nagababu
-
వర్మకు ఎమ్మెల్సీ దక్కకుండా పవనే అడ్డుకున్నారనే టాక్
-
నాగబాబు VS వర్మ.. పవన్ అహంకారం.. రగులుతున్న టీడీపీ
-
మెగా బ్రదర్స్ అత్యుత్సాహం..
మాటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకెళ్తే ఉస్కో అంటే ఎదురు మళ్ళా ఉస్కో అందట.. ఆలా అయింది తెలుగుదేశం పరిస్థితి. పార్టీ పెట్టి పుష్కరం దాటి.. అసెంబ్లీ గేటు కూడా దాటలేకపోయిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం.. బీజేపీతో పొత్తు పుణ్యాన ఈసారి అసెంబ్లీ లోపలి అడుగుపెట్టారు. పవన్ ప్రాధాన్యాన్ని గుర్తించిన చంద్రబాబు సైతం ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఇక జనసేనలో మొదట్నుంచి ఉన్న నాగబాబు సైతం గతంలో ఎంపీగా పోటీ చేసి మట్టికరిచారు. ఇక డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయడం అచ్చిరాదనుకున్నారో ఏమో అడ్డదారిలో శాసనమండలిలోకి అడుగుపెట్టారు. ఇక చట్టసభలో ప్రజల తరఫున మాట్లాడాల్సిన నాగబాబు తొలిసారిగా మైక్ అందుకుని ఇక ఒంటి మీద స్పృహ లేకుండా నోటికొచ్చింది వాగేశారు. తెలుగుదేశానికి లైఫ్ ఇచ్చింది తామేనని పవన్ అంటే.. అసలు పవన్ను గెలిపించింది ప్రజలు.. జనసైనికులే తప్ప ఇంకెవరూ కాదని గట్టిగా చెప్పారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు పిఠాపురం సీటును పవన్ కోసం త్యాగం చేసిన వర్మను నాగబాబు.. పవన్ ఇద్దరూ భుజానికి ఎత్తుకుని మోశారు. నా గెలుపు బాధ్యత మీదే.. మీ భుజాల మీదనే ఉందని మునగ చెట్టు ఎక్కించారు. ఇక గెలిచాక.. వర్మ త్యాగం గాలిలో కలిసిపోయింది.. అసెంబీ గేటు వరకూ ఓడ వర్మ.. గేటు దాటాక బోడి వర్మ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నలభయ్యేళ్ళ తెలుగుదేశాన్ని తామే నిలబెట్టినట్లు ఈ బ్రదర్స్ చెప్పుకున్నారు.పాలన గురించి ఒక్క ముక్కాలేదు..అటవీ, పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న పవన్ ఈ తొమ్మిది నెలల్లో చేసిన ఒక్క మంచి పని గురించి కూడా చెప్పలేదు.. ఎంతసేపు తన స్వోత్కర్ష.. సొంత ఎలివేషన్ తప్పితే ప్రజలకు పనికొచ్చేది.. సమాజానికి ఉపయోగపడే మాట ఒక్కటీ లేదు.. పైగా జనసైనికులు కూడా అచ్చం అలాగే తయారయ్యారు.. 2029 నాటికి పవన్ను సీఎం అభ్యర్థిగా చూడాలన్నది వారి అభిలాష అని అక్కడ ఓపెన్ అయిపోయారు.. ఈ అన్నదమ్ముల అత్యుత్సాహం తెలుగుదేశాన్ని ఇరిటేట్ చేస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో ఈ బ్రదర్స్ గురించి ట్రోలింగ్ మొదలైంది. తెలుగుదేశం లేకపోతే జనసేన ఎక్కడ ఉంటుంది. ఇదేంటి ఇంత ఓవర్ యాక్షన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తన గురించి మాటమాత్రం ప్రస్తావించకపోవడం పిఠాపురం వర్మను మరింత వేడెక్కిస్తోంది. ఈ అంశం లోకేష్ వద్దకు కూడా చేరింది.. పలువురు కార్యకర్తలు లోకేష్ తో మాట్లాడుతూ నాగబాబు.. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.చెప్పులోని రాయి చెవిలోని జోరీగకంటిలోని నలుసు కాలి ముల్లుఇంటిలోని పోరు ఇంతింత గాదయావిశ్వదాభిరామ వినురవేమ!అన్నట్లుగా తయారైంది టీడీపీ పరిస్థితి. తమ గెలుపులో కీలకపాత్ర పోషించిన పవన్ను ఇప్పుడు చెప్పులమాదిరిగా బయట వదిలేయలేక.. వాళ్ళ అన్నదమ్ముల కామెంట్లు చెవిలో జోరీగమాదిరిగా ఇబ్బంది పెడుతున్నా భరించలేక.. సతమతమవుతున్నారు. మొత్తానికి నోటి దురుసు ఉన్న నాగబాబు ఎప్పటికైనా కూటమిలో చిచ్చుకు కారణం అవుతారని అంటున్నారు..-సిమ్మాదిరప్పన్న -
Ambati Rambabu: జనసేన పార్టీకి దశదిశ లేదు
-
SVSN వర్మపై నాగబాబు కామెంట్స్
-
రాజకీయ దుమారం రేపుతున్న పవన్ కళ్యాణ్ పై నాగబాబు కామెంట్స్
-
వర్మ అది నీ కర్మ! మళ్లీ అగ్గి రాజేసిన నాగబాబు
-
నాగబాబు వ్యంగ్యాస్త్రాలు.. మరింత అగ్గి రాజేసేలా!
పిఠాపురం: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి టీడీపీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాత్ర ఏమీ లేదని జనసేన నేత నాగబాబు ఒక్క దెబ్బలో తేల్చి పారేశారు. అసలు పవన్ గెలుపునకు ఏ నేతైనా కారణం అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది కూడా పిఠాపురం వేదికగా ఈరోజు(శుక్రవారం) జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు పరోక్షంగా చురకలు అంటించారు. కేవలం పవన్ విజయానికి పిఠాపురం ప్రజలు, జన సైనికులే కారణమని ఒక్క ముక్కలో చెప్పేశారు నాగబాబు. ఇక్కడ పవన్ గెలుపునకు పవనే ప్రధాన కారణంగా చెప్పుకొచ్చారు. వర్మ సీటు త్యాగం సంగతి ఏంటో..?అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసింది పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ. ఇక్కడ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ ను భుజాన వేసుకున్నారు వర్మ, అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చంద్రబాబు ఆశ చూపడంతో పాటు దానికి పవన్ కళ్యాణ్ కూడా వంత పాడటం కూడా జరిగింది. సర్లే.. చంద్రబాబు మన నాయకుడే.. పవన్ కూడా మన వాడే అనుకున్నాడో ఏమో వర్మ.. ఎమ్మెల్సీ టికెట్ అన్నారు కదా అని ఆ ఎమ్మెల్యే సీటను త్యాగం చేశారు వర్మ,. మరి తీరా చూస్తే వర్మకు ఊహంచని పరిణామం ఎదురైంది. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా పెద్ద షాకిచ్చారు చంద్రబాబు..పవనే దెబ్బ కొట్టారా..?ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు.తనకు ప్రొటోకాల్ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్రబాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు.అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. మరింత అగ్గి రాజేసేలా..పవన్ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో పవన్ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పనిచేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంపడంలో కీలకపాత్ర పోషించారు.ఇప్పుడు ఆయనకే పవన్ అడ్డుపడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వర్మను పవన్ దెబ్బకొట్టడం దారుణమని వాపోతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి. ఇప్పుడు ఏకంగా నాగబాబు నోటి వెంట వర్మ పేరు రాలేదు.. కదా పరోక్షంగా సెటైర్లు వేయడం ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది. ఇప్పటికే టీడీపీ-జనసేనలపై ఆగ్రహంగా ఉన్న వర్మ వర్గంలో మరింత అగ్గి రాజేశారనే వాదన తెరపైకి వచ్చింది. -
Karumuri Venkat Reddy: నాగబాబుకి ఇచ్చినప్పుడు.. హైపర్ ఆదికి ఎందుకివ్వరు!
-
పవన్ కళ్యాణపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్
-
హామీల గురించి అడిగేవారు కుక్కలు, సన్నాసులా?
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగే వారిని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు(Nagababu) కుక్కలు, సన్నాసులుగా పేర్కొనడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చాక సొంత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే ఉద్దేశంతో ‘జనంలోకి జనసేన’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 2న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో నిర్వహించిన సభలో నాగబాబు మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది.ఇంకా అది చేయలేదు.. ఇది చేయలేదు.. ఆ స్కీం రాలేదు.. ఈ స్కీం రాలేదని నోటికి వచ్చినట్టు వాగే వారు వైఎస్సార్సీపీ గూండాలు, కుక్కలు, సన్నాసులు’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అటు సొంత పార్టీలో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీస్తున్నాయి. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని అమలు చేసి చూపించే బాధ్యత తనది అంటూ జనసేన పార్టీ అధినేతగా పవన్కళ్యాణ్ ఎన్నికల ముందు అనేక సభల్లో స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఆయన సోదరుడు నాగబాబు వ్యాఖ్యలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయంటూ సొంత పారీ్టలోనే అంతర్గతంగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలపై ఈ వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.2014–19 మధ్య అప్పటి టీడీపీ–బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి, అప్పటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అత్యధిక శాతం ఆ ఐదేళ్లలో అమలు చేయకపోయినా పవన్కళ్యాణ్ పెద్దగా ప్రశ్నించని కారణంగానే 2019 ఎన్నికల్లో జనసేన తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగే వారిని కించపరిచేలా, చులకనగా మాట్లాడడం ఏ మాత్రం మంచిది కాదని పెదవి విరుస్తున్నారు.నాగబాబు తర్వలో ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా చేపట్టనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడిన నేపథ్యంలో.. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన అహంకారానికి అద్దం పడుతున్నాయని, ఇలాంటి వారికి మంత్రి పదవి ఇస్తే ఇక అంతేనని వివిధ రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా, గతంలో నాగబాబు ‘సైకిల్ తొక్కితే మనకు ఆరోగ్యం – సైకిల్ను తొక్కితే రాష్ట్రానికి ఆరోగ్యం’ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యాఖ్యలు టీడీపీ–జనసేన శ్రేణుల మధ్య తీవ్ర దుమారం రేపాయి. -
మరోసారి బయటపడ్డ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విభేదాలు
-
నాగబాబు బెర్త్ ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే
మెగా బ్రదర్... జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రి యోగం.. ఉందా..? ఇప్పట్లో..? పండక్కి అవుతుందా ? ఇంకా టైం పడుతుందా ? అంతా గందరగోళం. తన మానాన తాను ట్విట్టర్లో పిచ్చి ట్వీట్స్ చేసుకుంటూ ఎకసెక్కాలు ఆడుకుంటావు ఉంటే ఉన్నఫళాన ఆయన్ను కేబినెట్లోకి తీసుకుంటాం సీఎం చంద్రబాబు ఒక ప్రకటన విడుదల చేసారు. వాస్తవానికి మొన్నామధ్య ఖాళీ అయినా మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానికి ఆయన్ను ఎంపిక చేసి రాజ్యసభకు ఢిల్లీ పంపుతారని వార్తలు వచ్చాయి కానీ అది కుదరకపోవడంతో ఎకాఎకిన ఆయన్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటాం అంటూ చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఫలానా వ్యక్తికీ త్వరలో కేబినెట్లో స్థానం కల్పిస్తాం అని ప్రకటన చేయలేదు. దీని మీద అప్పట్లో జరిగాయి.. వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియావాళ్లు సైతం బాగానే ట్రోల్ చేసారు. కానీ ఇంతవరకు ఆ విషయమై ఏమీ తేలలేదు..ఇదిలా ఉండగా మంత్రిగా ప్రమాణస్వీకారం ఎలా చేయాలన్నదానిమీద నాగబాబు ఇప్పటికే రిహార్సిల్స్ కూడా చేసేసి. కొత్త బట్టలు కుట్టించుకుని రెడీగా ఉన్నారు. కానీ మరి చంద్రబాబు నుంచి .. రాజ్ భవన్నుంచి కనీసం పిలుపు రాలేదు. వాస్తవానికి రాష్ట్ర కేబినెట్లో ఒకే ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది. ఇప్పటికె పలువురు మంత్రులు రెండేసి పదవులు చేపట్టి బాధ్యతలు మోస్తున్నారు. వాటిలో ఒకటి తీసేసి ఈయనకు ఇస్తారని.. అది కూడా జనసేన మంత్రి కందుల దుర్గేష్ వద్ద ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు ఇస్తారని కూడా పుకార్లు వచ్చాయి. కానీ ఆ సౌండ్ కూడా ఇప్పుడేం లేదు.. అంతా సైలెంట్ అయిపొయింది.ఆరోజుకు కూల్ చేయడమే చంద్రబాబు లక్ష్యమా ?వాస్తవానికి రాజ్యసభ స్థానం కోసం పట్టుబట్టిన నాగబాబును కూల్ చేయాడానికి అప్పటికపుడు ఆ మంత్రి పదవి పేరిట ఒక ప్రకటన ఇచ్చారు తప్ప ఇప్పుడప్పుడే ఆయన్ను కేబినెట్లోకి తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా అసలు ఏమి పదవి అడగాలి.. ఏది తీసుకోవాలి అనే విషయంలో పవన్ కళ్యాణ్.. నాగబాబులమధ్య చర్చలు కూడా నడిచాయని ఏ శాఖ తీసుకోవాలన్నదానిమీద వారు ఒక అవగాహనకు వచ్చారని కూడా అంటున్నారు కానీ చంద్రబాబు దగ్గర ఇవన్నీ నడుస్తాయా..? అయన ఇచ్చింది తీసుకోవడం తప్ప వీళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి ఉందా అనే అంశాలూ చర్చకు వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ గమ్మున కేబినెట్లోకి దూకేసి హడావుడి చేద్దాం అనుకున్న నాగబాబు స్పీడ్ కు చంద్రబాబు బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రాజ్యసభ ఎన్నికల హడావుడి ముగిసింది.. మళ్ళా ఏదైనా అవసరం పడినపుడు. పవన్ బ్రదర్స్ ను కూల్ చేయాల్సిన అవసరం వచ్చినపుడు చూద్దాం అందాక ఊరుకుందాం అని చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.- సిమ్మాదిరప్పన్న -
టార్గెట్ నాగబాబు.. లోకేష్కు బూమరాంగ్!
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడైన కొణిదెల నాగబాబు త్వరలో ఏపీకి మంత్రి కాబోతున్నారు. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆ ప్రకటన చేశారు. ఈ పరిణామంపై జనసేన ఫుల్ ఖుషీగా ఉంది. కష్టకాలంలో అండగా ఉన్న అన్నకు పవన్ తగిన బహుమతి ఇవ్వబోతున్నాడని అనుకుంటున్నారు. కానీ, టీడీపీ మాత్రం లోలోపల రగిలిపోతోంది. అందుకు కారణం.. గతంలో టీడీపీని, చినబాబును నాగబాబు ఫుల్గా ఆడేసుకోవడం!.2014లో జనసేన ఆవిర్భావం నుంచి పవన్ వెంటే ఆయన అన్న నాగబాబు నడుస్తున్నారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో ఆయన రాజకీయ మనుగడ కష్టమేనని అంతా అనుకున్నారు. అనూహ్యంగా.. జనసేన ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతూ పార్టీ బలోపేతం కోసం పని చేశారు. 2024 ఎన్నికలకు పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించగానే.. జనసేన శ్రేణుల్లో నైరాశ్యం ఆవహించింది. అయితే.. ఆ అసంతృప్తిని కప్పిపెట్టడంలో నాగబాబే ముఖ్యభూమిక పోషించారు. చివరకు ఏదైతేనేం.. ఎమ్మెల్సీ కోటాతో మంత్రి పదవి దక్కించుకోబోతున్నారు. అయితే.. ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది.నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కొణిదెల నాగబాబును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తిని.. ఇలా ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేయడం ఏంటంటూ పోస్టులు పెడుతున్నారు. నందమూరి బాలకృష్ణలాంటి అర్హత ఉన్నవాళ్లు ఉండగా.. ఏనాడూ ఎన్నికల్లో గెలవని నాగబాబును మంత్రిని చేయడం ఏంటని? ప్రశ్నిస్తున్నారు. అదే టైంలో.. గతంలో నారా లోకేష్ను టార్గెట్ చేసుకుని నాగబాబు చేసిన పోస్టులను కొందరు ప్రస్తావిస్తున్నారు.2019-24 మధ్య వైఎస్సార్సీపీతో పాటు టీడీపీని టార్గెట్గా పెట్టుకుని నాగబాబు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ‘మై ఛానెల్ నా ఇష్టం’ పేరిట యూట్యూబ్ చానెల్లో అడ్డగోలు కామెంట్స్ చేశారు. అందులో చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్తో పాటు కొడుకు లోకేష్ నోరు జారి చేసిన ప్రసంగాలను నాగబాబు బాగా హైలైట్ చేశారు. యూట్యూబ్ ఆదాయం కోసమే నాగబాబు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నాడంటూ ఆయనపై ఆ టైంలో సెటైర్లు కూడా బాగానే పేలాయి. చివరకు.. ఎందుకనో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది.సంబంధిత వార్త: ‘లోకేష్ కామెడీ ముందు జబర్దస్త్ ఏపాటిది’కట్ చేస్తే.. 2024 ఎన్నికల కోసం టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా వెళ్లాయి. ఆ టైంలో అనకాపల్లి ఎంపీ పోటీ కోసం నాగబాబు తెర వెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ.. పొత్తు అడ్డం వచ్చింది. అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా అదీ కుదరలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్కరోజు గడవకముందే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి మెగా బ్రదర్కే అంటూ ఓ ప్రచారం నడిచింది. కానీ, చంద్రబాబు దాన్ని కూడా లాగేసుకున్నారు. ఆపై ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకే దక్కవచ్చనే చర్చా నడిచింది. అది జరగలేదు.సంబంధిత వార్త: లోకేష్కు ఓ.. వేస్కోండి!ఇప్పుడు కాబోయే మంత్రి నాగబాబుపై పెడుతున్న పోస్టుల వెనుక.. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఉన్నాడనే చర్చ మొదలైంది. ప్రతీకార చర్యలో భాగంగానే.. టీడీపీ అనుకూల సోషల్ మీడియా ద్వారా ఈ తతంగం నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల టైంలో పవన్ కోసం నారా లోకేష్ను పక్కనపెట్టారు చంద్రబాబు. తీరా ఎన్నికలయ్యాక లోకేష్ను మంత్రిని చేసినప్పటికీ.. జనసేనానితో గ్యాప్ మాత్రం అలాగే కొనసాగుతోంది. మరోవైపు ఈ పోస్టుల ఆధారంగా.. నాగబాబుకు టీటీడీ చైర్మన్ సహా ఏ పదవీ దక్కకపోవడానికి చినబాబే కారణమై ఉంటాడని జనసేనలోనూ ఓ చర్చ నడుస్తోంది. అందుకే ఎమ్మెల్సీ కోటా మంత్రి అయిన సందర్భాన్ని లోకేష్కు అన్వయింపజేస్తూ కౌంటర్కు దిగారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ కూడా.. టీడీపీ-జనసేనల మధ్య ఏళ్లుగా నడుస్తున్న సోషల్ మీడియా వార్ రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
ఏపీ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ
-
ఏపీ కేబినెట్ విస్తరణ.. ఆ ఐదుగురికి ఉద్వాసన?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అతిత్వరలో కేబినెట్ విస్తరణ జరగనుందనే వార్త ఒకటి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జనసేన నేత, పవన్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కనున్న నేపథ్యంతో ఈ పరిణామం తప్పదనేది ఆ వార్త సారాంశం. ఈ క్రమంలో ఇప్పుడున్న కేబినెట్లో ఐదుగురికి ఉద్వాసన తప్పదనే మరో ప్రచారం తీవ్రంగా నడుస్తోంది. కూటమికి చెందిన.. అదీ టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేతే ఈ ప్రచారం దగ్గరుండి చేయిస్తుండడం గమనార్హం.ఏపీలో కేబినెట్ విస్తరణ ఈ నెలలోనే ఉంటుందా? లేదంటే సంక్రాంతి తర్వాత అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు కూటమి నేతల్లో టెన్షన్ మొదలైంది. నాగబాబు కేబినెట్ ఎంట్రీ ఒక ఎత్తు అయితే.. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో ఐదుగురిని మారుస్తారనే చర్చ మొదలైంది. ప్రస్తుతానికి కేబినెట్లో ఒక్క స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబుకు ఆ ఒక్కస్థానం అప్పగిస్తే సరిపోతుంది కదా?. కానీ, ఈ విషయంపై ఆ టీడీపీ పెద్ద ఏం చెబుతున్నారంటే.. ఇప్పుడు ఏపీ మంత్రులు సుభాష్, రాంప్రసాద్ రెడ్డి, సవిత పట్ల చంద్రబాబు మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ పనితీరు కూడా పెద్దగా బాగోలేదనే చంద్రబాబు అనుకుంటున్నారు. బోనస్గా.. హోం మంత్రి అనిత విషయంలోనూ పాజిటివ్నెస్ లేదు’’ అని ప్రచారం చేయిస్తున్నారు. ఆ టీడీపీ నేత చెప్పిన విషయాల గురించే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులు జోరుగా చర్చించుకుంటున్నాయి.ఇదిలా ఉంటే.. నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన కూటమి సర్కారులో చిన్నపాటి చిచ్చు రాజేసింది. టీడీపీ నేతలు ఆ ప్రకటనతో రగిలిపోతున్నారు. అయితే చంద్రబాబు వాళ్ల ఆవేశాన్ని చల్లార్చినట్లు సమాచారం. తొలుత.. ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకు ఇస్తారని, పవన్ సైతం ఆ అంశాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్లినట్లు ఊహాగానాలు వినవచ్చాయి. అయితే.. ఢిల్లీ లెవల్లో జనసేన పప్రాతినిధ్యం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుంది. అందుకే ఆ మూడు సీట్లలో ఒకటి బీజేపీ.. రెండు టీడీపీకి ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో ఏపీ కేబినెట్లో నాగబాబును తీసుకుంటున్నట్లు ప్రకటించి.. జనసేనలో పేరుకుపోయిన అసంతృప్తిని చంద్రబాబు చల్లాచర్చారు. -
టీడీపీ సీనియర్లకు దక్కని గౌరవం
-
నాగబాబుకు మంత్రి పదవి!
-
కూటమి @ ఫ్యామిలీ ప్యాక్
కూటమి సర్కారు ఫ్యామిలీ సర్కస్ మాదిరి మారింది. సర్కారులో ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును సైతం కేబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీసింది. వాస్తవానికి పార్టీలో అత్యంత కీలకమైనవ్యక్తులకు నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనివాళ్లకు మాత్రమే ఇలా ఎమ్మెల్సీగా గెలిపించి మంత్రిగా చేస్తారు.. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా పొంగూరు నారాయణ, లోకేష్ వంటివాళ్లకు మంత్రిగా స్థానం కల్పించారు. మొన్నటికి మొన్న వైయస్ జగన్ కేబినెట్లోనూ ఓడిపోయినా మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడొచ్చిన చిక్కంతా కూటమిలో ఫ్యామిలీ ఫ్యాక్స్ ఎక్కవైనాయి అనేది చర్చకు వచ్చింది.కూటమి ధర్మం అంటూ చంద్రబాబు చేస్తున్న చేష్టలు దిగజారినట్లుగా ఉంటున్నాయని అంటున్నారు. వాస్తవానికి తాజాగా ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకు ఇస్తారని ఊహాగానాలు వచ్చాయి. పవన్ సైతం ఆ అంశాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ మూడు సీట్లలో ఒకటి బిజెపి.. రెండు తెలుగుదేశం వాళ్ళు ఎగరేసుకుపోవడంతో నాగబాబుకు రాజ్యసభ ప్రాప్తం లేకుండా పోయింది. దీంతో ఆయన్ను సంతుష్టుణ్ణి చేసేందుకు కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.నామినేటెడ్ పదవుల విషయంలో కూడా మొదటినుంచీ కష్టపడినవాళ్లకు కాకుండా పైరవీకారులకు, డబ్బులు ఇచ్చేవాళ్లకే ప్రాధాన్యం దక్కిందన్న మూతి విరుపులు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. జనసేన పార్టీలో నాగబాబు పాత్ర, పార్టీ నిర్వహణ .. ఆర్థికవ్యవహారాలు వంటి అంశాల్లో అయన వ్యవహారశైలి మీద తీవ్ర విమర్శలు ఉన్నాయి. టిక్కెట్ల కోసం డబ్బులు కలెక్షన్ చేశారని. కార్యకర్తలను సాంతం వాడేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.అయినా సరే డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు కావడం.. పైగా ఎలాగైనా చట్టసభకు వెళ్లాలన్న కోరిక నాగబాబుతో ఉండడంతో ఆయన్ను ఈవిధంగా సంతృప్తి పరుస్తున్నట్లు టీడీపీ క్యాడర్ చెప్పుకుంటోంది. ఇప్పటికే టీడీపీలో సీనియర్లు అయిన యనమల రామకృషుడు,, కిమిడి కళావెంకట్రావు, పత్తిపాటి పుల్లారావు వంటివాళ్లకు మంత్రిపదవుల్లేక వట్టి ఎమ్మెల్యేలుగా జనాల్లోకి వెళ్లలేక అవమానభారం మోస్తుంటే ఇప్పుడు ఏమీలేని నాగబాబును ఎలా మంత్రిని చేస్తున్నారు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికే చంద్రబాబు.. అయన కుమారుడు లోకేష్ అధికారంలో ఉన్నారు.. ఇక శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు. అయన అన్నకొడుకు రామ్మోహన్ నాయుడు (కేంద్ర మంత్రి)గా ఉన్నారు. అలవిమాలిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులూ ఇప్పుడు ఆహామీల సంగతిపక్కనబెట్టి అధికారాన్ని పంచుకోవడంలో బిజీ అయ్యారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు.బాబు మాటలు.. నీటి మూటలునీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. అనడమే కాకుండా ప్రతి వ్యక్తికీ ఒక పథకాన్ని ప్రకటించారు. అవేం అమలుకాకపోగా గతంలో జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేసారు . పైగా ఇప్పటికే 75 వేల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు రెండుసార్లు పెంచి జనం నడ్డివిరగ్గొట్టారు. ఆ వైఫల్యాలను జనం ప్రస్తావించకుండా ఉండేందుకు ఒక నెల తిరుమల లడ్డులో కొవ్వు అంటూ.. ఇంకో నెల సోషల్ మీడియా అరెష్టులు.. ఇంకోసారి ఇంకేదో అంశాన్ని తెరమీదకు తెచ్చి జనం దృష్టిని మళ్లిస్తూ వస్తున్నారు.ఇదీ చదవండి: డైలాగులకూ చేతలకూ పొంతనుండొద్దా?ఫ్రీ ఇసుక లేకపోగా దాని ధర ఆకాశాన్ని అంటింది. మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎక్కడ రూపాయి ఉంటె అక్కడికి వాలిపోతున్నారు. ఇక పవన్ సైతం పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉంది.. ఏమి చేయలేకపోతున్నాం అని వగచారు. సంపద సృష్టిస్తాం అని చెప్పుకుని గెలిచాక ఈ చేతగాని ఏడుపులు ఎందుకు అంటూ ప్రజలనుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగానే నాగబాబుకు మంత్రిపదవి అంటూ చంద్రబాబు సరికొత్త కాన్సెప్ట్ ను బయటకు తీశారు. మొత్తానికి కూటమి సర్కారు జల్సా చేస్తోంది తప్ప ప్రజలకు చేస్తున్నదేం లేదని అంటున్నారు. నాగబాబు మంత్రి అయితే జబర్దస్త్ కామెడీ మొత్తం కేబినెట్లోనే ఉంటుందని అంటున్నారు-సిమ్మాదిరప్పన్న -
ట్వీట్ పెట్టినందుకు నాగబాబు గారికి థాంక్స్
-
ఎల్లోమీడియాకు నాగబాబు కౌంటర్
సాక్షి,హైదరాబాద్: జనసేన అధినేత పవన్కల్యాణ్ సోదరుడు నాగబాబు ఎల్లోమీడియాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు నాగబాబు తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో శుక్రవారం(నవంబర్ 29) ఒక పోస్టు చేశారు. తనకు రాజకీయ పదవులపై ఆసక్తి లేదని నాగబాబు కుండబద్దలు కొట్టారు. పవన్ ఢిల్లీ పర్యటనపై కొన్ని రోజులుగా ఏదేదో ప్రచారం చేస్తున్న ఎల్లోమీడియాకు తన ట్వీట్తో తాజాగా షాకిచ్చారు నాగబాబు. పవన్ ఢిల్లీ పర్యటన నాగబాబు కోసమేనని ఎల్లోమీడియా ఊదరగొడుతున్న విషయం తెలిసిందే. నాగబాబుకు రాజ్యసభ సీటు కావాలని పవన్ తన టూర్లో బీజేపీ పెద్దలను కోరినట్టు ఎల్లోమీడియా వార్తలు ప్రసారం చేసింది. ఈ ప్రచారంపై నాగబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఇందుకే ఆయన ఎక్స్లో క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. -
నిజం ఎప్పటికైనా బయటపడుతుంది..!
