Prince Harry
-
బ్రిటన్ యువరాజుపై ట్రంప్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి ఎన్నికైన తర్వాత అక్రమ వలస దారుల విషయంలో కఠినంగా ఉన్నారు. అమెరికాలో ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే వారిని కచ్చితంగా వెనక్కి పంపిస్తామనే సంకేతాలు అధ్యక్షుడిగా ఎన్నికైన ఆరంభంలోనే ఇచ్చారు ట్రంప్. అయితే అమెరికాలోనే ఉంటున్న బ్రిటన్ యువరాజు హ్యారీ విషయంలో ట్రంప్ ఆచితూచి అడుగులేస్తున్నారు. డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్హ్యారీ(Prince Harry)ని వెనక్కి పంపించాలని అనుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. శుక్రవారం నాటి న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం హ్యారీ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు..న్యూయార్క్ పోస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. హ్యారీని వెనక్కి పంపే విషయంలో క్లారిటీ ఇచ్చారు.‘ ప్రిన్స్ హ్యారీ విషయంలో నేను ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అతన్ని ఒంటరిగా వదిలేస్తున్నా. అతనికి ఇప్పటికే భార్యతో అనేక సమస్యలున్నాయి. అందుచేత హ్యారీపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు’ అని పేర్కొన్నారు.ఇప్పటికే హ్యారీకి సంబంధించిన అమెరికా వీసాపై అనేక న్యాయపరమైన చిక్కులున్నాయి. అమెరికా వీసా(USA VISA) ప్రొసెస్లో ఉండగా హ్యారీపై చట్ట వ్యతిరేకమైన డ్రగ్స్ వాడారనే ఆరోపణలు వచ్చాయి.ఇదిలా ఉంచితే, 2020 జనవరిలో రాయల్ డ్యూటీలను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజకుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో శాంటా బార్బరా సమీపంలోని మాంటెసిటోలో నివాసం ఉంటున్నారు. బ్రిటన్ రాజు చార్లెస్ III చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేఘన్ల మధ్య విభేదాలు తలెత్తాయి. మేఘన్కు తాను అనుకున్నట్లు హ్యారీతో జీవితం లేదనే కారణంతోనే అతనికి ఆమె దూరంగా ఉంటున్నట్లు గతంలోనే కథనాలు వచ్చాయి. దీనికి తోడు హ్యారీ దంపతులు రాజ కుంటుంబ సభ్యలు హోదాను వదులుకుని అమెరికాలో కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. అయితే అక్కడ చోటు చేసుకున్న పలు పరిణామాలతో హ్యారీతో మేఘన్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. -
హ్యారీకి రాజకుటుంబం.. పుట్టినరోజు శుభాకాంక్షలు
బ్రిటన్ యువరాజు హ్యారీకి బ్రిటన్ రాజ కుటుంబం జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఆదివారం ఆయన 40వ జన్మదినం సందర్భంగా బర్త్ డే కేక్ ఎమోజీతో మెరిసిపోతున్న హ్యారీ ఫోటోను పంచుకుంది. ‘‘డ్యూక్ ఆఫ్ ససెక్స్కు 40 వ పుట్టినరోజు శుభాకాంక్షలు’’క్యాప్షన్ను జత చేసింది. ప్రిన్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కూడా ఈ ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. 2021 తరువాత రాజకుటుంబం ఖాతా నుంచి హ్యారీకి వచి్చన మొట్టమొదటి బహిరంగ పుట్టినరోజు సందేశం ఇది. డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ ససెక్స్ 2020 జనవరిలో రాయల్ డ్యూటీలను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజకుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కాలిఫోరి్నయాలోని శాంటా బార్బరా సమీపంలోని మాంటెసిటోలో నివాసం ఉంటున్నారు. నెట్ఫ్లిక్స్, స్పాటిఫై సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. – లండన్ -
ప్రిన్స్ హ్యారీ, భార్య మేఘన్ల మధ్య విభేదాలు తలెత్తాయా?
