kanna lakshmi narayana
-
కన్నా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మంత్రి అంబటి
-
ఎన్నికల ఖర్చుకోసం బీజేపీ ఫండ్ పంపితే మింగిన ఘనత కన్నాది: అంబటి
-
వాడకమంటే బాబుదే.. సీనియర్ నేత 30 ఏళ్ల సేవలు గుర్తులేవా?
వాడుకుని వదిలేయడంతో చంద్రబాబును మించినవాళ్లు లేరు అనేది దేశవ్యాప్తంగా తెలిసిందే. తనకు అవసరం ఉంటే ఆకాశానికి ఎత్తేసి తరువాత మొహం చాటేయడంతో ఆయన్ను మించినవాళ్లు లేరని ఎప్పటికప్పుడు స్పష్టమవుతూనే ఉంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంటే వాస్తవానికి చంద్రబాబు అపారమైన ప్రేమ చూపిస్తారు. చూపిస్తారో నటిస్తారో తెలియదుకానీ.. టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన కొన్నాళ్ళకు కోడెల శివప్రసాద్ తన పిల్లలు చేసిన అరాచకాలకు బాధ్యత వహించాల్సి వచ్చింది. వాస్తవానికి ఆయన్ను ఇనుమేట్ల గ్రామంలో పోలింగ్ రోజున ప్రజలు తరిమి కొట్టడం, ఇన్ని దెబ్బలు కాసినా ఆయన ఎన్నికల్లో ఓడిపోవడం తెలిసిందే. బాబు శవ రాజకీయం.. ఆఖరుకు ప్రభుత్వ ఆఫీస్ కుర్చీలు సైతం ఆయన కుమారుడు శివరామ్ ఎత్తుకురావడమే కాకుండా సత్తెనపల్లిలో వీధి వ్యాపారుల నుంచి సైతం మామూళ్లు వసూళ్లు చేసిన అరాచకాలు.. తరువాత ఆయన కేసులు ఎదుర్కొని అవమానాలు పాలై చివరకు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన చనిపోయాక అది ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపణలు చేసి ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ పార్టీ ఆఫీసులో ఒకరోజు.. మంగళగిరి పార్టీ ఆఫీసులో ఒకరోజు.. నరసరావుపేటలో ఒక రోజు ఇలా మూడు రోజులు ఆయన శవంతో రాజకీయం చేశారు చంద్రబాబు. ఆ తరువాత శివరామ్ను ఓదార్చి నీ పొలిటికల్ కెరీర్ నేను చూసుకుంటాను అంటూ రెండు.. రెండంటే రెండే.. కన్నీటి బొట్లు కుడికన్ను నుంచి కార్చి వెళ్లిపోయారు. ఇక అక్కడ మళ్ళీ తమ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరూ లేకపోవడం, శివరామ్ గానీ పోటీ చేస్తే ఇనుమెట్ల సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని భయం. ఇవన్నీ కలగలిసి ఆ తరువాత శివరామ్కు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు. అంటే కోడెలను వాడుకున్నారు.. ఆయన చనిపోయాక ఆయన కుటుంబానికి కెరీర్ క్లోజ్ చేసేశారు. అదన్నమాట బాబుగారి వాడకం. శివమెత్తుతోన్న శివరామ్.. శని పట్టుకున్నా వదులుతుందేమో కానీ చంద్రబాబు పట్టుకుంటే మాత్రం వదలడు అనే నానుడి ఒకటి తెలుగు తమ్ముళ్లు తరచుగా చెప్పుకుంటారు. బతికి ఉండగా కోడెల శివప్రసాద్ను అనగదొక్కి మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవి కట్టబెట్టి మూలన కూర్చోబెట్టిన చంద్రబాబు. ఇప్పుడు కూడా ఆ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నారు చంద్రబాబు. తన తండ్రి రాజకీయ వారసత్వం తనకు వస్తుందని, సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తారని ఆశిస్తూ ఉన్న శివరామ్ను చంద్రబాబు పూర్తిగా పక్కన పడేసి.. అదే స్థానంలో కన్నా లక్ష్మి నారాయణను ప్రొజెక్ట్ చేయడంతో శివరామ్ శివాలెత్తి పోతున్నారు. ‘ముప్పై ఐదేళ్ల తన తండ్రి సేవలు గుర్తుకు రాలేదా.. మా కుటుంబానికి న్యాయం చేస్తాం అని గతంలో ఇచ్చిన హామీ మర్చిపోయారా’ అని నేరుగా చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నాడు శివరామ్. వాస్తవానికి కోడెల గత ముప్పై ఐదేళ్ల రాజకీయం ఒకెత్తు కాగా 2014-2019 మధ్య చేసిన రాజకీయం ఇంకో ఎత్తు అని చెప్పాలి. ఇనేళ్లు తాను నిర్మించిన పొలిటికల్ కెరీర్ సౌధాన్ని జస్ట్ ఐదేళ్లలో కొడుకు శివరామ్ కూల్చేశాడు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని జిల్లావ్యాప్తంగా దోపిడీలు..సెటిల్మెంట్లు, దందాలు చేశారు. ఆఖరుకు చిన్న వ్యాపారుల నుంచి కూడా వసూళ్లు.. బిజినెస్ అవకాశం ఇస్తానంటూ ఎందరి దగ్గరో వసూళ్లు.. అడిగితే బెదిరింపులు.. ఇవన్నీ కలగలిసి ఏకంగా కోడెల శివ ప్రసాద్ను పోలింగ్ రోజున ఇనుమేట్ల గ్రామంలో ప్రజలు వెంటాడి కొట్టిన పరిస్తితి ఎదురైంది. ఇక తెలుగుదేశం పరిస్థితి చూసి సత్తెనపల్లిలో ఓటర్లు నవ్వుకుంటున్నారు. ప్రజల ప్రశ్నలు ఇవే.. - సత్తెనపల్లి ఎవరి ఆస్తి? - మేమే పాలిస్తామని ఎవరైనా ఎలా చెప్పుకుంటారు? - ఈ పవర్ చంద్రబాబు చేతికి ఎవరిచ్చారు? - సత్తెనపల్లికి ఎవరు రుణపడి ఉన్నారు? - ఇన్నాళ్లు కోడెల చేసిందేంటీ? - స్పీకర్గా ఉంటూ ఫర్నీచర్ ఎత్తుకురావడమేంటీ? - కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లికి ఏంచేశారు? - అసలు టీడీపీకి ఎందుకు ఓటేయాలి? - పదవుల కోసం పార్టీలు మారిన వారిని ఎందుకు ఎంచుకోవాలి? - రాజకీయ అవసరాల కోసం సత్తెనపల్లిని తాకట్టు పెడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: టీడీపీలో అగ్గిరాజేసిన కేశినేని నాని.. తగ్గేదేలే అంటూ పచ్చ బ్యాచ్కు కౌంటర్! -
టీడీపీలో ముసలం.. కోడెల కుమారుడు శివరాం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి టీడీపీలో ముసలం పుట్టింది. నియోజకవర్గ ఇంచార్ద్ నియామకం టీడీపీలో కాక రేపుతోంది. అనుచరులతో కోడెల కుమారుడు శివరాం సమావేశమయ్యారు. టీడీపీ ఇన్ఛార్జ్గా కన్నా లక్ష్మీనారాయణ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న కోడెల శివరాం.. పట్టణంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఇన్ఛార్జ్గా కన్నా పేరు ప్రకటనపై తమకు సమాచారం లేదని కోడెల శివరాం మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో కన్నా అరాచకాలను కోడెల అడ్డుకున్నారని, టీడీపీని అవమానించిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘‘లాలుచి రాజకీయాలు మాకు తెలియదు. తెలుగుదేశం పార్టీని కోడెల బతికించారు. కొంత మంది నాయకులు మాపై కుట్రలు చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం మమ్మల్ని పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అధిష్టానం సత్తెనపల్లిని టార్గెట్ చేసింది’’ అంటూ శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: టీడీపీకి షాకిచ్చిన కొట్టే వెంకట్రావు దంపతులు -
కన్నా... నీ బతుకు ఏంటో తెలుసుకో..
మాచర్ల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పుణ్యాన మంత్రివై రాజకీయ జీవితాన్ని పెంపొందించుకున్న నువ్వు ఈ రోజు సీఎం జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేస్తున్నావ్..పార్టీలు మారగానే స్థాయి మరచిపోయి వ్యవహరిస్తున్నావు... నీకు ప్రజలు బుద్ధి చెబుతారు... వైఎస్ కుటుంబం గురించి మాట్లాడితే తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని గుర్తుంచుకో.. కన్నా అని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మాచర్లలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్మోహన్రెడ్డి పాలన గురించి మాట్లాడుతూ రాక్షస పాలన అని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిలో సుమారు 51 వేల మందికి ఇళ్ల పట్టాలు, 5 వేల మందికి టిడ్కో ఇళ్లు ఇవ్వటంపై జీర్ణించుకోలేక కన్నా లక్ష్మీనారాయణ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. రాజధానిలో పేదలకే ఇవ్వకూడదన్నట్లు మాట్లాడటం దారుణంగా ఉందన్నారు. మంత్రిగా పనిచేసిన నీకు రాజకీయ బిక్ష పెట్టిన రాజశేఖర్రెడ్డి కుటుంబాన్ని మరచిపోయి అధికారం కావాలని తపనతో మూడు పార్టీలు మారిన నువ్వా జగన్ గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. ఎట్లాబడితే అట్లా మాట్లాడుతున్నావు. మీకు బినామి ఆస్తులున్న అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదా వారు ఏం పాపం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే అది రాక్షస పాలన అవుతుందా? రాజకీయమంటే పేదలకు ఇళ్లు ఇవ్వటమా? ఇదేనా నువ్వు నేర్చుకున్న రాజకీయం అని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను పీఆర్కే ప్రశ్నించారు. మరోసారి రాజశేఖర్రెడ్డి, సీఎం జగన్ గురించి మాట్లాడితే పల్నాడులో తిరగవు. గుర్తుంచుకో.. నువ్వు టీడీపీలో చేరగానే అది మంచి పార్టీ అయిందా? రంగాను హత్య చేసినప్పుడు నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడింది గుర్తుందా? ఇయ్యాల వాళ్లు దేవుళ్లు.. సీఎం జగన్ రాక్షసుడా దయ్యాలు వేదాలు వల్లించినంటుంది. నువ్వు మాట్లాడే తీరు. ఇప్పటికే నీకు ప్రజలు బుద్ధి చెప్పారు. సీటు ఎక్కడొస్తుందో తెలియని నువ్వు చంద్రబాబు మెప్పు కోసం విమర్శలు చేస్తే సహించేది లేదంటూ పీఆర్కే ఘాటుగా హెచ్చరించారు. -
ఇంత‘కన్నా’ దారుణం ఉంటుందా?
నెహ్రూనగర్ (గుంటూరు తూర్పు): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. లాడ్జిసెంటర్లోని అంబేడ్కర్ విగ్రహాన్ని ఆధునీకరించి దానికి అంబేడ్కర్ సర్కిల్గా నామకరణం చేసి ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని కుల, దళిత సంఘాల నాయకులతో, అన్ని పార్టీ నాయకులను కలుపుకుంటూ శుక్రవారం ఉదయం 9 గంటలకు అధికారికంగా షెడ్యూల్ ప్రకటించారు. దీనికి సంబంధించి గురువారం సాయంత్రమే సమాచారం అందరికీ చేరవేసింది. అయితే టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ముందే వచ్చి ప్రొటోకాల్ను కాదని అంబేడ్కర్ విగ్రహానికి దండ వేస్తానని, తన అనుచరులతో కలిసి విగ్రహం వద్ద దౌర్జనం చేయసాగారు. దీన్ని ఖండిస్తూ దళిత కార్పొరేటర్ బోడపాటి ఉషారాణి భర్త వైఎస్సార్సీపీ నాయకులు బోడపాటి కిషోర్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జునలు ఉదయం 9 గంటలకు అధికారికంగా వచ్చి అంబేడ్కర్ సర్కిల్గా నామకరణం చేసి ప్రారంభిస్తారని, ఆ తరువాత దండ వేయాలని సూచించినప్పటికీ దౌర్జన్యంగా తోసుకుంటూ వెళ్లడంతో పాటు దూషిస్తూ, దాడి చేయడానికి యత్నించి భయభ్రాంతులకు గురిచేసి మరి అంబేడ్కర్ విగ్రహానికి దండ వేశారు. మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి అయి ఉండి కన్నా లక్ష్మీనారాయణ ప్రోటోకాల్ పాటించకుండా దళిత నాయకుడిని తోసేసి, దాడి చేసేందుకు ప్రయత్నించడాన్ని ఖండిస్తూ స్థానిక అరండల్పేటలో పోలీస్ స్టేషన్లో దళిత, గిరిజన కార్పొరేటర్లు కన్నాపై ఫిర్యాదు చేశారు. దళిత కార్పొరేటర్ భర్తకు క్షమాపణ చెప్పాలి దళిత కార్పొరేటర్ బోడపాటి ఉషారాణి భర్త కిషోర్పై టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ విచక్షణ కోల్పోయి దాడికి యత్నించి అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయడం చాలా బాధాకరమైన విషయమని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పేర్కొన్నారు. -
కన్నా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి.. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లాడు: మంత్రి అంబటి
-
టీడీపీలో కన్నా చేరికపై రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు
-
కన్నాను ఓడించడం గ్యారెంటీ.. నన్ను, బాబును ఎన్ని మాటలు అన్నారో!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో ఎక్కడ పోటీచేసినా ఓడించడం గ్యారెంటీ. ఆయన్ని టీడీపీలోకి తీసుకోవడం చంద్రబాబుకు తప్ప ఎవరికీ ఇష్టంలేదు. కన్నాను టీడీపీలోకి తీసుకోవడం నాకే కాదు.. సీనియర్లందరూ సిగ్గేస్తుందని అంటున్నారు’ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలం పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజుకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేనలో చేరతారనే ఊహాగానాలకు తెరదించుతూ గురువారం ఆయన సైకిల్ ఎక్కనున్నారు. ఈ నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ‘నేను చాలా అసంతృప్తితో ఉన్నా. కన్నాను పార్టీలో చేర్చుకోవడం పెద్ద తెలివి తక్కువ పని. నన్ను, చంద్రబాబును కన్నా ఎన్నేసి మాటలు అన్నాడు. పందులు, కుక్కలు, నక్కలు అంటూ వ్యక్తిగతంగా, సామాజికవర్గాన్ని దుమ్మెత్తిపోశాడు. అలాంటి వ్యక్తిని దగ్గరకు తీసుకోవడం ఏమిటి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి అవసరమని చంద్రబాబు చెబుతున్నారు. అయినా ఆయన్ను చూసి ఏమిటి భయపడేది? అతనికి ఎన్ని ఓట్లు వసా్తయి. నేను గుంటూరు లోక్సభ స్థానానికి, ఆయన పెదకూరపాడు అసెంబ్లీకి పోటీచేసినప్పుడు నాలుగైదు వేల ఓట్లు మెజార్టీ నాకే వచ్చేవి. నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఓట్లెన్ని వచ్చాయో అందరికీ తెలిసిందే’ అంటూ ఎద్దేవాచేశారు. ఏమాత్రం మంచి పద్దతి కాదు ‘పార్టీలో ఉన్న వారిని చంద్రబాబు దెబ్బతీయడం ఏమాత్రం సరికాదు. అందరి ముడ్డి కిందకు తెస్తున్నారు. అలా చేయడం తప్పు, అన్యాయం. ఇలా చేసుకుంటూ పోతే పార్టీలో ఎవరు నిలబడతారు? ఇలాగైతే నేనిక చంద్రబాబు వద్దకు వెళ్లను. ఎందుకు వెళ్లాలి? పార్టీలో మాకు టికెట్ ఇస్తామంటే తప్ప వెళ్లి కలిసేది లేదు. పార్టీలో ఇన్నేళ్లు పనిచేశా. నాకేం చేశారు? ఏమి ఇచ్చారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. నన్ను మాట్లాడవద్దన్నారు ‘చంద్రబాబు ఫోన్ చేశారు. కన్నాను తీసుకుంటున్నాం. నీతో పర్సనల్గా మాట్లాడతానన్నారు. అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫోన్ చేసి సార్ హైదరాబాద్ వెళ్లారు. వచ్చాక మీతో మాట్లాడతారు. అప్పటివరకు కన్నా గురించి ఎవరితోనూ మాట్లాడవద్దు. స్టేట్మెంట్లు ఇవ్వవద్దు అని చెప్పారు. పార్టీలో కన్నా చేరుతున్నారని ఆఫీసు నుంచి ఎవరో ఫోన్చేశారు. నేను రావడంలేదన్నాను. నేను వెళ్లను కూడా’ అని రాయపాటి చెప్పారు. 12 ఏళ్లు కోర్టులో కేసు నడిపారు ‘కన్నా నాపై 2010లో పరువు నష్టం దావా వేశారు. 12 ఏళ్లు కోర్టులో కేసు నడిపారు. రెండుసార్లు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. గత ఏడాది నవంబరు రెండో తేదీ న్యాయమూర్తి ద్వారా రాజీ చేసుకున్నారు. టీడీపీలో చేరాలనుకునే రాజీ కుదుర్చుకున్నట్లు ఉంది. చంద్రబాబుపైనా అనేక కేసులు వేశారు. ఇవన్నీ అందరికీ తెలుసు. అయినా కన్నాను పార్టీలోకి తీసుకోవడమే విచిత్రం’ అని రాయపాటి ఆవేదన వ్యక్తంచేశారు. -
బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా
-
బీజేపీకి కొత్త జాతీయ కార్యనిర్వాహక కమిటీ
సాక్షి , న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ అందుకనుగుణంగా పార్టీ కొత్త జాతీయ కార్య నిర్వాహక కమిటీని గురువారం ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించిన ఈ కమిటీలో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, గోయల్, అద్వానీ, మురళీ మనోహర్ జోషి సహా 80 మంది సభ్యులు ఉన్నారు. మంత్రివర్గంలో కొత్తగా చేరిన అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా, మీనాక్షి లేఖిలను కమిటీలోకి తీసుకున్నారు. లఖీమ్పూర్ ఘటనలో రైతులకు న్యాయం జరగాలని, కారకులకు శిక్ష పడాలంటూ సంబంధిత వీడియోను ట్వీట్చేసిన పార్టీ ఎంపీ వరుణ్ గాంధీకి కొత్త కమిటీలో చోటు దక్కలేదు. మోదీ సర్కార్ విధానాలపై విమర్శలు చేసిన మాజీ కేంద్రమంత్రి బీరేందర్ సింగ్తోపాటు వ్యవసాయ చట్టాల్లో రైతు అనుకూల వ్యాఖ్యలు చేసిన ఎంపీ మేనకాగాంధీని కమిటీ నుంచి తప్పించారు. కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు చోటు కల్పించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్రెడ్డి, వివేక్ వెంకట్స్వామి, గరికపాటి మోహన్రావులకు స్థానం లభించింది. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి ఈటల రాజేందర్, విజయశాంతిలకు అవకాశం కల్పించారు. కమిటీలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 35 మంది పార్టీ పదాధికారులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులకూ చోటు కల్పించారు. శాశ్వత ఆహ్వానితుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మాజీ సీఎంలు, జాతీయ మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. -
నిజాలు బయటకు రావట్లేదు: కన్నా ఫణీంద్ర
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సుహారిక మృతిలో అనేక అనుమానాలు ఉన్నాయంటూ ఆమె భర్త కన్నా ఫణీంద్ర సైబరాబాద్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. కార్డియాక్ అరెస్ట్తో చనిపోయిందని చెబుతున్న సుహరిక మృతిపై అనుమానం ఉందని, కేసు విచారణ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని శుక్రవారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ను కోరారు. 2020 మే 29న సుహరిక చనిపోయిన సమయంలో ఉన్న ప్రవీణ్, వివేక్, వివాస్, పవన్లతో పాటు సుహరిక తల్లి సాగరిక కూడా నిజాలు దాస్తున్నారని, వారిని మళ్లీ విచారించి న్యాయం చేయాలని సీపీకి సమర్పించిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. (‘కన్నా’ కోడలు అనుమానాస్పద మృతి) సీబీఐటీ సమీపంలోని ఫామ్ హౌస్లోనే సుహరిక చనిపోయి ఉంటుందని, అది దాచి ఏఐజీ ఆసుపత్రికి ఐదు నిమిషాల వ్యవధిలో చేరే మీనాక్షి బాంబూస్ విల్లా నంబర్ 28లో జరిగినట్టుగా చెబుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఎందుకంటే మెడికో లీగల్ కేసు రికార్డు ప్రకారం 11.30 గంటల ప్రాంతంలోనే అచేతనంలోనే ఉందని, 12.45 గంటల ప్రాంతంలోనే ఏఐజీ ఆసుపత్రికి తీసుకొచ్చారని, 1.13 గంటల ప్రాంతంలో సుహరిక చనిపోయిన విషయాన్ని తనకు చెప్పారన్నారు. సుహరిక తల్లి కూడా తన కూతురి మృతిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో రాయదుర్గం పోలీసులు కేసు విచారణ సజావుగా త్వరితగతిన సాగేలా చూడాల’ని కన్నా ఫణీంద్ర కోరారు. -
‘అభాసుపాలై పరువు పోగొట్టుకోవద్దు’
సాక్షి, విజయవాడ: అమ్మఒడి నిధులకు సంబంధించి బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అమ్మఒడి నిధులపై రాష్ట్ర బీజేపీ నేతల ఆరోపణలు సరికాదు. పరిజ్ఞాన లోపంతో కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్రెడ్డి ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్లోని అమ్మఒడి లబ్దిదారులకి రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు కేటాయించారు. ఆలయాల హుండీలు, భక్తుల కానుకల నుంచి నిధులిచ్చారనటం అవివేకం. బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖలో భాగం అయినంత మాత్రాన నిందలు సరికాదు. సమగ్ర సమాచారం తెలుసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. అరకొర సమాచారంతో మాట్లాడి అభాసుపాలై మరోసారి పరువు పోగొట్టుకోవద్దు' అంటూ బీజేపీ నాయకులకు మల్లాది విష్ణు సూచించారు. (ఓటేసిన జనమే టీడీపీ ఎమ్మెల్యేని ఛీ కొట్టారు..) -
అచ్చెన్న అరెస్ట్ను సమర్థించిన బీజేపీ..
సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ను బీజేపీ సమర్థించింది. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ పాలనలో భారీగా అవినీతి జరిగిందన్నారు. అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందే వైఎస్ జగన్ చెప్పారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. (‘చంద్రబాబు, లోకేష్ జైలుకెళ్లక తప్పదు’) శిక్ష అనుభవించాల్సిందే.. విజయవాడ: ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర రుజువైందని బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా అన్నారు. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన సొమ్మును అచ్చెన్నాయుడు నుంచి రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈఎస్ఐ స్కాం విషయంలో ప్రధానిమంత్రి మీద కూడా అచ్చెన్నాయుడు గతంలో బురద చల్లారని గుర్తుచేశారు. ఈఎస్ఐ స్కాంలో ప్రధాని పేరు ప్రస్తావిస్తే సహించేది లేదన్నారు. అచ్చెన్నాయుడును కిడ్నాప్ చేశారని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడుని ఇంటికెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఈఎస్ఐ స్కాంలో అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు కూడా ధ్రువీకరించారని లక్ష్మీపతి రాజా పేర్కొన్నారు. (అచ్చెన్న అరెస్ట్.. చంద్రబాబు కొత్త డ్రామా) అచ్చెన్నాయుడు అరెస్ట్ సబబే.. తూర్పుగోదావరి: టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ సబబేనని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ప్రతి పక్షనేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బీసీలందరూ బయటకు వచ్చి నిరసన తెలపాలని ఆయన మాట్లాడటం దారుణమని సోము వీర్రాజు పేర్కొన్నారు. -
రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదు
-
ఏపీ బీజేపీ నేతలకు హైకమాండ్ ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదని, లోతైన అధ్యయనం లేకుండా ఆరోపణలు చేయరాదని ఏపీ బీజేపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. బుధవారం ఆయన ఏపీ బీజేపీ ఎంపీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ అమలు చేస్తున్న ‘ఫీడ్ ద నీడ్’ అనే కార్యక్రమంపై సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి రాకుండా అందరికీ అవసరమైన సాయం చేయాలన్నారు. బీజేపీ యంత్రాంగం పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు చేసిన విమర్శలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇకపై పార్టీ నేతలు ఏ ఆరోపణలు అయినా చేసే ముందు అందుకు సంబంధించి వివరాలు, ఆధారాలు కేంద్ర పార్టీకి అందజేయాలని.. జాతీయ నాయకత్వం ఆమోదిస్తేనే ఆరోపణలు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ఏపీలో బీజేపీ స్వతంత్ర ప్రతిపక్షంగా వ్యవహరించాలని, టీడీపీ, వైఎస్సార్సీపీతో సమదూరం పాటించాలని ఆదేశించినట్టు సమాచారం. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే విమర్శలా! బీజేపీ అధికార ప్రతినిధి పురిగళ్ల రఘురాం అమరావతి: కరోనా వైరస్ కారణంగా రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు సలహాలు ఇవ్వడం మాని విమర్శలు గుప్పించడం బాధాకరమని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పురిగళ్ల రఘురాం పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో కూర్చుని లేఖలు రాస్తూ కాలయాపన చేస్తున్నారు. తమ శాసన సభ్యులను బాబు 12 గంటల పాటు నిరాహార దీక్షలు చేయమని చెప్పారే తప్ప.. పేద ప్రజలను ఆదుకోమని చెప్పక పోవడం దురదృష్టకరం. సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా వైరస్, ఆర్థిక పరిస్థితులపై సూచనలు, సలహాలు ఇవ్వకుండా దిక్కుమాలిన విమర్శలకు దిగటం ఆయన రాజకీయ జీవితంపై అసహ్యం వచ్చే విధంగా ఉంది. రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసి కరోనాపై పోరాడాల్సిన సమయమమిది. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలను సమన్వయం చేస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.’ అని అన్నారు. -
బాబు డైరెక్షన్ కన్నా యాక్షన్
-
కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా?
సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ఇమేజ్ పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగకపోవడానికి చంద్రబాబుకు అమ్ముడుపోయిన కన్నా లాంటివారే కారణమని’ సోమవారం ట్వీట్ చేశారు. ‘బాబు ప్యాకేజీ ఆఫర్ అవసాన దశలో ఉన్నవారినీ లేపి కూర్చోపెడుతుంది. మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారు... కన్నాలాంటి జంబూకాలను వదిలించుకోవాలి’ అని సూచించారు. ‘మళ్లీ అడుగుతున్నా...కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా? టీజేపీ (టీడీపీ జాకాల్స్ పార్టీ) వారు కాకుండా బీజేపీ వారు నా మీద విమర్శలు చేస్తే సమాధానం ఇస్తా.’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. (‘అధికారం కోల్పోయినా.. సీఎం అనే భ్రమలోనే..’) చదవండి: ‘మనవడితో ఆడుకోక.. ఈ చిటికెలెందుకు? -
14 ఏళ్లు సీఎంగా చేసిన అనుభవం ఇదేనా?
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఎలా బయటపడాలి అని అన్ని దేశాలు ఆందోళన చెందుతున్న ఇటువంటి సంక్షోభ సమయంలోనూ చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం తాపత్రయం పడటం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైరస్ భయంతో ప్రజలు తల్లడిల్లుతున్న సమయంలో చంద్రబాబు రాష్ట్రం వదిలి హైదరాబాద్లో కూర్చుని లేఖల పేరుతో ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. లాక్డౌన్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకున్నా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆగలేదని అంబటి తెలిపారు. పేదలకు రూ.1,000 పంచితే దానిపై కూడా బాబు రాజకీయ విమర్శలు దారుణమన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా తిరస్కరించినా బాబుకు బుద్ధిరాలేదని ధ్వజమెత్తారు. ఆ 1,000 రూపాయాలు కేంద్రం ఇచ్చినది కాదన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన బాబు సాధించిన అనుభవం ఇదేనా అని మండిపడ్డారు. విపత్కర సమయంలో ఏ నాయకుడైనా ప్రజలకు అండగా ఉంటారా, రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతారా అని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన తర్వాతే జీతం వాయిదా రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిస్థితిని అర్థం చేసుకుని ఉద్యోగులు సమ్మతించినా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. ► సీఎం వైఎస్ జగన్పై విమర్శలు చేస్తే ప్రజలు బాబును క్షమించరు. తెలంగాణ సీఎం కేసీఆర్కు చంద్రబాబు లేఖలు ఎందుకు రాయడం లేదన్నారు. ఒకవేళ కేసీఆర్కు లేఖ రాస్తే క్వారంటైన్లో పెడుతారేమోనని భయపడుతున్నారా అని ప్రశ్నించారు. ► బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ చెప్పినట్లు చేయడం కాదు. కేంద్రం నుంచి నిధులు తెప్పించాలి. అంతేగాని మాపై రాళ్లు వేస్తే ఆ పార్టీకి ప్రయోజనం ఉండదు. ► ఇప్పటికైనా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రానికి బాబు లేఖలు రాయాలి. లేకుంటే ప్రజలు బాబును రాజకీయాల నుంచి నిష్క్రమించే వరకు తీసుకువెళ్తారు. -
‘ఆ వీడియో ఎక్కడిదో బయటపెట్టాలి’
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ను ఎదుర్కునేందుకు దేశమంతా సంఘటితంగా పోరాడుతుంటే.. టీడీపీ నేతలు మాత్రం రాజకీయ విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ విధానాలు ఒకేలా ఉన్నాయని విమర్శించారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి 33 లక్షల మందికి రూ.1000 అందిస్తే.. దాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. రూ.1000 పంపిణీలు అవినీతి జరిగినట్లు చూపిస్తే ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందన్నారు. రూ. 1000 ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నట్లుగా కన్నా లక్ష్మీనారాయణ ఓ వీడియో పెట్టారని.. చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఎక్కడిదో బయటపెట్టాలని సవాల్ విసిరారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు కింద కేంద్రం నిధులు విడుదల చేసిందన్నారు. ఏపీతో పాటు 13 రాష్ట్రాలకు ఆ నిధులు విడుదలయ్యాయని, అంతేకాని ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిదేమీ లేదని ఆరోపించారు. -
‘ఆ విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి’
సాక్షి, అమరావతి : ‘వెల్లంపల్లి- ఊసరవెల్లి’ అంటూ బీజేపీ చేసిన ట్వీట్కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మించిన రాజకీయ ఊసరవెల్లి ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ఒక వేలు ఇతరుల వైపు చూపిస్తే నాలుగు వేళ్లు నీ వైపు చూపిస్తాయన్న విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీటర్ వేదికగా రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుపడ్డారు. ‘2009లో మంత్రిగా పనిచేసి..2014లో బీజేపీలో చేరి..2018లో వైఎస్సార్సీపీలోకి చేరడానికి సర్వం సిద్ధం చేసుకొని గుండెపోటు డ్రామాలత్బో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకున్న మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కంటే రాజకీయ ఊసరవెల్లి ఎవరైనా ఉంటారా? గోదావరి-కృష్ణా పుష్కరాలలో వేల కోట్లను దోచి, వందల దేవాలయాలను కూల్చిన మీకు, మీ పార్టీ అధ్యక్షుడు కన్నాకు హిందూ దేవాలయాల గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అమరేశ్వరం ఆలయానికి చెందిన భూములను భూబకాసురుల నుంచి కాపాడింది అప్పటి ప్రతిపక్షనేత, ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారే. దేవాలయ భూములు పరిరక్షణ విషయంతో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. దేవుడిని, హిందూ ధర్మాన్ని ఓట్ల రాజకీయం కోసం వాడుకునే మీకు దేవుడు తగిన శిక్ష వేస్తాడు’ అని మంత్రి వెల్లంపల్లి ట్వీట్ చేశారు. -
సొంత అజెండాతో సుజనా,కన్నా
-
టీడీపీకి యామిని గుడ్ బై!
సాక్షి, గుంటూరు : ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీడీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు బీజేపీ చేరారు. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని కూడా టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. యామిని బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను యామిని కలిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఆమె బీజేపీలో చేరనున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. గత ఎన్నికల సమయంలో సాధినేని యామిని సోషల్ మీడియాలో టీడీపీ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆమె సోషల్ మీడియాలో పోస్టులను తగ్గిస్తూ వచ్చారు. పలు సందర్భాల్లో ఆమె చేసిన పోస్టులు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. -
‘ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరడం లేదు’
సాక్షి, విజయనగరం : టీడీపీ ఎంపీలపై ఉన్నది కేవలం ఆరోపణలు మాత్రమే.. అవి నిజం కావాలని లేదు కదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2014 ముందు వరకూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉండేది.. కానీ ఇప్పుడు 12 కోట్ల సభ్యత్వాలతో బీజేపీ అతి పెద్ద రాజకీయ పార్టీగా మారిందన్నారు. ఆగస్టు 11 వరకూ బీజేపీ సభ్యత్వ నమోదు జరుగుతుందని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ ఎన్డీఏకు పట్టం కట్టేలా చేశాయన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వం నచ్చి, మెచ్చి, ఢిల్లీ నుంచి గల్లీ వరకూ చేరికలు జరుగుతున్నాయన్నారు. ఆర్థిక సంస్థల దాడులను ప్రశ్నించడం దౌర్భాగ్యం అన్నారు కన్నా. బీజేపీని అనడం సరి కాదు : పురంధరేశ్వరి కర్ణాకటలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి బీజేపీని బాధ్యులని చేయడం సరికాదన్నారు కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి. కాంగ్రెస్ నన్ను క్లర్క్ కన్నా హీనంగా చూస్తుందని అనేక సందర్భాల్లో కుమార్ స్వామి స్వయంగా ఆవేదన వ్యక్తం చేయడం నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత సంక్షోభానికి కాంగ్రెస్-జేడీఎస్ అంతర్గత విబేధాలే కారణం అన్నారు. -
హాయ్ల్యాండ్లో రెండోరోజు బీజేపీ నేతల భేటీ
సాక్షి, గుంటూరు : మంగళగిరి హాయ్ల్యాండ్లో శనివారం ఏపీ బీజేపీ ముఖ్యనేతల సమావేశం రెండో రోజు జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే సుమారు 75 మంది కీలక నేతల చేరికపై సమావేశంలో చర్చించనునారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ, పురందరేశ్వరి, జీవీఎల్, వి మురళీదరన్, సోము వీర్రాజు, సతీష్ జి, సునీల్ దియోదర్ పాల్గొన్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలు, సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. జమిలీ ఎన్నికలు వస్తే సన్నద్దతపై చర్చించారు. నేడు మూడు గంటలకు తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. -
కేంద్ర పథకాలను జన్మభూమి కమిటీలు దోచుకున్నాయి
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి కులం, మతం రంగు పూయాలని చాలా మంది ప్రయత్నించారన్నారు. కానీ కులమతాలకతీతంగా పార్టీలో చేరికలు జరుగుతున్నాయన్నారు. ఇందిరా గాంధీ టైంలో గరీబీ హఠావో తప్ప ఇంకే పథకం లేదన్నారు. మోదీ టీ అమ్ముకునే స్థాయి నుంచి వచ్చారని.. బీజేపీలో నాయకులందరూ కింది స్థాయి నుంచి వచ్చారని.. ప్రజల కష్టసుఖాలు బాగా తెలుసని కన్నా పేర్కొన్నారు. దేశంలో ప్రజలు మోదీ పాలనను కోరుకుంటున్నారన్నారు. -
హాయ్ల్యాండ్లో బీజేపీ నేతల సమావేశం
సాక్షి, గుంటూరు : మంగళగిరి హాయ్ల్యాండ్లో శనివారం ఏపీ బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఇతర పార్టీల నుంచి వచ్చే సుమారు 75 మంది కీలక నేతల చేరికపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ, పురందరేశ్వరి, జీవీఎల్, వి మురళీదరన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ.. భారత్ మాతా కీ జై అనే పలికి.. దేశం కోసం పని చేసే కార్యకర్తలున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెసేతర ప్రభుత్వం.. ఇందిరా గాంధీ తరహా పూర్తి స్థాయి మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ అని మురళీధర్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరి తరం కాదన్నారు మురళీధర్ రావు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు.. ఇక టీఆర్ఎస్ను వ్యతిరేకించే వారికి బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు. బీజేపీకి 11 కోట్ల మందితో సభ్యత్వం ఉందని.. ప్రపంచంలో ఏ పార్టీకి ఇంత భారీ సభ్యత్వం లేదన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తేడా లేదని.. రెండూ కాళ్లు పట్టుకునే పార్టీలే అని విమర్శంచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు వచ్చే నెల జూలై 6 నుంచి ఆగస్టు11 వరకూ సంఘటనా పర్వత్ పేరుతో సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. -
‘అక్రమ కట్టడాలు కూల్చితే మాకేం అభ్యంతరం లేదు’
సాక్షి, అమరావతి : అక్రమ కట్టడాలన్నింటి కూల్చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన మంచిదే అన్నారు. కరువు ప్రాంతాల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చే దిశగా చర్చలు జరగాలని కోరుకున్నారు. కేసులున్నవారే బీజేపీలో చేరుతున్నారనడం సరి కాదన్నారు. నిందితుల విషయంలో చట్టం తన పని చేసుకుపోతుందని తెలిపారు. పార్టీ ఫిరాయింపులుపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయంపై తానేమి స్పందించనన్నారు. -
సీఎం జగన్కు ఏడు లేఖలు రాసిన కన్నా
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం హయాంలో చోటుచేసుకున్న పలు అక్రమాలు, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా పోలవరం ముంపు వల్ల నష్టపోతున్న గిరిజనులను అన్ని విధాలా ఆదుకోవాలని విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూములపై విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేయాలని సూచించారు. ప్రభుత్వ దేవాలయాల ఆస్తులు పరిరక్షించాలని విఙ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్ స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. అదే విధంగా విజయవాడలో కూల్చేసిన 50 ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన.. ముఖ్యమంత్రికి ఏడు లేఖలు రాశారు. -
ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు
-
‘14.6 కోట్ల మంది రైతులకు లబ్ది’
సాక్షి, గుంటూరు : దేశాభివృద్ధికై గత ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ పడిన కష్టాన్ని గుర్తించిన ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అఖండ విజయం సాధించిన ప్రధాని మోదీ మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి(పీఎంకేఎస్ఎస్) పథకం ద్వారా రూ. 14.5 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో క్యాడర్ను బలోపేతం చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సర్పంచ్ నుంచి జడ్పీటీసీల వరకు కొత్త వారిని చేర్చుకుని..ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. అయితే కోర్ కమిటీతో చర్చించిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎంగా పనిచేసిన చంద్రబాబు గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం పాటు పడలేదని విమర్శించారు. ఇతరులతో గొడవలు పెట్టుకోవడం తప్ప ఆయన చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ వల్ల అభివృద్ధి ఆగిపోతుందన్నది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు -
ఫలితాల అనంతరం టీడీపీని కాంగ్రెస్లో విలీనం
-
‘అందుకే బాబు.. నీ సీటు మారుస్తున్నారు’
సాక్షి, అమరావతి : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ యావంతా దుస్తులు మార్చడంపైనే ఉంది కానీ దేశంపై లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. నరేంద్ర మోదీ గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం ఊసరవెల్లి కంటే ఘోరంగా రంగులు మారుస్తారని ఎద్దేవా చేశారు. నిమిషానికో మాట మారస్తూ నిజాయితీగా ఉన్న అధికారుల సీటు మారుస్తారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొని వాళ్ల పార్టీ మార్చారని, అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు సీటుని మారుస్తున్నారని ట్విట్ చేశారు. మోదీ గారు గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదుగానీ.. నువ్వు మాత్రం ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మారుస్తావ్. నిమిషానికి ఒక మాట మారుస్తావ్. నిజాయితీగా ఉండే అధికారుల సీటు మారుస్తావ్. ఎమ్మెల్యేలను కొని వాళ్ళ పార్టీ మారుస్తావ్. అందుకే ప్రజలు ఈ ఎన్నికలలో నీ సీట్ మారుస్తున్నారు. @ncbn pic.twitter.com/sVV0SWrC6E — Chowkidar Kanna Lakshmi Narayana (@klnbjp) May 2, 2019 -
చంద్రబాబు ఇప్పుడు ఈ ఏడుపు ఏంటి?