-
విన్న ప్రతిదాన్నీ నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు తర్వాత నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ‘ఎక్స్’లో చేసిన రెండు పోస్టులు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ‘న్యాయస్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తినీ నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు’అన్న బ్రిటిష్ లాయర్ సర్ విలియం గారో కొటేషన్ను ఆయన రాసుకొచ్చారు. అలాగే ‘మీరు విన్న ప్రతిదాన్నీ నమ్మొద్దు.ప్రతి కథకు మూడు పార్శా్వలు ఉంటాయి. మీ వైపు, నా వైపు మరియు నిజం’అని అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ ఎవాన్స్ రాసిన కొటేషన్ను కూడా పోస్టు చేశారు. జానీ మాస్టర్ గురించి ప్రత్యక్షంగా ఆయన ఎక్కడా ప్రస్తావించకపోయినా పరోక్షంగా మద్దతు పలికారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. జనసేన పారీ్టలో జానీ మాస్టర్ కీలకంగా వ్యవహరించడం వల్లే నాగబాబు ఇలా స్పందించారని అంటున్నారు. జానీ మాస్టర్.. తప్పు చేస్తే అంగీకరించండి: మంచు మనోజ్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు, అరెస్టు నేపథ్యంలో నటుడు మంచు మనోజ్ స్పందించారు. ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టారు. ‘జానీ మాస్టర్.. కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసు. అలాంటిది ఈరోజు మీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఇప్పుడు కాకపోయినా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అన్నది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులకు నా అభినందనలు.ఈ సమాజంలో చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇది తెలియజేస్తుంది. జానీ మాస్టర్.. మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చేయండి. తప్పు చేసి ఉంటే దానిని అంగీకరించండి..’అని మనోజ్ పేర్కొన్నారు. ‘ఇచి్చన మాట ప్రకారం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ని వెంటనే ఏర్పాటు చేయాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ను కోరుతున్నా. దానికంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియా ఖాతాలు ఏర్పాటు చేయండి. పరిశ్రమలోని మహిళలకు గొంతుగా నిలపండి. మీరు ఒంటరిగా లేరని, మీ ఆవేదన, బాధలను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. కుమార్తె, సోదరి, తల్లి.. ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం..’అంటూ మనోజ్ పోస్టు చేశారు. -
టీటీడీ.. మాకే కావాలి! పట్టుబడుతున్న టీడీపీ, జనసేన
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవి కోసం కూటమి పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు ఆ పదవి కోసం గట్టిగా పట్టుపడుతున్నారు. టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, వేమిరెడ్డి ప్రశాంతి, రఘురామకృష్ణరాజు రేసులో నిలవగా.. జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ పారీ్టకి చెందిన సీనియర్ నేత ఎవరికైనా ఆ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అశోక్ గజపతిరాజు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుమార్తె అదితికి అవకాశం కలి్పంచి.. తాను పోటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆయనకే ఈ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన పూర్తికాలం ఆ పదవి కోసం సమయం కేటాయించకపోవచ్చని, అలాగే అందరికీ అందుబాటులో ఉండడం కష్టమనే అభిప్రాయం టీడీపీ నేతల్లో నెలకొంది.ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం.. స్పీకర్ పదవి ఆశించినా అదీ రాకపోవడంతో ఆయన తనకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా రేసులో ఉన్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాలో పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డామని.. తమకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. నాగబాబు కోసం ఒత్తిడి! టీడీపీలోనే టీటీడీ చైర్మన్ పదవి కోసం ఎంతో మంది ఆశలు పెట్టుకోగా.. దాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు జనసేన పార్టీ పావులు కదుపుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకు ఆ పదవి ఇవ్వాల్సిందేనని జనసేన పార్టీ చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఖాయమైనట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అనంతరం ఆ ప్రచారాన్ని ఖండించిన నాగబాబు.. అధికారిక ప్రకటన వస్తేనే ఇలాంటి వాటిని నమ్మాలన్నారు. దీంతో నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవిపై ఆశ ఉన్నట్లు బయటపడింది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైన నాగబాబు.. సర్దుబాటులో భాగంగా ఆ సీటును వదులుకున్నారు. దీంతో అన్నకు ఏదైనా మంచి పదవి ఇప్పించాలనే ఉద్దేశంలో పవన్కళ్యాణ్ ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే టీటీడీ చైర్మన్ పదవిని అడుగుతున్నట్లు సమాచారం. నెల రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉన్నా కూడా ఆ పదవికి ఉన్న ప్రాధాన్యత.. పోటీ నేపథ్యంలో చంద్రబాబు ఏమీ తేల్చట్లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీటీడీ బోర్డులో కూడా తమ పారీ్టకి చెందిన వారిని సగం మందిని నియమించాలని జనసేన కోరుతున్నట్లు తెలిసింది. బీజేపీ కూడా మూడుకు తగ్గకుండా తమ వారిని బోర్డులో సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేస్తోందని సమాచారం. -
అల్లు అదుర్స్.. నాగబాబు బెదుర్స్
-
"సారీ రా బన్నీ.."
-
నాగబాబుపై ట్విట్టర్ వేదికగా పోతిన మహేష్ విమర్శలు
-
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎటాక్...పారిపోయిన నాగబాబు
-
తిరుపతి జనసేన నాయకులతో నాగబాబు సమావేశం
-
ట్వీటు రాజా? పోటీ లేదా?
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడితే చాలు మెగా బ్రదర్స్ అయిన పవన్, నాగబాబు తెగ హడావుడి చేస్తారు. రాష్ట్రంలో మూడు పార్టీల పొత్తుల కోసం తాను ఎన్నో త్యాగాలు చేస్తున్నానని పవన్ కల్యాణ్ పదేపదే చెప్పుకుంటూ బాబుతో ప్యాకేజీ ఒప్పందం చేసుకుంటే... నాగబాబు మాత్రం తానో అపర మేధావి అనుకుంటూ.. ఎక్కడెక్కడో కొటేషన్లో, పిట్టకథలో తీసుకొని తన సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. ఆపై ప్రతి నెల మొదటి వారంలో తన సోషల్ మీడియాలో QR కోడ్ను షేర్ చేసి వంద రూపాయల నుంచి విరాళం పంపాలని కోరుతాడు. అలా ఎప్పుడూ ఆయన నెట్టింట మెగా ఫ్యాన్స్కు టచ్లో ఉంటారు. వాస్తవంగా నాగబాబు కూడా తమ్ముడు పవన్ టైపే! పవన్ స్టేజీపై ఊగిపోతూ మాట్లాడితే.. కొణిదెల నాగబాబు మాత్రం ఇంట్లో కూర్చోని ట్విటర్లో ఊగిపోతాడు. పసలేని తన ట్వీట్లతో ఆజ్ఞానంలో మునిగితేలుతూ అభిమానులపై తన జ్ఞాన ప్రదర్శన చూపిస్తాడు. జనసేనను రాజకీయ పార్టీగా బలపరచుకోండయ్యా అని తెలివైన అభిమానులు సలహాలు ఇస్తే.. వారందరినీ వైసీపీ కోవర్ట్లు అంటూ పార్టీ నుంచి వెళ్లిపోండి అంటారు. పవన్ ఏమో చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుంటే.. నాగబాబు మాత్రం పేటీఎం స్కానర్ పట్టుకుని సోషల్ మీడియాతో పాటు ప్రపంచం మొత్తం తిరుగుతాడు. ఫ్యాన్స్ అభిమానాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు మెగాబ్రదర్స్ ఇద్దరూ ఇలా ఎప్పుడూ బిజీగానే ఉంటారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి అందరి కంటే ముందుగానే అక్కడ ఎంట్రీ ఇచ్చాడు నాగబాబు.. అచ్యుతాపురంలో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఉన్నట్టుండి అన్నయ్యకు పవన్ షాకిచ్చాడు. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును జనసేన త్యాగం చేస్తుందని దానికి ఎల్లో కలరింగ్ ఇచ్చాడు. దీంతో ఎన్నికల యుద్ధం నుంచి కత్తి పట్టకుండానే వెనుతిరిగాడు. అప్పటి వరకు వారం రోజుల పాటు అక్కడ హడావుడి చేసిన నాగబాబు తన షెడ్యూల్కు ప్యాకప్ చెప్పడమే కాకుండా ఆ ఇంటికి టూలెట్ బోర్డు పెట్టేశాడు. ఆపై అనకాపల్లి నుంచి హైదరాబాద్కు మకాం మార్చేసి.. హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో నాగబాబు ఇంటికే పరిమితం అయి ట్వీట్లు చేసుకుంటూ కాలం గడపుతున్నాడు. వాస్తంగా అక్కడ నాగబాబు ఎంట్రీ సమయంలోనే ఆయనది ఐరన్ లెగ్ అంటూ జనసేన అభిమానులు చెప్పుకొచ్చారు. వారు అనుకున్నదే తర్వాత నిజమైంది. అనకాపల్లిలో నాగబాబు ఓట్లు అడగడం కంటే ప్రజలకు ఎక్కువగా క్యూ ఆర్ కోడ్ను చూపించేవారట. వంద రూపాయల నుంచి ఎంతైనా స్కాన్ చేయండి అని వారి ఫ్యాన్స్కు చెప్పేవారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా కొంతమేరకు అసహనానికి గురైయ్యారు. ఇన్నాళ్లూ పార్టీలో నాగబాబుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని భావించిన వారికి ఆయనకు అంత సీను లేదని ఫ్యాన్స్కు అర్థమైంది. నిజంగా జనసేనలో నాగబాబుకు పట్టున్నా, లేక పవన్ వద్ద పలుకుబడి ఉన్నా ఆయనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కారణంగా ఆయన సోదరుడు నాగబాబు పొలిటికల్ కేరీర్ ఇంతటితో క్లోజ్ అయినట్లే.. మరో కొద్దిరోజుల్లో చంద్రబాబు వల్ల పవన్ పొలిటికల్ కెరియర్ కూడా క్లోజ్ అవుతుందని మెగా ఫ్యాన్సే బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత పార్టీ పేరుతో వారిద్దరూ విరాళాలు రాబట్టుకోవడంలో బిజీగా ఉంటారని పలువురు జోష్యం చెబుతున్నారు. -
పవన్ కల్యాణ్ సొంత అన్నకే దిక్కులేదు.. మేమెంత?
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన శ్రేణుల్లో సరికొత్త అలజడి రేగుతోంది. ఇప్పటికే టీడీపీతో పొత్తులో అరకొర సీట్ల కేటాయింపు వీరికి మింగుడు పడడంలేదు. చాలీచాలని సీట్లతో ఎవరికి ఎసరు వస్తుందోనని లోలోన ఆందోళన చెందుతు న్నారు. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి తానే బరిలో ఉంటున్నానని, అచ్యుతాపురంలో కాపురం కూడా పెట్టి నానా హంగామా చేసిన నాగబాబు.. పక్షం రోజులు తిరక్కుండానే పలాయనం చిత్తగించారు. ఈ పరిణామానికి జనసేన క్యాడరు షాక్కు గురైంది. పవన్ కల్యాణ్ సొంత సోదరునికే ఈ పరిస్థితి వస్తే ఇక మేమెంత? అంటూ పార్టీలో టిక్కెట్లను ఆశిస్తున్న వారు నిర్వేదంలో పడిపోయారు. ఇన్నాళ్లూ పార్టీలో నాగబాబుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని భావించిన వారికి ఆయనకు అంత సీను లేదని తేటతెల్లమైంది. నిజంగా జనసేనలో పట్టున్నా, లేక పవన్ వద్ద పలుకుబడి ఉన్నా నాగబాబుకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. స్వయంగా అన్నకే పార్టీలో దిక్కు లేదని, ఇక ఆయనను నమ్ముకుంటే తాము నట్టేట మునిగినట్టేనని వాపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాగబాబుకు అన్ని విధాలా దన్నుగా నిలిచి, ఆయన వ్యవహారాలు చూస్తున్న యలమంచిలి ప్రాంతానికి చెందిన సుందరపు బ్రదర్స్ (విజయ్కుమార్, సతీష్కుమార్) సైతం నాగబాబు ఎపిసోడ్తో పత్తాలేకుండా పోయారు. వాస్తవానికి వీరిలో విజయకుమార్ యలమంచిలి, సతీష్కుమార్ గాజువాక సీట్లను ఆశిస్తున్నారు. ఇందుకోసం వీరు నాగబాబును ప్రసన్నం చేసుకుంటూ అటు అనకాపల్లి జిల్లాలోను, ఇటు విశాఖపట్నం జిల్లాలోనూ వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. నాగబాబు మనుషులుగా ముద్ర వేయించుకున్న వీరు కొంతమంది నుంచి వసూళ్లకు దిగారన్న ఆరోపణలున్నాయి. నాగబాబు తాజా పరిస్థితితో వీరు ఆందోళన చెందుతున్నట్టు చెబుతున్నారు. త్యాగాలకు సిద్ధంకండి.. మరోవైపు భీమిలి జనసేన సీటు తనకే ఖాయమైందని బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న పంచకర్ల సందీప్కు కాకుండా టీడీపీకి కేటాయిస్తున్నట్టు ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ సారి ఈ సీటును త్యాగం చేయాలని అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సందీప్కు స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే గాజువాక స్థానం నుంచి తమ అభ్యర్థే బరిలో ఉంటారన్న ప్రచారాన్ని టీడీపీ నేతలు విస్తృతం చేశారు. దీంతో అక్కడ జనసేన సీటును ఆశిస్తున్న సుందరపు సతీష్కుమార్, కోన తాతారావులు కూడా త్యాగాలు చేయాల్సి వస్తుందని అంటున్నారు. ఇక జనసేన నుంచి విశాఖ దక్షిణ సీటును వంశీకృష్ణ శ్రీనివాస్, సాధిక్, ప్రసాదరెడ్డి, కందుల నాగరాజు, డాక్టర్ మూగి శ్రీనివాసరావులు ఆశిస్తున్నారు. ఈ స్థానం నుంచి కూడా టీడీపీ అభ్యర్థే పోటీ చేస్తారని తెలియడంతో వీరంతా కలవరం చెందుతున్నారు. ఆ ఇద్దరిలో ఒక్కరికే చాన్స్? ఇక ఎమ్మెల్యే టిక్కెట్టును ఆశించి వైఎస్సార్సీపీ నుంచి జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్లు జంప్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరిలో ఒక్కరికే జనసేన సీటు దక్కవచ్చని చెబుతున్నారు. పెందుర్తి స్థానం పంచకర్లకు దాదాపు ఖరారైందని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే వంశీకృష్ణకు మొండి చెయ్యే గతయ్యే పరిస్థితి తలెత్తనుంది. అదే జరిగితే జనసేన త్యాగరాజుల జాబితాలో ఆయన కూడా చేరిపోనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కీలకనేతలు తమకు గుర్తింపు లేదని, నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి పరిణామాలతో ఇప్పటికే జాడలేకుండా పోయారు. ఇప్పుడు వీరికి త్యాగమూర్తులు కూడా తోడయ్యే అవకాశం ఉంది. -
అనకాపల్లి నుండి నాగబాబు పరార్
-
జెండా పీకేసిన నాగబాబు..
-
జెండా ఎత్తేసిన నాగబాబు.. ఓటమి భయమే కారణమా?
-
నాగబాబు ప్యాకప్ వెనుక కారణం ఏంటంటే..
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు ఇద్దరూ ఒక్కటే అనిపించుకున్నారు. ఇద్దరూ పార్ట్ టైమ్ పొలిటిషీయన్స్ అని మరోసారి రుజువు చేసుకున్నారు. ప్రజలకు మేలు చేసేందుకు కాకుండా చంద్రబాబుకు సహకరించేందుకే వారు ఉన్నట్టు నిరూపించుకున్నారు. ఇంతకీ ఏమైందంటే.. జనసేన నేత నాగబాబు.. అనకాపల్లిలో నుంచి జెండా ఎత్తేశారు. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా నాగాబాబు ఏపీకి వచ్చారు. అనంతరం, అచ్చుతాపురంలో ఓ ఇల్లు తీసుకుని నాలుగు రోజులు హడావుడి చేశారు. సమీక్షల పేరుతో కలరింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో సర్వేలు కూడా చేయించుకున్నట్టు సమాచారం. అయితే... సర్వేల్లో ప్రతికూల ఫలితాల కారణంగా ఓటమి భయం మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో, నాగబాబు తన మకాంను అనకాపల్లి నుంచి హైదరాబాద్కు మార్చారు. తాజాగా మూటాముల్లె సర్దుకుని నాగాబాబు హైదరాబాద్కు పయనమయ్యారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన రోజున ఏపీకి వచ్చిన పవన్.. అనంతరం హైదరాబాద్కు వెళ్లారు. కాగా, పొత్తులో భాగంగా 24 సీట్లు జనసేకు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ఇప్పటి వరకు ప్రకటించగా.. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై పవన్ ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. చివరకు తాను ఎక్కడ పోటీ చేస్తున్న విషయం కూడా ఆయన చెప్పలేదు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కూడా చేయలేదు. ఇక, ఏపీలో రాజకీయాలు అంటూ పవన్ మళ్లీ హైదరాబాద్లోనే మకాం వేశారు. దీంతో, ఇలాంటి నేతలా ఏపీ ప్రజల బాగు కోరేది అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహ వేడుకల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
వైఎస్సార్సీపీ నేత కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: కాళ్ల మండలం పెద అమిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో పాలకొల్లు వైఎస్సార్సీపీ నాయకులు గుణ్ణం నాగబాబు కుమారుడు సుభాష్ వివాహానికి సీఎం హాజరయ్యారు. వరుడు గుణ్ణం సుభాష్, వధువు దీప్తిలను సీఎం జగన్ ఆశ్వీరదించారు. ఈ వివాహ వేడుకలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, పుప్పాల వాసు బాబు, శ్రీ రంగనాథరాజు తదితరులు పాల్గొన్నారు. -
నాగబాబుకి ఎంపీ సీటు..కొణతాల అసంతృప్తి
-
రూటు మార్చిన నాగబాబు?
జనసేన లో పవన్ కళ్యాణ్ .. నాదెండ్ల మనోహర్ తరువాత మూడో స్థానంలో ఉన్న పవన్ సోదరుడు నాగబాబుకు రాజకీయ ఆలోచనలు ఉన్నా.. వాటిని సరిగా అమలు చేయలేకపోవడం .. స్థిరత్వం లేకపోవడం.. సరైన ప్రణాళిక... వ్యూహాలు కొరవడడంతో చట్టసభల్లోకి వెళ్లే అవకాశం దక్కడం లేదు.. గతంలో 2019 లో నరసాపురం నుంచి జనసేన తరఫున లోక్ సభకు పోటీ చేసిన నాగబాబుకు రెండున్నర లక్షల ఓట్లు వచ్చినా గెలుపు సాధ్యపడలేదు.. అక్కడ రఘురామా కృష్ణం రాజు గెలవగా ఈయన ఏకంగా మూడో స్థానంలో మిగిలిపోయారు.. ఈసారైనా చట్టసభలో అధ్యక్షా అనాలన్నది అయన ఆశగా కనిపిస్తోంది.. చిన్నా చితకా యాక్టర్లు.. ఛోటామోటాగాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుతున్నారు కానీ మెగా బ్రదర్ అనే బ్రాండ్ ఉన్న నాకేం తక్కువ.. నేనూ గెలుస్తా అనే ధీమా ఆయనలో ఉన్నా.. తన కోరికను నెరవేర్చుకునే కృషి.. పట్టుదల.. అవేమి లేవు.. దీంతో ఆయన కోరిక నెరవేరడం లేదు.. ఈసారైనా గెలవాలన్న అయన లోక్ సభకు పోటీ చేస్తారని అంటున్నారు.. అయితే గతంలో కాపులు ఎక్కువగా ఉంటారన్న లెక్కతో నరసాపురంలో పోటీ చేసి దెబ్బతిన్న నాగబాబు ఈసారి రూటు మార్చారని అంటున్నారు.. ఏకంగా మూడు జిల్లాలు మారి అనకాపల్లికి రావడానికి ప్లాన్ చేస్తున్నారు . అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రూట్ వేస్తున్నట్లు అయన కదలికలు స్పష్టం చేస్తున్నాయి. అయన ఇటీవల విశాఖలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు.. దానికితోడు కాపు నాయకులూ.. వ్యాపారాలు.. పారిశ్రామికవేత్తలతోను సైతం తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ... ఇంకా నిధుల వసూళ్లు వంటి పనుల్లో అయన యాక్టివ్ గా ఉన్నారు. ఇందులో భాగంగా పెందుర్తి.. యలమంచిలి నియోజకవర్గాల్లో అయన పర్యటిస్తున్నారు.. ఈమధ్యనే వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు... రాజీనామా చేసి జనసేనలో చేరారు.. అయన పెందుర్తిలో పోటీ చేస్తారని .. ఈ మేరకు పవన్ సైతం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇద్దరికీ ప్రయోజనం కలిగేలా నాగబాబు సైతం పెందుర్తిలో పర్యటిస్తున్నారు. అయితే ఇదే పెందుర్తి టిక్కెట్ తనకు కావాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.. ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి అదీప్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో పెందుర్తి పోరు మంచి రసకందాయంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ కూడా లైన్లో ఉన్నారు.. తన కొడుక్కి ఎంతమాత్రం టిక్కెట్ ఇవ్వాల్సిందే అని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నుంచి బైరా దిలీప్ అనే వ్యాపారవేత్త సైతం లైన్లో ఉన్నారు. తన కొడుక్కు టిక్కెట్ ఇవ్వకుండా పొత్తులో భాగంగా నాగబాబు పోటీ చేస్తే అయ్యన్న ఊరుకుంటారా ? మరి ఆయన్ను ఎలా శాంత పరుస్తారన్నది తెలియడం లేదు. ఈసారి నాగబాబు తన అభీష్టం మేరకు అనకాపల్లిలో పోటీ చేయగలరా లేదా అన్నది చూడాలి.. - సిమ్మాదిరప్పన్న ఇదీ చదవండి: ఢిల్లీలో బాబుకు ఎదురుదెబ్బ.. పవన్తో కొత్త రాయబారం! -
చంద్రబాబు ప్లాన్.. పవన్, నాగాబాబుకు కొత్త కష్టం!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు తమ భవిష్యత్తు, తమ పార్టీల పరిస్థితిపై బాగానే ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నది. మరోవైపు నటుడు, జనసేన నేత నాగబాబు తమ బలం బాగా పెరిగిందని చెబుతున్న తీరు ఆసక్తికరంగానే ఉంది. చంద్రబాబు మాట్లాడిన ఒక వీడియోని గమనించండి. ఈసారి తెలుగుదేశం గెలవకపోతే ప్రత్యామ్నాయం ఉండదు. రాష్ట్రానికే తాము రాలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆయన అన్నారు. ✍️నిజానికి చంద్రబాబు ఇప్పటికీ ఎక్కువ కాలం హైదరాబాద్లోనే నివసిస్తుంటారు. పవన్ కల్యాణ్ కూడా అంతే. అయినా ఏపీ రాజకీయాలు చేస్తున్నారు కనుక ఇక్కడ అధికారంలోకి రావాలని విశ్వయత్నం చేస్తున్నారు. సర్వేల ప్రకారం కానీ, ఇతరత్రా కానీ తమ గెలుపు అవకాశాలు తగ్గుతున్నాయని భయపడుతున్నారో ఏమో కానీ, చంద్రబాబు నేరుగా రాష్ట్రానికే రాలేమని అంటున్నారు. అంటే ఏమిటి దీని అర్ధం. తాము గెలిస్తేనే ఏపీకి వస్తామని, లేకుంటే రాబోమని చెప్పడమే కదా!. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. ఏం జరిగినా ప్రజలలోనే ఉంటామని చెబుతారు. కానీ, చంద్రబాబు మాత్రం అందుకు విరుద్దంగా మాట్లాడుతున్నారు. ఈయనకు ఏపీ ప్రజలపై అభిమానం ఉన్నట్లా? లేక పదవీ వ్యామోహమా!. మాట్లాడితే రాష్ట్రం భవిష్యత్తు కోసం అని డైలాగులు చెబుతుంటారు. అప్పుడప్పుడూ ఇలా కొన్ని వాస్తవాలు బయటపెట్టేస్తుంటగారు. దీని ద్వారా తనలో ఉన్న భయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. ✍️రాష్ట్రం భవిష్యత్తు కోసం అని చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడబలుక్కుని మాట్లాడుతుంటారు. దానిని ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా మహాప్రసాదంగా ప్రచారం చేస్తుంటాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన స్కీములన్నిటిని విమర్శిస్తారు. దాని వల్ల రాష్ట్రం నాశనమైందని అంటారు. మళ్లీ తాము అవే స్కీములను ఇంకా ఎక్కువ ఇస్తామని చెబుతుంటారు. తాజాగా వచ్చిన పవన్ వీడియో ఒకటి గమనిస్తే ఈ సంగతి మరింత స్పష్టంగా తెలుస్తుంది. తాను సోషలిస్టునని సీఎం జగన్ కంటే ఒక పది రూపాయలు ఎక్కువే ప్రజలకు ఇస్తానని అన్నారు. అంతకు ముందు ఒక సందర్భంలో ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి జగన్ స్కీములను ఎద్దేవా చేస్తూ అమ్మ ఒడి అంటా! చేయూత అంటా! విమర్శించారు. వీటిలో దేనికి పవన్ కట్టుబడి ఉంటారో తెలియదు. అందుకే సోషల్ మీడియాలో పవన్ పరస్పరం విరుద్దంగా మాట్లాడే వీడియోలు బాగా చక్కర్లు కొడుతుంటాయి. ✍️ఈ విషయంలో చంద్రబాబు కూడా తక్కువ తినలేదు. సీఎం జగన్ స్కీములన్నింటిని పలుమార్లు తప్పు పట్టారు. అమ్మ ఒడి.. నాన్న బుడ్డి అంటూ అవహేళనగా మాట్లాడారు. కానీ, ఇప్పుడు అదే చంద్రబాబు తాను అమ్మ ఒడి స్కీమ్ను మరో పేరుతో మరింత మంది పిల్లలకు అమలు చేస్తానని చెబుతున్నారు. అప్పుడు రాష్ట్రం భవిష్యత్తు నాశనం కాదా అన్నదానికి వీరు బదులు ఇవ్వరు. నిజానికి సీఎం జగన్ చేసిన అనేక సంస్కరణలను వీరు వ్యతిరేకించారు. ప్రజల ఇళ్ల వద్దకే పాలనను అందించడాన్ని చంద్రబాబు, పవన్లు వ్యతిరేకించారు. వలంటీర్ల వ్యవస్థను నానా రకాలుగా దూషించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థవల్ల ఎంతో నష్టం జరిగిపోయిందని చెప్పారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే వీటన్నిటిని కొనసాగిస్తామని అంటారు. వీరు చెప్పేది అబద్దమని అన్న సంగతి కనిపించడం లేదా?. కేవలం తమకు రాజకీయ భవిష్యత్తు లేదన్న భయంతోనే వీరు మాట మార్చుతున్నారు. ✍️చంద్రబాబు ప్రకటించిన ఆరు గ్యారంటీలు చూస్తే ఏపీని ఎంతగా పాడు చేసేది అర్ధం అవుతుంది. విజ్ఞత ఉన్న పౌరులెవ్వరూ చంద్రబాబు ఇస్తున్న గ్యారంటీలను నమ్మరు. అది కేవలం తన కుమారుడు లోకేష్ భవిష్యత్తు కోసం చేస్తున్న జిమ్మిక్కు తప్ప ఇంకొకటి కాదు. మరో సంగతి చూద్దాం. పదేళ్లపాటు తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని పవన్ ప్రకటించారు. దానిపై కూడా సోషల్ మీడియాలో కూడా రకరకాల వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇందులో ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా ముడిపెట్టి చమత్కరిస్తున్నారు. ఆయన తన సంసార జీవితంలో పదేళ్లు ఏ ఒక్కరితో ఉండలేదని, కానీ టీడీపీతో మాత్రం పదేళ్లు ఉంటానంటున్నారని జోకులు వేస్తున్నారు. వీటన్నిటికి ఆయన సమాధానం చెప్పకపోవచ్చు. 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ 2019లో విడాకులు ఇచ్చేశారు. తిరిగి 2024లో కలిసి కాపురం అంటున్నారు. మరోవైపు ఇప్పటికే కాపురంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఏం చేశారో తెలియదు. ✍️తెలంగాణలో అయితే బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తాము వచ్చే లోక్సభ ఎన్నికలలో ఎవరితో పొత్తు లేకుండానే పోటీచేస్తామని ప్రకటించడం ద్వారా జనసేనకు రామ్ రామ్ చెప్పేశారు. దానికి కారణం పవన్ సొంత పార్టీ వారికే వెన్నుపోటు పొడవడం, జనసేనకు ఎక్కడా డిపాజిట్లు రాకపోవడం వంటి కారణాలని వేరే చెప్పనవసరం లేదు. తెలంగాణలో ఇలా ఉంటే, ఏపీలో మాత్రం తమ పొత్తు జనసేనతో కొనసాగుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అంటున్నారు. మరి ఇప్పటికే పవన్ టీడీపీతో కలిసి చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నా, ఆ విషయం ఆమె మాట్లాడరు. ఇలాంటి చిత్రాలన్నీ ఏపీ రాజకీయాలలోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో పవన్ పదేళ్లపాటు టీడీపీతో పొత్తు అంటే, వచ్చే రెండు ఎన్నికలలోనూ టీడీపీని మోయడానికే ఆయన సిద్దపడుతున్నారని జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటప్పుడు తమ సంగతేమిటని ఆయా నియోజకవర్గాలలో ఉన్న జనసేన ఇన్ఛార్జీలు ప్రశ్నిస్తున్నారు. ✍️ఉదాహరణకు వినుకొండ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జీ ఒక వీడియో చేసి పదేళ్లు టీడీపీకి పనిచేసేదానికి తమ పార్టీ ఎందుకని ప్రశ్నించారు. తమకు పదేళ్లపాటు రాజకీయ భవిష్యత్తు లేదని పవన్ చెప్పేశారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీతో పొత్తును విమర్శిస్తే వైఎస్సార్సీపీకి అమ్ముడు పోయినట్లేనని జనసైనికులను అవమానించిన పవన్పై వారికి కోపంగా ఉంటే, ఇప్పుడు తాజా పదేళ్ల పొత్తు ప్రకటనతో వారు మండిపడుతున్నారు. ఈ పరిస్థితిలో టీడీపీతో పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు అడుగుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. టీడీపీవారేమో పదో, పరకో జనసేనకు ఇస్తే సరిపోతుందని ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య టీడీపీ మీడియా వారు కొందరు ఒక ప్రచారం పెట్టారట. పవన్ పొత్తు ప్రకటన చేసినా, ఆశించిన విధంగా టీడీపీకి మేలు కలగడం లేదని వారు చెబుతున్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వనవసరం లేదనే కదా!ఎలాగూ ఇప్పుడు పవన్ టీడీపీ వెనుక నడవక తప్పదని, ఎక్కువ సీట్లు అడగకుండా ఇలా ఆయన పరువు తీయాలన్నది వారి ఉద్దేశం. ✍️ఈ వాస్తవాలు పవన్ సోదరుడు నాగబాబుకు తెలియవేమో కానీ, ఆయన మాత్రం జనసేన బలం బాగా పెరిగిందని సభలలో చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తూ జనసేన బలం ముప్పైరెండు నుంచి ముప్పైఐదు శాతం వరకు పెరిగిందని, ఉభయ గోదావరి జిల్లాలలో అయితే అది నలభై శాతంపైనే అని అన్నారు. దానిని ఆయన కానీ, ఆయన సోదరుడు కానీ నమ్ముతుంటే టీడీపీతో పొత్తులో భాగంగా కనీసం అరవై నుంచి డెబ్బై సీట్లు అడగాలి. అలాకానీ పక్షంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఏమి ప్రయోజనం అన్నది వారు చెప్పగలుగుతారా?. టీడీపీ, జనసేన అధినాయకత్వంలోనే గందరగోళం, భయం ఏర్పడిందనడానికి ఇవన్నీ ఉదాహరణలే కదా!. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
టీడీపీ నేతల బాటలోనే జనసేన నేతలు
-
నకిలీ ఓటరు గుర్తింపులో జనసేన నాగబాబు
-
కొత్తవాళ్లతో సినిమా పెద్ద బాధ్యత
‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో ఇప్పటివరకు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలింస్ చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ప్రారంభించాం. ఇంతమంది కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను’’ అన్నారు నిహారిక కొణిదెల. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రం శుక్రవారంప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ని యూనిట్కి అందించారు. యదు వంశీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ద్వారా 11 మందిని హీరోలుగా, నలుగురిని హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో నేను, నా సతీమణి జయలక్ష్మి నిర్మాతలుగా పరిచయమవుతున్నాం’’ అన్నారు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ అధినేత ఫణి. ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్ దేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: మన్యం రమేశ్. -
ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు: శ్రీకాంత్
మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్. 2004లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా హీరో శ్రీకాంత్ మెప్పించారు. అయితే ఈ మూవీని మెగా ప్రొడక్షన్స్ ద్వారా నవంబర్ 4న భారీ ఎత్తున రీ రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో ఈ రి రిలీజ్కు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ ట్రైలర్ను నాగబాబు, హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. '2004ని నేను ఎప్పుడూ మరిచిపోలేను. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే మున్నాభాయ్ లగేరహో రీమేక్ వార్త వినిపించింది. హీరో పక్కన ఉండే కారెక్టర్ నాకు ఎలా ఉంటుంది అన్నయ్యా?' అని చిరంజీవిని అడిగా. అలా నవ్వి ఇలా వదిలేశారు. కానీ చివరకు ఆ పాత్ర నాకే వచ్చింది. అన్నయ్యతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయనది ఎంతో కష్టపడే మనస్తత్వం. ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతోంది. పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. నాగబాబు మాట్లాడుతూ.. 'ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ మూవీ వచ్చి 19 ఏళ్లు అవుతోంది. ప్రతీ 20 ఏళ్లకు ఓ జనరేషన్ మారుతూ ఉంటుంది. టీవీ, యూట్యూబ్లో పాత సినిమాలను ఎవరూ చూడరు. కానీ ఇలాంటి సినిమాలకు మళ్లీ మళ్లీ చూసే ఆడియెన్స్ ఎక్కువగా ఉంటారు. ఇలాంటి చిత్రాలను ఒకప్పుడు థియేటర్లో మళ్లీ ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ, ఛానెళ్లలో వస్తున్నాయి. ఇలాంటి సినిమా మళ్లీ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లేలా ఉంటుంది. ట్రైలర్ చూశాకా ఇవన్నీ నాకు గుర్తొచ్చి బాధ, సంతోషం కలిగాయి.' అని అన్నారు. -
పవన్ కల్యాణ్ చుట్టూ 'రుక్మిణి' కోట.. ఇంతకూ ఎవరీమె..?