బ్రిటన్ రాజు చార్లెస్ III చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేఘన్ మర్క్లేల మధ్య విభేదాలు తలెత్తాయా? అందుకే వారిద్దరి మధ్య దూరం ఏర్పడిందా? అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా సంస్థలు.అందుకు ఊతం ఇచ్చేలా మేఘన్ తన జీవితం ‘తాను అనుకున్నట్లుగా లేదని’, కాబట్టే ఆమె ఆందోళన చెందుతోందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ప్రముఖ ఆథర్ టామ్ క్విన్ ఓ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ.. ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేఘన్ మార్క్లేల మధ్య దూరం పెరిగిపోతుంది. మేఘన్ తాను కోరుకున్నట్లు తన జీవితం లేదని బాధపడుతోంది. ఎందుకంటే తనకు మీడియా అటెన్షన్ అంటే బాగా ఇష్టం. అయితే ఇటీవల కాలంలో పలు సర్వేలు హ్యారీని,మేఘన్ను పెద్దగా పట్టించుకోవడం లేదనే రిపోర్ట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దీనికి తోడు 2020లో హ్యారీ దంపతులు రాజకుంటుంబ సభ్యలు హోదాను వదులుకుని అమెరికాలో కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. అయినప్పటికీ మొదట్లో కాలిఫోర్నియాలో హ్యారీ దంపతులకు అపూర్వ ఆదరణ లభించిందని, సినీరంగానికి చెందిన (హాలీవుడ్) ప్రముఖులు వారితో స్నేహం కోసం క్యూకట్టినట్లు పలు మీడియా రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ, వారి ప్రజాదరణ తగ్గుముఖం పట్టిందని సర్వేలు హైలెట్ చేశాయి. మేఘనా మార్క్లే ‘అమెరికాలో రివేరా ఆర్చర్డ్’ అనే ఆహార ఉత్పత్తుల బ్రాండ్ను లాంచ్ చేశారు. ఆ సమయంలో ఆమె కన్నీటి పర్యంతరమయ్యారు. ఎందుకంటే ఆమె రివే ఆర్చర్డ్స్ ఆహార ఉత్పత్తులు చాలా ఖరీదైనవి. కానీ వాటిల్లో అంత నాణ్యత లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శల్ని తాను తట్టుకోలేకపోయారు. అమెరికాలో మేఘన్ విలాసవంతమైన జీవనశైలిపై ఎప్పుడూ విమర్శలు వస్తుంటాయి. ఈ అంశం ఆమెకు అస్సలు మింగుడు పడడం లేదు. ఈ వరుస పరిణామాలు తాను అనుకున్నట్లు తన జీవితం లేదని మేఘన బాధపడుతుందని ఆథర్ టామ్ క్విన్ చెప్పారు. దీనికి తోడు ప్రిన్స్ హ్యారీని మేఘన్ను విసిగిస్తుందనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హ్యారీకి యూకేలోని తన స్నేహితులు అంటే చాలా ఇష్టం. వారిని కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండేవారు. కానీ హ్యారీ వారిని కలుసుకోవడం మేఘన్కు అస్సలు ఇష్టం ఉండదు. బహుశా ఈ తరహా వ్యక్తిగత భేదాభిప్రాయాల కారణంగా ప్రిన్స్ హ్యారీ అతడి భార్య మేఘన్ మర్క్లేల మధ్య దూరం పెరిగిపోతుందని పరోక్షంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. -
‘మీడియా దాడితో ఈ క్షణం దాకా బాధపడుతున్నా!’
