kathi mahesh
-
కత్తి మహేశ్ ప్రమాదంపై విచారణలో డ్రైవర్ సురేశ్ ఏమన్నాడంటే..
సినీ క్రిటిక్ కత్తి మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ జరిపించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొవ్వూరు సీఐ ప్రమాదంలో కత్తి మహేశ్ కారు డ్రైవింగ్ చేస్తున్న సురేశ్ను పిలిచి విచారించారు. ఈ విచారణలో డ్రైవర్ ప్రమాదం జరిగిన తీరును ఇలా వివరించాడు. నిద్ర సమయం కావటంతో నెల్లూరులో ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకున్నామని, ఆ లోపే ఈ ఘటన జరిగిందన్నాడు. కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించాడు. ప్రమాదం సమయంలో కత్తి మహేశ్ నిద్రలో ఉన్నారని, సీటు బెల్టు కూడా పెట్టుకోకపోవడం వల్ల ఆయన ముందుకు పడినట్లుగా సురేశ్ వెల్లడించాడు. ఈ క్రమంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ పగిలిన అద్దాల ముక్కలు మహేశ్ కంటికి గుచ్చుకున్నాయని అన్నాడు. ఆయనకు రక్తస్రావం అవుతుండటంతో హైవే పెట్రోలింగ్ పోలీసుల సాయంతో మహేశ్ను వెంటనే ఆస్పత్రికి తరలించామన్నాడు. అయితే అక్కడ ఐ స్పెషలిస్టు లేకపోవటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రి తరలిచించామని తెలిపాడు. మరీ ఈ ప్రమాదంలో మీకేందుకు గాయాలు కాలేదని పోలీసులు అడగడంతో తను సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే గాయాలు కాలేదని సురేశ్ సమాధానం ఇచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ విచారణ అనంతరం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, ఈ కేసులో తనని అనుమానించాల్సిన అవసరం లేదన్నాడు. అవసరమైతే మళ్లీ పోలీసుల విచారణకు సహకరిస్తానని సురేశ్ పేర్కొన్నాడు. ఇక సీఐ రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి ట్వీట్తో మహేశ్ ప్రమాద ఘటనపై విచారణ జరిపాం అన్నారు. ఈ మేరకు కారు నడిపిన సురేశ్ను పిలిచి విచారించామని, ప్రమాదం జరిగిన తీరు గురించి వివరాలు అడిగినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని విచారించాల్సి ఉందని సీఐ తెలిపారు. -
కత్తి మహేశ్కు జరిగిన ప్రమాదం తీరు అనుమానాస్పదంగా ఉంది: మందకృష్ణ
సాక్షి, నెల్లూరు: సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్ జరిగిన ప్రమాదం తీరు చూస్తుంటే అనుమానంగా ఉందన్నారు. ఈ ప్రమాదంలో కత్తి మహేశ్ కారు కుడి భాగం నుజ్జునుజ్జు అయినప్పటికీ డ్రైవర్ సురేశ్ స్వల్ప గాయాలతో బయటపడటం ఏంటని, ఎడమ వైపు కూర్చున్న మహేశకు తీవ్ర గాయాలవడం ఏంటని ప్రశ్నించారు. మహేశ్కు ఎంతో మంది శత్రువులు ఉన్నారన్నారని, గతంలోని దాడులు, కొన్ని సంఘటనలు దీనికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయన్నారు. తొలుత కత్తి మహేశ్కు గాయాలే కాలేదని చెప్పారన్నారు. ఆసుపత్రిలో మహేశ్ ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు పెట్టారని చెప్పారు. కత్తి మహేశ్ మరణంపై విచారణ జరిపించాలని ఏపీ సర్కారును ఆయన కోరారు. అంతేగాక ఎమ్మార్పీఎస్ నాయకులు ఈ రోజు నెల్లూరు జిల్లా రూరల్ డీఎప్సీని కలిసి కత్తి మహేశ్ మృతిపై విచారణ జరపాల్సిందిగా కోరుతూ వినతి పత్రం అందజేశారు. దీంతో సీఐ రామకృష్ణా రెడ్డి డ్రైవర్ సూరేశ్ను విచారణకు పిలిచి దర్యాప్తు జరుపుతున్నారు. దీనితో పాటు కత్తి మహేశ్ తండ్రి సైతం తన కొడుకు మృతిపై అనుమానం ఉందని తెలిపారు. కాగా, గత జూన్ 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. -
కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు ఉన్నాయి: తండ్రి ఓబులేసు
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం కత్తి మహేశ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో జరిగాయి. అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ మహేశ్ మరణం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. కత్తి మహేశ్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాజాగా ఆయన తండ్రి ఓబులేసు కూడా మహేశ్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ మరణించిన విషయం తమ కంటే ముందే బయటకు చెప్పారని ఆయన తెలిపారు. కత్తి మహేశ్ మృతిపై న్యాయ విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వయసు రీత్యా తన శరీరం సహకరించడం లేదని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని ఓబులేసు విజ్ఞప్తి చేశారు. -
ఆ రెండు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కత్తి మహేశ్
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. పలు వివాదాస్పద అంశాలతో చర్చకు తెరతీసి పాపులర్ అయిన కత్తి మహేశ్కు సోషల్ మీడియాలోనూ బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పలు సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీలు అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువు పూర్తయ్యాక ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేసిన కత్తి మహేశ్..రాఘవేంద్రరావు ప్రొడక్షన్ హౌస్లో ‘రాఘవేంద్ర మహత్య్మం’ సీరియల్కు పనిచేశారు. 2015లో పెసరట్టు అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. అయితే నటుడిగా రాణించాలనే కోరికతో హృదయ కాలేయం,కొబ్బరి మట్ట సహా కొన్ని చిత్రాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఎప్పటికైనా నటుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కకోవాలని అనుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన సన్నిహితులతో పాటు స్నేహితులతోనూ పదేపదే చెప్పేవారట. అంతేకాకుండా రాజకీయాల్లోనూ రాణించాలని భావించారట. అయితే దురదృష్టవశాత్తూ యాక్టింగ్, పాలిటిక్స్..ఈ రెండింటిలోనూ ఆయన ప్రారంభ దశలో ఉండగానే అకస్మాత్తుగా కన్నుమూశారు. 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించినా అప్పుడు కుదరలేదు. మొత్తానికి నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనదైన గుర్తింపు సంపాదించాలన్న కత్తి మహేశ్..ఆ రెండు కోరికలు తీరకుండానే తుదిశ్వాస విడిచారు. -
కత్తి మహేష్ : ఎన్నో వివాదాస్పద అంశాలు..అయినా బెదరలేదు
‘‘శోధన, సాధన చేసిన జ్ఞానం మాత్రమే శాశ్వతమని నమ్ముతాను. నిరంతరం ప్రశ్నించుకుంటూ నిజాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.’’ అప్పటికి మూడు పదులు కూడా నిండని కత్తి మహేష్– బ్లాగ్ పరిచయంలో తన చూపుని అట్లా ప్రకటించుకున్నాడు. ఎలాంటి కాలమది!. పత్రికలు, టీవీలని దాటి కొత్త మాధ్యమాలు అవతరిస్తున్నాయి. ఆర్కుట్ మూత పడుతూ బ్లాగులు కళకళ లాడుతున్నాయి. అప్పటివరకూ సాహిత్యం, సమాజం పట్ల నిబద్ధత కలిగిన మేధా సమూహాల రచనలకి దీటుగా సమస్త భావజాలాల మేలిమి ఆలోచనలతో బ్లాగ్ ప్రపంచం విస్తరించింది. 2007 – 2012 కాలంలో తెలుగు బ్లాగుల్లో కుల మత, ప్రాంత, జెండర్ భావాల సైద్ధాంతికతని ఒంటిచేత్తో ప్రవేశ పెట్టినవాడు మహేష్. అతని ‘పర్ణశాల’ బ్లాగ్ – అర్ధ దశాబ్దపు విస్ఫోటనం. తమ అభిమాన హీరో మీద విమర్శ చేస్తేనో, తాము పూజించే దేవుడిని తార్కికంగా ప్రశ్నిస్తేనో అతను ఎదుర్కొన్న దాడులు ఇటీవలివి. ట్రోలింగ్ అన్నమాట సమాజానికి పూర్తిగా పరిచయం కాకముందే పలు ఆధిపత్య సమూహాల చేత ట్రోల్ చేయబడ్డాడు. వ్యభిచార చట్టబద్ధత, నగ్న దేవతలు, కుల గౌరవ హత్యలు, ప్రత్యేక తెలంగాణ, పశువధ – గొడ్డు మాంసం, భాష – భావం, వివాహానికి పూర్వం సెక్స్, వర్గీకరణ సమస్య, గే చట్టం, కశ్మీర్ అంశం మొదలుకుని అనేక వివాదాస్పద అంశాల్లో పది పద్నాలుగేళ్ళకి ముందే దాదాపు నాలుగైదు వందల పోస్టులు రాసాడు. మేధావులనబడేవారి పరిమిత వలయంలో తిరుగాడుతుండే అటువంటి అంశాలని, వాటిమీద తన ప్రశ్నలని మామూలు ప్రజల మధ్యకి తీసుకు వచ్చాడు. అందుకోసం ఆర్కుట్– బ్లాగ్– ఫేస్బుక్– ట్విట్టర్– ఇన్ స్టాగ్రామ్ మీదుగా విస్తరించుకుంటూ సినిమాలు, పార్లమెంటరీ రాజకీయాలు తన కార్యక్షేత్రాలుగా నిర్ణయించుకున్నాడు. ప్రశ్నని నేర్చుకుంటే దానికి చెల్లించాల్సిన మూల్యం ఎంతటిదో తెలిసాక కూడా ‘నువ్వు రాసింది చదివి, రావలసిన వారికి కోపం రాకపోతే, నీ మీద బెదిరింపులకు దిగకపోతే, నీ మీద హత్యా ప్రయత్నమైనా జరగకపోతే, నువ్వేం రాస్తున్నట్టు?‘ అనగలిగిన తెగువ మహేష్కి ఉంది. అవును అతను దళితుడు, కానీ అతనిది మాలిమి చేయడానికి అనువైన బాధిత స్వరం కాదు, అందరినీ దూరం పెట్టే ఒంటరి ధిక్కార స్వరమూ కాదు. మందిని కలుపుకు పోయే, అనేక వర్గాలతో చెలిమి చేయగల ప్రజాస్వామిక స్వరం. ఈ గొంతు దిక్కుల అంచుల వరకూ వినబడగలిగే శక్తి కలిగినది కాబట్టే అంతే తీవ్రతతో వ్యతిరేకత కూడా వచ్చింది. కులం మతం వంటి సున్నితమైన అంశాల మీద మాట్లాడినపుడు, అతడి తర్కానికి జవాబు ఇవ్వడం తెలీని వారు, వ్యక్తిగత దూషణలకు దిగినా సంయమనం కోల్పోకుండా ఓపిగ్గా విషయాన్ని వివరించడానికి ప్రయత్నించేవాడే తప్ప మాట తూలేవాడు కాడు. అసలది అతని నైజమే కాదు. మహేష్ కంటే ముందే పురాణపాత్రలను విమర్శించిన వారెందరో ఉన్నారు. కేవలం అతని దళిత అస్తిత్వాన్ని ఆధారంగా చేసుకుని అతని విమర్శలను అంగీకరించక విషం కక్కిన లోకానికి మహేష్ ఎన్నడూ జడవలేదు. తిరిగి విషమూ కక్కలేదు. తనదైన శైలిలో తన అభిప్రాయాలను చెపుతూనే ఉన్నాడు, మర్యాదగా విభేదించడం మహేష్ వద్ద చాలామంది మిత్రులు నేర్చుకున్న విషయం. బ్లాగుల్లో తనతో హోరాహోరీ వాదనలకు దిగిన వ్యక్తులు బయట కలిస్తే అత్యంత స్నేహపూరితంగా ఉండేవాడు. పరుషమైన మాటలతో వ్యక్తిగత దూషణలు చేసినవారు సైతం, అతని స్నేహస్వభావానికి కరిగి స్నేహితులుగా మారిపోయిన సందర్భాలు అనేకం. రాముడిని విమర్శించి నగర బహిష్కరణకు గురైన అతడు 2007 లోనే తన బ్లాగ్ పేరు ‘పర్ణశాల’గా పెట్టుకున్నాడు. ‘పర్ణశాల అంటే ఆకుల పందిరి. దానికింద కూచుని అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. చాయ్ ఉంటే ఇంకా... రాముడు కూడా అలాంటిది ఒకటి కట్టుకున్నాడన్నమాట‘ అనేవాడు సరదాగా. వేలాది పేజీల తన రాతలు ఒక్క పుస్తకంగా కూడా వేసుకోలేదు మహేష్. అసలు ఆ ఆలోచన ఉన్నట్లు కూడా ఎపుడూ కనపడలేదు. నిలవ ఆలోచనల మీద ఘర్షణ, వ్యక్తుల్లో మానసిక విలువల పెంపుదల జరిగి మానవ సంస్కారంలో అవి ఇంకిపోతే చాలని అనుకునేవాడేమో! మనుషుల పట్ల ఇంత అక్కర ఉన్నవారు అత్యంత అరుదు. సామాజిక మాధ్యమాల్లో ఎవరి పోరాటాలు వారివి, తలదూర్చితే తలనొప్పులని తప్పుకునే వారే ఎక్కువ. కానీ మహేష్కి అంతశక్తి ఎలా వచ్చేదో కానీ తిరిగి ఒకమాట అనలేని వారి పక్షాన, చర్చల్లో ఒంటరులైనవారు అలిసిపోయే సమయాన– వారి ప్రాతినిధ్య స్వరంగా నిలబడేవాడు. ఇది చాలామందికి అనుభవమైన విషయం. ఎవరనగలరు అతనికి మనుషుల మీద ద్వేషం ఉందని! ఉన్నదల్లా ప్రేమే. ఆ ప్రేమ వల్లనే నాకెందుకని ఊరుకోక ప్రతిసారీ ఓపిగ్గా చర్చకి దిగేవాడు, చర్చే నచ్చనివారికి అది వితండవాదం కావొచ్చు. కానీ సంభాషిస్తూనే ఉండడం ఒక అంబేడ్కరైట్ గా అతని ఆచరణ. మహేష్కీ అంబేడ్కర్కీ ఆచరణలో ఒక పోలిక కనపడుతుంది. వారిద్దరూ తాము ప్రాతినిధ్యం వహించిన పీడిత కులాల గురించి ఆలోచనలు చేసి వారి ఎదుగుదలకి పునాదులు సూచించి ఊరుకోలేదు. అక్కడ నిలబడి స్వేచ్ఛా సమానత్వాలతో కూడిన సవ్యమైన జాతి మొత్తం నిర్మాణం కావాలని ఆశించారు. అందుకోసం అంబేడ్కర్ చేసిన కృషి ఆయన్ని జాతి మొత్తానికి నాయకుడిగా నిలిపింది. మహేష్ ఆయన మార్గంలో వడిగా సాగుతుండగా విషాదం సంభవించింది. రచయిత, విమర్శకుడు, సినిమా నటుడు, గాయకుడు, సామాజిక వ్యాఖ్యాత, కార్యకర్త, రాజకీయ నాయకుడుగా ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కత్తి మహేష్. మరి నాలుగైదు దశాబ్దాలు ఉండవలసిన మనిషి, అసమాన త్యాగాలతో నిండిన సామాజిక చైతన్యానికి కొత్త చేర్పుని, కొత్త రూపుని కనిపెట్టగల ఆధునిక ప్రజా కార్యకర్త – పరుగు పందాన్ని అర్ధాంతరంగా ఆపి విశ్రాంతికై తన కలల పర్ణశాలకి మరలిపోయాడు. వేలాది పేజీలలో, వందలాది ఉపన్యాసాలలో అతను పొదిగిన ప్రశ్నలను అంది పుచ్చుకుని ఈ పరుగుని కొనసాగించడమే మనం చేయగలిగింది. కె.ఎన్. మల్లీశ్వరి, సుజాత వేల్పూరి (నటుడు, సినీ, సాహిత్య, సామాజిక విమర్శకుడు కత్తి మహేష్కు నివాళిగా) -