జనసేన పార్టీలో కీలక నాయకుల పేర్లు చెప్పమని ఎవరినైనా అడిగితే పట్టుమని ఇదు పేర్లు కూడా తెరపై కనిపించవు. పవన్ పల్లకీ మోస్తున్న ఆయన అభిమానులకు కూడా ఈ విషయం తెలుసు. పవన్ తర్వాత పార్టీలో ఎక్కువగా వినిపించే పేరు నాదెండ్ల మనోహర్ కానీ ఆ జాబితాలో రుక్మిణి కోట అనే యువతి కూడా చేరారు. నిన్న మొన్నటి వరకు నాదెండ్ల ఏది చెబితే అదే జనసేనలో నడిచేది.. కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. తాజాగా రాయలసీమ జిల్లాల మహిళా నాయకురాలు పసుపులేటి పద్మావతి జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖలో 140 రోజుల పాటు రుక్మిణి ఎలా ఆడుకున్నారో క్లియర్గా వివరించారు. ఇలా బయటికి చెప్పుకోలేని వాళ్లు చాలా మంది జనసేనలో ఉన్నారని రుక్మిణి పేరు చెబుతూనే ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుకుంటున్నారు. రుక్మిణి కోట ఎవరు..? కృష్ణా జిల్లాకు చెందిన రుక్మిణి లండన్లో ఉండేవారు. అక్కడ ఆమె ప్రముఖ బ్రాండెడ్ బట్టల షాపును రన్ చేసేవారట. పవన్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయనకు దగ్గరుండి సౌకర్యాలు కల్పించేవారని జనసేన నాయకులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో 2020లో ఆమెను జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్గా పవన్ నియమించారు. వాస్తవానికి జనసేన నియామకాలను పరిశీలిస్తే ఎక్కువగా విదేశాల్లోనే ఉంటాయి. పార్టీ కోసం ఫండ్స్ పేరుతో పవన్,నాగబాబు కూడా ఇప్పటికే పలు పర్యటనలు కూడా చేసిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: మెగా 156 ప్రారంభం.. వీడియోతో ఫ్యాన్స్కు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి) జనసేన వీరమహిళ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దానికి దిశానిర్దేశం చేస్తున్నది కూడా రుక్మిణినే అని వారు చెబుతుంటారు. 2020 నుంచే రుక్మిణి పార్టీలో ఉన్నప్పటికీ 2022లో ఆమె లండన్ నుంచి హైదరాబాద్కు మకాం మార్చారు. ఇక్కడి వచ్చాక ఆమెకు హైదరాబాద్లోని జనసేన కార్యాలయ బాధ్యతల్ని మొదటగా రుక్మిణికి పవన్ అప్పగించారు. ఆమె టాలెంట్తో పవన్ను మెప్పించడంతో పార్టీలో ఆమె కీలకంగా మారిపోయారని టాక్. ఈ నేపథ్యంలో ఆప్పటికే జనసేన పార్టీ ఆఫీస్లో పనిచేసే 30 మందిని ఒక్కసారిగా తొలగించేశారని సమాచారం. వారి స్థానంలో తనకు సంబంధించిన వ్యక్తులను రుక్మిణి ఏర్పాటుచేసుకున్నారని తెలుస్తోంది. పవన్ను కలవాలంటే జనసేనలో ఎంత పెద్ద పాలెగాడైనా రుక్మిణిని దాటుకుని మాత్రమే వెళ్లాలట. ఎంతటివాడైనా డోంట్ కేర్ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పవన్ వద్దకు ఎంట్రీ దొరుకుందట. లేదంటే జనసేన కార్యాలయం గేటు కూడా తాకలేరట. ఇదే విషయాన్ని జనసేనకు రాజీనామ చేసిన పసుపులేటి పద్మావతి తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు పార్టీలో ఎంతపెద్ద తోపు నాయకుడు అయినా పవన్ను కలవాలంటే రుక్మిణి... రుక్మిణి.. అంటూ ప్రదక్షణలు చేసుకోవాల్సిందేనట. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను ఎందుకంటే: రేణు దేశాయ్) అలా జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ దేవుడైతే.. భక్తులకు , ఆయనకు మధ్య అనుసంధానకర్తగా రుక్మిణి అని జనసేన నాయకులు సరదాగా చెబుతున్న మాట. ఆమె అనుమతి లేకుండా పార్టీలో ఏ ఒక్క చిన్న పని కూడా జరగదట. రుక్మిణి స్పీడ్ ముందు నాదెండ్ల మనోహర్ పరిస్థితి ఎలా ఉందో అంటూ ఆ పార్టీలో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి -
జనసేన కిందే టీడీపీ...నాగబాబు కీలక వ్యాఖ్యలు..
-
మాకు సీఎం కావాలన్న ఆలోచనలేదు
సాక్షి, తిరుపతి : తమకు సీఎం కావాలన్న ఆలోచనలేదని.. టీడీపీకి, చంద్రబాబుకు తాము మద్దతుగా మాత్రమే ఉన్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు చెప్పారు. టీడీపీతో పొత్తుపట్ల 95 శాతం పార్టీ శ్రేణులు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. వ్యతిరేకంగా ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోవడంలేదని ఆయన స్పష్టంచేశారు. తిరుపతి సమీపంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి మద్దతుగా కలిసి పోరాడాలని నిర్ణయించామని ప్రకటించారు. అయితే, కాపు నేతలు టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎవరు సీఎం అనేది కాలమే నిర్ణయిస్తుందని నాగబాబు చెప్పారు. ఇక పొత్తుపై బీజేపీ నుంచి కూడా త్వరలోనే నిర్ణయం వస్తుందని నాగబాబు ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ప్యాకేజీ అంటే చెప్పు తీసుకుని కొడతామని వ్యాఖ్యానించారు. త్వరలోనే రాయలసీమలో పవన్ వారాహి యాత్ర ఉంటుందన్నారు. మేం అలా అనలేదు.. జనసైనికులు ఎప్పుడూ ఎవరిదో ఒకరి జెండాను మోయాల్సిందేనా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. మీరు సాక్షి వారా? ఈరోజు సాక్షిలో వచ్చిన వార్త గురించి చర్చించుకున్నాం. మేం అలా అనలేదు.. అని అంటూ.. సాక్షికి సమాధానం చెప్పడం కూడా వృథా అని వ్యాఖ్యానించారు. కేసులకు భయపడబోమని, వాటిని ఎదుర్కొంటామని.. తమకూ మంచి లీగల్ టీం ఉందన్నారు. టీడీపీతో పొత్తుకు ఒప్పుకోం.. అంతకుముందు జరిగిన కార్యకర్తల సమావేశంలో.. టీడీపీతో పొత్తుకు ఒప్పుకునేది లేదని, వారితో కలిసి వెళ్లే ప్రసక్తేలేదని జనసేన శ్రేణులు నాగబాబు సమక్షంలో తే ల్చిచెప్పారు. లేదంటే పవన్ని సీఎం అభ్యర్థి గా టీడీపీ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. జనసేన శ్రేణులను టీడీపీ వాడుకుని వదిలేసే రకమని సభలో కొందరు బిగ్గరగా అరిచినట్లు తెలిసింది. అయితే, సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు దీనిపై స్పందించకుండా మౌనం వహించినట్లు సమాచారం. దీంతో చేసేదిలేక మరోసారి క్షేత్రస్థాయిలో చర్చిద్దామని, సంయమనం పాటించాలని ప్రాథేయపడినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. -
జనసేన కిందే టీడీపీ పని చేయాలి: నాగబాబు
సాక్షి, తిరుపతి: సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. టీడీపీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన కిందనే టీడీపీ పని చేస్తుందంటూ కార్యకర్తలను ఉద్దేశించి నాగబాబు పేర్కొన్నారు. చిత్తూరు పర్యటనలో ఉన్న జనసేన నేత నాగబాబు.. అక్కడి కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అయితే ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు పొత్తు ప్రస్తావన తీసుకొచ్చారు. టీడీపీ నేతలు గతంలో తమని టార్చర్ పెట్టారని నాగబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. గతాన్ని మరిచిపోయి ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు నాగబాబు సర్దిచెప్పే యత్నం చేశారు. ఈ క్రమంలో .. టీడీపీ మన కిందనే పని చేయాలి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తు ఉన్నా.. టీడీపీ నాయకులు మన కిందనే పని చేయాలి. టీడీపీతో కలిసి పని చేసినా జనసేన అజెండానే మీరు తీసుకెళ్లాలి అని జనసేన కార్యకర్తలకు సూచించారాయన. అంతేకాదు.. అధికారంలోకి వస్తే పవనే సీఎం అవుతారంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఇదిలా ఉంటే.. టీడీపీతో కలిసి జనసేన ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, రాజమండ్రి జైలులో చంద్రబాబు ములాఖత్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ రెండు పార్టీ క్యాడర్ల నుంచి అసంతృప్తి రాగాలు బయటపడుతున్నాయి. -
నాగబాబు, నాదెండ్ల మనోహర్ పరిస్థితి ఎలా ఉందంటే..
-
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న 30 ఇయర్స్ పృథ్వీ కుమార్తె
క్రాంతి హీరోగా, శ్రీలు హీరోయిన్గా పరిచయమవుతున్న చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. నటుడు థర్టీ ఇయర్స్ పృధ్వీ ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టారు. గుంటక శ్రీనివాస్ రెడ్డి, కె.కృష్ణారెడ్డి, పద్మ రేఖ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను నటుడు, నిర్మాత నాగబాబు విడుదల చేశారు. ‘‘కొత్త రంగుల ప్రపంచం’ వంటి మంచి కథలో నటించే అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు క్రాంతి. ‘‘మా నాన్న(పృధ్వీ) దర్శకత్వం వహించిన తొలి సినిమాతో నేను హీరోయిన్గా పరిచయమవడం సంతోషంగా ఉంది’’అన్నారు శ్రీలు. ఈ కార్యక్రమంలో నటుడు సుమన్, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
మా ఇంట్లోనే హీరోలు.. కానీ ఎవరూ నాకు ఛాన్సివ్వలేదు: నాగబాబు
మా ఇంట్లో చాలామంది హీరోలున్నారు. కానీ ఎవరూ ఏనాడూ పిలిచి క్యారెక్టర్ ఇవ్వలేదు అన్నాడు నటుడు నాగబాబు. సుస్మిత కొణిదెల మాత్రం తనకు రెండోసారి అవకాశం ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. శ్రీదేవి శోభన్బాబు ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. సంతోష్ శోభన్, గౌరి.జి.కిషన్ జంటగా నటించిన చిత్రం శ్రీదేవి శోభన్బాబు. నూతన దర్శకుడు ప్రశాంత్కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని విష్ణుప్రసాద్తో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించారు. ఈ నెల 18న సినిమా రిలీజ్ కానున్న క్రమంలో హైదరాబాద్లో బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. 'మా ఇంట్లో చాలామంది హీరోలున్నారు కానీ నాకెవరూ ఛాన్సివ్వలేదు. మా హనీ(సుస్మిత) మాత్రం నాకు రెండోసారి అవకాశమిచ్చింది. హనీ గురించి ఓ మాట చెప్పాలి. తను తల్చుకుంటే తనకు సపోర్ట్గా ఏ హీరో అయినా ముందుకు వచ్చేస్తాడు. కానీ ఎవరి సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ నిర్మాతగా అన్ని కష్టాలు పడుతూ మీ ముందుకు ఈ సినిమా తీసుకొచ్చింది. తను త్వరలోనే మెగా ప్రొడ్యూసర్ అవుతుంది. ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు తెలియకుండానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ట్రైలర్ చూస్తుంటే ప్రశాంత్ ఏం చెప్పాడో అదే తీశాడనిపించింది. డైరెక్టర్గా అతడికి మంచి భవిష్యత్తు ఉంది. సినీ ఇండస్ట్రీలో మెన్ డామినేషన్ ఉంటే టీవీ ఇండస్ట్రీలో వుమెన్ డామినేషన్ ఉంది. ఆడపిల్లల్ని ఇండస్ట్రీకి పంపించకూడదు అన్న భ్రమలు ఇంకా ఉన్నాయి. అవకాశం వస్తే ఆడపిల్లలు మగవాళ్ల కన్నా బెస్ట్గా నటిస్తారు, బెస్ట్గా డైరెక్ట్ చేస్తారు, నిర్మిస్తారు' అని చెప్పుకొచ్చాడు నాగబాబు. చదవండి: అత్యంత చవక రేటుకు పఠాన్ టికెట్స్ -
కిరాక్ ఆర్పీ చేపల పులుసు బ్రాంచ్ ప్రారంభించిన నాగబాబు.. ఫోటోలు వైరల్
-
నాగబాబు ట్వీట్కు అంబటి కౌంటర్..
తాడేపల్లి: సినీ నటుడు నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. నువ్వు, మీ తమ్ముడు పవన్ కల్యాణ్ అన్నట్లు తాను సంబరాల రాంబాబునేనని, కానీ ముఖానికి రంగు వేయను, ప్యాకేజీ కోసం డాన్స్ చేయను అంటూ ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని భోగి వేడుకల్లో భాగంగా స్థానికులను ఉత్తేజ పరిచేందుకు అంబటి డాన్స్ చేశారు. ఈ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే నాగబాబు దీనిపై వ్యంగ్యంగా స్పందించగా.. అంబటి తనదైన రీతిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు, మీతమ్ముడు అన్నట్టు "సంబరాల రాంబాబు"నే ! కానీ...ముఖానికి రంగు వేయను ప్యాకేజి కోసం డాన్స్ చేయను ! @NagaBabuOffl@PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) January 16, 2023 -
Ram Gopal Varma: నాగబాబుపై ఆర్జీవీ సెటైర్లు.. వీడియో రిలీజ్
సాక్షి, హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన నాయకుల మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. పవన్ కల్యాణ్పై కామెంట్లు చేశారంటూ తనపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్న నేపథ్యంలో ఆర్జీవీ మరోసారి కౌంటర్ ఎటాక్గా ముందుకొచ్చారు. ‘కొణిదెల నాగబాబు.. ఆయన తమ్ముడికి లేక అన్నయ్యకు ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు నాకు కాదు. నేను జనసేన మీదకాని పవన్ కల్యాణ్ మీద చేసిన ట్వీట్స్ పవన్ అభిమానిగా చేశాను. అది అర్ధం అవ్వకపోకడం నా దురదృష్టం.. అంతకన్నా ఎక్కువ పవన్ దురదృష్టం. కేవలం తన అన్నయ్య కాబట్టి ఇలాంటి సలహాదారులను మాత్రమే పెట్టుకుంటే దాని తరువాత పవన్ కల్యాణ్ అవుట్ కమ్ ఏమిటో! జనమే చెపుతారు’ అంటూ రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. ఈమేరకు ట్విటర్లో వీడియో రిలీజ్ చేశారు. Hello @Pawankalyan gaaru , Konchem mee bhaijaaan gaarini choosukondi pic.twitter.com/8ih8kgxlDC — Ram Gopal Varma (@RGVzoomin) January 15, 2023 డైమండ్ రాణి అనే బిరుదుతో ఒకావిడని కించపరిచిన వ్యక్తికి తనుకూడా ఒక ఇస్పెట్ రాజా అని తెలుసుకోవాల్సిన కనీస జ్ఞానం ఉండాలి అని ఒక పి ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాను — Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2023 -
నాగబాబుకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన ఆర్జీవీ
-
నాగబాబుకు మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అమరావతి: సినీ నటుడు నాగబాబుకు మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. ఏదైనా విమర్శ చేసేటపుడు విషయం ఉంటే చేయాలే తప్ప నోటి కి ఎంత వస్తే అంత ఫేక్ వార్తలతో దుష్ప్రచారం చేయడం సబబుకాదని హితవు పలికారు. టూరిజంలో ఆంధ్రప్రదేశ్.. దేశంలో మూడో స్థానంలో ఉందని.. నాగబాబు అదికూడా తెలియకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి ఏపీకి ఏం చేశారని రాజకీయంగా తాను ఏనాడు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు, ఆయన దూరంగా ఉన్నారు కాబట్టి ఆ విషయం మాట్లాడనని తెలిపారు. వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని.. పార్టీ పరంగా, సిద్ధాంత పరంగానే తన వ్యాఖ్యలుంటాయని స్పష్టం చేశారు. మహిళలను గౌరవించడం ఎలాగో ముందు నాగబాబు తెలుసుకోవాలని మంత్రి రోజా చురకలంటించారు. చదవండి: (బాలయ్య బాబు కాదు.. బాలయ్య తాత.. 60 ఏళ్ల దాటాయి ఎవరొస్తారు చూడటానికి..?) -
నాగబాబు కు మంత్రి రోజా కౌంటర్
-
జనసేన, నాగబాబుపై అంబటి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, సత్తెనపల్లి: టీడీపీ, జనసేనపై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. సైకో బ్యాచ్, సైకిల్ బ్యాచ్ సత్తెనపల్లిని నాశనం చేయాలనుకుంటున్నారు అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి అంబటి రాంబాబు గురువారం జరిగిన వాలంటీర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. కిరాయి రౌడీల్లాగా, కిరాయి పాలిటిక్స్ చేసే పార్టీ జనసేన పార్టీ. గతంలో తాడేపల్లి ఆఫీసులో పవన్ కల్యాణ్.. కాపులను కించపరుస్తూ మాట్లాడాడు. నాకు, కాపులకు మధ్య తగాదాలు పెట్టాలని దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు. అలా సినిమా డైలాగ్స్ కొడుతూ, ఓవర్గా మాట్లాడే వ్యక్తి ఏపీ రాజకీయాల్లో పనికొస్తాడా?. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నాగాబాబు కూడా నన్ను ఏమీ చేయలేరు. నన్ను గెలిపించిన సత్తెనపల్లి ప్రజలకు నేను రుణపడి ఉంటాను అని అన్నారు. -
గరికపాటిపై ఆర్జీవీ ఆగ్రహం.. వదిలే ప్రసక్తే లేదంటూ..!
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, మెగాస్టార్ల మధ్య జరిగిన వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. వివాదాస్పద కామెంట్లు చేసే దర్శకుడు రామ్గోపాల్ వర్మ తాజాగా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. దీనిపై నాగబాబు చేసిన ట్వీట్ను ప్రస్తావిస్తూ ఆర్జీవీ గరికపాటిని విమర్శించారు. ‘మిమ్మల్ని మెగా ఫ్యామిలీ క్షమించినా.. అభిమానులైన మేం వదిలే ప్రసక్తే లేదంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీ ఆ ట్వీట్లో తనదైన శైలిలో గరికపాటిపై విరుచుకుపడ్డారు. వివాదం ఎక్కడ మొదలైందంటే! ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ‘చిరంజీవి ఫొటో సెషన్ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా’ అని గరికపాటి అసహనం వ్యక్తం చేయడంతో ఆ వ్యాఖ్యలు వివాదానానికి దారి తీశాయి. అయితే ఆ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి బాగానే మాట్లాడుకున్నా.. ఆ తరువాత నరసింహారావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్లో ఆయన పేరు ప్రస్తావించకుండా ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’నని స్పందించిన సంగతి తెలిసిందే. సర్ @NagaBabuOffl గారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ని ఎందుకు ఇచ్చారు సర్ .. సర్ సర్ సర్ @KChiruTweets ???? — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 సర్ @NagaBabuOffi గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు 🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా @KChiruTweets నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి 😡😡😡😌😌😌 — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ @KChiruTweets ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 -
ఆగని గరికపాటి వ్యాఖ్యల దుమారం..‘ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్లో బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ‘చిరంజీవి ఫొటో సెషన్ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా’అని అసహనం వ్యక్తం చేశారనే అంశం వివాదానానికి దారి తీసింది. అయితే ఆ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి బాగానే మాట్లాడుకున్నా... ఆ తరువాత నరసింహారావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్లో ఆయన పేరు ప్రస్తావించకుండా ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’నని స్పందించారు. నాగబాబు ట్వీట్పై బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ కౌంటర్ ఇచ్చారు. ‘నిత్యం తన ప్రవచనాలతో సమాజాన్ని ఎంతో సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాది, ఆధ్యాత్మిక వేత్తను.. నటనావ్యాపారం తప్ప సమాజహితాన్ని మరిచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందాడనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే’ అని ఘాటుగా స్పందించారు. చదవండి: 'మాకు ఆ ఉద్దేశం లేదు.. ఆయనను ఎవరూ తప్పుగా మాట్లాడొద్దన్న నాగబాబు' ఆగని ట్రోల్స్ మరోవైపు చిరంజీవి అభిమానులు, నటులు గరికపాటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలంటూ చిరంజీవి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ గరికపాటికి ఫోన్ చేసి డిమాండ్ చేశారు. చిరంజీవి గురించి అలా అనాల్సింది కాదంటూ గరికపాటిపై సినీనటుడు ఉత్తేజ్ మండిపడ్డారు. ఇలా సోషల్ మీడియాలో పోస్టుల పరంపరం కొనసాగింది. చివరకు నాగబాబు మళ్లీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘గరికపాటి వారు ఏదో మూడ్లో అలా అని ఉంటారు. ఆయనలాంటి పండితుడు అలా అని ఉండికూడదని అన్నామే తప్ప, ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. మెగాభిమానులు ఆయ నని అర్థం చేసుకోవాలే గానీ, ఆయన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని రెక్వెస్ట్’అని పేర్కొన్నారు. -
'మాకు ఆ ఉద్దేశం లేదు.. ఆయనను ఎవరూ తప్పుగా మాట్లాడొద్దన్న నాగబాబు'
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై చేసిన వ్యాఖ్యల పట్ల మెగాబ్రదర్ నాగబాబు వివరణ ఇచ్చారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన అలయ్-బలయ్ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటనపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. తాజాగా ఇవాళ వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశారు నాగబాబు. ట్విటర్లో ఆయన రాస్తూ.. 'గరికపాటి వారు ఏదో మూడ్లో ఆలా అని వుంటారు. ఆయన లాంటి పండితుడు అలా అని ఉండకూడదని ఆయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప.. ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగా అభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని.. ఆయనను ఎవరు తప్పుగా మాట్లాడవద్దని నా రెక్వెస్ట్.' అంటూ పోస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే: దసరా సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో అభిమానులు చిరంజీవితో ఫోటో సెషన్ నిర్వహించారు. మెగాస్టార్తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అనివుంటారు ,అయన లాంటి పండితుడు ఆలా అనివుండకూడదని అయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప ,ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు.ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా request. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 7, 2022 ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే .. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022 -
కోహినూర్ మెరుపు తగ్గొచ్చు కానీ వ్యాల్యూ తగ్గదు.. నాగబాబు ట్వీట్ వైరల్
ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి హిట్ కొట్టాడు. తమ అభిమాన హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించాలని చాలా కాలంగా మెగాస్టార్ అభిమానులు కోరుకుంటున్నారు. చిరు టైటిల్ పాత్రలో నటించిన సైరా, ఆచార్య చిత్రాలు ఆశించిన స్థాయిల్లో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో మెగా అభిమానులు కాస్త నిరాశ చెందారు. ముఖ్యంగా ఆచార్య ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇలాంటి తరుణంలో ‘గాడ్ ఫాదర్’తో భారీ హిట్ ఇచ్చాడు ‘అన్నయ్య’. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం.. తొలిరోజే రూ. 38 కోట్లు కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లో రూ.69 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మెగాస్టార్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. చాలా కాలం తర్వాత చిరంజీవి భారీ విజయం సాధించడంతో మెగా అభిమానులతో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్విటర్ వేదికగా ‘గాడ్ ఫాదర్’ విజయంపై స్పందిస్తూ చింజీవిని కొహినూర్ డైమాండ్తో పోల్చాడు. (చదవండి: బాక్సాఫీస్పై ‘గాడ్ ఫాదర్’ దండయాత్ర..రెండో రోజూ భారీ కలెక్షన్స్) ‘కోహినూర్ డైమండ్ కూడా కొన్నిసార్లు పాలీష్ తగ్గితే మెరుపు తగ్గొచ్చు కానీ దాని వాల్యూ ఎప్పుడు తగ్గదు .సరైన పాలీష్ (గాడ్ ఫాదర్ )పడితే కోహినూర్ డైమండ్ మిరుమిట్లు కొలిపే వెలుగు ని తట్టుకోవటం కష్టం’అంటూ నాగబాబు ట్వీట్ చేశాడు. మలయాళ మూవీ ’లూసీఫర్’కు తెలుగు రీమేకే ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. కోహినూర్ డైమండ్ కూడా కొన్నిసార్లు polish తగ్గితే మెరుపు తగ్గొచ్చు కానీ దాని వేల్యూ ఎప్పుడు తగ్గదు .సరైన polish (గాడ్ ఫాదర్ )పడితే కోహినూర్ డైమండ్ మిరుమిట్లు కొలిపే వెలుగు ని తట్టుకోవటం కష్టం. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022 -
గరికపాటి వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు.. ఏమన్నారంటే?
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై వ్యాఖ్యలపై నాగబాబు వ్యంగ్యంగా స్పందించారు. 'ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే' అంటూ ఆయన ట్వీట్ చేశారు. దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ వేడుకలో జరిగిన సంఘటనపై ఆయన ఈ విధంగా కౌంటరిచ్చినట్లు తెలుస్తోంది. (చదవండి: గరికపాటికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి) అసలేం జరిగిందంటే: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన అలయ్ బలయ్ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో అభిమానులు చిరంజీవితో ఫోటో సెషన్ నిర్వహించారు. మెగాస్టార్తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే .. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022 -
మెగా బ్రదర్ నాగబాబు చేతికి గాయం.. ఆయనకు ఏమైంది?
మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల చేతికి గాయమైంది. నాగబాబు తన ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసిన తాజా వీడియోలో ఆయన చేతికి కట్టు వేసుకుని కనిపించారు. దీంతో ఆయన చేయి ఫ్యాక్షర్ అయినట్లు తెలుస్తోంది. ఈ వీడియోకు ‘ముల్లును ముల్లుతోనే తియాలంటే ఇదేనేమో.. అయితే ఇది ఎవరూ ఇంట్లో ట్రై చేయకండి. నిపుణురాలు డా.నీహారిక పర్యవేక్షణలో జరిగింది’ అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు ఆయన. ఈ వీడియోలో తండ్రితో పక్కనే కూర్చుని ఉన్న నిహారిక సైలెంట్గా అల్లరి చేస్తోంది. తండ్రి గడ్డాన్ని నిమురుతూ ‘నొప్పిగా ఉందా నాన్న.. ఆ నొప్పి నేను తీసేయనా’ అంటుండగా.. పెద్ద పెద్ద డాకర్ట్స్ వల్లే కాలేదు.. నీ వల్ల ఏమౌతుంది అంటాడు నాగాబాబు. చదవండి: కొడుకు చంద్రహాస్పై ట్రోల్స్.. నటుడు ప్రభాకర్ షాకింగ్ రియాక్షన్ ‘నేను తీసేస్తా అంటున్నా కదా.. ఆ నొప్పి తీసేస్తా’ అంటూ నిహారిక తండ్రి చేయి పట్టుకుని గట్టిగా కొరికింది. ఆ నొప్పి భరించలేక నాగబాబు ఒక్కసారిగా గట్టిగా ఆరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ తండ్రి కూతుళ్ల బాండింగ్కు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే నాగబాబు చేతికి ఏమైంది? ఆ గాయం ఎలా అయ్యిందనేది క్లారిటీ లేదు. దీంతో ఆయనకు ఏమైందా? అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హీరోయిన్ గురించి ఏమన్నదంటే.. View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) -
మెగాస్టార్ బర్త్డే.. చిరంజీవి తమ్ముడు నాగబాబు పోస్టర్ రిలీజ్
సూపర్స్టార్ కృష్ణ, విజయనిర్మల ఫ్యామిలీ నుంచి శరణ్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సాక్షి. ఈ సినిమాలో హీరో లుక్ ఇది వరకే రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. శివ కేశన కుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై మునగాల సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. సాక్షి టైటిల్ లోగోను, అలాగే విలన్గా నటిస్తున్న నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బెక్కెం వేణు గోపాల్, దాము సంయుక్తంగా విడుదల చేశారు. అనంతరం నిర్మాత మునగాల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మా సాక్షి సినిమాలో విలన్గా నటించిన నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను రిలీజ్ చేసిన నిర్మాతలు దిల్ రాజు గారికి, బెక్కెం వేణు గోపాల్ గారికి, దాము గారికి చాలా థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో హీరోయిన్ జాహ్నవి కపూర్. అజయ్, ఇంద్రజ, ఆమని కీలకపాత్రల్లో నటించారు. భీమ్స్ గారి సంగీతం బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’ అన్నారు. చదవండి: సాలెపురుగును చూసి హడలెత్తిన హీరో, ఇల్లు అమ్మేస్తానంటూ కామెంట్ Chiranjeevi- Surekha: చూపులు కలవకుండానే పెళ్లి చేసుకున్న చిరంజీవి -
నాగబాబు ప్రొడక్షన్స్ వారి అట్టర్ ఫ్లాప్ షో
సాక్షి, తూర్పు గోదావరి: సినీ నిర్మాతగానే కాదు.. రాజకీయాల్లోనూ కొణిదెల నాగబాబు చేదు అనుభవాల్నే చవిచూస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ హోదాలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించబోయి.. చేసిన ఓ ఫ్లాప్ షో చివరకు ఆయన్ను నవ్వులపాలు చేసింది. రాజమహేంద్రవరంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ ఆయన శనివారం ఉదయం హడావుడి చేశారు. గోతులు పడిన ఓ రోడ్డు వద్ద ‘గుడ్మార్నింగ్ సీఎం సార్’ అంటూ ఫొటోకు పోజు ఇచ్చారు. అయితే.. వాస్తవానికి ఆ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది కాదు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రైల్వే శాఖ పరిధిలోని బొగ్గు డంపింగ్ యార్డుకు వెళ్లే దారి. రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎలాగైనా అభాసుపాలు చేసేందుకు చేసిన ప్రయత్నం చివరకు ఆయనకే బెడిసి కొట్టింది. సోషల్ మీడియాలో నాగబాబు ఫ్లాప్షో వైరల్ అవుతోంది. -
జనసేనలో లుకలుకలు.. నేతల డిష్యుం డిష్యుం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన పార్టీలో నేతల మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన సమావేశం సందర్భంగా పార్టీ నేతల మధ్య విభేదాలు పొడచూపినట్టు సమాచారం. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఉదయం విశాఖ అర్బన్, మధ్యాహ్నం విశాఖ రూరల్ నియోజకవర్గాల సమావేశాలను నాగబాబు నిర్వహించారు. కాగా, మధ్యాహ్నం సమావేశం ముగిసిన తర్వాత జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్పై ఆ పార్టీ యలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి సుందరపు విజయ్కుమార్ ఏకంగా చేయి చేసుకున్నట్టు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. యలమంచిలిలో పార్టీ ఇన్చార్జి అయిన తనను కాదని.. ఏడాదిక్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కట్టెంపుడు సతీష్ను ప్రోత్సహిస్తున్నారని మండిపడుతూ శివశంకర్తో సుందరపు విజయ్కుమార్ మొదట వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో విజయ్కుమార్ ఏకంగా శివశంకర్పై చేయిచేసుకోవడమే కాకుండా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉదయం జరిగిన అర్బన్ సమావేశంలోనూ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణపై జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వెంకటలక్ష్మి, ఆమె భర్త గోపీకృష్ణ మండిపడినట్టు తెలుస్తోంది. పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మొత్తంగా సమావేశం ముగించుకుని నాగబాబు వెళ్లిన వెంటనే పార్టీ కార్యాలయం సాక్షిగా జరిగిన ఈ ఘటనలు జనసేన పార్టీలో నేతల మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టాయి. ఇది కూడా చదవండి: చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు -
చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,విజయనగరం: తన సోదరుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని జనసేన నేత కొణిదెల నాగబాబు తెలిపారు. విజయనగరం జిల్లాలో పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వచ్చిన ఆయన ఓ హోటల్లో గురువారం మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో జనసేనకు చిరంజీవి మద్దతుగా ఉంటారే తప్ప ఎక్కడా పోటీ చేయరన్నారు. పొత్తులపై అన్నీ ఆలోచించి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారన్నారు. జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి తెలుసుకునేందుకు ఇక్కడకు వచ్చినట్టు వివరించారు. చదవండి: Ambati Rambabu: దేవినేని ఉమకు అంతా తెలిస్తే.. అప్పుడేం చేశారు: మంత్రి అంబటి -
నా కూతురేంటో నాకు తెలుసు, అలాంటివి పట్టించుకోను: నిహారిక తల్లి
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. పబ్ ఇన్సిడెంట్ తర్వాత టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన నిహారిక ఇటీవలె ఇన్స్టాగ్రామ్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సొంత బ్యానర్లో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా మారిన నిహారిక తాజాగా తల్లి పద్మజతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్బంగా ఇటీవలి కాలంలో నిహారికపై వచ్చిన వార్తలపై నాగబాబు భార్య, నిహారిక తల్లి పద్మజ స్పందించింది. 'మొదట్లో ఇలాంటి వార్తలు రావడం ఇబ్బందిగా అనిపించేది కానీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పదు. తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిహారిక ఎక్కడికైనా వెళ్లినా నాకేం అనిపించదు. నా కూతురేంటో నాకు తెలుసు. నాకు మా బావగారున్నారు.ఆయన ఉన్నంతవరకు మాకేం పర్వాలేదు' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. -
నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందన..
బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ బయటపడటం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు మాత్రమే ఉన్నారు. చదవండి: డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు: నటి హేమ ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో నిహారిక ఉండటం, పోలీసుస్టేషన్కు తరలించిన వ్యవహారంపై నాగబాబు స్పందించారు. 'నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారు. అనుమానాలకు తావివ్వకుండా నేను స్పందిస్తున్నా. నిహారికపై అనవసర ప్రచారాలు చేయవద్దు. ' అని నాగబాబు తెలిపారు. కాగా ఈ పబ్కు హాజరైన వారిలో ఐదుగురు విదేశీయులు కూడా ఉన్నారని సమాచారం. పబ్లో పాల్గొన్న 142 మంది వివరాలను పోలీసులు వెల్లడించారు. వీరిలో 99 మంది యువకులు, 33 మంది యువతులు పబ్లో పాల్గొన్నారు. 142 మంది అడ్రస్లు, ఇంటి నెంబర్లు తీసుకుని పోలీసులు నోటీసులు జారీ చేశారు. చదవండి: డ్రగ్స్ కేసులో నాగబాబు కుమార్తెకు నోటీసులు -
నిహారిక అకౌంట్ను నేనే డియాక్టివేట్ చేశాను : నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ విషయంపై అయినా తనదైన స్టైల్లో సమాధానమిస్తుంటాయరన. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్తో చిట్చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే ఓ యూజర్ నిహారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ఎందుకు డిలీట్ చేసింది?ఆ రూమర్స్పై రెస్పాండ్ అవ్వండి అని అడిగారు. దీనికి రిప్లై ఇచ్చిన నాగబాబు.. 'నిజానికి నేనే కోడింగ్ నేర్చుకొని అకౌంట్ హ్యక్ చేసి అకౌంట్ డియాక్టివేట్ చేశాను. మళ్లీ డీకోడింగ్ నేర్చుకొని అకౌంట్ రీ యాక్టివ్ చేస్తాను' అంటూ ఫన్నీగా బదులిచ్చారు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిహారిక కొన్ని రోజుల క్రితం తన ఇన్స్టా అకౌంట్ని డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. కానీ నిహారిక భర్త చైతన్య తన ఇన్స్టా నుంచి ఇద్దరి ఫోటోలు షేర్ చేస్తూ ఆ రూమర్స్కి చెక్ పెట్టారు. -
వరుణ్ తేజ్ పెళ్లిపై స్పందించిన నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు సోషల్మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా నెట్టింట అభిమానులతో షేర్ చేసుకుంటాడీ నటుడు. తాజాగా ఆయన ఫ్యాన్స్తో చిట్చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా నాగబాబుకు 'వరుణ్తేజ్ పెళ్లెప్పుడు?' అన్న ప్రశ్న ఎదురైంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ ప్రశ్న విని, దానికి సమాధానాలు చెప్పి విసుగెత్తిపోయిన ఈయన ఈ క్వశ్చన్కు వరుణ్తేజే ఆన్సరిస్తాడని చెప్పి తెలివిగా తప్పించుకున్నాడు. కాగా గతంలోనూ వరుణ్ అన్న మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు బాస్ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా మంచి సంబంధాలు ఉంటే చూడమని బదులిచ్చాడు నాగబాబు. మరొకసారైతే వరుణ్ ప్రేమ వివాహం చేసుకున్నా తనకెలాంటి అభ్యంతరం లేదని పరోక్షంగా బదులిచ్చాడు. ఇదిలా ఉంటే వరుణ్ ఓ హీరోయిన్ను పెళ్లాడబోతుందంటూ ప్రచారం జరగ్గా అది వట్టి పుకారుగానే తేలిపోయింది. హైదరాబాద్కు చెందిన ఓ పారిశ్రామికవేత్త కూతురితో ఏడడుగులు వేయబోతున్నాడంటూ కూడా కథనాలు రాగా అది కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే అతడు నటించిన ఎఫ్3 మే 27న విడుదలవుతుండగా గని ఏప్రిల్ 8న రిలీజ్ అవుతోంది. చదవండి: రోడ్డు ప్రమాదంలో బిగ్బాస్ ఫణికి తీవ్ర గాయాలు, 'బతుకు మీద ఆశ లేకపోవడం కూడా చావే' -
నువ్వు లేకపోయుంటే ఎంతో కష్టమయ్యేది డియర్: నాగబాబు
Naga Babu Wife Padmaja Birthday: మెగా బ్రదర్ నాగబాబు.. సినిమాల్లో నటిస్తూ, నిర్మాతగా రాణిస్తూ, పాపులర్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్నాడు. అటు బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకులకూ చేరువయ్యాడు. కుటుంబమే తన మొదటి ప్రపంచంగా భావిస్తాడు నాగబాబు. నేడు ఆయన సతీమణి పద్మజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెతో కేక్ కట్ చేయించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు నాగబాబు. 'ఈ ప్రపంచం ఎంతో కఠినమైన ప్రదేశం. నువ్వు లేకపోయుంటే ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడం మరింత కష్టమయ్యుండేది. ఎల్లప్పుడూ నాతో ఉంటూ నీ ప్రేమతో, నీ ముందుచూపుతో అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేసినందుకు కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్డే డియర్ పద్మ' అని శుభాకాంక్షలు తెలిపాడు. వరుణ్ తేజ్, నిహారిక సైతం తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
బిగ్బాస్ టైటిల్ గెలవలేదు కానీ.. పింకీపై నాగబాబు ప్రశంసలు
బిగ్బాస్లోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తనదైన ఆటతో 13 వారాల పాటు హౌస్లో కొనసాగింది ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ. గతంలో ఒకటి రెండు షోలలో పాల్గొన్నప్పటికీ.. పింకీకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ షో కారణంగా ప్రియాంక లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ట్రాన్స్ జెండర్గా హౌస్లోకి అడుగుపెట్టిన ప్రియాంక.. గత సీజన్లోని తమన్నా లాగే కొద్ది రోజుల్లోనే ఎలిమినేట్ అయిపోతుందని అంతా భావించారు. కానీ తన అందచందాలతో అందరిని ఆకట్టుకోవడమే కాకుండా.. అద్భుతమైన ఆటతీరుతో 13 వారాల పాటు హౌస్లో కొనసాగింది. ఒకానొక దశలో టాప్ 5లో ప్రియాంక కచ్చితంగా ఉంటుందనేట్లుగా తన గేమ్ని కొనసాగించింది. అయితే అనూహ్య పరిణామాల వల్ల గత ఆదివారం ప్రియాంక ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా పింకీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం పింకీ.. బిగ్బాస్ వల్ల వచ్చిన క్రేజ్ని ఆస్వాదిస్తుంది. ఈ క్రమంలో తాను హౌస్లో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచిన మెగాబ్రదర్ నాగబాబును కలిసి, ఆశీర్వాదం తీసుకుంది. ఈ విషయాన్ని నాగబాబు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. పింకీపై ప్రశంసల వర్షం కురించాడు. ‘ఎన్నో అసమానతలను ధిక్కరించి, అవమానాలను, అవరోధాలను ఎదుర్కొని ఈ రోజు గొప్ప స్థానంలో నిలిచావు. నువ్వు బిగ్బాస్ టైటిల్ గెలవకపోవచ్చు. కానీ నిత్యం సమాజంలో నిత్యం నీలా అవమానాలు, హేళన ఎదుర్కొనే వారికి నువ్వు ఒక స్ఫూర్తిగా నిలిచావు. జీవితంలో గెలవచ్చన్న ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించావు. నా ప్రేమాభిమానాలు, మద్దతు నీకు ఎప్పుడూ ఉంటాయి’ అని నాగబాబు ఇన్స్టాలో ఓ సుధీర్ఘ పోస్ట్ పెట్టాడు. View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) -
తండ్రి బర్త్డే, బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతోన్న మెగా డాటర్ నిహారిక!
మెగా డాటర్ నిహారిక రేపు ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పబోతోంది. రేపు తన తండ్రి నాగబాబు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ రానుందని తాజాగా జీ5 సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు జీ5 ట్వీట్ చేస్తూ.. మరో అద్భుతమైన అనుభూతి కోసం రెడీగా ఉండండి అని తెలిపింది. ‘ఓసీఎఫ్ఎస్’ అంటే ఏంటో గెస్ చేయగలరా? అని అడిగింది. చదవండి: సమంత పోస్ట్పై వెంకటేశ్ కూతురు అశ్రిత ఆసక్తికర కామెంట్ జీ5 చేసిన ఈ ప్రకటనను నిహారిక రీట్వీట్ చేస్తూ.. తాను కూడా ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నానని పేర్కొంది. ‘నాన్న పుట్టినరోజు సందర్భంగా ‘ఓసీఎఫ్ఎస్’ అంటే ఏమిటో రేపు వెల్లడిస్తాను’ అని చెప్పింది. తెలిపారు. కాగా గత ఏడాది చైతన్యతో నిహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు. వివాహానంతరం ఆమె తొలిసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. చదవండి: అల్లు అర్జున్పై బాలీవుడ్ డైరెక్టర్ల ప్రశంసలు, ఎందుకంటే.. "Whats #OCFS? Guess Guess.@zee5telugu I am also super excited about this too. Revealing #OCFS tomorrow on a special day as it is Nanna’s birthday". All the abbreviation will be shared on stories all day. https://t.co/2R4DamY6N2 — Niharika Konidela (@IamNiharikaK) October 28, 2021 -
నా జీవితంలో ఈ రోజు మరిచిపోలేను: చిరంజీవి
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న స్థానం, స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కళామ్మతల్లి ఒడిలో 40 ఏళ్లకు పైగా నటుడిగా కొనసాగుతూ ఎన్నో మైళ్లు రాళ్లు అధిగమించారు. అయితే చిరుకు మాత్రం సెప్టంబర్ 22 చాలా ప్రత్యేకమంటున్నారు. తాజాగా దానికి సంబంధించి ఆయన తన ట్విటర్లో పోస్ట్ చేశారు. చిత్ర సీమలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయంకృషి, కష్టపడే తత్వం.. లాంటివి పునాది రాళ్లుగా మార్చుకుని టాలీవుడ్లో కొణిదల శివశంకర్ వరప్రసాద్ నుంచి అభిమానుల మెగాస్టార్ చిరంజీవిగా అవతారం ఎత్తారు.ఆయన వెండితెర బాస్. చిరు తన జీవితంలో రెండు తేదీలను ఎప్పటికీ మరిచిపోలేరు. ఒకటి ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీ. రెండోది సెప్టెంబరు 22వ తేదీ. ఎందుకుంటే చిరు తొలి చిత్రం "ప్రాణం ఖరీదు" విడుదలైంది ఆ రోజే కాబట్టి. సరిగ్గా నేటితో ఈ చిత్రం విడుదలై 43 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మధురమైన క్షణాలను మెగాస్టార్ గుర్తుచేసుకుంటూ ఓ పోస్టును షేర్ చేశారు. ఆ టీట్లో.. ఆగస్ట్ 22న నా పుట్టిన రోజైతే, సెప్టెంబర్ 22న నేను నటుడిగా పుట్టినరోజు. కళామ్మ తల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికి నన్ను నటుడిగా పరిచయంచేసి మీ ఆశీస్సులు పొందినరోజు.నేను మరిచిపోలేనిరోజు. నేను మెగాస్టార్లా ఈ రోజు మీ ముందు ఇలా ఉండడానికి ఎంతో మంది సోదర సోదరీమణులే కారణమంటూ చిరు తన ట్వీట్ లో పేర్కొన్నారు. కెరీర్ పరంగా 150కి పైగా చిత్రాలు చేసిన చిరంజీవి ప్రస్తుతం ఆచార్య, గాడ్ ఫాదర్తో నటిస్తున్నాడు. సెప్టంబర్ 22 చిరుకి ప్రత్యేకమైనది కావడంతో ఆయన తమ్ముడు నాగబాబు నెట్టింట.. ఈ రోజు ఓ స్టార్ పుట్టాడని ట్వీట్ చేస్తూ చిరుపై తనకున్న ప్రేమను ఈ రకంగా చూపించారు. 22Aug నేను పుట్టినరోజైతే 22Sept నటుడిగా నేను పుట్టినరోజు.కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు.మీ అందరికి నన్ను నటుడిగా పరిచయంచేసి మీ ఆశీస్సులు పొందినరోజు.నేను మరిచిపోలేనిరోజు. Feel humbled & grateful for the invaluable❤️of lakhs of my bro’s & sisters this day made possible🙏— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2021 చదవండి: ఇదేం స్టైల్ బై..! ‘గబ్బర్సింగ్’ బ్యూటీని ట్రోల్ చేసిన నెటిజన్లు -
బిగ్బాస్: చివరి వరకు నా పూర్తి మద్దతు ఆమెకే : నాగబాబు
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్ ఐదో సీజన్ సందడి మొదలైంది. ఊహించని ట్విస్టులు, సరికొత్త టాస్క్లతో గత సీజన్ల కంటే ఎక్కువ వినోదాన్ని అందించే ప్లాన్లో ఉన్నాడు బిగ్బాస్. ఎప్పుడూ లేనంతగా ఈ సారి ఏకంగా 19 మందిని బిగ్బాస్ హౌస్లోకి తీసుకొచ్చారు. సాధారణంగా బిగ్బాస్ ఇంట్లో, షో మొదలై వారం రోజులు గడిచాక గొడవలు మొదలైతాయి. కానీ ఈ సారి మాత్రం తొలి రోజు నుంచి మాటల యుద్దం మొదలైంది. జెస్సీ మీద యానీ మాస్టర్ ఫైర్ అవ్వడం, ఎందుకంత హైపర్ అవుతున్నావని కాజల్కు లహరి చురకలు అంటించడం చూస్తుంటే.. మున్ముందు గొడవలకు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బిగ్బాస్ ఇంట్లో వాళ్లు అంత రచ్చ చేస్తుంటే.. బయట వారి అభిమానులు కూడా ‘సోషల్’ దాడి చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన కంటెస్టెంట్స్తో గొడవకి దిగిన వారిపై విమర్శలు చేస్తున్నారు. ఎవరికి వారు తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. (చదవండి: బిగ్బాస్: తమ్ముడి మరణం, రవిని పట్టుకుని ఏడ్చేసిన విశ్వ) ఈ తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా బిగ్బాస్పై స్పందించారు. బిగ్బాస్-5లో యాంకర్ రవి, యానీ మాస్టర్, సింగర్ శ్రీరామ్, ప్రియ, నటరాజ్ మాస్టర్తో పాటు చాలా మంది పాల్గొన్నారని, వీరంతా తనకు ఒకెత్తు అయితే.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ మరో ఎత్తు అన్నారు. తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఉంటుందన్నారు. ప్రియాంక అబ్బాయిగా (సాయి) ఉన్నప్పుడే తనకు బాగా క్లోజ్ అని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్నారు. ప్రియాంక బిగ్బాస్లోకి వెళ్లిందనే విషయం చాలా సంతోషానిచ్చిందన్నారు. ట్రాన్స్ జెండర్గా మారాక ప్రియాంక చాలా ఇబ్బంది పడిందని, అవకాశాలు రాని సమయంలో తాను ఓ షోలోకి తీసుకొని సాయం చేశానని గుర్తు చేశారు. ప్రియాంక విన్నర్ అవుతుందా లేదా తనకు తెలియదని కానీ, తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఇస్తానని తేల్చి చెప్పారు. ఇక ప్రియాంక విషయానికొస్తే.. ఓ కామెడీ షోలో లేడీ గెటప్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రియాంక అసలు పేరు సాయి తేజ. ట్రాన్స్ జెండర్గా మారాక ప్రియాంక సింగ్ అని పేరు మార్చుకున్నారు. -
జూపార్కును సందర్శించిన మెగా బ్రదర్ నాగబాబు
నెహ్రూ జూలాజికల్ పార్కును సినీ నటుడు నాగబాబు మంగళవారం మధ్యాహ్నం సందర్శించారు. జూపార్కులోని ఆయా వన్యప్రాణుల ఎన్క్లోజర్ను సందర్శించి వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జూపార్కు సందర్శన ఎంతో అనుభూతిని అందిస్తుందన్నారు. జూ నిర్వాహణ, వన్యప్రాణుల సంరక్షణ, క్లీన్ అండ్ గ్రీన్ చాలా చక్కగా నిర్వహిస్తున్నారని జూ మేనేజ్మెంట్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఒక జత సెనెగల్ రామచిలుకలను కొనుగోలు చేయాలంటూ రూ.35 వేల చెక్కును తన సోదరి విజయ తరఫున జూపార్కు క్యూరేటర్ వి.వి.ఎల్.సుభద్రాదేవికి అందజేశారు. -
మీరే నా బలం, నా జీవితం: మెగా బ్రదర్
Nagababu Emostional Post: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు, రాఖీ పౌర్ణమి ఒకే రోజు రావడంతో మెగావారి ఇంట రెండు పండగల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెగా కుటుంబం, బంధువులు అంత ఒకచోట చేరి సందడి చేశారు. అయితే ఎప్పుడూ కుటుంబ వేడుకులను దూరంగా ఉండే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ సారి హజరవ్వడంతో మెగా అభిమానులు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం మరింత రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఏమోషన్ పోస్ట్ షేర్ చేశాడు. సోదరుడు చిరు, పవన్లతో సరదాగా మాట్లాడుకుంటున్న ఫొటో షేర్ చేస్తూ వీరే నా బలం అంటూ భావోద్యేగానికి లోనయ్యాడు. చదవండి: చిరంజీవి బర్త్డే వేడుకలో కనిపించని అల్లు అర్జున్, ఏమైంది.. ‘నా ప్రతి మైలులో చిరునవ్వులు రెట్టింపు చేసి, ప్రతి క్షణం నా జీవితంలో మ్యాజిక్ను నింపే నా సోదరులు.. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్లు నా బలం, నా జీవితం’ అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చాడు. కాగా ఆదివారం(అగష్టు 22) రాఖీ పౌర్ణమితో పాటు చిరు బర్త్డే కూడా వచ్చింది. దీంతో మెగా ఆడపడుచులు మెగా బ్రదర్స్కు రాఖీ కట్టి ఆశ్వీర్వాదలు తీసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య మెగాస్టార్ కేక్ కట్ చేశాడు. ఈ కార్యక్రమంలో మెగా హీరోలు రామ్చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్లు, అల్లు అరవింద్, ఆయన భార్య, ఉపాసన కొణిదెల, మెగాస్టార్ కూతుళ్లు సుస్మిత, శ్రీజతో పాటు నిహారిక ఆమె భర్థతో పాటు పలువురు హాజరయ్యారు. కానీ ఈ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ లేకపోవడం బన్ని ఫ్యాన్స్ను నిరాశపరిచింది. చదవండి: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్కు అంత సమయమా..! View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) -
రతన్ టాటాను రాష్ట్రపతి చేయాలి: నాగబాబు
సాక్షి, హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటారు. నిత్యం ఏదో అంశం మీద కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా నాగబాబు రాష్ట్రపతి అంశంపై స్పందించారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలన్నారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ రాష్ట్రపతిగా రతన్టాటా పేరును సూచించి.. అందరిని ఆశ్చర్యపరిచారు నాగబాబు. దేశంలోనే అతి పెద్ద ఇండస్ట్రీయలిస్ట్లో ఒకరైన రతన్ టాటా తదుపరి రాష్ట్రపతి కావాలని నాగబాబు కోరుకున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం దాదాపుగా మరో ఏడాది వరకు ఉంది. దీని పైన జాతీయ స్థాయిలో కూడా గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడు చర్చలు జరుగుతున్నా...నిర్దిష్టంగా ఎవరు పోటీలో ఉంటారనే అంశం పైన మాత్రం క్లారిటీ లేదు. ఇక ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తదుపరి రాష్ట్రపతి రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ దాని గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాంటిది ఇప్పుడు ఇంత సడెన్గా రాష్ట్రపతి ఎన్నిక అంశం పైన నాగబాబు ఎందుకు స్పందించారనేది అంతు చిక్కని విషయం. ‘‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులును ఎదుర్కొంటుంది. రోజు రోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇలాంటి సమయంలో తదుపరి రాష్ట్రపతి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు పన్నే వ్యక్తి కాకుండా.. దేశాన్ని తన కుటుంబంలా భావించి ప్రేమించే వ్యక్తి అయితే బాగుంటుంది. భారత దేశ తదుపరి రాష్ట్రపతిగా నేను ప్రతిపాదించే వ్యక్తి ఎవరంటే రతన్టాటా గారు’’ అంటూ నాగబాబు ట్వీట్చేశారు. దాంతో పాటు #RatanTataforPresident అనే హ్యాష్ట్యాగ్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. With D Nation facing unprecedented Labyrinth's day after day Der is a need 4 "The President" who not only can strategise & implement, but also has a big heart & see whole nation as one Big Family ! I propose @RNTata2000 ji as the next President of India#RatanTataforPresident pic.twitter.com/rlstJGjyMJ — Naga Babu Konidela (@NagaBabuOffl) August 9, 2021 -
చాటింగ్.. డేటింగ్.. మీటింగ్!
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి ‘అతడు.. ఆమె.. ప్రియుడు’ టైటిల్ ఖరారైంది. ప్రముఖ నటుడు సునీల్, ‘బిగ్ బాస్’ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మహేశ్వరి, ప్రియాంక, సుపూర్ణ హీరోయిన్లు. రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ప్రారంభమైంది. నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకులు కోదండ రామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మొన్న చాటింగ్.. నిన్న డేటింగ్.. ఈ రోజు మీటింగ్.. రేపు..’ అని హీరోయిన్ చెప్పిన డైలాగ్తో మొదలైన తొలి సీన్కి దర్శకుడు అజయ్ కుమార్ క్లాప్ ఇచ్చారు. ‘‘యండమూరిగారి దర్శకత్వంలో ‘నల్లంచు తెల్లచీర’ సినిమా తర్వాత వెంటనే ఆయన డైరెక్షన్లోనే ‘అతడు.. ఆమె.. ప్రియుడు’ సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కూనం కృష్ణకుమారి, కూనం ఝాన్సీ సహ నిర్మాతలు. -
లవ్ యూ అన్న అప్సర.. నవ్వులు చిందించిన నాగబాబు
అంతర్జాతీయ కుటుంబం దినోత్సవం సందర్భంగా ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసింది అలానాటి హీరోయిన్ మీనా యాంకర్ అనసూయకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు మెగా బ్రదర్ నాగబాబు. ఈ సందర్భంగా అనసూయ, శ్రీముఖితో కలిసి ఉన్నఫోటోని షేర్ చేశాడు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది ‘జాతిరత్నాలు’ఫేమ్ ఫరియా అబ్దుల్లా అప్సరరాణి ఇన్స్ట్రాగ్రామ్ ఫాలోవర్సు్ 200kకి చేరింది. ఈ సందర్భంగా లవ్ యూ ఆల్ అంటూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది. బ్లాక్ టాప్లో అదరగొడుతున్న యాంకర్ విష్ణుప్రియ View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) -
ఆసుపత్రిలో చేరిన చిరంజీవి అల్లుడు
కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సామాన్యులు సహా పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా చిరంజీవి అల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్ దేవ్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలతో నిన్న పరీక్షలు చేయించుకోగా, తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాన్నట్లు చెప్పారు. త్వరలోనే కోలుకుంటానని, ఈ సందర్భంగా తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక నాగబాబు సైతం కల్యాణ్దేవ్ పోస్ట్పై స్పందించారు. త్వరగా కోలుకుంటావనే నమ్మకం, గెట్ వెల్ సూన్ మై బాయ్ అంటూ కామెంట్ చేశారు. ఇక హీరోయిన్ అవికా గౌర్ సహా పలువురు సన్నిహితులు, అభిమానులు కల్యాణ్ దేవ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) చదవండి : ఎంత ఆస్తి ఉందో లైవ్లో చెప్పేసిన నాగబాబు గుత్తా జ్వాల-హీరో విష్ణు మెహందీ ఫోటోలు వైరల్ -
ఎంత ఆస్తి ఉందో లైవ్లో చెప్పేసిన నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా నటించకపోయినా సోషల్ మీడియాలో ద్వారా నిత్యం అభిమానులతో టచ్లో ఉంటారు. అంతేకాకుండా నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో ధీటుగా బదులిస్తారు. ఇటీవలి కాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆస్క్ మి ఏ క్వశ్చన్ పేరుతో ఇన్స్టాగ్రామ్లో లైవ్ చాట్లో అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా నాగబాబును ఉద్దేశించి ఓ నెటిజన్..'ఎంత ఆస్తి ఉంది నీకు'? అంటూ ప్రశ్నించాడు. దీంతో అసహనానికి లోనైన నాగబాబు..అతడికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'నన్ను నువ్వు అని సంబోధించావు..రెస్పెక్ట్ తగ్గిపోయింది సో నీ ప్రశ్నకు సమాధానం చెప్పను. మీకు మీకు ఎంత ఆస్తి ఉంది? అని అడిగి ఉంటే, ఎంత ఉందో చెప్పి నా ఆస్తిలో సగం ఇచ్చేవాడిని .. బ్యాడ్ లక్' అంటూ తనదైన స్టైల్లో చురకలంటించారు. ఇక మరో నెటిజన్.. 'సర్ మీరు ఉండే ఇల్లు ఖరీదు రూ. 50 కోట్లు ఉంటుందా' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా 'ముకేష్ అంబానీ ఇంటి కంటే పది రూపాయలు తక్కువ అంతే. మిగిలినదంతా సేమ్ టూ సేమ్' అని వ్యంగ్యంగా బుదలిచ్చారు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి : అవి చూస్తారు కానీ ఆ పని మాత్రం చేయరు : నాగబాబు అల్లుడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు.. ఏంటో తెలుసా! -
అల్లుడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు.. ఏంటో తెలుసా!