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలో వందేళ్ల తర్వాత ఓ కీలక పరిణామం జరిగింది. సుమారు 130 ఏళ్ల తర్వాత.. తొలిసారి ఈ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కోర్టుకు హాజరయ్యారు. అతనే ప్రిన్స్ హ్యారీ(38). కింగ్ ఛార్లెస్ రెండో తనయుడు. ఫోన్ హ్యాకింగ్కు సంబంధించిన కేసులో ఓ వార్తా సంస్థకు వ్యతిరేకంగా మంగళవారం కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పాడు హ్యారీ. మీడియా దాడితో నేను జీవితాంతం బాధపడుతున్నా. కొన్ని టాబ్లాయిడ్లు, ఛానెల్స్, వెబ్సైట్లు.. తమ చేతులకు రక్తపు మరకలు అంటించుకుని తిరుగుతున్నాయి. వాళ్ల నిరంతర టీఆర్పీ రేటింగ్.. రీడర్షిప్ల దాహార్తికి నన్ను ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. అది నేటి వరకు.. ఈ క్షణం దాకా కూడా.. అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారాయన. తనను చెడ్డొడిగా చూపిస్తూ బ్రిటన్ మీడియా లాభపడుతోందంటూ ఆరోపించారాయన. ప్రత్యక్ష సాక్షి హోదాలో కోర్టు బోనెక్కిన ప్రిన్స్ ఛార్లెస్.. ఎవరైనా ఈ మీడియా పిచ్చికి అడ్డుకట్ట వేయకముందే వాళ్ల టైపింగ్ వేళ్లను ఎంత రక్తం ముంచేస్తుందో అంటూ తనపై వస్తున్న కథనాలపై ఆందోళన వ్యక్తం చేశారాయన. ప్లేబాయ్ ప్రిన్స్, ఫెయిల్యూర్, డ్రాప్అవుట్, మోసగాడు, తాగుబోతు, ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి.. ఇలా ఆ మీడియా తనపై అల్లిన కథనాల జాబితా పెద్దదేనంటూ కోర్టుకు తెలిపారాయన. టీనేజర్గా ఉన్నప్పుడు, ట్వంటీస్లో ఉన్నప్పుడు.. మీడియా నీచమైన రాతలను తాను చూడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. ఇదిలా ఉంటే.. బ్రిటన్కు చెందిన మిర్రర్ గ్రూప్ రాజకుటుంబం సహా అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. అందులో ఒకటే ఈ ఫోన్ హ్యాకింగ్ కేసు. ప్రిన్స్ హ్యారీతో పాటు పలువురు ప్రముఖులు ఈ వ్యవహారంపై సదరు మీడియా హౌజ్ను కోర్టుకు లాగారు. ఇక రాజకుటుంబానికి దూరంగా.. తన భార్య మేఘన్ మర్కెల్, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు ప్రిన్స్ హ్యారీ. సోమవారమే లండన్ చేరుకున్నప్పటికీ.. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం న్యాయస్థానంలో హాజరు అయ్యారు. తన వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు మిర్రర్ గ్రూప్ ఉపయోగించిన మోసపూరిత పద్ధతుల కారణంగా తన జీవితం ఎలా అతలాకుతలం అయ్యిందో హ్యారీ.. న్యాయమూర్తికి వివరించారు. చట్టవ్యతిరేకంగా సేకరించిన వివరాలతో.. 140 ఆర్టికల్స్ను ప్రచురించారని, ఒకానొక టైంలో ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లను సైతం ఉపయోగించారని హ్యారీ కోర్టుకు వివరించారు. 130 ఏళ్ల కిందట ఆయన.. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తులు కోర్టుకు హాజరవ్వడం 130 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 1870లో ఓ విడాకుల కేసుకు సంబంధించి ఎడ్వర్డ్ VII కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత 1891లో ఓ గ్యాంబ్లింగ్ కేసులోనూ ఇంగ్లీష్ హైకోర్టుకు వెళ్లి సాక్ష్యమిచ్చారు. అయితే, ఆయన రాజు కాకమునుపే ఈ రెండూ జరిగాయి. -
కోర్టు బోనెక్కి సాక్ష్యం చెప్పనున్న ప్రిన్స్ హ్యారీ
లండన్: బ్రిటన్ రాజు చార్లెస్ –3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ సాక్ష్యం ఇవ్వడానికి వచ్చే వారంలో కోర్టుకు హాజరుకానున్నారు. రాజకుటుంబానికి చెందినవారు ఇలా కోర్టు బోనెక్కడం 130 ఏళ్లలో ఇది తొలిసారి. డైలీ మిర్రర్, సండే మిర్రర్ వంటి వార్తా పత్రికల ప్రచురణ సంస్థ మిర్రర్ గ్రూప్ న్యూస్పేపర్స్ (ఎంజీఎన్) సెలిబ్రిటీల వ్యక్తిగత అంశాలను సేకరించడం కోసం చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై 100 మంది సెలిబ్రిటీలతో పాటు ప్రిన్స్ హ్యారీ కూడా మిర్రర్ గ్రూప్పై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారిస్తున్న లండన్ హైకోర్టులో ప్రిన్స్ హ్యారీ హాజరై ఫోన్ ట్యాంపింగ్పై సాక్ష్యం ఇవ్వనున్నారు. గతంలో 1870లో ఎడ్వర్డ్–7 ఒక విడాకుల కేసులో సాక్ష్యమిచ్చారు. -
కోర్టు బోనులో నిలబడనున్న బ్రిటన్ రాకుమారుడు.. 130 ఏళ్లలో తొలిసారి!
