Meets
-
ముద్రగడ ఇంటిపై దాడి.. పరామర్శించిన YSRCP నేతలు
-
మోదీ, ట్రంప్ భేటీ ఫిబ్రవరిలో?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఫిబ్రవరిలోనే జరగనుందా? ఈ దిశగా ఇరు దేశాల దౌత్యవేత్తల స్థాయిలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా? అవుననే అంటోంది రాయిటర్స్ వార్తా సంస్థ. వారు వాషింగ్టన్లో భేటీ కానున్నారని భారత దౌత్యవర్గాలను ఉటంకిస్తూ కథనం వెలువరించింది. ‘‘ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో మోదీ, ట్రంప్ మధ్య ఉన్న స్నేహబంధం కీలకపాత్ర పోషించనుంది. చైనా దూకుడును అడ్డుకోవడంపై ఈ భేటీలో నేతలిద్దరూ దృష్టి సారించే అవకాశముంది. ఇక భారతీయులను ఆందోళన పరుస్తున్న వలసలపై కఠిన వైఖరి, జన్మతః పౌరసత్వం రద్దు తదితర అంశాలను మోదీ ప్రముఖంగా లేవనెత్తవచ్చు. హెచ్–1బీ వీసాల్లో సింహభాగం భారతీయులే దక్కించుకుంటారన్నది తెలిసిందే. అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలు మరీ ఎక్కువని పదేపదే ఆక్షేపిస్తున్న ట్రంప్ ఈ అంశాన్ని మోదీతో లేవనెత్తవచ్చు. సుంకాలను తగ్గించడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను ఈ భేటీలో ట్రంప్ ముందుంచాలని మోదీ భావిస్తున్నారు’’ అని రాయిటర్స్ పేర్కొంది. భారత్కు అతి పెద్ద వర్తక భాగస్వామిగా అమెరికా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2023–24లో 118 బిలియన్ డాలర్ల మేరకు ద్వైపాక్షిక వర్తకం జరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుకేశ్ను సన్మానించిన రజనీకాంత్, శివకార్తికేయన్ (ఫోటోలు)
-
రాజ్ కపూర్ ఫిల్మ్ ఫెస్టివల్, మోదీతో భేటీ : హుందాగా, అందంగా కరీనా (ఫోటోలు)
-
సచిన్ టెండుల్కర్ను కలిసిన మనూ భాకర్ (ఫొటోలు)
-
రేణు దేశాయ్కు సారె పెట్టి సత్కరించిన మంత్రి (ఫోటోలు)
-
బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ భేటీ
బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక భేటీ జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో బుధవారం ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు.రుణాలు, డిపాజిట్ వృద్ధికి మధ్య అంతరం, లిక్విడిటీ రిస్క్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మోసాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు వంటి అనేక అంశాలు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. బ్యాంకుల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయడం, సరిహద్దు లావాదేవీల్లో రూపాయి వినియోగాన్ని పెంచడం, ఆర్బీఐ ఆవిష్కరణ కార్యక్రమాలలో బ్యాంకుల భాగస్వామ్యం గురించి కూడా చర్చించారు.తమ పరిధిలోకి వచ్చే బ్యాంకులు, సంస్థల సీనియర్ మేనేజ్మెంట్తో తరచూ ఆర్బీఐ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజా సమావేశం జరిగింది. ఇంతకుముందు భేటీ ఫిబ్రవరి 14న జరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ సమావేశానికి ఆర్బీఐ గవర్నర్తోపాటు, డిప్యూటీ గవర్నర్లు ఎం. రాజేశ్వర్ రావు, స్వామినాథన్, ఆర్బీఐ నియంత్రణ, పర్యవేక్షణ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
వైఎస్ జగన్ను కలిసిన పలువురు నేతలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం పలువురు నేతలు కలిశారు. ఎన్నికల ఫలితాలు, తదితర అంశాలపై వారితో వైఎస్ జగన్ చర్చించారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో కోలగట్ల వీరభద్రస్వామి, అదీప్రాజ్, పొన్నాడ సతీష్, సింహాద్రి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
అలవికాని హామీలు.. కాంగ్రెస్పై తరుణ్చుగ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ను కలిశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం బండి సంజయ్ తొలిసారిగా తరుణ్ చుగ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్కు శుభాకాంక్షలు తెలిపిన తరుణ్ చుగ్.. ఆయనతో అరగంటకుపైగా ముచ్చటించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ ఆ శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజలకు మరింత మేలు జరిగేలా పని చేస్తారనే ఆశాభావాన్ని తరుణ్ చుగ్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై అరగంటకుపైగా చర్చించారు. తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలను గెలిచిన బీజేపీ 35 శాతానికిపైగా ఓట్లు సాధించడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన తరుణ్ చుగ్.. నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలవల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే విశ్వసనీయతను కోల్పోయిందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నిరాశను ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తోందన్నారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం కూడా పార్లమెంట్ ఫలితాలతో రుజువైందన్నారు. -
అభిషేక్ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్మన్ .. ఫొటోలు వైరల్
-
సునీతా కేజ్రీవాల్ను కలుసుకున్న కల్పనా సోరెన్!