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లి జొన్నలగడ్డ చైతన్యతో గత డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం నిహారిక-చైతన్య తమ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. భర్తతో గడిపిన ప్రత్యేక క్షణాలను నిహారిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా నాగాబాబు తన ఒక్కగానొక్క అల్లుడికి ఓ లగ్జరీ గిఫ్ట్ను అందించారు. అల్లుడు చైతన్యకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. రేంజ్ రోవర్ డిస్కవర్ తెలుపు రంగు కారును అల్లుడికిస్తూ.. నిహారిక, చైతన్యలను సర్ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని నాగబాబు శనివారం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. నా అల్లుడికి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ ఇన్స్టాలో పేర్కొన్నారు. ఈ మేరకు కూతురు నిహారిక, చైతన్యకు కారును డెలివరీ చేస్తున్న ఫోటోను షేర్ చేశారు. దీని ఖరీదు దాదాపు 70 లక్షలు ఉంటుదని అంచనా. అయితే వాస్తవానికి ఇది ఉగాదికి ఇవ్వాల్సిన కానుక అని.. కానీ కాస్త ఆలస్యం అయ్యిందని నాగబాబు తన యూట్యూబ్ చానల్లో తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్గా మారింది. -
పీక కోస్తా అని నా భార్య వార్నింగ్ ఇచ్చింది : నాగబాబు
సినిమాల్లో నటించకున్నా.. టీవీల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్గా ఉంటాడు మెగా బ్రదర్ నాగబాబు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన పలు సినిమాల్లో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఆతర్వాత బుల్లితెరపై కూడా సందడి చేశాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో ఉండే నాగబాబు.. అభిమానులు అడిగిన చిలిపి ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానాలు ఇస్తుంటాడు. ఇటీవల ఇన్స్ట్రాగ్రామ్ లైవ్ చాట్లోకి వచ్చిన నాగబాబు.. రెండో పెళ్లి గురించి తన అభిప్రాయం చెప్పాడు. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా సర్? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, ‘ఈ వయసులో నాకు పెళ్లా..? అయినా మీరంతా ఓకే అంటే నాకూ ఓకే’ అంటూ నాగబాబు సరదాగా బదులిచ్చిన విషయం తెలిసిందే. నాగబాబు సమాధానంపై కొంతమంది ట్రోల్ చేయగా, మరికొంత మంది తనలోని హాస్యచతురతను మెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి రెండో పెళ్లి విషయంపై నాగబాబు మాట్లాడాడు. ఇటీవల జరిపిన ఇన్స్ట్రాగ్రామ్ లైవ్ చాట్లో ‘మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు సార్’ అని అడగ్గా.. ‘మా ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు.. ఆ ఆలోచన వచ్చినా పీక కోస్తా అని ప్రేమగా చెప్పింది.. అంత ప్రేమగా చెప్పాక నేను మాత్రం రెండో పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తాను’ అంటూ తనదైన శైలీలో సమాధానం ఇచ్చాడు. నాగబాబు ఫన్నీ రిప్లై ఇప్పుడు సోషల్ మీడిమాలో వైరల్ అయింది. చదవండి: నాగబాబు వాట్సాప్ డీపీ చూస్తే షాక్ అవ్వాల్సిందే! సాయి పల్లవితో వరుణ్ పెళ్లి.. బ్రహ్మానందాన్ని వాడేసిన నాగబాబు -
నాగబాబు వాట్సాప్ డీపీ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తనదైన శైలిలో బదులిస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో టచ్లో ఉంటారు. గతంలో రెండో పెళ్లిపై నాగబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కనీసం రెండో పెళ్లి ఆలోచన వచ్చినా చంపేస్తానని తన భార్య వార్నింగ్ కూడా ఇచ్చినట్లు నాగబాబు ఫన్నీగా బదులిచ్చారు. తాజాగా ఆస్క్ మి ఏ క్వశ్చన్ పేరుతో ఇన్స్టాగ్రామ్లో లైవ్ చాట్ నిర్వహించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో ఆన్సర్ చేశారు. ఇందులో భాగంగా..మీ వాట్సాప్ డీపీ ఏంటి? అని ఓ నెటిజన్ అడగ్గా, రామ్గోపాల్ వర్మ, బాలకృష్ణ నవ్వుతూ సంభాషిస్తున్న ఓ ఫోటోను షేర్ చేశారు. అయితే గతంలో బాలకృష్ట, ఆర్జీవీపై నాగబాబు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం నాగబాబు షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ‘మీది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా?’ అని నెటిజన్లు ప్రశ్నించగా తనది పెద్దలు కుదిర్చిన వివాహమని పేర్కొన్నారు. అనంతరం అల్లు అర్జున్కు సంబంధించిన ఓ ప్రశ్నకు బదులిస్తూ..బన్నీకి స్టైలిష్స్టార్ ట్యాగ్ బాగుంటుందన్నారు. అలాగే, సాయిధరమ్ తేజ్.. చాలా మంచి వ్యక్తని, కష్టపడే గుణం కలిగిన వ్యక్తి అని చెప్పారు. మరో ప్రశ్నకు బదులిస్తూ.. న్యూజిలాండ్ తనకెంతో ఇష్టమైన ప్రదేశమని అన్నారు. చదవండి : రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్ సాయి పల్లవితో వరుణ్ తేజ్ పెళ్లి.. నాగబాబు ఏమన్నారంటే.. -
సాయి పల్లవితో వరుణ్ పెళ్లి.. బ్రహ్మానందాన్ని వాడేసిన నాగబాబు
మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత అందరి చూపులు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్పై పడ్డాయి. వరుణ్ పెళ్లి గురించి మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చెల్లి పెళ్లి అయింది కాబట్టి అతి త్వరలోనే వరుణ్ బాబు కూడా పెళ్లి పీటలెక్కబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. నాగబాబు కూడా పలుమార్లు వరుణ్ పెళ్లి గురించి స్పందించారు. వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో తనకెలాంటి అభ్యంతరాలు లేవని ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. అమ్మాయి ఉంటే చూడమని కూడా మెగా అభిమానులకు సూచించాడు. అంతేకాదు వరుణ్కు పెళ్లి చెద్దామని తమకు కూడా ఉందని, కానీ వాడే ఇప్పుడు వద్దంటున్నాడని గతంలో ఓ ఇంటర్వూ్యలో కూడా చెప్పాడు. దీంతో వరుణ్ ఒక హీరోయిన్తో లవ్లో ఉన్నాడని, అందుకే ఇప్పుడు పెళ్లి వద్దంటున్నాడని వార్తలు వినిపించాయి. వీటిని మెగా ఫ్యామిలీ పెద్దగా పట్టించుకోలేదు. ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా వరుణ్ పెళ్లి గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాగబాబు ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఇటీవల నాగబాబు ఇన్స్ట్రాగ్రామ్ లైవ్లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ‘వరుణ్ అన్నా సాయి పల్లవికి మ్యారేజ్ చేస్తా సార్.. జోడీ బాగుంటుంది' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నెటిజన్ అలా చెప్పడంతో నాగబాబు సైతం అవాక్కయ్యారు. ఏం చేయాలో పాలుపోని నాగబాబు జాతిరత్నాలు సినిమాలోని క్లైమాక్స్లో వచ్చే కోర్టు సీన్ వీడియోను పోస్ట్ చేసి షాకిచ్చారు. ఆ కోర్ట్ సీన్లో జడ్జ్గా ఉన్న బ్రహ్మానందం 'తీర్పు మీరు మీరు చెప్పుకోండ్రా. ఇక, నేనేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే' అనే డైలాగ్ చెబుతారు. ఇదే వీడియో నాగబాబు పోస్ట్ చేశారు. నాగబాబు ఫన్నీ రిప్లై ఇప్పుడు సోషల్ మీడిమాలో వైరల్ అయింది. కాగా, వరుణ్ తేజ్, సాయి పల్లవి కలిసి ‘ఫిదా’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సాయిపల్లవి యాక్టింగ్కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. -
అవి చూస్తారు కానీ ఆ పని మాత్రం చేయరు : నాగబాబు
బుల్లితెరపై నాగబాబు హవా ఈ మధ్య కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. జబర్ధస్త్ నుంచి బయటకు వచ్చాక సొంతంగా కొన్ని షోలు నిర్వహించేందుకు గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ అవి అంతంగా సక్సెస్ కాలేదు. దీంతో యూట్యూబ్లో ఎప్పటికప్పుడు వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్తో టచ్లో ఉంటున్నారు. ఇప్పటికే పలు కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు..ప్రస్తుతం ఖుషీఖుషీగా అనే స్టాండప్ కామెడీ షోకు జడ్జిగా ఉంటున్నారు. ఈ షో ద్వారా నాగబాబు తన సొంత యూట్యూబ్ చానెల్తో కొత్త టాలెంట్ను పరిచయం చేస్తున్నారు. అయితే ఆశించిన స్థాయిలో వీటికి వ్యూస్ రావడం లేదు. అంతేకాకుండా ఈ షోలో శృతిమించిన కామెడీ ఉంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్లో ఫ్యాన్స్తో ముచ్చటించిన నాగబాబుకు ఓ నెటిజన్ చేసిన కామెంట్కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'ఖుషీ ఖుషీగా షో చూస్తున్నంతసేపు అసలు టైం తెలియదు..అప్పుడే ఫైనల్ వరకు వచ్చేసిందా.? అని పేర్కొనగా..దీనికి నాగబాబు స్పందిస్తూ..మీరు ఇప్పుడు ఇలానే అంటారు..చూసి షేర్ మాత్రం చేయరు..వ్యూస్ ఎక్కడ అండి వ్యూస్ అంటూ సెటైరికల్గా ఆన్సర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి : రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్ ప్రపంచంలోనే అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక సినిమా అదే! -
రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్
మెగా డాటర్ నిహారికకు ఇటీవలె పెళ్లి చేసిన నాగబాబు..త్వరలోనే వరుణ్తేజ్ని సైతం ఓ ఇంటి వాడిని చేయాలని చూస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఇప్పటికే అమ్మాయిని కూడా వెతికే పనిలో పడ్డారని సమాచారం. ఇదిలా ఉండగా మెగా బ్రదర్ నాగబాబు తన రెండో పెళ్లిపై స్పందించారు. ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్లో ఫ్యాన్స్తో ముచ్చటిస్తున్న నాగబాబుకు ఓ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. 'సర్..మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని ఓ నెటిజన్ అడగ్గా..ఈ వయసులో నాకు పెళ్లా..మీరంతా ఓకే అంటే నాకు కూడా ఓకే' అంటూ నాగబాబు సరదాగా బదులిచ్చారు. రెండో పెళ్లిపై నాగబాబు చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ పలువురు దీన్ని ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు రెండో పెళ్లిపై నాగబాబు చేసిన కామెంట్పై కొందరు నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'మీరంతా ఓకే అంటే నాకు కూడా ఓకే అంటున్నారంటే..మీ మనసులోనూ రెండో పెళ్లిపై ఆలోచన ఉందా?మీరు కూడా మీ తమ్ముడు పవన్కల్యాణ్ బాటలోనే నడుస్తారా' ? అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి : వరుణ్ పెళ్లిపై నాగబాబు కామెంట్.. ఆ అమ్మాయి అయినా ఓకేనట వకీల్సాబ్ : ట్రైలర్కే అద్దాలు పగిలితే.. ఇక సినిమా రిలీజైతే -
మెగా బ్రదర్ బాలీవుడ్ ఎంట్రీ.. ఆ హీరోకు విలన్గా..
మెగా బ్రదర్ నాగబాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. తెలుగులో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ప్రభాస్ చిత్రం ఛత్రపతి మూవీని యంగ్ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగబాబు విలన్ పాత్ర పొషిస్తున్నట్లు ఆయన తాజా ఫొటో షూట్ చూస్తే తెలుస్తోంది. ఈ ఫొటోలో నాగబాబు నోటిలో సిగరేట్తో విలన్ గేటప్లో దర్శనమిచ్చాడు. అది చూసి అందరూ షాకై ఆరా తీయగా ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది. హిందీలో రిమేక్ కానున్న ఛత్రపతి మూవీలో నాగబాబు విలన్గా నటిస్తున్నట్లు సినీ వర్గాల నుంచి సమచారం. ఇందులో విలన్ పాత్రకు కోసం చిత్ర బృందం ఆయనను సంప్రదించారని, ఈ పాత్ర చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన వెలువరించనుందట. కాగా తెలుగులో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే.. బుల్లితెరపై కూడా ఆలరిస్తున్నారు. ప్రముఖ కామెడీ షో జబర్థస్త్ కార్యక్రమం షోకు ఆయన జడ్జిగా వ్యవహరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై పలు సినిమాలు నిర్మించి నిర్మాతగా మారారు. చదవండి: అందుకే ‘ఉప్పెన’ ఈవెంట్కి రాలేదు: నాగబాబు -
నిహారిక కాలికి గాయం..సేవలు చేస్తున్న చైతన్య
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం గతేడాది డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మెగా డాటర్ భర్త చైతన్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. అలాగే వృత్తి పరంగాను బిజీగా ఉంది. పెళ్లి తర్వాత తొలి వెబ్ సిరీస్ మొదలు పెట్టిన నిహారిక ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్తో బిజీగా ఉంది. అయితే షూటింగ్ సమయంలో నిహారిక కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. కాలికి పట్టి కట్టిన ఫోటోని తన ఇన్స్ట్రాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసిన నిహారిక.. ‘భార్యను భర్త బుజ్జగిస్తున్న కార్యక్రమంలో నేటి ఎపిసోడ్ ఏంటంటే.. ''కాటన్ క్యాండీ'' అని క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫొటో తన చేతిలో ఓ బాక్స్ కనిపించింది. అందులో కాటన్ క్యాండీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన కాలికి గాయం అయిన విషయాన్ని మాత్రం నిహారికగా డైరెక్ట్గా చెప్పలేదు. అసలు ఆ గాయం ఎందుకు అయిందో కూడా పేర్కొనలేదు. కానీ ఫొటోలో ఆమెకు కాలికి ఉన్న పట్టీ చూసి.. ఖచ్చితంగా గాయపడిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె రాయుడు చిత్రాలు బ్యానర్పై భాను రాయుడు దర్శక నిర్మాతగా రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇందులో మరో కీలక పాత్రలో యాంకర్ అనసూయ నటిస్తోంది. -
హైదరాబాద్ తర్వాత వరంగల్లోనే: నాగబాబు
హన్మకొండ చౌరస్తా: ఐఎంఎఫ్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని సినీ నటుడు కొణిదెల నాగబాబు సూచించారు. విదేశీ విద్య కన్సల్టెన్సీ ప్రారంభోత్సవానికి ఆదివారం ఆయన నగరానికి వచ్చారు. హన్మకొండ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐఎంఎఫ్ఎస్ శాఖను ప్రారంభించిన అనంతరం నాగబాబు విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అన్ని సదుపాయాలు వరంగల్లోనే ఉన్నాయన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లోని ఉత్తమ విశ్వవిద్యాలయాలతో ఐఎంఎఫ్ఎస్కు భాగస్వామ్యం ఉందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో సంస్థ సీఈఓ కేపీ సింగ్, టెక్స్›టైల్ హ్యాండీక్రాఫ్ట్ ఓఎస్డీ శాంత, సంస్థ ప్రతినిధి అజయ్, కార్పొరేటర్ విజయ్భాస్కర్, హైకోర్టు న్యాయవాది పట్టాభి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఆచార్య@ మారేడుపల్లి.. చిరు గ్రాండ్ ఎంట్రీ -
అందుకే ‘ఉప్పెన’ ఈవెంట్కి రాలేదు: నాగబాబు
మెగా మేనల్లుడు, సాయిధరమ్తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 12న విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వేడుకకు చిరంజీవి తప్ప మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ రాలేదు. దానికి గల కారణమేంటో తెలియజేస్తూ మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ చానల్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘వైష్ణవ్ ఇండస్ట్రీకి రాకముందు చదువుకుంటావా? లేక ఇండస్ట్రీకి వస్తావా? అని నేను చాలాసార్లు అడిగాను. కానీ.. ఏదీ కన్ఫర్మ్గా చెప్పకపోయేవాడు. ఓ సారి నేను సీరియస్గా సినిమాల్లోకి వస్తావా అని అడిగినా కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేదు. అలాంటిది.. ఓ రోజు నా దగ్గరకు వచ్చి ‘ఉప్పెన’ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. మొత్తానికి.. వైష్ణవ్ సినిమాల్లోకే వచ్చాడు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. కళ్యాణ్ బాబు సూచనలతో థాయ్ బాక్సింగ్ నేర్చుకొని వచ్చాడు వైష్ణవ్ తేజ్. మంచి ఫిట్నెస్ ఉన్న కుర్రోడు. పైగా మంచితనం ఎక్కువ. మా నిహారికకు, వరుణ్ తేజ్కి వైష్ణవ్ అంటే చాలా ఇష్టం. మా అన్నయ్య, తమ్ముడు కళ్యాణ్ బాబు కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేశారు. కాబట్టి ఆ స్టాండర్డ్స్ రీచ్ కావాలంటే వరుణ్ గానీ, తేజ్ గానీ, వైష్ణవ్ గానీ చాలా కష్టపడాలి. ఇక ‘ఉప్పెన’ మూవీ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మొన్ననే చరణ్ వరుణ్ నిహారిక ఈ సినిమా చూశారు. చాలా బాగుందని చెప్పారు. కథ చాలా రియలిస్టిక్గా ఉంది వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాలోనే చాలా బాగా నటించాడు.మొన్న జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి మా ఫ్యామిలీ నుంచి ఎవ్వరమూ అటెండ్ కాలేదు. ఇంటిల్లిపాది వెళ్లడం కంటే.. వాడిని వాడిగా ప్రొజెక్ట్ చేయాలనే అలా చేశాము. కాకపోతే.. మా అందరికీ పెద్ద దిక్కు కాబట్టి మా అన్నయ్యను పిలిచారు. ఆ రకంగా వైష్ణవ్ ఆయన బ్లెస్సింగ్స్ దక్కాయి. ఉప్సెన మంచి హిట్ అవుతుదంనే నమ్మకం ఉంది. వైష్ణవ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి’అని నాగబాబు చెప్పుకొచ్చారు. -
గణతంత్ర వేడుకల్లో మెగాస్టార్, మెగా పవర్ స్టార్
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు, కుమారుడు రామ్ చరణ్ తేజ్, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్లో చిరంజీవి మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులకు పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చిరంజీవి, రామ్చరణ్ అభిమానులు పాల్గొన్నారు. అంతకుముందు చిరంజీవి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విస్తృతంగా రక్తదానం చేయాలనుకుని నిర్ణయించుకున్న మెగా బ్లడ్ బ్రదర్స్ని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తన పిలుపు మేరకు స్పందించి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్కు వచ్చి, రక్తదానం చేసిన, చేస్తున్న రక్తదాక్తలకు హృదయ పూర్వక ధన్యవాదాలు అని చెప్పారు. రక్త దానం చేయండి, ప్రాణ దాతలుకండి అంటూ చిరంజీవి తన వాయిస్ వీడియో ద్వారా సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని అందించారు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మాటలు తగ్గించేసింది: నాగబాబు ఎమోషనల్
మెగా బ్రదర్ నాగబాబుకు తన గారాలపట్టి నిహారిక అంటే కొండంత ప్రేమ. ఆమె చిన్నప్పుడు స్కూలుకు వెళ్తేనే ఎంతగానో మిస్సయ్యేవాడు. అలాంటిది ఇటీవలే ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టి అత్తారింటికి సాగనంపాడు. ఈ క్రమంలో ఆమె ఇల్లు వదిలి వెళ్తుంటే పొంగుకుస్తున్న దుఃఖాన్ని ఆపుకునేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. చిన్నపిల్లాడిలా మనసారా ఏడ్వాలని ఉన్నా పెద్దరికం అడ్డొచ్చి గొంతులోనే దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. (చదవండి: ఫ్యాట్ తగ్గించుకోవడానికి తమన్నా తిప్పలు.. వీడియో వైరల్) తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో కూతురి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. "సాధారణంగానే నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. నాకు కూతురు పుట్టాలని చాలా కోరుకున్నాను. అలా నాకు రెండోసారి నిహారిక పుట్టింది. ఆమె నాకు బెస్ట్ఫ్రెండ్. చాలా విషయాల్లో నాకు, నా కూతురుకు ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు పెళ్లైంది కదా! మాటలు తగ్గించేసింది. అయినా సరే నాకు సంతోషంగానే ఉంది" అని పేర్కొన్నాడు. కాగా మెగా డాటర్ నిహారిక- జొన్నలగడ్డ చైతన్యల వివాహం డిసెంబర్ 9న జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు జైపూర్లోని ఉదయ్విలాస్ ప్యాలెస్ వేదికగా మారింది. (చదవండి: కాలమే నిర్ణయిస్తుంది.. నాగబాబు భావోద్వేగం) -
సింగర్ సునీత పెళ్లి.. నాగబాబు కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాయనీ సునీత ఇటీవల మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శంషాబాద్లోని అమ్మపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో సునీతకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే వీరిద్దరికి ఇది రెండవ వివాహమని తెలిసిందే. దీంతో ఎదిగిన పిల్లల ఎదురుగా సునీత ఇలా ఆనందంగా పెళ్లి చేసుకొవడంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. (చదవండి: సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్) ఈ తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు ఈ జంటకు మద్దతుగా నిలిచారు. వారి వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం ట్వీట్ చేశారు. ‘సంతోషం అనేది పుట్టుకతో రాదు. దానిని మనమే వెతికి అందుకోవాలి. రామ్, సునీత కూడా అదే చేశారు. వారిద్దరూ తమ సంతోషాలను అన్వేషించి గుర్తించినందుకు అభినందనలు. ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి వీరి జంట ఆదర్శంగా నిలిచింది. ప్రేమ, ఆనందం వారి శాశ్వత చిరునామాగా మారాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీటర్ వేదికగా సునీత-రామ్లకు ఆయన వివాహ శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: అలా.. రామ్తో పరిచయం ఏర్పడింది: సునీత) Happy Married Life to You Two @OfficialSunitha & @ramveerapaneni pic.twitter.com/OEPMKxZnxl — Naga Babu Konidela (@NagaBabuOffl) January 12, 2021 -
శ్రీమతిగా నిహారిక ఫస్ట్ బర్త్డే.. పార్టీ ఎక్కడంటే
టాలీవుడ్ నటి, మెగా డాటర్ నిహారిక నేడు(శుక్రవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. నేటితో ఈ కొత్త పెళ్లి కూతురు 28వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య త్రిపాఠి, కాజల్ అగర్వాల్ విషెస్ తెలిపారు. ఇక మెట్టినింట్లో అడుగుపెట్టాక నిహారిక జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో తన భార్యకు చైతన్య జొన్నలగడ్డ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్’ అంటూ పొద్దుతిరుగుడు పూవుతో నిహారికను పోల్చాడు. సూర్య కాంతితోనే సన్ ఫ్లవర్ వికసిస్తోందన్న నేపథ్యంలో నిహారిక తన జీవితంలో అడుగుపెట్టడంతో చైతన్య జీవితం కూడా వికిసించిందని ప్రేమగా వివరించాడు. చదవండి: ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోను: నిహారిక కాగా నిహారిక తన బర్త్డేను నేడు భర్త చైతన్యతో కలిసి ఫలక్నామ ప్యాలెస్లో జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే ఫలక్నామ ప్యాలెస్కు ఈ జంట చేరుకున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు గత రాత్రి నిహారిక.. తండ్రి నాగబాబు, బుల్లితెర షో ‘అదిరింది’ కమెడీయన్స్తో కలిసి సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో యాంకర్ రవి, రాఘవ, పలువురు జబర్ధస్త్ నటులు, అదిరింది నటులు హాజరయ్యారు. ప్రస్తుతం నిహారిక బర్త్డేకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కాగా ఇటీవల నిహారిక పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్ 9న జొన్నలగడ్డ చైతన్యతో ఆమె ఏడడుగులు వేశారు. ఉదయ్పూర్లో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి హడావిడి చేయడం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. చదవండి: ఘనంగా నిహారిక-చైతన్య రిసెప్షన్ View this post on Instagram A post shared by Chaitanya Jv (@chaitanya_jv) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
నా బంగారు తల్లి.. డాషింగ్ బావ: వరుణ్ తేజ్
హైదరాబాద్: ‘‘నా బంగారు తల్లి నిహారిక, మా డాషింగ్ బావ చైతన్యకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేనిప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో వర్ణించేందుకు మాటలు సరిపోవు!’’ అంటూ సినీ హీరో వరుణ్ తేజ్ కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపాడు. అదే విధంగా తన ముద్దుల చెల్లి నిహారిక పెళ్లి సందర్భంగా శుభాశీసులు అందజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వివాహం- జొన్నలగడ్డ వెంకట చైతన్యతో జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్పూర్లోని ఉదయ్విలాస్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా ఈ వేడుక నిర్వహించారు. (నిహారిక- చైతన్య వివాహం: మరిన్ని ఫొటోల కోసం క్లిక్ చేయండి) మెగా కుటుంబ హీరోలంతా ఈ శుభకార్యానికి హాజరై సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రామ్చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైన నాటి నుంచే నిస్చై పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. (మెగా కుటుంబం సందడి: నిహారిక-చైతన్యల సంగీత్ ఫొటోలు) ఇక ఇప్పుడు వరుణ్ తేజ్, చెర్రీ సతీమణి ఉపాసన, బన్నీ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా నిహారిక- చైతన్య దంపతులకు విషెష్ చెబుతూ మరిన్ని ఫొటోలు షేర్ చేశారు. తమ ముద్దుల చిన్నారి అర్హ ఇప్పటికే మిమ్మల్ని మిస్ అవుతుందంటూ అల్లు స్నేహారెడ్డి పంచుకున్న ఫొటో బన్ని అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇక ఉపాసన మిస్టర్ సితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. అద్భుతమైన ఆతిథ్యం అందించినందుకు నాగబాబు కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. -
వైభవంగా నిహారిక-చైతన్య వివాహం
-
ఘనంగా నిహారిక - చైతన్య వివాహం
మెగా డాటర్, కుమారి నిహారిక కాస్త శ్రీమతి నిహారికగా మారింది. కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ ఆమె మెడలో గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డ మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచాడు. ఈ వివాహ వేడుకకు జైపూర్లోని ఉదయ్విలాస్ ప్యాలెస్ వేదికైంది. ఈ పెళ్లి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. (వైభవంగా నిహారిక-చైతన్య వివాహం గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Niharika Konidela Official (@niharikakonidelaofficial) -
నాకింకా గుర్తుంది; నాగబాబు భావోద్వేగం
హైదరాబాద్: ‘‘సరికొత్త జీవితం ఆరంభించబోతున్న నీకు శుభాకాంక్షలు. తను స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. అప్పుడైతే సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. తనతో ఇరవై నాలుగు గంటలు ఆడుకోలేననే బాధ వెంటాడేది. ఇంకెన్నాళ్లు ఇలాంటి ఫీలింగ్ ఉంటుందో.. కాలమే నిర్ణయిస్తుంది.. నిన్ను ఎంతగానో మిస్సవుతున్నా నిహా తల్లి’’ అంటూ నటుడు నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. కూతురిని అత్తారింటికి సాగనంపే సమయం ఆసన్నం కావడంతో పాత జ్ఞాపకాలు తలచుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. తన గారాలపట్టి నిహారిక పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను మెగా బ్రదర్ బుధవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా నాగబాబు కూతురుగానే గాకుండా నటిగా నిహారిక తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే.(చదవండి: వధువుగా ముస్తాబైన నిహారిక.. ఫోటో వైరల్) (వైభవంగా నిహారిక-చైతన్య వివాహం గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అంతేగాక తండ్రి బాటలో నడుస్తూ నిర్మాతగా పలు వెబ్ సిరీస్లు రూపొందించారు. ఇక నాన్నకూచి అయిన నిహారిక నేడు చైతన్య జొన్నలగడ్డతో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలో అడుగుపెట్టనున్నారు. మెగా కుటుంబం, అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరి వివాహం ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. నిహారిక- చైతన్య పెళ్లి వేడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
చిరుతో నిహారిక సెల్ఫీ.. నాగబాబు భావోద్వేగం
కొణిదెల వారింట్లో పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటాయి. మరో రెండు రోజుల్లో నాగబాబు కూతురు నిహారిక పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈనెల 9న జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయనున్నారు. ఈ వేడుకకు రాజస్తాన్లోని ఉదయ్పూర్ వేదికగా కానుంది. పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్నారు. నిహారిక, చైతన్యల కుటుంబం మాత్రం ప్రత్యేక విమానంలో ఉదయ్పూర్ బయలు దేరారు. ఈ ఫోటోను నిహారిక తన ట్విటర్లో పోస్టు్ చేశారు. ఇక నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడకల్లో కుటుంబ సభ్యులంతా సందడి చేస్తున్నారు. వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీ తమ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక పెళ్లి పనులకు చెందిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా నిహారిక పెళ్లి వేడుకల్లో చిరంజీవి, పవన్ కల్యాణ్,అల్లు అర్జున్ కనిపించలేదన్న విషయం తెలిసిందే.చదవండి: పెళ్లి కూతురుగా నిహారిక.. ఫోటోలు వైరల్! అయితే తాజాగా నాగాబాబు నిహారిక-చిరంజీవి దిగిన ఓ సెల్పీ ఫోటోను తన ట్విటర్లో షేర్ చేశారు. దీంతో మెగాస్టార్ కూడా పెళ్లి పనుల్లో భాగం అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలో తన తల్లి నిశ్చితార్థం నాటి చీరను ధరించిన నిహారిక.. పెద్దనాన్న చిరంజీవితో కలిసి నవ్వులు చిందిస్తున్నారు. ‘అతని ప్రేమకు అవధుల్లేవు, అతని చిరునవ్వు ప్రతి సందర్భాన్ని ఒక వేడుకగా మార్చుతుంది’ అంటూ చిరంజీవి గురించి ట్వీట్ చేస్తూ నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఇక మెగా బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పోస్టుతో అన్న మీద ఉన్న ప్రేమను నాగబాబు మరోసారి బయటపెట్టారు. చదవండి: అమ్మ చీరలో నిహారిక As A Family We gave You `ROOTS`.. AS A Father I gave You `WINGS`... The Wings will take You High & The Roots will keep You Safe The 2 Best gifts your loving Daddu can offer Love you to the moon & Back @IamNiharikaK#nischay pic.twitter.com/q3VzBiNpg6 — Naga Babu Konidela (@NagaBabuOffl) December 7, 2020 -
పెళ్లి కూతురుగా నిహారిక.. ఫోటోలు వైరల్!
