-
తిరుపతి జనసేన నాయకులతో నాగబాబు సమావేశం
-
ట్వీటు రాజా? పోటీ లేదా?
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడితే చాలు మెగా బ్రదర్స్ అయిన పవన్, నాగబాబు తెగ హడావుడి చేస్తారు. రాష్ట్రంలో మూడు పార్టీల పొత్తుల కోసం తాను ఎన్నో త్యాగాలు చేస్తున్నానని పవన్ కల్యాణ్ పదేపదే చెప్పుకుంటూ బాబుతో ప్యాకేజీ ఒప్పందం చేసుకుంటే... నాగబాబు మాత్రం తానో అపర మేధావి అనుకుంటూ.. ఎక్కడెక్కడో కొటేషన్లో, పిట్టకథలో తీసుకొని తన సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. ఆపై ప్రతి నెల మొదటి వారంలో తన సోషల్ మీడియాలో QR కోడ్ను షేర్ చేసి వంద రూపాయల నుంచి విరాళం పంపాలని కోరుతాడు. అలా ఎప్పుడూ ఆయన నెట్టింట మెగా ఫ్యాన్స్కు టచ్లో ఉంటారు. వాస్తవంగా నాగబాబు కూడా తమ్ముడు పవన్ టైపే! పవన్ స్టేజీపై ఊగిపోతూ మాట్లాడితే.. కొణిదెల నాగబాబు మాత్రం ఇంట్లో కూర్చోని ట్విటర్లో ఊగిపోతాడు. పసలేని తన ట్వీట్లతో ఆజ్ఞానంలో మునిగితేలుతూ అభిమానులపై తన జ్ఞాన ప్రదర్శన చూపిస్తాడు. జనసేనను రాజకీయ పార్టీగా బలపరచుకోండయ్యా అని తెలివైన అభిమానులు సలహాలు ఇస్తే.. వారందరినీ వైసీపీ కోవర్ట్లు అంటూ పార్టీ నుంచి వెళ్లిపోండి అంటారు. పవన్ ఏమో చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుంటే.. నాగబాబు మాత్రం పేటీఎం స్కానర్ పట్టుకుని సోషల్ మీడియాతో పాటు ప్రపంచం మొత్తం తిరుగుతాడు. ఫ్యాన్స్ అభిమానాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు మెగాబ్రదర్స్ ఇద్దరూ ఇలా ఎప్పుడూ బిజీగానే ఉంటారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి అందరి కంటే ముందుగానే అక్కడ ఎంట్రీ ఇచ్చాడు నాగబాబు.. అచ్యుతాపురంలో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఉన్నట్టుండి అన్నయ్యకు పవన్ షాకిచ్చాడు. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును జనసేన త్యాగం చేస్తుందని దానికి ఎల్లో కలరింగ్ ఇచ్చాడు. దీంతో ఎన్నికల యుద్ధం నుంచి కత్తి పట్టకుండానే వెనుతిరిగాడు. అప్పటి వరకు వారం రోజుల పాటు అక్కడ హడావుడి చేసిన నాగబాబు తన షెడ్యూల్కు ప్యాకప్ చెప్పడమే కాకుండా ఆ ఇంటికి టూలెట్ బోర్డు పెట్టేశాడు. ఆపై అనకాపల్లి నుంచి హైదరాబాద్కు మకాం మార్చేసి.. హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో నాగబాబు ఇంటికే పరిమితం అయి ట్వీట్లు చేసుకుంటూ కాలం గడపుతున్నాడు. వాస్తంగా అక్కడ నాగబాబు ఎంట్రీ సమయంలోనే ఆయనది ఐరన్ లెగ్ అంటూ జనసేన అభిమానులు చెప్పుకొచ్చారు. వారు అనుకున్నదే తర్వాత నిజమైంది. అనకాపల్లిలో నాగబాబు ఓట్లు అడగడం కంటే ప్రజలకు ఎక్కువగా క్యూ ఆర్ కోడ్ను చూపించేవారట. వంద రూపాయల నుంచి ఎంతైనా స్కాన్ చేయండి అని వారి ఫ్యాన్స్కు చెప్పేవారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా కొంతమేరకు అసహనానికి గురైయ్యారు. ఇన్నాళ్లూ పార్టీలో నాగబాబుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని భావించిన వారికి ఆయనకు అంత సీను లేదని ఫ్యాన్స్కు అర్థమైంది. నిజంగా జనసేనలో నాగబాబుకు పట్టున్నా, లేక పవన్ వద్ద పలుకుబడి ఉన్నా ఆయనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కారణంగా ఆయన సోదరుడు నాగబాబు పొలిటికల్ కేరీర్ ఇంతటితో క్లోజ్ అయినట్లే.. మరో కొద్దిరోజుల్లో చంద్రబాబు వల్ల పవన్ పొలిటికల్ కెరియర్ కూడా క్లోజ్ అవుతుందని మెగా ఫ్యాన్సే బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత పార్టీ పేరుతో వారిద్దరూ విరాళాలు రాబట్టుకోవడంలో బిజీగా ఉంటారని పలువురు జోష్యం చెబుతున్నారు. -
పవన్ కల్యాణ్ సొంత అన్నకే దిక్కులేదు.. మేమెంత?