Kathi Mahesh: బెంగాలీ యువతితో ప్రేమ..అనుకోకుండా ‘బిగ్బాస్’ ఆఫర్
సాక్షి, వెబ్డెస్క్: ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కత్తి మహేశ్ అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో జరగనున్నాయి. సినీ విమర్శకుడిగా ఫేమస్ అయిన మహేశ్ నేపథ్యం ఒక్కసారి చూస్తే.. కత్తిమహేశ్ కుమార్ చిత్తూరు జిల్లాలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన తండ్రి వ్యవసాయశాఖలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. మహేశ్కు ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. డైరెక్టర్ అవ్వాలనుకొని.. ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేశారు. రాఘవేంద్రరావు ప్రొడక్షన్ హౌస్లో ‘రాఘవేంద్ర మహత్య్మం’ సీరియల్కు పనిచేశారు. వర ముళ్లపూడి వద్ద 10 ఎపిసోడ్లకు సహాయకుడిగా పని చేసిన తర్వాత డబ్బులు సరిపోకపోవడంతో చిత్తూరు వెళ్లిపోయి ఓ ఎన్జీవోలో చేరారు. ఆ తర్వాత యూనిసెఫ్, వరల్డ్ బ్యాంకు, సేవ్ ది చిల్ర్డన్ తదితర సంస్థల్లో పనిచేశారు. బెంగాలీ యువతితో ప్రేమలో.. కత్తి మహేశ్ది ప్రేమ వివాహం. యూనిసెఫ్లో పనిచేస్తున్నప్పుడు బెంగాలీ యువతి సోనాలి పరిచమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. ఆమె కేర్ ఇండియా సంస్థ తరపున పనిచేసేది. వీరికి ఒక్క కుమారుడు ఉన్నారు. మరో ప్రయత్నం అనురాగ్ కశ్యప్ చెప్పిన మాటలకు స్ఫూర్తి పొంది సినిమా చేయాలని మళ్లీ ఇండస్ట్రీవైపు అడుగులు వేశారు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ఊరు చివర ఇల్లు కథను ఆధారంగా చేసుకొని ఒక షార్ట్ ఫిలింకి దర్శకత్వం చేశాడు. మిణుగురులు అనే చిత్రానికి సహ-రచయితగా వ్యవహరించాడు. పెసరట్టు అనే సినిమా క్రౌడ్ ఫండింగ్ ఆధారంగా నిర్మాణానికి అవసరమయ్యే డబ్బు సమకూర్చుకుని తీశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అనుకోకుండా ‘బిగ్బాస్’లోకి బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ మొదటి సీజన్లో కత్తి మహేశ్ పాల్గొన్నారు. అయితే ఆ అవకాశం కూడా అనుకోకుండానే వచ్చిందని పలు సందర్భాల్లో మహేశ్ చెప్పారు. స్టార్ మా నుంచి కాల్ రాగానే ఏదైనా సినిమా కోసం ఏమో అనుకున్నారట. కానీ, బిగ్బాస్ కోసం అని చెప్పడంతో ఆశ్చర్యపోయారట. అలా బిగ్బాస్ హౌస్లోకి వెళ్లిన ఆయన దాదాపు నాలుగు వారాల పాటు ప్రేక్షకులను అలరించారు. అలాంటి సినిమా తీయాలకున్నాడు సినిమాలు అంటే ఇష్టం కాని, నటుడు కావాలని కత్తి మహేశ్ ఎప్పుడు అనుకోలేదట. దర్శకుడిగా మారి మంచి చిత్రాలను తెరకెక్కించాలనుకున్నారట. అయితే సంపూర్ణేశ్బాబు హీరోగా తెరకెక్కిన ‘హృదయ కాలేయం’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు మహేశ్. ఆ సినిమా దర్శకుడు సాయిరాజేశ్ కోరిక మేరకు నటుడిగా మారాడట. ‘నిజానికి నటుడు అవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. సాయి రాజేశ్ నాకు స్నేహితుడు. చిన్న బడ్జెట్లో ‘హృదయ కాలేయం’ తీస్తున్నానని నాతో చెప్పాడు. పెద్ద నటులతో చేసేంత బడ్జెట్ లేదని, మీకు సరిపోయే పాత్ర ఒకటి ఉంది చేస్తారా? ‘మీరు మీలా ఉంటే చాలు’ అని అడిగారు. నేను, రచయిత దర్శకుడు కావడంతో సంభాషణలు, హావభావాలు పలకడం సులభమైంది. అంతేకానీ, నేను గొప్ప నటుడిని కాదు’అని కత్తి మహేశ్ ఓ సందర్భంలో చెప్పారు. నేనే రాజు నేను మంత్రి, కొబ్బరి మట్ట, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, క్రాక్ సినిమాల్లో నటించారు. ఎప్పటికైనా మంచి సందేశాత్మక చిత్రం తీయాలని కత్తి మహేశ్ అనుకునేవారని, ఆయన కోరిక అదేనని ఆయన సన్నిహితులు చెప్పారు. -
కత్తి మహేశ్: సినిమాల పిచ్చి.. 50 రోజులకు 50 సినిమాలు
సాక్షి, వెబ్డెస్క్: బహుముఖ ప్రజ్ఞాశాలి కత్తి మహశ్ శనివారం కన్నుమూశారు. గత నెలలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఓ చిన్న పల్లెటూరి నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న కత్తి మహేశ్ జీవిత విశేషాలపై ఓ లుక్.. వ్యక్తిగత జీవితం : కత్తి మహేశ్కుమార్ అలియాస్ కత్తి మహేశ్ ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని పీలేరు పట్టణం దగ్గర ఎల్లమంద అనే గ్రామంలో ఓబులేసు, సరోజమ్మ దంపతులకు 1977లో జన్మించారు. తండ్రి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్సన్ ఆఫీసరుగా పనిచేసేవారు. మహేశ్కు ఓ అన్న, చెల్లి ఉన్నారు. పీలేరు, హర్యానా, అనంతపురంలలో ప్రాథమిక విద్య, మైసూరులో డిగ్రీ.. హైదరాబాద్లోని ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ’లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. చాటింగ్ ద్వారా పరిచయం అయిన సోనాలిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికో బాబు ఉన్నాడు. సినిమా కెరీర్ : కత్తి మహేశ్కు చిన్నప్పటినుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉండేది. మదనపల్లె, తిరుపతిలో ఎక్కువగా సినిమాలు చూస్తుండేవారు. 50 రోజుల వేసవి సెలవుల్లో 50 సినిమాలు చూసేవారంటే సినిమా అంటే ఎంతిష్టమో అర్థం చేసుకోవచ్చు. దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ‘ఊరి చివరి ఇళ్లు’ ఆధారంగా ‘ఎడారి వర్షం’ అనే షార్ట్ ఫిల్మ్కు దర్శకత్వం వహించారు. 2014లో మిణుగురులు సినిమాకు కో రైటర్గా పనిచేశారు. అదే సంవత్సరంలో వచ్చిన కామెడీ సినిమా ‘హృదయ కాలేయం’లో పోలీస్ పాత్రను పోషించారు. 2015లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘పెసరట్టు’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్గోపాల్ వర్మ ‘‘ స్లోక్యామ్’’ టెక్నాలజీని వాడారు. నేనే రాజు నేను మంత్రి, కొబ్బరి మట్ట, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, క్రాక్ సినిమాల్లో నటించారు. 2017లో బిగ్బాస్ సీజన్ వన్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. సేవా కార్యక్రమాలు : కత్తి మహేశ్ యూనిసెఫ్, వరల్డ్ బ్యాంక్, సేవ్ ది చిల్డ్రన్, క్లింటన్ ఫౌండేషన్లతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంట్రవర్సీలపై కత్తి మహేశ్ సమాధానం.. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంట్రవర్సీలపై స్పందిస్తూ. ‘‘ కాంట్రవర్సీలతో.. కామెంట్లతో ఎంజాయ్ చేసేది ఏమీ ఉండదు. అనవసరపు అటెన్షన్, ఇది మనకు అవసరమా.. మన పనులన్నీ మానుకుని వాటిపై స్పందిస్తూ ఉండటం ఎంత చికాకో అర్థం కావట్లేదు’’ అని అన్నారు. -
కత్తి మహేశ్ మరణ వార్తతో షాకయ్యా
గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల బారిన పడ్డ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. నిన్న మొన్నటి వరకూ మహేశ్ ఆరోగ్యం నిలకడగానే ఉందనే వార్తలు వచ్చినా పరిస్థితి ఒక్కసారిగా విషమించి కన్నుమూశారు. ప్రధానంగా శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో కత్తి మహేశ్ ప్రాణాలు కోల్పోయారు. కత్తి మహేశ్ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేశ్ మరణవార్త విని షాక్ గురయ్యానని మంచు మనోజ్ ట్విటర్లో తెలిపారు. కత్తి మహేశ్ ప్రాణాలు కోల్పోయాడనే వార్త కలచివేసింది. కత్తి మహేశ్ కుటుంబానికి ప్రాగాఢ సానుభూతిని తెలియజేశారు. మహేశ్ ఆత్మకు శాంతి చేకూరాలని మంచు మనోజ్ ట్విటర్లో పేర్కొన్నారు. టాక్సీవాలా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కత్తి మహేశ్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. మహేశ్ ఆత్మకు శాంతి కలగాలని ట్విటర్లో పేర్కొన్నారు. హ్యపిడేస్ ఫేం ఆదర్శ్ బాలకృష్ణ కత్తి మహేశ్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. బిగ్బాస్ హౌజ్లో కత్తి మహేశ్తో గడిచిన క్షణాలను గుర్తుకుతెచ్చుకున్నారు. కత్తి మహేశ్ అపారమైన జ్ఞానం, ఆసక్తికరమైన భావజాలం కలిగిన వ్యక్తి అని ఆదర్శ్ కొనియాడారు. మహేశ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కత్తి మహేశ్ మరణవార్త విని షాక్ గురయ్యానని నేచురల్ స్టార్ నాని ట్విటర్లో పేర్కొన్నారు.కత్తి మహేశ్ ఎల్లప్పుడూ తన రివ్యూలతో ప్రత్యేకమైన కంటెంట్ సినిమాలను ప్రోత్సహించే వారని నాని గుర్తుచేశారు. మహేశ్ కుటుంబానికి, స్నేహితులకు సానూభూతిని వ్యక్తపరిచారు. #KathiMahesh is no more. May His Soul Rest In Peace pic.twitter.com/BRbjJw8QEE— SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 10, 2021 Shocked & saddened to hear the news about the demise of #KathiMahesh garu. My deep condolences to his family and friends. May his soul rest in peace! Om shanti 🙏 pic.twitter.com/PgFmmk4ct6— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) July 10, 2021 Spent a lot of time with #kathimahesh in the Big Boss House. Was a man of immense knowledge and interesting ideologies. Gone too soon. Deepest condolences to the family 🙏 pic.twitter.com/bGum4yhMOZ — Aadarsh Balakrishna (@AadarshBKrishna) July 10, 2021 Shocked to hear that Kathi Mahesh gaaru passed away. From what I’ve seen, he always tried to encourage films with unique content through his reviews. Strength to his family and friends. — Nani (@NameisNani) July 10, 2021 -
ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మృతి
-
Kathi Mahesh : ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ మృతి
సాక్షి, చెన్నై : ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. త్వరలోనే కుదుటపడుతుందనుకున్న ఆయన ఆరోగ్యం విషమించింది. అకస్మాత్తుగా శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో తుదిశ్వాస విడిచారు. కత్తి మహేశ్ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తల, కంటి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కత్తి మహేశ్కు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం మానవతా కోణంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17లక్షల రూపాయలు అందచేసింది. అయినా కూడా మహేశ్ ప్రాణాలు దక్కలేదు. ‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేశ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్-1 ద్వారా సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కత్తి మహేశ్. అంతకుముందు నందు హీరోగా నటించిన పెసరట్టు అనే సినిమాను తెరకెక్కించారు. కాగా, హృదయ కాలేయం, నేనే రాజు.. నేనే మంత్రి, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లోనూ నటించారు. -
కత్తి మహేశ్ చికిత్సకు ఏపీ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్ చికిత్స కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.17 లక్షల భారీ అర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ నుంచి లేఖను విడుదల చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)నుంచి ఈ నగదు అందించారు. ఇటీవల నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం అతన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
చూపు కోల్పోయిన కత్తి మహేశ్?
