jayaprada
-
చిన్నప్పుడే ఇంత అందంగా ఉన్న స్టార్ హీరోయిన్ బర్త్డే.. (ఫోటోలు)
-
జయప్రద జైలు శిక్షరద్దు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తన సినిమా థియేటర్లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ చెల్లించని కేసులో సీనియర్ నటి జయప్రదకు పడిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ అభయ్ ఓకా, ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. థియేటర్ యాజమాన్యం రూ. 9లక్షల80వేలను ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ కింద జమ చేసినందున కోర్టు శిక్షను రద్దు చేసింది. చెన్నైలోని జయప్రదకు చెందిన సినీ థియేటర్లో జయప్రద, ఆమె ఇద్దరు సోదరులు వాటాదారులుగా ఉన్నారు. ఈ థియేటర్ 10 ఏళ్ల క్రితమే మూతపడింది. అయితే ఈ థియేటర్లో పనిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి ఈఎస్ఐ పేరుతో కోతలు విధించి తమ వద్ద జమ చేయలేదని ఈఎస్ఐకార్పొరేషన్(ఈఎస్ఐసీ) కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన చెన్నైలోని మెట్రోపాలిటన్ కోర్టు గత ఏడాది ఆగస్టులో జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అనంతరం ఈ కేసులో ఆమె అప్పీల్కు వెళ్లగా సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇదీ చదవండి..ఈడీ విచారణకు కేజ్రీవాల్ మరోసారి డుమ్మా -
హైకోర్టులో జయప్రదకు ఎదురుదెబ్బ
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదను మార్చి 6వ తేదీలోపు అరెస్ట్ చేయాలని రామ్పుర్ ట్రయల్ కోర్టు తాజాగా ఆదేశించింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తనపై జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంటును నిలిపివేయాలని కోరుతూ జయప్రద దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు తాజాగా కొట్టివేసింది. దీంతో ఆమెకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. (ఇదీ చదవండి: ముందస్తు బెయిల్ కోసం క్రిష్ పిటిషన్ .. విదేశాలకు 'సైంధవ్' నిర్మాత కుమారుడు) 2019 నుంచి కోర్టు విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా ఆమె హాజరు కాలేదు.. దీంతో ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా గతంలో కోర్టు ప్రకటించింది. ఆపై నాన్ బెయిలబుల్ వారెంటును కోర్టు జారీ చేసింది. ఈ వారెంటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం తాజాగా విచారించి కొట్టివేసింది. త్వరలో మరిన్ని వాస్తవాలతో తాము మరో పిటిషన్ దాఖలు చేస్తామని జయప్రద తరపు న్యాయవాది కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు. కేసు ఏంటి..? 2019 లోక్సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరఫున రాంపూర్ నుంచి జయప్రద బరిలో నిలిచారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్లోని ఎంపీ- ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్లో ఉంది. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా ఆమె రాకపోవడంతో నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. -
మాజీ ఎంపీ జయప్రదకు షాక్
-
నటి జయప్రద ఎక్కడ.. వెతుకుతున్న ఢిల్లీ పోలీసులు
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు విషయంలో పలుమార్లు విచారణ జరిగింది. కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా హాజరు కాలేదు. దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నవంబర్ 8న ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉండగా.. జయప్రద కోర్టుకు హాజరు కాలేదు. ఈ అంశంపై ప్రోసక్యూషన్ ఆఫీసర్ అమర్నాథ్ తివారీ మాట్లాడుతూ.. జయప్రదకు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా ఆమె నవంబర్ 8న కోర్టుకు హాజరు కాలేదన్నారు. దీంతో న్యాయస్థానం ఈ కేసు విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది ఆ సమయంలో కూడా ఆమె కోర్టు రాలేదు. ఆపై డిసెంబర్ నెలలో హాజరు కావాలని హెచ్చరించినా కూడా ఆమె అందుబాటులోకి రాలేదు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్గా పరిగణలోకి తీసుకుంది. జనవరి 10లోగా ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది. దీంతో రామ్పూర్ ఎస్పీ ఆమెను వెతకడానికి ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేశారు. అయితే ఆ బృందం కూడా ఆమె ఆచూకీని కనిపెట్టలేకపోతుంది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. జయప్రద కోసం పోలీసులు ముమ్మరంగా వెతికే పనిలో ఉన్నారు. గత ఎన్నికల్లో రాంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన జయప్రద.. సమాజ్వాద్ పార్టీ అభ్యర్థి అజాం ఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. కేసు ఏంటి..? 2019 లోక్సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరఫున రాంపూర్ నుంచి జయప్రద బరిలో నిలిచారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్లోని ఎంపీ- ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్లో ఉంది. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా ఆమె రాకపోవడంతో నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. -
హీరోయిన్ జయప్రద అరెస్ట్కి రంగం సిద్ధం.. అసలేం జరిగిందంటే?
ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ జయప్రద అరెస్ట్కి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? హీరోయిన్ కమ్ పొలిటిషన్ అయిన జయప్రద ఏం తప్పు చేసింది? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్గా చేసిన జయప్రద.. 1994లో తెలుగుదేశం పార్టీలే చేరింది. కొన్నాళ్ల తర్వాత ఈ పార్టీని వీడి, సమాజ్ వాదీ పార్టీలో చేరింది. 2004 నుంచి 2014 వరకు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేసింది. 2019 నుంచి బీజేపీలో కొనసాగుతోంది. అయితే 2019లో ఎన్నికల సందర్భంగా జయప్రద.. నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో ఈమెపై నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ అయ్యాయి. ఈ కేసులో భాగంగా కోర్టు సమన్లు జారీ చేసినా సరే విచారణ నిమిత్తం న్యాయస్థానం ఎదుట జయప్రద.. హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి, ఆమెని అరెస్ట్ చేయాలని ఉత్తరప్రదేశ్ పోలీసులని ఆదేశించింది. ఈ క్రమంలోనే మహిళా ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. ఇదంతా చూస్తుంటే జయప్రద అరెస్ట్ త్వరలో జరగడం గ్యారంటీ అనిపిస్తుంది. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) -
ESI అవకతవకల కేసులో సినీనటి జయప్రదకి జైలుశిక్ష
-
అంత పెద్ద హీరో పక్కన నన్ను హీరోయిన్ గా పెట్టారు
-
అప్పుడు ఎన్టీఆర్ కు నేను సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది..తప్పు చేశాను
-
గర్వం లేని మనిషి ఆ వ్యక్తి అంటున్న జయప్రద
-
ఒక ముఖ్యమంత్రిని అలా చేయడం చాలా తప్పు అనిపించింది
-
ఆ స్టార్ హీరోల మధ్య తేడా ఇదే అనిపించింది: నటి జయప్రద
-
జయప్రద అంటే చాలా ఇష్టం..!
-
జయప్రద థ్రిల్లర్ మూవీ 'సువర్ణ సుందరి' .. రిలీజ్ డేట్ ఫిక్స్
సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. డాక్టర్ ఎమ్వీకే రెడ్డి సమర్పణలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ..' కరోనాలో నిలిచిపోయిన మా మూవీ రిలీజ్కు ఇదే సరైన సమయం. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన బింబిసారా, కార్తికేయ-2, మసూద చిత్రాలకు ఆడియన్స్ మంచి హిట్ అందించారు. అలాంటి జానర్లో వస్తున్న మా సువర్ణ సుందరి మూవీకి కూడా మంచి విజయాన్ని ఇస్తారనే నమ్మకంతో ఉన్నాం. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. మీరంతా సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నా.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినిడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు నటించారు. -
‘సువర్ణ సుందరి’ సరికొత్త అనుభూతిని ఇస్తుంది: దర్శకుడు సురేంద్ర
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుంది అనేది ట్యాగ్లైన్. మాదారపు సురేంద్ర దర్శకత్వంలో ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ – ‘‘గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిలా జయప్రదగారి పాత్ర ఉంటుంది. కరోనా పరిస్థితుల కారణంగా సినిమా లేట్గా విడుదలవుతోంది. విజువల్ పరంగా కావొచ్చు, కంటెంట్ పరంగా కావొచ్చు.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సహనిర్మాత: శ్రీకాంత్ పండుగుల. -
రామ్పూర్ ప్రత్యేక కోర్టులో జయప్రద
బరేలి: ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్ ప్రత్యేక కోర్టుకు సినీనటి, బీజేపీ నాయకురాలు జయప్రద హాజరయ్యారు. 2019నాటి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె కోర్టు ఎదుట గత మూడున్నరేళ్లుగా గైర్హాజర్ కావడంతో గత నెలలో కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. బుధవారం ఆమె కోర్టులో హాజరుకావడంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ‘‘మాజీ ఎంపీ , బీజేపీ నాయకురాలు జయప్రద కోర్టు ఎదుట హాజరై బెయిల్ దరఖాస్తును సమర్పించారు. దీంతో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది’’ అని ప్రభుత్వం తరఫున లాయర్ తెలిపారు. స్థానిక అధికారుల అనుమతి లేకుండా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జయప్రద ఎన్నికల ర్యాలీ నిర్వహించడంతో రెండు వేర్వేరు పోలీసు స్టేషన్లలో ఆమె రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. -
కంగనాకు పద్మశ్రీ.. సీనియర్లం మాకు లేదా?
నందమూరి బాలకృష్ణ సారథ్యంలో అన్స్టాపబుల్ రెండో సీజన్ కూడా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ఇటీవల ఈ షోలో ముగ్గురు హీరోయిన్స్ సందడి చేశారు. అలనాటి హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు మరో కథానాయిక రాశీ ఖన్నా ఆరో ఎపిసోడ్కు విచ్చేశారు. వీరిని ఇరుకున పెట్టే ప్రశ్నలడుగుతూ వాటికి సమాధానాలు రాబట్టాడు. ఈ క్రమంలో పద్మ అవార్డుల ప్రస్తావన రాగా.. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు జయసుధ, జయప్రద. 'కంగనా రనౌత్ అద్భుత నటి. పట్టుమని పది సినిమాలు చేసిందో లేదో అప్పుడే ఆమెకు పద్మ శ్రీ ఇచ్చారు. కానీ మా విషయంలో అలా జరగలేదు. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ మాకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు. అంతెందుకు, గిన్నిస్ రికార్డుకెక్కిన మహిళా డైరెక్టర్ విజయ నిర్మలను కూడా ప్రభుత్వం గుర్తించలేదు. ఇలాంటి సందర్భాల్లోనే కేంద్రం దక్షిణాది చిత్రపరిశ్రమ పట్ల వివక్ష చూపిస్తుందనిపిస్తుంది' అని జయసుధ చెప్పుకొచ్చింది. జయప్రద మాట్లాడుతూ.. అవార్డులు అడిగి తీసుకోవడం మాకిష్టం లేదు. మా ప్రతిభను, సీనియారిటీని గుర్తించి గౌరవించాలనుకున్నాం అని పేర్కొంది. చదవండి: థియేటర్లు అమ్మేశారు, ఆస్తులు పోయాయి.. కమెడియన్ కూతురు బతిమాలినా రాలేదు, నటిపై ఫైర్ -
జయప్రదకు ఎన్టీఆర్ చలనచిత్ర పురస్కారం
ప్రముఖ నటి జయప్రదని ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం వరించింది. హీరో బాలకృష్ణ గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 27 సాయంత్రం నాజర్పేట ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్లో రచయిత సాయిమాధవ్ బుర్రా సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. ఈ వేడుకలో జయప్రదకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ అందించనున్నారు. అలాగే ఈ నెల 28న ‘అడవి రాముడు‘ సినిమాను ప్రదర్శించనున్నారు. జయప్రద, రామకృష్ణ, దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి ప్రేక్షకులతో కలిసి ఈ సినిమాను వీక్షించనున్నారు. -
స్టార్ నటుడు చెంప చెళ్లుమనిపించిన జయప్రద? క్లారిటీ ఇచ్చిన దలీప్ తాహిల్
నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటోంది. ఇదిలా ఉంటే ఆమె స్టార్ నటుడు దలీప్ తాహిల్ చెంప చెళ్లుమనిపించిందంటూ తరచూ బాలీవుడ్లో వార్తల చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ వార్తలపై తాజాగా నటుడు దలీప్ తాహిల్ స్పందించాడు. ఈ సందర్భంగా జయప్రద తనని కొట్టినట్లు వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చాడు. 1986లో అమితాబ్ బచ్చన్-జయప్రద జంటగా ‘ఆఖ్రే రాస్తా’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో దలిప్ తాహిర్ విలన్గా చేశాడని, ఇందులో ఆయన జయప్రదను అత్యాచారం చేసే ఓ సన్నివేశం ఉందట. ఈ సీన్ షూటింగ్ సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో జయప్రద ఆయనను చెంప దెబ్బ కొట్టినట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. తాజాగా దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు. ‘‘జయప్రదతో కలిసి ఓ అభ్యంతరకర సన్నివేశంలో నటించానని, ఆ సీన్ షూటింగ్ సమయంలో ఆమె నన్ను కొట్టినట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను నేను కూడా విన్నాను. నేను కొంచెం దూకుడుగా వెళ్లానని, ఆమె నా చెంప చెళ్లు మనిపించినట్టు అందులో ఉంది. అసలు నేను జయప్రదతో కలిసి ఏ సినిమాలోనూ నటించనేలేదు. ఇది వాస్తవం. ఆమెతో కలిసి నటించాలనే ఆసక్తి ఉన్నా, ఆ అవకాశం మాత్రం రాలేదు. అలాంటప్పుడు ఇక అలాంటి సీన్ చేసే అవకాశమే లేదు కదా? ఈ కథనాలు రాసే వ్యక్తి పట్ల నాకు శత్రుత్వం లేదు. కానీ ఆ సీన్ చూపిస్తే సంతోషిస్తాను. సోషల్ మీడియాలో అసలు లేనివి కూడా పుట్టిస్తున్నారు’’ అంటూ దలీప్ తాహిల్ అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి నాన్నా: మహేశ్ ఎమోషనల్ ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్ -
కృష్ణంరాజుకు జయప్రద నివాళి.. వెక్కెక్కి ఏడ్చిన నటి
‘రెబల్’ స్టార్ కృష్ణం రాజు మృతిపై సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతరమయ్యారు. ఆయన మనతో లేరు అనేది తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. ‘ఎప్పుడు కనిపించిన జయప్రద ఎలా ఉన్నావంటూ చాలా అప్యాయంగా పలకరించేవారు. ఆయన పిలుపు ఇప్పటికీ నా చేవుల్లో మారుమ్రోగుతుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు చేసి ప్రజల హృదయాల్లో ఆయన నిలిచిపోయారు. ఆయన అనారోగ్యంతో తరచూ ఆస్పత్రికి వెళుతు వస్తున్నారని తెలుసు, ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్పత్రికి నుంచి ఆయన తిరిగి వస్తారనుకున్నాం’ అంటూ ఆమె వెక్కెక్కి ఏడ్చారు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రజనీకాంత్ కూతురు అలాగే ఆమె మాట్లాడుతూ.. ‘ఆయనతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని నాకు ఆ భగవంతుడు కల్పించాడు. తాండ్ర పాపరాయుడు, భక్త కన్నప్ప వంటి ఎన్నో చిత్రాలు చేసి ఈ రోజు రెబల్ స్టార్గా నిలిచారు. ఆయన కూతుళ్లు ఇంకా చిన్నపల్లలు. వారికి, ఆయన సతిమణికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆయన నటుడిగా, రాజకీయ వేత్తగా, కేంద్రమంత్రి ఆయన ఎదిగిన ఎత్తులు సాధారణమైనవి కాదు. ఎలాంటి మచ్చ లేకుండా ఆయన రారాజుగా వెళ్లిపోయారు’ అంటూ జయప్రద భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కృష్ణంరాజు ఆదివారం(సెప్టెంబర్ 11న) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చదవండి: చిరుతో ‘విక్టరి’ వెంకటేశ్ సరదా సన్నివేశం? ఏ సినిమాలో అంటే..! -
రాజమండ్రి నా స్వస్థలం.. ఇక్కడి నుండే రాజకీయాల్లోకి వెళ్లా: జయప్రద
-
సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం
సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి నీలవేణి(85) అనారోగ్యంతో ఈ రోజు(మంగళవారం) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నేడు సాయంత్రం ఆమె తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న నటి జయప్రద.. తల్లి మరణవార్త తెలిసి హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు జయప్రదకు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా అందం, అభినయంతో తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన జయప్రద ‘భూమికోసం’ చిత్రంతో తెలుగు తెరపై మెరిశారు. తన సినీ కెరీర్లో జయప్రద మొత్తం(తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలి, మరాఠి) 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆమె రాజకియాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం జయప్రద బీజేపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. -
పార్టీ ఆదేశిస్తే.. ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా: యోగి
లక్నో: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఉత్తరప్రదేశ్లోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేశానన్నారు. సీఎంగా అన్ని బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాననీ, ఈ విషయంలో లేశమాత్రమైనా పశ్చాత్తాపం లేదని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. మథురలో కృష్ణ మందిరం నిర్మిస్తామని ఎన్నికల వేళ బీజేపీ కొత్త నివాదం అందుకోవడం, మథుర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని యోగిని స్థానిక ఎంపీ జయప్రద ఆహ్వానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్య, మథుర, లేదా సొంత జిల్లా గోరఖ్పూర్లలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ పైవిధంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం యోగి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. యూపీ సీఎంగా కొనసాగిన వారిలో ములాయం సింగ్ ఆఖరిసారిగా 2003లో అసెంబ్లీకి పోటీ చేశారు. ఆయన తర్వాతి సీఎంలు మాయావతి, అఖిలేశ్, యోగి ఎమ్మెల్సీలుగా కొనసాగడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేసే అవకాశాల్లేవని ఇటీవల ప్రకటించిన మాజీ సీఎం అఖిలేశ్..ఆ విషయం పార్టీయే నిర్ణయిస్తుందంటూ ఆ తర్వాత మాటమార్చారు. కాశీ, అయోధ్యల్లో మాదిరిగా మథుర పుణ్యక్షేత్రంలో వివిధ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని యోగి అన్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ అడిగిన ప్రశ్నకు ఆయన..‘ఒవైసీ ఒవైసీయే. ఆయన నోటి నుంచి రామకథ వినాలని మీరు ఆశిస్తున్నారా?’ అని వ్యంగ్యంగా అన్నారు. -
బంగార్రాజుకు స్నేహితురాలిగా సీనియర్ నటి?
‘సోగ్గాడే చిన్ని నాయనా’లో బంగార్రాజుగా మంచి జోష్ ఉన్న పాత్రలో నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇది తండ్రి పాత్ర. ఇందులో తనయుడి పాత్రనూ ఆయనే చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘సోగ్గాడే...’కి ప్రీక్వెల్గా ‘బంగార్రాజు’ రూపొందనుంది. మొదటి భాగంలో కనిపించినట్లుగానే ఇందులోనూ పలువురు కలర్ఫుల్ తారలు కనిపిస్తారట. వాళ్లల్లో జయప్రద ఒకరనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ఉన్న ఒక కీలక పాత్రకు జయప్రదను సంప్రదించారట చిత్రదర్శకుడు కల్యాణ్కృష్ణ. మరి.. బంగార్రాజుకు స్నేహితురాలిగా జయప్రద కనిపిస్తారా? లేక వేరే ఏదైనా పాత్రా అనేది తెలియాల్సి ఉంది. జయప్రద ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, డేట్స్ కూడా కేటాయించారని టాక్. ‘సోగ్గాడే..’లో నాగ్కి జోడీగా నటించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలోనూ ఆ పాత్రను చేస్తారని తెలిసింది. నాగచైతన్య కూడా ఈ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. షూటింగ్ ఆరంభించడమే ఆలస్యం అని సమాచారం. -
‘బంగార్రాజు’తో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ !