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన శ్రేణుల్లో సరికొత్త అలజడి రేగుతోంది. ఇప్పటికే టీడీపీతో పొత్తులో అరకొర సీట్ల కేటాయింపు వీరికి మింగుడు పడడంలేదు. చాలీచాలని సీట్లతో ఎవరికి ఎసరు వస్తుందోనని లోలోన ఆందోళన చెందుతు న్నారు. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి తానే బరిలో ఉంటున్నానని, అచ్యుతాపురంలో కాపురం కూడా పెట్టి నానా హంగామా చేసిన నాగబాబు.. పక్షం రోజులు తిరక్కుండానే పలాయనం చిత్తగించారు. ఈ పరిణామానికి జనసేన క్యాడరు షాక్కు గురైంది. పవన్ కల్యాణ్ సొంత సోదరునికే ఈ పరిస్థితి వస్తే ఇక మేమెంత? అంటూ పార్టీలో టిక్కెట్లను ఆశిస్తున్న వారు నిర్వేదంలో పడిపోయారు. ఇన్నాళ్లూ పార్టీలో నాగబాబుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని భావించిన వారికి ఆయనకు అంత సీను లేదని తేటతెల్లమైంది. నిజంగా జనసేనలో పట్టున్నా, లేక పవన్ వద్ద పలుకుబడి ఉన్నా నాగబాబుకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. స్వయంగా అన్నకే పార్టీలో దిక్కు లేదని, ఇక ఆయనను నమ్ముకుంటే తాము నట్టేట మునిగినట్టేనని వాపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాగబాబుకు అన్ని విధాలా దన్నుగా నిలిచి, ఆయన వ్యవహారాలు చూస్తున్న యలమంచిలి ప్రాంతానికి చెందిన సుందరపు బ్రదర్స్ (విజయ్కుమార్, సతీష్కుమార్) సైతం నాగబాబు ఎపిసోడ్తో పత్తాలేకుండా పోయారు. వాస్తవానికి వీరిలో విజయకుమార్ యలమంచిలి, సతీష్కుమార్ గాజువాక సీట్లను ఆశిస్తున్నారు. ఇందుకోసం వీరు నాగబాబును ప్రసన్నం చేసుకుంటూ అటు అనకాపల్లి జిల్లాలోను, ఇటు విశాఖపట్నం జిల్లాలోనూ వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. నాగబాబు మనుషులుగా ముద్ర వేయించుకున్న వీరు కొంతమంది నుంచి వసూళ్లకు దిగారన్న ఆరోపణలున్నాయి. నాగబాబు తాజా పరిస్థితితో వీరు ఆందోళన చెందుతున్నట్టు చెబుతున్నారు. త్యాగాలకు సిద్ధంకండి.. మరోవైపు భీమిలి జనసేన సీటు తనకే ఖాయమైందని బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న పంచకర్ల సందీప్కు కాకుండా టీడీపీకి కేటాయిస్తున్నట్టు ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ సారి ఈ సీటును త్యాగం చేయాలని అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సందీప్కు స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే గాజువాక స్థానం నుంచి తమ అభ్యర్థే బరిలో ఉంటారన్న ప్రచారాన్ని టీడీపీ నేతలు విస్తృతం చేశారు. దీంతో అక్కడ జనసేన సీటును ఆశిస్తున్న సుందరపు సతీష్కుమార్, కోన తాతారావులు కూడా త్యాగాలు చేయాల్సి వస్తుందని అంటున్నారు. ఇక జనసేన నుంచి విశాఖ దక్షిణ సీటును వంశీకృష్ణ శ్రీనివాస్, సాధిక్, ప్రసాదరెడ్డి, కందుల నాగరాజు, డాక్టర్ మూగి శ్రీనివాసరావులు ఆశిస్తున్నారు. ఈ స్థానం నుంచి కూడా టీడీపీ అభ్యర్థే పోటీ చేస్తారని తెలియడంతో వీరంతా కలవరం చెందుతున్నారు. ఆ ఇద్దరిలో ఒక్కరికే చాన్స్? ఇక ఎమ్మెల్యే టిక్కెట్టును ఆశించి వైఎస్సార్సీపీ నుంచి జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్లు జంప్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరిలో ఒక్కరికే జనసేన సీటు దక్కవచ్చని చెబుతున్నారు. పెందుర్తి స్థానం పంచకర్లకు దాదాపు ఖరారైందని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే వంశీకృష్ణకు మొండి చెయ్యే గతయ్యే పరిస్థితి తలెత్తనుంది. అదే జరిగితే జనసేన త్యాగరాజుల జాబితాలో ఆయన కూడా చేరిపోనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కీలకనేతలు తమకు గుర్తింపు లేదని, నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి పరిణామాలతో ఇప్పటికే జాడలేకుండా పోయారు. ఇప్పుడు వీరికి త్యాగమూర్తులు కూడా తోడయ్యే అవకాశం ఉంది. -
అనకాపల్లి నుండి నాగబాబు పరార్
-
జెండా పీకేసిన నాగబాబు..
-
జెండా ఎత్తేసిన నాగబాబు.. ఓటమి భయమే కారణమా?
-
నాగబాబు ప్యాకప్ వెనుక కారణం ఏంటంటే..
