవసర నిధి ఉండాలి. అనుకోని పరిణామాలతో నెలవారీ వచ్చే ఆదాయం ఆగిపోతే? చేస్తున్న ఉద్యోగం ఊడిపోతే..? అక్కడి నుంచి తిరిగి ఉపాధి లభించేంత వరకు కుటుంబ అవసరాలను తీర్చేందుకు అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది అవసరాలను తీర్చేంత అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అయితే, ప్రతి ఒక్కరికీ ఇంత మొత్తం అత్యవసర నిధి కింద ఏర్పాటుకు వెసులుబాటు ఉండకపోవచ్చు. ఇలాంటి వారు ఎండోమెంట్ లేదా మనీబ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను అత్యవసర నిధి కింద ఉపయోగించుకోవచ్చు. తిరిగి ఉపాధి ఏర్పడి, ఆదాయం చేతికి అందేంత వరకు పాలసీపై రుణంతో అవసరాలను గట్టెక్కొచ్చు. ఆ తర్వాత క్రమంగా ఆరు నెలల్లోపు పాలసీపై రుణాన్ని తీర్చివేయడం మంచి ఆలోచన అవుతుంది. పాలసీ సరెండర్ అంటే? ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ బీమా ప్లాన్ వద్దనుకునే వారు దాన్ని సరెండర్ చేసుకోవచ్చు. అంటే గడువు ముగియకుండానే పాలసీని వెనక్కిచ్చేయడం. పాలసీ తీసుకున్న తర్వాత ఎంత కాలానికి సరెండర్ చేస్తున్నారనే దాని ఆధారంగా దానిపై ఎంతొస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. ఈ సరెండర్ వ్యాల్యూ (స్వా«దీనపు విలువ) విషయంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) 2024 ఏప్రిల్ 1 నుంచి నూతన నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ప్రకారం బీమా పాలసీ తీసుకున్న మూడేళ్లలోపు సరెండర్ చేస్తే చేతికి చాలా తక్కువే వస్తుంది. అంటే అప్పటికి కట్టిన ప్రీమియంలో సగం కూడా రాదు. అదే పాలసీ తీసుకున్న తర్వాత నాలుగేళ్ల నుంచి ఏడేళ్లలోపు సరెండర్ చేస్తే అధిక విలువ పాలసీదారుకు దక్కుతుంది. నిజానికి ఎండోమెంట్, మనీబ్యాక్ పాలసీల్లో 20–30 ఏళ్లపాటు కొనసాగినప్పుడే ప్రతిఫలం కనిపిస్తుంది. ఇంతకంటే తక్కువ కాలవ్యవధిపై వచ్చే ప్రయోజనం అంతగా ఉండదు. అందుకని నిధుల అవసరం ఏర్పడితే బీమా ప్లాన్ను సరెండర్ చేయడానికి బదులు.. దానిపై రుణం పొందడమే మెరుగైనది అవుతుంది. మళ్లీ నిధుల వెసులుబాటు వచ్చిన వెంటనే తీసుకున్న రుణాన్ని తీర్చివేయాలి. ఆరంభంలో తక్కువే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న కొత్తలో దీనిపై వచ్చే రుణం చాలా స్వల్పం. ఇందులో ఉన్న ప్రతికూలత ఇదే. క్యాష్ వ్యాల్యూ లేదా సరెండర్ వ్యాల్యూ గణనీయంగా పెరిగేందుకు కొన్నేళ్లు పడుతుంది. అప్పుడే చెప్పుకోతగ్గ మేర రుణం దీనిపై వస్తుంది. ఇక ఎండోమెంట్ లేదా మనీ బ్యాంక్ పాలసీలపై దీర్ఘకాలంలో వచ్చే రాబడి 5–6 శాతం మేర ఉంటుంది. దీనిపై రుణం తీసుకుంటే, నికరంగా అందుకునే రాబడి ప్రయోజనం మరింత తగ్గిపోతుందని గుర్తు పెట్టుకోవాలి. తిరిగి చెల్లించలేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న మరో అనుకూలత ఏమిటంటే.. రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనా అది క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేయబోదని కృష్ణన్ తెలిపారు. రుణంలో అసలు, వడ్డీ, చార్జీలు అన్నింటినీ పాలసీ సరెండర్ వ్యాల్యూ నుంచి బీమా సంస్థలు సర్దుబాటు చేసుకుంటాయని సహిల్ అరోరా తెలిపారు. రుణం చెల్లించకుండా పాలసీదారు మరణించిన సందర్భాల్లో.. పరిహారం నుంచి రుణం, వడ్డీ, చార్జీలను మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థ నామినీ లేదా పాలసీదారు వారసులకు చెల్లిస్తుంది. రుణం తీర్చకుండానే పాలసీ గడువు ముగిసిపోయిందనుకుంటే.. అప్పుడు నికరంగా చెల్లించే మొత్తం నుంచి రుణాన్ని బీమా సంస్థ వసూలు చేసుకుంటుంది. ఒకవేళ రుణంపై వడ్డీ కూడా బకాయి పడితే.. అసలు, వడ్డీ మొత్తం సరెండర్ వ్యాల్యూని దాటిపోతుంటే అప్పుడు పాలసీని బీమా సంస్థ రద్దు చేస్తుంది. పాలసీపై రుణం తీసుకునే సమయంలోనే దానిపై బీమా సంస్థకు హక్కులు బదలాయిస్తున్నట్టు అంగీకారాన్ని తీసుకుంటాయి. రుణం సమంజసమేనా..? అసలు జీవిత బీమా ఎందుకు? ఆర్జించే వ్యక్తికి దురదృష్టవశాత్తూ ఏదైనా వాటిల్లితే అప్పుడు అతనిపై ఆధారపడిన కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకూడదనే. తాను లేకపోయినా, తన కుటుంబ అవసరాలను తీర్చే లక్ష్యంతోనే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకుంటుంటారు. మరి అలాంటి సాధనంపై రుణం తీసుకుంటే, అసలు ప్రయోజనానికే భంగం కలగొచ్చని నిపుణుల భావన. అదెలా అంటే పాలసీపై రుణం తీసుకున్న తర్వాత సదరు పాలసీదారు అనుకోకుండా మరణం పాలైతే.. కుటుంబానికి దక్కే బీమా పరిహారం పెద్దగా ఉండకపోవచ్చు. దాంతో బీమా ఉద్దేశ్యం నెరవేరకుండా పోతుంది. అందుకని బంగారం, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ తదితర ఇతర సాధనాలపై రుణం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని చెబుతుంటారు. కానీ, ఇక్కడ వాస్తవ అంశం ఏమిటంటే.. బంగారంపై రుణం తీసుకున్న తర్వాత సదరు వ్యక్తి మరణించినా కానీ, ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత కుటుంబంపైనే పడుతుంది. అందుకని ఏ సాధనంపై రుణం తీసుకున్నా పరిణామం ఒక్కటిగానే ఉంటుంది. అందుకుని దీనికి పరిష్కారం ఒకటి ఉంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఏదైనా అవసరం కోసం రుణం తీసుకుంటుంటే, వెంటనే అంత విలువకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకోవడం లేదంటే అదనపు కవరేజీతో టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల అనుకోనిది జరిగినా వచ్చే పరిహారంతో రుణాలను గట్టెక్కొచ్చు. ఇక దీర్ఘకాల అవసరాలకు కాకుండా స్వల్పకాల అవసరాలకే బీమాపై రుణానికి పరిమితం కావాలి. మూడు నుంచి ఆరు నెలలు మించకూడదు. ఎందుకంటే ఇంత తక్కువ కాలానికి చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా చాలా తక్కువే ఉంటుంది. కనుక ఒకవేళ పాలసీదారు మరణించినా కుటుంబం పెద్దగా నష్టపోయేది ఉండదు. బీమా సంస్థ తనకు రావాల్సినంత మేర మినహాయించుకుని, మిగిలినది చెల్లించేస్తుంది. ఎండోమెంట్ ప్లాన్ ఉన్న వారు విధిగా మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు కుటుంబానికి మెరుగైన ఆర్థిక రక్షణ ఉంటుంది. -
అత్యంత కస్టమైజ్డ్ పాలసీలకు ఆదరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారితో జీవిత బీమాపై అభిప్రాయం మారిందని, ఏదో పెట్టుబడి సాధనంగా కాకుండా కీలకమైన రిస్క్ కవరేజీ సాధనంగా చూసే ధోరణి పెరిగిందని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ (బీఏఎల్ఐసీ) చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ (సీఏవో) సమీర్ జోషి తెలిపారు. ప్రజలు టర్మ్ ప్లాన్ల వైపు మొగ్గు చూపడం పెరిగిందని చెప్పారు. అలాగే, చెల్లింపుల్లో వెసులుబాటు, ఆన్లైన్ లావాదేవీలు, అదనపు కవరేజీ, వినూత్న ఉత్పత్తులు మొదలైన అత్యంత కస్టమైజ్డ్ ఆప్షన్లను కోరుకుంటున్నారని ఆయన వివరించారు. కంపెనీలు కూడా దానికి అనుగుణంగా సత్వరం తమ సర్వీసులు, ఉత్పత్తుల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నాయని జోషి చెప్పారు. తాము ప్రవేశపెట్టిన ఏస్, డయాబెటిక్ టర్మ్ ప్లాన్ మొదలైనవి ఈ కోవకి చెందినవేనని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. దక్షిణాదిపై మరింత దృష్టి .. ఇతరత్రా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మొదలైనవి .. అలాగే గోవా, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో బీమా విస్తృతి ఎక్కువగా ఉందని ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది. ఈ ప్రాంతాల్లో బీమా విస్తృతిని మరింత పెంచడంపై దృష్టి పెడుతున్నాం. కీలక ఆర్థిక సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నాం. ప్రవాస భారతీయ కస్టమర్లలో చాలా మంది ఈ ప్రాంతాలకు చెందినవారే కావడంతో వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్లు, సర్వీసులను తీర్చిదిద్దుతున్నాం. లక్ష కోట్లు దాటిన ఏయూఎం.. బజాజ్ అలయంజ్ లైఫ్ అతి తక్కువ కాలంలోనే దిగ్గజ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 56,085 కోట్లుగా ఉన్న మా ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటింది. మాపై కస్టమర్ల నమ్మకానికి ఇది నిదర్శనం. సరళమైన, వినూత్నమైన, కస్టమర్ ఆధారిత సాధనాలు, సమర్ధమంతమైన పంపిణీ వ్యవస్థ మొదలైనవి ఇందుకు తోడ్పడ్డాయి. పాలసీల వృద్ధిపరంగా పరిశ్రమ కన్నా అధికంగా 23 శాతం వృద్ధి సాధిస్తున్నాం. మాకు 1.40 లక్షల మంది ఏజెంట్లు, 60 పైచిలుకు ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం, 505 శాఖల పటిష్టమైన నెట్వర్క్ ఉంది. మొత్తం మీద సహాయకరమైన నియంత్రణ వ్యవస్థ, ప్రభావవంతమైన మార్పులతో 2023 మా సంస్థతో పాటు ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగానికి సానుకూలంగా గడిచింది. వృద్ధి లక్ష్యాలు.. వినూత్న ఉత్పత్తులు, సమగ్ర సేవలతో కొత్త ఏడాదిలో మరింత మంది కస్టమర్లకు చేరువై జీవిత బీమా రంగంలో మా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్దేశించుకున్నాం. కొత్త పాలసీల విషయంలో పరిశ్రమకు రెట్టింపు స్థాయి వృద్ధి సాధించడం, వేగంగా ఎదుగుతున్న టాప్ సంస్థల్లో ఒకటిగా కొనసాగడాన్ని లక్ష్యాలుగా పెట్టుకున్నాం. మా నెట్వర్క్ను మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడతాం. పరిశ్రమపరంగా చూస్తే 2032 నాటికి భారత ఇన్సూరెన్స్ మార్కెట్ ప్రపంచంలోనే ఆరో పెద్ద మార్కెట్గా ఎదుగుతుందని స్విస్ రీ సంస్థ ఒక నివేదికలో అంచనా వేసింది. పరిశ్రమ వృద్ధి గతిని తీర్చిదిద్దడంలో నియంత్రణ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది. బీమా సుగమ్, బీమా వాహక్, బీమా విస్తార్ వంటివి దేశవ్యాప్తంగా కోట్ల మందికి బీమాను అందుబాటులోకి తేవడం ద్వారా ‘2047 నాటికి అందరికీ బీమా కల్పించడం’ అనే ఐఆర్డీఏఐ లక్ష్య సాధనలో తోడ్పడగలవు. అలాగే పాలసీలను క్రమబద్ధీకరించడం, ప్రక్రియలను .. సర్వీసులను మెరుగుపర్చడం వంటి చర్యల ద్వారా బీమాను సరళతరం చేయడంపై పరిశ్రమ మరింతగా దృష్టి పెట్టనుంది. -
మెరైన్ బీమాపై శ్రీరామ్ జనరల్ ఫోకస్
చెన్నై: బీమా సంస్థ శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ వాహనయేతర బీమా విభాగాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా మెరైన్, అగ్ని ప్రమాదాలు మొదలైన వాటికి సంబంధించిన బీమా పాలసీలను ప్రవేశపెడుతోంది. కంపెనీ చీఫ్ అండర్రైటింగ్ ఆఫీసర్ శశికాంత్ దహూజా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తమ వ్యాపారంలో మోటార్ ఇన్సూరెన్స్ వాటా సుమారు 92 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. డైవర్సిఫికేషన్ ప్రణాళికల్లో భాగంగా ఫైర్, మెరైన్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో కొత్త బీమా పాలసీలను ప్రవేశపెట్టనున్నట్లు శశికాంత్ చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లలో వాహనయేతర వ్యాపారాన్ని 15 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇది 7–8 శాతంగా ఉంది. కేవలం ఒక విభాగంపై ఎక్కువగా ఆధారపడకూడదనే వ్యాపార వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం 37% పెరిగి రూ.98 కోట్లకు చేరింది. ఈ ఏడాది వ్యాపారం 30% మేర వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నట్లు శశికాంత్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల బీమా పాలసీల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో రూ.82 కోట్ల విలువైన పాలసీలను విక్రయించామన్నారు. ఈ ఏడాది వీటి విక్రయాలు రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 3,780 మంది ఉద్యోగులు ఉన్నారని, ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా 700 మందిని నియమించుకోనున్నామని శశికాంత్ తెలిపారు. -
ఎల్ఐసి సేవలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా.. ఇలా ప్రారంభించండి!
LIC WhatsApp Service: ఆధునిక కాలంలో చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీలు ఉంటాయి. అయితే మనకు ఇందులో ఏదైనా సందేహం వచ్చినా, సమస్య వచ్చిన నేరుగా సంబంధిత కార్యాలయానికి వెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అయితే సంస్థ ఇప్పుడు తమ పాలసీదారుల కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీసుని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ సర్వీసుల గురించి తెలుసుకోవచ్చు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎల్ఐసి కంపెనీ ప్రవేశపెట్టిన వాట్సాప్ సర్వీసు ద్వారా లోన్ ఎలిజిబిలిటీ, రీపేమెంట్ ఎస్టిమేట్, ప్రీమియం డ్యూ డేట్స్ వంటి వాటితో పాటు బోనస్ ఇన్ఫర్మషన్, లోన్ ఎలిజిబిలిటీ కొటేషన్, ఎల్ఐసి సర్వీస్ లింక్స్, పాలసీ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. (ఇదీ చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో నాలుగు బైకులు - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?) ఎల్ఐసి వాట్సాప్ సర్వీస్ ఉపయోగించుకోవడమెలా? మీ స్మార్ట్ఫోన్లో 8976862090 అనే నెంబర్కి 'హాయ్' అని మెసేజ్ చేయాలి. తరువాత మీకు 11 ఆప్షన్ కనిపిస్తాయి. అందులో మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దానిని సెలక్ట్ చేసుకోవాలి. మీరు ఎంచుకునే ఆప్షన్ని బట్టి రిప్లై వస్తుంది. వాట్సాప్ చాట్లోనే మీకు అవసరమైన వివరాలను ఎల్ఐసి షేర్ చేస్తుంది -
జీవిత బీమా.. రాబడి చూడొద్దు
జీవిత బీమా అనగానే.. ప్రీమియం ఎంత.. రాబడి ఎంత..? అన్న ప్రశ్న వస్తుంది. ఇప్పటికీ జీవిత బీమా విషయంలో ఎక్కువ మంది ఎంపిక సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలే. ఇందుకోసం భారీగా ప్రీమియం చెల్లిస్తుంటారు. ఒకవైపు బీమా కవరేజీ. మరోవైపు రాబడి. ఇదే ఎక్కువ మందిని ఆకర్షించే అంశం. బ్యాంక్ డిపాజిట్లో మాదిరిగా, లేదంటే అంతకంటే ఎక్కువ రాబడి బీమా పాలసీలో వస్తుందని నమ్ముతుంటారు. దీనికి అదనంగా బీమా రక్షణ ఉంటుందన్న కారణంతో దీనివైపే మొగ్గు చూపిస్తుంటారు. రాబడి ఇవ్వని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అర్థం చేసుకుని తీసుకునే వారు మొత్తం మీద తక్కువ. కానీ, సంప్రదాయ బీమా పాలసీల్లో రాబడి విషయమై ఎక్కువ మందిలో ఉండే అంచనా తప్పు. రాబడి రేటు చాలా తక్కువ. సగటు ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువేనని గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తుంది. మార్కెటింగ్లో భాగంగా సంప్రదాయ బీమా పాలసీలను ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాన్ని బీమా సంస్థలు, ఏజెంట్లు చేస్తుంటారు. కానీ, ఇక్కడ స్పష్టంగా తేల్చుకోవాల్సింది ఏమిటంటే.. కావాల్సింది బీమా రక్షణా? లేక రాబడా? ఈ అంశాలను వివరించే కథనం ఇది... సంప్రదాయ బీమా పాలసీలు రెండు రకాల ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంటాయి. మరణించినప్పుడు పరిహారాన్ని చెల్లిస్తాయి. పాలసీ కాలం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీదారు ఏదైనా కారణంతో దురదృష్టవశాత్తూ పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీదారు జీవించి ఉంటే చివర్లో అన్ని ప్రయోజనాలనూ కలిపి బీమా సంస్థ చెల్లిస్తుంది. బీమా ప్లాన్ బ్రోచర్లో ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు ఎల్ఐసీ బీమా జ్యోతి ప్లాన్ పరిశీలిస్తే.. ఇది పొదుపు, బీమాతో కూడిన ప్లాన్. 15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం చెల్లించక్కర్లేదు. 5 ఏళ్లు తగ్గించి మిగిలిన కాలానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి బీమా జ్యోతి పాలసీని రూ.15 లక్షల సమ్ అష్యూరెన్స్పై (బీమా రక్షణ/కవరేజీ) తీసుకుంటే అప్పుడు ఏటా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.80వేలు. ఇలా 15 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. జీవించి ఉంటే రెండు రూపాల్లో ఈ ప్లాన్ ప్రయోజనాలను చెల్లిస్తుంది. 55 ఏళ్ల వరకు జీవించి ఉంటే అప్పుడు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్ పొందొచ్చు. గ్యారంటీడ్ అడిషన్ అనేది ప్రతి రూ.1,000పై రూ.50 చొప్పున వస్తుంది. అంటే మొత్తం మీద 20 ఏళ్ల కాలంలో ప్రీమియం రూపేణా రూ.12 లక్షలు చెల్లిస్తారు. అంటే రూ.10 లక్షల కవరేజీ కోసం అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నారు. జీవించి ఉంటే 20 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం రూ.20 లక్షలు. అంటే రాబడి రూ.8 లక్షలే. అది కూడా 20 ఏళ్ల కాలానికి. ఇందులో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (రాబడి రేటు) 4 శాతమే. ఇదనే కాదు. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు అన్నింటిలోనూ దాదాపు ఇదే స్థాయిలో రాబడి ఉంటుంది. ఒకవేళ 30–40 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఈ రాబడి రేటు 4.5–5 శాతం మధ్య ఉంటుంది. కానీ, మన దేశంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండడాన్ని గమనించొచ్చు. ద్రవ్యోల్బణం రేటు, అంతకంటే తక్కువ రాబడి రేటు ఏదైనా.. నికరంగా అది మనకు రాబడిని ఇచ్చినట్టు కాదని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ప్లాన్ కాల వ్యవధిలో పాలసీదారు మరణించినట్టయితే, సమ్ అష్యూరెన్స్తోపాటు అప్పటి వరకు సమకూరిన గ్యారంటీడ్ అడిషన్స్ చెల్లిస్తారు. బేసిక్ సమ్ అష్యూరెన్స్పై 125 శాతం, వార్షికంగా చెల్లించే ప్రీమియానికి ఏడు రెట్లు, లేదంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు 105 శాతం.. వీటిల్లో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఉదాహరణకు 35 ఏళ్ల వయసులో తీసుకుని 50 ఏళ్ల సమయంలో మరణం సంభవించినట్టయితే రూ.20 లక్షలు పరిహారంగా ముడుతుంది. ప్రత్యామ్నాయం... బీమా, పెట్టుబడి ఈ రెండింటినీ కలిపి చూడొద్దని నిపుణులు తరచూ చెబుతుంటారు. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల అటు సరైనా బీమా రక్షణ, ఇటు సరైన రాబడి పొందలేని పరిస్థితికి సంప్రదాయ బీమా పాలసీలు అచ్చమైన ఉదాహరణ. అలా కాకుండా అచ్చమైన జీవిత బీమా రక్షణను ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ తీసుకుని, మరోవైపు మెరుగైన రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. పై ఉదాహరణ ఆధారంగా బీమా, పెట్టుబడిని వేరు చేస్తే వచ్చే ప్రయోజనం ఏ మేరకు ఉంటుందో చూద్దాం. 35 ఏళ్ల వయసున్న వ్యక్తి 25 ఏళ్ల కాలానికి అంటే 60 ఏళ్లు వచ్చే వరకు (రిటైర్మెంట్ వయసు/బాధ్యతలు ముగిసే సగటు వయసు) రూ.50 లక్షల సమ్ అష్యూరెన్స్తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.10వేల లోపే. ఎక్కువ కంపెనీల్లో ప్రీమియం రూ.7,400 నుంచి 9,800 మధ్య ఉంది. పొగతాగడం, మద్యపానం, అనారోగ్య సమస్యలు లేని వారికి ఈ ప్రీమియం అని అర్థం చేసుకోవాలి. బీమా జ్యోతి ప్లాన్లో ఏటా చెల్లించే ప్రీమియం రూ.80వేలు. కానీ బీమా రక్షణ రూ.10 లక్షలే. ఈ ప్రీమియంలో కేవలం 12 శాతం చెల్లించడం ద్వారా టర్మ్ ప్లాన్లో రూ.50 లక్షల బీమా కవరేజీని, అది కూడా 25 ఏళ్ల కాలానికి పొందొచ్చు. కేవలం 12 శాతం ప్రీమియానికే ఐదు రెట్లు అధిక బీమా రక్షణ తీసుకోవడం మెరుగైన నిర్ణయం అనిపించుకుంటుంది. అప్పుడు మిగిలిన రూ.70వేలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బీమా జ్యోతితో ప్రీమియం చెల్లింపు 15 ఏళ్లే కనుక దాన్నే పరిగణనలోకి తీసుకుని చూద్దాం. 12 శాతం రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్ పథకంలో ఏడాదికోసారి రూ.70వేల చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే 15 ఏళ్ల చివరికి రూ.29.22 లక్షలు సమకూరుతుంది. ఇందులో అసలు రూ.10.5 లక్షలు అయితే, రాబడి రూ.18.72 లక్షలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో దీర్ఘకాలానికి వార్షిక రాబడి 12 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ 10 శాతం రాబడి ఆధారంగా అంచనా వేసుకున్నా.. 15 ఏళ్లలో రూ.24.46 లక్షలు సమకూరుతుంది. విడిగా బీమా ప్లాన్, పెట్టుబడి ప్లాన్ ఎంపిక చేసుకోవడం వల్ల మెరుగైన కవరేజీకితోడు, మెరుగైన సంపద సృష్టి సాధ్యపడుతుందని ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. కాంపౌండింగ్ ఉండదు.. విడిగా ఇన్వెస్ట్ చేసుకుంటే కాంపౌండింగ్ ఉంటుంది. అంటే రాబడిపై రాబడి తోడవుతుంది. కానీ, సంప్రదాయ బీమా ప్లాన్లలో చెల్లించే గ్యారంటీడ్ అడిషన్స్, రివర్షనరీ బోనస్, సింపుల్ అడిషన్స్ మొత్తంపై కాంపౌండింగ్ ఉండదు. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బాండ్లను తీసుకుంటే, మొదటి ఏడాది రాబడిపై తర్వాతి కాలంలో రాబడి జమ అవుతుంది. ఇలా కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. పైకి కనిపించదు కానీ, సంపద సృష్టిలో కాంపౌండింగ్కు చాలా ప్రాధాన్యం ఉంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడి రేటు ముందే చెబుతారు. అదే, సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి రేటు ముందు చెప్పరు. సమ్ అష్యూరెన్స్తోపాటు ఇతర ప్రయోజనాలు చెల్లించే విధంగా ప్లాన్ ఉంటుంది. ఇందులో నికర రాబడి ఏ మేరకు అన్నది అర్థం చేసుకోవడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. సమ్ అష్యూరెన్స్కే హామీ ఉంటుంది. ఇతర చెల్లింపులకు హామీ ఉండదు. బీమా సంస్థ పనితీరు (అది చేసే పెట్టుబడులపై రాబడులు)పైనే ఆధారపడి ఉంటాయని అర్థం చేసుకోవాలి. అందుకే అన్నింటికంటే కుటుంబానికి మెరుగైన జీవిత బీమా రక్షణ కల్పించుకోవడం ముందుగా చేయాలి. రాబడి కోసం దీర్ఘకాలంలో ఈక్విటీలే మెరుగైన సాధనమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, ఇంకా ఆర్థిక వెసులుబాటు ఉంటే అప్పుడు మీకు నచ్చిన ప్లాన్ను కొనుగోలు చేసుకోవచ్చు. గ్యారంటీడ్/ పార్టిసిపేటింగ్ బీమా సంస్థలు సంప్రదాయ పాలసీలను ఆకర్షణీయంగా చూపించేందుకు బోనస్లను ప్రకటిస్తుంటాయి. బీమా సంస్థ పనితీరుపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ బీమా ప్లాన్లు సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ మెచ్యూరిటీ బోనస్, లాయల్టీ అడిషన్ను ఆఫర్ చేస్తుంటాయి. ఇవన్నీ బీమా సంస్థ వద్ద మిగులు నిల్వలపైనే ఆధారపడి ఉంటాయనే షరతు విధిస్తారు. మిగులు ఉంటే అప్పుడు సింపుల్ రివర్షనరీ బోనస్ ను చెల్లిస్తారు. కొన్ని ప్లాన్లలో సింపుల్ రివర్షనరీ బోనస్ అని కాకుండా, పాలసీ కాల వ్యవధి ముగింపు సమయంలో లాయల్టీ అడిషన్స్ పేరుతో చెల్లిస్తారు. ఇదే తరహా సంప్రదాయ ప్లాన్లు కొన్ని చివర్లో అడిషనల్ బోనస్ చెల్లింపునకు హామీ ఇస్తాయి. పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్ తీసుకుంటున్నట్టు అయితే, కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉన్న సందర్భంలో సమ్ అష్యూరెన్స్కు అదనంగా ఏదో ఒక రూపంలో చెల్లింపు ఉంటుంది. అదే నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ తీసుకుంటుంటే జీవించి ఉంటే చివర్లో ఏమీ రాదు. టర్మ్ ఇన్సూరెన్స్ను నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్గా పేర్కొంటారు. ఇప్పుడు ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వస్తున్నాయి. కనుక ఇక్కడ పొరపాటు పడొద్దు. ప్రీమియం వెనక్కి రాని టర్మ్ ప్లాన్ ప్రీమి యంతో పోలిస్తే, చివర్లో ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్ ప్రీమియం చాలా అధికంగా ఉంటుంది. -
విద్యుత్ వాహనాల బీమాకు జాగ్రత్తలు
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతోంది. 2022 ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం మన రహదారులపై 13 లక్షల పైచిలుకు ఈవీలు ఉన్నాయి. మూడేళ్లుగా వీటి అమ్మకా ల వృద్ధి వార్షికంగా 130 శాతంగా ఉంటోంది. వీటిల్లో అత్యధికంగా త్రిచక్ర రవాణా వాహనాలు, తర్వాత స్థానంలో ద్విచక్ర వాహనాలు, కార్లు ఉన్నా యి. అయితే మిగతా వాటి తరహాలోనే విద్యుత్ వాహనాలకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. అవి.. ► ఒక్క సారి చార్జి చేస్తే వాహనం ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందనేది ఒక సవాలు. ► ఈవీలు విజయవంతం కావాలంటే చార్జింగ్పరమైన మౌలిక సదుపాయాలు భారీగా అవసరం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇంకా పురోగమన దశలోనే ఉన్నాయి. ► ఈవీ బ్యాటరీ ఖరీదు.. వాహనం రేటులో దాదాపు సగం దాకా ఉంటోంది. కాబట్టి, బ్యాటరీ దీర్ఘాయుష్షు, వారంటీ, రీసేల్ విలువ గురించి చాలా సందేహాలే ఉన్నాయి. ► ఓవర్ చార్జింగ్ వల్ల వాహనంలో మంటలు చెలరే గితే పరిస్థితి ఏమిటనే భయాలూ ఉన్నాయి. అగ్నిప్రమాదాలకు దారి తీస్తే థర్డ్ పార్టీకి వాటిల్లే ఆస్తి, ప్రాణ నష్టానికి లయబిలిటీపైనా సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక మోటరు బీమా పాలసీ దశాబ్దాల కిందట రూపొందింది. అప్పుడు ఈవీలు, హైబ్రీడ్ వాహనాల ఉనికి లేదు. అయితే, మారే మార్కెట్ అవసరాలు, సమయానికి తగినట్లు కొత్త పథకాలను ప్రవేశపెట్టేలా ఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా రంగ నియంత్రణ సంస్థ స్వేచ్ఛనిస్తోంది. తదనుగుణంగానే బీమా సంస్థలు కూడా పైన పేర్కొన్న పలు సవాళ్లను పరిష్కరించగల యాడ్–ఆన్లను అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీల కోసం బీమా తీసుకునేటప్పుడు కొనుగోలుదారు ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ► బ్యాటరీకి విడిగా కవరేజి ఉందా? ఒకవేళ చార్జింగ్ చేసేటప్పుడు వరద లేదా అగ్ని ప్రమాదాల్లాంటివి సంభవించినట్లయితే బ్యాటరీ పూర్తి నష్టానికి పాలసీలో కవరేజీ ఉండాలి. ► ప్లాస్టిక్, లోహాలు, గాజు లేదా ఫైబర్ ఏవైనా భాగాలు అన్నింటికీ జీరో డిప్రిసియేషన్ కవరేజీ ఉందా అన్నది చూసుకోవాలి. ► ఈవీ వల్ల థర్డ్ పార్టీ ప్రాపర్టీ ధ్వంసమైనా, వారికి గాయాలైనా ఈవీ యజమానిపై దావా వేస్తే పరిహారంపరమైన సమస్యలు ఎదురవకుండా విడి గా లయబిలిటీ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ► గోడలో బిగించిన చార్జర్కు, చార్జింగ్ చేసే కేబుల్కు విడిగా కవరేజి ఉందా లేదా. ఈ భాగాలన్నీ వాహనంలో బిగించి ఉండవు కాబట్టి, వాటి గురించి నిర్దిష్టంగా తెలియపరుస్తూ కవరేజీ కల్పించడం ముఖ్యం. ► ఓఈఎం (వాహనం తయారీ సంస్థ) చేసే ప్రామాణికమైన ఫిట్టింగ్స్కు అదనంగా కారులో బిగించిన ఇన్ఫోటెయిన్మెంట్ గ్యాడ్జెట్లు, మ్యూ జిక్ సిస్టమ్లు, ఇతరత్రా ఏవైనా గ్యాడ్జెట్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటికీ కవరేజీ ఉందో లేదో చూసుకోవాలి. -
అన్రిజిస్టర్డ్ వ్యక్తులకూ ఇక జీఎస్టీ రిఫండ్స్!
న్యూఢిల్లీ: రద్దయిన కాంట్రాక్టులు లేదా బీమా పాలసీలకు సంబంధించి నమోదుకాని (అన్రిజిస్టర్డ్) వ్యక్తులు కూడా ఇకపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వాపసులను క్లెయిమ్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తన పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)తో జీఎస్టీ పోర్టల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ను పొందాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఒక ప్రకటనలో సూచించింది. బ్యాంక్ అకౌంట్ నెంబర్తోపాటు, రిఫండ్కు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కాంట్రాక్ట్ రద్దయిన సందర్భంలో తాము అప్పటికే భరించిన పన్ను మొత్తాన్ని వాపసు కోసం క్లెయిమ్ చేయడానికి ఒక సదుపాయాన్ని (ఫెసిలిటీ) కల్పించాలని రిజిస్టర్ కాని కొనుగోలుదారులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని వెలువరిస్తున్నట్లు తెలిపింది. రెండేళ్ల కాల వ్యవధి... తాజా నిర్ణయంతో ఫ్లాట్, భవనం నిర్మాణం లేదా దీర్ఘకాలిక బీమా పాలసీ రద్దుకు సంబంధించి అప్పటికే చెల్లించిన జీఎస్టీని ఇకపై అన్ రిజిస్టర్డ్ వ్యక్తులూ తిరిగి పొందే (రిఫండ్) వెసలుబాటు కలిగింది. నమోదవ్వని పన్ను చెల్లింపుదారు సంబంధిత తేదీ నుండి రెండు సంవత్సరాలలోపు వాపసుల కోసం ఫైల్ చేయవచ్చని సీబీఐసీ వివరించింది. వస్తువులు, సేవలను స్వీకరించిన తేదీ లేదా ఒప్పందం రద్దయిన తేదీ నుంచి ఇది ఈ రెండేళ్ల కాల వ్యవధి వర్తిస్తుందని వివరించింది. డిసెంబర్ 17న జరిగిన జీఎస్టీ అత్యున్నత స్థాయి 48వ సమావేశం నిర్ణయాలకు అనుగుణంగా తాజాగా సీబీఐసీ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ‘‘రిజిస్టర్ చేయని కొనుగోలుదారులు సరఫరా జరగని చోట జీఎస్టీ వాపసు పొందడానికి తాజా నిర్ణయం అనుమతిస్తుంది. వారిపై ఇప్పటి వరకూ ఉన్న అనవసరమైన వ్యయ భారాన్ని నివారించడంలో సహాయపడుతుంది’’ అని అని భారత్లో కేపీఎంసీ ప్రతినిధి (పరోక్ష పన్ను) అభిషేక్ జైన్ వ్యాఖ్యానించారు. -
పాలసీల విక్రయాల్లో అనైతిక పోకడ వద్దు
న్యూఢిల్లీ: కస్టమర్లతో ఏదో రకంగా బీమా పాలసీలను విక్రయించే విధానాలను బ్యాంక్లు అనుసరిస్తున్నాయనే విమర్శలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. బీమా ఉత్పత్తుల విక్రయాల కోసం అనైతిక విధానాలను అనుసరించొద్దని బ్యాంక్లను కోరింది. కస్టమర్లకు బీమా పాలసీల విక్రయాల్లో అనైతిక విధానాలు పాటించకుండా తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల అధినేతలను ఆదేశించింది. కస్టమర్లకు బీమా పాలసీలను విక్రయించే విషయంలో బ్యాంక్లు, బీమా సంస్థలు మోసపూరిత, అనైతిక విధానాలకు పాల్పడుతున్నాయంటూ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగానికి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 75 ఏళ్లు దాటిన కస్టమర్లకు సైతం జీవిత బీమా పాలసీలను విక్రయించిన సందర్భాలను ప్రస్తావించింది. సాధారణంగా కస్టమర్లు రుణాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, టర్మ్ డిపాజిట్ చేస్తున్నప్పుడు బ్యాంక్లు బీమా ఉత్పత్తులను వారితో కొనిపించే ప్రయత్నం చేస్తుంటాయి. ఏదో ఒక బీమా కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులను కస్టమర్లతో బలవంతంగా కొనిపించే చర్యలకు దూరంగా ఉండాలని తాజా ఆదేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. బీమా ఉత్పత్తుల విక్రయాలపై ప్రోత్సాహకాలు ఇవ్వడం క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఒత్తిడికి దారితీయడమే కాకుండా, బ్యాంక్ల ప్రధాన వాణిజ్య కార్యకలపాలపై ప్రభావం పడుతుందని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సైతం ఆందోళన వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అనైతిక, అనుచిత విధానాలను అనుసరించకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని, తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని కోరింది. బీమా పాలసీల విక్రయాలకు సంబంధించి నూరు శాతం కేవైసీ నిబంధనలు అమల్లో పెట్టాలని కూడా ఆదేశించింది. -
పోస్టాఫీస్ పథకం: రూ.399కే రూ.10లక్షల యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్!
పోస్టల్ డిపార్ట్ మెంట్ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. టాటా ఏఐజీత కలిసి ఖాతాదారుల కోసం గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పేరిట యాక్స్డెంట్ ఇన్స్యూరెన్స్ పాలసీని తీసుకువచ్చింది. ఈ పాలసీ హొల్డర్లు ఏడాదికి రూ.399 చెల్లించి రూ.10లక్షల యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ పాలసీ గురించి క్లుప్తంగా ►18 నుంచి 65ఏళ్ల వయసు కలిగిన వారు ఎవరైనా సరే పోస్టాఫీస్ నుంచి ఈ పాలసీని పొందవచ్చు. ►పాలసీ హోల్డర్లు ప్రమాదంలో మరణించినా, శాస్వత వైకల్యం ఏర్పడినా రూ.10లక్షలు చెల్లిస్తారు. ►ప్రమాదం జరిగి వైద్యం కోసం ఆస్పత్రిలో చేరితే రూ.60వేలు చెల్లిస్తారు. ►ఔట్ పేషంట్ రూ.30వేల వరకు క్లైమ్ చేసుకోవచ్చు. ►ఇక ఇదే పథకం కింద పాలసీ దారులు రూ.299 చెల్లించినా రూ.10లక్షల వరకు ఇన్స్యూరెన్స్ పొందవచ్చు. దీంతో పాటు ఇతర సౌకర్యాలు పొందవచ్చు. -
మెడిక్లెయిమ్ సెగ్మెంట్పై మళ్లీ ఎల్ఐసీ చూపు!
న్యూఢిల్లీ: భారత బీమా రంగ దిగ్గజ సంస్థ– జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తిరిగి మెడిక్లెయిమ్ బీమా పాలసీ సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి ఆసక్తిగా ఉంది. ఈ విషయంపై రెగ్యులేటర్– ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ పేర్కొన్నారు. మెడిక్లెయిమ్ పాలసీ అంటే... మెడిక్లెయిమ్ పాలసీలు అంటే... నష్టపరిహారం (ఇన్డెమ్నిటీ) ఆధారిత ఆరోగ్య పథకాలు. అయితే మార్కెట్ నుండి ఈ పథకాలను ఉపసంహరించుకోవాలని 2016లో ఐఆర్డీఏఐ జీవిత బీమా సంస్థలను కోరింది. మూడు నెలల నోటీస్ పిరియడ్తో అప్పట్లో వాటి ఉపసంహరణ కూడా జరిగింది. జీవిత బీమా సంస్థలు ఇలాంటి ఆరోగ్య సంబంధ పథకాలు ఇవ్వడానికి సాంకేతికంగా అడ్డంకులు ఉన్నాయని అప్పట్లో రెగ్యులేటర్ భావించింది. నష్టపరిహార ఆధారిత ఆరోగ్య బీమా పథకాల కింద బీమా చేసిన మొత్తం వరకు వైద్య చికిత్స కోసం ఖర్చు చేసిన డబ్బుకు బీమా సంస్థ రీయింబర్స్మెంట్ (చెల్లింపులు) చేస్తుంది. 2016లో ఉపసంహరణకు ముందు జీవిత బీమా సంస్థల ఆరోగ్య పోర్ట్ఫోలియోలో 90–95 శాతం నష్టపరిహార ఆధారిత ఆరోగ్య బీమా పథకాలు (ఇన్డెమ్నిటీ) ఉండేవి. దీని ప్రకారం పాలసీదారు వైద్యుడిని సందర్శించిన తర్వాత లేదా వైద్య ఖర్చులను భరించిన తర్వాత రీయింబర్స్మెంట్ను క్లెయిమ్ చేసే వీలుండేది. మళ్లీ మార్పు ఎందుకు? 2030 నాటికి ప్రతి పౌరుడు ఆరోగ్య బీమా పాలసీని కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్న ఆదేశాల నేపథ్యంలో జీవిత బీమా సంస్థలు ఆరోగ్య విభాగంలోకి తిరిగి ప్రవేశించే సమయం ఆసన్నమైందని ఇటీవలే కొత్త ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశిష్ పాండా అన్నారు.అయితే జీవిత బీమా సంస్థలను ఆరోగ్య బీమా పాలసీలను విక్రయించడానికి అనుమతించడం వల్ల కలిగే లాభ నష్టాలను రెగ్యులేటర్ మదింపు చేస్తోందని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్లలో జీవిత బీమా సంస్థలు ఆరోగ్య పాలసీలనూ విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 24.50 లక్షల మంది జీవిత బీమా ఏజెంట్లు ఉండగా, సాధారణ, ఆరోగ్య బీమా విభాగంలో కేవలం 3.60 లక్షల మంది ఏజెంట్లు మాత్రమే ఉన్నారు. జీవిత బీమా సంస్థలను ఆరోగ్య బీమా రంగంలోకి అనుమతించినట్లయితే, ఏజెంట్ల సంఖ్య 600 శాతం పెరుగుతుంది. దీనివల్ల దేశంలో ఆరోగ్య బీమా వ్యాప్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా. -
అరుదైన ఘనత దక్కించుకున్న ఎల్ఐసీ!
Lic Stands Fortune 500 List: ఇటీవలే లిస్టయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తొలిసారిగా ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో చోటు దక్కించుకుంది. 97.26 బిలియన్ డాలర్ల ఆదాయం, 553.8 మిలియన్ డాలర్ల లాభంతో 98వ స్థానంలో నిల్చింది. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ 93.98 బిలియన్ డాలర్ల ఆదాయం, 8.15 బిలియన్ డాలర్ల లాభాలతో ఏకంగా 51 స్థానాలు ఎగబాకి 104వ ర్యాంకును దక్కించుకుంది. రిలయన్స్ గత 19 ఏళ్లుగా ఈ లిస్టులో కొనసాగుతోంది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలపరంగా అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న సంస్థలతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితా రూపొందించింది. భారత్ నుంచి తొమ్మిది కంపెనీలు (అయిదు ప్రభుత్వ రంగంలోనివి, నాలుగు ప్రైవేట్ రంగంలోనివి) చోటు దక్కించుకున్నాయి. దేశీ కార్పొరేట్లలో రిలయన్స్ కన్నా పైస్థాయిలో ఉన్నది ఎల్ఐసీ మాత్రమే. ఫార్చూన్ 500లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 28 స్థానాలు ఎగబాకి 142వ ర్యాంకు, ఓఎన్జీసీ 16 ర్యాంకులు దాటి 190వ స్థానంలో ఉన్నాయి. ఎస్బీఐ 17 స్థానాలు (236వ ర్యాంకునకు), బీపీసీఎల్ 19 ర్యాంకులు (295వ స్థానానికి) పెరిగాయి. టాటా మోటార్స్ 370, టాటా స్టీల్ 435, రాజేశ్ ఎక్స్పోర్ట్స్ 437 ర్యాంకుల్లో నిల్చాయి. (ఇది కూడా చదవండి: ఏడో రోజూ లాభాల రింగింగ్, ఐటీ జోరు) మరిన్ని విశేషాలు.. ► వరుసగా తొమ్మిదోసారి అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ నంబర్ వన్ స్థానంలో నిల్చింది. అమెజాన్, చైనాకు చెందిన స్టేట్ గ్రిడ్, చైనా నేషనల్ పెట్రోలియం, సైనోపెక్ వరుసగా ఆ తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి. ► జాబితాలోని కంపెనీల మొత్తం అమ్మకాలు 19 శాతం పెరిగి 37.8 ట్రిలియన్ డాలర్లకు చేరాయి. ► తొలిసారిగా గ్రేటర్ చైనా (తైవాన్తో కలిపి) సంస్థల ఆదాయాలు.. అమెరికన్ కంపెనీలను మించాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: మహిళల్లో మార్పులు.. వచ్చింది కాదు నచ్చింది కావాలి! -
వాహనం నడిపినంతే బీమా!.. తగ్గనున్న బీమా ప్రీమియం
న్యూఢిల్లీ: కార్తీక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతడికి ఒక కారు, ఒక బైక్ ఉన్నాయి. నిత్యం కార్యాలయానికి కారులో వెళుతుంటాడు. ఇతర పనులకు బైక్ ఉపయోగిస్తాడు. దీంతో అతడు రెండింటికీ వేర్వేరు మోటారు బీమా పాలసీలను తీసుకుని ఉంటాడు. ఇకపై ఒక్కటే ఫ్లోటర్ పాలసీ తీసుకోవచ్చు. పైగా ప్రీమియం కూడా తక్కువకే వస్తుంది. ఎందుకంటే అతడు బైక్ వాడేది చాలా తక్కువ. పైగా కార్యాలయం కూడా 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలా చూసుకుంటే కారు వినియోగం కూడా తక్కువే. పైగా ఏకకాలంలో రెండు వాహనాలను వినియోగించడం అసాధ్యం. అందుకే అతడికి గతంతో పోలిస్తే ఇక మీదట ప్రీమియం చాలావరకు తగ్గనుంది. ఈ తరహా సంస్కరణలకు వీలు కల్పిస్తూ.. మోటారు ఇన్సూరెన్స్ పాలసీలకు అధునాతన ఫీచర్లతో కూడిన యాడాన్లను ప్రవేశపెట్టేందుకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) అనుమతించింది. కొత్త యాడాన్లు..: మోటారు ఓన్ డ్యామేజ్ (ఓడీ) అన్నది బేసిక్ మోటారు బీమా ప్లాన్. ఇందులో వాహనానికి ఏదైనా కారణం వల్ల నష్టం ఏర్పడితే కవరేజీ ఉంటుంది. ఇప్పుడు దీనికి ‘పే యాజ్ యూ డ్రైవ్, పే హౌ యూ డ్రైవ్’ అనే కాన్సెప్ట్ తోడు కానుంది. వాహనాన్ని నడిపిన మేరకు, నడిపే తీరుకు అనుగుణంగా బీమా సంస్థ టెక్నాలజీ సాయంతో ప్రీమియాన్ని నిర్ణయిస్తుంది. ఉదాహరణకు తక్కువ దూరం నడిపేవారికి తక్కువ ప్రీమియం, ఎక్కువ దూరం నడిపేవారికి కొంచెం ఎక్కువ ప్రీమియం ఇలా అన్నమాట. లేదంటే తక్కువ దూరం, సురక్షిత డ్రైవింగ్ విధానాన్ని అనుసరించే వారికి తక్కువ ప్రీమియానికే మరింత కవరేజీ లభించొచ్చు. అలాగే, ఒకే వాహనదారుడికి ఒకటికి మించిన వాహనాలు ఉంటే అన్నింటికీ కలిపి ఫ్లోటర్ పాలసీ జారీ చేసేందుకు కూడా ఐఆర్డీఏఐ అనుమతించింది. -
ధీమాగా బీమా ఇలా..!
ఆరోగ్య బీమా అవసరాన్ని గతంతో పోలిస్తే నేడు ఎక్కువ మంది గుర్తిస్తున్నారు. డిజిటల్ వేదికలు విస్తృతం కావడం, స్మార్ట్ఫోన్ల వినియోగం ఊపందుకోవడం హెల్త్ ఇన్సూరెన్స్పై అవగాహన పెరగడానికి సాయపడుతున్నాయి. కరోనా మహమ్మారి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాన్ని తెలిసేలా చేసింది. కానీ, ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో చాలా మందికి రకరకాల సందేహాలున్నాయి. బీమా పాలసీని తీసుకునేందుకు ఇవి అడ్డుపడొచ్చు. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పనిచేసే విధానం, క్లెయిమ్కు సంబంధించి కూడా రకరకాల అపోహలు ఉన్నాయి. వీటిని తొలగించుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తారు. ఇలాంటి కొన్ని అపోహలు, వాటికి సంబంధించి వాస్తవాలను నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ ప్రొడక్ట్స్, క్లెయిమ్స్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా వెల్లడించారు. ఆస్పత్రిలో చేరి కనీసం 24 గంటల పాటు చికిత్స తీసుకుంటేనే బీమా క్లెయిమ్కు అర్హత లభిస్తుందన్నది అపోహే. కానీ వాస్తవం వేరు. ఆధునిక పరిశోధన ఆధారిత ఔషధాలు, అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి రావడంతో చాలా చికిత్సలకు నేడు 24 గంటల పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఏర్పడడం లేదు. వీటిని డే కేర్ ట్రీట్మెంట్స్గా (రోజులో వచ్చి తీసుకుని వెళ్లే వీలున్నవి) చెబుతారు. కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాటరాక్ట్ ఆపరేషన్, కిడ్నీల్లో రాళ్లు తొలగించే సర్జరీ ఇలాంటివన్నీ డేకేర్ ట్రీట్మెంట్స్ కిందకు వస్తాయి. డేకేర్ ట్రీట్మెంట్స్లో చాలా వాటికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో కవరేజీ లభిస్తోంది. కేన్సర్కు సంబంధించి ఓరల్ కీమోథెరపీకి అన్ని రకాల ఇండెమ్నిటీ హెల్త్ ప్లాన్లలో కవరేజీ ఉంటోంది. క్లెయిమ్ మొత్తం వస్తుందనుకోవద్దు నియంత్రణ సంస్థ అనుమతి మేరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వేటికి చెల్లింపులు చేయవో తెలియజేస్తూ ఒక జాబితా నిర్వహిస్తుంటాయి. పీపీఈ కిట్, మాస్క్, బ్యాండేజ్, నెబ్యులైజర్ తదితర ఇలా చెల్లింపులు చేయని వాటి జాబితాను బీమా సంస్థలు పాలసీ వర్డింగ్స్లో ప్రత్యేకంగా పేర్కొంటాయి. అందుకుని ఆస్పత్రిలో అయ్యే బిల్లు మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయని అనుకోవద్దు. అయితే, వీటికి కూడా చెల్లింపులు చేసే రైడర్లను కొన్ని బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. రైడర్ను జోడించుకుని, కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా డిస్పోజబుల్స్కు సైతం క్లెయిమ్ తీసుకోవచ్చు. ఇక పాలసీల్లో మరికొన్ని ఇతర పరిమితులు కూడా ఉంటాయి. కోపేమెంట్, రూమ్రెంట్, డాక్టర్ కన్సల్టేషన్ చార్జీల పరంగా చెల్లింపుల పరిమితులు ఉంటాయి. అంటే వీటికి సంబంధించి బీమా సంస్థలు పాలసీ నియమ, నిబంధనల్లో పేర్కొన్న మేరకే చెల్లింపులు చేస్తుంటాయి. కనుక క్లెయిమ్ మొత్తం వస్తుందని అనుకోవద్దు. చెల్లింపుల్లో పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు సింగిల్ రూమ్ అని పాలసీ డాక్యుమెంట్లో ఉంటే.. హాస్పిటల్లో సాధారణ సింగిల్ రూమ్లో చేరినప్పుడే చికిత్సకు అయ్యే వ్యయాలపై పూర్తి చెల్లింపులు పొందడానికి ఉంటుంది. డీలక్స్ రూమ్/సూట్లో చేరితే అది పరిమితికి మించినది అవుతుంది. దీంతో క్లెయిమ్లో కొంత మేర కోత పడుతుంది. దీన్నే రూమ్ రెంట్ క్యాప్ అని కూడా అంటారు. వీటిపై పాలసీదారులు ముందే తగిన అవగాహనతో ఉండాలి. అందుకని కచ్చితంగా పాలసీ డాక్యుమెంట్ను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. లేదంటే బీమా సంస్థ కస్టమర్ కేర్ లేదా ఏజెంట్ను సంప్రదించాలి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అన్నది పేషెంట్ కోలుకున్న తర్వాత నిర్ణీత కాలం పాటు అతనికి బీమా సంస్థ కొత్త పాలసీని ఆఫర్ చేయకపోవడం. కానీ, దీన్ని బీమా సంస్థలు కచ్చితంగా ఎత్తివేయాలని పాలసీదారులు భావిస్తుంటారు. అంతేకాదు, బీమా సంస్థలు ఆరోగ్యవంతులు, ఆస్పత్రి అవసరం ఏర్పడని వారికే పాలసీని ఆఫర్ చేస్తాయని అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ వెనుక ఉన్న తార్కికత ఏమిటంటే.. ఒక ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకున్న తర్వాత ఏవైనా కొత్త సమస్యలు ఏర్పడతాయేమో అంచనా వేసేందుకు కావాల్సిన సమయంగా అర్థం చేసుకోవాలి. కరోనా చికిత్స లేదా సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పాలసీదారులు మరింత కవరేజీకి అర్హత సాధిస్తారు. వీటిని ముందస్తు నుంచి ఉన్న సమస్యలుగా బీమా సంస్థలు పరిగణించవు. అలాగే క్లెయిమ్ సమయంలో అస్పష్టతను కూడా తగ్గిస్తుంది. ఎక్కడైనా క్యాష్లెస్ బీమా క్లెయిమ్ ప్రక్రియను మరింత సులభతరం, పారదర్శకం, సౌకర్యంగా మార్చడంపై బీమా సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. క్లెయిమ్ను క్యాష్లెస్ (పాలసీదారు చెల్లించాల్సిన అవసరం లేకుండా) లేదా రీయింబర్స్మెంట్ విధానంలో దాఖలు చేసుకోవచ్చు. కానీ, నగదు రహిత చికిత్స సేవలు పొందాలంటే మీరు చేరే హాస్పిటల్.. బీమా సంస్థ క్యాష్లెస్ హాస్పిటల్ నెట్వర్క్లో భాగమై ఉండాలి. ఇలా కాకుండా పాలసీదారు చికిత్స తీసుకుని అందుకు సంబంధించిన మొత్తం వారే చెల్లించి తర్వాత బీమా సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఇందుకోసం అన్ని రకాల పత్రాలను సమర్పించాలి. అప్పుడే బీమా సంస్థ క్లెయిమ్ను ప్రాసెస్ చేయగలదు. క్యాష్లెస్ అన్నది సౌకర్యమైనది. దీనివల్ల ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చికిత్సకు అయ్యే వ్యయాలను పాలసీదారు సొంతంగా సమకూర్చుకునే ఇబ్బంది తప్పుతుంది. పైగా డిశ్చార్జ్ ప్రక్రియ క్యాష్లెస్ విధానంలో సులభంగా పూర్తవుతుంది. బీమా వ్యాపారం అన్నది ప్రజల నిధులతో కూడుకున్నదని అర్థం చేసుకోవాలి. ప్రజల డిపాజిట్లకు సంరక్షకుడిగా బీమా సంస్థ అన్ని రకాల నిజమైన క్లెయిమ్లను గౌరవించాల్సి ఉంటుంది. బీమా సంస్థలు పాలసీ డాక్యుమెంట్ను అర్థం చేసుకునేందుకు వీలుగా సులభ పరిభాషతో రూపొందిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కొనుగోలుకు ముందు శ్రద్ధగా వీటిని చదవడం వల్ల.. క్లెయిమ్ల సమయంలో అనవసర తలనొప్పులను రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు. అధిక కవరేజీ కోసం హెల్త్ చెకప్ పాలసీ జారీ చేసే ముందు అన్ని బీమా సంస్థలూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరడం లేదు. పెద్ద వయసులో ఉన్నారని లేదా అధిక కవరేజీ కోరుతున్నారని వైద్య పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలనేమీ లేదు. ఉదాహరణకు ప్రముఖ హెల్త్ ప్లాన్లు అన్నింటికీ ముందస్తు వైద్య పరీక్షలు అవసరం లేదు. కొన్ని ప్రత్యేక కేసుల్లోనే నిర్ధేశిత వైద్య పరీక్షలను బీమా సంస్థలు కోరుతుంటాయి. దరఖాస్తుదారులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా గతంలో ఏవైనా ఎదుర్కోని ఉంటే ప్రస్తుత ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరతాయి. ఇందుకు అయ్యే వ్యయాలను బీమా సంస్థలు పూర్తిగా భరిస్తుంటాయి. -
ఎల్ఐసీ బంపరాఫర్, మరికొన్ని రోజులే..ఈ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు!
