pinnelli ramakrishna reddy
-
చంద్రబాబుకి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కౌంటర్
-
జగన్ పండగ చేస్తే.. చంద్రబాబు దండగ చేశారు: వైఎస్సార్సీపీ
సాక్షి, పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం రైతులను నిలువున ముంచేసిందని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. నరసరావుపేటలో ‘అన్నదాతకు అండగా’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ‘‘రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనే నాధుడే లేడు. రేపు(శుక్రవారం) రైతుల తరఫున వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టర్లకు మెమోరాండం సమర్పిస్తారని ఆయన చెప్పారు.మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విత్తనాల కోసం ఎంత ఇబ్బంది పడ్డారో నరసరావుపేటలో మనం ప్రత్యక్షంగా చూశాం. ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు రైతుల్ని మోసం చేశాడని ఆమె మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ వ్యవసాయాన్ని పండగ చేశారని.. కూటమి ప్రభుత్వం దండగ చేసిందన్నారు. బస్తాకు 400 రూపాయలు నష్టానికి రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా పెట్టుబడి సాయం అందించాం. ఉచితంగా పంటల బీమా కల్పించాం. ఏ సీజన్లో పంటకు నష్టం వస్తే అదే సీజన్లో ఇన్ఫుట్ సబ్సిడీ అందించాం. కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేసిందన్నారు.మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు పైన కేసులు బనాయిస్తోంది. ఇదే దృష్టి పాలన పైన పెట్టాలి. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. -
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పీఏ కిడ్నాప్నకు యత్నం
మాచర్ల: మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పీఏ ఎం.శ్రీనివాస శర్మను కిడ్నాప్ చేయడానికి టీడీపీ వర్గీయులుగా భావిస్తున్న కొందరు గూండాలు ప్రయత్నించారు. పోలీసులు రంగంలోకి దిగడంతో ఆయన్ని వదిలేసి పరారయ్యారు. శర్మ కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. పిన్నెల్లికి చాలా కాలం నుంచి పీఏగా పనిచేస్తున్న శ్రీనివాస శర్మను టీడీపీ వర్గీయులు కొందరు టార్గెట్ చేసుకున్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ఆయన ఇంటికి టీడీపీ గుర్తులు కలిగిన స్కారి్పయో వాహనంలో గుర్తు తెలియని ఐదుగురు దుండగులు వచ్చారు.ఇంటి ముందు వాహనాన్ని ఆపి హడావుడిగా దిగారు. ఆ ప్రాంతానికి ఇతరులు రాకుండా ముగ్గురు నిలబడగా, ఇద్దరు ఇంటి ముందు తలుపులను కర్రలతో కొట్టారు. అవి రాకపోవటంతో మరో వైపు నుంచి తలుపులు బద్దలుకొట్టి దౌర్జన్యంగా ఇంటిలోకి ప్రవేశించి శ్రీనివాస శర్మను బెదిరించారు. తన భర్తను ఏమీ అనవద్దని, కొట్టవద్దని శర్మ భార్య వేడుకొన్నా వారు దౌర్జన్యంగా ప్రవర్తించారు. శర్మ రావాల్సిందేనని, లేకపోతే ఊరుకునేది లేదని బెదిరించారు. శ్రీనివాసశర్మ రానని చెప్పటంతో బయట ఉన్న ముగ్గురు కూడా లోపలకు వచ్చారు. శర్మను బలవంతంగా ఎత్తుకొని తీసుకెళ్లి వాహనంలో ఎక్కించారు.స్కార్పియోలో గుంటూరు రోడ్డు వైపు తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి కూడా పలువురు సమాచారమిచ్చారు. పట్టణ, నియోజక వర్గంలోని సీఐలు వెంటనే రంగంలోకి దిగారు. కిడ్నాప్ చేసిన వారి ఆచూకీ తెలుసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో కిడ్నాపర్లు శ్రీనివాస శర్మను కారంపూడి సమీపంలో వదిలివేసి పరారయ్యారు. ఆయన తెలిసిన వారి వాహనం ఎక్కి మాచర్లలోని ఇంటికి చేరుకున్నారు. వెంటనే కారంపూడి, మాచర్ల అర్బన్, రూరల్ సీఐలు శర్మ ఇంటికి చేరుకొని జరిగిన సంఘటనపై విచారణ జరిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు మాచర్ల అర్బన్ సీఐ చెప్పారు. -
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పై కాకాణి గోవర్ధన్ రెడ్డి రియాక్షన్
-
జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి విడుదల
-
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల..
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. రెంటచింతల, కారంపూడిలో నమోదైన కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా, అక్రమ కేసుల కారణంగా పిన్నెల్లి 55 రోజుల పాటు జైలులో ఉన్న ఉండాల్సి వచ్చింది.ఇక, పిన్నెల్లి బయటకు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..‘హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. వరుసగా నాలుగు సార్లు ఆయన మాచర్ల నుంచి విజయం సాధించారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గం. చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మేము భయపడం. పిన్నెల్లి ఏం నేరం చేశారని దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారు.చాలాచోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. కానీ, పిన్నెల్లిపై మాత్రమే కేసు పెట్టారు. అందుకే ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉంది. చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. శ్రేయోభిలాషులు అందరూ తల్లడిల్లిపోయారు. ఏది ఏమైనా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాం. పిన్నెల్లిపై మరిన్ని కేసులు నమోదు చేసి మళ్లీ జైలుకు పంపించాలని ప్రయత్నిస్తున్నారు.చంద్రబాబు ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో అవన్నీ మళ్ళీ పునరావృతమవుతాయి. ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. చంద్రబాబు చెప్పినట్లు చేస్తే అధికారులు బలి అవుతతారు. అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతే ఆయన, లోకేశ్తో హైదరాబాద్కు వెళ్ళిపోయారు. అధికారులు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. వంద రోజుల్లో మంచి పాలన అందిస్తానని చెప్పిన చంద్రబాబును ప్రజలు చీ కొడుతున్నారు. చంద్రబాబు పాలన చూసి ప్రజలు చీ కొడుతున్నారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి. కేసులకు, అరెస్ట్లకు భయపడే ప్రసక్తే లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
YSRCP మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్
-
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్
సాక్షి, అమరావతి/వెంకటాచలం: రెంటచింతల, కారంపూడి పోలీసులు నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని పిన్నెల్లిని ఆదేశించింది. చార్జిషీట్ దాఖలు చేసేంత వరకు వారంలో ఒక రోజు సంబంధిత ఎస్హెచ్వో ముందు హాజరు కావాలని చెప్పింది. పాస్పోర్టును మేజిస్ట్రేట్ కోర్టులో స్వాధీనం చేయాలని, అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లకూడదని, ఎప్పుడు అవసరమైనా దర్యాప్తునకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన వ్యక్తులను వాటిని కోర్టుకు, పోలీసు అధికారికి తెలియజేయకుండా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెదిరించడం, ప్రలోభపెట్టడం వంటివి చేయరాదని స్పష్టం చేసింది. నివాస స్థలం, మొబైల్ నంబరు వివరాలను దర్యాప్తు అధికారికి తెలపాలని, ఒకవేళ అవి మారితే వెంటనే ఆ విషయాన్ని తెలియజేయాలని చెప్పింది. ప్రస్తుత కేసుల్లో తన పాత్ర గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడరాదని ఆదేశించింది. ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంటూ జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు శుక్రవారం తీర్పు చెప్పారు. దర్యాప్తు అధికారి పిన్నెల్లిని విచారణకు పిలిచినప్పుడు వెంట న్యాయవాదిని తీసుకెళ్లే వెసులుబాటు కల్పించాలని ఆయన తరపు న్యాయవాది కోరగా.. ఆ పరిస్థితి వస్తే కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయమూర్తి çసూచించారు. పిన్నెల్లిపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు గురజాల కోర్టు నిరాకరించడంతో పిన్నెల్లి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై గురువారం విచారణ జరిపారు. ఈ కేసులో పిటిషనర్ నుంచి పోలీసులు రాబట్టాల్సిన విషయాలేవీ లేనందున, ఆయన్ని నిరవధికంగా నిర్బంధించడం సమర్థనీయం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పిన్నెల్లి 4 సార్లు ఎమ్మెల్యే అని, ఆయనకు బలమైన సామాజిక సంబంధాలున్నాయని, ఆయన విచారణ నుంచి పారిపోయే అవకాశం లేదన్నారు. నేడు జైలు నుంచి పిన్నెల్లి విడుదలబెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందజేయడంలో ఆలస్యం కావడంతో శుక్రవారం పిన్నెల్లిని విడుదల చేయడానికి వీలుకాలేదు. ఆయన్ని శనివారం విడుదలయ్యే అవకాశముంది. -
పిన్నెల్లికి రెండు కేసుల్లో బెయిల్ ' మంజూరు చేసిన ఏపీ హై కోర్ట్
-
బెయిల్ ఇవ్వండి
సాక్షి, అమరావతి: పోలింగ్ రోజున, ఆ మరుసటి రోజున తనపై రెంటచింతల, కారంపూడి పోలీసులు నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం విచారణ జరపనున్నారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసి.. టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేశారంటూ రెంటచింతల పోలీసులు రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజు కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారంటూ కారంపూడి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అనంతరం పిన్నెల్లిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఇటీవల గురజాల కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గురజాల కోర్టు రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై హత్యాయత్నం కింద నమోదు చేసిన కేసులు చెల్లవని.. అందుకు ఎలాంటి ఆధారాలు లేవని పిన్నెల్లి వివరించారు. రాజకీయ ప్రోద్భలంతో పోలీసులు తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. తాను జైలు నుంచి బయటకు రాకూడదని.. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విన్నవించారు. 37 రోజులుగా జైల్లో ఉన్నానని.. పోలీసులు దర్యాప్తు కూడా పూర్తయ్యిందని.. బెయిల్ మంజూరు సందర్భంగా ఏ షరతు విధించినా కట్టుబడి ఉంటానన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును పిన్నెల్లి కోరారు. -
పద్ధతి మార్చుకో.. చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక
ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు.. రోజులు మీవే ఉండవని గుర్తు పెట్టుకో చంద్రబాబూ.. మీ పాపాలు వేగంగా పండుతున్నాయి. ప్రజలు క్షమించని పరిస్థితి వస్తుంది. కచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు, రోజులు కూడా ఉంటాయి. చేతనైతే ప్రజలకు మంచి చేయండి. ప్రజల మనసులు గెలుచుకుని చిరస్థాయిగా నిలబడేలా పాలన చేయండి. కానీ ఈ తప్పుడు రాజకీయాలు మానండి. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయానికి నువ్వు నాంది పలికినట్లే. నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. రేప్పొద్దున మళ్లీ మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితి తప్పదు. అటు వంటి తప్పుడు సంప్రదాయాలు ఇప్పటికైనా ఆపండి. ఇలాంటివి ఎవరు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి. కానీ దగ్గరుండి ఇలా ప్రోత్సహించడం దుర్మార్గం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని హెచ్చరిస్తున్నాం. ఇదే తీరు కొనసాగితే మాత్రం ఊరుకునేది లేదు. రియాక్షన్ అనేది కచ్చితంగా ఉంటుంది. – మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో విధ్వంస రాజకీయాలకు పాల్పడుతూ విష సంస్కృతికి చంద్రబాబు బీజం వేస్తున్నారని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్లో రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దాడులు, విధ్వంసాలు ఆపాలని కోరడం లేదని, హెచ్చరిస్తున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని.. పైగా బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇది ఏ మాత్రం న్యాయం కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలు పండుతున్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై, మంచి పాలన అందించడంపై చంద్రబాబు దృష్టి పెడితే మంచిదన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గురువారం వైఎస్ జగన్ ములాఖత్ ద్వారా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసక చర్యలు జరుగుతున్నాయి. కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దొంగ కేసులు పెడుతున్నారు. వీళ్లే కొడతారు, మళ్లీ వీళ్లే అటు వైపున ఉన్న వారి మీద కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పరిపాలనలో కులం చూడలేదు, మతం చూడలేదు. ప్రాంతం చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకం, ప్రతి మంచిని అర్హత ప్రామాణికంగా ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేశాం. ఈ రోజు చంద్రబాబునాయుడుకు ఓటు వేయలేదనే కారణంతో అన్యాయంగా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. ఆ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను విరగ్గొడుతున్నారు.. పగలగొడుతున్నారు. ఇవన్నీ శిశు పాలుని పాపాల మాదిరిగా పండుతాయి. నెల్లూరులో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని, ప్రజల దగ్గరకు వెళ్లి ఫలాన మంచి చేశాం కాబట్టి ఓటు వేయండి అనే పరిస్థితులు ఉండాలి. కానీ ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, అన్యాయమైన కేసులు పెట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, భయాందోళనలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తే, అలాంటి రాజకీయం ఏ రోజూ నిలబడదు. తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో కానీ తర్వాత ఓటు వేసేటప్పుడు ప్రజలు ఇవన్నీ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. అందుకే చంద్రబాబులో మార్పు రావాలి. లేదంటే ప్రజలు లెక్కా జమా సరిచేసి చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..పిన్నెల్లిపై ఇంత అన్యాయంగా కక్ష సాధింపా?⇒ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏకంగా 307 అంటే హత్యాయత్నం కేసు పెట్టారు. ఏ రకంగా అన్యాయంగా అతన్ని జైల్లో నిర్బంధించారో చూస్తున్నాం. కారంపూడి ఘటన జరిగిందెప్పుడు? ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు అంటే మే 14న. కారంపూడిలో టీడీపీ ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలోని మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినందున వాళ్లను పరామర్శించడానికి డీఎస్పీ అనుమతి తీసుకుని అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి బయల్దేరాడు. ⇒ కారంపూడికి అటు వైపున ఎస్సీ కుటుంబం ఇల్లు ఉంటే.. ఎమ్మెల్యే ఊర్లోకి ప్రవేశించక ముందే ఇటు వైపు అడ్డగించారు. గొడవ టౌన్లో జరుగుతుంటే పిన్నెల్లిని ఊరుబయటే అడ్డగించారు. నారాయణస్వామి అనే సీఐని పిన్నెల్లి చూసిన దాఖలాలు కూడా లేవు. మే 14న గొడవ జరిగితే 9 రోజుల తర్వాత అంటే మే 23న ఆయనకేదో జరిగింది అన్నట్లుగా ఆ సీఐ, రామకృష్ణారెడ్డి మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. ఆ సీన్లో లేని వ్యక్తిపై ఈ కేసు బనాయించారు. ఇది అన్యాయం కాదా? ⇒ అసలు ఇన్సిడెంట్ నిజంగా జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14న జరిగి ఉంటే మే 15న మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు? 17వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం సిట్ వేసింది. 17 నుంచి 20వ తేదీ వరకు పల్నాడు ప్రాంతంలో ఆ సిట్ బృందం తిరిగి ఘటనపై రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టులో ఎందుకు ఈ అంశం రాలేదు? అలాంటప్పుడు ఈ రకంగా హత్యాయత్నం కేసులో ఒక మనిషిని ఇరికించడం ధర్మమేనా?ప్రతి దశలో ఓ రెడ్బుక్⇒ ప్రతి ఒక్కరూ వాళ్ల వాళ్ల స్థాయిలో రెడ్బుక్స్ అని చెప్పి పెట్టుకున్నారు. చంద్రబాబు స్థాయిలో ఒక రెడ్బుక్, లోకేశ్ స్థాయిలో ఒక రెడ్బుక్, ఎమ్మెల్యే స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఇలా రెడ్బుక్లు పెట్టుకుని ఏం చేస్తున్నారు? అతి దారుణంగా, అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ⇒ మీ విధ్వంసాలు, దాడులను రాష్ట్రం మొత్తం చూస్తోంది. కానీ ఎవరూ మాట్లాడటం లేదు. దొంగ కేసులు పెడుతున్నారు. చీనీ చెట్లు నరికేస్తున్నారు. జేసీబీలు, పొక్లెయిన్ల మీద స్వయంగా ఎమ్మెల్యేలు తిష్ట వేసి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఊరూరా ఆస్తుల ధ్వంసం, దాడులు, దౌర్జన్యాలపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.ఎమ్మెల్యే 10 సార్లు ఫోన్ చేసినా ఎస్పీ స్పందించలేదు⇒ మే 13న ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గరకు అప్పటి ఎమ్మెల్యే వెళ్లినప్పుడు జరిగిన ఘటన మీద మరో కేసు పెట్టారు. అసలు ఆ ఘటన ఎందుకు జరిగింది? అక్కడ ఉన్న ఎస్సీ సామాజిక వర్గం వారు పోలింగ్ బూత్లోకి వెళ్లి ఓటు వేసే పరిస్థితి లేనప్పుడు ఎమ్మెల్యే ఆ గ్రామానికి వెళ్లారు. ఆ పరిస్థితులను చూసి ఎస్పీకి 10 సార్లు ఫోన్ చేసినా కూడా స్పందించని పక్షంలో కనీసం సీఐని, ఎస్సైని పంపించండనే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టారు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఘటన జరిగింది. ఆ ఈవీఎం పగలగొట్టిన కేసులో తనకు బెయిల్ వచ్చింది. కానీ ఎవరిపైనో హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టి ఇవాళ జైలు పాలు చేశారు. ⇒ ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున కేసులు పెట్టారు. రిగ్గింగ్ను అడ్డుకునే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేస్తే, హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టారు. నిజంగా అటువంటిది జరిగి ఉంటే సిట్ 17వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో ఇచ్చిన రిపోర్టులో చెప్పాలి కదా? 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు పిన్నెల్లి గెలిచాడంటే మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంత వరకు ధర్మం? ఈ రోజు ఇది రామకృష్ణారెడ్డి ఒక్కడి పరిస్థితే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఇలానే జరుగుతోంది. ⇒ వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, అంబటి రాంబాబు పిన్నెల్లితో ములాఖత్లో పాల్గొన్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి తదితరులు ప్రెస్మీట్లో పాల్గొన్నారు.ప్రజలు మీకు ఓటు వేసింది ఎందుకు?⇒ ప్రజలకు మంచి చేసి వైఎస్సార్సీపీ ఓడిపోలేదు. చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఆకర్షితులయ్యారు. 10 శాతం ఓట్లు అటు షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. మేనిఫెస్టోలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్నారు. ఖరీఫ్లో జోరుగా వ్యవసాయం పనులు జరుగుతున్నాయి. రైతన్నలు పంటలు వేగంగా వేస్తున్నారు. ఇంత వరకు రైతు భరోసా రూ.20 వేలు ఇస్తానన్న దానికి అతీగతీ లేదు.⇒ బడులు మొదలయ్యాయి. అమ్మ ఒడి కింద జగన్ రూ.15 వేలు ఐదేళ్ల పాటు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తానని, ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు ఇస్తానని చెప్పారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా బడి ఈడు పిల్లలున్నారు. తల్లికి వందనం కింద ఆ డబ్బులేమయ్యాయి అని ప్రతి తల్లీ అడుగుతోంది. ⇒ 18 ఏళ్లు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 4.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2.10 కోట్ల మంది మహిళా ఓటర్లే. అందరూ 18 సంవత్సరాలు నిండిన వారే. ప్రతి నెలా రూ.1500 ఇస్తానన్నావు, ఏమైంది? అని వీరందరూ ఈ రోజు అడుగుతున్నారు. ⇒ వీటన్నింటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి. గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు డబ్బులిచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు రూ.20 వేలు ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రజలు ఎందుకు తమకు ఓటు వేశారు అని చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. ఇవేవీ కూడా చేయకుండా కేవలం భయాందోళనలు నెలకొల్పాలి.. రాష్ట్రంలో రావణకాష్టం రగిలించాలి.. దొంగ కేసులు పెట్టి ఇరికించాలి.. ఆస్తులను ధ్వంసం చేయాలి.. వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీకి ఓటు వేసిన వారెవరినీ ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం. -
పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారు: వైఎస్ జగన్
Live Updates..l⇒పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారు: వైఎస్ జగన్⇒టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో అక్రమ కేసులు పెడుతున్నారు.⇒వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు⇒శిశుపాలుని పాపాల మాదిరి చంద్రబాబు పాపాలు పండుతాయి⇒లెక్క జమ చేసి ప్రజలు చంద్రబాబుకు గట్టిగా జవాబిచ్చే రోజులు తొందరలోనే ఉన్నాయి.⇒బడులు ప్రారంభమైన అమ్మ ఒడి ఇవ్వడం లేదు⇒రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారు⇒ఇలాంటి రాజకీయాలు ఎక్కువ కాలం నిలబడవు⇒కారంపూడి సీఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు లేవు⇒మే 14న ఘటన జరిగితే, మే 23న హత్యాయత్నం కేసు నమోదు చేశారు.⇒నిజం దాడి జరిగితే ఆ మరుసటి రోజు కేసు ఎందుకు పెట్టలేదు?⇒అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్⇒నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని కలిసిన వైఎస్ జగన్⇒నెల్లూరు చేరుకున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి⇒సెంట్రల్ జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్న వైఎస్ జగన్⇒భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు⇒కాసేపట్లో వైఎస్ జగన్ నెల్లూరు చేరుకోనున్నారు. ⇒వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో నెల్లూరులో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. నెల్లూరు జైలు వద్దకు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మద్దతుదారులు చేరుకున్నారు. ⇒నెల్లూరు బయలుదేరిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి⇒కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్న జగన్⇒వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. ఈ క్రమంలో టీడీపీ నేతల అక్రమ కేసులు, దాడులకు బలైన వారికి రక్షణ కల్పించేందుకు, బాధితులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు.⇒నేడు నెల్లూరు జిల్లాకు వైఎస్ జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. పిన్నెళ్లిపై తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం ఆయనను జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఇక, రానున్న రోజుల్లో వైఎస్ జగన్.. పార్టీ కేడర్ కోసం న్యాయ పోరాటం చేస్తూనే బాధితులను కలుస్తూ వారికి భరోసా ఇవ్వనున్నారు. -
నెల్లూరుకు వైఎస్ జగన్
-
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై మరో కేసు నమోదు
-
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో అక్రమ కేసు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. అరెస్ట్ సమయంలో పిన్నెల్లిపై టీడీపీ నేత శివ దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. పిన్నెల్లిని కదలనివ్వకుండా అడ్డంగా నిలబడిన శివ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి యత్నించాడు.పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేత దౌర్జన్యానికి దిగాడు. శివ ఇచ్చిన ఫిర్యాదుతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు.. అయితే పిన్నెల్లిపై దాడికి యత్నించిన శివపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. పిన్నెల్లిపై అక్రమంగా కేసు నమోదు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.పిన్నెల్లిని కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువచ్చిన సమయంలో కోర్టు వద్దే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనపై దురుసుగా వ్యవహరించారు. పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు ముందే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. పిన్నెల్లి కోర్టు లోపలికి వెళ్తున్న సమయంలో మాచర్లకు చెందిన టీడీపీ కార్యకర్త కొమేర శివ అడ్డంగా నిలబడి దురుసుగా మాట్లాడాడు. ఆయనపై దాడి చేయబోయాడు.కోర్టు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. మాజీ ఎమ్మెల్యేని కోర్టులో హాజరుపరుస్తున్న సందర్భంలో ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీ కార్యకర్తలను అక్కడకు అనుమతించడమే కాకుండా వారు రెచ్చగొట్టేలా దుర్భాషలాడుతున్నా, బాణాసంచా కాల్చుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. పిన్నెల్లిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉందని తెలిసి కూడా ఆయన్ని కోర్టుకు తీసుకువచ్చే సమయానికి వారిని చెదరగొట్టలేదు.పిన్నెల్లిని కోర్టు లోపలికి తీసుకువెళ్లే సమయంలో ఆయన ముందు పోలీసులు ఎవరూ లేరు. అందువల్లే టీడీపీ కార్యకర్త శివ కోర్టు ప్రాంగణంలోనే నేరుగా పిన్నెల్లికి ఎదురు రాగలిగాడు. వెంటనే అతన్ని నిలువరించకపోగా, అతను కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, దాడికి యత్నించినా పట్టించుకోకపోవడం పోలీసుల ఉద్దేశపూర్వక చర్యేనని వైఎస్సార్సీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పైగా, ఉద్దేశపూర్వకంగా కోర్ట వద్దే పిన్నెల్లికి అడ్డు నిలబడి, దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్త శివే తనపై పిన్నెల్లి దాడి చేశారంటూ మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
పిన్నెల్లిపై దొంగ కేసు... ఆ పొలిసు అధికారి పనే
-
పిన్నెల్లి అరెస్ట్ పై గోపిరెడ్డి రియాక్షన్
-
పిన్నెల్లికి రిమాండ్
సాక్షి, నరసరావుపేట/నెల్లూరు (క్రైం): పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల అదనపు జూనియర్ సివిల్ కోర్టు రెండు కేసుల్లో 14 రోజుల రిమాండ్ విధించింది. మరో రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ మేజిస్ట్రేట్ ఎస్. శ్రీనివాస కల్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ రోజు, తరువాత జరిగిన ఘటనలపై తనపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను బుధవారం మధ్యాహ్నం హైకోర్టు తోసిపుచ్చడం, ఆ వెంటనే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి నరసరావుపేట ఏరియా వైద్యశాలలో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని మాచర్లకు తరలించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శ్రీనివాస కల్యాణ్ ముందు హాజరుపరిచారు. ఆయనపై నమోదైన నాలుగు కేసులపై విడివిడిగా ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. తెల్లవారుజాము నాలుగు గంటల వరకు వాదనలు కొనసాగాయి. మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం కేసు, పోలింగ్ బూత్ ముందు మహిళను బెదిరించారంటూ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కారంపూడి సీఐ నారాయణస్వామి, టీడీపీ నేత నంబూరి శేషగిరిరావుపై దాడి కేసుల్లో రిమాండ్ విధించింది. పిన్నెల్లిని నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. వెంటనే ఆయన్ని పటిష్ట భద్రత మధ్య నెల్లూరు తీసుకెళ్లారు. గురువారం ఉదయం 8.30 గంటలకు నెల్లూరులోని కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్తగా కేంద్ర కారాగారం వద్ద పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎవరూ అక్కడికి రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.కోర్టు వద్దే పిన్నెల్లిపై దాడికి యత్నంపెన్నెల్లిని కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువచ్చిన సమయంలో కోర్టు వద్దే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనపై దురుసుగా వ్యవహరించారు. పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు ముందే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. పిన్నెల్లి కోర్టు లోపలికి వెళ్తున్న సమయంలో మాచర్లకు చెందిన టీడీపీ కార్యకర్త కొమేర శివ అడ్డంగా నిలబడి దురుసుగా మాట్లాడాడు. ఆయనపై దాడి చేయబోయాడు. పోలీసులు అడ్డుకోకపోవడంతో పిన్నెల్లి అతన్ని తోసుకొని కోర్టులోకి వెళ్లిపోయారు. కోర్టు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. మాజీ ఎమ్మెల్యేని కోర్టులో హాజరుపరుస్తున్న సందర్భంలో ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీ కార్యకర్తలను అక్కడకు అనుమతించడమే కాకుండా వారు రెచ్చగొట్టేలా దుర్భాషలాడుతున్నా, బాణాసంచా కాల్చుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. పిన్నెల్లిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉందని తెలిసి కూడా ఆయన్ని కోర్టుకు తీసుకువచ్చే సమయానికి వారిని చెదరగొట్టలేదు. పిన్నెల్లిని కోర్టు లోపలికి తీసుకువెళ్లే సమయంలో ఆయన ముందు పోలీసులు ఎవరూ లేరు. అందువల్లే టీడీపీ కార్యకర్త శివ కోర్టు ప్రాంగణంలోనే నేరుగా పిన్నెల్లికి ఎదురు రాగలిగాడు. వెంటనే అతన్ని నిలువరించకపోగా, అతను కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, దాడికి యత్నించినా పట్టించుకోకపోవడం పోలీసుల ఉద్దేశపూర్వక చర్యేనని వైఎస్సార్సీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పైగా, ఉద్దేశపూర్వకంగా కోర్ట వద్దే పిన్నెల్లికి అడ్డు నిలబడి, దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్త శివే తనపై పిన్నెల్లి దాడి చేశారంటూ మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లిపై దాడికి యత్నం!