‘కింగ్’ నాగార్జున అక్కినేని-రమ్యకృష్ణ జంటగా డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయన’. ఎలాంటి అంచనాలు లేకుండా 2016లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో డైరెక్టర్ కల్యాణ్ దీనికి సీక్వెల్గా ‘బంగార్రాజు’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే బంగార్రాజును సెట్స్పైకి తీసుకురానున్నట్లు డైరెక్టర్ ప్రకటించినప్పటి నుంచి దీనికి సంపాదించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఇందులో అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ నటిస్తుండగా చైకి జోడిగా సమంత నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఆ తర్వాత సమంత కాదని తమిళ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ను అనుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బంగార్రాజు నుంచి మరో అసక్తికిర అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. తాజా సమచారం ప్రకారం ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రదను చిత్రం బృందం సంప్రదించినట్లు సమాచారం. డైరెక్టర్ కల్యాణ్ ఆమెను కలిసి పాత్రను వివరించగా అది నచ్చడంతో జయప్రద గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ మూవీ కోసం డెట్స్ కూడా ఇచ్చినట్లు టాలీవుడ్లో టాక్. కాగా కొంతకాలంగా జయప్రద తెలుగు తెరపై కనిపించడం లేదు. చాలా గ్యాప్ తర్వాత ‘బంగార్రాజు’ మూవీతో టాలీవుడ్కు రీఎంట్రీ ఇవ్వడం నిజంగా ఆమె అభిమానులకు పండగే. అలాగే దీనితో పాటు జయప్రద ఓ వెబ్ సిరీస్తో కూడా త్వరలో ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కూడా నాగార్జునకు జోడిగా నటి రమ్యకృష్ణ నటించనుంది. చదవండి: నాగార్జున యాక్షన్ మూవీ: జూన్లో ప్రారంభం -
కృష్ణ కెరీర్ను మలుపుతిప్పిన సినిమా ఇది
కొన్ని సినిమాలు... కాంబినేషన్లు అంతే! అతిగా ఊహించినప్పటి కన్నా, అంచనాలు లేనప్పుడే అద్భుత విజయాలు అందించి, ఆశ్చర్యపరుస్తాయి. ఆపైన ఆ కాంబినేషన్ను బాక్సాఫీస్ సంచలనంగా మార్చేస్తాయి!! అందుకు ఉదాహరణ – దర్శకుడు కె.రాఘవేంద్రరావు, హీరో కృష్ణ కాంబినేషన్లో 1981 జనవరి 14న రిలీజైన ‘ఊరుకి మొనగాడు’. ఆ కథ తెలుగులో హీరో కృష్ణ కెరీర్ లో ఘన విజయం! హిందీలో కె. రాఘవేంద్రరావునూ, శ్రీదేవినీ స్టార్లను చేసిన సంచలనం! కామెడీ విలనీకి ట్రేడ్ మార్కు కథనం!! ఆ ఫార్ములాకు తెరపై ఇప్పుడు 40 వసంతాలు. నాలుగు దశాబ్దాల క్రితం మాట. హీరో కృష్ణ అప్పటికే 175 సినిమాల హీరో. ‘పండంటి కాపురం’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘పాడిపంటలు’ లాంటి సూపర్ హిట్లు అందించిన హీరో. అయితే, ఎంతసేపటికీ ‘కృష్ణ సొంతంగా నిర్మించిన సినిమాలే పెద్ద హిట్టవుతాయి. బయటి నిర్మాతలకు పనిచేసినవి ఆడవు’ అనే అపవాదు ఉండేది. దాన్ని తుడిచిపెట్టి, బయటి బ్యానర్ లో కూడా కృష్ణకు భారీ హిట్స్ వస్తాయని బాక్సాఫీస్ సాక్షిగా నిరూపించిన చిత్రం ‘ఊరుకి మొనగాడు’. ఈ మాట సాక్షాత్తూ హీరో కృష్ణే శతదినోత్సవంలో చెప్పారు. ఈ గ్రామీణ నేపథ్య కుటుంబకథ ఆ సంక్రాంతికి పెద్ద హిట్! కృష్ణ కెరీర్లోనే థర్డ్ బిగ్గెస్ట్ హిట్!! కసితో వచ్చిన కాంబినేషన్... అంతకు సరిగ్గా ఏడాది ముందు 1980 సంక్రాంతికి కె. రాఘవేంద్రరావు – హీరో కృష్ణ కాంబినేషన్లోనే తొలి చిత్రం ‘భలే కృష్ణుడు’ వచ్చింది. ఆ రాఘవేంద్రరావు సొంత సినిమా నిరాశపరిచింది. మరో 2 నెలలకు ‘ఘరానా దొంగ’ (1980 మార్చి 29) వచ్చి, కాస్త ఫరవాలేదనిపించింది. కానీ, తమ కాంబినేషన్ అనుకున్న హిట్ సాధించలేదనే బాధ రాఘవేంద్రరావులో ఉండిపోయింది. దాంతో మూడో చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నిర్మాత అడుసు మిల్లి గోపాలకృష్ణేమో స్వయంగా ఆయన స్నేహితుడైన ఎ. లక్ష్మీ కుమార్ (శోభన్బాబు ‘రాజా’ చిత్ర నిర్మాత)కు తమ్ముడు. నిర్మాత నుంచి ఏ ఆటంకాలూ లేని ఆ సమయంలో, ఓ మంచి హిట్ ఫార్ములా కథ కోసం చూస్తున్న ఆయనకు సత్యానంద్ రాసిన కథ ‘ఊరుకి మొనగాడు’. ‘‘అప్పట్లో ‘భలేకృష్ణుడు’కు జంధ్యాల, నేను కలసి పని చేసినా, ఎందుకో ఆశించిన ఫలితం రాలేదు. కథ కోసం అన్వేషిస్తున్నప్పుడు అంతకు రెండేళ్ళ క్రితమే నాకు తట్టిన లైన్ చెప్పా. సినిమాలో మొదట మామూలుగా కనిపించే హీరో– చివరకు ఓ పోలీసని తేలడం, పగ తీర్చుకోవడం అనేది కమర్షియల్ ఫార్ములా. అదే పద్ధతిలో... గ్రామీణ నేపథ్యంలో ఓ ఇంజనీరులా ఉద్యోగం మీద ఓ ఊరికి వచ్చిన హీరో వెనుక అసలు కథ వేరే ఉంటే? ఆ ఊరితో అతనికి వేరే బంధముండి, తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటే? ఈ స్టోరీలైన్ చెప్పగానే రాఘవేంద్రరావుకు నచ్చేసింది. దాన్ని ‘ఊరుకి మొనగాడు’గా తీర్చిదిద్దా’’ అని సత్యానంద్ తెలిపారు. వినోదాత్మక విలనీ క్యారెక్టరైజేషన్! ‘ఊరుకి మొనగాడు’ షూటింగ్ అధిక భాగం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, కూళ్ళ, వాకతిప్ప, రామచంద్రాపురాల్లో జరిగింది. గ్రామీణ ప్రాంతంలోని మనుషులు, మనస్తత్వాలు, ఆకతాయి హీరోయిన్, బావా మరదళ్ళ సరసం, హీరోతో చేతులు కలిపి తండ్రి తప్పుదిద్దే హీరోయిన్, మామను ఆట పట్టించే కాబోయే అల్లుడు లాంటి సత్యా నంద్ రచనా చమక్కులన్నీ ఈ సినిమాకు హిట్ దినుసులయ్యాయి. ముఖ్యంగా, రావు గోపాలరావు, ఆయనకు సహచరుడైన అల్లు రామలింగయ్యల ట్రాక్ జనానికి తెగ నచ్చింది. రావు గోపాలరావు పాత్ర చిత్రణ, ఆ పాత్రకు రాసిన డైలాగ్స్ ఇప్పటికీ కొత్తగా అనిపిస్తాయి. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, ఆ తరువాత నాగభూషణం లాంటివాళ్ళు వినోదం పండిస్తూనే, విలనీ చేసేవారు. ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ (1969)లో నాగభూషణం కామిక్ రిలీఫ్ ఇస్తూ, విలనీ పండించడం, భమిడిపాటి రాధాకృష్ణ డైలాగులు కాలేజీ రోజుల్లో సత్యానంద్ మనసుపై ముద్ర వేశాయి. ‘‘మామూలుగా సినిమాలో విలన్లు పవర్ఫుల్గా, వయొ లెంట్గా ఉంటారు. కానీ, విలన్లు ఈ కథలో పాత్రలకు భయం కలిగిస్తూనే, చూసే ప్రేక్షకులకు వినోదం పంచా లనే కాన్సెప్ట్ తీసుకున్నా. ఆ పద్ధతిని నా తొలి చిత్రం ‘మాయదారి మల్లిగాడు’ (1973)లో నాగభూషణంతో ప్రయత్నించా. ‘ఊరుకి...’లో రావుగోపాలరావు, అల్లుతో పూర్తిస్థాయిలో పెట్టా’’ అని సత్యానంద్ వివరించారు. హిందీలోకీ అదే ఫార్ములా! విలన్, విలన్ వెంట సహాయకుడిగా కామెడీ విలన్ అనేది బాక్సాఫీస్ ఫార్ములాగా మారింది. ఈ సినిమాతో స్థిరపడ్డ ఆ ఫార్ములా ఆ తరువాత ఓ ట్రెండ్ గా తెలుగు తెరపై స్థిరపడింది. సత్యానంద్, రాఘవేంద్రరావు బృందం తీర్చిదిద్దిన ఈ సక్సెస్ ఫార్ములా ఆపైన హిందీ సినిమాల్లోకీ వెళ్ళడం విశేషం. రాఘవేంద్రరావు తన హిందీ చిత్రాల్లో రచయిత, నటుడు ఖాదర్ ఖాన్తో కలసి ఆ ఫార్ములాను ఉత్తరాదిలోనూ పాపులర్ చేశారు. అక్కడ చాలా సినిమాల్లో శక్తికపూర్, ఖాదర్ఖాన్ జంట మీదా ఈ విలన్, కమెడియన్ జంట ఫార్ములా బాక్సాఫీస్ వద్ద వర్కౌటైంది. గమ్మత్తేమిటంటే, 1990లలో కోట శ్రీనివాసరావు, అతని పక్కన బాబూమోహన్ అనే ట్రెండ్కు ఈ ఫార్ములానే మాతృక. కృష్ణకు... థర్డ్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ ‘ఊరుకి మొనగాడు’పై మొదట అంచనాలు లేవు. కానీ, హీరో కృష్ణ ఇంట్రడక్షన్ మొదలు కథ, కథనం, పాత్రల స్వరూపస్వభావాలు, డైలాగులతో వాటిని నడిపిన తీరు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే జనానికి బాగా పట్టేశాయి. అదే సంక్రాంతి రోజున రిలీజైన ఎన్టీఆర్ ‘ప్రేమ సింహాసనం’ని కూడా కాదని, ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టారు. అప్పటికే ఎన్టీఆర్తో బ్లాక్బస్టర్లిచ్చిన రాఘవేంద్రరావు ఈసారి కృష్ణతో తన కమర్షియల్ మాయాజాలం చూపారు. కృష్ణకు కెరీర్లో మూడో బిగ్గెస్ట్ హిట్గా ‘ఊరుకి మొనగాడు’ను నిలిపారు. ఆ ఏడాది సంక్రాంతి సీజన్లో తెలుగులో 8 సినిమాలొచ్చాయి. కృష్ణ ‘బంగారు బావ’ (1980 డిసెంబర్ 31), కొత్త ఏడాదిలో అక్కినేని ‘శ్రీవారి ముచ్చట్లు’, శోభన్బాబు ‘పండంటి జీవితం’, ‘జగమొండి’, ‘దేవుడు మామయ్య’, ఎన్టీఆర్ ‘ప్రేమ సింహాసనం’, కృష్ణ ‘ఊరుకి మొనగాడు’, కృష్ణంరాజు ‘ఆడాళ్ళూ మీకు జోహార్లు’ రిలీజయ్యాయి. వీటన్నిటిలోకీ ‘ఊరుకి...’ పెద్ద హిట్. ఈ సినిమా రిలీజై నెల తిరగ్గానే అక్కినేని – దాసరి గోల్డెన్జూబ్లీ హిట్ ‘ప్రేమాభిషేకం’ వచ్చింది. ఆ ప్రభంజనాన్ని సైతం తట్టుకొని, ‘ఊరుకి...’ నిలబడడం విశేషం. కృష్ణ సినీజీవితంలో ‘పండంటి కాపురం’ (17 కేంద్రాలు), ‘అల్లూరి సీతారామరాజు’ (15) తరువాత అత్యధిక సెంటర్లలో (7 కేంద్రాలు – విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, తెనాలి, ఒంగోలు) డైరెక్ట్గా వంద రోజులు ఆడిన చిత్రం ‘ఊరుకి మొనగా’డే! అలాగే ఈ చిత్రం మరో 4 కేంద్రాల్లో నూన్ షోస్తోనూ వంద నడిచింది. ఆపై షిఫ్టింగులతో రజతోత్సవం కూడా జరుపుకొంది. ఆ తరువాత విడుదలైన ‘ఈనాడు’ (1982) కూడా నేరుగా 7 కేంద్రాలలో 100 రోజులు ఆడి, ‘ఊరుకి’తో సమంగా నిలిచింది. కృష్ణకు నేరుగా 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన చిత్రాలుగా ‘పాడిపంటలు’ (1976), ‘సింహాసనం’ (1986), ‘నెంబర్ వన్’ (1994) రికార్డుకెక్కాయి. మారిన సినీ గ్రామర్... మామూలుగా తెలుగు భాషా, వ్యాకరణ, వాడుక భాషా సంప్రదాయాల్లో దేని ప్రకారం చూసినా ‘ఊరికి’ మొనగాడు అని రాయడం కరెక్ట్. కానీ, ఈ సినిమాకు ‘ఊరుకి’ అని తప్పుగా టైటిల్ పెట్టడం అప్పట్లో విమర్శలకు గురైంది. విజయవాడలో సినిమా యూనిట్ ‘గెట్ టుగెదర్’లో ప్రముఖ రచయిత రెంటాల గోపాలకృష్ణ లాంటి వారు సభాముఖంగా ఈ తప్పు ప్రస్తావించారు. అయితే, వ్యాకరణానికే కాదు... ఒక రకంగా సినీ వ్యాకరణానికి కూడా ఈ సినిమా ఎదురెళ్ళింది. సాధారణంగా తెలుగు సినిమాలో 70 నుంచి 80 సీన్లుంటాయి. కానీ, రెండున్నర గంటలైనా లేని ‘ఊరుకి..’లో ఏకంగా 120 దాకా సీన్లున్నాయి. కాకపోతే, అన్నీ చిన్న చిన్న సీన్లే. దాంతో, సీన్లు ఎక్కువున్నా, సినిమా నిడివి తక్కువే. చిన్న సీన్లతోనే చకచకా కథ చెబుతూ, ఒక్క సెంటిమెంట్ పార్ట్ మినహా హీరోయిన్, విలన్ల పాత్రలు సహా మిగతా అంతా ఎంటర్ టైనింగ్గా సాగే విధానాన్ని అప్పట్లోనే అనుసరించడం విశేషం. తెలుగు డేట్స్తో... హిందీ సినిమా ఈ చిత్ర హిందీ రీమేక్ ‘హిమ్మత్వాలా’ ముందు భారతీరాజా తమిళ హిట్ ‘పదు నారు వయదినిలే’ (పదహారేళ్ళ వయసు) హిందీ రీమేక్ ‘సోలవా( సావన్’ (1979) లాంటి సినిమాల్లో శ్రీదేవి నటించారు. అవేవీ ఆమెకు కలిసిరాలేదు. ఆ మాటకొస్తే, ఈ ‘హిమ్మత్ వాలా’లోనూ శ్రీదేవిని హీరోయిన్గా పెట్టుకోవాలని పద్మాలయా సంస్థ మొదట అనుకోలేదు. వారు ఓ తెలుగు సినిమా కోసం శ్రీదేవిని బుక్ చేసుకొని, డేట్లు తీసుకున్నారు. అనుకోకుండా ఆ తెలుగు సినిమా అనుకున్న టైమ్కి మొదలుకాలేదు. ఆగింది. దాంతో, శ్రీదేవి డేట్లు వేస్ట్ చేయడం ఎందుకని హిందీలో తీస్తున్న ‘హిమ్మత్ వాలా’కు అప్పటికప్పుడు శ్రీదేవిని పెట్టారు. ఆమె డేట్స్ అలా వాడుకున్నారు. అలా ఆపద్ధర్మంగా వాళ్ళు తీసుకున్న ఓ నిర్ణయం శ్రీదేవి కెరీర్నే మార్చేసింది. హిందీ సీమలో తిరుగులేని నాయికగా ఆమె ఎదగడానికి బలమైన పునాది వేసింది. జితేంద్ర, శ్రీదేవి జంట తెలుగు సిన్మాల హిందీ రీమేక్స్కు సరికొత్త పాపులర్ కాంబినేషన్ అయింది. ‘నిషానా’ (1980 – ఎన్టీఆర్ ‘వేటగాడు’ రీమేక్)తో హిందీలో అడుగుపెట్టిన రాఘవేంద్రరావుకు ‘ఫర్జ్ ఔర్ కానూన్’ (1982 – ఎన్టీఆర్ ‘కొండవీటి సింహం’ రీమేక్) తరువాత, ఈ మూడో చిత్రం ‘హిమ్మత్ వాలా’తోనే బాలీవుడ్లో భారీ బ్లాక్బస్టర్ వచ్చింది. ఒక్క కథ – ఇటు కృష్ణ, రావు – అల్లు కాంబినేషన్ నుంచి అటు శ్రీదేవి, జితేంద్ర, రాఘవేంద్రరావు దాకా ఎందరి కెరీర్నో కీలకమైన మలుపు తిప్పింది. అందరినీ బాక్సాఫీస్ మొనగాళ్ళుగా నిలిపింది. శ్రీదేవి కెరీర్ మార్చిన కథ! హీరో కృష్ణ సొంత సంస్థ పద్మాలయా వారు ఇదే కథను రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే హిందీలో శ్రీదేవి, జితేంద్ర జంటగా ‘హిమ్మత్ వాలా’ (1983) పేరుతో రీమేక్ చేశారు. ఏకంగా 50 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకొన్న ఆ హిందీ రీమేక్ అటు పద్మాలయాకూ, ఇటు శ్రీదేవికీ, రాఘవేంద్రరావుకీ – ముగ్గురికీ ఉత్తరాది సినీ సీమలో బ్రేక్ ఇచ్చింది. జితేంద్ర కెరీర్కు హీరోగా సెకండ్ ఇన్నింగ్సూ వచ్చింది. తెలుగు తెరపై... దివిసీమ ఉప్పెన! సమకాలీన సంఘటనల్ని సినిమాలోకి జొప్పిస్తే, అది ఎప్పుడూ బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములానే! 1977 నవంబర్లో కృష్ణాజిల్లా దివిసీమ తుపానులో జరిగిన భారీ ప్రాణనష్టం దేశవ్యాప్త సంచలనం. ‘ఊరుకి’లో ఆ సంఘటనను సందర్భోచితంగా వాడుకున్నారు. జనం మనసును మెలిపెడుతున్న ఆ ఘట్టాన్ని సినిమాలో వాడితే బాగుంటుందన్నది రాఘవేంద్రరావు ఆలోచన. ఆ ఆలోచనను అందుకొని, దాన్ని మూగవాడైన నటుడు చంద్రమోహన్ పాత్రకూ, నిర్మలమ్మ పాత్రకూ ముడి పెడుతూ, మంచి సెంటిమెంట్ ట్రాక్గా కథలో జొప్పించారు సత్యానంద్. ఉప్పెన వల్ల అయినవారిని పోగొట్టుకొని, కొంపా గోడు పోయి వీధిన పడ్డ సామాన్యుల కోసం విరాళాల సేకరణ జరిగిన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఈ సినిమాలో హీరో కృష్ణ జోలె పట్టి తిరిగే దృశ్యాలు తీశారు. ‘కదలి రండి మనుషులైతే...’ అంటూ ఆ సందర్భానికి తగ్గట్టు ఆరుద్ర రాసిన భావోద్వేగ గీతం ప్రేక్షకులను కదిలించింది. చిత్ర ఘనవిజయానికి బాగా తోడ్పడింది. ఆ పాట ఇవాళ్టికీ ప్రకృతి విపత్తుల వేళ రేడియోలో, టీవీలో తప్పకుండా వినిపించే మాట. ఈ కమర్షియల్ సినిమాలో చక్రవర్తి స్వరకల్పనలో ‘ఇదిగో తెల్లచీరా ఇవిగో మల్లెపూలు...’, ‘బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో...’, ‘అందాల జవ్వని మందార పువ్వని...’, ‘మొగ్గా పిందేళ నాడే...’ లాంటి వేటూరి మార్కు గీతాలన్నీ మాస్ నోట నానాయి. కథ, కథనంలోని బిగువుకు ఈ కమర్షియల్ పాటల సరళీ బాగా కలిసొచ్చింది. ఎన్టీఆర్ లాంటి హిట్స్ కోసం... ఆ రోజుల్లో ‘ఊరుకి మొనగాడు’ చిత్రం గుంటూరు జిల్లా హక్కులను హీరోయిన్ శ్రీదేవి తల్లి రూ. 3.2 లక్షలకు తీసుకుంటే, బోలెడంత లాభం వచ్చిందట. 1981 ఏప్రిల్ 25న మద్రాసులో పామ్గ్రోవ్ హోటల్లో శతదినోత్సవం జరిగింది. ప్రముఖ దర్శక, నిర్మాత ఎల్వీ ప్రసాద్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా హీరో ఎన్టీఆర్ విచ్చేసి, కృష్ణను అభినందించి, షీల్డులు అందించారు. ‘‘ఎన్టీఆర్ తో ‘అడవి రాముడు’, ‘వేటగాడు’ లాంటి సూపర్హిట్స్ తీసిన రాఘవేంద్రరావు నాతోనూ ఆ స్థాయి హిట్టయ్యే సినిమాలు ముందు ముందు తీయాలని ఆశిస్తున్నా’’ అంటూ వేదికపై కృష్ణ పేర్కొనడం గమనార్హం. ఇక, నిర్మాతగా ఈ తొలి చిత్రంతోనే బాక్సాఫీస్ హిట్ సాధించిన అడుసుమిల్లి గోపాలకృష్ణ తమ గోపీ మూవీస్ పతాకంపై రెండో చిత్రం ‘శక్తి’ (1983) కూడా కృష్ణ, రాఘవేంద్రరావుల కాంబినేష¯Œ లోనే నిర్మించడం, అదీ హిట్టవడం విశేషం. ఆ పైన రాఘవేంద్రరావు, కృష్ణ కలయికలో ‘అడవి సింహాలు’,‘ఇద్దరు దొంగలు’,‘అగ్నిపర్వతం’, ‘వజ్రాయుధం’ లాంటి చిత్రాలు వచ్చాయి. జయప్రద, కృష్ణ – రెంటాల జయదేవ -
పడ్డారండి ప్రేమలో మరి!
రాజేంద్ర ప్రసాద్ ప్రేమలో పడ్డారు. ఇది లేటు వయసులో క్యూటు ప్రేమ అట. అయినా ప్రేమకు వయసేంటి? ఈ ప్రేమ అంతా సినిమా కోసమే. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ముఖ్య పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘లవ్ – 60’ టైటిల్. ఈ సినిమాకు వీయన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తారు. అరవైలలో ప్రేమలో పడే జంటగా రాజేంద్ర ప్రసాద్, జయప్రద కనిపిస్తారు. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం ఈ సినిమాను రూపొందించనున్నారు. -
తొలి పరిచయం!
జయప్రద తొలి పరిచయానికి శ్రీకారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ., మలయాళం, హిందీ, భోజ్ పురి.. ఇలా పలు భాషల్లో సినిమాలు చేసిన జయప్రద ఇప్పుడు తొలి పరిచయం ఏంటీ? అనుకోవచ్చు. ఆమె పంజాబీ తెరకు పరిచయం కానున్నారు. జయప్రద చేస్తున్న తొలి పంజాబీ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. అమితాబ్ బచ్చన్, జయప్రద కాంబినేషన్లో ‘ఆజ్ కా అర్జున్’ (1990), రజనీకాంత్, ప్రేమ్ చోప్రా, రేఖ కాంబినేషన్ లో ‘ఫూల్ బనే అంగారే’ ఇంకా ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, అజయ్ దేవగన్ వంటి హీరోలతోనూ సినిమాలు తెరకెక్కించిన కేసీ బొకాడియా ఈ చిత్రానికి దర్శకుడు. అతి తక్కువ సమయంలో 50 చిత్రాలు నిర్మించిన నిర్మాతగానూ బొకాడియాకి పేరుంది. తాజాగా పంజాబీలో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మేరీ వోతీ దా వ్యాహ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాజ్ బబ్బర్, జయప్రద జంటగా తన రెండో సినిమా ‘భూత్.. అంకుల్–తుసీ గ్రేట్ హో’ని ఆరంభించారు బొకాడియా. జయప్రదకు పంజాబీలో ఇది తొలి సినిమా కాగా, దాదాపు పదేళ్ల తర్వాత రాజ్ బబ్బర్ చేస్తున్న పంజాబీ సినిమా ఇదే కావడం విశేషం. -
శ్రీలతా రెడ్డి, మంత్ర, సుజాత.. ఎవరబ్బా?!