పాలసీ దారులకు ఎల్ఐసీ బంపరాఫర్ ఇచ్చింది. కోవిడ్తో పాటు ఆర్ధిక కారణాల వల్ల కట్టలేని పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిచ్చింది. ఆలస్య రుసుము చెల్లించడం ద్వారా ఆగిపోయిన పాలసీలు మళ్లీ పునరుద్ధరించుకోవచ్చని ఇప్పటికే ఎల్ఐసీ అధికారిక ప్రకటన చేసింది. అయితే మరో వారం రోజుల్లో ఎల్ఐసీ ఇచ్చిన అవకాశం ముగియనుండడంతో.. పాలసీ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్ఐసీ కోరింది. కోవిడ్-19 మహమ్మారి లైఫ్ ఇన్సూరెన్స్ అవసరాల్ని గుర్తు చేసింది. అందుకే సకాలంలో బీమా చెల్లించలేని కుటుంబాలకు ఆర్ధిక ప్రయోజనాల్ని కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నాం. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25లోపు పాలసీదారులు ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశం కల్పిస్తున్నాం' అంటూ ఎల్ఐసీ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇచ్చిన గడువు మరో వారం రోజుల్లో ముగుస్తుండగా, అందుకే పాలసీ దారులు పాలసీలను పునరుద్దరించుకోవాలని ఎల్ఐసీ అధికారిక వర్గాలు కోరుతున్నాయి. Press Release - Special Revival Campaign pic.twitter.com/uHIl8YF6OD — LIC India Forever (@LICIndiaForever) February 7, 2022 నిబంధనలకు మేరకు మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి ఐదేళ్లలోపు నిర్దిష్ట అర్హత గల ప్లాన్ల పాలసీలను పునరుద్ధరించవచ్చని స్పష్టం చేసింది. చెల్లించే మొత్తం ప్రీమియంలను బట్టి టర్మ్ అస్యూరెన్స్, హై-రిస్క్ ప్లాన్లు కాకుండా ఇతర ఆలస్య రుసుములలో రాయితీలు పొందవచ్చు. వైద్య అవసరాలపై ఎలాంటి రాయితీలు లేవు. అర్హత కలిగిన ఆరోగ్య, సూక్ష్మ-బీమా ప్లాన్లు కూడా ఆలస్య రుసుముతో రాయితీకి అర్హత పొందగలరని పేర్కొంది. రూ.లక్ష వరకు స్వీకరించదగిన మొత్తం ప్రీమియంతో సంప్రదాయ, ఆరోగ్య పాలసీలను ఎల్ఐసీ గరిష్ట పరిమితి రూ.2,000తో ఆలస్య రుసుముతో 20 శాతం రాయితీని అందిస్తోంది. అదేవిధంగా రూ.3 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం మొత్తానికి, రూ.3,000 పరిమితితో 30 శాతం రాయితీ అందించబడుతుంది. మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ల కోసం ఎల్ఐసీ ఆలస్య రుసుములలో పూర్తి రాయితీని అందిస్తోంది. చదవండి: మే 12వరకూ ఎల్ఐసీకి గడువు -
వ్యక్తిగతమా.. గ్రూప్ పాలసీనా...
కోవిడ్–19 రాకతో ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యత గురించి అవగాహన పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల అవసరాన్ని గుర్తించి, కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రకరకాల హెల్త్ పాలసీలు ఉన్నాయి. వీటిలో వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేవి ఎక్కువగా ప్రాచుర్యంలో కనిపిస్తుంటాయి. వీటి గురించి వివరించేదే ఈ కథనం. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్.. సాధారణంగా ఒక గ్రూప్గా ఉండే వ్యక్తుల కోసం ఈ తరహా పాలసీలను కంపెనీలు రూపొందిస్తుంటాయి. ఉదాహరణకు ఒకే కంపెనీలో పనిచేసే వ్యక్తుల కోసం ఇలాంటి పాలసీలు ఉంటాయి. పాలసీదారు కుటుంబ సభ్యులకు కూడా చాలా సందర్భాల్లో పాలసీ ప్రయోజనాలను వర్తింపచేసినా .. ఒక్కో సభ్యుడికి ఒక్కో రకమైన కవరేజ్ అంటూ ఉండదు. ప్రాథమికంగా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది.. పాలసీదారులు ప్రమాదం కారణంగానైనా లేదా కోవిడ్–19 సహా ఇతరత్రా ఏదైనా అనారోగ్యంతోనైనా ఆస్పత్రిలో చేరితే కవరేజ్ ఇస్తుంది. ఇలాంటి పాలసీల కోసం బీమా కంపెనీలు మెడికల్ చెకప్ గురించి అడగవు. వ్యక్తిగత పాలసీలతో పోలిస్తే వీటి ప్రీమియంలు తక్కువగానే ఉంటాయి. గ్రూప్ అంగీకరించే కొటేషన్ను బట్టి ప్రతీ ఏడాది కవరేజీ మారవచ్చు. ఈ పాలసీల ప్రీమియాన్ని కంపెనీయే భరించవచ్చు లేదా సభ్యుడి నుంచి వసూలు చేయవచ్చు. గ్రూప్లో అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య బీమా.. ఈ పాలసీలను వ్యక్తులు నేరుగా కొనుగోలు చేస్తారు. వివిధ రకాల అస్వస్థతలు, ఆస్పత్రిలో చేరితే అయ్యే ఖర్చులు, ఇతరత్రా చికిత్సాపరమైన ఖర్చుల నుంచి రక్షణ పొందేందుకు .. పాలసీదారు తన అవసరాలకు అనుగుణంగా ఈ పాలసీల కవరేజీని ఎంచుకోవడానికి వీలు ఉంటుంది. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, అత్త మామలు వంటి మీ మీద ఆధారపడిన వారికి కూడా కవరేజీ లభించేలా దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి నేరుగా ప్రీమియంను కట్టాల్సి ఉంటుంది. సకాలంలో పునరుద్ధరించుకోకపోతే పాలసీ గడువు ముగిసిపోతుంది. పాలసీ తీసుకునే వ్యక్తికి సంబంధించిన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటారు. అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కూడా బీమా కంపెనీ అడగవచ్చు. ఎవరికి ఏవి అనువైనవంటే.. ప్రీమియంలు చౌకగా ఉండటంతో పాటు యజమానే కడతారు కాబట్టి యుక్తవయస్కులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అర్థవంతంగానే ఉంటుంది. కానీ కుటుంబ బాధ్యతలు ఉన్నవారు.. తగినంత కవరేజీతో కూడిన వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ సంస్థ నుంచి గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజీ భారీగానే ఉన్నట్లయితే.. గ్రూప్ ఇన్సూరెన్స్ సమ్ ఇన్సూర్డ్తో సరిపోయే టాప్–అప్ కవర్ని తీసుకోవచ్చు. ఇది చౌకగానే రావడంతో పాటు మీకు తగినంత స్థాయిలో కవరేజీనీ అందిస్తుంది. కొన్ని కంపెనీలు భవిష్యత్తులో అవసరమైతే టాప్–అప్ను బేస్ కవర్గా మార్చుకునేందుకు కూడా అవకాశమిస్తున్నాయి. కాబట్టి హెల్త్ పాలసీని తీసుకునేటప్పుడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవడం మంచిది. సుధా రెడ్డి, హెడ్ (హెల్త్ విభాగం) డిజిట్ ఇన్సూరెన్స్ -
హెల్త్ క్లెయిమ్ ఇలా కూడా కాదంటారు!
బీమా పాలసీ తీసుకునేదే కష్ట కాలంలో ఆదుకుంటుందన్న భరోసాతో. తీరా బీమా క్లెయిమ్ అవసరం ఏర్పడిన సందర్భంలో.. పరిహారానికి అర్హత లేదంటూ బీమా కంపెనీ మీ క్లెయిమ్ను తిరస్కరిస్తే పరిస్థితి ఏంటి..? అందుకే బీమా పాలసీ పత్రంలో అడిగిన ప్రతీ సమాచారం పట్ల పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. పాలసీ పత్రాలపై సంతకం పెట్టేయడం కాకుండా.. అందులోని షరతులు, మినహాయింపులు, నిబంధనలు, పరిమితుల జాబితాను సమగ్రంగా తెలుసుకోవాలి. ఒక్క చిన్న కారణం కనిపించినా.. బీమా సంస్థలు పరిహారానికి నో చెప్పొచ్చు. అందుకే సదా నిక్కచ్చిగా వ్యవహరించాలి ఒక పాలసీదారు బైక్ను నడుపుతూ ప్రమాదానికి గురై మరణించడంతో.. అతని కుటుంబం క్లెయిమ్ కోసం దాఖలు చేసుకుంది. సదరు ప్రైవేటు సాధారణ బీమా సంస్థ పరిహారం చెల్లించేందుకు తిరస్కరించింది. దీనికి చూపించిన కారణం.. 346సీసీ బైక్ను నడుపుతూ ప్రమాదానికి గురై మరణించడమే. 150సీసీ సామర్థ్యానికి మించి ఇంజన్తో కూడిన బైక్ను నడుపుతూ ప్రమాదానికి గురైతే పరిహారం బాధ్యత తమపై ఉండదన్న షరతును కూడా సదరు కంపెనీ తమ పాలసీ పత్రాల్లో పేర్కొంది. అయినప్పటికీ పాలసీదారు కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించి బీమా పరిహారం లభించిందనుకోండి. అందుకే వివిధ బీమా సంస్థలు కొన్ని అరుదైన కారణాలతోనూ పరిహారం చెల్లింపులకు తిరస్కరిస్తున్నాయి. కొత్తగా పాలసీ తీసుకునే వారు, ఇప్పటికే పాలసీ తీసుకున్న వారు వీటిపై అవగాహన కలిగి ఉండడం ఎంతైనా అవసరం. వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్ను కలిగిన ఒక పాలసీదారు మామిడి చెట్టెక్కి కాయలు కోస్తూ జారి కిందపడి వైకల్యం పాలయ్యాడు. చాలా ప్రమాదకరమైన విన్యాసంగా దీన్ని పేర్కొంటూ సదరు బీమా కంపెనీ తొలుత క్లెయిమ్ను తిరస్కరించింది. ప్రమాదకరమైన చర్య కనుక.. పాలసీదారుకు అందులో నైపుణ్యం ఉందా? లేదా అన్నది పరిగణనలోకి రాదని బీమా కంపెనీ పేర్కొంది. ఎందుకంటే శాశ్వత మినహాయింపుల జాబితాలో ఇది కూడా ఉన్నట్టు వివరణ ఇచ్చింది. హజార్డస్ స్పోర్ట్/యాక్టివిటీగా దీన్ని చూపించింది. కాకపోతే తదనంతర పరిణామాలతో బీమా కంపెనీ దిగొచ్చి, క్లెయిమ్ను చెల్లించింది. కనుక పాలసీ డాక్యుమెంట్లో పేర్కొన్న ప్రమాదకర విన్యాసాలు, క్రీడల క్లాజ్ గురించి తప్పకుండా పాలసీదారులు ఒకసారి తెలుసుకొని, వాటికి దూరంగా ఉండడం మంచిది. 150సీసీ కంటే అధిక సామర్థ్యంతో కూడిన బైక్ను నడపడం ప్రమాదానికి దారితీస్తుందని, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన వాహనంతో ప్రమాదం ఉండదని చెప్పగలమా? కానీ కొన్ని బీమా కంపెనీలు ఈ వైఖరినే అనుసరిస్తున్నాయి. 150సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల వాహనం నడుపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది కనుక పరిహారం చెల్లించబోమంటూ ఒక కేసులో ప్రముఖ సాధారణ బీమా సంస్థ బదులివ్వడం గమనార్హం. ఈ విషయంలో పాలసీదారులు అవగాహన కలిగి ఉండాలి. ‘‘వాస్తవానికి ఏడాది క్రితం వరకు ఎక్కువ ప్లాన్లలో ఈ నిబంధన ఉండేది. కానీ, ఇందులో మార్పు వచ్చింది. అయినప్పటికీ ప్రమాద బీమా ప్లాన్ను తీసుకున్న వారు, తీసుకోవాలని అనుకునే వారు పాలసీ డాక్యుమెంట్ను ఆసాంతం ఒక్కసారి చదివి ఈ తరహా కొర్రీలేవైనా ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. లేదంటే ఆర్థిక సలహాదారు సాయం తీసుకోవాలి’’ అని భేషక్ డాట్ ఓఆర్జీ వ్యవస్థాపకుడు మహావీర్ చోప్రా తెలిపారు. తిరస్కరిస్తే మార్గం ఏంటి? పరిహారం తిరస్కరణకు గురైందని ఆందోళన పడక్కర్లేదు. మీ క్లెయిమ్ నిజాయితీతో కూడినదేనని బీమా కంపెనీని ఒప్పించడం ద్వారా పరిహారం అందుకోవచ్చు. దీనికంటే ముందే బీమా సంస్థ క్లెయిమ్ ఎందుకు తిరస్కరించిందన్నది సరిగ్గా అర్థం చేసుకోవాలి. కారణాలను విశ్లేషించుకోవాలి. మీరు తీసుకున్న పాలసీకి సంబంధించి నియమ, నిబంధనలను, మినహాయింపుల గురించి మరోసారి సమీక్షించుకోవాలి. ఒక్కోసారి దరఖాస్తు, దానికి అనుబంధంగా అందజేసిన చికిత్సా సమాచారం అసంపూర్ణంగా ఉంటే.. అప్పుడు అదనపు పత్రాలను, సమాచారాన్ని ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. క్లెయిమ్ తిరస్కరణ ముందే బీమా సంస్థ పూర్తి విచారణ చేస్తుంది. అన్ని పత్రాలను పరిశీలించి నిబంధనల మేరకు వ్యవహరిస్తుంది. కానీ, బీమా కంపెనీ పరిహారం చెల్లించకపోవడం వెనుక సహేతుక కారణం లేదని మీరు గుర్తిస్తే బీమా కంపెనీలోని ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని సంప్రదించాలి. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ డెనియల్ అప్పీల్లెటర్ ద్వారా తిరిగి క్లెయిమ్కు దరఖాస్తు చేసుకోవాలి. కంపెనీ నిర్ణయం సరైంది కాదంటూ అందుకు మద్దతుగా పత్రాలను సమర్పించాలి. ఒకవేళ టీపీఏ నుంచి తీసుకుంటే వారిని సంప్రదించి, పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. పరిష్కారం లభించకపోతే ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ కార్యాలయాన్ని ఆశ్రయించొచ్చు. అక్కడ కూడా న్యాయం లభించకపోతే అప్పుడు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరమ్ సాయం కోరొచ్చు. చికిత్స కోసం కాకుండా.. ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ డాక్టర్ సూచన మేరకు ఆస్పత్రిలో చేరిన అనంతరం.. ఎన్నో రక్తపరీక్షలు, డెంగ్యూ, మలేరియా, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి కూడా జ్వరానికి కారణాన్ని వైద్యుడు గుర్తించలేకపోయాడని అనుకుందాం. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకుని పరిహారం కోసం బీమా సంస్థకు క్లెయిమ్ దాఖలు చేసుకుంటే తిరస్కరణకు అవకాశం లేకపోలేదు. ‘యాక్టివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్’ కొనసాగలేదని బీమా సంస్థ ఎత్తిచూపొచ్చు. ఎటువంటి వ్యాధి నిర్ధారణ లేకుండా, వైద్య పరీక్షలు, చికిత్స చేస్తే అందుకు పరిహారాన్ని బీమా సంస్థలు చెల్లించకపోవచ్చు. అంతేకాదు సరైన విధంగా చికిత్స చేయకపోయినా (యాక్టివ్లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) పరిహారం ఇవ్వబోవు. ‘‘జ్వరానికి ఔట్ పేషెంట్ కింద చికిత్స చేయవచ్చంటూ కొన్ని క్లెయిమ్లను బీమా కంపెనీలు ఆమోదించకపోవచ్చు. ఇది సహేతుకమే. కానీ, ఒక పేషెంట్గా వైద్యులు యాక్టివ్లైన్ ట్రీట్మెంట్ను అనుసరిస్తున్నారా? లేదా అన్నది తనకు ఎలా తెలుస్తుంది. ఈ లోపాన్ని పరిహరించాల్సి ఉంది’’ అని ష్యూర్క్లెయిమ్ సీఈవో అనుజ్ జిందాల్ పేర్కొన్నారు. పాక్షిక చెల్లింపులు కరోనా కారణంగా ఎదురైన క్లెయిమ్లలో బీమా కంపెనీలు పాక్షిక చెల్లింపులు చేసినవి చాలానే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నిర్ణయించిన ధరలకే తాము చెల్లింపులు చేస్తామన్నది బీమా కంపెనీల వాదన. ‘‘ఈ నిబంధన నిజంగా అడ్డంకే. ముఖ్యంగా నాన్ నెట్వర్క్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని రీయింబర్స్మెంట్ చేసుకునే వారికి ఇబ్బందికరం. సహేతుక చార్జీల గురించి పాలసీదారునకు ఎలా తెలుస్తుంది? బీమా సంస్థలే చికిత్సల సాధారణ చార్జీల గురించి పారదర్శకంగా వెల్లడించడం మంచిది’’ అన్నది జిందాల్ అభిప్రాయం. ముంబైకి చెందిన కార్యకర్త గౌరంగ్ దమానీ ఇదే విషయమై లోగడ బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా.. ఈ నిబంధన ఎత్తివేయాలంటూ ఐఆర్డీఏఐకూ లేఖ రాశారు. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లు ఎక్కువగా ఫిక్స్డ్ బెనిఫిట్ ప్రయోజనంతో ఉంటాయి. సంబంధిత వ్యాధి నిర్ధారణ అయి నిర్ణీత రోజుల పాటు జీవించి ఉంటే పరిహారం మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయి. ముఖ్యంగా కేన్సర్ వంటి చికిత్సల్లో బీమా సంస్థలు పాక్షిక చెల్లింపులే చేస్తున్నాయి. కేన్సర్లను ముందస్తు దశలో గుర్తిస్తే.. 25 శాతం బీమానే అందిస్తున్నాయి. కేన్సర్కు సంబంధించి ముఖ్యమైన చికిత్సలకు మాత్రం పూర్తి పరిహారం లభిస్తుంది. మినహాయింపులు పాలసీ పత్రంలో మినహాయింపులను స్పష్టంగా పేర్కొంటారు. ఆ జాబితాలోని వాటికి చికిత్స తీసుకుంటే పరిహారం రాదు. ముందస్తు వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్లో పరిహారం రాదు. పాలసీ తీసుకునే నాటికి ఉన్న ఆరోగ్య సమస్యలను వెల్లడిస్తే.. 3–4 ఏళ్ల వెయిటింగ్ తర్వాతే వాటికి కవరేజీ లభిస్తుంది. సకాలంలో ప్రీమియం చెల్లించకపోవడం వల్ల ల్యాప్స్ అయిన పాలసీలకు సంబంధించి కూడా క్లెయిమ్ కోరలేరు. నాన్ నెట్వర్క్ ఆస్పత్రిలో చేరి క్యాష్లెస్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నా, రీయింబర్స్ మెంట్ రూపంలో రావాలని అడగొచ్చు. వాస్తవాలను చెప్పకపోవడం, దాచిపెట్టడం.. బీమా కంపెనీలు పరిహారం చెల్లింపులను తిరస్కరించడానికి చూపించే కారణాల్లో.. పాలసీదారు పూర్తి సమాచారం వెల్లడించకపోవడమే ఎక్కువగా ఉంటోంది. పాలసీ డాక్యుమెంట్ను పూర్తిగా చదివేవారు చాలా తక్కువ. ఇదే సమస్యకు కారణం అవుతోంది. ముఖ్యంగా తమ వృత్తి లేదా చేస్తున్న ఉద్యోగం గురించి చెప్పకపోవడం, ఆదాయం, అప్పటికే కలిగి ఉన్న బీమా పాలసీలు, ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలను తెలియజేయకపోవడం వంటివి భవిష్యత్తులో క్లెయిమ్లు తిరస్కరణకు దారితీయవచ్చు. ఎందుకంటే పాలసీదారు వెల్లడించే సమాచారం ఆధారంగానే బీమా సంస్థలు రిస్క్ను అర్థం చేసుకుంటాయి. ఆ సమాచారం ఆధారంగా భవిష్యత్తులో క్లెయిమ్లు ఏ మేరకు రావచ్చన్నది అంచనా వేస్తాయి. తదనుగుణంగా ప్రీమియంను నిర్ణయిస్తాయి. మరి పాలసీ దరఖాస్తులో చెప్పిన సమాచారానికి, పాలసీదారు వాస్తవ ఆరోగ్య పరిస్థితులకు పొంతన లేకపోతే అప్పుడు బీమా సంస్థ ఆ భారాన్ని మోయడానికి అంగీకరించదు. కనుక తప్పనిసరిగా పూర్తి వాస్తవిక సమాచారాన్ని వెల్లడించాలి. కావాలని కాకుండా, అవగాహన లేక వెల్లడించకపోయినా ఆ బాధ్యత బీమా కంపెనీపై ఉండదు. గతంలో ఏవైనా పాలసీల కోసం దరఖాస్తు చేసుకుని, బీమా కంపెనీ నుంచి తిరస్కరణకు గురైనా ఆ సమాచారం కూడా తెలియజేయాల్సి ఉంటుంది. సకాలంలో క్లెయిమ్ దరఖాస్తు అత్యవసరంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చేరిన 24 గంటల్లోగా క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకున్న పాలసీ నిబంధనలు, ఎటువంటి చికిత్స కోసం చేరారన్న అంశాల ఆధారంగా ఈ సమయం పరిమితుల్లో మార్పులు ఉండొచ్చు. కానీ, సాధ్యమైనంతగా 24 గంటల్లోపే క్లెయిమ్ దాఖలు చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆలస్యంగా ఈ పనిచేస్తే క్యాష్లెస్ క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. దీంతో ఆ తర్వాత రీయింబర్స్మెంట్కు వెళ్లాల్సి వస్తుంది. ఇందుకోసం ఆస్పత్రిలో చేరకముందు, చేరిన తర్వాత చికిత్సకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు, బిల్లులు జాగ్రత్త చేసుకోవాలి. డిశ్చార్జ్సమ్మరీ తీసుకోవాలి. వైద్య పరీక్షల పత్రాలను కూడా జత చేసి క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. పారదర్శకంగా వ్యవహరించాల్సిందే.. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పరిష్కారంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాలంటూ అన్ని బీమా కంపెనీలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఇప్పటికే కోరింది. అన్ని దశల్లోనూ పాలసీదారులతో పారద్శకమైన సంప్రదింపులు నిర్వహించాలని ఆదేశించింది. క్యాష్లెస్ క్లెయిమ్ల పరిష్కారం, పురోగతి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంగా కోరింది. ఒకవేళ థర్డ్ పార్టీ ద్వారా ఈ సేవలు అందిస్తున్నా కానీ, అన్ని రకాల సంప్రదింపులు పద్ధతి ప్రకారం ఉండాల్సిందేనని ఆదేశించింది. అంతేకాదు, బీమా కంపెనీలు క్లెయిమ్లను తిరస్కరించిన సందర్భాల్లో కారణాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. -
కేవలం 35 పైసలతో 10 లక్షల ఇన్సూరెన్స్! వివరాలివే..
Indian Railway IRCTC Passengers 10 Lakh Insurance For 35 Paise: దూర ప్రయాణాలు చేసేవాళ్లకు రైల్ రిజర్వేషన్ ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ టికెట్ బుక్ చేసుకోవడం మొదలు.. నచ్చిన సీటును ఎంచుకోవడం, టైంకి తిండి, టైంకి జర్నీ, టాయిలెట్ సౌకర్యం.. ఇలా ఉంటాయి. అదే టైంలో మీ టికెట్ ఛార్జీలో కేవలం35 పైసలకే రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తుందన్న సంగతి మీకు తెలుసా? ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐటీఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో భారతీయ రైల్వే కేవలం 35 పైసలు.. అదీ జీరో ప్రీమియంతో రైలులో ప్రయాణించే వ్యక్తులకు రూ. 10 లక్షల వరకు బీమా రక్షణను అందిస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగిన పరిస్థితుల్లో ప్రయాణికుల కుటుంబానికి ఆసరాగా నిలబడేందుకు కారుచౌకగా ఈ బీమాను అందిస్తోంది రైల్వే శాఖ. క్లిక్ చేస్తే చాలు! IRCTC ద్వారా మీ రైలు టిక్కెట్ను బుక్ చేసేటప్పుడు మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఈ ఆప్షన్ను ఎంచుకుంటే బీమా కవర్ ఇవ్వబడుతుంది. అదే సమయంలో PNR నంబర్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ ఈ బీమా వర్తిస్తుంది. వేటికి వర్తింపు అంటే.. శాశ్వత పాక్షిక వైకల్యం, శాశ్వత వైకల్యం, రైలు ప్రమాదాల సమయంలో ఆసుపత్రి ఖర్చులు, ప్రయాణ సమయంలో మరణం, మృతదేహాల రవాణా కోసం.. వర్తిస్తుంది. ఉగ్రదాడులు, దోపిడీ-దాడులు, కాల్పుల ఘటనలు, ప్రమాదవశాత్తూ రైలు నుంచి కింద పడిపోవడం లాంటి ప్రమాదాలు ఒక కేటగిరీలో, రెండు రైళ్లు ఢీకొట్టినప్పుడు, రైలు ప్రయాణం మొదలైనప్పటి నుంచి గమ్యస్థానం చేరేలోపు రైలు ఎలాంటి ప్రమాదానికి గురైనా ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఎంత బీమా పొందే అవకాశం ఉంటుంది? ఆసుపత్రిలో చికిత్సలకు రూ.2 లక్షల కవరేజీ, శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ.7.5 లక్షల కవరేజీ, మృత దేహాలను రవాణా చేసేందుకు రూ.10 వేల కవరేజీ, రైలు ప్రమాదం లేదా రైలు ప్రయాణంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన కారణంగా మరణించినా.. శాశ్వతంగా వైకల్యం బారినపడ్డా కూడా రూ.10 లక్షల కవరేజీ వర్తిస్తుంది. ప్రమాదాలు ఎప్పుడు ఎటు నుంచి పొంచి ఉంటాయో ఊహించలేం. కాబట్టి, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా భవిష్యత్తులో కుటుంబాలకు అండగా నిలబడవచ్చు. -
Insurance Policy: ఈ పాలసీలు.. ఎంతో సులభం
బీమా పాలసీల్లోని సదుపాయాలను సులభంగా అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యపడేది కాదు. ఒక్కో కంపెనీ ప్లాన్ భిన్నమైన ప్రయోజనాలు, మినహాయింపులు, షరతులతో ఉంటుంది. కనుక పాలసీదారులు వీటిని అర్థం చేసుకోవడం కష్టమని తెలుసుకున్న బీమా రంగ నియంత్రణ , అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఒకే విధమైన ఫీచర్లతో అన్ని బీమా కంపెనీలు.. ఒకే పేరుతో ఒక ప్రామాణిక పాలసీని ప్రవేశపెట్టాలంటూ ఆదేశాలు తీసుకొచి్చంది. వీటినే స్టాండర్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లుగా పిలుస్తారు. ఆరోగ్య సంజీవని, సరళ్ జీవన్ బీమా, సరళ్ పెన్షన్, సరళ్ సురక్షా ఇలాంటివన్నీ కూడా ప్రామాణిక పాలసీలే. వీటి ప్రీమియంలు అందుబాటు ధరల్లోనే ఉంటాయి. కాకపోతే వీటిల్లో పరిమితులు కూడా ఉంటాయి కనుక అందరికీ కాకుండా.. కొందరికే అనుకూలం. బీమా పాలసీల విషయంలో ‘కరోనా’ఓ కనువిప్పుగానే చూడాలి. ఈ వైరస్ కారణంగా ఆస్పత్రుల పాలై ఆరి్థకంగా చితికిపోయిన వారు ఎందరో ఉన్నారు. అంతేకాదు బీమా రక్షణ లేని కారణంగా మరణించిన వారి కుటుంబాలూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా చాలా మంది జీవిత బీమా, ఆరోగ్య బీమా, ప్రమాద మరణం/వైకల్య పరిహార బీమాల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు లేని వారు పాలసీలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కవరేజీ, సదుపాయాలు, రైడర్లు బీమా సంస్థలు అన్నింటిలోనూ ఒకే మాదిరిగా ఉంటాయి. ఆరోగ్య సంజీవని పేరుతో హెల్త్ ప్లాన్, సరళ్ జీవన్ బీమా పేరుతో టర్మ్ ప్లాన్.. సరళ్ పెన్షన్ (యాన్యుటీ/పెన్షన్) ప్లాన్, సరళ్ సురక్షా బీమా (వ్యక్తిగత ప్రమాద కవరేజీ) ప్లాన్, కరోనా కవచ్, కరోనా రక్షక్ (కరోనా చికిత్సల ప్లాన్లు), భారత్ గృహ రక్ష (హోమ్ ఇన్సూరెన్స్) ఇవన్నీ స్టాండర్డ్ బీమా పథకాలే. వీటిని ఎంపిక చేసుకోవడానికి ముం దు.. నియమ, నిబంధనలు ఒక్కసారి తెలుసుకోవాలి. ఈ పాలసీలు ఏం ఆఫర్ చేస్తున్నాయి.. ప్రీమియం ఎంతన్నదీ చూడాలి. తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాలను తీర్చేవేనా? అన్న పరిశీలన కూడా చేసుకోవాలి. అప్పుడే వీటిపై ఒక అవగాహనకు రావడానికి వీలవుతుంది. సరళ్ జీవన్ బీమా అచ్చమైన టర్మ్ పాలసీ ఇది. పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉంటే ఎటువంటి రాబడులను రానటువంటి పాలసీ. పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే నామినీకి పరిహారం లభిస్తుంది. వార్షిక ప్రీమియానికి 10 రెట్లు లేదా మరణించే నాటికి చెల్లించిన ప్రీమియంతో కలిపి 105 శాతం, లేదా సమ్ అష్యూరెన్స్ (బీమా కవరేజీ) వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తం నామినీకి కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ సింగిల్ ప్రీమియం పాలసీలు అయితే చెల్లించిన ప్రీమియానికి 125 శాతం లేదా బీమా కవరేజీ ఈ రెండింటిలో గరిష్ట మొత్తాన్ని చెల్లిస్తుంది. ఐఆర్డీఏఐ మార్గదర్శకాల మేరకు సరళ్ జీవన్ బీమా ప్లాన్తోపాటు రెండు రైడర్లను కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్, పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్ను ఎంపిక చేసుకోవచ్చు. ఇతర టర్మ్ పాలసీలతో పోలిస్తే సరళ్ జీవన్ బీమా ప్లాన్లో 45 రోజుల వేచి ఉండే కాల వ్యవధి (పాలసీ జారీ చేసిన తేదీ నుంచి) అమలవుతుంది. కాకపోతే ఈ 45 రోజుల వ్యవధిలో ప్రమాదం కారణంగా మరణిస్తే పరిహారం లభిస్తుంది. ప్రమాదం కాకుండా ఇతర ఏ రూపంలో మరణం సంభవించినా బీమా పరిహారానికి అర్హత లభించదు. కేవలం చెల్లించిన ప్రీమియం వరకే నామినీకి లభిస్తుంది. టర్మ్ పాలసీలు ముక్కుసూటి పథకాలు. ఎటువంటి గందరగోళం లేకుండా జీవితానికి పూర్తి రక్షణ కల్పించేవి. వార్షిక ఆదాయానికి 10–15 రెట్ల వరకు అయినా బీమా పరిహారం కచ్చితంగా ఉండాలన్నది సాధారణంగా అనుసరించే విధానం. కానీ, సరళ్ జీవన్ బీమా ప్లాన్ను చాలా కంపెనీలు గరిష్టంగా రూ.25 లక్షలకే ఇస్తున్నాయి. కనుక తక్కువ ఆదాయం ఉన్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. మెరుగైన ఆదాయం ఉన్న వారు సాధారణ టర్మ్ ప్లాన్ను తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. సాధారణ టర్మ్ ప్లాన్ వ్యక్తి ఆదాయానికి తగినట్టు గరిష్ట కవరేజీతో వస్తుంది. ∙ ఉదాహరణకు.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సరళ్ జీవన్ బీమా ప్లాన్ను 40 ఏళ్ల కాలానికి రూ.25లక్షల కవరేజీతో తీసుకోవాలంటే.. 30 ఏళ్ల వ్యక్తి వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.12,312 (జీఎస్టీ కాకుండా). అదే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఆఫర్ చేసే ఐప్రొటెక్ట్ స్మార్ట్ టర్మ్ ప్లాన్లో రూ.50 లక్షల కవరేజీకి జీఎస్టీ కాకుండా వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం రూ.9,987. ఈ విధంగా చూసుకుంటే సరళ్తో పోలిస్తే సాధారణ టర్మ్ ప్లాన్లో తక్కువ ప్రీమియానికి అధిక కవరేజీ లభిస్తున్నట్టు అర్థం అవుతోంది. ప్రమాదం కారణంగా పాలసీదారు శాశ్వత వైకల్యానికి గురైతే ఆ తర్వాత నుంచి ప్రీమియం చెల్లించకుండా ఉండే ప్రీమియం వైవర్ ఐప్రొటెక్ట్ సస్మార్ట్ ప్లాన్లో ఉంది. టర్మ్ ప్లాన్ తీసుకోవాలంటే ఆదాయానికి సంబంధించి రుజువులు కచి్చతంగా ఉండాల్సిందే. కొన్ని రకాల ఉద్యోగాల్లోని వారికి టర్మ్ ప్లాన్ను కంపెనీలు ఆఫర్ చేయడం లేదు. కనుక ఇటువంటి వారు సరళ్ జీవన్ బీమాను పరిగణనలోకి తీసుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పెరుగుతున్న ఆదాయానికి అనుగుణంగా బీమా కవరేజీని కూడా ఎప్పటికప్పుడు పెంచుకోవడం అవసరం. అవసరమైతే ఈ రంగంలో నిపుణుల సలహా తీసుకోవాలి. ఆరోగ్య సంజీవని అన్ని సాధారణ, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్లాన్ను బేసిక్ పాలసీ కింద ఆఫర్ చేస్తున్నాయి. ఆస్పత్రిలో చేరడం వల్ల ఎదురయ్యే ఖర్చులను ఈ పాలసీ చెల్లిస్తుంది. డేకేర్ ట్రీట్మెంట్లకు (ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేని చికిత్సలు) ఈ పాలసీలో కవరేజీ ఉంటుంది. పాలసీ తీసుకున్న 30 రోజుల వరకు వేచి ఉండే కాలం అమలవుతుంది. అలాగే, కొన్ని వ్యాధులకు పాలసీ అమల్లోకి వచి్చన రెండేళ్ల తర్వాతే కవరేజీ లభిస్తుంది. ఒక పాలసీ సంవత్సరంలో క్లెయిమ్లు లేనట్టయితే బోనస్ కూడా ఇందులో అందుకోవచ్చు. అయితే, ఆరోగ్య సంజీవని హెల్త్ ప్లాన్లో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. సబ్ లిమిట్స్ ముఖ్యమైనది. ఆస్పత్రిలో గది అద్దె, ఐసీయూ చార్జీలకు ఇందులో పరిమితులు అమలవుతాయి. బీమా సంస్థ నిర్దేశించిన పరిమితులకు మించి గది అద్దె, ఐసీయూ చార్జీలు ఉంటే కనుక అప్పుడు పాలసీదారు మొత్తం బిల్లులో కొంత మొత్తాన్ని తన చేతి నుంచి చెల్లించుకోవాల్సి వస్తుంది. రూ.10 లక్షల కవరేజీతో ఆరోగ్య సంజీవని ప్లాన్ తీసుకున్నా సరే సబ్ లిమిట్స్ కారణంగా పాలసీదారు తనవంతుగా ఎంతో కొంత చెల్లించుకోక తప్పదు. మరో ముఖ్యమైన ప్రతికూల అంశం.. 5 శాతం కోపే నిబంధన ఇందులో ఉంటుంది. అంటే ప్రతీ క్లెయిమ్కు 5 శాతాన్ని పాలసీదారు స్వయంగా భరించాల్సి ఉంటుంది. ముందు చెప్పుకున్న సబ్ లిమిట్స్ కారణంగా పాలసీదారు కొంత మొత్తాన్ని సొంతంగా చెల్లించుకోవాల్సిన దానికి ఇది అదనం. సాధారణ హెల్త్ప్లాన్లు నేడు చాలా వరకు సబ్ లిమిట్స్, కోపే లేకుండానే వస్తున్నాయి. ముఖ్యంగా రూమ్రెంట్, ఐసీయూ చార్జీల విషయంలో పరిమితుల్లేకుండా ప్లాన్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంజీవని ప్లాన్లో రీస్టోరేషన్ సదుపాయం లేదు. ఆస్పత్రిలో చేరడం వల్ల బీమా కవరేజీ మొత్తం ఒకే విడత ఖర్చయిపోయిందనుకోండి.. అప్పుడు బీమా సంస్థలు అంతే మొత్తం కవరేజీని అదే సంవత్సరానికి రీస్టోరేషన్ కింద పునరుద్ధరిస్తాయి. దీంతో అదే వ్యక్తి మళ్లీ అదే పాలసీ సంవత్సరంలో ఆస్పత్రిలో చేరాల్సి వస్తే (మరో సమస్య వల్ల), లేదా కుటుంబ సభ్యుల్లో వేరొకరు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎదురైతే రీస్టోరేషన్ అక్కరకు వస్తుంది. వార్షిక ప్రీమియం, సబ్ లిమిట్స్, నో క్లెయిమ్ బోనస్, కోపే, ఏటా ఉచితంగా హెల్త్ చెకప్లు, ఓపీడీ చికిత్సలకు కవరేజీ సదుపాయాలను సాధారణ హెల్త్ ప్లాన్లలో చూడొచ్చు. మీ అవసరాలు, ప్రీమియం చెల్లింపుల సామర్థ్యం ఆధారంగా ఆరోగ్య సంజీవని లేదా సాధారణ హెల్త్ ప్లాన్లలో ఏదన్నది నిర్ణయించుకోవాలి. చాలా కంపెనీలు ఆరోగ్య సంజీవని ప్లాన్ ప్రీమియం స్థాయిల్లోనే మరింత మెరుగైన ఫీచర్లతో సాధారణ హెల్త్ ప్లాన్లను (నామమాత్రపు పరిమితులు లేదా పరిమితుల్లేకుండా) ఆఫర్ చేస్తున్నాయి. సరళ్ సురక్షా బీమా ఇది వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్. అన్ని సాధారణ, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్లాన్ను ఆఫర్ చేస్తున్నాయి. ప్రమాదంలో మరణించినా లేక పూర్తి, పాక్షిక అంగవైకల్యం (శాశ్వతంగా) పాలైన సందర్భంలో ఈ ప్లాన్ కింద నామినీకి పరిహారం లభిస్తుంది. ప్రమాదానికి గురైన తర్వాత 12 నెలల్లోపు మరణించినా కానీ పరిహారానికి అర్హత లభిస్తుంది. ప్రమాదం వల్ల వైకల్యానికి లోనయితే పాలసీ నియమ, నిబంధనలకు అనుగుణంగా పరిహారం చెల్లింపు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు శాశ్వత అంగవైకల్యం పాలైతే 100 శాతం బీమా పరిహారంగా అందుకోవచ్చు. ప్రమాదం నమోదైన తేదీ నుంచి 12 నెలల్లోపు అంగవైకల్యానికి గురైనా పరిహారం లభిస్తుంది. ఈ ప్లాన్ కింద మూడు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. 1. పాక్షిక అంగవైకల్యం కలిగినట్టయితే బీమా కవరేజీ మొత్తంలో 0.2 శాతాన్ని ప్రతీ వారం చొప్పున కంపెనీ చెల్లిస్తుంది. పాలసీదారు తిరిగి పని చేసుకునే స్థితిలోకి వచ్చే వరకు ఈ చెల్లింపులు కొనసాగుతాయి. 2. ప్రమాదం వల్ల ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సల కోసం బీమాలో 10 శాతాన్ని కంపెనీ చెల్లిస్తుంది. 3. పాలసీదారు పిల్లలకు విద్యాసాయం కింద బీమాలో 10 శాతాన్ని (ఒక్కొక్కరికి) ఒకే విడతగా కంపెనీ చెల్లిస్తుంది. కాకపోతే పిల్లల వయసు 25 ఏళ్లు దాటి ఉండకూడదు. రూ.2.5 లక్షల నుంచి రూ.కోటి వరకు బీమాను తీసుకోవచ్చు. సాధారణంగా టర్మ్ ప్లాన్, హెల్త్ ప్లాన్లకు రైడర్లుగా వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్లు లభిస్తున్నాయి. కనుక ఎవరైనా కానీ తమ టర్మ్ ప్లాన్ లేదా హెల్త్ ప్లాన్తో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని ఎంపిక చేసుకుని ఉంటే.. అటువంటి వారు విడిగా సరళ్ సురక్షా బీమాను తీసుకోవాల్సిన అవసరం లేదు. విడిగా ప్రమాద బీమా ప్లాన్ల ప్రీమియం, సదుపాయాలను.. సరళ్ సురక్షా బీమా ప్రీమియం, సదుపాయాలతో పోల్చి చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. వాస్తవానికి సరళ్ సురక్షా బీమా ప్లాన్, స్టాండలోన్ వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్ ప్రీమియంలు ఇంచుమించు ఒకే స్థాయిలో ఉంటున్నాయి. కనుక సదుపాయాలపై దృష్టి సారించడం అవసరం. ఇప్పటికే సరైన టర్మ్ ప్లాన్ను ఒకవేళ మీరు తీసుకుని ఉండి, ఆ ప్లాన్కు యాక్సిడెంటల్ డెత్/డిస్మెంబర్మెంట్ రైడర్ లేనట్టయితే.. అప్పుడు సరళ్ సురక్షా బీమా తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. -
ఇన్సూరెన్స్, అమ్మో..క్లెయిమ్ చేయని మొత్తం ఇన్నివేల కోట్లు ఉందా
2020 డిసెంబర్ 31 వరకూ అందుతున్న సమాచారం ప్రకారం బ్యాంకులు, బీమా కంపెనీల వద్ద క్లెయిమ్ చేయని మొత్తం దాదాపు రూ.49,000 కోట్లని ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాజ్యసభకు తెలిపారు. బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని సొమ్ము రూ.24,356 కోట్లని వివరించారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్– ఐఆర్డీఏఐ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థల వద్ద ఉన్న ఈ మొత్తాలు రూ.24,586 కోట్లని (2020 డిసెంబర్ నాటికి) వెల్లడించారు. ఎవ్వరూ క్లెయిమ్ చేయని నిధుల వినియోగానికి 2014లో ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ను ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు వారిలో అవగాహన పెంచడం ఈ ఫండ్ లక్ష్యమన్నారు. ఇక బీమా కంపెనీలు తమ వద్ద గత పదేళ్లుగా క్లెయిమ్ చేయని నిధులను సీనియర్ సిటిజన్ సంక్షేమ నిధికి (ఎస్సీడబ్లూఎఫ్) ప్రతి యేడాదీ బదలాయిస్తాయని తెలిపారు. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాల పరిరక్షణకు ఈ నిధులను ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. చదవండి : వేల కంపెనీలు మూతపడ్డాయ్, ఏ రాష్ట్రంలో ఎక్కువంటే -
ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స్, కోవిడ్–19 క్లెయిములు భారీగా పెరిగాయ్
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నికర లాభం 43 శాతం క్షీణించి రూ. 220 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 390 కోట్లు ఆర్జించింది. కోవిడ్–19 క్లెయిములకు చెల్లింపులు పెరగడం లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. క్యూ1లో 8,956 క్లెయిములు నమోదైనట్లు వెల్లడించింది. ఇవి 2020–21 పూర్తి ఏడాదితో పోలిస్తే దాదాపు 1.3 రెట్లు అధికమని తెలియజేసింది. దీంతో నికర రీఇన్సూరెన్స్ రూ. 570 కోట్లుగా నమోదైంది. ప్రీమియంల తీరు క్యూ1లో ఎస్బీఐ లైఫ్ స్థూల రిటెన్ ప్రీమియం 10 శాతం పుంజుకుని రూ. 8,380 కోట్లను తాకింది. కొత్త బిజినెస్ ప్రీమియం 9 శాతం వృద్ధితో రూ. 3,350 కోట్లకు చేరగా.. వ్యక్తిగత విభాగంలో 37 శాతం అధికంగా రూ. 1,840 కోట్లను తాకింది. కొత్త బిజినెస్ విలువ(వీవోఎన్బీ) 52 శాతం జంప్చేసి రూ. 390 కోట్లయ్యింది. రూ. 1,390 కోట్ల వ్యక్తిగత రేటెడ్ ప్రీమియంతో కంపెనీ ప్రయివేట్ మార్కెట్లో 18.9 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచినట్లు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వివరించింది. నిర్వహణలోని ఆస్తులు 32 శాతం బలపడి రూ. 2.3 లక్షల కోట్లను తాకగా.. కోవిడ్ సంబంధ క్లెయిముల కోసం రూ. 440 కోట్ల అదనపు రిజర్వులను ఏర్పాటు చేసింది. చదవండి: అదిరిపోయే ఫీచర్లు, మాస్కులోనే మైక్, స్పీకర్లు ఇంకా -
బీమా పాలసీకి బోనస్గా బొగ్గు గని షేర్లంటూ రూ.కోటి స్వాహా!
సాక్షి, సిటీబ్యూరో: బీమా పాలసీకి బోనస్గా బొగ్గు గనికి సంబంధించిన షేర్లు ఇస్తామంటూ హైదరాబాద్వాసికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.కోటి కొట్టేశారు. ఆరేళ్ల పాటు సాగిన ఈ దోపిడీపై ఎట్టకేలకు బాధితుడు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని ఆగాపూరకు చెందిన వ్యక్తి కొన్నేళ్లు అసోంలోని గౌహతిలో ఉన్నాడు. 2015లో ఇతడికి చేసి ఇన్సూరెన్స్ ఏజెంట్గా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు పాలసీ పేరు చెప్పారు. తమ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే రూ.80 లక్షల విలువైన కోల్మైన్ షేర్లు ఇస్తామంటూ ఎర వేశారు. అతి తక్కువ కాలంలోనే వాటి విలువ రూ.కోట్లకు చేరుతుందని నమ్మబలికారు. తొలుత ఇన్సూరెన్స్ పాలసీతో పాటు వివిధ పేర్లు చెప్పి రూ.20 లక్షలు కాజేశారు. ఆపై షేర్స్ కేటాయింపు కోసమంటూ కొన్ని పత్రాలు ఆయనకు పంపారు. వీటిని తిరిగి పొందిన తర్వాత ఓసారి ఫోన్ చేసి షేర్ విలువ భారీగా పెరిగిందని చెప్పారు. ఆ డబ్బును ఎన్క్యాష్ చేసుకోవడానికి కొన్ని పన్నులు చెల్లించాలంటూ చెప్పి భారీ మొత్తం స్వాహా చేశారు. ఆరేళ్ల కాలంలో మొత్తం రూ.కోటి స్వాహా చేశారు. మరికొన్ని పన్నుల పేరుతో ఇంకా డబ్బు చెల్లించాలని చెప్తుండటంతో అనుమానం వచ్చిన బాధితులు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేస్తోంది. -
బీమా పాలసీదారులకు శుభవార్త!
బీమా పాలసీదారులకు శుభవార్త. ఇస్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డిఎఐ), జీవిత బీమా కంపెనీల ముందు కొత్త ముసాయిదా మార్గదర్శకాలను ఉంచింది. ఐఆర్డిఎఐ జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. ముందస్తుగా ప్రీమియంలు చెల్లించే వారికి రాయితీలు లేదా వడ్డీ చెల్లిచాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై బీమా సంస్థలతో చర్చించింది. అనేక మంది వివిధ రకాల కారణాలతో ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంను గడువులోగా చెల్లించడంలో ఇబ్బందులు పడుతుంటారు. దీని వల్ల కొన్నిసార్లు మధ్యలోనే పాలసీ రద్దు చేసుకునే అవకాశం ఉంది. అందుకోసమే పాలసీదారులు గడువు కన్నా ముందుగానే ప్రీమియంలు చెల్లించేలా ప్రోత్సహించాలని ఇన్సూరెన్స్ కంపెనీలకు తెలిపింది. దానిలో భాగంగానే సకాలంలో చెల్లించిన వారికీ రాయితీలు ఇవ్వాలని ఐఆర్డిఎఐ పేర్కొంది. దీనివల్ల ఇరువురికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని తెలిపింది. త్వరలోనే ఈ అంశంపై ముసాయిదా సర్క్యులర్ విడుదల కానుంది. చదవండి: పోస్టాఫీస్ జీవిత బీమా పథకాలపై బోనస్ ఇంధన ధరలు తగ్గేది అప్పుడే: ధర్మేంద్ర ప్రధాన్ -
కార్డులు, ఖాతాలు భద్రంగా ఉన్నాయా?