పల్నాడు, సాక్షి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నేత దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. బుధవారం రాత్రి మాచర్లలో పిన్నెల్లిని హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుకు కదలనివ్వకుండా టీడీపీ నేత కొమేర శివ అడ్డుగా నిలబడ్డారు. .. పిన్నెల్లిని అసభ్య పదజాలంతో దూషిస్తూ.. దాడికి యత్నించారు. దాడిని పసిగట్టిన పిన్నెల్లి ఆయన్ని పక్కకు నెట్టేసి.. మెజిస్ట్రేట్ ముందుకు వేగంగా వెళ్లారు. పోలీసుల సమక్షంలోనే శివ ఈ చేష్టలకు దిగడం గమనార్హం. ఇదిలా ఉంటే.. శివపైన అనేక కేసులు పెండింగ్లో ఉండడంతో పాటు పోలీసులు సస్పెక్ట్ షీట్ సైతం తెరిచారు. ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేయడంతో.. పిన్నెల్లిని బుధవారం మధ్యాహ్నాం అదుపులోకి తీసుకున్నారు నరసరావుపేట పోలీసులు. ఆపై వైద్య పరీక్షల అనంతరం రాత్రి 10గం. టైంలో మాచర్ల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నాలుగు కేసులపై విచారణ చేసిన జడ్జి రెండు కేసులో రిమాండ్ విధించాడు. మరో రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చారు ఇక.. పిన్నెల్లిని కోర్టు దగ్గరికి తీసుకొచ్చిన టైంలో ఆయన ప్రత్యర్థి వర్గం బాణాసంచాలు పేల్చి పిన్నెల్లి వర్గీయుల్ని రెచ్చగొట్టే యత్నం చేసింది.ఇక.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ సందర్భంగా జైలు బయట, మార్గంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయనను సెంట్రల్ జైలు అధికారులు లోపలికి తీసుకెళ్లారు. -
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
సాక్షి, గుంటూరు: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అంతకు ముందు, పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.మే 13, 2024న ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగగా.. పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లకు సంబంధించి పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కొందరు తెలుగుదేశం నేతలు ఉన్నారని, ఉద్దేశపూర్వకంగా తనను ఇరికిస్తున్నారంటూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించాడు. మాచర్ల నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్లను తెలుగుదేశం నేతలు కబ్జా చేసి, రిగ్గింగ్ చేశారని, ఆ విషయం తెలిసి పోలింగ్ బూత్కు తాను వెళ్లానని పిన్నెల్లి హైకోర్టుకు తెలిపాడు. జూన్ 4, 2024న ఎన్నికల ఫలితాలు రాగా.. తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాల అనంతరం పలు చోట్ల వైఎస్సార్సిపి క్యాడర్పై విచ్చలవిడిగా దాడులు జరిగాయి. పలువురు కార్యకర్తలు రాష్ట్రం విడిచి పారిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి మిన్నకుండిపోయిన పోలీసులు.. టిడిపి నేతల ప్రోత్సాహంతో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని వైఎస్సార్సిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇవ్వాళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం రాగానే పోలీసులు రంగంలోకి దిగి పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. -
పిన్నెల్లి వ్యాజ్యాలపై తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి : పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ వ్యాజ్యాల్లో తీర్పు వెలువరించే వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పిన్నెల్లి పాల్గొనకుండా పెట్టిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటింగ్లో పాల్గొనేందుకు పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తరువాత ఈ ఉత్తర్వులను పొడిగిస్తూ వచ్చింది. గురువారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి.పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారు.. తీవ్రంగా పరిగణించండిఈ సందర్భంగా పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘం, పోలీసుల తీరును ఎండగట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి తీరాలన్న లక్ష్యంతో ఎన్నికల కమిషన్ అసాధారణ రీతిలో ఉత్తర్వులిచ్చిందని, గతంలో ఎన్నడూ కమిషన్ ఇలా వ్యవహరించలేదని అన్నారు. పోలీసులు పరిధి దాటి వ్యవహరించారన్నారు. తప్పుడు వివరాలతో కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈవీఎం కేసులో పిన్నెల్లికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వనున్నట్లు సంకేతాలు రావడంతో ఆ వెంటనే హత్యాయత్నం కేసులు బనాయించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారన్నారు. గత నెల 22న హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వగా, 23న ఇతర కేసుల్లో పిన్నెల్లిని నిందితునిగా చేర్చారని తెలిపారు. హైకోర్టుకు మాత్రం 22నే చేసినట్లు చెప్పారని, తరువాత ఇది అబద్ధమని తేలడంతో 23నే నిందితునిగా చేర్చినట్లు పోలీసులు అంగీకరించక తప్పలేదన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. పోలీసుల తీరును తీవ్రంగా పరిగణించాలన్నారు. హత్యాయత్నం చేశారని చెప్పినంత మాత్రాన ఆ సెక్షన్ కింద కేసు నమోదుకు వీల్లేదని, అందుకు నిర్దిష్ట విధానం ఉందని వివరించారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిన్నెల్లిపై పెట్టిన మరో కేసు చెల్లదని చెప్పారు.నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోండిపోలీసుల తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు నమోదు చేశామని తెలిపారు. 2019లో కూడా ఇదే తరహా కేసు నమోదైందన్నారు. మధ్యంతర ముందుస్తు బెయిల్ షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారని, సాక్షులను బెదిరించారని తెలిపారు. పిన్నెల్లి, అతని అనుచరుల దాడిలో కారెంపూడి సీఐ నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డారన్నారు. పిటిషనర్ నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకునేందుకు వచ్చిన శేషగిరిరావు, ప్రశ్నించిన మరో మహిళపై పిన్నెల్లి, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారన్నారు.అశ్వనీ కుమార్ నియామకం చట్ట విరుద్ధంఅనంతరం పిన్నెల్లి న్యాయవాది నిరంజన్రెడ్డి పోలీసుల తరఫున అశ్వనీ కుమార్ హాజరు కావడంపై అభ్యంతరం తెలిపారు. ఆయన నియామకం సీఆర్పీసీ నిబంధనలకు అనుగుణంగా జరగలేదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం గురించే నిబంధనల్లో ఉంది తప్ప, స్పెషల్ కౌన్సిల్ గురించి లేదన్నారు. తప్పును సరిచేసుకుని చట్ట ప్రకారం ఆయన్ను నియమించుకుంటే అభ్యంతరం లేదన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగింపు
సాక్షి, అమరావతి : మూడు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పిన్నెల్లి వ్యాజ్యాలను విచారించేందుకు తగినంత సమయం లేకపోవడం, అప్పటికే రాత్రి 10.30 గంటలు కావడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు.మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లుఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, ఆ వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా నమోదు చేసిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతూ మూడు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు.టీడీపీ నేతలు అస్మిత్రెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులు కూడా ఇదే రకమైన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉందని అభ్యర్థించడంతో ఈ నెల 6వ తేదీ వరకు వారందరికీ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.వాదనలు ముగిసేలోపు అర్ధరాత్రి అవుతుందిపిన్నెల్లి పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం మరోసారి విచారణ జరిపారు. హైకోర్టుకు వేసవి సెలవుల కారణంగా అత్యవసర కేసులను విచారిస్తుండటంతో ఈ వ్యాజ్యాలు రాత్రి 9.30 గంటల సమయంలో విచారణకు వచ్చాయి. పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి, న్యాయవాది ఎస్.రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని సుప్రీం కోర్టు ఆదేశించిందని తెలిపారు.అంతేకాక ఈ నెల 6న విచారణకు రానున్న వ్యాజ్యాలను పరిష్కరించాలని హైకోర్టుకు తెలిపిందన్నారు. తమ వ్యాజ్యాల్లో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, వాస్తవాలన్నింటినీ కోర్టు ముందు ఉంచి వాదనలు పూర్తి చేసేందుకు సమయం పడుతుందన్నారు. ఆ తరువాత తమ వాదనలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిర్యాదుదారు తరఫు న్యాయవాదులు స్పందించాల్సి ఉంటుందని, ఇవన్నీ పూర్తయ్యే లోపు అర్థరాత్రి దాటుతుందని నిరంజన్రెడ్డి వివరించారు. పైపెచ్చు సుప్రీంకోర్టు 6వ తేదీనే ఈ వ్యాజ్యాలను పరిష్కరించి తీరాలని చెప్పలేదని, ఎలాంటి గడువు నిర్దేశించకుండా ఆ రోజున విచారణకు వచ్చే వ్యాజ్యాలను పరిష్కరించాలని మాత్రమే చెప్పిందన్నారు.అనంతరం ఆయన కేసుకు సంబంధించిన వాదనలను వినిపించారు. పోలీసులు తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టించారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు సైతం స్పష్టంగా పేర్కొందని వివరించారు. పిన్నెల్లి విషయంలో పోలీసుల తీరు దురుద్దేశపూర్వకంగా ఉందన్నారు. ఉదయం 10.30 నుంచి విరామం లేకుండా వరుసగా అనేక కేసులు విచారణ జరిపి న్యాయమూర్తి తీవ్రంగా అలసిపోయినట్లు ఉండటాన్ని గమనించిన నిరంజన్రెడ్డి.. విచారణను శనివారానికి వాయిదా వేయాలని, ఆ రోజు పూర్తిస్థాయిలో వాదనలు వినిపిస్తామని చెప్పారు. శనివారం తాను కేసు వినేందుకు నిబంధనలు అనుమతించవని, ప్రధాన న్యాయమూర్తి అనుమతించాల్సి ఉంటుందని జస్టిస్ విజయ్ స్పష్టం చేశారు.అలా అయితే విచారణను వచ్చే వారానికి (13వ తేదీకి) వాయిదా వేయాలని, ఆ రోజున పూర్తిస్థాయి వాదనలు విని నిర్ణయాన్ని వెలువరించవచ్చని నిరంజన్ రెడ్డి చెప్పారు. తాము కూడా ఉదయం నుంచి పలు కేసుల్లో వాదనలు వినిపిస్తూ వస్తున్నామని చెప్పారు. ఇప్పుడే వాదనలు వినిపించాలని కోర్టు ఆదేశిస్తే అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఫిర్యాదుదారు తరఫు న్యాయవాదుల అభిప్రాయం కోరారు.వాదనలు విని తీర్పు చెప్పేలోపు తెల్లారుతుందిఫిర్యాదుదారు శేషగిరిరావు తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. మూడు క్రైం నంబర్లు ఒకే అంశానికి సంబంధించినవైనందున, అన్నింటినీ కలిపే విచారించాలని కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. అన్ని వ్యాజ్యాలపై వచ్చే వారం విచారణ జరుపుతానని తెలిపారు. ఇప్పటికే 10.20 అయిందని, ఇప్పుడు వాదనలు విని, తీర్పు చెప్పేలోపు తెల్లారి అవుతుందని, తాను అందుకు సిద్ధమేనని, అయితే కోర్టు సిబ్బంది ఇళ్లకు వెళ్లాల్సి ఉందని గుర్తు చేశారు. విచారణను వాయిదా వేయడంపై పోసాని వెంకటేశ్వర్లు అభిప్రాయం కోరగా, ఆయన కూడా అందుకు అంగీకరించారు. దీంతో న్యాయమూర్తి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. అప్పటి వరకు పిన్నెల్లి అరెస్ట్ విషయంలో ఉన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. వాయిదాకు ఫిర్యాదుదారు తరఫు న్యాయవాదులు అంగీకరించిన విషయాన్ని కూడా తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు.అలాంటి మాటలు ఇంకెవరి ముందైనా చెప్పండిపోలీసు అధికారి నారాయణ స్వామి (పిన్నెల్లి ఫిర్యాదు మేరకు ఇతన్ని ఎన్నికల సంఘం విధులకు దూరంగా ఉంచింది) తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ స్పందిస్తూ.. 6వ తేదీనే ఈ వ్యాజ్యాలను పరిష్కరించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లు చేయకుంటే బాగుండదన్నారు. దీనిపై మళ్లీ ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చన్నారు. ఈ వాదనపై న్యాయమూర్తి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘సుప్రీం కోర్టుకు వెళితే వెళ్లనివ్వండి. ఎవరో వెళతారని మీరెలా చెబుతారు? ఇలాంటివన్నీ ఇంకెవరి ముందైనా చెప్పండి. ఈ కోర్టుకు కాదు.కోర్టు పని వేళలు సాయంత్రం 4.15 గంటల వరకే. ఈ సమయం దాటి కేసులు విచారించకూడదు. మరి దీని గురించి ఏమంటారు’ అంటూ న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. దీంతో వెనక్కి తగ్గిన అశ్వనీ కుమార్ కోర్టును క్షమాపణలు కోరారు. అల్లర్లలో నారాయణస్వామి తలకు తీవ్ర గాయమైందన్నారు. దీనికి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ.. నారాయణస్వామి తలకు తగిలిన గాయం స్వల్పమైనదేనని, ఈ విషయాన్ని ఆయన సమర్పించిన మెడికల్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుందని చెప్పారు. స్వల్ప గాయమని డాక్టర్లు చెబుతుంటే, తీవ్రమైనదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. -
ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అధికార విధుల నుంచి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్ త్రిపాఠీ, ఎస్పీ మలికా గార్గ్, కారెంపూడి ఇన్స్పెక్టర్ నారాయణ స్వామిని దూరంగా ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమర్పించిన వినతిపత్రంపై రేపటికల్లా (శుక్రవారంలోగా) నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున, పిన్నెల్లి వినతిపై వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టంచేసింది.త్రిపాఠీ, గార్గ్, నారాయణ స్వామిలపై చర్యలు తీసుకోవాలని, వారు పని చేస్తున్న స్థానాల నుంచి మార్చాలంటూ తానిచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి పిన్నెల్లి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి గురువారం కోర్టు విచారణ మొదలు కాగానే న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం ముందు ప్రస్తావించారు.లంచ్మోషన్ రూపంలో అత్యవసర విచారణకు అభ్యర్థించారు. లంచ్మోషన్ అవసరం లేదని ధర్మాసనం మొదట చెప్పింది. అయితే నిరంజన్రెడ్డి అత్యవసరాన్ని వివరించారు. ఈ ముగ్గురు అధికారులు పిన్నెల్లికి వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన్ని కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈవీఎంల కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరువాత తిరిగి హత్యాయత్నం కేసులు పెట్టిన విషయాన్ని వివరించారు.ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న ఈ అధికారులను పిటిషనర్పై నమోదు చేసిన కేసుల దర్యాప్తు నుంచి దూరంగా ఉంచాలన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వారిని విధుల నుంచి దూరంగా ఉంచితే సరిపోతుందని వివరించారు. దీంతో ధర్మాసనం లంచ్మోషన్ ద్వారా అత్యవసర విచారణకు అనుమతినిచ్చింది.ఏబీ వెంకటేశ్వరరావు చెప్పినట్లే ఐజీ చేస్తున్నారుగురువారం సాయంత్రం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిన్నెల్లి తరఫు న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐజీ త్రిపాఠీ, ఇన్స్పెక్టర్ నారాయణస్వామిలపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సర్వశ్రేష్ట త్రిపాఠీ అత్యంత సన్నిహిత మిత్రుడుని, ఆయన చెప్పినట్లే చేస్తున్నారని తెలిపారు. అలాగే నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పారు.వీరిద్దరూ పిన్నెల్లి పట్ల దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఈ నెల 4 వరకు పిటిషనర్పై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా, ఆ కేసుల దర్యాప్తులో వీరు భాగం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల సంఘం, పోలీసుల తీరును చూస్తుంటే రాష్ట్రంలో న్యాయ పాలన ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. కోర్టు మాత్రమే తమకు రక్షణగా ఉందని, అందుకే మరోసారి కోర్టును ఆశ్రయించామని నిరంజన్రెడ్డి వివరించారు.ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిన్నెల్లి వినతిపత్రంపై మీరేం చేస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనికి ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ.. తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచిస్తానన్నారు. వినతిపత్రం తమకు ఇవ్వలేదని, డీజీపీకి ఇచ్చారని చెప్పారు. దీంతో ధర్మాసనం హోంశాఖ న్యాయవాదిని వివరణ కోరింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున డీజీపీ కూడా ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేస్తుంటారని తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘమేనన్నారు.పిన్నెల్లి తన పిటిషన్లో కొందరు పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అందువల్ల ఆయన వినతిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. రేపటికల్లా తగిన నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రధాన అధికారిని, డీజీపీని ఆదేశించింది. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని వినతి పత్రంగా పరిగణించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. -
పిన్నెల్లి పిటిషన్పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
అమరావతి:ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై సీఈసీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి వినతిపై రేపటికల్లా నిర్ణయాన్ని వెలువరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.కాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో రెండు రోజుల క్రితం హైకోర్టు ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్తో సహా పిన్నెల్లిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ నెల 6వ తేదీ వరకు ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపిందిదాంతో రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ, పోలీసులు పన్నిన కుట్రలు పటాపంచలు అయ్యాయి. రికార్డులను తారుమారు చేసి, బాధితులను ముందు పెట్టి పిన్నెల్లి ముందస్తు బెయిల్ను అడ్డుకునేందుకు పన్నిన కుట్రలు విఫలమయ్యాయి. -
పిన్నెల్లి పిటిషన్ పై విచారణ.. సీఈసీకి హైకోర్టు ఆదేశం
-
పచ్చ కుట్రలు పటాపంచలు
-
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
సాక్షి, అమరావతి: పచ్చ బ్యాచ్, పోలీసులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకునేందుకు వారు పన్నిన కుట్రలను పటాపంచలు చేసింది. రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ, పోలీసులు కుమ్మక్కయినా కూడా ప్రయోజనం లేకపోయింది. రికార్డులను తారుమారు చేసి, బాధితులను ముందు పెట్టి పిన్నెల్లి ముందస్తు బెయిల్ను అడ్డుకునేందుకు పన్నిన కుట్రలు విఫలమయ్యాయి. రామకృష్ణారెడ్డిపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో హైకోర్టు ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్ట్తో సహా పిన్నెల్లిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ నెల 6వ తేదీ వరకు ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. జేసీ అస్మిత్రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, చింతమనేని ప్రభాకర్, పరిమి సోమశేఖర్ నాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరహాలోనే పిన్నెల్లికి కూడా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్కు పలు షరతులు విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల చర్య చాలా తీవ్రమైనదిఈ మూడు కేసుల్లో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. మిగిలిన నిందితులను 16వ తేదీనే అరెస్ట్ చేసినప్పటికీ, వారిని 23వ తేదీన నిందితులుగా చేర్చినట్లు రిమాండ్ రిపోర్ట్లో చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది చాలా తీవ్రమైన విషయమని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఇలా చేయడం డీకే బసు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పిన్నెల్లిని 22వ తేదీనే నిందితునిగా చేర్చారని పోలీసులు చెప్పిన విషయాన్ని, కింది కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో 23వ తేదీ రాత్రి 8 గంటలకు నిందితునిగా చేర్చినట్లు పేర్కొనడాన్ని హైకోర్టు తన ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించింది. దీనిపై తుది విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరింత వివరణనివ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు...ఈవీఎం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉన్నందున మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేర్వేరుగా మూడు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి, న్యాయవాది ఎస్.రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్ జ్యోతిర్మయి ఆ మూడు అనుబంధ వ్యాజ్యాలను అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇవీ షరతులు..పిన్నెల్లిపై నిఘా ఉంచేలా పోలీసులను ఆదేశించాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి నేరపూరిత చర్యల్లో పాల్గొనకూడదని, పునరావృతం చేయరాదని పిన్నెల్లిని ఆదేశించింది. జిల్లాలో శాంతిభద్రతల సమస్య సృష్టించకూడదని చెప్పింది. ప్రజాశాంతికి, సాక్షుల రక్షణకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని, అనుచరులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా చూడాలని పిన్నెల్లిని ఆదేశించింది. అనుచరుల బాధ్యత రామకృష్ణారెడ్డిదేనని స్పష్టం చేసింది. ఈ కేసు గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. సాక్షులు, బాధితులతో సంభాషించవద్దని, వారిని బెదిరించడం వంటివి చేయరాదని తెలిపింది. పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో మాత్రమే ఉండాలని, ఒకవేళ కౌంటింగ్ కేంద్రం మరో చోట ఉంటే లెక్కింపు రోజున ఆ కేంద్రానికి వెళ్లొచ్చునని తెలిపింది. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు పల్నాడు ఎస్పీ ముందు హాజరు కావాలని పిన్నెల్లిని ఆదేశించింది. నర్సరావుపేటలో తాను ఎక్కడ ఉంటున్నదీ, తన మొబైల్ నంబరు వివరాలను పోలీసులకు తెలియచేయాలని ఆదేశించింది. స్థానిక కోర్టుల్లో పాస్పోర్ట్ జమ చేయాలని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. బాధితులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే, ఓ షరతును కొద్దిగా సవరించాలని పిన్నెల్లి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి అభ్యర్థించారు. కౌంటింగ్ రోజున ఎస్పీ ముందు హాజరయ్యేంత సమయం ఉండదని, అందువల్ల ఆ రోజున రిటర్నింగ్ అధికారి ముందు హాజరవుతారని తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి సమ్మతించి ఆ మేరకు ఆ షరతును సవరించారు. ప్రజా ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ చర్యల విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తన ఉత్తర్వుల్లో న్యాయమూర్తి స్పష్టం చేశారు. ‘న్యాయ చక్రాలు నెమ్మదిగా కదిలినప్పటికీ, అవి గొప్పగా కదులుతాయి,’ అంటూ ఓ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన కొటేషన్తో న్యాయమూర్తి తన ఉత్తర్వులను ముగించారు. -
హైకోర్టులో పిన్నేల్లికి భారీ ఊరట..
-
ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
సాక్షి, గుంటూరు: ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. జూన్ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది.కాగా, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈవీఎంకు సంబంధించి ఒక కేసు నమోదయింది. దీనిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు ఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరట ఇచ్చింది. అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ఉన్నందున కేసులోకి వెళ్లట్లేదని, పిన్నెల్లిని జూన్ 5 వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు తేల్చిచెప్పింది.హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో కొందరు పోలీసు అధికారులు ప్లాన్ మార్చారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పల్నాడు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పిన్నెల్లిపై వరుస కేసులు పెట్టారు. కౌంటింగ్ తేదీ కంటే ముందే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని, అసలు ఆ సమయంలో పిన్నెల్లి లేకుండా చూడాలని.. ఇదే సమయంలో పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియాకు లీకులిచ్చారు.ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతుండడంతో.. పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనల సందర్భంగా పోలీసులకు సంబంధించి ఓ కీలకమైన కుట్ర బయటపడింది. ఈ కేసులను ఎప్పుడు పెట్టారంటూ హైకోర్టు ప్రశ్నించగా.. మే 22న నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పిన్నెల్లి తరపున లాయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో ఈ విషయంలో మొత్తం రికార్డులు తెప్పించమని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ముందు రికార్డులు సమర్పించగా.. వాటిని హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడిస్తూ.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది.ఇదీ చదవండి: AP High Court : పిన్నెల్లి కేసులో రికార్డులు మార్చిందెవరు? -
పచ్చ ఖాకీల కుట్ర బట్టబయలు
-
బాబు సేవలో బదిలీ బలగాలు!
సాక్షి, అమరావతి: రాజకీయ ఒత్తిళ్లతో తాను నియమించుకున్న కొందరు పోలీసుల ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలు న్యాయస్థానం సాక్షిగా బట్టబయలయ్యాయి! ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలు పంచుకుంటూ పోటీ చేసిన ఓ అభ్యర్ధిని కౌంటింగ్ రోజు బయటకు రానివ్వకుండా చేసేందుకు బరి తెగించి ఆడుతున్న నాటకానికి తెర పడింది. ఈసీపై రాజకీయ ఒత్తిడి తెచ్చి నియమించుకున్న కొద్ది మంది పోలీసులు బాబుకు ఏజెంట్ల మాదిరిగా పని చేస్తున్నట్లు తేటతెల్లమైంది. న్యాయస్థానానికి సైతం వారు తప్పుడు సమాచారం ఇవ్వడంపై తీవ్ర విస్మ యం వ్యక్తమవుతోంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించడంలో డీజీపీ, టీడీపీకి కొమ్ము కాస్తున్న కొందరు పోలీసుల కుట్ర హైకోర్టు సాక్షిగా రుజువైంది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసమైన రోజు ఉదయం నుంచి ఏం జరిగిందో వాస్తవాలను వెల్లడించకుండా ఎడిటెడ్ వీడియో ఆధారంగా పిన్నెల్లి అరెస్టుకు ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పిన్నెల్లి ఈనెల 23న సానుకూల ఉత్తర్వులు పొందడం విదితమే. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు కానున్నట్లు అదే రోజు సాయంత్రం కల్లా సంకేతాలు అందడంతో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే కొందరు పోలీసు అధికారులు అడ్డగోలు వ్యవహారాలకు తెర తీశారు. అదే రోజు రాత్రి పిన్నెల్లిపై పాత ఘటనలకు సంబంధించి మూడు వేర్వేరు కేసులు హడావుడిగా నమోదు చేశారు. ఆ ఘటనలు ఎప్పుడో జరిగితే పది రోజుల తరువాత తాపీగా పిన్నెల్లిపై హత్యాయత్నం సహా మూడు కేసులు బనాయించారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఉత్తర్వులను అమలు చేయకుండా ఎన్నికల సంఘం, పోలీసులు ఈ తప్పుడు కేసులు పెట్టారని, వాస్తవానికి పిన్నెల్లిని 23వ తేదీ రాత్రి నిందితుడిగా చేర్చారని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే పోలీసులు తాము 22వ తేదీనే పిన్నెల్లిని నిందితునిగా చేర్చామని పేర్కొనడంతో న్యాయస్థానం ఈ విషయంలో వారిని స్పష్టత కోరింది. లిఖితపూర్వకంగా ఆ వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. సంబంధిత డాక్యుమెంట్లను పిన్నెల్లి తరఫు న్యాయవాదులు స్థానిక కోర్టు నుంచి అధికారికంగా పొందారు. వాటిని సోమవారం కోర్టుకు సమరి్పంచారు. దీంతో పచ్చ ముఠాలకు వత్తాసు పలుకుతున్న పోలీసులు నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. పిన్నెల్లిని నిందితుడిగా చేర్చి 23వతేదీ రాత్రి స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన విషయాన్ని కోర్టుకు వెల్లడించాల్సి వచ్చింది. దీంతో 23న మధ్యంతర ముందస్తు బెయిల్ పొందిన తరువాత పిన్నెల్లిపై ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు రుజువైంది. పిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్లు నిర్ధారణ కావడంతో కుట్ర కోణం బహిర్గతమైంది. డీజీపీ, పల్నాడులో కొందరు పోలీసులు దిగజారిపోతున్న తీరుకు ఇది అద్దం పడుతోంది. తీర్పు నేటికి వాయిదా తనపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం తన నిర్ణయం వెలువరిస్తామని ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎంల కేసులో హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిలు మంజూరు చేయగానే పిన్నెల్లిపై పోలీసులు అప్పటికప్పుడు మరో మూడు అక్రమ కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు హత్యాయత్నం కేసులున్నాయి. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్ ప్రక్రియలో పాలు పంచుకునేందుకు వీలుగా ఈ కేసుల్లో తనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో అనుబంధ పిటిషన్లు వేశారు. అనుబంధ వ్యాజ్యాలు.. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాల్లో బాధితులు నంబూరి శేషగిరి రావు, నాగ శిరోమణి ఇంప్లీడ్ అవుతున్నారని, ఆ మేరకు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశామని విచారణ సందర్భంగా టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. వారి తరఫున తాను వాదనలు వినిపిస్తానని తెలిపారు. అయితే మౌఖిక వాదనలకే పరిమితం కావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకున్నందుకు టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావును పిన్నెల్లి బెదిరించారని పోసాని పేర్కొన్నారు. నాగ శిరోమణి అనే మహిళను కూడా బెదిరించారన్నారు. కౌంటింగ్ రోజు పిన్నెల్లి అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్నారు. 23 రాత్రి 8 గంటలకు స్థానిక కోర్టులో మెమో పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అభ్యర్ధించారు. ఇప్పటికే పిన్నెల్లిపై 9 కేసులున్నాయన్నారు. పిన్నెల్లిపై నిఘా ఉంచాలని ఇదే కోర్టు ఈ నెల 23న ఉత్తర్వులిచ్చినా ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. క్రైం నెం 59లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎప్పుడు నిందితునిగా చేర్చారు? దీనికి సూటిగా సమాధానం చెప్పాలని పీపీని ఆదేశించారు. సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లిని నిందితుడిగా చేరుస్తూ 23వతేదీ రాత్రి 8 గంటల సమయంలో స్థానిక కోర్టులో మెమో దాఖలు చేశామని పీపీ వెల్లడించారు. దీంతో పిన్నెల్లిని 22వ తేదీనే నిందితుడిగా చేర్చామంటూ పోలీసులు చెప్పడం పచ్చి అబద్ధమని తేలిపోయింది. అస్మిత్, చింతమనేనికి ఇచ్చినట్లే.. పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుపట్టారు. పిన్నెల్లి విషయంలో ఎన్నికల సంఘం తీరు వల్ల ఆ సంస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోందన్నారు. పిన్నెల్లిపై పలు కేసులున్నాయని పోసాని, పీపీ పేర్కొనటాన్ని ప్రస్తావిస్తూ.. టీడీపీ నేతలైన చింతమనేని ప్రభాకర్, అస్మిత్రెడ్డిపై కూడా పెద్ద సంఖ్యలో కేసులున్నాయని గుర్తు చేశారు. అస్మిత్రెడ్డిపై 30, చింతమనేనిపై 31 కేసులు నమోదయ్యాయన్నారు. కేసుల ఆధారంగా ముందస్తు బెయిల్ ఇవ్వకూడదంటే వీరిద్దరికీ కూడా ముందస్తు బెయిల్ రాకూడదన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో పాలు పంచుకునేందుకు వీరిద్దరికీ ఇదే హైకోర్టు ఈ నెల 23న మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా పిన్నెల్లికి కూడా ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్ధించారు. పోలింగ్ కేంద్రం బయట ఒకే ఘటనకు సంబంధించి పోలీసులు పిన్నెల్లిపై రెండు కేసులు నమోదు చేశారని, ఒకే నేరానికి రెండు కేసులు చెల్లవని కోర్టుకు నివేదించారు. కౌంటింగ్ పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉంది.. కౌంటింగ్ ప్రక్రియలో పాలుపంచుకునే హక్కు ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ అభ్యర్ధికి ఉంటుందని టి.నిరంజన్రెడ్డి తెలిపారు. కౌంటింగ్ తేదీ సమీపిస్తున్నందువల్ల కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సిన బాధ్యత పిన్నెల్లిపై ఉందన్నారు. కౌంటింగ్ వద్ద అభ్యర్థి లేని పక్షంలో తీవ్రంగా నష్టపోతారన్నారు. చింతమనేని, అస్మిత్రెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ను వ్యతిరేకించని పోలీసులు పిన్నెల్లి విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు, ఈవీఎంల కేసులో మధ్యంతర బెయిల్ వస్తుందని 23వ తేదీ సాయంత్రం కల్లా గ్రహించడంతో అదే రోజు రాత్రి పిన్నెల్లిపై హత్యాయత్నంతో సహా మూడు కేసులు నమోదు చేశారన్నారు. అయితే పోలీసులు 22నే ఆయన్ను నిందితుడిగా చేర్చామంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని నివేదించారు. ఈమేరకు పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన డాక్యుమెంట్ల సరి్టఫైడ్ కాపీలను పిన్నెల్లి తరఫు మరో న్యాయవాది రామలక్ష్మణరెడ్డి కోర్టుకు సమరి్పంచారు. పోలీసులు దాఖలు చేసిన మెమోను పరిశీలించాలని నిరంజన్రెడ్డి కోరడంతో న్యాయమూర్తి దాన్ని పరిశీలించి పిన్నెల్లిని 23వ తేదీనే నిందితుడిగా చేర్చిన విషయాన్ని ధృవీకరించుకున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నిరంజన్రెడ్డి అభ్యర్ధించారు. విచారణకు అశ్వనీ కుమార్ గైర్హాజర్.. క్రైం నెంబర్ 59 కేసులో సీఐ నారాయణ స్వామి తరఫున అసాధారణ రీతిలో హాజరై ఆదివారం వాదనలు వినిపించిన న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ సోమవారం విచారణకు గైర్హాజరయ్యారు. ఆయన జూనియర్ కోర్టు ముందు హాజరై పిన్నెల్లి వ్యాజ్యాల్లో ఇంప్లీడ్ అవుతూ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. హైకోర్టు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఓ పోలీసు తరఫున ప్రైవేటు న్యాయవాది హాజరు కావడం విస్మయం కలిగించింది. అశ్వనీ కుమార్ ఆ పోలీసు తరఫున హాజరు కావడం వెనుక మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ ఉన్న విషయం బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారాన్ని మరింత సాగదీస్తే ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి రావడంతో అశ్వనీ కుమార్ సోమవారం విచారణకు గైర్హాజరైనట్లు న్యాయవర్గాలు చెబుతున్నాయి. బాబు కుట్రలలో భాగస్వాములు.. చంద్రబాబు కుట్రలో భాగం కావడం వల్లే ఎన్నికల సంఘం, డీజీపీ, కొందరు పోలీసు అధికారులు ఆయన చెప్పినట్లు ఆడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కీలకమైన ఓట్ల లెక్కింపు రోజు పోటీలో ఉన్న అభ్యర్ధి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీకి వంతపాడే పోలీసులు అడ్డదారులు తొక్కడం మొత్తం ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినట్లుగా భావించాలని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు. చంద్రబాబు, బీజీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పినట్లుగా ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉన్న పోలీసు అధికారులను ఆకస్మికంగా బదిలీ చేసి పురందేశ్వరి సూచించిన జాబితాలోని వారిని నియమించడంతోనే అడ్డదారులు తొక్కే వ్యవహారం ప్రారంభమైందని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు స్వేచ్ఛగా ఓటును వినియోగించుకొనే అవకాశం లేకుండా చేయడంతోపాటు హింస చెలరేగేందుకు దోహదం చేసిందని పేర్కొంటున్నారు. హైకోర్టు సాక్షిగా తాజాగా బయటడిన కుట్ర దీనికి స్పష్టమైన రుజువుగా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. -
మాచర్లలో వీధి నాటకాలు!