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు ఇద్దరూ ఒక్కటే అనిపించుకున్నారు. ఇద్దరూ పార్ట్ టైమ్ పొలిటిషీయన్స్ అని మరోసారి రుజువు చేసుకున్నారు. ప్రజలకు మేలు చేసేందుకు కాకుండా చంద్రబాబుకు సహకరించేందుకే వారు ఉన్నట్టు నిరూపించుకున్నారు. ఇంతకీ ఏమైందంటే.. జనసేన నేత నాగబాబు.. అనకాపల్లిలో నుంచి జెండా ఎత్తేశారు. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా నాగాబాబు ఏపీకి వచ్చారు. అనంతరం, అచ్చుతాపురంలో ఓ ఇల్లు తీసుకుని నాలుగు రోజులు హడావుడి చేశారు. సమీక్షల పేరుతో కలరింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో సర్వేలు కూడా చేయించుకున్నట్టు సమాచారం. అయితే... సర్వేల్లో ప్రతికూల ఫలితాల కారణంగా ఓటమి భయం మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో, నాగబాబు తన మకాంను అనకాపల్లి నుంచి హైదరాబాద్కు మార్చారు. తాజాగా మూటాముల్లె సర్దుకుని నాగాబాబు హైదరాబాద్కు పయనమయ్యారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన రోజున ఏపీకి వచ్చిన పవన్.. అనంతరం హైదరాబాద్కు వెళ్లారు. కాగా, పొత్తులో భాగంగా 24 సీట్లు జనసేకు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ఇప్పటి వరకు ప్రకటించగా.. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై పవన్ ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. చివరకు తాను ఎక్కడ పోటీ చేస్తున్న విషయం కూడా ఆయన చెప్పలేదు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కూడా చేయలేదు. ఇక, ఏపీలో రాజకీయాలు అంటూ పవన్ మళ్లీ హైదరాబాద్లోనే మకాం వేశారు. దీంతో, ఇలాంటి నేతలా ఏపీ ప్రజల బాగు కోరేది అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహ వేడుకల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
వైఎస్సార్సీపీ నేత కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: కాళ్ల మండలం పెద అమిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో పాలకొల్లు వైఎస్సార్సీపీ నాయకులు గుణ్ణం నాగబాబు కుమారుడు సుభాష్ వివాహానికి సీఎం హాజరయ్యారు. వరుడు గుణ్ణం సుభాష్, వధువు దీప్తిలను సీఎం జగన్ ఆశ్వీరదించారు. ఈ వివాహ వేడుకలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, పుప్పాల వాసు బాబు, శ్రీ రంగనాథరాజు తదితరులు పాల్గొన్నారు. -
నాగబాబుకి ఎంపీ సీటు..కొణతాల అసంతృప్తి
-
రూటు మార్చిన నాగబాబు?
జనసేన లో పవన్ కళ్యాణ్ .. నాదెండ్ల మనోహర్ తరువాత మూడో స్థానంలో ఉన్న పవన్ సోదరుడు నాగబాబుకు రాజకీయ ఆలోచనలు ఉన్నా.. వాటిని సరిగా అమలు చేయలేకపోవడం .. స్థిరత్వం లేకపోవడం.. సరైన ప్రణాళిక... వ్యూహాలు కొరవడడంతో చట్టసభల్లోకి వెళ్లే అవకాశం దక్కడం లేదు.. గతంలో 2019 లో నరసాపురం నుంచి జనసేన తరఫున లోక్ సభకు పోటీ చేసిన నాగబాబుకు రెండున్నర లక్షల ఓట్లు వచ్చినా గెలుపు సాధ్యపడలేదు.. అక్కడ రఘురామా కృష్ణం రాజు గెలవగా ఈయన ఏకంగా మూడో స్థానంలో మిగిలిపోయారు.. ఈసారైనా చట్టసభలో అధ్యక్షా అనాలన్నది అయన ఆశగా కనిపిస్తోంది.. చిన్నా చితకా యాక్టర్లు.. ఛోటామోటాగాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుతున్నారు కానీ మెగా బ్రదర్ అనే బ్రాండ్ ఉన్న నాకేం తక్కువ.. నేనూ గెలుస్తా అనే ధీమా ఆయనలో ఉన్నా.. తన కోరికను నెరవేర్చుకునే కృషి.. పట్టుదల.. అవేమి లేవు.. దీంతో ఆయన కోరిక నెరవేరడం లేదు.. ఈసారైనా గెలవాలన్న అయన లోక్ సభకు పోటీ చేస్తారని అంటున్నారు.. అయితే గతంలో కాపులు ఎక్కువగా ఉంటారన్న లెక్కతో నరసాపురంలో పోటీ చేసి దెబ్బతిన్న నాగబాబు ఈసారి రూటు మార్చారని అంటున్నారు.. ఏకంగా మూడు జిల్లాలు మారి అనకాపల్లికి రావడానికి ప్లాన్ చేస్తున్నారు . అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రూట్ వేస్తున్నట్లు అయన కదలికలు స్పష్టం చేస్తున్నాయి. అయన ఇటీవల విశాఖలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు.. దానికితోడు కాపు నాయకులూ.. వ్యాపారాలు.. పారిశ్రామికవేత్తలతోను సైతం తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ... ఇంకా నిధుల వసూళ్లు వంటి పనుల్లో అయన యాక్టివ్ గా ఉన్నారు. ఇందులో భాగంగా పెందుర్తి.. యలమంచిలి నియోజకవర్గాల్లో అయన పర్యటిస్తున్నారు.. ఈమధ్యనే వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు... రాజీనామా చేసి జనసేనలో చేరారు.. అయన పెందుర్తిలో పోటీ చేస్తారని .. ఈ మేరకు పవన్ సైతం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇద్దరికీ ప్రయోజనం కలిగేలా నాగబాబు సైతం పెందుర్తిలో పర్యటిస్తున్నారు. అయితే ఇదే పెందుర్తి టిక్కెట్ తనకు కావాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.. ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి అదీప్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో పెందుర్తి పోరు మంచి రసకందాయంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ కూడా లైన్లో ఉన్నారు.. తన కొడుక్కి ఎంతమాత్రం టిక్కెట్ ఇవ్వాల్సిందే అని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నుంచి బైరా దిలీప్ అనే వ్యాపారవేత్త సైతం లైన్లో ఉన్నారు. తన కొడుక్కు టిక్కెట్ ఇవ్వకుండా పొత్తులో భాగంగా నాగబాబు పోటీ చేస్తే అయ్యన్న ఊరుకుంటారా ? మరి ఆయన్ను ఎలా శాంత పరుస్తారన్నది తెలియడం లేదు. ఈసారి నాగబాబు తన అభీష్టం మేరకు అనకాపల్లిలో పోటీ చేయగలరా లేదా అన్నది చూడాలి.. - సిమ్మాదిరప్పన్న ఇదీ చదవండి: ఢిల్లీలో బాబుకు ఎదురుదెబ్బ.. పవన్తో కొత్త రాయబారం! -
చంద్రబాబు ప్లాన్.. పవన్, నాగాబాబుకు కొత్త కష్టం!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు తమ భవిష్యత్తు, తమ పార్టీల పరిస్థితిపై బాగానే ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నది. మరోవైపు నటుడు, జనసేన నేత నాగబాబు తమ బలం బాగా పెరిగిందని చెబుతున్న తీరు ఆసక్తికరంగానే ఉంది. చంద్రబాబు మాట్లాడిన ఒక వీడియోని గమనించండి. ఈసారి తెలుగుదేశం గెలవకపోతే ప్రత్యామ్నాయం ఉండదు. రాష్ట్రానికే తాము రాలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆయన అన్నారు. ✍️నిజానికి చంద్రబాబు ఇప్పటికీ ఎక్కువ కాలం హైదరాబాద్లోనే నివసిస్తుంటారు. పవన్ కల్యాణ్ కూడా అంతే. అయినా ఏపీ రాజకీయాలు చేస్తున్నారు కనుక ఇక్కడ అధికారంలోకి రావాలని విశ్వయత్నం చేస్తున్నారు. సర్వేల ప్రకారం కానీ, ఇతరత్రా కానీ తమ గెలుపు అవకాశాలు తగ్గుతున్నాయని భయపడుతున్నారో ఏమో కానీ, చంద్రబాబు నేరుగా రాష్ట్రానికే రాలేమని అంటున్నారు. అంటే ఏమిటి దీని అర్ధం. తాము గెలిస్తేనే ఏపీకి వస్తామని, లేకుంటే రాబోమని చెప్పడమే కదా!. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. ఏం జరిగినా ప్రజలలోనే ఉంటామని చెబుతారు. కానీ, చంద్రబాబు మాత్రం అందుకు విరుద్దంగా మాట్లాడుతున్నారు. ఈయనకు ఏపీ ప్రజలపై అభిమానం ఉన్నట్లా? లేక పదవీ వ్యామోహమా!. మాట్లాడితే రాష్ట్రం భవిష్యత్తు కోసం అని డైలాగులు చెబుతుంటారు. అప్పుడప్పుడూ ఇలా కొన్ని వాస్తవాలు బయటపెట్టేస్తుంటగారు. దీని ద్వారా తనలో ఉన్న భయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. ✍️రాష్ట్రం భవిష్యత్తు కోసం అని చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడబలుక్కుని మాట్లాడుతుంటారు. దానిని ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా మహాప్రసాదంగా ప్రచారం చేస్తుంటాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన స్కీములన్నిటిని విమర్శిస్తారు. దాని వల్ల రాష్ట్రం నాశనమైందని అంటారు. మళ్లీ తాము అవే స్కీములను ఇంకా ఎక్కువ ఇస్తామని చెబుతుంటారు. తాజాగా వచ్చిన పవన్ వీడియో ఒకటి గమనిస్తే ఈ సంగతి మరింత స్పష్టంగా తెలుస్తుంది. తాను సోషలిస్టునని సీఎం జగన్ కంటే ఒక పది రూపాయలు ఎక్కువే ప్రజలకు ఇస్తానని అన్నారు. అంతకు ముందు ఒక సందర్భంలో ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి జగన్ స్కీములను ఎద్దేవా చేస్తూ అమ్మ ఒడి అంటా! చేయూత అంటా! విమర్శించారు. వీటిలో దేనికి పవన్ కట్టుబడి ఉంటారో తెలియదు. అందుకే సోషల్ మీడియాలో పవన్ పరస్పరం విరుద్దంగా మాట్లాడే వీడియోలు బాగా చక్కర్లు కొడుతుంటాయి. ✍️ఈ విషయంలో చంద్రబాబు కూడా తక్కువ తినలేదు. సీఎం జగన్ స్కీములన్నింటిని పలుమార్లు తప్పు పట్టారు. అమ్మ ఒడి.. నాన్న బుడ్డి అంటూ అవహేళనగా మాట్లాడారు. కానీ, ఇప్పుడు అదే చంద్రబాబు తాను అమ్మ ఒడి స్కీమ్ను మరో పేరుతో మరింత మంది పిల్లలకు అమలు చేస్తానని చెబుతున్నారు. అప్పుడు రాష్ట్రం భవిష్యత్తు నాశనం కాదా అన్నదానికి వీరు బదులు ఇవ్వరు. నిజానికి సీఎం జగన్ చేసిన అనేక సంస్కరణలను వీరు వ్యతిరేకించారు. ప్రజల ఇళ్ల వద్దకే పాలనను అందించడాన్ని చంద్రబాబు, పవన్లు వ్యతిరేకించారు. వలంటీర్ల వ్యవస్థను నానా రకాలుగా దూషించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థవల్ల ఎంతో నష్టం జరిగిపోయిందని చెప్పారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే వీటన్నిటిని కొనసాగిస్తామని అంటారు. వీరు చెప్పేది అబద్దమని అన్న సంగతి కనిపించడం లేదా?. కేవలం తమకు రాజకీయ భవిష్యత్తు లేదన్న భయంతోనే వీరు మాట మార్చుతున్నారు. ✍️చంద్రబాబు ప్రకటించిన ఆరు గ్యారంటీలు చూస్తే ఏపీని ఎంతగా పాడు చేసేది అర్ధం అవుతుంది. విజ్ఞత ఉన్న పౌరులెవ్వరూ చంద్రబాబు ఇస్తున్న గ్యారంటీలను నమ్మరు. అది కేవలం తన కుమారుడు లోకేష్ భవిష్యత్తు కోసం చేస్తున్న జిమ్మిక్కు తప్ప ఇంకొకటి కాదు. మరో సంగతి చూద్దాం. పదేళ్లపాటు తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని పవన్ ప్రకటించారు. దానిపై కూడా సోషల్ మీడియాలో కూడా రకరకాల వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇందులో ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా ముడిపెట్టి చమత్కరిస్తున్నారు. ఆయన తన సంసార జీవితంలో పదేళ్లు ఏ ఒక్కరితో ఉండలేదని, కానీ టీడీపీతో మాత్రం పదేళ్లు ఉంటానంటున్నారని జోకులు వేస్తున్నారు. వీటన్నిటికి ఆయన సమాధానం చెప్పకపోవచ్చు. 