లండన్: బ్రిటన్ రాజు చార్లెజ్-III రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఓ వార్తా సంస్థపై హ్యారీతోపాటు ఇతర ప్రముఖులు వేసిన కేసు విచారణలో భాగంగా లండన్ హైకోర్టులో బోనులో(విట్నెస్ బాక్స్) నిలబడి సాక్ష్యం చెప్పనున్నారు. దీంతో 1890 నుంచి గత 130 సంవత్సరాల్లో కోర్టులో సాక్ష్యం చెప్పిన తొలి బ్రిటన్ రాజకుటుంబీకుడిగా హ్యారీనే కావడం విశేషం. కాగా ప్రిన్స్ హ్యారీతోపాటు సినిమా, క్రీడా రంగానికి చెందిన దాదాపు 100 మందికిపైగా ప్రముఖులు బ్రిటిష్కు చెందిన మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్పై లండన్ కోర్టులో దావా వేశారు.జర్నలిస్టులు, వారు నియమించిన ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లు భారీ స్థాయిలో ఫోన్ హ్యాకింగ్కు పాల్పడ్డారని, మోసపూరితంగా వ్యక్తిగత వివరాలను పొందడంతోపాటు ఇతర అక్రమ చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కోర్టులో కేసు ఫైల్ చేశారు. 1991 నుంచి 2011 వరకు సదరు పత్రిక విస్తృతంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై మే 10న విచారణ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు తన నిర్ధిష్ట కేసు విచారణలో భాగంగా హ్యారీ సాక్ష్యం ఇవ్వనున్నారు. అయితే 1870లో విడాకుల కేసులో ఎడ్వర్డ్ VII కోర్టుకు సాక్షిగా హాజరయ్యారు. అనంతరం 20 ఏళ్లకు కార్డ్ గేమ్పై కేసు విచారణలో మరోసారి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ రెండు ఆయన రాజు కావడానికి ముందే జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పడం ఇదే తొలిసారి. చదవండి: పాకిస్తాన్, చైనాతో పోలిస్తే ఆ విషయంలో భారత్ చాలా బెటర్.. -
ప్రిన్స్ హ్యారీ దంపతుల్ని వేటాడిన కెమెరాలు!.. కొద్దిలో తప్పిన ప్రమాదం
న్యూయార్క్: అమెరికాలో ఓ దాతృత్వ కార్యక్రమానికి వెళ్లొస్తున్న బ్రిటన్ రాచకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ, భార్య మెఘాన్, అత్త డోరియా రాగ్లాండ్లను మీడియా ఫొటోగ్రాఫర్లు ఫొటోల కోసం వెంబడించారు. ఇది పాతికేళ్ల క్రితం హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానాను పారిస్లో కెమెరామెన్లు వాహనాల్లో వెంబడించడం అది విషాదాంతమవడాన్ని గుర్తుచేసింది. ‘ఆరు వాహనాల్లో మీడియా వ్యక్తులు ఏకంగా రెండు గంటలపాటు హ్యారీ వాహనాన్ని వెంబడించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పలు వాహనాలు దాదాపు గుద్దుకున్నంత పని జరిగింది. ఈ ఘటనలో పలు వాహనాలు, పాదచారులు, ఇద్దరు న్యూయార్క్ పోలీసు అధికారులు చాలా ఇబ్బంది పడ్డారు’ అని హ్యారీ అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. ఘటన తర్వాత పోలీస్ రక్షణలో వారు వెళ్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే అధికారికంగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని న్యూయార్క్ పోలీసు విభాగం ప్రకటించింది. లండన్లో బ్రిటన్ రాజుగా చార్లెస్ పట్టాభిషేకÙకం తర్వాత దాదాపు నెలరోజుల తర్వాత తొలిసారిగా ఈ జంట మీడియా కంటపడటంతో మీడియా అత్యుత్సాహం చూపి ఉంటుందని వార్తలొచ్చాయి. చదవండి: అమెరికాలో అదృశ్యమైన ఎన్ఆర్ఐ లహరి మృతి -