మొబైల్ ఫోన్ నుంచే వ్యాలెట్ల వినియోగం, బ్యాంకింగ్ సేవలు, డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగం బాగా విస్తృతమవుతోంది. అత్యాధునిక టెక్నాలజీలతో.. వినియోగదారులు ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్ల నుంచి డిజిటల్ లావాదేవీలు చక్కబెట్టేస్తున్నారు. ఈ కామర్స్ షాపింగ్ కూడా మొబైల్ ఫోన్ల నుంచే ఎక్కువగా కొనసాగుతోంది. ఆర్థిక లావాదేవీలు కానీయండి.. వినోదం, షాపింగ్, విద్య ఇలా ఒకటేమిటి ఎన్నో అవసరాల కోసం డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఆధారపడడం పట్టణ, నగర జీవనంలో భాగంగా మారిపోయింది. దీంతో సమాచారానికి భద్రతా రిస్క్ నెలకొంది. మొబైల్ ఫోన్ అయినా, కంప్యూటర్ అయినా.. సైబర్ నేరగాళ్లు కీలక సమాచారాన్ని కొల్లగొట్టేందుకు ఎన్నో మార్గాలు వెతుక్కుంటున్నారు. కనుక వినియోగదారులుగా మన బ్యాంకు ఖాతాలు, కార్డులు, ఫోన్లు, వ్యాలెట్లకు తగినంత భద్రత ఉందా? అన్నది సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇటీవలే ఓ ఈ కామర్స్ పోర్టల్కు సంబంధించి 2 కోట్ల వినియోగదారుల వ్యక్తిగత వివరాలు లీకయ్యాయి. వెంటనే డార్క్ వెబ్లో ఈ వివరాలను అమ్మకానికి పెట్టడం కూడా జరిగిపోయింది. అదే విధంగా ఈ ఏడాది ఆగస్ట్లో 3,69,000 బ్యాంకింగ్ ఖాతాదారుల వివరాలను చోరీ చేసే ప్రయత్నం చోటు చేసుకుంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతాయే హ్యాకింగ్కు గురైందంటే సామాన్యుల ఖాతాలకు రక్షణ ఏ పాటిది? ఈ ఉదాహరణలన్నీ కూడా డిజిటల్ వేదికలపై మన సమాచారం చోరీకి గురికాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసేవే. కవరేజీ అన్నింటికీ కాదు.. ఉద్దేశపూర్వక, నేరపూరిత, మోసపూరిత తదితర చర్యలకు పాలసీ కవరేజీ ఉండదు. అలాగే, ఈ ప్లాన్లు పాలసీదారులకు అయ్యే గాయాలకు గానీ, మానసిక, భావోద్వేగ ఇబ్బందులు తదితర వాటికి పరిహారం ఇవ్వవు. కంప్యూటర్లు, పరికరాలకు వాటిల్లే నష్టానికీ పరిహారం రాకపోవచ్చు. కనుక పాలసీ డాక్యుమెంట్ను ముందే పూర్తిగా చదవడం అవసరం. క్లెయిమ్ ప్రక్రియ ఇతర సాధారణ బీమా పాలసీల మాదిరే క్లెయిమ్ ప్రక్రియ ఉంటుంది. పోలీసు లేదా సైబర్ సెల్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని, దానిని క్లెయిమ్ ఫామ్కు జత చేసి బీమా కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. లావాదేవీలకు సంబంధించిన రుజువులను కూడా చూపించాలి. సైబర్ దాడి లేదా చోరీ జరిగిన వెంటనే బీమా సంస్థకు ఫోన్ రూపంలో లేదా ఈ మెయిల్ ద్వారా వెంటనే తెలియజేయడం మంచిది. కస్టమర్లు తమ సంస్థ పోర్టల్పై క్లెయిమ్ నమోదు చేసుకోవచ్చని లేదా కస్టమర్కేర్ విభాగానికి సమాచారం తెలియజేయవచ్చ ని ఐసీఐసీఐ లాంబార్డ్కు చెందిన సంజయ్దత్తా సూచించారు. క్లెయిమ్స్ మేనేజర్, సైబర్ నిపుణులు ఈ విషయంలో పాలసీదారుకు అవసరమైన సహకారాన్ని అందిస్తారని చెప్పారు. రక్షణ కావాల్సిందే.. స్మార్ట్ పరికరాలను వాడే వారిలో అధిక శాతం మందికి.. మాల్వేర్, ఫైర్వాల్స్ విషయంలో రక్షణ గురించి అవగాహన లేదు. కార్యాలయాల్లో మనం వినియోగించే పరికరాలకు ఎక్కువ భద్రతే ఉంటుంది. కానీ, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇంటి నుంచే పని విధానం (వర్క్ ఫ్రమ్ హోమ్) పెరిగిపోయింది. అందుకే ఇటీవలి కాలంలో సైబర్ ఇన్సూరెన్స్కు ఆదరణ పెరుగుతోంది. ఉదాహరణకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఇండివిడ్యువల్ సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీ కోసం వివరాలు కోరే వారు 2020–21తొలి 6 నెలల్లో 20% అధికంగా ఉన్నట్టు కంపెనీ తెలియజేసింది. ఇక ఫ్యూచర్ జన రాలి ఇండియా ఇన్సూరెన్స్ సైబర్ పాలసీలకూ డిమాండ్ 30–40% అధికమైంది. ‘‘సైబర్ దాడుల నుంచి సైబర్ ఇన్సూరెన్స్ మీకు రక్షణ ఇవ్వదు. కాకపోతే ఈ తరహా సైబర్ దాడుల కారణంగా మీకు వాటిల్లే నష్టానికి పరిహారాన్ని అందించే విధంగా ఉంటుంది. కీలకమైన సమాచారాన్ని చోరీ చేసినా, దుర్వినియోగం చేసినా లేక మీ ప్రతిష్టకు నష్టం కలుగజేసినా కవరేజీనిస్తుంది’’ అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ టీఏ రామలింగం తెలిపారు. పాలసీ తీసుకునే ముందు ► రిస్క్ల మదింపు: ఆన్లైన్లో సైబర్ రిస్క్ ఏ స్థాయిలో ఉంది? డిజిటల్ లావాదేవీలను ఏ స్థాయిలో చేస్తున్నారు.. ఎన్ని రోజులకోసారి లేదా రోజువారీగా చేస్తున్నారా అన్నది పరిశీలించాలి. అదే విధంగా సోషల్ మీడియా ఖాతాల వినియోగం, డిజిటల్ లాకర్లు, డిజిటల్ స్టోరేజీలను కూడా వాడుతున్నారేమో చూసుకోవాలి. ► సరైన కవరేజీ: మీకున్న రిస్క్ స్థాయిని పూర్తిగా అంచనా వేసిన తర్వాత అవసరమైనంత కవరేజీతో పాలసీని తీసుకోవాలి. సాధారణంగా సైబర్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వ్యక్తులకు అయితే రూ.50వేల నుంచి రూ.2 కోట్ల వరకు కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. ► సరైన సంస్థ: మీ అవసరాలన్నింటికీ కవరేజీనిచ్చే పాలసీని ఎంపిక చేసుకోవడం ముఖ్యమైన అంశం అయితే.. ఆ పాలసీని ఏ బీమా సంస్థ నుంచి తీసుకోవాలన్నది కూడా చాలా కీలకం అవుతుంది. ఇందుకోసం బీమా సంస్థ చెల్లింపుల చరిత్ర మంచిగా ఉన్నదా, లేదా అన్నది పరిశీలించాలి. తక్కువ చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థ నుంచి పాలసీని తీసుకుంటే.. ఆ తర్వాత మీకు క్లెయిమ్ అవసరం ఏర్పడినప్పుడు సమస్యలు ఎదురుకావచ్చు. ► సరైన కవరేజీలు: మీరు తీసుకునే పాలసీ సమగ్ర కవరేజీతో కూడిన ప్లాన్ అయి ఉండాలి. అందులో అవసరమైన కవరేజీలు అన్నీ ఉండేలా చూసుకోవాలి. సరైన కవరేజీ సైబర్ ఇన్సూరెన్స్ అన్నది.. సైబర్ దాడి లేదా సమాచార చోరీ అనంతరం అవసరమైన న్యాయ, రక్షణ, విచారణ ఖర్చులను చెల్లిస్తుంది. కోర్టు విచారణకు హాజరు అయ్యేందుకు ఖర్చులను కూడా చెల్లిస్తుంది. చోరీకి గురైన డేటాను తిరిగి పొందడంతోపాటు, ఇన్స్టాలేషన్కు అయ్యే వ్యయాలను కూడా చెల్లిస్తుంది. గోప్యత, సమాచార ఉల్లంఘనల్లో మూడో పక్షానికి వాటిల్లే నష్టానికి కూడా పరిహారం అందిస్తుంది. అంతేకాదు ఆర్థికంగా ఏర్పడే నష్టాన్ని కూడా (మీరు తీసుకున్న కవరేజీకి లోబడి) భర్తీ చేస్తుంది. ‘‘కరోనా మహమ్మారి సమయంలో చాలా వరకు సంస్థలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ నమూనాను అనుసరించాయి. దీంతో సంస్థలు తమ ఐటీ అప్లికేషన్ల సేవలను, డేటాబేస్లను క్లౌడ్ ప్లాట్ఫామ్లపైకి మళ్లించడంతో సైబర్ దాడుల రిస్క్ పెరిగింది. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు ఉపయోగించే నెట్వర్క్లు పూర్తి స్థాయి రక్షణతో ఉన్నవి కావు. దీంతో సైబర్ దాడుల బారిన పడే రిస్క్ ఎక్కువైంది’’ అని ఐసీఐసీఐ లాంబార్డ్ అండర్రైటింగ్, క్లెయిమ్స్, రీఇన్సూరెన్స్ చీఫ్ సంజయ్దత్తా వివరించారు. వీటిని మర్చిపోవద్దు.. సైబర్ బీమా తీసుకుంటే చాలులే అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు. ప్రతీ ఒక్కరూ తమకంటూ ఉన్న రిస్క్లు ఏవేవి? అన్నది పరిశీలించుకుని, వాటికి కవరేజీనిచ్చే పాలసీని ఎంచుకోవడం కీలకం అవుతుంది. అంతేకాదు, అవసరమైన యాడాన్ కవరేజీలను కూడా జోడించుకోవాలి. ఇందులో ముఖ్యంగా రిస్క్ పరిమాణాన్ని అంచనా వేయాలి. ఇందుకుగాను ఇంటర్నెట్ వేదికపై ఎంత విలువ మేర ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నదీ చూడాల్సి ఉంటుంది. తరచూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ను, అదే విధంగా కార్డు చెల్లింపులు, ఈ వ్యాలెట్లను వినియోగించే వారు అయితే సైబర్ ఇన్సూరెన్స్ను తప్పకుండా తీసుకోవడం మంచిదని ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీరాజ్ దేశ్పాండే సూచించారు. రక్షణ చర్యలు సైబర్ బీమా తీసుకోవడం ఒక విధమైన రక్షణ అయితే.. మరోవైపు ఈ సైబర్ దాడుల బారిన పడకుండా మనవంతు రక్షణ చర్యలు తీసుకోవడం కూడా అవసరమే. ఇందుకోసం ఏం చేయాలంటే.. ► కంప్యూటర్కు రక్షణ: మొదటగా చేయాల్సింది ఇదే. కంప్యూటర్ నుంచి ఇంటర్నెట్ను యాక్సెస్ చేసే వారు తప్పకుండా యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్కువ రక్షణనిచ్చే సాఫ్ట్వేర్ను ఎంచుకోవాలి. దీనిని ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా చేసుకోవాలి. ► పటిష్ట పాస్వర్డ్లు: కొంత మంది అయితే పాస్వర్డ్లను ఎప్పటికీ మార్చకుండా వాటినే వినియోగిస్తుంటారు. కానీ ఇది చాలా రిస్క్తో కూడినది. పాస్వర్డ్లను ఇంకొకరు సులభంగా ఊహించే విధంగా ఉండకుండా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. పాస్వర్డ్లో నంబర్లు, ప్రత్యేక క్యారెక్టర్లు తప్పక ఉండాలి. ఎప్పటికప్పుడు పాస్వర్డ్లను మార్చుకుంటూ ఉండాలి. ► సోషల్ మీడియా ఖాతాలకు రక్షణ: సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై మీ ప్రొఫైల్ను ప్రైవేటు అకౌంట్స్ కోసమే అని ఎంచుకోవాలి. దాంతో మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మాత్రమే వాటిని చూడగలరు. అకౌంట్ను ప్రైవేటుగా ఎంచుకునే ఆప్షన్ అన్ని ప్లాట్ఫామ్లపైనా ఉంది. ► ఫిషింగ్ ఈమెయిల్స్తో జాగ్రత్త: ఈ మెయిల్స్కు వచ్చే ప్రతీ సందేశంపైనా క్లిక్ చేయకూడదు. క్లిక్ చేసే ముందు సోర్స్ చూడాలి. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? మీకు తెలిసిన వేదిక నుంచేనా అన్నది పరిశీలించుకోవాలి. బహుమతులు, మంచి ఆఫర్లు అంటూ తెలియని వేదికలు, కొత్త వేదికల నుంచి వచ్చే మెయిల్స్ను కూడా ముట్టుకోకుండా ఉండడమే మంచిది ► డేటా రక్షణ: మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఫైల్స్కు ఎన్క్రిప్షన్ ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు బ్యాకప్ కూడా తీసుకోవడం మర్చిపోవద్దు. ► మొబైల్ ఫోన్కు రక్షణ: మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లకు కూడా మంచి యాంటీ వైరస్ అవసరం ఎంతో ఉంది. -
ప్రియమైన వారికి అమూల్య బహుమతి
ముఖ్యమైన పండుగలు, పుట్టిన రోజు.. ఈ తరహా ప్రత్యేక సందర్భాల్లో కొందరు అపురూప కానుకల ద్వారా తమకు అత్యంత సన్నిహితులను సంతోషానికి, ఆశ్చర్యానికి గురి చేయాలనుకుంటారు. ఇందుకోసం ఖరీదైన కార్లు, బంగారం, వజ్రాభరణాలు, ఫ్లాట్ లేదా విల్లా ఈ తరహా కానుకలను ఇచ్చే వారు ఉన్నారు. కానీ, ఈ తరహా భౌతిక కానుకలు కాకుండా, మీరు నిజంగా అభిమానించే వారి భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు వినూత్నంగా బీమా పాలసీని బహుమతిగా ఎందుకు ఇవ్వకూడదు..? ఆలోచించండి. ఒక వ్యక్తి అకాల మరణంతో సంబంధిత కుటుంబం ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆ సమయంలో బీమా పాలసీ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటుందనడంలో సందేహం లేదు. కనుక జీవిత బీమా పాలసీని ఇవ్వడం నిజంగా అపురూపమైన కానుకే అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే మరణానికి పరిహారం ఇచ్చే ఉద్దేశ్యంతో కూడినది. పాలసీ కాల వ్యవధి ముగిసిపోయే వరకు పాలసీదారులు జీవించి ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ, పాలసీ కాల వ్యవధి సమయంలో అకాల మరణానికి గురైతే నామినీకి సమ్ అష్యూరెన్స్ను పరిహారం కింద చెల్లించడం జరుగుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్లో రూ.కోటి సమ్ అష్యూరెన్స్ (బీమా రక్షణ మొత్తం)కు ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. వీటిని గమనించాలి.. బీమా పాలసీని కానుకగా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇతర ఉత్పత్తుల వైపు ఆలోచన వెళ్లే అవకాశం లేకపోలేదు. అయితే, బండిల్డ్ ఉత్పత్తుల పట్ల జాగ్రత్త వహించాలి. బీమా రక్షణకు, పెట్టుబడి ఇతర ఆప్షన్లను జోడించి ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాలను కంపెనీలు చేస్తుంటాయి. కానీ, వీటిల్లో ఉండే అనేక రకాల చార్జీలతో బీమా కంపెనీలకే ప్రయోజనం ఎక్కువ. ఈ చార్జీల కారణంగా పాలసీదారులకు చివర్లో దక్కేది తక్కువే. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలు గట్టిగా 4–5 శాతం మించి రాబడులను ఇవ్వలేవు. ఇక ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే యూనిట్ లింక్డ్ బీమా పథకాల్లో (యులిప్) రిస్క్ అధికంగా ఉంటుంది. అదే సమయంలో రాబడులకు హామీ ఉండదు. అధిక రిస్క్ తీసుకునే వారికి యులిప్ పాలసీలు పెట్టుబడి ఆప్షన్ అవుతాయి. కానీ, టర్మ్ పాలసీలతో పోలిస్తే అసలైన బీమా ప్రయోజనం వీటిల్లో తక్కువే. ఇక పాలసీ ఎంపిక విషయంలో బీమా కంపెనీ, బీమా మొత్తం, బీమా కాల వ్యవధి, ప్రీమియం చెల్లింపు కాల వ్యవధి వీటి గురించి స్పష్టత తెచ్చుకోవాలి. బీమా ఎంత? ఎంత మొత్తం బీమా తీసుకోవాలనే విషయంలో ఓ సాధారణ సూత్రం ఉంది. వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్ల మేర బీమా తీసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.6 లక్షలు అనుకుంటే, పది రెట్ల మేర రూ.60 లక్షలకు బీమా కవరేజీని తీసుకోవడం అవసరం. అయితే, సంబంధిత వ్యక్తి పేరిట ఉన్న అప్పులు, కుటుంబ జీవన శైలి ఆధారంగా ఈ మొత్తం మారిపోతుంది. ఏమైనా రుణ భారం ఉంటే ఆ మేరకు అదనంగా బీమా కవరేజీ అవసరం. ఇక పాలసీ కాల వ్యవధిని నిర్ణయించే ముందు ఎంత కాలం పాటు ఇంకా ఆ వ్యక్తి పనిచేయగలరన్నది కీలకం అవుతుంది. ఎందుకంటే కుటుంబానికి సంబంధిత వ్యక్తి ఆర్జన అవసరమైనంత కాలం మేర బీమా రక్షణ ఉంటే సరిపోతుంది. ప్రీమియంలపై ప్రత్యేక దృష్టి... బీమా కంపెనీలు 80 ఏళ్ల వరకు జీవిత బీమా రక్షణను ఆఫర్ చేస్తున్నాయి. ఆలస్యంగా వివాహం అవడం, ఆలస్యంగా సంతానం కలిగిన వారికి రిటైరైన తర్వాత కూడా కొంత కాలం వరకు బీమా రక్షణ అవసరంపడొచ్చు. బీమా ప్రీమియం చెల్లింపు కాల వ్యవధి కూడా కీలకమైనదే. బీమా కంపెనీలు పరిమిత కాలం పాటు చెల్లింపు, పూర్తి కాలం పాటు చెల్లింపు ఆప్షన్లు ఇస్తుంటాయి. పరిమిత కాలం ఆప్షన్లో 20 ఏళ్లకు పాలసీ తీసుకుంటే 5/10/15 ఏళ్ల పాటు చెల్లించే అవకాశం ఇవ్వొచ్చు. ఇటువంటి సందర్భాల్లో చెల్లించే ప్రీమియం మొత్తం అధికంగా ఉంటుంది. కొనుగోలు ఏ రూపంలో..? ఆన్లైన్లో అయితే బీమా పాలసీని తక్కువ ప్రీమియానికే పొందే అవకాశం ఉంటుంది. దీనితో ఏజెంట్ల కమీషన్ భారం ఉండదు. అన్ని బీమా కంపెనీలు తమ అధికారిక వెబ్ పోర్టళ్ల ద్వారా ఆన్లైన్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. ఒకటికి మించిన బీమా కంపెనీల మధ్య ప్రీమియం పరంగా అంతరం, ప్రయోజనాల వైరుధ్యం తెలుసుకుని మంచి పాలసీని ఎంచుకునేందుకు పాలసీబజార్ డాట్ కామ్ పోర్టళ్లు అనుకూలంగా ఉంటాయి. పేరు, వయసు, ఎంత కాలానికి బీమా కవరేజీ కావాలి, ఎంత మొత్తం అనే వివరాలను పోర్టళ్లలో ఇవ్వడం ద్వారా ప్రీమియం ఎంతన్న కొటేషన్ చూసుకోవచ్చు. నచ్చితే అక్కడి నుంచే తదుపరి, పాన్, ఇతర ఆరోగ్య వివరాలు, చిరునామా, కాంటాక్ట్ సమాచారం ఇవ్వడం ద్వారా అప్లికేషన్ను ప్రాసెస్ చేసుకోవచ్చు. దీనికి 10–15 నిమిషాలకు మించి పట్టదు. చివర్లో ప్రీమియం చెల్లించినట్టయితే, కంపెనీ సిబ్బంది మీకు కాల్ చేసి తదుపరి వివరాలు కోరతారు. కొన్ని కంపెనీలు ఆరోగ్య పరీక్షల అనంతరం బీమా పాలసీని జారీ చేస్తాయి. కొనుగోలుకు ముందు ముఖ్యంగా బీమా కంపెనీని ఎంచుకునే ముందు, క్లెయిమ్స్ హిస్టరీని పరిశీలించాలి. అంటే ఒక్కో ఆర్థిక సంవత్సరంలో బీమా పరిహారం కోరుతూ వచ్చిన దరఖాస్తులు ఎన్ని, ఎన్నింటికి కంపెనీ పరిహారం చెల్లించింది, ఎన్నిటిని తిరస్కరించింది, అలాగే ఎన్ని అపరిష్కృతంగా ఉన్నాయనే వివరాలను ఐఆర్డీఏఐ వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు. చెల్లింపుల హిస్టరీ మెరుగ్గా ఉన్న కంపెనీని ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే వచ్చిన క్లెయిమ్స్ పట్ల బీమా కంపెనీ ఎంత బాధ్యతగా ఉన్నదీ తెలుస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త... ఒకరి పేరిట బీమా పాలసీని బహుమతిగా ఇవ్వడమే కాదు... సంబంధిత వ్యక్తి మరణిస్తే పరిహారం దక్కే విషయంలో తగిన రక్షణ కల్పించడం కూడా అవసరం. బీమా పాలసీ కలిగిన వారు మరణించిన సందర్భాల్లో, వారి పేరిట రుణాలు ఉంటే, ఆ పరిహారం తాము స్వాధీనం చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోర్టులను ఆశ్రయించొచ్చు. అదే జరిగితే వాటికి అనుకూలంగా కోర్టులు తీర్పులు ఇవ్వొచ్చు. ఈ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేందుకు, జీవిత బీమా పాలసీని వివాహిత మహిళా ఆస్తి చట్టం (ఎండబ్ల్యూపీ) కింద రిజిస్టర్ చేయాలి. ఇలా చేసిన పాలసీ విషయంలో క్లెయిమ్ హక్కును సంబంధిత వ్యక్తి జీవిత భాగస్వామి లేదా పిల్లలు మాత్రమే కలిగి ఉంటారు. కనుక బీమా పాలసీ కొనుగోలు సమయంలోనే దానిని ఎండబ్ల్యూపీ చట్టం కింద తీసుకోవాలి. ఒక్కసారి పాలసీ తీసుకున్న తర్వాత దాన్ని మార్చడానికి వీలు పడదు. -
అన్ని జీవాలకు బీమా సదుపాయం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన జీవాలకే బీమా పథకం వర్తిస్తుండగా, ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని జీవాలకూ బీమా పథకాన్ని వర్తింపజేస్తామని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందారులు సొంతంగా పెంచే జీవాలు రోడ్డు ప్రమాదాలు, ఇతర సందర్భాల్లో మరణిస్తే ఆయా పెంపకందారులకు తీవ్ర నష్టం కలుగుతోందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బీమా సదుపాయాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. శనివారం పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆ శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అదనపు డైరెక్టర్ రాంచందర్, విజయా డెయిరీ ఎండీ శ్రీనివాస్రావు, టీఎస్ఎల్డీసీ సీఈవో మంజువాణి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవాల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ప్రోత్సహించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ప్రమాదాలు, ఇతర కారణాలతో జీవాలు మరణిస్తే ఈ పథకం కింద జీవాన్ని కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. అయితే, బీమా ప్రీమియం మొత్తంలో 80 శాతం ప్రభుత్వం చెల్లిస్తుందని, 20 శాతం పెంపకందారులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ పథకం అమలుకు సంబంధించిన అన్ని కసరత్తులు పూర్తి చేసి అక్టోబర్ 15వ తేదీ నుంచి జిల్లా పశుసంవర్థక శాఖ కార్యాలయాల్లో బీమా కోసం దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో జీవాలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి పశుసంవర్థక శాఖకు రావాల్సిన నిధుల సమాచారాన్ని 15 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. చేప పిల్లలు వేయకండి: విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులు, రిజర్వాయర్లకు వరద నీరు పోటెత్తుతోందని, ఈ సమయంలో చేప పిల్లలను విడుదల చేయడం వల్ల వరద నీటిలో కొట్టుకుపోతాయని, వరదలు తగ్గేంతవరకు నాలుగు రోజుల పాటు చేపపిల్లల సరఫరా నిలిపివేయాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలు, హైవేల వెంట విజయా డెయిరీ ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని, వాటికి అదనంగా ప్రతి జిల్లాలో 5–6 ఔట్లెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డెయిరీ ఎండీ శ్రీనివాసరావును మంత్రి ఆదేశించారు. -
వాహన కొనుగోలుదారులకు ఊరట
సాకి, న్యూఢిల్లీ: వాహనదారులకు శుభవార్త. కొత్తగా కారు లేదా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఊరట లభించనుంది. నేటి (ఆగస్ట్ 1) నుంచి దేశంలో కొత్త ఇన్సూరెన్స్ నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహన ధరలు దిగి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులకు పెను భారంగా మారిన లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఇన్సూరెన్స్ కంపెనీలు ఉపసంహరించుకోనున్నాయి. దీంతో వినియోగదారులు మూడు లేదా ఐదు సంవత్సరాల దీర్ఘకాలిక బీమా పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన 2020 ఆగస్టు 1 తర్వాత కొనుగోలు చేసే వాహనాలకు వర్తిస్తుంది. దీంతో ఇకపై కారు, లేదా బైక్ కొనే వారు మూడేళ్లు లేదా ఐదేళ్లకు కాకుండా ఒక ఏడాదికే వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అయితే ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఈ పాలసీని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా వెహికల్ ఆన్రోడ్ ధర కూడా దిగి వస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా కారు లేదా టూవీలర్ కొనుగోలు చేసే వారికి తొలి ఏడాది ఇన్సూరెన్స్ భారం తగ్గుతుంది. అంతేకాకుండా, కస్టమర్లు ఎక్కువ కాలం ఒకే బీమా కంపెనీకి కట్టుబడి ఉండాల్సి అవసరం లేదు. ఇతర బీమా సంస్థలకు కూడా మారవచ్చు. కాగా వాహన యజమానులు ద్విచక్ర వాహనాలకు ఐదేళ్లు, నాలుగు చక్రాల వాహనాలకు మూడేళ్లు దీర్ఘకాలిక పాలసీని 2018లో సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. ఇది భారమవుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తాజా నిబంధనలను ఐఆర్డీఏఐ తీసుకొచ్చింది. -
సంపూర్ణ ఆరోగ్య రక్షణ మీకుందా..?
ఈ రోజుల్లో బీమా పాలసీ లేకుండా వైద్య చికిత్సల ఖర్చులను భరించడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. ఏటేటా వైద్య ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోతున్న తరుణంలో ప్రతీ ఒక్కరి ప్రణాళికలో ఆరోగ్య బీమా (హెల్త్ పాలసీ) అవసరం ఎంతో ఉంది. అలా అని ఏదో నామమాత్రపు కవరేజీతో హెల్త్ పాలసీ తీసుకుని.. ‘హమ్మయ్య నాకు హెల్త్ కవరేజీ ఉందిలే’ అని అనుకోవద్దు. ఎందుకంటే మధ్య వయసు నుంచి వృద్ధాప్యానికి చేరువవుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు, జీవనశైలి వ్యాధుల ముప్పు ఎక్కువవుతుంది. కనుక 20ల్లో తీసుకున్న కవరేజీయే జీవితాంతం సరిపోతుందని అనుకోవద్దు. అంతేకాదు ఒక్కొక్కరి జీవన విధానం, జీవనశైలి వేర్వేరుగా ఉండొచ్చు. కొందరికి జీవనశైలి వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వయసుకు తగ్గ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ (బీమా రక్షణ) అవసరం. అప్పటికే పలు వ్యాధులతో బాధపడుతుంటే.. ఎదురయ్యే ఖర్చులను తీర్చే స్థాయిలో బీమా రక్షణ ఉండాలి. ఇక కోవిడ్–19 వైరస్కు ప్రైవేటులో చికిత్స తీసుకోవాల్సి వస్తే పేదలు, మధ్యతరగతి వారు లబోదిబోమనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే రోజుకు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు కొన్ని ఉన్నాయి. దీంతో కోవిడ్ చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాలంటే భయపడే పరిస్థితి. ఈ పరిణామాలు సైతం హెల్త్ ఇన్సూరెన్స్పాలసీ అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. 20–30 మధ్య వయస్సువారు... సాధారణంగా జీవనశైలి ఆరోగ్యంగానే ఉంటుంది. అయినప్పటికీ వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అందుకు సన్నద్ధమై ఉండాలి. కనుక ఇండివిడ్యువల్ హెల్త్ పాలసీ తీసుకోవాలి. ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఇది ఆదుకుంటుంది. ఔట్ పేషెంట్ చికిత్సలకు కవరేజీ ఇచ్చే పాలసీ మంచిది. పెరిగే వయసు, వైద్య ద్రవ్యోల్బణానికి తగ్గట్టు బీమా కవరేజీ పెంచుకునే ఆప్షన్ తప్పకుండా ఉండాలి. ఐఆర్డీఏఐ ఆదేశాలతో చాలా బీమా కంపెనీలు ఆరోగ్య సంజీవని పేరుతో ఓ ప్రామాణిక హెల్త్ పాలసీని తీసుకొచ్చాయి. కనుక యువత ఈ ప్లాన్ను పరిశీలించొచ్చు. మెట్రో నగరాలు, టైర్–1 పట్టణాల్లో ఉంటుంటే కవరేజీ కనీసం రూ.5లక్షలు, ఇతర పట్టణాల్లో ఉంటున్న వారు రూ.3 లక్షలు ఉండేలా ఎంచుకోవాలి. ఇక ఉద్యోగం ఉండి, తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటే, రిస్క్ ఎక్కువ ఉండే రంగాల్లో పనిచేస్తుంటే.. ప్రమాదాల కారణంగా ఏర్పడే వైకల్యానికి... యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ తీసుకోవాలి. కవరేజీ రూ.20 లక్షలు అయినా ఉండాలి. 30ప్లస్లోకి చేరితే... ఈ వయసులో వైవాహిక జీవితంలోకి ప్రవేశించడంతోపాటు తల్లిదండ్రులు అవుతుంటారు. కనుక మొత్తం కుటుంబానికి హెల్త్ కవరేజీ అవసరం. అప్పటికే తీసుకున్న ఆరోగ్య బీమా ప్లాన్ను ఫ్యామిలీ ఫ్లోటర్గా మార్చుకోవాలి. ఆ అవకాశం లేకపోతే అదే కంపెనీలో లేదా మరో మంచి కంపెనీలో ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఎంచుకోవాలి. ముఖ్యంగా మెటర్నిటీ కవరేజీ, పుట్టిన బేబీకి కూడా ఆటోమేటిక్ కవరేజీ లభించే ప్లాన్ను ఎంచుకోవాలి. కనీసం రూ.3 నుంచి రూ.5 లక్షలు అయినా బీమా రక్షణ ఉండేలా చూసుకోవాలి. దీనికి అదనంగా రూ.10–20 లక్షల కవరేజీతో టాపప్ ప్లాన్ తీసుకోవాలి. అప్పుడు బేసిక్ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు అయితే టాపప్ ప్లాన్ నుంచి చెల్లింపులు వెళ్లిపోతాయి. అదే విధంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ కవరేజీ తప్పక ఉండాలి. 40–50 మధ్యకు ఉన్నట్టయితే... ఈ వయసులోని వారి పిల్లలు ఎదుగుతుంటారు. దీంతో ఒత్తిళ్లు పెరిగిపోతుండడం సహజం. ఫలితంగా జీవనశైలి వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. అంటే గుండెపోటు, మధుమేహం వాటి రిస్క్ ఉంటుంది. కనుక ఆరోగ్యకరమైన ఆహార, జీవన అలవాట్లు ఉండేలా చూసుకోవాలి. ప్రీమియం భారంగా మారుతున్నా కానీ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ను తప్పకుండా కొనసాగించుకోవాలి. అదనంగా కనీసం రూ.10–20 లక్షల టాపప్ ప్లాన్ ఉండాలి. దీనికి అదనంగా రూ.20–30 లక్షలతో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ను తీసుకోవడం అవసరం. ఈ ప్లాన్ తీసుకున్న వారికి.. గుండెపోటు, క్యాన్సర్, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం తదితర తీవ్ర వ్యాధుల్లో ఏవైనా నిర్ధారణ అయితే వెంటనే పూర్తి కవరేజీని ఏక మొత్తంలో బీమా సంస్థ చెల్లించేస్తుంది. అదే విధంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ కవర్ రూ.25 లక్షలు అవసరం. 50 ప్లస్లోకి వచ్చేస్తే.. 50–60 మధ్యలో ఉన్న వారి పిల్లలు ఉన్నత విద్యకు చేరువ కావడం, ఉద్యోగాల్లోకి చేరిపోవడం చూస్తుంటాం. పిల్లలు 18 ప్లస్లోకి చేరిపోతే వారికంటూ ఇండివిడ్యువల్ ప్లాన్ తీసుకుని, దంపతుల వరకే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కొనసాగించుకోవడం లేదా వారు సైతం ఇండివిడ్యువల్ ప్లాన్కు పోర్టింగ్ పెట్టుకోవడం చేయవచ్చు. ప్రీమియం భారం తగ్గేట్టు ఉంటేనే మారడం సరైనది. లేకపోతే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని అలాగే కొనసాగించుకోవాలి. ఇక ఈ వయసులో బాధ్యతలు తీరిపోతే ప్రమాద వైకల్య బీమా అవసరం అంతగా ఉండనట్టే. కాకపోతే మీకున్న హెల్త్ ప్లాన్ జీవితాంతం రెన్యువల్ చేసుకునే ఆప్షన్తో ఉండేలా జాగ్రత్త పడడం ఎంతో అవసరం. కనీసం రూ.5 లక్షల కవరేజీ, దీనికి అదనంగా రూ.20 లక్షల టాపప్ ప్లాన్ ఉంటే మంచిది. అదే విధంగా రూ.30 లక్షలతో క్రిటికల్ ఇన్నెస్ ప్లాన్ కూడా తీసుకోవాలి. 60 ఏళ్లు దాటితే.. ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు ఇది. వృత్తి, వ్యాపారాల్లోని వారికి మాత్రం ఆర్జనా శక్తి కొనసాగుతుంది. ఈ వయసులో దాదాపు పిల్లలకు సంబంధించిన బాధ్యతలన్నీ పూర్తయి ఉంటాయి. ఈ వయసులో వైద్య ఖర్చులు పెరుగుతుంటాయి. కనుక ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితులకు సన్నద్ధం కావాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ల్యాప్స్ అవకుండా ప్రీమియం ఆటోమేటిగ్గా బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక విడిగా దంపతులు ఇద్దరికీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే బెటర్. ఒకవేళ ప్రీమియం భారంగా అనిపిస్తే తమ పిల్లలు ఉద్యోగం చేస్తుంటే వారి సంస్థల నుంచి లభించే గ్రూపు హెల్త్ కవరేజీలో భాగస్వాములుగా చేరాలి. ఇటువంటి పాలసీల్లో ప్రీమియం తక్కువగా ఉంటుంది. బేసిక్ ప్లాన్కు అదనంగా రూ.15–25 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. అలాగే, రూ.20–30 లక్షలకు క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కూడా ఉండే విధంగా చూసుకోవాలి. ఇవి తెలుసుకోవాలి... కోపే: ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే బిల్లులో పాలసీదారు తను సొంతంగా చెల్లించాల్సిన మొత్తమే కోపే. ఉదాహరణకు రూ.5 లక్షల కవరేజీ పాలసీలో 10 శాతం కోపే షరతు ఉందనుకుంటే.. అప్పుడు ఆస్పత్రి బిల్లులో 10 శాతం పాలసీదారే భరించాల్సి వస్తుంది. మిగిలిన 90 శాతం బీమా సంస్థ చెల్లిస్తుంది. డిడక్టబుల్: ఇది కూడా ఒక విధంగా వైద్య ఖర్చుల్లో పాలసీదారు స్వయంగా భరించాల్సిన అంశమే. ఎప్పుడు ఆస్పత్రిలో చేరినా కానీ అయ్యే బిల్లులో నిర్ణీత మొత్తాన్ని మినహాయించి, ఆ తర్వాత మిగిలిన మేర బీమా సంస్థ చెల్లిస్తుంది. డిడక్టబుల్ అన్నది పాలసీ డాక్యుమెంట్లో పేర్కొనడం జరుగుతుంది. సెటిల్మెంట్ రేషియో: బీమా సంస్థకు వచ్చే క్లెయిమ్లలో (పరిహారం కోసం వచ్చే దరఖాస్తులు) ఎన్నింటికి చెల్లింపులు చేసింది, ఎన్నింటిని తిరస్కరించిందన్న వివరాలను ఇది తెలియజేస్తుంది. ఎక్స్క్లూజన్: బీమా పాలసీలో వేటికి కవరేజీ మినహాయించేది ఈ క్లాజులో వివరంగా ఉంటుంది. హెల్త్ పాలసీల్లో కొన్నింటికి మినహాయింపులు ఉంటాయి. ఫ్రీ లుక్ పీరియడ్: పాలసీ జారీ చేసిన తర్వాత సాధారణంగా 15 రోజుల కాలాన్ని ఫ్రీ లుక్ పీరియడ్గా పరిగణిస్తుంటారు. ఈ కాలంలో పాలసీ వద్దనుకుంటే అదే విషయాన్ని బీమా సంస్థకు తెలియజేస్తే ఎటువంటి చార్జీలు, పెనాల్టీలు లేకుండా ప్రీమియం వెనక్కి వచ్చేస్తుంది. -
భర్తకు బీమా చేసి హత్య చేసిన భార్య
కాజీపేట అర్బన్: మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నాడు.. కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విసిగి వేసారిన భార్య అతడిని హత్య చేయాలని నిర్ణయించింది. అయితే.. కుటుంబ పెద్దను హత్య చేస్తే తర్వాత తమ పరిస్థితి ఏమిటని ఆలోచించిన ఆమె.. రూ.20 లక్షలకు బీమా చేయించి మరీ ఘాతుకానికి పాల్పడింది. ఈ హత్యకు భర్త సోదరి, బావ సహకారం కూడా తీసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో జరిగిన ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం హన్మకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి ఈ కేసు వివరాలన మీడియాకు వెల్లడించారు. పర్వతగిరి మండలం హత్యా తండాకు చెందిన బాదావత్ వీరన్న భార్య యాకమ్మతో కలసి పున్నేలు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దోబీగా పనిచేసేవాడు. లాక్డౌన్తో పాఠశాలను మూసివేయగా ఖాళీ మద్యం సీసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. (ఫోన్ స్విచ్చాఫ్ చేసిన ఎస్సై ) మద్యానికి బానిసైన వీరన్న భార్యను వేధించడం.. కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. భార్య పలుమార్లు హెచ్చరించినా మార్పు రాలేదు. దీంతో యాకమ్మ భర్తను హత్య చేయాలని నిర్ణయించింది. ఇందుకు చెన్నారావుపేటలో నివాసం ఉండే వీరన్న సోదరి భూక్యా బుజ్జి, బావ భూక్యా బిచ్చాల సహకారం కోరింది. వారు అంగీకరించడంతో అందరూ కలసి హత్యకు పథక రచన చేశారు. తొలుత గ్రామంలోని గ్రామీణ బ్యాంకులో రూ.20 లక్షలకు వీరన్న పేరిట బీమా చేయించారు. తర్వాత ఈనెల 19వ తేదీన నెక్కొండ ప్రాంతంలో సైకిల్పై ఖాళీ మద్యం సీసాలను విక్రయించేందుకు వీరన్న వెళ్లగా.. ఆ సమాచారాన్ని భూక్యా బిచ్చాకు అందజేసింది. నెక్కొండలో సాయంత్రం వీరన్నను కలసిన బిచ్చా.. తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని హత్యాతండాకు బయలుదేరాడు. మార్గమధ్యలో మద్యం తాగి తమ వ్యవసాయ భూమి వద్దకు రాత్రి 11.45 గంటలకు తీసుకెళ్లగా.. అప్పటికే భార్య యాకమ్మ, సోదరి బుజ్జి ఉన్నారు. అందరూ కలసి వీరన్నకు తాడుతో ఉరి వేసి హత్య చేశారు. బతికి ఉన్నాడన్న అనుమానంతో ముఖంపై బండరాయితో కొట్టి పక్కనే ఉన్న కెనాల్లో పడేశారు. అనంతరం బిచ్చా, బుజ్జి తమ స్వగ్రామానికి వెళ్లిపోగా.. యాకమ్మ తన భర్తను ఎవరో హత్య చేశారని నటించడం మొదలు పెట్టింది. దీంతో పర్వతగిరి ఇన్స్పెక్టర్ పి.కిషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల ఆధారంగా.. అయితే, సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా అనుమానం రావడంతో పోలీసులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. ఈ హత్య తామే చేశామని వారు అంగీకరించారు. దీంతో నిందితులు యాకమ్మ, బిచ్చా, బుజ్జిలను అరెస్టు చేశారు. కాగా, ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన మామూనూర్ ఏసీపీ శ్యాంసుందర్, పర్వతగిరి ఇన్స్పెక్టర్ పి.కిషన్, ఎస్సైలు ప్రశాంత బాబు, నర్సింగరావు, సురేష్తో పాటు, కానిస్టేబుళ్లను సీపీ రవీందర్ అభినందించారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్కు సైబర్ బీమా!
కరోనా వైరస్ పరిశ్రమల రూపురేఖలను మార్చేసింది. వైరస్ విస్తరించకుండా చూసే లక్ష్యంతో సేవల రంగ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే పని) విధానాన్ని ఆచరణలో పెట్టాయి. ఐటీ, మీడియా తదితర చాలా రంగాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. వైరస్ ఇప్పట్లో కనుమరుగు కాకపోవచ్చని, వ్యాక్సిన్ వచ్చే వరకు సామాజిక దూరం పాటించక తప్పదంటున్నారు నిపుణులు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం భవిష్యత్తులోనూ కొనసాగొచ్చని భావిస్తున్నారు. ఈ విధానంలో ఉద్యోగులు తమ వ్యక్తిగత కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ సాయంతో ఇంటర్నెట్ ద్వారా కార్యాలయ సర్వర్లతో అనుసంధానమై పనిచేయాల్సి ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్ దాడుల రిస్క్ ఎక్కువగా పొంచి ఉంటుంది. ఏ కొంచెం అవకాశం ఇచ్చినా సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లు, సర్వర్లలోకి చొచ్చుకుపోయి నష్టానికి కారణం కావచ్చు. కరోనా వైరస్ పేరుతో నిత్యం 2,600 సంస్థలపై సైబర్ దాడులు జరుగుతున్నాయని ఇటీవలే చెక్ పాయింట్ సర్వే వెల్లడించింది. కనుక ఇటువంటి ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విలువైన డేటాతోపాటు, బ్యాంకు ఖాతాల్లోని డబ్బును జాగ్రత్తగా కాపాడుకునే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు సైబర్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఒక చక్కని పరిష్కారం. సైబర్ దాడి జరిగితే ఎదురయ్యే నష్టాన్ని సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ భరిస్తుంది. కనుక ఆన్లైన్ వేదికగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారు, తమ కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో కీలక సమాచారాన్ని ఉంచుకునే వారు తప్పకుండా ఈ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. కవరేజీ వీటికి... దాదాపు అన్ని ప్రముఖ బీమా సంస్థలు.. బజాజ్ అలియాంజ్ జనరల్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్ బీమా సంస్థలు ఈ తరహా సైబర్ కవరేజీలను అందిస్తున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారు ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు. హెచ్డీఎఫ్సీ ఎర్గో అయితే ఫ్యామిలీ ఫ్లోటర్ సైబర్ పాలసీని అందిస్తోంది. ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్ను కూడా ఆఫర్ చేస్తోంది. ప్రతీ ఏటా దీన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. బీమా సంస్థలను బట్టి కవరేజీ ఫీచర్లలో స్వల్ప మార్పులు ఉండొచ్చు. ప్రధానంగా గుర్తింపు చోరీ, అనధికారిక ఆన్లైన్ లావాదేవీలు (మీ ప్రమేయం లేకుండా వేరే వారు చేసేవి) ఈ–ఎక్ట్సార్షన్ (డబ్బు కోసం డిమాండ్ చేస్తూ దాడి చేయం), సైబర్ బుల్లీయింగ్ (బెదిరింపులు), మాల్వేర్ దాడులు (సాఫ్ట్వేర్ సాయంతో కంప్యూటర్లను అధీనంలోకి తీసుకోవడం), కీలకమైన సమాచార వివరాలను (పాస్వర్డ్, యూజర్ నేమ్ వంటివి) చోరీ చేసే ఫిషింగ్ దాడులు, ఈమెయిల్ స్పూఫింగ్ (తప్పుదోవ పట్టించే, మోసపూరిత మెయిల్స్) తదితర దాడుల నుంచి సైబర్ పాలసీల్లో రక్షణ ఉంటుంది. వీటి వల్ల జరిగిన నష్టానికి పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. పరిహారం అన్నది గరిష్టంగా మీరు తీసుకునే సమ్ ఇన్సూర్డ్ వరకేనని గమనించాలి. సైబర్ దాడుల కారణంగా ఎదురయ్యే న్యాయపరమైన చర్యల ఖర్చును కూడా బీమా సంస్థ నుంచి పొందే అవకాశం ఉంటుంది. హెచ్డీఎఫ్సీ ఎర్గో, బజాజ్ అలియాంజ్ సంస్థలు ఈ కవరేజీలు అన్నింటినీ ఆఫర్ చేస్తున్నాయి. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అదనంగా సోషల్ మీడియా కవర్ను కూడా అందిస్తోంది. దీని కింద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రొఫైల్పై దాడుల వల్ల గుర్తింపు వివరాల నష్టం జరిగితే పరిహారం తీసుకోవచ్చు. ఈ దాడుల వల్ల వేతన నష్టం జరిగితే హెచ్డీఎఫ్సీ ఎర్గో పరిహారం (గరిష్టంగా ఏడు రోజులకు మించకుండా) ఇస్తోంది. మొబిక్విక్ ప్లాట్ఫామ్పై లభించే ఐసీఐసీఐ లాంబార్డ్ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే అనధికారిక లావాదేవీల వల్ల కలిగే ఆర్థిక నష్టం, వేతన నష్టాలకు పరిహారం అందిస్తోంది. క్లెయిమ్ విధానం.. సైబర్ దాడి ఏదైనా కానీయండి.. ఏడు రోజుల్లోపు బీమా సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మెయిల్ లేదా ఫోన్ లేదా ఏజెంట్ల ద్వారా సమాచారాన్ని అందించొచ్చు. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేస్తూ, ఆధారంగా అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించాలి. ఇవి అందిన రోజు నుంచి 30 రోజుల్లోగా బీమా సంస్థ క్లెయిమ్ను పరిష్కరిస్తుంది. క్లెయిమ్ ఫామ్, ఎఫ్ఐఆర్ కాపీ, సైబర్ దాడి జరిగినట్టు ఆధారాలు, లీగర్ నోటీసులు ఏవైనా అందుకుంటే ఆయా కాపీలను కూడా బీమా సంస్థకు అందించాల్సి ఉంటుంది. గమనించాల్సినవి.. సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్నో పరిమితులు, మినహాయింపులతో ఉంటాయి. ముఖ్యంగా పాలసీదారుడు ఒక ఏడాదిలో ఒకటే క్లెయిమ్ చేయగలరు. ఒకటికి మించి దాడులు ఏకకాలంలో జరిగితే ఇందులో ఎక్కువ నష్టం జరిగిన దాడికి సంబంధించి హెచ్డీఎఫ్సీ ఎర్గో పరిహారం చెల్లిస్తుంది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఆఫర్ చేస్తున్న సైబర్సేఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో పరిహారానికి సంబంధించి ఉప పరిమితులు ఉన్నాయి. అంటే ప్రతీ కవరేజీకి విడిగా గరిష్ట పరిహారాన్ని కంపెనీ పరిమితం చేసింది. ఉదాహరణకు ఫిషింగ్, ఐటీ చోరీలో పరిహారం అన్నది బీమా మొత్తం (సమ్ ఇన్సూర్డ్)లో 25 శాతానికే పరిమితం అవుతుంది. ఉదాహరణకు రూ.1 లక్షకు పాలసీ తీసుకున్నట్టయితే ఫిషింగ్ ఘటనలో లభించే గరిష్ట పరిహారం రూ.25 వేలుగానే ఉంటుంది. అదే విధంగా ఈమెయిల్ స్పూఫింగ్లో గరిష్ట బీమా 15 శాతానికే పరిమితం అవుతుంది. మిగిలిన అన్ని దాడుల్లోనూ పరిహారం బీమా కవరేజీలో 10 శాతంగానే ఉంటుందని గమనించాలి. అదే విధంగా హెచ్డీఎఫ్సీ ఎర్గో ఈ సెక్యూర్ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలో సైబర్ బుల్లీయింగ్, ఈ ఎక్ట్సార్షన్, ఈ రిప్యుటేషన్ (పేరు ప్రతిష్ట) నష్టానికి క్లెయిమ్ చేసుకోవాలంటే 45 రోజులు వేచి ఉండే నిబంధన అమల్లో ఉంది. అంటే పాలసీ తీసుకున్న 45 రోజుల తర్వాతే వీటి విషయంలో క్లెయిమ్ హక్కు లభిస్తుంది. అలాగే, ఈ రిప్యుటేషన్ నష్టం, గుర్తింపు వివ రాల చోరీ, ఈమెయిల్ స్పూఫింగ్ ఘటనల్లో లభించే పరిహారం గరిష్టంగా బీమా కవరేజీలో 25 శాతంగానే ఉంటుంది. ఫిషింగ్లో ఇది 15 శాతంగాను, సైకలాజికల్ కౌన్సిలింగ్, ఈ ఎక్ట్సార్షన్, సైబర్ బుల్లీయింగ్, మాల్వేర్ దాడుల్లో గరిష్ట పరిహారం 10%. అదే విధంగా క్లెయిమ్ మొత్తం రూ.50,000 మించి ఉంటే కనీసం రూ. 3,500ను తగ్గించి ఇస్తుంది. ఐసీఐసీఐ లాం బార్డ్ సైబర్ పాలసీలో 10% లోపే ఆప్షన్ ఉంది. అంటే పాలసీదారు క్లెయిమ్ మొత్తంలో తన వంతుగా 10 శాతాన్ని భరించాల్సి ఉంటుంది. -
హర్యానా వాసి ఇన్సూరెన్స్ ఫ్రాడ్..
సాక్షి, సిటీబ్యూరో: ఇన్సూరెన్స్ పాలసీల్లో బోనస్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలు అందించి సహకరిస్తున్న హర్యానా వాసిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఖాతాల్లో డిపాజిట్ అయిన డబ్బు డ్రా చేసి నేరగాళ్లకు అందించినందుకు గాను ఇతను 20 శాతం కమీషన్ తీసుకుంటున్నట్లు సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సోమవారం పేర్కొన్నారు. న్యూ ఢిల్లీకి చెందిన వినీత్ సింగ్ ప్రస్తుతం ఫరీదాబాద్లో ఉంటున్నాడు. వృత్తిరీత్యా జోయాటో డెలివరీ బాయ్గా పని చేసే అతను 2018లో ఢిల్లీలో నమోదైన ఓ దాడి కేసులో అరెస్టయ్యాడు. అప్పట్లో తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడికి అక్కడే ఓ నేరగాడితో పరిచయమైంది. సైబర్ నేరాలకు పాల్పడే వారికి అవసరమైన బ్యాంకు ఖాతాలు సమకూర్చడం అతడి పని. ఆన్లైన్ ద్వారా ఎర వేసి మోసాలు చేసే సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి డబ్బు డిపాజిట్ చేయించుకోవడానికి తమ పేరుతో ఉన్న ఖాతాలు వాడరు. అలా చేస్తే పోలీసులకు చిక్కుతామనే ఉద్దేశంతో మధ్యవర్తుల ద్వారా కొందరు మనీమ్యూల్స్ను ఏర్పాటు చేసుకుంటారు. వీరి ఖాతాలు వినియోగిస్తూ వీరికి కమీషన్లు ఇస్తూ ఉంటారు. అలాంటి మనీమ్యూల్స్లో వినీత్ ఒకడిగా మారి కర్ణాటక బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ల్లో ఖాతాలు తెరిచి వాటి వివరాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించాడు. ఇన్సూరెన్స్ పేరుతో టోకరా నగరానికి చెందిన ఓ యువతికి మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అధికారిగా ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. బీమా ప్రీమియం రూ.59,511 ప్రతి ఏటా జనవరిలో తన యాక్సిస్ బ్యాంకు ఖాతా ద్వారా ఈమె చెల్లిస్తుండేది. అయితే ప్రైవేట్ బ్యాంక్ ద్వారా కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంక్ ద్వారా చెల్లిస్తే 10 శాతం డిస్కౌంట్ వస్తుందని, రూ.53,332 చెల్లిస్తే చాలంటూ చెప్పాడు. ఈ విషయం ఆమె నమ్మడంతో కర్ణాటక బ్యాంక్లో వినీత్ తెరిచిన ఖాతా నంబర్ ఇచ్చి అందులో డిపాజిట్ చేయమన్నాడు. ఆమె అలాగే చేయడంతో ఆ మొత్తం డ్రా చేసిన వినీత్ సైబర్ నేరగాడికి అప్పగించి కమీషన్ తీసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గత నెల 24న కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ వెంకటరామిరెడ్డి నిందితుడిని హర్యానాలో అరెస్టు చేశారు. పీటీ వారెంట్పై నగరానికి తీసుకువచ్చి రిమాండ్కు తరలించారు. -
ఇలా చనిపోతే బీమా హుళక్కే!
బీమా పాలసీ ఉన్న వారు మరణానికి గురైతే బీమా కంపెనీలు పరిహారం చెల్లించడం అన్నది సహజమే. బీమా పాలసీ తీసుకునేదే అందుకు కదా..! అయితే, ఏ కారణంతో మరణించినా జీవిత బీమా పరిహారం వస్తుందని నిశ్చింతగా ఉంటే కుదరదు. ఇక్కడ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కొన్ని రకాల మరణాలకు జీవిత బీమా పాలసీల్లో కవరేజీ ఉండదన్న విషయం ముమ్మాటికీ నిజం. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కలిగిన వారు లేదా తీసుకోవాలనుకునే వారు ఏ మరణాలకు పరిహారం ఉండదన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవడం అవసరం. ఆ వివరాలే ఇవి... హత్యకు గురైతే.. ఉదాహరణకు.. పాలసీదారుడు హత్య కారణంగా చనిపోయినట్టు ధ్రువీకరణ అయితే, అదే సమయంలో నామినీయే హత్యలో పాల్గొన్నట్టు విచారణలు స్పష్టం చేస్తుంటే బీమా కంపెనీలు పరిహారం చెల్లించవు. నామినీపై హత్యాభియోగాలు తొలగిస్తే లేదా నిర్దోషి అయితేనే పరిహారం చెల్లింపులు జరుగుతాయి. కేసు నామినీకి అనుకూలంగా వచ్చేంత వరకు బీమా సంస్థ పరిహార చెల్లింపులను నిరవధికంగా నిలిపివేస్తుంది’’ అని ఇండియన్ మనీ డాట్ కామ్ సీఈవో సీఎస్ సుధీర్ తెలిపారు. అలాగే, పాలసీదారులు నేరపూరిత చర్యల్లో పాల్గొని చనిపోయిన సందర్భాల్లోనూ బీమా కంపెనీలు పరిహార చెల్లింపును తిరస్కరిస్తాయి. ‘‘నేర కార్యకలాపాల్లో పాలసీదారుడు పాల్గొన్నట్టు నిరూపితం అయితే నామినీలకు పరిహార చెల్లింపు జరగదు. ఎటువంటి నేర కార్యక్రమంలో పాల్గొని చనిపోయినా కానీ, చట్ట ప్రకారం అది కవరేజీ పరిధిలోకి రాదు. ఒకవేళ పాలసీదారుకు నేరపూరిత చరిత్ర ఉండుండి, సహజ కారణాల వల్ల.. ఉదాహరణకు స్వైన్ ఫ్లూ లేదా డెంగీ లేదా పిడుగుపాటు కారణంగా చనిపోతే పరిహారాన్ని నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు’’ అని పాలసీబజార్కు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సంతోష్ అగర్వాల్ తెలిపారు. ముందస్తు వ్యాధుల వల్ల.. టర్మ్ పాలసీ తీసుకునే నాటికి ఉన్న అనారోగ్య సమస్యలను దరఖాస్తు పత్రంలో తప్పకుండా వెల్లడించాలి. లేదంటే ఆ సమస్యల కారణంగా ఆ తర్వాత కాలంలో పాలసీదారుడు మరణించినట్టయితే.. బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో కవరేజీ కాని మరణ కేసులు ఎన్నో ఉన్నాయని సుధీర్ వెల్లడించారు. ‘‘స్వయంగా చేసుకున్న గాయాల కారణంగా, లేదా ప్రమాదకర విన్యాసాల కారణంగా, లైంగింకంగా సంక్రమించే హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ వంటి వ్యాధుల కారణంగా లేదా మందుల అధిక మోతాదు కారణంగా చనిపోతే.. వారికి ప్రత్యేక రైడర్లు ఉంటే తప్ప బీమా సంస్థలు పరిహారాన్ని నిరాకరిస్తాయి’’ అని సుధీర్ వివరించారు. ఆత్మహత్య చేసుకున్నా.. బీమా పాలసీ తీసుకున్న వారు, మొదటి ఏడాది కాలంలో ఆత్మహత్య చేసుకున్నట్టయితే బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. అయితే, చాలా కంపెనీలు పాలసీదారులకు రెండో ఏడాది నుంచి ఆత్మహత్యకు కూడా పరిహారాన్ని ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలోనూ నియమ, నిబంధనలు అమలు చేస్తున్నాయి. ప్రకృతి విపత్తుల వల్ల.. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న వ్యక్తి భూకంపం, తీవ్ర తుపాను వంటి ప్రమాదాల్లో మరణించినట్టయితే నామినీలకు పరిహారం రాదు. ‘‘సునామీ, భూకంపం వంటి ప్రకృతి ఉత్పాతాల వల్ల తలెత్తే మరణాలు టర్మ్ పాలసీల్లో కవర్ అవ్వవు’’ అని సుధీర్ తెలిపారు. ప్రసవం కారణంగా.. పాలసీ కలిగిన వారు గర్భధారణ కారణంగా లేదా ప్రసవం సమయంలో చనిపోయినట్టయితే బీమా సంస్థ నామినీకి పరిహారం చెల్లించదు. ఇటువంటి మరణాలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కవర్ కావని అగర్వాల్ వెల్లడించారు. ప్రమాదకరమైన కార్యకలాపాలు.. సాహసోపేత లేదా ప్రమాదకరమైన కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మరణానికి గురైతే అటువంటి సందర్భాలకు బీమా సంస్థలు పరిహారం చెల్లించవు. ఎందుకంటే ఈ తరహా కార్యకలాపాల్లో ప్రాణ ప్రమాదం అధికంగా ఉంటుంది. ‘‘ప్రమాదకరమైన క్రీడలు.. కార్, బైక్ రేసింగ్, స్కైడైవింగ్, పారాగ్లైడింగ్, పారాచ్యూట్ తదితర వాటిల్లో పాల్గొనే వారు పాలసీ తీసుకునే సమయంలోనే వాటి గురించి వెల్లడించాలి. లేకపోతే ఈ వివరాలను వెల్లడించని కారణంగా బీమా కంపెనీలు భవిష్యత్తులో వచ్చే క్లెయిమ్లను అంగీకరించవు’’ అని అగర్వాల్ సూచించారు. మద్యం ప్రభావం కారణంగా.. ఆల్కహాల్ లేదా మాదకద్రవ్యాలు తీసుకుని వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై చనిపోయిన సందర్భాల్లోనూ బీమా కంపెనీ పరిహారం చెల్లించేందుకు నిరాకరిస్తుంది. ‘‘మద్యం తరచుగా తీసుకునే వారికి, మాదకద్రవ్యాల అలవాటు ఉన్న వారికి బీమా కంపెనీలు అరుదుగానే పాలసీలను ఇస్తుంటాయి. టర్మ్ బీమా తీసుకునే సమయంలో ఈ అలవాట్ల గురించి వెల్లడించకపోతే, ఆ తర్వాత ఈ అలవాట్ల కారణంగా పాలసీదారులు మరణానికి గురైతే.. పరిహారాన్ని కంపెనీలు నిలిపివేస్తాయి. అధికంగా మద్యం సేవించే వారికి టర్మ్ ఇన్సూరెన్స్ లభించడం కష్టమే’’ అని సుధీర్ వివరించారు. ‘‘ఒకవేళ మీరు ఆల్కహాల్ తీసుకునే వారు అయితే, భవిష్యత్తులో మరణ పరిహార క్లెయిమ్ తిరస్కరణకు గురికాకూడదని భావిస్తే.. ఆల్కహాల్ను ఏ మోతాదులో తీసుకుంటారనే వివరాలను ప్రపోజల్ పత్రంలో వెల్లడించడం తప్పనిసరి’’ అని కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ అక్చుయరీ సునీల్శర్మ సూచించారు. పొగతాగే అలవాటు దాచిపెడితే.. సాధారణంగా పొగతాగే అలవాటును చాలా మంది బీమా పాలసీ దరఖాస్తు పత్రాల్లో వెల్లడించరు. వెల్లడిస్తే ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుందని అలా చేస్తుంటారు. కానీ, పొగతాగే అలవాటు ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఈ అనారోగ్య అలవాటు కారణంగా వారికి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలవాటు తీవ్రతను బట్టి కేన్సర్ వంటివి సోకి మరణించే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఈ విధమైన రిస్క్ ఉంటుంది కనుకనే బీమా కంపెనీలు పొగతాగే అలవాటు ఉన్న వారికి బీమా ప్రీమియంను అధికంగా నిర్ణయిస్తుంటాయి. పొగతాగే అలవాటును బీమా పాలసీల్లో వెల్లడించని వారు, ఆ తర్వాత అదే అలవాటు కారణంగా అనారోగ్యంతో మరణిస్తే పరిహారాన్ని తిరస్కరించేందుకు దారితీస్తుందని సుధీర్ తెలిపారు. పాలసీ దరఖాస్తును పూర్తిగా చదివిన తర్వాతే టర్మ్ పాలసీని తీసుకోవాలని.. మినహాయింపుల గురించి ముందుగానే తెలుసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చని సూచించారు. -
సైబర్ పాలసీలకు పెరుగుతున్న ఆదరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైబర్ దాడుల ముప్పు తీవ్రమవుతున్న నేపథ్యంలో సైబర్ లయబిలిటీ బీమా పాలసీలకు క్రమంగా ఆదరణ పెరుగుతోందని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలోక్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఈ మార్కెట్ సుమారు రూ. 30 కోట్లుగా ఉందని.. వచ్చే ఏడాది వ్యవధిలో రూ. 75 కోట్లకు చేరవచ్చన్న అంచనాలు ఉన్నాయని ఆయన వివరించారు. తాము త్వరలోనే వ్యక్తిగత సైబర్ పాలసీని కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు అగర్వాల్ శుక్రవారమిక్కడ విలేకరులకు చెప్పారు. దీనికి ఇటీవలే బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ అనుమతులు లభించాయన్నారు. మరోవైపు, వాహన విక్రయాలు మందగించడం .. మోటార్ పాలసీల విభాగంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అగర్వాల్ తెలిపారు. అయితే, బీమా పాలసీ నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు విధించేలా మోటార్ వాహనాల చట్టంలో తెచ్చిన సవరణలు కాస్త ఊతమిచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి టెక్నాలజీలను ఉపయోగించి, ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని అగర్వాల్ వివరించారు. -
ఇక పోస్ట్‘పాలసీ’ మ్యాన్లు!