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ 2019లో విడాకులు ఇచ్చేశారు. తిరిగి 2024లో కలిసి కాపురం అంటున్నారు. మరోవైపు ఇప్పటికే కాపురంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఏం చేశారో తెలియదు. ✍️తెలంగాణలో అయితే బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తాము వచ్చే లోక్సభ ఎన్నికలలో ఎవరితో పొత్తు లేకుండానే పోటీచేస్తామని ప్రకటించడం ద్వారా జనసేనకు రామ్ రామ్ చెప్పేశారు. దానికి కారణం పవన్ సొంత పార్టీ వారికే వెన్నుపోటు పొడవడం, జనసేనకు ఎక్కడా డిపాజిట్లు రాకపోవడం వంటి కారణాలని వేరే చెప్పనవసరం లేదు. తెలంగాణలో ఇలా ఉంటే, ఏపీలో మాత్రం తమ పొత్తు జనసేనతో కొనసాగుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అంటున్నారు. మరి ఇప్పటికే పవన్ టీడీపీతో కలిసి చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నా, ఆ విషయం ఆమె మాట్లాడరు. ఇలాంటి చిత్రాలన్నీ ఏపీ రాజకీయాలలోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో పవన్ పదేళ్లపాటు టీడీపీతో పొత్తు అంటే, వచ్చే రెండు ఎన్నికలలోనూ టీడీపీని మోయడానికే ఆయన సిద్దపడుతున్నారని జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటప్పుడు తమ సంగతేమిటని ఆయా నియోజకవర్గాలలో ఉన్న జనసేన ఇన్ఛార్జీలు ప్రశ్నిస్తున్నారు. ✍️ఉదాహరణకు వినుకొండ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జీ ఒక వీడియో చేసి పదేళ్లు టీడీపీకి పనిచేసేదానికి తమ పార్టీ ఎందుకని ప్రశ్నించారు. తమకు పదేళ్లపాటు రాజకీయ భవిష్యత్తు లేదని పవన్ చెప్పేశారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీతో పొత్తును విమర్శిస్తే వైఎస్సార్సీపీకి అమ్ముడు పోయినట్లేనని జనసైనికులను అవమానించిన పవన్పై వారికి కోపంగా ఉంటే, ఇప్పుడు తాజా పదేళ్ల పొత్తు ప్రకటనతో వారు మండిపడుతున్నారు. ఈ పరిస్థితిలో టీడీపీతో పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు అడుగుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. టీడీపీవారేమో పదో, పరకో జనసేనకు ఇస్తే సరిపోతుందని ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య టీడీపీ మీడియా వారు కొందరు ఒక ప్రచారం పెట్టారట. పవన్ పొత్తు ప్రకటన చేసినా, ఆశించిన విధంగా టీడీపీకి మేలు కలగడం లేదని వారు చెబుతున్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వనవసరం లేదనే కదా!ఎలాగూ ఇప్పుడు పవన్ టీడీపీ వెనుక నడవక తప్పదని, ఎక్కువ సీట్లు అడగకుండా ఇలా ఆయన పరువు తీయాలన్నది వారి ఉద్దేశం. ✍️ఈ వాస్తవాలు పవన్ సోదరుడు నాగబాబుకు తెలియవేమో కానీ, ఆయన మాత్రం జనసేన బలం బాగా పెరిగిందని సభలలో చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తూ జనసేన బలం ముప్పైరెండు నుంచి ముప్పైఐదు శాతం వరకు పెరిగిందని, ఉభయ గోదావరి జిల్లాలలో అయితే అది నలభై శాతంపైనే అని అన్నారు. దానిని ఆయన కానీ, ఆయన సోదరుడు కానీ నమ్ముతుంటే టీడీపీతో పొత్తులో భాగంగా కనీసం అరవై నుంచి డెబ్బై సీట్లు అడగాలి. అలాకానీ పక్షంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఏమి ప్రయోజనం అన్నది వారు చెప్పగలుగుతారా?. టీడీపీ, జనసేన అధినాయకత్వంలోనే గందరగోళం, భయం ఏర్పడిందనడానికి ఇవన్నీ ఉదాహరణలే కదా!. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
టీడీపీ నేతల బాటలోనే జనసేన నేతలు
-
నకిలీ ఓటరు గుర్తింపులో జనసేన నాగబాబు
-
కొత్తవాళ్లతో సినిమా పెద్ద బాధ్యత
‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో ఇప్పటివరకు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలింస్ చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ప్రారంభించాం. ఇంతమంది కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను’’ అన్నారు నిహారిక కొణిదెల. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రం శుక్రవారంప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ని యూనిట్కి అందించారు. యదు వంశీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ద్వారా 11 మందిని హీరోలుగా, నలుగురిని హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో నేను, నా సతీమణి జయలక్ష్మి నిర్మాతలుగా పరిచయమవుతున్నాం’’ అన్నారు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ అధినేత ఫణి. ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్ దేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: మన్యం రమేశ్. -
ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు: శ్రీకాంత్
మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్. 2004లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా హీరో శ్రీకాంత్ మెప్పించారు. అయితే ఈ మూవీని మెగా ప్రొడక్షన్స్ ద్వారా నవంబర్ 4న భారీ ఎత్తున రీ రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో ఈ రి రిలీజ్కు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ ట్రైలర్ను నాగబాబు, హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. '2004ని నేను ఎప్పుడూ మరిచిపోలేను. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే మున్నాభాయ్ లగేరహో రీమేక్ వార్త వినిపించింది. హీరో పక్కన ఉండే కారెక్టర్ నాకు ఎలా ఉంటుంది అన్నయ్యా?' అని చిరంజీవిని అడిగా. అలా నవ్వి ఇలా వదిలేశారు. కానీ చివరకు ఆ పాత్ర నాకే వచ్చింది. అన్నయ్యతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయనది ఎంతో కష్టపడే మనస్తత్వం. ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతోంది. పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. నాగబాబు మాట్లాడుతూ.. 'ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ మూవీ వచ్చి 19 ఏళ్లు అవుతోంది. ప్రతీ 20 ఏళ్లకు ఓ జనరేషన్ మారుతూ ఉంటుంది. టీవీ, యూట్యూబ్లో పాత సినిమాలను ఎవరూ చూడరు. కానీ ఇలాంటి సినిమాలకు మళ్లీ మళ్లీ చూసే ఆడియెన్స్ ఎక్కువగా ఉంటారు. ఇలాంటి చిత్రాలను ఒకప్పుడు థియేటర్లో మళ్లీ ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ, ఛానెళ్లలో వస్తున్నాయి. ఇలాంటి సినిమా మళ్లీ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లేలా ఉంటుంది. ట్రైలర్ చూశాకా ఇవన్నీ నాకు గుర్తొచ్చి బాధ, సంతోషం కలిగాయి.' అని అన్నారు. -
పవన్ కల్యాణ్ చుట్టూ 'రుక్మిణి' కోట.. ఇంతకూ ఎవరీమె..?
జనసేన పార్టీలో కీలక నాయకుల పేర్లు చెప్పమని ఎవరినైనా అడిగితే పట్టుమని ఇదు పేర్లు కూడా తెరపై కనిపించవు. పవన్ పల్లకీ మోస్తున్న ఆయన అభిమానులకు కూడా ఈ విషయం తెలుసు. పవన్ తర్వాత పార్టీలో ఎక్కువగా వినిపించే పేరు నాదెండ్ల మనోహర్ కానీ ఆ జాబితాలో రుక్మిణి కోట అనే యువతి కూడా చేరారు. నిన్న మొన్నటి వరకు నాదెండ్ల ఏది చెబితే అదే జనసేనలో నడిచేది.. కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. తాజాగా రాయలసీమ జిల్లాల మహిళా నాయకురాలు పసుపులేటి పద్మావతి జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖలో 140 రోజుల పాటు రుక్మిణి ఎలా ఆడుకున్నారో క్లియర్గా వివరించారు. ఇలా బయటికి చెప్పుకోలేని వాళ్లు చాలా మంది జనసేనలో ఉన్నారని రుక్మిణి పేరు చెబుతూనే ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుకుంటున్నారు. రుక్మిణి కోట ఎవరు..? కృష్ణా జిల్లాకు చెందిన రుక్మిణి లండన్లో ఉండేవారు. అక్కడ ఆమె ప్రముఖ బ్రాండెడ్ బట్టల షాపును రన్ చేసేవారట. పవన్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయనకు దగ్గరుండి సౌకర్యాలు కల్పించేవారని జనసేన నాయకులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో 2020లో ఆమెను జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్గా పవన్ నియమించారు. వాస్తవానికి జనసేన నియామకాలను పరిశీలిస్తే ఎక్కువగా విదేశాల్లోనే ఉంటాయి. పార్టీ కోసం ఫండ్స్ పేరుతో పవన్,నాగబాబు కూడా ఇప్పటికే పలు పర్యటనలు కూడా చేసిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: మెగా 156 ప్రారంభం.. వీడియోతో ఫ్యాన్స్కు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి) జనసేన వీరమహిళ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దానికి దిశానిర్దేశం చేస్తున్నది కూడా రుక్మిణినే అని వారు చెబుతుంటారు. 2020 నుంచే రుక్మిణి పార్టీలో ఉన్నప్పటికీ 2022లో ఆమె లండన్ నుంచి హైదరాబాద్కు మకాం మార్చారు. ఇక్కడి వచ్చాక ఆమెకు హైదరాబాద్లోని జనసేన కార్యాలయ బాధ్యతల్ని మొదటగా రుక్మిణికి పవన్ అప్పగించారు. ఆమె టాలెంట్తో పవన్ను మెప్పించడంతో పార్టీలో ఆమె కీలకంగా మారిపోయారని టాక్. ఈ నేపథ్యంలో ఆప్పటికే జనసేన పార్టీ ఆఫీస్లో పనిచేసే 30 మందిని ఒక్కసారిగా తొలగించేశారని సమాచారం. వారి స్థానంలో తనకు సంబంధించిన వ్యక్తులను రుక్మిణి ఏర్పాటుచేసుకున్నారని తెలుస్తోంది. పవన్ను కలవాలంటే జనసేనలో ఎంత పెద్ద పాలెగాడైనా రుక్మిణిని దాటుకుని మాత్రమే వెళ్లాలట. ఎంతటివాడైనా డోంట్ కేర్ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పవన్ వద్దకు ఎంట్రీ దొరుకుందట. లేదంటే జనసేన కార్యాలయం గేటు కూడా తాకలేరట. ఇదే విషయాన్ని జనసేనకు రాజీనామ చేసిన పసుపులేటి పద్మావతి తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు పార్టీలో ఎంతపెద్ద తోపు నాయకుడు అయినా పవన్ను కలవాలంటే రుక్మిణి... రుక్మిణి.. అంటూ ప్రదక్షణలు చేసుకోవాల్సిందేనట. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను ఎందుకంటే: రేణు దేశాయ్) అలా జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ దేవుడైతే.. భక్తులకు , ఆయనకు మధ్య అనుసంధానకర్తగా రుక్మిణి అని జనసేన నాయకులు సరదాగా చెబుతున్న మాట. ఆమె అనుమతి లేకుండా పార్టీలో ఏ ఒక్క చిన్న పని కూడా జరగదట. రుక్మిణి స్పీడ్ ముందు నాదెండ్ల మనోహర్ పరిస్థితి ఎలా ఉందో అంటూ ఆ పార్టీలో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి -
జనసేన కిందే టీడీపీ...నాగబాబు కీలక వ్యాఖ్యలు..
-
మాకు సీఎం కావాలన్న ఆలోచనలేదు
సాక్షి, తిరుపతి : తమకు సీఎం కావాలన్న ఆలోచనలేదని.. టీడీపీకి, చంద్రబాబుకు తాము మద్దతుగా మాత్రమే ఉన్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు చెప్పారు. టీడీపీతో పొత్తుపట్ల 95 శాతం పార్టీ శ్రేణులు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. వ్యతిరేకంగా ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోవడంలేదని ఆయన స్పష్టంచేశారు. తిరుపతి సమీపంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి మద్దతుగా కలిసి పోరాడాలని నిర్ణయించామని ప్రకటించారు. అయితే, కాపు నేతలు టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎవరు సీఎం అనేది కాలమే నిర్ణయిస్తుందని నాగబాబు చెప్పారు. ఇక పొత్తుపై బీజేపీ నుంచి కూడా త్వరలోనే నిర్ణయం వస్తుందని నాగబాబు ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ప్యాకేజీ అంటే చెప్పు తీసుకుని కొడతామని వ్యాఖ్యానించారు. త్వరలోనే రాయలసీమలో పవన్ వారాహి యాత్ర ఉంటుందన్నారు. మేం అలా అనలేదు.. జనసైనికులు ఎప్పుడూ ఎవరిదో ఒకరి జెండాను మోయాల్సిందేనా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. మీరు సాక్షి వారా? ఈరోజు సాక్షిలో వచ్చిన వార్త గురించి చర్చించుకున్నాం. మేం అలా అనలేదు.. అని అంటూ.. సాక్షికి సమాధానం చెప్పడం కూడా వృథా అని వ్యాఖ్యానించారు. కేసులకు భయపడబోమని, వాటిని ఎదుర్కొంటామని.. తమకూ మంచి లీగల్ టీం ఉందన్నారు. టీడీపీతో పొత్తుకు ఒప్పుకోం.. అంతకుముందు జరిగిన కార్యకర్తల సమావేశంలో.. టీడీపీతో పొత్తుకు ఒప్పుకునేది లేదని, వారితో కలిసి వెళ్లే ప్రసక్తేలేదని జనసేన శ్రేణులు నాగబాబు సమక్షంలో తే ల్చిచెప్పారు. లేదంటే పవన్ని సీఎం అభ్యర్థి గా టీడీపీ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. జనసేన శ్రేణులను టీడీపీ వాడుకుని వదిలేసే రకమని సభలో కొందరు బిగ్గరగా అరిచినట్లు తెలిసింది. అయితే, సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు దీనిపై స్పందించకుండా మౌనం వహించినట్లు సమాచారం. దీంతో చేసేదిలేక మరోసారి క్షేత్రస్థాయిలో చర్చిద్దామని, సంయమనం పాటించాలని ప్రాథేయపడినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. -
జనసేన కిందే టీడీపీ పని చేయాలి: నాగబాబు
సాక్షి, తిరుపతి: సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. టీడీపీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన కిందనే టీడీపీ పని చేస్తుందంటూ కార్యకర్తలను ఉద్దేశించి నాగబాబు పేర్కొన్నారు. చిత్తూరు పర్యటనలో ఉన్న జనసేన నేత నాగబాబు.. అక్కడి కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అయితే ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు పొత్తు ప్రస్తావన తీసుకొచ్చారు. టీడీపీ నేతలు గతంలో తమని టార్చర్ పెట్టారని నాగబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. గతాన్ని మరిచిపోయి ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు నాగబాబు సర్దిచెప్పే యత్నం చేశారు. ఈ క్రమంలో .. టీడీపీ మన కిందనే పని చేయాలి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తు ఉన్నా.. టీడీపీ నాయకులు మన కిందనే పని చేయాలి. టీడీపీతో కలిసి పని చేసినా జనసేన అజెండానే మీరు తీసుకెళ్లాలి అని జనసేన కార్యకర్తలకు సూచించారాయన. అంతేకాదు.. అధికారంలోకి వస్తే పవనే సీఎం అవుతారంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఇదిలా ఉంటే.. టీడీపీతో కలిసి జనసేన ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, రాజమండ్రి జైలులో చంద్రబాబు ములాఖత్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ రెండు పార్టీ క్యాడర్ల నుంచి అసంతృప్తి రాగాలు బయటపడుతున్నాయి. -
నాగబాబు, నాదెండ్ల మనోహర్ పరిస్థితి ఎలా ఉందంటే..