(వెబ్ స్పెషల్): పుట్టగానే అమ్మ నాన్న పేరు పెడతారు. ఆ తర్వాత ముద్దు పేర్లు వచ్చి చేరతాయి. మరి కొందరు వారు చేస్తున్న పనిని బట్టి పేర్లు తెచ్చుకుంటారు. ఆ పేరుతోనే ఫేమస్ అవుతారు. ఇక సినీ ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. ఇండస్ట్రీలో విజయాలు సాధించాలని కొందరు కొత్త పేర్లు పెట్టుకుంటారు.. మరి కొందరు ఉన్న పేరుకే మార్పులు చేసుకుంటారు. ఇక కొందరికి దర్శకులే నామకరణం చేస్తారు. అలాంటి వారు సొంత పేరుతో కన్నా ఈ పేరుతోనే బాగా గుర్తింపు పొందుతారు. మరి ఇండస్ట్రీలో ఇలా పేరు మార్చుకుని.. స్టార్గా ఎదిగిన హీరోయిన్లు ఎవరో చూడండి.. శ్రీదేవి బాల్యంలోనే ఇండస్ట్రీలో ప్రవేశించి.. అంచెలంచెలుగా ఎదుగి.. ఫిమేల్ సూపర్ స్టార్గా పేరు సంపాదించున్నారు అందాల నటి శ్రీదేవి. అయితే ఆమె కూడా పేరు మార్చుకున్నారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. ఆ తర్వాత శ్రీదేవిగా మారి.. ఇండియాను ఓ ఊపు ఊపేసారు. జయసుధ మూవీస్లో సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు జయసుధ. అయితే ఆమె కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. ఆమె అసలు పేరు సుజాత. (మార్పు అవసరం) జయప్రద అందం, అభినయం, నాట్య మయూరి అయిన జయప్రద అసలు పేరు లలితా రాణి. రాజమండ్రిలో జన్మించిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమై, దక్షిణాది, బాలివుడ్లో అగ్రకథానాయికగా ఎదిగి, ఆ తరువాత రాజకీయాల్లో రాణిస్తున్నారు. సౌందర్య పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగించి ఆడపడుచు అయ్యారు సౌందర్య. టాప్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో అకాల మృత్యువు ఆమెను కబలించింది. సావిత్రిలాగా తెలుగు సినిమా ఉన్నంత కాలం సౌందర్య కూడ ప్రేక్షకుల మదిలో జీవించే ఉంటారు. భౌతికంగా మనల్ని విడిచివెళ్ళిన ఈమె అసలు పేరు సౌమ్య అనే విషయం అందరికి తెలిసిందే. (రెండు కోట్ల ప్రేమ) రోజా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. హీరోయిన్గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈమె కూడా పేరు మార్చుకున్నారు. రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. రంభ నిజంగా దివి నుంచి భువికి దిగివచ్చిన అందాల బొమ్మ రంభ. గ్లామర్ అనే పదం వినగానే 1990ల ప్రేక్షకులకి గుర్తొచ్చే పేరు రంభ. విజయవాడలో పుట్టి పెరిగిన రంభ అసలు పేరు విజయలక్ష్మీ. భూమిక ఢిల్లీ నుంచి వచ్చిన రచన చావ్లా కాస్త సినిమాల కోసం భూమికగా మారారు. హీరోయిన్గా వచ్చిన కొత్తలో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించారు. పవన్ కళ్యాణ్ తో ఖుషి, మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. (నన్ను నేను తెలుసు కుంటున్నాను) అనుష్క ప్రయోగాత్మక చిత్రాలకు.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు అనుష్క. బెంగుళూరుకి చెందిన అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి అనే విషయం అందరికి తెలిసిందే. సినిమాల్లో తప్ప, బయట ఆమెని అందరు స్వీటి అనే పిలుస్తారు. స్వతహాగా ఈమె యోగ టీచర్. నయనతార సూపర్ స్టార్ రజినీకాంత్ ‘చంద్రముఖి’ చిత్రంతో పరిచయం అయిన కేరళ బ్యూటి నయనతార అసలు పేరు డయాన మరియమ్ కురియన్. కాని ఈ లేడి సూపర్ స్టార్ సినిమాల కోసం నయనతారగా మారింది. రాశి రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఆమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవారు. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది. అయితే రాశి అసలు పేరు విజయలక్ష్మి. ఇక వీరే కాక హీరో రజనీకాంత్, చిరంజీవి, సూర్య, పవన్ కళ్యాణ్, విక్రమ్ వంటి స్టార్ హీరోలు సైతం పేరు మార్చుకున్నారు. -
జయప్రదను టార్గెట్ చేసిన నగ్మ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతూ మాదకద్రవవ్యాల వినియోగం అంశం దగ్గర ఆగిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కోణం వెలువడటంతో కేసు మరో మలుపు తిరిగింది. పార్లమెంట్ వేదికగా దీనిపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇక మాదకద్రవ్యాల కోణం గురించి వ్యాఖ్యలు చేసిన కంగనకు, ఇతర నటులకు మధ్య మాటలయుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మ.. బీజేపీ నాయకులు, సీనియర్ నటి జయప్రదను టార్గెట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు నుంచి ప్రజలను దారి మళ్లించడానికి మాదకద్రవ్యాలు, బాలీవుడ్లో డ్రగ్ కల్చర్ అంశాలను తెర మీదకు తెచ్చారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు నగ్మ ట్వీట్ చేశారు. (చదవండి: విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు) CBI , NCB , ED pls answer to #BJP Member #JayaPrada Ji on what’s happening to #SSR case it’s been so long we are all waiting for what’s the outcome but no result and to cover up suddenly all #bjp members r talking about drugs in #Bollywood as Nation is still waiting #SSRDeathCase — Nagma (@nagma_morarji) September 17, 2020 ‘సీబీఐ, ఎన్సీబీ,ఈడీ దయచేసి సుశాంత్ కేసులో ఏం జరుగుతుందో బీజేపీ నాయకులు, జయప్రద గారికి తెలియజేయండి. సుశాంత్ చనిపోయి ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది. దేశప్రజలంతా సుశాంత్ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఫలితం లేదు. దీన్ని కవర్ చేయడానికి ఉన్నట్లుండి బీజేపీ నాయకులు బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వినియోగం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికి కూడా దేశ ప్రజలు సుశాంత్ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని భావిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు. ఎంపీ రవికిషన్ బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం ఉందంటూ చేసిన వ్యాఖ్యలకు జయప్రద మద్దతిచ్చారు. దాంతో నగ్మ ఈ వ్యాఖ్యలు చేశారు. టీవీ నటి కావ్యా పంజాబీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘తొలుత జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ ప్రారంభమైంది.. తరువాత జస్టిస్ ఫర్ కంగనగా మారి ఇప్పుడు జస్టిస్ ఫర్ రవి కిషన్ అయ్యింది. మరి సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఎక్కడ అంటూ’ ట్వీట్ చేసింది. -
దర్శకుడు కె.విశ్వనాథ్ను కలిసిన సినీ నటి జయప్రద
-
వైరల్ : ఖుష్భూతో చిందేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ రీయూనియన్ పదో యానివర్సరీ సెలబ్రేషన్స్లో అలనాటి తారలతో కలిసి చిరంజీవి ఫూల్గా ఎంజాయ్ చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బంగారు కోడిపెట్ట సాంగ్కు ఆయన ఖుష్భూతో డ్యాన్స్ చేశారు. మధ్యలో జయప్రద కూడా చిరుతో జత కలిశారు. కాగా, 1980లలో నటించిన స్టార్స్ ప్రతీ ఏడాది సరదాగా కలసి రీయూనియన్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రీయూనియన్ను చిరంజీవి హోస్ట్ చేశారు. ఈ పార్టీ హైదరాబాద్లోని చిరంజీవి స్వగృహంలో జరిగింది. ఈ వేడుకకు 40మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలకు చెందిన నటీనటులున్నారు. -
‘నన్ను ఏడిపించారుగా..అందుకే ఇలా’
లక్నో : తనను అకారణంగా వేధిస్తున్నారని ఎస్పీ ఎంపీ ఆజం ఖాన్ ఎన్నికల ప్రచార సభలో గగ్గోలు పెట్టిన క్రమంలో ఆయన ప్రత్యర్థి, బీజేపీ నేత జయప్రద స్పందించారు. ఆజం ఖాన్ కారణంగా మహిళ కంటతడి పెట్టిన ఫలితమే ఇదని ఆమె మండిపడ్డారు. ఆయన ఇప్పుడు ప్రతిసభలో ఏడుస్తున్నారు. తనను ఆయన మంచి నటినంటూ ఎద్దేవా చేసేవారు..ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటని జయప్రద ఆక్షేపించారు. రాంపూర్లో బీజేపీ తరపున ఎంపీగా జయప్రద పోటీచేసిన క్రమంలో ఆమెపై ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆజం ఖాన్ తన రాజకీయ కెరీర్ను నాశనం చేసేందుకు ప్రయత్నించారని గతంలో జయప్రద ఆరోపించారు. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆజం ఖాన్ను ఈనెల 5న సిట్ అధికారులు దాదాపు రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. పలు కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో రాంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను వేధిస్తున్నాయని ఆయన వాపోతున్నారు. ఎస్పీ నేత ఆజం ఖాన్పై 80కి పైగా కేసులు నమోదయ్యాయి. -
జయప్రద ఓటమి
రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసిన సీనియర్ హీరోయిన్ జయప్రద ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఉత్తర ప్రదేశ్ లోని రామ్పూర్ నుంచి బరిలో నిలిచిన జయప్రదపై ఆమె సమీప ప్రత్యర్థి, సమాజ్ వాది పార్టీ అభ్యర్థి ఆజాంఖాన్ లక్ష 40 వేలకు పైగా మెజారిటీ సాధించారు. తెలుగు, హిందీ సినిమాలతో నటిగా తార స్థాయిని అందుకొని తరువాత జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముంద్ర వేసిన సీనియర్ నటి జయప్రద. ఎన్టీఆర్ ఆహ్వానంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయప్రద తరువాత చంద్రబాబు నాయుడుతో విభేదాల కారణంగా తెలుగు రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యారు. ఉత్తర్ప్రదేశ్ సమాజ్ వాది పార్టీలో చేరి రెండు సార్లు ఎంపీగా గెలిచి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. సమాజ్ వాదీ పార్టీలో విభేదాలు రావటంతో అమర్సింగ్తో కలిసి రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీని స్థాపించారు. 2011లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసిన ఈ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు. తరువాత కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన జయప్రద అడపాదడపా సినిమాల్లో నటించారు. మూడేళ్ల విరామం తరువాత అమర్ సింగ్తో కలిసి ఆర్ఎల్డీ పార్టీలో చేరిన జయప్రద 2014 జనరల్ ఎలక్షన్స్లో బిజ్నూర్ నియోజిక వర్గం నుంచి లోక్సభకు పోటి చేసి ఓడిపోయిన ఆమె 2019 జనరల్ ఎలక్షన్స్ కు ముందుకు బీజీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోసారి రామ్పూర్ నుంచి పోటిచేసి ఓటమి పాలయ్యారు. -
కొంత మంది నేతలకు ‘అజ్ఞానమే వరం’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ‘వారి అజ్ఞానమే వారికి వరం’ అనుకుంటా! పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలివుడ్ నటుడు సన్నీడియోల్ను బాలకోట్లో భారత వైమానిక దళం జరిపిన దాడుల గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, తనకేమీ తెలియదని చెప్పారు. భారత్–పాక్ సంబంధాల గురించి ప్రశ్నించగా అది అంతకంటే తెలియదని అన్నారు. హరియాణలోని లాడ్వా నుంచి పోటీ చేస్తున్న తన కుమారుడి తరఫున ప్రచారానికి వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌధురి బీరేంద్ర సింగ్ను స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న నీరు, విద్యుత్ సమస్యల గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ‘నేనెవరో తెలుసా? కేంద్ర మంత్రిని, నన్ను పట్టుకొని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా?’ అంటూ ఆయన విసుక్కున్నారు. మిగతా వారిలాగా ఆయన తనకు తెలియదంటూ సమాధానం ఇవ్వలేదు. ఇక ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ సినీ నటి జయప్రదను కొంత మంది రాజకీయ నాయకులు చేస్తున్న మహిళా విద్వేషక విమర్శల గురించి ప్రశ్నించగా తనకు తెలియదంటూ జయప్రద చెప్పడం ఆమె చుట్టూ చేరిన వారిని కూడా ఆశ్చర్యపరిచింది. ఆమెకు వ్యతిరేకంగా అలాంటి వ్యాఖ్యలు చేసన ఆజం ఖాన్ గురించి అప్పుడే మరచిపోయినట్లున్నారు. లేదంటే ముస్లిం ఓట్లు పోతాయని అలా సమాధానం ఇచ్చారా? అన్నది ఆమెకే తెలియాలి. ఇక తృణమూల్ ఎంపీ మూన్మూన్ సేన్ను, పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్లో జరిగిన ఎన్నికల హింస గురించి అడగ్గా తనకేమి తెలియదని అన్నారు. అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి బాబుల్ సుప్రియో వర్గం, తృణమూల్ కార్యకర్త మధ్య జరిగిన హింసాకాండలో ఆయన కారు ధ్వంసంకాగా, పలువురు గాయపడ్డారు. ఇది గెలవకుముందు అభ్యర్థుల పరిస్థితి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని వాటి ఫుల్ఫామ్లు అడుగుతుంటే తెలియదని చెబుతూ ఆశ్చర్యపరుస్తున్న నాయకులూ ఉన్నారు. -
గుడియా.. నాచ్నేవాలీ..చాక్లెట్ ఫేస్.. శూర్పణఖ..
ఈ ఎన్నికల సీజన్లో రాంపూర్లో సాయంత్రాలు కలర్ఫుల్గా ఉంటాయి (జయప్రద తరచూ పార్టీలు మారడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎస్పీ నేత ఫిరోజ్ఖాన్) ప్రియాంక పప్పూకి పప్పి – మహేశ్ శర్మ, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి మాయావతిని మా కూటమిలో చేర్చుకోవాలంటే ఆమె చాలా పెద్ద జాగానే ఆక్రమిస్తారు. పైపెచ్చు ఆమె పార్టీ గుర్తు ఏనుగు కూడా.. (రెండేళ్ల క్రితం ఎస్పీ, బీఎస్పీ కలయికపై అఖిలేశ్ యాదవ్ను ప్రశ్నించినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలివి. ఇప్పుడు అదే మాయావతితో ఆయన పొత్తు పెట్టుకున్నారు) మాయావతి రోజూ ముఖానికి ఫేషియల్ చేస్తారు. జుట్టుకు రంగు వేసుకొని యువతిలా కనిపించాలని తాపత్రయపడతారు. 60 ఏళ్లు వచ్చినా, ఇంకా ఆమె జుట్టు నల్లగానే ఉండడానికి కారణం అదే. – సురేంద్రనాథ్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే ఒక వేశ్య కూడా తనకు చెల్లించిన ప్రతి పైసాకు ప్రతిఫలాన్ని అందించి చిత్తశుద్ధి ప్రదర్శిస్తుంది. కానీ మాయావతి అలా కాదు. ఆమె పార్టీ టికెట్లు ఎవరు డబ్బులెక్కువగా ఇస్తే వారికి ఇస్తారు. ఎవరైనా టికెట్ కోసం కోటి రూపాయలు ఇస్తామంటే.. మరొకరొచ్చి రెండు కోట్లు ఇస్తామంటే వారికే ఇస్తారు. – దయాశంకర్ సింగ్, బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ ఉపాధ్యక్షుడు ఆకాశంలో సగం. ఓటర్లలో సగం. అయినా చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేదు. ఉన్నవాళ్లని గౌరవించే సంస్కృతీ లేదు. మహిళలు రాజకీయాలకి పనికిరారా? రాజకీయాల్లో పోటీ చేసే మహిళలపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకునే పురుషుల సంఖ్య ఈ మధ్య ఎక్కువైపోతోంది. ఉత్తరప్రదేశ్లో అలనాటి అందాల నటి జయప్రద లోదుస్తులపై రామ్పూర్ నియోజకవర్గంలో ఆమె ప్రత్యర్థి, ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ వెకిలిగా వ్యాఖ్యానిస్తే ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజమ్ రెండాకులు ఎక్కువే చదివారు. ‘అలీ బజరంగ బలీ మావే. అనార్కలి మాకు అవసరం లేద’న్నారు. ఇలా తండ్రీ కొడుకు జయప్రదను టార్గెట్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందిరాగాంధీ నుంచి ప్రియాంక గాంధీ వరకు, జయప్రద నుంచి హేమమాలిని వరకు రాజకీయాల్లోకి వచ్చిన మహిళలందరూ వేధింపులు వెటకారాలు ఎదుర్కొన్న వారే. వాళ్లెంత పవర్ఫుల్ నాయకురాళ్లయినా కావచ్చు. వారికి జనంలో వీరాభిమానులు ఉండచ్చు. కానీ ఎన్నికలు వచ్చే వేళకి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, ఇతర నాయకులకు నోరు పారేసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. ఆజం వెకిలితనం.. నిన్నటికి నిన్న జయప్రదను ఉద్దేశించి ఆజంఖాన్ అన్న మాటలు విన్న వాళ్లంతా షాక్కు లోనయ్యారు. మరీ ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ నివ్వెరపోయారు. ‘జయప్రదను నేనే రామ్పూర్కి తీసుకువచ్చా. ఆమె శరీరాన్ని తాకకుండా నేనే అందరినీ అడ్డుకునే వాడిని. దానికి మీరే సాక్ష్యం. ఆమె అసలు రంగు తెలుసుకోవడానికి మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ రంగు అండర్వేర్ ధరిస్తుందని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నా’ అని నోరు పారేసుకున్నారు. తాను రాజకీయ రంగానికి పరిచయం చేసిన జయప్రద బీజేపీకి మారి రామ్పూర్ నుంచి బరిలోకి దిగడంతో ఆజంఖాన్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆరెస్సెస్ నిక్కర్ రంగుతో జయప్రద లోదుస్తుల్ని పోలిక పెడుతూ ఈ వెకిలి కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతీ ఒక్కరూ తీవ్రంగా ప్రతిస్పం దించినా కనీసం ఆయన క్షమాపణ కూడా కోరడానికి సిద్ధంగా లేరంటేనే తలబిరుసు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఆజంఖాన్ గతంలోనూ ఒక ఎన్నికల ర్యాలీలో జయప్రదని ‘నాట్యగత్తె’ అంటూ చులకన చేశారు. జయప్రద సినిమా రంగం నుంచి రావడమే కాదు, ఆమె కుటుంబ నేపథ్యాన్ని కూడా లాగి నోటికి ఎంత మాట వస్తే అంత మాట వాడేశారు ఆజంఖాన్. ఆయన కుమారుడు కూడా ‘అలీ బజరంగ బలీ మావే (హిందూ, ముస్లిం ఓట్లు మావే). అనార్కలి (సినీ రంగం నుంచి వచ్చిన నాట్యగత్తె జయప్రద) అక్కర్లే)దంటూ ఎన్నికల సభలో నినదించారు. ఇందిరమ్మ.. మూగబొమ్మ దేశ తొలి మహిళా ప్రధాని, గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన ఐరన్ లేడీ ఇందిరాగాంధీకి కూడా ఈ తరహా వ్యాఖ్యలు ఎదుర్కోక తప్పలేదు. ఆమె రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో గూంగీ గుడియా (మూగ బొమ్మ) అని సోషలిస్టు నేత రామ్ మనోహర్ ఏకంగా ఒక పేరే పెట్టేశారు. ప్రధాని అయ్యే తొలినాళ్లలో ఆమె తక్కువగా మాట్లాడేవారన్న విమర్శలుండేవి. అసలు ఇందిరకు ప్రధాని అయ్యే అర్హత లేదని విపక్షాలు చీటికిమాటికి ఎత్తి చూపుతుండేవి. చూడ్డానికి అందంగా ఉంటుంది.. 