కొణిదెల వారింట పెళ్లి సందడి మొదలైంది. మరో నాలుగు రోజుల్లో మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆగష్టులో నిశ్చితార్థం చేసుకున్న నిహారిక-చైతన్యల జంట డిసెంబర్ 9 మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ వేడుక రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో ఘనంగా జరగనుంది. మెగా కుటుంబంలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జోరందుకున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక పెళ్లి పనులకు చెందిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: మీకన్నా నాకెవరున్నారు: నిహారిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నేడు (శనివారం) నిహారికను పెళ్లి కూతురుగా చేశారు. తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. ఇంటిని రంగురంగుల పువ్వులు, తోరణాలతో సుందరంగా అలంకరించారు. ఇక అందంగా ముస్తాబు అయిన నిహారిక ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. కాగా నిహారిక పెళ్లి కార్యక్రమాల్లో చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదిలా ఉండగా నాగబాబు కూతురు నిహారిక వివాహం గుంటూరు ఐజీ ఎం. ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో ఈ నెల 9వ తేదీన జరగనుంది. రాజస్తాన్లో జరిగే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇరు కుటుంబాలు రాజస్తాన్ తరలి వెళ్లనున్నాయి. చదవండి: కౌంట్డౌన్ స్టార్ట్.. మరో నాలుగు రోజుల్లోనే View this post on Instagram A post shared by Niharika K (@konidela_niharika_) View this post on Instagram A post shared by Niharika Konidela Official (@niharikakonidelaofficial) -
మీకన్నా నాకెవరున్నారు: నిహారిక
మరో నాలుగు రోజుల్లో కొణిదెల వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా ప్రిన్సెస్ నిహారిక జొన్నలగడ్డవారి కోడలు కానుంది. పెళ్లికి సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తికాగా..డిసెంబర్ 9న జరగబోయే పెళ్లికి రాజస్తాన్లోని ఉదయ్పూర్కి తరలి వెళ్లనున్నారు మెగా ఫ్యామిలి. ఈ సందర్భంగా తన సంతోషకరమైన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది నిహారిక. ప్రీవెడ్డింగ్ షూట్లో తనను రెడీ చేస్తున్న తన స్నేహితురాళ్ల ఫోటోలను షేర్ చేస్తూ ఇంతకంటే గొప్పగా నన్ను రెడీ చేసేదెవరంటూ పోస్ట్ చేసింది. (చదవండి: మరో ‘మెగా’ చాన్స్ కొట్టేసిన రష్మిక!) ఆగస్టు 13న కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో నిహారిక నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలను జ్ఞాపకాలను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటితోపాటు తన కాళ్లకు హీల్స్ వేస్తున్న ఇద్దరి స్నేహితుల పిక్స్ని కూడా నిహారిక షేర్ చేసింది. ‘వీళ్లు నాకు హీల్స్ వేయడంలో సహాయం చేస్తున్నారు, వీరు కాకుండా నన్ను పెళ్లి కూతుర్ని చేసేందుకు పర్ఫెక్ట్ పర్సన్స్ ఉన్నారని నేను అనుకోవడం లేదు లవ్ యూ గర్ల్స్’ అంటూ సోషల్ మీడియా వేదికగా వారి మీద తనకున్న ప్రేమను తెలియజేసింది. నాగబాబు కూతురు కూతురు నిహారిక వివాహం గుంటూరు ఐజీ ఎం. ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో ఈ నెల 9వ తేదీన జరగనుంది. రాజస్తాన్లో జరిగే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇరు కుటుంబాలు రాజస్తాన్ తరలి వెళ్లనున్నాయి. ఇటీవలే తమ వెడ్డింగ్ కార్టును ఫైనలైజ్ చేశారు ఈ జంట. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
నటుల మధ్య చిచ్చుపెట్టిన గ్రేటర్ పోరు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల పోరు రాజధానిలో రాజకీయ వేడిని మరింత పెంచింది. విమర్శకు ప్రతి విమర్శ చేస్తూ నేతలు రెచ్చిపోతుంటే.. ఎన్నడూ లేని విధంగా సినీ నటుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రాజకీయ విమర్శల వేడి టాలీవుడ్ నటులకూ పాకింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి మద్దతునిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ బహుబాషా నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించారు. పవన్ను ఊసరవెల్లితో పోల్చుతూ ప్రకాశ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అతని చరిత్ర ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిబేట్లోనే తెలిసిపోయిందని కొట్టిపారేశారు. (బీజేపీ ముందు పవన్ కీలక ప్రతిపాదన!) ఈ మేరకు ప్రకాశ్ రాజ్కు కౌంటర్గా నాగబాబు ట్వీట్ ద్వారా సమాధానం ఇచ్చారు. ‘రాజకీయల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్లో ప్రజలకు, పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుకు విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. ప్రశాష్ రాజ్ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మస్వామి డిబేట్లోనే అర్థం అయ్యింది. నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. నీ దృష్టిలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే విమర్శించు తప్పులేదు. మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం. ఈ దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ, జనసేన విజయాన్ని ఆపలేరు. బీజేపీ నేతల్ని నువ్వు ఎన్ని మాటల అన్నా వాళ్లు నిన్ను ఏమీ అనడంలేదంటే ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకో. నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో, డేట్స్ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురిచేశావో అన్నీ గుర్తున్నాయి. మరోసారి పవన్ గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు’ అంటూ ఘాటు వ్యాఖ్యలతో నాగబాబు ట్వీట్ చేశారు. (హై పిచ్లో బ్యాలెట్ బీట్) కాగా ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రకాశ్ రాజ్ స్థానిక రాజకీయాలపై ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ ఎన్నికల్లో పోటీచేయకుండా బీజేపీకి మద్దతునిచ్చి పవన్ కల్యాణ్ అందరినీ నిరాశపర్చాడు. గత సాధారణ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి వచ్చిన ఓటింగ్ శాతం ఎంత వచ్చిందో తెలియదా..? మీరు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ ఎందుకు వెళ్తున్నారు. 2014లో పవన్ ఎన్డీఏ తరుపున ప్రచారం చేస్తూ..మోదీని గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు. కానీ 2019లో ఆ మాటలు పక్కన పెట్టి లెఫ్ట పార్టీలతో కలిసి వెళ్లి..మోదీ, టీడీపీని విమర్శించారు. ఇక 2020 లో మళ్లీ బీజేపీతో కలిసి ముందుకొస్తున్నారు. పవన్ కల్యాణ్ ఓ ఊసరవెళ్లి తప్ప మరొకటి కాదు’ అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. -
బిగ్బాస్ : ఆ ఇద్దరికే నా సపోర్ట్.. నాగబాబు
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్ నాల్గో సీజన్ ముగింపుదశకు వచ్చింది. ఊహించని ట్విస్టులు, సరికొత్త టాస్క్లతో గత సీజన్ల కంటే ఎక్కువ వినోదాన్ని అందిస్తూ విజయవంతగా 11 వారాలు ముగించుకొని 12వ వారంలోకి అడుగుపెట్టింది. షో ముగింపునకు 25 రోజులే మిగిలి ఉండటంతో టైటిల్ విజేత ఎవరన్నదానిపై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలలోనూ ఆసక్తిమొదలైంది. మరోపక్క ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో హౌస్మేట్స్ ఫోకస్ అంతా గేమ్పైనే పెట్టారు. త్యాగాలు, సపోర్టులు పక్కకు పెట్టి విడివిడిగా గేమ్ ఆడుతున్నారు. ఇక ప్రేక్షకులు మాత్రం తమ అభిమాన కంటెస్టెంట్ని రక్షించేపనిలో పడ్డారు. ఎవరికి వారు తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. (చదవండి : బిగ్బాస్లోకి అనుకొని అతిథి.. దడుచుకున్న బోల్డ్ గర్ల్) ఈ తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా బిగ్బాస్పై స్పందించారు. జబర్దస్త్ కమెడియన్ అవినాష్, అభిజిత్లకు సపోర్ట్ చేయాల్సిందిగా వీడియో విడుదల చేశారు. అవినాస్ తనకు చాలాకాలంగా తెలుసని అతనికి సపోర్ట్ చేయాలని కోరారు. అయితే, బిగ్ బాస్ షోలో ఓసారి అవినాశ్ తీవ్ర భావోద్వేగాలకు గురికావడం గమనించానని, దాంతో అతడికి కొద్దిగా బ్యాడ్ నేమ్ వచ్చిందని అన్నారు. తనకు తెలిసినంత వరకు అవినాష్ ఎమోషనల్ వ్యక్తి కాదని, బహుశా బిగ్ బాస్ షోలో పరిస్థితుల కారణంగా భావోద్వేగాలకు లోనై ఉంటాడని తెలిపారు. అలాగే హౌస్లో తనకు బాగా నచ్చిన కంటెస్టెంట్ అభిజిత్ అని, అతని వ్యక్తిత్వం తనకు బాగా నచ్చిందని చెపుకొచ్చాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించిన అభిజిత్ ను తాను ఒకట్రెండు సార్లు కలిశాను. మొదటిసారి కలిసినప్పుడే నచ్చాడు. మంచి కుర్రాడు అనిపించాడు. అతను ఓ హీరోగా సక్సెస్ అయ్యుంటే బాగుండును అనిపించింది. కానీ సినిమా కెరీర్ విషయం అటుంచితే బిగ్ బాస్ లో మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడు. వ్యక్తిగతంగా అవినాష్కి నా సపోర్ట్ ఉన్నా కూడా నా మనసు, నా ఇష్టం మాత్రం అభిజిత్పైనే ఉంది. నన్ను సపోర్ట్ చేయమని ఎవరూ అడుగలేదు. ఎందుకో ఈ ఇద్దరికి సపోర్ట్ ఇవ్వాలనిపించింది. ఇద్దరిలో ఎవరు విజేత అయినా నాకు ఇష్టమే. ఇద్దరికి ఓట్లు వేసి ఫైనల్ వరకు తీసుకురండి’ అని తన అభిమానులను కోరారు. -
నిహారిక పెళ్లి డేట్ ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్
సాక్షి, తిరుపతి : ప్రముఖ నటుడు నాగబాబు కూమార్తె నిహారిక కొణెదల వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. డిసెంబర్ 9న వివాహం జరగనుంది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు ఈ ఏడాది ఆగస్ట్లో నిశ్చితార్థం జరిగిన విషయం విదితమే. పెళ్లి తేదీని వరుడి తండ్రి ప్రభాకరరావు మీడియాకు తెలిపారు. బుధవారం ప్రభాకరరావు దంపతులు తిరుమలకు విచ్చేసి, పెళ్లి శుభలేఖను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు అందుకున్నారు. (డిసెంబరులో మూడు ముళ్లు) అనంతరం ప్రభాకరరావు వివాహానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 9న రాత్రి 7.15 నిమిషాలకు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించారని తెలిపారు. అయితే పెళ్లి మాత్రం రాజస్థాన్లో జరగనుందట. ఉదయ్ పూర్ నగరంలోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ హోటల్లో వివాహ వేడుకను నిర్వహించనున్నట్లు ప్రకభాకర్ రావు తెలిపారు. ఇక పెళ్లి పనులు కూడా మెగా వారింట ఇప్పటికే మొదలయ్యాయి. (నిహారిక ఇంట పసుపు ఫంక్షన్) చదవండి: వైరల్: కొత్త పెళ్లి కూతురుగా నిహారిక -
నాగబాబు బర్త్డే : చిరంజీవి భావోద్వేగ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, నటుడు, నిర్మాత నాగబాబు పుట్టిన రోజు నేడు(అక్టోబర్ 29). ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు నాగబాబుకు బర్త్డే విషెష్ తెలియజేస్తున్నారు. ఇక తన తమ్ముడికి సోషల్ మీడియా వెదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. ‘విధేయుడు, భావోధ్వేగం కలిగిన వాడు, దయా హృదయుడు, సరదా వ్యక్తి నా సోదరుడు నాగబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను అంటూ చిరంజీవి తన ట్వీటర్ ద్వారా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇద్దరు తమ్ముళ్లు పవన్, నాగబాబులతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇక అన్నయ్య బర్త్డే ట్వీట్కు స్పందించిన నాగబాబు..‘థ్యాంక్స్ అన్నయ్య.. నేనేప్పుడు నీతోడుగానే ఉంటా’ అంటూ రిప్లై ఇచ్చాడు. (చదవండి : పారితోషికం తీసుకోవడంలేదు) అలాగే మెగా అల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ కూడా మామయ్య నాగబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడలు, కళలలోకి రావడంలో నన్నుప్రోత్సహించిన వారిలో నాగబాబు ఒకరు. ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేస్తూ నాగబాబుతో కలిసి దిగిన తన చిన్నప్పటి ఫోటోని షేర్ చేశాడు. అలాగే నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్, సినీ నిర్మాత బండ్ల గణేష్ తదితరులు సోషల్ మీడియా వేదికగా నాగబాబుకి బర్త్డే విషెష్ తెలియజేశారు. Happy Birthday to my passionately loyal, emotional, kind hearted and fun loving brother @NagaBabuOffl Have a great year ahead! మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని , నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను! pic.twitter.com/qswBwxgVfe — Chiranjeevi Konidela (@KChiruTweets) October 29, 2020 The man behind me getting into sports and arts...Wishing one of my pillars of support and strength @NagaBabuOffl mama, a very Happy Birthday. pic.twitter.com/dp9lxONvQb — Sai Dharam Tej (@IamSaiDharamTej) October 29, 2020 Happy birthday Nana! Thanks for this beautiful life you’ve given me.. And for always being my best friend!! Love you!❤️❤️❤️@NagaBabuOffl pic.twitter.com/cZvJ2CqYVG — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) October 29, 2020 బోలా నాగేంద్రుడి కి జన్మదిన శుభాకాంక్షలు @NagaBabuOffl 💐 pic.twitter.com/i4fGF7hZFi — BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2020 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1461324347.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1461324347.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1461324347.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Happy birthday Nanna! Here’s wishing that you’ll become funnier, more handsome and much more younger with each birthday! Love you to bits! ❤️ @NagaBabuOffl pic.twitter.com/dN0rO4BnK9 — Niharika Konidela (@IamNiharikaK) October 29, 2020 -
నాగబాబుకు అభినందనలు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ను జయించిన మెగా బ్రదర్ నాగబాబు కరోనా బాధితులకు అండగా నిలబడ్డారు. ప్లాస్మా దానం చేసి కోవిడ్ బాధితులకు ప్రాణదానం చేశారు. ఈ సందర్భంగా తమ్ముడు చేసిన మంచి పనిని అన్నయ్య చిరంజీవి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. "కోవిడ్-19తో పోరాడి గెలవడమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో సీసీటీ(చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్)లో ప్లాస్మా దానం చేసిన తమ్ముడు నాగబాబుకు అభినందనలు. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్నవారికి మరోమారు నా విన్నపం. మీరు ప్లాస్మా దానం చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు. దయచేసి ముందుకు రండి" అని మెగాస్టార్ పిలుపునిచ్చారు. ఈ ట్వీట్కు నాగబాబు ఫొటోను జత చేశారు. (చదవండి: నాగబాబుకు కరోనా పాజిటివ్) కాగా గత నెల 15న నాగబాబు కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ఈ మహమ్మారిని జయించి ప్లాస్మాదాతగా మారతానని మాటిచ్చారు. సెప్టెంబర్ 27వ తేదీన మహమ్మారిని జయించారు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నాగబాబు తాజాగా ప్లాస్మాదానం చేయగా ఆయన ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. (చదవండి: కరోనా: పేదలకు అండగా మెగాస్టార్) covid 19 తో పోరాడి గెలవటమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో, CCTలో plasma donate చేసిన తమ్ముడు @NagaBabuOffl కి అభినందనలు👌👍ఈ సందర్భంగా covid నుంచి కోలుకున్నవారికి మరో మారు నా విన్నపం. మీరు plasma donate చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు.దయచేసి ముందుకు రండి.🙏 #DonatePlasma pic.twitter.com/L8nUPJPinc — Chiranjeevi Konidela (@KChiruTweets) October 15, 2020 -
ప్లాస్మా దానం చేస్తా
తెలుగు ఇండస్ట్రీలోనూ కరోనా వ్యాప్తి చెందుతోంది. ఆ మధ్య దర్శకుడు రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు, తేజ వంటి వారు కోవిడ్ బారినపడ్డారు. తాజాగా నటుడు నాగబాబుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ఆయనే తెలిపారు. ఈ విషయం గురించి ఇలా రాసుకొచ్చారాయన. ‘వైరస్ అనేది ప్రతిసారీ మనల్ని బాధకు గురి చేసేది కాదు, ఇతరులకు సహాయం చేసే అవకాశాన్ని కూడా కల్పించేది అవుతుంది. కరోనా పాజిటివ్ అని తేలింది. దీన్ని తట్టుకుని నిలబడి ప్లాస్మా దానం చేయాలనుకుంటున్నాను’ అన్నారు నాగబాబు. -
నాగబాబుకు కరోనా పాజిటివ్
మెగా బ్రదర్, నటుడు, నిర్మాత నాగబాబుకు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన ఇటీవలే పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. "ఓ వ్యాధి వచ్చిందని ఎప్పుడూ బాధగా ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని ఇతరులకు సాయం చేయడానికి దొరికిన అవకాశంగా మలుచుకోవచ్చు. నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. త్వరలోనే దీన్ని జయించి ప్లాస్మాదాతగా మారుతాను" అని చెప్పుకొచ్చారు. (చదవండి: వైభవంగా నిహారిక నిశ్చితార్థం) ఈ పోస్ట్ చూసిన ఆయన అభిమానులు నాగబాబు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. దర్శకుడు మారుతి సైతం ఆయన వేగంగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన నాగబాబు "మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు" అని రిప్లై ఇచ్చారు. కాగా టాలీవుడ్లో దర్శకుడు రాజమౌళి కుటుంబం, డైరెక్టర్ తేజ, సింగర్లు సునీత, మాళవిక, స్మిత, నటులు రవికృష్ణ, నవ్య స్వామి, పార్వతి సహా పలువురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో చాలామంది ప్లాస్మా దానం కూడా చేశారు. (చదవండి: కరోనా : సీనియర్ జర్నలిస్టు, నటుడు మృతి) ."An Infection doesnt always has to be a Suffering, You can always transform it into an opportunity to help the fellow Beings". Tested Covid-19 +ve. Will Scuffle & Strife through this and Will be a Plasma Donor.#covidwarrior #plasmadonor pic.twitter.com/2EeZItJ4ub — Naga Babu Konidela (@NagaBabuOffl) September 15, 2020 -
ట్రైలర్ చాలా బాగుంది
‘‘అవలంబిక’ ట్రైలర్ చాలా బాగుంది. రాజశేఖర్ చాలా కష్టపడి ఈ సినిమాని చేశాడని తెలుస్తోంది. యువ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుంది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించారు’ అని నటుడు, నిర్మాత నాగబాబు అన్నారు. సుజయ్, అర్చన (వేద) జంటగా రాజశేఖర్ (రాజ్) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అవలంబిక’. శ్రీ షిరిడీ సాయి ప్రొడక్ష¯Œ ్స పతాకంపై జి.శ్రీనివాస్ గౌడ్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ని నాగబాబు విడుదల చేశారు. ‘‘ఈ సినిమాని భారీ గ్రాఫిక్స్తో చిత్రీకరించాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు రాజశేఖర్. ‘‘ఖర్చుకు వెనకాడకుండా గ్రాండ్గా ఈ చిత్రం నిర్మించాం’’ అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుజయ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకీ పెద్దాడ, సంగీతం: ఉదయ్ కిరణ్. -
వైభవంగా నిహారిక నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్: ముందుగా అనుకున్న తేదీ ప్రకారమే కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల-చైతన్యల నిశ్చితార్థం నేడు హైదరాబాద్లో ఘనంగా జరిగింది. గురువారం రాత్రి ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ ఎంగేజ్మెంట్కు అతి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. నిహారిక జంటకు ఇరువైపులా నాగబాబు, చిరంజీవి ఫ్యామిలీ కలిసి దిగిన ఫొటో అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. వీరి నిశ్చితార్థ సంబరానికి మెగాపవర్ స్టార్ రామచరణ్ సతీసమేతంగా విచ్చేశారు. అల్లు అర్జున్తో పాటు సాయిధరమ్తేజ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. (కాబోయే భర్త ఫోటో షేర్ చేసిన నిహారిక!) మెగా ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేములో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎంగేజ్మెంట్కు వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకునే కనిపించారు. చిరంజీవి, ఆయన సతీమణి కూడా మాస్కులు పెట్టుకుని కోవిడ్ జాగ్రత్తలను పాటించారు. అయితే బంధువులతో సరదాగా మాట్లాడే సమయంలో మాత్రం మాస్కు తీసేసి కనిపించారు. కాగా నిహారికది అరేంజ్డ్ మ్యారేజ్. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్ కుమారుడు చైతన్యతో ఏడడుగులు వేయబోతున్నారు. ఆయన హైదరాబాద్లోని ఓ ఎమ్ఎన్సీ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్గా వర్క్ చేస్తున్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వైరల్: కొత్త పెళ్లి కూతురుగా నిహారిక
ఇప్పటికే దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగగా త్వరలోనే మెగా ఫ్యామిలీలోనూ పెళ్లి పనులు మొదలవ్వనున్నాయి. కొణిదెల నాగబాబు కూతురు, హీరోయిన్ నిహారిక తన మెడలో కోరుకున్న వరుడితో మూడు ముళ్లు వేయించుకోనున్నారు. తన చేయి పట్టి ఏడడుగులు నడవబోయే ఆ పెళ్లి కొడుకు గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్ కుమారుడు చైతన్య జొన్నలగడ్డ అని సోషల్ మీడియాలో ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు ప్రేమ జంట ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. అయితే పెళ్లి తేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ ఓ షోలో పెళ్లి కూతురుగా ముస్తాబైన నిహారిక తెగ సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె తండ్రి నాగబాబే జడ్జి కావడం విశేషం. వినాయక చవితి సందర్భంగా "బాపు బొమ్మకు పెళ్లంట" అని ప్రత్యేక కార్యక్రమం రాబోతోంది. (హ్యాపీ బర్త్డే.. లవ్ : నిహారిక) దీనికి సంబంధించిన ప్రోమోలు యూట్యూబ్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ షోలో నిహారిక పల్లకి నుంచి దిగారు. ఎప్పుడూ పంచ్లతో ఎదుటివారిని మాట్లాడకుండా చేసే నిహారిక కాబోయే భర్త గురించి అడిగేసరికి సిగ్గుల మొగ్గయ్యారు. భర్తతో కలిసి ప్రోగ్రామ్కు విచ్చేసిన యాంకర్ అనసూయ.. నిహారికకు ముందస్తు కానుకను కూడా అందించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో జానీ మాస్టర్తో పాటు బిగ్బాస్ కంటెస్టెంట్ బాబా భాస్కర్ కూడా పాల్గొన్నారు. ఇదిలా వుంటే నిహారిక, చైతన్యల నిశ్చితార్థం నేడు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆరణాల అచ్చ తెలుగు అమ్మాయి నిహారిక కొత్త పెళ్లి కూతురిగా తయారైన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (కుమారి శ్రీమతి కానుంది) -
టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
సాక్షి, అమరావతి: రాజధాని రైతులకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ డిమాండ్ చేశారు. తమ ప్రాంతం నుంచి రాజధాని తరలిపోతున్నందున అమరావతిని నిలుపుకునేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలూ రాజీనామాలు చేసి పోరాటం చేయాలన్నారు. జనసేన పార్టీకి శాసన ప్రక్రియలో ఏ కొద్దిపాటి భాగస్వామ్యం ఉన్నా మొదటగా రాజీనామాలు చేసేదన్నారు. పవన్ అధ్యక్షతన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది. టెలీకాన్ఫరెన్స్లో పవన్ ఏమన్నారంటే.. ► కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నివారణ చర్యలు చేపట్టలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజధాని వికేంద్రీకరణ క్రీడకు తెరతీసింది. ► అమరావతి నిర్మాణంలో ఇప్పటివరకు జనసేన ప్రమేయమేలేదు. ► రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులతో, నిపుణులతో కూలంకషంగా చర్చించి ముందుకు వెళ్తాం. ఈ పరిస్థితికి కారకుడు చంద్రబాబే: నాగబాబు రాజధాని తరలింపునకు కారకుడు చంద్రబాబేని జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు వ్యాఖ్యానించారు. ‘నాడు ఆయన చేసిన తప్పిదాలనే జగన్ అనుకూలంగా మార్చుకుని రాజధాని తరలిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. సమావేశంలో నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
నాగబాబు కొత్త షో : విజిల్ ప్రీ లోడెడ్
హైదరాబాద్ : ట్యాలెంట్ ఉన్న హ్యాస్యనటులను ప్రోత్సహించేందుకు నటుడు నాగబాబు డిజిటల్ మీడియా వేదికగా రెండు కొత్త షోలను ప్రారంభించనున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి స్టాండప్ కామెడీ షో, మరోకటి ‘అదిరింది’ మాదిరి కామెడీ స్కిట్స్ అని తెలిపారు. అందులో ఇప్పటికే స్టాండప్ కామెడీ షో.. ఖుషీ ఖుషీగా వివరాలను జబర్దస్త్ నటుడు బుల్లెట్ భాస్కర్ వెల్లడించారు. తాజాగా కామెడీ స్కిట్స్తో కూడిన షో వివరాలను జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను ఓ వీడియో ద్వారా వివరించారు.(రెండు రోజుల తర్వాత కరోనా అంటూ ఫోన్..!) షో పేరు విజిల్.. ప్రీలోడెడ్ అని తెలిపారు. ఈ డిజిటల్ షోలో అవకావం దక్కించుకోవడానికి ఏం చేయాలో కూడా వివరించారు. ఆ తర్వాత ఎంపిక ప్రకియ ఎలా కొనసాగుతుందో కూడా తెలిపారు. ఎంపికైనవారికి ప్రోత్సహకాలు ఉంటాయని చెప్పారు. నాగాబాబు ఆధ్వర్యంలోని జడ్జిమెంట్ ప్యానల్ చివరకు.. ఆరు టీమ్లను ఎంపిక చేసి వాటి మధ్య ఫైనల్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వీరికి ఓటీటీ ప్లాట్ఫామ్లో అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. ఈ షోలో పాపులర్ కమెడియన్స్ కూడా పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. (హీరోయిన్ ఐశ్వర్య అర్జున్కు కరోనా) Here's a golden chance for all the Talented people. Don't miss this opportunity! Registration link - https://t.co/K2jXq5AfqW Watch Here: https://t.co/NEJVY6C86A#VijilPreloadedShow #NagaBabu #GetupSrinu #ManaChannelManaIshtam — Naga Babu Konidela (@NagaBabuOffl) July 20, 2020 -
నిహారిక పోస్ట్: పెళ్లి గురించేనా?