న్యూఢిల్లీ: తపాలా శాఖకు చెందిన పోస్ట్మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవక్లు త్వరలో బీమా పాలసీ విక్రయదారుల అవతారం ఎత్తనున్నారు. వీరిని పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్గా (విక్రయదారులు) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) ప్రతిపాదించవచ్చని ఐఆర్డీఏఐ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. వీటి ప్రకారం.. తపాలా శాఖ పోస్ట్మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవక్ల జాబితాను ఐఆర్డీఏఐకు పంపి అనుమతి కోరాల్సి ఉంటుంది. ప్రధానంగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని, పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు విస్తరించని ప్రాంతాల్లో (మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు) వీరు బీమా విస్తరణకు తోడ్పడతారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఒకటికి మించిన బీమా కంపెనీలతో వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుని, పోస్ట్మ్యాన్లు, డాక్ సేవక్ల ద్వారా పాలసీల విక్రయాలను చేపట్టవచ్చు. -
హోంగార్డుల సంక్షేమంలో మనమే బెస్ట్
సాక్షి, అమరావతి: హోంగార్డ్ల సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 6న నిర్వహించే హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా హోంగార్డులకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో హోంగార్డులు పోలీసులతో సమానంగా కష్టపడుతున్నారని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ప్రభుత్వం హోంగార్డులకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని గుర్తు చేశారు. దీంతోపాటు పోలీసులతో సమానంగా యాక్సిస్ బ్యాంకు ద్వారా రూ.30 లక్షలకు ఇన్సురెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించినట్టు వివరించారు. హోంగార్డుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. -
బీమా పాలసీ క్లెయిమ్ కాలేదా? ఈ స్టోరీ చదవండి
సాక్షి, ముంబై: ఆపద సమయంలో ఆదుకుంటుందన్న భరోసాతో బీమా (ప్రభుత్వ, లేదా ప్రైవేటు) పాలసీ తీసుకునే వినియోగదారులకు భారీ నిరాశ ఎదురయ్యే ఉదంతాలు చాలా చూశాం. ఇలాంటి ఘటనలో న్యాయ పోరాటం చేయడం కూడా చాలా అరుదు. కానీ ఒక పాలసీదారుని భార్య మాత్రం ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)పై పోరుకు దిగారు. చట్టపరంగా తనకు దక్కాల్సిన పాలసీ సొమ్ముపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ను ఆశ్రయించి విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే..ముంబైకి చెందిన దిగంబరరావు ఠాక్రే 2000 సంవత్సరంలో ఎల్ఐసీ నుంచి మూడు బీమా పాలసీలను తీసుకున్నారు. అనారోగ్యంతో మార్చి13, 2003న ఆయన కన్నుమూశారు. దీంతో ఆయన భార్య రత్న తనకు రావాల్సిన బీమా సొమ్మును చెల్లించాల్సిందిగా ఎల్ఐసీని కోరగా అందుకు ఆ సంస్థ తిరస్కరించింది. పాలసీ తీసుకునేముందు పాలసీదారుడు ఠాక్రే ఆస్తమాతో ఆసుపత్రిలో చేరడం తదితర విషయాలను దాచి పెట్టారని వాదించింది. దీంతో 2005లో ఆమె వార్ధాలోని జిల్లా వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించారు. దీన్ని విచారించిన ఫోరమ్ ఆమె క్లెయిమ్ను చెల్లించాలని ఎల్ఐసీని ఆదేశించింది. ఇందుకు నిరకారించిన ఎల్ఐసీ ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఎన్సీడీఆర్సీలో రివ్యూ పిటిషన్ వేసింది. అయితే ఎల్ఐసీ వాదనను తిరస్కరించిన ఎన్సీడీఆర్సీ ఆమెకు రావాల్సిన రూ. 9.3 లక్షలు చెల్లించాలని తాజాగా ఆదేశించింది. ఎల్ఐసీ వాదనకు ఎలాంటి ఆధారాలు లేవనీ, పైగా ఠాక్రేకు ఇంతకుముందు అలాంటి అనారోగ్యం ఉన్నప్పటికీ, ఎల్ఐసీ పాలసీ జారీ చేసే సమయానికి ఆరోగ్యంగా ఉన్నందున, ఆ కాంట్రాక్టును తొలగించలేమని ఎన్సీడీఆర్సీ ప్రిసైడింగ్ సభ్యుడు దీపా శర్మ వ్యాఖ్యానించారు. వినియోగదారుని అభ్యర్థనను బీమా సంస్థ తిరస్కరించడం సేవలో లోపంగానే పరిగణించాలని పేర్కొన్నారు. -
బీమా పాలసీ కొనసాగించలేకపోతున్నారా?
కారణాలేవైనా కానీ మీరు తీసుకున్న బీమా పాలసీని కొనసాగించలేకపోతున్నారా..? ప్రీమియం చెల్లింపును భారంగా భావిస్తున్నారా..? దీంతో పాలసీని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీ ముందు ఓ చక్కని మార్గం ఉంది. పాలసీ ప్రీమియం చెల్లించకపోతే అది ల్యాప్స్ అయిపోతుంది. దీనికంటే పెయిడప్ పాలసీగా మార్చుకుంటే సరి. ఈ అవకాశం ఎండోమెంట్ పాలసీల్లో ఉంటుంది. ఎండోమెంట్ పాలసీలు బీమా రక్షణతోపాటు, పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ లభిస్తుంది. ఈ ఎండో మెంట్ పాలసీ కాల వ్యవధి ముగియక ముందే దాన్ని నిలిపివేయాలని భావిస్తే రెండు మార్గాలు ఉన్నాయి. దాన్ని పెయిడప్ పాలసీగా మార్చుకోవడం ఒకటి. ఇలా చేస్తే బీమా కవరేజీ కొనసాగుతుంది. లేదా పాలసీని బీమా సంస్థకు స్వాధీనం చేసి సరెండర్ వ్యాల్యూని పొందడం. ఈ రెండు మార్గాల్లో ఉన్న మంచి చెడులను తెలియజేసే కథనమే ఇది. పెయిడప్ పాలసీ పెయిడప్ పాలసీ ఆప్షన్లో జీవిత బీమా నిర్ణీత కాలం వరకు కొనసాగడం అనుకూలతగా చెప్పుకోవాలి. అంటే ప్రీమియం చెల్లించకపోయినా కానీ, ఈ కవరేజీ కొనసాగుతుంది. అలాగే, పాలసీ కాల వ్యవధి సమయంలో పాలసీదారు మరణిస్తే సమ్ అష్యూరెన్స్ (బీమా మొత్తం)ను నామినీకి చెల్లించడం జరుగుతుంది. పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ లభిస్తుంది. కాకపోతే పాలసీని పెయిడప్గా మార్చుకుంటే చివర్లో వచ్చే ప్రయోజనాలు కొంత తగ్గిపోతాయి. ఎందుకంటే అప్పటి నుంచి ప్రీమియం చెల్లించరు కనుక. దాంతో కాల వ్యవధి తీరిన తర్వాత పాలసీదారుకు లభించే మొత్తం తగ్గుతుంది. పెయిడప్గా మార్చిన నాటి నుంచి ప్రీమియం చెల్లించరు కనుక వార్షికంగా తాజా బోనస్లు కూడా నిలిచిపోతాయి. అప్పటి వరకు సమకూరిన బోనస్లను కాల వ్యవధి తీరిన తర్వాత చెల్లిస్తారు. ‘‘ఇటీవలి ఐఆర్డీఏఐ నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ నిబంధనలు 2019 ప్రకారం పెయిడప్కు అర్హమైన పాలసీల్లో చెల్లించాల్సిన కనీస ప్రీమియం రెండు సంవత్సరాలుగా నిర్దేశించడం జరిగింది. అంటే ఇంకా మిగిలి ఉన్న కాలంతో సంబంధం లేకుండా అన్ని పాలసీలకు పెయిడప్ విషయంలో రెండేళ్ల ప్రీమియం చెల్లిస్తే చాలు’’ అని హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీ తెలిపింది. యూనిట్ లింక్డ్ ప్లాన్ (యులిప్)లను కూడా పెయిడప్ పాలసీలుగా మార్చుకోవచ్చు. అయితే, లాకిన్ పీరియడ్ వరకు (ఐదేళ్ల పాటు) అందులో కొనసాగాల్సి ఉంటుంది. పాలసీదారుపై చార్జీల భారం మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే యులిప్లలో జీవిత బీమా కవరేజీ రిస్క్ చార్జీలు పోను మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ, డెట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కనుక ఫండ్ నిర్వహణ చార్జీలు కొనసాగుతాయి. నాన్ లింక్డ్ ఎండోమెంట్ పాలసీల్లో పెయిడప్గా మారిన తర్వాత ఎటువంటి చార్జీలను విధించడం జరగదు. స్వాధీనం చేస్తే..? ఒకవేళ పాలసీలో కొనసాగకూడదని భావిస్తే దాన్ని స్వాధీనం చేసి స్వాధీన విలువను (సరెండర్ వ్యాల్యూ) పొందొచ్చు. సరెండర్ చేసినట్టయితే ఆ తర్వాత బీమా కవరేజీ కూడా ముగిసినట్టే. ఈ ఆప్షన్లోనూ కనీసం కొంత కాలం పాటు ప్రీమియం చెల్లింపు తర్వాతే సరెండర్ చేయడానికి వీలుంటుందని పాలసీబజార్ టర్మ్ ఇన్సూరెన్స్ హెడ్ అక్షయ వైద్య తెలిపారు. యులిప్లలో కనీసం ఐదేళ్లు కొనసాగిన తర్వాతే సరెండర్కు వీలుంటుంది. యులిప్లలో ఐదేళ్లు ప్రీమియం చెల్లింపు తర్వాత ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనం చేసే నాటికి ఉన్న ఫండ్ విలువ ను చెల్లించడం జరుగుతుంది. ముందుగా వైదొలిగినందుకు ఎటువంటి చార్జీల విధింపు ఉండదు. అదే నాన్ లింక్డ్ ప్లాన్లలో అయితే రెండేళ్ల తర్వాత స్వాధీనం చేయవచ్చు. సరెండర్ చార్జీలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. పాలసీ స్వాధీనం విషయంలో చెల్లించాల్సిన కనీస మొత్తాలను ఐఆర్డీఏఐ నిర్దేశించింది. అయితే, పాలసీ తొలి నాళ్లలో స్వాధీనం చేసినట్టయితే, చెల్లించిన ప్రీమియంలో 50%వరకు నష్టపోవాల్సి రావచ్చు. నాన్లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్ను రెండో ఏడాది స్వాధీనం చేస్తే చెల్లించిన మొత్తం ప్రీమియంలో 30 శాతమే వెనక్కి వస్తుంది. మూడో ఏడాది స్వాధీనం చేస్తే 35% లభిస్తుంది. పాలసీ తొలినాళ్లలో స్వాధీనం చేయడం ద్వారా ఎక్కువ మొత్తాన్ని నష్టపోవాల్సి ఉంటుంది. పాలసీ తొలి ఏడేళ్ల కాలంలో స్వాధీనం చేస్తే ఎంత చెల్లించాలన్న దానిని ఐఆర్డీఏఐ పేర్కొంది. పెయిడప్, సరెండర్... ఏది నయం? ఒక్కసారి ఎండోమెంట్ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత కనీసం రెండేళ్లు అయినా ప్రీమియం చెల్లిచాలి. అప్పుడే దాన్నుంచి పెద్దగా నష్టం రాదు. బీమాతోపాటు పొదుపు కలసిన పాలసీల్లో రెండేళ్లలోపే బయటపడితే వచ్చేదేమీ పెద్దగా ఉండదు. కనీసం రెండేళ్లు చెల్లించిన తర్వాత పెయిడప్, సరెండర్ ఆప్షన్లను పరిశీలించొచ్చు. అయినా కానీ తొలినాళ్లలో ఇలా చేయడం వల్ల అంత ప్రయోజం ఉండదు. పెయిడప్, సరెండర్ ఈ రెండింటిలో ఏది నయం? అన్న ప్రశ్నే ఎదురైతే పెయిడప్గా మార్చుకోవడమే మంచిది. ఎందుకంటే, ఇందులో జీవిత బీమా కొనసాగుతుంది. కాల వ్యవధి తీరాక కొంత వెనక్కి వస్తుంది. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీకి పరిహారం దక్కుతుంది. మరో జీవిత బీమా పాలసీ తీసుకున్నా తర్వాతే ఒక పాలసీ నుంచి వెదొలగడాన్ని పరిశీలించాలి. -
బీమాలో తప్పు చేయొద్దు..!
‘‘ఇదొక పెట్టుబడి సాధనం. దీనిపై వార్షికంగా 12 శాతం చొప్పున ఆదాయం క్రమం తప్పకుండా పొందొచ్చు’’ ఈ తరహా ఆకర్షణీయమైన ప్రకటనలు బీమా ఏజెంట్లు వినిపిస్తే మీరొక సారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఇలా చెప్పినప్పుడు అసలు ఆ పెట్టుబడి సాధనం ఏమిటని మీరు ప్రశ్నించారనుకోండి... అదొక ఇన్సూరెన్స్ పాలసీ అని, అందులో ఉన్న ఫీచర్లు ఇవంటూ మరిన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేయవచ్చు. అలా చెబుతున్నారంటే అది యులిప్ పాలసీయే అయి ఉంటుంది. బీమా పాలసీలు తీసుకుంటున్న వారిని గమనిస్తే... ఎక్కువ మంది తమ అవసరాలను తీర్చేది అయి ఉండడం లేదని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. ఆర్థిక ప్రణాళిక పక్కాగా ఉండాలంటే, తమకు తగినంత బీమా రక్షణ ఉండాలన్న విషయాన్ని మరవొద్దు. జీవిత బీమా లేదా వైద్య బీమా, మరే ఇతర బీమా అయినా కానీ తగినంత బీమా కవరేజీ ఉండడం అవసరం. అదే సమయంలో అవసరం లేని బీమా ఉత్పత్తులతో మీ ఆర్థిక ప్రణాళిక భారంగా మారకుండా చూసుకోవాలి. బీమా పాలసీలకు సంబంధించి పక్కదోవ పట్టించే అంశాలను మీ దృష్టికి తీసుకురావడమే ఈ కథనం ఉద్దేశ్యం. టర్మ్ ప్లాన్లపై తప్పుదారి..! బీమా ఏజెంట్లు ప్రాథమికంగా తమకు కమీషన్ ఎక్కువగా లభించే పాలసీల విక్రయంపైనే ఆసక్తి చూపిస్తుంటారు. దాంతో టర్మ్ ప్లాన్ కొనుగోలు చేసే వారిని తప్పుదోవ పట్టించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. వీటికి బదులు యూనిట్ ఆధారిత బీమా పాలసీలు (యులిప్ల) లేదంటే సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలను తీసుకునే దిశగా మంచి రాబడి వివరాలతో ప్రదర్శన ఇస్తుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే... టర్మ్ ప్లాన్ అన్నది అచ్చమైన బీమా కవరేజీకి సంబంధించి కచ్చితమైన పాలసీ. అనుకోని ప్రమాదంతో పాలసీదారు ప్రాణం కోల్పోతే, అతను లేదా ఆమెపై ఆధారపడిన వారు ఆర్థిక ఇబ్బందులు పడకుండా తగినంత పరిహారం లభించాలంటే అది టర్మ్ప్లాన్లోనే సాధ్యపడుతుంది. ఎందుకంటే భరించేంత ప్రీమియంతో అధిక బీమా కవరేజీ టర్మ్ ప్లాన్లోనే లభిస్తుంది. జీవిత బీమా తీసుకోవాలంటే అందుకు టర్మ్ ప్లాన్ను మించినది లేదని పాలసీఎక్స్ డాట్ కామ్సీఈవో నావల్ గోయల్ పేర్కొన్నారు. తక్కువ ప్రీమియానికి అధిక రక్షణ ఇచ్చే విధంగా ఉంటాయి. అయితే, పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు పాలసీదారులు జీవించి ఉంటే ఆ తర్వాత ఆ పాలసీపై ఎటువంటి ప్రయోజనం లభించదు. కానీ, బీమా అంటే మరణంపై కవరేజీని తీసుకోవడం. చెల్లించిన ప్రీమియాన్ని తిరిగి పొందడం కాదని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు టర్మ్ ప్లాన్లో మీరు తీసుకోదలిచిన బీమా కవరేజీకి ప్రీమియం రూ.10వేలు ఉంటే, అదే యులిప్ పాలసీలో రూ.30వేలు చెల్లించాల్సి ఉంటుంది. యులిప్ పాలసీ అంటే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్తో ముడిపడిన బీమా పథకం. దీన్ని తీసుకోవడానికి బదులు రూ.10వేల ప్రీమియంతో టర్మ్ ప్లాన్ తీసుకుని, మిగిలిన రూ.20వేలను స్వయంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను ఆదాకు మంచి సాధనం...? ఏజెంట్లు లేదా బీమా పాలసీల విక్రయదారులు చెప్పే ఆకర్షణీయమైన వివరాల్లో పన్ను ఆదా కూడా ఒకటి. ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చని, గడువు తీరిన తర్వాత లేదా మరణంపై వచ్చే పరిహారంపై కూడా పన్ను ఉండదని వివరిస్తుంటారు. నిజానికి జీవిత బీమా పాలసీ కూడా పన్ను ఆదా ప్రయోజనం కల్పించే సాధనాల్లో ఒకటి. అయితే, పన్ను ఆదా కోసమే ఉద్దేశించిన సాధనం కాదు. ఇది బీమా రక్షణకు ఉద్దేశించినదిగా ముందు గుర్తుంచుకోవాలి. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను ఆదా కల్పించే పెట్టుబడి సాధనాలు ఎన్నో ఉన్నాయి. ఈపీఎఫ్, పీపీఎఫ్ వంటివి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. పన్ను ఆదా కోసమే అయితే వీటిని పరిశీలించొచ్చు కానీ, బీమా కాదు. ఎవరికి వారు వారి ఆర్థిక ప్రణాళికకు అనుకూలమైన సాధనాలను ఎంచుకోవడం వారి విజయానికి కీలకం. బ్యాంకు ఎఫ్డీల కంటే బెటర్..? ఎండోమెంట్ పాలసీలు ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరే రాబడులతోపాటు బీమా రక్షణనిస్తాయని బీమా ఏజెంట్లు చెబుతుంటారు. ఎండోమెంట్ పాలసీలు బీమా రక్షణ, పన్ను ఆదాతో పాటు చక్కని రాబడులను ఇస్తాయన్న మాటలను ఆకర్షితులై పాలసీలను తీసుకోవద్దు. రాబడులపై బ్యాంకు ఎఫ్డీల్లో టీడీఎస్ ఉంటుందని, బీమా పాలసీల్లో ఇది ఉండదని, కనుక బీమా పాలసీలు మంచి పెట్టుబడి సాధనాలని వివరించే వారూ ఉన్నారు. నిజానికి బీమా ఉత్పత్తుల్లో పలు రకాల చార్జీలు ఉంటాయి. కాల వ్యవధి తీరిన తర్వాత నిర్ణీత ప్రయోజనాలను అందిస్తాయి. అదే సమయంలో పాలసీ కాల వ్యవధి సమయంలో మరణిస్తే బీమా పరిహారాన్ని చెల్లిస్తాయి. అంతేకానీ రాబడులను పంచవు. కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడుల విషయంలో స్పష్టత ఉంటుంది. ఇక బీమా పాలసీలు, ఎఫ్డీల్లో పెట్టుబడుల రక్షణ భిన్నంగా ఉంటుంది. యులిప్లు మ్యూచువల్ ఫండ్స్ కంటే నయం? యూనిట్ ఆధారిత బీమా పాలసీ (యులిప్) బీమా రక్షణతోపాటు, అదనంగా మార్కెట్ ఆధారిత రాబడులను కూడా ఇస్తుందని బీమా ఏజెంట్లు చెప్పొచ్చు. అలాగే, మ్యూచువల్ పండ్స్లో అయితే రాబడులు మార్కెట్ ఆధారితం కనుక రిస్క్ ఉంటుందని, బీమా మాత్రం లభించదని కూడా చెప్పే అవకాశం లేకపోలేదు. యులిప్లు అటు బీమా రక్షణతోపాటుగా పెట్టుబడుల విషయంలోనూ ఎంతో స్వేచ్ఛ ఉంటుందని, రాబడుల విషయంలో సంతృప్తి అనిపించకపోతే, ఎటువంటి అదనపు చార్జీలు లేకుండానే పెట్టుబడి ఆప్షన్లను మార్చుకోవచ్చన్నది నిజమే కావచ్చు. అయితే, మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోనూ దీర్ఘకాలంలో అద్భుత రాబడులను ఇచ్చినవి వందల సంఖ్యలో ఉన్నాయనేది మర్చిపోవద్దు. యులిప్ అయితే, చెల్లించిన ప్రీమియంలో కొంత భాగం మార్కెట్ల పెట్టుబడులకు వెళుతుంది. మిగిలినదంతా పాలసీదారులు మరణానికి గురైతే పరిహారం చెల్లించేందుకు గాను, మోర్టాలిటీ చార్జీల కింద మినహాయించుకుంటాయి. దీంతో నిజానికి యులిప్లలో అటు అచ్చమైన పెట్టుబడులు కాకుండా, ఇటు అచ్చమైన బీమా రక్షణ కాకుండా ఉంటుంది. ఇక పాలసీ సరెండర్ చార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఫండ్ నిర్వహణ చార్జీలు, అలోకేషన్ చార్జీలు తదితర చార్జీల పరంగా పారదర్శకత తక్కువ. మొత్తంగా చూస్తే... బీమా అవసరం, పెట్టుబడుల ప్రాధాన్యం, మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉత్పత్తి ఎంపిక ఉండాలి. అవసరమైతే ఈ రంగంలో నిపుణులను సంప్రదించాలి. ఇవి గమనించండి... - పన్ను ఆదా కోసం ఆర్థిక సంవత్సరం చివర్లో బీమా పాలసీ తీసుకోవడం, ఆ తర్వాత అది తనకు తగినది కాదని తదుపరి ఆర్థిక సంవత్సరం రెన్యువల్ చేసుకోకుండా వదిలేయడం సరికాదు. - మార్కెట్ లింక్డ్ తరహా యులిప్ పాలసీలపై రాబడుల విషయంలో స్పష్టత ఉండదు. వీటిని బ్యాంకు ఎఫ్డీలతో పోల్చి చూడకూడదు - యులిప్ పాలసీల్లో మోర్టాలిటీ చార్జీల పేరుతో వసూలు చేసే చార్జీ కారణంగా ఇన్వెస్టర్ల రాబడులు చాలా వరకు తగ్గిపోతాయి. - బీమా, పెట్టుబడితో కూడిన పథకాల్లో రాబడులు, బీమా కవరేజీ తగినంత ఉండవు. - టర్మ్ కవర్లో తగినంత బీమా రక్షణను తక్కువ ప్రీమియానికే పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలకు అద్భుత సాధనం? ఆర్థిక లక్ష్యాలకు బీమా పాలసీలు అద్భుత సాధనాలనే విషయంలో ప్రతి ఒక్కరికీ స్పష్టత అవసరం. ఎందుకంటే దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు బీమా పాలసీలను పెట్టుబడి సాధనాలుగా చూస్తే అది పొరపాటులో కాలేసినట్టే అవుతుంది. బీమా పాలసీలన్నవి మీ ఆర్థిక లక్ష్యాలకు కవరేజీనిచ్చే సాధనం వరకే పరిమితం. అంతేకానీ, మీ ఆర్థిక అవసరాలను పాలసీలు అచ్చంగా తీర్చలేవు. అందుకు మీ రిస్క్కు తగ్గ పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ చైల్డ్ ప్లాన్లు, మ్యూచువల్ ఫండ్స్ రెండూ మీ పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాలకు ఉపయోగపడతాయి. కానీ, మంచి పనితీరు, పరిశోధనా టీమ్ కలిగిన మ్యూచువల్ ఫండ్ సాధనం బీమాతో కూడిన పెట్టుబడి సాధనం కంటే అధిక రాబడులను ఇస్తుందనడంలో సందేహం లేదు. ‘‘బీమాను కొనుగోలు చేసే వారు ఏజెంట్ను కలవడానికి ముందే కొంత సాధన చేయాలి. తప్పుడు బీమా పథకంలో ఇరుక్కుపోకుండా ఉండాలంటే తగినంత అవగాహన ఉండాలి. ఏజెంట్లు చెప్పే భారీ మొత్తాలు, హామీల ఆకర్షణలో పడిపోవద్దు’’ అని అలంకిత్ లిమిటెడ్ ఎండీ అంకిత్ అగర్వాల్ సూచించారు. -
మీ ‘పాలసీ’ ఏంటి..?
ఓ వ్యక్తి జీవితానికి, అతనిపై ఆధారపడిన కుటుంబానికి ఆర్థికపరమైన రక్షణ, భరోసాను కల్పించేది బీమా పాలసీ. ఆర్జనా పరులు, మరొకరికి ఆధారమైన వారు ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవడం తప్పనిసరి బాధ్యతలో ఒక్కటి. అయితే, జీవిత బీమా పాలసీ ఎంపికలో చాలా కచ్చితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సరైన పాలసీ తీసుకోవడం, దీనికి ముందు దృష్టి పెట్టాల్సిన అంశాల గురించి తెలియజేసే కథనమే ఇది. టర్మ్ – హోల్లైఫ్ నిర్ణీత కాలానికి (టర్మ్) పాలసీ తీసుకోవాలా లేక జీవితాంతం రక్షణనిచ్చే పాలసీ తీసుకోవాలా? అన్నది ముందుగా ఆలోచించుకోవాలి. మరణం సంభవిస్తే కుటుంబానికి బీమా మొత్తాన్ని చెల్లించే టర్మ్ పాలసీల ప్రీమియం తక్కువగా ఉంటుంది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీ టర్మ్ పాలసీల్లో లభిస్తుంది. పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు జీవించినప్పుడు ఆ తర్వాత ఎటువంటి మెచ్యూరిటీ టర్మ్ ప్లాన్లలో ఉండదు. కేవలం రక్షణకే ఇవి పరిమితం. దీనికి బదులు పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా జీవితాంతం (80–100 సంవత్సరాల వరకు) రక్షణను హోల్లైఫ్ పాలసీలు ఇస్తుంటాయి. కానీ, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ప్రీమియం అధికంగా ఉంటుంది. ఈ పాలసీల్లో పాలసీదారుడు ఎప్పుడు మరణించినా కానీ, పరిహారం లభించే సౌకర్యం ఉంటుంది. పెట్టుబడి సాధనం కాదు... జీవిత బీమా పాలసీలను సంప్రదాయ పెట్టుబడి సాధనాలుగా చూడకూడదు. ఎండోమెంట్, యులిప్ ప్లాన్లు, టర్మ్ ప్లాన్లు ఈ మూడు రకాల్లోనూ జీవితానికి రక్షణ ఉంటుంది. అయితే, యులిప్ ప్లాన్లు ఈక్విటీ ఆధారిత పెట్టుబడి, బీమా కలగలిపిన సాధనం. ఈక్విటీ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి రాబడులు ఉంటాయి. కానీ, జీవిత బీమా అన్నది పెట్టుబడి సాధనం కాదు. అలా చూడడం కూడా సరికాదు. రాబడులే కావాలనుకుంటే అందుకోసం ఇతర పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాలి. బీమా రక్షణ కోసం టర్మ్ ప్లాన్లను తీసుకోవాలి. ప్రీమియం పెంచినా సరే... టర్మ్ ప్లాన్లు తీసుకునేవారు ప్రీమియం చెల్లించిన తర్వాత వైద్య పరీక్షలకు వెళ్లాలని బీమా సంస్థ కోరుతుంది. వైద్య పరీక్షల అనంతరం ఫలితాల ఆధారంగా రిస్క్ ఉందనుకుంటే ప్రీమియాన్ని పెంచుతాయి. అయితే, పెంచిన మేర ప్రీమియం చెల్లించేందుకు ఇష్ట పడక కొందరు వేరే బీమా కంపెనీని ఆశ్రయిస్తుంటారు. కానీ, పెంచిన మేర ప్రీమి యం చెల్లించడం వల్ల వైద్య పరమైన సమస్యలకు సంబంధించిన రిస్క్ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఆ మేరకు రిస్క్ను బీమా కంపెనీ ప్రీమియం పెంచడం ద్వారా ఆమోదించినట్టు అవుతుంది. భవిష్యత్తులో వైద్య పరమైన సమస్యలతో మరణం సంభవిస్తే... క్లెయిమ్ విషయంలో బీమా సంస్థ కొర్రీలు వేయకుండా ఉంటుంది. మైనర్ పేరిట వద్దు కొంత మంది తమ పిల్లల పేరిట బీమా పాలసీలు తీసుకుంటుంటారు. పిల్లలకు ఎటువంటి ఆర్జనా శక్తి ఉండదు కనుక వారి పేరిట బీమా పాలసీ తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. పిల్లలకు బదులు సంపాదనా శక్తి కలిగిన వారి పేరుతో బీమా పాలసీ తీసుకోవాలి. పాలసీ డాక్యుమెంట్ పరిశీలన పాలసీ తీసుకున్నాక చూడాల్సిన అంశాలూ ఉన్నాయి. అందులో పాలసీ డాక్యుమెంట్ మీకు చేరిన తర్వాత దాన్ని ఓ సారి పూర్తిగా చదవడం మరవొద్దు. డాక్యుమెంట్లోని ప్రతీ కాలమ్ను పరిశీలించాలి. అందు లోని వివరాలు మీరు అనుకున్న విధంగానే ఉన్నాయా? అప్పటి వరకు మీకు తెలియని నచ్చని అంశాలు ఏవైనా ఉన్నాయేమో చూడాలి. సమ్ అష్యూర్డ్, పాలసీ కాల వ్యవధి, చెల్లించాల్సిన ప్రీమియం, ఎంత కాలానికోసారి ప్రీమియం చెల్లించాలి... ఈ వివరాలన్నీ సరిగానే ఉన్నా యా, లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏవైనా తప్పులుంటే వెంటనే వాటి గురించి బీమా సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. మీ పాలసీ పత్రంలో అన్ని వివరాలు సరిగ్గానే ఉంటే, క్లెయిమ్ సమయంలో నామినీకి ఇబ్బందులు ఎదురుకావు. అయితే, పాలసీ పత్రంలో మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, కాంటాక్ట్ సమాచారం, నామినీ పేరు వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోవా ల్సిన బాధ్యత పాలసీదారులపై ఉంటుంది. వివరాల్లో తప్పులు ఉంటే సులభంగానే కరెక్షన్ చేసుకోవచ్చు. కాకపోతే వెంటనే ఈ పని చేయాలి. బీమా సంస్థ కస్టమర్ పోర్టల్లో లాగిన్ అయి, మార్పులకు సంబంధించిన రిక్వెస్ట్ పెట్టుకోవ చ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా కస్టమర్కేర్ మెయిల్ ఐడీకి మెయిల్ చేయవచ్చు. లిఖిత పూర్వకంగానూ తెలియజేయవచ్చు. సకాలంలో ప్రీమియం ప్రీమియం చెల్లింపు క్రమం కూడా ముఖ్యమే. చాలా మంది వార్షిక ప్రీమియానికి మొగ్గు చూపితే. కొందరు నెలవారీ చెల్లింపు ఎంచుకుంటారు. కొందరు త్రైమాసికం, అర్ధ సంవత్సరం ఆప్షన్ ఎంచుకుంటుంటారు. ఎంత కాలానికి ప్రీమియం ఎంత మేర చెల్లింపు సౌకర్యంగా ఉంటుందో చూసి ఎంచుకోవాలి. ఇక, ఆ గడువు నాటికి సకాలంలో ప్రీమియం చెల్లించాలి. దీనికంటే కూడా ఈసీఎస్ విధానంలో నేరుగా గడువు నాటికి బ్యాం కు ఖాతా నుంచి ప్రీమియం చెల్లింపు జరిగేలా చూసు కుంటే మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఇలా చేయనప్పుడు మర్చిపోయి సకాలంలో ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఆ సమయంలో ప్రాణ ప్రమాదం ఎదురైతే నామినీలకు సమస్యలు తప్పవు. ఇక పాలసీ తీసుకున్నాం పనైపోయిందనుకోవద్దు. ఉద్యోగంలో చేరిన కొత్తలో పాలసీ తీసుకున్న వారు... వివాహం, పిల్లలు పుట్టాక తమ జీవన అవసరాలు, తీసుకున్న రుణాలు, పెరిగిన బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీని పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకని ఐదేళ్ల కోసారి అయినా సమీక్షించుకుని పాలసీ కవరేజీని పెంచుకోవడం అవసరం. పాలసీ నచ్చకపోతే తిప్పి పంపొచ్చు పాలసీ డాక్యుమెంట్ను ఆసాంతం పరిశీలించిన తర్వాత అందులోని నియమ నిబంధనలు అనుకూలంగా లేవని భావిస్తే సంబంధిత పాలసీని తిరిగి వాపసు చేయవచ్చు. ఇందుకు 15–30 రోజుల గడువు ఉంటుంది. ఆన్లైన్ పాలసీల్లో 30 రోజుల గడువు ఉంటుంది. దీన్నే ఫ్రీ లుక్ పీరియడ్ అంటారు. ఈ లోపు తగిన కారణాలను పేర్కొంటూ పాలసీని వాపస్ చేస్తే బీమా కంపెనీకి చెల్లించిన ప్రీమియంను తిరిగి పొందొచ్చు. వైద్య పరీక్షల వంటివి చేసి ఉంటే, అందుకు అయిన ఖర్చులు, పాలనా ఖర్చులను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాయి. నామినీకి సమాచారం నామినీలు సహజంగా జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు అయి ఉంటారు. బీమా పాలసీ తీసుకుని, అందులో ఒకరిని నామినీగా పేర్కొన్న వెంటనే, ఆ వివరాలను వారికి తెలియజేయాలి. ఫలానా సంస్థ నుంచి పాలసీ తీసుకున్నట్టు, అందులో నామినీగా వారి పేరును రిజిస్టర్ చేసినట్టు చెప్పాలి. కొన్ని టర్మ్ ప్లాన్లు మరణ పరిహారాన్ని ఏక మొత్తంలో చెల్లించడానికి అదనంగా, ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని పదేళ్ల వరకు చెల్లించే రైడర్లతో వస్తున్నాయి. ఈ బెనిఫిట్స్ ఏవి ఉన్నా, నామినికీ పూర్తి వివరాలు తెలపడం ఎందుకైనా మంచిది. -
మీ ‘సేఫ్’ లాకర్ ఎక్కడ?
బంగారు ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకునేందుకు చాలా మంది బ్యాంకుల్లోని సేఫ్లాకర్లను ఆశ్రయిస్తారు. ఇది సర్వసాధారణం. కారణం... బ్యాంకు లాకర్లలో ఉంచితే ఎంతో భద్రంగా ఉంటాయన్న నమ్మకం!!. కాకపోతే ఇక్కడో చిక్కుంది. బ్యాంకు లాకర్ మాత్రమే అద్దెకిస్తుంది. అంతవరకే దాని బాధ్యత. అందులో మనం ఏం దాచామన్నది బ్యాంకుకు తెలియదు. అనవసరం కూడా. కాబట్టి ఆ లాకర్లలో మనం దాచిన వస్తువులు పోతే... అందుకు బ్యాంకుల బాధ్యత ఉండదని ఈ మధ్యే ఆర్బీఐ కూడా స్పష్టం చేసింది. అలాగే, కొన్ని చోట్ల బ్యాంకు లాకర్లను బద్దలు కొట్టి విలువైన వస్తువుల్ని దోచుకుపోయిన సంఘటనలు సైతం ఉన్నాయి. దీంతో బ్యాంకు లాకర్లలో ఉంచిన వస్తువుల భద్రత విషయంలో ఖాతాదారులు మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి వాటికి ప్రత్యామ్నాయాలేంటి? ఎక్కడైతే సురక్షితంగా దాచుకోగలం? అసలు బ్యాంకు లాకర్లలో ఉంచిన వారు భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?... ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం మంచి కంపెనీల సేఫ్టీ లాకర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు సరిపోయేదాన్ని ఎంచుకుని ఇంట్లోనే ఓ చోట ఏర్పాటు చేసుకోవడం ఒక పరిష్కారం. ఇందులో కొన్ని ప్రయోజనాలున్నాయి. అలాగే, కొన్ని రిస్క్లు కూడా ఉన్నాయి. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా లాకర్లలో ఉంచిన వాటిని తీసుకోవచ్చు. బ్యాంకుల్లో అయితే నిర్ణీత సమయాల్లోనే ఆ అవకాశం ఉంటుంది. ప్రైవేటుగా లాకర్ సేవలందించే సంస్థలు కూడా రోజువారీ సమయాలను పాటిస్తాయి. పైపెచ్చు సెలవు రోజుల్లో మూసి ఉంచుతాయి. ఇక బ్యాంకు లాకర్లయితే ఏడాదిలో కనీసం ఒకసారయినా లాకర్ను తెరవాలన్న నిబంధన ఉంటుంది. ఒకవేళ అలా తెరవలేని పక్షంలో ఎందుకు తెరవలేదో చెప్పాలని కోరుతూ బ్యాంకు నోటీసు జారీ చేస్తుంది. దానికి సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దానికి స్పందించకపోతే లాకర్ను బలవంతంగా తెరవడం జరుగుతుంది. బ్యాంకు లాకర్లలో విలువైన వస్తువులుంచినపుడు వాటిని అవసరానికి తీసుకురావడం, పని ముగిసిన తర్వాత తిరిగి మళ్లీ తీసుకెళ్లి లాకర్లలో పెట్టడం కాస్తంత శ్రమ, సమయంతో కూడినది. పైగా క్యారీ చేసే సమయంలో దోపిడీ భయం ఉండనే ఉంది. ఇంట్లోనే లాకర్ ఏర్పాటు చేసుకుంటే ఈ విధమైన ఇబ్బంది ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది. చార్జీలు ఎలా ఉంటాయంటే... బ్యాంకు లాకర్ను అద్దెకు తీసుకునేటపుడైనా... దానికి బదులు సొంతంగా లాకర్ కొనుగోలు చేసి ఇంట్లో ఏర్పాటు చేసుకునేటపుడైనా వాటికయ్యే ఖర్చును పోల్చి చూడాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో లాకర్ అద్దెలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటున్నాయి. లాకర్ సైజును బట్టి కూడా ఈ చార్జీలు మారుతుంటాయి. చిన్న లాకర్కు అయితే ఎస్బీఐ సంవత్సరానికి పట్టణాల్లో రూ.1,100, సెమీ అర్బన్, గ్రామీణ శాఖల్లో రూ.800 చొప్పున వసూలు చేస్తోంది. పెద్ద లాకర్ అయితే ఈ అద్దె పట్టణాల్లో రూ.8,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,000గా ఉంది. పైపెచ్చు బ్యాంకుల్లో లాకర్ కోసం మూడేళ్ల అద్దెను కూడా డిపాజిట్ చేయాల్సి రావచ్చు. ప్రైవేటు సంస్థలయితే తిరిగి చెల్లించే మూడేళ్ల అద్దెను డిపాజిట్ చేయాలని కోరుతున్నాయి. ఈ సంస్థలు వసూలు చేసే అద్దె ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే కొంచెం ఎక్కువగా ఉంటోంది. ఇక ఇంట్లోనే లాకర్ ఏర్పాటు చేసుకున్నట్టయితే ఫలానా వారే దాన్ని తెరవాలి, ఇన్ని సార్లే తెరవాలన్న అడ్డంకులేవీ ఉండవు. బ్యాంకులు లాకర్లను తెరిచే విషయంలో ఏడాదికి ఇన్ని సార్లేనన్న పరిమితులు అమలు చేస్తున్నాయి. అంతకు మించితే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీఐ అయితే ఏడాదికి 12 సార్లు మాత్రమే ఉచితం. ఆ తర్వాత నుంచి ప్రతీ సందర్శనకు రూ.100 చార్జీ విధిస్తోంది. అలాగే, బ్యాంకులు ఇద్దరు వ్యక్తులను జాయింట్ హోల్డర్లుగా లాకర్ను యాక్సెస్ చేసుకునేందుకు అనుమతిస్తుంటాయి. వీరు మినహా మిగిలిన వారికి ఆ అవకాశం ఉండదు. నామినీని కూడా పేర్కొనాల్సి ఉంటుంది. ఇంట్లోనే లాకర్ ఏర్పాటు చేసుకున్నట్టయితే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దొంగల నుంచి కాపాడుకునే బాధ్యత ఎవరికి వారే చూసుకోవాల్సి ఉంటుంది. సీసీ కెమెరాలు, ఎవరైనా చొరబడితే గుర్తించి అప్రమత్తం చేసే పరికరాలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. లాకర్ ఎంపిక ఎలా? ఇంట్లో ఏర్పాటు చేసుకునే లాకర్లకు సంబంధించి ఎన్నో సైజులు, మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా కనిపించేవి ‘కీ’తో ఉండే మెకానికల్ లాకర్లు. అలాకాకుండా ఎలక్ట్రానిక్ కీప్యాడ్లతో కూడిన ఖరీదైన లాకర్లు సైతం మార్కెట్లో ఉన్నాయి. కార్డుల స్వైప్తో, బయోమెట్రిక్ ద్వారా యాక్సెస్ చేసుకునేవీ దొరుకుతున్నాయి. మెకానికల్ లాకర్ల కంటే ఈ తరహా లాకర్ల ఖరీదు దాదాపు 50 శాతం ఎక్కువ ఉంటోంది. ఉదాహరణకు గోద్రెజ్ 23 లీటర్ల ఎలక్ట్రానిక్ మోడల్ లాకర్ ధర రూ.11,522. అదే మెకానికల్ లాకర్ ధరయితే రూ.8,000. లాకర్ బరువు కూడా చూడాల్సి ఉంటుంది. చాలా బరువుతో ఉండేవి ఎంచుకోవడం వల్ల దొంగలెవరైనా చొరబడి వాటిని ధ్వంసం చేయాలనుకున్నా, తీసుకెళ్ళాలనుకున్నా కష్టమవుతుంది. అలాంటి వాటి ధర ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. 30 లీటర్ల ఎలక్ట్రానిక్ సేఫ్ లాకర్, 14 కిలోల బరువున్న దాన్ని పెప్పర్ఫ్రైలో కొనుగోలు చేయాలంటే ధర సుమారు రూ.12,200 వరకూ ఉంది. 18 కిలోల బరువుతో ఉన్న దాని ధర రూ.13,530. ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఇళ్లలో లాకర్ను పెట్టుకోవాలనుకున్న వారు... దాన్ని ఎక్కడ ఉంచాలన్నది కూడా ఆలోచించతగినదే. ఇంటి నిర్మాణ సమయంలోనే లాకర్ను కొని ఏర్పాటు చేయించుకోవడం మంచి ఆలోచన. ఇలా చేస్తే లాకర్ కనిపించకుండా చేసుకునేందుకు వీలుంటుంది. నిర్మాణం పూర్తయిన ఇంట్లో అయితే గోడలకు స్క్రూతో గట్టిగా ఫిట్ చేయించుకోవాలి. కాకపోతే ఇలా లాకర్ను ఏర్పాటు చేసేటపుడు ఎవరికీ తెలియకుండా చూసుకోవటం తప్పనిసరి. ఇల్లు కట్టేటపుడు ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కూడా ఈ జాగ్రత్తలు తప్పనిసరి. అగ్ని ప్రమాద నిరోధ లాకర్లు కూడా ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరిగితే ఈ లాకర్లలో ఉంచిన డాక్యుమెంట్లకు కాలిపోయే రిస్క్ ఉండదు. ఏ మేరకు భద్రత అవసరం అన్నదాన్ని బట్టి ఈ ఫీ చర్లను జోడించుకుంటూ వెళ్లొచ్చు. అలాగే, ధర కూడా ఎంచుకున్నదాన్ని బట్టి ఉంటుంది. బీమా తప్పనిసరి బ్యాంకు లాకర్ అద్దెకు తీసుకున్నా లేక ఇంట్లో లాకర్ను ఏర్పాటు చేసుకున్నా తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అంశం బీమా పాలసీ తీసుకోవడం. లాకర్లలో ఉంచిన వస్తువులు మాయం అయితే బ్యాంకులు బాధ్యత తీసుకోవడం లేదు. కనుక అందులో ఉంచిన వాటి విలువకు సమానంగా బీమా రక్షణతో పాలసీ తీసుకోవడం అవసరం. హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలో చాలా వాటికి బీమా రక్షణ లభిస్తుంది. బీమా పాలసీ తీసుకునే వారు బ్యాంకు లాకర్లలో ఉంచినవి కోల్పోతే కచ్చితంగా పరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాంకు శాఖలు పటిష్ట భద్రతతో ఉంటాయి కనుక. కానీ, ఇంట్లో లాకర్ ఏర్పాటు చేసుకుని అందులో విలువైన వాటిని ఉంచిన వారు బీమా ఉందిలే అని నిర్లక్ష్యం చూపిస్తే పరిహారం ఇచ్చేందుకు కంపెనీలు నిరాకరించే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇంట్లో లాకర్ ఏర్పాటు చేసుకునే వారు సీసీ కెమెరాలు, పటిష్టమైన లాకర్, అగ్ని నిరోధక తదితర అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం కచ్చితంగా అవసరం. అప్పుడే క్లెయిమ్ తిరస్కరణ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. -
బీమా చేసి.. వదిలేశారా..??
మనలో చాలా మంది జీవిత బీమా పాలసీలు తీసుకుంటూ ఉంటారు. వీరిలో ఎక్కువ మంది ఆదాయం పన్ను మినహాయింపు పొందడం కోసం పాలసీ తీసుకుంటారు.అయితే, ఆ అవసరం తీరిపోయాకా పాలసీ గురించి పట్టించుకోరు. క్రమం తప్పకుండా ప్రీమియంలు కట్టరు.దాంతో ఆ పాలసీ లాప్స్ అయిపోతుంది.ఇలా పాలసీ చేసి ప్రీమియంలు కట్టకపోవడం వల్ల ఎల్ఐసీకి ఏటా 5వేల కోట్ల రూపాయలకు పైగా మిగులుతోందని తేలింది.దేశంలో ఉన్న బీమా కంపెనీలు చేయించే పాలసీలలో 25శాతం పాలసీలు మొదటి ఏడాది తర్వాత లాప్స్ అయిపోతున్నాయి. పాలసీ కట్టిన ఏడాది లోపు అది లాప్స్ అయిపోతే కట్టిన వారికి డబ్బులేమీ తిరిగి రావు. బీమా సంస్థలు పాలసీకి సంబంధించిన ఖర్చులన్నీ–ఏజెంట్ కమిషన్ సహా–తీసేసు కుంటాయి.దాంతో పాలసీదారునికి ఎంత డబ్బు తిరిగి వస్తుందన్నది అనుమానమే.2016–17 సంవత్సరంలో జీవిత బీమా సంస్థ(ఎస్ఐటీ) రూ.22,178 కోట్ల విలువైన రెగ్యులర్ ప్రీమియం పాలసీలను (క్రమం తప్పకుండా ప్రీమియంలు కట్టాల్సిన పాలసీలు) విక్రయించింది. దేశం మొత్తం మీద జరిగిన పాలసీ విక్రయాల్లో ఇది 44శాతం.అయితే, ఏడాది తర్వాత ‘పీమియంలు కట్టని కారణంగా దీనిలో 25శాతం పాలసీలు లాప్స్ అయిపోవడం వల్ల ఎల్ఐసీకి 5వేల కోట్ల రూపాయలకు పైగా మిగిలిందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొందరు పాలసీదారులు ఉద్దేశ పూర్వకంగానే ప్రీమియంలు కట్టరు. మరి కొందరు గుర్తులేకో, సమయానికి డబ్బు అందకో మరే కారణం చేతో ప్రీమియం కట్టలేకపోతున్నారు. పాలసీ చేయించిన ఏజెంటు కూడా పాలసీ కట్టించుకున్న తర్వాత దాని గురించి పట్టించుకోకపోవడం కూడా ఒక కారణం. విదేశాల్లో అయితే, పాలసీ లాప్స్ అయితే కంపెనీలు సంబంధిత ఏజెంటుకిచ్చిన కమీషన్ నుంచి కొంత మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తాయి. దానివల్ల ఏజెంట్లు పాలసీలు లాప్స్ కాకుండా చూసుకుంటారు.మన దగ్గర ఆ విధానం లేదు. ఇదిలా ఉంటే, కొందరు జీవిత బీమా పాలసీలు చేసి ప్రీమియంలు కూడా చివరి వరకు కడతారు.అయితే ఆ వివరాలేమీ ఇంట్లో వాళ్లకి చెప్పరు.దాంతో వారు చనిపోతే ఆ పాలసీ సొమ్ము కంపెనీ దగ్గరే ఉండిపోతుంది.ఇలా ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము 15వేల కోట్ల వరకకు బీమా కంపెనీల దగ్గర ఉంది. -
సమయానికి తగు బీమా
వివాహాది శుభకార్యాలు సంతోషాలు కలిగించడంతో పాటు కొత్త బాధ్యతలను కూడా మోసుకొస్తాయి. పెళ్లి, కొత్తగా సొంతిల్లు .. పిల్లల కోసం, వారి చదువుల కోసం ప్లానింగ్ ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత మరొకటి వచ్చేస్తాయి. వీటి కోసం ప్లానింగ్ చేసుకోవడంతో పాటు దురదృష్టకరమైన సంఘటనేదైనా జరిగితే ..కుటుంబం ఆర్థికంగా ఇబ్బందిపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సరైన సమయంలో బీమా పాలసీ తీసుకున్న పక్షంలో ఆర్థికంగా ఎలాంటి అవరోధాన్నైనా ధీమాగా ఎదుర్కొనవచ్చు. సాధారణంగా పెళ్లిళ్లకు సంబంధించి సగటు వయస్సు అంతర్జాతీయంగా 28 ఏళ్లుగా ఉంటుండగా.. మన దగ్గర 22.8 సంవత్సరాలుగా ఉంటోంది. వయస్సు పెరిగే కొద్దీ బీమా ప్రీమియం పెరుగుతుందన్న సంగతి తెలిసిందే. కాబట్టి వివాహం నాటికే లేదా వివాహ సమయానికే బీమా తీసుకుంటే.. స్వల్ప ప్రీమియానికి అధిక కవరేజీ పొందడానికి వీలవుతుంది. మరికాస్త వివరంగా చెప్పాలంటే పలు అధ్యయనాల ప్రకారం .. సాధారణంగా 55–60 ఏళ్లు వచ్చేసరికి పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు పూర్తయిపోవడం .. ఇతరత్రా ఇంటి రుణాల చెల్లింపు మొదలైన బాధ్యతలను తీర్చేసుకోవడం జరుగుతుంటుంది. కనుక.. సరైన సమయంలో జీవిత బీమా టర్మ్ పాలసీ తీసుకున్న పక్షంలో అత్యంత కీలకమైన సమయంలో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కవరేజీని పెంచుకోవచ్చు.. వివాహానికి ముందో లేదా వివాహ సమయంలోనో పాలసీ తీసేసుకున్నా.. ఆ తర్వాత పిల్లలు పుట్టాక మరికొన్ని బాధ్యతలు జతవుతాయి కాబట్టి.. కవరేజీని, సమ్ అష్యూర్డ్ను పెంచుకోవడం శ్రేయస్కరం. ఇటు ద్రవ్యోల్బణం.. అటు పెరిగే బాధ్యతలకు అనుగుణంగా వయస్సు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా సమ్ అష్యూర్డ్ కూడా పెరిగేలా ప్రస్తుతం పలు పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీ పాలసీ ఈ కోవకి చెందినది కాకపోతే కొత్తగా మరో పాలసీ తీసుకోవడమో లేదా.. కొంత ప్రీమియంలో వ్యత్యాసాలన్ని కట్టేసి.. ఇప్పటికే ఉన్న పాలసీలో సమ్ అష్యూర్డ్ను పెంచుకోవడమో చేయొచ్చు. పిల్లల భవిష్యత్ చైల్డ్ పాలసీలు .. పిల్లల బంగారు భవిష్యత్ కోసం ప్లానింగ్ చేసేందుకు అనువైన చైల్డ్ ప్రొటెక్షన్ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ బీమా తీసుకున్న పేరెంట్కి ఏదైనా అనుకోనిది జరిగినా పాలసీ కొనసాగేలా భవిష్యత్ ప్రీమియంలను కట్టడం నుంచి మినహాయింపునిచ్చే పథకాలు కూడా ఉన్నాయి. ఇటు పొదుపు, అటు రక్షణ ప్రయోజనాలు కూడా కల్పించే ఇలాంటి పాలసీలు పిల్లల బంగారు భవిష్యత్ కోసం బాటలు వేసేందుకు ఉపయోగపడతాయి. ఇక సొంతింటి కోసం రుణం తీసుకున్నా .. ఆ భారం మరీ అధికం కాకుండా మార్టిగేజ్ లోన్ తీసుకుంటే శ్రేయస్కరం. 30 ఏళ్ల లోపే పాలసీని తీసుకోవటం మంచిది.. వయస్సు పెరిగే కొద్దీ ప్రీమియంలు పెరుగుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకూ 30 ఏళ్ల లోపే పాలసీని తీసుకోవటం మంచిది. పెరిగే వయస్సుతో పాటు ఆరోగ్య సమస్యలూ తలెత్తవచ్చు.. ఫలితంగా ప్రీమియం పెరగొచ్చు. ఒకవేళ 60 ఏళ్లు దాటేస్తే.. బీమా సంస్థలు కవరేజీనిచ్చేందుకు నిరాకరించే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు.. 30–35 ఏళ్ల వ్యక్తి (సిగరెట్ల అలవాటు లేకుండా) రూ. 1 కోటి సమ్ అష్యూర్డ్కి పాలసీ తీసుకుంటే.. ప్రీమియం దాదాపు రూ. 8,000 ఉంటుంది. అదే మరో పదిహేనేళ్లు వాయిదా వేసి.. 45 ఏళ్లప్పుడు తీసుకుందామనుకుంటే.. అదే కవరేజీకి ఏకంగా రూ. 20,100 దాకా కట్టాల్సి ఉంటుంది. పైగా ఆరోగ్య సమస్యల్లాంటివేమైనా ఉన్న పక్షంలో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కనుక.. పెళ్లి, పిల్లలు, వారి చదువులు, ఇంటి కొనుగోళ్లు ఇలా సందర్భాలను బట్టి బీమా కవరేజీని ఎప్పటికప్పుడు పునఃసమీక్షించుకుంటూ ఉండాలి. కుటుంబానికి అంతటికీ ఆధారమైన ఇంటి పెద్దకేదైనా జరిగిన పక్షంలో వారు లేని లోటు తీర్చలేనిదే అయినా.. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఇలాంటి బీమా పాలసీలతో రక్షణ కల్పించవచ్చు. - రిషి శ్రీవాస్తవ , హెడ్ (ప్రొప్రైటరీ చానల్), టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ -
హృదయం పదిలం!!