2014 ఎన్నికల సమయంలో ఎస్పీ నాయకుడు అమర్సింగ్ మథుర బీజేపీ అభ్యర్థి హేమమాలినిపై విరుచుకుపడ్డారు. ఆమె చూడ్డానికి అందంగా బొమ్మలా ఉంటుంది తప్ప ఆమెకు ఎవరూ ఓట్లెయ్యరంటూ ప్రచారం చేశారు. అమర్సింగ్కి బాలీవుడ్తో మంచి సంబంధ బాంధవ్యాలే ఉన్నాయి. హేమమాలినికి మంచి స్నేహితుడిగా కూడా గుర్తింపు ఉంది. ఎన్నికలొచ్చే సరికి స్నేహితులు కూడా శత్రువుల్లా మారి ఇలా మనసును తూట్లు పొడుస్తారా అని బాధపడటం మినహా హేమమాలిని ఏం చేయలేకపోయారు. నుదుటి కుంకుమపైనా కామెంట్లు కొద్ది రోజుల క్రితమే పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ నేత జైదీప్ కవాడే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లక్ష్యంగా షాకింగ్ కామెంట్లే చేశారు. ఓ వీడియోను రూపొం దించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘గడ్కరీ పక్కన కూర్చొని స్మృతి ఇరానీ రాజ్యాంగాన్ని మార్చాలని చెబుతుంటారు. కానీ మీకో విషయం తెలియాలి. ఆమె తన భర్తల్ని మార్చినప్పుడల్లా ఆమె నుదుటిపై ఉన్న బొట్టు సైజు పెద్దదవుతూ ఉంటుంది. అలా అని నాతో ఒకరు చెప్పారు’ అంటూ తీవ్రంగా అవమానించారు. చాక్లెట్ ఫేస్ ప్రియాంక.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకగాంధీ బాధ్యతలు చేపట్టగానే ఆమెని టార్గెట్ చేస్తూ బీజేపీ నాయకుడు కైలాష్ విజయవార్గియా కాంగ్రెస్ పార్టీలో సమర్థులైన నాయకులు లేక ఇలాంటి చాక్లెట్ ఫేస్లను తెస్తున్నారంటూ ప్రియాంకపై విరుచుకుపడ్డారు. ఆయన ట్వీట్ తర్వాత బీజేపీ మద్దుతుదారులు ప్రియాంకపై అసభ్యకరమైన మీమ్లు, ట్వీట్లు పెట్టారు. దీంతో బిహార్లో కొందరిని అరెస్ట్ చేశారు కూడా. నిండు సభలో చీర లాగారు.. ఎన్నికల సమయంలో ప్రచార హడావుడిలో ఏదో నోరు జారడం కాదు, చట్టసభల సాక్షిగా మహిళల్ని అవమానించిన ఘటనలూ ఉన్నాయి. తమిళులకు జయలలిత అంటే ఎంత ఆరాధ్య దైవమో చెప్పనక్కర్లేదు. డీఎంకే శాసనసభ్యులు ఏకంగా దుశ్శాసన పర్వానికి దిగి.. ఆమె చీరలాగారు. చట్టసభల చరిత్రలో ఇదో చీకటి రోజు. ఇక పార్లమెంటులో మన తెలుగు ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరిని శూర్పణఖ అని ప్రత్యర్థి పార్టీల నేతలు తిట్టిపోసిన విషయమూ తెలిసిందే. మహిళలు బాధితులుగా మారే అవకాశాలు రాజకీయాల్లో చాలా ఎక్కువ. ఇది తీవ్రంగా ఖండించాల్సిన అంశం. ఈ తరహా ధోరణి మన ప్రజాస్వామ్య వ్యవస్థని బలహీనం చేయడమే కాదు, మహిళా రాజకీయవేత్తల హక్కుల్ని కూడా కాలరాస్తుంది. అలాంటి చెత్త కామెంట్లు చేసే వారిని ఖండించడానికి మాటలు సరిపోవు. ఇలాంటి విపరీత ధోరణుల్ని అడ్డుకునే ప్రయత్నం ఎన్నికల సంఘం కూడా చేయకపోవడం శోచనీయం. – బృందా కారత్, సీపీఎం నాయకురాలు తిరగబడుతున్న యువతరం ఎన్నికల వేళ మహిళల్ని టార్గెట్ చేస్తుంటే సీనియర్ లీడర్లు నిస్సహాయతతో పంటి బిగువన భర్తిస్తున్నారు కానీ కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న వారు మాటకి మాట విసురుతున్నారు. బీజేపీ నాయకురాలు, ఫ్యాషన్ డిజైనర్ కూడా అయిన షైనా ఎన్సీ ‘మహిళల్ని చిన్నచూపు చూస్తే ఏ మాత్రం సహించకూడదు. వారు బయటకి వచ్చి వెంటనే ఫిర్యాదు చెయ్యాలి. సోషల్ మీడియాలో నన్ను అవమానిస్తూ 587 వరకు మెసేజ్లు వచ్చాయి. నేను వాళ్ల పాపాన వారే పోతారులే అని ఊరుకోలేదు. పోలీసుస్టేషన్కి వెళ్లి కంప్లయింట్ చేశాను’ అని వెల్లడించారు. చట్టసభల్లోనూ, బయటా, మహిళలు పనిచేసే ప్రతీ చోటా మాటల ద్వారా మానసికంగా గాయం చేసి పైశాచికత్వాన్ని బయట పెట్టుకునే మగ పిశాచాలకు తగిన బుద్ధి చెప్పేలా చట్టాలు ఉండాలి అని షైనా అంటున్నారు. మహిళా సాధికారత గురించి పెద్ద లెక్చర్లు ఇస్తూ, వారి ఓట్లు కొల్లగొట్టడానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టే పార్టీల నేతలే మహిళలపై నోరు పారేసుకుంటుంటే ఎవరైనా ఏం చెయ్యాలి. చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ బిల్లును కూడా అటకెక్కించేసిన ఈ పార్టీలు మహిళా సాధికారత కోసం ఏమైనా చేస్తారనుకుంటే పొరపాటే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘జయప్రద ఓ అనార్కలి’
లక్నో : జయప్రదపై ఎస్పీ నేత ఆజం ఖాన్ చేసిన అమర్యాదకర వ్యాఖ్యలు దుమారం రేపగా తాజాగా ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్ నోరు పారేసుకున్నాడు. జయప్రదను అనార్కలిగా అబ్దుల్లా వ్యాఖ్యానించాడు. తాము అలిని, భజరంగ్ భళిని కోరుకుంటామని అనార్కలిని కాదని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అది దేశ చరిత్రకు మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. కాగా అబ్దుల్లా వ్యాఖ్యలపై జయప్రద భగ్గుమన్నారు. తండ్రి ఆజంఖాన్లాగే ఆయన కుమారుడు మాట్లాడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబం నుంచి వచ్చినందుకే అబ్దుల్లా బాగా చదువుకున్నా తండ్రిలాగే మాట్లాడుతున్నాడని, వారికి మహిళలను గౌరవించడం తెలియదని దుయ్యబట్టారు. కాగా జయప్రదపై ఆజం ఖాన్ చేసిన ఖాకీ నిక్కర్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆజం ఖాన్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్, ఈసీ తీవ్రంగా స్పందించాయి. ఆజం ఖాన్ 72 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనను అనుమతించరాదని జయప్రద డిమాండ్ చేశారు. -
వెండితెర రాణి.. వివాదాల రాజు
ఉత్తరప్రదేశ్లోని ప్రతిష్టాత్మక రాంపూర్ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ప్రతిరోజూ ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత సినీ దర్శకుడు సత్యజిత్రే నోరారా పొగిడిన భూలోక సుందరి (ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ద ఇండియన్ స్క్రీన్) జయప్రద ఇక్కడి నుంచే పోటీ చేయడం రాంపూర్ ప్రత్యేకత. మరో అంశం.. స్త్రీలపై అత్యంత అవమానకర వ్యాఖ్యలు చేసి, ఎన్నికల వ్యవస్థనే కించపరిచిన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్ వ్యవహార శైలి కూడా రాంపూర్ నియోజకవర్గానికి మరో రకమైన అపకీర్తిని తెచ్చిపెట్టింది. ఒకనాటి అన్నాచెల్లెలు బం«ధానికి ప్రతీకగా ఉన్న రాంపూర్.. ఎన్నికల సమరంతో రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. హోరాహోరీ ఎన్నికల పోరులో తాడోపేడో తేల్చుకోవాలన్న పట్టుదలతో ఇటు బీజేపీ, అటు ఎస్పీ తీవ్రంగా యత్నిస్తున్నాయి. అయితే రాంపూర్ పోరులో మాత్రం పార్టీల కంటే పాత్రలకే ప్రాధాన్యత ఎక్కువన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలో రాంపూర్ నియోజకవర్గంపై రాజకీయ నిపుణులు, విశ్లేషకులు దృష్టి సారించారు. పదకొండు సార్లు ముస్లింలకే పట్టం 1957లో ఈ లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పదిసార్లు, బీజేపీ మూడుసార్లు, ఎస్పీ రెండుసార్లు గెలిచాయి. భారతీయ జనతాదళ్ ఒకసారి (1977)లో గెలిచింది. మొత్తం 11 సార్లు ముస్లిం అభ్యర్థులే ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ఈ నియోజకవర్గ ప్రజలు మహిళలకు సైతం నాలుగు సార్లు పట్టం కట్టారు. ఈసారి కూడా ‘సన్ ఆఫ్ ద సాయిల్’ ఆజంఖాన్కు గట్టిపోటీ ఇస్తూ, దక్షిణ భారత చిత్రసీమను ఏలిన ఒకనాటి అందాలతార జయప్రద ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎస్పీ నుంచి ఆజంఖాన్, కాంగ్రెస్ నుంచి సంజయ్ కపూర్ (బిలాస్పూర్ ఎమ్మెల్యే) పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ నాటి మిత్రులూ, నేటి బద్ధ శత్రువులైన జయప్రద – ఆజంఖాన్ మ«ధ్యనే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గత ఎన్నికల్లో కొద్దిలో గెలిచిన బీజేపీ ఈ లోక్సభ పరిధిలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వీటిలో రెండు కాంగ్రెస్, రెండు ఎస్పీ, ఒకటి బీఎస్పీ ప్రాతినిధ్యంలో ఉన్నాయి. జయప్రద గతంలో రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009లో జయప్రద బీఎస్పీ టికెట్పై రాంపూర్ లోక్సభ స్థానానికి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె రాజకీయ ప్రత్యర్థి ఆజంఖాన్ తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ డాక్టర్ నేపాల్ సింగ్, 2014లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి నజీర్ అహ్మద్ఖాన్పై, 23 వేల స్వల్ప ఆధిక్యతతో గెలవగలిగారు. గత ఎన్నికల్లో బీఎస్పీ విడిగా పోటీ చేసింది. అయితే ఈసారి మాత్రం ఎస్పీ, బీఎస్పీ పొత్తుపెట్టుకుని తమ ఉమ్మడి అభ్యర్థిగా ఆజంఖాన్ని పోటీకి దింపాయి. వైరం ఎక్కడ మొదలైంది? పదిహేనేళ్ల క్రితం జయప్రదను ముంబై నుంచి రాంపూర్కి రప్పించిన వ్యక్తి, సమాజ్వాదీ పార్టీకి పరిచయం చేసిన మిత్రుడు ఈ రోజు ఆమెకు బద్ధ శత్రువుగా ఎలా మారిపోయాడన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తనను నాడు పరిచయం చేసిన ఆజంఖాన్ను జయప్రద గౌరవంగా అన్నా అని సంబోధించే వారు. ఆయనను గురువుగానూ భావించారు. అయితే సమాజ్వాదీ పార్టీలో ఉండగా ఆజంఖాన్ – అమర్సింగ్ మధ్య తలెత్తిన వైషమ్యాల సందర్భంగా జయప్రద అమర్సింగ్ పక్షం వహించడం వీరిద్దరి మధ్య అగ్గి రాజేసింది. అప్పటి నుంచి ఒకనాటి మిత్రులు బద్ధ శత్రువులుగా మారిపోయారు. తదనంతర పరిణామాల్లో అమర్సింగ్, జయప్రదను సమాజ్వాదీ పార్టీ బహిష్కరించింది. 2014 ఎన్నికల్లో బిజ్నోర్ నియోజకవర్గం నుంచి ఆర్ఎల్డీ తరఫున పోటీ చేసి జయప్రద ఓడిపోయారు. ఆజంఖాన్కిది అలవాటే.. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండటం ఆజంఖాన్ నైజం. అయితే ఈసారి జయప్రదపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలక్షన్ కమిషన్ ఆగ్రహానికి కారణమయ్యాయి. అనుచిత వ్యాఖ్యల కారణంగా 72 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆజంఖాన్ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే గతంలో సైతం తన చిత్రాలను మార్ఫింగ్ చేశాడంటూ ఆజంఖాన్పై జయప్రద ఆరోపణలు గుప్పించింది. ఇప్పుడు సైతం ఆమెపై వ్యక్తిగతంగా చౌకబారు వ్యాఖ్యలు చేయడం మరోమారు ఆజంఖాన్ని అభాసుపాలు చేసింది. ఇప్పుడు తాజాగా ఆమెపై ఆజంఖాన్ ‘పదిహేడేళ్లుగా చూసినా మీకర్థం కాని విషయం నాకు 17 రోజుల్లోనే అర్థమైంది. జయప్రద ఖాకీ నిక్కరు ధరించింది’ అంటూ అంతర్లీనంగా ఆమె ఆర్ఎస్ఎస్ మనిషి అంటూ స్త్రీలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం అక్కడి రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసింది. పైగా తనపై యాసిడ్ దాడికి ఆజంఖాన్ కుట్ర పన్నాడన్న జయప్రద ఆరోపణలు ఇక్కడి రాజకీయ వాతావరణానికి అద్దం పడుతున్నాయి. సామాజిక సమీకరణలు పదకొండు సార్లు ముస్లింలకే పట్టంగట్టిన ఈ నియోజకవర్గంలో ముస్లింల జనాభా సగానికి పైగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు 50.57 శాతం ఉన్నారు. హిందువులు 45.97 శాతం, సిక్కులు 2.80 శాతంగా ఉన్నారు. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. రాంపూర్ అక్షరాస్యత 53.34 శాతం మాత్రమే. జాతీయ సగటు కన్నా ఇది చాలా తక్కువ. రాంపూర్ ముఖచిత్రం మొత్తం ఓటర్లు 11,54,544 పురుషులు 6,22,769 స్త్రీలు 5,31,775 పురుషుల అక్షరాస్యత 61.50% మహిళల అక్షరాస్యత 44.44% -
మహిళల ఓట్లు నాకే
రాంపూర్: సమాజ్వాదీ పార్టీ ముఖ్య నేత ఆజంఖాన్ ఇటీవల తనపై చేసిన అసభ్యకర ‘ఖాకీ నిక్కర్’ వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందించకపోవడాన్ని జయప్రద ఓ ఇంటర్వ్యూలో తప్పుబట్టారు. ఈ అంశంలో అఖిలేశ్ మౌనం వహించడంతో ఇప్పుడు మహిళలు ఆ పార్టీకి దూరం అయ్యారనీ, ఇక స్త్రీలంతా తనకే ఓటు వేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాంపూర్లో ఎస్పీ తరఫున ఆజంఖాన్, బీజేపీ తరఫున జయప్రద పోటీ చేస్తుండటం తెలిసిందే. అఖిలేశ్ సమక్షంలోనే ఆజం ఖాన్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నా అఖిలేశ్ ఏమీ అనలేదనీ, కాబట్టి ఆయన మనస్తత్వం కూడా ఆజంఖాన్ లాంటిదేనని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతాననే అభద్రతా భావంతోనే ఆజంఖాన్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసి ఉంటాడని జయప్రద పేర్కొన్నారు. ఆంజఖాన్ వ్యాఖ్యలు చేయడం చిన్న అంశమంటూ అఖిలేశ్ భార్య డింపుల్ అనడం పట్ల జయప్రద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దేశం మొత్తం తనవైపు ఉంటే డింపుల్, జయా బచ్చన్, షబానా అజ్మీలు మాత్రమే తనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు ఆజంఖాన్ ప్రచారం చేయకుండా 72 గంటలపాటు నిషేధించిన ఎన్నికల సంఘానికి, అలాగే ఈ అంశంపై స్పందించి ఆజంఖాన్కు నోటీసులు పంపిన జాతీయ మహిళా కమిషన్కు జయప్రద ధన్యవాదాలు తెలిపారు. అన్నా అని పిలిచి తప్పు చేశా.. ఆజంఖాన్ను అన్నా అని పిలిచి తాను తప్పు చేశానని జయప్రద అన్నారు. ఖాన్ పైకి కనిపించేంతటి మంచి మనిషి కాదనీ, లోపల ఇంకో మనిషి ఉన్నాడని ఆయనే స్వయంగా నిరూపించుకున్నాడన్నారు. ఆజంఖాన్ను అన్నా అని పిలిచినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నానని జయప్రద అన్నారు. ఖాన్ వ్యాఖ్యలతో రాంపూర్ మహిళలంతా తన పక్షాన నిలవనున్నారనీ, ఇప్పుడు పోటీలో ఉన్నది జయప్రద కాదు, ప్రజలేనని ఆమె అభివర్ణించారు. రాంపూర్ లోక్సభ స్థానానికి జయప్రద 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు ఎస్పీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. తర్వాత అప్పటి పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్తో ఏర్పడిన విభేదాల కారణంగా అమర్సింగ్తో కలిసి ఎస్పీ నుంచి బయటకు వచ్చారు. ఇటీవలే బీజేపీలో చేరి ప్రస్తుతం రాంపూర్లో కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆజంఖాన్ వ్యాఖ్యల విషయంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు తనకు మద్దతు తెలపకపోవడంపై జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. -
మళ్లీ రెచ్చిపోయిన ఆజం ఖాన్
లక్నో : జయప్రదపై ‘ఖాకీ నిక్కర్’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎస్పీ నేత ఆజం ఖాన్ సోమవారం మీడియా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. మధ్యప్రదేశ్లోని విదిశలో రాజ్యసభ ఎంపీ మునావర్ సలీం అంత్యక్రియలకు హాజరై తిరిగివస్తున్న ఆజం ఖాన్ను జయప్రదపై ఆయన చేసిన వ్యాఖ్యల గురించి వివరణ అడగ్గా విలేకరులపై అసహనం వ్యక్తం చేశారు. మీ తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చానంటూ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి చిర్రుబుర్రులాడారు. కాగా జయప్రదపై ఆజం ఖాన్ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాగా, ఓ ఎన్నికల ప్రచార సభలో ఆదివారం ఆజం ఖాన్ మాట్లాడుతూ ‘జయప్రదను నేనే రాంపూర్కు తీసుకొచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా, పల్లెత్తు మాట అనకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే(మీడియా) సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను.’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
ఆజం ఖాన్పై జయప్రద సంచలన వ్యాఖ్యలు
లక్నో : ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ను తను అన్నా అని పిలిస్తే.. అతను మాత్రం తనని నాట్యగత్తె అని అవమానించాడని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో సమాజ్వాదీ పార్టీ తరఫున రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు జయప్రద. ఆ తర్వాత ఎస్పీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ తీరుతో ఆమె పార్టీని వీడారు. 2019 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన జయప్రద ప్రస్తుతం ఆ పార్టీ తరఫున రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆజం ఖాన్.. నేను నిన్ను అన్నా అని పిలిచాను. కానీ నువ్వు నన్ను అవమానించావు. నన్ను నాట్యగత్తె అన్నావు. నిజమైన సోదరులు ఎవరూ అలా మాట్లాడరు. నీ మాటలు నన్ను ఎంతో బాధపెట్టాయి. అందుకే నేను రాంపూర్ విడిచి వెళ్లాను’ అన్నారు. పద్మావత్ సినిమా చూసిన తర్వాత జయప్రద మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఖిల్జీ పాత్రను చూస్తే నాకు ఆజం ఖానే గుర్తుకు వచ్చాడు. గత ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న సమయంలో అతను నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాడు’ అని పేర్కొన్నారు. జయప్రద వ్యాఖ్యలపై స్పందించిన ఆజం ఖాన్ ఆమెను నాట్యగత్తె అని సంభోదించిన సంగతి తెలిసిందే. -
ప్రచారంలో కన్నీటిపర్యంతమైన జయప్రద
లక్నో : బీజేపీ తరఫున రామ్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు సినీ నటి జయప్రద. పుట్టినరోజు సందర్భంగా బుధవారం నామినేషన్ వేశారు జయప్రద. అనంతరం రామ్పూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘సమాజ్వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్ మూలాన నేను రామ్పూర్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. అతను నా మీద యాసిడ్ పోస్తానని బెదిరించాడు’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అది చూసి చలించిన జనాలు.. ‘బాధపడకండి.. మేం అంతా మీకు తోడుగా ఉంటాం’ అని ఆమెను ఓదార్చారు. తర్వాత తనను తాను సముదాయించుకున్నారు జయప్రద. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘కానీ తొలిసారి ఈ రోజు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నా వెనక బీజేపీ ఉంది. గతంలో నేనేప్పుడు ఇలా ఏడ్వలేదు. నాకు బతికే హక్కు ఉంది.. జీవిస్తాను మీకు సేవ చేస్తాను. మహిళలకు రక్షణ, గౌరవం లభించే పార్టీలో చేరినందుకు నాకు చాలా గర్వంగా ఉంద’ని తెలిపారు. అంతేకాక ‘దేవున్ని ఒక్కటే వేడుకుంటున్నాను. మరోసారి ఈ యుద్ధంలో నన్ను గెలిపించు.. జనాలకు సేవ చేసే అవకాశం కల్పించమని కోరుకుంటున్నట్లు’ తెలిపారు. గతంలో జయప్రద రెండు సార్లు 2004, 2009లో రామ్పూర్ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె ఆజం ఖాన్ మీద చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే 2004 ఎన్నికల్లో ఆజం ఖాన్ జయప్రద తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఏళ్లు గడుస్తున్న వారు కొద్ది బద్ద శత్రువుల్లా మారారు. -
జన్మదినం నాడే నామినేషన్ వేయబోతున్నా!