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్ వేదికగా మరోసారి విమర్శస్త్రాలు సంధించారు. ’చంద్రబాబు...! అసలు ఈవీఎం కనిపెట్టమని చెప్పిందే నువ్వు కదా!. వీవీ ప్యాట్లో ఎవరికి ఓటు పడిందో చూసి కూడా ఇప్పుడు ఈ ఏడుపు ఏంటి?. ఓటమిని హుందాగా స్వీకరించలేని నీ గోల ప్రజలు పట్టించుకోవడం లేదని గ్రహించు. ఇక పచ్చ మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టించలేవు. ప్రజలే నిన్ను సాగనంపడానికి బాధ్యతగా ఓటు వేశారు.’ అంటూ ఆయన శనివారం ట్వీట్ చేశారు. ‘యూ టర్న్ బాబు, ఈవీఎంల విషయంలో ఆడలేక మద్దెల ఓడు లాగా ఉంది నీ వ్యవహారం.. సిగ్గు లేకుండా అవినీతి చేసి బుకాయించడం, రాజ్యాంగ సంస్థల పట్ల నమ్మకం లేకపోవడం, గుడ్డ కాల్చి పక్కన వాళ్లమీద వేయడం, ఎన్నికల అయిపోయినా ఇంకా ఎవరిని మభ్యపెట్టేందుకు ఈ పిచ్చి వేషాలు. ఓటమి భయం నిన్ను మరింత దిగజారేలా చేస్తోంది.’ అంటూ చంద్రబాబుపై కన్నా మండిపడ్డారు. చంద్రబాబు.! అసలు EVM కనిపెట్టమని చెప్పిందే నువ్వు కదా! VVPATలో ఎవరికి ఓటు పడిందో చూసి కూడా ఇప్పుడు ఈ ఏడుపు ఏంటి? ఓటమిని హుందాగా స్వీకరించలేని నీ గోల ప్రజలు పట్టించుకొవడం లేదని గ్రహించు.. ఇక పచ్చ మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టించలేవు.ప్రజలే నిన్ను సాగనంపడానికి బాధ్యతగా ఓటు వేశారు. pic.twitter.com/bzAcIcford — Chowkidar Kanna Lakshmi Narayana (@klnbjp) 13 April 2019 కాగా ఒక గుర్తుకు ఓటేస్తే మరో గుర్తుకు వెళ్తోందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈసీ పూర్తిగా విఫలం అయ్యిందంటూ ఆయన ఆరోపణలు కూడా చేశారు. దీనిపై చంద్రబాబు ఇవాళ సీఈసీకి 18 పేజీలతో కూడిన లేఖను సమర్పించారు. -
అంబులెన్స్లలో డబ్బులను తరలిస్తున్నారు
-
చంద్రబాబు వీరితోనా నీ ప్రచారం..? : కన్నా
సాక్షి, అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. అధికారం కోసం వేర్పాటువాద, అరాచక నాయకులతో చేతులు కలుపుతావా చంద్రబాబు? అంటూ ట్వీట్ చేశారు. వేర్పాటువాద ఫారూఖ్ అబ్దుల్లా, అబద్ధాల ఆరవింద్ కేజ్రివాల్, అరాచక రాజకీయ హత్యలతో మమతా..వీరితోనా నీ ప్రచారం..? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీరితో రాజకీయ పొత్తులు పెట్టుకుని నీ స్థాయి మరింత దిగజారిపోయింది అని నిప్పులు చెరిగారు. వినాశ కాలే విపరీత బుద్ధి: అధికారం కోసం వేర్పాటువాద, అరాచక నాయకులతో చేతులు కలుపుతావా చంద్రబాబు? వేర్పాటువాద ఫారూఖ్ అబ్దుల్లా,అబద్ధాల ఆరవింద్ కేజ్రివాల్,అరాచక రాజకీయ హత్యలతో మమతా.. వీరితోనా నీ ప్రచారం..? వీరితో రాజకీయ పొత్తులు పెట్టుకుని నీ స్థాయి మరింత దిగజారిపోయింది. pic.twitter.com/u5ONgLJcHI — Chowkidar Kanna Lakshmi Narayana (@klnbjp) April 3, 2019 -
ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు: కన్నా
సాక్షి, అమరావతి : ‘అధికారం టీడీపీదే’ అనే జోక్ని ప్రచురించి మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతి పత్రికకు ధన్యవాదాలంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. ఏపీలో అధికారం టీడీపీదే అని లోక్నీతి సర్వే పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ లక్ష్మీనారాయణ వ్యంగ్యంగా.. ఆంధ్రజ్యోతిని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఒకప్పుడు తెలుగు పత్రికలు ఫూల్స్ డే నాడు హాస్యాస్పద కథనాలు ప్రచురించేవని తెలిపారు. అయితే గత కొంతకాలంగా ఈ సంప్రదాయం కనిపించడం లేదని.. కానీ ఆంధ్రజ్యోతి తిరిగి ప్రారంభించిందన్నారు. ‘అధికారం టీడీపీదే’ అనే తప్పుడు కథనంతో ఏప్రిల్ 1న నాడు మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు అంటూ కన్నా ట్వీట్ చేశారు. గతంలో తెలుగు పత్రికలు ఏప్రిల్ 1st ఫూల్స్ డే నాడు హాస్యాస్పదంగా కథనాలు వేసేవారు.. ఎందుకో మిగతా పత్రికలు ఆ సంప్రదాయం ఆపేసాయి.. కానీ నేటి ఆంధ్రజ్యోతి "అధికారం టీడీపీదే" అని ఏప్రిల్ 1st నాడు నవ్వులు పూయించింది.. జోక్ ని ప్రచరించి మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు. pic.twitter.com/MUe1L88FNP — Chowkidar Kanna Lakshmi Narayana (@klnbjp) April 1, 2019 ఇదిలా ఉండగా ఏపీలో టీడీపీకే అత్యధిక స్థానాలు వస్తాయంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే దీనిని ఎస్డీఎస్ లోక్నీతి సర్వే సంస్థ తీవ్రంగా ఖండించింది. తమ అనుమతి లేకుండా సంస్థ పేరును ప్రచురించినందుకు సంబంధిత పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. (చదవండి: అడ్డంగా దొరికిన ఆంధ్రజ్యోతి..!) -
బాబూ లీకేష్.. అఫిడవిట్లో కాపీనేనా?
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల ఎన్నికల ప్రచారంలో నోరు జారి పప్పులో కాలేసిన మంత్రి నారా లోకేష్... ఎన్నికల అఫిడవిట్లోనూ తప్పు చేసి నవ్వుల పాలయ్యారు. అఫడవిట్లో భర్తపేరు దగ్గర తండ్రి పేరు రాసి ఇచ్చారని, తండ్రి చంద్రబాబు నాయుడు అఫిడవిట్ను కాపీ చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్ వేదికగా విమర్శించారు. ‘బాబు లీకేష్, "ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?" అనే సామేత నిజంచేశావ్. నువ్వు అవినీతిలో డాడీకి కాపీ.! తెలివిలో డాడీకి కలర్ జిరాక్స్ అనుకున్నాం.. కానీ ఆఖరికి అఫిడవిట్ లోనూ కాపీనేనా!? ఇద్దరికి అఫిడవిట్ సరిగ్గా వేయడం రాదు కానీ అమరావతిని అమెరికా చేస్తా అని కేఏ పాల్ కబుర్ల చెబుతారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఈ అఫిడవిట్ కాపీలు సోషల్ మీడియాలో తెగహల్చల్ చేస్తున్నాయి. ‘ఇది మా కర్మరా.!’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి : నోరు జారిన లోకేశ్.. ఆర్కే సెటైర్! బాబు లీకేష్, "ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?" అనే సామేత నిజంచేశావ్. నువ్వు అవినీతిలో డాడీకి కాపీ.! తెలివిలో డాడీకి కలర్ జిరాక్స్ అనుకున్నాం కానీ ఆఖరికి అఫిడవిట్ లోనూ కాపీనేనా!? ఇద్దరికి అఫిడవిట్ సరిగ్గా వేయడం రాదు కానీ అమరావతిని అమెరికా చేస్తా అని KA పాల్ కబుర్ల చెబుతారు pic.twitter.com/v4vLPCAUkV — Chowkidar Kanna Lakshmi Narayana (@klnbjp) March 23, 2019 -
మేమంతా చంద్రబాబు తీరు చూసి నవ్వుకొనేవాళ్లం..
అవినీతి సొమ్ము వెదజల్లి ప్రజల తీర్పును కొనుక్కోలేరు. ఈ నిజాన్ని చంద్రబాబు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. చంద్రబాబు స్వభావమే అంత. ఏదో ఒక ఆధారం చూసుకొని ఎన్నికలు గట్టెక్కాలని చూస్తారు. 2004లో అవినీతి సొమ్ము, బాకా ఊదే మీడియా చంద్రబాబును రక్షించలేకపోయాయి. ఇప్పుడూ అంతే. అవేమీ రక్షించలేవు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. అవినీతి, అరాచక ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారు.రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ♦ ‘చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళుతున్నారని ఎవరన్నారు? అడ్డంగా దోచేసిన రూ.వేల కోట్ల అవినీతి సొమ్ము ఆయనకు తోడుంది. మసిపూసి మారేడుకాయచేసి చూపించే మీడియా అండగా ఉంది. మరి ఒంటరిఅని ఎలా అనగలం?’ ♦ ‘చంద్రబాబును మళ్లీ నమ్మితే రాష్ట్రాన్ని భగవంతుడు కూడా రక్షించలేడు. మళ్లీ వస్తే జరిగే అవినీతి, అరాచకం అంచనాల కందదు’ ♦ ‘బాబుకు, వైఎస్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది.. వైఎస్ ప్రజల మనిషి’ ♦ ‘కాపీ కొట్టడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. వైఎస్ ప్రకటించే పథకాలను ముందుగానే తెలసుకొని ప్రతిపక్ష నేతగా ఉన్న బాబు అవన్నీ కావాలని డిమాండ్ చేసేవారు. ‘‘నేను డిమాండ్ చేశాను.. ప్రభుత్వం ఇచ్చింది’’ అని చెప్పేవారు’ ♦ ‘2014లో తల్లి కాంగ్రెస్.. పిల్ల కాంగ్రెస్ అన్నారు. జగన్కు ఓటేస్తే కాంగ్రెస్కు ఓటేసినట్లే అన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ చంకలో చంద్రబాబు దూరారు’ ♦ ‘గత ఎన్నికల్లో మోదీ ఇమేజితో ఎన్నికలు గట్టెక్కారు. ఇప్పుడు అదే బీజేపీని బూచిగా చూపిస్తున్నారు. జగన్కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. జగన్ ఓటు బ్యాంకును చీల్చడానికి బాబు చేస్తున్న కుట్ర ఇది’ అని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఏ గాలికి ఆ చాప ఎత్తడం బాబు నైజం 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీని వాడుకొని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఎన్డీఏలోనే ఉంటూ మోదీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 2015 బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనే బాబు చేస్తున్న కుటిలయత్నాలను చెప్పాను. చంద్రబాబు తెలివితేటలన్నీ మాకు తెలుసు. 30 ఏళ్లుగా అతన్ని చూస్తున్నాం. స్వయం ప్రకటిత మేధావి చలసాని శ్రీనివాస్, సినిమా యాక్టర్ శివాజీ ద్వారా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడించారు. నాలుగేళ్లకుపైగా బీజేపీతో ఉండి, ఎన్నికలకు ఏడాది ముందు మోదీకి వ్యతిరేకంగా పాట అందుకున్నారు. ఏ గాలికి ఆ చాప ఎత్తడం బాబుకు అలవాటే. బాబు పాలనలో అభివృద్ధి ఊసే లేదు దేశంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయి. అవినీతి చేయడానికి అవకాశం లేని పథకాల కింద ఇచ్చిన నిధులను తీసుకోవడానికి చంద్రబాబు ఇష్టపడలేదు. కొన్ని నిధులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వడానికి ఇష్టం లేక కొన్ని నిధులను తీసుకోలేకపోయారు. భారీగా నిధులు తీసుకున్న పథకాల్లో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారు. ఈ 5 సంవత్సరాల్లో తాను ఇది చేశానని చెప్పడానికి చంద్రబాబుకు ఏమీ లేదు. అవినీతి, అరాచకం తప్ప.. ఈ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఏమీ చేయలేదు. ఈ ఎన్నికల్లో లబ్ధికోసం కేంద్రం నిధులు ఇవ్వలేదని, అభివృద్ధి జరగకపోవడానికి బీజేపీనే కారణమని దోషిగా నిలబట్టి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రాజధానిని దోపిడీ కేంద్రంగా మార్చారు గుంటూరు జిల్లా ప్రజల త్యాగం దోపిడీకి గురైంది. మూడు పంటలు పండే 53 వేల ఎకరాలు తీసుకొని రాజధానిని దోపిడీ కేంద్రంగా మార్చుకొని లూటీ చేశారు. పర్యావరణాన్ని గాలికి వదిలి లక్షల మంది ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారు. కృష్ణా నదిలో ఇసుక తోడి రాజధాని ప్రాంతాన్ని మెరక చేస్తున్నారు. సీఎం కుర్చీ ఎక్కగానే హామీలు మరచిపోయారు 2014లో అడ్డమైన హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. సీఎం కుర్చీ ఎక్కగానే హామీలు మరిచిపోయారు. రుణమాఫీ చేయలేదు. బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని ఎన్నికల్లో చెప్పారు. బాబు సీఎం అయిన తర్వాత బంగారు నగలన్నీ బ్యాంకులు వేలం వేశాయి. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు. ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ముందున్న ఒకేఒక మార్గం... ప్రజల సొమ్ముతో ఓట్లు కొనుక్కోవడం. 2019 జనవరి తర్వాత.. ఉన్నట్లుండి సంక్షేమ పథకాలు గుర్చొచ్చాయి. ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని గుర్తుపెట్టుకోండి. గత ఎన్నికల్లో ఇచ్చిన ఇచ్చిన హామీలను మరిచిపోయారు. చంద్రబాబు మళ్లీ వస్తే అవినీతి, అరాచకం.. అంచనాలకు అందదు. నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా వైఎస్ ప్రజల మనిషి. వైఎస్తో చంద్రబాబుకు పోలికా! నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది ఇద్దరికీ. మరో మాట అక్కర్లేదు. అవినీతి కోణాలెన్నో రాజధానిలో చూశా రాజధాని గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు నేను స్వాగతించాను. సంతోషించాను. కానీ.. చంద్రబాబు, ఆయన మనుషులు, మంత్రులు, అధికార పార్టీ నాయకులు రాజధానిని బంగారు బాతుగా మార్చుకున్నారు. వరదలు వస్తే గుంటూరు, కృష్ణా జిల్లాలకు ప్రాణ, ఆస్తి నష్టం ఎంత జరుగుతుందో అంచనా వేయలేం. రాజధాని కుంభకోణాలు ఒకటీరెండూ కాదు. దోపిడీలో వినూత్న కార్యక్రమం అది. గుంటూరుకు రాజధాని వచ్చిందని సంతోషించాలో, దోపిడీ–పర్యావరణ విధ్వంసం గురించి బాధపడాలో ప్రజలకు అర్థం కావడం లేదు. జగన్ ఓటు బ్యాంకును దెబ్బతీయాలనే కుట్ర దీని వెనుక జగన్ ఓటు బ్యాంకును దెబ్బతీయాలనే కుట్ర దాగి ఉంది. మైనార్టీ ఓట్లు జగన్కు రాకుండా చేయడానికి చంద్రబాబు ఈ కుట్రను అమలు చేస్తున్నారు. దానికి ఆయన అనుకూల మీడియా తందానా అంటోంది. టీడీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోందో ఆరు నెలల క్రితం నేనే చెప్పాను. నాలుగున్నర సంవత్సరాలలో చంద్రబాబు అవినీతి తప్ప అభివృద్ధి చేయలేదని వెల్లడించాను. 2019 ఎన్నికల అజెండాగా ‘బీజేపీ బూచి’గా ఎంపిక చేసుకుంటారని చెప్పాను. ఇప్పుడు ఎన్నికలొచ్చాయి. నేను ఆరు నెలల క్రితం చెప్పిన దానికి, ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా? చంద్రబాబు కుయుక్తులన్నీ నాకు తెలుసు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ‘తల్లి కాంగ్రెస్... పిల్ల కాంగ్రెస్’ అన్నారు. జగన్కు ఓటేస్తే తల్లి కాంగ్రెస్కు ఓటేసినట్లేనని ప్రచారం చేసి లబ్ధి పొందారు. తల్లి కాంగ్రెస్కు.. జగన్కు సంబంధం లేదని చంద్రబాబుకు తెలియని విషయం కాదు. ఇప్పుడేమో.. అదే తల్లి కాంగ్రెస్ చంకలో చంద్రబాబు దూరారు. చంద్రబాబు నైజమే అంత. ఏదో ఒకదాన్ని బూచిగా చూపించాల్సిందే తప్ప.. తాను ఏం చేశాడో ఎప్పుడూ చెప్పరు. తన గురించి ఎన్నికల్లో చెబితే ప్రజలు ఛీకొడతారని ఆయనకు స్పష్టంగా తెలుసు. బాబుకు అండగా అవినీతి సొమ్ము రాష్ట్రంలో అడ్డంగా దోచేసిన రూ.వేల కోట్ల అవినీతి సొమ్ము ఆయనకు అండగా ఉంది. చంద్రబాబు ఒంటరిగా వెళుతున్నారని ఎవరు చెప్పారు? ఈ ఎన్నికల్లో డబ్బును వెదజల్లి గట్టెక్కగలననే నమ్మకంతో చంద్రబాబు ఎన్నికలకు వెళుతున్నారు. చంద్రబాబు నంది అంటే నంది అని, పంది అంటే పంది అని ప్రచారం చేసి.. తిమ్మిని బమ్మిని చేయడానికి బాకా ఊదే పత్రికలు, టీవీలు ఆయనకు తోడుగా ఉన్నాయి. అడ్డంగా రాష్ట్రాన్ని దోచేసినా, అవినీతిని విచ్చలవిడిగా చేసినా, అడ్డమైన పనులు చేసినా.. ఆ మీడియా అండగా ఉంది. అవన్నీ తోడుగా ఉంటే.. చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళుతున్నారని ఎలా అనగలం? జగన్ పథకాలు కాపీ కొడుతున్నారు కాపీ కొట్టడం చంద్రబాబు రక్తంలోనే ఉంది. మూడు దశాబ్దాలుగా ఆయన్ను చూసిన వాడిగా చెబుతున్నా. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ అంతే. ప్రభుత్వం ప్రకటించే పథకాలు, కార్యక్రమాలను ముందుగా తెలుసుకునేవాడు. అలా తెలుసుకోవడానికి చంద్రబాబు మనుషులు కొద్ది మంది ప్రభుత్వంలో ఏదో స్థాయిలో ఉండేవారు. ఆ పథకంలో ఉన్న వాటిని ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసే వారు. తీరా వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాన్ని ప్రకటించగానే.. ‘నేను డిమాండ్ చేశాను ముందే, ప్రభుత్వం దిగొచ్చి ప్రకటించింది’ అని చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పేవారు. మేమంతా బాబు తీరు చూసి నవ్వుకొనేవాళ్లం. ఇప్పుడు జగన్ నవరత్నాల పథకాలను కాపీ కొడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. -
చంద్రబాబు ఫామ్ 7 పై రాద్దాంతం చేస్తున్నారు
-
త్వరలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
-
‘చంద్రబాబును తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’
-
రైతు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? : కన్నా
సాక్షి, అమరావతి : సీఎం చంద్రబాబు సభకోసం ఓ రైతును అన్యాయంగా చంపిన ఘటనపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. చారిత్రక కొండవీడు కోటలో చంద్రబాబు పర్యటన ఓ రైతు కుటుంబం ఇంట్లో తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. మీ రైతు వ్యతిరేక వైఖరితో మరో రైతుని బలిచేశారని చంద్రబాబుపై కన్నా ట్విట్టర్లో నిప్పులు చెరిగారు. 'పొలాన్ని దేవాలయంగా భావించే రైతు పట్ల మీరు అధికార దర్పాన్ని చూపి పోలీసులతో కొట్టించడం వలన ప్రాణాలు విడిస్తే కనీసం కేసు, విచారణ లేకుండా ఆత్మహత్య అని ఎలా మీరు ప్రకటిస్తారు? ప్రజలకు వర్తించే చట్టాలు మీకు వర్తించవా? కొండవీడు ఉత్సవాల ఏర్పాట్ల కోసం కోటయ్యకు చెందిన పచ్చని పంటపొలాలను తన సమ్మతి లేకుండా తీసుకునే హక్కు మీకు, పచ్చ కార్యకర్తలుగా పనిచేస్తున్న పోలీసులకు ఎవరిచ్చారు?! సామాన్య రైతు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? మీలాంటి దౌర్జన్యం చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం' అని పేర్కొన్నారు. @ncbn, మీ రైతు వ్యతిరేక వైఖరికి మరో రైతుని బలిచేశారు. పొలాన్ని దేవాలయంగా భావించే రైతు పట్ల మీరు అధికార దర్పాన్ని చూపి పోలీసులతో కొట్టించడం వలన ప్రాణాలు విడిస్తే కనీసం కేసు,విచారణ లేకుండా ఆత్మహత్య అని ఎలా మీరు ప్రకటిస్తారు? ప్రజలకు వర్తించే చట్టాలు మీకు వర్తించవా?#ShameOnYouCM — Kanna Lakshmi Narayana (@klnbjp) February 19, 2019 ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, సభ పేరుతో కాపుకొచ్చిన పండ్ల తోట, పూల తోటను ధ్వంసం చేయడం, పొలంలోకి రాకుండా తనను అవమానించడంతో ఓ రైతన్న తల్లడిల్లాడు. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పోలీస్ దెబ్బలకు రైతు నేలకొరిగిన ఘటన సోమవారం గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. కొన ఊపిరితో ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని మృతుడి కుమారుడు వేడుకున్నా పోలీసులు అందుకు అంగీకరించలేదు. సీఎం వస్తున్నారంటూ అంబులెన్స్, ఆటోలను కూడా రానివ్వలేదు. చేసేదిలేక చేతులపైనే కోటయ్యను గ్రామస్థులు మోసుకెళ్లారు. మార్గమధ్యలోనే కోటయ్య ప్రాణాలు విడిచాడు. -
‘ఆ ఆంబోతు దొరికిన చోటల్లా దోచేస్తోంది’
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కుమారుడ్ని అచ్చోసిన ఆంబోతులా ఊరి మీదకు వదిలారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఆ ఆంబోతు దొరికిన చోటల్లా దోచేస్తోందని మంత్రి నారా లోకేష్ను ఉద్ధేశిస్తూ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్నారని చెప్పి చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపెట్టుకున్నారని తెలిపారు. ఇప్పుడు ఏపీ ఎన్నికలకు కాంగ్రెస్ను దూరం పెట్టడం వంటి దిక్కుమాలిన రాజకీయాలు చంద్రబాబుకే చెల్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల సొమ్ముని దీక్షల పేరుతో చంద్రబాబు దుబారా చేస్తున్నారని తెలిపారు. కేంద్రంపై నిరసన తెలపాలనుకుంటే ఒక్కడే ఢిల్లీ వెళ్లి దీక్ష చేయొచ్చుకదా అని ప్రశ్నించారు. పోలవరాన్ని తాము కట్టిస్తుంటే అది తన ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ఐదేళ్లలో అవినీతి, అక్రమాలు, అరాచకం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా?.. కేంద్ర నిధులతో కట్టిన నిర్మాణాలను మేము చూపిస్తాం, రాష్ట్రం కట్టించిన ఒక్క ప్రాజెక్టునైనా మీరు చూపించగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు సంస్కారహీనుడు కాబేట్టే మోదీ భార్య గురించి మాట్లాడారని చెప్పారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే ఆహ్వానించాలన్న కనీస ప్రోటోకాల్ పాటించకుండా.. చంద్రబాబు ఆంధ్రుల పరువు నిలువునా తీశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి పది లక్షల కోట్లు ఇచ్చామని గడ్కరీ లెక్కలు చెప్పారని, కాదంటే దీనిపై చర్చకు రావాలంటూ సవాల్ చేశారని వెల్లడించారు. కానీ చంద్రబాబు ముందుకు రాలేకపోయాడని, యూటర్న్ ముఖ్యమంత్రి ఇప్పుడు మతిస్థిమితం లేని ముఖ్యమంత్రి అయ్యారంటూ ఎద్దేవా చేశారు. -
‘చంద్రబాబు దొంగలా బెజవాడకు పారిపోయారు’
సాక్షి, అమరావతి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా గుంటూరులో ఆదివారం జరిగిన బీజేపీ ప్రజాచైతన్య సభలో ఆయన మాట్లాడుతూ.. ‘అవినీతి, అక్రమాలతో కోట్ల రూపాయల ప్రజల ఆస్తులను చంద్రబాబు కొల్లగొట్టారు. అలా కూడబెట్టిన సొమ్ముతో నేడు ఓట్లు కొనుక్కునే స్థితికి వచ్చారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు. దొంగలా రాత్రికి రాత్రే విజయవాడకు పరార్ అయ్యారు. చంద్రబాబు నిర్వాకంతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో అద్దెలు కట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. కనీసం ఉద్యోగలుకు జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా రాష్ట్రాన్ని దిగజార్చారు’ అని మండిపడ్డారు. పోలవరం నిర్మాణానికి 100 శాతం నిధులు కేంద్రమే ఇస్తోందని తెలిపారు. అనంతపురంలో కియా కార్ల తయారీ పరిశ్రమ రావడానికి ప్రధాని నరేంద్ర మోదీ చొరవే కారణమని కన్నా కొనియాడారు.ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సహకరిస్తోందని వెల్లడించారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభం ఉందని చెప్పుకునే చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధిలో ఎందుకు చూపించడంలేదని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు దమ్ముంటే అభివృద్ధి అంటే ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రైతులకు రూ.6 వేల ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించారని గుర్తు చేశారు. మోదీ ఆధ్వర్యంలో దేశం ముందుకెళ్తోందని అన్నారు. -
మోదీ దేశానికే గర్వకారణం
-
ఇదేం పిచ్చి బాబు!?