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నప్పటికీ ఆయన తల, ముక్కు,కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మెదడులో ఎలాంటి రక్తస్రావం జరగకపోవడం వలన మహేష్కు ప్రాణాపాయం లేదని తెలుస్తుంది. అయితే ఆయన ఎడమ కంటి చూపు మాత్రం పూర్తిగా పోయిందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్లు తమతో చెప్పారని కత్తి మహేష్ మేనమామ ఒకరు మీడియాకు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతుంది. సర్జరీ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. మరోవైపు కత్తి మహేశ్ త్వరగా కోలుకోవాలని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు. ఈ ఘటనలో కత్తి మహేశ్ కారు నుజ్జు, నుజ్జు అయిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్పై విమర్శలు, వివాదాస్పద పోస్తులలో కత్తి మహేశ్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చదవండి : రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్కు తీవ్ర గాయాలు -
రోడ్డు ప్రమాదంలో సినీ విమర్శకుడు ‘కత్తి’కి గాయాలు
కొడవలూరు: రోడ్డు ప్రమాదంలో సినీ విమర్శకుడు కత్తి మహేష్కు గాయాలయ్యాయి. ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి కథనం మేరకు.. మహేష్ తన స్నేహితుడు సురేష్తో కలిసి విజయవాడ నుంచి తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా యర్రవారిపాలేనికి శుక్రవారం రాత్రి ఇన్నోవా కారులో బయలుదేరారు. చంద్రశేఖరపురం వద్ద ముందు వెళుతోన్న కంటైనర్ను శని వారం తెల్లవారుజామున 2.30 గంటలకు కారు ఢీకొంది. ఆ సమయంలో మహేష్ స్నేహితుడు కారును డ్రైవ్ చేస్తున్నారు. ఘటనలో మహేష్కు కంటి భాగంలో తీవ్ర గాయమైంది. ఆయనను హైవే మొబైల్ పోలీ సులు నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్పిం చారు. ప్రమాదం నుంచి సురేష్ సురక్షితంగా బయటపడ్డారు. మహేష్కు ఎడమ కన్ను బాగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స అవసరమ ని వైద్యులు నిర్ధారించి ఆయనను శనివారం చెన్నైకు తరలించారు. చదవండి: రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్కు తీవ్ర గాయాలు -
నటుడు కత్తి మహేశ్కు పెను ప్రమాదం
-
రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్కు తీవ్ర గాయాలు
సాక్షి, నెల్లూరు: ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. దీంతో మహేశ్ వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నా, తల భాగంలో మహేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎడమ కంటికి తీవ్రగాయమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ ఘటనలో కత్తి మహేశ్ కారు నుజ్జు, నుజ్జు అయింది. పవన్ కల్యాణ్పై విమర్శలు, వివాదాస్పద పోస్తులలో కత్తి మహేశ్ పాపులర్ అయ్యారు. రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గతంలో ఆయన హైదరాబాద్ నగర బహిష్కరణకు కూడా గురయ్యారు. -
సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్
తల్లి పెళ్లి వేడుకలో పిల్లల సందడి. తన జీవితంలోని మధుర జ్ఞాపకంలో అడుగడుగునా వారి భాగస్వామ్యం. పెళ్లిపందిరిలో.. తమను పెంచి పెద్దచేసిన అమ్మను అట్టిపెట్టుకునే ఉన్నారు... ఉంగరాల ఆటలో ఆమె గెలుపును ఆస్వాదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నాళ్లు ఒంటరి మహిళగా ఉన్న మాతృమూర్తికి తోడు దొరికినందుకు వారి కళ్లు సంతోషంతో వెలిగిపోయాయి. ప్రముఖ గాయని సునీత వివాహంలో ఆవిష్కృతమైన దృశ్యాలు ఇవి. కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నానన్న సంతోషం కంటే.. పిల్లలు అందుకు అండగా నిలిచినందుకే బహుశా ఆమె ఎక్కువగా ఆనందించి ఉంటారు. ఏదైతేనేమీ ఎన్నో ఒడిదొడుకుల అనంతరం ఆమె.. వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో జనవరి 9న ఏడడుగులు నడిచారు. శంషాబాద్లోని ఓ ఆలయంలో వీరి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: ఘనంగా సింగర్ సునీత వివాహ వేడుక) ఇక అప్పటి నుంచి ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. సెలబ్రిటీ పెళ్లి.. అందునా ఇద్దరికి రెండో వివాహం. ఇంకేముంది నెటిజన్లకు కావాల్సినంత చర్చ. సునీత నిర్ణయాన్ని స్వాగతిస్తూ భర్తతో ఆమెకున్న అనుబంధాన్ని, అందుకు పిల్లలు ఆనందిస్తున్న తీరు చూసి చాలా మంది అభినందనల అక్షింతలు జల్లుతుంటే.. మరికొంత మంది మాత్రం.. ‘‘పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెట్టుకుని, తల్లి రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటి? సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు’’ అంటూ మండిపడుతున్నారు. అయితే ఇలాంటి కామెంట్లపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ తనదైన శైలిలో స్పందించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఛస్! అయ్.. అసలు ఏంటిది? ‘‘ఈ కళ్లలో ఆనందం చూస్తే ఎందుకో "ఇబ్బంది."? అరే... ఎదో బాధ్యతతో పెళ్లి చేసుకుంటారు. ఎవరినైనా ఉద్ధరించడానికి పెళ్లి చేసుకుంటారు. బాధల్లో ఉంటే ఓదార్చడానికి,ఆదుకోవడానికి పెళ్లి చేసుకుంటారు. ఇలా సుఖం కోసం. ఆనందం కోసం. ఆర్భాటంగా పెళ్లి చేసుకుని. సంతోషంగా కనిపిస్తే...హమ్మో! ఎంత కష్టం. ఎంత కష్టం. ఎదో రెండోపెళ్లి చాటుమాటుగా చేసుకుని. గిల్ట్ ఫీలవుతూ, ఏడుపు ముఖాలతో కనిపించాలిగానీ. ఈ బిమింగ్ హ్యాపీనెస్ ఏమిటి?ఆ కళ్లలో ఆ ఆనందం ఏమిటి? ఆ వెలుగేమిటి? ఎట్లా ఇట్లా అయితే? సమాజం నాశనం అయిపోదా...హమ్మా!!! సమాజానికి మీరు ఇలా ఏం సందేశం ఇస్తున్నట్టు? ఛస్! ఆయ్!!’’ అంటూ ఫేస్బుక్ వేదికగా నెగిటివిటీ ప్రచారం చేస్తున్న వారిని ఉద్దేశించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. -
కత్తి మహేష్పై మరో కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్పై సైబర్క్రైమ్ పోలీసులు శుక్రవారం మరోసారి కేసు నమోదు చేశారు. హైదరాబాద్ జాంబాగ్కు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ కత్తి మహేష్ను పిటీ వారెంట్పై నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కత్తి మహేష్ చంచల్గూడ జైలులో ఉన్నారు. గతంలో శ్రీరాముడిపై అసభ్యకర పోస్ట్లు పెట్టిన కేసులో కత్తి మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన హిందూ సంఘాలు పలు చోట్ల కేసులు పెట్టాయి. కొద్దిరోజుల క్రితం ట్విటర్లో శ్రీరాముడి గురించి అసభ్యకర పోస్ట్లు పెట్టిన కత్తి మహేశ్ను ఆగస్టు 15న సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి : శ్రీరాముడిపై పోస్టు.. కత్తి మహేశ్ అరెస్టు) -
శ్రీరాముడిపై పోస్టు.. కత్తి మహేశ్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేశ్ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సోషల్ మీడియా పోస్టు ప్రభావం బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో హైదరా బాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో బుధవారం నుంచి సైబర్ స్పేస్ పోలీసింగ్ చేపడుతూ సోషల్ మీడియాపై పటిష్ట నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే గురువారం కత్తి మహేశ్ శ్రీరాముడిపై ఫేస్బుక్లో అనుచిత పోస్టు పెట్టాడు. ఈ విషయం పోలీస్ అధికారుల దృష్టికి రావడంతో సైబర్ క్రైమ్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా సుమోటో కేసు నమోదు చేసి మహేశ్ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. మహేశ్పై గతంలో సైబర్ క్రైమ్ ఠాణాలో ఓ కేసు నమోదై ఉంది. ఈ కేసులో పీటీ వారెంట్పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. -
ఆ వార్తల్లో నిజం లేదు : కత్తి మహేష్
-
ఆ వార్తల్లో నిజం లేదు : కత్తి మహేష్
తనకు కరోనా పాజిటివ్గా తేలిందని జరుగుతున్న ప్రచారంపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ స్పందించారు. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. తనకు కరోనా సోకిందమోనని కొంత మంది మిత్రులు ఫోన్ చేసి అడుగుతున్నారని.. ఇప్పటి వరకైతే తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘కొన్ని రోజుల కిత్రం చేసిన టెస్ట్ల్లో నాకు కరోనా నెగిటివ్గా తేలింది. నాకు కరోనా రావాలని కోరుకుంటున్నవారే.. ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారేమో. నాకు కరోనా సోకిందని రుమార్లు సృష్టించేవారు.. శునకానందం మానుకోవాలి. ఏదైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి. ఒకరి ఆరోగ్యం బాగోలేదని ప్రచారం చేసే చర్యలు హర్షించదగ్గవి కావు. (చదవండి : నా స్నేహితులు నాతో పాటే పడుకునే వారు: మనోజ్ బాజ్పేయి) ఇప్పటికైతే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఒకవేళ నాకు కరోనా వచ్చినా అధైర్య పడే రకాన్ని కాదు. కరోనాతో పోరాడి నా ఆరోగ్యాన్ని నేను వెనక్కి తెచ్చుకుంటాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న మిత్రులకు నా ధన్యవాదాలు’ అని తెలిపారు. (చదవండి : అమెజాన్తో ప్రియాంక భారీ డీల్) -
కత్తి మహేష్పై దాడి
ఖైరతాబాద్: సినీ విమర్శకుడు కత్తి మహేష్పై భజ్రంగ్దళ్ సభ్యులు దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం ఐమాక్స్లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా చూసి కారులో బయటికి వస్తున్న కత్తి మహేష్పై ఐదుగురు భజ్రంగ్దళ్ సభ్యులు దాడిచేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని మాసబ్ట్యాంక్కు చెందిన బి.రాజ్కుమార్, ఖైరతాబాద్కు చెందిన వై.వెంకట్, జి.సాయిరాజ, ఎంఎస్మక్తాకు చెందిన డి.నాగరాజు, వారాసిగూడకు చెందిన దేవగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
కత్తి మహేష్పై మరో కేసు
సాక్షి, హైదరాబాద్ : శ్రీరాముడిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ, హిందువుల మనోభావాలు దేబ్బతీసేలా మాట్లాడరని ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్పై కేసు నమోదైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ మీద కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లు, హిందూ మతాన్ని కించపరిచేలా మట్లాడిన కత్తి మహేష్పై చర్యలు తీసుకోవాలని నాంపల్లి పోలీసు స్టేషన్లో ఉమేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును నాంపల్లి పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్పై కేసు నమోదు చేశారు. ఇవే ఆరోపణలతో అడ్వొకేట్, హింధు సంఘటన్ అధ్యక్షుడు కరుణాసాగర్ కూడా మహేష్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ మీటింగ్ను ఉద్దేశించి కత్తి మహేష్ మాట్లాడుతూ హిందు దేవతలను కించపరిచేలా వ్యవహరించారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కరుణాసాగర్ కోరారు. కాగా, గతంలో కూడా కత్తి మహేష్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపారు. ఇప్పటికే అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. -
‘మూడు ప్రాంతాల అభివృద్ధికి జైకొడదాం’
కదిరి: కోస్తా, ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని..ఈ నిర్ణయానికి జై కొడదామని సినీ నటుడు కత్తి మహేష్ అన్నారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లా కదిరిలో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో టీడీపీ పెద్దలు భారీగా భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. జనసేనాని పవన్ కల్యాణ్ చంద్రబాబుకు సేనానిలా మారిపోయారని విమర్శించారు. -
సినీ నటితో అసభ్య ప్రవర్తన
బంజారాహిల్స్: తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీవీ9 యాంకర్ సత్య, కత్తి మహేష్లపై చర్యలు తీసుకోవాలని సినీ నటి సునీత బోయ మంగళవారం బంజారాహిల్స్పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్యాస్టింగ్ కౌచ్పై గతడాది ఏప్రిల్ 14న టీవీ9లో యాంకర్ సత్య నిర్వహించిన చర్చావేధికలో తనతో పాటు కత్తి మహేష్, నిర్మాత ప్రసన్నకుమార్ పాల్గొన్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కత్తి మహేష్ మహిళలు, తన పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. దీనిపై తాను అప్పుడే కేసు పెట్టినట్లు తెలిపింది. అయితే బాధ్యులపై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగేందుకు మంగళవారం టీవీ9 స్టూడియోకు వెళ్లిన తన పట్ల మరోసారి అసభ్యంగా ప్రవర్తించారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. -
కత్తి మహేష్ ఎన్నికల ప్రచారం
ముప్పాళ్ళ(సత్తెనపల్లి): టీడీపీ ప్రభుత్వంతో ఏ వర్గాలకూ న్యాయం జరగలేదని సినీ విమర్శకుడు కత్తి మహేష్ అన్నారు. ఎస్సీలను టీడీపీ కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, మనమంతా వైఎస్సార్ సీపీకి అండగా ఉండాలన్నారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలంలోని గోళ్ళపాడు, ముప్పాళ్ళ గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో సోమవారం వైఎస్సార్ సీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కాలనీవాసులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎస్సీలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు తెలపాలన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్తోనే సాధ్యమన్నారు. -
పవన్ కల్యాణ్ ఆధారాలు బయటపెట్టాలి : కత్తి మహేశ్
సాక్షి, హైదరాబాద్ : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని అంటున్నారని, ఈ కుట్రకు సంబంధించిన ఆధారాలను ఆయన బయటపెట్టాలని ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ అన్నారు. 2019 ఎన్నికల్లో తాను రాజకీయాల్లోకి వస్తానని, చిత్తూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీచేసే అవకాశముందని పేర్కొన్నారు. ఒంగోలులో ఆదివారం ఆయన దళిత సంఘాల సమావేశంలో మాట్లాడారు. దళితులు రాజ్యాధికారం సాధించాలని, 2019 ఎన్నికల్లో దళితులదే వాయిస్ అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దళిత నాయకత్వం రావాలని అన్నారు. రాజకీయంగా ఇంకా దళితులు వెనుక బడి ఉన్నారని పేర్కొన్నారు. ప్రణయ్ హత్య కులదురహంకార హత్య అని అభివర్ణించారు. ఉగ్రవాదులతో చేతులు కలిపి మారుతీరావు ఈ హత్య చేయించారని పేర్కొన్నారు. -
కత్తి మహేష్పై క్రిమినల్ కేసు
హైదరాబాద్, బంజారాహిల్స్: హిందువుల మనోభావాలు దెబ్బతినేలా టీవీ చర్చల్లో మాట్లాడిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. గత జూన్ 29న బంజారాహిల్స్లోని ఓ తెలుగు న్యూస్ ఛానెల్లో జరిగిన చర్చావేదికలో పాల్గొన్న కత్తి మహేష్ రామాయణంలో రాముడు సీతపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని అదే రోజు యూసుఫ్గూడ సమీపంలోని రహ్మత్నగర్కు చెందిన గడ్డం శ్రీధర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు న్యాయ సలహా అనంతరం శుక్రవారం కత్తి మహేష్పై ఐపీసీ సెక్షన్ 295(ఏ), 505(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నేను కేరళ వాసిని: స్వామి పరిపూర్ణానంద
సాక్షి, విజయవాడ: శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగర బహిష్కరణను హైకోర్డు కొట్టివేయడంతో ఆయన నేడు నగరంలో అడుగుపెట్టనున్నారు. దుర్గగుడిలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన నగరానికి బయలుదేరారు. అంతకుముందు పటిష్ట భద్రత నడుమ పరిపూర్ణానందను పోలీసులు ఇంద్రకీలాద్రికి తీసుకొచ్చారు. స్వామిజీ వెంట తెలంగాణ ఎమ్మెల్యే ప్రభాకర్, బీజేపీ కార్యకర్తలు, భక్తులు తదితరులు ఉన్నారు. అమ్మవారి దర్శనాంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నన్ను బహిష్కరించడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నాపై తెలంగాణ పోలీసుల చర్యలను కోర్టు కొట్టివేసింది. ధర్మం కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్దం. తెలంగాణకు వెళ్లేలా ఆశీర్వదించమని అమ్మవారి కోరుకున్నా. అమ్మవారు కటాక్షించారు. అందుకే దర్శనం చేసుకోవాలని వచ్చా. నేను కేరళ వాసిని.. నా సొంత రాష్ట్రంలో వచ్చిన విపత్తును తగ్గించాలని అమ్మవారిని కోరుకున్నా, త్వరలోనే కేరళను సందర్వించబోతున్నా’ అంటూ పరిపూర్ణానంద వివరించారు. ఇక పరిపూర్ణానంద హైదరాబాద్ రానుండటంతో ఘనంగా స్వాగతం పలకాలని బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బైక్ ర్యాలీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అసలేం జరిగిందంటే.. ఓ టీవీ చానెల్లో చర్చ సందర్భంగా శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, కత్తి మహేశ్పై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు. తనపై విధించిన నగర బహిష్కరణపై పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం హైదరాబాద్ నగర బహిష్కరణ చేస్తూ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపి వేస్తూ మధ్యంతర ఆదేశాలిచ్చింది. -
కత్తి మహేశ్ బహిష్కరణపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ బహిష్కరణ పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. నగర బహిష్కరణను సవాలు చేస్తూ కత్తి మహేశ్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. తనపై ఉన్న నగర బహిష్కరణను ఎత్తి వేయాలంటూ పిటిషన్లో కత్తి మహేశ్ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరపు న్యాయవాది 10 రోజుల సమయం కావాలని కోరారు. దీనికి సమ్మతించిన హైకోర్టు కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది. -
హైకోర్టును ఆశ్రయించిన కత్తి మహేశ్
హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను వెంటనే ఎత్తివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను కత్తి మహేశ్ను 6 నెలల పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ నగర బహిష్కరణ చేసిన సంగతి తెల్సిందే. అలాగే కత్తి మహేశ్కు వ్యతిరేకంగా హిందువులను కూడగట్టి హైదరాబాద్లో ర్యాలీ తీసేందుకు ప్రయత్నించిన పరిపూర్ణానంద స్వామిని కూడా నగర పోలీసులు 6 నెలల పాటు బహిష్కరణ చేశారు. ఇద్దరూ వేర్వేరుగా తమపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను వెంటనే ఎత్తివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. -
పరిపూర్ణానంద: ఎప్పుడో చేసిన ప్రసంగాలపై ఇప్పుడు బహిష్కరణా?