సాక్షి, లక్నో: ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎంపీ, సినీతార జయప్రదను ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్ నుంచి దింపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఎస్పీ నేత ఆజం ఖాన్పై ఆమె పోటీకి సిద్ధమవుతున్నారు. ‘ఇది నాకెంతో సంతోషకరమైన విషయం. ఈ రోజు జన్మదినం సందర్భంగా నామినేషన్ వేయబోతున్నాను. నాకు మద్దతు తెలిపిన ప్రధాని మోదీతోపాటు అభిమానులు, ప్రజలందరికీ కృతజ్ఞతల’ని జయప్రద సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన రాజకీయ జీవితాన్ని టీడీపీతో ప్రారంభించిన జయప్రద తర్వాత చంద్రబాబుతో విభేదాలు రావడంతో, ఆ పార్టీని వదిలి సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఎస్పీ అభ్యర్థిగా రామ్పూర్ నుంచి 2004-2009 మధ్య కాలంలో జయప్రద ఎంపీగా సేవలందించారు. 2010లో మరో ఎస్పీ నాయకుడు అమర్సింగ్తోపాటు జయప్రదను ఎస్పీ బహిష్కరించింది. -
జయప్రదపై ఎస్పీ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు
లక్నో : బీజేపీలో చేరిన మాజీ ఎంపీ, నటి జయప్రదపై ఎస్పీ నేత ఆజం ఖాన్ సన్నిహితుడు, ఆ పార్టీ సంభాల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో జయప్రద యూపీలోని రాంపూర్ నుంచి ఎస్పీ నేత ఆజం ఖాన్తో తలపడతారని భావిస్తున్న సంగతి తెలిసిందే. రాంపూర్ ప్రజలను జయప్రద తన నృత్యాలతో ఆకట్టుకుంటారని ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. జయప్రదను చూసేందుకు తమ జిల్లా ప్రజలు రాంపూర్కు తరలివెళతారని చెప్పుకొచ్చారు. జయప్రద గతంలో ఎస్పీ నుంచి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం బీజేపీలో చేరి గతంలో తమ పార్టీ సహచరుడు ఎస్పీ నేత ఆజం ఖాన్పై రాంపూర్ నుంచి పోటీ చేయనున్నారు. కాగా గతంలో ఆజం ఖాన్ సైతం జయప్రదపై అభ్యంతరకర వ్యాక్యలు చేశారు. మరోవైపు జయప్రదను ఎస్పీలోకి తీసుకువచ్చి రాంపూర్ లోక్సభ స్ధానం నుంచి గెలుపొందేలా ఆజం ఖాన్ చొరవ చూపడం గమనార్హం. అయితే జయప్రద ఎస్పీ మాజీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ వర్గంలో చురుకుగా వ్యవహరించడంతో వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. 2009 లోక్సభ ఎన్నికల్లో జయప్రదకు వ్యతిరేకంగా ఆజం ఖాన్ వర్గీయులు ప్రచారం చేశారు. ఇక ఆజం ఖాన్ తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా జయప్రద ఇప్పటికే రాంపూర్ నుంచి రెండు సార్లు గెలుపొందారు. -
రాంపూర్ బరిలో జయప్రద
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీలో చేరిన సినీ నటి జయప్రదను ఊహించినట్టే యూపీలోని రాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ బరిలో నిలిపింది. యూపీ, పశ్చిమ బెంగాల్లో పోటీ చేసే 29 మంది అభ్యర్థులతో కూడిన తాజా జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో కాన్పూర్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీని తప్పించి కేంద్ర మంత్రి సత్యదేవ్ పచౌరీకి చోటు కల్పించారు. ఇక కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలు గతంలో వరుసగా ఫిలిబిత్, సుల్తాన్పూర్ల నుంచి పోటీ చేయగా వారి స్ధానాలను పరస్పరం మార్పు చేశారు. యూపీ మంత్రి రీటా బహుగుణ జోషికి అలహాబాద్ స్ధానం నుంచి పోటీకి నిలిపారు. 2014లో ఇక్కడి నుంచి గెలుపొందిన శ్యామ చరణ్ గుప్తా సమాజ్వాదీ పార్టీలో చేరడంతో జోషీ వైపు బీజేపీ అగ్రనాయకత్వం మొగ్గుచూపింది. -
నా జీవితం బీజేపీకి అంకితం: ప్రముఖ నటి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద (56) బీజేపీలో చేరారు. గతంలో పలు పార్టీలకి పని చేసిన ఆమె తాజాగా బీజేపీ తీర్ధం పుచ్చుకుని కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. తన పూర్తి జీవితం బీజేపీకి అంకితమని పేర్కొన్నారు. బీజేపీ నేత ఉపేంద్ర యాదవ్ ఆమెకు కాషాయ కండువా కప్పి, సభ్యత్వాన్నిచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు ఉత్తర ప్రదేశ్లోని రామ్పుర్ నియోజక వర్గం నుంచి ఆమె పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా 1994లో తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన జయప్రద ఆ తరువాత చంద్రబాబు నాయుడుతో విభేదాల కారణంగా సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి రాంపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2004 నుంచి 2009 మధ్య ఎంపీగా కొనసాగారు. ఇప్పుడిదే స్థానం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన ఆజంఖాన్పై గతంలో జయప్రద చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ దుమారం లేపాయి. మొత్తానికి జయప్రద చేరికతో రాంపూర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. -
‘మంచి భర్తల్ని తయారు చేయలేకపోతున్నాం’
పురాణాల కాలం నుంచి నేటి వరకూ మంచి భార్య ఎలా ఉండాలో చెప్పారు కానీ మంచి భర్త లక్షణాలను గురించి ఎక్కడ చెప్పలేదన్నారు సిని నటి జయప్రద. ప్రస్తుతం జయప్రద ‘పర్ఫెక్ట్ పతి’ అనే హిందీ సీరియల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘పర్ఫెక్ట్ పతి’తో బుల్లితెరలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. ఇందులో నా పాత్ర ఓ తల్లిగా, అత్తగా చాలా బలంగా ఉంటుంది. ప్రతి తల్లి తన పిల్లల ప్రవర్తనను తెలుసుకోవాలి. వారు చేసే తప్పొప్పులు గురించి వివరించాలి. అతి ప్రేమ, జాగ్రత్తల పేరుతో వారు ఏం చేసినా ఊరుకోకూడద’న్నారు. అంతేకాక ‘ఎన్నో ఏళ్లుగా మన భారత దేశంలో అమ్మాయిలు మంచి భార్యలుగా ఎలా ఉండాలో చెప్పడమే కాక అలానే తీర్చిదిద్దుతున్నారు. కానీ అంత మంచి భార్యలకు సరిపోయే భర్తల్ని తయారు (పెంచడం) చేయడంలో మాత్రం మన సమాజం విఫలం అవుతోంది. సమాజంలోని మగవారంతా మంచి భర్తలు కాలేకపోతున్నారు. భర్త ఎలా ఉన్నా భరించాలని చెబుతూ అమ్మాయిల్ని పెంచుతున్నారు’ అని జయప్రద అభిప్రాయపడ్డారు. ఈ సీరియల్లో జయప్రద రాజ్యశ్రీ రాథోడ్ అనే పాత్రను పోషిస్తున్నారు. ఆమె కుమారుడిగా నటుడు అయుష్ ఆనంద్, కోడలిగా నటి సనా అమిన్ షేక్ కనిపించనున్నారు. ఇందులో జయప్రద కుమారుడు తన భార్యను చంపడానికి ప్రయత్నిస్తుంటారట. దాంతో కోడలికి న్యాయం చేయడానికి కన్న కుమారుడ్ని జయప్రద చంపేస్తారట. ఈ నేపథ్యంలో సాగే ఈ సీరియల్ అందర్నీ మెప్పిస్తుందని జయప్రద ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆ ఫోటోలు చూసి చనిపోవాలనుకున్న : జయప్రద
లక్నో : ‘అమర్ సింగ్ను నా గాడ్ఫాదర్గా భావిస్తున్నాను. కానీ జనాలు మాత్రం మా ఇద్దరి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు’ అంటూ ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. క్వీన్స్లైన్ లిటరేచర్ ఫెస్టివల్కు హాజరైన జయప్రద, రచయిత రామ్ కమల్తో మాట్లాడుతూ.. ‘సినీ రంగం నుంచి వచ్చాను.. ఎంపీగా గెలిచాను. కానీ సాధరణ మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను నేను ఎదుర్కొంటున్నాను. ఈ రోజు నేను రాజకీయాల్లో ప్రవేశించి.. రాణించగల్గుతున్నానంటే అందుకు కారణం అమర్ సింగ్. ఆయన నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. ఒకవేళ నేను ఆయనకు రాఖీ కట్టినా జనాలు తప్పుడు ప్రచారం మాత్రం ఆపరు. అందుకే వాటి గురించి పట్టించుకోవడం మానేశాను’ అని తెలిపారు. జయప్రద తొలుత సమాజ్వాదీ పార్టీలోనే ఉండేవారు. కానీ విబేధాల కారణంగా ఎస్పీ నుంచి బయటకు వచ్చి ఆమర్ సింగ్తో కలిసి ‘రాష్ట్రీయ్ లోక్ మాంచ్ పార్టీ’ స్థాపించారు. అప్పటి నుంచి వీరిద్దరి బంధం గురించి పుకార్లు ఎక్కువయ్యాయి. ఈ సందర్భంగా సీనియర్ ఎస్పీ నాయకుడు, రామ్పుర్ ఎమ్మెల్యే అజామ్ ఖాన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తన మీద యాసిడ్ పోస్తానంటూ అజామ్ ఖాన్ తనను బెదిరించారని తెలిపారు. కానీ ఈ బెదిరంపులకు తాను భయపడలేదన్నారు. ఈ విషయం గురించి చెప్తూ ‘నా ప్రాణానికి ప్రమాదం ఉందని నాకు తెలుసు. నేను ఇంటి నుంచి బయటికి వెళితే క్షేమంగా తిరిగి వస్తానో? లేదో కూడా మా అమ్మకు చెప్పలేకపోతున్నాను. ఏ ఒక్క రాజకీయ నాయకుడు నాకు మద్దతుగా నిలవలేదు. ములాయం సింగ్ కూడా ఈ విషయంలో ఎటువంటి సహాయం చేయలేదని విచారం వ్యక్తం చేశారు. అంతేకాక తన ఫోటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రోజున తాను చనిపోవాలని నిర్ణయించకున్నట్లు జయప్రద తెలిపారు. ఆ సమయంలో అమర్సింగ్ డయాలసిస్ చికిత్సలో ఉన్నారని, ఏం చేయాలో పాలుపోక తాను తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని చెప్పారు. ఆ సమయంలో ఎవరూ తనకు అండగా నిలవలేదన్నారు. డయాలసిస్ చేయించుకుని తిరిగి వచ్చిన అమర్సింగ్ మాత్రమే తనకు చేయూతనిచ్చారని ఆమె వివరించారు. అలాంటి వ్యక్తిని తాను గాడ్ఫాదర్గా భావిస్తున్నానని.. అందుకే పనికిమాలిన పుకార్లను పట్టించుకోవడం మానేసానని తెలిపారు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో రాజకీయాలనే కాదు ఏ రంగంలోనైనా రాణించడం మహిళలకు నిజంగా ఓ యుద్ధంతో సమానమని ఆమె వర్ణించారు. అంతేకాక ఇటీవలే విడుదలైన మణికర్ణిక సినిమాలో కంగనా పాత్రలో తనను తాను చూసుకున్నానని చెప్పారు. అవసరాన్ని బట్టి ప్రతి మహిళ ఓ దుర్గాదేవిగా మారాలని పిలుపునిచ్చారు. -
లవ్వులో పడాల్సిందే... కేక పెట్టాల్సిందే!
ఈ సన్నివేశం సినిమాల్లో బాగా చూసి ఉంటారు.హీరోయిన్ వెళ్లిపోతుంటే హీరో చూస్తుంటాడు.ఫ్రెండ్తో చెబుతాడు – అమ్మాయి తిరిగి చూసిందంటే లవ్లో పడినట్లే అని.అమ్మాయి తిరిగి చూస్తుంది. ఆడియన్స్ కూడా హీరోలాంటి వాళ్లే.ఏ హీరోయిన్ తిరిగి వచ్చినా..ఏ హీరో రిటర్న్ ఇచ్చినా లవ్వులో పడాల్సిందే... కేక పెట్టాల్సిందే. సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీతో పాటు రీఎంట్రీ కూడా ఉంటుంది. చనిపోయాడనుకున్న హీరో సెకండ్హాఫ్లో బతికి కనిపించినట్టే తెరమరుగైపోయారనుకున్న తారలు ఒక్కసారిగా మళ్లీ స్క్రీన్ మీద తళుక్కుమని మెరవడానికి వస్తారు. ఒక్కోసారి ఎంట్రీలోని ఇమేజ్ కన్నా రీఎంట్రీలోని క్రేజ్ వారిని ఎక్కడికో తీసుకెళ్లే అవకాశం ఉంది. చిరంజీవి వంటి మెగాస్టారే బ్రేక్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చినప్పుడు.. పెళ్లి, బాధ్యతలు, సరైన పాత్రలు రాకపోవడం వంటి కారణాల వల్ల బ్రేక్ తీసుకున్నవారు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో తప్పేముంది? సీనియర్ నటి జయప్రదతో పాటు ఇలియానా, లయ, ప్రియమణి, సంగీత, భాగ్యశ్రీ, హీరో ఆర్యన్ రాజేశ్ తదితరులు టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తున్నారు. టేక్కి రెడీ అంటున్నారు. జయప్రదం ‘ఝుమ్మంది నాదం.. సయ్యంది పాదం’.. అన్న జయప్రద ఆ తర్వాత దశ తిరిగి ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అన్నారు. 1970ల చివరలో 1980లలో ఆమె స్టార్ హీరోయిన్. అయితే ఇక్కడ కెరీర్ పీక్లో ఉండగానే బాలీవుడ్కు వెళ్లిపోయి తెలుగు సినిమాలు తగ్గించుకున్నారు. ఆ తర్వాత కొత్తతరం రావడం, రాజకీయాల్లో బిజీ కావడం తదితర కారణాల వల్ల తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం జరగలేదు. ‘సాగర సంగమం’, ‘దేవత’ వంటి మంచి సినిమాలు చేసిన జయప్రద తెలుగు సినిమాలో మళ్లీ కనిపిస్తే ప్రేక్షకులకు అదే పెద్ద ఆనందం.పి.వాసు దర్శకత్వంలో 2007లో వచ్చిన ‘మహారథి’లో కీలక పాత్రలో నటించిన ఆమె 11ఏళ్ల తర్వాత ‘శరభ’ చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు. ఆకాష్కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా యన్.నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆమెను తెలుగులో బిజీ చేస్తుందని ఆశిద్దాం. సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. అలాగే ‘సువర్ణ సుందరి’ అనే మరో తెలుగు చిత్రంలోనూ జయప్రద ముఖ్యమైన పాత్ర చేశారు. సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తయారైన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా రెండు సినిమాలతో జయప్రదంగా ఆమె రీఎంట్రీ ఇవ్వడం అభిమానులకు ఆనందం. గోవా బ్యూటీ వచ్చేశారు ‘దేవదాసు’ ఆ వెంటనే ‘పోకిరి’ సినిమాతో యూత్ గుండె గోడల మీద పోస్టర్ గర్ల్గా నిలిచారు ఇలియానా. ఆ తర్వాత మహేశ్బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ .. వంటి హీరోలందరితో జోడీ కట్టారు. ‘జల్సా’, ‘కిక్’, ‘జులాయి’ వంటి సూపర్ హిట్స్ ఆమె ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. టాలీవుడ్లో అతి తక్కువ టైమ్లో కోటి రూపాయలు పారితోషికం అందుకున్న స్టార్ హీరోయిన్గా ఆమెకు పేరుంది.2012లో విడుదలైన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తర్వాత టాలీవుడ్కి బై చెప్పి ‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్కి వెళ్లిపోయారామె. ఆరేళ్ల తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటొని’ (అఅఆ)తో తెలుగు చిత్ర పరిశ్రమకు రీఎంట్రీ ఇచ్చారు. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తయారైన ‘అమర్ అక్బర్ ఆంటొని’ ఈ నెల 16న రిలీజైంది. ఇలియానా టాలీవుడ్కి వచ్చిన 12ఏళ్లలో తొలిసారి ‘అఅఆ’కి డబ్బింగ్ చెప్పారు.ఈ రీఎంట్రీతో ఆమె మరిన్ని సినిమాలు చేస్తారని చెప్పవచ్చు. ప్రియమైన వెన్నెల ప్రియమణి తెలుగు టీవీ కార్యక్రమాలలో కనిపిస్తున్నారు కానీ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. హుషారైన బాడీ లాంగ్వేజ్తో, అందమైన చిరునవ్వు, యాక్టింగ్ టాలెంట్తో ముఖ్యమైన హీరోలతో పని చేసిన ప్రియమణి ఎక్కువ కాలం తెలుగు మీద ఫోకస్ చేయలేదనే చెప్పాలి. ఎక్కువ సమయం హీరోయిన్గా నిలవలేదనీ చెప్పాలి. తమిళ, తెలుగు, కన్నడ సినిమాలను సుడిగాలిలా చుట్టి ఖాళీ అయిన ఈ నటి ‘చెన్నై ఎక్స్ప్రెస్’లో షారుక్ ఖాన్తో ఐటమ్ సాంగ్ చేసి తానున్నట్టు రిఫ్రెష్ బటన్ నొక్కారు. 2016లో విడుదలైన ‘మన ఊరి రామాయణం’ తర్వాత ఆమె వేరే తెలుగు చిత్రంలో నటించలేదు. ఇప్పుడు ‘సిరివెన్నెల’ అనే తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ప్రకాష్ పులిజాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రకథ బాగా నచ్చడంతో పాటు నటనకి ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకున్నారట. త్వరలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది. మైనే ఫిర్ ఆగయీ భాగ్యశ్రీని చూసి కనీసం అరకోటి మంది అబ్బాయిలైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుని ఉంటారు ‘మైనే ప్యార్ కియా’ సమయంలో. అయితే ఆమె సినిమాల్లో కంటిన్యూ కాకుండా హిమాలయ్ను భర్తగా చేసుకుని లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. తెలుగులో ‘ఓంకారమ్’, ‘రాణా’ సినిమాల్లో ఆమె నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1998లో వచ్చిన ‘రాణా’ చిత్రంలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో కనిపించిన భాగ్యశ్రీ 20ఏళ్ల తర్వాత ‘2 స్టేట్స్’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు. అడివి శేష్, శివానీ రాజశేఖర్ జంటగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శివాని తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటిస్తున్నారు. టాలీవుడ్ కే పాస్ మై ఫిర్ ఆగయీ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు భాగ్యశ్రీ. తల్లి రీఎంట్రీ.. తనయ ఎంట్రీ ‘ప్రేమించు’ చిత్రంలో అంధురాలి పాత్రలో లయ నటించారనడం కంటే జీవించారనడం కరెక్టేమో. 1992లో అక్కినేని కుటుంబరావ్ దర్శకత్వంలో వచ్చిన ‘భద్రం కొడుకో’ సినిమాతో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ‘స్వయంవరం’ సినిమాతో కథానాయికగా మారారు. ఆ తర్వాత తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి, అలరించారు. ‘మనోహరం, ‘ప్రేమించు’ చిత్రాలకు నంది అవార్డులు కూడా అందుకున్నారు. 2010లో ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ చిత్రం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయిపోయారు. చాలా రోజులుగా లయ రీఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. 8 ఏళ్ల తర్వాత తాజాగా ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు లయ. ఈ చిత్రంతోనే లయ కూతురు శ్లోక బాలనటిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఒకే సినిమాతో తల్లి రీఎంట్రీ.. తనయ ఎంట్రీ .. ప్రేక్షకులకు డబుల్ ధమాకాయే కదా! ఆరేళ్ల తర్వాత హాయ్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 2002లో వచ్చిన ‘హాయ్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి హాయ్ చెప్పారు ఆర్యన్ రాజేష్. ఆ తర్వాత తెలుగులోనే కాదు తమిళంలోనూ సినిమాలు చేశారు.రామకృష్ణ దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘బాలరాజు ఆడి బామ్మర్ది’ చిత్రం తర్వాత ఏ తెలుగు చిత్రంలోనూ ఆయన నటించలేదు. ఆరేళ్ల తర్వాత తాజాగా ‘వినయ విధేయ రామ’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. రామ్చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చెర్రీ (రామ్చరణ్) సోదరుని పాత్రలో నటిస్తున్నారట. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. పద్మావతి వస్తున్నారహో... సంగీత మంచి డాన్సర్, నటి. ‘అదిరిందయ్యా చంద్రం’ సినిమాలోని ‘పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే.. దగ దగ ముద్దొస్తున్నావే’ పాట ఆమెకు మంచి హిట్ ఇచ్చింది. 1999లో ‘ఆశల సందడి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగీత ‘ఖడ్గం’, ‘పెళ్ళాం ఊరెళితే’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, ‘సంక్రాంతి’ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు. 2010లో వచ్చిన ‘కారా మజాకా’ చిత్రంలో నటించిన సంగీత ఆ తర్వాత తెలుగు సినిమాలేవీ చేయలేదు. 8 ఏళ్ల విరామం తర్వాత ‘తెలంగాణ దేవుడు’ చిత్రంతో టాలీవుడ్కి రీఎంట్రీ ఇస్తున్నారామె. ‘‘తెలుగులో ఇది నా సెకండ్ ఇన్నింగ్స్.. ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలి’’ అని పేర్కొన్నారు సంగీత. పాతికేళ్ల తర్వాత టాలీవుడ్కి... ‘సాక్షి’, ‘మగాడు’, ‘దోషి..నిర్దోషి’, ‘20వ శతాబ్దం’... తదితర చిత్రాలతో 1990వ దశకంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన లిజీ దర్శకుడు ప్రియదర్శన్ను వివాహం చేసుకుని టాలీవుడ్కి దూరంగా ఉండిపోయారు. 25ఏళ్ల తర్వాత ‘ఛల్ మోహన్రంగ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా అడివి శేష్, శివాని రాజశేఖర్ జంటగా తెరకెక్కుతున్న ‘2 స్టేట్స్’ సినిమాలో లిజీ ఓ కీలక పాత్ర చేసేందుకు అంగీకరించారని వార్త. అలాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ 11 ఏళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గతేడాది వచ్చిన ‘జయ జానకి నాయక’ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో జగపతిబాబు చెల్లెలి పాత్రలో ఆమె కనిపించింది కొద్దిసేపే అయినా మెప్పించారు. ఇక 1980లో ‘మా భూమి’ సినిమాతో టాలీవుడ్కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిచంద్ చిరంజీవితో ‘మంచు పల్లకీ’తో పాటు అనేక చిత్రాల్లో నటించారు. 1989లో రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివ’ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదాయన. 27ఏళ్ల తర్వాత ‘ఫిదా’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సైరా’ సినిమాలో ఆయన ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారట. దాంతో ‘మంచుపల్లకీ’ తర్వాత 36 ఏళ్లకు చిరంజీవి, సాయిచంద్ కలిసి నటించినట్టవుతుంది ఈ సినిమాతో. – ఇన్పుట్స్: డేరంగుల జగన్ -
మహేష్ తల్లిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్ 25వ సినిమా కూడా కావటంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ తల్లిగా సీనియర్ స్టార్ హీరోయిన్ జయప్రద నటిస్తున్నారు. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా యువ కథానాయకుడు అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. -
తొమ్మిదేళ్లకు...
తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ బెంగాలీ ఆడియన్స్ను పలకరించడానికి రెడీ అయ్యారు జయప్రద. 2009లో రిలీజైన ‘శేష్ సంగట్’ బెంగాలీలో జయప్రద లాస్ట్ సినిమా. లేటెస్ట్గా దర్శకుడు ఆత్వను బోస్ రూపొందించిన ‘ఆత్వజా’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు జయప్రద. కౌషిక్ సేన్, సాహెబ్ భట్టాచార్య నటించిన ఈ చిత్రం నేడు బెంగాలీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి జయప్రద మాట్లాడుతూ – ‘‘తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బెంగాలీ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. పర్ఫార్మెన్కు స్కోప్ ఉన్న రోల్తో బెంగాలీ ఆడియన్స్ దగ్గరకు మళ్లీ వెళ్లడం ఎగై్జటింగ్గా ఉంది’’ అన్నారు జయప్రద. -
‘ఖిల్జీని చూస్తే అజంఖాన్ గుర్తొచ్చాడు’
రాయ్పూర్: సమాజ్వాదీ పార్టీ నాయకుడు అజంఖాన్ను ఉద్దేశించి మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు అజంఖానే గుర్తొచ్చాడని ఆమె వ్యాఖ్యానిం చారు. ‘‘అజంఖాన్ను నేను సోదరునిగా భావించాను. కానీ అతను నాపై ప్రతీకారం తీర్చుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించాడు’ అని రాయ్పూర్లో వ్యాఖ్యానించారు. -
ఖిల్జీని చూస్తే అతనే గుర్తుకొచ్చాడు: నటి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఎంపీ, ప్రముఖ నటి జయప్రద కొంతకాలం కిందటివరకు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సమాజ్వాదీ పార్టీ తరఫున రాంపూర్ నియోజకవర్గం నుంచి ఆమె రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఆమె ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్న సమయంలో సొంత పార్టీ ఎస్పీ సీనియర్ నేత ఆజంఖాన్ నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో తన పట్ల దుష్ప్రచారం చేస్తున్నారని కూడా అప్పట్లో ఆరోపించారు. తాజాగా ‘పద్మావత్’ సినిమా చూస్తే ఆనాటి జ్ఞాపకాలు ఆమెను వెంటాడినట్టు ఉన్నాయి. అందుకే ‘పద్మావత్’ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు ఆజంఖాన్ గుర్తుకువచ్చాడని, ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నప్పుడు అతను తనను ఎంతోగానే వేధించాడని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆజంఖాన్ను ఖిల్జీతో పోల్చారు. -
చివరికి కంచంలోనూ...
‘నేను శక్తి’ క్యాంపెయిన్ గురించి జయప్రద మాట్లాడుతూ... ‘‘సాక్షి’ చేస్తున్న ఈ కార్యక్రమం చాలా గొప్పది. ఈ ప్రయత్నం తప్పకుండా జయప్రదం కావాలి. ఎంతోమందిలో ఇది చైతన్యం తేవాలి’’ అన్నారు. ఆడ, మగ... రెండూ రక్తమాంసాలున్న శరీరాలే. ఆడ తక్కువ.. మగ ఎక్కువ ఎందుకు? కరెక్టే. దెబ్బ తగిలితే నొప్పి ఎవరికైనా ఒకటే. మగాళ్లకు తక్కువగా ఉంటుందా? లేదు కదా. మరి ఆడవాళ్లు ఎందుకు తక్కువ? మగవాళ్లు ఎందుకు ఎక్కువ? ఇది ఎవరికివాళ్లు వేసుకోవాల్సిన ప్రశ్న. ముఖ్యంగా ఆడవాళ్లు తక్కువ అని అనుకునేవాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కడుపులో పడ్డ బిడ్డ ‘ఫీమేల్’ అనగానే నిర్దాక్షిణ్యంగా ఊపిరి ఆపేస్తున్నారు. చివరికి ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అని అభ్యర్థించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.. ‘ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే’ సెలబ్రేషన్స్ను ప్రతి ఏడాదీ ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ వేడుకలు ఎందుకు? ఎవరి కోసం? సమాజంలో ఉన్న ఆడవాళ్లందరి పరిస్థితీ బాగుందనా? ఇప్పుడు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. వెయ్యి మంది మగపిల్లలుంటే ఆరేడు వందల మంది మాత్రమే ఆడపిల్లలు ఉంటున్నారు. ఆడపిల్లను కడుపులోనే చంపేస్తున్నారు. చూస్తూ ఉండండి... ఇప్పుడు కట్నం తీసుకుంటున్న అబ్బాయిలు భవిష్యత్తులో ఆడపిల్లల కొరత కారణంగా ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మీరు హర్యానా, రాజస్తాన్లను తీసుకుంటే అక్కడ భ్రూణ హత్యలు ఎక్కువ. ఆడపిల్ల ఏం పాపం చేసిందని భూమ్మీదకు రానివ్వకుండా చేస్తున్నారో? మగపిల్లాడైతే కట్నం తెస్తాడనా? కొన్ని సందర్భాల్లో ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులవుతున్నారు. కోడలి కడుపులో పడ్డది ఆడబిడ్డ అంటే అత్త కూడా వ్యతిరేకిస్తుంది. అందుకే ఆడవాళ్లలోనూ మార్పు రావాలి. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థలకు ఓ విన్నపం. లింగ నిర్ధారణ కూడదని ప్రభుత్వం ఓ నిబంధన పెట్టినప్పటికీ, కొన్ని చోట్ల దాన్ని ఉల్లంఘిస్తున్నారు. దయచేసి దాని మీద పోరాడండి. భాష కూడా మారిపోతుంది నా విషయంలో అజమ్ ఖాన్ చేసింది ఏంటి? నీచమైన ప్రచారానికి ఒడిగట్టాడు. క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. స్త్రీ అంటే ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక బొమ్మలా భావిస్తారు. ఈ గడ్డ మీద ప్రతి స్త్రీకి ప్రతి నిమిషం అగ్ని పరిక్షే. ఆమె గురించి మాట్లాడేటప్పుడు కొందరి భాష కూడా మారిపోతుంది. వాడే పదాలు ఘోరంగా ఉంటాయి. ఆ విధంగా సంతృప్తి పొందుతారు. ఖిల్జీకి దక్కకూడదనే పద్మావతి అలా చేసింది ఆడవాళ్లకు ఆత్మాభిమానం ఎక్కువ. రాణీ పద్మావతి అందుకు ఓ ఉదాహరణ. ఖిల్జీ నీడ కూడా తనను తాకకూడదని ఆత్మాహుతికి పాల్పడింది. పిరికితనంతో కాదు.. తెగువతో. తనంతట తాను ఇష్టపడి తీసుకున్న నిర్ణయం అది. ఖిల్జీకి దక్కి తాను ఓడిపోకూడదని, తనువు చాలించి, గెలిచింది. మన గడ్డ మీద ఉన్న స్త్రీ అంత పవిత్రమైనది. ఆడవాళ్లు గొప్ప పదవుల్లో ఉంటే.. ఆమెను వీలైనంతగా హింసించాలని చాలామంది ప్రయత్నిస్తారు. రాజకీయ నాయకురాలిగా మీరలాంటివి ఫేస్ చేశారు కదా? యస్.. మనం పెద్ద పదవుల్లో ఉంటే భరించలేరు. రామ్పూర్లో నేను పొలిటీషియన్గా అడుగుపెట్టినప్పుడు ఆడవాళ్లను లీడర్గా అంగీకరించే పరిస్థితులు లేవు. కానీ ప్రజల ప్రేమతో గెలిచాను. ప్రత్యర్థి పార్టీల సంగతి వదిలేయండి.. నా పార్టీలో ఉన్నవాళ్లే నన్ను సూటిపోటి మాటలనేవాళ్లు. యాసిడ్ ఎటాక్ చేస్తారని, చంపేస్తారని భయపడేదాన్ని. అలాంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. మనసులో భయం ఉన్నా ధైర్యంగా ముందుకెళ్లా. మేల్ డామినేషన్ ఉన్న ఈ సొసైటీలో ఆడవాళ్లు రాజకీయాల్లోకి రావాలి. ఇందిరా గాంధీ, జయలలితగార్లను జనాలు ఎప్పటికీ మరచిపోలేరు. ప్రజల ప్రేమ ఒక్కటి చాలు. ఎవరేం చేయాలనుకున్నా చేయలేరు. ఆడవాళ్ల ప్రతిష్టను మంటగలపాలంటే వాళ్ల క్యారెక్టర్ను తక్కువ చేసి మాట్లాడే ప్రబుద్ధులు చాలామంది ఉంటారు. అలాంటివారి గురించి ఏమంటారు? వాళ్లకు ‘ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్’ ఎక్కువ. అందుకే క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడతారు. నిండు సభలో జయలలితగారిని అలానే కదా చేయబోయారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టుదలతో అనుకున్నది సాధించారు. క్యారెక్టర్ తక్కువ చేసి మాట్లాడటం మొదలుపెడితే ఏ ఆడపిల్లకైనా బాధ ఉంటుంది. ఆ బాధలోంచి అభద్రతాభావం వస్తుంది. మానసికంగా కుంగిపోతుంది. అప్పుడు అనుకున్నది సాధించలేదు. అప్పుడు ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్తో బాధపడే మగవాడు తాను గెలిచినట్లుగా ఫీలవుతాడు. ఆ మగవాడి బుద్ధి అంత నీచమైనది. నా గురించి కూడా అవాకులు చెవాకులు పేలారు. పట్టించుకోలేదు. ఎందుకంటే పట్టించుకుని నేను వెనక్కి తగ్గితే, ఇంకొకరి గెలుపుకి కారణం అవుతాను. అలాగే మగవాళ్ల సక్సెస్ని వాళ్ల ప్రతిభతో, ఆడవాళ్ల సక్సెస్ని వాళ్ల అందానికి ఎక్కువగా ఆపాదించి, టాలెంట్కి తక్కువ స్పేస్ ఇస్తారు కొంతమంది... ఇది దౌర్భాగ్య పరిస్థితి. ఆడవాళ్ల ప్రతిభను అంగీకరించలేని కుంచిత మనస్తత్వాలు ఉంటాయి. ఆ మనుషులను ఏమీ చేయలేం. అయితే బయటకు ఎంత మాట్లాడినా మనసుకి తెలుస్తుంది కదా.. తాము మాట్లాడేది కరెక్ట్ కాదని. అది ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, పాలిటిక్స్ అయినా.. ఏ ఫీల్డ్ అయినా ఆడవాళ్ల టాలెంట్ను అభినందించే వాళ్లు తక్కువ ఉంటారు. వాళ్ల సక్సెస్ని ప్రతిభకు తక్కువ, అందంతో ఎక్కువ ముడిపెట్టేస్తారు. అందుకే అంటున్నా... ‘అందంగా ఉండటం కూడా ఆడదానికి శాపమే’. అసలు ఆడవాళ్లంటేనే అందమైనవాళ్లు. అందుకే ప్రతి స్త్రీకి పోరాటం తప్పడంలేదు. నాలుగేళ్ల పాపలో ఏం అందం చూసి, రేప్ చేస్తున్నారు. ఎంత రాక్షసత్వం ఉండి ఉంటుంది. ఆ మనిషి ఎంత కఠినాత్ముడు అయ్యుంటాడు? వాళ్లను క్షమించవచ్చా? ‘నిర్భయ’ యాక్ట్ అంటున్నారు. కానీ నిర్భయంగానే ఇలాంటి పనులు చేస్తున్నారు. వాళ్లను ఎంత కఠినంగా శిక్షించాలంటే తప్పు చేయాలనుకున్నవాళ్ల వెన్నులో వణుకు పుట్టాలి. అవునూ... ఆడవాళ్లు ఎందుకు కట్నం ఇవ్వాలి? ఈ ప్రశ్న చాలాసార్లు వేసుకున్నాను. ఇలాంటి ఓ నియమం ఉంది కాబట్టే ఆడపిల్లను తల్లిదండ్రులు భారంగా అనుకుంటున్నారు. ఎక్కువ చదువులు చదివిస్తే ఆ చదువుకి తగ్గ వరుడ్ని తీసుకురావాల్సి వస్తుందని భయపడుతున్నారు. అంతేకానీ అమ్మాయి తన కాళ్లపై తను నిలబడుతుందని ఆలోచించడంలేదు. ‘డౌరీ యాక్ట్’ రావడంతో చాలామంది బతికిపోయాం. లేకపోతే ఆడవాళ్లను గుండెల మీద కుంపటిలా చూసేవాళ్లు. అయినా ఇప్పటికీ కట్నం వ్యవహారం సాగుతుందనుకోండి. ఒక పెళ్లి కుదరాలంటే కట్నం ‘డిసైడింగ్ ఫ్యాక్టర్’ అవుతోంది. పెళ్లనేది రెండు మనసులతో, ‘మాంగల్యం’తో ముడిపడుతుంది కానీ డబ్బుతోనే ఎక్కువ ముడిపడింది. బాధపడాల్సిన విషయం ఏంటంటే.. పుట్టింటి నుంచి మెట్టినింటికి కోడలిగా వచ్చే అమ్మాయి.. అత్త అయ్యే సమయానికి కట్నం ఆశిస్తోంది. కొందరు ఆడవాళ్లు ఇందుకు మినహాయింపు. ఏది ఏమైనా నిన్నటి కంటే ఇవాళ మార్పు వచ్చింది. కట్నం విషయంలో రేపు మరింత మంచి మార్పు వస్తుందనే నమ్మకం ఉంది. కొందరు మగవాళ్లు తమ ఇంటి ఆడవాళ్లను పరాయి మగాడు కన్నెత్తి చూడకూడదనుకుంటారు. వాళ్లు మాత్రం పరాయి ఆడవాళ్ల మీద కన్నేస్తారు... రావణాసురుడు ఏమయ్యాడు? సీతను అపహరించి మరీ తీసుకెళ్లాడు. అతనికి అవసాన దశ వచ్చింది కాబట్టే అలాంటి దుర్బుద్ధి పుట్టింది. పరాయి స్త్రీని ఆశించే ఏ మగాడి పరిస్థితి అయినా చివరికి అదే అవుతుంది. మీరు గమనించారో లేదో కానీ అనాధాశ్రమాల్లో దత్తత తీసుకునేటప్పుడు కూడా ఎక్కువమంది తల్లిదండ్రులు మగపిల్లలనే దత్తత తీసుకుంటుంటారు? ‘మాతృదేవోభవ’ సినిమా గుర్తొస్తోంది. ఆ సినిమాలో ముందు మగపిల్లలను దత్తత తీసుకుంటారు. బిడ్డలు లేనివాళ్లకు ఏ బిడ్డ అయినా ఒకటే. అయినా దత్తత తీసుకునేటప్పుడు మగబిడ్డను కోరుకుంటారు. మగబిడ్డ లేకపోతే అప్పుడు ఆడపిల్ల గురించి ఆలోచిస్తారు. నేను స్వయంగా ఇలాంటి సంఘటనలు చూశా. కొంతమందికి హితబోధ చేశాను కూడా. మగపిల్లాడైతే ఆదుకుంటాడనా? ఏం మగపిల్లలు తల్లిదండ్రులను నిర్దయగా వదిలేయడం మనం చూడటంలేదా? అయినా ఇంకా మారకపోతే ఎలా? దేశం కోసం పోరాడిన వీర నారీమణులు ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయ్, రాణీ రుద్రమదేవి, పద్మావతి వంటి వాళ్లు తిరగాడిన ఈ గడ్డ మీద వివక్షా? అప్పుడు వాళ్లు కత్తి పట్టి దేశాన్ని రక్షించాలనుకున్నారు. ఆడవాళ్లు దేశాలనే పాలించగల సమర్థత ఉన్నవాళ్లు. వాళ్లను అణగదొక్కడమా? ఇదెక్కడి న్యాయం? కొన్ని ఇళ్లల్లో మగవాళ్లకు ముందు అన్నం పెట్టి, ఆ తర్వాత ఆడవాళ్లు తినడం జరుగుతుంది. ఆకలికి కూడా ‘జెండరా?’ ఇదెక్కడి న్యాయం? ఆడ కడుపు, మగ కడుపు అని ఉండదు కదా. ఆకలి ఒకటే. మగవాళ్లు తినేంతవరకూ ఆకలి భరించాలా? వాళ్లు తిన్న తర్వాత మిగిలితే తినాలా? సగం ఆకలే తీర్చుకోవాలా? కడుపు నిండా తినే అర్హత కూడా ఆడపిల్లకు లేదా? ఆకలిలోనూ వివక్షా? ఇదెంత దుర్మార్గం. కొన్ని ఇళ్లల్లో మగపిల్లలకు పౌష్టికాహారం పెట్టి, ఆడపిల్లకు తక్కువ పెడతారు. మగపిల్లలకు గ్లాసుడు పాలు ఇస్తారు. అమ్మాయికి కొన్ని చుక్కలు ఇస్తారు. మగాడి జన్మకు కారణం అవుతున్న ఆడపిల్లకు తక్కువ తిండా? ఆడపిల్ల చదువుకోకూడదా? ఎనిమిదో తరగతి వరకూ చదివిస్తే చాలని ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో అనుకుంటున్నారు. ఆడపిల్ల ఎడ్యుకేట్ అవ్వకూడదా? ఏం... ప్రశ్నిస్తుందని భయమా? హీరోలతో సమానంగా హీరోయిన్లకు పారితోషికం ఎందుకు ఇవ్వరు? ఈ ఒక్క విషయంలో కొంచెం న్యాయం మాట్లాడాలి. ఫెయిల్యూర్ ఎఫెక్ట్ ఎక్కువగా హీరోల మీదే పడుతుంది. అందుకని మనం ఈ పరిస్థితిని అంగీకరించాలి. అదే విధంగా హీరోయిన్ల కష్టం తక్కువ కాదని కూడా గ్రహించాలి. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో సాగడం అంటే అంత సులువు కాదు. అయినా మాకంటూ ఓ ప్రత్యేకత క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్రత్యేకత కొన్ని తరాల పాటు గుర్తుండిపోయేలా ఉండాలి. అది సాధించగలిగితే మేం సక్సెస్ అయినట్లే. ప్రపంచం ప్రగతిపథంలో వెళుతున్న ఈ సమయంలో ‘సమానత్వం’ ఇంకా ప్రశ్నార్థకంగానే ఉండటం గురించి? పురాణాలకు వెళితే స్త్రీ–పురుషులు సమానమే అనేది గుర్తొస్తుంది. సీతారాములు, రాధాకృష్ణులు, పార్వతీపరమేశ్వరులు అన్నారు. పురాణాల్లో స్త్రీకి అంత విలువ ఉంది. మనం చాలా విషయాల్లో పురాణాలను ఆచరిస్తాం. కానీ స్త్రీ–పురుష సమానత్వం వచ్చేసరికి కొందరు పురాణాలను మరచిపోతారు. స్త్రీని దేవతలా భావించాల్సిన సంస్కృతి మనది. దేవతలా భావించడం పక్కన పెట్టండి.. కనీసం తమతో సమానంగా చూడ్డానికి కూడా ఇష్టపడటంలేదు. మారాలి.. మనిషి ఆలోచనా విధానం మారాలి. స్త్రీని చూసే విధానంలో మార్పు రావాలి. స్త్రీని సమానంగా చూసే ప్రపంచం రావాలి. – డి.జి. భవాని -
కేణిలో ఆ ఇద్దరి పాట.. నిజంగా విశేషమే!
సాక్షి, చెన్నై: గానగంధర్వులు కేజే.ఏసుదాస్, ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం కలిసి పాడితే అది నిజంగా విశేషమే అవుతుంది. అలా 25 ఏళ్ల ముందు ఈ గాన తపస్విలు కలిసి ఆలపించారు. ఆ తరువాత సంగీత కచేరిలో ఒకే వేదికపై పాడి ఉండవచ్చుగానీ, సినిమా కోసం కలిసి పాడిన సందర్భం లేదు. అలాంటి అరుదైన సంఘటన కేణి చిత్రం కోసం జరిగింది. తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒకే పాటను కేజే.ఏసుదాస్, ఎస్పీ.బాలు కలిసి పాడారు. మలయాళ దర్శకుడు నిషాద్ తొలిసారిగా కోలీవుడ్కు పరిచయం అవుతున్న ఇందులో సీనియర్ నటి జయప్రద, సుహాసిని, రేవతి, నటుడు పార్థిబన్, నాజర్, నటి అనుహాసన్, రేఖ ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్రగ్రాంట్ నేచర్ ఫిలిం క్రియేషన్స్ పతాకంపై ఆన్ సజీవ్, సజీవ్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్రహోటల్లో జరిగింది. నటి సుహాసిని చిత్ర ఆడియోను ఆవిష్కరించగా నటి జయప్రద, పార్థిబన్ తొలి ప్రతిని అందుకున్నారు. జయప్రద మాట్లాడుతూ.. తమిళంలో వరసగా నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇంతకు ముందు నినైత్తాలే ఇనిక్కుమ్, సలంగై ఒళి, ఏళైజాతి, దశావతారం వంటి చిత్రాల వరుసలో ఇప్పుడు కేణి వంటి మంచి చిత్రాల్లో నటించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో తాను ఇందిర అనే సామాజిక బాధ్యత కలిగిని పాత్రలో నటించానని చెప్పారు. మహిళలు అభివృద్ధి చెందాలని అందరం చెబుతుంటామన్నారు. అయితే అలాంటి సమాజాన్ని స్త్రీలే సాధించుకోవాలని చెప్పే చిత్రంగా కేణి చిత్రం ఉంటుందని తెలిపారు. అదే విధంగా మంచి నీళ్లు అన్నవి తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు సంబంధించిన విషయం కాదన్నారు. నీరు అన్నది ప్రపంచ సమస్య అని, అలాంటి సమస్యను కథలో చేర్చిన దర్శకుడిని అభినందిస్తున్నానన్నారు. తాను ఇతర భాషా చిత్రాల్లో నటిస్తున్నా, తమిళంలోనూ నటించాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. దర్శకుడు నిషాద్ మాట్లాడుతూ.. మలయాళంలో కిణరు తనకు ఏడవ చిత్రం అయినా, తమిళంలో కేణి తొలి చిత్రం అని తెలిపారు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం సామాజిక ఇతివృత్తంతో కూడి ఉంటుందన్నారు. నీళ్లు ఈ భూమిపై జీవించే ప్రాణులందరికి చెందుతాయన్నారు. అలాంటిది మానవులు మాత్రమే సొంతం చేసుకోవాలనుకుంటున్నారని అన్నారు. ఎండ, వాన లాంటివి ప్రకృతి ప్రసాదించినవని కరువుకు మాత్రం మనిషే కారణం అవుతున్నాడని అన్నారు. ఈ విషయాలను ఆవిష్కరించే చిత్రంగా కేణి ఉంటుందని దర్శకుడు తెలిపారు. -
జయకథ!