రాజుగా చార్లెస్–3 పట్టాభిషేకం.. మేఘన్-హ్యారీ రాకపై కీలక ప్రకటన
లండన్: బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్లోని వెస్ట్మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే, చార్లెస్–3 పట్టాభిషేకం సందర్బంగా అందరి ఫోకస్ రాజకుటుంబం మీదే ఉంది. ఈ నేపథ్యంలో, రాచరికాన్ని వదులుకున్న చార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ ఈ కార్యక్రమానికి వస్తారా..? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ విషయంపై బకింగ్ హామ్ ప్యాలెస్ శనివారం ఉదయం కీలక ప్రకటన చేసింది. పట్టాభిషేక మహోత్సవానికి హ్యారీ వస్తున్నట్లు తెలిపింది. అయితే మేఘన్ మాత్రం హాజరుకావడం లేదని అధికారికంగా ప్రకటించింది. ‘రాజు పట్టాభిషేక మహోత్సవానికి డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ హాజరవుతారు.. కానీ, ప్రిన్స్ ఆర్కీ, ప్రిన్సెస్ లిలిబెట్తో కలిసి డచెస్ ఆఫ్ ససెక్స్ మేఘన్ మార్కెల్ కాలిఫోర్నియాలోనే ఉండిపోతారు అని ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది’. ఇదిలా ఉండగా.. మేఘన్-హ్యారీ దంపతులకు ఇద్దరు సంతానం. ఆర్కీ, లిలిబెట్. అయితే, రాజు సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో ఆర్కీ ఆరోస్థానంలో ఉన్నారు. కింగ్ చార్లెస్ పట్టాభిషేకం రోజునే ఆ చిన్నారికి నాలుగేండ్లు పూర్తవుతాయి. ఇక, రాజకుటుంబంతో విభేధాల కారణంగా చార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ , ఆయన భార్య మేఘన్ మార్కెల్ రాజరికాన్ని వదులుకున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ రాజకుటుంబంతో ప్రిన్స్ హ్యారీకి విభేధాలు వచ్చిన విషయం తెలిసిందే. భార్య ప్రేమ, వివాహ బంధం కోసం రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ బ్రిటన్ రాజకుటుంబానికి దూరమయ్యారు. ప్రస్తుతం అతను భార్య, పిల్లలతో అమెరికాలో స్థిరపడ్డారు. మరోవైపు.. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులు శుక్రవారం లండన్కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. Prince Harry will be attending the #coronation today, but Meghan Markle has remained in California with their children.https://t.co/LfDJkI6e7i pic.twitter.com/PQYLkr68tI — Newsweek (@Newsweek) May 6, 2023 ఇది కూడా చదవండి: వీడియో: రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్ ఎంపీ పంచ్ల వర్షం -