మెగాడాటర్ నిహారిక కొణిదెల ఇన్స్టాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా నిహారిక పెళ్లి వార్తలపై అనేక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆమె చేసిన పోస్ట్లో.. ఓ కాఫీ కప్పై ‘మిస్ నిహారిక’ అని రాసి ఉంటుంది. ఆ తర్వాత మిస్ అనే పదాన్ని కొట్టేసి దాని కిందే మిసెస్ అని రాసి పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టింది. అంతేకాకుండా `ఉహ్.. వాట్?` అనే కామెంట్ను కూడా జత చేసింది. ఈ పోస్ట్ క్షణాల్లోనే తెగ వైరల్ అయింది. (నిహారిక, యశ్ల డ్యాన్స్ చూశారా?) పెళ్లి గురించి నిహారిక హింట్ ఇచ్చింది అని నెటిజన్లు పేర్కొంటుండగా మరికొంత మంది ఓ అడుగు ముందుకేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో నిహారిక పెళ్లిపై మరోసారి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వరుడు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్ట్కు చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ సైతం స్పందిస్తూ.. వై అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక వచ్చే ఏడాది నిహారిక పెళ్లి ఉంటుందని ఇప్పటికే నాగబాబు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె పెళ్లి గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే నిహారిక పోస్టుపై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ('ప్రభాస్ను నేను పెళ్లి చేసుకోవడం లేదు') View this post on Instagram Uh.. what? A post shared by Niharika Konidela (@niharikakonidela) on Jun 17, 2020 at 6:45am PDT -
టాలీవుడ్లో ముదురుతున్న వివాదం
-
నన్ను ఒక్కడూ పిలవలేదు : బాలకృష్ణ
ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని షూటింగ్లు ప్రారంభించాలి? థియేటర్లు మళ్లీ ఎలా ఓపెన్ చేయాలి? అనే విషయాల గురించి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పలువురు సినీ ప్రముఖులు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి గురువారం నటుడు బాలకృష్ణ వద్ద మీడియా ప్రస్తావించగా, ‘‘ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి అంట. వార్తల ద్వారా, పత్రికల ద్వారా విషయం తెలుస్తోంది. అంచలంచెలుగా షూటింగ్స్కి అనుమతి ఇస్తారని తెలిసింది’’ అన్నారు. అనంతరం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ‘‘చాలా మీటింగులు జరిగాయి. నన్ను ఎవ్వరూ పిలవలేదు. ఎవరు పిలిచారు నన్ను? వీళ్లందరూ ఏమైనా భూములు పంచుకుంటున్నారా... శ్రీనివాస్ యాదవ్తో కూర్చుని. నన్ను ఒక్కడూ పిలవలేదు’’ అన్నారు బాలకృష్ణ. నోరు అదుపులో పెట్టుకోండి : నాగబాబు ఈ విషయంపై నటుడు నాగబాబు తన యూట్యూబ్ చానల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నాగబాబు మాట్లాడుతూ – ‘‘షూటింగ్స్ ఎలా ప్రారంభించాలని తలసాని శ్రీనివాస యాదవ్తో కలసి చిరంజీవిగారింట్లో నాగార్జునగారు, రాజమౌళిగారు, అరవింద్గారు, సురేశ్బాబుగారు, ఇంకా ఇండస్ట్రీకి సంబంధించిన నటులు, నిర్మాతలందరూ చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. చాలా తక్కువ మందినే పిలిచారు. ఆ మీటింగ్ నేపథ్యం ఏంటో సరిగ్గా తెలియదు. ఇవాళ బాలకృష్ణగారి కామెంట్స్ చూశాను. ఆయన్ను మీటింగ్కి పిలవకపోవడం తప్పా? ఒప్పా నాకు తెలియదు. పిలిచారా పిలవలేదా? అని ఈ మీటింగ్స్ని నిర్వహించినవాళ్లను అడగాల్సిన బాధ్యత బాలకృష్ణ మీద ఉంది. పిలవలేదని కోప్పడ్డారు. సరే.. కోప్పడ్డానికి రీజన్ ఉంది. కానీ ‘భూములు పంచుకుంటున్నారు’ అని నోరు జారారు. మిమ్మల్ని పిలవకపోవడం కరెక్ట్ అని నేను అనను. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అయ్యుంటుంది. వేరే కారణం అయ్యుండొచ్చు. ఆ కారణం తెలుసుకొని అడిగినా తప్పు లేదు. కానీ భూములు పంచుకుంటున్నారన్న మాట నిర్మాతగా, నటుడిగా నాకు బాధ కలిగించింది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతానంటే కరెక్ట్ కాదు. మీకంటే పదిరెట్లు ఎక్కువ మాట్లాడటానికి చాలా మంది ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి బాలకృష్ణగారూ. ఇండస్ట్రీ బాగు కోసం పని చేస్తున్నారు తప్ప, భూములు పంచుకోవడానికి ఎవ్వరూ వెళ్లలేదు. మమ్మల్ని కూడా చాలామంది పిలవలేదు. ఆ మాటలేంటి? ఇండస్ట్రీ మీద మీకున్న గౌరవం ఇదా? మీరు కేవలం ఇండస్ట్రీనే కాదు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అవమానించారు. ఇండస్ట్రీకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పడం మీ బాధ్యత. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మీకు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఆంధ్రప్రదేశ్ని ఎలా నాశనం చేశారో, సామాన్యుల జీవితాలు ఎలా నాశనం అయ్యాయో మీ తెలుగు దేశం పార్టీని నమ్మినవాళ్లను అడిగితే తెలుస్తుంది. ఇండస్ట్రీకి మీరు కింగ్ కాదు. ఒక హీరో మాత్రమే. కంట్రోల్గా మాట్లాడటం నేర్చుకోండి’’ అన్నారు. మాలో విభేదాలు లేవు – నిర్మాత సి. కల్యాణ్ నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘మీటింగ్స్ అన్నీ నిర్మాతల తరఫునుంచి, స్టూడియోల సైడ్ నుంచి జరుగుతున్నాయి తప్పితే ఆర్టిస్టుల నుంచి కాదు. ఆర్టిస్టుల ఇబ్బందులు చెప్పడానికి ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఉంది. దాని నుంచి నరేశ్గారు, జీవితగారు హాజరయ్యారు. ఎవరితో ఏది చర్చించాలంటే ఇండస్ట్రీ వాళ్లను పిలుస్తుంది. ఇండస్ట్రీలో ఉండే ఎవరైనా ఇండస్ట్రీని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం అని ముందుకు వస్తే వాళ్ల వెనక ఉండటానికి మేం సిద్ధంగా ఉన్నాం. మధ్యాహ్నమే (గురువారం) బాలకృష్ణగారికి అన్నీ వివరించాను. ఆయన సంతృప్తిగానే ఉన్నారు. ఈ విషయం మీద ఇక చర్చలు ఉండవనుకుంటున్నాను. ఇక మీటింగ్స్ ఉండకపోవచ్చు. బాలకృష్ణగారు మా హీరో. ఆయన మనిషిగా నేను ఇందులో పాల్గొంటున్నట్టే లెక్క. మాకు ఇద్దరు ముఖ్యమంత్రులూ ముఖ్యం. అందరం ఒకటే. ఇక్కడ గ్రూపులు లేవు. దాసరిగారు ఉన్నప్పుడు అన్నీ ఆయన భుజాన వేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవిగారిని మేమే అడిగాం. నాగార్జునగారూ వచ్చారు. బాలకృష్ణగారు కూడా రెడీగా ఉన్నారు. ఎక్కడ ఎవరు అవసరమైతే వాళ్లను పిలుచుకుని వెళ్లడానికి మేం రెడీ. పని జరగడం ముఖ్యం. మేం ఏ పార్టీలకు సంబంధించిన వాళ్లం కాదు. బాలయ్యగారు వస్తానంటే ఎవరైనా వద్దంటారా? మాలో విభేదాలు లేవు. బాలయ్యను సొంత బ్రదర్లా భావిస్తాను’’ అన్నారు. -
టాలీవుడ్లో మరో వివాదం
-
సీఎం జగన్కు నాగబాబు అభినందనలు
సాక్షి, అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా దీనిపై సినీ నటుడు నాగబాబు స్పందించారు. టీటీడీ భూముల అమ్మకాన్ని నిలివేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్విరీ చేసి నిజాలను నిగ్గు తేల్చండి. థాంక్యూ యు సీఎం గారు’ అని ట్వీట్ చేశారు. (2016 టీటీడీ బోర్డు నిర్ణయం నిలుపుదల) -
నాగబాబు అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పేరుతో జనసేన పార్టీ మీడియా విభాగం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జనసేనలో ఉండే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలే. ఈ మధ్యకాలంలో కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందినవారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున.. మరోసారి ఈ విషయాన్ని మీకు విశదీకరిస్తున్నాను’ అని పేర్కొన్నారు. జనసేన అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నామని, వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని పేర్కొన్నారు. -
నాగబాబు ట్వీట్లపై స్పందించిన పవన్
సాక్షి, హైదరాబాద్ : వరుస వివాదాస్పద ట్వీట్లతో విమర్శలు ఎదుర్కొంటున్న సినీ నటుడు, జనసేన నేత నాగబాబు తీరుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలతో తమ పార్టీకి ఎటువంటి సంబంధంలేదని పవన్ స్పష్టం చేశారు. గత మూడురోజులుగా నాగబాబు చేస్తున్న వివాదాస్పద పోస్టులు కూడా ఆయన వ్యక్తిగతమైనవని, వీటితో జనసేన పార్టీకి సంబంధంలేదని అన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజాసేవ ద్వారా ఎటువంటి అంశాల జోలికి వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు. ఈ మేరకు శనివారం పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు. (గాడ్సే నిజమైన దేశ భక్తుడు: నాగబాబు) పవన్ కల్యాణ్ లేఖలో స్పందిస్తూ.. ‘జనసేన పార్టీలో లక్షలాదిగా వున్న కార్యకర్తలు, జన సైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వ్యక్తిగత అభిప్రాయాలే గానీ.. పార్టీకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేస్తున్నా. గతంలో కూడా మీడియా ద్వారా ఇదే విషయాన్ని చెప్పాను. ఈ మధ్య కాలంలో కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన కొందరు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవి. పార్టీకి ఎటువంటి సంబంధంలేదు. పార్టీ అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికారిక పత్రం ద్వారా మాత్రమే వెల్లడిస్తాం. కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో మనం ప్రజాసేవ తప్పమరే ఇతర అంశాల జోలికి వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలను కోరుతున్నాను. ఎవరూ కూడా క్రమశిక్షను అతిక్రమించవద్ద’ అని లేఖలో పేర్కొన్నారు. (నాగబాబుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు) కాగా మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరం గాడ్సే దేశ భక్తుడంటూ నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే శనివారం ఆయన మరో పోస్ట్ చేశారు. ‘భారత కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజ్పేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉందంటూ కొత్త వివాదానికి తెరలేపారు. వివాదాస్పద ట్వీట్లతో సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నాగబాబు పోస్టులతో జనసేనకు సంబంధంలేదని పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. (కరెన్సీ నోట్లపై వారి ఫోటోలు కూడా) -
నాగబాబు మరో సంచలన ట్వీట్: వైరల్
హైదరాబాద్ : మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు కొణిదెల సోషల్ మీడియాలో రోజుకో సంచలనం సృష్టిస్తున్నారు. ఇటీవలె జాతిపిత మహాత్మ గాంధీజీని హత్యచేసిన నాథూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ వివాదస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. నాగబాబు వ్యాఖ్యలపై గాంధేయవాదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భగ్గుమన్నారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. తాజాగా ఈ మెగా బ్రదర్ చేసిన మరో ట్వీట్ వివాదస్పదమవుతోంది. ‘భారత కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజ్పేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్బావానికి కృషి చేసి మహానుభావులను జనం మర్చిపోకూడదని ఒక ఆశ’ అంటూ ట్వీట్ చేశారు. ‘గాంధీ గారు బతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసి దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్లపై వారి ముఖ పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అంటూ మరో ట్వీట్లో నాగబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెంటు ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే నాగబాబు వ్యాఖ్యలపై కొందరు మండిపడుతుండగా మరికొందరు సమర్థిస్తున్నారు. చదవండి: గాడ్సే నిజమైన దేశభక్తుడు పార్టీకి, ఫ్యామిలీకి సంబంధం లేదు : నాగబాబు అక్కినేని ‘మనం’.. ఎన్నేళ్లైనా మరువం -
పార్టీకి, ఫ్యామిలీకి సంబంధం లేదు : నాగబాబు
హైదరాబాద్ : నాథూరాం గాడ్సే దేశభక్తిని శంకించలేమని సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆయన పోస్ట్పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి నాగబాబుపై చర్యలు తీసుకోవాలని కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తన ట్వీట్కు సంబంధించి నాగబాబు వివరణ కూడా ఇచ్చారు. తాజాగా తాను చేసే ట్వీట్లకు సంబంధించి పూర్తి బాధ్యత తనదేనని నాగబాబు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ఆయన ఓ పోస్ట్ చేశారు.(చదవండి : నాగబాబుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు) ‘నేను ఏ అంశంపై ట్వీట్ చేసినా.. అది నా వ్యక్తిగత బాధ్యతే. జనసేన పార్టీకిగానీ, మా కుటుంబ సభ్యులకుగానీ నా అభిప్రాయాలలో ఎటువంటి ప్రమేయం లేదు’ అని పేర్కొన్నారు. కాగా, గాడ్సే పుట్టిన రోజున నాగబాబు చేసిన ట్వీట్ వివాదస్పదం కావడంతో ఆయన వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాథూరాం గురించి ఇచ్చిన ట్వీట్ లో అతను చేసిన నేరాన్ని సమర్థించలేదు.నాథూరాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను.నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం.ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం’ అని పేర్కొన్నారు.(చదవండి : గాడ్సే నిజమైన దేశభక్తుడు) Whatever i tweet on anything,it's my personal responsibility.janasena party or any of my family has no involvement in my opinion — Naga Babu Konidela (@NagaBabuOffl) May 20, 2020 -
నాగబాబుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : జాతిపిత మహాత్మా గాంధీని కించపరిచారంటూ సినీ నటుడు, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబుపై టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. నాగబాబుపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం మానవతారాయ్ మాట్లాడుతూ.. నాగబాబుకు మతిభ్రమించిందని, ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించాలన్నారు. మానసిక స్థితి బాగాలేకపోవడంతోనే ట్విటర్లో గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడని కొనియాడారని విమర్శించారు. నాగబాబుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మానవతారాయ్ డిమాండ్ చేశారు. కాగా, మంగళవారం గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే జన్మదినం సందర్భంగా నాగబాబు వివాదస్పద ట్వీట్ చేసిన విషయం తెలసిందే. ‘ఈరోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశభక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది డిబేటబుల్. అతని వైపు వాదనని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు అంతే). గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఓసారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. చదవండి: గాడ్సే నిజమైన దేశ భక్తుడు: నాగబాబు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను: ఎన్టీఆర్ ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ..contd pic.twitter.com/WNIpG6gsVO — Naga Babu Konidela (@NagaBabuOffl) May 19, 2020 -
గాడ్సే నిజమైన దేశభక్తుడు
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు వివాదాస్పద ట్వీట్తో వార్తల్లోకెక్కారు. మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేను పొగుడుతూ, గాంధీజీ హత్య గురించి చర్చించాలంటూ ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమవుతోంది. ‘ఈరోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశభక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది డిబేటబుల్. అతని వైపు వాదనని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు అంతే). గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఓసారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ మంగళవారం ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ఈ పోస్టు పట్ల నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడటం వల్లే జనసేనను ప్రజలు ఆదరించలేదని, కసబ్ కూడా తాను నమ్మిన సిద్ధాంతం కోసం యుద్ధం చేశాడని, ఆయన దేశభక్తిని శంకించలేమని చెప్పినట్లు ఉందని కొందరు ట్వీట్ చేశారు. మొత్తమ్మీద గాడ్సే పుట్టినరోజు పేరుతో నాగబాబు చేసిన ఈ ట్వీట్ వివాదాస్పదమవుతూనే అసలీ పోస్టు ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది.. ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. -
గాడ్సేపై నాగబాబు వివాదాస్పద ట్వీట్
సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేపై సినీనటుడు నాగబాబు వివాదాస్పద ట్వీట్ చేశారు. నాథురాం గాడ్సే దేశభక్తిని శంకించలేమని, ఆయన నిజమైన దేశ భక్తుడని కొనియాడారు. మంగళవారం గాడ్సే జయంతి సందర్భంగా నాగబాబు ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ రోజు నాథురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది చర్చనీయాంశం. కానీ అతని వైపు వాదనలను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి మాత్రమే పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తాను అనుకున్నది చేశాడు. నాథురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తుచేసుకోవాలనిపించింది. పాపం నాథురాం గాడ్సే.. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.’ అని ట్విటర్లో అభిప్రాయపడ్డారు. (అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశా) గాడ్సేపై నాగబాబు చేసిన పోస్ట్పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గాంధీని చంపిన వ్యక్తి దేశ భక్తుడు ఎలా అవుతాడు..? అంటూ కొంతమంది ప్రశ్నించగా.. అతను ముమ్మాటికీ హంతకుడేనని మరికొందరు ట్వీట్ చేశారు. ‘ఇంకా నయం డబ్బులు మీద గాంధీ బొమ్మ కాకుండా గాడ్సే బొమ్మ ఉండాలి అని చెప్పలేదు సంతోషం’ అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా స్పందించారు. -
‘డియర్ విజయ్.. నేనర్థం చేసుకోగలను’
‘కిల్ ఫేక్ న్యూస్’ అంటూ పిలుపునిచ్చిన టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండకు మెగాస్టార్ చిరంజీవి మద్దతుగా నిలిచాడు. కరోనాపై పోరాటంలో భాగంగా తాను చేస్తున్న సహాయ కార్యక్రమాలపై విషప్రచారం చేస్తున్న పలు వెబ్సైట్లపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనపై తప్పుడు వార్తలు రాసిన వెబ్సైట్లను కడిగిపడేస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. ఇక ఈ విషయంలో విజయ్కు మద్దతుగా మహేశ్బాబు, క్రిష్, కొరటాల శివ, అనిల్ రావిపూడి తదితరులు ట్వీట్లు చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా విజయ్కు సంఘీభావం తెలుపుతు ట్వీట్ చేశారు. ‘డియర్ విజయ్ మీ ఆవేదన అర్థం చేసుకోగలను. బాధ్యతలేని రాతల వల్ల మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము మీతో ఉన్నాం. ఏది ఏమైనా మంచి చేయాలనే నీ స్పూర్థిని కొనసాగించు. అదేవిధంగా జర్నలిస్టు సోదరులకు చిన్న విజ్ఞప్తి. మీ సొంత అభిప్రాయాలను వార్తలుగా ప్రచురించవద్దు’ అంటూ చిరు ట్వీట్ చేశారు. 'హాయ్ విజయ్.. నేను నీకు మద్దతు తెలుపుతున్నాను. ఇటువంటి వెబ్సైట్లపై స్పందించడంలో ఇప్పటికే సినీ పరిశ్రమ చాలా ఆలస్యం చేసింది. సినీ పరిశ్రమ నుంచి వారు జలగల్లా రక్తం పీల్చుకుని తాగుతున్నారు. అలాంటి ఫేక్ న్యూస్ రాసే వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అంటూ చిరంజీవి సోదరుడు నాగబాబు ట్వీట్ చేశారు. చదవండి: ‘మీరెవరు నన్ను అడగడానికి.. అది నా ఇష్టం’ ‘ఆచార్య’లో అనసూయ.. చరణ్తో? డియర్ విజయ్@TheDeverakonda మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.We stand by you. Pl don't let anything deter ur spirit to do good.Humbly request Journo friends not to peddle individual views as news.#KillFakeNews — Chiranjeevi Konidela (@KChiruTweets) May 5, 2020 @TheDeverakonda hai vijay i strongly support your #killfakenews #killgossipwebsites.its already too late from the film industry to react certain parasitic websites who are like leeches drinking blood from the film industry.thank you for your reaction.Time to take action my boy — Naga Babu Konidela (@NagaBabuOffl) May 5, 2020 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1081263436.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం
సాక్షి, హైదరాబాద్: ఉగాది పండుగ సందర్భంగా ప్రముఖ వినోద చానెల్ జీ తెలుగు ‘బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం’ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమంలో ఆదివారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగాది సంబరాల సందర్భంగా పూర్ణాలు, పూతరేకులు, గారెలు, పులిహోర, ఉగాది పచ్చడి, ఉలవచారు, పప్పు చారు, గుత్తి వంకాయ కూర, చల్ల మిర్చి...వంటి అచ్చ తెలుగు వంటకాల విశిష్టతకు అద్దం పడతూ ఈ కార్యక్రమం కొనసాగుతోంది. హీరోయిన్ అనుష్క ప్రధాన ఆకర్షణగా.. నటుడు నాగబాబు, ఆయన కుమార్తె నీహారిక, యాంకర్స్ అనసూయ భరద్వాజ్, ప్రదీప్ మాచిరాజు, రవి, పలువురు డ్యాన్స్ మాస్టర్స్... పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా తమ నటనతో అదరగొట్టారు. నీహారిక ... ‘ఓ మై డాడీ’ అంటూ మైక్ పట్టి పాట పడితే... అనసూయ... ‘మహానటి’ గా అభినయించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అయింది. -
నాగబాబుగారికి ధన్యవాదాలు : అంబటి
సాక్షి, అమరావతి : సినీ నటుడు, జనసేన నేత నాగబాబు వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. నాగబాబు వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా అంబటి కౌంటర్ ఇచ్చారు. ‘నేను ‘తోకలేని పిట్ట’ చిత్రంలో నటించిన సంగతి నేనే మరచితిని.. గుర్తుంచుకున్నందుకు నాగబాబుగారికి ధన్యవాదాలు నటనలో ఓటమిపాలై నిష్క్రమించాను నేను.. రాజకీయాలలో ఓటమిపాలైన మీరు నిష్క్రమిస్తారా.... లేక’ అంటూ నాగబాబుపై వ్యంగ్య ధోరణిలో మండిపడ్డారు. నాగబాబు ట్వీటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పైవిధంగా స్పందించారు. ‘బహు పాత్రలలో బాగు బాగు’ అని పేర్కొంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై కూడా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. బహు పాత్రలలో బాగు బాగు @NagaBabuOffl pic.twitter.com/t448AvOnfM — Ambati Rambabu (@AmbatiRambabu8) January 18, 2020 చదవండి: ‘హోదా’ వదిలేశా సాంబా! ‘పవన్ కల్యాణ్కు నేరుగా 10 ప్రశ్నలు’ ‘పవన్ కల్యాణ్ అలా చేసి ఉండాల్సింది’ పార్ట్నర్స్ వేసిన మరో ప్లాన్..! నేనేమైనా వాళ్లకు బాకీ ఉన్నానా? -
అందుకే జబర్దస్త్ నుంచి బయటకు : నాగబాబు
సాక్షి, హైదరాబాద్ : గత ఏడేళ్లుగా తెలుగు బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్న బిగ్గెస్ట్ కామెడీ షో ‘జబర్దస్త్’ నుంచి నటుడు నాగబాబు తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రకటించారు. గురువారం నాగబాబు తన యూట్యూబ్ చానెల్ ద్వారా మాట్లాడుతూ.. రేపటి (శుక్రవారం) ఎపిసోడ్తో జబర్దస్త్లో తన జర్నీ ముగుస్తుందని చెప్పారు. ‘నాకు ప్రతి గురువారం, శుక్రవారం చాలా ముఖ్యమైన రోజులు. 2013 నుంచి 2019 వరకు జబర్దస్త్తో నా ప్రయాణం కొనసాగింది. ఈ ప్రయాణం మరిచిపోలేనిది. నాకు నేనుగా జబర్దస్త్ నుంచి బయటకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. బిజినెస్కు సంబంధించిన ఐడియాలాజికల్ విభేదాల వల్ల బయటకు వచ్చానే తప్ప దీంట్లో ఎవరి తప్పు లేదు. జబర్దస్త్ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డికి థ్యాంక్స్. నేను ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు జబర్దస్త్లోకి వచ్చాను. నా స్థాయికి తగ్గటు కాకపోయినా మంచి రెన్యూమరేషన్ ఇచ్చారు. అది నాకు చాలా ఉపయోగపడింది. రెన్యూమరేషన్ విషయంలో విభేదాలు వచ్చి వెళ్లిపోయాడనేది అబద్ధం. నేను పారితోషికం కోసమే జబర్దస్త్కి రాలేదు. నాకు అది పెద్ద విషయమే కాదు. హాలిడే ట్రిప్పులా ఇన్ని రోజులు షో నడిచింది. ఈ విషయంలో మరోసారి శ్యాంప్రసాద్రెడ్డి ధన్యవాదాలు చెబుతున్నాను. నా జర్నీ ఎలా మొదలైంది. ఎలా క్లోజ్ అయిందనేది తర్వాత రోజుల్లో చెబుతాను’ అని నాగబాబు పేర్కొన్నారు. -
జీవితమంటే ఆట కాదు
రాఘవసాయి, నాగబాబు, చాణక్య హీరోలుగా స్నేహాల్కామత్, మమతారెడ్డి, దీక్ష హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖేల్’. ‘లైఫ్ ఈజ్ నాట్ ఏ గేమ్’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమాతో శరత్ కుమార్. ఆర్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. గ్లోబల్ మోషన్ పిక్చర్స్ సమర్పణలో మాన్సీ మూవీస్ పతాకంపై గొట్టిముక్కల పాండురంగారావు, పులి అమృత్గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ– ‘‘భారతదేశంలో హైదరాబాద్ సినిమా హబ్గా మారనుంది. షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాల కోసం సినిమా పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ‘ఖేల్’ సినిమా విజయవంతం కావాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు యు. సత్యనారాయణ, కూకట్పల్లి ప్రెస్క్లబ్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్ సాధనాల, సంగీతం: ఆనంద్ అవసరాల, సహ నిర్మాత: పులి అమృత్గౌడ్. ∙పి. మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బి. వినోద్ కుమార్, పులి అమృత్ గౌడ్, జి. పాండురంగా రావు -
అందుకే నర్సాపురం వచ్చా: నాగబాబు
సాక్షి, నర్సాపురం : కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే తాను నర్సాపురం వచ్చానని జనసేన పార్టీ నేత నాగబాబు అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించారరు. అనంతరం నాగబాబు ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునేది లేదని నాగస్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని, అందుకే బాగా పరిపాలించాలని నాగబాబు అన్నారు. కొన్నిచోట్ల జనసేన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్న ఆయన.. పోలీసులు అధికారంలో ఉన్నవారికి సపోర్టు చేయొచ్చుగానీ, తప్పుడు కేసులు పెట్టకూడదని అన్నారు. కాగా నాగబాబు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. -
యాక్టింగ్కు మెగా గర్ల్ గుడ్బై!
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా వెండితెర మీద అడుగుపెట్టిన నటి నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా నిహారికపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే నటిగా నిహారిక మూడు సినిమాలు చేసినా ఆ అంచనాలను అందుకోలేకపోయారు. వరుస డిజాస్టర్లు రావటంతో ఇక సినిమాలకు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే నటనకు దూరంగా ఉన్న సినీరంగంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారట. యాక్టింగ్ మానేసి నిర్మాతగా కొనసాగాలనే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్లను నిర్మిస్తున్న నిహారిక అదే సంస్థను పూర్తి స్థాయి ప్రొడక్షన్ హౌజ్గా మార్చే ఆలోచనలో ఉన్నారట. మరి నిహారికి నిర్మాతగా అయిన సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. -
పవన్ కళ్యాణ్పై జాలేసింది
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రక విజయం సాధించారని, అందులో తాము కూడా భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నామని హీరో రాజశేఖర్ అన్నారు. తన భార్య జీవితతో కలిసి శనివారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయంలోనూ మా పాత్ర ఉండటం ఆనందంగా ఉంది. జగన్ పాదయాత్రలో పాల్గొన్నప్పుడే విజయ సంకేతాలు అందాయి. జగన్ గెలుస్తాడని ముందే తెలుసు. జగన్కు ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ‘మా’ ఎన్నికల్లో మద్దతిచ్చిన నాగబాబుకు మాకు ఎలాంటి విబేధాలు లేవు. ఎన్నికల్లో నాగబాబుకు వ్యతిరేకంగా ఎక్కడ ప్రచారం చేయలేదు. పవన్ కళ్యాణ్పై జాలి వేసింది, ఒక్క చోటైనా గెలిస్తే బాగుండేద’ని రాజశేఖర్ అన్నారు. రోజా గెలవడం అదృష్టం: జీవిత వైఎస్ జగన్ గత పదేళ్లుగా ప్రజలతోనే ఉన్నారని, సామాన్యుడిలా పాదయాత్ర చేసి ప్రజలను కలిశారని జీవిత చెప్పారు. అంకితభావంతో కష్టపడిన జగన్కు ప్రజలు అవకాశం ఇచ్చారని, వచ్చే పదేళ్లు ఆయనదేనని వ్యాఖ్యానించారు. తాము ప్రచారం చేసిన ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీ సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నాగబాబుపై, తమపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ ఎన్నికల్లో నాగబాబు తమకు అండగా నిలబడ్డారని వెల్లడించారు. ‘ప్రజలు చాలా తెలివిగా కేంద్రంలో ఎన్డీఏను, రాష్ట్రంలో వైఎస్సార్సీపీని గెలిపించారు. ఆంధ్రప్రదేశ్కు జగన్ ప్రత్యేక హోదా తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. రోజా గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె గెలవడం వైఎస్సార్సీపీ అదృష్టం. రోజాకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నా’ని జీవిత అన్నారు. -
మెగా బ్రదర్స్కు పరాభవం
మాదీ పశ్చిమగోదావరే...మా నాన్న జిల్లాలో పనిచేశారు.మొగల్తూరు మా సొంతూరు అంటూ ఎన్నికల్లో పోటీచేసిన మెగా బ్రదర్స్కు డెల్టాప్రాంత ఓటర్లు పెద్ద షాక్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన రోజుల్లో ఈ ప్రాంతం గురించి పట్టించుకోని కొణిదెల చిరంజీవి (ప్రజారాజ్యం పార్టీ స్థాపకులు), జనసేన అధినేత పవన్ కల్యాణ్, మెగా సోదరుడు నాగబాబుకు చేదు పరిస్థితులే ఎదురయ్యాయి. భీమవరం: మెగా సోదరులు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి జిల్లాకు మీరేమి చేశారంటూ ప్రజలు ప్రశ్నించడం, ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం సర్వసాధారణమైంది. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొస్తానని, అవినీతిని అంతమొందించి నీతివంతమైన పాలన సాగిస్తానని 2008 ఆగస్టు 26వ తేదిన సుప్రీమ్ హీరో, మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీస్థాపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన చిరంజీవి ఎమ్మెల్యేగా జిల్లాలోని పాలకొల్లు, తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేయడం అవివేకమని నీతివంతమైన పాలన అందించడానికి డబ్బుతో కాకుండా నిజాయితీతో రాజకీయాలు చేయాలంటూ చిరంజీవి ఎన్నో ప్రసంగాలు చేశారు. అయితే 2009 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో తన భార్య సురేఖ పుట్టిన ఊరైన పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో గెలుపు సునాయాసమని అక్కడి నుంచి పోటీకీ దిగారు. నీతివంతమైన పాలన అంటూనే ఎన్నికల్లో ఓటర్లను డబ్బుతో ప్రభావితం చేసే విధంగా సొమ్ములు పంపిణీ చేశారు. అయినప్పటికీ అక్కడ మైనార్టీ (వైశ్య) వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బంగారు ఉషారాణి చేతిలో ఘోర పరాజయం పొందారు. పాలకొల్లు ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ సభ్యులు అల్లు అర్జున్, రామ్చరణ్ తేజ తదితరులు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. ఎంతచేసినా చిరంజీవికి ఓటర్ల నుంచి ఆదరణ దక్కలేదు. తిరిగి ప్రస్తుత ఎన్నికల్లో మెగా తమ్ముడు పవన్కల్యాణ్ జనసేన పార్టీ తరపున భీమవరం నుంచి అసెంబ్లీకి, మెగా సోదరుడు నాగబాబు నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి వివిధ సామాజిక వర్గాల ప్రజలు, వివిధ సంఘాల నాయకులు, కులవృత్తుల వారితో సమావేశాలు నిర్వహించడమేగాక మెగా సోదరులతోపాటు నాగబాబు భార్య పద్మజ, కుమారై నిహారిక, కొడుకు వరుణ్తేజ్తో సహా జబర్దస్త్ టీమ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో నాగబాబు మాది మొగల్తూరు ఇక్కడి సమస్యలు మాకు బాగా తెలుసు ప్రజల కష్టాలను తీరుస్తామంటూ ఊదరగొట్టారు. పెనుగొండలో బంధువులున్నారు. మొగల్తూరులో మాకు ఇల్లు ఉండేది, మాఅన్న చిరంజీవి నరసాపురం వైఎన్ కళాశాలలోనే చదువుకున్నారంటూ చెప్పుకొచ్చారు. ప్రాంతీ యతను రాజేచి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఓటర్లకు డబ్బు పంపిణీకి తాము వ్యతి రేకమంటూనే భీమవరం అసెంబ్లీ పరిధిలో ఓటర్లకు పెద్ద ఎత్తున సొమ్ములు పంపిణీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలు నుంచే డబ్బు పంపిణీ ప్రారంభించారు. మెగా బ్రదర్స్పై సినిమా అభిమానంలో అన్ని వర్గాల ప్రజలు పవన్కల్యాణ్ సభలకు ఎటువంటి తరలింపులు లేకుండానే పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో పవన్కల్యాణ్ భీమవరం ఎమ్మెల్యేగా, నాగబాబు నరసాపురం ఎంపీగా గెలుపు ఖాయమంటూ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు పందేలు కూడా కాశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా అప్పులు చేసి పవన్కల్యాణ్, నాగబాబు విజయం సాధిస్తారంటూ పెద్ద మొత్తంలో పందేలు వేశారు. గురువారం వెల్లడైన ఫలితాల్లో పవన్కల్యాణ్ వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో 8,691 ఓట్ల తేడాతో ఓడిపోగా.. నరసాపురం లోక్సభ అభ్యర్థి నాగబాబు మూడవ స్థానానికే పరిమితమయ్యారు. దీనితో పశ్చిమలో మెగా బ్రదర్స్కు ఆదరణలేదని ఓటర్లు తేటతెల్లం చేసినట్లు స్పష్టమైంది. -
అన్నదమ్ములకు ‘సినిమా’ చూపించారు..