సాక్షి, అమరావతి: చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమ సభ సందర్భంగా ప్రజలకు పంచిపెట్టిన భోజనంతోపాటు అప్పడాలపై సీఎం చంద్రబాబునాయుడు ఫొటోలు ముద్రించడంపై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు పేలుతున్నాయి. ప్రజలకు అందించిన తిండిపైనా నేతల ఫొటోలు ముద్రించి పబ్లిసిటీకి ఉపయోగించుకోవడమేంటని పలువురు మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ అంశంపై ట్విట్టర్లో సెటైర్లు సంధించారు. ‘ఆశ-దోచే-అప్పడం బాబు..! కుర్చీ మీద ఆశతో రాష్ట్రాన్ని దోచి ప్రచార పిచ్చితో ఆఖరికీ అప్పడాలపై, టిష్యూ పేపర్లపై, బాత్రూం కమోడ్లపై కూడా ప్రచారం చేసుకుంటున్నావ్! ఇదేం పిచ్చి బాబు!?’ అని నిలదీశారు. కొంపదీసి శారదా స్కాం మీ హస్తముందా? పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీ హైడ్రామా విషయంలో కేంద్రంపై విమర్శలు చేసిన చంద్రబాబుపైనా కన్నా మండిపడ్డారు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు చంద్రబాబు అని నిలదీశారు. ‘కొంపతీసి 'శారదా స్కామ్'లో కూడా 'తమరి హస్తం' ఉందా?!? 'పచ్చ కామెర్లు' వాడికి లోకం 'పచ్చగా' కనిపిస్తుందని సామెత మీకు వర్తిస్తుంది’ అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య దేశంలో దీదీ గుండాగిరి, చంద్రబాబు దాదాగారి మరెంతో కాలం సాగదని అన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా? అని కన్నా ప్రశ్నించారు. ‘కాకినాడలో మహిళలను ఫినిష్ చేస్తా అన్నప్పుడు ఏమైంది మీ ప్రజాస్వామ్యం? అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేని దూషించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం? సెక్రటేరియట్లో నాయీబ్రాహ్మణులను బెదిరించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం?’అని వరుస ట్వీట్లలో చంద్రబాబును కన్నా ప్రశ్నించారు. ఆశ-దోచే-అప్పడం బాబు..! కుర్చీ మీద ఆశతో రాష్ట్రాన్ని దోచి ప్రచార పిచ్చితో ఆఖరికి అప్పడాలపై,టిష్యూ పేపర్ లపై బాత్రూం కమోడ్లపై కూడా ప్రచారం చేసుకుంటున్నావ్..! ఇదేం పిచ్చి బాబు!?@ncbn pic.twitter.com/s1TH9U0qsd — Kanna Lakshmi Narayana (@klnbjp) 4 February 2019 గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు @ncbn ? కొంప తీసి 'శారదా స్కామ్' లో కూడా 'తమరి హస్తం' ఉందా?!? 'పచ్చ కామెర్లు' వాడికి లోకం 'పచ్చగా' కనిపిస్తుందని సామెత మీకు వర్తిస్తుంది.. ప్రజాస్వామ్య దేశంలో దీదీ గుండాగిరి,మీ దాదాగారి మరెంతో కాలం సాగదు. pic.twitter.com/y2Lo8Noc0k — Kanna Lakshmi Narayana (@klnbjp) 3 February 2019 ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకుందా చంద్రబాబు? కాకినాడలో మహిళలను ఫినిష్ చేస్తా అన్నప్పుడు ఏమైంది మీ ప్రజాస్వామ్యం? అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేని దూషించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం? సెక్రటేరియట్లో నాయీబ్రాహ్మణులను బెదిరించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం? https://t.co/sMB2fOO3OP — Kanna Lakshmi Narayana (@klnbjp) 3 February 2019 -
చంద్రబాబు అగ్రకులాల మధ్య చిచ్చు పెడుతున్నారు
-
చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గా లేదు
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం: దోచుకున్న సొమ్ముతో ఓటుకు రూ.25,000 ఇచ్చి అధికారంలోకి తిరిగి రావాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును సోమవారం రాత్రి దీక్షా శిబిరం వద్ద ఆయన కలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గా లేదన్నారు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియని విధంగా బాబు ఉన్నారన్నారు. తాను మారానని , అధికారమిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలను సీఎం చంద్రబాబు నమ్మించి గొంతు కోశారన్నారు. నమ్మి ఓట్లేసి గెలిపించిన జిల్లా ప్రజలకు సీఎం ద్రోహం చేశారని ఆరోపించారు. భూకుంభకోణాలు, మట్టి, మైనింగ్ కుంభకోణాలతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారన్నారు. రాజధానికి 20 వేల ఎకరాలు సరిపోతాయనుకుంటే, 54 వేల ఎకరాలను రైతుల నుంచి లాక్కుని వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీల నుంచి సీఎం కొడుకు వరకు రాబంధుల మాదిరి దోచేసుకుంటున్నారని విమర్శించారు. తక్షణం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావుకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. చంద్రబాబు నిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని మాణిక్యాలరావు అడుగుతున్నారన్నారు. సీఎం సరిగ్గా ఉంటే గూడెంలో ఎమ్మెల్యే దీక్ష చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. బీజేíపీ రాష్ట్ర నాయకులు అడపా నాగేంద్ర తదితరులు ఉన్నారు. -
బీజేపీకి చంద్రబాబే క్యాంపెనర్: బీజేపీ అధ్యక్షుడు
సాక్షి, గుంటూరు: సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం కేంద్రంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి చంద్రబాబు ఓ క్యాంపెనర్గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాలు ముఖ్యం కాదని ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ సహాయం చేస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పనిలో చంద్రబాబు కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సోమవారం గుంటూరు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క గడ్కరి శాఖ నుంచే మూడు లక్షల కోట్ల నిధులు ఏపీకి వచ్చాయని వివరించారు. ‘నోట్ల రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాసింది నేనే అని చెప్పిన మాటలు చంద్రబాబు మర్చిపోయారా? డీమానిటైజేషన్ కమిటీకి కన్వీనర్ చంద్రబాబే గుర్తుంది కదా. ఏదైనా సమస్య ఉంటే దానికి బాబే బాధ్యత వహించాలి. మోదీ మరలా ప్రధాని అయితే జైలుకు పోతామనే భయంతో దొంగలంతా ఓ చోటకు చేరారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మోదీ అంతటి ధైర్యశాలైన ప్రధానిని చూడలేదు. 2014 కంటే అత్యధిక మెజారిటీతో మోదీ తిరిగి ప్రధాని అవుతారు’అంటూ కన్నా లక్ష్మీనారాయణ విశ్వాసం వక్తం చేశారు. -
ఏపీ అభివృద్ధికి చంద్రబాబే అడ్డంకి
కడప కోటిరెడ్డిసర్కిల్/అగ్రికల్చర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడానికి సీఎం చంద్రబాబునాయుడే ప్రధాన అడ్డంకి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. శుక్రవారం కడప నగరంలోని కందుల ఎస్టేట్లో రాయలసీమస్థాయి శక్తికేంద్రాల ప్రముఖ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిందన్నారు. ఈ విషయాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము,ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ పరిశ్రమ వచ్చిం దంటే అది ప్రధాని మోదీ చలువేనని అన్నారు. రాయలసీమ జిల్లాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కూడా చొరవ తీసుకున్నట్లు చెప్పారు. ప్రాజెక్టులకు కోట్లరూపాయలు ఇచ్చి పూర్తిచేయమని కేంద్రం చెబితే ఆ నిధులను తన అనుయాయులైన కాం ట్రాక్టర్లకు ఇచ్చుకుని కమీషన్ నొక్కేశారన్నారు. నీరు –చెట్టు పేరుతో చెరువులను చెరపట్టి దోపిడీకి తెరతీశారన్నారు వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడప నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలు నిజాయితీ పరిపాలన అందించాలని అధికారమిస్తే సీఎం చంద్రబాబు ఆ అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకున్నారని నిప్పులు చెరిగారు. 2014న సీఎంగా ప్రమాణ స్వీకారం రోజున కేంద్ర విద్యుత్శాఖ మంత్రి పీయూస్ గోయల్ ఈ రాష్ట్రానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నట్లు ప్రకటించారని అన్నారు. దాన్ని కూడా తామే ఇస్తున్నట్లు సీఎం చెప్పుకోవడం దారుణమన్నారు. రాయలసీమ వెనుకబాటు తనానికి చంద్రబాబు తీరే కారణమన్నారు. రూ.75 వేల కోట్ల విలువ చేసే మట్టిని అమ్ముకుని టీడీపీ నాయకులు సొమ్ము చేసుకున్నారన్నారు. ఇలా ఒకటేమిటి అన్ని పథకాల్లోను అవినీతిని పారించారని దుమ్మెత్తి పోశారు. కడప ఉక్కుఫ్యాక్టరీ స్థాపన కోసం వనరులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరగా అందుకు ఎలాంటి సహకారం, సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. అఖిల భారత మహిళా మోర్చా ఇన్చార్జి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పాలక ప్రభుత్వం రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆరోపించారు.ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడే పరిస్థితి లేదన్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశలోని అఖిలేష్, మాయావతి ఇప్పటికే కూటమి నాయకుడిగా చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబును ముందు మీ పీఠం గురించి ఆలోచించి రమ్మనట్లు ఢిల్లీలో చెప్పుకుంటున్నారన్నారు. తొమ్మిది సంవత్సరాల్లో హైదరబాద్ను నేనే కట్టానని చెబుతున్న సీఎం చంద్రబాబు మరి ఐదేళ్లలో అమరావతిలో రాజధానిని ఎందుకు కట్టలేకపోయారో? ప్రజలకు సమాధానం చెప్పాల న్నారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వాల్లో ఏపీలోని టీడీపీ సర్కార్ నాలుగో స్థానంలో ఉందని సాక్షాత్తు ఢిల్లీలోని సీడీఎఫ్ నివేదిక ఇచ్చిందన్నారు. కర్నూలు ఇన్చార్జి కపిలేశ్వరయ్య మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి నిధులు ఇస్తే వాటిని టీడీపీ నాయకులు అప్పనంగా భోం చేశారని దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్రెడ్డి మాట్లాడుతూ శక్తి కేంద్రాల ప్రముఖ్లు ఎన్నికల వరకు పెద్ద యజ్ఞం చేయాలన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్, రాష్ట్ర కార్యదర్శులు వంగల శశిభూషణ్రెడ్డి, సుంకర శ్రీనివాస్, అడపా నాగేంద్ర, చల్లపల్లి నరసింహారెడ్డి, భాను ప్రకాష్రెడ్డి, నీలకంఠ,బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్, కర్నూలు, అనంతపురం చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల పార్టీ అధ్యక్షులు హరీష్, అంకాల్రెడ్డి, చంద్రారెడ్డి, పుప్పాల శ్రీనాధ్రెడ్డి,బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బత్తల పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆయన్ని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతోంది’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014లో ఏం మాట్లాడాడు.. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు సిద్ధాంతాలు లేవన్నారు. చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తుపెట్టుకోవటం, దొంగలందరూ ఒక్కటయ్యారన్న దానికి నిదర్శనంగా పేర్కొన్నారు. టీడీపీ నాయకులు దోచిన అవినీతి సొమ్ము ప్రధాని నరేంద్రమోదీ కక్కిస్తాడనే భయం వారికి పట్టుకుందని అన్నారు. -
కేంద్రం సొమ్ముతో రాష్ట్రం సోకులా?
పామర్రు: పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్రం నిధులను మంజూరుచేస్తుంటే వాటిని తమవిగా చెప్పుకుంటూ ప్రజలను టీడీపీ ప్రభుత్వం వంచిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీనేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పలు పథకాలకు పేర్లు మార్చి జన్మభూమి కమిటీలు చెబితేనే ఇస్తామంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ బినామీలకే మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. వివిధ పన్నుల ద్వారా వచ్చిన నిధులను జన్మభూమి, సీఎం, సీఎం కుమారుడు పేరిట విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తుంటే వాటిని పక్కదారి పట్టించి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని దుష్పచారం చేస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. పథకాలకు నిధులు కేంద్రం ఇస్తుంటే ట్యాంక్యూ సీఎం అని మెసేజ్లు పెట్టించుకోవడం ఎంత దారుణం అన్నారు. రానున్న ఎన్నికలలో ఏపీలోని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి వాటి ప్రకారం విధులు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్రెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు షేక్ బాజీ, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, నియోజకవర్గ అధ్యక్షులు ఎస్పీ నాగేశ్వరరావు, పార్టీనేతలు కాకర్ల సత్యనారాయణ, ఏకె ప్రసాద్, నాంచారయ్య, రామిరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి 4.70 లక్షల గృహాలు మంజూరు చిలకలపూడి(మచిలీపట్నం):కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 4.70 లక్షల గృహాలు కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూదందాలకు నిరసనగా బీజేపీ భూ రక్షణ దీక్ష కార్యక్రమాన్ని శనివారం కలెక్టరేట్ సమీపంలో నిర్వహించారు. కన్నా మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్కు ఇంత రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నిధులు కేటాయించిందన్నారు. నరేంద్రమోడీ, బీజేపీ ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కో–ఇన్చార్జ్ సునీల్ థియోడర్ మాట్లాడుతూ చంద్రబాబు దొంగ కాదని గంజ దొంగగా అభివర్ణించారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ దళితులు, వెనుకబడిన వర్గాల వారు కూలీ, నాలీ చేసుకుంటూ సంపాదించుకున్న భూమిని కూడా వదలకుండా లాక్కోవటం దుర్మార్గమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబుకు కుటుంబరావు, బుద్దా వెంకన్నలు బ్రోకర్లుగా మారారన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దారా సాంబయ్య, తురగా నాగభూషణం, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీఆర్ రవీంద్రరాజు, మైనార్టీ మోర్చ నాయకులు షేక్ బాజీ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి ఆలపాటి లక్ష్మీనారాయణ, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కూనపరెడ్డి శ్రీనివాసరావు, నాయకులు పంతం గజేం ద్ర, వైవీఆర్ పాండురంగారావు పాల్గొన్నారు. -
సోనియాను ఇటలీ దెయ్యం అన్నారు..
-
‘దొంగలకు పెద్దదొంగ చంద్రబాబు’
సాక్షి, ఏలూరు : చంద్రబాబు ఆధ్యర్యంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం నిర్వహించిన బీజేపీ ప్రజా ఆవేదన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. ఏపీలో దోపీడి పాలనకు వ్యతిరేకంగా ఈ ధర్నా నిర్వహించామన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో భూ అక్రమాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలకు కాపలా కాస్తున్న పెద్ద దొంగ చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ఆయన రాజకీయ జీవితమంతా నమ్మక ద్రోహం, మోసాలతోనే సాగిందన్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలు, దోపీడీ గురించి వంద పేజీల పుస్తకం రాసినా సరిపోదని ఎద్దేవా చేశారు. మోసం చేయడంలో బాబు దిట్ట నమ్మిన వారి మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని కన్నా విమర్శించారు. రిజర్వేషన్ల పేరుతో పలు కులాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మి ఓట్లు వేసిన మహిళలకు రుణమాఫీ చేయకుండా మోసం చేశారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ప్రచారదాహానికి గోదావరి పుష్కరాల్లో 29 మంది పేదలు బలి అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పట్టిన శని అని చెప్పిన చంద్రబాబు ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబుకి ఉలికిపాటు ఎందుకుని ప్రశ్నించారు. బాబు సీఎం కావడానికి వెన్నెముకగా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లాకు ఆయన చేసిన అభివృద్ది శూన్యమన్నారు. 2019లో అభివృద్ధి కావాలో.. అవినీతికావాలో ప్రజలే తేల్చుకోవాలని కన్నా పిలుపునిచ్చారు. -
ఏపీని అప్పులమయంగా మార్చింది
-
‘పర్యావరణాన్ని ఎలా నాశనం చెయ్యాలో చెప్తావా బాబూ..’
సాక్షి, పశ్చిమగోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా కలక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. కొవ్వూరులో జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా కోడూరి లక్ష్మీనారాయణ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయనతో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ అవినీతిని తూర్పారాబట్టారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద డ్రామా కంపెనీల తయారయిందని అన్నారు. లిక్కర్, ఇసుక మాఫియా ఆగడాలకు కొవ్వూరు నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. అడ్డగోలు ఇసుక, మట్టి తవ్వకాలతో పర్యావరణాన్ని కాలరాస్తున్న చంద్రబాబు పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశంలో మాట్లాడతాననడం.. దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి టీడీపీ నేతల జేబుల్లోకి నేరుగా తీసుకెళ్లడమే బాబు ఉద్దేశమని కన్నా ఆరోపించారు. -
చంద్రబాబు పచ్చి అవకాశవాది
-
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం‘‘ చంద్రబాబు’’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంతో ప్రజల ముందుకు వచ్చి డ్రామా వేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అవకాశవాదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ను దూషించి ఇప్పుడు చేతులు కలపటం దారుణమని అన్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందని గుర్తుచేశారు. టీడీపీ డ్రామా కంపెనీ అని, పార్టీ సిద్ధాంతం అంటూ ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో చంద్రబాబు కన్నా అవినీతిపరుడు మరొకరు లేరని తేల్చిచెప్పారు. ఆపరేషన్ గరుడ అంటూ కొత్త నాటకంతో సినీనటుడు ముందుకు వచ్చాడని పేర్కొన్నారు. స్వలాభం కోసం చంద్రబాబు ఎవరితోనైనా చేతులు కలుపుతారని ధ్వజమెత్తారు. -
ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
-
అసమర్థ ప్రభుత్వం మీది కాదా?