సాక్షి, నరసరావుపేట/మాచర్ల: వీధి గొడవలకు రాజకీయ రంగు పులిమి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు రోజుకో డ్రామాకు తెర తీస్తున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పోలీసుల ద్వారా తాపీగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.కారంపూడిలో ఘర్షణలు జరిగిన వారం తరువాత పిన్నెల్లి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడం తెలిసిందే. పాల్వాయి గేట్లో వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాడి చేసిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేయగా తనను చంపుతానని పిన్నెల్లి బెదిరించారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేశారంటూ ఇంకో కేసు పెట్టారు. ఇవి చాలవన్నట్లు కండ్లకుంటకు చెందిన టీడీపీ ఏజెంట్తో పిన్నెల్లి సోదరులపై మంగళగిరి పోలీసుస్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. మద్యం మత్తులో దాడి.. మాచర్ల 22వ వార్డులో శనివారం రాత్రి మల్లె లీలావతి అనే మహిళపై అదే వీధికి చెందిన ఉప్పుతోళ్ల వెంకటేశ్ మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరి మధ్య కొన్నాళ్లుగా కుటుంబ కలహాలున్నాయి. ఎల్లో మీడియా దీనికి రాజకీయ రంగు పులిమింది. బాధిత మహిళ టీడీపీకి ఓటు వేయడమే ఈ ఘర్షణకు కారణమంటూ కథనాలు అల్లేసింది. పిన్నెల్లి సోదరుల ప్రోద్బలంతో దాడులు జరిగినట్లు తప్పుడు కథనాలు వెలువరించింది. పార్టీలకు సంబంధం లేదు.. నాపై జరిగిన దాడితో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఓ పార్టీకి ఓటు వేయడంతో దాడి చేశారంటూ వచ్చిన కథనాల్లో నిజం లేదు. నన్ను ఏ మీడియా వాళ్లు వివరణ అడగలేదు. ఇష్టానుసారంగా వార్తలు రాయడం బాగాలేదు. మమ్మల్ని పార్టీల గొడవల్లోకి లాగొద్దు. మద్యం సేవించి నాపై దాడి చేస్తే పార్టీలకు అంటగట్టడం సరికాదు. నాపై దాడికి పాల్పడిన వెంకటేష్ పై పోలీసులు చర్య తీసుకోవాలి. లీలావతి, బాధిత మహిళ, మాచర్ల -
AP High Court : పిన్నెల్లి కేసులో రికార్డులు మార్చిందెవరు?
అమరావతి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో కొందరు పోలీసులు తీరు ప్రశ్నార్థకంగా మారింది. ఇవ్వాళ హైకోర్టు ముందు జరిగిన విచారణలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పల్నాడు పోలీసుల తీరు పలు ప్రశ్నలకు దారి తీసేలా మారింది.ఏం జరిగింది? ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎంకు సంబంధించి ఒక కేసు నమోదయింది. దీనిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు ఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరట ఇచ్చింది. అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ఉన్నందున కేసులోకి వెళ్లట్లేదని, పిన్నెల్లిని జూన్ 5 వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు తేల్చిచెప్పింది. పోలీసులు ఏం చేశారు?హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో కొందరు పోలీసు అధికారులు ప్లాన్ మార్చారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పల్నాడు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పిన్నెల్లిపై వరుస కేసులు పెట్టారు. కౌంటింగ్ తేదీ కంటే ముందే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని, అసలు ఆ సమయంలో పిన్నెల్లి లేకుండా చూడాలని నిర్ణయించారు. ఈవీఎం కేసు ఉండగానే పిన్నెల్లిపై మరో మూడు కేసులు పెట్టారు. ఇదే సమయంలో పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియాకు లీకులిచ్చారు. హైకోర్టులో ఏం తేలింది? ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతుండడంతో .. పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనల సందర్భంగా పోలీసులకు సంబంధించి ఓ కీలకమైన కుట్ర బయటపడింది. ఈ కేసులను ఎప్పుడు పెట్టారంటూ హైకోర్టు ప్రశ్నించగా.. మే 22న నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పిన్నెల్లి తరపున లాయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో ఈ విషయంలో మొత్తం రికార్డులు తెప్పించమని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ముందు రికార్డులు సమర్పించగా.. వాటిని హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. ఆ రికార్డుల్లో ఏం తేలిందంటే.. పిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న పోలీసులు నమోదు చేశారుఅది కూడా ఈవీఎంల కేసులో హైకోర్టు ఆదేశాల తర్వాత కేసులు నమోదు చేశారుఆ తర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్కు తెలియపరిచారుఅయినా హైకోర్టుకు కేసు నమోదు విషయంలో పోలీసులు తప్పుడు సమాచారం అందించారుహైకోర్టు విచారణ సందర్భంగా ఇంకేం తేలింది?ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో లేకుండా లాయర్ అశ్వనీకుమార్ను రంగంలోకి దించారుపోలీసుల తరపున ఒక లాయర్ వాదించాలంటే కొన్ని నిబంధనలు పాటించాలినిబంధనలన్నింటిని తుంగలో తొక్కి అశ్వనీకుమార్ను వాదనల కోసం తెచ్చారుఅశ్వనీ కుమార్ ద్వారా ముందే కేసు నమోదు చేశామంటూ తప్పుడు సమాచారాన్ని హైకోర్టుకు ఇచ్చారుతమ వాదనలు వినిపిస్తున్న పోలీసు పిపికి కూడా సమాచారం ఇవ్వని డిజిపి, పోలీసులుఇవ్వాళ కోర్టుకు రాని అశ్వనీకుమార్ఇదే కేసులో టిడిపి లీగల్ సెల్ లాయర్ పోసానితో ఇంప్లీడ్ పిటిషన్ వేయించారుఇవ్వాళ కోర్టు ముందు వాదనలు వినిపించిన టిడిపి లీగల్ సెల్ లాయర్ పోసాని వెంకటేశ్వర్లురికార్డులను పరిశీలించిన తర్వాత హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థం కావడం లేదంటూ పిన్నెల్లి తరఫు న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో హైకోర్టు పిన్నెల్లికి ముందస్తు బెయిల్పై కోర్టు తీర్పు వాయిదా వేసింది. పిన్నెల్లి విషయంలో వ్యక్తిగత కక్ష కనిపిస్తోందని తాజా ఘటనల ద్వారా అర్థమవుతోంది. ఈ కేసులో డీజీపీ, పల్నాడు పోలీసుల తీరు రోజురోజుకూ దిగజారుతోంది. కౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి కొందరు పోలీసు అధికారులు కుట్ర పన్నుతున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని పిన్నెల్లి లాయర్ హైకోర్టుకు తెలిపారు. "పీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్ను కూడా పెట్టారని పిన్నెల్లి తరఫు న్యాయవాది తెలిపారు. హైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపారు. -
హైకోర్టులో పిన్నెల్లి అత్యవసర పిటిషన్
-
టార్గెట్ పిన్నెల్లి
గుంటూరు,సాక్షి: నాలుగు సార్లు ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ప్రాణాలకు రక్షణ కరువైంది. ఒక కేసు నుంచి ఊరట దొరికిందని అనుకునేలోపు.. మూడు తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసే యత్నాలు చేస్తున్నారు. అంతేకాదు సదరు ఎమ్మెల్యేను హతమార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది వైఎస్సార్సీపీ. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతున్నారు పోలీసులు. ఇప్పటికే ఈవీఎం ఘటన కేసులో హైకోర్టు ఆయనకు ఊరట లభించగా.. ఆయన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలని కంకణం కట్టుకున్న పోలీసులు మరో మూడు హత్యాయత్నం కేసులు పెట్టారు. అయితే ఈ పరిణామాలపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏదో ఒకలా ఆయన్ని హతమార్చేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మ ఘటనలను.. తదనంతర పరిణామాలను చూసిన ఎవరికైనా కొన్ని అనుమానాలు రావడం సహజం. అటు ఎన్నికల సంఘం, ఇటు పోలీస్ శాఖ ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి అనుబంధ సంఘాలుగా మారాయి ఏమో అనిపించకమానదు. దీనికి తోడు పిన్నెల్లిని లక్ష్యంగా చేసుకుని పచ్చ బ్యాచ్ పన్నుతున్న కుట్రలు చూస్తున్నదే. అయితే దీని వెనుక కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ అనుమానిస్తోంది. సీఐ నారాయణస్వామిచౌదరి ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపిస్తోంది. వైఎస్సార్సీపీ సూటి ప్రశ్నలుమాచర్లలో ఎన్నికల హింసకు సంబంధించి ఎస్సీ, డీఎస్పీ, ఎస్సై సస్పెండైనా ఐజీ త్రిపాఠీకి సన్నిహితుడైన సీఐ నారాయణస్వామిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. గతంలో కారంపూడి ఎస్సైగా ఉన్నప్పుడు అత్యంత వివాదాస్పంగా వ్యవహరించి సస్పెన్షన్కు గురైన నారాయణస్వామిని సీఐగా ఎలా నియమిస్తారు? ఆయన వ్యవహార శైలిపై గత నెల(ఏప్రిల్) 8నే ఎమ్మెల్యే పిన్నెల్లి ఫిర్యాదు చేసినా ఈసీ ఎందుకు పట్టించుకోలేదు? ఎన్నికల వ్యవస్థ, పోలీసు వ్యవస్థలు టీడీపీకి లొంగిపోయాయేమో అనిపిస్తోంది. పిన్నెల్లిపై కక్ష కట్టి తప్పుడు కేసులు బనాయిస్తున్నాయి :::వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏదైనా హాని జరిగితే సీఐ నారాయణస్వామి, ఐజీ త్రిపాఠిదే బాధ్యత అని ఇప్పటికే స్పష్టం చేసింది. పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చలా కొందరు అధికారులు తయారు అయ్యారని, వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, టీడీపీ కూటమికి కొమ్ము కాస్తున్న అధికారులు జూన్ 4 ఎన్నికల పలితాల మూల్యం చెల్లించుకోక తప్పదని సున్నితంగా హెచ్చరిస్తోంది కూడా. -
తాపీగా తప్పుడు కేసులు
సాక్షి, అమరావతి: రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈసీ నియమించిన పోలీసు అధికారులు స్వామి భక్తి చాటుకునేందుకు బరి తెగిస్తున్నారు. పోలింగ్ రోజు పల్నాడు, అనంతపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో చోటుచేసుకున్న ఘటనలే అందుకు నిదర్శనం. పల్నాడులో ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు టీడీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నట్లు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆర్వో (రిటర్నింగ్ అధికారి) నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వరకూ, ఎస్పీ నుంచి డీజీపీ దాకా పలుదఫాలు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న రెంటచింతల మండలంలో ఎన్నికల రోజు భారీగా పారా మిలటరీ బలగాలను మోహరించగా, టీడీపీ మద్దతుదారులున్న చోట్ల హోంగార్డులతో సరిపెట్టడం గమనార్హం. తాపీగా సీఐ ఫిర్యాదు..మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంపై ఈనెల 20న నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతా నుంచి ఎడిట్ చేసిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసమైనట్లు పీవో లాగ్ బుక్లో ఎక్కడా నమోదు చేయలేదు. పోలింగ్కు విఘాతం కలిగినట్లు పేర్కొనలేదు. సిట్ కూడా దీని గురించి ప్రస్తావించలేదు. ఈ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి పాల్గొన్నట్లు చెప్పలేదు. ఈనెల 18న డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలోనూ ఆ ప్రస్తావనే లేదు. అసలు వెబ్కాస్టింగ్ నుంచి అది ఎలా లీకైంది? నిజమైనదేనా? మార్ఫింగ్ చేసిందా? అనే విషయాలను ధృవీకరించుకోకుండా పిన్నెల్లిని అరెస్టు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు.దీన్ని సవాల్ చేసిన పిన్నెల్లికి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో పోలీసులు మరో మూడు అక్రమ కేసులు బనాయించారు. ఈ నెల 14న కారంపూడిలో వైఎస్సార్సీపీ శ్రేణులను చెదరగొడుతుండగా తన తలకు గాయమైందని, ఆ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నారంటూ సీఐ నారాయణస్వామి తాపీగా ఈనెల 22న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక కేసు నమోదైంది. పోలింగ్ రోజు తనను హత్య చేయడానికి పురిగొల్పారని ఆరోపణలు చేసిన ఓ టీడీపీ నేత ఫిర్యాదు ఆధారంగా మరో కేసు నమోదు చేయగా, తనను చంపుతానని బెదిరించారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మూడో కేసును పిన్నెల్లిపై నమోదు చేశారు. వీటిని పరిశీలిస్తే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు ఇలా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.టీడీపీ గూండాలకు చట్టం చుట్టమా?నరసరావుపేటలో పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. గోపిరెడ్డి దొరకకపోవడంతో ఆయన మామపై పచ్చ మూక దాడి చేసింది. అయితే హత్యాయత్నానికి పాల్పడ్డ టీడీపీ గూండాలపై కేసు నమోదు చేయకుండా ఆ కేసును పోలీసులు గోపిరెడ్డిపై బనాయించడం విస్మయం కలిగిస్తోంది. నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అరవిందబాబు ఇంట్లో పెట్రోల్ బాంబులు, మారణాయుధాలు లభ్యమైతే ఆయనపై చిన్న కేసుతో సరిపుచ్చారు. పోలింగ్ మర్నాడు కారంపూడిలో టీడీపీ మూకలు పేట్రేగినా పోలీసులు కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేదు. -
ఆ మూడు కేసుల్లోనూ ‘పిన్నెల్లి’కి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వండి
సాక్షి, అమరావతి: ఈవీఎంల ధ్వంసం కేసులో హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు వేర్వేరుగా మరో మూడు కేసులు నమోదు చేయడాన్ని సవాలుచేస్తూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హత్యాయత్నం చేశానంటూ నమోదు చేసిన ఈ కేసుల్లో తనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకే తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఆదివారం అయినప్పటికీ ఈ వ్యాజ్యాల అత్యవసర దృష్ట్యా న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తన ఇంటి వద్దే విచారణ చేపట్టారు. దాదాపు రెండు గంటలపాటు వాదనలు కొనసాగాయి. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.ఎన్నికల సంఘం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది..పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి. నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టుచేసి తీరాలన్న లక్ష్యంతో ఎన్నికల కమిషన్ అసాధారణ రీతిలో వ్యవహరిస్తోందన్నారు. ఎప్పుడూ కూడా ఎన్నికల కమిషన్ ఇలా వ్యవహరించలేదన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ కక్ష సాధింపు ధోరణి చూపుతోందని.. తన పరిధి దాటి వ్యవహరిస్తోందని తెలిపారు. పిన్నెల్లి అరెస్టు విషయంలో డీజీపీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, అది ఎందుకో అర్థంకావడం లేదన్నారు.ఈవీఎంల ధ్వంసం కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే తెల్లారేలోపు పిన్నెల్లిపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారన్నారు. అప్పటివరకు ఆ కేసుల గురించి కనీన ప్రస్తావన కూడా తేలేదన్నారు. ఘటన 13న జరిగితే పది రోజుల తరువాత పిటిషనర్పై కేసు నమోదు చేశారన్నారు. అలాగే, మరో కేసును కూడా ఘటన జరిగిన పది రోజుల తరువాత నమోదు చేశారని తెలిపారు. ఓ కేసులో ఫిర్యాదుదారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని తెలిపారు. హత్యాయత్నం చేశారని పది రోజుల తరువాత ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తి, ఘటన జరిగిన రోజునే ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. కట్టుకథ అల్లి, ఎలాగైనా పిన్నెల్లిని అరెస్టుచేయాలన్న దురుద్దేశంతోనే ఈ కేసులు నమోదు చేశారని నిరంజన్రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ మూడు కేసులు కూడా ఎన్నికలకు సంబంధించినవేనని.. ఒకే అంశంపై మూడు ఎఫ్ఐఆర్లు చెల్లవన్నారు.కేసుల నమోదులో పది రోజుల జాప్యం ఎందుకు జరిగిందో చెప్పడంలేదన్నారు. పిన్నెల్లి దాడిచేశారని చెబుతూ ఓ నిమిషం వీడియోను బయటపెట్టారని, వెబ్క్యాస్టింగ్ ఉన్నప్పుడు మొత్తం వీడియోను పరిశీలించి ఆ తర్వాతే చర్యలు తీసుకుని ఉండాల్సిందని నిరంజన్రెడ్డి చెప్పారు. ఇప్పుడు మూడు కేసులు పెట్టారని, రేపు ఇంకొన్ని కేసులు పెడతారని, వీటి వెనుక ఎవరున్నారో పోలీసులకు బాగా తెలుసునన్నారు.అలా చేయడం పబ్లిక్ ప్రాసిక్యూటర్ను అవమానించడమే..ఈ కేసులో డీజీపీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, అందుకే రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) ఉండగా, పోలీసుల తరఫున వాదనలు వినిపించుకునేందుకు మరో ప్రైవేటు న్యాయవాదిని నియమించుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇలా చేయడం పీపీని అవమానించడమేనన్నారు. ఒకవేళ ప్రైవేటు న్యాయవాది ప్రత్యేకంగా వాదనలు వినిపించాలనుకుంటే అందుకు ప్రభుత్వం జీఓ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. అలాంటి పరిస్థితి లేకపోవడంతో, ఫిర్యాదుదారు అయిన పోలీసు తరఫున ఆ న్యాయవాది హాజరవుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి తమ ముందస్తు బెయిల్ను పీపీ తీవ్రంగా వ్యతిరేకించారని, అయినా కూడా ఓ ప్రైవేటు న్యాయవాదిని నియమించుకోవాలని ప్రయత్నించారంటే తెర వెనుక ఎంత వ్యూహ రచన జరుగుతోందో అర్థంచేసుకోవచ్చునన్నారు.ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6 వరకు అరెస్టు నుంచి రక్షణనిచ్చారని, ఈ కేసుల్లో కూడా అలాంటి రక్షణనే ఇవ్వాలని నిరంజన్రెడ్డి కోర్టును అభ్యర్థించారు. అలాగే, హత్యాయత్నం చేశారని చెప్పినంత మాత్రాన ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదని.. అందుకు నిర్ధిష్ట విధానం ఉందని ఆయన వివరించారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిన్నెల్లిపై మరో కేసు పెట్టారని, ఇది ఎంతమాత్రం చెల్లదన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా పిన్నెల్లిని నిలువరించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్, పోలీసులు పనిచేస్తున్నారని న్యాయమూర్తికి నిరంజన్రెడ్డి తెలిపారు.పిన్నెల్లి తీవ్ర నేరాలకు పాల్పడ్డారు..తరువాత పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈవీఎంల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసే సందర్భంలో పిన్నెల్లిపై నిఘా పెట్టాలని ఈ కోర్టు పోలీసులను ఆదేశించిందన్నారు. అయితే, ఇప్పటివరకు పిటిషనర్ ఆచూకీ తెలీలేదని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనన్నారు. దర్యాప్తులో వెలుగుచూసిన వాస్తవాల ఆధారంగా కేసులు పెట్టామని తెలిపారు. పిన్నెల్లి తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని, అందువల్ల ఆయన మధ్యంతర ముందస్తు బెయిల్కు అర్హుడు కారన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామన్నారు. కౌంటింగ్ రోజున మరిన్ని అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్నారు.పిన్నెల్లిని ఎప్పుడు నిందితుడిగా చేర్చారో చెప్పండి..ఈ సమయంలో సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి స్పందిస్తూ.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే ఈ కేసులు పెట్టారని, ఆ విషయం తెలిసి కూడా తామెలా బయటకు రాగలమన్నారు. ఈ కేసులన్నీ కూడా పాత తేదీలతో నమోదు చేశారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. క్రైం నెంబర్ 59లో పిన్నెల్లిపై ఎప్పుడు కేసు నమోదు చేశారని ప్రశ్నించారు. 23న చేశారని నిరంజన్రెడ్డి చెప్పగా, కాదని 22నే చేశామని పీపీ నాగిరెడ్డి చెప్పారు. ఇది పచ్చి అబద్ధమని, ఈవీఎంల కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన తరువాతే పిన్నెల్లిని నిందితునిగా చేర్చారన్నారు. ఇక్కడే పోలీసుల కుట్ర బయటపడుతోందన్నారు. పోలీసులు పీపీకి సైతం వాస్తవాలు చెప్పడంలేదన్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే పారా మిలటరీ బలగాలను రంగంలోకి దించారన్నారు.పిన్నెల్లి చరిత్రను చూడండి..అనంతరం.. సీఐ నారాయణస్వామి తరఫు న్యాయవాది ఎన్. అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ, ముందస్తు బెయిల్ మంజూరు చేసేటప్పుడు పిటిషనర్ పిన్నెల్లి చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఇలాగే ఆయన పలు నేరాలకు పాల్పడ్డారన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి, క్రైం నెం 59లో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పీపీని ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.అస్మిత్ విషయంలో మాట్లాడని పోలీసులుఇక తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో ఆయనకు హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ, ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులు ఎక్కడా కూడా ఆయన ముందస్తు బెయిల్ను వ్యతిరేకించలేదు. కేవలం షరతులు విధించాలని మాత్రమే కోరారు. అదే సమయంలో ఈవీఎంల కేసులో పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. వాస్తవానికి.. ఆ కేసులో పిన్నెల్లిపై హత్యాయత్నం ఆరోపణలు లేవు. కానీ, టీడీపీ అభ్యర్థి అస్మిత్పై ఉన్నాయి. అయినా కూడా పోలీసులు అస్మిత్ విషయంలో ఓ రకంగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి విషయంలో మరో రకంగా వ్యవహరించారు. ఇదంతా కూడా పోలీసులు కావాలనే చేస్తున్నారనేందుకు ఇది ప్రత్యక్ష నిదర్శనం.పోలీసుల తరఫున ప్రైవేటు న్యాయవాది అసాధారణం..ఇదిలా ఉంటే.. పిన్నెల్లి విషయంలో పోలీసు ఉన్నతాధికారుల చర్యలు అసాధారణంగా ఉన్నాయి. అందుకు ఆదివారం హైకోర్టులో జరిగిన పరిణామాలే నిదర్శనం. ఫిర్యాదుదారుగా ఉన్న పోలీసు తరఫున ఓ ప్రైవేటు న్యాయవాది హాజరుకావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పోలీసు ఫిర్యాదుదారుగా ఉన్న కేసుల్లో ఇప్పటివరకు ఆ పోలీసు తరఫున ప్రైవేటు న్యాయవాది హాజరైన ఉదంతాలు హైకోర్టు చరిత్రలో ఇప్పటివరకు లేవు. సాధారణంగా పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటరే హాజరవుతుంటారు. అయితే, పిన్నెల్లి విషయంలో డీజీపీ కార్యాలయం ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది.కారంపూడి కేసులో ఫిర్యాదుదారు అయిన సీఐ నారాయణస్వామి తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ హాజరయ్యారు. వాస్తవానికి.. పిన్నెల్లిపై ఉన్న కేసుల్లో పోలీసుల తరఫున వాదనల కోసం అశ్వనీకుమార్నే నియమించుకోవాలని డీజీపీ కార్యాలయం భావించింది. అయితే, అందుకు ప్రభుత్వం జీఓ జారీచేయాల్సి ఉండటంతో వారి ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. చివరకు నారాయణస్వామి తరఫున అశ్వనీకుమార్ను రంగంలోకి దించారు.అశ్వనీకుమార్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కు అత్యంత సన్నిహితుడు. ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు రమేష్కుమార్ ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదిగా అశ్వనీకుమార్ను నియమించారు. తన పదవీ విరమణ తరువాత కూడా వ్యక్తిగతంగా నిమ్మగడ్డ రమేష్కుమార్ కేసులు అశ్వనీ వాదించారు. ఇప్పుడు పిన్నెల్లి కేసులో అశ్వనీకుమార్ తెరపైకి రావడం వెనుక కూడా నిమ్మగడ్డ ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. అలాగే, టీడీపీ, జనసేన నాయకుల తరఫున కూడా అశ్వనీకుమార్ కేసులు వాదించారు. -
పిన్నెల్లి హత్యకు పథకం: పేర్ని నాని ఆందోళన
సాక్షి, అమరావతి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటాడి హత్య చేసేందుకు పోలీసుల ద్వారా టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆందోళన వ్యక్తం చేశారు. పిన్నెల్లి ప్రాణాలకు ఎలాంటి హాని జరిగినా సీఐ నారాయణస్వామి, గుంటూరు రేంజ్ ఐజీ, డీజీపీదే బాధ్యతని స్పష్టం చేశారు. సీఐ నారాయణస్వామిని అడ్డు పెట్టుకుని తనను అంతమొందించేందుకు టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నట్లు ఈసీ, పోలీసు ఉన్నతాధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన ఇంటి వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పారామిలిటరీ బలగాలను ఈనెల 14న ఎందుకు వెనక్కి రప్పించారని నిలదీశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ఈ కుట్రలపై గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానికి మొర పెట్టుకుంటేగానీ పారా మిలిటరీ బలగాలను పంపలేదన్నారు. పోలీసు వ్యవస్థకు మాయని మచ్చలా తయారై సంఘ విద్రోహక శక్తుల్లా వ్యవహరిస్తున్న అధికారులకు ముందుంది ముసళ్ల పండుగని హెచ్చరించారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో టీడీపీ గూండాలకు వత్తాసు పలుకుతున్న వారు జూన్ 4 తరువాత తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. పేర్ని నాని ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ మూకల విధ్వంసకాండను రుజువు చేసే పలు వీడియోలను ప్రదర్శించారు.పిన్నెల్లి 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మాచర్లలో వైఎస్సార్సీపీకి బలమైన పునాది వేశారు. మాచర్లలో టీడీపీ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, గట్టి భద్రత కల్పించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలని కోరుతూ ఈనెల 11న ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషన్, పోలీసు ఉన్నతాధికారులకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వినతిపత్రం అందచేశారు.⇒ మాచర్ల నియోజకవర్గంలో ఇప్పటివరకూ అల్లర్లు జరగని ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలను నియమించిన అధికారులు ఘర్షణలు చోటుచేసుకునే చోట్ల మాత్రం హోంగార్డులతో సరిపుచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై టీడీపీ మూకలు దాడి చేస్తుంటే ప్రేక్షకపాత్ర వహించడం ద్వారా పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుట్ర చేశారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారులను భయభ్రాంతులకు గురి చేసి టీడీపీ మూకలు రిగ్గింగ్కు పాల్పడ్డాయి.⇒ ఈనెల 13న పోలింగ్ రోజు పాల్వాయి గేట్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసమైనట్లు పీవో లాగ్ బుక్లో ఎందుకు నమోదు చేయలేదు? అర క్షణమైనా పోలింగ్కు విఘాతం కలిగిందా? ఈనెల 17న విచారణకు వెళ్లిన సిట్ బృందానికైనా ఈవీఎం ధ్వంసం గురించి చెప్పారా? ఈనెల 18న డీజీపీకి సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనూ ఎమ్మెల్యే పిన్నెల్లి పేరు లేదు. ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసినట్లు ఆ నివేదికలో ఎక్కడా లేదు. మీడియాకు సిట్ విడుదల చేసిన నివేదికే అందుకు తార్కాణం.⇒ ఈనెల 20న లోకేష్ ట్వీట్ ఆధారంగా పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఎన్నికల కమిషన్ మర్నాడు ఆదేశించింది. లోకేష్కు ఆ వీడియో ఎలా వచ్చిందని మీడియా ప్రశ్నిస్తే తన కార్యాలయం నుంచి లీక్ కాలేదని, ఎలా వచ్చిందో విచారణలో తేలుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పేర్కొనడం హాస్యాస్పదం.⇒ ఈసీ ఉత్తర్వులపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించి ఈనెల 22న బెయిల్ తెచ్చుకుంటే అదే రోజు ఆయనపై తప్పుడు కేసు బనాయించారు. ఈనెల 14న కారంపూడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చెదరగొట్టేటప్పుడు తనకు గాయమైందని, తనపై దాడి చేసిన వారిలో పిన్నెల్లి ఉన్నారని ఈనెల 22న సీఐ నారాయణస్వామి తాపీగా స్టేట్మెంట్ ఇచ్చారు. పిన్నెల్లి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చి తప్పుడు కేసు బనాయించారు. సీఐకి 14న గాయమైతే 22 వరకూ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఏం చేశారు?⇒ పోలింగ్ మర్నాడు పారా మిలటరీ బలగాలు మాచర్లలో ఉన్నా పక్కనే ఉన్న కారంపూడిలో సీఐ నారాయణస్వామి, ఎస్సై రామాంజనేయులు అండతో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన టీడీపీ రౌడీమూకలు విధ్వంసానికి తెగబడ్డాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేసినా పోలీసులు పట్టించుకోలేదు.⇒ టీడీపీకి లొంగిపోయిన ఎన్నికల వ్యవస్థ, పోలీసు వ్యవస్థలు పిన్నెల్లిపై కక్ష కట్టి తప్పుడు కేసులు బనాయిస్తున్నాయి. మాచర్లలో ఎన్నికల హింసకు సంబంధించి ఎస్సీ, డీఎస్పీ, ఎస్సై సస్పెండైనా ఐజీ త్రిపాఠీకి సన్నిహితుడైన సీఐ నారాయణస్వామిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో కారంపూడి ఎస్సైగా ఉన్నప్పుడు అత్యంత వివాదాస్పంగా వ్యవహరించి సస్పెన్షన్కు గురైన నారాయణస్వామిని సీఐగా ఎలా నియమిస్తారు? ఆయన వ్యవహార శైలిపై గత నెల 8నే ఎమ్మెల్యే పిన్నెల్లి ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదు. ⇒ పోలింగ్ రోజు టీడీపీ కార్యకర్తను హత్య చేసేందుకు పురిగొల్పారని, మహిళలను చంపుతానని బెదిరించారని పిన్నెల్లిపై ఈనెల 23న మరో రెండు కేసులు నమోదు చేశారు. ఇలా ఇంకెన్ని తప్పుడు కేసులు బనాయిస్తారో డీజీపీ వెల్లడించాలి. పిన్నెల్లిని కౌంటింగ్కు రానివ్వకుండా చేసి దౌర్జన్యాలకు తెగబడాలని టీడీపీ కుట్రలు చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఈసీ అందుకు వంత పాడటం దారుణం. -
మాచర్లలో ఉనికి కోసం చంద్రబాబు పాకులాట.. బయటపడ్డ బాబు నిజస్వరూపం
-
లోకేష్ కు అమ్మేశారా ?