సాక్షి, హైదరాబాద్ : శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టులోవాదనలు కొనసాగాయి. తనను నగరం నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ.. హైదరాబాద్ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ప్రతివాదిగా చేర్చారు. ఆదిలాబాద్లో, కరీంనగర్లో గతంలో పరిపూర్ణానంద ఇచ్చిన ప్రసంగాల ఆధారంగా ఆయనను బహిష్కరించమని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలుపగా.. హైదరాబాద్ పరిధిలో ఎలాంటి కేసులు లేకుండా ఎలా బహిష్కరిస్తారని పరిపూర్ణానంద తరఫున వాదనలు వినిపిస్తున్న మాజీ అడ్వొకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. ఎప్పుడో చేసిన ప్రసంగాలపై ఇప్పుడు ఎలా బహిష్కరిస్తారని అడిగారు. ధర్మాగ్రహ యాత్రకు మొదటి అనుమతి ఇచ్చి తర్వాత ఎందుకు అనుమతి నిరాకరించారో తెలపాలని కోరారు. ఆర్టికల్ 19 ప్రకారం భారతదేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉంటుందని ఆయన కోర్టుకు తెలిపారు. స్వామి పరిపూర్ణానందపై వేసిన నగర బహిష్కరణ ఎత్తివేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. పరిపూర్ణానంద బహిష్కరణకు సంబంధించి.. ఒరిజినల్ డాక్యుమెంట్లను మంగళవారం కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఓ టీవీ చానెల్లో చర్చ సందర్భంగా శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, కత్తి మహేశ్పై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు. తనపై విధించిన నగర బహిష్కరణపై న్యాయపోరాటం చేయాలని స్వామి పరిపూర్ణానంద నిర్ణయించారు. ఇందులో భాగంగానే హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన బహిష్కరణ రాజ్యాంగ విరుద్ధమని, గూండాలను మాత్రమే నగరం నుంచి పోలీసులు బహిష్కరిస్తారని పరిపూర్ణానంద పిటిషన్లో పేర్కొన్నారు. -
హైకోర్టును ఆశ్రయించిన పరిపూర్ణానంద స్వామి
హైదరాబాద్ : ఆరు నెలలపాటు నగర బహిష్కరణకు గురైన స్వామి పరిపూర్ణానంద స్వామి శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. తనపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పరిపూర్ణానంద దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. పిటిషన్లో ప్రతివాదిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ను చేర్చారు. శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. కత్తి మహేశ్ వ్యాఖ్యలకు నిరసనగా ‘ధర్మాగ్రహ యాత్ర’చేపడతానని ప్రకటించిన ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరిస్తూ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జూలై 10న ఆయనకు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆరు నెలల పాటు హైదరాబాద్లో అడుగు పెట్టొద్దని, నోటీసులు అందుకున్న 24 గంటల్లో నగరాన్ని విడిచిపెట్టాలని అందులో పేర్కొన్నారు. మరుసటి రోజు తెల్లవారుజామున స్వామిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీపీఠానికి తరలించాయి. పరిపూర్ణానంద స్వామి నగర బహిర్కణకు ముందే కత్తి మహేశ్ను కూడా ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసిన సంగతి విదితమే. -
పీఠాధిపతి అరెస్ట్.. శైవ క్షేత్రంలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : శైవక్షేత్ర పీఠాధీపతి శివస్వామిని మరో సారి పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. హిందూ సంస్థలపై జరుగుతున్న దాడులకు నిరసనగా గురువారం తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల దిగ్భంధానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసలు శివస్వామిని హౌజ్ అరెస్ట్ చేశారు. శైవక్షేత్రం చుట్టూ భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు భక్తులకు మధ్య వాగ్వివాదం జరిగింది. శివస్వామిని ఎందుకు హౌజ్ అరెస్ట్ చేసి వేధిస్తున్నారని భక్తులు పోలీసులను నిలదీశారు. శివస్వామి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తోందని తెలిపారు. క్షేత్రంలో పోలీసుల్ని చూసి భక్తులు భయపడుతున్నారని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకుండా తనను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. హిందుత్వంపై దాడి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చేబుతారని విమర్శించారు. కాగా ఈ నెలలో శివస్వామిని హౌజ్ అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. హిందులపై కత్తి మహేశ్ చేసిన వాఖ్యల పట్ల చర్యలు తీసుకోవాలంటూ తహశీల్దార్కు వినతిపత్రం ఇవ్వడానికి యత్నించిన శివస్వామిని ఈ నెల 16న హౌజ్ అరెస్ట్ చేశారు. -
తెలంగాణ సర్కార్పై సుబ్రమణ్యస్వామి ఫైర్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఫైర్ అయ్యారు. ఈ విషయం గురించి తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. పరిపూర్ణానంద స్వామిజీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తిస్తుందని లేఖలో పేర్కొన్నారు. గూండాలపై పెట్టే కేసులు స్వామీజీపై పెడతారా అని ప్రశ్నించారు. ఒక సాధువును గూండాల ట్రీట్ చేస్తారా అని తీవ్ర స్థాయిలో సుబ్రమణ్యస్వామి మండిపడ్డారు. పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేయడమంటే ఆయనను తీవ్రంగా అవమానించడమేనని, అలాగే ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగిందని లేఖలో తెలియజేశారు. నగర బహిష్కరణ వల్ల ఆయన వాక్స్వాతంత్ర్యం, ఉద్యమ స్వాతంత్ర్యం హక్కులకు భంగం కలిగిందని సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. రాముడిపై కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్లో ర్యాలీ తలపెట్టడంతో కత్తి మహేశ్తో పాటు పరిపూర్ణానంద స్వామిని కూడా పోలీసులు 6 నెలల పాటు నగర బహిష్కరణ చేసిన సంగతి తెల్సిందే. -
కత్తి మహేష్ ఉదంతం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది!
సందర్భం ఈమధ్య కత్తి మహేష్ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాలనూ కుదిపేసింది. ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం, దానిపై పరిపూర్ణానంద స్వామి తదితరులు తీవ్రంగా స్పందిం చడంతో పరిస్థితి కొంత చేయి దాటిపోయే ప్రమా దం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహా త్మకంగా వ్యవహరించి ప్రస్తుతానికి సమస్య సమసిపోయేటట్లుగా చర్యలు చేపట్టింది. ప్రజాస్వామ్య దేశాలలో భావ వ్యక్తీకరణ స్వాతంత్య్రం అందరికీ ఉంటుంది. కానీ ఈ స్వాతంత్య్రం కొన్ని పరిమితులకులోనై మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుందనే విషయం ఎవరూ మరువరాదు. అబ్రహాం లింకన్ చెప్పినట్టు ‘నీ పిడికిలి నా ముక్కు దగ్గర ఆగిపోతుంది.‘ అంటే పక్కవారిని భౌతికంగా గానీ మానసికంగా గానీ గాయపరిచే హక్కు ఎవరికీ లేదు. ఈ సూత్రం ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే మూలం. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను భారత రాజ్యాంగంలోని 19 (1)(ఎ) ప్రకరణలో పొందుపరచటం జరిగింది. కానీ దీనికి రాజ్యాంగబద్ధమైన పరిమితులను 19 (2)లో పొందుపరిచారు. ప్రజా నియంత్రణ, మర్యాద, నైతి కత, దేశ భద్రత వంటి మరికొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు ఈ పై స్వేచ్ఛపై సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చు. కత్తి మహేష్ వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధమైన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కిందికి ఏ విధంగా పరిశీలించినా రావు. ఇక ఈయన వ్యాఖ్యలను సమర్థించేవారు రెండు అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంతకుముందు చాలా మంది నాయకులు, వ్యక్తులు చేశారు గానీ ప్రభుత్వం అప్పుడు ఈ విధంగా స్పందించలేదు. ఇతని ఒక్కని విషయంలో మాత్రం ఈ విధమైన స్పందన వివక్షా పూరితంగా ఉంది అని వీరంటున్నారు. ఇది చాలా సహేతుకమైన వాదన. రెచ్చగొట్టే ప్రసంగాలు ఎవరు చేసినా అది శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన అవసరముంది. ఇక వారు ప్రస్తావించే రెండవ ప్రధాన అంశం రామాయణం లాంటి పురాణాల మీద ఇంతకు పూర్వం రంగనాయకమ్మ, రామస్వామి చౌదరి, చలం లాంటి వారు చాలా వ్యాఖ్యానాలు చేశారు. వాటిని తప్పు పట్టనప్పుడు మహేష్ చేసిన వ్యాఖ్యానాలు ఏ రకంగా తప్పు పడతారు? ఈ వాదన సరికాకపోవచ్చు. పురాణాలను విశ్లేషణాత్మకంగా పరిశీ లించి, విమర్శనాత్మక వ్యాఖ్యానం చేయటం ఒక వంతు కాగా, సభ్యసమాజం మనోభావాలు గాయపడే విధంగా విచక్షణ కోల్పోయి వ్యాఖ్యానించటం వేరొక వంతు. పైపెచ్చు ఆ వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయటం కూడా సమర్థనీయం కాదు. అలాగే కత్తి మహేష్ కుటుంబంపై దూషణలకు దిగిన వారి చర్య కూడా గర్హనీయమైనది. హిందూ మతం ఏ ఒక్క ప్రవక్త బోధనలవల్ల ఏర్పడిన మతం కాదు. ఇది యుగాల కాలంలో పరిణతి చెందిన మత విధానం. ఆరాధనలో, నమ్మకంలో, ఆచరణలో భిన్నత్వం ఈ మత విధానానికి మూలస్థానం. ప్రకృతి ఆరాధన విధానాల నుంచి నిరాకార నిరామయ స్వరూపుడైన భగవంతుని ఆరాధించే విధానం వరకు అన్నీ ఈ మతంలో ఆరాధనా విధి విధానాలే. ఈ భిన్నత్వాన్ని గౌరవించి ప్రవర్తించాల్సిన బాధ్యత అందరిమీదా ఉంటుంది. ఇతర మత విధానాల పట్ల కూడా అదేవిధంగా మెలగాలి. ఇటువంటి వ్యాఖ్యలు గతంలో పరిమితంగా చర్చకు వచ్చేవి. కానీ ప్రస్తుతం మీడియా పుణ్యమా అని శరవేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రసార మాధ్యమాలు కూడా ఇటువంటి అంశాలకు ప్రసార అవకాశం ఇవ్వకుండా వ్యవహరిస్తే మంచిది. ఈ వివాదం ఇంతటితో సమసిపోవటానికి అందరూ ముఖ్యంగా మేధావి వర్గం వారి భావజాలం ఏదైనా కానీ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడించే రుగ్మతలు ఎన్నో ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి, ఆర్థిక అసమానతలను రూపుమాపటం, నిరుద్యోగ సమస్య, పర్యావరణ పరిరక్షణ వంటి సమకాలీన అంశాలను వదిలివేసి చరిత్రను తవ్వుకుని సమస్యను సృష్టించుకోవటం వలన ప్రయోజనమేమీ ఉండదు. ఇందులో ఎంత చరిత్ర, ఎంత కవి కల్పన అనేది ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే చర్చించే అంశాలు చరిత్రకందని కాలం నాటివి. గత శతాబ్ది కాలంలో హిందూ సమాజానికి రామానుజాచార్యులవారి స్థాయి కలిగిన మత సామాజిక సంస్కర్త లేకపోవటం ఈ మతం చేసుకున్న గొప్ప దురదృష్టం. సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా మతంలో మార్పులు రాకపోతే మతానికే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఉంటాయి. ఈ అంశంపై హైందవ సమాజం మొత్తం దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ-మెయిల్ : iyrk45@gmail.com -
కత్తిపై బెజవాడలో కేసు నమోదు
విజయవాడ: సినీ విమర్శకుడు కత్తి మహేశ్పై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కులాలు, మతాల మధ్య గొడవలు, మనస్పర్థలు కలిగించే విధంగా కత్తి మహేశ్ వ్యవహరిస్తున్నాడంటూ విజయ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సత్యనారాయణపురం పోలీసులు కత్తి మహేశ్పై 153(ఏ), 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ప్రతి ఇంటికి తాళం వేయండి’
సాక్షి, హైదరాబాద్ : కత్తి మహేశ్, స్వామి పరిపూర్ణానందలను నగర బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని కాగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతి భద్రతల పేరిట ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలెవరూ బయటకి రాకుండా ప్రతి ఇంటికి తాళం వేయండి ..శాంతి భద్రతలు ఇంకా బాగుంటాయని ఎద్దెవా చేశారు. పరిపూర్ణానంద స్వామి బహిష్కరణపై చినజీయర్ స్వామి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. స్వామీజీ ఎం తప్పు చేశారని ఆయనపై గుండా యాక్ట్ పెట్టారని మండిపడ్డారు. ప్రగతి భవన్ వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేడయం దారుణమన్నారు. ముఖ్యమంత్రి ప్రతి చర్యను గవర్నర్ సమర్థించడం సరికాదన్నారు. -
కత్తి మహేష్కు మరో చేదు అనుభవం!
సాక్షి, తిరుపతి : శ్రీరాముడిపై తరుచూ వివాదస్పద వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలతో సినీ విమర్శకుడు కత్తి మహేష్పై ఇదివరకే ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ విధించిన విషయం విధితమే. అయితే తన సొంతూరుకు వెళ్లాలనుకున్న కత్తి మహేష్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. అతడిని స్వగ్రామానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడం గమనార్హం. చిత్తూరు జిల్లా ఎర్రవారిపల్లి మండలంలోని తన స్వగ్రామం యలమందకు వెళ్తున్నట్లు పీలేరు పోలీసులకు కత్తి మహేష్ తెలిపారు. ఈ మేరకు పీలేరు పోలీస్స్టేషన్కు వెళ్లిన ఆయనను పోలీసులు వద్దని వారించారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా కత్తి మహేష్ యలమందకు వెళితే అక్కడ హిందూ ధార్మిక సంఘాలు దాడి చేసే అవకాశముందని పోలీసులు హెచ్చరించారు. అయినా కత్తి మహేష్ వెనక్కి తగ్గకపోవడంతో.. బలవంతంగా జీపు ఎక్కించారు పీలేరు పోలీసులు. అక్కడినుంచి ఆయనను బెంగళూరుకు తరలించారు. కాగా, కత్తి మహేష్పై వేటు వేసిన తర్వాత స్వామి పరిపూర్ణానందను సైతం పోలీసులు హైదరాబాద్ నగరం నుంచి ఆరు నెలలపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా, కత్తి మహేష్ను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిషేధించాలంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేటు పడ్డ తర్వాత శ్రీరాముడిపై కత్తి మహేష్ పాడిన శ్లోకం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంబంధిత కథనాలు కత్తి మహేశ్పై బహిష్కరణ వేటు! అమోఘం: కత్తి మహేష్ నోట శ్రీరాముడి శ్లోకం! -
శైవక్షేత్ర పీఠాధీపతి శివస్వామి అరెస్ట్
-
పీఠాధిపతి అరెస్ట్.. శైవక్షేత్రం వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : టీడీపీ సర్కార్ ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందని, దేవాలయాలను సైతం కూల్చివేస్తూ అక్రమాలకు పాల్పుడుతున్నారని శైవక్షేత్ర పీఠాధీపతి శివస్వామి తీవ్ర ఆరోపణల చేశారు. నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తోందని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినీ విమర్శకుడు కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యల పట్ల చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తహశీల్దార్కు వినతిపత్రం ఇవ్వడానికి యత్నించిన పీఠాధిపతి శివస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్వోకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లినందుకు హౌస్ అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు శివస్వామి హౌస్ అరెస్ట్ నేపథ్యంలో శైవక్షేత్రం చుట్టూ పోలీసు బలగాలు మోహరించినా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. హిందుత్వంపై జరుగుతున్న దాడులను క్షేత్రానికి చెందిన పలువురు ఖండించారు. శ్రీవారి ఆభరణాల మాయంపై ఏపీ ప్రభుత్వం కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కమిటీ వేసి విచారణ చేయకుంటే ఆరోపణల్లో నిజముందని భావించాల్సి ఉంటుందన్నారు. హిందుత్వంపై టీడీపీ సర్కార్ చేస్తున్న దాడులను నిరసిస్తూ చలో తిరుపతి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 29న విజయవాడ నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర ఆగస్టు 12కు తిరుమల చేరుకుంటుందని వెల్లడించారు. 30 మంది స్వామిజీలు, 200 మంది శిష్యులు ఈ పాదయాత్రలో పాల్గొంటారని.. ఇందులో భాగంగా 500 గ్రామాల్లో సభలు నిర్వహిస్తామన్నారు. హిందుత్వంపై ప్రభుత్వం చేస్తున్న దాడులను ప్రజలకు వివరించి, ఏం జరిగినా సరే ఆగస్టు 13న తిరుపతి బంద్ నిర్వహిస్తామని శివస్వామి వివరించారు. -