గుంటూరు: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి మరోసారి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖాస్త్రం సంధించారు. పదోసారి మరో ఐదు ప్రశ్నలు సంధించారు. ఇలా మొత్తం ఇప్పటి వరకు పంపిన 50 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఆ ప్రశ్నలు ఇవే.. ప్రశ్న నెంబర్ 46: మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో అవినీతి రహిత, సుపరిపాలనను అందిస్తామని వాగ్దానం చేశారు. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి ‘మా ప్రజా ప్రతినిధులు గానీ, మా నాయకులు గానీ చేసిన ఒక్క అవినీతి పనినైనా చెప్పగలరా’ అని ప్రజలను అడిగే ధైర్యం ఉందా? మీ ఎంఎల్ఏ, ఎంపీ, ఎంఎల్సీల అవినీతి అరాచకాలపై ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమా? సీబీఐ విచారణకు సిద్ధమా? ప్రశ్న నెంబర్ 47: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదట ర్యాంక్ వచ్చిందని చెబుతున్నారు కదా! ఈ నాలుగు సంవత్సరాలలో మీ పచ్చ నాయకులు, ప్రజా ప్రతినిధులు తమవి గానీ తమకు సంబంధించినవి గానీ ఎన్ని పరిశ్రమలను, వ్యాపారాలను ఇతర రాష్ట్రాలలో పెట్టారు? మన రాష్ట్రంలో ఎన్ని పెట్టారు? నిజాయతీగా ప్రజలకు చెప్పగలరా? ప్రశ్న నెంబర్ 48: బీజేపీ మీద కోపంతో బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూల్చాలని ప్రయత్నించడం లేదా? తద్వారా కోట్లాది ప్రజలను గందరగోళంలోకి నెట్టాలని చూడటం లేదా? డిమానిటైజేషన్, డిజిటల్ కరెన్సీని బహిరంగంగా బలపరచి, ఈ మధ్య కాలంలో కావాలని కుట్రపూరితంగా బ్యాంకింగ్ వ్యవస్థ మీద బాధ్యతారాహిత్య ప్రకటనలను చేస్తూ ప్రజలలో లేనిపోని అనుమానాలు లేవనెత్తుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం లేదా?. రాజ్యంగపదవిలో ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు చేయవలసిన పనేనా ఇది? మీ కుట్రపూరిత ప్రకటనల వల్ల ఒక్కసారిగా బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలితే ఈ దేశం, ప్రజలు ఏమి కావాలి.. మీ స్వార్థం కోసం ద్రోహం చేయవచ్చా? ప్రశ్న నెంబర్ 49: వెనకబడిన జిల్లాల అభివృద్ధికి అహర్నిశలూ పాటుబడుతున్నామని చెప్పే మీరు వెనకబడిన విజయనగరం జిల్లా అభివృద్ధిని తుంగలో తొక్కలేదా? సాగునీటికి తాగునీటికి ఎంతో ముఖ్యమైన తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు అటక ఎక్కిన వాస్తవం కాదా?. తోటపల్లి రిజర్వాయర్ ఫీల్డ్ చానల్స్ను పూర్తి చేయలేదు. వెంగళరావు సాగర్ అదనపు ఆయకట్టు పెంపుదల పక్కన పెట్టేశారు. మీ మేనిఫెస్టోలో పెట్టిన సాలూరు బైపాస్ను మర్చిపోయారు. జిల్లాలోని జూట్ మిల్లులను తెరిపించడంతో విఫలమై 10 వేల మంది కార్మికుల భవితవ్యాన్ని చీకట్లోకి నెట్టేసిన ఘనత మీది కాదా? వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు మీకుందా? ప్రశ్న నెంబర్ 50: ఎంతో వెనకబడిన ప్రకాశం, వైఎస్సార్ జిల్లాలకు వరప్రసాదిని అయిన వెలుగొండ ప్రాజెక్టు ఈరోజుకీ పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం మీది కాదా? 4.59 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించే అత్యంత ప్రాధాన్యత గల ఈ ప్రాజెక్టునే పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు ఉందా? -
సీఎం చంద్రబాబుకు కన్నా బహిరంగ లేఖ
-
రెండుకళ్ల సిద్ధాంతంలో చంద్రబాబు రాటు దేలారు
-
‘బాబు 1500 రోజుల పాలన.. అవినీతి కుంభకోణాలు’
సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబు పాలనపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు 1500 రోజుల పాలనలో 15 ప్రాజెక్టులైనా కట్టారా అని కన్నా నిలదీశారు. ఆయన మంగళవారం రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు 1500 రోజుల పాలనలో అవినీతి కుంభకోణాలు తప్ప ఏమీ లేవని మండిపడ్డారు. చంద్రబాబు అనుభవజ్ఞుడని అధికారం కట్టబెడితే అవినీతి పాలన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని చంద్రబాబు రాత్రికి రాత్రి పారిపోయి విజయవాడ వచ్చారని కన్నా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రావలసిన వేల కోట్ల రూపాయలను ఓటు నోటు కేసుకు భయపడి అడగడలేదని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు అంగీకరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్యాకేజీ ఇచ్చినందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు టీడీపీ నేతలు సన్మానాలు కూడా చేశారన్నారు. అంతేకాక ప్రధాని మోదీని అభినందిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కాగా, చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని కన్నా డిమాండ్ చేశారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు అనుభవం అబద్దాలు ఆడటానికి ఉపయోగపడుతుందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. -
టీడీపీ టార్గెట్గా కమలనాథుల విమర్శలు
-
‘కేంద్రం నిధులతో చంద్రబాబు అవినీతి’
సాక్షి, గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. బీజేపీ కార్యకర్తల సమావేశం శుక్రవారం గుంటూరులో జరిగింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, గోకరాజు గంగరాజు, పురందేశ్వరి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఏపీలో కుక్కను మేక అని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు, ఆయన భజన మీడియా చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న అది కేంద్రం సహకారంతోనే అని కన్నా అన్నారు. ‘అంతేకాక దేశంలో ఉన్న అన్ని ఎయిమ్స్లలో ఏపీకే అత్యధిక నిధులు కేటాయించారు. ఏపీకి అన్ని రంగాల్లో సింహాభాగం నిధులు కేటాయించారు. నాలుగేళ్ళుగా చంద్రబాబు కేంద్రం నిధులు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు. చంద్రబాబు చేసే అవినీతిని ప్రజలందరికి తెలియజేయాలి. బాబు తాను బురద పూసుకుంటూ.. దానిని మనకి పూయాలని చూస్తున్నాడు. అంతేకాక ఏపీలో బాబు మోసం చేయని కులం అంటూ ఉందా? వెనక్కి తిరిగి చూసుకుంటే బాబుదంతా అవినీతి చరిత్ర. త్వరలో ఇంటింటికి బీజేపీలో భాగంగా బాబు అవినీతిని ప్రజలందరికి వివరించాలని’ కన్నా లక్ష్మీనారాయణ సమావేశంలో పేర్కొన్నారు. మోదీ చరిష్మా ప్రపంచ వ్యాప్తంగా.. సమావేశంలో కేంద్రమంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రంగాలలో సమూలమైన మార్పులు తెచ్చారు. ‘దేశంలో అభివృద్ధి జరుగుతుందని ప్రతిపక్షం కూడా చెప్పక తప్పలేదు. ప్రధాని మోదీ వచ్చాక అవినీతి, లంచాలు కనుమరుగై పోయాయి. గత పాలనలో అవినీతి, లంచగొండితనం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. ప్రధాని చరిష్మా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. మోదీ పని తీరుపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. రైతులకు ఆదాయం పెంచడం కోసం వ్యవసాయంలో అనేక మార్పులు తెచ్చారు. మోదీ పాలనలో దేశం త్వరితగతిన ఎదుగుతుంది. మొదటి క్యాబినెట్లో పోలవరంకు నిధులు కేటాయించాం. ఏపీ అభివృద్ధిలో మా చిత్తశుద్దికి అదో నిదర్శనం’ కేంద్ర మంత్రి జేపి నడ్డా తెలిపారు. -
ఆ చేతులను నరకడమే బాబు నైజం
సాక్షి, విశాఖపట్నం : సాయం చేసిన చేతులను నరకడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ మండిపడ్డారు. గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన బాబుపై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో చంద్రబాబు జనసేన, బీజేపీ కాళ్లు పట్టుకొని అధికారంలోకి వచ్చారని, నాలుగేళ్లు కలిసిఉన్న అనంతరం విమర్శలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని అందుకే వాటి గురించి ఇంకా సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నరని మండిపడ్డారు. కడప ఉక్కు గురించి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకూ నిర్వాసితుల వివరాలతో పాటు ఇతర సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఫీజబిలిటీ లేదని సెయిల్ చెప్పినా, రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కావడంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించిందన్నారు. టీడీపీ ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడానికి యత్నిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ప్రజలకు చెప్పడానికి కొత్తగా హామీలు లేవని, అన్నీ 2014 ఎన్నికల్లోనే ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కేంద్రంను నిందించడమే మేనిఫెస్టోగా సీఎం పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విపరీతమైన అవినితి జరుగుతోందని కన్నా ఆరోపించారు. పోలవరం పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని నిర్వాసిత గిరిజనులు ఆరోపించారని.. తప్పుడు పత్రాలు, రికార్డులు సృష్టించి భూములను లాక్కున్నారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ను కూడా కేంద్రం ఇస్తుందని దానికి ఇంకా సమయం ఉందని తెలిపారు. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా కేంద్రం నిధులు విడుదల చేస్తోందని అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం అన్యాయం చేస్తున్నారంటూ బీజేపీ, కేంద్రంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం బీజేపీ కి మాత్రమే ఉందని కన్నా అన్నారు. -
వెన్నుపోటు పొడవడం చంద్రబాబు సహజగుణం
-
కత్తి, పరిపూర్ణానంద ఎపిసోడ్: కన్నా ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : లక్షలాది మంది హిందూవులు ఆరాధించే పరిపూర్ణానంద స్వామిని హౌజ్ అరెస్టు చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. పరిపూర్ణానంద హౌజ్ అరెస్టు అయిన జులై 9ను బ్లాక్ డేగా అభివర్ణించారు. కాగా, రాముడిని దూషిస్తూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాదయాత్ర చేపడుతున్న పరిపూర్ణనంద స్వామిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏ మతానికి చెందిన దేవుడిని లేక దేవతను ఉద్దేశించి తప్పుగా మాట్లాడేవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాన్ని తేవాలనే సదుద్దేశంతోనే స్వామి పాదయాత్ర తలపెట్టారన్నారు. ఇదేమైనా నేరమా అని ప్రశ్నించారు. మన పాలన ఇలా ఉందంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి స్వామీజీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. July 9 was another black day in democracy as a Hindu sanyasi, Paripoornananda Swamiji, adored by lakhs of Hindus in Telugu States, was detained at his camp in Hyderabad by State police preventing from taking a paadayaatra. (1/2) — Kanna Lakshmi Narayana (@klnbjp) July 10, 2018 His crime was that he sought a legislation to be brought in facilitating "severe punishment for defaming or decrying Gods or Goddesses of any religion." What a great Governance we have ! Let wisdom dawn on Government and Swamiji be released (2/2) — Kanna Lakshmi Narayana (@klnbjp) July 10, 2018 -
నాలుగేళ్లలో బాబు రాష్ట్రానికి చేసింది శూన్యం
-
నాలుగేళ్లలో బాబు చేసిందేమీ లేదు: కన్నా
సాక్షి, ప్రకాశం: చంద్రబాబు నాలుగేళ్లలో జగన్ మోహన్ రెడ్డిని, పవన్ కల్యాణ్ని తిట్టుకుంటూ బతకడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. ఒంగోలు బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దాడులు చేస్తూ సంస్కారంలేని వాడిగా బాబు ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు రాష్ట్రంలోని ఏ సెక్టార్కి మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం షో చేస్తోందని, కేంద్ర నిధులను టీడీపీ నేతలు దోచుకుంటున్నారని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ని బాబు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రామాయపట్నం పోర్ట్ కోసం కేంద్రానికి ఎందుకు ప్రతిపాదనలు పంపడం లేదని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం వివరాలు అడుగుతుంటే ఇవ్వకుండా బాబు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కి కేంద్రం పక్కా గృహాలు అధికంగా మంజూరు చేసిందని తెలిపారు. బాబు రాష్ట్రాన్ని దోచుకుంటుంటే.. ప్రజలు వలయంగా నిలబడాలా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి రహితంగా పాలన చేస్తామని కన్నా చెప్పారు. -
ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది
-
కేంద్రం ఇస్తున్న నిధులను టీడీపీ కాజేస్తుంది
-
విజయ డెయిరీ గాలికి.. హెరిటేజ్ డెయిరీకి అందలం..
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతి కోరల్లో కూరుకుపోయిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ నేతలు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులను పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహిస్తూ హ్యాపీగా ఉంటున్నారని మండిపడ్డారు. నయవంచన దీక్షలను ఆపి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. చిత్తూరు డెయిరీని గాలికి వదిలేసిన చంద్రబాబు సొంత హెరిటేజ్ డెయిరీని అందలం ఎక్కించారని ఆరోపించారు. చిత్తూరులోని చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. -
కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి
-
కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి జరిగింది. బుధవారం నెల్లూరు జిల్లాలో కావలిలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆయనపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు చెప్పులు విసిరారు. దీంతో బీజేపీ కార్యకర్తలు అతడిని చితకబాదారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలిస్తున్నా, వెంబడించి మరీ చావబాదారు. అనంతరం చెప్పుల దాడికి నిరసనగా నిరసనగా బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. రాష్ట్రంలో టీడీపీ రౌడీయిజాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా, చెప్పుల దాడి ఘటనపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేతలు కొరివితో తల గోక్కుంటున్నారని హెచ్చరించారు. తన ఇంటిపైకి కూడా టీడీపీ నాయకులు రౌడీలను పంపిస్తున్నారని ఆరోపించారు. హోం మంత్రి, డీజీపీ, గవర్నర్లను ఈ విషయంపై కలిశామని గుర్తు చేశారు. రాష్ట్రానికి నాలుగేళ్లలో ఏం చేశామనే విషయాన్ని ప్రజలకు చెప్పడానికే పర్యటన చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యటన విజయవంతం అయితే ఓడిపోతామని భయపడుతున్న చంద్రబాబు ఇలాంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. -
‘నిధులు మావి.. ప్రచారాలు మీవా’
సాక్షి, నెల్లూరు: జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు నిధులను దిగమింగుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం ఏం చేసిందో, శ్వేతపత్రం విడుదల చేయగలదా అని ప్రశ్నించారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్ముతున్నా పట్టించుకునే దిక్కు లేదు.. చేనేత రంగానికి ఏదేదో చేశామని చెప్తున్నారని, అసలు రుణాలు ఎంతవరకు మాఫీ చేసారో చెప్పగలరా అని నిలదీశారు. హౌస్ ఫర్ ఆల్ స్కీంలో కాంట్రాక్టర్లును మేపుతూ ప్రభుత్వం కమీషన్లు తీసుకుంటోందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ప్రతి అభివృద్ధి కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయన్నారు. నిధులు తమవి.. ప్రచారాలు మీవి.. పథకాలు మీ కార్యకర్తలకా.. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయ లబ్దికోసం యూటర్న్ తీసుకుని ప్రజలని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ప్రత్యేక ప్యాకేజి తీసుకొంటూ.. కేంద్రం ఏమీ చేయలేదని చెప్పడం సరికాదన్నారు. -
రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు
-
‘బాబు అవినీతి అందలమెక్కి కులుకుతున్నారు’
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో అవినీతి, అరాచక, అసమర్థత పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడప ఉక్కు పరిశ్రమ సమాచారాన్ని కేంద్ర ఉక్కు శాఖా మంత్రికి ఇవ్వకుండా.. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రమేష్తో దీక్ష చేయిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతి అందెలమెక్కి కులుకుతున్నారని అన్నారు. సోమ్ము మాది.. అవినీతి మీది అని మండిపడ్డారు. బాబు మీకు దమ్ముంటే రాష్ట్ర అభివృద్ధిపై రాష్ట్ర వాటా, కేంద్రం వాటాపై శ్వేతపత్రం విడుదల చేయండని డిమాండ్ చేశారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం ప్రధాని నరేంద్ర మోదీ 150 సంక్షేమ పథకాలు ప్రవేశపేట్టారని గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. బాబు బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని తెలిపారు. బాబులో ఒక అపరిచితున్ని చూస్తున్నామని కన్నా అన్నారు. జిల్లాకు నాలుగేళ్లలో కేంద్రం 14 విద్యా సంస్థలు నెలకొల్పిందని పేర్కొన్నారు. తక్కువ ఫీజుతో ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. -
విజయవాడలో బీజేపీ నేతల ధర్నా
-
నాపై హత్యాయత్నం జరిగింది: కన్నా
సాక్షి, అనంతపురం : అనంతపురంలోని ఆర్ అండ్ బీ గెస్టహౌస్ వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బస చేసిన ఆర్అండ్బీ అతిథి గృహాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గురువారం ముట్టడించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు టీడీపీ జెండాలను తగులబెట్టారు. అంతేకాకుండా టీడీపీ కార్యక్తరలపై బీజేపీ నేతలు దాడిచేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ నేతల దాడితో ముట్టడికి యత్నించిన టీడీపీ కార్యకర్తలు అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనతో చంద్రబాబుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. దౌర్జన్యాలను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. టీడీపీ కుట్ర టీడీపీ కార్యకర్తల ముట్టడిపై కన్నా లక్ష్మీనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తిరుపతి పర్యటనలో అమిత్ షా హత్యకు టీడీపీ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇపుడు వాస్తవాలు మాట్లాడుతున్న తనపై హత్యాయత్నం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం టీడీపీ గూండాలకు సహకరించారని మండిపడ్డారు. సీఎం రమేష్ కమీషన్ల కోసం హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టు పనులు తీసుకున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందన్నారు. -
‘చంద్రబాబుకు రోగం.. రాష్ట్రానికి ప్రమాదం’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్న చంద్రబాబు, ఇప్పుడు ఆ పార్టీనే న్యాయం చేసిందని మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబులో ఒక అపరిచితుడిని చూస్తున్నామని.. ఆయనకు ఉన్న మానసిక రోగంతో రాష్ట్రానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు. పోలవరం ఏడు ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపింది బీజేపీ అని, ఆ సంగతి మర్చిపోయి చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ ముంపు మండలాలను ఆంధ్రాలో కలపకపోతే పోలవరం కలగానే మిగిలిపోయేదన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా పోలవరం అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచేస్తుందని ఆరోపించారు. పోలవరానికి పెండింగ్ బిల్లు బకాయిలు లేవని పోలవరం అథారటి అధికారులు చెపుతున్నారని తెలిపారు. సమాచార హక్కు చట్టం ద్వారా తాము వివరాలు అడిగితే పోలవరం ప్రాజెక్టుకు పాత బకాయిలు లేవని చెప్పినట్టు గుర్తు చేశారు. చంద్రబాబు రూ.1950 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని అబద్దం చెపుతున్నారన్నారు. కడప స్టీల్ ప్లాంట్ రావాలనే ఉద్దేశ్యం టీడీపీకి లేదని, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు సైందవుడులా అడ్డుపడుతున్నారన్నారు. కేంద్రం ఉక్కు పరిశ్రమ ఇస్తుందని తెలిసే టీడీపీ నాయకులు ప్రాణ త్యాగానికి సిద్ధమనే డ్రామాలు ఆడుతున్నారన్నారు. -
బాబు అవినీతిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలి
-
నిధులు మావి.. సోకు బాబుది..