సాక్షి, హైదరాబాద్ : ప్రశ్నిస్తా అంటూ ప్రజల ముందుకు వచ్చిన జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఓటర్లు ‘సినిమా’ చూపించారు.. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు శాసనభ స్థానాల్లోనూ ఘోర పరాజయం పాలయ్యారు. ఆయన సోదరుడు నాగబాబు నరసాపురం లోక్సభ స్థానంలో ఓడిపోయారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన పవన్.. రెండు స్థానాల్లో పోటీచేయగా ఆ రెండు స్థానల్లో ప్రజలు తిరస్కరించారు. భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలైన జనసేనాని.. గాజువాకలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి తిప్పాల నాగిరెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. ఇక ఎన్నికల ముందు పార్టీ కండువా కప్పుకొని నరసాపురం ఎంపీగా బరిలోకి దిగిన నాగబాబు.. వైఎస్సార్సీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు చేతిలో చిత్తుగా ఓడి మూడో స్థానంలో నిలిచారు. జనసేనాని ఓటమితో ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచి ఆ పార్టీ మద్దతుదారులు ఊహించని ఫలితాలతో ముఖం చాటేశారు. ఆ పార్టీ అధికారిక ట్విటర్ మూగబోయింది. -
నాగబాబు బూతు బుసలు
పనికిమాలిన సన్నాసులు.. అడ్డగాడిదలు.. వెధవలు.. రాస్కెల్స్.. ఒరేయ్..!!ఇవన్నీ జనసేన అధినేత పవన్కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ నరసాపురం లోక్సభ అభ్యర్ధి, సినీ నటుడు.. ఇంకా చెప్పాలంటే జబర్దస్త్ ఫేమ్ నాగబాబు అలియాస్ నాగేంద్రబాబు నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు..రాజకీయాలన్న తర్వాత విపక్ష, అధికారపక్ష నేతలు మాటలు విసురుకోవడం.. ఒకరినొకరు విమర్శించుకోవడం, ఆరోపణలు చేసుకోవడం సహజమే.. కానీ ప్రత్యర్థి పార్టీల నేతలనుద్దేశించి నోటికొచ్చినట్టు దారుణమైన పదజాలం వాడిన నాగబాబు వ్యవహారశైలి ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మేడే సందర్భంగా గాజువాకలో నిర్వహించిన జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఇది జరిగి నాలుగురోజులైనా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ బూతు పురాణంపై వివాదం నలుగుతోంది. విపక్షనేతల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిన నాగబాబు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాజకీయాల్లో విమర్శలు.. ప్రతివిమర్శలు, ఆరోపణలు.. ప్రత్యారోపణలు సహజమే. కానీ వ్యక్తిత్వ హననానికి తెగబడుతూ నోటికొచ్చినట్టు బూతుమాటలు, పరుష పదజాలం ఆ మధ్య తెలంగాణ ఎన్నికల్లో కొంత కనిపించింది. కానీ ఏపీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి దాదాపుగా ఎదురుకాలేదు. పవన్కల్యాణ్ ఊగిపోతూ చేసిన ఆవేశపూరిత ప్రసంగాల్లో అరుపులు, కేకల మధ్య అడపాదడపా హద్దులు దాటినా.. అవి పెద్దగా ఎవరికీ వినిపించలేదు. ఎవరూ పట్టించుకోలేదు కూడా. కానీ ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ఆయన సోదరుడు నాగబాబు చేసిన దారుణమైన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగా మారాయి. మేడే నాడు.. బుధవారం పవన్కల్యాణ్ పోటీ చేసిన గాజువాకలో జనసేన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నాగబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. విశాఖ ఎంపీ అభ్యర్థి జేడీ అలియాస్ వీవీ లక్ష్మీనారాయణ సహా జనసేన నేతలంతా హాజరై పవన్కల్యాణ్పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇందులో తప్పేమీ లేదు. ఎవరికీ అభ్యంతరాల్లేవు. వారి అధినేతను వారు ప్రశంసలు, అభినందనలతో ముంచెత్తడం వారిష్టం. కానీ అదే సమావేశంలో పవన్ సోదరుడు నాగబాబు అదుపుతప్పి చేసిన వ్యాఖ్యలు, విపక్ష నేతలనుద్దేశించి పఠించిన తిట్ల పురాణాలపై మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబూ.. ఇదేనా జనసేన విలువల రాజకీయం నా తమ్ముడు కల్యాణ్బాబును విమర్శించినోళ్ళు పనికిమాలిన సన్నాసులు, అడ్డగాడిదలు, వెధవలు, రాస్కెల్స్.. అని నాగబాబు నోటికొచ్చినట్టు మాట్లాడారు. విపక్ష పార్టీల తరఫున ప్రచారం చేసిన నటులంతా పెయిడ్ ఆర్టిస్టుగాళ్ళు అని నోరుపారేసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైనే దుమారం రేగుతోంది. సోదరుడిగా పవన్ కల్యాణ్ గురించి నాగబాబు గొప్పగా చెప్పుకున్నారు. తాను ఎలా పోయినా ఫర్వాలేదని, తమ్ముడు పవన్ కల్యాణ్ వందేళ్ళు బతకాలని కోరుకున్నారు. ఇండియాలోనే పవన్ గొప్ప నాయకుడని చెప్పుకున్నారు. ఇలా తన తమ్ముడి గురించి ఎంతసేపు, ఎన్ని మాట్లాడుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ విపక్ష నేతలనుద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడటమే ఇప్పుడు చర్చకు తెరలేపింది. నేను చదువుకున్నాను.. హిస్టరీ స్టూడెంట్ను.. అని అదే ప్రసంగంలో చెప్పుకున్న నాగబాబు విజ్ఞత, సంస్కారం ఇవేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్పై రాజకీయంగా విమర్శలు చేసిన వారికి బదులుగా నాగబాబూ కూడా విమర్శలు చేసుకోవచ్చు. ఆరోపణలు చేయొచ్చు. కానీ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయవర్గాలు మండిపడుతున్నాయి. రాజకీయాలు మార్చేస్తామంటున్న జనసేన సిద్ధాంతం ఇలా బండబూతులు తిట్టడమేనా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నాగబాబూ.. నోరు అదుపులో పెట్టుకో.. ‘చంద్రబాబునాయుడు ప్యాకేజీలకు అమ్ముడుపోయిన మీ తమ్ముడికి, మీకు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలను విమర్శించే నైతిక హక్కు లేదు.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని జనసేన నాయకుడు, సినీనటుడు నాగబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర యువజన విభాగం అధ్యక్షుడు కొండా రాజీవ్గాంధీ హెచ్చరించారు. తెలంగాణలో విద్యార్థులు చనిపోతే స్పందించిన పవన్ కల్యాణ్, ఆంధ్రాలో నారాయణ, చైతన్య స్కూల్ విద్యార్థులు చనిపోయినప్పుడు ఎందుకు స్పందించలేదని విమర్శించారు. నగరంలోని మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో పవన్, వీవీ లక్ష్మీనారాయణ ఓడిపోతారనే భయంతోనే జగన్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్పై పెట్టిన తప్పుడు కేసులేవీ నిలబడవని, ఆయన నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. చంద్రబాబు ప్యాకేజీల కోసమే పవన్కల్యాణ్ ఎన్నికల సీన్లో నటించారని, ఎన్నికల అనంతరం ఏసీ రూమ్ల్లో గడుపుతూ ప్రజాసమస్యలు గాలికి వదిలేశారని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతూ, ప్రజాసంకల్పయాత్రలో వేల కిలోమీటర్లు నడిచి అశేష ప్రజాదరణ పొందారని గుర్తుచేశారు. త్వరలో ఆయనను ముఖ్యమంత్రిగా చూడబోతున్నామని చెప్పారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై జగన్, విజయసాయిరెడ్డి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుచేశారని, ఎన్నికల్లో అవకతవకలు, రీ ఎలక్షన్, ఈవీఎంలు, వీప్యాడ్ తదితర వాటిపై పవన్ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో రిలీజ్ కాకుండా చంద్రబాబు రకరకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పవన్, చంద్రబాబు, నాగబాబుల విమర్శల తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రామరాజ్యం జగనన్నతోనే సాధ్యమని ప్రజలు భావించి వైఎస్సార్సీపీని ఆదరించారని, అధిక మెజార్టీతో జగన్ అధికారంలోకి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కారుకూతలు మానుకోవాలి రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేదు. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన నాగబాబు ఎంతో ప్రజాదరణ ఉన్న జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయం. నాగబాబుతో పాటు ఆయని సోదరులు చిరంజీవి, పవన్కల్యాణ్లు అమ్ముడుపోయే రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్లు. చంద్రబాబు గెలుపుకోసం అమాయక అభిమానుల మనోభావాలను వీరు తాకట్టు పెట్టారు. కేవలం ప్యాకేజీల కోసం రాష్ట్రంలో వీరు రాజకీయాలు చేస్తున్నారు. నరస్సాపురంలో తన ప్రత్యర్థి పోటీదారులు ఎవరో కూడా నాగబాబుకు తెలియని పరిస్థితి. ఇలాంటి వ్యక్తి పార్లమెంట్కు పోటీ చేయడం అక్కడి ప్రజల దురదృష్టం. నాగబాబుకి జగన్ను విమర్శించే నైతికహక్కులేదు. హుందా రాజకీయాలు ఆయన నేర్చుకోవాలి. మతిస్థిమితం లేని ఇలాంటి వారిని ప్రజలు రాకీయాలకు దూరంగా ఉంచాలి. – కొయ్య ప్రసాద్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సాఆర్సీపీ జబర్దస్త్ షో అనుకున్నావా.. బాబూ నాగబాబూ.. రాజకీయాలంటే నువ్వు టీవీల్లో చేసే జబర్దస్త్ షో అనుకున్నావా.. నువ్వు నటుడై ఉండి.. మీ సకుటుంబ సపరివారమంతా నటీనటులై ఉండి.. సాటి నటులను పెయిడ్ ఆర్టిస్టుగాళ్ళు అంటావా.. అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జాన్ వెస్లీ ప్రశ్నించారు. నటులంతా మీ వెంటే తిరగాలా.. రాజకీయంగా వారికి వ్యక్తిగత ఇష్టాలు, పార్టీలు ఉండకూడదా.. అని ప్రశ్నించారు. తనకు నచ్చని విధానాలపై, పార్టీలపై నాగబాబుకు విమర్శించే హక్కుంది. కానీ ఇలా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడటం, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేట్టు మాట్లాడటం అతని స్థాయిని బయటపెట్టింది. వెంటనే నాగబాబు తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి.. అని జాన్వెస్లీ డిమాండ్ చేశారు. - జాన్ వెస్లీ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి -
చిరుబ్రదర్స్ జాడేది..!
సాక్షి, భీమవరం : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా.. భీమవరాన్ని అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దుతానంటూ ప్రచారం చేసిన జనసేన పార్టీ అధినేత, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కొణిదెల పవన్కల్యాణ్, ఆయన సోదరుడు నరసాపురం లోక్సభ అభ్యర్థి నాగేంద్రబాబు గురువారం పోలింగ్ రోజున కన్పించకపోవడం చర్చనీయాంశమైంది. ప్రతిష్టాత్మకమైన భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, జనసేన అభ్యర్థి పవన్కల్యాణ్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నా నామమాత్రమేననే ప్రచారం ఉంది. గురువారం నియోజకవర్గవ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నియోజకవర్గ ఓటర్లు కావడంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవడమేగాక ఎప్పటికప్పుడు ఆయాపార్టీల నాయకులు, అనుచరులతో పోలింగ్ సరళిని తెలుసుకుంటూ కొన్ని పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అయితే జనసేన అభ్యర్థులు పవన్కల్యాణ్, నాగేంద్రబాబుకు ఇక్కడ ఓట్లు లేకపోవడంతో ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం లేకపోయింది. జనసేన అధినేత పవన్కల్యాణ్ పోటీ చేస్తుండటంతో భీమవరం అందరి దృష్టిని ఆకర్షించింది. అతడి సోదరుడు నరసాపురం లోక్సభ అభ్యర్థి నాగేంద్రబాబు లోక్సభ నియోజకవర్గ పరిధిలో పర్యటించినా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఈ విషయం జనసేన శ్రేణులను నిరాశకు గురిచేసింది. పార్టీ అధినేత పవన్కల్యాణ్ రాలేకపోయినా కనీసం నాగేంద్రబాబు వచ్చి ఉంటే ఓటర్లలో మరింత చైతన్యం వచ్చేదని తద్వారా పార్టీకి ఉపయోగపడేదని నాయకులు చెబుతున్నారు. నరసాపురం పార్లమెంట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజు, టీడీపీ అభ్యర్థి వేటుకూరి వెంకటశివరామరాజు, బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు, ప్రజాశాంతి అభ్యర్థి కేఏ పాల్, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సైతం పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇవ్వగా జనసేన అభ్యర్థి నాగేంద్రబాబు కనీసం ఎక్కడా కన్పించపోవడంతో జనసేనాని ఎక్కడంటూ చర్చించుకోవడం కన్పించింది. -
పవన్, నాగబాబుపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చర్చకు తెరలేపి సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు, జనసేన నరసాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబుపై నిప్పులు చెరిగారు. ‘పవన్ మంచోడు కాదు అలా అని చెడ్డోడు కూడా కాదు. ఆయన ఓ నటుడు మాత్రమే. దయచేసి ఆయన మాటలను నమ్మి ఉన్మాదులుగా మారొద్దు’ అని హితవు పలికారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి ఎన్నికల నేపథ్యంలో ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతూ.. ఓటు ద్వారా ఆంధ్రప్రదేశ్ రుణం తీర్చుకుని, అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. నాగబాబుకు ఓటెయ్యద్దని చెప్పిన శివాజీరాజాను నోటికి వచ్చినట్టు తిట్టిన దిలీప్ సుంకరపై శ్రీరెడ్డి మండిపడ్డారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని దిలీప్ సుంకరను హెచ్చరించారు. ‘ఓ మహిళగా పవన్ తల్లి గురించి మాట్లాడిన మాటలకు సారీ చెబుతున్నా. జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తాం అంటూ కామెంట్లు చేస్తారు. రౌడీయిజం చేస్తారా. అసలేం తెలుసురా మీకు పవన్, నాగబాబు గురించి. నాగబాబుకు ఎంత పొగరు. సాటి ఆర్టిస్టులకు డబ్బులు లేనంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా. నరసాపురం నియోజకవర్గంలో పదివేల రూపాయల గుప్తదానం చేశావా. కనీసం పది రూపాయలు ఎవరికైనా దానం చేశావా. వరుణ్తేజ్, నిహారికలను తీసుకొస్తే గెలుస్తావా. మీ తమ్ముడు వంశపారంపర్య రాజకీయాలు చేయము అన్న ఉత్తముడు, ఉదాత్తుడు కదా. మరి నిన్నెందుకు తీసుకొచ్చాడు. రాజకీయ నాయకులను వెధవలు, రా అంటున్నావు. ఏరా పోరా అంటున్న మిమ్మల్ని నేను కూడా అంటా. మీరే నాకు ఆ హక్కు ఇచ్చారు. ఏందిరా పవన్ కల్యాణ్ నీ యాక్టింగ్లు. బొచ్చెలో తినడం. పవన్ ఏం చేశావని నీ అన్నను ఎంపీగా గెలిపించాలి. నువ్వు చెప్పిన వాళ్లందరికీ ఓటు వేయాలా. కాపుల్లో ఉత్తములు ఉన్నారు. అధోగతి పాలైన వారు ఉన్నారు. కమ్మ, రెడ్డి, కాపు అయినా ప్రతీ కులంలో చెడ్డోడు ఉన్నాడు మంచోడు ఉన్నాడు. పవన్ మంచోడు కాదు అలా అని చెడ్డోడు కాదు. రాజకీయంగా కొన్ని లక్షణాలు ఉండాలి. చదువు రాని వాడివి ఏవిధంగా రా ఐఏఎస్ల ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావు. టెన్త్ సర్టిఫికెట్లు దొంగతనంగా సృష్టించావు. సీఎం అయితే వందల కోట్ల ఫైల్స్పై సంతకం చేయాల్సి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీని దోచుకుని కోట్లు కోట్లు సంపాదించావు. కారు లేదంటావు. ఈఎంఐలు కట్టలేనంటావు. మరి నీకు హెలికాప్టర్లు ఎక్కడినుంచి వచ్చాయి. కానిస్టేబుల్ కొడుకునంటావు. ఐటీ కోట్లకు కోట్లు కట్టానంటావు. డబ్బుల్లేవంటావు. పైత్యం ఉన్న ఇలాంటి వ్యక్తిని కొంతమంది ఉన్మాదులు, కాపు వ్యక్తి సీఎం కావాలనే వ్యక్తులు నీ వెనుక తిరగొచ్చు. కనీసం అబద్ధాలైనా కరెక్టుగా గుర్తు పెట్టుకుని చెప్పు. ఆంధ్రప్రదేశ్ నిధులు ఏం కావాలి. కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి ఉపయోగం అన్న విషయాలు తెలుసా. పవన్ కల్యాణ్ అనే వెధవకు, దరిద్రుడైన నాగబాబుకి, కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమందికి ఓటు వేసే ముందు ఆలోచించండి. రాజకీయ నాయకులు మాకు సేవచేయడానికి మాత్రమే మీరున్నది. దయచేసి మీ ఓటు ఎవరికి వేయాలో ఆలోచించి వేయండి’ అని శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
నాగబాబుకి ఓటు వేయకండి : శివాజీ రాజా
సాక్షి, హైదరాబాద్ : జనసేన పార్టీ తరఫున నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నాగబాబుపై నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా విరుచుకుపడ్డారు. నాగబాబు వల్ల ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ దిగజారిపోయిందని, అభివృద్ధిలో ‘మా’ ను రెండేళ్లు వెనక్కి నెట్టారని ఆయన ధ్వజమెత్తారు. మెగా ఫ్యామిలీని తిట్టినవాళ్లకు నాగబాబు రాత్రికి రాత్రే మద్దతు ఇచ్చారని, వాళ్లు ఎన్నికల్లో నెగ్గిన రెండు రోజులకే మెగా ఫ్యామిలీని తిట్టారన్నారు. 600మంది ఉన్న ‘మా’కు ఏమీ చేయనివాడు...నర్సాపురానికి ఏం చేస్తారంటూ శివాజీ రాజా సూటిగా ప్రశ్నించారు. మీరు ఏ పార్టీకి అయినా ఓటు వేసుకోండి...కానీ నాగబాబుకు మాత్రం ఓటు వేయొద్దు అని నర్సాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో శివాజీ రాజా ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘నేను ఇలా మాట్లాడటానికి సుమారు 15 రోజుల పాటు ఆలోచించాను. పవన్ కల్యాణ్ తన కష్టం ఏదో తాను పడుతున్నాడు. ఇండస్ట్రీలో అందరూ మెగా ఫ్యామిలీతో సినిమాలు చేశారు. కానీ నేను ఒక్క సినిమా కూడా చేయలేదు. మెగా ఫ్యామిలీలో నాగబాబు ఒక్కడే తేడా. ఆయన భీమవరం నాది, నర్సాపురం నాది అంటున్నాడు..ఎలా అవుతుంది?. భీమవరంలో మురికివాడలు లేకుండా చేస్తావా?. నర్సాపురాన్ని బాగు చేస్తావా? నువ్వు వంటగదిలో నుంచి హాల్లోకి రావడానికే అరగంట పడుతుంది. అలాంటిది నువ్వు నర్సాపురం వెళ్లి సేవ చేస్తావా?’ అంటూ ప్రశ్నలు సంధించారు. అలాగే ఈ ప్రపంచంలో తనకు చిరంజీవి తర్వాతే ఎవరైనా అని... తాను ఎప్పుడు చిరంజీవికి పెద్ద అభిమానినే అని శివాజీ రాజా తెలిపారు. -
‘నాగబాబు ట్వీట్పై అనుమానాలు’
సాక్షి, పశ్చిమగోదావరి : తనపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయకముందే నర్సాపురం జనసేన అభ్యర్థి నాగబాబు ట్వీట్ చేయడం అనుమానాలకు తావిస్తోందని వైఎస్సార్సీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ నేతలు, సినీ కళాకారులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గురువారం తనపై కొందరు యువకులు దాడి చేశారని, ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయకముందే జనసైనికుల ముసుగులో ఇతర పార్టీల వారు కొందరు విధ్వంస చర్యలకు దిగుతున్నారని, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలంటూ నాగబాబు ఫేస్బుక్లో పోస్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నాగబాబు ట్వీట్పై అనుమానాలు ఉన్నాయన్నారు. దాడి చేసింది ఏ పార్టీ వారైనా పోలీసులు పట్టుకోవాలని డిమాండ్ చేశారు. పవర్ స్టార్ ప్యాకేజీ స్టార్గా మారారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను ఎద్దేవా చేశారు. ప్యాకేజీల రాజకీయాలు వద్దని, పవన్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడుక్కోవాలన్నారు. పశ్చిమ గోదావరి ప్రజలు శాంతి కాముకులు అని తన్నుడు రాజకీయాలు జిల్లాలో వద్దని పవన్కు సూచించారు. రఘురామ కృష్ణంరాజుపై దాడి అమానుషం రఘురామ కృష్ణంరాజుపై దాడి అమానుషమని వైఎస్సార్సీపీ నాయకుడు, సినీ నటులు పృద్వీ అన్నారు. నాగబాబు, పవన్ లు మాట్లాడే భాష సరికాదన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి, జగన్ను ప్రశ్నిస్తున్నప్పుడే జనసేన వైఖరి ఏంటో ప్రజలకు అర్థమవుతుందన్నారు. నటన వేరు, రాజకీయం వేరన్నారు. రాష్ట్రంలో జగన్ సీఎం కావాలని ,రాజన్న రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుత ఎన్నికలతో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. గురువారం కొత్తాడ గ్రామంలో రఘురామకృష్ణంరాజుపై కొందరు యువకులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడిలో ఆయన కారు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. సకాలంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది స్పందించి యువకులను చెదరగొట్టడంతో రఘురామ కృష్ణం రాజుకు ముప్పు తప్పింది. ఈ దాడి నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
‘అసలు నాగబాబు పోటీయే కాదు’
సాక్షి, పశ్చిమగోదావరి : నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజుకు జనసేన అభ్యర్థి నాగబాబు పోటీయే కాదన ప్రముఖ సీనీ రచయిత చిన్ని కృష్ణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లకు పైగా గెలిచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అభిమాన హీరోల సినిమాలు 10 సార్లు చూడండి కానీ ఓటు మాత్రం వైఎస్సార్ సీపీకే వేయమని ప్రజలను కోరారు. గతంలో చిరంజీవికి లక్షల మంది ఓట్లు వేస్తే ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. అదే కుటుంబం నుంచి మళ్లీ ఇద్దరు వచ్చి ఓట్లు అడిగితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమన్నారు. అక్కడ వైఎస్సార్సీసీ అభ్యర్థి శ్రీనివాస్ ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
ఎప్పుడు వస్తావో చెప్పు నాగబాబు...
సాక్షి, నరసాపురం : జనసేన నేత నాగబాబు ఓటమి భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ..వాపును చూసి బలుపు అనుకోవద్దని, ఎన్నికల రోజు ప్రజలు ఎవరివైపు ఉన్నారో తెలిసిపోతుందని, ప్రజా తీర్పు వచ్చేవరకూ వేచి చూడాలని హితవు పలికారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం కోరుకుంటున్నారని అన్నారు. రఘురామ కృష్ణంరాజు బుధవారమిక్కడ మాట్లాడుతూ...‘ఇంత లావుగా ఉంటే తంతాం...అంటే భయంతో ఇక్కడ చూస్తూ ఊరుకునివారు ఎవరూ లేరు. ఎప్పుడు వస్తావో చెప్పు నాగబాబు, ఛాలెంజ్. నన్ను తంతావో లేదో చూద్దాం రండి. మీరు సినిమాల్లో నటించారుగా... త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో మేము మీకు సినిమా చూపిస్తాం. సొంత ఊరులో లైబ్రరీ పెట్టుకుంటాం అంటే ఉమ్మడి ఆస్తుల పేరుతో అడ్డుకొని అమ్ముకున్న వ్యక్తి నాగబాబు. ఆయన గురించి జిల్లాలో ఎవరికైనా తెలుసు. ఎన్నికల కోసమే మళ్లీ వచ్చారని కూడా ప్రజలకు తెలుసు. విలువల గురించి మీరా మాట్లాడేది? ప్రజా సమస్యలు అంటే ఇవేనా?. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి చాలు. నేను పార్టీలు మారడం కాదు. నా సొంత గూటికి తిరిగి వచ్చాను. నేను ఎప్పుడైనా ఒకదాని తర్వాత ఒక్కటే కండువా వేసుకున్నా. కానీ మీరు ఏడు కండువాలు ఒకేసారి వేసుకుని తిరుగుతున్నారు. సీపీఎం, సీపీఐ, ఏనుగు నడుముకు పచ్చ కండువా చివరికి కేఏ పాల్ కండువా ఇలా ఏడు వేసుకున్నారు. మీ తీరు వల్ల... మీ సోదరులు మీద ఉన్న గౌరవం, పరువు పోతోంది. ఇక మీరు మీ తమ్ముడు పవన్ కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు. రెండు రాష్ట్రాల మధ్య శాంతి చెడగొట్టవద్దు. మీరు ప్రశాంతంగా మీ ప్రచారం చేసుకోండి. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, ప్రశాంతమైన జిల్లాలో శాంతిగా ఉండండి.’ అని సూచించారు. -
జనసేనలోకి నాగబాబు
-
నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా నాగబాబు
-
జనసేనలోకి నాగబాబు
సాక్షి, అమరావతి : ప్రముఖ సినీ నటుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు జనసేన పార్టీలో చేరారు. నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా ఆ పార్టీ తరపున నాగబాబు బరిలోకి దిగుతున్నారు . ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే మొదటి నుంచి జనసేనకు నాగబాబు పరోక్షంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు కానీ ప్రత్యేక్షంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల వేళ పార్టీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. అనుకున్నట్లే ఎన్నికల సమయంలో నాగబాబు పార్టీలో చేరి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగారు. -
లోకేష్కో ఓ.. వేసుకోండి : నాగబాబు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారాలోకేశ్పై మెగాబ్రదర్ నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మై ఛానెల్ నా ఇష్టం’ పేరిట యూట్యూబ్ చానెల్ ప్రారంభిన ఆయన.. పొలిటికల్ ఫీచర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో పొలిటికల్ అభిప్రాయాలను మాత్రమే పంచుకుంటానన్న మెగా బ్రదర్.. ఇది కేవలం నవ్వుకోవడానికి మాత్రమేనని, పెద్దగా సిరీయస్గా స్పందించాల్సి అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ చానెల్లో ఎప్పుడు ఎక్కడా చూడనవి, ఒకవేళ చూసినా నిశబ్ధంగా మరిచిపోయేలా చేసినవి చూపిస్తానని, దీంతో ఎవరికి సంబంధం లేదన్నారు. ఇందులో భాగంగా ఆయన నారా లోకేష్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో లోకేష్ ఓ బహిరంగ సభలో.. ‘అవినీతి, బంధుప్రీతి, మతపిచ్చి,కులపిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదన్న ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీయే’ అని చేసిన వ్యాఖ్యలను జోడిస్తూ సెటైర్లేశారు. ‘పిల్లలు దేవుళ్లు చల్లని వారే. కళ్ల కపటం లేని కరుణమాయులే.’ అని చిన్నప్పుడు చదువుకున్నానని, అలానే లోకేష్బాబు వాస్తవాలను ఒప్పుకున్నారని చెప్పారు. ‘థ్యాంక్యూ లోకేష్ మీ పార్టీ గురించి చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత నిజాయితీగా మాట్లాడే రాజకీయనాయకుడే లేడు. లోకేష్కు ఒక్క ఓ వేసుకుందాం’ అని నాగబాబు అభిమానులకు పిలుపునిచ్చారు. ఇక మొన్నటి వరకు నటుడు బాలకృష్ణపై సెటైర్లు వేసిన నాగబాబు.. ఇప్పుడు ఆయన అల్లుడు నారాలోకేశ్ను టార్గెట్ చేయడం సినీ వర్గాల్లో తీవ్రచర్చనీయాంశమైంది.