-
ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట
-
పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
సాక్షి, అమరావతి: ఎన్నికల రోజు ఉదయం నుంచి సాయంత్రం 7గంటల వరకు చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, రిగ్గింగ్పై మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలు ఫిర్యాదు చేసినా జిల్లా ఎస్పీ బేఖాతర్ చేశారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను గురువారం కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అరాచకాలు, హింసపై ఈసీ సరైన రీతిలో స్పందించకుంటే హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయన్నారు.ఈ అరాచకాలపై ఎన్నికల కమిషన్కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడిందని, 60కి పైగా కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని కోరామన్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేసిన వారిపై టీడీపీ మూకలు దాడులకు తెగబడటాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినా పోలీసులు ఏమాత్రం స్పందించలేదన్నారు. ఎన్నికల ముందు పోలీస్ అధికారులను ఈసీ ఆకస్మికంగా బదిలీ చేయడంతో హింస చెలరేగిందని చెప్పారు. దీనికి బీజేపీ, టీడీపీ, ఈసీ పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. టీడీపీ గూండాలు యథేచ్ఛగా రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బదిలీలతో చెలరేగిన హింస.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి ముందుగానే ఈసీ దృష్టికి తెచ్చామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా తగిన భద్రత కలి్పంచాలని కోరామన్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో టీడీపీ బరి తెగించి రిగ్గింగ్, దాడులకు తెగబడిందన్నారు. చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిడితో ఈసీ అధికారులను బదిలీ చేసిన చోట్ల హింస చెలరేగిందన్నారు. రిగ్గింగ్, ఓటర్లను బెదిరించడం, బూత్ల క్యాప్చరింగ్ తదితరాలపై పోలింగ్ రోజే టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు శాసన మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు.16 నియోజకవర్గాలకు సంబంధించి 60 పోలింగ్ బూత్లలో రీ పోలింగ్ జరపాలని కోరామన్నారు. రీ పోలింగ్ కోరుతున్న బూత్లలో లైవ్ వెబ్ క్యాస్టింగ్ ఫుటేజీని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పాల్వాయి గేట్, తుమృకోట, చింతపల్లి, ఒప్పిచర్ల, జెట్టిపాలెం, వెల్దుర్తిలో టీడీపీ విధ్వంసకాండపై ఈసీకి పోలింగ్ రోజే ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించిందని చెప్పారు. వీడియో ఫుటేజీల ఆధారంగా టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి, ఇతర అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి, పానుగంటి చైతన్య పాల్గొన్నారు. -
టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు?
సాక్షి, నరసరావుపేట: ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేశాడు.. ఓటర్లను బెదిరించాడు.. ఎన్నికలు సక్రమంగా జరగలేదు’.. అని రెండ్రోజులుగా గగ్గోలు పెడుతున్న టీడీపీ, పచ్చ మీడియా వర్గాలు ఎందుకు ఈవీఎంలు పగలగొట్టిన చోట్ల రీపోలింగ్ జరపమని ఎన్నికల సంఘాన్ని కోరలేదన్న ప్రశ్న అందరిలోనూ వేధిస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ రోజు అధికార పార్టీ రిగ్గింగ్ చేసిందనో, అధికారులను ఉపయోగించి ఎన్నికలు పారదర్శకంగా జరపలేదన్న కారణాలను చూపి రీపోలింగ్ అడుగుతాయి.ఫ్యాక్షన్ కు దూరంగా ఉంటూ అభివృద్ధి బాటపట్టిన మాచర్లను కావాలనే టీడీపీ అనుకూల మీడియా చంబల్లోయ అంటూ గత కొన్నినెలలుగా విషప్రచారం చేస్తోంది. అదే నిజమైతే అక్కడ నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో అరాచకం సృష్టించాడు.. రీపోలింగ్ జరపండి అని ఈసీని కోరాలిగానీ అటువంటి చర్యలేవి తెలుగుదేశం పార్టీ, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తీసుకోలేదు, అంటే.. ఎన్నికల వారికి అనుకూలంగా జరిగాయని వారు భావిస్తున్నట్లేగా? తాము చేసిన రిగ్గింగ్ వృథా కాకూడదనే మౌనంగా ఉన్నారా అన్న వాదన వినిపిస్తోంది.విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసిన జూలకంటి..నిజానికి.. ఫ్యాక్షన్ నేతగా ముద్రపడిన మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పోలింగ్ రోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్ నుంచి బయటకు లాగి కళ్లలో కారంకొట్టి దాడి చేయించాడు. రెంటచింతల మండలం పాల్వాయిగేట్, తుమృకోట, జెట్టిపాలెం, కారంపూడి మండలం ఒప్పిచర్ల, చింతలపూడి, వెల్దుర్తి వంటి పలు గ్రామాల్లో ఇదే జరిగింది. ఒప్పిచర్లలో పోలింగ్ ఏజెంట్గా ఉన్న ఎస్టీ సామాజికవర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావు, ఆయన సోదరుడు పాలకీర్తి నరేంద్రలపై వందల మంది దాడిచేసి బయటకు లాగి యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారు.అలాగే, రెంటచింతల మండలం తుమృకోటలో ఏజెంట్లుగా ఉన్న షేక్ సైషావలీ, షేక్ జానీబాషాలను బయటకు లాగి విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. రిగ్గింగ్ అడ్డుకున్నందుకు తుమృకోటలో నాలుగు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. జూలకంటి సొంత గ్రామమైన వెల్దుర్తిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకులాగి దాడిచేసి రిగ్గింగ్లకు తెగబడ్డాడు. 137, 138, 139, 140, 141 బూత్లలో కూర్చున్న వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను టీడీపీ నేతలు బయటకులాగి రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఇలా మాచర్ల నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాల పరిధిలోని సుమారు 20 పోలింగ్ బూత్లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అంతేకాక.. మాచర్లలో బ్రహ్మారెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశాడు. ఇందుకు పోలీసుశాఖ పూర్తి సహాయ సహకారాలు అందించిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.వీడియో బయటకు వచ్చాక గగ్గోలు..ఇక జూలకంటి బ్రహ్మారెడ్డి అనుకున్నట్లుగా రిగ్గింగ్ విచ్చలవిడిగా జరగడంతో టీడీపీ, పచ్చమీడియా పోలింగ్ రోజు, తరువాత వారం రోజులపాటు రిగ్గింగ్ అన్న పదం వాడలేదు. టీడీపీ రిగ్గింగ్ చేయడంతో అడ్డుకోవడానికి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఈవీఎంలు పగలగొట్టాడు అని వార్తలు సైతం పెద్దగా రాయలేదు. కారణం పాల్వాయిగేట్లో టీడీపీ చేసిన రిగ్గింగ్ బయటపడుతుందన్న ఒకేఒక్క కారణంతో. అయితే, నిజమో కాదో తెలియని ఓ ఈవీఎం పగలగొడుతున్న వీడియో బయటకు రాగానే ఒక్కసారిగా మాచర్లలో అరాచకం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు.అయినా సరే.. ఏ టీడీపీ నేత కూడా ఈవీఎంలు పగలినచోట్ల రీపోలింగ్ జరపమని మాటవరుసకైనా అనలేదు. కారణం అక్కడ రిగ్గింగ్ చేసింది, లాభపడింది తెలుగుదేశం పార్టీ కావడమే. ఈవీఎంలు పగలడానికి ముందు ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరిగిన దౌర్జన్యాల సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టమని అడగడంలేదు. ఒకవేళ టీడీపీ రిగ్గింగ్ చేసి ఉండకపోతే పూర్తి సీసీ ఫుటేజ్ బయటపెట్టమని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్నా సరే వారెందుకు మౌనంగా ఉంటున్నారో మిలియన్ డాలర్ల ప్రశ్న. కారణం జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గం చేసిన అరాచకాలు బయటపడితే వారి కుట్రలు ప్రజలకు తెలిసిపోతాయని.రీపోలింగ్ కోరిన పిన్నెల్లి..మరోవైపు.. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ చేసిన రిగ్గింగ్పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి రెండుసార్లు లేఖ రాశారు. పోలింగ్ రోజు నియోజకవర్గంలోని 8 గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో టీడీపీ చేసిన దౌర్జన్యాలను వివరిస్తూ మే 13వ తేదీ మ.3.33 గంటలకు.. సా.6.10 గంటలకు ఈసీకి రెండు లేఖలు రాశారు. ఇందులో టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న గ్రామాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థించారు. ఆ గ్రామాలు కారంపూడి మండలంలో చింతపల్లి, ఒప్పిచర్ల, పేటసన్నెగుండ్ల, పెదకోడగుండ్ల, రెంటచింతల మండం తుమృకోట, పాల్వాయిగేట్, జెట్టిపాలెం, వెల్దుర్తి గ్రామాలున్నాయి. అయినా, ఈ లేఖలను ఎన్నికల సంఘం పట్టించుకున్న పాపాన పోలేదు.టీడీపీ నేతలు రీపోలింగ్ జరపకుండా ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి తెచ్చి విజయం సాధించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగా.. వైఎస్సార్సీపీ నేతలు రిగ్గింగ్ చేసి ఉంటే రీపోలింగ్ జరపమని పదేపదే లేఖలు రాసి ఎందుకు డిమాండ్ చేస్తారు? వెబ్కాస్టింగ్ వీడియోలు పూర్తిగా బయటపెట్టమని ఎందుకు అడుగుతారు? అంబటి రాంబాబు లాంటి నేతలు రీపోలింగ్ కోసం ఎందుకు హైకోర్టు మెట్లు ఎక్కుతారు? ఈ చిన్న లాజిక్వల్ల పల్నాడులో అరాచకాలు చేసింది తెలుగుదేశం పార్టీయేనని సృష్టమవుతోంది. -
ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ
సాక్షి, అమరావతి: ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులకు హైకోర్టు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో వారికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లయింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండరాదని.. తాడిపత్రి బయట ఉండాలని జేసీ అస్మిత్రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సోమశేఖర నాయుడులను హైకోర్టు ఆదేశించింది. నలుగురు కంటే ఎక్కువ మందితో తిరగరాదని.. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని అస్మిత్రెడ్డి, పెద్దారెడ్డిలతో సహా మిగిలిన అభ్యర్థులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులనూ ఆదేశించింది. పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తున్నారని, అందువల్ల అభ్యర్థుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని ప్రధాన ఎన్నికల అధికారికి స్పష్టంచేసింది. అంతేకాక.. ఆయా కేసులకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయడంగానీ.. దర్యాప్తులో జోక్యం చేసుకోవడంగానీ చేయరాదని ఆదేశించింది. కేసు పూర్వాపరాల ఆధారంగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తంచేయడం లేదన్న హైకోర్టు, ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.అరెస్టుకు అవకాశం ఉంది.. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వండి..ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన కేసుల్లో పోలీసులు తమను అరెస్టుచేసే అవకాశముందని, అందువల్ల తమకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్లతో పలువురు స్వతంత్ర అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు టి. నిరంజన్రెడ్డి, పి.వీరారెడ్డి, ఓ.మనోహర్రెడ్డి, పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాదులు ఎస్.రామలక్ష్మణరెడ్డి, చుక్కపల్లి భానుప్రకాశ్.. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి తమ తమ వాదనలను వినిపించారు.సుప్రీంకోర్టుకన్నా తామే ఎక్కువని ఈసీ భావిస్తోంది..పిటిషనర్లపై నమోదైన కేసులన్నీ కూడా ఏడేళ్ల కంటే తక్కువ శిక్షపడే కేసులని, అందువల్ల వారికి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాల్సి ఉంటుందని నిరంజన్రెడ్డి తెలిపారు. అర్నేష్కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే కేసుల్లో అరెస్టుచేయడానికి వీల్లేదన్నారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం రామకృష్ణారెడ్డిని అరెస్టుచేసి తీరుతామని ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు కన్నా తామే ఎక్కువన్న విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని తెలిపారు. అలాగే, టీడీపీ నేత నారా లోకేశ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్చేసిన వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్ రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశించిందన్నారు. వాస్తవాలు విచారించకుండా ఇలాంటి వీడియోల ఆధారంగా అరెస్టుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇలా వ్యవహరించిన ఉదంతాలు గతంలో ఎక్కడా లేవన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది పోలీసు బృందాలు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల వెంటపడ్డాయన్నారు. తాము కౌంటింగ్ పూర్తయ్యే వరకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోరుతున్నామని సీనియర్ న్యాయవాదులు తెలిపారు. ఇప్పుడు అరెస్టుచేస్తే కౌంటింగ్ రోజున ఏజెంట్లను నియమించుకునే అవకాశం కూడా ఉండదన్నారు. దీనివల్ల పిటిషనర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ సమయంలో పీపీ నాగిరెడ్డి జోక్యం చేసుకుంటూ.. మధ్యంతర బెయిల్ ఇస్తే మొన్న జరిగిన ఘటనల వంటి వాటిని పునరావృత్తం చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇవ్వాలనుకుంటే షరతులు విధించాలని కోర్టుకు విన్నవించారు. ఎలాంటి ఘటనలు జరిగినా వారినే బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి, హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు పిటిషనర్లను అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించారు.ఆ పిటిషన్ల విచారణ 30కి వాయిదా..ఇదిలా ఉంటే, ఎన్నికల సమయంలో, ఎన్నికల తరువాత జరిగిన ఘర్షణలపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన
-
ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట
సాక్షి, విజయవాడ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేసింది.పిన్నెల్లితో సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో ఊరట లభించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కేసులున్న అభ్యర్థులపై వచ్చే నెల 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది.కాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. సంఘటన ఈనెల 13న జరిగితే.. 15న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని పేర్కొన్నారు. ముందు ఎఫ్ఐఆర్లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని.. తర్వాత లోకేష్ ట్విట్టర్లో వీడియోను చూసి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంపై నిరంజన్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.ట్విట్టర్లో వీడియో మార్ఫింగ్ చేసి ఉండొచ్చని.. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన నిరంజన్రెడ్డి.. సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉంటే 41A నోటీసులు ఇవ్వాలని ఉందని పేర్కొన్నారు. -
దమ్ముంటే ఆ ప్రాంతంలో రీపోలింగ్ పెట్టాలి
-
సినిమా సీన్ తరహాలో టీడీపీ దౌర్జన్యం
-
పిన్నెల్లి వీడియో ముందు ఏం జరిగింది..?
-
ఆ వీడియో ఫేకా? ఒరిజినలా?: మంత్రి అంబటి
సత్తెనపల్లి: ‘పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో దారుణాలు జరిగాయి. అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ మూకలు పేట్రేగిపోయాయి. బూత్ క్యాప్చరింగ్ చేశారు. దొంగ ఓట్లు వేసుకున్నారు. ఈవీఎంలను పగులగొట్టేందుకు యత్నించారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారనుకున్న ఓటర్లను అడ్డుకున్నారు. కొట్టి బయటకు పంపించారు. వీటన్నింటిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అటు అధికారులకు, ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి స్పందనా లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉన్నట్లుండి చిత్రంగా ఒక వీడియో రిలీజ్ అయ్యింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్లో ఈవీఎం పగలకొడుతున్నట్లు అందులో ఉంది. దీన్ని ఎవరు లీక్ చేశారు? ఇది ఫేకా, ఒరిజినలా తేల్చాలి’ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో అర్థం కావడం లేదన్నారు. వాస్తవంగా ఇలాంటిదేదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయాలని చెప్పారు. ‘దీన్ని లోకేశ్ ఎక్స్ (ట్విటర్)లో పెట్టారంట! ఎలా చేరింది లోకేశ్ ట్విటర్లోకి? ఈ వీడియో ఫేకా? ఒరిజినలా? కన్క్లూజన్ ఎవిడెన్సా.. కాదా.. ఆలోచించాలి కదా.. కలెక్టర్ అన్న రిలీజ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన వారన్నా రిలీజ్ చేయాలి. వీరెవరూ కాకుండా ఇది డైరెక్ట్గా తెలుగుదేశ«ం అధినేత కొడుకైన లోకేశ్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్లింది?’ అని ప్రశ్నించారు. అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అధికారులు, ఎన్నికల కమిషన్లో ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారనే అనుమానం కలగటం సహజం అని స్పష్టం చేశారు. ఒక వేళ అది నిజంగా జరిగి ఉంటే, సంబంధిత అధికారులు విడుదల చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకునేదన్నారు. ఇప్పుడు జరిగింది చూస్తుంటే ఇది ఫేక్ అనిపిస్తోందని చెప్పారు. అంబటి ఇంకా ఏమన్నారంటే..ఆ వీడియోలన్నీ రిలీజ్ చేయాలి‘పాల్వాయిగేట్ బూత్లో టీడీపీ మూకలు ఎంత దారుణంగా వ్యవహరించారో పిన్నెలి రామకృష్ణారెడ్డి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. అది నేను కూడా మీకు చూపిస్తా (వీడియో ప్రదర్శించారు). వైఎస్సార్సీపీకి చెందిన వారని భావిస్తున్న ఓటర్లు ఆ బూత్లోకి వెళ్లి స్వేచ్ఛగా ఓటు వేస్తే ఒప్పుకోనటువంటి పరిస్థితి. బూత్ బయట హింసించి తరిమేస్తున్నటువంటి సందర్భం. దీని మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిపోర్టు చేశారు. అయితే ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీకీ అనుకూలమైనటువంటి బూత్ల దగ్గర గొడవ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకుండా ఉండే పరిస్థితి. ఇది వాస్తవం. చాలా నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగాయి. నా నియోజకవర్గంలో కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగి టీడీపీ వాళ్లు ఓట్లు వేసుకున్నారు. వెట్ క్యామ్ ఓపెన్ చేయండి అంటే పట్టించుకోలేదు. ఎలాంటి చర్యలూ లేవు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టారని ప్రచారంలో ఉన్న వీడియో ఫేక్ వీడియోనా? కరెక్ట్ వీడియోనా? కరెక్ట్ వీడియో అయితే లోకేశ్ దగ్గర ఎలా రిలీజ్ అయ్యింది. దీనిపై ఎన్నికల కమిషన్ ఏం యాక్షన్ తీసుకుంది? నేరం చేసినట్టుగా భావించేలా అలా ఫేక్గా చేయడం తప్పు. నిజంగా నేరం చేసిన వారిని శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మేం ఆందోళన చెందుతున్నాం. ఎక్కడైతే బూత్ క్యాప్చరింగ్ జరిగిందో ఆ వీడియోస్ను ఎలక్షన్ కమిషన్ బయట పెట్టాలి. ఒక చోట కాదు.. అనేక చోట్ల మేం ఫిర్యాదు కూడా చేశాం. ఆ వీడియోలన్నీ రిలీజ్ చేయాలి’ అని మంత్రి అంబటి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలపై తాము ఈసీకి అనేక రకాలుగా ముందస్తుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తుదకు ఆ అక్రమాలను అందరూ కళ్లారా చూడటంతో కొందరు అధికారులను సస్పెండ్ చేశారని, మరికొందరిని మార్చారని చెప్పారు. తద్వారా తప్పు జరిగిందనే భావన సర్వత్రా వ్యాపించిందన్నారు.రీ పోలింగ్ పిటిషన్పై నేడు విచారణపల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం నార్నెపాడులో 236, 237 పోలింగ్ కేంద్రాలు, దమ్మాలపాడులోని 253, 254 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్కు పాల్పడ్డారు. వెబ్ కెమెరాలను పరిశీలించి రీ పోలింగ్ జరపాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోక పోవడంతో రీ పోలింగ్ జరపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈసీ, సీఈఓ సహా ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. -
‘రిగ్గింగ్’ వదిలేసి అడ్డుకుంటే కేసులా?
నరసరావుపేట: ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడిన వారిని వదిలేసి అడ్డుకున్న వారిపై ఈసీ కన్నెర్ర చేయడం ఏమిటని గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. బుధవారం నరసరావుపేటలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా పిన్నెల్లి నాలుగు సార్లు ప్రజాబలంతో ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. ఈవీఎం ఘటనను పదేపదే చూపిస్తున్న టీడీపీ అనుకూల మీడియా అదేచోట వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై జరిగిన దాడులను ఎందుకు దాచి పెడుతోందని నిలదీశారు. మిగతా వాటి సంగతేంటి? ఒక్క ఈవీఎం ఘటనను చూపిస్తూ పిన్నెల్లి నిందితుడిగా చేర్చారు. మరి పల్నాడులో పలుచోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టడం లేదు? టీడీపీ నేతలు దౌర్జన్యాలకు తెగబడి ఈవీఎంలను పగులకొట్టిన వీడియోలు ఎందుకు బహిర్గతం చేయడం లేదు? పోలింగ్ కేంద్రాల్లో వీడియో కెమెరాలు అమర్చిన ఈసీ పది రోజులుగా మేం ఘోషిస్తున్నా ఎందుకు స్పందించలేదు?రిగ్గింగ్ జరగలేదని నిరూపించాలి..మాచర్లలో ఈసీకి ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులొచ్చాయి? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలి. పాల్వాయి గేటుతో సహా మేం చెబుతున్న చోట్ల రిగ్గింగ్ జరగలేదని వెబ్ కెమెరా వీడియోలను బయటపెట్టి నిరూపించగలరా? ప్రజాస్వామ్య వ్యవస్థలో దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదే. కొత్త గణేశునిపాడులో మహిళల నిర్బంధంపోలింగ్ రోజు మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో అర్ధరాత్రి యాదవులు, ఎస్టీల ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు దిగి స్వైరవిహారం చేశాయి. మహిళలు ప్రాణభయంతో 24 గంటల పాటు ఓ దేవాలయంలో తల దాచుకుంటే ఇరువర్గాలపై కేసులు పెడతారా? ఇదేనా ఈసీ చేసే న్యాయం? పోలింగ్కు ముందు పల్నాడులో పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ఈసీ ఆ స్థానంలో తాను నియమించిన వారు విధుల్లో అలసత్వం ప్రదర్శించారంటూ సస్పెండ్ చేసింది. ఈసీ నియమించిన అధికారులే సస్పెండ్ అయ్యారంటే ఎవరు విఫలమైనట్లు? రీపోలింగ్కు హైకోర్టుకెళ్లి పోరాడతాం..ఎన్నికల కమిషన్కు వైఎస్సార్ సీపీ అందించిన ఫిర్యాదులన్నింటికీ సమాధానం చెప్పాల్సిందే. రిగ్గింగ్ జరిగినట్లు మేం ఫిర్యాదు చేసిన ప్రతి పోలింగ్ కేంద్రం వీడియోలను ఎన్నికల కమిష¯Œన్ బహిర్గతం చేయాల్సిందే. అధికారుల నియామకాలు, ఆ తర్వాత వారిని సస్పెండ్ చేయడం, ఎన్నికల ప్రక్రియలో లోపాలపై కచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం. రీపోలింగ్ నిర్వహించేలా పోరాటం చేస్తాం. రిగ్గింగ్ ఆరోపణలు వచ్చిన చోట వెబ్ కెమెరాలను తనిఖీ చేసి రీపోలింగ్ నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉంది. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు, ఏజెంట్లు కలసి రిగ్గింగ్కు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బయటకు లాగి దాడి చేయడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకుని తీవ్రంగా ప్రతిఘటించారు. మేం చెప్పేది నిజం కాకుంటే పూర్తి నిడివి వీడియోలను ఈసీ బయట పెట్టాలి. పిన్నెల్లి నాలుగు సార్లు ప్రజాస్వామ్యబద్ధంగా మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదోసారి కూడా కచ్చితంగా విజయం సాధిస్తారు. నలుగురు అధికారులను మేనేజ్ చేసి ఎడిటెడ్ వీడియోలు లీక్ చేసినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదు. ఇలాంటి రాజకీయాలు చాలా చూశాం. బాబు నోట నీతులా..?నరసరావుపేటలో కోడెల ఇంట్లో బాంబులు తయారు చేస్తుండగా నలుగురు చనిపోతే ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన చంద్రబాబు నీతులు చెబుతున్నారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై ఏ 1గా ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన చంద్రబాబు ఇప్పుడు అదే వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఫ్యాక్షనిజం, ఫ్యాక్షన్ లీడర్లను ప్రోత్సహించేది చంద్రబాబేనని అందరికీ తెలుసు.'గేట్’ వీడియోలన్నీ బయట పెట్టాలి..మాచర్ల నియోజకవర్గంలోని తుమృకోట, వెల్దుర్తి, చింతపల్లి, వేపకంపల్లె, ఒప్పిచర్లలో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బూత్ల నుంచి బయటకు లాక్కెళుతున్న వీడియోలను ఎన్నికల కమిష¯Œన్ దృష్టికి తెచ్చాం. పాల్వాయిగేట్లో మా పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు లాక్కెళ్లి కొడుతుంటే పిన్నెల్లి రిగ్గింగ్ను అడ్డుకునేందుకు వెళ్లారు. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు రెండు మూడు గంటల పాటు సాగిన టీడీపీ మూకల దౌర్జన్యాలు, విధ్వంసకాండను ఎందుకు బయట పెట్టడం లేదు? అక్కడ ఉదయం నుంచి జరిగిన ఘటనల వీడియోలన్నీ బహిర్గతం చేయాలి. -
మరీ ఇంత ‘పచ్చ’పాతమా!