వాళ్లను విధ్వంసకర శక్తులుగానే హైదరాబాద్ చూస్తుంది
రాముని మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అయితేనేమి, ‘ధర్మాగ్రహ యాత్ర’ పేరుతో మత వైషమ్యాలకు పురిగొల్పే ఆధ్యాత్మిక గురువు అయితేనేమి, వాళ్లను హైదరాబాద్ నగరం విధ్వంసకర శక్తులుగానే చూస్తుంది. విశ్వనగరంలో మతం చిచ్చుపెట్టే వాళ్లను ఉపేక్షించేది లేదని కేసీఆర్ మరోసారి రుజువు చేశారు. చట్టం తనపని తాను చేసుకుపోయింది. కేసీఆర్ ఆది నుంచి సనాతన ధార్మికుడు. ఆధ్యాత్మిక ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని, అవి తెలంగాణ సౌభాగ్యానికి పాటుపడాలని కోరుకునే నాయకుడు ఆయన. నేడు ప్రశాంత హైదరాబాద్ మహానగరంగా మరోసారి నిలబడింది. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాదులు, సమస్త శాస్త్రాలు మను షుల్ని చీకటి నుంచి వెలుతురు వైపు నడిపించాలి. శాస్త్ర విజ్ఞానం పెరిగి ఆకాశం ఆవలి దిక్కు గుట్టు విప్పుతున్న వేళ అంధ విశ్వాస్వాలు చెలరేగి మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తున్నాయి. మత విశ్వాసాల పేరుతో హత్యలకు, దాడు లకు, ధర్నాలకు, బంద్లకు పూనుకో వటం ఎంత దౌర్భాగ్యం.lభారత జను లది వైవిధ్యభరిత జీవన విధానం. ఆసేతు హిమాచల భారతావ నిలో భిన్న జాతులు, విభిన్న భాషలు, భావోద్వేగాలు, సంస్కృ తులు, ఆచారాలు, అవసరాలు ఉంటాయి. ఇంతటి జీవన వైవి« ద్యం ప్రపంచంలో మరే దేశంలో కన్పించదు. ఈ దేశంపై బయటి వారి దండయాత్రలు, అంతర్యుద్ధాలు శతాబ్దాల ఏలుబడిలో ఎక్కడి ఆచారాలు అక్కడ స్థిరపడిపోయాయి. అందుకే మతాలు, సంస్కృతులమధ్య అంతరాలు అనుబంధాలు ఏర్పడ్డాయి. భిన్న త్వంలో ఏకత్వమే లౌకిక భారత బలం. రోజు రోజుకు దేశంలో మత అసహనం పెరిగిపోతోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో చూశాను.‘మీ ఇంట్లో మీ ఆడవాళ్ళ ముఖాన బొట్టు, మెడలో మంగళసూత్రం, నల్లపూసల గొలుసు, కాళ్లకు మెట్టెలు... ఇవి అన్ని ఓ మతంలో భాగమే... ఆ మతాన్ని గురించి మాట్లాడకపోతే మీరు ఇంట్లో మీ ఆడవాళ్ళ మెడలో ఉన్న మంగళసూత్రాలు, నల్లపూసలు, బొట్టు, మెట్టెలు తీసేయండి’ అని పోస్టులు పెట్టారు. మతం అనేది ఒక విశ్వాసం. ఎవరి విశ్వాసాలు వాళ్లకు, ఎవరి నమ్మకాలు వాళ్లకు ఉంటాయి. మతోన్మాద శక్తులు మతం అంటే జీవన విధానం అనే దగుల్భాజీ మాటలను తెర మీదకు తెచ్చారు. వీళ్లే దేశంలో ప్రజలు ఏం తినాలో, ఏం తాగా లనే ఆహారపు అలవాట్లను నిర్దేశిస్తున్నారు. కట్టు, బొట్టు లాంటి సంస్కృతి, సాంప్రదాయాలను, నియంత్రించేందుకు భౌతిక దాడులకు దిగుతున్నారు. గోరక్షణ పేరుతో మనుషులను పాశవి కంగా చంపేస్తున్నారు. అది తప్పు అన్న బుద్ధి జీవులను నిర్ధాక్షి ణ్యంగా చంపించేస్తున్నారు. 2015 ఫిబ్రవరి 16న మహారాష్ట్ర వామపక్షవాది గోవింద్ పన్సారేను హత్య చేశారు. అదే ఏడాది ఆగస్టు 30న కన్నడ సాహితీవేత్త ఎంఎం కాల్బుర్గి(77)ని, 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన ఇంటి ఆవరణలో సీనియర్ జర్నలిస్ట్ గౌరీలంకేశ్(55)ను దుండగులు కాల్చి చంపారు. ఈ ముఠా హిట్ లిస్ట్లో జ్ఞానపీఠ్ గ్రహీత గిరీశ్ కర్నాడ్, కన్నడ రచ యిత ప్రొఫెసర్ కెఎస్ భగవాన్, సాహితీవేత్త బిటి లలితా నాయక్, నిడు మామిడి మఠం స్వామీజీ వీరభద్ర చెన్నమళ్లస్వామి, హేతు వాది సీఎస్ ద్వారకానాథ్ ఉన్నట్టు బయటపడింది. తెలంగాణ సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరి త్రను కలిగిన ప్రాంతం.. ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజవంశానికి చెందిన హిందూ రాజులు, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ రాజ వంశాలకు చెందిన ముస్లిం పాలకులు పాలించారు. భారత ఉప ఖండంలో మొట్టమొదటి సంస్కృతి కేంద్రంగా ఈ ప్రాంతం ఆవి ర్భవించింది. కళలు, సంస్కృతులపై ఆసక్తికలిగిన అప్పటి, ఇప్పటి పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక బహుళ సాంస్కృ తిక ప్రాంతంగా మార్చారు. ఇక్కడ రెండు వేర్వేరు సంస్కృతులు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. బోనాలు, బతుకమ్మ, దసరా, ఉగాది, సంక్రాంతి, మీలాద్–ఉన్–నబి, రంజాన్ వంటి మతపరమైన పండుగలు, డెక్కన్ ఫెస్టివల్ వంటి ఇతర వేడుక లను కూడా జరుపుకుంటారు. విభిన్న భాషలు, సంస్కృతులకు తెలంగాణ రాష్ట్రం చాలాకాలం నుండి కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. ‘దక్షిణానికి ఉత్తరం. ఉత్తరానికి దక్షిణం’గా, ‘గంగా– యమున తెహజీబ్’గా పిలవబడుతున్న తెలంగాణ రాష్ట్ర రాజ ధాని హైదరాబాద్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన నగరం. హిందూ, ముస్లిం, సిక్కు, పార్శి, మరాఠి సర్వ జనుల సంగమ విశ్వనగరం ఇది. రాముని మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అయితేనేమి , ‘ధర్మాగ్రహ యాత్ర’ పేరుతో మత వైషమ్యా లకు పురిగొల్పేlఆధ్యాత్మిక గురువు అయితేనేమి, వాళ్లను హైదరా బాద్ నగరం విధ్వంసకర శక్తులుగానే చూస్తుంది. విశ్వనగరంలో మతం చిచ్చుపెట్టే వాళ్లను ఉపేక్షించేది లేదని కేసీఆర్ మరోసారి రుజువు చేశారు. చట్టం తనపని తాను చేసుకుపోయింది. కేసీఆర్ ఆది నుంచి సనాతన ధార్మికుడు. ఆధ్యాత్మిక ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని, అది తెలంగాణ సౌభాగ్యానికి పాటుపడాలని కోరు కునే నాయకుడు ఆయన. రాజ్యం బాగుండాల, రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలనే ఆకాంక్షతో దేశవ్యాప్తంగా ఉన్న 1221 మంది పండితులను పిలిచి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో అయుత చండీమహాయాగం చేశారు. ఈ క్రతువులో 20 లక్షల మందికి పైగా ప్రజలు భాగస్వాములు అయ్యారు. శిధిలావస్థలో ఉన్న ఎన్నో దేవాలయాలను పునః నిర్మాణం చేసి పూర్వ వైభవం తెచ్చారు. సర్వ మతాల ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ఎన్నో మజీదులను, చర్చిలను పునః నిర్మాణం చేశారు. ఇక్కడో ఉదాహరణ. మీర్ ఉస్మాన్ అలీఖాన్కు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక సేనను తయారు చేసుకోవాల్సి వచ్చింది. అది తయారుచేసి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, అత్యాచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీయే ఐనా అందుకు తన పోలీసులతో, పాలనతో ప్రోత్సహించినవారు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆ బలమే లేకపోతే హైదరాబాద్ నగరంలో షోయ బుల్లాఖాన్ వంటి పత్రికా సంపాదకుణ్ని బర్కత్పురాలో రజాకార్లు చంపగలిగేవాళ్లు కాదు. రజాకార్లు విద్వేషాలు రెచ్చగొట్టారనేది స్పష్టం. నిజాం వాళ్ళను పెంచి పోషించాడన్నదీ çసుస్పష్టం. దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణలో భీంరెడ్డి నర్సింహారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటి యువ నేతలు ఆయుధాలు పట్టాల్సి వచ్చింది. అదే తెలం గాణ సాయుధ పోరాటం అయింది. నిజాం చివరి రోజుల్లో తీసు కున్న ఈ నిర్ణయం 400 ఏళ్ల అద్భుత పరిపాలనకు మాయని మచ్చను తీసుకొచ్చింది. ‘రాజ్యాంగమెంత మంచిదైనా పాలకులు మంచివారు కాకపోతే అది చెడుగా మారుతుంది. ఎంత చెడు రాజ్యాంగమైనా పాలకులు మంచివారైతే మంచిదిగా మారు తుంది’ అని రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడు డా‘‘ అంబేడ్కర్ చేసిన హెచ్చరిక ఎప్పటికీ పాలకులను అప్రమత్తులను చేస్తూనే ఉంది. ఆ అప్రమత్తత నుంచి పుట్టిన ఆలోచనే కేసీఆర్ తీసుకున్న కఠిన నిర్ణయం. నేడు ప్రశాంత హైదరాబాద్ మహానగరంగా మరోసారి నిలబడింది. వారం రోజులుగా నగరంలో జరుగుతున్న సంఘటనల పట్ల కేసీఆర్ నిర్ణయాన్ని సకల మతాలు, సబ్బండ జాతులు స్వాగతిస్తున్నాయి. వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు మొబైల్ : 94403 80141 -
కత్తి మహేష్ శ్లోకం.. పరిపూర్ణానంద కామెంట్స్!
సాక్షి, విజయవాడ : కత్తి మహేష్ పాడిన శ్రీరామనామంపై శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి స్పందించారు. శ్రీరాముడిపై కత్తి మహేష్, తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాప పడ్డానని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఆయన శుక్రవారం కనకదుర్గ అమ్మవారిని దర్శంచుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో స్వామిజీకి అధికారులు స్వాగతం పలికారు. అంతేకాక స్వామిజీ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ.. రామనామంను కీర్తించడం ద్వారా కత్తి మహేష్లో పరివర్తన ఏర్పడుతోందని చెప్పారు. ఇటీవల కత్తి మహేష్ రామనామంను పలికిన విషయం విదితమే. అతి త్వరలోనే రామనామం గొప్పతనాన్ని కత్తి మహేష్ గుర్తిస్తారని స్వామిజీ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందన్నారు. మత ధర్మాలను హాయిగా ఆచరించే చట్టాలు తేవాలని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసులు కత్తి మహేష్, పరిపూర్ణానంద స్వామిలను ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించిన విషయం తెలిసిందే. -
కేవీపీఎస్ నాయకుల ఆందోళన
జనగామ: కత్తి మహేష్, పరిపూర్ణానంద హైదరాబాద్ నగర బహిష్కరణలను వ్యతిరేకిస్తూ కేవీపీఎస్ బాధ్యులు గురువారం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, కత్తి మహేష్, పరిపూర్ణానంద బహిష్కరణలను ఎత్తివేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్బాబు మాట్లాడుతూ ఇద్దరిని నగర బహిష్కరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న నాయకులను ఎస్సై పరమేశ్వర్ ఆధ్వర్యంలో బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసుల వాహనాన్ని అడ్డగించారు. దళిత, గిరిజన సంఘాల సమాఖ్య జిల్లా చైర్మన్ పగిడిపాటి సుగుణాకర్రాజు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారపాక మధు, బొట్ల శేఖర్, తిప్పారపు విజయ్ ఉన్నారు. -
కత్తి మహేశ్ను హీరో చేసిందెవరు?
సాక్షి, న్యూఢిల్లీ : రామాయణంలోని పాత్రల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఎలాంటి నేర చరిత్రలేని ఓ దళితుడిని తెలంగాణ పోలీసులు నగర బహిష్కారం చేయడం బహూశ దేశంలోనే మొదటి సారి కావచ్చు. పైగా రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినిమా విశ్లేషకుడు కత్తి మహేశ్, ఆయన వ్యాఖ్యలకు నిరసనగా పాద యాత్ర జరుపుతానంటూ హెచ్చరిక చేసిన పరపూర్ణానంద స్వామి పట్ల పరస్పరం భిన్నంగా వ్యవహరించడం కూడా తెలంగాణ పోలీసులకే చెల్లింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇచ్చుకునేందుకు వీలుగా కత్తి మహేశ్కు ఎలాంటి న్యాయపరమైన నోటీసులు ఇవ్వని పోలీసులు (పిలిపించి మాట్లాడారే తప్ప), మత మార్పిడిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరిపూర్ణానంద స్వామికి మాత్రం నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా తొలుత స్వామిని గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు, కత్తి మహేశ్ను మాత్రం నగర బహిష్కారం చేశారు. పోలీసుల నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వక పోవడమే కాకుండా ప్రతిపాదిత నిరసన పాద యాత్రను మానుకోనని మొండికేయడంతోనే స్వామినీ కూడా నగర బహిష్కారం చేశారు. సమన్యాయం చాటుకునేందుకే అలాచేసి ఉండవచ్చు. కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు నిక్కచ్చిగా ఆయన తన సొంత అభిప్రాయంగానే చెప్పారు. అది ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛ. ఆయన అభిప్రాయంతో ఎవరైనా విభేదించవచ్చు. విమర్శించవచ్చు. అంతేగానీ శిక్షించే అధికారం చట్టానికే లేదు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులకు ఇంకెక్కడిది? ఆ మాటకొస్తే రామాయణంపై అందులోని పాత్రలపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఎంతో మంది సాహిత్యవేత్తలు, మేథావులు రామాయణాన్ని విమర్శించారు. అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. ప్రముఖ తెలుగు మహిళా సాహితీవేత్త రంగనాయకమ్మ ‘రామాయణం ఓ విష వృక్షం’ అని ఓ గ్రంధమే రాశారు. దక్షిణాదిలో ద్రావిడ ఉద్యమానికి ఆద్యుడు పెరియార్ ఈవీ రామస్వామి రామాయణంలోని అన్ని పాత్రలను విశ్లేషిస్తూ దశరథుడు, రాముడు, లక్ష్మణుడు, సీత, కౌసల్యా.. తదితర పాత్రలన్నింటిని విమర్శించారు. రాముడు, లక్ష్మణుడు శూర్పనకను అవమానించిన కారణంగానే అందుకు ప్రతీకారంగానే రావణాసురుడు సీతనుఎత్తుకు పోయాడని, అమెను కనీసం ముట్టుకోలేదంటూ రావణాసురుడిని సమర్థించారు. రామాయణాన్ని ఆయన విశ్లేషిస్తూ పెరియార్ రామస్వామి రాసిన ‘ఈవీ రామస్వామీస్ రీడింగ్ ఆఫ్ ది రామాయణ’ అనే పుస్తకాన్ని తమిళయన్లు పవిత్ర గ్రంధంగా పూజిస్తున్నారు. పెరియార్ రామస్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి దేవుడిలా కొలుస్తున్నారు. ఆయన ప్రారంభించిన ద్రావిడ ఉద్యమం పేరు దాదాపు అన్ని రాజకీయ పార్టీల పేర్లలో మిలితమై ఉంటుంది. ఇటు పెరియార్ రామస్వామి పుస్తకాన్నిగానీ, తెలుగునాట రంగనాయకమ్మ రాసిన ‘రామాయణం విషవృక్షం’ పుస్తకాన్ని ఎందుకు నిషేధించలేదు? ఆక్స్ఫర్డ్ ఇండియా పేపర్బ్యాక్స్ ప్రచురించిన ‘మెనీ రామయాణాస్’ చదివితే ఇంకేమైనా ఉందా? ఇంకా దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛను నిషేధించలేదు కనుక, ఈ పుస్తకాలను కూడా నిషేధించలేదు. ఈ నేపథ్యంలోనే కత్తి మహేశ్కు నగర బహిష్కార శిక్ష సబబా, కాదా? అన్న చర్చ వస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కత్తి మహేశ్కు వచ్చిన పబ్లిసిటీ ఏమోగానీ నగర బహిష్కరణ శిక్ష ద్వారా ఆయనకు వచ్చిన పాపులారిటీ చాలా ఎక్కువ. మహేశ్ వర్సెస్ పరిపూర్ణానంద స్వామి ఎపిసోడ్లో స్వామి బహిష్కరణను తీవ్రంగా ఖండించిన స్థానిక బీజేపీ నాయకులు మాట వరుసకు కూడా కత్తి బహిష్కారాన్ని ఖండించలేదు. కేంద్రంలో ఇటీవల అస్తమానం భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు మాత్రం ఈ ఎపిసోడ్పై స్పందించడం లేదు. అదే నెట్ఫిక్స్లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ ‘సాక్రెడ్ గేమ్స్’ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని విమర్శించారంటూ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. గాంధీ, నెహ్రూలు వారికి దేవుళ్లతో సమానం కనుక వారికి కోపం వచ్చి ఉంటుంది. హిందువులను కించపరిచే డైలాగులు ఉన్నాయంటూ సాక్రెడ్ గేమ్స్పై ఆరెస్సెస్ వారు కూడా కోర్టుకెళ్లారు. అది వేరే విషయం. -
శ్రీ రాముడి పాట పాడిన కత్తి మహేష్
-
అమోఘం: కత్తి మహేష్ నోట శ్రీరాముడి శ్లోకం!