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్పనా సోరెన్ మాట్లాడుతూ రెండు నెలల క్రితం జార్ఖండ్లో జరిగిన ఘటన మాదిరిగానే ఢిల్లీలో కూడా జరిగిందని అన్నారు. తాను సునీతను కలుసుకునేందుకు వచ్చానని, ఆమె భాధ్యతలను కూడా పంచుకుంటానని అన్నారు. తాము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతిజ్ఞ చేశామని కల్పనా సోరెన్ చెప్పారు. జార్ఖండ్ రాష్ట్రం అరవింద్ కేజ్రీవాల్ వెంట ఉంటుందని, తాను కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ ఛైర్పర్సన్ సోనియా గాంధీని కలవబోతున్నానన్నారు. రాంలీలా మైదాన్లో జరిగే ఇండియా కూటమి బహిరంగ సభకు హాజరవుతానన్నారు. #WATCH दिल्ली: झारखंड मुक्ति मोर्चा(JMM) नेता और पूर्व सीएम हेमंत सोरेन की पत्नी कल्पना सोरेन ने कहा, "जैसी घटना 2 महीने पहले झारखंड में हुई थी दिल्ली में भी वैसा ही कुछ हुआ है... मैं सुनीता केजरीवाल से मिलकर उनका दुख दर्द बांटने आई थी। हमने मिलकर प्रण लिया है कि इस लड़ाई को हमें… https://t.co/YzQ1M0Mktw pic.twitter.com/9JjhaVS7fR — ANI_HindiNews (@AHindinews) March 30, 2024 కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్ ఇద్దరి పరిస్థితులు ఒకేలాంటివని విశ్లేషకులు అంటారు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కల్పనా సోరెన్ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అదేవిధంగా, అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసే వరకు సునీతా కేజ్రీవాల్ తన ఇంటికి, కుటుంబానికే పరిమితమయ్యారు. హేమంత్ సోరెన్-అరవింద్ కేజ్రీవాల్ల అరెస్ట్ తర్వాత కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్లు తదుపరి బాధ్యతలను స్వీకరించడంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వారిద్దరూ ఈడీ రిమాండ్లో ఉన్న తమ భర్తలను కలుసుకుని వారికి ధైర్యాన్ని అందిస్తూనే, మరో వైపు పార్టీని ఐక్యంగా ఉంచడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. -
మేము కేసీఆర్ వెంటే ఉంటాం..పార్టీ మారే ఆలోచన మాకు లేదు..