దర్శి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుల్లో ఈసీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందన్న ఆరోపణలకు దర్శి ఘటన బలం చేకూరుస్తోంది. పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై 10 రకాల సెక్షన్లు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఓ వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది.ఈ విషయంపై పచ్చ మీడియా చిలువలుపలువలుగా కథనాలు ప్రచురిస్తోంది. ఇదే తరహాలో ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ నేతలు ఈవీఎంను ధ్వంసం చేశారు. దానిని పగులగొట్టిన టీడీపీ నేత వీసీ రెడ్డిపై తీసుకున్న చర్యలు మాత్రం నామమాత్రం. 13వ తేదీ పోలింగ్ జరుగుతున్న సందర్భంగా దర్శి ఎంఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్లో ఎంపీ అభ్యర్థికి చెందిన ఈవీఎంను టీడీపీ నేత వేమిరెడ్డి చెన్నారెడ్డి(వీసీ రెడ్డి) పగులగొట్టాడు. ఇదే బూత్ సమీపంలో టీడీపీ నేతలు వీరంగం చేయడంతో కొంతసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.నిందితుడికి 41ఏ నోటీసులతో సరి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో వీసీ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 41ఏ నోటీసులు ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కళ్లు తిరుగుతున్నాయని చెప్పగా వీసీ రెడ్డిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి వీసీ రెడ్డి పరారయ్యాడు. 41ఏ నోటీసులు తీసుకున్న వ్యక్తి పోలీసుల అనుమతి లేకుండా గ్రామం విడిచి వెళ్లకూడదు. పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన నిందితుడు ఒంగోలు రామ్నగర్లో నివాసముంటున్న టీడీపీ కీలక నేత కుమారుడి వద్ద ఆశ్రయం పొందినట్లు గత పది రోజులుగా ప్రచారం జరిగింది. సదరు నాయకుడి ఒత్తిడి మేరకే వీసీ రెడ్డిపై పోలీస్ అధికారులు ఉదాశీన వైఖరిని అవలంబిస్తున్నారని, చట్ట ప్రకారం కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా.. బుధవారం వీసీ రెడ్డి దర్శిలోని ఓ రెస్టారెంట్లో ఉన్న సమయంలో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు వర్గాలు చెబుతుండటం గమనార్హం. ఈవీఎం ధ్వంసం చేసిన విషయం, నరసరావుపేట నుంచి వచ్చిన 150 మంది టీడీపీ గూండాలు దర్శి నియోజకవర్గంలో చేసిన రచ్చను ఉద్దేశపూర్వకంగా దాచేసిన ఎల్లో మీడియా.. వైఎస్సార్సీపీ నాయకులపై మాత్రం విషం చిమ్మడాన్ని ఆపడం లేదు. -
‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్
సాక్షి, నరసరావుపేట / రెంటచింతల: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేటులోని పోలింగ్ బూత్లో ఆ రోజు అసలు ఏం జరిగిందన్నది కీలకంగా మారింది. మే 13న రెంటచింతల మండలం పాల్వాయిగేటు 201, 202 పోలింగ్ బూత్లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలను బెదిరించి టీడీపీ గూండాలు భయానక వాతావరణం సృష్టించారు. పోలింగ్ సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారితోపాటు పల్నాడు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసేందుకు పిన్నెల్లి పలుసార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు లాక్కొచ్చి దాడులు చేయడంతోపాటు టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకున్నట్లు చెబుతున్నారు. యథేచ్ఛగా జరుగుతున్న రిగ్గింగ్ను ఆయన ప్రతిఘటించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పచ్చ ముఠాలు పల్నాడు ప్రాంతంలో దాదాపు ఏడు చోట్ల ఈవీఎంల విధ్వంసాలకు తెగబడగా దీన్ని అడ్డుకున్న పిన్నెల్లి వీడియోను మాత్రమే బహిర్గతం చేయడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈసీకి మొర పెట్టుకున్నా... పాల్వాయిగేట్, తుమృకోట, ఒప్పిచర్ల, చింతలపల్లి పోలింగ్ కేంద్రాలలో గతంలో పలుమార్లు టీడీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఆయా కేంద్రాలలో పటిష్ట బందోబస్తు కల్పించి ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని పిన్నెల్లి పలు దఫాలు ఈసీ, కలెక్టర్, ఎస్పీలను అభ్యరి్థంచినా స్పందించలేదు. పోలింగ్ రోజు కూడా రెండుసార్లు ఈసీకి మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ అరాచకాలకు సహకరించేందుకు 50 ఏళ్లకు పైగా వయసున్న పోలీసు కానిస్టేబుల్కే విధులు కేటాయించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను చితకబాది.. పాల్వాయి గేట్ కేంద్రంలో వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న చింతా సుబ్బారావు, డేరంగుల శ్రీను, చల్లా సుబ్బయ్యలను టీడీపీ నేతలు కొట్టి బయటకు ఈడ్చేశారు. ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డ మహిళలను భయకంపితుల్ని చేసి తరిమేశారు. అనంతరం అక్కడ టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడ్డారు. స్థానికులతో కలసి మరోసారి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పిన్నెల్లి రిగ్గింగ్ను ప్రతిఘటించారు. దీన్ని అడ్డుకోవాలని పోలింగ్ అధికారులను అభ్యరి్థంచారు. టీడీపీ మూకల అరాచకాలను ఎన్నికల అధికారుల దృష్టికి తెచి్చనా స్పందించలేదు. పిన్నెల్లి కుమారుడు గౌతమ్రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి, మరికొందరిపై టీడీపీ నేతలు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. పిన్నెల్లి కాన్వాయ్లోని వాహనాలను ధ్వంసం చేశారు. ఓటర్లు, ఏజెంట్లను భయపెట్టి రిగ్గింగ్ చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఆ వీడియో ఒక్కటే.. వారం తరువాత మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు మొత్తం ఏడు ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఒక్క పాల్వాయి గేటు వీడియో మినహా మిగతావి ఏవీ బయటకు రాలేదు. అది కూడా వారం తరువాత తాపీగా విడుదల చేయడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈవీఎంలు ధ్వంసమైన మిగిలిన ఆరు వీడియోలను ఎన్నికల సంఘం ఇప్పటికీ బయట పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియోను తాము రిలీజ్ చేయలేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడిన తరువాత విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్ ‘ఎక్స్’ ఖాతా నుంచి వీడియో పోస్టు కావడం గమనార్హం. ఈసీ ఆదీనంలో ఉండాల్సిన వీడియో లోకేష్ చేతికి ఎలా వచి్చందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈసీ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో టీడీపీ మూకలు రిగ్గింగ్ చేస్తుంటే ఎందుకు స్పందించలేదు? ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నా ఏమి పట్టనట్లు వ్యవహరించడం ఏమిటి? ఫిర్యాదులు అందినా ఎందుకు పట్టించుకోలేదు? అనే ప్రశ్నలకు ఈసీ జవాబు చెపాల్సి ఉంది. మాచర్ల నియోజకవర్గంలో వంద శాతం వెబ్ కాస్టింగ్ జరుగుతోంది. 202 పోలింగ్ బూత్లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలిసినా ఉదాశీనంగా ఉండటంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. తుమృకోటలో దాడులు.. ఈవీఎంలు ధ్వంసం రెంటచింతల మండలం తుమృకోటలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన ఎస్సీ, ముస్లిం మైనార్టీలపై టీడీపీ నేతలు దాడి చేశారు. 203, 204, 205 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. రీపోలింగ్ జరపకుండా సాయంత్రం 4 గంటల సమయంలో కొత్త ఈవీంఎలతో తిరిగి పోలింగ్ కొనసాగించారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేశారు. ఈ వీడియోలను ఎన్నికల సంఘం బయటపెట్టలేదు. కారంపూడి మండలం ఒప్పిచర్లలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ పాలకిర్తి శ్రీనివాసరావుపై టీడీపీ అగ్రవర్ణ నేతలు దాడి చేసి పోలింగ్ కేంద్రం నుంచి ఈడ్చేసి అక్రమ కేసు బనాయించారు. ఈసీ డేటా భద్రమేనా?సాక్షి, నరసరావుపేట: పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఈవీఎం «ధ్వంసం వీడియోపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా అది సీసీ ఫుటేజేనా? లేక మార్ఫింగ్ చేసిన వీడియోనా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీడియో కుడివైపు పైభాగంలో మొబైల్ 5జీ సిగ్నల్, 65 శాతం బ్యాటరీ పర్సంటేజ్, అలారం ఇండికేషన్స్ కనిపించడం గమనార్హం. వీడియోలో మొత్తం నిడివి 23.52 గంటలు ఉండగా 12.06 గంటల వద్ద తమకు అవసరమైన మేరకు రెండు నిమిషాల పాటు మొబైల్లో రికార్డు చేసినట్టు స్పష్టమవుతోంది. ఎంతో భద్రంగా ఉండాల్సిన పోలింగ్ వెబ్ కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు అలుముకుంటున్నాయి. ఈ వీడియో తొలుత నారా లోకేష్ ఎక్స్ ఖాతా, టీడీపీ సోషల్ మీడియా గ్రూప్లలో కనిపించింది. అంటే వారి ద్వారానే బయటకు వచి్చనట్టు తేలిపోతోంది. గ్రాఫిక్స్కు పెట్టింది పేరైన పచ్చ ముఠాల వీడియోను నిర్థారించుకోకుండా, ఎలా బయటకు వచి్చందనే విషయాన్ని పట్టించుకోకుండా ఈసీ కేసు నమోదుకు ఆదేశించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 53 గ్రామాల్లో దాడులుసాక్షి, ప్రత్యేక ప్రతినిధి / సాక్షి, నరసరావుపేట: పల్నాడులోని 53 గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై, ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఆస్తులను ధ్వంసం చేశాయి. పోలింగ్ నాడు టీడీపీ నాయకులు హింసాకాండకు పథకం రూపొందించినట్లు మంత్రి అంబటి, పిన్నెల్లి తదితరులు ఎన్నికల యంత్రాంగానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందించలేదు. వీడియోను మొబైల్లో రికార్డు చేశారని చెప్పడానికి గల ఆధారాలు.. ఆ వీడియో వెనుక అసలు నిజాలు..⇒ మే 13న పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా ఓటర్లను టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. ⇒ పాల్వాయి గేట్లోని అన్ని బూత్లను ఆక్రమించి పచ్చ ముఠాలు రిగ్గింగ్కు పాల్పడ్డాయి. ⇒ బ్రహా్మరెడ్డి కుట్రలను ముందే పసిగట్టి మే 11న పిన్నెల్లి ఈసీకి లేఖ రాశారు. ⇒ సమస్యాత్మక ప్రాంతమైన మాచర్లలో భారీగా పోలీసులను మోహరించాలని పిన్నెల్లి కోరారు. ⇒ టీడీపీ అరాచకాలకు పాల్పడినందున రీ పోలింగ్ నిర్వహించాలని లేఖలో పిన్నెల్లి కోరారు.⇒ ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసినందున రీ పోలింగ్ జరపాల్సిందేనని అభ్యరి్థస్తూ పిన్నెల్లి మరో లేఖ రాశారు. ⇒ టీడీపీ కుట్రలపై మే 11న ఒక లేఖ, పోలింగ్ జరిగిన మే 13న రెండు లేఖలను పిన్నెల్లి ఈసీకి రాశారు. ⇒ 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయినట్లు ఎన్నికల అధికారి ప్రెస్ మీట్ నిర్వహించి మరీ చెప్పారు. ⇒ టీడీపీ గూండాలు 10 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదు?⇒ నారా లోకేష్ ఫిర్యాదుతో 8 రోజుల తరువాత ఒక వీడియో విడుదల చేసి అరెస్టుకు ఆదేశాలిచ్చారు.దాడి చేసి.. రిగ్గింగ్202 పోలింగ్ బూత్లోకి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రవేశించి నాతో పాటు డేరంగులు శ్రీను, చల్లా సుబ్బయ్యలపై దాడి చేశారు. చితకబాది పోలింగ్ బూత్ బయటకు లాక్కొచ్చారు. అనంతరం టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అక్కడున్న పోలీసులు, పోలింగ్ అధికారులు ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో మేం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాం. అక్కడకు వచి్చన పిన్నెల్లి, ఆయన అనుచరులపై పచ్చమూకలు దాడులకు పాల్పడ్డాయి. –చింతా సుబ్బారావు, ఇన్చార్జి సర్పంచి,వైఎస్సార్సీపీ ఏజెంట్, పాల్వాయి గేట్పల్నాడు గ్రామాల్లో టీడీపీ దురాగతాలు..⇒ మాచర్ల రూరల్ మండలం: కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు ⇒ రెంటచింతల: రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు ⇒ కారంపూడి: ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి ⇒ దుర్గి: ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి ⇒ వెల్దుర్తి: లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట ⇒ గురజాల: కేసానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, మాచవరం, బ్రాహ్మణపల్లి, పెదఅగ్రహారం, జానపాడు. ⇒ నరసరావుపేట: నరసరావుపేట పట్టణం, దొండపాడు, పమిడిపాడు. ⇒ సత్తెనపల్లి: పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుండ్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్ల. ⇒ వినుకొండ: నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం. ⇒ పెదకూరపాడు: ఎర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు. ⇒ చిలకలూరిపేట: అప్పాపురం -
నేను ఎక్కడికి పారిపోలేదు.. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం
సాక్షి, పల్నాడు: ‘టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతి. ఫ్యాక్షనిజమే అతని జీవితం..’ అని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని పిన్నెల్లి ప్రకటించారు. ఆయన మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ‘టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోసి.. ఆయన మాత్రం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ప్రజలను పట్టించుకోవడం లేదు. అటువంటి వ్యక్తి నేను పారిపోయానని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. ఏడు మర్డర్ కేసుల్లో ఏ–1గా ఉన్న బ్రహ్మారెడ్డి నాపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మడం లేదు. నాపై పోటీ చేసి ఓడిపోయిన బ్రహ్మారెడ్డి గుంటూరుకు పారిపోయాడు. ఆ తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికల ముందు బ్రహ్మారెడ్డిని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చంద్రబాబు తీసుకొచ్చి పల్నాడులో ఫ్యాక్షన్కు ఆజ్యం పోశారు. కారెంపూడి మండలంలోని చింతపల్లి, ఒప్పిచర్ల, రెంటచింతల మండలంలో తుమృకోట, పాలవాయిగేటు గ్రామాల్లో కమ్మ సామాజికవర్గానికి చెందినవారు మా ఏజెంట్లను తరిమికొట్టి గొడవలు సృష్టించారు. కారెంపూడి సీఐ నారాయణస్వామి ద్వారా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ గ్రామాల్లో గొడవలు జరుగుతాయని బందోబస్తు పెంచాలని హైకోర్టు నుంచి ముందుగానే ఆర్డర్ తీసుకొచ్చి ఎస్పీకి ఇచ్చినా పట్టించుకోలేదు. ఎన్నికల రోజు గొడవలు జరిగినా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పోలీసుల సూచనల మేరకు హైదరాబాద్కు వచ్చాను. మర్డర్లు చేసి పారిపోయిన చరిత్ర నాకు లేదు. నేను ఎన్నడూ పారిపోలేదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామాజికవర్గాన్ని ఒకటి చేయటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు కలిసి గొడవలు చేశారు. టీడీపీని గెలిపించేందుకు సీఐ నారాయణస్వామి దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. బ్రహ్మారెడ్డిలా నీచ రాజకీయాలు చేసి పారిపోయే చరిత్ర నాది కాదు. నేను ఎప్పుడూ ప్రజలకు వెన్నంటే ఉంటాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. మీ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పండి. చందాలు వసూలు చేసి ఇల్లు కట్టుకుని చందాల నాయకుడుగా మారిన బ్రహ్మారెడ్డి నన్ను విమర్శించడం సిగ్గుచేటు.’ అని పిన్నెల్లి రామకృష్ణరెడ్డి చెప్పారు. -
పల్నాడుపై పగబట్టిన బాబు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, నరసరావుపేట : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు పల్నాడుపై పగపట్టారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్న వరుస పరిణామాలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా వరుసగా చావు దెబ్బ తింటున్న తెలుగుదేశం ఎలాగైనా పల్నాడులో ఫ్యాక్షనిజాన్ని ఎగదోసి, వర్గ వైషమ్యాలను పెంచి పోషించడం ద్వారా తన ఉనికిని నిలబెట్టుకునేందుకు శతధా ప్రయత్నిస్తోంది.అందులో భాగంగా వరుస దాడులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు పల్నాడు ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మాచర్ల నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ తరఫున పోటీ చేసిన జూలకంటి దుర్గాంబ గెలుపొందారు. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి గెలుపొందారు. 2009, 2012 (ఉప ఎన్నిక), 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తున్నారు. కాగా దుర్గాంబ కుమారుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో మాచర్లలో సైకిల్ మూలన పడింది. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. టీడీపీ బలోపేతమంటూ...మాచర్లలో టీడీపీని బలోపేతం చేయాలంటే పిన్నెల్లిని అడ్డు తొలగించడమే మార్గం అని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు.. అందుకు అనుగుణంగా దాడుల ప్రణాళిక రచించారు. అందులో భాగంగా 2020 జనవరి ఏడో తేదీన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మంగళగిరికి సమీపంలోని కాజ టోల్ప్లాజా వద్ద టీడీపీ శ్రేణులతో భారీ ఎత్తున దాడి చేయించారు. ఎమ్మెల్యే వాహనాన్ని రాళ్లతో ధ్వంసం చేశారు. గన్మెన్ గాయాలపాలయ్యారు. అయితే ఆ రోజు ఎమ్మెల్యే బయటపడ్డారు. ఆ క్రమంలో భాగంగా రౌడీలు, గూండాలనే గుర్తింపున్న బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలకు మందీ మార్భలాన్ని తోడిచ్చి విజయవాడ నుంచి 2020 మార్చి 11న మాచర్లకు పంపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు, స్థానికులు తిరగబడి బొండా, బుద్దా బృందాలను వెంటపడి తరిమేశారు. దీంతో చంద్రబాబు.. ఫ్యాక్షనిజం, హత్యల నేపథ్యమున్న జూలకంటి బ్రహ్మానందరెడ్డిని మళ్లీ రంగంలోకి దింపుతూ 2021 డిసెంబర్లో మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. 2010 మార్చి పదో తేదీన ఆత్మకూరు వద్ద ఏడుగురి హత్య కేసులో జూలకంటి ప్రథమ ముద్దాయి. చివరకు తన బాబాయి కుమారుడైన సాంబిరెడ్డి పొలాల్లో దాక్కుని ఉండగా హత్య చేయించారని అందరూ చెప్పుకుంటారు. పోలేపల్లి శివారెడ్డి హత్య కేసులోనూ జూలకంటిది ప్రధాన పాత్ర అని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మాచర్ల ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వరుస దాడులు, దొమ్మీలు, హత్యా ప్రయత్నాల పరంపర కొనసాగుతోంది. ఈ ఎన్నికల తర్వాత అది శ్రుతి మించింది. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై విచ్చలవిడిగా టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. వినుకొండ, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లోనూ టీడీపీ దాడులకు తెగబడింది. మాచర్ల నియోజకవర్గంలో అశాంతికి ప్రధాన కారణం పోలీసులేనని, ప్రధానంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కారంపూడి సీఐ నారాయణస్వామి తీరు వల్లే గొడవలు పెరిగాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బహిరంగా నిప్పులు చెరగడం పల్నాడులో పరిస్థితికి అద్దం పడుతోంది. పదుల సంఖ్యలో ఊళ్లలో విధ్వంసం» మాచర్ల రూరల్ మండలంలోని కొత్తూరు, కంబంపాడు, భైరవునిపాడు, వెల్దుర్తి మండలం లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సంపేట, రెంటచింతల మండలం రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు, కారంపూడి మండలం ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి, దుర్గి మండలం ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి తదితర గ్రామాల్లో టీడీపీ దాడులు కొనసాగాయి.» దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లోని కేశానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, బ్రాహ్మణపల్లి, పెద అగ్రహారం, జానపాడు, వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం, సత్తెనపల్లి నియోజకవర్గంలోని పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుంట్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్లలోనూ వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేశారు.» నరసరావుపేట టౌన్, దొండపాడు, పమిడిపాడు, పెదకూరపాడు మండలం యర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు, చిలకలూరిపేటలోని అప్పాపురం గ్రామాల్లో టీడీపీ దాడులకు తెగబడింది. అభివృద్ధిలో పోటీ పడలేకే విధ్వంసంచంద్రబాబు ఏలుబడిలో అభివృద్ధి ఊసే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పల్నాడులో అభివృద్ధి పరుగెత్తుతోంది. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటైంది. పిడుగురాళ్లలో మెడికల్ కాలేజీ రూపు దిద్దుకుంటోంది. వరికపూడిసెలకు మోక్షం కలిగింది. గురజాల నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో తాగునీటి వసతి కలిగింది.నరసరావుపేటలో జేఎన్టీయూ కాలేజీకి శాశ్వత భవనాలు ఒనగూరాయి. రొంపిచర్ల, మాచర్లలో కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. పులిచింతల ప్రాజెక్టు దిగువన మాదిపాడు వద్ద వంతెన నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. తద్వారా అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, గుంటూరు వరకు, మరోవైపు జగ్గయ్యపేటకు రవాణా వసతి మెరుగు పడనుంది.కొండమోడు–పేరేచర్ల, సాగర్– దావుపల్లి, మాచర్ల– దాచేపల్లి, నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు.. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి గొడవలు చేయిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. వృద్ధుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై టీడీపీ ఏజెంట్లు దాడికి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై రాళ్లతో దాడి చేశారు. అదే గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై కూడా దాడి చేసి.. వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డకున్న వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. -
సీఎం జగన్ సిద్ధం సభ..డ్రైవర్ గా మారిన ఎమ్మెల్యే పిన్నెల్లి
-
15 లక్షల మందితో సిద్ధం సభ: అనిల్కుమార్ యాదవ్
-
వైఎస్సార్ సీపీలో భారీగా చేరికలు
-
బతుకమ్మ ఊరేగింపులో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు
-
హంతకులు ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
-
కునిరెడ్డి కృష్ణారెడ్డి హత్యపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దిగ్భ్రాంతి
సాక్షి, పల్నాడు: కునిరెడ్డి కృష్ణారెడ్డి హత్య దిగ్భ్రాంతి కలిగించిందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నా వదిలేది లేదని చెప్పారు. హత్యకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు. అమాయకుడిని పొట్టనపెట్టుకున్నారని దుయ్యబట్టారు. 'చాలా కిరాతకంగా కృష్ణారెడ్డిని హత్య చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడి జైలులో ఉన్నారు. టీడీపీ నేతలకు ఏం చేయాలో తెలియక ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారు. సీఎం జగన్ దృష్టికి ఈ విషయం తీసుకెళతాం. కృష్ణారెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.' అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ‘భర్త అవినీతి చేయలేదని భువనేశ్వరి ప్రమాణం చేస్తారా?’ -
దళితుల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు : ఆదిమూలపు, పిన్నెల్లి
-
‘అందుకే కోటంరెడ్డిని అడ్డం పెట్టుకుని డైవర్ట్ పాలిటిక్స్’
సాక్షి, పల్నాడు జిల్లా: ప్రజలు టీడీపీని నమ్మే పరిస్థితి లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మాచర్లలో రూ.480 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సురేష్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఆదిమూలపు మీడియాతో మాట్లాడుతూ, ‘‘కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చంద్రబాబును కలవలేదా?. కోటంరెడ్డి అడ్డంగా దొరికిపోయి ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నాడు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని కోటంరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అతను చూపించే విశ్వాసం ఇదేనా?’’ అంటూ దుయ్యబట్టారు. లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్: ఎమ్మెల్యే పిన్నెల్లి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ‘‘లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయింది. అందుకే చంద్రబాబు.. శ్రీధర్రెడ్డిని అడ్డం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ అంటూ డైవర్ట్ పాలిటిక్స్కు పాల్పడుతున్నాడు. శ్రీధర్ రెడ్డి దమ్ముంటే 51 సెకండ్ల ఆడియోను బయట పెట్టాలి. చంద్రబాబుతో కుమ్మక్కై అడ్డంగా దొరికిపోయి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి ఇలా ఎంతమంది పోయిన పార్టీకి నష్టం లేదు. పార్టీలో ఇలాంటి కోవర్టులు ఉంటే సీఎం జగన్ కచ్చితంగా బయటికి పంపుతారు’’ అని పిన్నెల్లి అన్నారు. చదవండి: కోటంరెడ్డికి మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్ -
Macherla Constituency: టీడీపీకి దిక్కేది.. జూలకంటి జాడేది!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మాచర్ల నియోజకవర్గంలో జూలకంటి కుటుంబానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. 55 ఏళ్లుగా ఆ కుటుంబం ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడుతూ మధ్యలో టికెట్టు దక్కక విరామం తీసుకుంటూ కొనసాగుతోంది. ఇండిపెండెంట్గా, కాంగ్రెస్, టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపు ఓటములను చవిచూడటమూ ఆ కుటుంబ పోటీదారులకు రివాజే. దాదాపు దశాబ్దం పాటు మౌనం వహించిన జూలకంటి పేరు తాజాగా పల్నాడులో వినిపిస్తోంది. వాడుకుని వదిలేయడంలో బాబు దిట్ట తన వ్యక్తిగతంతోపాటు పార్టీ అవసరాలకు సమయానుకూలంగా ఎవరినైనా వాడుకుని పక్కకు విసిరిపారేయడంలో అందెవేసిన నేతగా ప్రత్యేక గుర్తింపున్న చంద్రబాబునాయుడు తాజాగా జూలకంటిని వాడేసుకుంటూ ఫ్యాక్షన్ రాజకీయాలకు పాలుపోస్తున్నారనే మాట పల్నాడులోని ప్రతినోటా వినిపిస్తున్నదే. రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్న వారెవరైనా చర్చిస్తున్న తాజా అంశమిదే. అధికార, ప్రతిపక్షాలు ఏవైనా ప్రాంతాల అభివృద్ధిలో పోటీపడాలే తప్ప ప్రజల్లో అశాంతిని రేకెత్తించే కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వడంలో ఔచిత్యమేంటని ప్రశ్నిస్తున్నారు. పాలకపక్ష నాయకుల తప్పులుంటే ఎత్తిచూపడంలో తప్పులేదని, ప్రశాంతతతో పాటు వేగంగా ప్రగతిబాట పడుతున్న పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు పడగవిప్పేలా చేస్తున్న వారెవరినీ క్షమించకూడదని పార్టీల రహితంగా ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత తీరును, జూలకంటి కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని గుర్తుచేస్తున్నారు. మొత్తంమీద ఏడుసార్లు జూలకంటి కుటుంబం ఎన్నికల్లో తలపడగా 1972, 1983, 1999లలో విజయం సాధించడం పరిశీలనాంశం. n జూలకంటి నాగిరెడ్డి 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాచర్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్పతేడాతో ఓటమి చెందారు. 1972లో అదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1978లో రంగంలోకి దిగి మూడో స్థానంలో నిలిచారు. 1983లో గురజాల స్థానం నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. నాగిరెడ్డి భార్య దుర్గాంబ 1999లో మాచర్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి పిన్నెల్లి లక్ష్మారెడ్డి(కాంగ్రెస్)పై విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూలకంటి కుటుంబాన్ని ఓటర్లు ఆదరించలేదు. 2004 నుంచి ఓటమెరుగని పిన్నెల్లి కుటుంబీకులు మాచర్ల నియోజకవర్గం నుంచి పిన్నెల్లి కుటుంబం తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తోంది. 1994 ఎన్నికల్లో మాత్రం పిన్నెల్లి సుందరరామిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2004లో లక్ష్మారెడ్డి గెలుపొందగా ఆయన వారసునిగా శాసనసభ అభ్యర్థిగా రంగంలోకి దిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2009, 2012 (బై ఎలక్షన్), 2014, 2019లలో వరుసగా విజయాలు సాధించారు. ఏడుగురి హత్యకేసుతోపాటు వివిధ కేసుల్లో చిక్కుకున్న జూలకంటి బ్రహ్మానందరెడ్డి (బ్రహ్మారెడ్డి) 2004, 2009 ఎన్నికల్లో లక్ష్మారెడ్డి, రామకృష్ణారెడ్డిల చేతుల్లో ఓటమి చవిచూశారు. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు టికెట్టు ఇవ్వకపోగా దూరంగా పెట్టడంతో బ్రహ్మారెడ్డి మౌనం దాల్చక తప్పలేదు. చివరికి నీవే శరణం అన్నట్టు.. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి దిక్కూమొక్కూ లేకుండా పోయిన దశలో చంద్రబాబునాయుడు కొన్ని నెలల కిందట జూలకంటిని రంగంలోకి దించారు. పరస్పర అవసరాల ప్రాతిపదికన రాజకీయ రచ్చకు ప్రాధాన్యమిస్తూ ఫ్యాక్షన్ కు ప్రాణం పోస్తున్నారనేది పరిశీలకుల విశ్లేషణ. అభివృద్ధి కోణంలో పల్నాడులో మరే ప్రాంతాలకు తీసిపోని రీతిలో వేగంగా అడుగులు పడుతున్నాయని ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని పలుసార్లు బహిరంగంగా పిలుపునిచ్చినా టీడీపీ నుంచి కనీస స్పందన కరవైందని పాలకపక్ష ప్రజాప్రతినిధులు గుర్తుచేస్తున్నారు. టీడీపీ హింసా రాజకీయాలకు ప్రాధాన్యమిస్తోందంటూ... గతంలో నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ బాంబులతో రాజకీయాలు నడిపారని, గురజాలలో అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ఇప్పుడేమో మాచర్లలో ఫ్యాక్షన్ కు ఊతమిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ తరహా రాజకీయాలకు చంద్రబాబు ఫుల్స్టాప్ పెడితే మంచిదని హితపు పలుకుతున్నారు. 2004 నుంచి గెలుపే లేని టీడీపీ టీడీపీ ఆవిర్భావం తర్వాత మాచర్ల నియోజకవర్గంలో మొత్తం పది సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా కేవలం నాలుగు సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. మూడుసార్లు కాంగ్రెస్, మూడుసార్లు వైఎస్సార్ సీపీ గెలుపొందాయి. 2012 నుంచి వైఎస్సార్ సీపీ తరఫున పీఆర్కే జయకేతనం ఎగురవేస్తుండడం విశేషం. టీడీపీ నుంచి 1983లో కొర్రపాటి సుబ్బారావు, 1989లో నిమ్మగడ్డ శివరామ కృష్ణప్రసాద్, 1994లో కుర్రి పున్నారెడ్డి, 1999లో జూలకంటి దుర్గాంబ గెలిచారు. కాంగ్రెస్ నుంచి 1995లో నత్తువ కృష్ణమూర్తి, 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి, 2009లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) గెలిచారు. వైఎస్సార్ సీపీ నుంచి 2012, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పీఆర్కే విజయ పరంపర కొనసాగించారు. (క్లిక్ చేయండి: టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్.. ఇదేం కర్మరా బాబు?) -
మాచర్ల అల్లర్లకు చంద్రబాబే కారణం
నరసరావుపేట: మాచర్ల అల్లర్లకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడే కారణమని ప్రభుత్వ విప్, వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.నరసరావుపేటలోని జీబీఆర్ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను పిన్నెల్లి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం వేర్వేరుగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పిన్నెల్లి మీడియాతో మాట్లాడుతూ.. బీసీలంటే టీడీపీకి అక్కసు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు కొంత కాలంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ కార్యకర్తలను రెచ్చగొడుతుండటం దారుణం అన్నారు. ఇందులో భాగంగా నెలవారి మామూళ్లతో బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని నియమించారన్నారు. ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని నిలదీసిన స్థానికులను కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేయడమేమిటని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారన్నారు. ఇందుకు బదులుగా వారు కర్రలు, బండరాళ్లతో దాడి చేసి, ముగ్గురు బీసీలను చంపే ప్రయత్నం చేశారన్నారు. ఈ విషయంలో పచ్చ మీడియా దుష్ప్రచారం దారుణం అని మండిపడ్డారు. వారు తప్పు చేయకపోతే గొడవ జరిగిన గంటలోనే మాచర్ల వదిలి ఎందుకు పరారయ్యారని ప్రశ్నించారు. యరపతినేని శ్రీనివాసరావు బండారం మొత్తం అందరికీ తెలుసని, అందుకే ప్రజలు మూడుసార్లు ఓడించారని.. ప్రజాభిమానంతో తాను ఐదుసార్లు గెలిచానన్నారు. యరపతినేని ఉడుత ఊపులకు ఇక్కడ భయపడేవారెవరూ లేరని స్పష్టం చేశారు. బాబు పంపించిన పేటీఎం (జూలకంటి బ్రహ్మారెడ్డి) వ్యక్తిని చూసి తాము భయపడే ప్రసక్తే లేదని, ఆయన 2009లోనే తమపై ఓడిపోయాడనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఓర్వలేకే గొడవల సృష్టి : ఎంపీ లావు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పరిపాలన సాగుతుంటే, ఓర్వలేకే ప్రతిపక్షం గొడవలు సృష్టిస్తోందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. మాచర్లలో గత 15 ఏళ్లుగా గొడవలు లేవని చెప్పారు. రెచ్చగొట్టే రాజకీయాలు వల్ల కార్యకర్తలు, వారి కుటుంబాలు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎక్కడా, ఎప్పుడూ రెచ్చగొట్టే రాజకీయాలు చేయలేదని తెలిపారు. మాచర్లలో ప్రస్తుతం ప్రశాంతత నెలకొందని, ఇకపై ఇలాంటి ఘటనలను ఉపేక్షించవద్దని అధికారులకు సూచించామన్నారు. మీడియా కూడా రెచ్చగొట్టే ప్రచారం చేయకూడదని విజ్ఞప్తి చేశారు. -
టీడీపీ ఉడత ఊపులకు భయపడం: ఎమ్మెల్యే పిన్నెల్లి
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో వార్డు మహిళలు నిలదీశారనే అక్కసుతోనే మాపై దాడి చేసి చంపాలని చూశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. నెలవారీ ముమూళ్లు ఇచ్చి బ్రహ్మారెడ్డిని ఇంఛార్జిగా పెట్టారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి రాదని తెలిసే మాపై దాడులు చేస్తున్నారన్నారు. ‘‘యరపతినేని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే పిన్నెల్లి హెచ్చరించారు. ‘‘ఇక్కడ ఉడత ఊపులకు భయపడేవారు ఎవరూలేరు. టీడీపీ నాయకులు దమ్ముంటే డైరెక్ట్గా రండి.. ఏ డిబేట్కైన సిద్ధం’’ అంటూ రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చదవండి: మాచర్ల స్కెచ్ చంద్రబాబుదే... -
మాచర్ల స్కెచ్ చంద్రబాబుదే...
నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్లలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, వైఎస్సార్సీపీ ప్రభుత్వ విప్గా వ్యవహరిస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిని హత్య చేసి.. అడ్డు తొలగించడం ద్వారా ఆ నియోజకవర్గంలో పాగా వేయాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. అయితే ప్రజాబలం ఉన్న పిన్నెల్లిని బాబు వీసమెత్తు కూడా కదిలించలేరని స్పష్టంచేశారు. శుక్రవారం రాత్రి మాచర్లలో జరిగిన ఘర్షణలో గాయపడి, నరసరావుపేట పట్టణంలోని జీబీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీసీ వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు మోహన్రావు, వీరయ్య, శ్రీనివాసరావులను శనివారం ఆయన ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డితో కలిసి పరామర్శించారు. వైద్యులను అడిగి వారి పరిస్థితి తెలుసుకున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. అనంతరం మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ పిన్నెల్లి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఏం చేయాలో తెలియక హత్యా రాజకీయాలకు తెరలేపారన్నారు. కొంతకాలంగా ‘కోపం రాదా తమ్ముళ్లూ మీకు..’ లాంటి చంద్రబాబు ఉపన్యాసాలు పరిశీలిస్తే అతను వారి నాయకులను రెచ్చగొడుతున్నారని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన బ్రహ్మారెడ్డిని టీడీపీ ఇన్చార్జిగా నియమించడం ద్వారా చంద్రబాబు, లోకేశ్లు మాచర్లలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందులో భాగమే ఈ సంఘటన అని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పల్నాడులో చంద్రబాబు పాచికలు పారవని స్పష్టం చేశారు. రాళ్లు, కర్రలతో ఎందుకొచ్చారు? పిన్నెల్లి సోదరులను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, వీటికి భయపడేది లేదని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. ఇదేం ఖర్మ కార్యక్రమం చేపట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలు.. రాళ్లు, కర్రలు ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలని నిలదీశారు. ‘ఇరవై కేసులు లేకపోతే టీడీపీ నాయకులు కాలేరు’ అని చంద్రబాబు, లోకేశ్ చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకుడు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. -
ప్లాన్ ప్రకారం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు: ఎమ్మెల్యే పిన్నెల్లి
-
‘ఫ్యాక్షనిస్టు బ్రహ్మారెడ్డి ద్వారా కుట్రలు చేస్తున్న బాబు’
పల్నాడు జిల్లా: మాచర్ల భగ్గుమనడానికి కారణం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్లే కారణమని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో పిన్నెల్లి మాట్లాడుతూ.. ప్లాన్ ప్రకారం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడికి పాల్పడిందన్నారు. ‘మాచర్ల భగ్గుమనడానికి కారణం చంద్రబాబు, లోకేష్. ఫ్యాక్షనిస్టు బ్రహ్మారెడ్డి ద్వారా బాబు కుట్రలు చేస్తున్నాడు. కర్రలు, రాడ్లు ర్యాలీలో ఎక్కడ నుంచి వచ్చాయి. గొడవకు కారణమైన బాధ్యలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు, లోకేష్ కలిసి ఆడుతున్న నాటకమిది. బ్రహ్మారెడ్డి ఉండే ఇంటిని టీడీపీ కార్యకర్తలే తగులబెట్టారు. ప్రజల్లో సానుభూతి కోసం చంద్రబాబు కుట్రలు. మాచర్లలో టీడీపీకి పార్టీ కార్యాలయమే లేదు’ అని అన్నారు. చదవండి: టీడీపీ రౌడీల స్వైర విహారం మాచర్ల ఘటన: నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు: డీజీపీ -
వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షునిగా పిన్నెల్లి
సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షునిగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ప్రస్తుతం కూడా ఆయనే జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలుగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకరరెడ్డి వ్యవహరిస్తారు. చదవండి: (వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..) -
‘ఇలాంటివి చేస్తే ఆ 23 సీట్లు కూడా రావు’
తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్లు పల్నాడులో ఏదో చేయాలని నిప్పు రాజేస్తున్నరని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పల్నాడు వచ్చి లోకేస్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, లోకేష్ పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటే ఒక జోకర్లా కనిపించాడన్నాడని పిన్నెల్లి విమర్శించారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పిన్నెల్లి.. పల్నాడులో తండ్రీ కొడుకులు ఏదో చెయ్యాలని నిప్పు రాజేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘లోకేష్కు శుభకార్యానికి, పరామర్శకి తేడా తెలియదు.పల్నాడు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నిన్న లోకేష్ ముఖంలో నిరాశ, నిస్పృహ కన్పిస్తున్నాయి. జల్లయ్య గురించి నీకు తెలుసా...ఆయనపై మీ ప్రభుత్వంలోనే 10 కేసులు ఉన్నాయి.నిన్నటి దాకా నువ్వు ఇక్కడ లేవు...అసలు బ్రహ్మారెడ్డి గురించి నీకు తెలుసా?, నువ్వెక్కడో స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నావు.బ్రహ్మా రెడ్డి తల్లి ఎమ్మెల్యేగా ఉన్నపుడు వాళ్ళ సొంత గ్రామంలో 13 హత్యలు జరిగాయి. 7 మందిని చంపిన కేసులో A1 ముద్దాయి బ్రహ్మా రెడ్డి. ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వు పల్నాడు వచ్చి ఫ్యాక్షన్ రెచ్చగొట్టాలి అనుకుంటున్నావా?, ఇలాంటివి చేస్తే ఆ 23 సీట్లు కూడా రావు’ అని పిన్నెల్లి హెచ్చరించారు. -
చంద్రబాబు శవ రాజకీయాలు
మాచర్ల: రాష్ట్రంలో అధోగతి పాలైన టీడీపీని కాపాడుకునేందుకే ప్రతి చిన్న ఘటనను భూతద్దంలో చూపిస్తూ చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం మాచర్లలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ప్రజలు టీడీపీని ఓడించారన్న కక్షతో చంద్రబాబు హత్యలు, అల్లర్లు సృష్టించే వారిని చేరదీసి మద్దతు పలుకుతున్నారన్నారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోనసీమ, రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో చంద్రబాబు మత, ప్రాంతీయ, కులాల మధ్య వివాదాలు సృష్టిస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. గుండ్లపాడు, జంగమహేశ్వరపాడు ఘటనలతో తనకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అనేక సంవత్సరాలుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న జూలకంటి బ్రహ్మారెడ్డిని టీడీపీ ఇన్చార్జిగా నియమించినప్పటి నుంచే ఆయా గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. అలజడులు సృష్టించి, గొడవలు చేసి, హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దొంగతనాలు చేసిన వారిని ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తూ ప్రతి చిన్న ఘటనను భూతద్దంలో చంద్రబాబు చూపుతున్నారన్నారు. టీడీపీ హయాంలోనే ఫ్యాక్షనిజం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పల్నాడులో అనేక గ్రామాల్లో ఫ్యాక్షనిజం పెరిగిందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడులో అభివృద్ధి పనులు జరిగాయని, ఫ్యాక్షన్ రాజకీయాలు ఆగిపోయాయని గుర్తు చేశారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తిరిగి అరాచకాలు పెరిగాయన్నారు. అందులో భాగంగానే టీడీపీ నాయకుడు కంచర్ల జాలయ్య వైఎస్సార్ సీపీకి చెందిన గుడిపాటి వెంకట్రామయ్యను హత్య చేశారన్నారు. అయినా ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దని నచ్చజెప్పి అదే కేసులో మొదటి ముద్దాయి అయిన కంచర్ల జాలయ్యను, పార్టీకి చెందిన వారిని పిలిచి రాజీ చేశానన్నారు. అందుకు భిన్నంగా మాజీ సీఎం చంద్రబాబు, లోకేశ్ కలిసి మాచర్ల నియోజకవర్గంలో ఏడుగురి హత్య కేసులలో నిందితుడైన జూలకంటి బ్రహ్మారెడ్డిని టీడీపీ ఇన్చార్జిగా నియమించారని, అప్పటినుంచే నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. తానెప్పుడూ ఫ్యాక్షన్ రాజకీయాలు చేయలేదని, కక్షలతో రగులుతున్న వారి మధ్య రాజీ కుదిర్చి.. ప్రతి గ్రామంలో అభివృద్ధి చేయటానికి తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. ఏదో ఒక ఘటనను ఆధారం చేసుకొని పల్నాడు జిల్లాను అభివృద్ధికి దూరం చేసి ప్రజల మధ్య అపోహలు సృష్టిస్తూ ఓట్ల రాజకీయాలకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రక్తపాతం సృష్టించి ఇరువర్గాలను రెచ్చగొడుతున్నారని, రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘటనను పెద్దది చేసి చంద్రబాబు ఓట్లు సంపాదించాలనే కుటిల ప్రయత్నం చేస్తున్నారన్నారు. గుండ్లపాడు గ్రామంలో కూడా పాడె మోసి ఓట్ల కోసం చంద్రబాబు దిగజారారని పేర్కొన్నారు. ఇదంతా ప్రజలు గమనించాలని, అన్ని వర్గాలు సమన్వయంతో ఉండాలని, ఘర్షణలకు దూరంగా పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. -
పార్టీ అంటే నేను,నేను అంటే పార్టీ :పిన్నెల్లి
-
ఏ బాధ్యత అప్పగించినా పూర్తిస్థాయిలో పనిచేస్తా: పిన్నెల్లి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పార్టీ అంటే తమ పార్టీ అని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట తాను మొదటి నుంచీ నడిచిన వ్యక్తినని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం సీఎం వైఎస్జగన్తో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్లో సామాజిక సమీకరణలో భాగంగా సీఎం జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు భాగస్వామ్యం కల్పించారని తెలిపారు. అందువల్ల సీనియర్లకు అవకాశం రాలేదని చెప్పారు. తమ టార్గెట్ 2024 ఎన్నికలు అని, దానికోసం ఏ బాధ్యత ఇచ్చినా పూర్తిస్థాయిలో పని చేస్తానని ఎమ్మెల్యే పిన్నెల్లి తెలిపారు. పార్టీ కోసం దేనికైనా సిద్ధమని, తనకు ఏ హామీ ఇవ్వలేదని తెలిపారు. హామీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తనకు బీ ఫామ్ ఇవ్వబట్టే ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తుచేశారు. ఆయన ఏమి చేసినా పార్టీ మంచి కోసమే చేస్తారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఎవరికీ అన్యాయం చేయరని, అందరూ పార్టీ కోసం పని చేయాల్సిందేని చెప్పారు. అంతకు ముందు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంత్రి పెద్దిరెడ్డిని కలిశారు. ఈ క్రమంలో మంత్రి పదవి రాలేదని తనకు ఎలాంటి అసంతృప్తి లేదని తెలిపారు. పార్టీనే మాది.. అసంతృప్తి ఎక్కడుంటుందని వ్యాఖ్యానించారు. చదవండి: జగన్ సీఎం కంటే నాకేదీ ముఖ్యం కాదు: ఎమ్మెల్యే రాచమల్లు -
సీఎం వైఎస్ జగన్ ను కలవనున్న పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
-
పచ్చని పల్నాడులో చిచ్చు పెడుతున్నారు
వెల్దుర్తి (మాచర్ల): పచ్చని పల్నాడులో చిచ్చు పెట్టడానికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చారని మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే), వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహించదని తెలిపారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాల్సిన అవసరం పిన్నెల్లి కుటుంబానికి లేదని స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రయ్య హత్య బాధాకరమని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ హత్యపై పోలీసులు పూర్తిగా విచారించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హత్యా రాజకీయాలకు దూరంగా ఉండటంవల్లనే తమ కుటుంబాన్ని వరుసగా ఐదుసార్లు ఇక్కడి ప్రజలు గెలిపించారని చెప్పారు. గత 15 సంవత్సరాల్లో పల్నాడులో హత్యలు జరగలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఎటువంటి గొడవలు లేవని తెలిపారు. ఇన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న పల్నాడుకు ఫ్యాక్షన్ ముద్ర ఉన్న నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డిని తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించటం వల్లే మళ్లీ ఫ్యాక్షన్ మొదలవుతోందని చెప్పారు. గతంలో ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే బ్రహ్మారెడ్డి తల్లి దుర్గాంబ మాచర్ల ఎమ్మెల్యేగా చేసిన సమయంలోనే అనేక ఫ్యాక్షన్ హత్యలు జరిగినట్లు తెలిపారు. బ్రహ్మారెడ్డి 15 హత్యలు చేయించాడన్నారు. చంద్రయ్య హత్య ఎందుకు జరిగిందో చంద్రబాబు తెలుసుకొని మాట్లాడాలన్నారు. దీనిని రాజకీయ హత్యగా చూపుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీతో సంబంధం లేని సంఘటనలను కూడా రాజకీయంగా వాడుకోవాలని టీడీపీ చూస్తోందని విమర్శించారు. ఇలాంటి నీచ రాజకీయాలు చంద్రబాబుకు మామూలేనని, ప్రభుత్వం మీద, సీఎం జగన్ పైన నిత్యం అసత్యాలు ప్రచారం చేయటం పరిపాటిగా మారిందని అన్నారు. పక్క నియోజకవర్గాల నుంచి నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీసుకొచ్చి బెదిరించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎవరు ఎలాంటి వ్యక్తులో ఎవరి హయాంలో గొడవలు జరుగుతున్నాయో పల్నాడు ప్రజలకు తెలుసునని అన్నారు. గుండ్లపాడు చాలా సున్నితమైన గ్రామమని, గతంలోనూ హత్యలు జరిగాయని, ఇప్పుడు ఏమీ ఎన్నికలు లేని సమయంలో హత్యలెందుకు జరుగుతాయని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రం ముందుకెళ్తుంటే సహించలేని చంద్రబాబు ఈ హత్యను వైఎస్సార్సీపీ మీద రుద్దాలని చూస్తున్నారన్నారు. -
కారు ప్రమాదంలో ఎమ్మెల్యే బంధువులు దుర్మరణం
మాచర్ల రూరల్: కారు అదుపుతప్పి సాగర్ కుడి కాలువలో పడిన ఘటనలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయి కుమారుడు మదన్మోహన్రెడ్డి భార్య లావణ్య (30), కుమార్తె సుదీక్షిత (9) కన్నుమూశారు. మంగళవారం రాత్రి మదన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు సాగర్ కుడి కాలువలో పడిపోయిన విషయం తెలిసిందే. అడిగొప్పల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే సమయంలో కారు కాలువలో పడింది. మదనమోహన్రెడ్డిని స్థానికులు కాపాడారు. ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. గజ ఈతగాళ్లు కాలువలో గాలించారు. ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో కారును గుర్తించారు. కారులోనే ఉన్న లావణ్య, సుదీక్షిత అప్పటికే విగతజీవులుగా మారారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. -
సాగర్లోకి దూసుకెళ్లిన కారు.. కారులో ఎమ్మెల్యే బంధువులు
మాచర్ల: గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల వద్ద మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ కుమారుడు ప్రయాణిస్తున్న కారు మంగళవారం రాత్రి అదుపుతప్పి సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు సురక్షితంగా బయటపడగా.. ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చేపట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ సుందరరామిరెడ్డి కుమారుడు మదనమోహన్రెడ్డి తన భార్య, కుమార్తెతో కలిసి గుంటూరు వెళ్లారు. తిరిగి మాచర్ల వస్తుండగా కారు అదుపు తప్పి కుడికాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు కారు అద్దాలు పగులగొట్టి మదన్మోహన్రెడ్డిని కాపాడారు. కారులో ఉన్న ఆయన భార్య, కుమార్తె ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గజఈతగాళ్లతో గాలింపు చేయిస్తున్నారు. సంఘటనపై విచారణ చేపట్టారు. -
టీడీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు అంటే అందరికీ గౌరవమేనని, గుంటూరు జిల్లా దుర్గిలో ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన ఘటన చాలా దురదృష్టకరమని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై సోమవారం ఆయన స్పందిస్తూ.. జరిగిన ఘటనను వైఎస్సార్సీపీ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనను టీడీపీ రాజకీయంగా వాడుకోవడానికి చూస్తోందని, ఆ పార్టీ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని కోరారు. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్సార్, ఎన్టీఆర్ లాంటి వారు రాష్ట్రాన్ని పరిపాలించిన గొప్ప వ్యక్తులని కొనియాడారు. వారి గౌరవార్థం విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెట్టుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, ఆయన చావుకు కారణమైన చంద్రబాబు ఈ చిన్న ఘటనను రాజకీయంగా వాడుకోవాలని చూడటం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. ఈ ఘటనకు, వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. నిందితుడిని అతని తండ్రే పోలీసులకు అప్పగించారని, పోలీసులు కూడా వెంటనే కేసు నమోదు చేశారని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ విగ్రహాలను తీసి పక్కన పడేసిన సందర్భాలు ఎన్నోచూశామని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం పాటుబడ్డ నాయకుడిగా ఎన్టీఆర్ను తాము గుర్తించి, గౌరవిస్తామని.. అయితే 1995లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసిన చంద్రబాబే ఆయన నాయకత్వాన్ని గుర్తించలేదన్నారు. -
లోకేష్ నోరు అదుపులో పెట్టుకో: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
సాక్షి, గుంటూరు: అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. ఈ మేరకు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్ పాలనలో పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. అవినీతికి తావులేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇది ఓర్చుకోలేక టీడీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి. వార్డు మెంబర్గా కూడా లోకేష్ గెలవలేరు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు' అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పల్నాడు ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల రూపురేఖలు మారుతున్నాయి. రాబోయే కాలంలో పల్నాడు వెనుకబడిన ప్రాంతంగా ఉండదు. అభివృద్ధి చూసి ఓర్వలేక టీడీపీ కుటిల రాజకీయాలు చేస్తోంది. పల్నాడుకు టీడీపీ చేసిందేమీలేదు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడమే టీడీపీకి తెలుసు అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. చదవండి: (‘ఆ ప్రశ్నకు టీడీపీ నుంచి ఇంతవరకు సమాధానమే లేదు’) -
మీ గూండాగిరీ.. ఇక్కడ చెల్లదు
మాచర్ల: ‘నేను ఛాలెంజ్ చేస్తున్నా. మా దగ్గరికి వచ్చి గూండాయిజం చేస్తామంటే కుదరదు. పల్నాడు ప్రాంతంలో హుందాతనంతో కూడిన రాజకీయాలు చేయడం అలవాటు. ఏదో షో చేసి మీడియా ముందు మాట్లాడటం కాదు. మీకు చేతనైతే మాచర్లకు రండి... లేదా నేనే విజయవాడ వస్తా’’ అంటూ ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన బుధవారం మాచర్లలో విలేకరులతో మట్లాడారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, వారి అనుచరులు పది కార్లలో మాచర్లకు తరలివచ్చారని, దివ్యాంగుడిపై కారు వేగంగా వెళ్లటంతో అక్కడ స్థానికులు వారిపై దాడి చేశారని పేర్కొన్నారు. ఈ దాడిని అడ్డం పెట్టుకొని తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తే ఊరుకునే పరిస్థితి లేదన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే.. - విజయవాడలో గల్లీ రాజకీయాలు చేసే బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు పది కార్లు వేసుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి? - ప్రతిదీ రాజకీయం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి అలజడి సృష్టించాల్సిన అవసరం ఏమిటో చెప్పాలి. ఈ ప్రాంతానికి సంబంధం లేని వారు ఇక్కడ గొడవలు చేయాల్సిన పని ఏమిటి? మీ గూండాగిరీ పల్నాడులో చెల్లదు. - ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నన్ను టార్గెట్ చేశారు. కొన్ని రోజుల క్రితం రాజధాని అమరావతి వద్ద నాపై దాడి చేయించారు. - టీడీపీ తరఫున నామినేషన్లు వేసేవారు లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డం పెట్టుకొని గల్లీ గూండాలు నాటకాలకు తెరతీశారు. - మా పార్టీ శ్రేణులపై దాడులు చేయడానికి బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు వచ్చి కారు నడిపి ఒక దివ్యాంగుడిని గాయపరచడం వల్లే ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో వారిపై దాడి చేశారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు నానా హంగామా చేసి ప్రజలను రెచ్చగొట్టారు. -
ఉమా నువ్వొస్తావా? నన్ను రమ్మంటావా?
సాక్షి, గుంటూరు : టీడీపీ నేత బోండా ఉమా సవాల్పై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీటుగా స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ.. ‘పల్నాడు ప్రజలను బెదిరిస్తే బెదిరిపోయే వాళ్లు కాదని బోండా ఉమా తెలుసుకోవాలి. విజయవాడ గల్లీలో రౌడీయిజం చేసినట్లు పల్నాడులో చేస్తామంటే కుదరదు. మాచర్ల మళ్లీ వస్తానని సవాల్ చేయడం కాదు, దమ్ముంటే రావాలి. లేదా నన్ను విజయవాడ రమ్మన్నా వస్తా. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నేను భయపడలేదు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తే సహించేది లేదు. ఈ విషయంలో ఎక్కడదాకా వెళ్లడానికి అయినా నేను సిద్ధంగా ఉంటా. ఎవరినీ ఉపేక్షించేది లేదు’ అని స్పష్టం చేశారు. (కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారు : పిన్నెల్లి) గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడు గ్రామంలో జరిగిన చిన్న గొడవను పెద్దది చేసి హంగామా సృష్టించేందుకు విజయవాడ నుంచి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మరికొందరిని చంద్రబాబు అక్కడికి పంపించినట్లు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. (బోండా ఉమా, బుద్దా వెంకన్నకు మాచర్లలో ఏంటి పని?) కాగా బోదిలవీడులో రెండు వర్గాల కొద్దిరోజులుగా గొడవలు జరుగుతుండగా, టీడీపీ నేతలు సోమవారం రాత్రి వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేశారు. దానిపై మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించడంతో నామినేషన్లు వేసే సమయంలో గొడవ జరిగింది. దాన్ని మరింత పెద్దది చేసే ఉద్ధేశంతో విజయవాడ నుంచి నాయకులు, కార్యకర్తలను బుధవారం బోదిలవీడుకు పంపి ఉద్రిక్తత సృష్టించాలని చూడగా మార్గమధ్యలో మాచర్ల వద్దే స్థానికంగా జరిగిన ప్రమాదంతో ఘర్షణ జరిగింది. (స్థానిక ఎన్నికల్లో నీ సత్తా చూపించు !) -
కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారు : పిన్నెల్లి
సాక్షి, గుంటూరు(మాచర్ల): పల్నాడులో ప్రశాంత పరిస్థితులను చెడగొట్టేందుకు టీడీపీ యత్నిస్తోందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడ నుంచి 10 కార్లలో టీడీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నతో పాటు మరికొందరు గూండాలను చంద్రబాబు పంపించారన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ.. మాచర్లలో దూసుకొచ్చిన టీడీపీ వాహనాల్లో ఒకటి ఓ పిల్లాడికి తగిలిందని, దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని తెలిపారు. వారిని సముదాయించాల్సింది పోయి బోండా సహా ఇతర టీడీపీ నాయకులు దుర్భాషలాడారని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే టీడీపీ పథకమని, అందులో భాగంగానే పది కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారని తెలిపారు. ప్రజాబలం లేని చంద్రబాబు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, ఆ ఘటనలను తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అన్నారు. ఇదే పల్నాడులో 2014 స్థానిక ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు అంబటి రాంబాబు, ముస్తాఫాలపై దాడులు చేసి చంపడానికి యత్నించారని గుర్తు చేశారు. మొన్నటికి మొన్న రైతుల ముసుగులో తనను హత్య చేయడానికి ప్రయత్నించారని, అయినా తాము సంయమనంతో వ్యవహరించామని తెలిపారు. -
స్థానిక ఎన్నికల్లో నీ సత్తా చూపించు !
సాక్షి, మాచర్ల: ‘దమ్ముంటే స్థానిక ఎన్నికల్లో నీ సత్తా చూపించు.. 29 గ్రామాలకు పరిమితమైన నువ్వా మమ్మల్ని రౌడీలని మాట్లాడేది.. మాకు నిజాయితీ ఉంది కాబట్టి నోరు ఉంది.. నీలాగా గుంట నక్క జిత్తులు మాకు తెలియవు.. ఫేస్ టు ఫేస్ మాట్లాడటమే తెలుసు..త్వరలో జరగబోయే లోకల్ ఎన్నికలకు అసలు అభ్యర్థులున్నారో వెతుక్కో మాజీ సీఎం చంద్రబాబు’ అంటూ జలవనరుల శాఖ రాష్ట్ర మంత్రి అనిల్కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. మాచర్ల నియోజకవర్గ మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వేలాది మందిని ఉద్దేశించి ఉద్రేకపూరితంగా మాట్లాడారు. బీసీలకు అన్యాయం చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. కోర్టులకు తన అనుచరులను పంపించి కేసులు వాయిదా వేయించే ప్రయత్నం ఎందుకని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కేసుల పేరుతో స్థానిక ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో తెలుసుకొని మాట్లాడాలని, నాలుగు అనుకూల మీడియా డబ్బాలను పెట్టుకొని రాజకీయాలు చేయటం మంచిది కాదని హితవు పలికారు. వెనుకబడిన పల్నాటి ప్రాంతానికి ఒక దశలోనే వరికపూడిసెలను రూ. 1630 కోట్లతో సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీకు మార్కెట్ యార్డులు, ఇతర పదవులలో 50% ఇచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదేనని మంత్రి అనిల్కుమార్ చెప్పారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గం మొత్తం సీఎం జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుందని, రాబోయే రోజుల్లో తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. స్థానిక ఎన్నికలు పూర్తయిన అనంతరం సీఎం జగన్మోహన్రెడ్డిని వరికపూడిసెలకు శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ రాçష్ట్ర ప్ర«ధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు కామనబోయిన కోటయ్య, బత్తుల ఏడుకొండలు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు యరబోతుల శ్రీనివాసరావు, మారం వెంకటేశ్వరరావు, తాడి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసశర్మ, కుర్రి సాయి మార్కొండారెడ్డి, పల్లపాటి గురుబ్రహ్మం పాల్గొన్నారు. మార్కెట్ యార్డు కార్యవర్గం ప్రమాణం నూతనంగా నియమించబడిన మార్కెట్ యార్డు చైర్మన్ పల్లపాటి నారాయణమ్మ, వైస్ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, డైరెక్టర్లు ఐనబోయిన శ్రీను, దుబ్బా సీమోను, బొనిగే సాగరమ్మ, జల్లా శాయమ్మ, కొత్త శ్రీనివాసరావు, దుర్గెంపూడి శివమ్మ, గుంజనబోయిన లింగమ్మ, మట్టపల్లి బ్రహ్మం, ఆరికట్ల మంగమ్మ, జవిశెట్టి అనసూర్య, గోగిరెడ్డి కేశవరెడ్డి, మాచర్ల పుల్లమ్మ, రెంటాల పున్నయ్యలతో మంత్రి అనిల్కుమార్, ఎమ్మెల్యే పీఆర్కే, మార్కెట్ యార్డు శాఖాధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. -
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పిన్నెల్లి పరామర్శ
సాక్షి, గుంటూరు: చలమల – శ్రీరాంపురం తండా మధ్య జరిగిన లారీ ప్రమాదంలో గాయపడి మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సోమవారం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలను కూడా పరామర్శించి.. వారిని ఓదార్చారు. తన సొంత నిధుల నుంచి రూ.50 వేలు, వైఎస్సార్ బీమా పథకం నుంచి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి తన నిధుల నుంచి పదివేలు ప్రకటించారు. ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని రామకృష్ణారెడ్డి తెలిపారు. (మృత్యు ఘోష) -
‘బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు’
సాక్షి, గుంటూరు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు బినామీలపై ఐటీ సోదాలు జరిగిన ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారని ప్రశ్నించారు. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో చంద్రబాబు ఆయన సన్నిహితుల అవినీతి బండారం బట్టబయలు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబు అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరగాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాజధానిలో టీడీపీ ప్రభుత్వం చేసిన వేల కోట్ల అవినీతిని కూడా బయటకు తీయాలి అని కోరారు. అక్రమాలు బయటకు రాకూడదనే చంద్రబాబు కృత్రిమ ఉద్యమం నడుపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు మద్దతిచ్చే పార్టీలు పునరాలోచన చేసుకోవాలని సూచించారు. అవినీతి పరుడికి ఎందుకు మద్దతు ఇస్తున్నారో ఆయా పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అవినీతి వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు మరొక అంశాన్ని చంద్రబాబు తెరమీదికి తెస్తారని.. అయితే అలాంటి జిమ్మిక్కులకు కాలం చెల్లిందని తెలిపారు. (చదవండి : రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్కు చంద్రబాబు పయనం!) నిప్పునంటూ బాబు డబ్బాలు కొట్టుకున్నారు : గోపిరెడ్డి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నిజాయితీపరుడయితే ఐటీ కేసుపై విచారణ ఎదుర్కోవాలని సవాలు విసిరారు. అవినీతి, అక్రమాలకు పాల్పడటం కోర్టుల నుంచి స్టే తెచ్చుకోవటం చంద్రబాబుకు అలవాటేనని గుర్తుచేశారు. బయట మాత్రం నిప్పునంటూ చంద్రబాబు డబ్బాలు కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిపై ఆయనకు మద్దతు ఇస్తున్న సీపీఐ, సీపీఎం, పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుపై విచారణ జరపాలని ఆ పార్టీలు కూడా డిమాండ్ చేయాలన్నారు. (చదవండి : మరో పచ్చ '420') ఓట్ల కొనుగోలుకు ఆద్యుడు చంద్రబాబు : కాసు మహేష్రెడ్డి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. 1994 నుంచే డబ్బుతో రాజకీయాలు చేసిన బాబు.. ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు ఆద్యుడు అని అన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లోనే రూ. 2 వేల కోట్లుంటే.. బాబు ఖాతాలో ఎంతుందో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. బాబు అవినీతిలో పవన్ కల్యాణ్కు కూడా భాగం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. అమరావతి స్కామ్పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. తాము చెప్పినట్టే చంద్రబాబు అవినీతి బయటపడుతుందని గుర్తుచేశారు. చంద్రబాబు అవినీతిపై సీబీఐ, ఈడీలతో లోతైన విచారణ జరిపించాలని కోరారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి బట్టబయలైందని తెలిపారు. నిప్పు అని చెప్పుకునే బాబు.. ఇప్పుడేం చేస్తారని ఎద్దేవా చేశారు. ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. బాబుకు ఐదేళ్లు టైమిస్తే రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిపై సీబీఐ, ఈడీ కూడా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.(చదవండి : చంద్రబాబు అవినీతి బట్టబయలు) -
పిన్నెల్లిపై దాడి కేసులో మరో నలుగురి అరెస్టు
సాక్షి, మంగళగిరి: ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి కేసులో మరో నలుగురు నిందితులను మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని గ్రామం వద్ద అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 7న జరిగిన జాతీయ రహదారి దిగ్బంధం, ఆందోళనలో భాగంగా ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు మంగళగిరి రూరల్ సీఐ శేషగిరిరావు తెలిపారు. ఇప్పటికే తాడికొండకు చెందిన ఉన్నం రామ్మోహన్రావు, చినకాకానికి చెందిన సోమారపు ప్రకాశరావును అరెస్ట్ చేశామన్నారు. తాజాగా శనివారం చినకాకానికి చెందిన కఠారి సాంబవెంకటప్రసాద్, పిడుగురాళ్లకు చెందిన షేక్ ఇంతియాజ్, తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన ఫణిదపు వెంకటసాయి, దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన పేరూరి సత్యనారాయణను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ముద్దాయిలకు కోర్టు రిమాండ్ విధించింది. చదవండి: ప్రభుత్వ విప్ పిన్నెల్లిపై హత్యాయత్నం పిన్నెల్లిపై హత్యాయత్నం; ఇద్దరి అరెస్టు -
పిన్నెల్లిపై హత్యాయత్నం; ఇద్దరి అరెస్టు
సాక్షి, గుంటూరు: ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఇద్దరిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఈ ఘటనపై గుంటూరు అర్బన్ పోలీసులు ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. అరెస్టు చేసిన ఇద్దరిలో ఒకరు తాడికొండకు చెందిన టీడీపీ నేత, మాజీ ఉప సర్పంచ్ కొమ్మినేని రాము కాగా, మరొకరు చినకాకానికి చెందిన లారీ డ్రైవర్ సోమవరపు ప్రకాశ్ అని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేపై హత్యాయత్నానికి పాల్పడిన వారందరూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. సుమారు 20 నుంచి 50 మంది టీడీపీ గూండాలు దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, గుంటూరు అర్బన్ జిల్లాలో సెక్షన్ 144, 30 పోలీసు యాక్ట్ అమలులో ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా మంగళవారం ఎన్హెచ్–16పై రాస్తారోకో నిర్వహించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రహదారిని నిర్బంధించిన వారిలో 35 మందిని పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. సంబంధిత వార్తలు.. రైతుల ముసుగులో టీడీపీ గూండాల దౌర్జన్యం దాడి చేసింది రైతులు కాదు.. టీడీపీ గూండాలే ఆ భయంతోనే బాబు దాడులు చేయిస్తున్నారు చంద్రబాబు భారీ మూల్యం చెల్లించక తప్పదు..! -
అమరావతి కోసం అంటూ తప్పుడు ప్రచారం..