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఇటీవల శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేయడంతో కత్తిపై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్లిపోయారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్లో అడుగుపెట్టడానికి వీళ్లేదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కత్తి దీనిపై న్యాయబద్ధంగా పోరాడటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. శ్రీరాముడిని దూషించిన నోటితోటే ఆయనను పొగుడుతూ శ్లోకాలతో కూడిన ఓ పాటను కత్తి మహేష్ పాడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కత్తి మహేష్ రాముడి పాటను స్పష్టంగా పాడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దాదాపు ఒక నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో ఆయన నోటి వెంట రాముని పాట తప్ప ఇంకేమీ లేకపోవడం విశేషం. అయితే కత్తి నోట ఈ శ్లోకం రావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. పశ్చత్తాపంతో రాముడిని స్మరించుకున్నాడా..? లేదంటే శ్రీ రాముడికి తాను వ్యతిరేకిని కాదని చెప్పడానికి పాడాడా..? భయంతో పాడుతున్నాడా.? భక్తితో పాడుతున్నాడా.? లేక వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారా.? అనేది అర్థం కావడంలేదని నెటిజన్లు అంటున్నారు. -
అలజడి.. ఆందోళన
సాక్షి, కొత్తగూడెం: రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్ బహిష్కరణ అంశం తరువాత చోటుచేసుకున్న పరిణామాలు బుధవారం జిల్లాలోనూ కలకలం రేపింది. చివరకు జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం పట్టణాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు. శ్రీరాముడి విషయమై ఇటీవల కత్తి మహేష్ అనే సినీ క్రిటిక్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని వివాదం చెలరేగడంతో కత్తి మహేష్ను హైదరాబాద్ నగర బహిష్కరణ చేసి అతని సొంత జిల్లా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు తెలంగాణ పోలీసులు తరలించారు. ఈ క్రమంలో గత 6నెలల క్రితం పరిపూర్ణానంద స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన విమర్శల నేపథ్యంలో స్వామీజీని సైతం హైదరాబాద్ నగర బహిష్కరణ చేశారు. ఈ క్రమంలో పరిపూర్ణానంద స్వామిని కాకినాడకు తరలించేందుకు రాష్ట్ర పోలీసులు ప్రయత్నించగా, స్వామి మాత్రం భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకునంటానని కోరారు. ఈ క్రమంలో పోలీసులు దారి మార్చి అశ్వారావుపేట మీదుగా నేరుగా కాకనాడకు స్వామీజీని తరలిస్తుండడంతో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు. భద్రాచలం వంతెనపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడంతో సమస్య ఏర్పడింది. దీంతో పోలీసులు ప్రభాకర్రెడ్డితో పాటు మరో 8 మంది నాయకులను అరెస్టు చేసి తరువాత విడుదల చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కేవలం హైదరాబాద్ నగర బహిష్కరణ మాత్రమే చేసిన పోలీసులు, స్వామీజీని భద్రాచలం పంపుతామని చెప్పి ఇలా దారిమళ్లించడం సరికాదని అన్నారు. ఇలా ఏకపక్షంగా రాష్ట్రం దాటించడం ఏమిటని ప్రశ్నించారు. -
హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా ధర్మాగ్రహ యాత్ర నిర్వహించాలని సిద్ధపడ్డ పరిపూర్ణానంద స్వామిని బహిష్కరించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన ప్రాథమికహక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ అంశంపై గవర్నర్ నరసింహన్ను రాజ్భవన్లో బీజేపీ నేతలు బుధవారం కలసి ఫిర్యాదు చేశారు. కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కిషన్రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు, నేతలు ప్రేమేందర్రెడ్డి, చింతా సాంబమూర్తి, దాసరి మల్లేశం తదితరులు గవర్నర్ను కలిశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టాలని నోటికొచ్చినట్లు మాట్లాడిన ఎంఐఎం నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, హిందూ ప్రజల మనోభావాల గురించి ప్రశ్నిస్తున్న వారిపైనే చర్యలు తీసుకోవడం శోచనీయమన్నారు. రాష్ట్రప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ పరిపూర్ణానందను అకారణంగా బహిష్కరించారని మండిపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. లక్షలాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగం చేస్తూ పరిపూర్ణానందను గృహ నిర్బంధం చేశారని.. ఆయనను ఎందుకలా గృహ నిర్బంధం చేయాల్సి వచ్చిందో చెప్పాలని కిషన్రెడ్డి ప్రశ్నించారు. నగర బహిష్కరణ అని, రాష్ట్రం నుంచి ఎలా బహిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదేమైనా నిజాం పాలనా అని ప్రశ్నించారు. విభజన చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి హిందువులపై అనుచితంగా, మనోభావాలను కించపరుస్తూ మాట్లాడుతున్నా ఎందుకు చర్యలను తీసుకోవట్లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న ఎంఐఎం నేతలపై ఎందుకు చర్యలను తీసుకోవట్లేదని ప్రశ్నించారు. బహిష్కరణ దారుణం: లక్ష్మణ్ స్వామి పరిపూర్ణానందపై బహిష్కరణ నిర్ణయం అప్రజాస్వామికం, దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేవుడిని దూషించి, మెజారిటీ ప్రజల మనోభావాలను గాయపర్చిన వారిపై కఠినంగా వ్యవహరించకుండా పరిపూర్ణానంద పై బహిష్కరణ వేటు వేయడం ప్రభుత్వ దుర్మార్గ చర్యలకు పరాకాష్ట అని విమర్శించారు. పరిపూర్ణానంద స్వామిని నిర్బంధించడం, నగర బహిష్కరణ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పరిపూర్ణానంద బహిష్కరణ అంశంపై ప్రభుత్వం, పోలీసులు పునరాలోచించాలని కోరారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఎంఐఎం నేతలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిపూర్ణానంద స్వామిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. -
పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ‘ధర్మాగ్రహ యాత్ర’చేపడతానని ప్రకటించిన ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరిస్తూ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయనకు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ఆరు నెలల పాటు హైదరాబాద్లో అడుగు పెట్టొద్దని, నోటీసులు అందుకున్న 24 గంటల్లో నగరాన్ని విడిచిపెట్టాలని అందులో పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున స్వామిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీపీఠానికి తరలించాయి. గత రెండు రోజులుగా ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ తరహాలో ‘శాంతిభద్రతల సమస్య’పేరుతో నగర బహిష్కరణకు గురైన రెండో వ్యక్తి స్వామి పరిపూర్ణానంద. సోమవారం సినీ విమర్శకుడు కత్తి మహేశ్ను నగరం నుంచి బహిష్కరించడం, ఆ విషయాన్ని స్వయంగా రాష్ట్ర డీజీపీ ప్రకటించడం తెలిసిందే. నగర పోలీసు చరిత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించిన కారణాలతో నగర బహిష్కరణ చేయడం ఇదే తొలిసారి. రానున్న ఎన్నికల సీజన్ నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడాది క్రితం నాటి అంశాలను ప్రస్తావిస్తూ.. ఓ టీవీ చానల్ కార్యక్రమంలో రాముడిని ఉద్దేశించి కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం, దానికి నిరసనగా స్వామి పరిపూర్ణానంద యాత్రకు సిద్ధం కావడం తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు పరిపూర్ణానందకు జారీ చేసిన ఐదు పేజీల నోటీసులు ఏడాది క్రితం నాటి అంశాలను ప్రస్తావించారు. గతేడాది నవంబర్లో మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్లో జరిగిన సభలో రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ ప్రకటన చేసిన స్వామి పవిత్ర యాత్రకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. డిసెంబర్లో కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, మార్చిలో కరీంనగర్లో నిర్వహించిన బహిరంగ సభలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పది రోజులుగా కత్తి మహేశ్, స్వామి పరిపూర్ణానంద చేస్తున్న వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు కారణమయ్యేలా, అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ‘ధర్మాగ్రహ యాత్ర’పేరుతో స్వామి చేపట్టదలచిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ ఆదివారం విలేకరులతో మాట్లాడిన స్వామి యాత్ర కొనసాగిస్తానని ప్రకటించారని, ఇది శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఆస్కారం ఉందని పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు. కాకినాడకు చెందిన పరిపూర్ణానంద తరచుగా హైదరాబాద్ వచ్చి ఉంటున్నారని, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఇవి రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయని, ఈ పరిణామాల నేపథ్యంలో ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లో ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చని పోలీసు కమిషనర్ సూచించారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ‘తడిపార్’ ఇలా నగర బహిష్కరణ విధించడాన్ని తడిపార్ అంటారు. మాజీ డీజీపీ ఎంవీ భాస్కర్రావు నగర పోలీసు కమిషనర్గా ఉండగా దీన్ని ఎక్కువగా వినియోగించారు. ఆపై బి.ప్రసాదరావు కొత్వాల్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2008 నుంచి అనేక మందిని నగరం నుంచి బహిష్కరించారు. 2014లో చాదర్ఘాట్కు చెందిన హిస్టరీ షీటర్ మహ్మద్ జాబ్రీపై పడిన తడిపార్ వేటే ఆఖరిది. అంతకు ముందు రౌడీషీటర్లు జంగ్లీ యూసుఫ్, ఖైసర్, లేడీ డాన్ ఫర్హాఖాన్.. ఇలా ఎంతో మందిని నగరం నుంచి బహిష్కరించారు. అయితే నగర పోలీసు కమిషనరేట్ చరిత్రలో ఇప్పటి వరకు రౌడీషీటర్లు, కరడుగట్టిన నేరగాళ్లను మాత్రమే బహిష్కరించే వారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం పేరుతో తడిపార్ చేయడం ఇదే తొలిసారి. సిటీలో గతంలోనూ అనేక మంది రాజకీయ నాయకులు, పెద్దలు కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వారిపై ఇలాంటి నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. -
స్వామి బహిష్కరణ.. స్పందించిన కత్తి మహేష్!
శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు ఆరు నెలలు బహిష్కరించడంపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ ట్విటర్ ద్వారా స్పందించారు. స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ విధించడాన్ని ఆయన ఖండించారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కత్తి మహేష్పై హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పాడుతుందనే భావనతో కత్తి మహేష్పై హైదరాబాద్ పోలీసులు ఆరు నెలలు నగర బహిష్కరణ విధించిన విషయం తెలిసిందే. ‘పరిపూర్ణానంద నగర బహిష్కరణను ఖండిస్తున్నాను. బహిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం కాదు. బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. మనుషుల్ని‘‘తప్పిస్తే’’ సమస్యలు తప్పుతాయి అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుంద’ని కత్తి మహేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కత్తి మహేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్వామి బహిష్కరణకు మద్దతుగా కత్తి మహేష్ మాట్లాడటం ఆసక్తికర పరిణామం. స్వామి పరిపూర్ణానందపై కూడా హైదరాబాద్ పోలీసులు నేడు బహిష్కరణ విధించారు. ఆయన గతంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని.. వాటికి సమాధానం చెప్పలేదంటూ స్వామి పరిపూర్ణానందపై కూడా 6 నెలల బహిష్కరణ వేటు వేశారు. పరిపూర్ణానంద నగర బహిష్కరణను ఖండిస్తున్నాను. బహిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం కాదు.బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.మనుషుల్ని "తప్పిస్తే" సమస్యలు తప్పుతాయి అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుంది. — Kathi Mahesh™️ (@kathimahesh) 11 July 2018 -
కత్తి మహేష్పై వేటు తగదు
శ్రీకాకుళం(పీఎన్కాలనీ) : రాముడు, రామాయణం గురించి కత్తి మహేష్ విమర్శించాడని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని పేర్కొంటూ తెలం గాణ ప్రభుత్వం, డీజీపీ అతనిని హైదరాబాద్ నుంచి బహిష్కరించడం తగదని దళిత ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలో అంబేడ్కర్ విజ్ఞాన మందిర్లో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కత్తి మహేష్ దళిత కులానికి చెందినవాడని బహిష్కరించారని, అగ్రకులస్తుడైతే అంత ధైర్యం చేయరన్నారు. తక్షణమే నగర బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గతంలో రాముడుమీద, రామాయణం మీద అనేక విమర్శలు చేసిన, రాసిన ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ మీద గాని, రచయిత ఆరుద్రపైన, చలం, ప్రముఖ న్యాయవాది రామ్జఠ్మాలానీపై ఎటువంటి శిక్షలు వేయకుండా దళితుడిపై ఇటువంటి చర్యలు తీసుకోవడం హేయమైన చర్య అని అన్నారు. ఈ సమావేశంలో దళిత ఆదివాసీ జేఏసీ నాయకులు కలివరపు సింహాచలం, కల్లేపల్లి రామ్గోపాల్, పోతల దుర్గారావు, డి.గణేష్, కంఠ వేణు, అంపోలు ప్రతాప్, మిస్క కృష్ణయ్య, బోసు మన్మథరావు, ఎస్.ఎబేరు పాల్గొన్నారు. -
స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్ : శ్రీరాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో జూబ్లీహిల్స్ గృహ నిర్బంధంలో ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాకినాడ తరలించారు. అనుమతి లేకుండా నగరంలో ప్రవేశించొద్దని.. తమ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు సందర్భాల్లో ఇతర మతాలపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వామి పరిపూర్ణాంద తరలింపులో తొలుత పోలీసులు చాకచక్యం ప్రదర్శించారు. నాలుగు వాహనాల్లో బయలు దేరిన పోలీసులు రెండు వాహనాలను విజయవాడ వైపు, మరో రెండు వాహనాలను శ్రీశైలం వైపు పంపించారు. ఈ రెండు మార్గాల్లో ఆయన్ను ఎక్కడికి తరలించారనే విషయాన్నిపోలీసులు వెల్లడించలేదు. అధికారిక ప్రకటన అనంతరం కాకినాడలోని శ్రీపీఠానికి స్వామి పరిపూర్ణానందను తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
స్వామి పరిపూర్ణానంద ఆరు నెలలు నగర బహిష్కరణ
-
కత్తి, పరిపూర్ణానంద ఎపిసోడ్: కన్నా ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : లక్షలాది మంది హిందూవులు ఆరాధించే పరిపూర్ణానంద స్వామిని హౌజ్ అరెస్టు చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. పరిపూర్ణానంద హౌజ్ అరెస్టు అయిన జులై 9ను బ్లాక్ డేగా అభివర్ణించారు. కాగా, రాముడిని దూషిస్తూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాదయాత్ర చేపడుతున్న పరిపూర్ణనంద స్వామిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏ మతానికి చెందిన దేవుడిని లేక దేవతను ఉద్దేశించి తప్పుగా మాట్లాడేవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాన్ని తేవాలనే సదుద్దేశంతోనే స్వామి పాదయాత్ర తలపెట్టారన్నారు. ఇదేమైనా నేరమా అని ప్రశ్నించారు. మన పాలన ఇలా ఉందంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి స్వామీజీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. July 9 was another black day in democracy as a Hindu sanyasi, Paripoornananda Swamiji, adored by lakhs of Hindus in Telugu States, was detained at his camp in Hyderabad by State police preventing from taking a paadayaatra. (1/2) — Kanna Lakshmi Narayana (@klnbjp) July 10, 2018 His crime was that he sought a legislation to be brought in facilitating "severe punishment for defaming or decrying Gods or Goddesses of any religion." What a great Governance we have ! Let wisdom dawn on Government and Swamiji be released (2/2) — Kanna Lakshmi Narayana (@klnbjp) July 10, 2018 -
‘కత్తి’ని తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలి!