-
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న 30 ఇయర్స్ పృథ్వీ కుమార్తె
క్రాంతి హీరోగా, శ్రీలు హీరోయిన్గా పరిచయమవుతున్న చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. నటుడు థర్టీ ఇయర్స్ పృధ్వీ ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టారు. గుంటక శ్రీనివాస్ రెడ్డి, కె.కృష్ణారెడ్డి, పద్మ రేఖ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను నటుడు, నిర్మాత నాగబాబు విడుదల చేశారు. ‘‘కొత్త రంగుల ప్రపంచం’ వంటి మంచి కథలో నటించే అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు క్రాంతి. ‘‘మా నాన్న(పృధ్వీ) దర్శకత్వం వహించిన తొలి సినిమాతో నేను హీరోయిన్గా పరిచయమవడం సంతోషంగా ఉంది’’అన్నారు శ్రీలు. ఈ కార్యక్రమంలో నటుడు సుమన్, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
మా ఇంట్లోనే హీరోలు.. కానీ ఎవరూ నాకు ఛాన్సివ్వలేదు: నాగబాబు
మా ఇంట్లో చాలామంది హీరోలున్నారు. కానీ ఎవరూ ఏనాడూ పిలిచి క్యారెక్టర్ ఇవ్వలేదు అన్నాడు నటుడు నాగబాబు. సుస్మిత కొణిదెల మాత్రం తనకు రెండోసారి అవకాశం ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. శ్రీదేవి శోభన్బాబు ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. సంతోష్ శోభన్, గౌరి.జి.కిషన్ జంటగా నటించిన చిత్రం శ్రీదేవి శోభన్బాబు. నూతన దర్శకుడు ప్రశాంత్కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని విష్ణుప్రసాద్తో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించారు. ఈ నెల 18న సినిమా రిలీజ్ కానున్న క్రమంలో హైదరాబాద్లో బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. 'మా ఇంట్లో చాలామంది హీరోలున్నారు కానీ నాకెవరూ ఛాన్సివ్వలేదు. మా హనీ(సుస్మిత) మాత్రం నాకు రెండోసారి అవకాశమిచ్చింది. హనీ గురించి ఓ మాట చెప్పాలి. తను తల్చుకుంటే తనకు సపోర్ట్గా ఏ హీరో అయినా ముందుకు వచ్చేస్తాడు. కానీ ఎవరి సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ నిర్మాతగా అన్ని కష్టాలు పడుతూ మీ ముందుకు ఈ సినిమా తీసుకొచ్చింది. తను త్వరలోనే మెగా ప్రొడ్యూసర్ అవుతుంది. ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు తెలియకుండానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ట్రైలర్ చూస్తుంటే ప్రశాంత్ ఏం చెప్పాడో అదే తీశాడనిపించింది. డైరెక్టర్గా అతడికి మంచి భవిష్యత్తు ఉంది. సినీ ఇండస్ట్రీలో మెన్ డామినేషన్ ఉంటే టీవీ ఇండస్ట్రీలో వుమెన్ డామినేషన్ ఉంది. ఆడపిల్లల్ని ఇండస్ట్రీకి పంపించకూడదు అన్న భ్రమలు ఇంకా ఉన్నాయి. అవకాశం వస్తే ఆడపిల్లలు మగవాళ్ల కన్నా బెస్ట్గా నటిస్తారు, బెస్ట్గా డైరెక్ట్ చేస్తారు, నిర్మిస్తారు' అని చెప్పుకొచ్చాడు నాగబాబు. చదవండి: అత్యంత చవక రేటుకు పఠాన్ టికెట్స్ -
కిరాక్ ఆర్పీ చేపల పులుసు బ్రాంచ్ ప్రారంభించిన నాగబాబు.. ఫోటోలు వైరల్
-
నాగబాబు ట్వీట్కు అంబటి కౌంటర్..
తాడేపల్లి: సినీ నటుడు నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. నువ్వు, మీ తమ్ముడు పవన్ కల్యాణ్ అన్నట్లు తాను సంబరాల రాంబాబునేనని, కానీ ముఖానికి రంగు వేయను, ప్యాకేజీ కోసం డాన్స్ చేయను అంటూ ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని భోగి వేడుకల్లో భాగంగా స్థానికులను ఉత్తేజ పరిచేందుకు అంబటి డాన్స్ చేశారు. ఈ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే నాగబాబు దీనిపై వ్యంగ్యంగా స్పందించగా.. అంబటి తనదైన రీతిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు, మీతమ్ముడు అన్నట్టు "సంబరాల రాంబాబు"నే ! కానీ...ముఖానికి రంగు వేయను ప్యాకేజి కోసం డాన్స్ చేయను ! @NagaBabuOffl@PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) January 16, 2023
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ఆ డైరెక్టర్ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంటే ఎయిర్పోర్టుకు..
- నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- ‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
- అమెరికాలో గంజాయి బ్యాచ్లకు ఊరట!
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచకం.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
Advertisement