సాక్షి, తాడేపల్లి: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై దాడి హేయనీయమని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం రైతులను రెచ్చగొడుతున్నారని ఎంపీ నందిగం సురేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..రాజధాని రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తారు. అమరావతి రైతులను ఎలా ఆదుకోవాలో ముఖ్యమంత్రికి తెలుసు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోరు. ప్రతి రైతును సీఎం జగన్ ఆదుకుంటారు. రాజధానిని నాశనం చేసింది బాబే... తాను దోచుకున్న డబ్బు బైటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు. తన ఆస్తుల కోసం ప్రతిపక్ష నేత ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. లక్ష కోట్లు ఒకేచోట పెడితే..మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి. ఆయన ఫ్యాక్షనిస్ట్లా వ్యవహరిస్తూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై దాడి చేయిస్తున్నారు. కర్నూలు, విశాఖలో రెండు రాజధానులు పెడితే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటి? జరిగిన దాడులు అల్లర్లలో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలి. జస్టిస్ శివరామకృష్ణన్ నివేదిక పట్టించుకోకుండా రాజధానిని నాశనం చేసింది చంద్రబాబే. ఆయన రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి నాయకుడిగా దిగజారిపోయారు. రాజధాని ఉద్యమంలో టీడీపీ గూండాలు, రౌడీలు పాల్గొని అల్లర్లు సృష్టిస్తున్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు ఈ అయిదేళ్లలో అమరావతిలో ఎందుకు ఒక్క శాశ్వత భవనాన్ని కూడా కట్టలేకపోయారు. రాజధానిలో ఎవరు చనిపోయినా అమరావతి కోసం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులపై దాడులు చేయించిన చంద్రబాబును అరెస్ట్ చేసి విచారణ జరపాలి’ అని డిమాండ్ చేశారు. చదవండి: ప్రభుత్వ విప్ పిన్నెల్లిపై హత్యాయత్నం దాడి చేసింది రైతులు కాదు..చంద్రబాబు గూండాలే.. వినాశకాలం.. అందుకే విపరీత బుద్ధి పక్కా పథకం ప్రకారమే పిన్నెల్లిపై హత్యాయత్నం 'చంద్రబాబు చరిత్ర హీనులవడం ఖాయం' -
ప్రభుత్వ విప్ పిన్నెల్లిపై హత్యాయత్నం
సాక్షి, గుంటూరు: పాలన వికేంద్రీకరణపై ఆందోళన పేరుతో రాజధాని రైతుల ముసుగులో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన కారుపై రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. సమీపంలో ఉన్న పోలీసులు సకాలంలో రావడంతో పీఆర్కే త్రుటిలో ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డారు. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మందడంలో ఇటీవల మీడియా ప్రతినిధులు, పోలీసులపై రాజధాని రైతుల ముసుగులో కొందరు దాడికి పాల్పడిన ఘటన మరువకముందే తాజాగా ఎమ్మెల్యేపైనే టీడీపీకి చెందిన గూండాలు దాడికి దిగడం గమనార్హం. రాస్తారోకో పేరిట అరాచకం.. రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణను నిరసిస్తూ పొలిటికల్ జేఏసీ జాతీయ రహదారి–16పై మంగళవారం రాస్తారోకో, ధర్నాలకు పిలుపునిచ్చింది. అయితే ఇందుకు పోలీసులు అనుమతించలేదు. అయినా పట్టించుకోని టీడీపీ నాయకులు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున జనాన్ని రాస్తారోకోకు తరలించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నియోజకవర్గానికి 200 మంది చొప్పున టీడీపీ కార్యకర్తలను తరలించినట్టు సమాచారం. అనుమతుల్లేకుండా వస్తున్న ఆందోళనకారులను ఎక్కడికక్కడ చెక్పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకోగా.. టీడీపీ శ్రేణులు అల్లరిమూకలతో కలసి పొలాల్లోని రోడ్లు, డొంకల వెంట ద్విచక్ర వాహనాలపై చినకాకాని చేరుకున్నాయి. ఇలా వచ్చిన వందలాది మంది టీడీపీ శ్రేణులు ఎన్హెచ్–16పై రెండు గంటలపాటు బైఠాయించి ఆందోళన చేశారు. ఫలితంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. రహదారి ముట్టడికి వచ్చిన వారంతా తమ ద్విచక్ర వాహనాలను సర్వీస్ రోడ్డు వెంబడి పెట్టడంతో సర్వీసు రోడ్డులోనూ ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. సర్వీస్ రోడ్డులో ఉన్న పీఆర్కే కారును గుర్తించి.. ఇదే సమయంలో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కారులో గుంటూరు నుంచి విజయవాడ వెళుతున్న ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చినకాకాని వద్ద సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ఇది గమనించిన టీడీపీ గూండాలు 50 మందికిపైగా పక్కా ప్రణాళికతో ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో కారుపై విచక్షణారహితంగా దాడికి దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారులో నుంచి పీఆర్కేను కిందకు దింపి ఆయన్ను తుదముట్టించాలని ప్రయత్నించారు. దీన్ని పసిగట్టిన పీఆర్కే గన్మెన్లు టీడీపీ గూండాలను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో వారిపైనా టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. సమీపంలో ఉన్న పోలీసులు విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకుని టీడీపీ గూండాల బారి నుంచి ఎమ్మెల్యేను రక్షించారు. అక్కడినుంచి పోలీసు బందోబస్తు మధ్య ఆయన్ను గుంటూరుకు తరలించారు. పక్కా ప్రణాళికతోనే.. పాలన వికేంద్రీకరణపై టీడీపీ కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తుండడం తెలిసిందే. అయితే ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవడంతో హింసను ప్రేరేపించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మార్చాలని టీడీపీ స్కెచ్ వేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఆందోళన చేస్తున్న సమయంలో అటువైపు వచ్చిన పోలీసులు, మీడియా ప్రతినిధులు, మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై దాడికి యత్నించాలని ముందుగానే పథకం వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల మందడంలో పోలీసులు, మీడియా ప్రతినిధులపై ఆందోళనకారుల ముసుగులో టీడీపీ శ్రేణులు దాడి చేయడం విదితమే. ఈ ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన వారిలో చాలావరకూ టీడీపీ సానుభూతిపరులే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో పీఆర్కే ట్రాఫిక్లో ఉన్న విషయం తెలుసుకున్న టీడీపీ గూండాలు పథకం ప్రకారం రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడికి యత్నించిన వారందరూ మద్యం తాగి ఉన్నట్టు పీఆర్కే చెబుతున్నారు. మద్యం తాగి ఉండడమేగాక ముందస్తుగా రాళ్లు, కర్రలతో సిద్ధంగా ఉన్న టీడీపీ గూండాలు ఎమ్మెల్యే వాహనంపై ఒక్కసారిగా దాడికి తెగబడటాన్ని చూస్తుంటే ఇది పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని విదితమవుతోంది. టీడీపీకి ఇది కొత్తేమీ కాదు.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా హింసను ప్రేరేపించి పబ్బం గడుపుకోవడం టీడీపీ నాయకులకు కొత్తేమీ కాదని పరిశీలకులు అంటున్నారు. పీఆర్కేపై హత్యాయత్నం నేపథ్యంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ఐదేళ్లలో గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు చేసిన అరాచకాలను వారు గుర్తు చేస్తున్నారు. గతంలో ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ ఏడుగురు ఎంపీటీసీలున్న వైఎస్సార్సీపీకి జిల్లాలోని ముప్పాళ్ళ ఎంపీపీ స్థానం దక్కకుండా ఐదుగురు ఎంపీటీసీలున్న టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. 2014 జూలై 13న ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీలతో వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, అంబటి రాంబాబులపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్ గూండాలతో మేడికొండూరు వద్ద దాడులు చేయించారు. ఎంపీపీలు ప్రయాణిస్తున్న బస్సు, ఎమ్మెల్యే వాహనాన్ని ధ్వంసం చేయడమేగాక ముస్తఫాతోపాటు అంబటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి భయానక వాతావరణం సృష్టించారు. ఎమ్మెల్యే పీఆర్కేపై దాడి హేయం టీడీపీ నేతలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చర్చలకు వస్తే వారి న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరిస్తామని మంత్రులు చెబుతున్నారు. రైతులు శాంతియుతంగా చేస్తున్న నిరసనలను టీడీపీ నేతలు పక్కదోవ పట్టిస్తున్నారు. ఎమ్మెల్యేపై జరిగిన దాడి వెనుక టీడీపీ నేతల హస్తం ఉంది. టీడీపీ ఇప్పుడు కూడా రైతులను మోసం చేస్తోంది. – ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ ఎమ్మెల్యే దాడి వెనుక టీడీపీ గూండాలు ఉన్నారు ఎమ్మెల్యే పిన్నెల్లిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి దాడులు చేయడం, కారు అద్దాలు పగలగొట్టడం హేయమైన చర్య. దాడి వెనుక టీడీపీ గూండాలు ఉన్నారు. – నందిగం సురేష్, బాపట్ల ఎంపీ టీడీపీ గూండాల పనే రైతుల రూపంలో టీడీపీ గూండాలను ప్రేరేపించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆరోపించారు. దేశంలో నంబర్ వన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ చంద్రబాబే అని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కావాల్సింది స్టేట్ కాదు..రియల్ ఎస్టేట్ అని ధ్వజమెత్తారు. బాబు దిగజారుడుతనానికి నిదర్శనం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కైలే అనిల్కుమార్లపై దాడులు చేయించడం టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్పై అక్రమంగా కేసులు పెట్టినప్పుడు, ఆయనపై హత్యాయత్నం జరిగినప్పుడు తాము దాడులకు, హింసకు పాల్పడలేదని గుర్తు చేశారు. -
టీడీపీ గూండాల కుట్ర
-
చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడం
-
దాడి చేసింది రైతులు కాదు..చంద్రబాబు గూండాలే..
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. దమ్ముంటే ముసుగు తీసి బయటకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు ఎక్కడికి రమ్మంటే అక్కడి వచ్చేందుకు సిద్ధమని తెలిపారు. మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పక్కాప్లాన్ ప్రకారమే తనపై హత్యాయత్నం చేయించారని నిప్పులు చెరిగారు. ఆయన ఆస్తులను కాపాడుకునేందుకే అల్లర్లు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై హత్యాయత్నం చేసింది.. రైతులు కాదని.. టీడీపీ గూండాలేనని పేర్కొన్నారు. తనపై దాడి చేసినవారి విజువల్స్ ఉన్నాయని.. ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. గతంలో కూడా తనపై అక్రమ కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేశారని వివరించారు. మాపై దాడులు చేయడానికి మేం ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చామా అని ప్రశ్నించారు. దమ్ముంటే చంద్రబాబు నిజాయితీగా రాజకీయం చేయాలన్నారు. ‘నాయకులపై దాడులు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా.. నిరసనలు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని’ తెలిపారు. సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వ లేకపోతున్నారన్నారు. అన్నివర్గాలకు న్యాయం చేయాలనే సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారన్నారు. చంద్రబాబు ట్రాప్లో రైతులు పడొద్దని.. రైతు సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సూచించారు. రైతులపై సీఎం జగన్కు సానుభూతి ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కలిశారు. తనపై జరిగిన హత్యాయత్నం ఘటన గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, విడదల రజని తదితరులు ఉన్నారు. చదవండి : ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం -
'చంద్రబాబు చరిత్ర హీనులవడం ఖాయం'
సాక్షి, అమరావతి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ గూండాలు హత్యాయత్నంకు పాల్పడిన ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు చూశారని డిప్యూటీ సీఎం అంజద్ బాషా వెల్లడించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ దుర్మార్గాన్ని ప్రోత్సహించడం దారుణమని పేర్కొన్నారు.రైతుల రూపంలో టీడీపీ గూండాలను ప్రేరేపించి ఒక ప్రజాప్రతినిధిపై హత్యాయత్నంకు పాల్పడడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఇటువంటి చర్యలపై ప్రజలే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వుంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు మాత్రమే ఇచ్చి చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఆయన బుద్ధి మారలేదని విమర్శించారు. చంద్రబాబు అప్పటి నుంచి మరింత దిగజారి ఇలాంటి సిగ్గుమాలిన పనులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ రోజు దేశంలో నెంబర్ వన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ చంద్రబాబేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనే దుష్ర్పచారంతో చంద్రబాబు ముందుకు వెడుతున్నారన్నారు. ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆయన గన్ మెన్లపై కూడా దాడులు చేయడం, అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా జరిగిన సంఘటనను వక్రీకరించి చూపుతున్నారని అంజద్ బాషా వెల్లడించారు. అసెంబ్లీకి, సెక్రటేరియట్ కు ఎవరూ రాలేని పరిస్థితిని చంద్రబాబు సృష్టించారు. అమరావతి ప్రాంతంలో లెజిస్లేచర్ క్యాపిటల్ ఉండకూడదనే చంద్రబాబు ఇలాంటి కుట్రలను చేస్తున్నారని విమర్శించారు.( ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం) ఒకప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు కూడా చంద్రబాబుకు ఆవేశం రాలేదని, ఈ రోజు మాత్రం మూడు రాజధానులు అంటే ఎందుకు అంత ఆవేశం వస్తుందని ప్రశ్నించారు. చంద్రబాబు ఆవేశం వెనుక ఆయన బినామీలకు చెందిన భూముల విలువలు తగ్గిపోతున్నాయనే బాధ తప్ప వేరేవి పట్టించుకోరని ఎద్దేవా చేశారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొందన్నారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీలను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బీసీజీ నివేదికను వివరించిన అధికారుల తీరును తప్పుబట్టిన చంద్రబాబు ప్రస్తుతం ఏ రకమైన బాషను మాట్లాడుతున్నారనేది ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని అంజద్ వెల్లడించారు. దళిత ఐఎఎస్ అధికారి పట్ల చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారని, ఈ వ్యవహారంపై దళిత సంఘాలు చంద్రబాబును ఛీ కొడుతున్నారని పేర్కొన్నారు. మూడు రాజధానులు వద్దు... అమరావతి ముద్దు అని విజయవాడలో బెబుతున్న చంద్రబాబు ఇదే మాటను రాయలసీమ, ఉత్తరాంధ్రకు వెళ్లి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపి ప్రజలకు భ్రమలు కల్పించారని తెలిపారు. అమరావతిని నిర్మించాలంటే రూ. 1.10 లక్షల కోట్లు కావాలని చెప్పారు. ప్రస్తుతం అంత డబ్బు ఖర్చు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని, ఆయన చెప్పిన విషయాలను పరిగణలోకి చూస్తే బయటి నుంచి అప్పులు తేవాలన్నారు. అందుకు ప్రతిఏటా వేల కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వుంటుందని, ఇవన్నీ సాధ్యపడుతాయా అంటూ ప్రశ్నించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చామని అంజద్ పేర్కొన్నారు. రాజధాని కోసమే రైతులు చనిపోతున్నారంటూ చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని, ఏ కారణంతో చనిపోయినా రాజధాని కోసమే అంటూ దుష్ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి, సమన్యాయం కోసమే తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు చరిత్ర హీనులుగా నిలవడం ఖాయమని దుయ్యబట్టారు. -
వినాశకాలం.. అందుకే విపరీత బుద్ధి
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి.. చంద్రబాబు అరాచకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు చంద్రబాబు, టీడీపీ నేతలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తన స్వార్థం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే అవకాశవాది చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోసం ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన ఘనత ఆయనదని ధ్వజమెత్తారు. (పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం) ప్రభుత్వంపై బురదజల్లేందుకు హింసను ప్రేరేపించే విధంగా చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని అంబటి మండిపడ్డారు. మొన్న మీడియాపై దాడి, నేడు పిన్నెల్లిపై దాడి రెండూ చంద్రబాబు కుట్రలో భాగమేఅన్నారు. తన ఆస్తులకు కాపాడుకునేందుకు చంద్రబాబు అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు వినాశకాలం వచ్చిందని, అందుకే విపరీత బుద్ధి పుట్టిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు బాగుండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చేస్తున్నారని తెలిపారు. రైతుల సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. -
పక్కా పథకం ప్రకారమే పిన్నెల్లిపై హత్యాయత్నం
సాక్షి, మంగళగిరి : రైతుల ముసుగులో టీడీపీ నాయకులు ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. పక్కా స్కెచ్ ప్రకారమే టీడీపీ గుండాలు హత్యాయత్నంకు దిగారని అన్నారు. మంగళవారం ఆర్కే రోజా మీడియా సమావేశంలో మాట్లాడారు. పిన్నెలిపై హత్యాయత్నం ముమ్మటికి టీడీపీ కుట్రలో భాగమేనని మండిపడ్డారు. రైతులు ముసుగులో మీడియాపై కూడా టీడీపీ నేతలే దాడికి దిగారని అన్నారు. పిన్నెల్లి పై దాడికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడుకు అమరావతిపై ప్రేమ ఉంటే అధికారంలో ఉన్న సమయంలో గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. (పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం) అల్లర్లు అరాచకాలు సృష్టించడం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటే అని రోజా అన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలతోనే ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుదని గుర్తుచేశారు. అమరావతిలో గొడవలు పెట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు రాజధానులను సమర్ధిచింన టీడీపీ నేతలైనా గంటా శ్రీనివాసరావు, కేఈపై ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నించారు. గుండా గిరి దాదా గిరి చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోరదని రోజా హెచ్చరించారు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
చంద్రబాబుకు పిన్నెల్లి సవాల్
-
ప్రభుత్వ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం
-
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం
సాక్షి, గుంటూరు: ఉద్యమం ముసుగులో టీడీపీ కార్యకర్తలు గుండాగిరీకి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో రామకృష్ణారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాలు... అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ కార్యకర్తలు చిన్న కాకాని వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్ను అడ్డుకున్నారు. కాజా టోల్గేట్ దగ్గర ఆయన కారుపై రాళ్లతో దాడి చేశారు. భద్రతా సిబ్బందిపై సైతం దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో రామకృష్ణారెడ్డి సంయమనం పాటించి.. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వెనుక నుంచి దాడి చేసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబుకు పిన్నెల్లి సవాల్ తన కాన్వాయ్పై రాళ్ల దాడి ఘటనను ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిరికపంద చర్యగా అభివర్ణించారు. రైతుల ముసుగులో చంద్రబాబు తన కార్యకర్తలతో దాడి చేయించారని ఆరోపించారు. కుట్రలో భాగంగానే తనపై, గన్మెన్లపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి తన ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతుల పేరిట చంద్రబాబు రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దమ్ముంటే చంద్రబాబు ధైర్యంగా ముందుకు రావాలని సవాల్ విసిరారు. అదే విధంగా రాజధాని ప్రాంత రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పకుండా న్యాయం చేస్తారని పిన్నెల్లి స్పష్టం చేశారు. ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైతులు ముసుగులో దాడులకు పాల్పడితే తాము భయపడమని స్పష్టం చేశారు. -
ఆత్మకూరులో అసలేం జరిగింది?
(పల్నాడు ప్రాంతం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)/సాక్షి, గుంటూరు/మాచర్ల: మూడేళ్ల క్రితం అంగన్వాడీ ఉద్యోగం తెచ్చిన తంటా ఆ పచ్చని పల్లె పేరును ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగేలా చేసింది. ఆ గ్రామంలో ఒకే పార్టీకి చెందిన రెండు కుటుంబాలు వైరి వర్గాలుగా విడిపోయి ఊరొదిలి వెళుతుంటే దానికి టీడీపీ రాజకీయరంగు పులిమింది. పల్నాడు ప్రాంతంలో గెలిచిన రాజకీయ పార్టీకి చెందిన వారిది పైచేయి అవుతుందని ఓడిన పార్టీ వారు కొంతకాలం ఊరొదిలి వెళ్లడం రివాజు. అయితే ఇప్పుడు కుటుంబ తగాదాలను పార్టీ తగాదాలుగా చిత్రీకరిస్తూ, ఊరొదిలి వెళ్లిన వారు వైఎస్సార్ సీపీ బాధితులంటూ ప్రతిపక్ష టీడీపీ యాగీ చేస్తుండటం ఆ ప్రాంత ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాలు కొన్నేళ్లుగా ప్రత్యర్థి వర్గాలుగా ఉంటున్నాయి. ఆ వర్గాలకు గ్రామ మాజీ సర్పంచ్ పి.యోసేబు, మండి చార్లెస్ నేతృత్వం వహిస్తున్నారు. యోసేబు స్వయానా చార్లెస్కు పిల్లనిచ్చిన మామ కావడం గమనార్హం. వీరివురూ తొలినాళ్లలో టీడీపీలోనే ఉన్నారు. ఒకే కాలనీలో నివాసం ఉండేవారు. మూడేళ్ల క్రితం గ్రామంలో అంగన్వాడీ పోస్టు తన భార్యకు ఇవ్వాలని చార్లెస్ తన మామపై ఒత్తిడి తెచ్చాడు. అప్పటి టీడీపీ నేతల రాజకీయ కారణాలతో యోసేబు నిరాకరించాడు. దీంతో టీడీపీలోనే రెండు వర్గాలుగా వీరు చీలడంతో ఆధిపత్యం కోసం గొడవలు ఆరంభమయ్యాయి. కొంతకాలానికి తారస్థాయికి చేరాయి. రెండేళ్ల క్రితం సర్పంచ్ యోసేబు కాలనీలో భయోత్పాతం సృష్టించి చార్లెస్ వర్గాన్ని టార్గెట్ చేశాడు. టీడీపీ నేతల ప్రోద్బలంతో చార్లెస్ను ఊరొదిలి వెళ్లేలా చేశాడు. చార్లెస్ కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వీలులేని పరిస్థితులను టీడీపీ నేతలు కల్పించారు. ఆత్మకూరులో మొహరించిన పోలీసులు గ్రామంలో పెద్దలు చార్లెస్కు మద్దతుగా వచ్చినా.. పోలీస్ అధికారులతో వారిని దుర్భాషలాడించారు. చేసేదేమీ లేని పరిస్థితుల్లో చార్లెస్, అతని అనుచరులకు గ్రామ శివారులో స్థానిక పెద్దలు ఆశ్రయం కల్పించారు. ఎన్నికల రోజు కూడా గ్రామంలో యోసేబు వర్గం చార్లెస్ వర్గంపై దాడులకు యత్నించింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గ్రామం ప్రశాంతంగా ఉన్నా.. ప్రతి దాడులేమీ లేకపోయినా.. యోసేబు వర్గం మొత్తం ఊరొదిలి వెళ్లింది. ఆ తర్వాతే గ్రామ శివారులో తలదాచుకున్న చార్లెస్ తన అనుచరులతో కలిసి కాలనీకి వచ్చినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రశాంతంగా ఉండే ఆత్మకూరు గ్రామంలో అంగన్వాడీ పోస్టు మామా, అల్లుళ్ల మధ్య చిచ్చు రేపిందని చెబుతున్నారు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలో రాజీలు జరిగి రెండు వర్గాలు కలిసి సహపంక్తి భోజనాలు చేశారన్నారు. దాడులు జరగలేదు ఆత్మకూరు గ్రామానికి తిరిగి వచ్చిన యోసేబు వర్గంలోని కొందరు అసలు ఏం జరిగిందో ‘సాక్షి’కి వివరించారు. ప్రభుత్వం మారగానే చార్లెస్ వర్గం దాడులు చేస్తారనే భయంతోనే ఊరు వదిలి వెళ్లామని యోసేబు వర్గానికి చెందిన కిన్నెర రాబర్ట్ స్పష్టం చేశాడు. కిన్నెర రాబర్ట్ స్వయానా చార్లెస్కు మేనమామ కూడా. ఇలా ఊరొదిలి వెళ్లడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోందని రాబర్ట్ చెప్పాడు. తమపై దాడులు జరగలేదని స్వయంగా యోసేబు కూడా మీడియా ప్రతినిధులకు వివరించారు. తన బంధువును చార్లెస్ భయపెట్టాడని, ఆ తర్వాత తమపై దాడులు జరుగుతాయని భావించి ఊరొదిలి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ను చూసి.. కాపీ బాబు కుట్ర 1989లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామంలో పూరి పాకలను తగులబెట్టిన ఘటనలు జరిగాయి. అప్పట్లో గ్రామానికి ఎన్టీఆర్ పరామర్శకు వచ్చారు. ఇప్పుడు గ్రామం ప్రశాంతంగా ఉన్నా.. దాడులు ఏవీ జరగకున్నా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు పార్టీ ఉనికి కోసం, తమ పార్టీ నేతలు యరపతినేని, కోడెల అక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రలు రచించారని ఈ ప్రాంతానికి చెందిన పలువురు పేర్కొంటున్నారు. కుట్రలకు పల్నాడు ప్రాంతాన్ని చంద్రబాబు ఎంచుకోవడంపై మండిపడుతున్నారు. పోలీసుల హామీ మేరకు వచ్చాం మా బంధువుల్లోనే వివాదం వల్ల ఆందోళన చెంది బయటకు వెళ్లాం. పోలీసుల హామీ వల్ల తిరిగి గ్రామానికి వచ్చాం. మా మధ్య ఎటువంటి రాజకీయ గొడవలూ లేవు. పోలీసుల చొరవతో మా మధ్య విభేదాలు తొలగిపోయాయి. మేమంతా కలిసికట్టుగానే ఉంటాం. – పేరువాల యోసేబు, టీడీపీ నేత, ఆత్మకూరు మా మధ్య కుటుంబ గొడవలు ఉన్నాయి మా సామాజికవర్గానికి చెందిన వారిలోనే విభేదాలు ఉండి గతంలో గొడవ పడ్డాం. మేమంతా ఒకే కుటుంబానికి చెందినవారం. గత ఐదేళ్లలో అధికారం అండతో మా ప్రత్యర్థి వర్గం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఇటీవల టీడీపీ ఓటమిపాలు కావడంతో మేం వారిపై దాడి చేస్తామోననే భయంతో వారు ఊరు విడిచి వెళ్లారు. మా గొడవలకు రాజకీయాలతో సంబంధం లేదు. – మందా చార్లెస్, ఆత్మకూరు గ్రామంలో రాజకీయ గొడవలు లేవు.. మా గ్రామంలో వైఎస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రాజకీయ గొడవలు లేవు. మేము అందరం కలిసి ఉంటున్నాం. టీడీపీలో ఉన్న ఎస్సీల బంధువర్గంలో విభేదాల వలన చిన్న వివాదాలను పెద్దవిగా చేసి రాజకీయరంగు పులిమారు. మా గ్రామంపై విష ప్రచారం చేయటం దారుణం. – రాయపరెడ్డి, గ్రామపెద్ద, ఆత్మకూరు దాడులు నిరూపిస్తే రాజీనామా చేస్తా ఆత్మకూరు గ్రామంలో ఎస్సీలపై మా పార్టీ నాయకులు దాడి చేశారని, వారి నుంచి ఎస్సీలకు ప్రాణహాని ఉందని, గ్రామంలో వారికి రక్షణ లేదని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. చౌకబారు విమర్శలు చేసి చంద్రబాబు తన ప్రతిష్టను ఇంకా దిగజార్చుకుంటున్నారు. మా పార్టీ వర్గీయులు దాడి చేయడం వల్ల గ్రామంలో ఎస్సీ కుటుంబాలు ఇళ్లను వదిలి వెళ్లిపోయాయని ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాను. వైఎస్సార్సీపీ వర్గీయులు దాడి చేయడం వల్లే వాళ్లు గ్రామం విడిచి వెళ్లినట్లయితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. వాస్తవం కానట్లయితే పల్నాడు ప్రాంత ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే -
గురజాల పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత
-
ఐటీ దాడులు చేస్తే నీ మీద చేసినట్టా?
మాచర్ల: ‘చంద్రబాబూ.. నీ బినామీలపై ఐటీ దాడులు జరిగితే అవి రాష్ట్రం మీద దాడులా? ఎంపీ సీఎం రమేష్కు 2014కు ముందు ఎన్ని ఆస్తులున్నాయి? ఈరోజు రూ.వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ బినామీగా వ్యవహరించిన రమేష్పై దాడులు జరిగితే అది రాష్ట్రంపై దాడిగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంతటి దిగజారుడు రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు చేస్తావు?’ అని వైఎస్సార్సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మాచర్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఐటీ దాడులు జరగటానికి కారణం టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతేనని చెప్పారు. ఎన్నికల ముందు అఫిడవిట్లో ఇచ్చిన ఆస్తులకు, నాలుగేళ్లుగా సంపాదించిన ఆస్తులకు వందల కోట్ల తేడాలు ఉండటంతో ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. అసలు పెట్టుబడులు పెట్టలేని సంస్థలు కోట్ల రూపాయలను సంపాదిస్తుంటే ఐటీ వాళ్లు ఎందుకు దాడులు చేయరని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులపై దాడులు చేయటం సహజమన్నారు. ఐటీ దాడుల నుంచి తప్పించుకోవటానికి అధికార పార్టీ నాయకులు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లుతూ ఆరోపణలు చేయటం హాస్యాస్పదమన్నారు. ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా అక్రమాలు బయటకు రాక తప్పవని, అక్రమంగా ఆస్తులు సంపాదించిన టీడీపీ నేతలంతా శిక్షకు గురై ప్రజల చేత కూడా బుద్ధి చెప్పించుకునే పరిస్థితి త్వరలోనే రానుందని ఎమ్మెల్యే పీఆర్కే అన్నారు. -
‘ఇలాంటి సీఎంను ఎప్పుడు చూడలేదు’
సాక్షి, గుంటూరు: తన నియోజకవర్గంలోని సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బహిరంగ లేఖ రాశారు. మాచర్లలోని సమస్యలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ఆ ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి ఎప్పుడు మోక్షం కలుగుతుందని ప్రశ్నించారు. విజయపురి సౌత్లో మెగా టూరిజం ప్రాజెక్టును ఎప్పుడు తీసుకువస్తారని నిలదీశారు. ఎస్కేబీఆర్ కాలేజ్లో పీజీ సెంటర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే.. మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూని ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గ సమస్యలను చెప్పాటానికి కలుస్తానంటే సీఎం అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటి సీఎంను గతంలో ఎప్పుడు చూడలేదని.. అందుకే బహిరంగ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. -
‘సమయం వచ్చినప్పుడు గుణపాఠం తప్పదు’
-
‘సమయం వచ్చినప్పుడు గుణపాఠం తప్పదు’
అమరావతి: ఏపీ శాసనసభలో కీలక అంశాలపై చర్చ జరగనీయకుండా చంద్రబాబు ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పోలవరం, చేనేత, పేదల ఇళ్లపై చర్చ జరగకుండా సభను వాయిదా వేసిందని విమర్శించారు. మూడేళ్ల పాలన పేదలకు ఒక్క ఇల్లు కట్టిన పాపాన పోలేదని మండిపడ్డారు. ‘హైదరాబాద్ లో చంద్రబాబు ఆడంబరంగా ఇల్లు కట్టుకుంటున్నారు. నారా లోకేశ్ కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. పేదవారికి ఇల్లు కట్టాలనే ఆలోచన రాకపోవడం దారుణం. వీళ్లు చేసే అన్యాయాలు ప్రజలు చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతార’ని రామకృష్ణా రెడ్డి అన్నారు. -
అధికారం నిలుపుకొనేందుకే ఫిరాయింపులు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెళ్లి, దాడిశెట్టి, విశ్వేశ్వరరెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకునేం దుకే టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై శుక్రవారం ఎమ్మె ల్యేలు దాడిశెట్టి రాజా, విశ్వేశ్వరరెడ్డిలతో కలిసి అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. కల్పనపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పిన్నెళ్లి విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ(వైఎస్సార్సీపీ) గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభ పెట్టి, అనధికారంగా చేర్చుకోవడం దారుణమన్నారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు అదే పద్ధతిలో ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొంటూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశా లను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం అసెంబ్లీ సమావేశాలను కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా) ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. తెలంగాణలో అనైతికమన్న పార్టీ ఫిరాయింపులను చంద్రబాబు సిగ్గువిడిచి ఏపీలో ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. -
హోదా కోసం పోరాడటమే నేరమా?