సాక్షి, అనతపురం : హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిపై అనుచిత వాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్ను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలని భజరంగదళ్ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై ఈ రోజు(మంగళవారం) రెవెన్యూ అధికారులకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో మాట్లాడుతున్న కత్తి మహేష్ హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారన్నారు. సీతారాముల చరిత్రను కించపరిచే విధంగా మాట్లాడుతున్న కత్తిపై కేసు నమోదు చేయాలన్నారు. హిందూ ధర్మగ్రహ యాత్రకు తెలంగాణలో అవకాశం కల్పించి, పరిపూర్ణానంద స్వామీజీకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. చర్చావేదికలు పెట్టి మత విశ్వాసాలపై డిబెట్ పెడుతున్న టీవీ9 చానల్ను సైతం మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భజరంగదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కసాపురం రవి, సోమశేఖర్, రమేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కత్తి మహేశ్పై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. వినతిపత్రం అందజేస్తున్న భజరంగదళ్ నాయకులు -
తొలిసారి తెరపైకి కత్తి మహేష్ తండ్రి
-
తొలిసారి తెరపైకి కత్తి మహేష్ తండ్రి
సాక్షి, చిత్తూరు : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్పై ఈ రోజు(సోమవారం) హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. కత్తి ఇటీవల శ్రీరాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, హిందూమతాన్ని కించపరిచేవిధంగా ఆయన మాట్లాడారని హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా కత్తి మహేశ్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ.. స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. శ్రీరాముడిపై వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే కత్తిపై పలు కేసులు నమోదయ్యాయి. దీనిపై కత్తి మహేష్ తండ్రి కత్తి ఓబులేసు స్పందించి శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నా కొడుకును కాదు.. హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణానందను దేశ బహిష్కరణ చేయాలన్నారు. మహేష్ దళితుడు కాబట్టే బ్రాహ్మణులు అనవసర రార్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాముడి గురించి నా కొడుకు మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమేనని పేర్కొన్నారు. రామాయణం విష వృక్ష పుస్తకం.. పూర్తిగా చదివితే రాముడు ఎలాంటి వాడో అందరికీ అర్థమవుతోందన్నారు. నా కొడుకు హిందువే.. నాస్తికుడు కాదు.. అస్తికుడేనని తెలిపారు. నా కొడుకు తన భార్యతో కలిసే ఉన్నాడు విడిపోలేదని చెప్పారు. ఈ నెల 4న లక్నో వెళ్లి కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారని తెలిపారు. సామాజిక మాథ్యమాల్లో కావాలనే కొంతమంది నా కొడుకుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. -
కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై హైపర్ ఆది ఫైర్
-
కత్తి మహేష్పై హైపర్ ఆది ఫైర్
కత్తి మహేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఫైర్ అయ్యారు. ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియో సారాంశం.. ‘హాయ్ అండి నేను హైపర్ ఆదిని మాట్లాడుతున్నాను. కొన్నికోట్ల మంది దేవుడిగా కొలిచే రాముడ్ని కూడా తీసుకొచ్చి న్యూస్ ఛానెళ్లో కూర్చోబెట్టేశారండి. ఒకడేమో రాముడు దేవుడు కాదంటాడు. ఇంకొకడేమో సీతను రావణాసురుడి దగ్గర ఉంచితే మంచిది అంటాడు. ఇంకొకడైతే రాముడు దశరథుడికి పుట్టలేదంటాడు. ఇంకొకడైతే రాముడ్ని డైరెక్ట్గా దగుల్బాజీ అంటాడు. ఛీ ఛీ చీ.. ఏరా శ్రీరామనవమికి పెట్టే పానకం, వడపప్పు తిని ఒళ్లు పెంచినట్టున్నావ్. ఎలా వచ్చాయ్రా నీకా మాటలు. నాకు క్రిష్టియన్స్, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. క్రిస్మస్, రంజాన్ వస్తే నేను వాళ్లింటికి వెళ్లి భోజనం చేస్తాను. సంక్రాంతి వస్తే వాళ్లు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. నేను ఎక్కడికైనా వెళ్తుంటే దారిలో చర్చి, మసీదు, గుడి కనిపించినా దండం పెట్టుకుంటాను. ఇలా ఐకమత్యంగా ఉండే మనదేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అరే.. మీ పబ్లిసిటీ కోసం మనుషుల మధ్యే కాకుండా దేవుడి మీదే రివ్యూలు రాసి.. మా హీరో మా హీరో అని కొట్టుకునే స్థాయి నుంచి మా దేవుడు మా దేవుడు అని కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు. సూపర్. సార్.. మీ అందరికి.. హిందు మతాన్ని కించపరుస్తుంటే.. ఇది తప్పు అని చెప్పలేనంత బిజీగా ఉన్నారని నేననుకోవడం లేదు. కాబట్టి మీరు ఎవ్వరూ ఏ ప్రొఫెషన్లో ఉన్నా.. మీకిది తప్పు అని అనిపిస్తే ఖండించండి సార్. అలాగే రేపు బొడుప్పల్ నుంచి యాదగిరి గుట్ట వరకు హిందూ ధర్మాగ్రహ యాత్రలో అందరూ పాల్గొనండి. ఇది తప్పు అనిపించిన ఎవరైనా మతబేధం లేకుండా అందరూ ఖండించండి. కానీ దేవుడ్ని తిట్టిన విషయంలో కూడా సపోర్ట్ చేయటం కరెక్ట్ కాదు సర్. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. అందరు దేవుళ్లు ఒకటే. థ్యాంక్యూ’ అంటూ ముగించారు. ఇక ఇదే విషయంపై మెగా బ్రదర్ నాగబాబు కూడా ఫైర్ అయిన సంగతి తెలిసిందే. -
‘కత్తి మహేశ్ అయినా నెత్తి మహేశ్ అయినా’
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యనూ తెలంగాణ ప్రభుత్వం అనుమతించబోదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. అది కత్తి మహేశ్ అయినా నెత్తి మహేశ్ అయినా సామరస్యాన్ని చెడగొడితే ఉపేక్షించమని పేర్కొన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్పై తీసుకున్న నిర్ణయానికి డీజీపీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ప్రాధాన్యత లేని వ్యక్తుల మాటలను ప్రసారం చేసేప్పుడు మీడియా మరింత సంయమనం పాటించాలని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాడిందే పాడినట్టు కాళేశ్వరంపై పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ప్రజలను గందరగోళ పరిచేట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టును ఎందుకు కట్ట లేదో జీవన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు ప్రతిపాదిస్తే మహారాష్ట్రతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందం కుదుర్చుకోలేకపోయిందని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి అవివేకంతో మాట్లాడుతున్నారని, కాళేశ్వరంపై సుప్రీంకోర్టు తాజాగా వేసిన పిటిషన్ను కొట్టి వేయడం కాంగ్రెకు చెంపపెట్టు అన్నారు. సుప్రీంలోద తాజాగా పిటిషన్ వేసిన దొంతు లక్ష్మీనారాయణ వెనక కూడా కాంగ్రెస్ ఉందన్నారు. కోర్టులతో మొట్టి కాయలు వేయించుకోవడం కాంగ్రెస్కు పరిపాటిగా మారిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై కోర్టుల్లో కేసులు నిలవక పోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటక స్థలంగా మారిందని జీవన్ రెడ్డి అంటున్నారనిఒ, ఆధునిక దేవాలయాలు సాగునీటి ప్రాజెక్టులు పర్యాటక స్థలాలుగా మారితే తప్పేంటి అని ప్రశ్నించారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లకు గ్రీసు పెట్టిన పాపాన కూడా పోలేదని, కాళేశ్వరానకి గత ఏడాది కాలంలోనే పది రకాల అనుమతులు సాధించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. ఇకనైనా కాంగ్రెస్ కోర్టుల్లో కేసులు వేయడం మానుకుని ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలన్నారు. -
‘కత్తి మహేష్పై జీవితకాల నిషేధం విధించాలి’
సాక్షి, హైదరాబాద్: శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్పై ఆరు నెలల నిషేధం సరిపోదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గృహనిర్బంధంలో ఉన్న స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్తో పాటు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ... హైదరాబాద్ నుంచి శాశ్వతంగా కత్తి మహేష్ను బహిష్కరించాలని, జీవితకాలం పాటు నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలుగా స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు వస్తే పోలీసులు అనుమతి ఇవ్వలేదని, దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. దళితుల పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అక్బరుద్దీన్పై ప్రభుత్వానికి పట్టదా? స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఖండించారు. కత్తి మహేష్ను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. స్వామిజీ శాంతియుతంగా ధర్మాగ్రహ యాత్ర చేస్తామంటే ఎందుకు నిర్బంధించారని నిలదీశారు. కాగా, స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు సినీ నటి కరాటే కల్యాణిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. చదవండి : పరిపూర్ణానంద నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత! కత్తి మహేశ్పై బహిష్కరణ వేటు! కత్తి మహేశ్ను అందుకే బహిష్కరించాం: డీజీపీ -
అవసరమైతే కత్తి మహేశ్కు మూడేళ్ల జైలు
-
అసలు కత్తి మహేశ్ ఎవరు?
సాక్షి, తిరుపతి : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేశ్పై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు కత్తి మహేశ్ను అదుపులోకి తీసుకొని.. చిత్తూరు జిల్లాకు తరలిస్తున్నట్టు సమాచారం అందుతోంది. మరికాసేపట్లో చిత్తూరు జిల్లా ఎర్రవారిపల్లి మండలంలోని ఆయన స్వగ్రామం ఎలమండకు మహేశ్ను తీసుకెళ్లి వదిలిపెట్టనున్నారని సమాచారం. అయితే, కత్తి మహేశ్ను జిల్లాకు తరలిస్తున్న విషయాన్ని చిత్తూరు పోలీసులు ఖండిస్తున్నారు. ఈ విషయమై మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డిని ఆరాతీయగా.. ‘అసలు కత్తి మహేశ్ ఎవరు’ అంటూ స్పందించారు. కత్తి మహేశ్ను జిల్లాకు తీసుకువస్తునట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని, ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా తమకు చెప్పలేదని డీఎస్పీ తెలిపారు. -
కత్తి మహేశ్ను అందుకే బహిష్కరించాం : డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : గత నాలుగేళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు వ్యవస్థ తీవ్రంగా కృషి చేస్తోందని తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. కేవలం కొందరు వ్యక్తుల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకూడదని భావించి సినీ విమర్శకుడు కత్తి మహేశ్ను హైదరాబాద్ నుంచి బహిష్కరించినట్లు డీజీపీ వెల్లడించారు. కత్తి మహేశ్ పోస్టులు, ఆపై బహిష్కరణ విషయంపై సోమవారం మహేందర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. సొంత జిల్లాకు కత్తి మహేశ్ కత్తి మహేశ్ అనే వ్యక్తి టీవీ చానళ్లను, సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పదే పదే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేశ్ వ్యాఖ్యలు, పోస్టులతో మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శాంతి భద్రతలు క్షీణిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కు అయినప్పటికీ సమాజంలో ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భావిస్తున్నాం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన క్రమంలో హైదరాబాద్ నుంచి కత్తి మహేశ్ను 6 నెలలపాటు బహిష్కరించాం. ఆయన సొంత జిల్లా చిత్తూరుకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. చట్టాలను ఉల్లంఘించి ఒకవేళ మళ్లీ అతను నిషేధ సమయంలో హైదరాబాద్లో ప్రవేశిస్తే మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అంతేగాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కత్తి మహేశ్పై నిషేధం విధించాల్సి ఉంటుంది. ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటాం. భారతదేశం నలుమూలల నుంచి ఎక్కడినుంచైనా వచ్చి ఏ ప్రాంతంలోనైనా ఉండొచ్చు. కానీ కత్తి మహేశ్ తరహాలో ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా, వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. శాంతి భద్రతలు బాగుండటం వల్లే తెలంగాణ పౌరులు, ఉద్యోగులు, అన్నివర్గాల వారు అభివృద్ది కోసం వాళ్ల పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఎవరో కొందరు వ్యక్తులు కావాలని పని గట్టుకుని, ప్రసార మాధ్యమాలను వేదికగా చేసుకుని ఇతర వర్గాల మధ్య తగాదాలు పెట్టడం చేయకూడదు. పదే పదే తమకున్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే పరిస్తితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్పై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. సహకరిస్తే చర్యలు తప్పవు కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రక్రియలో ఇతర వర్గాలు, మతాలు, ప్రాంతాల వారి మనోభావాలు దెబ్బతినేలా చేస్తే.. ఆయా వ్యక్తులకు సహకరించిన వారిపై సైతం చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇతరత్రా మాధ్యమాల ద్వారా ఏ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా నోటీసులు జారీ చేస్తాం. కత్తి మహేశ్ వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసిన ఓ ఛానల్కు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. వారిచ్చే సమాధానం బట్టి చర్యలు ఉంటాయి. సెక్షన్ 16, 17 కేబుల్ యాక్ట్ ప్రకారం మేనేజ్మెంట్ రెండేళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చాం. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. సంబంధిత కథనం కత్తి మహేశ్పై బహిష్కరణ వేటు! -
పరిపూర్ణానంద నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత!
సాక్షి, హైదరాబాద్ : ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన స్వామి పరిపూర్ణానందను పోలీసులు గృహనిర్బంధం చేసిన నేపథ్యంలో జుబ్లీహిల్స్లోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హిందూత్వవాదులు, ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో ఇంటివద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్వామి పరిపూర్ణనంద ఇంటి వద్ద ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పెట్రోల్ డబ్బాతో వచ్చిన అతను.. స్వామిజీ మద్దతుగా ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. అతను ఒంటిపై పెట్రోల్ పోసుకుంటుండగా అడ్డుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. బీజేపీ ఖండన శ్రీరాముడిపై కత్తిమహేష్ వ్యాఖ్యలకు నిరసనగా ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన స్వామి పరిపూర్ణానందను గృహనిర్బంధం చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపూర్ణానంద హౌజ్ అరెస్టును ఆయన ఖండించారు. స్వామీజీలను అరెస్టు చేయడం మంచిది కాదని తెలంగాణ ప్రభుత్వానికి లక్ష్మణ్ హితవు పలికారు. పరిపూర్ణానందను వెంటనే గృహనిర్బంధం నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేయడం, నిరసనలు ప్రదర్శించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఈ హక్కును ప్రభుత్వాలు కాలరాయకూడదని ఆయన పేర్కొన్నారు. హిందూ సంస్థల ఆందోళన స్వామి పరిపూర్ణానంద హౌజ్ అరెస్టును వ్యతిరేకిస్తూ తిరుమల అలిపిరి వద్ద హిందూ దేవాలయాల పరిరక్షణ సేవాసంస్థ నిరసన ప్రదర్శన చేపట్టింది. గోవింద నామస్మరణతో సంస్థ ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టగా.. విజిలెన్స్ అధికారులు వారిని అడ్డుకున్నారు. చదవండి : పరిపూర్ణానంద హౌస్ అరెస్టు! కత్తి మహేశ్పై బహిష్కరణ వేటు! -
కత్తి మహేశ్పై నగర బహిష్కరణ వేటు
-
కత్తి మహేశ్పై బహిష్కరణ వేటు!