ఒకప్పుడు గుండెపోటు వంటివి కాస్త పెద్ద వయసు వారికే వచ్చేవి. ఇపుడు వయసుతో సంబంధం లేకుండా దీనికి గురవుతున్నారు. గుండెకు ఉన్న అత్యధిక ప్రాధాన్యం దృష్ట్యా హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇటీవలే ’కార్డియాక్ కేర్’ పేరుతో హార్ట్ ప్లాన్ తెచ్చింది. గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకయ్యే వైద్య ఖర్చులను ఇది భరిస్తుంది. సాధారణంగా క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు అన్ని ముఖ్యమైన అనారోగ్యాలను కవర్ చేస్తాయి. కానీ, విడిగా ఒక్కో అవయవానికి సంబంధించిన ప్లాన్ను తీసుకుంటే, కవరేజీ సమగ్రంగా లభిస్తుంది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ తీసుకొచ్చిన కార్డియాక్ కేర్ను ఓ సారి పరిశీలించాల్సిందే... 18–65 ఏళ్ల వయసు వారు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. కనిష్టంగా 5 సంవత్సరాలు, గరిష్టంగా 40 సంవత్సరాల వరకు కవరేజీ పొందొచ్చు. కనీసం రూ.2 లక్షలు, గరిష్టంగా రూ.50 లక్షల కవరేజీని పొందే అవకాశం ఉంది. గుండెకు సంబంధించి 18 రకాల అనారోగ్య సమస్యలకు హెచ్డీఎఫ్సీ కార్డియాక్ కేర్లో కవరేజీ పొందొచ్చు. ప్రతి మూడేళ్లకోసారి ప్రీమియాన్ని కంపెనీ సవరిస్తుంటుంది. ప్రీమియంలో మార్పు ఉంటే అది అమల్లోకి రావడానికి ముందే ఆ విషయాన్ని పాలసీదారునికి నోటీసు రూపంలో తెలియజేస్తుంది. ప్రీమియం చెల్లింపునకు 30 రోజుల సమయాన్ని కూడా ఇస్తోంది. పాలసీ ప్రయోజనాలు ఈ పాలసీలో ఉన్న ప్రయోజనం కవరేజీలో పేర్కొన్న ఏదేనీ గుండె అనారోగ్యం బయటపడితే బీమా మొత్తాన్ని చెల్లించేస్తుంది. ఆ సమస్యకు చికిత్స ఎంత అయిందన్న దానితో సంబంధం లేదు. సాధారణ క్రిటికల్ ఇల్నెస్ పాలసీల్లో మినహాయింపు ఉన్న పలు చికిత్సలకు కూడా హెచ్డీఎఫ్సీ కార్డియాక్ కేర్ కవరేజీనిస్తోంది. వీటిలో కీహోల్ లేదా మినిమల్లీ ఇన్వేసివ్ లేదా రోబోటిక్ కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్, బెలూన్ వాల్వోటోమీ లేదా వాల్వో ప్లాస్టీ, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ ఆఫ్ అరోటా, పేస్మేకర్ ఏర్పాటు వంటివి ఉన్నాయి. వీటికి హెచ్డీఎఫ్సీ కార్డియాక్ కేర్ కవరేజీనిస్తోంది. మొత్తం 18 రకాల గుండె సమస్యలను అధిక తీవ్రత (ఎ), మధ్య స్థాయి తీవ్రత (బి), తక్కువ తీవ్రత (సి) అని మూడు గ్రూపులుగా పాలసీలో వర్గీకర ణలు చేయడం జరిగింది. పాలసీదారులకు వచ్చిన సమస్య వీటిలో ఏ గ్రూపులో ఉన్నదనే అంశాన్ని బట్టి పరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది. ఉదాహరణకు గ్రూప్ ఏ పరిధిలోని సమస్య అయితే 100 శాతం, గ్రూపు బి అయితే 50 శాతం, గ్రూపు సి అయితే 25 శాతం బీమా మొత్తంలో చెల్లిస్తుంది. ఇక ఒక్కో సమస్యకు బేసిక్ కవరేజీకి అదనంగా హాస్పిటలైజేషన్, ద్రవ్యోల్బణంతో కూడిన ఇండెక్సేషన్, ఇన్కమ్ బెనిఫిట్స్ను కూడా ఎంచుకోవచ్చు. అయితే అదనపు ప్రీమియం చెల్లించాలి. హాస్పిటలైజేషన్ ఒక్కసారి పాలసీ తీసుకునే సమయంలో ఎంచుకున్న బెనిఫిట్స్ను తిరిగి సవరించడం ఉండదు. హాస్పిటలైజేషన్ బెనిఫిట్ కింద ఆస్పత్రిలో ఐసీయూలో చేరితే బీమా మొత్తంలో 2 శాతాన్ని ప్రతి రోజూ చెల్లిస్తుంది. గరిష్ట పరిమితి రూ.20,000. కాకపోతే ఏడాదిలో ఇలా ఐదు రోజుల వరకే చెల్లింపులు చేస్తుంది. పాలసీ కాల వ్యవధిలో మొత్తం మీద 15 రోజులకే హాస్పిటలైజేషన్ బెనిఫిట్ పరిమితం. ఒకవేళ ఐసీయూ కాకుండా ఆస్పత్రిలో చేరి పొందే చికిత్సలకు బీమా మొత్తంలో 1 శాతం పరిహారం చెల్లించడం జరుగుతుంది. రోజుకు గరిష్ట పరిమితి రూ.10,000. ఏడాదిలో 10 రోజుల వరకు, పాలసీ కాల వ్యవధిలో 30 రోజుల వరకు ఈ ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఒక ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే హెల్త్ పాలసీల్లో మాదిరే కార్డియాక్ కేర్లోనూ నో క్లెయిమ్ బోనస్ లభిస్తుంది. బీమా మొత్తం 10 శాతం పెరుగుతుంది. అయితే, ఒక్కసారి క్లెయిమ్ చేశారంటే, సమ్ ఇన్సూర్డ్ మొత్తం పెరగదు. నెలవారీ ఆదాయం పాలసీలో భాగంగా ఇన్కమ్ బెనిఫిట్ ఎంచుకుంటే, పాలసీలోని గ్రూప్ ఏలో పేర్కొన్న గుండె అనారోగ్యాల్లో ఏదైనా బయటపడితే బీమా మొత్తంలో ఒక శాతం చొప్పున ప్రతి నెలా చెల్లించడం జరుగుతుంది. ఇలా ఐదేళ్ల పాటు నెలవారీ ఆదాయం పొందొచ్చు. ఒకవేళ ఈ ఐదేళ్ల నెలవారీ బెనిఫిట్ చెల్లింపుల సమయంలో పాలసీదారుడు మరణిస్తే మిగిలిన మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. ఎంత వరకు లాభం..? సాధారణ క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లతో పోలిస్తే హెచ్డీఎఫ్సీ కార్డియాక్ కేర్ చాలా అంశాల్లో లాభసాటే అని చెప్పొచ్చు. అయితే, చాలా అంశాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ హార్ట్ ప్రొటెక్ట్ ప్లాన్తో హెచ్డీఎఫ్సీ కార్డియాక్ కేర్కు పోలిక ఉంది. ఈ రెండు పాలసీలు కూడా 18 రకాల గుండె సమస్యలకు కవరేజీనిస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ హార్ట్ ప్రొటెక్ట్లో పాలసీదారుని గుండె సమస్యను బట్టి 25 శాతం లేదా 100 శాతం పరిహారం లభిస్తుంది. మైనర్ అయితే 25 శాతం, మేజర్ సమస్య అయితే 100 శాతం పొందొచ్చు. అదే హెచ్డీఎఫ్సీ కార్డియాక్ కేర్లో మూడు వర్గీకరణలు ఉన్నాయి. మూడు రకాల పరిహారాలు పొందొచ్చు. అంటే దీని ప్రకారం ఐసీఐసీఐ ప్లాన్లో కొన్నింటికి 25 శాతమే పరిహారం లభిస్తే, అవే సమస్యలకు హెచ్డీఎఫ్సీ ప్లాన్లో అధిక కవరేజీ లభిస్తోంది. ఇక హెచ్ఢీఎఫ్సీ కార్డియాక్ కేర్లో బెలూన్ వాల్వోటోమీ లేదా వాల్వో ప్లాస్టీ, కరోటిడ్ ఆర్టరీ సర్జరీ, ఇంప్లాంటబుల్ కార్డియో వెర్టెర్ డిఫిబ్రిలాటో, వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైజ్ల ఏర్పాటు సర్జరీ, ఆర్టిఫిషియల్ హార్ట్ ఏర్పాటుకు బీమా మొత్తంలో 50% పరిహారం లభిస్తుంది. ఇక హెచ్డీఎఫ్సీ కార్డియాక్ కేర్లో ఒకే రకమైన సమస్యకు ఒకటికి మించి క్లెయిమ్లకు అవకాశం ఉంది. ఐసీఐసీఐ పాలసీలో అది లేదు. కాకపోతే హెచ్డీఎఫ్సీ కార్డియాక్ కేర్ ప్లాన్లో ఒక ప్రతికూలత ఉంది. పాలసీ పరిధిలో ఉన్న సమస్యల్లో ఏది బయటపడినా, పాలసీదారుడు 30 రోజుల పాటు జీవించి ఉంటేనే పరిహారం లభిస్తుంది. ఐసీఐసీఐ ప్లాన్లో ఇది ఏడు రోజులుగానే ఉంది. పీఎన్బీ మెట్లైఫ్, బిర్లా సన్లైఫ్, అవివాలైఫ్, ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా హార్ట్కేర్ ప్లాన్లను అందిస్తున్నాయి. కాకపోతే వీటితో పోలిస్తే హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ అందిస్తున్న పాలసీలు మరింత సమగ్రమైన కవరేజీతో ఉంటున్నాయి. ప్రీమియం చూస్తే 35ఏళ్ల వ్యక్తి రూ.25 లక్షల కవరేజీని 20 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఏటా రూ.6,213 ప్రీమియం చెల్లించాలి. -
తగ్గింపు ప్రీమియంతో స్టార్ కార్డియాక్ కేర్ పాలసీ
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ తన కార్డియాక్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీని సవరించింది. తగ్గింపు ప్రీమియం రేట్లతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కస్టమర్లు కార్డియాక్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీని వయసు ప్రాతిపదికన 28–40 శాతం తగ్గింపు ప్రీమియంతో పొందొచ్చని కంపెనీ తెలిపింది. స్టార్ హెల్త్ 2013లో మొదటిసారి ఈ పాలసీని మార్కెట్లోకి తెచ్చింది. ఇది తీసుకున్నవారు గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స చేయించుకోవచ్చు. అలాగే బైపాస్ సర్జరీ కవరేజ్ కూడా ఉంది. ఔట్ పేషెంట్ వైద్య ఖర్చులకు, ప్రమాదవశాత్తు మరణానికి వ్యక్తిగత బీమా వంటి సౌలభ్యాలున్నాయి. సవరించిన పాలసీలో అన్ని రకాల డే కేర్ ప్రొసీజర్లు భాగంగా ఉంటాయి. ఇదివరకు 450 డే కేర్ ప్రొసీజర్లకు మాత్రమే పరిమితి ఉండేది. ‘2017–18లో స్టార్ కార్డియాక్ కేర్ పాలసీలో 27%వృద్ధి నమోదయ్యింది. కస్టమర్ల అవసరాన్ని తీర్చే ప్రొడక్టుల అభివృద్ధే మా లక్ష్యం’ అని కంపెనీ సీవోవో ఎస్.ప్రకాశ్ వ్యాఖ్యానించారు. -
క్యాన్సర్ చికిత్సకూ ఉందో పాలసీ..
దేశంలో గుండె జబ్బుల తర్వాత అత్యధికంగా ప్రాణాలు తీస్తున్న వ్యాధి క్యాన్సర్. వయస్సుతో సంబంధం లేకుండా వస్తోంది కూడా. దేశంలో ఏటా 10 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా .. 6 లక్షల మంది మరణిస్తున్నారు. 2035 నాటికి క్యాన్సర్ సోకే వారి సంఖ్య ఏటా 17 లక్షలకు, మరణించే వారి సంఖ్య 12 లక్షలకు చేరుతుందని అంచనా. ప్రధానంగా 30–69 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటోంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించినా కూడా ట్రీట్మెంట్ ఖర్చులు లక్షల్లో ఉంటున్నాయి. రూ.10–12 లక్షలకు పైగా చికిత్స వ్యయం ఉంటోంది. సమగ్రమైన హెల్త్ పాలసీ ఉన్నా.. దాని ద్వారా వచ్చే మొత్తం చాలా సందర్భాల్లో క్యాన్సర్ చికిత్సకు చాలటంలేదు. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఉన్నా.. వ్యాధి తీవ్ర స్థాయికి చేరితే తప్ప ప్రాథమిక స్థాయిల్లో చికిత్సకు దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు. అందుకే ప్రత్యేకంగా క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగపడే బీమా పథకాలు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ప్రీమియం.. ఎక్కువ కవరేజీ.. సాధారణంగా క్యాన్సర్ ఇన్సూరెన్స్ పాలసీలు.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ ఇస్తున్నాయి. 40 ఏళ్ల వ్యవధికి అత్యంత తక్కువగా ఏటా రూ.5,000–6,000 ప్రీమియం ఉంటోంది. సమ్ అష్యూర్డ్, వయస్సు మొదలైన అంశాలను బట్టి ప్రీమియం మారుతుంది. వెయివర్ ఆఫ్ ప్రీమియం, ఆదాయ ప్రయోజనం తదితర ఫీచర్లుంటాయి. ఉదాహరణకు 30 ఏళ్ల పురుషుడు 70 ఏళ్ల మెచ్యూరిటీ ఏజ్తో.. రూ. 25 లక్షల సమ్ అష్యూర్డ్ పొందేందుకు ఏటా రూ.8,231 చెల్లించాలి. సాధారణంగా క్లెయిమ్ చేయని ప్రతి సంవత్సరానికి.. సమ్ అష్యూర్డ్ మొత్తం 10–15 శాతం మేర పెరుగుతుంది. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి పాలసీ మొత్తాన్ని దశలవారీగా పొందవచ్చు. ఉదాహరణకు.. పాలసీదారు క్యాన్సర్ బారిన పడినట్లు వైద్య పరీక్షల్లో తేలిన వెంటనే.. సమ్ అష్యూర్డ్లో 25 శాతం మొత్తాన్ని వారి ఖాతాలో జమచేస్తారు. ప్రాథమికంగా ఎదురయ్యే అడ్మిషన్ ఫీజు మొదలైన ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇతర శరీర భాగాలకు క్యాన్సర్ సోకిందని తేలిన పక్షంలో ఒకో భాగానికి సమ్ అష్యూర్డ్లో 20 శాతం మొత్తాన్ని చెల్లిస్తారు. అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటే కొన్ని ప్లాన్స్ 100 శాతం సమ్ అష్యూర్డ్ చెల్లించడంతో పాటు.. కొన్నాళ్ల ఆదాయం కింద సమ్ అష్యూర్డ్లో మరో పది శాతం మొత్తాన్ని అదనంగా కూడా అందిస్తున్నాయి. ప్లాన్ తీసుకోవడం ఇలా .. ఇతరత్రా బీమా పాలసీ మాదిరే ఆన్లైన్, ఆఫ్లైన్ రెండిట్లో ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రపోజల్ ఫారంలో ఇచ్చిన వివరాల ఆధారంగా, వైద్య పరీక్షలేవీ లేకుండానే ప్రస్తుతం చాలా కంపెనీలు ఈ పాలసీని జారీ చేస్తున్నాయి. అయితే, ఆరోగ్యానికి సంబంధించి ఏదీ దాచిపెట్టకుండా ఫారంలో వెల్లడించాలి. దీనివల్ల క్లెయిమ్ సమయంలో ఇబ్బందులుండవు. -
టర్మ్ బీమా పాలసీని ఎలా ఎంచుకోవాలి ?
నా వయస్సు 47 సంవత్సరాలు. నాకు నెలకు రూ.40,000 జీతం వస్తోంది. నాకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నేను ఇంత వరకూ ఎలాంటి బీమా పాలసీ తీసుకోలేదు. నేను ఎంత మొత్తానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ? నాకు తగిన టర్మ్ బీమా పాలసీని సూచించండి. – శేఖర్, హైదరాబాద్ సాధారణంగా ఒక వ్యక్తి పదేళ్ల ఆదాయానికి సరిపడా కవరేజ్ ఉన్న బీమా తీసుకోవాలని బీమా నిపుణులు చెబుతుంటారు. అయితే ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలి అనే విషయం మరికొన్ని ముఖ్యమైన అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. మీ పిల్లల ఉన్నత విద్యావసరాలు. మీపై ఆర్థికంగా ఆధారపడి ఉన్న వ్యక్తుల అవసరాలు. మీ ఇతర బాధ్యతలు, తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఎంత మొత్తానికి బీమా పాలసీ తీసుకోవాలో మీరు నిర్ణయించుకోండి. ఇక మంచి టర్మ్ బీమా పాలసీ తీసుకోవడానికి మూడు అంశాలు ముఖ్యమైనవి. మొదటిది క్లెయిమ్స్ సెటిల్మెంట్ రేషియో..బీమా సంస్థ పరిష్కరించిన క్లెయిమ్స్ను బీమా సంస్థకు అందిన మొత్తం క్లెయిమ్స్తో భాగిస్తే వచ్చేదే క్లెయిమ్స్ సెటిల్మెంట్ రేషియో. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అందుకని అత్యధిక క్లెయిమ్స్ సెటిల్మెంట్ రేషియో ఉన్న కంపెనీ బీమా పాలసీను తీసుకోవడం ఉత్తమం. ఇక రెండో కీలకమైన అంశం.. చెల్లించాల్సిన ప్రీమియమ్..టర్మ్ బీమా అనేది తక్కువ వ్యయాలున్న సమర్థవంతమైన పాలసీ. అయితే కంపెనీ, కంపెనీకి ప్రీమియమ్ విషయంలో తేడాలు బాగానే ఉంటాయి. తక్కువ ప్రీమియమ్ ఉన్న పాలసీనే తీసుకోండి. ఇక టర్మ్ పాలసీ తీసుకునే విషయంలో ముఖ్యమైన మూడో అంశం.. రైడర్స్... బీమా పాలసీతో పాటు కొన్ని రైడర్స్ను కూడా తీసుకుంటే అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. బీమా కవరేజ్ను కూడా మెరుగుపరచుకోవచ్చు. రైడర్స్కు కొంత అదనపు ప్రీమియమ్ చెల్లించాల్సి ఉంటుంది. అనుకోని, ఊహించని విషాదాలు ఎదురైన పక్షంలో ఈ రైడర్స్ మీకు తగిన రక్షణను ఇవ్వగలవు. మీది తరచుగా ప్రయాణాలు చేసే ఉద్యోగమైతే, యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్ను తీసుకోవాలి. ఇలాంటి రైడర్స్ చాలా ఉన్నాయి. అన్నింటినీ కాకుండా మీకు తగిన రైడర్స్ను ఎంచుకుంటే మంచిది. వివిధ బీమా సంస్థల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, ప్రీమియమ్ తదితర అంశాలను ఇప్పుడు ఆన్లైన్లో సులభంగా పోల్చిచూసుకోవచ్చు. ఇలా పోల్చి చూసుకుని, ఎక్కువ క్లెయిమ్స్ సెటిల్మెంట్ రేషియో, తక్కువ ప్రీమియమ్ ఉన్న పాలసీని ఎంచుకోండి. ఇటీవల లాంగ్టర్మ్ డెట్ ఫండ్స్ సరైన రాబడులనివ్వడం లేదు. డెట్ ఫండ్స్లో ఉన్న నా ఇన్వెస్ట్మెంట్స్ను వెనక్కి తీసుకుందామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? – ప్రశాంత్, విశాఖపట్టణం ఇటీవల కాలంలో లాంగ్టర్మ్ డెట్ ఫండ్స్ సరైన రాబడులనివ్వని మాట కరెక్టే. రాబడులు సరిగ్గా లేని కారణంగా ఈ డెట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ను వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయమే. మీరు స్థిర ఆదాయ ఇన్వెస్టర్అయిన పక్షంలోనే ఇది సరైన నిర్ణయం. ఈ తరహా ఇన్వెస్ట్మెంట్స్కు నష్ట భయం చాలా తక్కువగా ఉంటుంది. వడ్డీరేట్లు తగ్గితే ఇవి మంచి రాబడులనిస్తాయి. లాంగ్టర్మ్ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ను 2–3 సంవత్సరాల పాటు కొనసాగిస్తే, మంచి రాబడులే పొందవచ్చు. ఇటీవల కాలంలో ఇవి సరైన రాబడులు ఇవ్వని మాట వాస్తవమే అయినప్పటికీ, వీటి పనితీరు మరీ తీసికట్టుగా ఏమీ లేదు. అయితే రెండు నుంచి మూడేళ్లు వేచి చూడగలిగితే, మీకు మంచి రాబడులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఇంత గందరగోళం వద్దనుకుంటే, స్వల్పకాలిక డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఫండ్స్ 8.5 శాతం రాబడులనిచ్చే అవకాశాలున్నాయి. మ్యూచువల్ ఫండ్ సంస్థలు వ్యయాలను నెట్ అసెట్ వేల్యూ(ఎన్ఏవీ) నుంచే తగ్గిస్తాయా ? ఇది ఎలా ఉంటుంది? రోజువారీగా ఉంటుందా? నెలవారీగా ఉంటుందా ? – స్రవంతి, విజయవాడ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఫండ్ నిర్వహణ వ్యయాలన్నింటీనీ ఎన్ఏవీ(నెట్ అసెట్ వేల్యూ) నుంచే తగ్గిస్తాయి. ఇది ఏ రోజుకారోజే జరుగుతుంది. ప్రతి రోజూ కొత్త ఇన్వెస్టర్లు ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మరికొంత మంది ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్మెంట్స్ను వెనక్కి తీసుకుంటారు. ఇది ప్రతి రోజూ జరుగుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రతి రోజూ తమ వ్యయాలను ఎన్ఏవీ నుంచే తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇన్వెస్టర్లు ఎన్ఏవీ ఆధారంగానే సదరు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడం కానీ, విక్రయించడం కానీ చేస్తారు. నేను నెలకు కొంత మొత్తాన్ని ఒక మ్యూచువల్ ఫండ్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వచ్చే నెల నుంచి నా జీతం పెరుగుతోంది. సిప్ మొత్తాన్ని కూడా పెంచుదామనుకుంటున్నాను. అలా చేయమంటారా ? లేక అదే ఫండ్లో కొత్త సిప్ను ప్రారంభించమంటారా? – ఆంటోని, ఈ మెయిల్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. జీతం పెరిగినప్పుడల్లానో, రెండు, మూడు సంవత్సరాలకొకసారి సిప్ మొత్తాన్ని పెంచితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఇక మీ విషయంలో మీరు మీ సిప్ మొత్తాన్ని పెంచుకోవచ్చు. లేదా కొత్త సిప్ను ప్రారంభించవచ్చు. మీరు ఎలా చేసిన ఒకటే. సాంకేతికంగా చూసినా ఎలాంటి తేడా ఉండదు. ఎలా చేసినా పన్ను భారం ఒకే విధంగా ఉంటుంది. - ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రూ.3 లక్షలు ఎర..రూ.59 లక్షలు స్వాహా!
సాక్షి, సిటీబ్యూరో: మీరు చేసిన ఓ ఇన్సూరెన్స్ పాలసీ మీద రూ.3 లక్షల బోనస్ వచ్చిందంటూ మీకు ఓ ఫోన్ కాల్ వచ్చిందనుకుందాం... ఆ మొత్తం క్లైమ్ చేసుకోవడానికి కొంత డిపాజిట్ చేయమని చెప్పారనుకోండి... గరిష్టంగా మీరు ఎంత కడతారు... ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చెల్లించే మొత్తం రూ.లక్షకు మించనీయరు. అయితే నగరానికి చెందిన ఓ రిటైర్డ్ రైల్వే అధికారి మాత్రం ఏకంగా రూ.59 లక్షలు చెల్లించేలా చేశారు సైబర్ నేరగాళ్ళు. ఓ పక్క మాటల గారడీతో పాటు మరోపక్క కట్టింది మొత్తం రిఫండ్ వస్తుందంటూ చెప్పిన ఆన్లైన్ కేటుగాళ్లు భారీ మొత్తం స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కస్టమర్ ఐడీ అంటూ... దక్షిణ మధ్య రైల్వేలో పని చేసి పదవీ విరమణ చేసిన ఓ అధికారి ప్రస్తుతం బొగ్గులకుంటలో నివసిస్తున్నారు. ఈయనకు 2015 జనవరిలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్కాల్ వచ్చింది. గౌరవ్ ఖన్నా అంటూ పరిచయం చేసుకున్న అతను మీ ఇన్సూరెన్స్ పాలసీపై రూ.2,83,683 బోనస్ వచ్చిందని, ఇది త్వరలోనే రద్దయ్యే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పాడు. అలా కాకుండా ఉండాలంటే ప్రాథమికంగా రూ.72 వేలు చెల్లించి కస్టమర్ ఐడీ పొందాలంటూ సూచించాడు. ఇతడి మాటలు నమ్మిన రిటైర్డ్ ఉద్యోగి ఘజియాబాద్లో ఉన్న బ్యాంకు ఖాతాలోకి ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేశారు. ఆపై ‘లైన్లోకి’ వచ్చిన అశోక్ గుప్త అనే వ్యక్తి ఫొటో, పాన్కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు ఈ–మెయిల్ ద్వారా పంపమని బాధితుడిని కోరాడు. అంతకు ముందు ఓ రూ.10,417 ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడంతో బాధితుడు అలానే చేశాడు. రిఫండ్ వస్తాయంటూ నమ్మించి... వీరిద్దరి తర్వాత ఆ ముఠాకు చెందిన అనేక మంది మోసగాళ్ళు, వివిధ విభాగాల పేర్లతో బాధితుడికి ఫోన్ చేశారు. ఆదాయపుపన్ను శాఖ నుంచి అంటూ దినేష్కార్ల, దిషబ్ త్యాగి, రియ అంటూ ముగ్గురు నామినేషన్ పేర్ల కోసమని, ఐబీఏ నుంచి నిరంజన్ అగర్వాల్ పేరుతో స్టాంప్ డ్యూటీ కోసమని, గవర్నమెంట్ బాడీ ఆఫ్ ఇన్సూరెన్స్ నుంచి అమిత్ కె.మిశ్రా అని బాధితుడితో మాట్లాడారు. ఒక్కొక్కరూ ఒక్కో పన్ను, చార్జీల పేరు చెప్పి మొత్తం రూ.40 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించారు. కొంత మొత్తం చెల్లించిన తర్వాత బాధితుడు సందేహించగా... ఇవన్నీ రిఫండబుల్ చార్జెస్ అని, ఇన్సూరెన్స్ బోనస్తో పాటు ప్రతి పైసా తిరిగి వస్తుందంటూ డబ్బు కట్టించారు. 2016 ఆగస్టులో ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నానంటూ ఆర్కే దుగ్గల్గా చెప్పుకున్న వ్యక్తి నుంచి బాధితుడికి ఫోన్ వచ్చింది. మీకు సంబంధించిన భారీ మొత్తం తమ వద్ద పెండింగ్లో ఉందని చెప్పాడు. రూ.45 లక్షలు ఇస్తామంటూ మరికొంత... అదే ఏడాది అక్టోబర్లో సుచిత్ర పటేల్ అనే మహిళ నుంచి బాధితుడికి ఫోన్ వచ్చింది. మీరు ఇప్పటి వరకు చెల్లించిన డబ్బు, ఇన్సూరెన్స్పై బోనస్తో కలిపి మొత్తం రూ.45 లక్షలు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పింది. ఇందుకుగాను తుది చెల్లింపుగా రూ.82 వేలు ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఇది జరిగిన తర్వాత బాధితుడు కొన్నాళ్ళ పాటు అమెరికాలో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత సైతం సుచిత్ర వదిలిపెట్టలేదు. ఆమెతో పాటు ఆమె సహాయకుడిగా చెప్పుకున్న ప్రాకాష్ భన్సాల్ ఫోన్లు చేసి బాధితుడితో మాట్లాడి అతడి నుంచి మరో రూ.3.75 లక్షలు స్వాహా చేశారు. ఇలా వివిధ దఫాల్లో రూ.59 లక్షల వరకు పోగొట్టుకున్న బాధితుడు కొన్నాళ్ళ పాటు మోసగాళ్ళ నుంచి డబ్బు వస్తుందనే ఆశతో గడిపాడు. చివరకు మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ బి.రమేష్ దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా నిందితులు వాడిన సెల్ఫోన్ నెంబర్లు, బాధితుడు డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంక్ ఖాతాల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. ఉత్తరాదికి చెందిన ఈ గ్యాంగ్ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. -
వాళ్లు చెప్పరు! మీరే అడగాలి!
‘‘ప్రీమియం చాలా తక్కువ. 10 ఏళ్లు కడితే చాలు. చక్కని నిధి చేతికందుతుంది. పన్ను ఆదా చేసుకోవచ్చు...’’ ఇవీ చాలా మంది బీమా ఏజెంట్లు చెప్పే మాటలు. ఏజెంట్ల ద్వారా బీమా తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి మాటలు వినే ఉంటారు. ఎందుకంటే సంప్రదాయ బీమా పాలసీలను విక్రయించటానికి ఏజెంట్లు ఇలా తియ్యటి మాటలు చెప్పటం సర్వసాధారణం. ఎన్నెన్నో గణాంకాలు కూడా వినిపిస్తుంటారు. కాకపోతే కొన్ని గణాంకాలను కావాలనే దాచిపెడతారు. వారు చెప్పిన విషయాలన్నీ కరెక్టే కావచ్చు!! కానీ కావాలని చెప్పనివి కూడా కొన్ని విషయాలుంటాయి. అలాంటివన్నీ స్వయంగా తెలుసుకోవాల్సిందే. అప్పుడే బీమా పాలసీ సరైనదో, కాదో తెలుసుకుని ఒక నిర్ణయానికి రాగలం. అందుకే... పాలసీ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటో తెలియజేసేదే ఈ కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం బీమా కంపెనీల వ్యాపారంలో అత్యంత కీలకమైనవి ఎండోమెంట్ పాలసీలే. ఇక యూనిట్ లింక్డ్ పాలసీలు (యులిప్), పొదుపుతో కూడిన బీమా రక్షణ పథకాలు సంప్రదాయ పాలసీల్లో భాగంగా ఉంటాయి. ఈ సంప్రదాయ పాలసీల్లోనే పార్టిసిపేటింగ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్లు ఉంటాయి. పార్టిసిపేటింగ్ ప్లాన్లలో పాలసీదారులు బీమా కంపెనీ చేసిన పెట్టుబడులపై వచ్చిన లాభాలను పొందుతారు. బోనస్ రూపంలో కంపెనీలు దీన్ని పంచుతాయి. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్లలో కచ్చితమైన హామీతో కూడిన రాబడులుంటాయి. నిజానికి సంప్రదాయ పాలసీల్లో రిస్క్ కవరేజీ చాలా తక్కువ. జీవితానికి తగిన రక్షణ కావాలని అనుకునేవారికి ఇవి తగినవి కానే కావు. వీటికి కట్టే ప్రీమియానికి మహా అయితే 10 రెట్ల బీమా రక్షణ లభిస్తుంది. ఇలా కాకుండా కేవలం బీమా రక్షణే కోరుకుంటే (టర్మ్పాలసీ) తక్కువ ప్రీమియానికి మెరుగైన బీమా రక్షణ లభిస్తుంది. సంప్రదాయ పాలసీల విషయంలో పాలసీ పత్రాలపై సంతకం చేసే ముందు తెలుసుకోవాల్సినవి ఇవే. ఛార్జీలు ఎంతో తెలుసా? సంప్రదాయ పాలసీల్లో ప్రీమియం అలోకేషన్ చార్జీ గురించి పాలసీదారులకు తెలిసింది తక్కువే. అలాగే, పరిపాలనా వ్యయాలు, మోర్టాలిటీ చార్జీలు కూడా గోప్యంగానే ఉంచుతారు. స్థూల, నికర రాబడులను బెనిఫిట్ ఇలస్ట్రేషన్ (బీఐ) నుంచి వేరు చేస్తే ఎక్స్పెన్స్ రేషియో ఎంత అనేది అర్థం చేసుకోవచ్చు. ఏజెంట్లు సరెండర్ చార్జీల గురించి అస్సలు ప్రస్తావించరు. సంప్రదాయ పాలసీల్లో సరెండర్ (పాలసీ వద్దని వెనక్కి ఇచ్చేయడం) చార్జీలు చాలా ఎక్కువ. పాలసీ తీసుకున్న తర్వాత తొలినాళ్లలో చెల్లించిన ప్రీమియంలో 70 శాతం వరకూ నష్టపోవాల్సి వస్తుంది. కాల వ్యవధి ముగింపుకు దగ్గర్లో సరెండర్ చేస్తే తక్కువ మొత్తంలో కోల్పోవాల్సి ఉంటుంది. పాలసీ పత్రాల్లో సరెండర్ చార్జీల ప్రస్తావన ఉంటుంది. కానీ, ఏజెంట్లు ఈ విషయాల గురించి దాదాపుగా చెప్పరు. బోనస్ గురించి తెలుసుకోవాలి... పార్టిసిపేటింగ్ ప్లాన్లలో బోనస్ గ్యారంటీగా వస్తుందని ఏజెంట్లు చెప్పే మాటల్ని నమ్మొద్దు. నిజానికి బోనస్ రూపంలో వచ్చే రాబడి ఒక శాతం ఐఆర్ఆర్ మాత్రమే. బీమా కంపెనీలు పార్టిసిపేటింగ్ ప్లాన్లలో తమ పెట్టుబడి నిధి వృద్ధి చెందితేనే బోనస్ను ప్రకటించాలి. కనుక పెట్టుబడులపై రాబడులు వచ్చిన సంవత్సరాల్లోనే బోనస్ వస్తుందని ఆశించొచ్చు. అలాగే, రాబడుల ఆధారంగా ఈ బోనస్ రేటు కూడా ఏటేటా మారిపోవచ్చు. బోనస్ రేటు అన్నది వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. పార్టిసిపేటింగ్ ప్లాన్లలో అధిక శాతం రాబడులను డెట్ విభాగంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బీమా కంపెనీల బోనస్ రేటు కూడా తగ్గుతోంది. 2014లో ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులు 9 శాతంగా ఉంటే, ప్రస్తుతం అవి 6.8 శాతంగా ఉన్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సేవింగ్స్ సురక్షా పార్టిసిపేటింగ్ ప్లాన్లో 2014లో 2.25 శాతంగా ఉన్న బోనస్ రేటు 2017లో 1.75 శాతానికి తగ్గింది. సమ్ అష్యూర్డ్లో నిర్ణీత శాతం చొప్పున బోనస్ను బీమా కంపెనీలు ప్రకటిస్తుంటాయి. సాధారణంగా రెండు రకాల బోనస్లుంటాయి. రివర్షనరీ బోనస్ అనేది ఏటా బీమా కంపెనీ ప్రకటిస్తుంది. టెర్మినల్ బోనస్ మరొకటి. పాలసీని సరెండర్ చేసినా లేక కాల వ్యవధి తీరినా, పాలసీదారుడు మరణించిన సమయాల్లో చెల్లించేది టెర్మినల్ బోనస్. పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత సమ్ అష్యూర్డ్తో పాటు, జీఏ, రివర్షనరీ బోనస్, టెర్మినల్ బోనస్ చెల్లించడం జరుగుతుంది. అసలైన రాబడి ఎంత? సంప్రదాయ పాలసీల గురించి ఏజెంట్లు చెప్పే గొప్పల్లో ముఖ్యమైంది చెల్లించిన ప్రీమియం రెట్టింపు అవుతుందని. కానీ, ఇందులో వాస్తవం వేరు. నిజానికి చాలా వరకు నాన్ పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ పాలసీలపై నికర రాబడులు 4– 5 శాతం మధ్యే ఉంటాయి. మరే ఇతర సంప్రదాయ పథకంలోనూ ఇంత తక్కువ రాబడులుండవు. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ లైఫ్ సంచయ్ అనేది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. 45 సంవత్సరాల వ్యక్తి ఏటా రూ.1.50 లక్షల చొప్పున పదేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే 20వ సంవత్సరం ముగింపులో రూ.28 లక్షలు చేతికి అందుతాయి. ఇందులో వాస్తవ రాబడి 4 శాతమే. మెచ్యూరిటీ తీరిన తర్వాత చేతికందే మొత్తం గురించే చెబుతుంటారు కానీ... ఏటా ప్రీమియం రూపంలో ఎంతమేర చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని వివరంగా చెప్పరు. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (అంతర్గత రాబడి రేటు) అన్నది ఎండోమెంట్ పాలసీల్లో వాస్తవ రాబడులు తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది. ఇందుకు సంబంధించి ఆన్లైన్లో ఎన్నో కాలిక్కులేటర్స్ అందుబాటులో ఉన్నాయి. రాబడిపై చెప్పేవన్నీ గొప్పలే... పొదుపుతో కూడిన బీమా పథకాల్లో ఇన్వెస్టర్లను ఆకర్షించేది గడువు తీరాక వచ్చే రాబడులే. పార్టిసిపేటింగ్, నాన్ పార్టిసిపేటింగ్ పథకాల్లో పాలసీ డాక్యుమెంట్లో భాగంగా బెనిఫిట్ ఇలస్ట్రేషన్ (బీఐ) కూడా ఉంటుంది. అంటే పాలసీదారుడు మరణిస్తే తన నామినీకి ఎంత మొత్తం అందుతుంది... లేక జీవించి ఉంటే గడువు తీరిన తర్వాత ఏ మేర ప్రయోజనం అందుతుంది... వంటి వివరాలు అందులో ఉంటాయి. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్లలో మెచ్యూరిటీ బెనిఫిట్ అన్నది పూర్తిగా హామీతో కూడినది. పెట్టుబడుల విలువ కాల వ్యవధి ముగింపు నాటికి ఎంతకు చేరుతుందన్న వివరాలు బీఐలో ఉంటాయి. పార్టిసిపేటింగ్ ప్లాన్ల విషయంలో బీమా కంపెనీ 4 శాతం రాబడుల ప్రకారం అయితే ఎంతొస్తుంది, 8 శాతం రాబడులు అయితే ఎంత లభిస్తుందన్న రెండు రకాల అంచనాలను వివరిస్తుంది. అయితే, ఈ గణాంకాలను చూసి అంత మేర వస్తాయని నిశ్చయమైపోవటం కరెక్టు కాదు. ఇవి కేవలం అంచనాలే కానీ, బీమా కంపెనీ ఇస్తున్న హామీతో కూడిన రాబడులు మాత్రం కాదు. జీవన్ సరళ్ కూడా అలాంటిదే... ఇలా గొప్పలు చెప్పిన పాలసీల్లో ఎల్ఐసీకి చెందిన జీవన్ సరళ్ను కూడా ఉదహరించొచ్చు. ఇది ఆరంభమైన సమయంలో ఏజెంట్లు చెప్పిన గొప్పలు అన్నీ ఇన్నీ కావు. అప్పటి స్టాక్ మార్కెట్ రాబడులను ఉదహరిస్తూ కొందరైతే ఏకంగా 12–15 శాతం వార్షిక రాబడులను అంచనా వేసి పాలసీలు కట్టించారు. కట్టే వార్షిక ప్రీమియానికి ఏకంగా పాతిక రెట్ల బీమా రక్షణ లభిస్తుందని, వార్షిక రాబడులు భారీగా ఉంటాయి కనుక పదేళ్లు కడితే విపరీతమైన లాభాలొస్తాయని చెప్పారు. నిజానికి ఈ పాలసీలో రాబడులనేవి పదేళ్ల తరవాతే మొదలవుతాయనే విషయాన్ని మాత్రం చాలా మంది పాలసీదారులు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే పాలసీ ఆరంభమై ఇప్పటికి తొమ్మిదేళ్లు కావస్తుండగా... చాలామంది దీన్ని సరెండర్ చేసేశారు. చిత్రమేంటంటే 8 ఏళ్లు ప్రీమియం కట్టి సరెండర్ చేసిన వారికి కూడా... కనీసం వారు చెల్లించిన మొత్తం చేతికి రాలేదు. పదేళ్లు పూర్తయితే అప్పటిదాకా కట్టిన మొత్తం ప్రీమియంపై ఓ 4–5 శాతం రాబడి రావచ్చనేది ప్రస్తుతం ఉన్న అంచనా. నిజానికి ఈ తొమ్మిదేళ్లు ప్రీమియం కట్టిన వారు అప్పట్లోనే బీమా రక్షణ కోసం టర్మ్ పాలసీ తీసుకుని ఉంటే... కట్టే ప్రీమియంలో 10 శాతానికే ఈ పాలసీ ఇచ్చినంత రక్షణ ఆ పాలసీ కూడా ఇచ్చేది. మిగతా 90 శాతం సొమ్మును బ్యాంకు ఆర్డీ, మ్యూచ్వల్ పండ్స్ ఇలా దేన్లో ఇన్వెస్ట్ చేసినా ఆ సొమ్ము రెట్టింపు అయ్యేది. ఇవన్నీ అర్థం చేసుకునేనేమో!! చాలామంది ఇప్పటికే ఈ పాలసీని సరెండర్ చేసేశారు. ధీరేంద్రకుమార్ వంటి నిపుణులు సైతం దీన్ని రాబడుల విషయంలో పూర్తి సందిగ్ధత ఉన్న పాలసీగా పేర్కొన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వ్యయాలు తెలుసుకునేందుకే బీఐ! పైన చెప్పిన ఉదాహరణ బట్టి చూసినా... వాస్తవ రాబడులన్నవి అంచనాలపై కాకుండా బీమా కంపెనీ పెట్టుబడులపైనే ఆధారపడి ఉంటాయని తెలుసుకోవాలి. పార్టిసిపేటింగ్ ప్లాన్లలో కచ్చితంగా ఎంతొస్తుందన్నది ముందుగా చెప్పలేం. బీమా కంపెనీలు తమ పెట్టుబడులపై వచ్చే రాబడి ఆధారంగా వార్షికంగా బోనస్ను ప్రకటిస్తాయి. దీన్ని బట్టే రాబడులుంటాయి. కాకపోతే పార్టిసిపేటింగ్ ప్లాన్లలో వ్యయాలు తెలుసుకునేందుకు బీఐ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు 8 శాతం రాబడుల అంచనాల పాలసీలో ఐఆర్ఆర్ అన్నది 5 శాతంగా ఉంటుంది. అంటే మూడు శాతం వ్యయాల రూపంలో పోతుంది. దీన్నే ఎక్స్పెన్స్ రేషియోగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాబడులు పరిమితమే... సంప్రదాయ పాలసీలు అధిక రాబడులను ఇవ్వలేవు. ఎందుకంటే అవి డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఐఆర్డీఏ నిబంధనల ప్రకారం బీమా కంపెనీలు తమ ఆస్తుల్లో సగం మేర ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా ప్రభుత్వ ఆమోదిత సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. 15 శాతాన్ని ఆమోదిత హౌసింగ్, ఇన్ఫ్రా బాండ్లలో పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన 35 శాతమే ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉంది. కాబట్టి వీటికి రాబడులు పరిమితంగానే ఉంటాయన్నది గుర్తించాలి. -
ఎన్నారైలు ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
మా భార్యాభర్తలకు కలిపి టర్మ్ బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. పెద్ద మొత్తంలో టర్మ్ బీమా పాలసీ తీసుకునేటప్పుడు రెండు వేర్వేరు కంపెనీల నుంచి తీసుకోవాలని గతంలో మీరు సూచించారు కదా ! దీనిని దృష్టిలో పెట్టుకొని ఎల్ఐసీ నుంచి రూ.50 లక్షలకు, మరో సంస్థ నుంచి రూ.కోటికి టర్మ్ పాలసీలు తీసుకోవాలనుకుంటున్నాను. యాక్సిడెంటల్ డిజేబిలిటీ ఫీచర్ ఉన్న పాలసీను సూచించండి. శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే, నెలవారీ ఆదాయం వచ్చేలా ఉండే పాలసీ వివరాలు తెలపండి – కార్తీక్, విశాఖపట్టణం మీరు పెద్ద మొత్తంలో టర్మ్ బీమా పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు.. రెండు వేర్వేరు కంపెనీల నుంచి పాలసీలు తీసుకోవడం సరైన నిర్ణయం. ఇలా తీసుకుంటే, రిస్క్ను డైవర్సిఫై చేసినట్లు అవుతుంది. శాశ్వత, పాక్షిక అంగవైకల్యం(పర్మనెంట్, పార్షియల్ డిజేబిలిటీ) రైడర్లు ఉన్న పాలసీలు తీసుకుంటే మంచిదే. ఈ తరహా పాలసీలు తీసుకుంటే, తర్వాతి 5–10 ఏళ్ల కాలానికి మీరు తీసుకున్న బీమాలో కొంత శాతంగా బీమా సంస్థ నుంచి చెల్లింపులు వస్తాయి. యాక్సిడెంట్లు కారణంగా అంగవైకల్యం ఏర్పడితేనే ఇది వర్తిస్తుందని గుర్తుంచుకోండి. ఈ రైడర్లకు సంబంధించి సదరు బీమా సంస్థ అందించే సూచనలను క్షుణ్నంగా చదివి అర్థం చేసుకోండి. వివిధ బీమా సంస్థల క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్ను, ప్రీమియమ్లను పోల్చి చూసుకొని ఏ సంస్థ టర్మ్ పాలసీలు తీసుకోవాలో నిర్ణయం తీసుకోండి. ఇతర సంస్థలతో పోల్చితే ఎల్ఐసీ ప్రీమియమ్ ఒకింత ఎక్కువగానే ఉంటుంది. ఇక మీరు.. ఏగాన్ రెలిగేర్ ఐటెర్మ్ ప్లాన్, మ్యాక్స్ లైఫ్ ఆన్లైన్ టర్మ్ ప్లాన్, హెచ్డీఎఫ్సీ లైప్ క్లిక్2ప్రొటెక్ట్.. టర్మ్ పాలసీలను పరిశీలించవచ్చు. వీటిని ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. మీ వయస్సు పరంగా ఈ పాలసీలు వసూలు చేసే ప్రీమియమ్లను పరిశీలించి మీ బడ్జెట్కు తగ్గట్టుగా ఉండే, పాలసీని ఎంచుకోండి. ప్రపోజల్ ఫార్మ్ నింపేటప్పుడు అన్ని వివరాలు ఇవ్వండి. ఇలా చేస్తే, పాలసీ క్లెయిమ్ చేసుకోవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి గందరగోళం తలెత్తదు. నేను కొంత కాలం క్రితం విదేశాలకు వెళ్లాను. నేను ఇప్పుడు ప్రవాస భారతీయుడిని కాబట్టి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయలేనని నా మిత్రులంటున్నారు. ఇది కరెక్టేనా ? కానీ నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను నా పేరు మీద ఇన్వెస్ట్ చేయలేకపోతే, దీనికి ప్రత్యామ్నాయంగా కొంత సొమ్మును నా తల్లిదండ్రుల ఖాతాకు బదిలీ చేసి, వారి ట్రేడింగ్ ఖాతా ద్వారా మ్యూచువల్ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? –ప్రభాకర్, విజయవాడ మీ మిత్రులు చెప్పింది తప్పు. మీరు విదేశాల్లో ఉన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీకు ప్రవాస భారతీయుడి(ఎన్ఆర్ఐ–నాన్ రెసిడెంట్ ఇండియన్) హోదా ఉన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అమెరికా, కెనడాల్లో ఉండే ఎన్నారైల ఇన్వెస్ట్మెంట్స్ స్వీకరించడం లేదు. మీరు విదేశాల్లో ఉండి, ఇక్కడి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు. ముందుగా మీ కేవైసీ(నో యువర్ క్లయింట్) వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మీ నివాస హోదాను ఎన్నారైగా మార్చాల్సి ఉంటుంది. ఒక ఎన్నారైగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో రీపాట్రియబుల్ ప్రాతిపదికన గానీ, నాన్–రీపాట్రియబుల్ ప్రాతిపదికన గానీ ఇన్వెస్ట్ చేయవచ్చు. రీపాట్రియబుల్ప్రాతిపదికన ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. భారత్లో ఏదైనా బ్యాంక్లో మీకు ఎన్ఆర్ఈ(నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్) ఖాతా తప్పకుండా ఉండాలి. మీ ఎన్ఆర్ఈ ఖాతా నుంచి మీ ఇన్వెస్ట్మెంట్స్ రెమిట్ చేయబడుతాయి. మీరు నాన్ రీపాట్రియబుల్ ప్రాతిపదికన ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మీరు ఎన్ఆర్ఓ(నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) ఖాతాను ఉపయోగించాల్సి ఉంటుంది. ఫ్రీ–లుక్ పీరియడ్ అంటే ఏమిటి? ఈ పీరియడ్లో మనం తీసుకున్న పాలసీలను రద్దు చేసుకోవచ్చా? –సంతోష్, హైదరాబాద్ మీరు ఒక షాపుకు వెళ్లి ఒక వస్తువు కొనుగోలు చేశారు. ఆ వస్తువు మీకు నచ్చకపోతే కొన్ని రోజుల తర్వాతైనా దానిని తిరగి ఇచ్చేయ్యమని దుకాణదారు ఆఫర్ చేశారనుకోండి. మీకు ఆ వస్తువు నచ్చితే దానిని వాడుకుంటారు. ఒక వేళ నచ్చకపోతే మూడు, లేదా నాలుగు రోజుల తర్వాత దానిని దుకాణదారుడికి వాపస్ చేస్తారు. ఫ్రీ–లుక్ పీరియడ్ కూడా అలాంటిదే. మీరు ఒక బీమా పాలసీ తీసుకున్నారనుకోండి. పాలసీ డాక్యుమెంట్ మీకు అందిన తర్వాత, ఆ పాలసీ మీ అవసరాలకు అనుగుణంగా లేకపోతేనో, లేదా మీకు నచ్చని అంశాలు దాంట్లో ఉంటేనో, మీరు ఆ పాలసీ నుంచి వైదొలగవచ్చు. వస్తువులు రిటర్న్ తీసుకోవడం దుకాణదారుడిని బట్టి ఉంటుంది. కానీ పాలసీలకు ఈ ఫ్రీ–లుక్ పీరియడ్ తప్పనిసరి. సాధారణంగా ఈ ఫ్రీ–లుక్ పీరియడ్ 15 రోజులు ఉంటుంది. ఈ ఫ్రీ–లుక్ పీరియడ్లో మీరు తీసుకునే పాలసీని మరోసారి సమీక్షించుకునే అవకాశం మీకు ఉంటుంది. పాలసీ బాండ్ జారీ చేయడానికి అయిన వ్యయాలు, ఆ ఫ్రీ–లుక్ పీరియడ్కు సంబంధించిన బీమా కవర్కు అయిన వ్యయాలు మినహాయించుకొని మీరు చెల్లించిన ప్రీమియమ్ను సదరు బీమా సంస్థ మీకు వెనక్కి ఇస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వార్షిక కాంట్రాక్టులు అయినప్పటికీ, ఫ్రీ–లుక్ పీరియడ్ మొదటి ఏడాదికే వర్తిస్తుంది. రెన్యూవల్స్కు వర్తించదు. ఇక ఏడాది కంటే తక్కువ కాల వ్యవధి ఉండే పాలసీలకు ఫ్రీ–లుక్ రూల్ వర్తించదు. -
కొటక్ జనరల్.. కొత్త ‘ప్రయాణం’
♦ ప్రయాణ బీమాలోకి విస్తరణ... ♦ ఏడాదిలో ప్రొడక్ట్, పబ్లిక్ ♦ లయబులిటీ ఇన్సూరెన్స్ కూడా.. ♦ 2017 క్యూ1లో రూ.36 కోట్ల వ్యాపారం ♦ దేశంలో రూ.84 కోట్ల వ్యాపారం; తెలంగాణ, ఏపీ వాటా 5 శాతం ♦ కొటక్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, ♦ సీఈఓ మహేశ్ బాలసుబ్రమణియన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొటక్ మహీంద్రా బ్యాంక్కు చెందిన 100 శాతం అనుబంధ సంస్థ కొటక్ జనరల్ ఇన్సూరెన్స్ 2017–18 ఆర్ధిక సంవత్సరంలో ఇతర బీమా విభాగాల్లోకి విస్తరించనుంది. ముందుగా ప్రయాణ బీమా పాలసీలను ఆ తర్వాత ప్రొడక్ట్, పబ్లిక్ లయబులిటీ ఇన్సూరెన్స్, ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ బీమా పాలసీలను ప్రారంభిస్తామని కంపెనీ ఎండీ అండ్ సీఈఓ మహేశ్ బాలసుబ్రమణియన్ చెప్పారు. బుధవారమిక్కడ ‘సాక్షి బిజినెస్’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయనింకా ఏమన్నారంటే.. ఏపీ, తెలంగాణ వాటా 8 శాతం..: 2016–17 ఆర్ధిక సంవత్సరంలో రూ.84 కోట్ల ప్రీమియంలను సమీకరించాం. ఈ ఆర్ధిక సంవత్సరంలో మూడింతల వృద్ధితో రూ.200 కోట్ల ప్రీమియంలను లకి‡్ష్యంచాం. 2017 తొలి త్రైమాసికంలో రూ.36 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. గత ఆర్ధిక సంవత్సరం క్యూ1లో రూ.10.50 కోట్ల వ్యాపారాన్ని చేశాం. మా మొత్తం వ్యాపారంలో మహారాష్ట్ర తర్వాత అతిపెద్ద మార్కెట్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే. ఇక్కడి నుంచి 8 శాతం వ్యాపారం జరుగుతోంది. గతేడాది దేశీయ సాధారణ బీమా పరిశ్రమ 32 శాతం వృద్ధి రేటుతో రూ.1.27 లక్షల కోట్లకు చేరింది. ఏడాదిలో 10 సంస్థలతో ఒప్పందం.. ప్రస్తుతం వాహన, ఆరోగ్య, గృహ విభాగాల పాలసీలందిస్తున్నాం. దేశవ్యాప్తంగా 1.75 లక్షల పాలసీలుండగా.. రెండేళ్లలో మూడింతల వృద్ధితో 3 లక్షల పాలసీలను లకి‡్ష్యంచాం. ఆన్లైన్లో పాలసీల కొనుగోళ్ల వాటా 20 శాతం వరకూ వుంటుంది. కొటక్ బ్యాంక్ కస్టమర్లే కాకుండా డిస్ట్రిబ్యూటర్లు, ప్రైవేట్ సంస్థలు, ఇతర బ్యాంకుల నుంచి కూడా మాకు కస్టమర్లున్నారు. వీరి వాటా 35 శాతం వుంటుంది. చెన్నైకు చెందిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ముంబైకి చెందిన సూర్యోదయ్ ఫైనాన్స్ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నాం. ఏడాదిలో మరో 10 సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నాం. పలు ఎన్బీఎఫ్సీలు, గృహ రుణ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. జీఎస్టీ ప్రయోజనం వేచి చూడాలి.. కొటక్ మహీంద్ర బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 2014లో లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలోకి అడుగుపెట్టాం. ఇప్పటివరకు కొటక్ మహీంద్రా నుంచి రూ.175 కోట్ల నిధులు సమీకరించాం. గతంలో బీమా రంగానికి 15 శాతంగా ఉన్న పన్నులను.. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో 18 శాతంలో శ్లాబును కేటాయించారు. దీంతో ప్రీమియం ధరలు కూడా 3 శాతం పెరిగాయి. అయితే పెరిగిన ప్రీమియంల కారణంగా కస్టమర్ల పాలసీ విషయంలో ఎలాంటి మార్పుల్లేవు. దీర్ఘకాలంగా ఎలాంటి ప్రయోజనాలుంటాయో వేచి చూడాలి. -
ఫండ్స్లో పెట్టుబడులు.. ఈ అంశాలు తప్పనిసరి
నేను ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నాను. నా భార్య సాధారణ గృహిణి, నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వాయిదాల పద్ధతిలో ఒక బైక్ తీసుకున్నాను. రిటైరైన తర్వాత ప్రశాంత జీవితం కోసం పెన్షన్–బీమా ప్లానుల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ? –నరేంద్ర, విశాఖపట్టణం ఇన్వెస్ట్మెంట్ కోసం బీమా పాలసీలను తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. బీమా, ఇన్వెస్ట్మెంట్ అవసరాలను విడివిడిగా చూడాలి. బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ప్లాన్లు రెంటికి చెడ్డ రేవడి చందంగా ఉంటాయి. ఇవి తగినంత బీమా కవరేజ్ను ఇవ్వలేవు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా ఇవ్వలేవు. జీవిత బీమా అవసరాల కోసం ఒక టర్మ్ పాలసీ తీసుకోవాలి. రిటైరైన తర్వాత ప్రశాంత జీవనం కోసం ఒక నిధిని ఇప్పటినుంచే ఏర్పాటు చేసుకోవాలనుకోవడం మంచి ఆలోచన. దీని కోసం మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి. రిటైర్మెంట్, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత చదువు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఒకటి లేదా రెండు డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకొని వాటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందగలరు. మీరు ఎంచుకోవడానికి కొన్ని ఫండ్స్ను సూచిస్తున్నాం. బిర్లా సన్లైఫ్ ఈక్విటీ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ కంపెనీస్ ఫండ్, ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ ఫండ్, మిరా అసెట్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్క్యాప్ ఫండ్, కోటక్ ఆపర్చునిటీస్ రెగ్యులర్ ఫండ్, డీఎస్పీ బ్లాక్రాక్ ఫోకస్ 25 ఫండ్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? –ఇస్మాయిల్, వరంగల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం మంచి నిర్ణయమే. సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఒక మంచి మార్గం. సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైరైన తర్వాత ప్రశాంత జీవనం గడపడం కోసం తగిన రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం, పిల్లల ఉన్నత చదువులు.. తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులే పొందవచ్చు. ఇక తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మూడు ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. మొదటిది పన్ను ఆదా చేసే ఫండ్స్(ఈ ఫండ్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ మూడేళ్ల పాటు లాక్–ఇన్ అయి ఉంటాయి) లేదా బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. రెండోది ఎప్పుడూ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు వస్తాయి. ఇక మూడోది కనీసం మూడు నుంచి ఐదేళ్ల పాటు తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలి. ఈ మూడు విషయాలను మీరు అనుసరించకపోతే, కొత్త ఇన్వెస్టర్లకు నష్టాలు వచ్చే అవకాశాలే అధికంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను అధిక ధరల్లో కొనుగోలు చేసి, తక్కువ ధరల్లో విక్రయించాల్సి రావచ్చు. నేను సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య గృహిణి, వడ్డీరేట్లు దిగివచ్చినందున పెద్ద మొత్తంలో గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నాను. ఒక మిత్రుడు 8.6 శాతం వడ్డీకే ఒక సంస్థ నుంచి గృహ రుణం ఇప్పిస్తానని అంటున్నాడు.ఈఎంఐ నా ఆదాయంలో 60 శాతం వరకూ ఉండొచ్చు. తగిన సలహా ఇవ్వండి. –రవీందర్, హైదరాబాద్ గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గినందున గృహ రుణం తీసుకోవాలనుకోవడం మంచి నిర్ణయమే. 8.6 శాతం వడ్డీకి గృహరుణం తీసుకోవడం.. ఖరీదైన అప్పు కాదని చెప్పవచ్చు. అయితే మీ మొత్తం ఆదాయంలో 60 శాతం వరకూ ఈఎంఐ (సమాన నెలసరి వాయిదా) కింద చెల్లించడం సరైనది కాదు. మీ ఉద్యోగానికి సంబంధించి ఏమైన అనిశ్చితి తలెత్తిన పరిస్థితుల్లో పరిస్థితులన్నీ తల్లకిందులవుతాయి. అందుకని రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. మీ మొత్తం ఆదాయంలో మీరు చెల్లించాల్సిన ఈఎంఐ మూడోవంతుకు మించకుండా ఉండేలా చూసుకోవడం ఉత్తమం. ఇలా ఉంటే అన్ని విషయాలూ మీ నియంత్రణలోనే ఉంటాయి. నేను ఇటీవలే రిటైరయ్యాను. వడ్డీరేట్లు పడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి 9–10 శాతం డివిడెండ్ ఇచ్చే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటికే నేను హెచ్డీఎఫ్సీ ప్రుడెన్స్ ఫండ్లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నాను. తగిన సలహా ఇవ్వండి. –జాన్సన్, విజయవాడ ఇన్వెస్ట్మెంట్స్పై రాబడులు పెంచుకోవాలంటే మీరు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. గత రెండేళ్లలో ఈక్విటీ మార్కెట్ మంచి పనితీరు కనబరిచింది. దీంతో బ్యాలెన్స్డ్ ఫండ్స్ మంచి రాబడులనిచ్చాయి. అయితే అన్ని రోజులూ ఇలాగే ఉంటాయని లేదు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉంటుంది. మార్కెట్ పడిపోతే మీ పెట్టుబడుల విలువ తగ్గిపోతుంది. రిటైరైన తర్వాత రెగ్యులర్ ఆదాయం మీకు అవసరముంటుంది. ఇందుకోసం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ వంటి స్థిర ఆదాయాన్నిచ్చే సాధనాలపై ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. -
ఈఎంఐలు ఎక్కువైనా చిక్కులే
♦ ఇంటి రుణం, వ్యక్తిగత రుణం, బీమా పాలసీలు... ♦ వేతనంలో పరిమితంగానే నెలసరి చెల్లింపులు రుణాలు కావచ్చు... ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు... ఖర్చులు కావచ్చు! కానీ వాటి కోసం చేసే చెల్లింపులు పరిమితి దాటితే కోరి చిక్కులు తెచ్చుకున్నట్టే.! రాబడులు తక్కువగా ఉండే సంప్రదాయ బీమా పాలసీలు, అధిక వడ్డీతో కూడిన వ్యక్తిగత రుణాలు ఆర్థిక లక్ష్యాలకు విఘాతంగా మారకూడదు. ఇంటి రుణం కూడా... ఆర్థికంగా ప్రయోజనం కల్పించేది అయి ఉండాలి గానీ, భారంగా పరిణమించకూడదు. అందుకే వచ్చే ఆదాయంలో వీటికంటూ ఓ నిర్ణీత పరిమితి విధించుకోవడం అవసరం. శేఖర్ ఈ మధ్యే గృహ రుణం తీసుకుని ఫ్లాట్ కొన్నాడు. అప్పటికే తనకు వ్యక్తిగత రుణం బకాయిలున్నాయి. ఇక గృహ ప్రవేశం ఖర్చులకు స్నేహితులనడిగి కొంత మొత్తం తీసుకున్నాడు. ఇక కార్ లోన్ ఇంకా ఏడాది చెల్లించాల్సి ఉంది. జీవిత బీమా పాలసీలకు చేసే చెల్లింపులతో కలిసి తడిసి మోపెడవుతోంది. వీటికోసం నెలనెలా క్రెడిట్ కార్డులపై వాడకం పెంచాడు. దాంతో అవి కూడా భారీగా బిల్లులొస్తున్నాయి. కనీస బిల్లు చెల్లిస్తుండటంతో వడ్డీ భారీగా పెరుగుతోంది. శేఖర్ ప్లానింగ్ మంచిదే. కానీ ఇబ్బందులు మామూలుగా లేవు. ఎందుకిలా? ఇదే విషయం చెప్పి తన మిత్రుడైన ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర వాపోయాడు శేఖర్. దానికి ఆ అడ్వయిజర్... తన క్లయింట్లు కొందరి అనుభవాలు చెబుతూ తగిన సూచనలిచ్చారు. ఆ వివరాలే ఇవి... ఇంటి రుణం... ఇంటి తాలూకూ వ్యయాలు... రుణానికి చెల్లించే ఈఎంఐ కావచ్చు లేదా ఇంటి అద్దె కావచ్చు. ఏదైనా గానీ వేతనంలో చెప్పుకోతగ్గ వ్యయం అవుతుంది. గృహ రుణ ఈఎంఐ వేతనంలో 35–40 శాతానికే పరిమితం చేయాలి. పన్ను ఆదా, పొదుపు కోసమే రుణంపై ఇంటిని కొనుగోలు చేసినా సరే... ఇది నిర్ణీత శాతం మించితే ఇబ్బందే. నిజానికి ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ ప్రస్తుతం 8–9 శాతం మధ్యనే ఉంటోంది. ఇంటి రుణం కోసం చేసే అసలు, వడ్డీ చెల్లింపులపై ఆదాయపన్ను పరంగా మినహాయింపులు కూడా ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ అసలు ఏమీ లేనట్టే భావించొచ్చు. అసలు భారమే కాని ఇంటి రుణాన్ని తీర్చేయాలన్న యోచనలో దీర్ఘకాలంలో 12 శాతం పైగా రాబడులను ఇచ్చే ఈక్విటీ పెట్టుబడులపై దృష్టి పెట్టకపోవడం ఆర్థిక ప్రణాళిక లోప మే అవుతుంది. ఇక కొందరికి అప్పు ఉందంటే నిద్ర పట్టదు. అందుకే తీసుకునే వరకూ నిద్రపోరు. దాన్ని తీర్చేవరకూ ప్రశాంతంగా ఉండరు. ఇంటి రుణంపై ప్రారంభంలో కొన్నేళ్లు వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. ఒకవేళ అప్పు తొందరగా తీర్చేయాలని అనుకుంటే ఏడేళ్ల తరువాత ముందస్తుగా తీర్చేయొచ్చు. అలాగైతే వడ్డీపై పన్ను ప్రయోజనాలన్నీ అప్పటిదాకా కలిసివస్తాయి. బీమా ప్రీమియం... సతీష్ (50) ఓ ఉద్యోగి. నెల జీతం రూ.60,000. యులిప్ పాలసీలకు, రెండు సంప్రదాయ పాలసీలకు కలిపి నెల నెలా రూ.21,000 (జీతంలో 35 శాతం) చెల్లించేవాడు. పన్ను ఆదాకు, సురక్షితమైన చక్కని రాబడుల కోసం వీటిని అతడి ఎంచుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత... రాబడులు తన లక్ష్యాలకు అనుగుణంగా లేవని గుర్తించాడు. దీంతో భారంగా మారిన అన్ని సంప్రదాయ పాలసీలను సరెండర్ చేసి వచ్చినంత వెనక్కి తీసుకున్నాడు. పెట్టుబడుల కోణంలో ఒకటికి మించిన పాలసీలను తీసుకుని ఉంటే, ద్రవ్యోల్బణానికి దీటైన రాబడులను ఇవ్వలేవు కనుక వాటిని వదిలించుకోవడమే బెటర్. అయితే, పాలసీలను రద్దు చేసుకునే ముందు సరెండ్ వేల్యూ ఎంత వస్తుందో తెలుసుకుని.. ఓ నిర్ణయం తీసుకోవాలి. నష్టపోయేది కొద్దిగానే ఉండి, పాలసీ ముగియడానికి ఇంకా కొన్నేళ్ల పాటు సమయం ఉంటే రద్దు చేసుకోవడమే కరెక్టు. బీమా... పెట్టుబడికాదు! బీమా అన్నది కేవలం రక్షణ కోసమే అయి ఉండాలి. టర్మ్ పాలసీలు ఈ కోవకు చెందినవే. వీటి ప్రీమియం సంప్రదాయ పాలసీలతో పోలిస్తే చాలా తక్కువ. కానీ, కవరేజీ ఎక్కువ. అయినా కూడా చాలామంది సంప్రదాయ పాలసీలకే మొగ్గు చూపుతుంటారు. వీటికి ప్రీమియం ఎక్కువ, బీమా రక్షణ తక్కువ. పైగా వీటిపై వచ్చే రాబడులు కూడా 5–6 శాతాన్ని మించవు. ఇక, వైద్య బీమా, క్రిటికల్ ఇల్నెస్, వాహన బీమా, గృహ బీమాలను కూడా కలిసి చూస్తే ప్రీమియం రూపంలో చెల్లించాల్సిన మొత్తం భారీగానే ఉంటుంది. పాలసీలు ఏవైనా కానీయండి... వాటికి చెల్లించే ప్రీమియం ఏడాదిలో ఓ వ్యక్తి ఆదాయంలో 6 –7 శాతాన్ని మించకుండా చూసుకోవాలి. టర్మ్ పాలసీ తీసుకునే వారు తమ వార్షికాదాయానికి పది రెట్ల మొత్తం, దీనికి అదనంగా అప్పులు తీసుకుని ఉంటే ఆ మొత్తానికి కూడా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత, ఇతర రుణాలు కొంత మంది వైద్య పరమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, వివాహాల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకుంటుంటారు. వడ్డీ భారం ఎక్కువగా ఉండే వ్యక్తిగత రుణాలను ఎక్కువగా తీసుకోవటం సరికాదు. తప్పనిసరి అయితే వీటికి చేసే చెల్లింపులు తమ వేతనంలో 10 శాతం దాటకుండా చూసుకోవాలనేది ఒక నియమం. అంతకు మించితే అది ఆర్థిక లక్ష్యాలకు విఘాతంగా మారుతుంది. వేతనంలో 50 శాతం దాటితే అది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. -
బీమా లేని చికిత్సా..? బాబోయ్!!