- ప్రివిలేజ్ కమిటీ ఎదుట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాదన - అసెంబ్లీలో సమావేశమైన ప్రివిలేజ్ కమిటీ సాక్షి, అమరావతి/హైదరాబాద్: భావితరాల భవిష్యత్ కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చే క్రమంలో సభలో చర్చ జరపాలని కోరుతూ తాము సభా కార్యక్రమాలను స్తంభింపచేశాం తప్ప మరో ఆలోచన లేదని గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైఎస్సార్సీపీ) చెప్పారు. హోదా కోసం పోరాడటమే నేరమా అని ప్రశ్నించారు. తాను సమగ్రంగా వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశం హైదరాబాద్లోని అసెంబ్లీ హాల్లో జరిగింది. చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన భేటీలో సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (వైఎస్సార్సీపీ), తెనాలి శ్రావణ్కుమార్, కె.రామకృష్ణ (టీడీపీ) హాజరయ్యారు. సొంత ఎజెండా లేదు..: అనంతరం అసెంబ్లీ ఆవరణలో రామకృష్ణారెడ్డి మీడియా తో మాట్లాడుతూ శాసనసభలో జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు పిలిచిన ప్రివిలేజ్ కమిటీ ప్రోసీడింగ్ ఇవ్వకుండా హాజరు కావాలనడం బాధాకరమన్నారు. తనకు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ జరిగిన శాసనసభ సమావేశాల వీడియో టేప్లను అందిస్తే వాటిని పరిశీలించి సభలో తమను మాట్లాడనివ్వకుండా అధికారపక్షం ఎలా అడ్డుకుందో.. వచ్చే సమావేశంలో వివరిస్తారని చెప్పారు. నాని, చెవిరెడ్డి లేఖలు..: కమిటీ ముందు హాజరు కావాల్సిన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) జ్వరం వల్ల రాలేకపోతున్నానని, స్థానికంగా అమ్మవారి ఆలయంలో వస్త్రాలు సమర్పించాల్సి ఉన్నందున రాలేనని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి లేఖ పంపారు. దీంతో మరోసారి వారు హాజరై వివరణ ఇచ్చేందుకు కమిటీ అనుమతిచ్చింది. కాగా అసెంబ్లీలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తినప్పుడు తమను ఉద్దేశించి అమర్యాదగా మాట్లాడి, అసభ్యంగా వ్యవహరించిన అధికార పార్టీ నేతలకు సభాహక్కుల ఉల్లంఘణ నోటీసులు ఇవ్వాలంటూ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కోడెల శివప్రసాద్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వారి నుంచి వివరణ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన తాజాగా స్పీకర్కు ఒక లేఖ రాశారు. -
హోదా.. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష: పిన్నెల్లి
-
హోదా.. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష: పిన్నెల్లి
ప్రత్యేక హోదా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని వైఎస్ఆర్సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత తమపై ఉందని, అయితే అసెంబ్లీలో తమ గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ఎంతవరమైనా పోరాడతాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజి కమిటీ ఎదుట శుక్రవారం హాజరైన ఆయన.. తన వివరణ ఇచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల తాము హాజరు కాలేకపోతున్నామని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని), చెవిరెడ్డి భాస్కరరెడ్డి లేఖలు రాశారు. ఇప్పటికే 9 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విచారణ కమిటీ ఎదుట హాజరై తమ వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ గత అసెంబ్లీ సమావేశాలలో వైఎస్ఆర్సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీనిపై అసెంబ్లీలో ఆందోళనకు దిగినందుకు విపక్ష ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. -
‘చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదు’
-
‘చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదు’
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం సీఎం చంద్రబాబును కలవనున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లి ఆయనను కలవనున్నట్టు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. 15 రోజుల నుంచి సీఎం అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. నియోజక వర్గ నిధుల గురించే తామ అపాయింట్ మెంట్ అడిగుతన్నా చంద్రబాబు ఇవ్వడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్తున్నట్టు పిన్నెల్లి వెల్లడించారు. -
ప్రభుత్వం నియోజకవర్గ నిధులివ్వడం లేదు
-
'చంద్రబాబు బెదిరింపులకు భయపడం'
గుంటూరు: శాసనసభ హక్కుల కమిటీ నోటీసులపై మాచర్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం పోరాడితే ప్రభుత్వం నోటీసులిచ్చి బెదిరిస్తోందన్నారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడేదిలేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎందాకైనా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా వైఎస్సార్సీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. త్వరలో జరగనున్న కమిటీ సమావేశానికి హాజరై అభిప్రాయాలు వెల్లడించాలని ఆదేశించింది. 25 తేదీన ఆరుగురు, 26వ తేదీన మరో ఆరుగురు కమిటీ ముందు హాజరు కావాలని పేర్కొంది. ఈ మేరకు శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి 12 ఎమ్మెల్యేలకు లేఖలు రాయడం గమనార్హం. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో రాష్ట్ర శాసనసభా సమావేశాల్లో తమ వాణి వినిపించేందుకు పట్టుపట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో 12 మందికి సభా హక్కుల కమిటీ నోటీసులు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
గుంటూరు : గుంటూరు జిల్లా దుర్గి మండలం నరమాలపాడు వద్ద ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 420 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే లారీని కూడా స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
'అహంకార ధోరణితో వ్యవహరిస్తున్న చంద్రబాబు'
విజయవాడ: విజయవాడలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగింపును తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్ సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ విగ్రహాన్ని పునరుద్దరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చంద్రబాబును పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. -
ప్రజలు ఎన్నుకున్న వారికి అవమానమా?
ఓడిపోయిన వారికి గౌరవమా..ప్రొటోకాల్ అంటే ఇదేనా జిల్లాలో ప్రొటోకాల్ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను పిలవటం లేదు. ఓడిపోయిన అధికార పార్టీ నాయకులను వేదికలపైకి ఎక్కిస్తున్నారు. మాచర్ల : ప్రజలు ఎన్నుకున్న నేతలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రొటోకాల్ ప్రకారం వారిని ఆహ్వానించాల్సి ఉంది. ప్రభుత్వాలు రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించి ఓడిపోయిన వారిని పిలిచి వేదిక లపై ఎక్కించి ప్రొటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం చేయడంపై గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మాచర్ల నియోజకవర్గంలోప్రొటోకాల్ ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావడంతో ఆయనను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకుండానే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేస్తున్నారు. ఏడాదిగా ఇదే తీరు ఏడాదిగా ప్రొటోకాల్ను పక్కనపెట్టి ఎమ్మెల్యే పీఆర్కేపై ఓటమి పాలైన ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చలమారెడ్డి, అంతకుముందు ఉపఎన్నికల్లో ఓడిపోయిన చిరుమామిళ్ల మధుబాబు తండ్రి వెంకటనర్సయ్య,కౌన్సిలర్లుగా పోటీచేసి ఓడిపోయినవారిని సైతం ప్రభుత్వ కార్యక్రమాల వేదికపై పిలిచి మాట్లాడిస్తున్నారు. ఏఎంసీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు తన పరిధిని దాటి మండలాల్లో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, ఆదేశాలు జారీచేస్తూ ప్రొటోకాల్ను పట్టించుకోవటం లేదు. ఎంపీ రాయపాటి పర్యటనల్లో.. ఎంపీ రాయపాటి సాంబశివరావు రెండు నెలల్లో మాచర్ల నియోజకవర్గంలో పదిసార్లు పర్యటిస్తే ఒక్కసారి కూడా ఎమ్మెల్యే పీఆర్కేను ఏ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. ఇటీవల మాచర్ల మండలంలో ఎంపీ రాయపాటి పర్యటించి కృష్ణా పుష్కర ఘాట్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే పీఆర్కేను ఆహ్వానించలేదు. పురపాలక సంఘ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం, హోం మంత్రి చినరాజప్ప పర్యటన సమయంలోనూ ఎమ్మెల్యే పీఆర్కేను ఆహ్వానించలేదు. పార్లమెంట్ ప్రోటోకాల్ కమిటీలో సభ్యుడిగా.. పార్లమెంట్లో ప్రొటోకాల్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఎంపీ రాయపాటి పాల్గొనే కార్యక్రమాల్లోనే ప్రొటోకాల్ను అధికారులు పట్టించుకోవడం గమనార్హం! రాయపాటి సైతం ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పాల్గొనకపోయినా ఓడిపోయిన అభ్యర్థులతో కొబ్బరికాయలు కొట్టించి ప్రోత్సహిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అహంభావంతోనే ఇలా.. నిబంధనలు లేవు, చట్టం లేదు, ప్రొటోకాల్ను పాటిం చరు. అధికారం వచ్చిందని అహంభావంతో యథేచ్ఛగా ప్రొటోకాల్ను ఉల్లంఘిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. రాష్ట్రాన్ని టీడీపీ సొంత రాజ్యంగా భావిస్తూ ప్రజాస్వామ్యహితంగా కాకుండా ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్నారు. అసెంబ్లీలో చెప్పుకుంటేనే దిక్కులేని పరిస్థితి. ప్రొటోకాల్ అమలు చేయాల్సిన ప్రజాప్రతినిధులే వాటిని ప్రోత్సహిస్తున్నారు. - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే, మాచర్ల -
ఉత్కంఠభరితంగా సాగిన కోడిపోరు
గుంటూరు జిల్లా కారంపూడిలో జరుగుతున్న పల్నాటి వీరారాధనోత్సవాలలో నాలుగో రోజు ఆదివారం కోడి పోరు ఉత్సవం ఉత్కంఠభరితంగా సాగింది. అలనాటి కోడి పందేలను తలపించేలా కోడి పోరును వీరులగుడి ఆవరణలో నిర్వహించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కోడిపోరులో పాల్గొన్నారు. బ్రహ్మనాయుడు కోడిపుంజును ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, నాయకురాలు నాగమ్మ కోడిపుంజును ఎమ్మెల్యే ఆంజనేయులు బరిలోకి వదిలారు. సంప్రదాయం కోసం మూడు విడతలుగా నిర్వహించిన పోరులో రెండుసార్లు బ్రహ్మనాయుడు పుంజు గెలిచింది. రాజ్యాన్ని వీడి అరణ్యవాసం చేయాలనే షరతుతో జరిగిన మూడో పందెంలో నాయకురాలు పుంజు గెలిచినట్లుగా పోరును ముగించారు. -
రైతులను బ్లాక్మెయిల్ చేయడమే
హైదరాబాద్ : బలవంతపు భూ సేకరణ చేపడతామని మంత్రులు చెప్పడం... రైతులను బ్లాక్మెయిల్ చేయడమేనని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.... భూములు ఇవ్వని రైతుల పంటలను తగలబెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బలవంతపు భూ సేకరణకు తమపార్టీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా రైతులకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. -
రైతులను ఎన్నాళ్లు మోసగిస్తారు
మాచర్లటౌన్ : రైతుల సమస్యలను పరిష్కరించకుండా వివిధ సాకులతో ఎన్నాళ్లు మోసం చేస్తారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. శనివారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ పూర్తిగా జరగక కరువుతో అల్లాడుతున్న గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులకు నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ అధికారులు పక్షపాతం చూపిస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని పీఆర్కే ప్రశ్నించారు. కృష్ణా బోర్డు ఏర్పాటు చేసేంత వరకు ఎవరి ప్రాంతంలో వారు నీటిని విడుదల చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఆ సమస్యను పట్టించుకోకపోవటం వలన గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని చెప్పారు. తెలంగాణ అధికారులు, తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా నీటిని విడుదల చేయించటంలో చంద్రబాబు అలసత్వం వహిస్తూ రైతులను మోసగిస్తున్నారన్నారు. జీతాలకు కూడా డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు విహార యాత్రల పేరుతో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ విదేశాల్లో పర్యటిస్తున్నారని ఆరోపించారు. వాస్తు పేరుతో సీఎం కార్యాలయ మరమ్మతులకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్నారు. రాజధానికి రైతుల నుంచి భూములను లాక్కొని మోసగిస్తున్నారని ఆరోపించారు. రైతులు త్వరలోనే ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతుండటంతో టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ దోచుకునే పనుల్లో ఉంటున్నారన్నారు. రైతు, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో చేపట్టనున్న దీక్షకు అందరూ తరలివచ్చి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు శౌరెడ్డి గోపిరెడ్డి, నవులూరి భాస్కరరెడ్డి, కళ్లం కృష్ణవేణి రామాంజనేయరెడ్డి, ఎంపీపీలు ఓరుగంటి పార్వతమ్మ, కుర్రి సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
కబ్జాదారుల భరతం పడదాం
పేదలపై రౌడీయుజం చెలాయిస్తే సహించబోం టీడీపీ పాలనలో పది మంది నవ్వుతుంటే... వంద మంది ఏడుస్తున్నారు ప్రజలకు అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాక్షి వీఐపీ రిపోర్టర్గా నియోజకవర్గంలో పర్యటన పలనాడు పౌరుషాల అడ్డా.. మాచర్ల గడ్డ. అలనాటి బ్రహ్మనాయుడి కాలం నుంచి నేటి వరకు ఇక్కడ పగలు, సెగలే రాజ్యమేలుతుంటాయి. అందుకే ఆ చెన్నకేశవుడి సాక్షిగా బోలెడు సమస్యలిక్కడ తిష్ట వేశాయి. దాపులనే సాగర్ ఉన్నా దక్కని సాగునీరు.. కోరలు చాస్తున్న కబ్జాదారులు.. అర్ధంతరంగా నిలిచిన అభివృద్ధి పనులు ప్రగతి నిరోధకాలుగా మారాయి. ఇంతటి వెనుకబాటుకు గురైన మాచర్లను ప్రగతి పథంలో పరుగులు పెట్టించాలని కృత నిశ్చయంతో పనిచేస్తున్న స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాక్షి వీఐపీ రిపోర్టరుగా మారారు. శనివారం నియోజకవర్గంలోని మాచర్ల పట్టణం, సమీప ప్రాంతాలకు వెళ్లి ప్రజల ఇబ్బందులేమిటో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారుల అండతో పేదల గుడిసెలు కూల్చిన కబ్జాదారుల భరతం పడతానని బాధితులకు భరోసా ఇచ్చారు. జిల్లాలో రాజకీయంగా చైతన్యవంతమైనప్పటికీ అభివృద్ధి పరంగా నేటికీ వెనకబడి ఉన్న ప్రాంతం మాచర్ల నియోజకవర్గం. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో మాచర్ల వాసులంతా తమకు మంచిరోజులొచ్చాయని సంతోషించారు. ఆయన అకాల మరణం తర్వాత ఇక్కడి ప్రగతి మళ్లీ కుంటుపడింది. ప్రస్తుత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం తన నియోజకవర్గంలో పర్యటించి, ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకున్నారు. మాచర్ల రోప్వే కాలనీ... ఎమ్మెల్యే : ఏమ్మా నీ పేరేమిటి? ఏం చేస్తుంటావ్..! సునీత: నా పేరు సునీత సార్.. నేను మా ఆయన కూలి పనులు చేసుకుని పొట్ట పోసుకుంటున్నాం. ఎమ్మెల్యే : నీ జీవనం బాగానే ఉందా? సునీత : ఏం బాగు సారూ... అన్నీ సమస్యలే. ఎన్ని సమస్యలున్నా ఒక గూడు ఉంటే తినో తినకో అందులో కాళ్ళు ముడుచుకోవచ్చని ప్రభుత్వ ఖాళీ స్థలంలో గుడిసె వేసుకుని ఉంటున్నాం సార్. ఓర్వలేనోళ్లు అది కూడా కూల్చేసి ఆ జాగా దర్జాగా కబ్జా చేసేసారు. సత్యవతి : మా వద్ద అన్యాయంగా స్థలం లాక్కుని వేరే వారికి అప్పనంగా అమ్ముకుంటున్నారు సార్. కృష్ణవేణి : కట్టిన ఇళ్లను కూడా నిర్దయగా కూల్చేస్తే మాబోటివాళ్లం ఇంకెక్కడ తలదాచుకోవాలి సార్? ఎమ్మెల్యే : జనారణ్యంలో ఇంత అన్యాయం జరుగుతున్నా మీరెలా చూస్తూ ఊరుకున్నారు? ఇంత మంది ఉన్నారు కదా అడ్డుకోలేకపోయారా? అసలు ఎంత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? కృష్ణవేణి : యాభై అరవై మంది కలసి వచ్చి మూకుమ్మడిగా దౌర్జన్యం చేస్తుంటే మేమేం చేయగలం సారూ. అధికారులను కలిశాం. కనీసం స్పందించ లేదు. సంతోషరావు : ఊహ తెలిసిన నాటి నుంచి 250 కుటుంబాల వరకు ఇదే రోప్లైన్ కాలనీలో జీవనం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు గొట్టిపాళ్ళ నుంచి కొందరొచ్చి మాైపై దౌర్జన్యం చేస్తున్నారు. ఒక మహిళ గూండాలను వెంటేసుకుని తిరుగుతూ మమ్మల్ని ఇళ్ల నుంచి తరిమేసింది. ఎమ్మార్వోకి చెబితే హేళనగా మాట్లాడుతున్నారు. వారి దౌర్జన్యాన్ని అడ్డుకునే వారే లేరా? ఎమ్మెల్యే : ఆందోళన చెందకండి. అలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదు. ఎక్కడి వాళ్ళో వచ్చి స్థానికులను తన్ని తరిమేస్తుంటే చూస్తూ కూర్చోం. అధికారుల అండతో రౌడీయిజం చెలాయించాలని చూస్తే ప్రజల అండతో వారి కోరలు పీకేస్తాం. ఈ విషయాన్ని వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తాను. మాచర్లలో భూ కబ్జాదారుల భరతం పడతాను. ఎమ్మెల్యే : ఇక్కడ యార్డు ఉంటే సౌకర్యంగా ఉంటుందా? మోహన్రెడ్డి : ఆసియాలోనే అతి పెద్దదని చెప్పుకునే గుంటూరు మిర్చియార్డుకు మా ప్రాంతం నుండే అధికంగా మిర్చి వెళుతుంది సార్. మిర్చిని నమ్ముకుని కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాయి. ఇక్కడ యార్డ ఏర్పాటు చేస్తేనే మా జీవనం మెరుగవుతుంది. ఎమ్మెల్యే : గుంటూరు వెళ్లడానికి ఇబ్బందులేమిటి? మోహన్రెడ్డి : లారీ మిర్చికి రూ. 35వేల వరకు నష్టం వస్తుంది సార్. అదే యార్డు ఇక్కడే ఉంటే అదంతా మాకు మిగులే కదా? ఇక సరైన భోజనం, వసతి లేక మా పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎమ్మెల్యే : ఎమ్.పి.గారు ఇక్కడే యార్డు పెడతామని చెబుతున్నారు కదా? కొప్పుల జానయ్య : అవన్నీ ఎన్నికల వాగ్దానాలే సార్. కొత్తపల్లిలో అనుపు-కొప్పునూరు లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద.. ఎమ్మెల్యే : మీరు ఇక్కడి రైతులేనా? పోతిరెడ్డి కోటిరెడ్డి : అవునండీ. ఎమ్మెల్యే : ఇదేమిటి, దీన్ని సగం తవ్వి వదిలేశారు? కోటిరెడ్డి : వైఎస్సార్ హయాంలో చింతల తండా వద్ద ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పధకానికి శంకుస్థాఫన జరిగింది సార్. అప్పటి నుండి తొలుత పనులు వేగంగానే జరిగినప్పటికీ ఆయన మరణానంతరం మందగించాయి. ఇప్పుడిక పూర్తిగా నిలిచిపోయాయి. ఎమ్మెల్యే : (అక్కడే ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ కన్వీనర్తో..) ఏమంటారు సుధాకర్రెడ్డిగారు? సుధాకర్రెడ్డి : దాదాపు 90శాతం పని పూర్తయింది సార్. ఇక జాక్వెల్ పాయింట్ దగ్గర 200మీటర్ల పని మాత్రం మిగిలి ఉంది. అయితే దీనికి అటవీ అనుమతులు లేవన్న కారణంగా పని ఆగిపోయింది. మాచర్ల పట్టణంలోని 7, 8 వార్డుల్లోని మురికివాడల్లో.. ఎమ్మెల్యే : ఏమ్మా పింఛను సరిగా వస్తుందా? చల్లా పిచ్చమ్మ, జ్ఞానసుందరి : వైఎస్ ఉన్నప్పుడు వచ్చేదయ్యా. ఇప్పుడు రావడం లేదు. మంగమ్మ : వైఎస్సార్ హయాంలో మూగవాడైనా నా బాబుకు వికలాంగ పింఛను దక్కింది సార్. చంద్రబాబు వచ్చిన తర్వాత రూ.1500కు పెరిగిందన్నారు కానీ మాకు ఒక్క రూపాయి కూడా ఎవరూ ఇచ్చిన పాపాన పోలేదు. ఎమ్మెల్యే : చూడండమ్మా. మీలాగే మాచర్ల పట్టణంలోని చాలా మంది అర్హులకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు నిలిచిపోయాయి. మీరేమీ ఆందోళన చెందకండి. మీరు మళ్లీ దరఖాస్తు చేయండి. ఈ సారి ఫించన్లు ఎందుకు రావో నేను చూస్తాను. పూడిక తీయని కాల్వలు, అధ్వానంగా ఉన్న రోడ్లు ఇలా మీ సమస్యల్ని స్వయంగా పరిశీలించాను. మరోసారి ఎమ్మెల్యేగా కమిషనర్ను ఇతర అధికారులను వెంటబెట్టుకుని వచ్చి పరిష్కారమయ్యేలా నూటికి నూరు శాతం కృషి చేస్తాను. -
టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలి: పిన్నెల్లి
మాచర్ల: గుంటూరు జిల్లా మాచెర్లలో భూకబ్జాకు పాల్పడిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మాచర్ల శివారులోని ఆటవీ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిన టీడీపీ నేతల ప్రయత్నాలను ఆటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఆటవీ భూమిలో బోర్లు వేసి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని టీడీపీ నేతలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. -
అక్రమ కేసులకు భయపడం: పిన్నెల్లి
మాచర్ల(గుంటూరు జిల్లా): అక్రమ కేసులకు భయపడేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాచర్ల ఎమ్మెల్నే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొంటామని చెప్పారు. తమపై తప్పుడు కేసులు పెట్టినవారు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అన్నారు. శుక్రవారం మాచర్ల చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఘనస్వాగతం లభించింది. నాగార్జున్ సాగర్ నుంచి భారీ బైక్ ర్యాలీతో మద్దతుదారులు ఆయనకు స్వాగతం పలికారు. సరస్వతి పవర్, ఇండస్ట్రీస్ భూముల వ్యవహారంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన అరెస్ట్పై హైకోర్టు గురువారం స్టే విధించింది. -
మాచర్ల ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
రామకృష్ణారెడ్డి తదితరుల అరెస్ట్పై హైకోర్టు స్టే సాక్షి, హైదరాబాద్: సరస్వతి పవర్, ఇండస్ట్రీస్ భూముల వ్యవహారంలో మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సరస్వతి పవర్ డెరైక్టర్ ఆదిరాజు వేణుగోపాలరాజు, మరో ఏడుగురికి హైకోర్టులో ఊరట లభించింది. వీరి అరెస్ట్పై హైకోర్టు గురువారం స్టే విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సరస్వతి ఇండస్ట్రీస్ భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన వారిపై కాకుండా వారిని అడ్డుకున్న తమపై మాచవరం పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని, ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రామకృష్ణారెడ్డి, వేణుగోపాలరాజు తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ విచారించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, మార్కెట్ ధర కన్నా అధిక మొత్తం చెల్లించి సరస్వతి యాజమాన్యం భూములు కొనుగోలు చేసిందని, ఇప్పుడు ఆ భూములను అధికార పార్టీ నేతల సహకారంతో కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని తెలిపారు. పోలీసులు పిటిషనర్లపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయ కక్షసాధింపు తోనేఈ కేసు నమోదు చేశారని ఆయన వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ పిటిషనర్ల అరెస్ట్పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ పై హైకోర్టు స్టే
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్ట్పై హైకోర్టు స్టే విధించింది. గుంటూరు జిల్లా సరస్వతి భూముల వ్యవహారంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకట రమణా రెడ్డి, వేణుగోపాల రాజులతోపాటు మరికొంతమంది అరెస్ట్పై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిందితులను అరెస్ట్ చేయరాదని కోర్టు తెలిపినట్లు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ** -
'టీడీపీ విషసంస్కృతిని అమలు చేస్తోంది'
హైదరాబాద్: కొత్త రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికార టీడీపీ విషసంస్కృతిని అమలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రైతుల భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. దీనిపై అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్లు దౌర్జన్యాలు చేస్తున్నారని అంబటి రాంబాబు వాపోయారు. కాగా, సరస్వతి సిమెంట్స్ భూములను తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అవి పూర్తిగా కొనుగోలు చేసి, రిజిస్టర్ చేసుకున్న భూములని ఆయన స్పష్టం చేశారు. -
'సరస్వతి' భూములపై లేనిపోని వివాదం
సరస్వతి సిమెంట్స్ భూములను తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అవి పూర్తిగా కొనుగోలు చేసి, రిజిస్టర్ చేసుకున్న భూములని.. వాటిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సాగు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన తమ పార్టీ వాళ్లపై దాడి చేశారని, ఇప్పుడు మళ్లీ అక్కడ బాంబులు దొరికాయంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రామకృష్ణారెడ్డి విమర్శించారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ
మాచర్లటౌన్ : టీడీపీ నాయకులు అధికార బలం ప్రదర్శిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ సభను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన పట్టణంలో వైఎస్సార్ సీపీ స్థానిక నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను దారుణంగా చంపుతుంటే ఆ విషయాన్ని నిలదీస్తున్న జగన్మోహన్రెడ్డికి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా అధికారపక్షం వ్యవహరించడం ఏ సభా సంప్రదాయమని ప్రశ్నించారు. సభలో నిరసన వ్యక్తం చేసేందుకు ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇవ్వకపోవడం టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందన్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి ఎదరుకాలేదని, అందరినీ సమదృష్టితో చూడాల్సిన స్పీకర్ ఇలా వ్యవహరించడం సభా సంప్రదాయం కాదనిపేర్కొన్నారు. టీడీపీ ఆగడాలను ప్రజలకు వివరిద్దాం.. గడచిన మూడు నెలల్లో అనేక మంది తమ పార్టీ కార్యకర్తలను టీడీపీ నేతలు బలిగొన్నారన్నారు. దీనిపై చర్చించకుండా ఎప్పుడో పాత సంఘటనలు ప్రస్తావించి అసలు విషయాన్ని చర్చకు రాకుండా సభను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. పరిటాల రవి హత్య కేసు విచారణ పూర్తయి నిందితులు కూడా శిక్షకు గురైతే ఆ సంఘటనను పట్టుకుని జగన్పై నిందారోపణలు చేస్తున్నారని, ఎమ్మెల్యేలను స్మగ్లర్లంటూ ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ నాయకుడిపై కావాలనే టీడీపీ నాయకులు ఎదురుదాడి చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూనే ఉన్నారని, టీడీపీకి తొందరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మనోధైర్యంతో అధికార పార్టీ ఆగడాలను ఎదుర్కొని వారి దౌర్జన్యాల గురించి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో మార్కెట్యార్డు మాజీ చైర్మన్ తాడి వెంకటేశ్వరరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బత్తుల ఏడుకొండలు, పార్టీ న్యాయవాద విభాగ నాయకులు కుర్రి సాయిమార్కొండారెడ్డి పాల్గొన్నారు. -
'బాబుపై అభిమానం ఉంటే పేజీలు పేజీలు రాసుకోండి'
మాచర్ల : చంద్రబాబు నాయుడు మీద అభిమానం ఉంటే రోజూ పేజీలు పేజీలు రాసుకోండి అంతేకాని లేనిపోని అవాస్తవాలను రాసి ఎల్లో జర్నలిజం ద్వారా ప్రజలను మభ్యపెట్టవద్దని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఎల్లో మీడియాకు సంబంధించిన ఓ పత్రికలో తాను టీడీపీలో చేరుతున్నట్లు ఊహాగానాలతో వార్త ప్రచురించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎవరితో ఎప్పుడూ చర్చలు జరపలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో బలమైన ప్రతిపక్షాన్ని... బలహీనపరిచేందుకు వైఎస్ కుటుంబానికి అండగా ఉండే తనలాంటి వారిపై తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైండ్ గేమ్ ప్రారంభించిందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అందుబలో భాగంగా నీచ రాజకీయాలకు పాల్పడుతూ బేరసారాలను కొనసాగిస్తోందన్నారు. ఎవరూ టీడీపీ బేరసారాల గురించి పట్టించుకోకపోవడంతో ఏదో ఒకవిధంగా బురద జల్లి ఎమ్మెల్యేలు అధికంగా టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం చేయడంలో భాగంగా వైఎస్ కుటుంబం అండదండలతో మూడుసార్లు గెలుపొందిన తాను పార్టీ మారుతున్నానని విస్తృతంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీలోకి వెళ్లే అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. నిరాధార కథనాలను రాస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. -
ఏరుదాటాక...
సాక్షి, గుంటూరు: ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా అవసరమైనప్పుడు తమను వాడుకుని ఎన్నికలు వచ్చేసరికి పక్కన పెట్టారని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఆస్తులమ్ముకుని మరీ బలోపేతాని కృషిచేసిన తమను కూరలో కరివేపాకులా తీసేశారని పార్టీ అధినేత చంద్రబాబుపై జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. మాచర్ల నియోజకవర్గం ఇన్చార్జి చిరుమామిళ్ల మధుబాబు టికెట్టు ఆశించి భంగపడ్డారు. 2012 ఉప ఎన్నికల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎవరూ పోటీకి రాకపోవడంతో 2014 ఎన్నికల్లో సైతం టిక్కెట్టు ఇస్తామంటూ నమ్మబలికి మధుబాబుతో ఉప ఎన్నికల్లో పోటీ చేయించి కోట్లు ఖర్చు చేయించారు. తీరా 2014 ఎన్నికల్లో టికెట్టు అడిగితే సామాజిక సమీకరణల పేరుతో ఆయనను పక్కన పెట్టారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన మధుబాబు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మకాయల రాజనారాయణ సైతం గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, 2009 ఎన్నికల్లో పార్టీ కోసం తీవ్రంగా శ్రమించి అధిక మొత్తంలో ఖర్చు పెట్టారు. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్టు ఇవ్వకుండా నరసరావుపేటకు చెందిన మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావుకు టికెట్టు కేటాయించారు. దీంతో ఆవేదన చెందిన రాజనారాయణ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గుంటూరుకు చెందిన బీసీ నాయకులు బోనబోయిన శ్రీనివాసయాదవ్ కూడా అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతూ గుంటూరు వెస్ట్ టికెట్టు ఆశించారు. నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డికి ఇక్కడ సీటిచ్చి ఆయనకు మాచర్ల టికెట్టు కేటాయించారు. తాను మాచర్లలో పోటీ చేయలేనని తనకు మంగళగిరి టికెట్టు కేటాయించమని అడిగినా అధినేత పట్టించుకోకపోవడంతో గుంటూరు పార్లమెంటు, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాలకు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 2014 ఎన్నికల్లో తాను సత్తెనపల్లికి వెళ్లి నీకు నరసరావుపేట టికెట్ ఇప్పిస్తానంటూ మాజీమంత్రి కోడెల ఆశచూపి నరసరావుపేటకు చెందిన బీసీ నాయకులు సింహాద్రి యాదవ్తో అధిక మొత్తంలో ఖర్చు చేయించారు. తీరా ఎన్నికలు వచ్చే సమయానికి అదికాస్తా మరిచిన కోడెల తాను మాత్రం సత్తెనపల్లికి వె ళ్లి నరసరావుపేట స్థానాన్ని బీజేపీకి కేటాయించడంలో కీలకపాత్ర పోషించారని తీవ్ర ఆగ్రహంతో ఉన్న సింహాద్రియాదవ్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. {పత్తిపాడు నుంచి కందుకూరు వీరయ్య, గుంటూరు వెస్ట్ నుంచి మిన్నెకంటి జయశ్రీ, మంగళగిరి నుంచి అంకవరప్రసాద్ కూడా పార్టీ కోసం కష్టపడి ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం వీరిని గుర్తించకుండా కొత్త అభ్యర్థులకు టికెట్టు ఇవ్వడంతో వీరు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. వీరు ముగ్గురు టీడీపీ రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. ఇలా జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని పక్కన బెట్టి ఆర్థికంగా బలమైన అభ్యర్థులకు టికెట్లు కేటాయించారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
'వైఎస్ ఉండి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు'
గుంటూరు : వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టేది కాదని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఓట్లు-సీట్లు కోసం కాంగ్రెస్ రాజకీయ డ్రామా ఆడుతోందని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్ నాలుగోవ వర్థంతి సందర్భంగా ఆ వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించింది. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి, పేదలకు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వైఎస్ఆర్ వర్థంతి వేడుకలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ నేత మద్దాల రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు చేపట్టారు. చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఇక చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెంలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.