-
విద్యకు సహకారం అందించండి
సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఏడాదిపాటు విద్యా కార్య క్రమాలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాలని హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యాపకుల బృందానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో హార్వర్డ్ వర్సిటీ అధ్యాపకబృందం గురువారం సీఎం రేవంత్ను ఆయన నివాసంలో కలిసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జనవరి 7 నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్íÙప్ (పీఎస్ఐఎల్–24) కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ బృందం రాష్ట్రానికి వచి్చంది. ఈ బృందం 40 ప్రభుత్వ పాఠశాలల్లో 10–12 తరగతులు చదువుతున్న 100 మంది విద్యార్థులతోపాటు 33 జిల్లాల ఉన్నత పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఎంఎస్ షెఫాలీ ప్రకాశ్, డాక్టర్ ఎండీ రైట్ పాల్గొన్నారు. -
గద్దర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి భట్టి
-
సీఎం జగన్ ను కలిసిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా
-
మెగాస్టార్ చిరంజీవిని కలిసిన నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ (ఫోటోలు)
-
కన్నడ సూపర్స్టార్ను కలిసిన టాలీవుడ్ హీరో నాని (ఫొటోలు)
-
Madhya Pradesh: ఆసక్తికర పరిణామం.. సీఎంను కలిసిన పీసీసీ చీఫ్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను మాజీ సీఎం, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్నాథ్ కలిశారు. రాష్ట్ర రాజధాని భోపాల్లోని శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసానికి సోమవారం వచ్చిన కమల్నాథ్ ఆయనకు పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్.. కమల్నాథ్ను సాదరంగా ఆహ్వానిస్తూ ఇంట్లోకి తీసుకెళ్లారు. మధ్యప్రదేశ్ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ తిరుగులేని విజయాన్ని సొంత చేసుకుంది. 230 స్థానాలకు గానూ ఏకంగా 163 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టుకుంది. కాగా కమల్నాథ్ సారధ్యంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలకే పరిమితమైంది. #WATCH | Madhya Pradesh | State Congress president Kamal Nath meets Chief Minister Shivraj Singh Chouhan at his residence in Bhopal. The party registered a thumping majority in the state election, winning 163 of the total 230 seats. pic.twitter.com/CSTFecTjKC — ANI (@ANI) December 4, 2023 -
ఖర్గే, రాహుల్ గాం«దీతో శరద్ పవార్ భేటీ
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాం«దీతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారు చర్చించుకున్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి తదుపరి కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకున్నారు. దాదాపు 40 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. ఇండియా కూటమి చివరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరిగింది. త్వరలోనే కూటమి నేతలంతా మరోసారి భేటీ కావాలని పవర్, ఖర్గే, రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. -
8న ప్రధాని మోదీతో బైడెన్ భేటీ
వాషింగ్టన్: జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్ రానున్న అధ్యక్షుడు బైడెన్ ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. భారత్ అధ్యక్షతన ఈ నెల 9, 10వ తేదీల్లో జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ‘జీ20 సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 7వ తేదీన అధ్యక్షుడు బైడెన్ ఢిల్లీకి చేరుకుంటారు. 8న ప్రధాని మోదీతో ఆయన సమావేశమవుతారు’ అంటూ వైట్ హౌస్ శుక్రవారం రాత్రి బైడెన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్లో వివరించింది. 9, 10వ తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర భేటీల్లో ఆయన పాల్గొంటారు. ఇతర జీ20 భాగస్వామ్య దేశాల నేతలతో ఆయన క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, వాతావరణ మార్పులను నిలువరించడం వంటి అంతర్జాతీయ అంశాల్లో ఉమ్మడి ప్రయత్నాలపై చర్చిస్తారని వైట్ హౌస్ తెలిపింది. 10న వియత్నాంకు బయలుదేరి వెళతారని పేర్కొంది. -
ఇండియా కూటమి భేటీ.. ఈ అంశాలే ప్రధానంగా..
ముంబయి: 2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి 'ఇండియా' సన్నద్ధమవుతోంది. నేడు 28 పార్టీలు ముంబయి వేదికగా జరుగుతున్న డిన్నర్ భేటీలో పాల్గొననున్నాయి. కూటమికి ఓ లోగోను ఎంపిక చేయడంతోపాటు సమన్వయ కమిటీ, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. దేశంలో బీజేపీకి ధీటుగా ఐక్యంగా పోరాడుతామని ప్రతిపక్ష పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమి భేటీకి ముంబయికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను పార్టీ శ్రేణులు గణంగా ఆహ్వానిస్తున్నాయి. ఈ మేరకు బ్యాండ్ బాజాలతో సోనియా గాంధీని, రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. #WATCH | Congress supporters gathered outside Mumbai airport to welcome party leaders Sonia Gandhi and Rahul Gandhi They will attend the third meeting of the Opposition bloc, Indian National Developmental Inclusive Alliance (INDIA) here. pic.twitter.com/VAAdjcUP6d — ANI (@ANI) August 31, 2023 కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ ముంబయికి చేరుకున్నారు. #WATCH | Maharashtra | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and MP Rahul Gandhi arrive at a hotel in Mumbai. Rahul Gandhi will hold a press conference shortly. pic.twitter.com/NXsA0IkdUD — ANI (@ANI) August 31, 2023 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ముంబయికి చేరుకున్నారు. మరికాసేపట్ల భేటీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. #WATCH | Maharashtra | Congress national president Mallikarjun Kharge arrives in Mumbai for the meeting of the INDIA alliance. pic.twitter.com/FVNd2UTWGF — ANI (@ANI) August 31, 2023 ఇండియా కూటమి మూడో భేటీకి హాజరవడానికి జమ్మూ కశ్మీర్ పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ముంబయి చేరుకున్నారు. కూటమి వర్థిల్లాలని నినదించారు. #WATCH | PDP Chief Mehbooba Mufti arrives in Mumbai to attend the third meeting of the Opposition bloc, Indian National Developmental Inclusive Alliance (INDIA) "Judega Bharat, Jeetega INDIA," says Mehbooba Mufti pic.twitter.com/qPA4sp0r5v — ANI (@ANI) August 31, 2023 ముంబయిలో జరగనున్న సమావేశానికి హాజరవడానికి కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరారు. #WATCH | Delhi | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and MP Rahul Gandhi leave from Delhi airport to attend the third meeting of the Opposition bloc, Indian National Developmental Inclusive Alliance (INDIA), in Mumbai. pic.twitter.com/StAcj1OOKX — ANI (@ANI) August 31, 2023 ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి 28 పార్టీల తరుపున 63 మంది నేతలు పాల్గొననున్నారు. ఈ మేరకు ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్లో భేటీ కానున్నారు. కూటమికి ఓ జెండాను ఎంపిక చేయనున్నారు. పార్టీల మధ్య సమన్వయం చేయడానికి ఓ కమిటీని కూడా నియమించనున్నారు. పాట్నా, బెంగళూరు సమావేశాల తర్వాత ముంబయి వేదికగా మూడోసారి జరుగుతున్న నేటి భేటీ చివరిది కావడం గమనార్హం. అందుకే ఈ సమావేశంలోనే కీలక అంశాలపై చర్చ జరగనుందని సమాచారం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్లు ఇప్పటికే ముంబయి చేరుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, నితీష్ కుమార్, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ రోజు ముంబయికి చేరనున్నారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో నేటి డిన్నర్ భేటీ జరగనుంది. దేశంలో ప్రస్తుతం ఏర్పడుతున్న ఇండియా కూటమి రాజకీయ ప్రత్యామ్నాయంగా మారనుందని ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ తెలిపారు. సీట్ల పంపకాలపై ఎలాంటి చర్చలు ఉండవని పేర్కొన్నారు. ఇండియా కూటమి భేటీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర బీజేపీ కూడా రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనుంది. రాష్ట్రంలో లోక్సభ సీట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇదీ చదవండి: Jammu Kashmir: జమ్ములో ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం -
సీఎం జగన్ను కలిసిన యూపీఎస్సీ(సీఎస్ఈ) ర్యాంకర్లు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని యూపీఎస్సీ(సీఎస్ఈ) 2022 ర్యాంకర్లు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా యూపీఎస్ఈ ర్యాంకర్లను సీఎం జగన్ అభినందించారు. ర్యాంకర్ల కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, సివిల్స్ ప్రిపరేషన్కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని సూచించారు. మంచి పరిపాలనలో భాగస్వాములై ప్రజా సేవలో తనదైన ముద్ర వేయాలని ర్యాంకర్లకు సీఎం సూచించారు. చదవండి: పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే: సీఎం జగన్ -
పెట్టుబడులతో రండి... అమెరికన్ కంపెనీలకు ప్రధాని పిలుపు
వాషింగ్టన్: భారత్లో పెట్టుబడులు పెట్టాలని ప్రముఖ అమెరికన్ కంపెనీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని పలు అగ్రగామి కంపెనీల సీఈవోలతో వాషింగ్టన్లో చర్చలు నిర్వహించారు. భారత సెమీకండక్టర్ పరిశ్రమకు మద్దతుగా నిలవాలని అమెరికన్ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీని కోరారు. టెక్నాలజీ ప్రాసెస్, ప్యాకేజింగ్ సామర్థ్యాల అభివృద్ధికి భారత్కు విచ్చేయాలని సెమీకండక్టర్ రంగంలో పనిచేసే ప్రముఖ సంస్థ అప్లయ్డ్ మెటీరియల్స్ సంస్థను ప్రధాని కోరారు. భారత్లోని సంస్థలతో సహకారానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అప్లయ్డ్ మెటీరియల్స్ సీఈ వో గ్యారీ డికర్సన్కు సూచించారు. భారత ఏవి యేషన్, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ముఖ్య పాత్ర పోషించాలని జనరల్ ఎలక్ట్రిక్ సీఈవో హెచ్ లారెన్స్కల్ప్తో భేటీ సందర్భంగా కోరారు. సుముఖంగా ఉన్నాం పరస్పర విజయానికి వీలుగా ప్రధాని మోదీ, భారత్లోని ప్రతి ఒక్కరితో కలసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నాం. – గ్యారీ డికర్సన్, అప్లయ్డ్ మెటీరియల్స్ -
బసవరాజ బొమ్మైతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రహస్య భేటీ...