Prince Harry: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోని విభేధాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. మే 6వ తేదీన జరగబోయే కింగ్ ఛార్లెస్ Charles III పట్టాభిషేకం కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో.. ప్రిన్స్ హ్యారీ రాక గురించి ఆసక్తి నెలకొంది. అయితే అయిష్టంగానే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలుస్తోంది. తండ్రి ఛార్లెస్ పిలుపు మేరకు ప్రిన్స్ హ్యారీ పట్టాభిషేకానికి హాజరు అవుతారని, కానీ, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారని రాజకుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. ప్రిన్సెస్ డయానా దగ్గర బట్లర్గా పని చేసిన పాల్ బరెల్.. ప్రస్తుతం రాజకుటుంబంలోని వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఆయన తాజా పరిణామాలపై స్పందించారు. ఛార్లెస్, విలియమ్-హ్యారీల మధ్య సయోధ్య ఇప్పట్లో జరగకపోవచ్చు. పట్టాభిషేక కార్యక్రమంలో వాళ్ల మధ్య కనీసం మాటలు కూడా ఉండకపోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. తండ్రిపై గౌరవంతో.. డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ హోదాలో కేవలం ముఖం చూపించేందుకు మాత్రమే హ్యారీ అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. అంతేగానీ ఆ కుటుంబంలో మళ్లీ కలిసిపోవడానికి ఎంత మాత్రం కాదు అని పేర్కొన్నారు పాల్. ఇక మూడు రోజులు పాటు జరిగే పట్టాభిషేక మహోత్సవంలో కేవలం సింహాసనాన్ని అధిష్టించే కార్యక్రమం నాడు మాత్రమే ప్రిన్స్ హ్యారీ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు 24 గంటలు గడవక ముందే ఆయన యూకేను విడిచి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు పట్టాభిషేక సమయంలో ముందు వరుసలో కాకుండా.. దూరంగా ఎక్కడో పదో వరుసలో ఆయన కూర్చుంటారని సమాచారం. అయితే ఆయన భార్య మేఘన్ మార్కే హాజరుపై మాత్రం స్పష్టత లేదు. క్వీన్ ఎలిజబెత్-2 మరణం అనంతరం రాజుగా పగ్గాలు చేపట్టిన ఛార్లెస్-3.. ఇప్పుడు ఎనిమిది నెలల తర్వాత పట్టాభిషేకం జరుపుకోబోతున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆయన 40వ చక్రవర్తి. ఆయన రెండో భార్య క్యామిల్లా యూకే రాణిగా బాధ్యతలు చేపట్టనుంది. అయితే.. పూర్తిస్థాయి మహారాణి హోదా కాదు. ఆ తరహా హోదాతో కూడిన క్వీన్ కాన్సోర్ట్ మాత్రమే. అంటే నామమాత్రపు మహారాణిగా బకింగ్హమ్ ప్యాలెస్లో ఆమె నివసించనున్నారు. రాజకుటుంబంలో ఏం జరిగింది? భార్యలు రాజేసిన చిచ్చు భగ్గున మండి.. -
నా భార్యకు రాజకుటుంబం క్షమాపణ చెప్పాలి
లండన్: బ్రిటన్ రాజకుటుంబం నుంచి క్షమాపణకు తన భార్య మేఘన్ మెర్కెల్ అర్హురాలని ఆమె భర్త ప్రిన్స్ హ్యారీ తేల్చిచెప్పారు. తన భార్యను మానసికంగా వేధింపులకు గురిచేశారని, ఆమెకు క్షమాపణ చెప్పాలని రాజకుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఆయన తాజాగా డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. బ్రిటిష్ మీడియా తన భార్య మెర్కెల్ను అనవసరంగా ట్రోల్ చేస్తోందని విమర్శించారు. తన వదిన కేట్ మిడిల్టన్ పట్ల జనంలో సానుకూలత పెంచాలన్నదే మీడియా యత్నమని ఆరోపించారు. రాజకుటుంబాన్ని ముక్కలు చేయాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. రెండు పుస్తకాలకు సరిపడా సమాచారం తన వద్ద ఉందని, అదంతా బయటపెట్టి తన తండ్రిని, సోదరుడిని ఇబ్బంది పెట్టాలని తాను కోరుకోవడం లేదని చెప్పారు. తనకు, తండ్రికి, సోదరుడికి మధ్య జరిగిన విషయాలన్నీ బయటపెడితే వారు తనను ఎప్పటికీ క్షమించబోరని అన్నారు. తండ్రి, సోదరుడు తన పట్ల దారుణంగా వ్యవహరించారని, అయినప్పటికీ వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వారితో కూర్చొని మాట్లాడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను వారి నుంచి కేవలం జవాబుదారీతనం, తన భార్యకు క్షమాపణను మాత్రమే కోరుకుంటున్నానని ప్రిన్స్ హ్యారీ స్పష్టం చేశారు. ఆయన ఇటీవలే తన ఆత్మకథ ‘స్పేర్’ను విడుదల చేశారు. ఇందులో పలు సంచలన విషయాలను బయటపెట్టారు. రాజకుటుంబంలో తనకు ఎదురైన చాలా అవమానాలను ‘స్పేర్’ పుస్తకంలో చేర్చలేదని ప్రిన్స్ హ్యారీ చెప్పారు. -
మా అమ్మ పార్థివ దేహం వద్ద... కరువుదీరా ఏడ్వలేకపోయా
లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై ప్రిన్స్ హ్యారీ (38) విమర్శలు, ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రేమకు ప్రతిరూపమైన తన తల్లి డయానా చనిపోతే కనీసం కరువుదీరా ఏడవలేకపోయానని మంగళవారం విడుదల కానున్న తన స్వీయచరిత్ర ‘స్పేర్’లో ఆయన వాపోయారు. రాచ కుటుంబపు కఠినమైన నైతిక కట్టుబాట్లే అందుకు కారణమని ఆరోపించారు. ‘‘ఏం జరిగినా ఏడవకూడదన్నది రాజకుటుంబంలో అలిఖిత నియమం. ఇలాంటి వాటిని చిన్నతనం నుంచే రుద్దీ రుద్దీ నా హృదయాన్ని బండబార్చారు. దాంతో మా అమ్మ చనిపోయి అంతులేని శూన్యాన్ని మిగిల్చినా ఆ దుర్భర ఆవేదనను బయట పెట్టే స్వేచ్ఛ కూడా లేకపోయింది. దాన్నంతటినీ గుండెల్లోనే అదిమి పెట్టి మా అమ్మ కడసారి చూపు కోసం భారీగా తరలివచ్చిన అభిమానులను నవ్వుతూ పలకరించాల్సి వచ్చింది. కానీ వారిలో ఎవరితో కరచాలనం చేసినా అరచేతులన్నీ తడితడిగా తగిలాయి. అవన్నీ వారి కన్నీళ్లతో తడిశాయని అర్థమై చాలా సిగ్గుపడ్డా. ఆ వీడియోలను ఇప్పుడు చూసినా సిగ్గేస్తుంటుంది’’ అన్నారు. -
డ్రగ్స్ తీసుకున్నా: హ్యారీ
లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై రాజు చార్లెస్–2 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ సంచలన ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. అన్న ప్రిన్స్ విలియంతో తన బంధం ఎప్పుడూ సమస్యాత్మకంగానే సాగిందంటూ త్వరలో విడుదలవనున్న తన ఆత్మకథలో బయట పెట్టారాయన. ‘‘2021లో ఒకసారి మేమిద్దరం మా నాన్న సమక్షంలోనే తలపడ్డాం. మీరిలా కొట్టుకుని నా చివరి రోజులను దుర్భరంగా మార్చకండంటూ ఆయన మమ్మల్ని విడదీశాడు’’ అని వివరించారు. ‘‘రాచ కుటుంబీకుల పెళ్లిళ్లు జరిగే వెస్ట్మినిస్టర్ అబేలోని సెయింట్ పాల్స్ కెథడ్రెల్లో మెగన్, నేను ఒక్కటయ్యేందుకు కూడా విలియం ఒప్పుకోలేదు’’ అన్నారు. రాచరికపు జీవితపు ఒత్తిడిని తట్టుకోలేకు ఒక దశలో డ్రగ్స్కు అలవాటు పడ్డట్టు చెప్పారు! ‘‘17 ఏళ్ల వయసులో తొలిసారిగా కొకైన్ వాడా. అంత థ్రిల్లింగ్గా ఏమీ అన్పించలేదు. తర్వాత ఎలన్ కాలేజీలో చదువుతున్న సమయంలో బాత్రూంలో గంజా తాగాను. కాలిఫోర్నియాకు వెళ్లినప్పుడు మ్యాజిక్ మష్రూమ్స్ వంటివి టేస్ట్ చేశా. 