కథ.. జరిగిందే కానక్కర్లేదు... జరగబోయేది కూడా కథే. జయం కోసం పోరాడిన కథ అంతులేని కథ అవుతుంది. జయప్రదం అయిన కథ జయకథ అవుతుంది. నాలుగు సినిమాల్లో కనపడబోతోంది. శ్రీదేవితో పోటీ పడబోతోంది. జయసుధకు సానుభూతి తెలుపుతోంది. ‘కోమలంగా ఉంటాను.. కమిలిపోతాను’ అనుకోవద్దు.. సవాళ్లు ఎదురైతే ‘బస్తీ మే సవాల్’ అంటుంది! అబ్బో... చాలా రోజుల తర్వాత కనిపించింది మనకి ఎంతో సంతోషంగా కనబడింది. ఎంతో ఆనందంగా మాట్లాడింది. ఎంజాయ్... జయకథ! ► మీ ఏజ్ ఫిఫ్టీ ప్లస్.. కెరీర్ ఏజ్ ఫార్టీ. రాజమండ్రి టు చైన్నై.. చెన్నై టు హైదరాబాద్, యూపీ.. లైఫ్లో బోలెడన్ని మలుపులు. ఆలోచిస్తే ఏమనిపిస్తోంది? ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోలేదు. అసలు ఏం అవాలో కూడా ప్లాన్ చేసుకోలేని ఏజ్లో అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చీ రావడంతోనే సక్సెస్. స్టార్స్తో సినిమాలు, మంచి మంచి క్యారెక్టర్లు.. 40 ఇయర్స్ క్రితం స్టార్ట్ అయిన జర్నీ ఇప్పటికీ గ్యాప్ లేకుండా కంటిన్యూ అవుతోంది. నటిగా, రాజకీయ నాయకురాలిగా ప్రజలు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలు వెల కట్టలేనివి. ఆ దేవుడి దయ, నా కష్టమే నన్నింతదాకా తీసుకొచ్చాయి. ఐయామ్ హ్యాపీ. ► మీరంటే ముందు గుర్తొచ్చేది ‘సాగర సంగమం’. మీ కెరీర్లో కీ రోల్ ప్లే చేసిన ఆ సినిమా ఒప్పుకున్నప్పుడు ‘వద్దు’ అన్నవాళ్లు ఉన్నారా? అప్పటికి నేను కమర్షియల్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాను. ‘ఇలాంటి టైమ్లో నువ్వు మాధవి (‘సాగర సంగమం’లో జయప్రద పాత్ర పేరు) లాంటి పాత్ర ఒప్పుకుంటే కెరీర్కి డ్యామేజ్ అవుతుంది’ అని కొందరు అన్నారు. కానీ, నేనా మాటలను పట్టించుకోలేదు. అప్పటికే విశ్వనాథ్ గారితో ‘సిరిసిరి మువ్వ’ సినిమా చేశా. ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. విశ్వనాథ్గారిని నేను వెల్విషర్లా భావిస్తా. అందుకని, ఆయన నా కెరీర్కు ఉపయోగపడే క్యారెక్టరే ఇస్తారని నమ్మకం. ఆ నమ్మకంతో ‘సాగర సంగమం’ చేశాను. నా లైఫ్లో ‘స్పెషల్ మూవీస్’ చాలా ఉన్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి.. క్లాసిక్. ఇప్పటికి 30 ఏళ్లకు పైనే అయినా ఇంకా మాట్లాడుతున్నారంటే అది ఆ సినిమా గొప్పదనం. మొన్నా మధ్య అమెరికా వెళ్లాను. అక్కడవాళ్లు ఈ సినిమా గురించే మాట్లాడారు. యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. నేను చేసినవాటిలో ‘మాధవి ఈజ్ వన్నాఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్’. ► విశ్వనాథ్గారు ‘శంకరాభరణం’ మొదలుపెట్టినప్పుడు మంజు భార్గవి రోల్కి మిమ్మల్ని తీసుకోలేదని బాధపడ్డారట? అవును. ‘శంకరాభరణం’ కోసం ఫోటోషూట్ చేసి, విశ్వనాథ్గారు నాకు చూపించినప్పుడు పది నిమిషాలు కామ్గా ఉండిపోయాను. మంజు భార్గవి చేసిన పాత్రకు డైరెక్టర్గారు మనల్ని ఎందుకు అనుకోలేదు? అని బాధపడ్డాను. ‘సార్.. ప్లీజ్ ఇంకోసారి ఆలోచిస్తారా?’ అన్నాను. ఆ సినిమా నాకు రాకపోవడం ఏదో మిస్ అయిపోయినట్టు అనిపించింది. కానీ, అప్పటికే అన్నీ ఫిక్స్ అయిపోయాయి. చేసే సినిమా మీద మన పేరు రాసి పెట్టి ఉండాలేమో అనుకుని, సర్ది చెప్పుకున్నా. కానీ, నేను బాలీవుడ్కు వెళ్లినప్పుడు అక్కడ ‘సుర్ సంగమం’ పేరుతో ‘శంకరాభరణం’ను రీమేక్ చేశారు. అందులో నటించడం ద్వారా ‘శంకరాభరణం’లో క్యారెక్టర్ చేయాలనే నా కోరిక తీరిపోయింది. అలాగే ‘జీవన జ్యోతి’లో వాణిశ్రీగారి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అయితే ఆ పాత్ర చేసేంత ఏజ్ నాకప్పుడు లేదు. సినిమాలో వాణిశ్రీగారు ఆ బొమ్మను పట్టుకుని వెళ్లడం నాకు నచ్చేది. ఆమె బ్రిలియెంట్ యాక్ట్రస్. ఆ సినిమా చేయలేదని బాధగా ఉండేది. అనుకోకుండా ఆ సినిమాను హిందీలోకి విశ్వనాథ్గారు రీమేక్ చేయడం, అందులో నేను నటించడంతో ఆ కొరత కూడా తీరిపోయింది. ఇక్కడ వయసు సరిపోక వదిలేసిన ఆ క్యారెక్టర్ను కొంచెం ఏజ్ పెరిగాక చేశాను. ► సో.. మీరేదైనా బలంగా కోరుకుంటే అది నెరవేరుతుందేమో.. ఇంకా ఇలాంటివి ఏవైనా జరిగాయా? అవును.. బలంగా అనుకుంటే జరుగుతుంది. ఇంకో ఉదాహరణ ఏంటంటే.. హిందీ సినిమా ‘ఖల్నాయక్’ షూటింగ్ కొన్నాళ్లు ఢిల్లీలో జరిగింది. షూటింగ్ స్పాట్కి పార్లమెంట్ ముందు నుంచి వెళ్లేవాళ్లం. ఆ ప్లేస్ రాగానే కారు ఆపి, పార్లమెంట్కి దండం పెట్టేదాన్ని. ఎంతోమంది మహానుభావులు ఉండే చోటు కాబట్టి, అలా చేసేదాన్ని. నాతో పాటు నా బ్రదర్ రాజబాబు ఉండేవాడు. నేను దండం పెట్టిన ప్రతిసారీ ‘ఏదో రోజు నువ్వు కూడా తప్పకుండా పార్లమెంట్కు వెళతావు’ అనేవాడు. అప్పుడు ఏదో మూల ‘సమాజానికి మన వంతుగా ఏదైనా చేయాలి’ అనే ఫీల్ కలిగేది. అది కూడా జరిగింది. మొదటిసారి పార్లమెంట్లోకి అడుగుపెట్టినప్పుడు నమ్మలేకపోయాను. పార్లమెంట్ను టచ్ చేసిన వెంటనే నా ఒంట్లో ఒక తెలియని గగుర్పాటు కలిగింది. థ్రిల్ ఫీలయ్యాను. ‘చాలామందికి రాని అవకాశం మనకు వచ్చింది. ఎంతో బాధ్యతగా ఉండాలి’ అనుకున్నా. పార్లమెంట్లో ‘కిత్తూరు చెన్నమ్మ’ స్టాచ్యూ ఉంది. కన్నడ దేశానికి చెందిన చెన్నమ్మ స్వాతంత్య్రం కోసం పోరాడిన మొదటి వీర వనిత. ఆన్స్క్రీన్లో ఆమె క్యారెక్టర్ చేసే చాన్స్ వస్తే బాగుండు అనుకున్నా. అది కూడా నెరవేరింది. ఐదేళ్ల క్రితం కన్నడంలో వచ్చిన ‘సంగోలి రాయన్న’లో ఆ క్యారెక్టర్ చేశా. బ్రిటిషర్స్తో ఫైట్ చేసిన ఒక దేశభక్తురాలి పాత్ర చేయడం నా అదృష్టం. ► పైకి సాఫ్ట్గా కనిపిస్తారు. సమస్యలు ఎదురైనప్పుడు, ఎవరైనా తేలికగా మాట్లాడినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? సినిమాల్లోకి రాకముందు.. వచ్చాక చాలా సంవత్సరాలు నేను సాఫ్ట్ పర్సన్నే. బాగా సిగ్గుపడేదాన్ని. ఎవరితో అయినా మాట్లాడటమంటే నాకు అది పెద్ద విషయం. తడబడిపోయేదాన్ని. భయస్తురాల్ని. ఎంత భయం అంటే.. పక్క గదిలో లైట్ వేయమని అమ్మ చెబితే. ‘అమ్మా నువ్వు ఉన్నావా? ఇక్కడే ఉన్నావా?’ అంటూ ఆమెతో మాట్లాడుతూ వెళ్లి లైట్ వేసేదాన్ని. ఒకవేళ అమ్మ నుంచి సమాధానం రాలేదంటే పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసేదాన్ని. అది అప్పటి జయప్రద. ఇప్పటి జయప్రద వేరు. మొన్నా మధ్య యూపీలో అజమ్ ఖాన్ (రాజకీయ నాయకుడు)పై ఎలా విరుచుకుపడ్డానో చూశారుగా! అనవసరంగా నన్నంటే అలానే చేస్తా. సినిమాల్లో ఓవర్ వర్క్ ఓ స్ట్రెస్. రాజకీయాల్లోకి వెళ్లడం ఓ స్ట్రెస్. క్రిమినల్ పీపుల్తో ఫైట్ చేయడం ఇంకో స్ట్రెస్. ‘ఇలాంటి వాతావరణంలోనే నువ్వు పని చేయాలి’ అన్నప్పుడు రాటుదేలాలి. నా ప్లేస్లో ఇంకో అమ్మాయి ఉండి ఉంటే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయేదేమో. రాజకీయాలకు దూరంగా ఉండేదేమో. కానీ, అనుభవాలు నాలో పరిణతి తెచ్చాయి. ఇప్పుడు నేను ఏ సమస్యనైనా అధిగమించగలను. ఎవరినైనా ఎదుర్కోగలను. ► ‘అంతు లేని కథ’లో అన్నాచెల్లెళ్లను.. మొత్తం కుటుంబాన్ని ఈదే అమ్మాయిగా నటించారు. రియల్ లైఫ్లో బ్రదర్, సిస్టర్స్, .. ఇలా కుటుంబానికి అండగా ఉన్నారేమో..? నా బ్రదర్, సిస్టర్స్ సపోర్ట్ లేకపోతే నేను లేను. వాళ్లు నా కోపాన్ని భరిస్తారు. నాన్సెన్స్ మాట్లాడితే సహిస్తారు. నా కష్టసుఖాలను పంచుకోవడానికి నా మనుషులు ఉండాలి. నా కుటుంబం నాకు పెద్ద అండ. మా అమ్మగారు వండర్ఫుల్. ప్రతి రోజూ షూటింగ్ వెళ్లేటప్పుడు ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటేనే నాకు ఆ రోజు పరిపూర్ణం అనిపిస్తుంది. కెరీర్ స్టార్టింగ్లో తను కూడా నాతో వచ్చేది. ఎండల్లో నాతో పాటు లొకేషన్లో ఉండేది. ఇదిగో ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా నాతో కబుర్లు చెబుతూ కూర్చుంది. సినిమాలు, పాలిటిక్స్ కోసం నేను వేరే రాష్ట్రాలు వెళతాను కదా. అప్పుడు నా ఫొటో దగ్గర నిలబడి ‘ఎప్పుడు వస్తావ్. ఎన్నాళ్లయింది చూసి’ అంటుంటుంది. నా లైఫ్లో మా ఫ్యామిలీ మెంబర్స్ది కీ రోల్. వేరే ఇంటి నుంచి మా ఇంట్లోకి కోడళ్లుగా, మరదళ్లుగా అడుగుపెట్టిన ఆడపిల్లలను మేం మా ఇంటి పిల్లలానే చూస్తాం. నా వాళ్లను చూడటం బర్డన్లా ఫీలవ్వడంలేదు. బాధ్యత అనుకుంటున్నా. ఆ బాధ్యత ఆనందంగా ఉంటుంది. ఢిల్లీలో మాకు ఫ్యాక్టరీలు ఉన్నాయి. యూపీలో కాలేజీలు, ట్రస్ట్ వ్యవహారాలు. ఇవన్నీ మావాళ్లు కూడా చూసుకుంటారు. ► ఒకప్పుడు మీరు, జయసుధగారు, శ్రీదేవిగారు.. పోటాపోటీగా సినిమాలు చేశారు.. చాలా గ్యాప్ తర్వాత శ్రీదేవిగారు కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడూ పోటీ ఉందా? ఇప్పుడూ పోటీయే. అది లేకపోతే మజా ఉండదు. అప్పట్లో మేం పోటీపడింది వృత్తిపరంగానే. వ్యక్తిగత పోటీలు ఉండవు. ఒకవేళ మళ్లీ వాళ్లతో కలసి సినిమాలు చేసే అవకాశం వస్తే, ‘ఐయామ్ రెడీ’. ► తెలుగు అమ్మాయి యూపీలో స్టార్ పొలిటీషియన్ కావడం గ్రేట్. రాజకీయాలను డీల్ చేయడం అంత ఈజీ కాదు కదా? కచ్చితంగా కాదు. నా లైఫ్లో అన్నీ ప్లస్లు అని చెప్పలేను. మైనస్లు అని చెప్పలేను. నేను ప్లాన్ చేసుకుని పాలిటిక్స్లోకి వెళ్లలేదు. 1994లో ఎన్టీఆర్గారు ఆహ్వానించారు. నా ఐదేళ్ల వయసులో ఆయన్ను స్క్రీన్ మీద చూసి, ఫ్యాన్ అయ్యాను. ఆయనతో మంచి మంచి సినిమాలు చేశాను. ఎన్టీఆర్గారంటే నాకు చాలా గౌరవం. మా మధ్య మంచి బాండింగ్ ఉండేది. అందుకే వెళ్లాను. ఎంతో బాధ్యతగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఎన్టీఆర్గారు సీయం కావడంలో నా వంతు పాత్ర ఉంది. ఆయన పిలిచినప్పుడు నేను ఏ పదవీ ఆశించి వెళ్లలేదు. ఎన్టీఆర్గారికి నా మీద ఉన్నంత అభిమానాన్ని నేను చంద్రబాబు నాయుడుగారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేను. అయితే గుర్తింపు రాకపోతే బాధ ఉంటుంది. బేసిక్గా నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. కావాలంటే 24 గంటలు కష్టపడతా. కానీ, దానికి తగ్గ గుర్తింపు రాకపోతే మాత్రం హర్ట్ అవుతా. అలాంటి బాధలోనే ఇక్కడ డ్రాప్ అయ్యి, యూపీ వెళ్లాను. యూపీలో పాలిటిక్స్ నాకు బోనస్. అక్కడ రెండుసార్లు పబ్లిక్ నుంచి గెలవడం ఆనందంగా ఉంది. నా నియోజకవర్గంలో ముస్లిమ్స్ ఎక్కువ. వాళ్లు కూడా నన్ను వాళ్ల ఆడపడుచులా భావించి, గెలిపించారు. అది ఆనందపడాల్సిన విషయం. ► అమ్మవారి పాత్రలు చేశారు కదా.. మరి దసరా సందర్భంగా అమ్మవారిని ఏ విధంగా పూజించారు? నాకు దైవభక్తి ఎక్కువ. శివుడు అంటే చాలా ఇష్టం. అలాగే, కాళీమాతను ఎక్కువగా పూజిస్తుంటాను. కోల్కత్తా దగ్గర దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్కి వెళుతుంటాను. కాళీ ఘాట్కి వెళతాను. ఢిల్లీలో కాళీ మాత టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్లి అమ్మవారిని పూజిస్తాను. నవరాత్రుల్లో నేను తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటాను. రోజంతా ఓన్లీ ఫ్రూట్స్. అది కూడా మితంగానే. తొమ్మిదో రోజు చండీ హోమం కంపల్సరీ. ► రాజకీయాల్లో ఇప్పుడు మీరేంటి? నేను లేను అని చెప్పను గానీ... ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ పార్టీ! ఈలోపు మంచి సినిమాలు చేయాలనుకుంటున్నా. 2019లో కదా (ఎన్నికలు)! ఇంకా టైముంది. ► మీరు చేరబోయే పార్టీ తెలుగు పార్టీ అయితే బాగుంటుందని మీ అభిమానులు కోరుకుంటున్నారు. వాళ్లకు దగ్గరగా ఉంటారని!! నాక్కూడా ఇక్కడ ఉండడమే ఇష్టం. అక్కడి (ఉత్తర ప్రదేశ్)కి వెళ్లి, మళ్లీ ఆజమ్ఖాన్ (రాజకీయ నేత)తో గొడవలు, ఏడుపులు... అబ్బబ్బా! ఇక చాలు. అతనితో చాలా పోరాడాను. సో, ఐ డోంట్ నో! ఇప్పుడు మళ్లీ నేనేదైనా చెబితే హెడ్లైన్స్కి ఎక్కుతుంది. కొంచెం ఆలోచించుకోనివ్వండి. నాకు మంచి ఆలోచనలు ఉన్నాయి. తప్పకుండా అంతా మంచే జరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నప్పటికీ, నేను సీరియస్గా సిన్మాలు చేయడం ప్రారంభించాను. మళ్లీ తెలుగులో మంచి సినిమాలు చేయాలనేది నా కోరిక. ► అసలు తెలుగులో ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? మలయాళం, కన్నడ, తమిళ సినిమాలు చేస్తున్నాను. ఈ సంవత్సరం సౌత్తోపాటు బెంగాలీ, పంజాబీ సినిమాలు కూడా చేస్తున్నాను. అక్టోబరులో నేను చేసిన నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. హిందీలో రెండు సినిమాలు చేస్తున్నా. కానీ, తెలుగులోనే గ్యాప్. మన తెలుగుపిల్లని మనం ఆదరించాలి అనే ఫీలింగ్ ఇండస్ట్రీలో లేదేమో అనిపించింది. అయినా జనరేషన్ ఛేంజ్ అవుతోంది. నన్నెందుకు తీసుకోవాలనుకుంటారు. ఆశించడం తప్పే. కాకపోతే వేరే భాషల్లో సినిమాలు చేస్తున్నప్పుడు మన తెలుగు సినిమాలు చేయాలని ఉంటుంది. ఒక మంచి సినిమాతో ఒక తెలుగు అమ్మాయిగా నా క్యారెక్టర్ను తెలుగు ప్రేక్షకకులు మెచ్చుకోవాలనే తపన ఉంటుంది కదా. సరిగ్గా అప్పుడే ‘శరభ’కి అడిగారు. ఇందులో నాది మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్. ఒక అమ్మాయిని ఎలా పెంచాలి? దుష్టశక్తుల నుంచి ఎలా కాపాడాలి? అనేది మెయిన్ పాయింట్. అందరికీ నచ్చే సినిమా అవుతుంది. డైరెక్టర్ నరసింహారావుగారు మంచి కథతో అద్భుతంగా తీశారు. ఎక్కువ బడ్జెట్ అయింది. అయినా రాజీపడలేదు. మంచి స్టోరీ, క్యారెక్టరైజేషన్స్, గ్రాఫిక్స్తో సినిమా ఫుల్మీల్స్లా ఉంటుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నా. ► ఇండస్ట్రీలో మీకు జయసుధగారు క్లోజ్ ఫ్రెండ్. ఈ మధ్య ఆమె భర్త చనిపోయినప్పుడు మీరు వెళ్లి పరామర్శించారా? విషయం వినగానే వెళ్లాను. మా ఇద్దరి మధ్య ఉన్నది జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు. మాటల్లో చెప్పలేని ఓ ఎటాచ్మెంట్ ఉంది. నితిన్ కపూర్ (జయసుధ భర్త) మంచి హ్యూమన్బీయింగ్. అయితే, ఆయన లైఫ్ను అర్థం చేసుకోలేదేమో అనిపించింది. ఇంకొక్క అవకాశం ఆయన ఇచ్చి ఉండాల్సింది అనేది నా ఫీలింగ్. బాధపడాల్సిన విషయం ఏంటంటే... జయసుధ తప్పు లేకుండా ఆమె లైఫ్లో ఏదో కోల్పోయింది. ► మీరు చివరిసారిగా నితిన్గారిని ఎప్పుడు కలిశారు? ఆయన చనిపోవడానికి నెల ముందు మాట్లాడాను. చాలాసేపు మాట్లాడుకున్నాం. జీవితంలో అందరూ సుఖంగా ఉండలేరు. ఎత్తుపల్లాలు ఉంటాయి. ఆ మూమెంట్లో మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోతే ఇలాంటి పరిణామాలే వస్తాయి. అలాంటప్పుడు మనం ఓవర్ బిజీగా ఉండాలి. దేవుణ్ణి తలచుకోవాలి. సమస్యలను దాటాలి. ► అదేంటీ.. వంద సినిమాలు చేశారు. ఇప్పుడు స్టూడెంట్లా నేర్చుకున్నారా? మనం ఎప్పటికీ స్టూడెంట్స్మే అని నా ఫీలింగ్. ‘ఇది నేర్చుకున్నాం.. ఇంకా నేర్చుకోవడానికి ఏమీ లేదు’ అనేది ఉండదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎడిటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నా. టెక్నాలజీ గురించి చాలా విషయాలు తెలిశాయి. భవిష్యత్తులో దర్శకత్వంవైపు అడుగులు వేస్తే నాకు హెల్ప్ అవుతుంది. ► అంటే.. డైరెక్టర్ కావాలనే ఆలోచన ఉందా? మంచి కథ కోసం వెయిటింగ్. దొరకగానే చేస్తాను. ► ఫిల్మ్స్ అండ్ పాలిటిక్సేనా.. వేరే ఏమైనా ఆలోచనలు? ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్నాం. చిన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నా. డ్యాన్స్ని, నన్నూ వేరు చేయలేం. ఓ డ్యాన్స్ బ్యాలే ఉంది. యూపీలో రెండు కాలేజీలు ఉన్నాయి. జయప్రద ఛారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా సహాయ కార్యక్రమాలు చేస్తాం. ప్రస్తుతానికి ఇవే. ► ఫైనల్లీ... ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు మీరేదైనా బలంగా అనుకుంటే అది జరుగుతుందని చెప్పుకున్నాం కదా.. మరి.. ఇంకా మనసులో ఏమైనా బలమైన లక్ష్యాలు? పెద్ద పెద్ద లక్ష్యాలు లేవు. నేను బాలసుబ్రహ్మణ్యంగారికి గ్రేట్ ఫ్యాన్. పాటలు పాడటానికి ఆయన రాజమండ్రి వచ్చేవారు. అప్పట్లో ఆయనకు ‘ది ఎంగెస్ట్ ఫ్యాన్స్’ అంటే నేనూ, నా బ్రదర్. రెండు గులాబీ పూలు పట్టుకుని ఆయనకివ్వడానికి స్టేషన్ దగ్గర వెయిట్ చేసేవాళ్లం. ‘నేను మీతో పాడాలి. అది కూడా స్టేజ్ మీదే పాడాలి’ అని ఆయనతో అనేదాన్ని. పెద్దయ్యాక పాడుదువుగాని అని ఓదార్చేవారు. చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నా. టీనేజ్లో సినిమాల్లోకొచ్చేసాను కాబట్టి, సంగీతం ప్రాక్టీస్ చేయడానికి తక్కువ టైమ్ దొరికింది. అప్పట్లో ‘సీతారాములు’లో ఓ పాటలో కొన్ని మాటలు మాట్లాడాను. ఆ మధ్య మేం తెలుగు ‘ఇష్క్’ని తమిళంలో రీమేక్ చేశాం. ఆ సినిమాలో ఒక పాట పాడాను. ఇప్పుడు పాట పాడటం అప్పటి రోజులతో పోలిస్తే పెద్ద కష్టమేం కాదు. టెక్నాలజీ సాయంతో ఏ పాటైనా మనం పాడుకోవచ్చు. తెలుగు సినిమాకి పాడాలనే కోరిక బలంగా ఉంది. ► ఇది కూడా నెరవేరుతుంది మేడమ్.. అవును. నాకూ ఆ నమ్మకం ఉంది (నవ్వేస్తూ). – డి.జి. భవాని -
ఇక నా దృష్టంతా సినిమాలపైనే: సీనియర్ నటి
సాక్షి, హైదరాబాద్: 'ఇక నా దృష్టంతా సినిమాలపైనే.. ' సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద తెలిపారు. చెన్నై ప్రసాద్ ల్యాబ్లో శనివారం శరభ చిత్రం టీజర్ లాంచ్ చేశారు. ఈ చిత్రంలో జయప్రద ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో జయప్రద మాట్లాడుతూ కొంతకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. రాజకీయాల్లో ఉండటం వల్ల సినీ దర్శకులు మంచి కథలతో తన వద్దకు రాలేకపోయారని చెప్పారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నాలుగు చిత్రాలతో నటిస్తూ బిజీగా ఉన్నానని వివరించారు. -
ఆరేళ్ల తర్వాత మేకప్ వేసుకోనున్న నటి
తిరువనంతపురం: వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద తిరిగి మరోసారి తెరంగేట్రం చేయనున్నారు. దాదాపుగా ఆరేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఓ మలయాళ చిత్రం ద్వారా తిరిగి మేకప్ వేసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకోసం ఆమె కేరళ రాజధానికి కూడా చేరుకున్నారు. దర్శకుడు ఎంఏ నిషాద్ తీయబోతున్న కిన్నారు(మంచి) అనే మలయాళ చిత్రంలో జయప్రద ప్రస్తుతం నటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలయాళ చిత్రం ద్వారా తిరిగి నటనను ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. తాను నటించబోతున్న ఈ సినిమాలో సామాజిక సమస్య అయిన నీటి సమస్య, రైతుల సమస్యలు ఇతివృత్తంగా ఉండబోతుందని చెప్పారు. 2011లో ఆమె మలయాళంలో ప్రణయం అనే చిత్రం చేశారు. ఆ చిత్రంలో ఆమెతోపాటు మోహన్లాల్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా నటించారు. -
జయప్రద, జితేంద్ర స్ఫూప్ వీడియో అదుర్స్!