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నాయకుల రహస్య, బహిరంగ భేటీలో తాజాగా రాజకీయాల్లో కుతూహలానికి కారణమయ్యాయి. దావణగెరె కాంగ్రెస్ వృద్ధ నేత శామనూరు శివశంకరప్పని బీజేపీ నాయకుడు బసవరాజ బొమ్మై కలవడంపై అనేక ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. అదేరీతిలో డీసీఎం శివకుమార్తో బీజేపీ నేత రేణుకాచార్య భేటీ అయ్యారు. మరోవైపు కొందరు బీజేపీ నాయకులు కాంగ్రెస్తో సఖ్యతగా ఉంటూ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని కాషాయనేతలు సీటీ రవి, ప్రతాపసింహా మండిపడడం రెండు పారీ్టల్లో కలకలం రేపింది. కర్ణాటక: మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు రేణుకాచార్య బుధవారం బెంగళూరులో ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ను భేటీ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రేణుకాచార్య ఓడిపోయాక మౌనంగా ఉంటున్నారు. ఈ తరుణంలో డీకేని కలవడం రాజకీయ రంగంలో చర్చకు కారణమైంది. భేటీ తరువాత రేణుకాచార్య మీడియాతో మాట్లాడుతూ డీకే తనకు మంచి స్నేహితుడని, అందుకే కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని అన్నారు. హొన్నళ్లిలో జరిగే వ్యవసాయ మేళాకు ఆహా్వనించానన్నారు. కుమ్మక్కుపై వారినే అడగండి కొంతమంది బీజేపీ నాయకులు కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారని మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ, బీజేపీ సీనియర్నేత సీటీ రవి ఆరోపణలు చేసిన సమయంలో ఈ భేటీ జరగడం విశేషం. ఈ ఆరోపణలపై రేణుకాచార్య స్పందిస్తూ కుమ్మక్కుపై సీటీ రవి, ప్రతాపసింహనే అడగాలని, తనకు సమాచారం లేదని, ఏ అర్థంలో చెప్పారనేది తెలియదని అన్నారు. ప్రతాపసింహ, సీటీ రవి ఏమన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ సీనియర్ నాయకులు మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించటం గాని, ఆరోపణలు చేయటం గాని చేయటం లేదు. అనేక మంది సీనియర్ నాయకులు సీఎం సిద్దరామయ్యతో కుమ్మక్కయ్యారని ఎంపీ ప్రతాప్ సింహ, సీటీ రవి ఆరోపణలు చేశారు. రెండు పారీ్టల నాయకులు కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక బీజేపీ నాయకులను బెదిరింపులకు గురిచేశారని వారు ఆరోపించారు. అది మామూలు భేటీనే: బొమ్మై బీజేపీ మాజీ సీఎం బసవరాజ బొమ్మై మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే శామనూరు శివశంకప్పను రహస్యంగా భేటీ కావటంపై రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. దీనిపై బుధవారం బొమ్మై స్పందిస్తూ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు. నా రాజకీయ వైఖరిలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన ట్విట్టర్లో అన్నారు. ఆయన తనకు బంధువు అని, తరచూ ఇళ్లకు వెళ్లి వస్తుంటామని, దీనికి రాజకీయాలు పూయడం సరికాదన్నారు. వారి మనమళ్లకు పెళ్లి సంబంధాల గురించి చర్చ జరిగింది, ఇందులో రాజకీయాల ప్రస్తావన లేదన్నారు. మరోవైపు శివశంకరప్ప స్పందిస్తూ ఎన్నికలు జరిగిననాటి నుంచి తాము కలవలేదు. అందుకే కలిశామన్నారు. మాకు బంధుత్వం ఉంది, కొన్ని విషయాలు చెప్పేందుకు సాధ్యపడదన్నారు. -