♦ ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాల్సిందే ♦ రకరకాల పాలసీలను చూసి సందిగ్ధంలో పడొద్దు ∙ ♦ వయసు, అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి ♦ ముందే వైద్య పరీక్షలు బెటర్ ♦ సబ్ లిమిట్స్, కో–పే వంటి పరిమితులు లేకుంటేనే నయం రాజారావు (42) ఉన్నట్టుండి ఛాతీ భాగంలో నొప్పిగా ఉందంటూ కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గుండెకు ఆపరేషన్ చేసి రాజారావు ప్రాణాన్ని నిలబెట్టారు. కుటుంబంలో తిరిగి సంతోషం వెల్లివిరిసింది. కానీ, ఆస్పత్రి బిల్లు రూ.4 లక్షలు చూశాక ఆ సంతోషం ఆవిరైపోయింది. కారణం రాజారావుకు వైద్య బీమా లేదు. తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఆ బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ఆ అప్పులు తీర్చడానికి వారికి రెండేళ్లు పట్టింది. వైద్య వ్యయాలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో బీమా లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటన్నది రాజారావును చూస్తే తెలియకమానదు. గుండె సంబంధిత చికిత్సలకు రూ.1.50 లక్షలకన్నా తక్కువ కావడం లేదు. కేన్సర్ చికిత్సకు రూ.3 లక్షల వరకు, ఫ్రాక్చర్, ఇతరత్రా చికిత్సలకూ రూ.లక్ష వరకు ఖర్చవుతున్న రోజులివి. అనారోగ్యం పాలైనపుడు ఇల్లు గుల్ల కాకూడదనుకుంటే వెంటనే బీమా పాలసీ తీసుకోవాల్సిందే... బీమా పాలసీ ఎంపిక అన్నది ఓ పెద్ద ప్రహసనం. ఎన్నో నిబంధనలు, పరిమితులు, ఓ పట్టాన అర్థం కాని టెర్మినాలజీ పరిస్థితిని సంక్లిష్టం చేస్తున్నాయి. సబ్లిమిట్స్, కోపేమెంట్స్, వెయిటింగ్ పిరియడ్ తదితర కీలక అంశాల గురించి వివరించడంతోపాటు, ఏ పాలసీ అనువైనదో చెప్పేదే ఈ సమగ్ర కథనం. వేచి ఉండే కాలం ముందు నుంచి ఉన్న వ్యాధులకు కవరేజీ కోసం వేచి ఉండాలన్న నిబంధనను చూసి వ్యాధులను దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు. తర్వాతి కాలంలో వైద్య పరీక్షల్లో ఆ వ్యాధి అప్పుడే మొదలైంది కాదన్న విషయం బయటపడితే క్లెయిమ్ను కంపెనీలు తీరస్కరించే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, పాలసీ రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే బీమా పాలసీ తీసుకునే ముందే సమగ్ర వైద్య పరీక్షలకు సిద్ధం కావడం (కంపెనీ కోరకపోయినా) మంచిది. ఎక్కువ శాతం బీమా కంపెనీలు ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కవరేజీని ఇచ్చేందుకు నాలుగేళ్ల పాటు వేచి ఉండాలన్న నిబంధన అమలు చేస్తున్నాయి. అదే సమయంలో అపోలో మ్యూనిచ్ ఆప్టిమా రీస్టోర్, రాయల్ సుందరం లైఫ్లైన్ సుప్రీమ్, సిగ్నా టీటీకే ప్రో హెల్త్ ప్లస్ పాలసీల్లో మూడేళ్లుగానే ఉంది. మ్యాక్స్ బూపా హార్ట్బీట్ (ప్లాటినం, గోల్డ్ ప్లస్) పాలసీల్లో వెయిటింగ్ పిరియడ్ రెండేళ్లే. కాకపోతే ప్రీమియం ఎక్కువ. యుక్త వయసులో ఉంటే... 30ఏళ్లలోపు అవివాహితులు ప్రీమియం తక్కువ ఉంది కదా అని ఏదో ఒక హెల్త్ పాలసీ తీసుకున్నారనుకోండి. 30 ఏళ్లు దాటాక ఎక్కువగా క్లెయిమ్స్ అవసరం ఏర్పడుతుంది. అప్పుడు మీరు తీసుకున్న పాలసీ ఆ అవసరాలను తీర్చకపోతే ఆర్థికంగా భారమే. ఉద్యోగం చేసే సంస్థ నుంచి గ్రూపు హెల్త్ పాలసీ ఉందన్న ధీమా పనికిరాదు. వాటిలో పలు మినహాయిం పులు ఉండొచ్చు. అందుకే వ్యక్తిగతంగా ఓ మంచి హెల్త్ పాలసీ ఉండితీరాలి. 30 ఏళ్ల వయసులో ఉన్న వారికి సాధారణ వైద్య బీమా పాలసీ సరి పోతుంది. సమ్ ఇన్సూర్డ్ రీస్టోరేషన్, నో క్లెయిమ్ బోనస్ కోసం చూడక్కర్లేదు. ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు లేకుంటే నాలుగేళ్ల ‘ప్రీ ఎగ్జిస్టింగ్ డీసీజెస్’ నిబంధన ఉన్న పాలసీ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఏ పాలసీలు అనువు... రెలిగేర్ హెల్త్ కేర్, రాయల్ సుందరం లైఫ్లైన్ సుప్రీమ్, మ్యాక్స్బూపా హెల్త్ కంపానియన్ వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఈ పాలసీల్లో హాస్పిటల్ రూమ్ అద్దెలపై ఎటువంటి పరిమితులు, ఇతరత్రా ఎటువంటి చార్జీల విధింపు లేదు. రూ.5 లక్షల వైద్య బీమా కవరేజీకి ఏడాదికి ప్రీమియం రూ.5,500 – రూ.6,500 మధ్యలో ఉంటుంది. వివాహితులకు 30–40 ఏళ్ల మధ్య వయసులో, వివాహితులైన వారికి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు అనువుగా ఉంటాయి. ఇందులో పాలసీదారుడితో పాటు అతని జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలకు కవరేజీ లభిస్తుంది. 40 ఏళ్లు దాటితే... జీవిత భాగస్వాములు ఇద్దరూ 40 ఏళ్ల పైబడి ఉంటే... వారికి బీమా కవరేజీ తగినంత ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంటుంది. అందుకని రీస్టోరేషన్ సదుపాయం ఉన్న పాలసీని ఎంచుకోవాలి. ఒకవేళ హైపర్టెన్షన్ సంబంధిత సమస్యలు ఉన్న వారు ముందస్తు వ్యాధులకు కవరేజీ కోసం దీర్ఘకాలం పాటు చూసే నిబంధన ఉన్న పాలసీలను ఎంచుకోవద్దు. 60 ఏళ్లు దాటిన వారికి... కొన్ని కంపెనీలు గరిష్టంగా 65 ఏళ్ల వరకే పాలసీ తీసుకునేందుకు అనుమతిస్తున్నాయి. కొన్నింటిలో ఏ వయసు వారైనా వైద్య బీమా పొందొచ్చు. బీమా పాలసీ తీసుకున్న తర్వాత ఏ వయసు వారికైనా రెన్యువల్కు తిరస్కరించడానికి లేదు. ఆరోగ్యంగా ఉండి ఉంటే సీనియర్ సిటిజన్ పాలసీలకు బదులు రెగ్యులర్ హెల్త్ పాలసీలు అనువైనవి. వీటిలో సబ్ లిమిట్స్, కో–పే నిబంధనలుండవు. రాయల్ సుందరం లైఫ్లైన్ సుప్రీమ్, మ్యాక్స్ బూపా హెల్త్ కంపానియన్, అపోలో మ్యూనిచ్ ఆప్టిమా రీస్టోర్ పాలసీల్లో కోపే లేదు. రీస్టోరేషన్ సదుపాయం ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో ఒక ఏడాదిలో బీమా కవరేజీ మొత్తాన్ని ఒకరు వినియోగించుకున్నా, మరో వ్యక్తి రీస్టోరేషన్ కింద తిరిగి బీమా కవరేజీని అదే ఏడాదిలో పొందవచ్చు. ఉదాహరణకు నలుగురు సభ్యులున్న కుటుంబం రూ.5 లక్షల బీమా పాలసీ తీసుకుంటే అది వారి అవసరాలకు సరిపోదు. ఏకకాలంలో ఇద్దరు అనారోగ్యం బారిన పడితే బీమా కవరేజీ సరిపోకపోవచ్చు. అదే సమయంలో అధిక బీమా కవరేజీ తీసుకుంటే ప్రీమియం భారం కావచ్చు. ఇటువంటి వారికి రీస్టోరేషన్ సదుపాయం అక్కరకు వస్తుంది. ఇందులో ఉన్న నిబంధనల్లా ఒకరు వ్యాధి బారినపడి పూర్తి బీమా కవరేజీని వినియోగించుకుంటే రీస్టోరేషన్ కింద తిరిగి అదే వ్యక్తి అదే వ్యాధి కోసం ఆ ఏడాదిలో మళ్లీ పరిహారం కోరేందుకు అవకాశం ఉండదు. సదరు వ్యక్తి మరో వ్యాధికి గురైతే పరిహారం పొందొచ్చు. అలాగే కుటుంబంలోని మిగిలిన సభ్యులు సైతం పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం వద్దనుకుంటే రూ.10లక్షల పాలసీపై ప్రీమియం రూ.1,000–2000 వరకు తగ్గుతుంది. సబ్లిమిట్స్ పాలసీలో సబ్ లిమి ట్, కో పే ఆప్షన్లను ఎంచుకోవద్దు. వీటిని ఎంచుకోవడం వల్ల ప్రీమియం కొంచెం తగ్గొచ్చేమో కానీ, క్లెయిమ్ ఎదురైతే అధిక మొత్తం జేబులోంచి పెట్టాల్సి వస్తుంది. రూమ్ చార్జీలు సహా ఆస్పత్రి వ్యయ భారాన్ని కొంత తగ్గించుకునేందుకు కంపెనీలు ఈ నిబంధనను అమలు చేస్తుం టాయి. ప్రభుత్వ రంగ కంపెనీల వైద్య బీమా పాలసీల ప్రీమియం ప్రైవేటు కంపెనీలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కానీ, ప్రభుత్వ రంగ బీమా కంపెనీల పాలసీల్లో సబ్లిమిట్స్ ఉన్నాయి. గది అద్దె, ఐసీయూ, అంబులెన్స్ ఇలా పలు రకాల చార్జీలపై పరిమితి ఉంటుంది. ఉదాహరణకు అంబులెన్స్కు రూ.10వేలు చార్జీ అయితే, బీమా కంపెనీ రూ.2,000కే పరిహా రాన్ని పరిమితం చేయవచ్చు. ఉదాహరణకు న్యూఇండియా అష్యూరెన్స్ ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ సమ్ ఇన్సూర్డ్ మొత్తంలో గది అద్దెను 1 శాతానికి పరిమితం చేసింది. రూ.5 లక్షల బీమా పాలసీలో రూమ్ అద్దె రూ.5 వేల వరకే కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ఆస్పత్రిలో గది అద్దె రూ.10వేలు ఉందనుకుంటే మిగిలిన మొత్తాన్ని పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. ఈ కోత దీనికే పరిమితం కాదండోయ్. మిగిలిన క్లెయిమ్ మొత్తానికీ దీన్నే అమలు చేస్తాయి. ఉదాహరణకు క్లెయిమ్ రూ.లక్ష ఉందనుకుంటే రూ.50వేలే చెల్లిస్తాయి. గది అద్దె రూ.10వేలలో సగమే చెల్లిస్తున్నందున అదే నిబంధన మిగిలిన క్లెయిమ్ మొత్తానికీ వర్తిస్తుంది. రెలిగేర్ హెల్త్ కేర్, అపోలో మ్యూనిచ్ ఆప్టిమా రీస్టోర్, మ్యాక్స్ బూపా హెల్త్ కంపానియన్ తదితర పాలసీల్లో ఈ తరహా సబ్ లిమిట్స్ లేవు. నో క్లెయిమ్ బోనస్ వైద్య బీమాలో ఓ ఏడాదిలో ఒక్క క్లెయిమ్ కూడా లేకుంటే కంపెనీలు కొంత బోనస్ను ఇస్తుంటాయి. వైద్యం ఏటేటా ఖరీదవుతున్నందున ఇది కొంత మేర ఉపశమనం ఇచ్చేదే. దాదాపు అన్ని కంపెనీలు ఈ సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఓ ఏడాదిలో క్లెయిమ్ లేకుంటే మరుసటి ఏడాది సమ్ ఇన్సూర్డ్ (బీమా కవరేజీ) 10 నుంచి 20 శాతం పెరుగుతుంది. దీనికి ఎటువంటి అదనపు ప్రీమియం చెల్లించక్కర్లేదు. బేసిక్ బీమా కవరేజీకి సమాన స్థాయి వరకూ నో క్లెయిమ్ బోనస్ రూపంలో కవరేజీ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అంటే రూ.లక్ష పాలసీకి ఏటేటా 20 శాతం నో క్లెయిమ్ బోనస్ చొప్పున ఐదేళ్ల పాటు బీమా కవరేజీ రూ.లక్ష వరకు పెరిగి మొత్తం రూ.2 లక్షలు అవుతుంది. రెండేళ్లపాటు నో క్లెయిమ్ బోనస్ రూపంలో రూ.లక్ష పాలసీకి రూ.44వేల కవరేజీ పెరిగిందనుకోండి. మూడో ఏట క్లెయిమ్ వస్తే అప్పుడు సమ్ ఇన్సూర్డ్లో 20 శాతం తగ్గిపోతుంది. ఆ తర్వాతి సంవత్సరంలోనూ క్లెయిమ్ వస్తే మరో 20 శాతం తగ్గి బేసిక్ సమ్ ఇన్సూర్డ్ దగ్గర ఆగిపోతుంది. అయితే, మ్యాక్స్ బూపా హెల్త్ కంపానియన్, రాయల్ సుందరం లైఫ్లైన్ పాలసీల్లో మాత్రం నో క్లెయిమ్ బోనస్ కింద సమ్ ఇన్సూర్డ్ ఏటా 20 శాతం పెరుగుతుంది. కానీ, ఆ తర్వాతి సంవత్సరాల్లో క్లెయిమ్ వచ్చినప్పటికీ ఈ పెరిగిన సమ్ ఇన్సూర్డ్లో కోత విధించడం లేదు. ఇదో ఆకర్షణీయాంశం. కో పేమెంట్... అంటే సహ చెల్లింపు. క్లెయిమ్ మొత్తంలో కంపెనీతోపాటు పాలసీదారుడూ కొంత శాతాన్ని భరించడం. ఉదాహరణకు 20 శాతం కోపే ఉంటే, ఆస్పత్రి బిల్లు రూ.2 లక్షలు వచ్చిందనుకుంటే బీమా కంపెనీ రూ.1.60 లక్షల పరిహారమే చెల్లిస్తుంది. మిగిలిన రూ.40వేలను పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. హోమియో, ఆయుర్వేద చికిత్సలకూ... సాధారణంగా ఎక్కువ పాలసీలు అల్లోపతీ వైద్య చికిత్సలకే బీమా కవరేజీని పరిమితం చేస్తున్నాయి. హోమియోపతి, ఆయుర్వేదం, యునానీ తరహా వైద్య విధానాలకూ కవరేజీ కోరుకునే వారి కోసం మాక్స్ బూపా హెల్త్ కంపానియన్, రాయల్ సుందరం లైఫ్లైన్ పాలసీలను పరిశీలించొచ్చు. -
వృద్ధ దంపతుల్ని నిండా ముంచారు
- ఇన్సూరెన్స్ పాలసీతో సైబర్ నేరగాళ్ల ఎర - నమ్మి రూ. 70 లక్షలు చెల్లించిన దంపతులు - రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వృద్ధ దంపతుల్ని సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. గతంలోనే సరెండర్ చేసిన ఇన్సూరెన్స్ పాలసీపై బోనస్ వస్తుందంటూ ఎర వేశారు. వీరి మాటల వల్లో పడిన వృద్ధ దంపతులు ఏకంగా రూ. 69.73 లక్షలు పోగొట్టుకున్నారు. దీనిపై బుధవారం కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తార్నాక ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులు గతంలో ఐసీఐసీఐ బ్యాంకు ఇన్సూరెన్స్ పాలసీని సరెండర్ చేశారు. 2015 మార్చి నెల్లో వీరికి ఓ ఫోన్కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి అమన్ శర్మగా పరిచయం చేసుకుని.. సరెండర్ చేసిన పాలసీ నంబర్, వివరాలు చెప్పాడు. ఆ పాలసీపై బోనస్ పాయింట్లు వచ్చాయని, సిల్వర్ ప్లాన్ కింద రూ. 66 వేలు, గోల్డ్ ప్లాన్ కింద రూ.78 వేలు పొందే అవకాశం ఉందంటూ నమ్మించాడు. దీంతో ఆశపడిన ఆ దంపతులు ఆసక్తి చూపడంతో సైబర్ నేరగాళ్లు అసలు దందా ప్రారంభించారు. ఆయా స్కీమ్స్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రూ. 20 వేలు చెల్లించాల్సి ఉంటుందంటూ చెప్పి ఓ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయించుకున్నారు. వృద్ధ దంపతులు పూర్తిగా తమ వల్లో పడ్డారని నిర్ధారించుకున్న సైబర్ నేరగాళ్లు తమ పంథా మార్చారు. డబ్బు రెట్టింపయ్యే అవకాశముందని.. ప్రత్యేక స్కీమ్ నేపథ్యంలో మీరు చెల్లించే ప్రతి రూపాయికీ బోనస్ పాయింట్లు పెరుగుతాయని, మొత్తమ్మీద కొన్ని రోజుల్లోనే ఆ డబ్బు రెట్టింపయ్యే అవకాశం సైతం ఉందని నమ్మించారు. ఇలా మోసగాళ్లు వివిధ స్కీముల పేర్లు చెప్తూ దఫదఫాలుగా డబ్బు డిమాండ్ చేశారు. వీరి మాయలో పడిపోయిన వృద్ధ దంపతులు పదవీ విరమణతో వచ్చిన డబ్బు, తమ పిల్లలకు చెందిన నగదుతో పాటు మరికొంత మొత్తం అప్పు చేసి మరీ సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తూ పోయారు. మొత్తమ్మీద ఏడాది కాలంలో రూ. 69.73 లక్షల్ని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశారు. మోసపోయామని గుర్తించిన బాధితులు సైబర్ నేరగాళ్లను ఫోన్లో నిలదీయగా బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆ మోసగాళ్లు ఢిల్లీ కేంద్రంగా కథ నడిపినట్లు పోలీసులు గుర్తించారు. వృద్ధ దంపతులకు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు వీరు సరెండర్ చేసిన పాలసీ నంబర్ చెప్పడాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ బ్యాంక్నకు చెందిన కాల్సెంటర్ నుంచి ఈ వివరాలు లీక్ అయ్యాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. -
బీమాకు యుక్త వయసే కరెక్ట్!
⇒ ఎప్పుడు ఏం జరుగుతుందో మన చేతుల్లో ఉండదు ⇒ త్వరగా ప్రారంభిస్తే ప్రీమియం కూడా తక్కువ జీవితం మన చేతుల్లో ఉండదు. ఏదీ అనుకున్నట్టు జరగదు కూడా. దీన్నెప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. గతేడాది నవంబర్లో ఇండోర్– పాట్నా రైలు ప్రమాదం జరిగింది... గుర్తుందా? ఇందులో ప్రాణాలు కోల్పోయిన 120 మందిలో ఓ ఇద్దరు యువకుల గురించి తెలుసుకోవాలి. వీరు గతేడాది ప్రారంభంలోనే కొత్తగా ఉద్యోగంలో చేరారు. ఒకసారి ఆలోచించండి. వారి కుటుంబాలు వారిపై ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటాయో? సంపాదించే కొడుకులను పోగొట్టుకున్న ఆ కుటుంబాల కలలు కల్లలయ్యాయి. అయితే ఇద్దరిలో ఒక వ్యక్తి మాత్రం ఉద్యోగంలో చేరిన వెంటనే జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. మరో వ్యక్తి అప్పుడే బీమా ఎందుకులే... అని తన సంపాదనను ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం ఆరంభించాడు. ఇప్పుడు ఎవరి కుటుంబం సంతోషంగా ఉందో మీకు ఆర్థమయ్యే ఉంటుంది!!. జీవిత బీమా కూడా ఆర్థిక సాధనమే.. సంపాదన ప్రారంభించిన దగ్గరి నుంచే ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. కేవలం కుటుంబం కలిగిన వారు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని అనుకోకూడదు. పెళ్లి కాకుండా ఒంటరిగా ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఎంత వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాలి. అప్పుడే చివరిలో ఎక్కువ ప్రయోజనం పొందగలం. ఇక్కడ జీవిత బీమాను కూడా ఆర్థిక సాధనంగానే చూడాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ప్రకారం... దేశంలో రెండో అత్యంత అనూకూలమైన, ఇష్టమైన ఆర్థిక సాధనం జీవిత బీమానే. 2020 నాటికి భారత్ ప్రపంచంలోని ప్రధాన ఇన్సూరెన్స్ మార్కెట్లలో ఒకటిగా మారబోతోంది. బాధ్యతలను భర్తీ చేస్తుంది! జీవిత బీమా అనేది మరణించిన తర్వాత మన కుటుంబానికి ఆర్థికంగా బాసటగా నిలుస్తుంది. సంపాదించడం ప్రారంభించిన ప్రతి వ్యక్తి తొలినాళ్లలోనే తప్పకుండా జీవిత బీమా తీసుకోవాలి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు మన మదిని తొలిచేస్తాయి. కోల్పోయిన ఆదాయ భర్తీకి పాలసీ తీసుకుంటున్నావా? లేదా పిల్లల చదువుకా? లేదా తల్లిదండ్రుల కోసమా? ఇలా ఎన్నో అవసరాలు తెరమీదకు వస్తాయి. అందుకే బీమా పాలసీ తీసుకునే ముందు కవరేజ్ ఎంతుందో చూసుకోవాలి. ఇది మన అవసరాలకు సరిపడేలా ఉండాలి. యువతకు బీమా అంటే బేజారా? చాలా మంది యువత జీవిత బీమాను తీసుకోవడానికి ఇష్టపడరు. దీనికి రెండు కారణాలుంటాయి. ఒకటి వారు దీర్ఘకాలం జీవిస్తామని భావించడం. రెండవది తెలిసి తెలిసి చావుకు ప్రణాళికలు వేసుకోవడం ఎందుకని ఆలోచించడం. ఈ ఆలోచనా ధోరణ మంచిది కాదు. మనం మరణించిన తర్వాత మనల్ని నమ్ముకున్న వారిని ఎవరు చూసుకుంటారో తెలీదు. అందుకే మనం చనిపోయినా కూడా మనం తీసుకున్న బీమా వారిని కష్టాల పాలు కాకుండా చూసుకుంటుందనే విషయాన్ని గుర్తెరగాలి. ముందుగా బీమా తెలివైన నిర్ణయం ముందు నుంచే జీవిత బీమా తీసుకోవడాన్ని తెలివైన నిర్ణయంగా భావించాలి. మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటే దాని ప్రీమియం తక్కువగా ఉంటుంది. అదే ఎక్కువ వయసు ఉన్నప్పుడు తీసుకుంటే ప్రీమియం ఎక్కువవుతుంది. కొంతమంది బీమా పాలసీలు చాలా ఖరీదైనవని, గందరగోళంగా ఉంటాయని, అర్థం చేసుకోవడం కష్టమని అనుకుంటుంటారు. మీరు ఎంత మొత్తంలో ప్రీమియం చెల్లించగలరనే ప్రాతిపదికనే మీ పాలసీ ఎంపిక జరగాలి. తర్వాత కంపెనీ సెటిల్మెంట్ రేటు ఏవిధంగా ఉందో చూడండి. ఈ వివరాలు ఆయా కంపెనీల వెబ్సైట్స్లో అందుబాటులో ఉంటాయి. అలాగే మనపై ఆధారపడ్డ వారి భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకొని పాలసీని ఎంపిక చేసుకోవాలి. జీవిత బీమా పాలసీ ఎప్పుడు తీసుకోవాలి అని మీరు మీ అంతరాత్మను ప్రశ్నించుకుంటే.. దానికి సమాధానం ఇప్పుడే అని తెలుసుకోండి. -
చౌక పాలసీకి ఆన్లైన్ మార్గం!
తక్కువ ప్రీమియానికే అధిక కవరేజీ ⇒ ఆన్లైన్లో 10 శాతం తక్కువకే ఇవ్వాలన్న ప్రభుత్వం నచ్చిన వస్తువును ఆన్లైన్లో ఒక్క క్లిక్తో కొనేస్తున్న రోజులివి. కాలు బయటపెట్టకుండా... చౌకగా స్మార్ట్ఫోన్ నుంచే కొనే వెసులుబాటుంటే ఎవరాగుతారు చెప్పండి? మరి బీమా పాలసీలను సైతం ఇదే విధంగా ఆన్లైన్లో తీసుకోవచ్చని ఎప్పుడైనా ఆలోచించారా? భౌతికంగా పత్రాల రూపంలో, బీమా ఏజెంట్ సాయంతో తీసుకునే పాలసీలతో పోలిస్తే ఆన్లైన్ పాలసీలు తక్కువ ప్రీమియానికే అందుబాటులో ఉంటాయని గమనించారా? నిజం!! ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఇప్పుడు ఈ పాలసీలు ఇంకాస్త చౌకగా మారాయి. ఆ వివరాలే ఈ కథనం.. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న సంకల్పంతో... ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసీ ద్వారా తీసుకునే జీవిత బీమా పాలసీలు, నాలుగు సాధారణ బీమా కంపెనీల నుంచి తీసుకునే మోటారు, ఆరోగ్య బీమా, ఇతర పాలసీలను 8 నుంచి 10 శాతం తక్కువకే అందించాలని కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అంటే ఏటా రూ.10,000 ప్రీమియం కట్టే చోట ఆన్లైన్ పాలసీ అయితే, రూ.వెయ్యి వరకు ఆదా చేసుకునేందుకు ప్రభుత్వ నిర్ణయం వీలు కల్పించింది. కనుక పాలసీ తీసుకునే ముందు ఆన్లైన్లో ఎల్ఐసీ, ఓరియెంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్ సంస్థల సైట్లను ఆశ్రయించడం ద్వారా చౌకగా పాలసీలు ఏవైనా లభిస్తున్నాయేమో చూసుకోవాలి. ఆన్లైన్లో ఎందుకు చౌక? ఆన్లైన్ మాధ్యమంలో పాలసీల జారీ వల్ల కంపెనీలకు వ్యయాలు ఆదా అవుతాయి. మధ్యవర్తులు ఎవరూ ఉండరు. నేరుగా పాలసీదారుడు, కంపెనీకి మధ్య వ్యవహారాలు నడుస్తాయి. దాంతో పరిపాలనా, ఇతర కమీషన్ల వ్యయాలు కంపెనీలకు మిగులుతాయి. ఇలా మిగిలే మొత్తంలో కొంత శాతాన్ని ప్రీమియం తగ్గింపు ద్వారా పాలసీదారులకు బదిలీ చేస్తాయి. జీవిత బీమాల్లో టర్మ్ పాలసీలు, సాధారణ బీమాలో మోటారు, ఆరోగ్య, పర్యాటక బీమా పాలసీలు ఇలా పోటాపోటీగా చౌక ప్రీమియానికే లభించే పరిస్థితి ఉంది. ప్రీమియం వ్యవధి బట్టి రాయితీ ప్రీమియం తగ్గింపు అన్నది ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. బీమా కవరేజీ అధికంగా ఎంచుకుంటే తగ్గింపు ఎక్కువ లభిస్తుంది. ఎందుకంటే ఆ స్థాయిలో కంపెనీలకు వ్యయాలు మిగులుతాయి మరి. అలాగే, ప్రీమియం చెల్లింపు ఏడాదికోసారి అయితే రాయితీ ఎక్కువ లభిస్తుంది. అదే ఆరు నెలలకోసారి అయితే రాయితీ తగ్గుతుంది. నిజానికి ఆన్లైన్ విభాగంలో పాలసీల అమ్మకాలు తక్కువే. అందులోనూ సాధారణ బీమా కంపెనీల పాలసీల్లో ఇది మరింత తక్కువగా ఉందనేది ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఉన్నతాధికారి గుంజన్ ఘాయ్ మాట. అధిక శాతం సాధారణ బీమా కంపెనీలు ఆన్లైన్, ఆఫ్లైన్ కోసం వేర్వేరు పాలసీలను నిర్వహించడం లేదని ఆయన చెప్పారు. కానీ, జీవిత బీమా పాలసీల్లో ఈ పరిస్థితి లేదు. కంపెనీలు టర్మ్ పాలసీల్లో అయితే పోటాపోటీగా తక్కువ ప్రీమియంకే పాలసీలు ఆఫర్ చేస్తున్నాయి. ఎల్ఐసీలో రెండు పాలసీలే... ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ... ఆన్లైన్ ద్వారా రెండు రకాల పాలసీలనే అందిస్తోంది. అవి టర్మ్ పాలసీలు, ఇమిడియెట్ యాన్యుటీ ప్లాన్స్. టర్మ్ పాలసీలను రూ.25 లక్షలు అంతకుమించిన కవరేజీతోనే అందిస్తోంది. రూ.50 లక్షలకు టర్మ్ పాలసీని 30 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల కాలానికి ఎంచుకుంటే ఆన్లైన్ పాలసీలో ప్రీమియం సుమారు రూ.7,300 వరకు ఉంటోంది. ఇదే పాలసీని ఆఫ్లైన్లో బీమా కార్యాలయం నుంచి తీసుకుంటే ప్రీమియం రూ.11,600గా ఉంది. దీనికి సేవారుసుం అదనం. ఇక ఇమిడియట్ యాన్యుటీ పాలసీల్లో (పాలసీ తీసుకున్న తర్వాత నుంచి నెలవారీ, వార్షికంగా చెల్లింపులు చేసేవి/పెన్షన్ ప్లాన్లు). ఈ విభాగంలో ఎల్ఐసీ ఆన్లైన్లో తీసుకునే పాలసీల్లో ఒక శాతం అధిక రాబడులను అందిస్తోంది. ప్రోత్సాహకం ఏదీ...? ఆన్లైన్లో కొనుగోలు చేసే పాలసీలపై 8 నుంచి 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం డీమోనిటైజేషన్ తర్వాత ప్రకటించినప్పటికీ ప్రభుత్వ రంగంలోని నాలుగు సాధారణ బీమా కంపెనీలు ఇంత వరకు ఒక్క ఆన్లైన్ పాలసీనీ ప్రత్యేకంగా ప్రారంభించలేదు. ఎల్ఐసీ మాత్రం ప్రస్తుతం అందిస్తున్న పాలసీలకు... తొలి ఏడాది ప్రీమియంను 8 శాతం వరకూ తగ్గిస్తోంది. అయినప్పటికీ ప్రైవేటు రంగ బీమా కంపెనీలతో పోలిస్తే ఎల్ఐసీలో పాలసీ ప్రీమియంలు అధికమేనని చెప్పొచ్చు. ఉదాహరణకు ఎల్ఐసీ అన్మోల్ జీవన్ పాలసీలో 30 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల కాలానికి రూ.15 లక్షల కవరేజీకి గాను ప్రీమియం రూ.4,571 (పన్నులతో కలుపుకుని). దీనిపై 8 శాతం తగ్గింపు అంటే రూ.365 పోను ప్రీమియం రూ.4,205గా ఉంటుందనుకోవచ్చు. కానీ, ఇంతే మొత్తం బీమా కవరేజీని ప్రైవేటు కంపెనీలు రూ.3,000 నుంచి రూ.3,500కే అందిస్తుండటం గమనార్హం. -
జీవిత బీమా.. రాబడికి కాదు!
దాన్ని రిస్క్ను తట్టుకునే సాధనంగానే చూడాలి ►దానిపై రాబడులొస్తాయని ఇన్వెస్ట్ చేయొద్దు ►మామూలు పాలసీలకన్నా టర్మ్ పాలసీనే ఉత్తమం ►అతితక్కువ ప్రీమియానికే అత్యధిక కవరేజీ ►మిగిలిన డబ్బు ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు మళ్లించొచ్చు జీవిత బీమా అంటే పెట్టుబడి సాధనమా? దాన్ని మన జీవితానికి కవరేజీగా భావించాలా... లేక దానిపై కూడా ఆదాయం వచ్చేలా చూసుకోవాలా? నిజానికి మనలో చాలామందికి ఈ డైలమా ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకుని కంపెనీలో బోలెడన్ని పాలసీలను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటికి ఏజెంట్లు చాలా అందమైన మాటల్ని ముసుగుగా వేస్తారు. ఫలితం... మనం పడిపోతాం!!. ఇలాంటి పాలసీలు తీసుకునేముందు మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే!. మీరు పాలసీ తీసుకుంటున్నది జీవితానికి జరగరానిది జరిగితే తగిన రక్షణ కోసమా? లేక పెట్టుబడికా? పెట్టుబడికైతే మార్కెట్లో బోలెడన్ని సాధనాలున్నపుడు దీన్లో ఎందుకు పెట్టాలి? రాబడుల్లో బీమా స్థానం చివరే!! ‘‘నెలకు రూ.25,000 ప్రీమియం చొప్పున 20 ఏళ్లు కడితే చాలు... 21వ ఏట నుంచి 16 ఏళ్ల పాటు ప్రతీ నెలా రూ.64,000 చొప్పున చేతికొస్తాయి. ఏటా కొంత మొత్తం పెరుగుతుంది కూడా. పైగా దీనిపై పన్నుండదు. 80 లక్షల బీమా కవరేజీ కూడా లభిస్తుంది’’ ఇవి ఓ బీమా ఏజెంటు వెంకట్తో అన్న మాటలు. నెలకు రూ.60 వేలకు పైనే సంపాదించే వెంకట్ మనసును ఇవి భలే ఆకర్షించాయి. ఓకే చెప్పేశాడు. జీవితానికి మంచి కవరేజీ, కాల వ్యవధి తర్వాత 16 ఏళ్ల పాటు పన్నులేని చక్కని ఆదాయం పెన్షన్లా ఉపయోగపడుతుందని అనుకున్నాడు. పైపెచ్చు ఈ తరహా పాలసీలకు చెల్లించే ప్రీమియంపై ఏటా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. జీవిత బీమా కవరేజీతో పాటు మెచ్యూరిటీ తర్వాత చేతికొచ్చే ఆదాయంపైనా పన్ను ఉండదు. ఈ ఉద్దేశంతోనే ఎక్కువ మంది ఇలాంటి పాలసీలను తీసుకుంటున్నారు. కానీ, సంప్రదాయ బీమా ప్లస్ పెట్టుబడి కలిసిన పాలసీల రాబడి సగటున ఏడాదికి 4.8 శాతమే ఉంటుందనే వాస్తవాన్ని గ్రహించాలి. 20 ఏళ్ల కాల వ్యవధిగల పాలసీలపై రాబడులు 4.5–5 శాతం స్థాయిలోనే ఉంటాయి. 25 ఏళ్ల కంటే ఎక్కువ కాల వ్యవధితో కూడిన పాలసీలపై మాత్రం కాస్త మెరుగ్గా 6 శాతం స్థాయిలో ఉంటాయి. కానీ, ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చి చూస్తే ఇంత తక్కువ రాబడులనిచ్చేవి బీమా పాలసీలే అన్నది వాస్తవం. అయితే, బీమా రక్షణ కూడా వస్తోందిగా..? అని వాదించొచ్చు. అంత సుదీర్ఘకాలానికి బీమా రక్షణ, జీవించి ఉంటే రాబడులకు హామీనిచ్చే సాధనం మరొకటి లేదన్నది నిజమే. అయితే, అదే సమయంలో బీమా కవరేజీ కోసం రాబడులను ఎందుకు కోల్పోవాలి? ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయిగా!!. బీమా రక్షణ తక్కువే భారీ ప్రీమియం... కవరేజీ మాత్రం స్వల్పం. సంప్రదాయ బీమా పాలసీల తీరు ఇదే. ఉదాహరణకు ఏటా రూ.5 లక్షల ఆదాయం పొందుతున్న ఓ వ్యక్తికి జీవిత బీమా కవరేజీ కనీసం రూ.కోటి అయినా ఉండాలి. ఇందుకు ప్రీమియం 25 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఎంత తక్కువగా చూసుకున్నా సంప్రదాయ పాలసీల్లో రూ.5 లక్షల వరకు ఉంటుంది. అదే టర్మ్ పాలసీ అయితే రూ.10 వేలలోపు వార్షిక ప్రీమియానికే రూ.కోటి కవరేజీ లభిస్తుంది. పన్ను ప్రయోజనం పరిమితమే సంప్రదాయ జీవిత బీమా పాలసీలను తీసుకునే వారిలో చాలా మంది... జీవిత బీమా రక్షణ కంటే కూడా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందేందుకే. నిజానికి సంప్రదాయ బీమా పాలసీలతో వచ్చే పన్ను ప్రయోజం ఇతర సాధనాలతో పోలిస్తే అంత మెరుగ్గా ఏమీ లేదు. ఉదాహరణకు 30 శాతం వార్షిక పన్ను రేటు పరిధిలో ఉన్నవారు బ్యాంకు ఎఫ్డీలో పెట్టుబడి పెట్టారనుకుందాం. వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించగా నికరంగా వారికి వచ్చే రాబడి 4.9 శాతం. జాతీయ పొదుపు పత్రాల్లో పెట్టుబడి పెడితే పన్ను అనంతర రాబడి 5.6 శాతం. ఇక ప్రజాభవిష్యనిధి (పీపీఎఫ్) అయితే, పన్నులేని 8 శాతం రాబడులను ఇస్తోంది. పదేళ్లలోపు కుమార్తె ఉన్న వారు... సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను రహిత 8.5 శాతం రాబడిని అందుకోవచ్చు. ఇక ఎన్పీఎస్, ఈఎల్ఎస్ఎస్ వంటి సాధనాల ద్వారా దీర్ఘకాలంలో ఇంకా అధికంగా రాబడులను అందుకునేందుకూ అవకాశం ఉంది. కాకపోతే ఈ రాబడులకు హామీ మాత్రం ఉండదు. సంప్రదాయ పాలసీకి బదులు బీమా రక్షణ కోసం తక్కువ ప్రీమియంతో ఆఫర్ చేసే టర్మ్ పాలసీని తీసుకుని, మిగిలిన మొత్తాన్ని పీపీఎఫ్ లేదా ఈఎల్ఎస్ఎస్ వంటి సాధనాల్లో మదుపు చేయడం దీర్ఘకాలంలో గరిష్ట రాబడులు అందుకోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. సంప్రదాయ పాలసీలకే ఆదరణ వాస్తవాలు ఇలా ఉంటే ఇప్పటికీ జీవిత బీమా కంపెనీలు విక్రయిస్తున్న పాలసీల్లో సింహ భాగం సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలే ఉంటున్నాయి. బీమా కంపెనీలకు వస్తున్న ప్రీమియం ఆదాయంలో 70 శాతం ఈ పాలసీల నుంచేనని ఓ అంచనా. ఎందుకూ అంటే బీమా కంపెనీలు, ఏజెంట్లు సంప్రదాయ పాలసీల గురించే ఎక్కువగా ప్రమోట్ చేయడం. 25 – 30 ఏళ్ల తర్వాత భారీగా వస్తున్న ఆదాయ అంకెలు వారిని ఆకర్షించడం. ఓ ప్రయోజనం కూడా ఉంది అయితే, సంప్రదాయ జీవిత బీమా పాలసీలతో ఓ ప్రయోజనం కూడా ఉంది. నిర్బంధ పొదుపు అలవడుతుంది. సంప్రదాయ పాలసీలో చేరిన తర్వాత ప్రీమియం కట్టడం ఆపేస్తే పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. దాంతో వెనక్కి వచ్చేది నామమాత్రమే. నష్టపోవడం ఎందుకన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ప్రీమియం కడుతుంటారు. పైగా ఎక్కువ మంది తక్కువ బీమా రక్షణతో పాలసీలు తీసుకుంటుంటారు. కనుక ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే చిన్న ఇన్వెస్టర్లు రెండేళ్లలోపే పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వైదొలిగే అవకాశం ఉంది గనుక. కానీ, సంప్రదాయ జీవిత బీమా పాలసీల్లో ఇలా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉండదు కాబట్టి వాటిని కొనసాగిస్తారు. కనుక ఆ మేరకు పొదుపు చేసినట్టే. -
ఈ ప్లాన్లు సరెండర్ చేస్తే..