విజయనగరం అర్బన్ : కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే.. వాటిలో కమీషన్లు నొక్కేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోకులు చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సైతం తన పేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం విజయనగరానికి శుక్రవారం వచ్చిన ఆయనకు కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయుడు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులను ప్రజలకు చేర్చకుండా కొడుకు లోకేష్ సారధ్యంలో చంద్రబాబు దోచుకుంటున్నాడని ఆరోపించారు. పాలన చేతకాక బీజేపీని భూతంలా చూపించడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి ప్రతిపాదించిన రూ.3,500 కోట్లలో ఇప్పటికే రూ.2,500 కోట్లను కేంద్రప్రభుత్వం ఇస్తే.. వాటికి ఇంతవరకు లెక్కలు చెప్పలేదని తెలిపారు. పదేళ్లపాటు హైదరాబాదులో ఉండే అవకాశం ఉన్నప్పటికీ..భయపడి పారిపోయి వచ్చి రూ.10,500 కోట్లు వెచ్చించి తాత్కాలిక అసెంబ్లీ నిర్మించి నిధులు భారీగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. పోలవరం నిధుల్లో రూ.1,600 కోట్లు బదలాయించి పట్టిసీమ కాలువ నిర్మాణం పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీగా రూ.16,500 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే వెచ్చించాల్సిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు ఇవ్వకుండా.. దోచుకునేందుకు నేరుగా నిధులివ్వాలని కోరుతున్నారని. అది సాధ్యం కాదని వివరించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేయడాన్ని చూసి రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తున్నారో తెలియని పరిస్థితిలో ప్రజలున్నారన్నారు. చంద్రబాబునాయుడి అవినీతి పాలనను ఏ పార్టీ నిలదీస్తున్నా.. దాని వెనుక బీజేపీ స్క్రిప్ట్ ఉందంటూ మతిభ్రమించి అపరిచితుడిలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. -
చంద్రబాబు పాలనలో అవినీతిని నిరూపిస్తాం
-
‘కడపలో డ్రామాలు ఆపండి’
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం ఎవరూ ప్రాణ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు.. కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తే చాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటనలో భాగంగా కన్నా మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కోసం తెలుగుదేశం పార్టీ అసలు ప్రయత్నమే చేయలేదని స్పష్టం చేశారు. కేంద్రం స్టీల్ప్లాంట్ ఇస్తామంటుంటే.. కావాలనే కడపలో డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఈ డ్రామాలో సీఎం రమేష్ పాత్రధారి కాగా, చంద్రబాబు డైరెక్టర్ అని.. ఇకనైనా డ్రామాలు ఆపాలన్నారు. (శ్రీకాకుళం పర్యటనలో మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ) చంద్రబాబు నాయుడుకి అవినీతి, రాజకీయం తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సైంధవుడిలా దాపురించారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు ఏళ్లలో శ్రీకాకుళం జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. వంశధార, తోటపల్లి ప్రాజెక్టులను పూర్తిచేశారా..? ఉద్ధానం కిడ్ని బాధితుల సమస్యను పరిష్కరించారా..? అని ప్రశ్నించారు. వంశధార ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెద్ద అవినీతి పుట్ట అని విమర్శించారు. చంద్రబాబు చేతకానితనం వల్ల 21 వేల మంది సాక్షరభారత్ ఉద్యోగులు బజారున పడ్డారని తెలిపారు. -
బాబు తీరును తప్పుపట్టిన బీజేపీ నేత కన్నా
సాక్షి, విజయవాడ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధర్నా పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతిగా స్పందిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కేజ్రీవాల్ నిరాహార దీక్షను సాకుగా చూపి ముఖ్యమంత్రుల సమావేశాన్ని చంద్రబాబు బహిష్కరించాలని చూస్తున్నారని విమర్శించారు. విజయవాడలో ఆదివారం కన్నా లక్ష్మీనారాయణ లాయర్లతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలనను సీఎం చంద్రబాబు గాలికి వదిలేశారని విమర్శించారు. ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న హడావుడి ఊరిలో పెళ్లికి కుక్కల హడావుడిని తలపిస్తోందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అత్యాచారాలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయని, నిందితులకు టీడీపీ నాయకులే అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్, బీజేపీ నాయకుడు ఆకుల సత్యనారాయణను పరామర్శించడానికే కలిశాడని స్పష్టం చేశారు. ఈ సంఘటనపైనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని చెప్పారు. రాజకీయ జన్మనిచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్కే ద్రోహం చేసిన చంద్రబాబు పంచన చేరిన యనమల ఇతరులకు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
చంద్రబాబుపై కన్నా ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ : చంద్రబాబు ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటు విమర్శలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వానికి సిగ్గు, లజ్జా లేవని, నిర్లజ్జగా అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. మోసపూరిత చర్యలతో ప్రజల ముందు బీజేపీని దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణ త్యాగం చేస్తామన్న టీడీపీ నేతలు నాటకాలు ఆపాలంటూ హితవు పలికారు. ప్రజలను మోసం చేయడం ఆపి, ఇప్పుడైన నిజాలు చెప్పాలంటూ దుయ్యబట్టారు. పునర్విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇచ్చిందని కన్నా తెలిపారు. కానీ రాష్ట్ర అధికారులు కడపలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని జూన్లో రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు. కానీ అమిత్ షా కారణంగా పట్టుబడంతో మరోసారి పరిశీలించాలంటూ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారంటూ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, మెకాన్ సంస్థ కలిపి నివేదిక అందచేస్తే కేంద్రం కూడా త్వరలోనే ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన ఆర్డర్లో ఎక్కడా కూడా ప్లాంట్ సాధ్యపడదు అని చెప్పలేదని, ఈ విషయం కేంద్రం ఇచ్చిన ఆర్డర్లో స్పష్టంగా ఉందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తెలుగుదేశం నిరాధార ఆరోపణల కారణంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని విమర్శించారు. తెలుగుదేశం నేతలు ఎవరు స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణ త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు. పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కడపకు స్టీల్ ప్లాంట్ తీసుకువచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే నని కన్నా స్పష్టం చేశారు. -
బాబు కనుసన్నల్లోనే దాడులు : బీజేపీ
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రధానిపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నాచౌక్లో భారతీయ జనతా పార్టీ, నేతలు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి మాణిక్యాలరావు, విష్ణువర్ధన్ రెడ్డి, సురేష్ రెడ్డి, రమేష్ నాయుడులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. పోలీసులను ఉపయోగించుకుని ముఖ్యమంత్రి తన ప్రత్యర్ధులపై దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని కన్నా ఆరోపించారు. టీడీపీలో చేరకపోతే కేసులు బెడతామంటూ పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. పోలీసులు దమన కాండ సాగిస్తున్నారని, అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖాకీ డ్రెస్ వేసుకొని పచ్చ జెండా కింద పని చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అలిపిరిలో అమిత్ షాపై రాళ్లదాడి చంద్రబాబు ఆదేశాలతోనే జరిగిందని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే బీజేపీ కార్యకర్తలపై ఎదురు కేసులు పెట్టారని కన్నా ధ్వజమెత్తారు. గతంలో సోము వీర్రాజు ఇంటిపై టిడిపి కార్యకర్తలు దాడి చేశారని గుర్తుచేశారు. తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో సీఎం పర్యటన సందర్భంగా, బీజేపీ నేతలను గృహనిర్భందం చేశారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. -
చంద్రబాబుది అన్నం పెట్టిన చేతిని నరికే సంస్కృతి
-
‘ఆంధ్ర అపరిచితుడి మాటలు నమ్మకండి’
సాక్షి, విజయవాడ: చంద్రబాబుది అన్నం పెట్టిన చేతిని నరికే సంస్కృతి అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అనుభవం ఉన్న వ్యక్తి అని చంద్రబాబును ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే గజదొంగను మించిపోయారని ధ్వజమెత్తారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు అద్దె మైకు లాంటివారని ఎద్దేవా చేశారు. అవినీతి అరాచకం తప్ప నాలుగేళ్ల నుంచి చంద్రబాబు ఈ రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. ‘చంద్రబాబు నిన్న చేసింది నవనిర్మాణ దీక్ష కాదు నయవంచన దీక్ష. మూడు దీక్షల్లో కాంగ్రెస్ను తప్పుబట్టిన చంద్రబాబు ఈ దీక్షలో తన నిజరూపాన్ని బయట పెట్టుకున్నారు. రాహుల్ గాందీ ప్రాపకం కోసం మోదీ, అమిత్ షాలను విమర్శిస్తున్నారు. నాలుగేళ్ల పాలనలో మోదీ అవినీతి రహిత పాలన సాగించి అందరికి ఆదర్శంగా నిలిచారు.156 సంక్షేమ పథకాలను మోదీ అమలు చేసి.. అన్ని వర్గాల వారికి చేయూతను ఇచ్చారు.చంద్రబాబు ప్రభుత్వం అనేక కుంభకోణాల్లో కూరుకుపోయింది. ఏపీలో అసమర్థ పాలన, పోలీసు రాజ్యం సాగుతుంది. న్యాయం చేయాలని ఎవరైనా బయటకు వస్తే వారిని బెదిరిస్తున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాధనాన్ని టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారు. టీడీపీ నాయకులు మట్టి, ఇసుక, భూకబ్జా మాఫియాలకు పాల్పడుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర అపరిచితుడు మాటలను నమ్మొద్దు. ఆయన చరిత్ర మొత్తం మోసపూరితం, కుట్ర పూరితం, వెన్నుపోట్లు. దేశంలో ఏ రాష్ట్రం అయినా కేంద్ర మోసం చేసిందని చెప్పిందా? ఎన్డీఏలో ఉంటూ కుట్రలు చేసి బీజేపీపై చంద్రబాబు బురద జల్లుతున్నారు. విభజన బిల్లులో చాలా అంశాలను కేంద్రం అమలు చేసింది. సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది అన్నట్లుగా చంద్రన్న బీమా పధకానికి కేంద్రం ఇచ్చే నిధులు వాడుకుంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో పార్టీల మధ్య అక్రమ సంబంధాలు అంటకడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. చంద్రబాబుకు దమ్ముంటే జనాల్లోకి వెళ్లి వాస్తవాలు చెప్పాలి. చంద్రబాబు చేసిన కుట్రలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికలలో బీజేపీ విజయానికి కృషి చేస్తా. ఇంటింటికి బీజేపీ పేరుతో యాత్రలు చెపడతాం. బిజెపి పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి.. మేము చేసిన అభివృద్ధి ని ప్రజలకు వివరిస్తామ’ని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. -
మహానాడు కాదు.. మాయనాడు..
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని వాడుకుని రెండుసార్లు అధికారంలోకి వచ్చారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరం తీరాక టీడీపీ, బీజేపీని దోషిగా నిలబెడుతోందంటూ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు డబుల్ గేమ్ ఆడారని చెప్పారు. చంద్రబాబును పెద్ద మాయగాడు అని అభివర్ణించారు. నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) జయంతి సందర్భంగా చంద్రబాబు మహానాడు పేరుతో మాయనాడును నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్టీఆర్ను ఆత్మక్షోభకు గురి చేశారని చెప్పారు. టీడీపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్తో జతకడుతోందని అన్నారు. కర్ణాటకలో చంద్రబాబు వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. -
విభజన సమయంలో బాబు డబుల్ గేమ్ ఆడాడు
-
కులరాజకీయాలు పెచ్చుమీరాయి
సాక్షి, గుంటూరు/గన్నవరం/మంగళగిరి రూరల్: రాష్ట్రంలో కుల రాజకీయాలు పెచ్చుమీరిపోయాయని.. వెంకటేశ్వర స్వామికి కూడా కులాన్ని ఆపాదించి వెంకన్నచౌదరిగా పిలుస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మండిపడ్డారు. గుంటూరు నగరంలోని సిద్దార్థ గార్డెన్స్లో శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాంమాధవ్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు కంటే కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో ఐదేళ్లు సీనియర్ అని చెప్పారు. కాంగ్రెస్పై ఎన్టీఆర్ పోరాటం చేస్తే.. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్తో జత కట్టేందుకు తహతహలాడుతున్నారని దుయ్యబట్టారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేస్తానని చెప్పారు. కాగా, తాళ్లాయపాలెం పీఠాధిపతి శివస్వామి కన్నాకు ఆశీర్వచనం అందించారు. -
చంద్రబాబులా కన్నాకు మామలేరు
-
కదులుతున్న రైల్లో నుంచి టీడీపీ దూకేసింది
సాక్షి అమరావతి : తెలుగుదేశంపార్టీ (టీడీపీ) నాయకత్వం పాత స్నేహాన్ని మర్చిపోయిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ విమర్శించారు. శనివారం గుంటూరు సిద్దార్థ గార్డెన్లో ఎన్డీఏ నాలుగేళ్ల విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రామ్ మాధవ్ టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దుష్ట చరిత్ర ఉన్న కాంగ్రెస్తో జతకట్టి ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడించారని విమర్శించారు. అధర్మ రాజకీయాలు చేస్తూ ధర్మపోరాటం చేయడం ఏంటని నిలదీశారు. ఎవరిది ధర్మపోరాటమో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. రాజకీయాల్లో వెన్నుపోటు పొడిచి పైకి రావడానికి కన్నా లక్ష్మీనారాయణకు మామ లేరని ఎద్దేవా చేశారు. చివరకు దేవుడిపై కూడా ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని, వెంకటేశ్వర స్వామికి కూడా కులాన్ని అంటగట్టారని రామ్ మాధవ్ మండిపడ్డారు. కేవలం తమతో పొత్తు కారణంగానే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ.. కదులుతున్న రైలు నుంచి దూకేసి, గాయం తగిలిందంటూ మొసలి కన్నీరు కారుస్తోందని చెప్పారు. నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు కంటే కన్నా లక్ష్మీనారాయణకే అనుభవం ఎక్కువని పేర్కొన్నారు. పోలవరానికి వంద శాతం నిధులు ఇస్తామని, ఏపీ విభజన చట్టంలోని హామీలు అన్నీ అమలు చేస్తామని వెల్లడించారు. ఒకరు థర్డ్ ఫ్రంట్ అంటే మరొకరు ఫోర్త్ ఫ్రంట్ అంటూ తిరుగుతున్నారని ప్రస్తావించారు. ఎన్ని ఫ్రంట్లు వచ్చినా బీజేపీని ఏం చేయలేవంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి ప్రతిపక్షం లేదని, నాలుగేళ్లలో మచ్చలేని పాలన అందించారన్నారు. అవినీతి చేసి దొరకనప్పుడు అందరూ ప్రజాసేవ, అవినీతి రహితం అంటూ మాట్లాడుతారని రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. టీడీపీ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా నాలుగేళ్లపాటు స్వచ్ఛమైన పరిపాలన అందించామని పేర్కొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో ఏపీలో నూతన ఒరవడి సృష్టిస్తామన్నారు. 2022 నాటికి దేశంలో పేదరికం లేని కొత్త భారతదేశం నిర్మాణానికి మోదీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు సిద్ధార్థ్నాథ్ సింగ్, జీవీఎల్ నరసింహా రావు, సోము వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు. -
కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు బాధ్యతలను నూతన అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్ధ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపీ గోకరాజు గంగరాజు, పార్టీ మహిళా నేత పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తే... కక్షపూరిత వాతావరణం నెలకొంది. కూటమిలో ఉంటూనే టీడీపీ...బీజేపీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చేతగానితనంతో కేంద్రంపై నిందలు వేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా ప్రధాని 24 గంటల పాటు నిరంతరం పని చేస్తున్నారని కన్నా పేర్కొన్నారు. చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని ఎండగడతామని తెలిపారు. -
చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారు
-
కాంగ్రెస్ పార్టీలో టీడీపీ కలిసిపోయింది..
సాక్షి, గన్నవరం : ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేయడం శుభపరిణామమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గుంటూరులో జరిగే కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ నేతలు రాంమాధవ్, యూపీ మంత్రి సిద్ధార్థ సింగ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు శనివారం గన్నవరం చేరుకున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు గన్నవరం విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాంమాధవ్ మాట్లాడుతూ...‘ రాష్ట్రంలో చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారు. చివరికి ఫ్లెక్సీల మీద కూడా తమ కుటుంబానికి చెందినవారి ఫోటోలను మాత్రమే వేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో విడిపోవడం మాకు నష్టం లేదు. మాతో విడిపోయిన తర్వాత టీడీపీ విషప్రచారం చేస్తోంది. ఎవరిది ధర్మ పోరాటమో ప్రజలే నిర్ణయిస్తారు. నరేంద్ర మోదీ ఇమేజ్ వలనే దేశంలో బీజేపీ బలంగా ఉంది. కాంగ్రెస్ వ్యతిరేక విధానాలతో పుట్టిన టీడీపీ చివరకు కాంగ్రెస్లోనే కలిసిపోయింది. రాహుల్ గాంధీ, చంద్రబాబు చేతులు కలపడాన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. అభివృద్ధి ప్రధాన అంశంగా 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2019లో కూడా అదే ఉత్సాహంతో ముందకు వెళ్తాం. ఏపీకి హోదా విషయాన్ని పక్కనపెడితే ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాం.ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి టీడీపీ స్వార్థ ప్రయోజనం కోసం దుష్ప్రచారం చేస్తోంది.’ అని ధ్వజమెత్తారు. -
అనుభవమున్న వ్యక్తి అని అధికారమిస్తే..
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి అని అధికారం ఇస్తే ప్రశ్నించే గొంతుకులను అణచివేసే సంస్కృతిని తీసుకొచ్చారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్యాయం జరుగుతోందని మాట్లాడితే అణచివేసే ధోరణిలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం, కేసులు పెట్టడం మంచి పద్దతికాదని హితవు పలికారు. సీఎం చంద్రబాబు ఈ ధోరణి మార్చుకోకుంటే నాలుగు మాసాలనంతరం ప్రజలే తిరగబడుతారని హెచ్చరించారు. 2019లో చంద్రబాబుకి ప్రజల సమస్యలు కనబడేలా, వినబడేలా చేస్తామన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అనేక దేవాలయాలను కూల్చివేశారని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రధాన అర్చకుడు చెబితే వయసు పరిమితి పెట్టి ఆయన్ను తీసేశారని మండిపడ్డారు. -
తప్పు చేయకపోతే భయమెందుకు చంద్రబాబూ?