సాక్షి, హైదరాబాద్ : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్పై హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆయనపై నగర బహిష్కరణ వేటు వేశారు. తమ అనుమతి లేకుండా నగరంలోకి ప్రవేశించవద్దని కత్తిని ఆదేశించారు. ఈ మేరకు ఆయనను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని.. నగరం నుంచి తీసుకెళ్లారు. ఏపీలోనూ కత్తి మహేశ్పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్తూరులోని స్వగ్రామానికి కత్తి మహేశ్ను పోలీసులు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, కత్తి మహేశ్పై నగర బహిష్కరణ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఆయనను హైదరాబాద్ నుంచి బహిష్కరించారా? లేక తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించారా? అన్నది తెలియాల్సి ఉంది. ఎన్ని నెలలపాటు కత్తి మహేశ్ను నగరం నుంచి బహిష్కరించారనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ నగర బహిష్కరణ, స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్టుపై మరిన్ని వివరాలు తెలిపేందుకు తెలంగాణ డీజీపీ మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. శ్రీరాముడిపై తాజాగా కత్తి మహేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, హిందూమతాన్ని కించపరిచేవిధంగా ఆయన మాట్లాడారని హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. శ్రీరాముడిపై వ్యాఖ్యల నేపథ్యంలో కత్తి మహేశ్పై పలు కేసులు నమోదయ్యాయి. కత్తి మహేశ్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ.. స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశముండటంతో కత్తి మహేశ్పై పోలీసులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. చదవండి : ధర్మాగ్రహ యాత్రకు నో.. పరిపూర్ణానంద హౌస్ అరెస్టు! -
సంచలనం కోసమే ‘కత్తి’ మాట్లాడుతున్నారు
హైదరాబాద్ : హిందువుల పట్ల జరిగిన సంఘటనకు దేశ విదేశాల్లో ఉన్న హిందువులు అందరూ ఆవేదనకు గురయ్యారని శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఆదివారం పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. హిందూ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. రాముడు ఒక దగుల్భాజీ అని, సీత రాముని కన్నా రావణాసురుడి దగ్గర ఉంటేనే ఎక్కువ సుఖపడేదని కత్తి మహేశ్ ఆరోపణలు చేయడం చూస్తుంటే..ఆయన సంచలనం కోసమే ఇలా మాట్లాడుతున్నాడని తెలుస్తోందని అన్నారు. కత్తి వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. సీతమ్మను దూషించడం అంటే యావత్ స్త్రీ జాతిని అనడమేనన్నారు. రాజ్యాంగంలో శ్రీరాముని చిత్రపటాన్ని పెట్టడానికి కారణం..రాముడు చర్రిత కారుడు అని చెప్పడానికేనని తెలిపారు. ఇది రాజ్యాంగాన్ని ధిక్కరించడం కాదా అని ప్రశ్నించారు. పైశాచిక ఆనందం కోసమే ఇలా మాట్లాడుతున్నారని కత్తి మహేశ్ను ఉద్దేశించి అన్నారు. ఇది దేశద్రోహం..బడుగు బలహీన వర్గాల ముసుగులో మహేశ్ ఈవిధంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రామనామ స్మరణ చేస్తూ అన్ని వర్గాల వారు రేపు(సోమవారం) తనతో పాదయాత్ర చేస్తారని తెలిపారు. కత్తి మహేశ్ మాటల వెనక కుట్ర ఉందని, కులాల అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. . ‘ నీకు ఎలా సమాధానం చెప్పాలో మా వాళ్ల దగ్గర ఉపాయాలు ఉన్నాయ్. పోలీసులు, ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. అదుపు తప్పి బరితెగించి వ్యాఖ్యలు చేస్తున్నారు. కత్తి మహేష్ వ్యాఖ్యలకు రెండు రాష్ట్రాల సీఎంలు సమాధానం చెప్పాలి. ప్రతి శ్రీరామ నవమికి ఇద్దరు సీఎంలు దగుల్బాజీల దగ్గరకు పట్టు వస్త్రాలు తీసుకువెళ్తున్నారో చెప్పాలి. ఎవరు ఏ మతం మీద దాడి చేసినా ప్రభుత్వం సెక్యులర్గా పని చేయాలి. దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి. నీవు హిందువు కాదు, శ్రీరాముడిని దూషించిన వారు ఎవరూ హిందువులు కాదు. రేపు(సోమవారం) బషీర్ బాగ్ నుంచి యాదగిరిగుట్ట వరకు ధర్మాగ్రహా యాత్ర చేస్తాం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రీరాముడికి పాలాభిషేకం చేస్తాం. సాధువులకు నిగ్రహం అవసరం అంటున్నారు. ధర్మ పరిరక్షణకు మేము సైనికులము అవుతా’ మని హెచ్చరించారు. -
మెగా ఫ్యామిలీపై కత్తి ఫైర్
-
మెగా నటుడు నాగబాబుపై కత్తి ఫైర్
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్ శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే కత్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. వారిలో మెగా బ్రదర్ నాగబాబు ఒకరు. దీంతో నాగబాబు, మెగా ఫ్యామిలీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తన ఫేస్బుక్ అకౌంట్లో కత్తి మహేశ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘నాగబాబు నా పేరు కూడా ఉచ్ఛరించకుండా నన్ను నీచుడిగా సంభోదిస్తూ చేసినటువంటి వీడియో నేను చూశాను. నాకు జాలి కలిగింది. నేనా నీచుడినా? అంత నీచానికి ఏం పాల్పడ్డానని ప్రశ్నించారు. ఒక అన్నకు తమ్ముడిగా.. ఒక తమ్ముడికి అన్నగా ఏమాత్రం అస్థిత్వం లేని మీరు నాగురించి మాట్లాడుతున్నారు. మీ ఫ్యామిలీ రామ భక్తులా.. ‘జనాల్ని మోసం చేయడం, ప్యాకేజీలు దండుకోవడం, ఉన్న పార్టీలను అమ్ముకొని వేరే పార్టీలో కలవడం. జబర్ధస్ట్లాంటి షోలో జడ్జ్గా కుర్చోని పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ ఉండటం ఇది మీ కాంట్రిబ్యూషన్ సొసైటీ. మీరు హిందువు.. ఇక రాముడి ఆదర్శం గురించి మీ ఫ్యామిలీ ఎంత బాగా పట్టుదలతో ఉంటారనేది మాకందరికీ బాగా తెలుసు. మీ ఫ్యామీలీ, మీ అన్నదమ్ముల గురించి నేను మాట్లాడితే మీరు తట్టుకోవడం కష్టం. మీరు నాకు బెదిరింపులు ఇస్తారా. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నా మీద చేయి పడితే మీరే బాధ్యత వహిస్తారు. నేను చెప్పిందేంటో అర్ధం కానీ మీరు నాకు వార్నింగ్ ఇస్తారా.. ఇదే పంథా మీరు కొనసాగించండీ.. మీ రాజకీయ, సినిమా జీవితం ఎంత దౌర్భాగ్యమో అందరికీ వెలుగెత్తి చాటే రోజు ఒకటి వస్తుంది. మీ పతనానికి మీరే పునాది తవ్వుకుంటున్నారు. సాధారణంగా నేను మనుషుల గురించి, వారి వ్యక్తిగతాల గురించి, వ్యక్తిత్వాల గురించి మాట్లాడే వాడ్ని కాదు.. నీచుడు అంటూ నన్ను ఒక దళితున్ని సంభోదించారు ఎంత అహంకారముంటే ఇలా చేస్తారోనని అర్థమవుతోంది. సెక్యులర్ హిందువులు ఎక్కడి నుంచి వచ్చారు? దళితుల మీద దాడి జరుగుతున్నపుడు మీరంతా నోరెందుకు మెదపలేదు. ముస్లింపై దాడి జరిగినపుడు మీరంతా ఏం చేస్తున్నారు? నా హక్కుల కోసం నేను పోరాడుతున్నాను. నా వాక్స్వాతంత్రం, భావాప్రకటన స్వేచ్ఛ కోసం నేను పోరాడుతున్నాను’ అని కత్తి మహేశ్ అన్నారు. కత్తి మహేష్పై నాగబాబు కామెంట్లు -
కత్తి మహేష్పై ఎందుకు చర్యలు తీసుకోరు?
సాక్షి, భూపాలపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర పెంచడంతో రైతులు సంతోషిస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతును రాజును చేసిన ఘనత మోదీకి దక్కిందని, మద్దతు ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ఇప్పటివరకు జై జవాన్, జై కిసాన్ అనేవి నినాదాలుగా ఉండేవి కానీ నేడు వాటిని గొప్పగా కీర్తించిన వ్యక్తి మోదీ అని తెలిపారు. 70 ఏళ్లుగా రైతుల పేరుతో ఓట్లు దండుకున్నారని, బీజేపీ రైతుల మొహంలో చిరునవ్వు చూడాలని కోరుకుంటోందని లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇస్తే, బీజేపీ ఎకరానికి 10 నుంచి 15 వేల రూపాయల వరకు లాభాలు వచ్చేలా చేసిందని తెలిపారు. శ్రీరాముడుపై కత్తి మహేష్ కించపరిచే వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. దీన్ని ప్రభుత్వం మతం, కులం కోణంలో చూస్తే ఊరుకునేది లేదన్నారు. అవసరమైతే చట్టాన్ని సవరించైనా రాముడిపై వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వంరంగల్ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి లక్ష్మణ్ సంతాపం తెలిపారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, వరంగల్ నడిబొడ్డున బాణసంచా అక్రమంగా తయారు చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఘటనతో ప్రభుత్వం తన శాఖల పనితీరుపై పట్టు కోల్పోయినట్లు తెలుస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు పరిహారం అందిచాలని కోరారు. సింగరేణి కార్మికులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప వారికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావులు పాల్గొన్నారు. -
‘కత్తిని ఈ మధ్యే చూస్తున్నాను’
సాక్షి, హైదరాబాద్: రామాయణంపై, సీతారాముల పవిత్ర బంధంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్పై బీజేపీ శాసనపక్ష నేత కిషన్రెడ్డి మండిపడ్డారు. ప్రచారం కోసం కొందరు వ్యక్తులు మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘కొందరు స్వయం ప్రకటిత మేధావులు రాముడి మీద, రామాయణం మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్తామ’ని హెచ్చరించారు. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నవారు మరో మతంపై ఇలా నోరు జారగలరా..! అని ప్రశ్నించారు. ‘కత్తి మహేశ్ను ఈ మధ్యే చూస్తున్నాను. నువ్ ఏమన్నా మాట్లాడుకో. కానీ, దేవుళ్ల మీద, మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంద’ని అన్నారు. హిందువులను కించ పరుస్తూ మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. -
కత్తి మహేష్ వ్యాఖ్యలు క్షమించరానివి
-
కత్తి మషేష్పై విరుచుకుపడ్డ నాగబాబు
-
కత్తి మహేష్పై నాగబాబు కామెంట్లు
సాక్షి, హైదరాబాద్ : శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాలు ఎదుర్కొంటున్న సినీ విశ్లేషకుడు కత్తి మహేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని జబర్ధస్త్ ఫేం, మెగా బ్రదర్ నాగబాబు డిమాండ్ చేశారు. ఏ మతాన్నైనా కించపరుస్తూ ఎవరు మాట్లాడిన తప్పేనని ఆయన అన్నారు. రామాయణం ఒక పుస్తకం కాదని, కోట్లాది మంది హిందువులు ఆరాధించే చరిత్ర అని వ్యాఖ్యానించారు. క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎలాగో హిందువులకు రామాయణం, మహాభారతం అలాంటివని అన్నారు. నాస్తికత్వం పేరుతో హిందువుల జోలికి వస్తే శిక్ష అనుభవిస్తారని, మత విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని నాగబాబు హెచ్చరించారు. హిందూ మతం, దేవతలపై పథకం ప్రకారం దాడి జరుతోందని ఆరోపించారు. మతపరమైన చర్చలను ఎవరూ ప్రోత్సహించొద్దంటూ సూచించారు. హిందువుల మనోభావాలను కించపరిచిన కత్తి మషేష్పై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే చారిత్రాత్మక తప్పు చేసిన వారవుతారని అన్నారు. ఈ విషయాన్ని పోలీసులు తేలిగ్గా తీసుకుంటే ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని నాగబాబు చెప్పారు. -
బయటకొచ్చిన ‘కత్తి’.. రాముడిపై మళ్లీ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ బయటికొచ్చారు. గత రాత్రి(సోమవారం) బంజారాహిల్స్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అర్థరాత్రి విచారణ కోసం స్టేషన్కి తీసుకెళ్లిన పోలీసులు.. ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే కేసుకు సంబంధించిన వివరాలు చెప్పటంతో.. వివరణ కోరుతూ ఇప్పుడు నోటీస్ ఇచ్చారని, దర్యాప్తుకు సహకరించమని కోరారని కత్తి మహేష్ తెలిపారు. ఇకపైన మిగతా విషయాలు చూడాలి అంటూ ఫేస్బుక్లో ఆయన ఓ పోస్ట్ చేశారు. అయితే అంతటితో ఆగకుండా మరో పోస్టుతో ఆయన దుమారం రేపారు. ‘శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనువదించిన రామాయంలోని యుద్ధకాండలోని కొంత భాగాన్ని’ ఆయన పోస్ట్ చేశారు. తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని తన వ్యాఖ్యలను మహేష్ సమర్థించుకుంటున్న విషయం తెలిసిందే. (ఇంతకీ కత్తి ఏమన్నాడంటే...) -
కత్తి మహేశ్ను అరెస్ట్ చేసిన పోలిసులు
-
పోలీసుల అదుపులో కత్తి మహేశ్
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బంజారాహిల్స్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్ ఫోన్ ఇన్లో మాట్లాడుతూ.. ఓ హిందూ దేవుడిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ ఆరాధ్య దైవాన్ని కత్తి మహేశ్ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను కించపరిచారంటూ విశ్వహిందూ పరిషత్ కార్యకర్త కిరణ్ నందన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కత్తి మహేష్పై ఐపీసీ సెక్షన్ 295(1), 505(2)ల కింద కేసు నమోదు చేసి కత్తి మహేశ్ను ఇంటి దగ్గర నుంచి అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. కాగా, ఆయనపై హైదరాబాద్ పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. -
కత్తికి శ్రీరెడ్డి చురకలు
ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. శ్రీరాముడిని దూషించాడని మహేష్పై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. ‘జై శ్రీరామ్.. దేవుడ్ని దూషించటం మంచిది కాదు. మా హిందూ ధర్మాన్ని హేళన చేయకండి’ అంటూ ఫేస్బుక్లో పరోక్షంగా కత్తిని ఉద్దేశించి ఆమె ఓ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఓ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా ఫోన్ ఇన్లో మాట్లాడుతూ..‘ రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిందూ జనశక్తి నేతలు ఆయనపై నగరంలోని కేబీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు హిందూ సంఘాలు వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేశాయి కూడా. -
బిగ్బాస్ : కిరీటి ఔట్!
సాక్షి, హైదరాబాద్ : బిగ్బాస్-2 రియాల్టీ షోకు రోజు రోజుకు ప్రేక్షకాదరణ లభిస్తోంది. తొలి రోజుల్లో కాస్త అనాసక్తి కనబర్చిన ప్రేక్షకులు ఇటీవల హౌస్లో చోటుచేసుకున్న పరిణామాలతో ఆకర్షితులవుతున్నారు. హౌస్మెట్స్ మధ్య గొడవలు.. ప్రేమలు.. ఫన్నీ టాస్క్లతో షో కాస్త ఎంటర్టైనింగా మారింది. దీనికి తోడు వీకెండ్లో తనదైన శైలితో హోస్ట్ నాని అలరిస్తున్నాడు. హౌస్మెట్స్ మధ్య చోటుచేసుకున్న గొడవలపై కాస్త సిరీయస్గానే ఆరా తీస్తున్నాడు. అంతేకాకుండా వస్తూ వస్తూనే ఓపిట్ట కథ చెప్పి చివర్లో అది ఏ కంటెస్టెంట్కు వర్తిస్తుందో.. అని తనదైన స్టైల్తో పరోక్షంగా తెలియజేస్తున్నాడు. అయితే తొలి రెండు వారాల్లో సామాన్యులే ఎలిమినేట్ అయ్యారు. ఈ విషయంలో ప్రేక్షకులు కొంత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇది బిగ్బాస్ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతందని ట్రోల్ కూడా చేశారు. అయితే ఈ సారి మాత్రం సెలబ్రిటీ కిరీటి దామరాజు హౌస్ను వీడనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం నానీ సైతం గతవారమే చెప్పాడు.. అతను కనుక ఎలిమినేషన్ ప్రక్రియలో ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు తిరస్కరించేవారని హెచ్చరించాడు. దీనికి కారణం కౌశల్ పట్ల కిరీటి వ్యవహరించిన తీరే. ఈ ప్రవర్తనతోనే హౌస్మెట్స్ అంతా అతన్నీ ఈ వారం నామినేట్ చేశారు. అంతేకాకుండా కౌశల్ హౌస్లో ఉన్నాడంటే దానికి కారణం కూడా కిరీటి ప్రవర్తనే. అమ్మాయిలతో కౌశల్ సరిగ్గా ప్రవర్తించడం లేదని ఓ టాస్క్లో కిరీటి అతన్ని చిత్ర హింసలు పెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రేక్షకుల దృష్టిలో ఒక్కసారిగా కౌశల్ హీరో కాగా.. కిరీటి విలన్ అయ్యాడు. ఇదే కిరీటి ఎలిమినేషన్ కారణం కానుంది. అప్పటి వరకు కాస్త హుషారుగా కనిపించిన కిరీటి ఈ దెబ్బతో ఈ వారం మొత్తం సైలెంట్ అయిపోయాడు. తనపై ప్రేక్షకులకున్న వ్యతిరేకతను పోగట్టుకోలేకపోయాడు. ఇదే అతని ఎలిమినేషన్కు కారణం కానుంది. శుక్రవారం ఎపిసోడ్ కెప్టెన్ టాస్క్లో కూడా ఆకట్టుకోలేకపోయాడు. గణేశ్కు భారీ మద్దతు ఇక ప్రతీవారం ఎలిమినేషన్ ప్రక్రియలో సామాన్యులను టార్గెట్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేసిన హౌస్మెట్స్ మళ్లీ ఈ సారి కూడా కామన్ మ్యాన్ గణేశ్నే టార్గెట్ చేశారు. ఇక గణేశ్ హౌస్లోకి వెళ్లినప్పటి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అయి ప్రజల మద్దతుతో హౌస్లో కొనసాగుతున్నాడు. ఈ సారీ ఇక అతనికి చాలా మాద్దతు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఓ సామాన్యుడు హౌస్లో ఉండాలని ప్రతీ ప్రేక్షకుడు భావిస్తున్నాడు. దీంతోనే అతను హౌస్లో కొనసాగే అవకాశం ఉంది. ఇక ఈ వారం నామినేట్ అయిన వారిలో సింగర్ గీతా మాధురి, తేజస్వీ, భానుశ్రీలకు సైతం ప్రేక్షకుల మద్దతు లభించనుంది. తేజస్వీ హౌస్లో ప్రేక్షకులకు కావాల్సిన మంచి మసాల అందిస్తుండగా.. సింగర్ గీతా మాధురి పెద్దక్క పాత్ర పొషిస్తోంది. ఇక భాను శ్రీకి తెలంగాణ సెంటిమెంట్ కలిసిరానుంది. ఆమెకు మద్దతుగా ఫేస్బుక్లో విపరీత ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వారం కిరీటి దామరాజు ఎలిమినేషన్ తప్పేట్లేదు. గత సీజన్తో బిగ్బాస్తో ప్రేక్షకాదరణ పొందిన, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. తన ఫేస్ బుక్లో ‘ఈ వారం కిరీటి బిగ్ బాస్2 నుంచీ వెళ్లిపోతాడేమో...అని నా ఫీలింగ్!’ అని పేర్కొన్నాడు.