గత జనవరిలో ఎడ్ షీరాన్ ’షేప్ ఆఫ్ యూ’ విడుదలైన నాటి నుంచి ఆ వీడియో సాంగ్పై అనేక బాలీవుడ్ స్ఫూప్ వీడియోలు ఆన్లైన్లో హల్చల్ చేశాయి. షీరాన్ పాటపై సల్మాన్ ఖాన్ మొదలు గోవింద వరకు నటులు చేసిన డ్యాన్స్తో మిక్స్ చేసిన స్ఫూప్ వీడియోలు నెటిజన్లను అలరించగా.. తాజాగా పాప్ సింగర్ సియా ‘చీప్ థ్రిల్స్’ పాటపై స్ఫూప్ వీడియోలు దుమ్మురేపుతున్నాయి. 2016లో చార్ట్ బస్టర్గా నిలిచిన ’చీప్ థ్రిల్స్’ పాటను తాజాగా అలనాటి నటులు జితేంద్ర, జయప్రద తీసిన ఓ పాటతో స్ఫూప్ చేయడం నెటిజన్లను నవ్వులో ముంచెత్తుతోంది. ‘మవాలీ’ సినిమాలో ’ఉయ్ అమ్మ ఉయ్ అమ్మ’ పాటను సియా ’చిప్ థ్రిల్స్’ సాంగ్తో స్ఫూప్ చేసి ఫేస్బుక్లో విట్టీఫీడ్ అనే పేజీ పోస్టు చేసింది. ఈ పోస్టు నెటిజన్లను ఆకట్టుకోవడమే కాదు వారికి కితకితలు పెడుతోంది. మీరూ ఓ లుక్ వేయండి.. -
'జయప్రదతో విభేదాలు లేవు'
లక్నో: జయప్రదకు, తనకు ఎటువంటి విభేదాలు లేవని సమాజ్ వాది పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన అమర్ సింగ్ తెలిపారు. ములాయం సింగ్ మన్ననలు చూరగొనడం పట్ల ఆయన అమితానందం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యత్వం కంటే ములాయం దీవెనలు పొందడమే తనకు ముఖ్యమని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ తన ఫోన్ చేసి అభినందలు తెలిపారని, ఆయన ఎందుకు అభినందలు తెలిపారో ముందు అర్థం కాలేదన్నారు. తర్వాత రోజు ములాయంతో మాట్లాడినప్పుడు తనను రాజ్యసభకు ఎంపిక చేశారని తెలిసిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జయాబచ్చన్ తో విభేదాల గురించి అడిగినప్పుడు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. -
'బాస్' రూటులో జయప్రద?
లక్నో: అమర్ సింగ్ సమాజ్ వాదీ పార్టీలోకి తన పునరాగమాన్ని ఘనంగా చాటారు. పార్టీలో బడా నేతలు వ్యతిరేకించినప్పటికీ పెద్దల సభ సీటు దక్కించుకుని సత్తా చాటారు. ఆయనతో పాటు సమాజ్ వాది పార్టీకి దూరమైన ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద కూడా మళ్లీ ఎస్ పీ గూటికి చేరే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రియాశీల రాజకీయల్లోకి మళ్లీ అడుగు పెట్టేందుకు జయప్రద ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమర్ సింగ్ సొంతగూటికి చేరడంతో ఆమెకు అనుకూలించే పరిణామం. తనకు మెంటర్, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అయిన అమర్ సింగ్ మార్గాన్నే ఆమె అనుసరించే అవకాశముంది. ఆయన సొంత గూటికి చేరుకుని రాజ్యసభ సభ్యత్వం దక్కించుకోవడంతో జయప్రద ఆయన బాటలోనే ప్రయాణిస్తారని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమె మళ్లీ యూపీ వైపు మళ్లనున్నారని తెలుస్తోంది. అమర్ సింగ్ పునరాగమనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆజాంఖాన్, రాంగోపాల్ యాదవ్.. జయప్రద రాకకు మోకాలడ్డే అవకాశముంది. అయితే 'బాస్' అమర్ సింగ్ తలచుకుంటే జయప్రదకు మళ్లీ యూపీ పాలిటిక్స్ లో మెరుస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
'ఏ పార్టీలో చేరతానో ఇప్పుడే చెప్పలేను'
హైదరాబాద్: తాను ఏ రాజకీయ పార్టీలో చేరేదీ ఇప్పుడే చెప్పలేనని అలనాటి సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. నగరంలోని తాజ్కృష్ణా హోటల్లో ఏర్పాటైన 'లావిష్ డిజైనర్ ఎక్స్పో'ను ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోడ్రన్ దుస్తులు కూడా ధరిస్తున్నా.. చీరలోనే తను మరింత అందంగా, ప్రత్యేకంగా కనపడతానని అందరూ ప్రశంసిస్తుంటారని అన్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు పలు భాషల్లో రూపొందుతున్న సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. ఇప్పుటికిప్పుడే ఏ పార్టీలో చేరేదీ చెప్పలేనని.. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి రావెల కిషోర్బాబు కూడా హాజరయ్యారు. -
చెన్నైని తెలుగు చిత్ర పరిశ్రమ ఆదుకుంటుంది
తిరుమల: తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై కేంద్రంగానే ప్రారంభమైందని, వరద విపత్తులో చిక్కుకున్న చెన్నైలోని బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ చిత్ర పరిశ్రమ ముందుకొచ్చిందని సినీనటి జయప్రద అన్నారు. గురువారం ఆమె కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వరద కారణంగా చెన్నైలో తీవ్రమైన ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, తమవంతు బాధ్యతగా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకొచ్చిందని అన్నారు. సాధ్యమైనంత త్వరలోనే బాధితులను ఆదుకుంటామని తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. -
శ్రీవారి సేవలో జయప్రద
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం సినీనటి జయప్రద దర్శించుకున్నారు. ఈ రోజు వీఐపీ విరామ సమయంలో జయప్రద కుటుంబ సభ్యులతో కలిసి స్వామి సేవలో పాల్గొన్నారు . దర్శనం అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరోవైపు భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి ఒక కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి, ప్రత్యేక ప్రేవశ దర్శనానికి, కాలినడక వచ్చే భక్తులకు గంట సమయం పడుతోంది. గదులు కూడా సులభంగా దొరుకుతున్నాయి. బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం గదుల వివరాలు: ఉచిత గదులు : 126 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు : 159 ఖాళీగా ఉన్నాయి రూ. 100 గదులు : 204 ఖాళీగా ఉన్నాయి రూ. 500 గదులు : 112 ఖాళీగా ఉన్నాయి -
జయప్రద కుమారుడి రిసెప్షన్కు ములాయం
-
జయప్రద కుమారుడి రిసెప్షన్కు ములాయం
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, సినీనటి జయప్రద కుమారుడి వివాహ విందులో సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ సందడి చేశారు. జయప్రద ఆహ్వానం మేరకు ప్రత్యేక విమానంలో లక్నో నుంచి ఆదివారం నగరానికి చేరుకున్న ములాయంసింగ్ యాదవ్ నేరుగా మాదాపూర్లోని జయప్రద ఇంటికి వెళ్లారు. ఆ పార్టీ మాజీ నేత అమర్సింగ్ కూడా ములాయం వెంట ఉన్నారు. వారికి జయప్రద కుటుంబ సభ్యులు సాదరస్వాగతం పలికారు. నూతన వధూవరులు ప్రవళిక, సిద్ధార్థ్లను వారు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జయప్రద కుటుంబసభ్యులు వారికి ప్రత్యేక జ్ఞాపికలు అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం రాత్రి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. రాజకీయాలు మాట్లాడ్డం కోసం త్వరలో వస్తా... ఈ సందర్భంగా ములాయంసింగ్ యాదవ్ కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. జయప్రద కుమారుడి వివాహ విందులో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బిహార్ ఎన్నికలు, తదనంతర రాజకీయ పరిణామాలపై విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించగా మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. తాను ఒక శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాత్రమే వచ్చానని, ఇలాంటి వేళ రాజకీయాల గురించి మాట్లాడటం ఉచితం కాదని పేర్కొన్నారు. రాజకీయాలపై మాట్లాడేందుకు త్వరలోనే మరోసారి వస్తానని అన్నారు. -
చిందేసిన జయప్రద, జయసుధ
-
చిందేసిన జయప్రద, జయసుధ
హైదరాబాద్: సీనియర్ నటీమణులు జయప్రద, జయసుధ స్టెప్పులతో పాత రోజులను గుర్తు చేశారు. హుషారుగా డాన్స్ చేసి అలరించారు. మాజీ ఎంపీ జయప్రద తనయుడు సిద్ధార్థ వివాహ వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. శంషాబాద్ లోని సుచిర్ టింబర్ లీఫ్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకకు సినిమా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సమాజ్ వాది పార్టీకి చెందిన మాజీ నేత అమర్ సింగ్, సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమార్తె మంచు లక్ష్మి, సంగీత దర్శకురాలు శ్రీలేఖ తదితరులు హాజరయ్యారు. నాటి అందాల తారలు జయసుధ, జయప్రద పదం కలిపి ఆటపాటలతో ఈవెంట్ కు జోష్ పెంచారు. నెల 27న హైదరాబాద్ లో సిద్ధార్థ, ప్రవల్లికా రెడ్డి వివాహం జరగనుంది. సిద్ధార్థ్ జయప్రద సోదరి కుమారుడు. జయప్రద అతడిని దత్తత తీసుకున్నట్లు సమాచారం. సిద్ధార్ధ్ తమిళంలో 'ఉయిరే ఉయిరే' అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం నితిన్ హీరోగా నటించిన 'ఇష్క్' చిత్రానికి రీమేక్ కాగా అందులో అతడి సరసన హన్సిక కథానాయికగా నటించింది. -
ఆడియోవేదికపై స్టెప్పులేసిన సినీతారాగణం
-
ప్రస్తుతం సినిమాల మీదే: జయప్రద
బంజారాహిల్స్ (హైదరాబాద్): మంచి కథ దొరికితే తెలుగులో నటించడానికి సిద్ధంగా ఉన్నానని నటి, మాజీ ఎంపీ జయప్రద చెప్పారు. తాను తెలుగు నటిని కావడంతో సహజంగానే తెలుగులో నటించాలనే ఆసక్తి ఉంటుందన్నారు. సోమవారం బంజారాహిల్స్లోని పార్క్హయత్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తున్నానని చెప్పారు. -
మూవీ ముచ్చట్లు : జయప్రద
-
జయప్రద చెల్లెలి కొడుకు నిశ్చితార్థం
-
ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతా: జయప్రద
తిరుమల: ‘‘మొన్నమొన్ననే ఎన్నికలయ్యాయి. ఏ పార్టీలో చేరాలో ఇంకా టైముంది కదా? త్వరలోనే వెల్లడిస్తా’’ అని మాజీ ఎంపీ, సినీనటి జయప్రద అన్నారు. ఆదివారం ఉదయం ఆమె వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామిని ప్రార్థించానన్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి హరీశ్రావుతో సమావేశం కావడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. హరీశ్రావు తన సోదరుడు లాంటివారని, మర్యాదపూర్వకంగానే ఆయనను కలిసానని ఆమె స్పష్టం చేశారు. -
సావిత్రిలా పేరు తెచ్చుకోవాలి
ప్రఖ్యాత నటీమణి సావిత్రిలా పేరు తెచ్చుకోవాలన్నది తన ఆశ అంటున్నారు నటి అనుష్క. అభినయంలో సత్తా ఏమిటో అరుంధతి చిత్రంతోనే చాటుకున్నారు. అయితే త్వరలో నటనకు స్వస్తి చెప్పబోతున్నారని, కారణం పెళ్లి పీట లెక్కనునున్నారరన్నది తాజా ప్రచారం. ఇలాంటి పరిస్థితిలో ఈ ముద్దుగుమ్మ మాత్రం నటి ప్రేక్షకుల హృదయాల్లో సరైన స్థానం సంపాదించుకోలేదని మహానటి సావిత్రి లా పేరుసంపాదించుకోవాలని అనడం విశేషం. ఇంకా ఈ బ్యూటీ భావాలేమిటో చూద్దాం. ప్రస్తుత నటీమణులు సీజన్ పండ్లు లాంటి వారేనన్నారు. ఒక్కో సీజన్లో ఒక్కోనటి చిత్రం విజయం సాధిస్తుందన్నారు. తాను మాత్రం జయాపజయాలను సమంగా స్వీకరిస్తానని తెలిపారు. కొన్ని చిత్రాల్లో అందాలారబోస్తూ మరికొన్ని చిత్రాల్లో నటనాభినయాన్ని చాటుతున్నట్లు చెప్పారు. దర్శకుడు చెప్పినట్లు నటిస్తానన్నారు. మరో విషయం ఏమిటంటే విజయం అనేది ఏ ఒక్కరితోనో వచ్చేది కాదని, అది సమష్టి కృషితోనే సాధ్యమన్నారు. నెంబర్వన్ స్థానంపై ఆశ లేదన్నారు. నాటి నటీమణులు సావిత్రి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద లాంటి వారు ఇప్పటికి 14 ఏళ్ల కు ర్రాళ్లకు తెలిసేలా చిరస్థాయిగా గుర్తింపు పొందారన్నారు. మరో విషయం ఏమిటంటే వారి కాలంలో ఇప్పటిలా ప్రసార సాధనాలు లేవన్నారు. అయినా వారు పోషించిన పాత్రలు గుర్తుండిపోయాయని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు ట్విట్టర్లు, పేస్బుక్ లాంటి పలు ప్రసార సాధనాలున్నా తనతో సహా నేటి నాయికలకు, అభిమానుల్లో అంతగా గుర్తింపు లేదన్నది వాస్తవం అన్నారు. అందువల్లే సావిత్రిలా మంచి పాత్రలో నటించి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానన్నారు. భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకునేలా మంచి పాత్రలను ఇక ముందు కూడా పోషించాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. -
జయప్రద కొడుకుతో నటిస్తోన్న జాహ్నవి?
-
తారలు హిట్!.. ఫట్!!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో వివిధ పార్టీల తరఫున ఎంపీ స్థానాల్లో పోటీకి దిగిన సినీతారల్లో కొందరిని విజయం వరించగా, మరి కొందరు అపజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. విజయం వరించిన తారలు: హేమమాలిని, శతృఘ్నసిన్హా, పరేశ్ రావల్, వినోద్ ఖన్నా, కిరణ్ఖేర్, మనోజ్ తివారీ(బీజేపీ), మూన్మూన్సేన్ (తృణమూల్), ఇన్నోసెంట్ (స్వతంత్ర). ఓడినతారలు: నగ్మా, కునాల్సింగ్, రాజ్ బబ్బర్(కాంగ్రెస్), స్మృతి ఇరానీ(బీజేపీ), జయప్రద(ఆర్ఎల్డీ), రాఖీసావంత్ (రాష్ట్రీయ ఆమ్ పార్టీ), -
పొన్నాల సీఎం అయ్యే అవకాశం: జయప్రద
జనగామ: తనపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు ఓటుగా మార్చి గెలిపించాలని ఎంపీ జయప్రద అన్నారు. వరంగల్ జిల్లా జనగామలో సోమవారం పొన్నాల చేపట్టిన రోడ్షోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోనియా, రాహుల్ గాంధీ ఆశీస్సులతో పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయన్నారు. అభిమాన లోకానికి రుణపడి ఉంటానని తెలిపారు. మతాలు, జాతుల పేరుతో వచ్చే నాయకులను నమ్మొద్దన్నారు. -
బాబు కారణంగానే రాష్ట్రానికి దూరమయ్యా
-
సామాజిక హరిత తెలంగాణకు కృషి
రోడ్ షోలో ఆర్ఎల్డీ ఎంపీ, సినీనటి జయప్రద హన్మకొండ చౌరస్తా, న్యూస్లైన్ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తమ పార్టీ లక్ష్యం.. సామాజిక హరిత తెలంగాణ కోసం ఆర్ఎల్డీ పాటుపడుతుందని ఆ పార్టీ ఎంపీ, సినీనటి జయప్రద అన్నారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ వరంగల్ పశ్చిమ అభ్యర్థి దిలీప్కుమార్ పక్షాన శనివారం జయప్రద నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హెలికాప్టర్ ద్వారా సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో దిగిన ఆమెకు కపిలవాయి దిలీప్కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న జయప్రద ముందుగా మీడియాతో మాట్లాడారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగిన రోడ్షోలో అక్కడక్కడా వాహనం పైనుంచే ప్రసంగించారు. మాధవరెడ్డి హోం మంత్రిగా ఉన్నప్పటి నుంచి దిలీప్కుమార్ తనకు పరిచయమని చెప్పారు. సిన్సియర్ ఉద్యోగిగా ప్రజలకు సేవలందించిన దిలీప్కు ప్రజాప్రతినిధిగా అంతకంటే రెట్టింపు స్థాయిలో పనిచేసే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఆమె వెంట కపిలవాయి దిలీప్కుమార్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిరాదిలీప్, జిల్లా అధ్యక్షుడు సంగాల ఇర్మియా, కాకిరాల హరిప్రసాద్, చెరుకూరి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్ షోలో గోండు, కోయగిరిజ సంప్రదాయ వేషధారణలో కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. -
బాబు కారణంగానే రాష్ట్రానికి దూరమయ్యా
ఎంపీ జయప్రద హన్మకొండ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి కారణంగానే తాను రాష్ట్రానికి దూరమయ్యానని సినీనటి, ఎంపీ జయప్రద అన్నారు. శనివారం దిలీప్కుమార్తో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆనాడు చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే యూపీలో పోటీ చేయాల్సి వచ్చింద న్నారు. భవిష్యత్తులో అవకాశం ఉంటే తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు ఆంధ్రా లేదా తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటుకు అజిత్సింగ్ కృషి గొప్పదని కొనియాడారు.