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు కాబట్టే కేసుల పేరు చెబుతుంటే ఆయన ఉలిక్కిపడుతున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. సోమవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశంలో కన్నా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాటాడుతూ.. ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ద్వారా నిధులిస్తామని కేంద్రం ముందుకొచ్చినా దాన్ని సాధించుకోవడంతో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల్లో కేంద్రం ఇప్పటికే 85 శాతం అమలు చేసిందని, మిగిలినవి కూడా కేంద్రం అమలు చేస్తుందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వాటి సాధనలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కేంద్రం తనపై కక్ష సాధింపునకు దిగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతుండడం చూస్తుంటే ఆయన ఏదో తప్పు చేశారని స్పష్టమవుతోందన్నారు. కేసుల పేరు చెబితే చంద్రబాబు ఊలిక్కిపడుతున్నారన్నారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. హోదా కోసం నాలుగేళ్లుగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాన్ని చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారన్నారు. గాలి కబుర్లు చెబితే నమ్ముతారనుకోవద్దు.. ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను కన్నా కొట్టిపారేశారు. కేంద్రం నుంచి బయటకొచ్చినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకుగానూ అమిత్షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్లను కన్నా కలసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాష్ట్ర పార్టీలో నెలకొన్న విభేదాలు టీకప్పులో తుపాను లాంటివని, కన్నాను నియమించడం వల్ల అవి సమసిపోతాయని జాతీయ కార్యదర్శి మురళీధర్రావు అన్నారు. -
కన్నాకు బీజేపీ రాష్ట్ర పగ్గాలు
సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ, గుంటూరు, గన్నవరం: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కార్యాలయ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ ఆదివారం జారీ చేశారు. మరోవైపు పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షునిగా నియమితులవుతారని విస్తృత స్థాయిలో ప్రచారం జరిగిన ఎమ్మెల్సీ సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్గా నియమించారు. పార్టీ నిబంధనావళి ప్రకారం పార్టీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీనే.. ఎన్నికలప్పుడు ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థుల పేర్లను జాతీయ కమిటీకి సూచిస్తుంది. అలాంటి కీలక బాధ్యతల్లో ఆయన్ను నియమించడం విశేషం. బీజేపీ నిబంధనావళి ప్రకారం ఆరేళ్లపాటు సభ్యత్వ మున్న వారినే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వంటి పదవుల్లో నియమించాల్సి ఉంటుంది. అయితే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరి మూడున్న రేళ్లే అయింది. అయినప్పటికీ రాజకీయ అనుభవంతోపాటు ఆర్థిక వనరులున్న కన్నాకు రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించుకుందన్న ప్రచారం సాగుతోంది. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైనట్టు ఉత్తర్వులు వెలువడగానే గుంటూరు కన్నావారితోటలోని కన్నా కార్యాలయానికి పలువురు పార్టీ నేతలు చేరుకుని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో తనపై నమ్మకముంచి అప్పగించిన బాధ్యతలకు కట్టుబడి పదవికి న్యాయం చేస్తానని చెప్పారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులైన విషయం తెలియగానే కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆదివారం ఆయన ఇంటికొచ్చి కలిశారు. -
మాజీ మంత్రి కన్నాకు అస్వస్థత
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున అధిక రక్తపోటుతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆయన్ను గుంటూరులోని లలిత సూపర్స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వైద్యులు డాక్టర్ విజయ, డాక్టర్ రాఘవశర్మ తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. నాలుగు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించిన తరువాత డిశ్చార్జి చేస్తామని చెప్పారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో బీపీ టాబ్లెట్ వేసుకున్నారని, బుధవారం తెల్లవారుజామున మరింత ఇబ్బందిగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకొచ్చామని కన్నా కుమారుడు, మాజీ మేయర్ కన్నా నాగరాజు తెలిపారు. -
కన్నా లక్ష్మీనారాయణకు తీవ్ర అస్వస్థత
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్లుండి హైబీపీ రావడంతో హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కన్నాకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కాగా, మంగళవారం కన్నా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
వైఎస్సార్సీపీలోకి కన్నా
సాక్షి, అమరావతి బ్యూరో: బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే గుంటూరు వెస్ట్తో పాటు, పెదకూరపాడు నియోజకవర్గంలో తన అనుచరులతో పలుమార్లు సమావేశమై వైఎస్సార్సీపీలో చేరికపై చర్చించారు. ఈ మేరకు బుధవారం కృష్ణా జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు సమాచారం. ఆయనతో పాటు ఆయన తనయుడు, మాజీ మేయర్ కన్నా నాగరాజు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పడుచూరి వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాళ్ళ వెంకటేష్యాదవ్, చదలవాడ వేణుబాబు, బీజేపీ నగర యువమోర్చా అధ్యక్షుడు శిఖాకొల్లి అభినేష్, నగర ప్రధాన కార్యదర్శి కొల్లి సుబ్బారెడ్డి, బీసీ మోర్చా నగర అధ్యక్షుడు రాచమంటి భాస్కరరావు, పరుచూరి సంజయ్, తాడిశెట్టి రఘు, మాజీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు వైఎస్సార్సీపీలో చేరనున్నారు. మంగళవారం కన్నాను ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, నేతలు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గుంటూరులోని నివాసం నుంచి భారీ ర్యాలీతో బయలుదేరనున్నారు. కన్నా గతంలో గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు, గుంటూరు వెస్ట్ నుంచి ఒకసారి మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. -
కాపు నేతకే ఏపీ బీజేపీ పగ్గాలు
-
ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టారు
-
మీ కుట్రలు సాగనివ్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిపాలనలో ఘోర వైఫల్యం, అవినీతి అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఆ తప్పంతా కేంద్రంపై నెట్టివేసి తప్పుకోవాలని చూస్తోందంటూ భారతీయ జనతా పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పాటు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తూ వచ్చిన టీడీపీ ఎన్నికల సంవత్సరం దగ్గరపడుతున్న సమయంలో కుట్రలు చేస్తోందంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు కేంద్రాన్ని దోషిగా చూపించి లబ్ధి పొందాలన్న ఎత్తుగడలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ నేతలకు ఆ పార్టీ అధిష్టానం సూచనలు జారీచేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు టీడీపీ వైఖరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత నాలుగేళ్లుగా కేంద్రం అందించిన సాయం వివరాలతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు 27 పేజీల నివేదికను ఢిల్లీలో విడుదల చేశారు. కేంద్రం సహాయం చేయడంలేదన్న టీడీపీ వాదనలకు గణాంకాలతో చెక్ పెట్టారు. పొత్తులపై తేల్చుకోవాల్సింది టీడీపీయేనంటూ కుండబద్దలు కొట్టారు. రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజలను రెచ్చగొట్టవద్దని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచలేమన్నందుకే మాపై కుట్ర చేస్తున్నారా? అంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. కేంద్రం ఎంతో సాయం చేస్తుందంటూ నాలుగేళ్లుగా పొగిడిన చంద్రబాబు ఇప్పుడెందుకు ప్లేటు ఫిరాయించారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో టీడీపీ ఎంపీలు ఎలా భేటీ అవుతారంటూ నిలదీశారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా గొడవ చేస్తున్నారంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. తమను ముంచాలని చూస్తే చంద్రబాబే మునిగిపోతారని హెచ్చరించారు. కేంద్రం ఎంత ఇచ్చిందో, ఎంత ఖర్చుచేశారో బహిరంగ ప్రకటన చేయాలంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఈవెంట్ల పేరుతో, సదస్సుల పేరుతో ఫైవ్స్టార్ హోటళ్లకు కోట్లాది రూపాయలు తగలేస్తున్న టీడీపీ ప్రభుత్వం ఏపీకి నిధుల లోటు ఉందంటే ప్రజలు కూడా నమ్మబోరని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం దుబారాపై చర్చకు సిద్ధమా? అంటూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. టీడీపీ కేంద్రంలో అధికారంలో కొనసాగుతూ... ప్రభుత్వ నిర్ణయాలను ఒకవైపు ఆమోదిస్తూ... మరోవైపు ప్రజలను మభ్యపెట్టడానికి సభలో నిరసనలకు దిగుతున్నారనే అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బీజేపీ నేతలు అస్త్రాలను సన్నద్ధం చేసుకుంటున్నారు. రాజీనామాలు ఎందుకు చేయడం లేదు? ఇటీవల చంద్రబాబునాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. రెండు ఎకరాల ఆసామి రెండు వేల కోట్లకు పైగా ఆస్తులు ఎలా సమకూరాయని కూడా ఆయన పరోక్షంగా సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఆ సమయంలో టీడీపీ నేతలు వీర్రాజు ఇంటిపై దాడికి తెగబడ్డారు. మరోవైపు పార్టీ అధినేత ఆదేశాలతో వీర్రాజుపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. చంద్రబాబును విమర్శించే ముందు వీర్రాజు తమ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాలని డిమాండ్ చేశారు. అలాగైతే కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై విమర్శలు చేస్తున్న తెలుగుదేశం నేతలు కేంద్ర మంత్రి పదవులకు ఎందుకు రాజీనామాలు చేయలేకపోతున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పదవుల్లో కొనసాగుతూ ప్రశ్నించే అర్హత టీడీపీ వారికి లేనేలేదని, ఇదే అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నదే తమ వ్యూహమని చెబుతున్నారు. అదే సమయంలో ఈ నాలుగేళ్లలో కేంద్రం నుంచి ఇచ్చిన నిధులను, ఇతర ప్రాజెక్టులను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నామని పేర్కొంటున్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించడం లేదని, అవినీతి అక్రమాలను పాల్పడిందని, వాటినీ ప్రజలకు వివరిస్తామని చెబుతున్నారు. పోలవరం, రాజధాని నిధులే కాకుండా వివిధ పథకాల కింద వచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వ నేతలు పక్కదారి పట్టిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నియోజకవర్గంలోనే రూ.10 కోట్లమేర ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పట్టిన వైనాన్ని వారు గుర్తుచేస్తున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు పేర్లు మార్చి తన సొంత పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారని, కనీసం ప్రధాని ఫొటో కూడా పెట్టడం లేదని ఇప్పటికే బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సోము వీర్రాజు ప్రకటనల తరువాత బీజేపీ రాష్ట్ర నేతల ప్రచారాలు ప్రజల్లోకి వెళ్లకుండా కట్టడికి తెలుగుదేశం నేతలు కొన్ని లీకులు ఇప్పించి సోము వీర్రాజును ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్షా మందలించినట్లు తమ మీడియాలో ప్రచారం చేయించారు. బీజేపీ నేతలు వాటిని ఖండించడమే కాకుండా మరింత ఉధృతంగా టీడీపీపై విమర్శల దాడి పెంచేందుకు సన్నద్ధమవుతున్నారు. సాక్షాత్తూ అమిత్షానే తమకు మార్గనిర్దేశం చేసినందున జిల్లా స్థాయి వరకు టీడీపీ మోసపూరిత నిరసన నాటకాన్ని ప్రజల ముందు ఎండగట్టాలని నిర్ణయించారు. బీజేపీ లేకపోతే టీడీపీకి అధికారమెక్కడిది? మిత్రపక్షంగా ఉంటూనే బీజేపీని నిర్వీర్యం చేయడానికి తెలుగుదేశం తెరవెనుక కుట్రలు చేస్తోందని ఆ పార్టీ నేతలు ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నారు. బీజేపీ నేతల నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తమ వారికి పనులు కూడా చేయనివ్వకుండా అధికారులకు ఆదేశాలిచ్చారని చెబుతున్నారు. ఇదంతా రాజకీయంగా దెబ్బతీసేందుకు చంద్రబాబునాయుడు తెరవెనుక ఆడిన నాటకమని పేర్కొంటున్నారు. కాకినాడ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారని గుర్తుచేస్తున్నారు. ‘బీజేపీకి రాష్ట్రంలో స్వతంత్రంగా 18% ఓట్లు సాధించుకొనే సత్తా ఉంది. గతంలో ఇది నిరూపితమైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిందంటే అది మా చలవే. టీడీపీ వైఎస్సార్సీపీకి కేవలం ఓట్ల తేడా ఐదు లక్షల ఓట్లే. మా వల్ల అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పడు మమ్మల్నే అణగదొక్కాలని చూస్తోంది’ అని బీజేపీ సీనియర్ నేత ఒకరు మండిపడ్డారు. ‘రాష్ట్ర బీజేపీ పార్టీనే కాకుండా జాతీయ పార్టీని, ప్రధాని మోడీని కూడా రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని చూస్తోంది. దీనిని మేమెంత మాత్రం సహించబోము. మా తడాఖా ఏమిటో మేమూ చూపిస్తాం’ అని మరో బీజేపీ నేత చెప్పారు. లెక్కలు చెప్పడానికి భయమెందుకు? కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఇచ్చిన నిధులు లెక్కలు చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి భయమెందుకని బీజేపీ రాష్ట్రనేత ఒకరు ప్రశ్నించారు. ‘‘టీడీపీ నేతలు నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం రాలేదని ఇప్పుడు చెబుతున్నారు. అసలు ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన వాటికి లెక్కలు కూడా చెప్పడం లేదు. పోలవరానికి ఇచ్చిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. యూసీలు ఇవ్వడానికి ఎందుకు అంత భయం? అక్కడ జరిగిన అవినీతి బయటపడుతుందని భయమా? రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధుల పరిస్థితీ అలాగే ఉంది. శాశ్వత నిర్మాణాలు కాకుండా తాత్కాలిక నిర్మాణాలంటూ ఆ నిధులు వృథా చేస్తున్నారు. తెరవెనుక లాలూచీలతో ఇవన్నీ తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించి అవినీతికి పాల్పడుతున్నారు. వీటన్నిటిలో ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసు. నిధులు కేంద్రం నుంచి సహాయం రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన రిపోర్టులు ఉండాలి. ఇతర రాష్ట్రాలు త్వరితంగా డీపీఆర్లు పంపించి నిధులు రప్పించుకుంటుండగా ఇక్కడ మాత్రం అలా చేయడం లేదు. వారి వైఫల్యాలకు కేంద్రంపై, బీజేపీపై నిందలు వేస్తున్నారు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
'మమ్మల్ని ముంచాలనుకుని మీరు మునగొద్దు'
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. నిన్నటి వరకు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా మరోనేత అధికార పార్టీ నేతలపై మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి వినియోగిస్తున్న ప్రతి పైసా కేంద్రం నుంచి వచ్చిందేనని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరానికి కేంద్రం రూ. 4 వేల కోట్లు ఇచ్చిందన్నారు. ప్రత్యేక హోదాకు సాంకేతిక ఇబ్బంది ఉన్నందున.. ప్ర్యతేక ప్యాకేజీ ఇచ్చారన్నారు. అపుడు సీఎం చంద్రబాబు, మంత్రులు కూడా అభినందించారని గుర్తు చేశారు. కేంద్రం ఆర్థిక సాయం చేస్తున్నా టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఏపీకి పదేళ్లలో ఇవ్వాల్సింది.. రెండున్నర ఏళ్లలో బీజేపీ ఇచ్చిందన్నారు. మిత్రధర్మం అంటూనే బీసీ చట్టబద్ధత, ట్రిపుల్ తలాక్ బిల్లులకు కాంగ్రెస్తో కలిసి టీడీపీ మోకాలడ్డుతోందని ఆరోపించారు. సోము వీర్రాజుపై దాడులు సరికాదన్నారు. తమని ముంచాలనుకుని.. టీడీపీ మునగొద్దని ఆయన హితవు పలికారు. -
టీడీపీ నేతలకు అలవాటుగా మారింది
-
టీడీపీ నేతలకు అలవాటుగా మారింది: కన్నా
విజయవాడ: టీడీపీ నేతలకు బీజేపీని విమర్శించడం అలవాటుగా మారిందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ నేతలు విమర్శించడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఖండించడం...ఇదంతా ఓ నాటకంలా కనిపిస్తోందని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. ఈ తరహా కుట్రలను తాము అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని ఆయన తెలిపారు. అలాగే ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక పార్టీ అభిప్రాయామా అనేది చెప్పాలని కన్నా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రధానమంత్రిని ప్రతిపక్ష నేత కలిస్తే తప్పేముందని, ఇందులో పెడర్థాలు తీయాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే విజయవాడలో టీడీపీ మరింతగా భారీ మెజార్టీతో గెలిచేదని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
అమిత్ షా ఏం నిర్ణయం తీసుకుంటారో?
గుంటూరు : తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంపై బీజేపీ నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ తన అసంతృప్తి వెళ్లగక్కారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని వెంకయ్య నాయుడు చెప్పారని, అయితే ఎన్నికల నాటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని ఆయన గురువారమిక్కడ అన్నారు. టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని, ఇదే విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లినట్లు కన్నా తెలిపారు. దీనిపై కమిటీ వేసి విచారణ జరుపుతామన్నారని అమిత్ షా తెలిపారన్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు ఏపీ బీజేపీ నేతలు అంతగా ఆసక్తి చూపడం లేదు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై పలువురు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. తాజాగా కన్నా లక్ష్మీ నారాయణ కూడా అదే అంశాన్ని తెరమీదకు తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
కాపులు మంచోళ్లన్న బాబు..కేసులెందుకు??
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ...ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీను ఏపీ ప్రభుత్వం నెరవేర్చలేదు కాబట్టే ఆందోళనకు దిగామని చెప్పారు. కాపులు మంచి వాళ్లన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేసులెందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన హామీ గుర్తు చేసేందుకే తుని సభ నిర్వహించాల్సి వచ్చిందని కన్నా అన్నారు. తునిలో హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. -
నేడు బీజేపీలోకి కన్నా లక్ష్మీనారాయణ
హైదరాబాద్ : మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆయన, తన మద్దతుదారులతో ఈరోజు ఉదయం 10.30 గంటలకు కాషాయ కండువా కప్పుకోనున్నారు. వారం క్రితమే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. -
ఫ్లాప్ షో..!
సాక్షి, ఒంగోలు: ‘కాశీకి వెళ్లానని..కాషాయం..’ అంటూ ఇంద్ర సినిమా డైలాగ్తో ప్రారంభమైన ఆయన ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తల బుర్రను వేడెక్కించింది. నూనుగు మీసాల వయసులో ఒంగోలులో తాను తిరిగిన జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని చెప్పిన ఆయన గుర్తులు వేదికపైనున్న కాంగ్రెస్ పెద్దల్ని అయోమయానికి గురిచేశాయి. ‘కాంగ్రెస్ పార్టీ అనేది ప్రకృతి గద్ద.. రెక్కలు విప్పుకుని ఆకాశంలో ఎగిరిన పక్షిలా.. నేడు యువకులు రూపాంతరం చెందాలి.. కార్యోన్ముఖులు కావాలి..’ కాంగ్రెస్ ప్రచారకమిటీ అధ్యక్ష బాధ్యత చేపట్టిన కేంద్రమంత్రి చిరంజీవి పొంతనలేకుండా చేసిన వ్యాఖ్యలివి.. సోమవారం ఒంగోలులో కాంగ్రెస్ బస్సుయాత్ర కాస్తా తుస్సుమంది. గుంటూరు జిల్లా నుంచి నేరుగా ఒంగోలులోకి ప్రవేశించిన బస్సుయాత్ర నగరంలో ట్రంకురోడ్డు, చర్చిసెంటర్, కలెక్టరేట్, రామ్నగర్ మీదుగా సాగింది. అనంతరం ఓ ప్రైవేటు ఫంక్షన్హాలులో ఏర్పాటు చేసిన సమావేశానికి సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, చిరంజీవి, కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలం, మాజీమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశం ఆద్యంతం గందరగోళంగా నడిచింది. చిరంజీవి అభిమానులు అక్కడికొచ్చినా... వారు తమ అభిమాన నేతను కలిసే విషయంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో తీవ్రంగా విభేదించి వాగ్వాదానికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ ఫ్లెక్సీలను కూడా చించేశారు. నేతల ప్రసంగాలకు అడ్డుతగులుతున్న చిరు అభిమానుల హడావుడిపై రఘువీరారెడ్డి తీవ్ర అసహనానికి గురై మైక్లో కేకలేశారు. స్వయంగా చిరంజీవి పైకిలేచి ..మైకు పట్టుకుని క్రమశిక్షణ అంటూ అభిమానులను కట్టడిచేసే ప్రయత్నం చే సినా.. వారిమధ్య వాగ్వాదాలు సద్దుమణగలేదు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రను నవ్యాంధ్రగా మార్చే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. దొంగే..దొంగదొంగ అని అరిచినట్లు చంద్రబాబు కాంగ్రెస్ను విమర్శిస్తున్నారని.. అతనికి భవిష్యత్లో ఘోరపరాభవం ఎదురుకానున్నదని రఘువీరా జోస్యం చెప్పారు. కేంద్రమంత్రి పనబాక మాట్లాడుతూ చిరంజీవిని సూపర్స్టార్ అని సంభోదించగా.. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. పవర్స్టార్, జై జనసేన అంటూ పవన్కల్యాణ్ను స్తుతిస్తూ కొందరు పవన్కల్యాణ్ అభిమానులు పెద్దగా నినాదాలివ్వడంతో వేదికపై నేతలు డైలామాలో పడ్డారు. పలువురు రాష్ట్ర నేతలు మాట్లాడినప్పటికీ.. రాష్ట్రవిభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు, సీమాంధ్ర ప్యాకేజీలపై కార్యకర్తల్లో సరైన అవగాహన కల్పించలేకపోయారు. చివరికి చిరంజీవి ప్రసంగంలో ఒంగోలును జపాన్ చేస్తానని.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ప్రకాశం రైతులకు మేలంటూ .. చెప్పడంపై విసుగు చెందిన పలువురు నేతలతో పాటు సమావేశం నుంచి భారీగా కార్యకర్తలు బయటకు వెళ్లిపోయారు. ‘స్టాలిన్’ డైలాగ్ను గుర్తుచేసిన పనబాక కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా డైలాగ్ను చెబుతూ.. కాంగ్రెస్పై ఇతర పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని ఒకరు మరో ముగ్గురుతో మాట్లాడి తిప్పికొట్టాలని సూచించారు. చిరంజీవి అభిమానులు ఈలలు, చప్పట్లకు పరిమితం కాకూడదంటూ.. రానున్న కాలంలో యువతకు తమపార్టీ పెద్దపీట వేస్తుందని చెప్పారు. మరో కేంద్రమంత్రి జేడీ శీలం మాట్లాడుతూ చంద్రబాబు బీజేపీతో అశ్లీలపొత్తుకు సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. ఆయన తొమ్మిదేళ్లహయాంలో ఇంకుడు గుంతలు, నీరు, మీరు, వనం..మనం తదితర పథకాలతో పచ్చకండువాల నేతలకు రాష్ట్ర్రాన్ని బేరం పెట్టడం అందరికీ తెలిసిందేనన్నారు. సీమాంధ్రకు కేంద్రమిచ్చిన ప్రత్యేక ప్యాకేజీతో ఒక్కో పట్టణాన్ని ఒక్కో భాగ్యనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మాజీమంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ పదవులు అనుభవించి పక్కకెళ్లిన నేతల కారణంగా కాంగ్రెస్కు కష్టాలు దాపురించాయన్నారు. త్వరలో సీమాంధ్ర అద్భుతప్రగతిని చూస్తుందన్నారు. మాజీమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే జీవీ శేషు తదితరులు మాట్లాడారు. కాంగ్రెస్ బస్సుయాత్రకు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, జీవి శేషు మినహా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీమంత్రి మానుగుంట మహీధర్రెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా దూరంగా ఉన్నారు. కార్యక్రమం అంతటా చిరంజీవి అభిమానులు తప్ప కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పెద్దగా కనిపించలేదు. గతంలో తాను పీఆర్పీ అధినేతగా సమైక్యాంధ్ర కోసం పోరాడానంటూనే.. అప్పట్లో తనను ఎవరూ మెచ్చుకోనందున.. కాంగ్రెస్లో కలిశానని.. ఇప్పుడు తన హక్కులు, అధికారాలు పరిమితమయ్యాయని చిరంజీవి చెప్పుకోవడంపై అభిమానులు పెదవి విరిచారు. చిరంజీవి మాట్లాడుతూ మాగుంట కాస్త అటూఇటుగా ఉన్నారని, ఆయన మళ్లీ కాంగ్రెస్లోకి వస్తారని అన్నారు. విభజనపై తాను బాధపడుతున్నానని ఆయన చెప్పుకుంటూనే కాంగ్రెస్ను ఓట్లేసి గెలిపించమనడం ఎంతవరకు సబబని కార్యకర్తలు ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. మొత్తానికి కాంగ్రెస్ బస్సుయాత్ర ఫ్లాప్షోగా మిగిలిపోయింది. -
ఉల్లంఘనలు ‘కన్నారా
ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన కాంగ్రెస్ కేంద్ర మంత్రి జై రాం రమేష్ పర్యటన ఆద్యంతం అధికార దుర్వినియోగం చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికార గణం ప్రభుత్వ ఆస్తులపైనా టీడీపీ, బీజేపీల ప్రచారం మున్సి‘పోల్స్’ నేపథ్యంలో జిల్లాలో సోమవారం నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవు తోంది. అయితే అధికార యంత్రాంగం మాత్రం కోడ్ ఉల్లంఘనపై కన్నెత్తి చూడటం లేదు. ఉల్లం‘ఘనుల’పై కొరడా ఝళిపించడం లేదు. మరో వైపు బుధవారం నుంచి సార్వత్రిక ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది. సాక్షి, గుంటూరు గుంటూరు నగరంలో ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో తాజా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు అనుకూలంగా పెద్ద ఎత్తున గోడ రాతలు వెలిశాయి. ఏకంగా ప్రభుత్వ ఆస్తులపైనే ప్రచారానికి తెగబడ్డారు. టీడీపీ, బీజేపీలు తామేమీ తీసిపోమన్న విధంగా గోడ రాతలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. సత్తెనపల్లి, నరసరావుపేటలో టీడీపీ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే అడుగడుగునా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు అనుకూలంగా విద్యుత్ సబ్ స్టేషన్లపైనా, ఫ్లై ఓవర్ల పైనా కలెక్టరేట్ రోడ్డులోనూ కన్నా హయాంలో అంత అభివృద్ధి.. ఇంత అభివృద్ధి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాతలు రాసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కేంద్ర మంత్రి జై రాం రమేష్ మంగళవారం గుంటూరు నగరంలో హల్చల్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ర్యాలీలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు బలప్రదర్శనలు, ర్యాలీలు జరపకూడదు. ఈ నిబంధన అతిక్రమించి మరీ జిల్లా సరిహద్దు తాడేపల్లి నుంచి భారీ కాన్వాయ్తో కేంద్ర మంత్రి పర్యటించారు. నిబంధనలు ఉల్లంఘించి హామీలు, వాగ్దానాలు ఇవ్వడంతో పలువురు ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఇంతటి స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతున్నా, కోడ్ అమలు బాధ్యతలు పర్యవేక్షించాల్సిన అధికారులు మిన్నకుండి పోయారు. మరో వైపు సార్వత్రిక ఎన్నికల కోడ్ కూడా బుధవారం నుంచి అమల్లోకి రానుంది. నోటీసులు జారీ చేయాలని వారం క్రితమే కలెక్టరు ఆదేశాలు మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకమునుపే జిల్లా కలెక్టరు ఎస్.సురేశ్కుమార్ పట్టణాల్లో అనధికార హోర్డింగులు, గోడ రాతలు, ఫ్లెక్సీలు తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తొలగించిన ఖర్చు ఏర్పాటు చేసిన వారి నుంచే వసూలు చేయాలని సూచించారు. నోటీసులకు స్పందించకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టరు ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలు ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పర్యవేక్షిస్తోంది. తాజా మాజీ మంత్రి కన్నా పేరుతో వెలసిన గోడ రాతల్ని తక్కువ ఖర్చుతో పెయింటింగ్ వేసి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన కార్పొరేషన్ అధికారులు నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారనే ఆరోపణలున్నాయి. కార్పొరేషన్ పరిధిలో కోడ్ ఉల్లంఘనకు సంబంధించి సూచనలు చేసినా పెడచెవిన పెట్టడంపై జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కళ్ళెదుటే గోడ రాతలు కనిపిస్తున్నా, ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు నగర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి జైరాం రమేష్ను ప్రసన్నం చేసుకునేందుకు తాజా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బ్యానర్లు కట్టి కోడ్ ఉల్లంఘనకు పాల్పడినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మస్తాన్వలి మరో అడుగు ముందుకేసి ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. మరో వైపు నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మీయపాదయాత్ర పేరుతో చేస్తున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వీధులన్నీ పచ్చ తోరణాలతో, పార్టీ బ్యానర్లతో కళకళలాడుతున్నా అధికారులకు మాత్రం ఇవేమీకనిపించలేదు. ఇతర పార్టీల నాయకులు ఫిర్యాదులు చేసినా వినిపించనట్లే ఉండిపోయారు. -
నాలుగో కృష్ణుడిపై సర్వత్రా ఆసక్తి!