నేను మూడు పాలసీలు తీసుకున్నాను. 2014లో మ్యాక్స్ లైఫ్ గెయిన్ ప్రీమియర్ను, 2016లో బీఎస్ఎల్–వెల్త్ యాస్పైర్ ప్లాన్ను, కోటక్ ప్రీమియర్ ఎండోమెంట్ ప్లాన్లు తీసుకున్నాను. ఈ ప్లాన్లు ఏవీ సరైన రాబడులు ఇవ్వడం లేదు. వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా? వైదొలగమంటారా? ఒకవేళ వైదొలిగితే, వీటికి చెల్లించే ప్రీమియమ్లను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమంటారా?తగిన సలహా ఇవ్వగలరు. – కుమార్, హైదరాబాద్ కోటక్ ప్రీమియర్, మ్యాక్స్ లైఫ్ గెయిన్ ప్రీమియర్.. ఇవి రెండూ ఎండోమెంట్ ప్లాన్లు. బిర్లా సన్లైఫ్ వెల్త్ యాస్పైర్ అనేది యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్) బీమా పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఎండోమెంట్ పాలసీలు కానీ, యులిప్లు కానీ మంచి రాబడులను ఇవ్వలేవు. వీటిని సరెండర్ చేయడమే సరైన నిర్ణయం. వీటిని సరెండర్ చేసిన తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్పాలసీ తీసుకోండి. టర్మ్ బీమా పాలసీలో ప్రీమియమ్ తక్కువగా ఉంటుంది. ప్రయోజనాలు అధికంగా, బీమా కవరేజ్ అధికంగా ఉంటుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ అవసరాల కోసం మంచి రేటింగ్ ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. కనీసం ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రాబడులు వస్తాయి. ఇక మీ ప్లాన్ల సరెండర్ వివరాలు చూద్దాం.. బీఎస్ఎల్ వెల్త్ యాస్పైర్: ఈ ప్లాన్కు ఐదేళ్ల లాక్ ఇన్పీరియడ్ ఉంది. ఈ ప్లాన్ను మీరు సరెండర్ చేసినట్లయితే, సరెండర్ విలువ డిస్కంటిన్యూడ్ పాలసీ ఫండ్కు బదిలీ చేస్తారు. డిస్కంటిన్యూ చార్జీలను మినహాయించుకొని ఐదేళ్లు పూర్తయిన తర్వాత ఈ సొమ్ములను మీకు చెల్లిస్తారు. ఇక ఎండోమెంట్ ప్లాన్ల విషయానికొస్తే, వీటిని కొనుగోలు చేసిన మూడేళ్ల తర్వాత గానీ వీటిని సరెండర్ చేయడానికి వీలు కాదు. మూడేళ్ల తర్వాత సరెండర్ చేస్తే, మీరు చెల్లించిన ప్రీమియమ్ల్లో 30 శాతం మొత్తం గ్యారంటీడ్ సరెండర్ వేల్యూగా లభిస్తుంది. ఈ పాలసీలను సరెండర్ చేయడం వల్ల మిగిలే ప్రీమియమ్లను మొత్తాలను మంచి మ్యూచువల్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేయండి. దీర్ఘకాలం పాటు మ్యూచువల్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేస్తే, మీరు పై మూడు ప్లాన్ల్లో నష్టపోయిన ప్రీమియమ్లను కూడా మీరు భర్తీ చేసుకోగలుగుతారు. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ బీమాను, ఇన్వెస్ట్మెంట్స్ను కలగలపకండి. మీ వెబ్సైట్లో హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్ ఎన్ఏవీ విలువ గత ఏడాది నవంబర్ 18న రూ.29.83గా ఉండగా, అదే రోజు నా పోర్ట్ఫోలియోలో మాత్రం రూ.27.70గా ఉంది. లావాదేవీల ఫీజు కారణంగా ఎన్ఏవీలో ఈ తేడా ఉందా? – సురేంద్ర, కాకినాడ హెచ్డీఎఫ్సీ బ్యాలన్స్డ్ ఫండ్ అనేది హైబ్రిడ్ ఫండ్. ఈక్విటీ, డెట్ విభాగాలు ఈ ఫండ్లో ఉంటాయి. అంటే ఈ ఫండ్స్ నిధుల్లో 65–70 శాతం వరకూ ఈక్విటీలోనూ, మిగిలిన మొత్తాలను డెట్ ఇన్స్ట్రుమెంట్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తారు. ఇక ఎన్ఏవీ ధరలో తేడా గురించి... లావాదేవీల ఫీజు కారణంగా ఎన్ఏవీలో తేడా ఉండదు. మీరు నవంబర్ 18న ఒకే ఫండ్కు రెండు విభిన్నమైన ఎన్ఏవీలు చూశారు. వీటిల్లో ఒకటి రెగ్యులర్ ప్లాన్ కాగా, ఇంకొకటి డైరెక్ట్ ప్లాన్. రెగ్యులర్ ప్లాన్ ఎన్ఏవీ 27.70గా ఉండగా, డైరెక్ట్ ప్లాన్ ఎన్ఏవీ 29.83గా ఉంది. సాధారణంగా ఒకే ఫండ్ను పరిగణనలోకి తీసుకుంటే, రెగ్యులర్ స్కీమ్ ఎన్ఏవీ కన్నా, డైరెక్ట్ ఫండ్ ఎన్ఏవీ అధికంగా ఉంటుంది. ఇక మీ అత్యవసర నిధి అవసరాల కోసం లిక్విడ్ డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీరు ఎంచుకోవడానికి కొన్ని మంచి రేటింగ్ ఉన్న లిక్విడ్ ఫండ్స్.. ఎస్కార్ట్స్ లిక్విడ్ డైరెక్ట్ ప్లాన్, ఎస్కార్ట్స్ లిక్విడ్ ప్లాన్, ఇండియాబుల్స్ లిక్విడ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్, ఎస్బీఐ మ్యాగ్నమ్ ఇన్స్టా లిక్విడ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్, బరోడా పయనీర్ లిక్విడ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్, టారస్ లిక్విడ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్. నా వయస్సు 80 సంవత్సరాలు. అత్యవసర నిధి(ఎమర్జన్సీ ఫండ్) నిమిత్తం కొంత సొమ్మును ఏదైనా ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. సరైన ఈక్విటీ ఫండ్ను సూచించండి. – రామకృష్ణ, వరంగల్ అత్యవసర నిధి నిమిత్తం ఇన్వెస్ట్ చేయడానికి ఈక్విటీ ఫండ్స్ను ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదు. కనీసం ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే ఈక్విటీ ఫండ్స్ను పరిగణనలోకి తీసుకోవాలి. అత్యవసర నిధి కోసం ఇన్వెస్ట్ చేసే సొమ్ము– మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకునేలా ఉండాలి. దీని కోసం లిక్విడ్ డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీరు ఎంచుకోవడానికి కొన్ని మంచి రేటింగ్ ఉన్న లిక్విడ్ ఫండ్స్.. ఎస్కార్ట్స్ లిక్విడ్ డైరెక్ట్ ప్లాన్, ఎస్కార్ట్స్ లిక్విడ్ ప్లాన్, ఇండియాబుల్స్ లిక్విడ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్, ఎస్బీఐ మ్యాగ్నమ్ ఇన్స్టా లిక్విడ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్, బరోడా పయనీర్ లిక్విడ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్, టారస్ లిక్విడ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ నా బీమా పాలసీ ల్యాప్స్ అయిపోయింది. ఇది నా సిబిల్ స్కోర్పై ఏమైనా ప్రభావం చూపుతుందా? – రవి, హైదరాబాద్ సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్) అనేది ఒక వ్యక్తికి సంబంధించిన రుణాలు, క్రెడిట్ కార్డ్ల చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, రికార్డ్లను నిర్వహిస్తుంది. ఏదైనా రుణం, క్రెడిట్ కార్డులు పొందడానికి సిబిల్ స్కోర్ ముఖ్యమైనది. ఒక వ్యక్తి రుణ చెల్లింపుల చరిత్ర ఎలా ఉంది ? చెల్లింపుల్లో ఎప్పుడైనా విఫలమయ్యాడా తదితర అంశాలు సిబిల్ స్కోర్లో తెలుస్తాయి. అంటే ఒక వ్యక్తి పరపతి చరిత్ర సిబిల్ స్కోర్ ఆధారంగానే ఆర్థిక సంస్థలు అంచనా వేస్తాయి. దీని ఆధారంగానే రుణాలను, క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తాయి. అయితే బీమా పాలసీ ల్యాప్స్ అయిపోతే దాని ప్రభావం సిబిల్ స్కోర్పై ఏ మాత్రం ఉండదు. -
ఈపీఎఫ్ నుంచి పాలసీ కట్టొచ్చు!
► కావాలంటే పీఎఫ్ సంస్థే కడుతుంది ► కానీ మీ ఖాతాలో డబ్బులుంటేనే సుమా! ► లేకపోతే పాలసీ రద్దయ్యే ప్రమాదమూ ఉంది ఎల్ఐసీ పాలసీలు మనలో చాలా మంది తీసుకుంటారు. ఉద్యోగులైతే ప్రత్యేకంగా వారి వేతనం నుంచి ప్రీమియం కట్టాల్సిన ఇబ్బంది లేకుండా భవిష్య నిధి (ఈపీ ఎఫ్)ని అందుకు ఉపయోగించుకోవచ్చు. చాలా మందికి ఈ విష యమై అవగాహన లేదు. ఈ సదుపాయం ఎలాగో ఓసారి చూద్దాం... కొత్తగా ఎల్ఐసీ పాలసీ తీసుకుంటున్నా, ఇప్పటికే పాలసీ తీసుకుని ఉన్నా... సంబంధిత పాలసీ వివరాలను ఈపీఎఫ్వోకు తెలియజేసి ప్రీమియాన్ని తమ భవిష్య నిధి నుంచి చెల్లించాలని కోరవచ్చు. అయితే, ఈపీఎఫ్వోకు చెప్పాం కదా అని దాని గురించి పట్టించుకోవటం మానొద్దు. ఎందుకంటే బీమా పాలసీ ప్రీమియాన్ని పీఎఫ్ నుంచి చెల్లించాలని కోరిన తర్వాత మీ భవిష్యనిధి ఖాతాలో నగదు నిల్వలు తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే ఈపీఎఫ్వో ఎలా చెల్లిస్తుంది చెప్పండి? పైపెచ్చు ఈ విషయంలో మిమ్మల్ని ఈపీఎఫ్వో అప్రమత్తం చేయదు కూడా. ఆ బాధ్యత పాలసీదారుడిపైనే ఉంటుంది. ఈపీఎఫ్వో గనక ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అయిపోతుందని గుర్తుంచుకోవాలి. భవిష్య నిధిలో డబ్బులున్నంత కాలం ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు సదుపాయం యాక్టివ్గానే ఉంటుంది. నిధిని ఖాళీ చేసేస్తే పాలసీదారు స్వయంగా బీమా పాలసీ ప్రీమియాన్ని గుర్తుంచుకుని మరీ చెల్లించుకోవాలి. ఈపీఎఫ్కు హక్కులివ్వాలి... భవిష్య నిధి నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియాన్ని చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని అనుకుంటే... ఆ పాలసీపై హక్కుల్ని ఈపీఎఫ్వో సంస్థకు దఖలు పరచాలనే నిబంధన ఉంది. భవిష్య నిధి నుంచి పాలసీ ప్రీమియాన్ని చెల్లించడం ద్వారా దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా ఈ నిబంధన విధించినట్టు తెలుస్తోంది. ఉదాహరణకు ఎల్ఐసీ ఎండోమెంట్ పాలసీని సరెండ్ చేయడం ద్వారా కట్టిన మొత్తంలో కొంత వెనక్కి అందుకునే అవకాశం ఉందన్న విషయం తెలుసు. అలాగే, పాలసీపై రుణం పొందే సదుపాయం కూడా ఉంది. భవిష్య నిధిని బీమా పాలసీకి మళ్లించి అక్కడి నుంచి నిధిని తరలించుకుపోకుండా ఈ నిబంధన విధించి ఉండవచ్చు. రెండేళ్లు నిండాలి... ఈ సదుపాయం కోసం ఈపీఎఫ్ చందాదారుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న వారే అర్హులు. ఉద్యోగం చేస్తున్న సంస్థలోనే ఇందుకు సంబంధించి ఫామ్ 14ను ఇస్తే సరిపోతుంది. ఈ ఫామ్ను ఈపీఎఫ్వో వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. భవిష్య నిధి నుంచి చెల్లించడం సరైనదేనా? ఎల్ఐసీ పాలసీ ప్రీమియాన్ని భవిష్య నిధి నుంచి చెల్లించడం కరెక్టేనా? అన్న సందేహం సహజం. జీవితానికి బీమా పాలసీ ఎంతో కీలకమైనది. ప్రీమియం సకాలంలో చెల్లిస్తేనే పాలసీ మనుగడలో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈపీఎఫ్వో ప్రీమియాన్ని చెల్లించిందా? లేదా? అన్నది గడువు తేదీ తర్వాత బీమా కార్యాలయంలో తెలుసుకోవాలి. లేదంటే వెంటనే చెల్లించాలి. ఈ మాత్రం సమయం కేటాయించే తీరిక ఉంటే భవిష్య నిధి నుంచి ప్రీమియాన్ని నిశ్చింతగా చెల్లించుకోవచ్చు. ఎందుకంటే భవిష్యనిధిలో నగదు నిల్వలు లేక ఈపీఎఫ్వో చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. దాంతో పాలసీదారుడు రిస్క్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక, భవిష్యనిధి అనేది ఉద్యోగ విరమణ తర్వాత అక్కరకు వచ్చే చక్కని సాధనం. దాని నిల్వల నుంచి పాలసీ ప్రీమియం చెల్లించడం కంటే వీలుంటే సొంత బడ్జెట్ నుంచి చెల్లించటమే మంచిది. బడ్జెట్ కష్టంగా ఉంటే, వేతనం నుంచి కట్టే అవకాశం లేకపోతేనే ఈపీఎఫ్ నుంచి చెల్లించడం ఎంచుకోవాలి. –సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
ఆస్తులకు ధీమా... అవసరానికో బీమా!
• జీవిత బీమా, వైద్య బీమా కొంత తప్పనిసరే • వాహనం, గృహ రక్షణకు వివిధ పాలసీలు • చిన్న వయసులో తీసుకుంటే తక్కువ ప్రీమియం • ఆన్లైన్లో తీసుకుంటే ఇంకాస్త చౌక ఉండటానికి ఇల్లుండాలి. రాకపోకలకు వాహనం ఉండాలి. అవసరమైతే ఆసుపత్రికీ వెళుతుండాలి. కాకపోతే... ఇవన్నీ ఉన్నా వీటిని కవర్ చేయడానికి బీమా పాలసీలుండటం చాలా ముఖ్యం. ఎందుకంటే వీటిలో ఏ ఒక్కదాన్లో తేడా వచ్చినా భరించటం మన వల్ల కాదు కాబట్టి!! సంపాదించే వ్యక్తికి జీవిత బీమా, వైద్య, వాహన, యాక్సిడెంట్, గృహ బీమా పాలసీలు ఎంత తప్పనిసరో వివరించేదే ఈ ప్రాఫిట్ కథనం... (సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం) చాలామంది బీమా అంటే డబ్బులు వృ«థా చేయడమనుకుంటారు. పాలసీలకు చెల్లించే ప్రీమియంలను వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చని భావిస్తారు కూడా. కానీ అనుకోనిదేదైనా జరిగితే!!? సంపాదించే వ్యక్తికి దురదృష్టవశాత్తూ ఏదన్నా జరిగితే? అప్పుడు ఆ కుటుంబం స్థితిగతులు పూర్తిగా తల్లకిందులవుతాయి. సంపాదించే వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్కు గురై, అంగ వికలుడైతే కుటుంబ జీవనోపాధి దెబ్బతింటుంది. ఏదైనా పెద్ద జబ్బు బారిన పడితే అప్పటివరకూ దాచుకున్నదంతా ఆసుపత్రికి ధారపోయాల్సి ఉంటుంది. చికిత్స కోసం 3–4 రోజులు హాస్పిటల్లో ఉంటే, ఆ ఖర్చు పదేళ్ల వైద్య బీమా ప్రీమియంలతో సమానంగా ఉంటుంది. ఆన్లైన్లో కాస్త చౌకే! మానసిక ప్రశాంతత కోసం మీరు ఎంత వెచ్చించాల్సి ఉంటుందంటే... మహా అయితే 35 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.2,000–3,000 వరకూ!! అది చేస్తే తన కుటుంబ ఆర్థిక భవిష్యత్తు పట్ల భరోసాగా ఉండొచ్చు. ఒక వ్యక్తి తప్పనిసరిగా తీసుకోవలసిన ఐదు బీమా పాలసీలకు నెలవారీ అయ్యే ఖర్చు ఇది. ఈ పాలసీలన్నీ చౌకైనవి. కమిషన్ తక్కువగా వస్తుంది కాబట్టి వీటిని విక్రయించడానికి ఏజెంట్లు ఆసక్తి చూపరు. అయితే ఈ పాలసీలకు ఏజెంట్ల బెడద లేదు. వీటిల్లో ఎక్కువ భాగం ఆన్లైన్లోనే కొనుగోలు చేయవచ్చు. ఏజంట్ల ద్వారా కొనటం కన్నా ఆన్లైన్లో కొంటే కాస్తంత చౌక కూడా!!. జీవిత బీమా తప్పనిసరి... ఒక వ్యక్తి వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు బీమా అవసరమనేది సాధారణ లెక్క. ఇది అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని వేసిన అంచనా. సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఆ వ్యక్తి తీర్చాల్సిన అప్పులు పోగా ఆ కుటుంబం సాఫీగా గడవటానికయ్యే ఖర్చులన్నీ కవరయ్యేలా ఈ బీమా ఉండాలి. దీనికి టర్మ్ బీమా పాలసీలు ఉత్తమం. వీటి ద్వారా తక్కువ ప్రీమియం కే ఎక్కువ బీమా రక్షణ పొందవచ్చు. 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటికి బీమా తీసుకుంటే ఆ వ్యక్తి చెల్లించాల్సిన ప్రీమియం ఏడాదికి రూ.10,000 మాత్రమే. అంటే ఒక్క రోజుకు రూ.28 మాత్రమే ఖర్చవుతుంది. రకరకాల టర్మ్ ప్లాన్లు.. బీమా కంపెనీలు వినియోగదారులు, పరిస్థితులకు తగ్గట్లుగా వివిధ రకాలైన టర్మ్ పాలసీలను అందిస్తున్నాయి. ఏటా పెరిగే ద్రవ్యోల్బణానికి తగ్గట్టు బీమా కవరేజీ ఉండే టర్మ్ ప్లాన్లూ అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఏటా ప్రీమియం చెల్లించడం తలనొప్పి అనుకుంటే ఒకేసారి ప్రీమియం చెల్లించి ఊరుకునే సింగిల్ టర్మ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వకుండా 10–15 ఏళ్లపాటు నెలవారీగా చెల్లించేవి... టర్మ్ పూర్తయ్యాక మీరు చెల్లించిన ప్రీమియంలు పూర్తిగా వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్లు... ఇలా చాలానే ఉన్నాయి. కాకపోతే వీటికి ప్రీమియం కొం చెం ఎక్కువ. ప్రీమియం, బీమా రక్షణ తర్వాత బీమా పాలసీ కాల వ్యవధే కీలకం. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 20 సంవత్సరాల కాలానికి టర్మ్ పాలసీ తీసుకున్నాడనుకుందాం. అతడు చెల్లించాల్సిన ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. కానీ అతడికి బీమా అవసరాలు అధికంగా ఉన్న వయస్సులోనే ఈ ప్లాన్ ముగిసిపోతుంది. ఆ వయస్సులో కొత్త పాలసీ తీసుకోవాలంటే ఖర్చులు తడిసిమోపెడవుతాయి. అప్పు డు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, బీమా నిరాకరించే అవకాశాలూ ఉంటాయి. అందుకని 50 ఏళ్లు వచ్చే సమయంలో ముగిసే బీమా పాలసీలు కాకుండా 60–65 ఏళ్ల వయస్సులో ముగిసే పాలసీలు తీసుకోవడం ఉత్తమం. చిన్న వయసులోనే బీమా పాలసీ తీసుకుంటే, ప్రీమియం తక్కువగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వివిధ స్థాయిల్లో బీమా రక్షణను సమీక్షించాల్సిన అవసరం కూడా ఉంది. గ్రూప్ బీమా కవరేజ్ ఉన్నాసరే.. కొంతమంది తమకు కంపెనీ గ్రూప్ బీమా కవరేజ్ ఉందని వైద్య బీమా పాలసీలు తీసుకోరు. ఇవి ఉండడం మంచిదే అయినా, ఇవి సరిపోవని గ్రహించాలి. వీటికి మినహాయింపులు, షరతులు అధికంగా ఉంటాయి. మీరు ఉద్యోగిగా ఉన్నంతవరకూ అవి వర్తిస్తాయి. మీరు ఉద్యోగం మానేస్తే ఈ బీమా రక్షణ లభించదు. అందుకని సొంతంగా వైద్య బీమా పాలసీ తీసుకోవడం తప్పనిసరి. మీకు గ్రూప్ బీమా కవరేజ్ ఉంటే. ఈ బీమా కవర్ను మరింతగా పెంచుకోవాలనుకుంటే, టాప్ అప్ ప్లాన్లు తీసుకోవచ్చు. వ్యయాలు ఒక పరిమితికి మించితేనే ఇవి వర్తిస్తాయి. కాబట్టి ఇవి చౌకగా ఉంటాయి. ఉదాహరణకు మీకు గ్రూప్ కవర్ రూ. 3 లక్షలు ఉందనుకుందాం. మీరు రూ.2 లక్షల టాప్ అప్ ప్లాన్ను రూ.2 లక్షల పరిమితితో కొనుగోలు చేస్తే, . మీ వైద్య ఖర్చులు రూ.2 లక్షల వరకూ గ్రూప్కవర్ భరిస్తుంది. రూ.2 లక్షలను మించితే టాప్అప్ ప్లాన్ వర్తిస్తుంది. అదనంగా... ప్రమాద బీమా భారత్లో యాక్సిడెంట్లు అధికం. యాక్సిడెంట్ కారణంగా తాత్కాలిక లేదా శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే, ఈ పాలసీ ఆదుకుంటుంది. అందుకని యాక్సిడెంట్ డెత్ అండ్ డిజేబిలిటీ కవర్ ముఖ్యమైన మూడో బీమా పాలసీ. యాక్సిడెంట్ కారణంగా మరణం సంభవిస్తే పాలసీ తీసుకున్న వ్యక్తి నామినీకి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తారు. అంగవైకల్యం సంభవిస్తే బీమా సంస్థ తగిన మొత్తంలోనే పాలసీ తీసుకున్న వ్యక్తికి సొమ్ములు చెల్లిస్తుంది. యాక్సిడెంట్ కారణంగా పనులు చేసుకోలేని పరిస్థితుల్లో నెలవారీ ఆదాయం కావాలనుకుంటే, అదనపు కవర్తో కూ డిన పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. కలల ఇంటికి రక్షణ... హోమ్ ఇన్సూరెన్స్ మనిషికి అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఇల్లొకటి. ఈ విషయం అర్థం చేసుకున్న కొద్దిమంది మాత్రమే హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. డ్యామేజీ జరగకుండా రక్షణ కోసం రూ.లక్షకు రూ.40 కనిష్ట ప్రీమియంతో ఈ తరహా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మీ ఇల్లు ఎంత విలువైనదో అంత మొత్తానికి పాలసీ తీసుకోనక్కర్లేదు. పునర్నిర్మాణానికి అయ్యే విలువకే బీమా తీసుకోవాలి. ఉదాహరణకు వెయ్యి చదరపు అడుగుల ఇంటికి రూ.18–30 లక్షల పాలసీకి బీమా చేయిస్తే, ఏడాదికి చెల్లించాల్సిన ప్రీమియమ్ రూ.800–2,400 రేంజ్లో ఉంటుంది. వీటిల్లో ఫైర్, ఇతర పాలసీలు కూడా ఉంటాయి. కానీ సమగ్రమైన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడమే ఉత్తమం. ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులకు కూడా బీమా కవర్ తీసుకోవచ్చు. సహజ, మానవ ఉత్పాతాల కారణంగా పాడయ్యే వస్తువుల రక్షణకోసం ఈ పాలసీలు తీసుకోవచ్చు. రూ.పది లక్షల విలువైన వస్తువుకు ఏడాది ప్రీమియం కనిష్టంగా రూ.255 ఉంటుంది. దోపిడీ, తదితర విధ్వంసాల రక్షణకు కూడా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాహన బీమా తప్పనిసరి కూడా!! మీ వాహనాలకు బీమా కవర్ తీసుకోవడం ముఖ్యమైనదే కాదు... తప్పనిసరి కూడా. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే... రిపేర్లకు అయిన బిల్లులను బీమా కంపెనీ భరిస్తుంది. బీమా ఉన్న వాహనానికి యాక్సిడెంట్ అయితే, యాక్సిడెంట్కు గురైన వ్యక్తికి పరిహారం కూడా బీమా సంస్థే చెల్లిస్తుంది. ఒక్కోసారి ఈ పరిహారం లక్షల్లో ఉండొచ్చు. అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. యాక్సిడెంట్లో గాయాలైనా, ఎవరైనా చనిపోయినా, అపరిమిత బీమా రక్షణ ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్లో ధర్డ్ పార్టీ ప్రీమియమ్లు పెరిగాయి. ఏడాదికి ఇవి రూ.2,000 రేంజ్లో ఉంటాయి. తమ వాహనం పాతదైపోయిందంటూ చాలా మంది బీమా పాలసీ తీసుకోవడం నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది ఖరీదైన తప్పు అని చెప్పవచ్చు. దొంగతనం, డ్యామేజ్ల కోసం బీమా పాలసీలు తీసుకోకపోయినా, థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ మాత్రం తీసుకుంటేనే మేలు. ఈ లయబిలిటీపై పరిమితి విధించాలని సాధారణబీమా కంపెనీలు ఎన్నో ఏళ్లుగా లాబీయింగ్ చేస్తున్నాయి. వచ్చే ప్రీమియం కంటే చెల్లించే పరిహారమే అధికమని ఈ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. వైద్య ఖర్చులకు బీమా మార్గం! జీవిత బీమా పాలసీ తర్వాత తీసుకోవలసిన ముఖ్యమైన పాలసీ వైద్య బీమా. కొందరైతే జీవిత బీమా కంటే వైద్య బీమాయే ముఖ్యమని కూడా అంటారు. ఎందుకంటే వైద్య ఖర్చులే భారీగా పెరుగుతున్నాయి. 3–4 రోజులు ఆసుపత్రిలో ఉంటే కనీసం రూ.50,000–60,000 ఖర్చు అవుతోంది. అయితే ఏడాదికి వైద్య బీమా వ్యయం రూ.10,000–15,000 రేంజ్లోనే ఉంటుంది. ఆదాయపు పన్నును పరిగణనలోకి తీసుకుంటే 30 శాతం పన్ను పరిధిలో ఉన్నవారికి వైద్య బీమా వ్యయం ఏడాదికి రూ.7,000–10,500 రేంజ్లోనే ఉంటుంది. మా పాలసీ తీసుకుంటే బోలెడు ప్రయోజనాలంటూ చాలా బీమా కంపెనీలు ఊదరగొడుతుంటాయి. ప్రయోజనాలున్న స్థాయిలో మినహాయింపుల కూడా ఉంటాయి. మనకు అవసరం లేని ప్రయోజనం కోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి రావచ్చు. వైద్య బీమా పాలసీల డాక్యుమెంట్లు చిత్ర విచిత్రమైన న్యాయపరమైన, వైద్య పరమైన పదబంధాలతో మనల్ని అయోమయానికి గురి చేస్తాయి. అందుకని నగదు రహిత, లేదా వైద్య సేవలనంతరం వ్యయాలను రీయింబర్స్ చేసే సాదా సీదా ఇండెమ్నిటీ పాలసీ తీసుకోండి. అదనపు బీమా కవర్ కావాలనుకుంటే, సంబంధిత ప్రయోజనాలందించే పాలసీని ఎంచుకోండి. కుటుంబంలో పెద్దలుంటే వారికోసం ప్రత్యేకమైన పాలసీ తీసుకుంటేనే మంచిది. -
డిజిటల్ బీమా.. వైపరీత్యాల్లో ధీమా
వర్షాలు.. వరదలు ఇతరత్రా రూపాల్లో ఇటీవలి కాలంలో ప్రకృతి వైపరీత్యాల ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. వీటి వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టం గణనీయంగానే జరుగుతోంది. వాస్తవానికి ప్రకృతి వైపరీత్యాల మీద మనకెలాంటి నియంత్రణ లేకపోయినప్పటికీ.. వాటి బారి నుంచి మనకి కొంతైనా ఉపశమనం కల్పించే బీమా పాలసీల విషయంలో కాస్త ముందుచూపుతో ఉంటే తగు ప్రయోజనాలు పొందే వీలుంటుంది. సులభంగా క్లెయిమ్ చేసుకునేందుకు సాధ్యపడుతుంది. పాలసీ క్లెయిమ్లకు సంబంధించి సమస్యలేమీ ఎదురవకుండా ఉండాలంటే.. ముందుగా ఆయా బీమా పాలసీల్లో వివిధ నిబంధనల గురించి తగినంత అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే పాలసీకి సంబంధించి మన హక్కులను పరిరక్షించుకునే వీలవుతుంది. ఈ దిశగా ఉపయోగకరమైన కొన్ని అంశాలివీ... * ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో భద్రపరచటం మేలు * వీలైతే బీమా కంపెనీల సైట్లలోనే రిజిస్ట్రేషన్ ఆరోగ్య బీమా జీవిత బీమా తరహాలోనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలను కూడా ప్రత్యేకంగా బీరువాల్లో దాచిపెట్టకుండా.. డిజిటల్ ఫార్మాట్లోనూ భ ద్రపర్చుకోవచ్చు. వర్తించే ప్రయోజనాలన్నీ పొందవచ్చు. అయితే, ఎంత ప్రకృతి వైపరీత్యాల్లాంటి సమయంలోనైనా హెల్త్ పాలసీ ప్రయోజనాలు పొందాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే క్లెయిములను బీమా కంపెనీ తోసిపుచ్చే అవకాశం ఉంది. ఏదైనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన పక్షంలో దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. ఒకోసారి క్యాష్లెస్ హాస్పిటలైజేషన్ కుదరకపోయినప్పటికీ.. నిర్దేశిత నిబంధనలు పాటిస్తే, తర్వాత దశలో రీయింబర్స్మెంట్ అయినా పొందడానికి వీలవుతుంది. జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్ని సాధ్యమైతే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో భద్రపర్చడం మంచిది. అలా కుదరకపోతే కనీసం పాలసీ నంబరునైనా ఎలక్ట్రానిక్ విధానంలో ఎక్కడో ఒక దగ్గర భద్రంగా ఉంచుకోవాలి. నిజానికిది చాలా సులువైన ప్రక్రియే. డాక్యుమెంట్ ను స్కాన్ చేసిన త ర్వాత మీ ఈమెయిల్ అకౌంట్లోనో లేదా ఆన్లైన్ డ్రైవ్లోనో స్టోర్ చేసుకోవచ్చు. సెర్చి ఇంజిన్ గూగుల్ ఇందుకోసం డాక్యుమెంట్స్, డ్రైవ్ వంటి సర్వీసులు అందిస్తోంది. జీమెయిల్ ఉంటే వీటిని ఉచితంగా కూడా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు పలు బీమా కంపెనీలు కస్టమర్లకు ఆన్లైన్ సౌకర్యాలు అందిస్తున్నాయి. అంటే పాలసీల్ని వీటిలో రిజిస్టరు చేసుకోవచ్చన్న మాట. ఒకసారి రిజిస్టరు చేసుకుంటే... ప్రీమియం చెల్లింపులు కూడా దీనిద్వారానే చేయొచ్చు. పాలసీ వివరాలతో పాటు చెల్లించిన రసీదులు కూడా దీన్లో భద్రంగా ఉంటాయి. దీంతో పాటు జీవిత బీమా పాలసీ తీసుకున్న సంగతిని పాలసీదారు తనపై ఆధారపడి ఉన్న కుటుంబసభ్యులకు/ నామినీలకు కచ్చితంగా తెలియజేయాలి. చాలా మంది ఈ విషయాన్ని గురించి వెల్లడించకుండా... పెద్ద తప్పు చేస్తుంటారు. ఒకవేళ పాలసీదారుకు ఏదైనా అనుకోనిది జరిగితే.. లైఫ్ ఇన్సూరెన్స్ ఉందన్న సంగతి నామినీకి తెలియకపోతే కట్టిన ప్రీమియంలు, ప్రయాస అంతా వృధానే అవుతుంది. కాబట్టి, జీవిత బీమా కంపెనీ పేరు, పత్రం లేదా నంబరు, సమ్ ఇన్సూర్డ్, ప్రీమియం, వేలిడిటీ మొదలైన వివరాలన్నీ నామినికీ తెలియపర్చి ఉంచాలి. ప్రస్తుతం అన్ని జీవిత బీమా కంపెనీలు.. పాలసీలను డిజిటల్ ఫార్మాట్లో ఇవ్వడంపై దృష్టి పెడుతున్నాయి. దీని వల్ల పేపర్లను పోగొట్టుకునే రిస్కులు తగ్గుతాయి. సాధారణ బీమా ఇతర పాలసీల మాదిరిగానే, జనరల్ ఇన్సూరెన్స్ విషయంలోనూ నిర్దిష్ట జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాల వల్ల మీ మోటార్సైకిలు, కారు, ఇల్లు లేదా వ్యాపారాలకు నష్టం వాటిల్లి క్లెయిమ్ పొందాలనుకుంటే.. సదరు ఘటన జరిగిన రెండు, మూడు రోజుల్లోగానే బీమా కంపెనీకి తెలియజేయాలి. ప్రకృతి వైపరీత్య పరిస్థితుల్లో పాలసీ కింద ఎంత మేరకు, ఏయే సమస్యలకు కవరేజి ఉంటుందో ముందుగానే నిబంధనలు తెలుసుకుని ఉండాలి. చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. రిస్కు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు అధిక ప్రీమియంలు కట్టాల్సి రావొచ్చు. ఇక ప్రైవేట్దైనా, ప్రభుత్వ రంగంలోనిదైనా.. బీమా కంపెనీని ఎంచుకునే ముందు క్లెయిమ్ సెటిల్మెంట్లో సదరు సంస్థ ట్రాక్ రికార్డును కూడా పరిశీలించుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. -
ఈ-కామర్స్ వెబ్సైట్లలో బీమా పాలసీలు
♦ అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి ♦ ఐఆర్డీఏఐ చైర్మన్ టి.ఎస్.విజయన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బీమా పాలసీలు ఇక నుంచి ఈ-కామర్స్ వెబ్సైట్లలో లభించనున్నాయి. పాలసీల అమ్మకం, సేవలు అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయని ఐఆర్డీఏఐ చైర్మన్ టి.ఎస్.విజయన్ వెల్లడించారు. గురువారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. హై కమర్షియల్ పాలసీలకు అక్టోబర్ 1 తప్పనిసరి చేయనున్నట్టు విజయన్ చెప్పారు. కస్టమర్ కోరితే కంపెనీ తప్పనిసరి ఆన్ లైన్లో అందుబాటులోకి తేవాల్సిందేనని అన్నారు. బీమా పోర్టబిలిటీ రానున్న రోజుల్లో పెద్ద సవాల్గా నిలువనుందన్నారు. ‘ప్రస్తుతం ఆరోగ్య బీమా పాలసీలకు మాత్రమే పోర్టబిలిటీ ఉంది. పాలసీ ప్రమాణీకరించి (స్టాండర్డైజ్) ఉంటేనే పోర్టబిలిటీకి ఆస్కారం ఉంటుంది. పాలసీలో విభిన్న షరతులు (క్లాజులు) ఉంటే ముందుగా సరళీకృతం చేసి ప్రమాణీకరించాలి. పోర్టబిలిటీ విషయంలో ఐఆర్డీఏఐ ముందు ఎటువంటి రోడ్ మ్యాప్ లేదు. పాలసీల డిజిటైజేషన్ తొలి అడుగు. ఇది పూర్తి అయితే పోర్టబిలిటీ గురించి ఆలోచిస్తాం. ఇది అమలైతే కంపెనీ సేవలకు రేటింగ్ ఇచ్చేందుకు కస్టమర్లకు వీలు కలుగుతుంది. మంచి సేవలందించే కంపెనీని ఎంచుకోవచ్చు’ అని వివరించారు. -
పాలసీ మెచ్యూరిటీపై పన్నులు ఎలా ఉంటాయి?
నేను 2006, జూన్లో పీఎన్బీ మెట్లైఫ్ ఫ్యామిలీ ఇన్కం ప్లాన్ను రూ.4 లక్షల బీమా కోసం తీసుకున్నాను. ఏడాదికి రూ.7,152 ప్రీమియమ్ చొప్పున పదేళ్ల పాటు ప్రీమియమ్ చెల్లించాను. ఈ పాలసీ ఇప్పుడు మెచ్యూర్ అయింది. ఇప్పుడు నేను ఏమైనా పన్నులు చెల్లించాలా? -సుందర్, విజయవాడ ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 10(10డి) ప్రకారం.., సాధారణ బీమా పాలసీల మెచ్యురిటీ మొత్తాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు పొందే మెచ్యూరిటీ మొత్తం, మీరు చెల్లించిన వార్షిక ప్రీమియమ్నకు ఐదు రెట్ల మొత్తం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పని లేదు. బీమా పాలసీలు మెచ్యూర్ అయినప్పుడు వచ్చే మొత్తాలపై పన్నులు ఏ ఏ సందర్భాల్లో ఉండవంటే.., 1. 2003, మార్చి 31 కంటే ముందు తీసుకున్న బీమా పాలసీలకు 2. 2003, ఏప్రిల్ 1 నుంచి 2012, మార్చి 31 మధ్య కాలంలో బీమా పాలసీలు తీసుకున్నట్లయితే, మీరు పొందే మెచ్యూరిటీ మొత్తం, మీరు చెల్లించిన వార్షిక ప్రీమియమ్నకు ఐదు రెట్ల మొత్తం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు- 3. 2012, ఏప్రిల్ 1 తర్వాత బీమా పాలసీలు తీసుకున్నట్లయితే, మీరు పొందే మెచ్యూరిటీ మొత్తం, మీరు చెల్లించిన వార్షిక ప్రీమియమ్నకు పది రెట్ల మొత్తం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు... ఈ సందర్బాల్లో మెచ్యురిటీ మొత్తాలపై ఎలాంటి పన్నులు ఉండవు. నేను ఆరేళ్ల నుంచి కోటక్ సూపర్ అడ్వాంటేజ్ యులిప్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్ పనితీరు సంతృప్తికరంగా లేదు. మెచ్యూరిటీ వరకూ ఈ యూలిప్లో కొనసాగితే మంచి రాబడులు వస్తాయని, మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ చెప్పాడు. ఈ యులిప్ నెలవారీ వ్యయాలు 4 శాతంగా ఉన్నాయి. ఈ యులిప్లో కొనసాగమంటారా? వద్దా ? - సతీష్ కృష్ణ, బెంగళూరు(ఈ మెయిల్ ద్వారా) కోటక్ సూపర్ అడ్వాండేజ్ యులిప్.. ఇతర యులిప్లతో పోల్చితే కొంచెం భిన్నమైనది. ఈ యులిప్లో రెండో ఏడాది నుంచి ప్రీమియమ్ అలకేషన్ చార్జీలు ఉండవు. ఈ యులిప్లో తప్పనిసరిగా వచ్చే రాబడులు రెండు ఉన్నాయి. మొదటిది ఫిక్స్డ్ అడ్వాంటేజ్.. పాలసీ కాలపరిమితిని బట్టి మీరు తొలి ఏడాది చెల్లించిన ప్రీమియమ్లో కొంత శాతం లభిస్తుంది. మీ విషయానికొస్తే, మీ పాలసీ కాలవ్యవధి 20 ఏళ్లు కాబట్టి. మీరు చెల్లించిన తొలి ఏడాది ప్రీమియమ్కు 200% మొత్తం తప్పనిసరిగా లభిస్తుంది. రెండోది డైనమిక్ అడ్వాంటేజ్.. పాలసీకి సంబంధించి చివరి మూడేళ్ల ఫండ్ విలువ సగటులో 3 శాతం లభిస్తుంది. సాధారణంగా వచ్చే రాబడులకు ఈ రెండు రాబడులు అదనం. అయితే ఇవన్నీ కూడా కలుపుకున్నా కూడా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసే ఈ పాలసీ ద్వారా మీకు తగిన రాబడులు రావని చెప్పవచ్చు. మీరు చెల్లించే ప్రీమియమ్లో ప్రతి ఏటా మెర్టాలిటీ చార్జీ కింద కొంత కోత ఉంటుంది. యులిప్లో స్వల్పమొత్తానికే బీమా రక్షణ ఉంటుంది. మీపై ఆధారపడిన వారికి ఈ బీమా రక్షణ సరిపోదు. యులిప్లు మార్కెట్ అనుసంధానిత ఫండ్స్ అయినప్పటికీ, ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్లా వీటిల్లో పారదర్శకత ఉండదు. ఎన్ఏవీ, పోర్ట్ఫోలియోలు, ఫండ్ మేనేజర్ వ్యూహాలు.. తదితర విషయాల్లో ఎలాంటి పారదర్శకత ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఉపసంహరించుకుంటే ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. యులిప్ చార్జీలతో పోల్చితే ఇవి తక్కువగానే ఉంటాయి. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ యులిప్ నుంచి వైదొలగడం సరైన నిర్ణయమే. బీమాను, ఇన్వెస్ట్మెంట్స్ను ఎప్పుడు కలగలపకూడదు. జీవిత బీమా కోసం టర్మ్ బీమా పాలసీలు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కనీసం ఐదేళ్ల పాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. స్టాక్ మార్కెట్కు మీరు కొత్త అయితే, ముందుగా మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్ను ఎంచుకోండి. ఈ ఫండ్లో ప్రతి నెలా కొంత మొత్తం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్పై మీకు కొంత అవగాహన ఉంటే, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయండి. నివాస భారతీయుడి హోదాలో గత ఏడాది నుంచి మ్యూచువల్ ఫండ్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ సిప్లు 2024 వరకూ ఉంటాయి. అయితే ఈ ఏడాది నుంచి నా హోదా నివాస భారతీయుడి నుంచి ప్రవాస భారతీయుడి(ఎన్నారై)గా మారింది. ఎన్నారైగా మారినప్పటికీ, ఈ సిప్ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించే వీలు ఉందా? లేకుంటే ఆపేయాలా? - నారాయణ, విశాఖ పట్టణం మీ నివాసిత హోదా మారినప్పటికీ, మీ మ్యూచువల్ ఫండ్ సిప్ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగింవచ్చు. అయితే మీరు మీ కేవైసీ(నో యువర్ కస్టమర్) వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్లు మీ మ్యూచువల్ ఫండ్ సంస్థకు పంపించి మీ కేవైసీని అప్డేట్ చేయించండి. మ్యూచువల్ ఫండ్స్లో నిరభ్యంతరంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించండి. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్) ప్రయోజనాలు సీనియర్ సిటిజన్లకు, ఇతర వయస్కులకు ఒకే విధంగా ఉంటాయా? సీనియర్ సిటిజన్లకు ఏమైనా అధిక ప్రయోజనాలు లభిస్తాయా? పీఓఎంఐఎస్కు ఏమైనా పన్ను ప్రయోజనాలుంటాయా? - అనుపమ, హైదరాబాద్ పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న గ్యారంటీడ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్గా పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్)ను చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్లో కొంత మొత్తం డిపాజిట్ చేస్తే, డిపాజిట్ చేసిన తేది నుంచి నెల తర్వాత కొంత మొత్తం ప్రతి నెలా ఐదేళ్ల పాటు అందుకోవచ్చు. ఈ డిపాజిట్లపై ప్రస్తుతం వడ్డీరేటు 7.8 శాతంగా ఉంది. ఈ స్కీమ్ కింద ఒక వ్యక్తి గరిష్టంగా రూ.4.5 లక్షలు, జాయింట్గా రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు రూ.4.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీరు ప్రతి నెలా రూ.2,925 చొప్పున ఐదు సంవత్సరాల పాటు ఆదాయాన్ని అందుకోవచ్చు. కాలపరిమితి పూర్తయిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం మళ్లీ మీకు లభిస్తుంది. ఇక వయస్సు విషయంలో ఎలాంటి ప్రయోజనాలు లేవు. సీనియర్ సిటిజన్లకు ఎలాంటి అధిక ప్రయోజనాలు ఉండవు. ఈ స్కీమ్ కింద వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
అమ్మకు బీమా బహుమతిగా ఇద్దాం!
అమ్మ అంటే... వెలకట్టలేని రెండక్ష రాలు. అమ్మకు బీమా పాలసీని బహుమతిగా ఇవ్వడం నిజంగా ఓ ప్రత్యేకతే.. మార్కెట్లో బీమాలెన్నో.. ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.ఇక్కడ అమ్మ అవసరాలను ప్రాధాన్యంలోకి తీసుకోవాలి. వాటికి అనుగుణంగా పాలసీని ఎంచుకోవాలి. అవేంటో చూద్దాం... వ్యక్తిగత ప్రమాద బీమా: ఎవరైనా ప్రమాదానికి గురికావొచ్చు. కాబట్టి ఈ బీమా తీసుకోవడం మంచిది. ఏదైనా జరిగినప్పుడు కుటుంబ సభ్యులపై, సన్నిహితులపై ఆర్థికంగా ఆధారపడటం కొంత తగ్గుతుంది. ఆరోగ్య బీమా: ఆమె బాగుంటేనే.. మనం బాగున్నట్లు. ఎందుకంటే మన అవసరాలను తను చూసుకుంటుంది కాబట్టి. ఆమెకు ఎదైనా హెల్త్ ఎమర్జెన్సీ సంభవిస్తే ఆ పరిస్థితుల నుంచి గ ట్టెక్కడానికి ఆరోగ్య బీమా తప్పనిసరి. అత్యవసర బీమా: మహిళలకు మాత్రమే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటి చికిత్సకు అధిక మొత్తంలో ఖర్చవుతుంది. వీటికి సంబంధించి అత్యవసర బీమా పాలసీని తీసుకోవాలి. వాహన బీమా: ఒకవేళ అమ్మ ఉద్యోగం చేస్తుంటే.. తనకు వాహనం ఉంటే.. వాహన బీమా తీసుకోవాలి. ఇంటి బీమా: మహిళలు రకరకాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారు ఆర్థికంగా స్వతంత్రులుగా ఉండి, ఆర్థికపరమైన అంశాల్లో స్వీయ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే.. వారికి ఇంటి బీమాను కానుకగా ఇవ్వండి. ట్రావెల్ ఇన్సూరెన్స్: ప్రస్తుతం మహిళలు ఉద్యోగం/వ్యాపారంలో భాగంగా దేశ విదేశాలు చుట్టేస్తున్నారు. కొందరు ఉల్లాసం, కొత్తదనం కోసం టూర్లకు వెళ్తూ ఉంటారు. ఈ విధంగా అమ్మ కూడా తరచూ విదేశాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటే.. ఆమెకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం. అది వారికి కొత్త ప్రదేశాల్లో అనుకోని పరిస్థితులు సంభవిస్తే.. రక్షణ కల్పిస్తుంది. గృహిణైనా? ఉద్యోగిణైనా? బీమా తప్పనిసరి భారత్లో బీమా వ్యాప్తి తక్కువే. బీమా పరిశ్రమ నివేదికల ప్రకారం.. బీమా తీసుకున్న వారిలో మహిళల వాటా 20-30 శాతం మాత్రమే. గతంలో కుటుంబంలోని మహిళకు ఎలాంటి ఆర్థికపరమైన బాధ్యతలు ఉండవనే కారణంతో వారికి బీమా ఎందుకని అనుకునేవారు. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు వారూ బాధ్యతలను మోస్తున్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కానీ బీమా దగ్గరకు వచ్చేసరికి ఎలాంటి మార్పు లేదు. ఇది మారాలి. వారికి కూడా బీమా తీసుకోవాలి. కనీసం ఇంట్లో అమ్మకైనా బీమా ఇప్పించాలి. ఆమె గృహిణా? ఉద్యోగిణా? అనేది ఇక్కడ అనవసరం. - పునీత్ సాహ్ని హెడ్- ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ -
మహిళలు ఎందుకని తక్కువ ప్రీమియం చెల్లిస్తారు?
ఫైనాన్షియల్ బేసిక్స్.. అతని పేరు కృష్ణ. వయస్సు 32 ఏళ్లు. కొత్తగా రెండు బీమా పాలసీలు తీసుకుందామనుకున్నాడు. ఒకటి తనకు. మరొకటి తన భార్యకు. అందుకు తగినట్లే ఇద్దరూ ఒకే రకమైన జీవిత బీమా పాలసీలను ఎంచుకున్నారు. ఇద్దరం ఒకే పాలసీ తీసుకున్నాం కదా.. ప్రీమియం కూడా ఒకేలా ఉంటుందనుకున్నాడు కృష్ణ. కానీ ఇక్కడ ఇద్దరికీ ప్రీమియం వేర్వేరుగా ఉంది. కృష్ణ పాలసీ ప్రీమియం తన భార్య పాలసీ ప్రీమియంతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇక్కడ కృష్ణ కన్నా అతని భార్య వయసులో పెద్దది. అంటే వయసు పెరిగే కొద్ది ప్రీమియం కూడా పెరుగుతుంది కదా? అయినా కూడా ఇక్కడ అలా జరుగలేదు. పరిస్థితి భిన్నంగా ఉంది. దీనికి ఒక్కటే ప్రధాన కారణం. అది జీవన ప్రమాణం. సాధారణంగా మగవారితో పోలిస్తే మహిళల జీవన ప్రమాణం ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు పురుషుల కన్నా ఎక్కువ కాలం జీవిస్తారన్న మాట. అందుకే బీమా కంపెనీలు మహిళలకు సంబంధించిన పాలసీల విషయంలో కొంత తక్కువ ప్రీమియాన్ని వసూలు చేస్తాయి. -
బీమా ఎందుకు?..
ఊహించడానికే వీల్లేని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మనపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండటమే బీమా పాలసీ ముఖ్య ఉద్దేశం. పెళ్ళికాని యువతుల విషయానికొస్తే వీరిపై తల్లిదండ్రులు లేదా చెల్లి, తమ్ముడు వంటి వారు ఆధారపడతారు. పిల్లలున్న తల్లులయితే... పిల్లల ఆర్థిక భద్రత ముఖ్యం కదా!! అంతేకాదు మహిళలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీటన్నింటికి జీవిత, ఆరోగ్య బీమాలు చక్కటి పరిష్కారాన్ని అందిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో బీమా ఉండాలి. -
ఉద్యోగంతో పాటు బీమా ముఖ్యమే..!
జీవితంలో ప్రతి ఒక్కరికీ బీమా చాలా ముఖ్యం. కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న మహిళలు బీమాకి దూరంగా ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి చిన్న వయసులో బీమా పాలసీ తీసుకోవడమనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వయసుతో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడు చిన్న వయసులోనే పాలసీని తీసుకోవడం ద్వారా తక్కువ ప్రీమియంతో దీర్ఘకాలం కొనసాగవచ్చు. 30 ఏళ్లలోపున్న ఉద్యోగినులకు బీమా అవసరం గురించి తెలిసినా... ఇప్పుడు మేం బాగానే ఉన్నాం కదా!! అనే ధోరణితో వారి పోర్ట్ఫోలియోలో బీమాకు చోటివ్వటం లేదు. వీరు అత్యధికంగా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ వంటి నష్టభయం ఎక్కువగా ఉండే ఇన్వెస్ట్మెంట్ సాధనాలవైపే చూస్తున్నారు. -
రెంటొమో.. ఇదో స్టోర్ రూం స్టార్టప్!