వృద్ధి అవకాశాల్లో భారత్ నెంబర్ వన్
న్యూఢిల్లీ: అమెరికా నెట్వర్క్ పరికరాల తయారీ సంస్థ– సిస్కో భారత్లో తన భారీ పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. రూటర్లు, స్విచ్ల వంటి ఉత్పత్తుల తయారీకి సంబంధించిన భారత ప్రణాళికలను చైర్మన్, సీఈఓ చక్ రాబిన్స్ ప్రకటించారు. డిజిటల్ మౌలిక సదుపాయాలపై దేశం అద్భుతమైన పురోగతిని సాధించిందని పేర్కొంటూ, వచ్చే దశాబ్దపు వృద్ధి అవకాశాలకు సంబంధించి భారత్ మొదటి అవకాశంగా ఉందని అన్నా రు. తయారీ రంగానికి కేంద్రంగా భారత్ రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు. బహుళ పథకా లు ఇందుకు దోహదపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ తయారీ కార్యకలాపాలు సిస్కో కాంట్రాక్ట్ తయారీదారుల ద్వారా ప్రారంభమవుతాయని తెలిపారు. బిలియన్ డాలర్ల ఎగుమతులు సమీపకాలంలో జరుగుతాయని తాము భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ తదితర సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... ► ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితులు, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం భౌగోళిక రాజకీయ భయాల నేపథ్యంలో టెక్ డిజిటలైజేషన్ వ్యూహాత్మక విలువ మందగించాలి. కానీ అలా జరక్కపోవడం హర్షణీయం. పైగా ఇది పురోగతి బాటన నడుస్తోంది. టెక్నాలజీకి సంబంధి ప్రతి దేశం సాధిస్తున్న విజయానికి ఇది సంకేతం. ► డిజిటలైజేషన్, 5జీ రోల్అవుట్, నైపుణ్య సామర్థ్యాలు, స్టార్టప్ వ్యవస్థ దీనిని బలపరిచే మౌలిక వ్యవస్థ భారత్కు కలిసివస్తున్న అంశాలు. ► భారత్ డిజిటలైజేషన్లో భారీగా పురోగమించింది. మహమ్మారి సమయంలో అలాగే తీవ్ర సవా ళ్ల సమయాల్లో డిజిటలైజేషన్లో దేశం పటిష్ట పురోగతిని సాధించింది. పురోగతి విషయంలో భారత్ ఆశయం చాలా స్పష్టంగా ఉంది. ఇది హర్షణీయ పరిణామం. ప్రధానమంత్రి, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు అనేక అంశాల గురించి మాట్లాడారు. తయారీ నుంచి నైపుణ్యత, సిస్కో కార్యకలాపాలు, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్, 5జీ, సుస్థిర అభివృద్ధి వరకూ అన్ని అంశాలపై ప్రధాని మోదీతో చర్చించడం జరిగింది. భారతదేశంలో తయారీ పురోగతి విషయంలో సహకారం ఇచ్చే విషయంలో మా నిబ ద్ధతను ఈ సందర్భంగా పునరుద్ఘాటించాను. ► ఒక్క డిజిటలైజేషన్లోనే కాదు. భౌతికంగా మౌలిక సదుపాయాల కల్పనలోనూ భారత్ దూసుకుపోతోంది. ► మేడిన్ ఇండియా సిస్కో ప్రొడక్టులు ఈ ప్రాంతానికి, యూరప్కు ఎగుమతి అవుతాయి. దేశంలో క్రమంగా మా వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తాం. ముఖ్యంగా 5జీ పై మాకు ఎక్కువ ఆసక్తి ఉంది. ప్రతి చోటకూ కనెక్టివిటీ హైస్పీడ్కు దోహపపడే అంశం ఇది. ► ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో చోటుచేసుకుంటున్న ఉద్యోగాల కోత ఫలితాలు, పర్యవసానాలు మున్ముందు ఎలా మారతాయన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్తో సిస్కో సీఈఓ చక్ రాబిన్స్ భేటీ