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హస్తినకు చేరాయి. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాతో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఢిల్లీలో మకాం వేసి సీఎం పీఠం కోసం ఎవరికి వారే జోరుగా పైరవీలు చేస్తున్నారు. ఇప్పటికే ఇరు ప్రాంతాల నేతలు అధిష్టానం పెద్దలతో భేటీ కోసం పోటీ పడుతున్నారు. రాష్ట్రపతి పాలన కంటే ప్రభుత్వ ఏర్పాటు వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుండటంతో ‘సీఎం’ ఆశావహుల సందడి ఒక్కసారిగా పెరిగిపోయింది. తెలంగాణ నేతలూ పోటీలో ఉన్నా సీమాంధ్రకే, అందులోనూ కాపు సామాజిక వర్గానికి ఈసారి అవకాశమివ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. చిరంజీవి, కన్నా లక్ష్మీనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పల్లంరాజు, పీసీసీ చీఫ్ బొత్స కూడా రేసులో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో కేంద్రమంత్రి చిరంజీవి మంగళవారం భేటీ అయ్యారు. మరోవైపు ఉత్తరాంధ్రకు చెందిన కేంద్రమంత్రి కిల్లి కృపారాణి కూడా అందుబాటులో ఉండాలని సోనియా కార్యాలయం నుంచి పిలుపువచ్చినట్లు సమాచారం. ఇప్పటికే హస్తినలో మకాం వేసిన డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అలాగే మంత్రులు ముఖేష్ గౌడ్, డీకె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, సునీతా లక్ష్మారెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈరోజు ఉదయం దిగ్విజయ్ సింగ్ను కలిశారు. బుధవారం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని, అనంతరం 27 లేదా 28 తేదీల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ ఉంటుందని అంటున్నారు. మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా సీమాంధ్ర మంత్రులు, సీనియర్ నేతలకు దిగ్విజయ్ నుంచి ఇప్పటికే తాఖీదు అందింది. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం దామోదరతో పాటు మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి తదితరులతో పాటు పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ కూడా సీఎంగిరీ కోసం ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు పీఠం దక్కిన వారే సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కానుండటంతో అది ఎవరవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. -
రామానాయుడికి అంతిమ వీడ్కోలు
గుంటూరు మెడికల్, న్యూస్లైన్: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తండ్రి లగడపాటి వెంకటరామానాయుడు (75) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గుంటూరులో నివాసముంటున్న రామానాయుడు అస్వస్థతకు లోనవడంతో నెలరోజుల క్రితం హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించారు. ఊపిరితిత్తుల్లో నిమ్ముచేరి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. వెంకటరామానాయుడు భౌతిక కాయాన్ని సోమవారం మధ్యాహ్నం గుంటూరు మంగళగిరిరోడ్డులోని సీతారామనగర్ మూడోలైన్లోని స్వగృహంలో సందర్శనార్ధం ఉంచారు. రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, తెలుగుభాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా జడ్జి ఎస్.ఎం.రఫీ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కేశినేని నాని, నరేంద్ర చౌదరి, గజల్ శ్రీనివాస్ తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎంపీ లగడపాటిని, కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. పెద్దకుమారుడు ఎంపీ లగడపాటి అంత్యక్రియలు నిర్వహించారు. వెంకటరామానాయుడుకు భార్య రామలక్ష్మమ్మ, ఓ కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. కుమార్తె పద్మ భర్త భాస్కరరావు ల్యాంకో గ్రూప్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ ఎంపీగా, లగడపాటి శ్రీధర్ సినీనిర్మాతగా కొనసాగుతున్నారు. మూడో కుమారుడు మధుసూదన్ ల్యాంకో మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. -
వైఎస్ హయాంలో వ్యవసాయానికి పెద్దపీట
మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సాక్షి, బళ్లారి (కర్ణాటక) : వ్యవసాయం దండగ అంటూ ఒకవైపు నాటి పాలకుల ప్రచారం... వ్యవసాయం చేసి బతకలేమా? అంటూ మరోవైపు రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రంగానికి పెద్దపీట వేసి ఆదుకున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆది వారం బళ్లారిలో సింధూరి ఆగ్రోస్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొ న్న మంత్రి మాట్లాడుతూ ఆంధ్రలో వైఎస్ రైతులకు అనేక రకాల ప్రయోజనాలు కల్పించి మేలు చేశారన్నారు. రైతులు నూతన పద్ధతులను తెలుసుకుని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి పాల్గొన్నారు. -
కన్నాకు ఢిల్లీలో ఏంపని?
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఓవైపు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా జరుగుతుంటే మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హస్తినలో మకాం వేశారు. అధిష్టానానికి వీర విధేయుడిగా ముద్రపడిన కన్నా లక్ష్మీనారాయణ నిన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్న తరుణంలో కన్నా.... రాష్ట్రపతి ప్రణబ్, సోనియాలను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకీ 'కన్నా'కి ఢిల్లీలో ఏం పని అనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కన్నా అధిష్టానంతో మంతనాలు జరపటం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో కాక పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ ఇటీవలి రాష్ట్ర పర్యటన ముగించుకుని.... తాజా పరిణామాలను అధినేత్రికి నివేదిక అందించినట్లు సమాచారం. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియపై జెట్స్పీడ్తో ముందుకు పోతున్న కాంగ్రెస్ మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ వ్యవహార శైలిపై కూడా దృష్టి సారించినట్టు సమాచారం. ఇక కిరణ్ తీరుపై కూడా దిగ్విజయ్ సవివరంగా మేడమ్కు నివేదించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం కంట్లో నలుసుగా మారిన కిరణ్ ను మార్చే విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందనే అభిప్రాయానికి వచ్చిన పార్టీ అధిష్ఠానం, హుటాహుటిన కన్నాని ఢిల్లీకి పిలిపించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. గతంలోనూ కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీ వెళ్లివచ్చినప్పుడు ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఏకంగా ఆయన నియోజకవర్గంలో 'కాబోయే సీఎం కన్నాలక్ష్మీనారాయణ' అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే తాను సీఎం రేసులో లేనని కన్నా వివరణ కూడా ఇచ్చుకున్నారు. తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై వాడి వేడిగా చర్చ జరుగుతున్న క్రమంలో ఆయన ఢిల్లీ యాత్రకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఇక నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో చేయి కాల్చుకున్న కాంగ్రెస్ రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఫలితాలపై డీలా పడవద్దని, గెలుపోటములు సహజమని వేదాంతం గుమ్మరించిన కాంగ్రెస్ ... వచ్చే సాధారణ ఎన్నికలను ప్రభావితం చేసేలా నిర్ణయం ఉండాలని వ్యూహం రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం పావులు కదుపుతోంది. వీర విధేయులకే పట్టం కట్టే కాంగ్రెస్...ఈసారి సీఎం కుర్చీని ఎవరికి కట్టబెడుతుందో!! కన్నాను సీఎం పదవి వరిస్తుందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. -
సోనియా, రాష్ట్రపతి ప్రణబ్లతో కన్నా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం అత్యంత రహస్యంగా భేటీ అయినట్టు తెలిసింది. అధిష్టానం పిలుపు మేరకే ఢిల్లీ వచ్చిన కన్నా సాయంత్రం 6 గంటల తర్వాత సోనియాను ఆమె నివాసంలో కలిసి 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ముసాయిదా బిల్లుపై ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను అధినేత్రికి కన్నా వివరించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా అత్యంత గౌరవ ప్రదంగా అసెంబ్లీ నుంచి బిల్లు బయటకు వచ్చేలా సహకారం అందించాలని, మెజారిటీ సభ్యులచే బిల్లుకు మద్దతు తెలిపేలా చూడాలని సోనియా సూచించారు. అనంతరం రాష్ర్టపతి తోనూ భేటీ అయిన కన్నా అసెంబ్లీలో జరుగుతున్న ప్రక్రియను వివరించినట్టు తెలిసింది. భేటీ ముగిసిన వెంటనే కన్నా హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. గతంలో ఒకసారి కిరణ్ను మారుస్తారని విస్తృతంగా ప్రచారం జరిగిన తరుణంలో కన్నా లక్ష్మినారాయణ వెళ్లి సోనియాను కలిసి రావడం అప్పట్లో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం కూడా ఢిల్లీలో కన్నా కదలికలపై ఆరా తీసినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు కన్నా స్పందిస్తూ... తనకు, సీఎం కిరణ్కు మధ్య అంతరాన్ని పెంచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశేమీ లేదని పేర్కొన్నారు. ఇప్పుడు సీఎం గురువారం ఢిల్లీ వెళ్లనున్న తరుణంలో కన్నా ఆకస్మాత్తుగా బుధవారమే ఢిల్లీ వెళ్లి సోనియా, ప్రణబ్లను కలవడం పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
కాబోయే సీఎం 'కన్నా'నా?
హైదరాబాద్ : వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. ఆయన శనివారం గవర్నర్ నరసింహన్తో సమావేశం అయ్యారు. పావుగంట పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించినట్టు సమాచారం. గవర్నర్తో కన్నా భేటీ... పలు ఊహాగానాలకు తావిస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానంపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ధిక్కార స్వరం వినిసిస్తున్న నేపథ్యంలో గవర్నర్, కన్నా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వారం రోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణను కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఢిల్లీ పిలిపించుకుని చర్చించడం, ఇప్పుడు గవర్నర్ నరసింహన్తో భేటీ కావడం రాజకీయ చర్చకు దారితీసింది. కిరణ్ స్థానంలో కన్నా లక్ష్మి నారాయణను సీఎం గద్దె ఎక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఓవైపు మీడియాలో కూడా విస్తృత ప్రచారం లభిస్తోంది. ఇదే విషయంలో గుంటూరులో మూడు రోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణ పోస్టర్లు కలకలం సృష్టించాయి. కాబోయే సీఎం కన్నా అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేశారు. బుధవారం శ్రీనివాస గార్డెన్లో జరిగిన రచ్చబండలో కన్నా అభిమానులు రచ్చ రచ్చ చేశారు. సీఎం కిరణ్ను అధిష్టానం మారిస్తే ఆస్థానంలో కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తారంటూ సంబరపడిపోతున్నారు. కాబోయే సీఎం కన్నా అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రోజు పీసీసీ అధ్యక్షుడు బొత్సతో కన్నా భేటీ అయ్యారు. కాగా కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వరించిందంటూ ఇటీవలే ఆయన అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. హస్తిన నుంచి ఫోన్ వచ్చిందని కోట్ల ఇక సీఎం కుర్చీని అధిష్టించటమే తరువాయి అంటూ మిఠాయిలు పంచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అవన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది. మరి కన్నా విషయంలో ఏం జరుగుతుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
గవర్నర్తో మంత్రి కన్నా భేటీ
-
పితానికి సీఎం క్లాస్
ఏలూరు, న్యూస్లైన్ :సభలు, సమావేశాల్లో జాగ్రత్తగా మాట్లాడాలంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్ శనివారం క్లాస్ తీసుకున్నారు. పెనుగొండ మండలం జగన్నాథపురంలో శుక్రవారం నిర్వహించినరచ్చబండ సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ‘మరో ముఖ్యమంత్రి’ అని మంత్రి పితాని సంబోధించిన నేపథ్యంలో ఆయనపై సీఎం కిరణ్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పితాని చేసిన వ్యాఖ్యను సభావేదికపై ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తేలికగానే తీసుకున్నారు. సభ ముగిశాక పెనుగొండలోని మార్కెట్ కమిటీ కార్యాలయూనికి చేరుకున్న సీఎం శుక్రవారం రాత్రి అక్కడే బస చేసిన విషయం విదితమే. పితాని చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో మంత్రి పితానిని ఉద్దేశించి ‘మరో ముఖ్యమంత్రి అనడం కరెక్ట్ కాదు. జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇబ్బందులొస్తాయ్’ అంటూ శనివారం ముఖ్యమంత్రి చిరుకోపం ప్రదర్శించారని సమాచారం. -
పేదల్ని ఆదుకునేందుకే రచ్చబండ : మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
తాడేపల్లిగూడెం రూరల్, న్యూస్లైన్ : పేదలను ఆదుకునేందుకే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రచ్చబండ ఏర్పా ట్లు, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల తీరుపై తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం జిల్లా అధికారులతో ఆయన సమీక్షిం చారు. ఈ నెల 11వ తేదీ నుంచి 26 వరకు నిర్వహించనున్న మూడో విడత రచ్చబండలో జిల్లాలోని 2 లక్షల మంది పేదలకు సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 81 వేల మంది పేదలకు రేషన్ కూపన్లు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో కొత్తగా 36వేల 549 వృద్ధాప్య, వితంతు, 5వేల 716 మంది వికలాంగులకు పింఛన్లు జారీ చేస్తామని చెప్పారు. 20 నుంచి 30 శాతం వరకూ అంగవైకల్యం కలిగిన వారికి రూ.200 చొప్పున అందిస్తామన్నారు. ఇప్పటివరకూ ఈ కేటగిరి కింద 34వేల 558 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. 31వేల 965 మంది పేదలకు శాశ్వత గృహ నిర్మాణపథకం కింద ఇళ్ల మంజూరు ఉత్తర్వులను అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నివసిస్తూ నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న 15వేల 455 మంది ఎస్సీలకు రూ.2.42 కోట్లు, 2వేల 399 మంది ఎస్టీలకు రూ.18 లక్షల విద్యుత్ రాయితీ సొమ్ము అందిస్తామని చెప్పారు. రచ్చబండ లబ్ధిదారుల జాబితాలన్నీ ఈ నెల 10 నాటికి సిద్ధం చేసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇటీవల జరిగిన పంట నష్టాలపై కలెక్టర్ సిద్ధార్థజైన్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఖరీఫ్ పంట కాలంలో 12.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావించామని, వరదలు, వర్షాలతో 80 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గవచ్చని వివరించారు. రంగుమారిన ధాన్యం కొనుగోలుచేసేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. శాఖల వారీగా జరిగిన నష్టాల నివేదికను మంత్రి కన్నాకు సమర్పించారు. సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలినాని, నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, జేసీ టి.బాబూరావునాయుడు, ఉద్యాన వర్శిటీ అధికారి శ్రీనివాసులు, ట్రాన్స్కో ఎస్ఈ టీవీ సూర్యప్రకాష్, వ్యవసాయశాఖ జేడీ వీడీవీ కృపాదాసు, ప్రణాళికా విభాగం జేడీ కె.సత్యనారాయణ, సోషల్ వెల్ఫేర్ జేడీ ఆర్.మల్లికార్జునరావు, డీఎస్వో డి.శివశంకర్ రెడ్డి, ఏలూరు ఆర్డీవో శ్రీనివాసరావు, ఉద్యాన శాఖ ఏడీ ఎస్.సుజాత పాల్గొన్నారు. -
మంత్రి కన్నాను నిలదీసిన రైతులు
హైదరాబాద్ : అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు వేదిక వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. సదస్సుకు రైతులను అనుమతించకపోవటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ సదస్సుకు అనుమతించటం లేదంటూ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఈ సందర్భంగా రైతులు నిలదీశారు. అయితే జిల్లాల వారీగా ఎంపిక చేసిన రైతులను మాత్రమే సదస్సుకు ఉచితంగా ప్రవేశం కల్పించినట్లు మంత్రి తెలిపారు. బహుళ జాతి కంపెనీల ప్రయోజనాల కోసమే వ్యవసాయ సదస్సును ఏర్పాటు చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వ్యవసాయ సదస్సుకు రైతులను అనుమతించకపోవటం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కాగా అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు సభ్యత్వ నమోదు రుసుమును ప్రభుత్వం రూ.5,000గా నిర్ణయించిన విషయం తెలిసిందే. -
మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇల్లు ముట్టడి
పట్నంబజారు(గుంటూరు), న్యూస్లైన్ : సమైక్యాంధ్రను పరిరక్షించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసాన్ని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. జై సమైక్యాంధ్ర... డౌన్ డౌన్ కన్నా... నినాదాలతో గుంటూరులోని నగరంపాలెం ప్రాంతం దద్దరిల్లింది. తొలుత కలెక్టర్ కార్యాలయం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రదర్శనగా కన్నా నివాసం వద్దకు చేరుకోవడంతో కేంద్ర బలగాలు, పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ముళ్ళ కంచెలు అడ్డు వేశారు. ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలువురు పార్టీ నాయకులకు ముళ్ళ కంచలు గుచ్చుకుని గాయాలయ్యాయి. పోలీసుల తోపులాటలో పార్టీ గుంటూరు తూర్పు నియోకవర్గ నాయకుడు షేక్ మెహమూద్ సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అనంతరం నాయకులను అరెస్టు చేసి పట్టాభిపురం పోలీసుస్టేషన్కు తరలించారు. నాయకులను స్టేషన్కు తరలించకుండా విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ రాజీనామా చేయమని ఆరు కోట్ల మంది ప్రజలు 70 రోజులుగా కోరుతున్నా కనీసం ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లయినా లేకపోవడం సిగ్గుచేటన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల ముందుకు వెళితే చెప్పులతో కొడతారని హెచ్చరించారు. పోరాటాల పురిటిగడ్డలో పుట్టిన మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్, కాసు కృష్ణారెడ్డి ఏమాత్రం రోషం ఉన్నా తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీనగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మరిచి పదవుల పట్టుకుని వేలాడుతున్న ప్రజాప్రతినిధులకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం ఐదు జిల్లాల కో ఆర్డినేటర్ డైమండ్బాబు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ షౌకత్, ఎండీ నసీర్ అహ్మద్, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త రాతంశెట్టి రామాంజనేయులు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈపూరి అనూప్, మందపాటి శేషగిరిరావు, లీగల్ విభాగం జిల్లా కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి, యువజన విభాగం నాయకులు నూనె ఉమమహేశ్వరరెడ్డి, దళిత విభాగం జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, పలు విభాగాల నాయకులు మార్కెట్బాబు, సుంకర రామాంజనేయులు, మద్దుల రాజాయాదవ్, యరమాల విజయ్కిషోర్, పల్లపు శివ, పానుగంటి చైతన్య, అత్తోట జోసఫ్, శిఖా బెనర్జీ, కారుమూరి అశోక్రెడ్డి, పి.రవిశంకర్, కోనూరు సతీష్శర్మ, కోటా పిచ్చిరెడ్డి, తోటా ఆంజనేయులు, మహ్మద్ కర్నూమా, కౌశిక్, వనిపెంట వీరారెడ్డి, తనుబుద్ధి కృష్ణారెడ్డి, మేరుగ విజయలక్ష్మి, అనసూయ చౌదరి, సంధాని, అజయ్ యాదవ్, సోమా శేషుబాబు, జూలూరి హేమంగద గుప్తా తదితరులు పాల్గొన్నారు.