♦ హెయిర్ బ్లోయర్ నుంచి హై ఎండ్ కార్ల దాకా.. ♦ ప్రతీ ఒక్కటీ అద్దెకిస్తున్న రెంటొమో ♦ 6 నెలల్లో పాత వస్తువులకూ బీమా పాలసీ ప్రారంభం ♦ రూ.60 లక్షల నిధుల సమీకరణ కూడా.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతి ఇంట్లో స్టోర్ రూమ్ కామన్. అందులో వాడి పడేసిన వస్తువులు చాలానే ఉంటాయి. పారేయడానికి మనసు రాక, మళ్లీ వాడాలన్న ఇంట్రస్టూ లేక అవి దుమ్ముపట్టిపోతుంటాయి. అయితే మనకు అక్కర్లేదనుకునే వస్తువులు ఇతరులకు పనికి రావొచ్చుగా! మనం పారేయాలనుకున్న వస్తువులు వేరేవాళ్లకు విలువైనవిగా అనిపించొచ్చుగా! దీన్నే వ్యాపార సూత్రంగా మార్చుకున్నాడు అన్షుల్ జోరి. ఇంకా చెప్పాలంటే హెయిర్ బ్లోయర్ నుంచి హై ఎండ్ కార్ల దాకా ప్రతీ ఒక్కటీ అద్దెకిచ్చే ‘రెంటొమో’ సంస్థను ప్రారంభించాడు. మరిన్ని వివరాలివిగో.. పుణే వర్సిటీలో ఎంసీఏ చేశాక.. ఐబిబో, ఆస్క్ లైలా, బుక్ అడ్డా, అమెజాన్ వంటి కంపెనీల్లో కొంత కాలం ఉద్యోగం చేశా. ఓసారి కుటుంబంతో కలిసి యూరప్కు వెళ్లా. టూరిస్ట్లకు రూమ్ షేరింగ్ ఇచ్చే ఎయిర్ బీఎన్బీ సంస్థ సేవలను చూసి ఆశ్చర్యపోయా. ఇందులో కేవలం గదే కాదు చార్జర్, కెమెరా, ల్యాప్టాప్, బైకు, కారు.. ఇలా ప్రతీ ఒక్కటీ అద్దెకిస్తున్నారు. అచ్చం ఇలాంటి సేవలను మన దేశంలోనూ ప్రారంభిస్తే బాగుండనిపించింది! ఆఫీసుకొచ్చాక తెలిసిన వాళ్లకు, సహోద్యోగులకు ఈ-మెయిళ్లు పెట్టా. నా దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అద్దెకు కావాలంటే తీసుకోండని! ఆశ్చర్యకరంగా చాలా మంది నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకేముంది రూ. 5 లక్షల పెట్టుబడితో ఆగస్టు 2015లో రెంటొమో సంస్థను ప్రారంభించాం. షేరింగ్ ఎకానమీ. సూటిగా చెప్పాలంటే వస్తువులను అద్దెకివ్వటం, తీసుకోవటం. అయితే మన దేశంలో ఇలాంటి సంస్థలంటే బైకులు, కార్ల వంటి వాటికే పరిమితం. కానీ, అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో దువ్వెన్లు, కెమెరాలు, చార్జర్లు, వంటింట్లోని సామాన్లు.. ఇలా ప్రతీ ఒక్కటీ అద్దెకు దొరకుతాయి. ప్రతీ ఒక్కటీ యూజ్ అండ్ పే పాలసీనే. సరిగ్గా ఇలాంటి కంపెనీయే రెంటొమో. అంటే వస్తువు యజమానులను, అద్దెకు తీసుకునే వారిని ఇద్దరినీ కలపడమే రెంటొమో పని. ఇంకా చెప్పాలంటే స్టోర్ రూం వస్తువులకు అగ్రిగేటరన్నమాట. రూ.10 నుంచి రూ.10 వేల దాకా.. ప్రస్తుతం రెంటొమోలో ట్రావెల్, స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్, మోటార్ బైక్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ వంటి విభాగాల్లో సుమారు 550 వస్తువులు అద్దెకిచ్చేందుకు రిజిస్టరై ఉన్నాయి. అవసరాన్ని బట్టి నెల, రోజు, వారం లెక్కన వస్తువులను అద్దెకు తీసుకోవచ్చు. వీటి ధరలు పది రూపాయల నుంచి పది వేల దాకా ఉన్నాయి. బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన రెంటొమో సేవలు హైదరాబాద్, ఢిల్లీ, గుర్గావ్, పుణె, లక్నో నగరాలకు విస్తరించాయి. వస్తువులను అద్దెకివ్వాలనుకుంటే.. మన దగ్గరున్న వస్తువులను రెంటొమో ద్వారా అద్దెకివ్వాలనుకుంటే.. రెంటొమో వెబ్సైట్లోకి లాగిన్ కాగానే అక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి వస్తువు తాలుకు ఫొటోలను అప్లోడ్ చేసి.. ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, అద్దె వంటి ఇతర వివరాలిస్తే సరిపోతుంది. అద్దెకు తీసుకోవాలనుకునే వ్యక్తి.. మా వెబ్సైట్లోకి లాగిన్ అయి ఏ వస్తువు కావాలో నమోదు చేస్తే చాలు.. దానికి సంబంధించిన వ్యక్తుల, వాటి అద్దె వివరాలొస్తాయి. నచ్చితే సంబంధిత వ్యక్తి తాలుకు ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ఫెరిఫై చేసి.. వస్తువు తాలూకు యజమాని ఫోన్ నంబర్ను ఇస్తాం. మరో ఆరు నెలల్లో అప్లోడ్ చేసే వస్తువులకు బీమా పాలసీలను ప్రారంభించనున్నాం. అపోలో, భారతీ ఆక్సా సంస్థలతో చర్చిస్తున్నాం. వస్తువులు తిరిగొస్తాయా మరి.. యజమానుల దగ్గర్నుంచి వస్తువులను అద్దెకు తీసుకొని అవసరం తీరాక తిరిగి ఇచ్చేయడమే దీని పని. అంటే తాత్కాలిక అవసరాల కోసం కొత్త వస్తువులు కొనాల్సిన పనుండదు. దానివల్ల డబ్బు మిగులుతుంది. అటు అద్దెకిచ్చిన వారికీ ఎంతో కొంత ఆమ్దాని. ఎలా చూసినా ఇద్దరికీ లాభమే. అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. అద్దెకిచ్చిన వస్తువు తిరిగి రాకపోతే? ఒకవేళ వచ్చినా ఏదైనా డ్యామేజి జరిగితే? దానికీ ఓ పరిష్కారం చూపించింది రెంటొమో. చుట్టుపక్కల వాళ్లు స్నేహితులు, కామన్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ ఇలా రెంటొమోలో ఒక కమ్యూనిటీ ఉంటుంది. వారిలో అవసరం ఉన్న వారికి వస్తువులు అద్దెకివ్వొచ్చు. ఫేస్బుక్ ఐడీతో ఇందులోకి రిజిస్టర్ కావాల్సి ఉంటుందన్నమాట. రూ.60 లక్షల నిధుల సమీకరణ.. ‘‘సంస్థను ప్రారంభించిన 5 నెలల్లోనే సుమారు 6 వేల మంది మా సేవలను వినియోగించుకున్నారు. రోజుకు 30-40 మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఇటీవలే రెంటొమో ఆండ్రాయిడ్ యాప్ను కూడా ప్రారంభించాం. ప్రస్తుతం మా సేవలు ఉచితంగానే అందిస్తున్నాం. ఇటీవలే మా సంస్థలో యూకే నుంచి శివ అశోక్, యూఏఈకి చెందిన మరో ఇన్వెస్టర్ ఇద్దరు కలిసి రూ.60 లక్షల పెట్టుబడులు పెట్టారని’’అన్షుల్ వివరించారు. -
కట్టేది తక్కువ... పొందేది ఎక్కువ
టర్మ్ ఇన్సూరెన్స్ ఉమన్ ఫైనాన్స్ ఈ రోజుల్లో ఆలుమగలు ఇద్దరూ సంపాదిస్తే గానీ కుటుంబం సజావుగా సాగదు. కనుక చాలామంది మహిళలు తప్పనిసరిగా ఉద్యోగమో, వ్యాపారమో ఏదో ఒకటి చేస్తూ తమ కుటుంబ ఖర్చులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఆదాయంలో తమ మిగులుకు తగ్గట్లుగా పొదుపు చేసి వాటిని సరైన మార్గాలలో పెట్టుబడి పెడుతున్నారు. మరి ఏ కారణం చేతనైనా ఆలూమగలలో ఒకరి ఆ సంపాదన ఆగిపోతే? ఈ ప్రశ్నకు సరైన సమాధానం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక నిర్ణీత కాలానికి లభ్యమయ్యేది. ఆ నిర్ణీత కాలంలో మరణం సంభవిస్తే, ఎంత మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకొంటామో అంత మొత్తం నామినీకి అందజేస్తారు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే:కనీసం 18 సంవత్సరాల వయస్సు కలవారై ఉండాలి. చాలావరకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ టర్మ్ పాలసీలను గరిష్టంగా 60 సంవత్సరాల వయస్సు గలవారి వరకు అందజేస్తున్నారు. చాలా తక్కువ (1/2) కంపెనీలు మాత్రమే 70 ఏళ్ల వారికి కూడా అందజేస్తున్నారు. ఈ పాలసీని కనీసం 5 నుండి 40 ఏళ్ల కాలపరిమితి వరకు ఇస్తున్నారు.ఎంత మొత్తం భీమాకి అనుమతిస్తారో పాలసీదారుకి వయస్సు, సంపాదన, తదితర విషయాల మీద ఆధారపడి ఇన్సూరెన్స్ కంపెనీలు నిర్థారిస్తాయి. {పీమియం ఎంతైతే చెల్లిస్తారో ఆ మొత్తం ఇన్కమ్ట్యాక్స్ యాక్ట్ 1961, సెక్షన్ 80సి కింద పన్ను రాయితీ లభిస్తుంది. ఈ టర్మ్ పాలసీ ప్రీమియం సాంప్రదాయక పథకాలైన ఎండోమెంట్, హోల్ లైఫ్ మొదలైన వాటితో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం పాలసీదారు చనిపోతేనే నామినీకి ఈ కవరేజీ అందుతుంది. పాలసీ గడువు ముగిసిన తరువాత కూడా పాలసీదారు జీవించి ఉన్నట్లయితే, ఎటువంటి కవరేజీ రాదు. ఎందుకంటే టర్మ్ పాలసీ అనేది పూర్తిగా రిస్క్ని అధిగమించడానికి ఉపయోగపడేదిగా ఉంటుంది. పాలసీ తీసుకొనేటప్పుడు గమనించదగ్గ విషయాలు: పాలసీ ప్రపోజల్ ఫామ్లో అన్ని విషయాలు (మీ ఫ్యామిలీ హిస్టరీ, సంపాదన, ఆరోగ్య సమస్యలు మొదలైనవి) పొందుపరచండి. ఒకవేళ మీరు దాచిన విషయం ఏదైనా పాలసీ ఇచ్చే విషయంలో ప్రభావం చూపేదైతే, క్లైమ్ సెటిల్మెంట్ చేయరు. నామినీని తప్పనిసరిగా నమోదు చేయండి.పాలసీ నియమ నిబంధనలని తప్పనిసరిగా చదివి ఏ పాలసీ కావాలో నిర్ణయించుకోండి. మీ వయస్సు, సంపాదించడానికి మీకున్న కాలం, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక బరువు బాధ్యతలు, భవిష్యత్తులో మీరు సంపాదించే మొత్తం, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు... ఇలా పలు విషయాలను పరిగణనలోకి తీసుకొని మీ జీవితానికి ఉండే విలువను లెక్కలోకి తీసుకోవాలి. దానికి అనుగుణంగా జీవిత భీమాని ఈ టర్మ్ పాలసీ ద్వారా తీసుకోవచ్చు లేదా మీ వార్షిక ఆదాయానికి 10 నుండి 12 రెట్ల కవరేజీని తీసుకోవచ్చు. మనిషి చనిపోతేనే కవరేజీ వస్తుంది, బతికి ఉన్నట్లయితే మనం కట్టిన ప్రీమియం మొత్తం పోతుంది కదా అనే ఒక అపోహతో ఈ పాలసీని కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. సంపాదించే వ్యక్తి అనుకోని సంఘటన వల్లో, జబ్బునపడో, మరే ఇతర కారణం చేతనైనా మరణిస్తే అతను/ ఆమె లేని లోటు ఎవరూ పూడ్చలేరు. ఆ కుటుంబం, వారికుండే ఆర్థిక అవసరాలు, లక్ష్యాలు ముందుకు వెళ్లాలి కాబట్టి అందుకు ఆర్థిక చేయూత ఎంతైనా అవసరం. ఆ చేయూతను సరైన భీమా పాలసీ మాత్రమే తీరుస్తుందని గుర్తించాలి. -
యులిప్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా?
ఫైనాన్షియల్ బేసిక్స్.. అయితే ముందు యులిప్స్ అంటే ఏంటో తెలియాలి. యులిప్స్కి సంప్రదాయ ఇన్సూరెన్స్ పాలసీలకు మధ్య ఉన్న తేడాలపై స్పష్టమైన అవగాహనకు రావాలి. మీరు ఎంత రిస్క్ భరించగలుగుతారు? మీ వయసు? సంపాదన వంటి అంశాలు పాలసీ ఎంపికను ప్రభావితం చేస్తాయి. ఈక్విటీ, డెట్ ఫండ్స్కు కేటాయించే మొత్తాన్ని కూడా మీరు పాలసీ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలి. ఎక్కువ రిస్క్ను భరించగలిగితే ఈక్విటీ ఫండ్స్పై, తక్కువ రిస్క్వైపు మొగ్గుచూపితే డెట్ ఫండ్స్పై ఎక్కువగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మధ్యరకంగా ఉండాలంటే అటు ఈక్విటీ ఫండ్స్కు, ఇటు డెట్ ఫండ్స్కు సమాన కేటాయింపులు జరపాలి. ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు వాటి పనితీరును పరిగణనలోకి తీసుకోండి. పాలసీ చార్జీలు ఎలా ఉన్నాయో గమనించండి. సాధారణంగా యులిప్స్లో ప్రీమియం కేటాయింపు, ఫండ్ మేనేజ్మెంట్, పాలసీ అడ్మినిస్ట్రేషన్ వంటి అంశాలకు సంబంధించిన తదితర చార్జీలు ప్రధానంగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకోండి. ప్రస్తుతం మార్కెట్లో చాలా బీమా కంపెనీలున్నాయి. అవి కస్టమర్లకు పలు రకాల యులిప్ పాలసీలనందిస్తున్నాయి. ఒక కంపెనీ పాలసీని మరొక కంపెనీ పాలసీతో పోల్చి చూసుకోండి. ఎందుకంటే బీమా కంపెనీల పాలసీలన్నీ ఒకే విధంగా ఉండవు. ఏ బీమా కంపెనీ పాలసీ మీకు అనువుగా ఉంటుందని భావిస్తారో దాన్ని ఎంపిక చేసుకోండి. పాలసీ ఎంపికకు ముందు ఇన్సూరెన్స్ అడ్వైజర్ సలహాలను కూడా తీసుకోవచ్చు. అదే సమయంలో ఆయన సిఫార్సు చేసిన ప్రొడక్ట్ గురించి మీకేమైనా సందేహాలుంటే వాటిని అడిగి నివృత్తి చేసుకోండి. -
ఉద్యోగం.. బంగారం అంటూ దగా
సాక్షి,సిటీబ్యూరో: కోరుకున్న ఉద్యోగం ఇప్పిస్తాం... మా సొసైటీలో సభ్యత్వం తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ధనవంతులను చేస్తాం....ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే రుణమిస్తాం... ఇలా ఎరవేసి హైదరాబాదీలను మోసం చేసిన మూడు కేసుల్లో ఆరుగురు నిందితులను నగర సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీ. ముంబైల్లో అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ ప్రభాకర్రావు కథనం ప్రకారం...మీరు కోరుకున్న ఉద్యోగం ఇప్పిస్తామంటూ క్వికర్.కామ్లో హారిజాన్ కన్సల్టెన్సీ పేరుతో ఓ ప్రకటన వచ్చింది. అది చూసి ఏసీ గార్డ్స్కు చెందిన మిర్ ఫహద్ అలీ... హారిజాన్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు సందీప్కు కాల్ చేశాడు. కెనడాలోని వైవైసీ కాలగ్రె ఎయిర్పోర్టు ఆథారిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని, ఒక్కొక్కరికి రూ.18 వేలు ఖర్చవుతుందని చెప్పాడు. అలీ తనతో పాటు భార్య, బావమరిదితో కలిపి ముగ్గురికి రూ.54 వేలు అతడిచ్చిన బ్యాంక్ ఖాతాలో జమ చేశాడు. ఆ తర్వాత కెనడా వెళ్లేందుకు విమాన టికెట్ల కోసమని రూ.49 వేలు జమ చేయించుకున్నాడు. పార్క్ హయత్ హోటల్కు వెళ్తే జన్నీఫర్ అనే మహిళ మీకు ఉద్యోగపత్రాలు ఇస్తుందని చెప్పాడు. అక్కడికి వెళ్లిన అలీకి ఆ పేరుతో ఎవరూ లేరని తెలిసింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు నగర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు ముంబైలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి సయ్యద్ రజాక్ అలియాస్ సందీప్ను అరెస్టు చేశారు. రూ.22 వేల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. సొసైటీలో సభ్యత్వమంటూ ... సీక్రెట్ సొసైటీ ఇల్యూమ్నటిలో సభ్యత్వం తీసుకుంటే మీకు బంగారం, డబ్బు వస్తుందని, త్వరగా ధనవంతులు కావచ్చని నైజీరియాకు చెందిన రెమాండ్ హుడ్ బల్క్ పంపిన మెయిల్కు మల్లేపల్లికి చెందిన పతాన్ అమీనా బీ స్పందించింది. ఆమెను నమ్మించి హుడ్బల్క్ దశలవారీగా రూ.9.63 లక్షలు వివిధ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నాడు.తర్వాత బంగా రు పార్సిల్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ క్లియరెన్స్, ఆర్బీఐ క్లియరెన్స్ కోసం ఆగిపోయిందని, డబ్బు పంపమని కోరితే చెల్లించింది. చివరకు తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది కూడా ముంబై కేంద్రంగా జరిగిన మోసంగా గుర్తించిన పోలీసులు నిందితుల ఖాతా వివరాల ఆధారంగా రేమండ్కు సహకరించిన రాజేంద్రకుమార్ వర్మ, అనిల్కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు సెల్ఫోన్లు, 12 చెక్బుక్లు, డెబిట్ కార్డు స్వైపింగ్ యంత్రా న్ని స్వాధీనం చేసుకున్నారు లోన్లు ఇప్పిస్తామంటూ బురిడీ... అబిడ్స్కు చెందిన నిషాచల్ నరేంద్ర ప్రసాద్కు ఢిల్లీ నుంచి నేహగుప్తా ఫోన్ చేసి యూనియన్ వాల్యూ సర్వీసెస్ పాలసీ తీసుకుంటే మీకు లోన్లు ఇప్పిస్తామని నమ్మించి రూ.45 వేలు తీసుకొని మోసం చేశాడు. బాధితుడు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ భరత్చౌదరి, రమణ్దీప్, అంకూర్, అనాస్ అలీ, మునీ త్ ముఖర్జీ, రిహిత్కపూర్, ప్రేమ్కుమార్ దోవ, గన్శ్యామ్సింగ్ తదితరులు డల్ ఈజీ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, కేర్ ఇండియా ఫౌండేషన్, యూనియన్ వాల్యూ సర్వీసెస్, మనీక్యాస్ సొల్యూషన్, విన్నర్ 10 ఇంటర్నేషనల్, ఇన్ప్రా తదితర పేర్లతో సంస్థలను నడిపిస్తున్నట్టు తెలిసింది. ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అమాయాకులకు ఫోన్లు చేసి లోన్లు ఇప్పిస్తామంటూ, ఇన్సూరెన్స్ తీసుకుంటే రుణాలు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఇదే కాల్ సెంటర్ నుంచే అబిడ్స్కు చెందిన నరేంద్ర ఫోన్కాల్ వచ్చింది. నరేంద్ర డబ్బు డిపాజిట్ చేసి బ్యాంక్ ఖాతాదారులైన అనాస్ అలీ, గన్శ్యామ్, ప్రేమ్కుమార్లను అరెస్టు చేసి, నాలుగు మొబైల్ఫోన్లు, ల్యాప్టాప్లు, డెబిట్కార్డులు, పాన్కార్డులు, చెక్బుక్లు, రూ.68 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
సిగరెట్లు తాగినా... ఆ విషయం దాచొద్దు
మల్టీ నేషనల్ కంపనీలో పనిచేసే రమేష్... వారాంతాల్లో పార్టీలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు సిగరెట్లు కాలుస్తుంటాడు. తాను రెగ్యులర్గా సిగరెట్లు తాగడు కనక అదేమీ పెద్ద విషయం కాదనుకుని, ఆ వివరాల్ని బీమా పాలసీ తీసుకున్నప్పుడు పేర్కొనలేదు. ఇలా అప్పుడప్పుడు సిగరెట్లు కాల్చే చాలామంది ఆలోచన విధానం ఇదే విధంగా ఉంటుంది. కానీ బీమా పాలసీ తీసుకునేటప్పుడు మాత్రం సిగరెట్ కాల్చే అలవాటు గురించి మాత్రం తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే ఇప్పుడు బీమా కంపెనీలు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దీన్ని బట్టే మీరు చెల్లించే ప్రీమియాన్ని కూడా నిర్దేశిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్లో టర్మ్ పాలసీలను పోటీ పడి మరీ తక్కువ ప్రీమియంకే అందిస్తుండటంతో కంపెనీలు ఇటువంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. సిగరెట్ కాల్చేవారు ఆ అలవాటు లేని వారితో పోలిస్తే 1.5 నుంచి 2 రెట్లు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. మూడు రకాలు.. ఇప్పుడు చాలా బీమా కంపెనీలు పొగాకు ఉత్పత్తులు వినియోగించే వారిని స్మోకర్, నాన్ స్మోకర్, ప్రిఫర్డ్ నాన్ స్మోకర్ అనే మూడు రకాలుగా విభజించి దాని ప్రకారం ప్రీమియంను లెక్కిస్తున్నాయి. పూర్తి ఆరోగ్యంగా ఉండి, ఎటువంటి చెడు అలవాట్లు లేని వారికి ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. గత మూడేళ్లుగా నికోటిన్ను వినియోగించని వాళ్ళను నాన్ స్మోకర్లుగా పరిగణిస్తారు. అయితే ఈ నిబంధనలు ఒక్కో కంపెనీకీ ఒకొక్క విధంగా ఉంటాయి. మీరు సిగరెట్లు అప్పుడప్పుడు కాలుస్తున్నా లేక, అలవాటు ఉన్నా.. వీరందరినీ స్మోకర్లుగానే కంపెనీలు భావించి ప్రీమియం నిర్ణయిస్తాయి. అప్పుడప్పుడు అలవాటు ఉన్న వారు కూడా పాలసీ తీసుకునేటప్పుడు ఆ విషయాన్ని పేర్కొనండి. లేకపోతే క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఆన్లైన్ టర్మ్ ప్లాన్ తీసుకుంటున్న వారు నాన్ స్మోకర్ అని పేర్కొంటున్న వారిపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాయి. ఇలా అనుమానం వచ్చిన వారి మూత్ర, రక్త పరీక్షలను బీమా కంపెనీలు తీసుకుంటున్నాయి. తర్వాత కూడా చెప్పాలి.. ఈ అలవాట్లు అనేవి ఎప్పుడు మొదలవుతాయో ఎప్పుడు ఆగిపోతాయో చెప్పడం కష్టం. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత సిగరెట్ అలవాటు మొదలైతే ఆ విషయాన్ని బీమా కంపెనీకి చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. అలా కాకుండా పాలసీ తీసుకున్న తర్వాత సిగరెట్ అలవాటు మానేస్తే ఆ విషయాన్ని కూడా చెప్పండి. సిగరెట్ మానేసి ఏడాది దాటితే అప్పుడు మిమల్ని నాన్ స్మోకర్గా గుర్తిస్తారు. అప్పుడు మీకు తక్కువ ప్రీమియం రేట్లే వర్తిస్తాయి. ఇలా అలవాట్లు, ఆరోగ్య విషయాలను దాచకుండా వివరిస్తే క్లెయిమ్ల సమయంలో మీపై ఆధారపడిన వారికి ఇబ్బందులు ఉండవు. - మునీష్ షర్దా, ఎండీ,సీఈవో, ఫ్యూచర్ జెనరాలీ ఇండియా లైఫ్ -
మేలుకో పాలసీదారుడా మేలుకో..
బీమా పాలసీలతో అనేక ప్రయోజనాలున్నాయి. జీవితంలో ఊహించడానికి వీలులేని సంఘటన ఏదైనా జరిగితే మనపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. అంతేకాదు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో బీమాపై ప్రజల్లో అవగాహన క్రమేపీ పెరుగుతోంది. కేవలం పాలసీ తీసుకోవడమే కాకుండా దానిపై ఉండే హక్కులపై కూడా అవగాహన పెంచుకోవాలి. పాలసీదారుడిగా వాటి హక్కులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. బీమా లో పాలసీదారునికి ఉండే హక్కులను మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి పాలసీ కొనుగోలు సంబంధిత హక్కులు, కొనుగోలు తర్వాత పాలసీ సర్వీసులను పొందే హక్కులు, క్లెయిమ్ సంబంధిత హక్కులు. కొనుగోలు హక్కులు బీమా కంపెనీలు పాలసీలను విక్రయించడానికి శత విధాలా ప్రయత్నిస్తాయి. తొందరపడి వారి బుట్టలో పడొద్దు. ముందుగా బీమా కంపెనీకి సంబంధించిన విషయాలతోపాటు, ఆ పథకం వివరాలన్నీ ఏజెంట్ను క్షుణంగా అడిగి తెలుసుకోండి. పాలసీ కొనుగోలుదారునిగా ఈ పథకానికి సంబంధించిన అంశాలతో పాటు బీమా కంపెనీ గత చరిత్ర, దాని పనితీరును, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, ఫిర్యాదుల పరిష్కారం వంటి పలు అంశాలను అడిగి తెలుసుకునే హక్కు ఉంది. అవసరమైతే ఈ విషయాలను కంపెనీ వెబ్సైట్ ద్వారా కూడా పొందొచ్చు. మీరు ఎంచుకున్న పథకానికి సంబంధించిన లాభ నష్టాలను తెలియజేయాలి. ఏదైనా పథకం సూచించేటప్పుడు అతని వయసు, ఆర్థిక లక్ష్యాలను తప్పక పరిగణలోకి తీసుకోవాలి. అలాకాకుండా కస్టమరే ఏదైనా పథకాన్ని ఎంచుకుంటే... ఆ పథకానికి అతను అర్హుడా? కాదా? అనే అంశాన్ని 15 రోజుల్లోగా బీమా కంపెనీ తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే పాలసీ కట్టించుకుంటే 30 రోజుల్లో డాక్యుమెంట్లను కస్టమర్లకు అందివ్వాలి. బీమా కంపెనీలు కస్టమర్ల వద్ద నుంచి అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరించాలి. కస్టమర్లు కూడా ఎలాంటి ఇతర సమాచారాన్ని వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత సమాచారాన్ని బీమా కంపెనీలు బయటి వ్యక్తులకు కానీ, సంస్థలకు కానీ ఇవ్వడానికి నిబంధనలు అనుమతించవు. పాలసీ సర్వీసులను పొందే హక్కులు ఒక్కసారి పాలసీని తీసుకున్న తర్వాత ఆ పాలసీ ప్రయోజనాలను పొందే హక్కు వస్తుంది. ఒకవేళ ఆ పాలసీని వద్దనుకుంటే దాన్ని 15 రోజుల్లోగా తిరస్కరించే అవకాశం ఉందన్న విషయం మర్చిపోవద్దు. ఇలా 15రోజుల్లోగా పాలసీని రద్దు చేసుకున్నప్పుడు సదరు బీమా కంపెనీ స్టాంప్ డ్యూటీ చార్జీలను, వైద్యపరీక్షల ఖర్చులను మినహాయించుకొని తిరిగి మన ప్రీమియాన్ని మనకు చెల్లిస్తుంది. కస్టమర్ బీమా కంపెనీ సర్వీసులు, ప్రాడక్టుతో సంతృప్తి చెందకపోతే అతను బీమా కంపెనీ నోడల్ ఆఫీస్లో కానీ, అంబూడ్స్మెన్, లేదా కన్సూమర్ కోర్టులో కానీ ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన తర్వాత ఈ కేసును 14 రోజుల్లోగా ముగించాల్సి ఉంటుంది. క్లెయిమ్ సంబంధిత హక్కులు బీమా కంపెనీ నిర్దేశించిన సమయంలో కస్టమర్కు లేదా అతని సంబంధీకులకు క్లెయిమ్ను అందిస్తే ఎలాంటి గొడవ ఉండదు. కానీ క్లెయిమ్ సెటిల్మెంట్లలో ఏవైనా జాప్యాలు జరిగితేనే అసలు సమస్య. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కంపెనీకి ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే క్లెయిమ్ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోగా అడగాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా దర్యాప్తు అవసరమైతే 180 రోజుల్లోగా పూర్తి చేయాలి. ఎలాంటి దర్యాప్తు అవసరం లేకపోతే 30 రోజుల్లోగా క్లెయిమ్ను సెటిల్ చేయాలి. -
ఇష్టానుసారంగా పాలసీలు విక్రయిస్తే..
బ్యాంకులు, ఉద్యోగులపై చర్యలు: ఐఆర్డీఐ ముంబై: అధిక ప్రయోజనాలు వస్తాయని బీమా పాలసీలను ఎక్కువ చేసి విక్రయిస్తే బ్యాంకులు, సంబంధిత ఉద్యోగులు బాధ్యత వహించాల్సి ఉంటుందని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) హెచ్చరించింది. ఉన్నవి, లేనివి కల్పించి బీమా పాలసీలు విక్రయిస్తే బ్యాంకులు, సంబంధిత ఉద్యోగులపై కొత్త బీమా చట్టం ప్రకారం చర్యలు తప్పవని ఐఆర్డీఏ చైర్మన్ టి. ఎస్. విజయన్ చెప్పారు. 2002 నుంచి బ్యాంకులు బీమా పాలసీలు విక్రయించడం ప్రారంభించాయి. కొత్త బీమా చట్టం నేపథ్యంలో బ్యాంకులు బీమా పాలసీల విక్రయాలపై తగిన రికార్డ్లను నిర్వహించాలని విజయన్ చెప్పారు. అవసరమైనపక్షంలో ఆ రికార్డులను తమ పరిశీలనకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. బ్యాంకులు విక్రయించే పాలసీలపై ఆయా బ్యాంకులకు, సంబంధిత ఉద్యోగులకు తగిన అవగాహన లేదని గతంలో తాము నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైందని వివరించారు. అందుకే ఈ కొత్త నిబంధనలు తెచ్చామని పేర్కొన్నారు. -
మధ్యవర్తిల మహా జోరు..
భారీగా పెరుగుతున్న ఆన్లైన్ ఆగ్రిగేటర్లు ట్యాక్సీ నుంచి బీమా పాలసీల దాకా అన్నిటికీ ప్రతి రంగానికీ విస్తరిస్తున్న ఆగ్రిగేటింగ్ వెబ్సైట్లు భవిష్యత్తు దృష్ట్యా ఆకాశానికి ఎగస్తున్న వాల్యుయేషన్లు ‘ఉబెర్’ విలువ ఏకంగా రూ.2.5 లక్షల కోట్లపైనే రూ. 1,200 కోట్లు పెట్టి ట్యాక్సీ ఫర్ స్యూర్ను కొన్న ఓలా పాలసీ బజార్లో ప్రేమ్జీ రూ.300 కోట్ల పెట్టుబడి మధ్యవర్తి. మరోరకంగా చెప్పాలంటే దళారి పేరేదైనా... చేసే పని మాత్రం కొనుగోలుదారు, అమ్మకందారు మధ్య సంధానకర్త్తే. దుస్తులు... షూలు... కిచెన్ వేర్... ఎలక్ట్రానిక్స్... ఏ వస్తువైనా కావొచ్చు.. కొనాలనుకున్నప్పుడు సాధారణంగా ఏం చేస్తాం? ఎకాయెకిన కొనేయకుండా నాలుగైదు షాపులు తిరిగి రేట్లు తెలుసుకుని, నాణ్యమైనది ఎక్కడ చవకగా దొరుకుతోందో చూస్తాం. అక్కడే కొనుక్కుంటాం. మరి ఇన్ని షాపుల చుట్టూ ఇలా తిరక్కుండా... అసలు ఇంటి నుంచి కాలు బయటపెట్టాల్సిన అవసరమే లేకుండా ఆన్లైన్లోనే అన్ని షాపుల్లోని, అన్ని బ్రాండ్ల ధరలూ ఒకేచోట దొరికేస్తే! అన్ని కంపెనీల సేవలూ ఒకేచోట దొరికేస్తే..! అన్నిటినీ పోల్చిచూసుకునే అవకాశం ఒకేచోట ఉంటే...? ఉండకేం... బీమా పాలసీల నుంచి మ్యూచ్వల్ ఫండ్ల వరకూ... సినిమా టికెట్ల నుంచి విమానం టికెట్ల వరకూ... ట్యాక్సీ నుంచి హోటల్ ప్యాకేజీల వరకూ అన్ని సేవలనూ ‘ఒకే గేట్వే’ నుంచి అందించడానికి బోలెడన్ని ‘ఆగ్రిగేటర్లు’ వచ్చాయి. ఇండియాలో ఇంటర్నెట్తో పాటు ఆగ్రిగేటర్ల వాడకమూ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అసలీ ఆగ్రిగేటర్ల కథేంటి? వీటి భవిష్యత్తేంటి? వీటితో ఉపయోగాలేంటి? అనే విశ్లేషణే ఈ కథనం... సమాచార్తో అరంగేట్రం... ఆగ్రిగేటర్లంటే మొదట చెప్పాల్సింది వార్తల ఆగ్రిగేటర్గా అరంగేట్రం చేసిన సమాచార్ డాట్ కామ్ గురించే. 1990ల చివరల్లో ఇండియా వరల్డ్ సంస్థ ఆరంభించిన ఈ న్యూస్ ఆగ్రిగేటర్ను, మరో మూడునాలుగు వెబ్సైట్లను కలిపి అప్పట్లో సత్యం కంప్యూటర్స్ సంస్థ... సిఫీ ద్వారా ఏకంగా రూ.499 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అప్పట్లో అదొక రికార్డు. తమక్కూడా న్యూస్ పోర్టల్ (సిఫీ.కామ్) ఉంది కనక రెండిటినీ కలిపితే విదేశాల్లోని భారతీయ నెటిజన్లంతా తమ పోర్టలే చూస్తారని, ఈ ఏకచ్ఛత్రాధిపత్యం కోసమే అంత సొమ్ము పెట్టామని అప్పట్లో సిఫీ చెప్పింది. అయితే తరువాతి పరిణామాల్లో ఇంటర్నెట్తో పాటు న్యూస్ పోర్టళ్లూ బాగా అభివృద్ధి చెంది అవే సొంతగా యూజర్ల మొబైల్స్కు ఫ్లాష్లు పంపటం, ఎక్స్క్లూజివ్ వార్తల్ని కూడా మెసేజ్లు, మెయిల్స్ ద్వారా పుష్ చేయటం మొదలెట్టాయి. ఫలితంగా యూజర్లు నేరుగా నచ్చిన సైట్కే వెళుతుండటంతో సొంత వార్తలతో సహా ఆగ్రిగేటర్ సేవలనూ అందిస్తున్న సమాచార్ డాట్కామ్ వెనకబడిపోయింది. ప్రతి పనికీ ఆగ్రిగేటర్లే! నిజానికి ఈ ఆగ్రిగేటింగ్ వెబ్సైట్లకు సొంత ఉత్పత్తులేమీ ఉండవు. వాటిని విక్రయించే వివిధ సంస్థలు, వెబ్సైట్ల నుంచి సమాచారం సేకరించి, ఒకే చోట అందించడమే వీటి పని. దీంతో కస్టమర్లు తమకు కావాల్సిన ఉత్పత్తులు లేదా సర్వీసులను వివిధ సంస్థలు ఏ రేటుకు, ఎంత నాణ్యంగా అందిస్తున్నాయో పోల్చి చూసుకుని... వీలైతే అక్కడే కొనుగోలు చేయటమో, లేకుంటే సదరు సంస్థ సొంత వెబ్సైట్లో కొనటమో చేయొచ్చు. ఇంటర్ నెట్, మొబైల్ నెట్ బూమ్తో ఇపుడు ఆగ్రిగేటర్ల హవా అంతకంతకూ పెరుగుతుండటంతో వాటి వాల్యుయేషన్లూ ఆకాశాన్నంటుతున్నాయి. రిఫరల్ సేవలు కూడా... ధరలను పోల్చే ఆన్లైన్ అగ్రిగేటర్ల వ్యాపార విధానాలు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి మధ్యవర్తి విధానం కాగా.. మరొకటి రిఫరల్ విధానం. మొదటిది యాత్రా, మేక్మైట్రిప్ వంటి ట్రావెల్ పోర్టల్స్ తరహాలో ఉంటుంది. కస్టమర్ సదరు సైటును సందర్శించి... విమాన టికెట్లు, హోటళ్లు, టూర్ ప్యాకేజీల వంటి ఉత్పత్తుల గురించి తెలుసుకున్నాక ఆ సైట్ నుంచే నేరుగా కొనుగోలు చేయొచ్చు. రిఫరల్ విధానానికి వస్తే... ఇక్సిగో తదితర వెబ్సైట్లు ఈ కోవలోకి వస్తాయి. కస్టమర్ ఆగ్రిగేటర్ సైట్లోకి వెళ్లి వివిధ కంపెనీల కొటేషన్లను పోల్చి చూసుకున్నాక నేరుగా కావాల్సిన కంపెనీ సైటుకు అక్కడి నుంచే లావాదేవీని నిర్వహించుకోవచ్చు. కస్టమర్ను అందించినందుకు రిఫరల్ ఆగ్రిగేటరుకు కంపెనీ నుంచి కొంత కమిషన్ లభిస్తుంది. కూపన్దునియా, షాపింగ్పైరేట్స్ వంటి కూపన్ వెబ్సైట్లు ఈ కోవలోనివే. భవిష్యత్తేంటి? ఈ-కామర్స్ అభివృద్ధిపై రెండో అభిప్రాయానికి తావులేకున్నా... వాటి ఆదాయాలు, వాల్యుయేషన్లపై మాత్రం విశ్లేషకుల అంచనాల్లో ఏకాభిప్రాయం లేదు. చాలా ఈ కామర్స్ సంస్థలకు స్పష్టమైన ఆదాయ మార్గాలు లేవని, అలాంటపుడు ఈ వాల్యుయేషన్లు ఏ మేరకు కరెక్టనుకోవాలనేది వారి వాదన. ఆ లెక్కన చూస్తే ఆగ్రిగేటర్లు ఆధార పడాల్సిందల్లా రిఫర్ చేసిన సైట్లు అందించే కమిషన్పైనే. ఇపుడు ఈ కామర్స్ సంస్థలు భారీ ప్రచారం, ప్రత్యేక డీల్స్, షాపింగ్ ఫెస్టివల్స్ వంటి ఆకర్షణలతో నేరుగా వినియోగదారుల్ని తమ సైట్లకే రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అవి విజయవంతమవుతున్నాయి కూడా. మున్ముందు ఈ కామర్స్ రంగంలో పునరేకీకరణ జరిగి చిన్నచిన్న వెబ్సైట్లు టేకోవర్ అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అదే జరిగితే మిగిలిన పెద్ద సంస్థలు నేరుగా కస్టమర్లను తమవద్దకే రప్పించుకోవటం పెద్ద కష్టమేమీ కాబోదు. అపుడు ఈ ఆగ్రిగేటర్ల భవిష్యత్తేంటనేది ఇప్పుడే చెప్పలేం. బ్రిటన్ బీమా రంగంలో 60 మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు, 50 శాతం వ్యక్తిగత బీమా పాలసీలు అగ్రిగేటర్ల ద్వారానే అమ్ముడవుతున్నాయి. 2018 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది వద్ద స్మార్ట్ మొబైల్ ఫోన్లు ఉంటాయి, దీంతో ఆగ్రిగేటర్ల వాడకమూ పెరుగుతుంది. ఈ-కామర్స్లోనూ హవా జంగ్లీ.కామ్, మైస్మార్ట్ప్రైస్.కామ్, ప్రైస్దేఖో.కామ్, 91మొబైల్స్.కామ్... ఇలా డజన్ల కొద్దీ ఈ-కామర్స్ అగ్రిగేటర్లున్నాయి. మొబైల్ ఫోన్లు, దుస్తులు, బుక్స్, ఆభరణాలు.. ఇలా పలు ఉత్పత్తుల సంస్థలకు అగ్రిగేటర్గా జంగ్లీడాట్కామ్ ఉంది. ఫ్లిప్కార్ట్, ఇన్ఫీబీమ్, స్నాప్డీల్, అమెజాన్ తదితర ఆన్లైన్ షాపింగ్ సైట్లలో అమ్మే ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, గృహోపకరణాల ధరలను పోల్చి చూపించేందుకు మైస్మార్ట్ప్రైస్ ఉపయోగపడుతోంది. ప్రైస్దేఖో కూడా అలాంటిదే. ఒకేసారి పలు ఫోన్ల స్పెసిఫికేషన్లు, ధరలను పోల్చిచూసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి స్మార్ట్ప్రిక్స్, 91మొబైల్స్ తదితర సైట్లు. రియల్ఎస్టేట్లో మకాన్, మ్యాజిక్బ్రిక్స్ లాంటి వెబ్సైట్లు... ఆటోమొబైల్స్లో కార్వాలే తదితర సైట్లు ఆగ్రిగేషన్ సేవలందిస్తున్నాయి. కాగా ఈ కామర్స్ భవిష్యత్తుపై నమ్మకంతో పలు ఆన్లైన్ షాపింగ్ సంస్థలు క్రమంగా అగ్రిగేటర్లుగా మారుతున్నాయి. యేభీ డాట్కామ్, బీస్టయిలిష్ డాట్కామ్ లాంటివి ఈ కోవలోనివే. ఆర్థిక సేవల్లో ముందంజ... రుణాలు, క్రెడిట్ కార్డుల సమాచారం కావాలంటే బ్యాంక్బజార్ డాట్కామ్కు వెళితే చాలు. ఫండ్స్ ఇండియా అనేది మ్యూచువల్ ఫండ్స్ ఆగ్రిగేటర్గా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థ వ్యాపారం ఏటా 300-400 శాతం వృద్ధి చెందుతోందంటే పరిస్థితి తెలుస్తోంది. ఇక వివిధ బీమా కంపెనీల పాలసీలకు అగ్రిగేటర్గా పాలసీ బజార్ డాట్కామ్ వ్యవహరిస్తోంది. 2010-11లో ఈ వెబ్సైట్ ద్వారా నెలకు 1,000 కన్నా తక్కువ లావాదేవీలు జరగ్గా... 2013-14లో ఈ సంఖ్య ఏకంగా 32,000కు చేరింది. పాలసీబజార్ ఇటీవలే మరో రూ. 300 కోట్లు నిధులు సమీకరణ కోసం ప్రేమ్జీ ఇన్వెస్ట్ (విప్రో అధినేత అజీం ప్రేమ్జీ సంస్థ)తో డీల్ కుదుర్చుకుంది. దీని ప్రకారం పాలసీబజార్ విలువ ఏకంగా రూ. 1,200 కోట్లుగా లెక్కగట్టారు. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ వెబ్సైట్లోని వివరాల మేరకు ప్రస్తుతం మై ఇన్సూరెన్స్క్లబ్, ఎక్యూరేట్ కోట్స్, బైస్మార్ట్పాలసీ... లాంటి సంస్థలకు ఆగ్రిగేటర్లుగా వ్యవహరించేందుకు అనుమతి ఉంది. - ‘సాక్షి’ బిజినెస్ విభాగం -
బీమా పాలసీల్లో నామినీ మార్పుకు 100 వరకూ చార్జీ
న్యూఢిల్లీ: బీమా పాలసీల్లో నామినేషన్ రద్దు, మార్పులు, చేర్పులు చేయడం ఇప్పుడు ఖరీదు కానున్నది. ఇలాంటి మార్పులకు బీమా కంపెనీలు రూ. వంద వరకూ వసూలు చేసుకోవచ్చని బీమా నియంత్రణ సంస్థ, ఐఆర్డీఏ(ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ) పేర్కొంది. ఆన్లైన్ పాలసీలకైతే ఇది రూ.50 అని వివరించింది. ఇంతకు మించి బీమా సంస్థలు వసూలు చేయడానికి వీలు లేదని ఐఆర్డీఏ తెలిపింది. నామినేషన్ రద్దు, నామినేషన్ మార్పులకు సంబంధించి ఐఆర్డీఏ కొత్త మార్గదర్శకాలు ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చాయి. బీమా చట్టం ప్రకారం, బీమా పాలసీదారుడు, తాను మరణించిన పక్షంలో వచ్చే ప్రయోజనాల ను పొందే వారి పేరును నామినీగా పేర్కొనాలి. -
పెట్టుబడులకు.. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్
జీవితానికి భరోసా, భవిష్యత్తుపై ధీమా కల్పించేవి.. పొదుపు, మదుపు. సంపాదించిన ప్రతి పైసాను జాగ్రత్తగా వాడుకొని, రేపటి అవసరాల కోసం అందులో కొంత మిగుల్చుకోవాలనే ఆరాటం అందరిలో ఉంటుంది. మిగిల్చిన సొమ్మును ఎక్కడ, ఎలా పొదుపు చేసుకోవాలో చాలామందికి అవగాహన ఉండదు. ఒక రూపాయితో మరో రూపాయిని సంపాదించడం ఎలాగో తెలియదు. బీమా పాలసీ తీసుకోవాలంటే .. మార్కెట్లో లెక్కలేనన్ని పథకాలు. వాటిలో తమ అవసరాలకు సరిపోయే పథకంపై పరిజ్ఞానం శూన్యం. ఇలాంటి కీలకమైన ఆర్థిక అంశాలపై జనానికి అవగాహన కల్పించి, పొదుపు మదుపుల విషయంలో మార్గదర్శిగా వ్యవహరించే నిపుణులే.. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. నేటి సామాజిక అవసరాల రీత్యా వీరికి డిమాండ్ పెరుగుతోంది. ఆదాయాలు వృద్ధి చెందుతుండడంతో ఆర్థిక సలహాదారులను సంప్రదించేవారి సంఖ్య నానాటికీ అధికమవుతోంది. అంకెలు, గణాంకాలు, వడ్డీ లెక్కలపై ఆసక్తి ఉన్నవారు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా కెరీర్లో సులభంగా రాణించొచ్చు. సలహాదారులకు ప్రస్తుతం పుష్కలమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్లు, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సంస్థల్లో.. అర్హులైన ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ కార్పొరేట్ సంస్థల, క్లయింట్ల ఆర్థికపరమైన సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీ షేర్లు, డిబెంచర్లు, బీమా పాలసీలు, కమోడిటీలు, స్థిరాస్తి.. ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలు ఇవ్వాలి. క్లయింట్ల తరఫున వారి డబ్బును పెట్టుబడి పథకాల్లో పొదుపు, మదుపు చేయాలి. లాభాలను వారికి అందిస్తూ ఆకర్షణీయమైన కమీషన్ పొందొచ్చు. ప్రతి పెట్టుబడిలో లాభనష్టాలను వివరించాలి. ఆయా రంగాల్లో భవిష్యత్తు పరిణామాలను ఊహించగలిగే నేర్పు ఉండాలి. క్లయింట్ల సొమ్ముకు భద్రత కల్పించే పథకాలను సూచించాలి. భారీ స్థాయిలో వ్యాపారలావాదేవీలను నిర్వహించే కార్పొరేట్ సంస్థలు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లను నియమించుకుంటున్నాయి. బ్యాంకుల్లో, రియల్ ఎస్టేట్ సంస్థల్లో, స్టాక్మార్కెట్లలోనూ ఉద్యోగాలు దక్కుతున్నాయి. వృత్తి నైపుణ్యాలను పెంచుకొని సొంతంగా ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: ఆర్థిక సలహాదారులకు విశ్లేషణాత్మక దృక్పథం, తార్కిక ఆలోచనా విధానం ఉండాలి. కమ్యూనికేషన్, మార్కెటింగ్, రిలేషన్షిప్ బిల్డింగ్ స్కిల్స్ అవసరం. ఆర్థిక వ్యవహారాలు, సంబంధిత చట్టాలు, నియమ నిబంధనలపై ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలి. వృత్తిపరమైన నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాలి. అర్హతలు: పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా వృత్తిలోకి ప్రవేశించాలంటే.. ‘అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్ టెస్ట్’లో అర్హత సాధించాలి. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సర్టిఫికేషన్తో అర్హతలను, నైపుణ్యాలను పెంచుకోవచ్చు. కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా మారాలంటే.. ఫైనాన్స్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్గా గ్రాడ్యుయేషన్/పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. ప్రారంభంలో సీనియర్ అడ్వైజర్ వద్ద పనిచేసి, వృత్తిలో మెళకువలను తెలుసుకొని అనుభవం సంపాదించిన తర్వాత సలహాదారుగా సొంతంగా పనిచేసుకోవచ్చు. వేతనాలు: పొదుపు, మదుపు సలహాదారులు తమ నైపుణ్యాలు, మార్కెట్ స్థితిగతులను బట్టి ఆదాయం ఆర్జించుకోవచ్చు. కార్పొరేట్ సంస్థల సలహాదారులకు స్థిరమైన వేతనం అందుతుంది. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పొందొచ్చు. సొంతంగా ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటే ఇంకా అధికంగా సంపాదించుకోవచ్చు. ఖాతాదారుల సంఖ్య, వారి పెట్టుబడుల ఆధారంగా ఆదాయం లభిస్తుంది. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - కోల్కతా వెబ్సైట్: https://www.iimcal.ac.in/ ఏ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఢిల్లీ యూనివర్సిటీ వెబ్సైట్: http://www.fms.edu/ ఏ నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్-ముంబై వెబ్సైట్: http://www.nmims.edu/ ఏ ఇంటర్నేషనల్ కాలేజీ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వెబ్సైట్: http://www.icofp.org/ ఏ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వెబ్సైట్: http://www.xlri.ac.in/ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ పోటీ పరీక్షల్లో ‘పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య’లపై ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? -ఎం.నరేష్, హఫీజ్పేట 2013లో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ఐసోబార్లపై ప్రశ్న అడిగారు. అణుభారం (ద్రవ్యరాశి సంఖ్య)ను సమానంగా ఇచ్చి, వాటి పరమాణు సంఖ్యలను వేరుగా ఇచ్చారు. నిర్వచనం ప్రకారం ఐసోబార్లలో పరమాణు ద్రవ్యరాశి సమానంగా ఉండి, పరమాణు సంఖ్యలు వేరుగా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు గుర్తించడానికి పరమాణు సంఖ్యలు, ద్రవ్యరాశి సంఖ్యలను గుర్తుంచుకోవాల్సిన పని లేదు. ఇచ్చిన ఆప్షన్ల లోని మూలకాల పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య, ఇంకా లోతుగా.. న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని గుర్తిస్తే చాలు. పరమాణు సంఖ్య అనేది ఆ మూలక క్రమ సంఖ్య లాంటిది. ప్రాథమిక కణాల్లో ప్రోటాన్ల సంఖ్య ఆధారంగా మూలకానికి పరమాణు సంఖ్య (ో) ఇచ్చారు. కేంద్రకంలోని ప్రోటాన్లు, న్యూట్రాన్ల భారాన్ని కలిపితే పరమాణు భారం వస్తుంది. దీని నుంచి ద్రవ్యరాశి సంఖ్య (అ) వస్తుంది. ప్రోటాన్లు, న్యూట్రాన్ల సంఖ్యలోని తేడాల వల్ల ఐసోటోపులు, ఐసోబార్లు, ఐసోటోన్లు, ఐసోడయఫర్లు వస్తాయి. పదో తరగతితోపాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రసాయన శాస్త్ర పాఠ్యపుస్తకాలను చదివితే ఈ పాఠ్యాంశంపై పట్టు సాధించవచ్చు. నేను డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేరవుతున్నాను. భూగోళ శాస్త్రంలోని ‘భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమరిక’ అధ్యాయాన్ని ఎలా చదవాలి? -కె.ప్రసన్న, సంతోష్నగర్ గత డీఎస్సీ పరీక్షలో ఈ అధ్యాయం నుంచి రెండు ప్రశ్నలు అడిగారు. ఈసారి కూడా 2 నుంచి 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాలు, వివిధ దేశాల సరిహద్దులను మ్యాప్ పాయింటింగ్ ద్వారా సాధన చేస్తే ఈ పాఠ్యాంశంలోని అంశాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉత్తర ప్రాంత హిమాలయాలను అధ్యయనం చేసేటప్పుడు, వాటి దిక్కులను ఆధారంగా చేసుకుని చదవాలి. భారతదేశ భూ స్వరూపాలు, నదీ ప్రాంతాలు, ఏర్పాటైన రాష్ట్రాలు, ప్రాంతాలను కలిపి చదవాలి. అట్లాస్ను దగ్గర పెట్టుకొని భారతదేశ భౌతిక అమరిక, పర్వతాల క్రమం, రాష్ట్రాల ఉనికిపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలను సులువుగా గుర్తించవచ్చు. జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స జేఎన్టీయూ-హైదరాబాద్ హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకడమిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అకడమిక్ అసిస్టెంట్ విభాగాలు: సీఎస్, ఎస్ఈ, సీఎన్ఐఎస్, బీఐ అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంటెక్/ పీహెచ్డీ ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 17 వెబ్సైట్: http://jntuh.ac.in/ హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ ముంబైలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్), గ్రాడ్యుయేట్ ఇంజనీర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అర్హత: బీటెక్. వయసు: 25 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: గేట్-2015 స్కోర్ ఆధారంగా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: 18 డిసెంబర్ 2014 నుంచి 2 ఫిబ్రవరి 2015 వెబ్సైట్: www.hindustanpetroleum.com ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. చీఫ్ మేనేజర్ (ఎకనామిస్ట్) మేనేజర్ (ఎకనామిస్ట్) డిప్యూటీ మేనేజర్ (ఎకనామిస్ట్) చీఫ్ మేనేజర్ (రిస్క్ ఎనలిస్ట్) చీఫ్ మేనేజర్ (కంపెనీ సెక్రటరీ) దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 17 వెబ్సైట్: www.sbi.co.in ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎమ్మెస్సీ (నర్సింగ్) అర్హతలు: 55 శాతం మార్కులతో బీఎస్సీ (నర్సింగ్)/ బీఎస్సీ హానర్స్ (నర్సింగ్)/ పోస్ట్ బేసిక్ (నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్తో పాటు ఏడాది అనుభవం అవసరం. ఎంపిక: ఆన్లైన్ టెస్ట్ ద్వారా. ఎంపీటీ. అర్హతలు: బీపీటీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 17 వెబ్సైట్: ntruhs.ap.nic.in ఎడ్యూ న్యూస్: ఆస్ట్రేలియాలో విదేశీ విద్య ఖర్చు ఎక్కువ ఫారిన్ ఎడ్యుకేషన్ విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియాలో ఖర్చు అత్యధికం. హెచ్ఎస్బీసీ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఒక విదేశీ విద్యార్థి భారత్లో అండర్గ్రాడ్యుయేట్ కోర్సు చదవడానికి ప్రతిఏటా 5,642 అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే ఆస్ట్రేలియాలో అయితే 42,093 డాలర్లు వెచ్చించాల్సిందే. మొత్తం15 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. నాణ్యమైన విద్యనందించడంలో మనదేశం 8వ స్థానంలో ఉండడం గమనార్హం. విదేశీ విద్యకు ఎక్కువ డబ్బు ఖర్చయ్యే దేశాల జాబితాలో ఆస్ట్రేలియా, సింగపూర్, అమెరికా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. సింగపూర్లో ప్రతిఏటా 39,229 డాలర్లు, అమెరికాలో 36,564 డాలర్లు ఖర్చవుతాయి. భారత్లో న్యూజిలాండ్ విద్యాసంస్థ కోర్సులు భారత్లో అప్లయిడ్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్లను ప్రారంభించనున్నట్లు న్యూజిలాండ్లో ప్రభుత్వ నిధులతో నడిచే ఈస్ట్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఈఐటీ) ప్రకటించింది. ఈ కోర్సుల ద్వారా భారత విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకొని, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు దక్కించుకోవచ్చని పేర్కొంది. ఎడ్యూ ఈవెంట్: ‘ప్రాక్టికల్ నాలెడ్జ్తోనే కెరీర్లో రాణింపు’ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు అలవర్చుకోవాల్సిన నైపుణ్యాలపై నగరంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ) క్యాంపస్లో సదస్సు నిర్వహించారు. ఇండస్ట్రీ, క్లాస్రూంకు మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఐఎంటీ ప్రతిఏటా వ్యాపార ప్రముఖులతో సదస్సులను నిర్వహిస్తోంది. ఇలాంటి సదస్సులు నిర్వహించడం ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను ప్రాక్టికల్గా అన్వయించుకునే అవకాశం చిక్కుతుందంటున్నారు నిర్వాహకులు. విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జతోనే కెరీర్లో బాగా రాణిస్తారని ఈ సదస్సుకు హాజరైన నిపుణులు చెప్పారు. ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ప్రాక్టికల్ ఓరియెంటేషన్ను పెంపొందించుకోవాలని సూచించారు. -
రైడర్లతో బహుళ ప్రయోజనాలు
బీమా రంగంలో తరచూ వినిపించే పదాల్లో ‘రైడర్’ ఒకటి. ఉదాహరణకు ఐదు లక్షల రూపాయల ఒక ప్రధాన బీమా పాలసీ మొత్తానికి రూ.2,000 వేలు చెల్లించాలనుకుంటే, అదనంగా మరికొంత అతి స్వల్ప మొత్తం చెల్లించి మరో ఐదు లక్షల బీమా పొందగల సౌలభ్యం ఇందులో ఉంటుంది. అంటే ఒక ప్రాథమిక పాలసీకి అనుబంధంగా స్వల్ప మొత్తం చెల్లింపుల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందే అవకాశాన్ని రైడర్లు పాలసీదారుకు కల్పిస్తున్నాయి.యాక్సిడెంట్ డెత్ అడిషనల్ కవర్, డిజేబిలిటీ కవర్, క్రిటికల్ ఇల్నెస్ కవర్, హాస్పిటలైజేషన్ కవర్ వంటి పలు అదనపు ప్రయోజనాలను రైడర్ల ద్వారా పొందవచ్చు. ఐచ్ఛికాలు.. మీ లైఫ్స్టైల్కు అనుగుణంగా రైడర్లు ఏవి తీసుకుంటే ప్రయోజనమన్న విషయాన్ని మీరే నిర్ణయించుకునే వీలు మీకుంటుంది. మీ బేస్ బీమా పాలసీ ప్రయోజనాలకు అదనంగా నాణ్యతాపూర్వక, పరిమాణాత్మకమైన లబ్ధిని చేకూర్చడానికి ఇది దోహదపడుతుంది. పలు కాంబినేషన్లలో రైడర్లు లభ్యమవుతుంటాయి. ఉదాహరణకు అవీవా లైఫ్లాంగ్ పాలసీని తీసుకుందాం. ఇందులో బేసిక్ జీవిత బీమా పాలసీకి మూడు రకాల రైడర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదవశాత్తు మరణం, అంగవైకల్యం (ఏడీఅండ్డీ), కేన్సర్, గుండెపోటు, అంగ వైఫల్యం వంటి తీవ్ర అస్వస్థత, ప్రమాదం లేదా ఏదైనా వ్యాధి వల్ల మొత్తంగా శాశ్వత అంగవైకల్యం (సీఐఅండ్పీటీడీ), ఆసుపత్రి వ్యయాల ప్రయోజనాలు (హెచ్సీబీ) వీటిలో ఉన్నాయి. స్వల్ప ప్రీమియంలు... బేస్ పాలసీ ప్రీమియంలతో పోల్చితే, రైడర్లపై ప్రీమియంలు కూడా అతి స్వల్పంగా ఉంటాయి. ఇక బేసిక్ పాలసీ కాల వ్యవధితో సమానంగా రైడర్లను తీసుకోవాల్సిన పనిలేదు. అంటే వీటిని బేసిక్ పాలసీ ఉన్నన్నాళ్లూ కొనసాగించుకోవాల్సిన అవసరం లేదన్నమాట. మీ బీమా అవసరాలకు, ఎప్పటిక ప్పటి ప్రయోజనాలకు కాలానుగుణంగా రైడర్లు తీసుకోవచ్చు. మరో మాటలో చెప్పాలంటే- బీమా రైడర్ ప్రయోజనాన్ని మొబైల్ ఫోన్ రీచార్జ్కి ఎక్స్ట్రా టాపప్గా పరిగణించవచ్చు. బేసిక్ ప్రయోజనాలకు మరింత అదనపు ప్రయోజనాన్ని ఇక్కడ పాలసీదారుకు రైడర్ అందిస్తుంది. విభిన్న రూపాలు... బీమా కంపెనీలు రైడర్లను వివిధ రూపాల్లో ఆఫర్ చేస్తున్నాయి. యాక్సిడెంటల్ రైడర్స్, హెల్త్ రైడర్స్, టర్మ్ రైడర్స్, ప్రీమియం రద్దు రైడర్స్, పన్నుల భారాలు తగ్గించుకోవడం... ఇలా వివిధ రూపాల్లో పాలసీదారుకు ఇవి అందుబాటులో ఉంటాయి. వయసు, అవసరాలు, జీవన శైలి, లైఫ్స్టైల్ అలవాట్లు, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు... ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణమైన అమిత బీమా ప్రయోజనాలను పొందడానికి రైడర్లు దోహదపడతాయి. రెగ్యులర్ బీమా పాలసీ తీసుకునే ముందు కస్టమర్ ఈ రైడర్లపైనా తప్పనిసరిగా దృష్టి పెట్టాలన్నది ముఖ్య సలహా.