17 ఏళ్లప్పుడే వయసులో నాకంటే పెద్దావిడతో తొలి లైంగికానుభవం రుచి చూశా’’ అని వివరించారు. ‘‘12 ఏళ్ల వయసులో నా తల్లి డయానాను ప్రమాదంలో కోల్పోవడం బాధించింది. నిద్ర పోతున్న నన్ను లేపి నాన్న ఆ వార్త చెప్పారు. కానీ కనీసం నన్ను దగ్గరికి కూడా తీసుకుని ఓదార్చలేదు. మరణించిన నా తల్లితో ఎలాగైనా మాట్లాడేందుకు ‘శక్తులున్న’ ఒక మహిళను ఆశ్రయించా’’ అని చెప్పుకొచ్చారు. కెమిల్లాను పెళ్లి చేసుకోవాలని తండ్రి భావించినప్పుడు వద్దని తాను, విలియం బతిమాలామన్నారు. హ్యారీ బయట పెట్టిన ఈ అంశాలపై వ్యాఖ్యానించేందుకు రాజ కుటుంబం తిరస్కరించింది. -
నా అన్న కాలర్ పట్టి కొట్టాడు: ప్రిన్స్ హ్యారీ
శాక్రమెంటో: బ్రిటన్ రాజకుటుంబంలో కుటుంబ కలహాలు సమసిపోయి అంతా సర్దుకుంటుందనుకుంటున్న సమయంలో.. మరో పరిణామం చోటు చేసుకుంది. డ్యూక్ ఆఫ్ సస్సెక్స్, ప్రిన్స్ హ్యారీ సంచలనాలకు తెర తీశాడు. తన ఆత్మకథ ‘స్పేర్’ ద్వారా బయటి ప్రపంచానికి రాజ‘కుటుంబ’ కలహాలను పూసగుచ్ఛినట్లు వివరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తన అన్న, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన విలియమ్ తనపై భౌతిక దాడికి దిగాడని, అందుకు తన భార్య మేఘన్ మార్కెల్ కారణమని చెబుతూ పెద్ద షాకే ఇచ్చాడు. ది గార్డియన్ కథనం ప్రకారం.. స్పేర్ ఆత్మకథలోని ఆరో పేజీలో ప్రిన్స్ హ్యారీ ఈ విషయాన్ని తెలియజేశాడు. మేఘన్ మార్కెల్ విషయంలో తన అన్నతో తనకు వాగ్వాదం జరిగిందని, పట్టరాని కోపంతో విలియమ్ తనపై దాడికి దిగాడని హ్యారీ అందులో పేర్కొన్నాడు. మేఘన్ స్వభావాన్ని ఉద్దేశించి విలియమ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే.. తన భార్య గురించి తప్పుగా మాట్లాడొద్దంటూ ఆమెకు మద్దతుగా హ్యారీ ఏదో సర్ది చెప్పబోయాడట. ఈ క్రమంలో సహనం కోల్పోయిన విలియమ్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. హ్యారీ గల్లా పట్టుకుని.. మరో చేత్తో మెడలో గొలసును లాగిపడేశాడు. హ్యారీని నేలకేసి కొట్టాడు. కింద.. కుక్కకు భోజనం పెట్టే పాత్ర తగిలి హ్యారీ వీపుకు గాయమైంది. కష్టంగానే పైకి లేచిన ప్రిన్స్ హ్యారీ.. బయటకు వెళ్లిపోమని విలియమ్ మీదకు అరిచాడు. కోపంగానే విలియమ్ గది నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ పరిణామంతా చాలా వేగంగానే జరిగింది. ఈ ఘటనలో హ్యారీ వీపునకు అయిన గాయం మానడానికి నెలలు పట్టింది అని ఆ కథనం ఆ పేజీ సారాంశాన్ని తెలిపింది. ఇంకా ఈ బుక్.. ఎన్నో ఆసక్తికరమైన, రాజకుటుంబం నుంచి దిగ్భ్రాంతికరమైన విషయాలను వెలుగులోకి తేనుందని గార్డియన్ కథనం పేర్కొంది. జనవరి 10వ తేదీన స్పేర్ మార్కెట్లోకి రీలీజ్ కానుంది. గత సెప్టెంబర్లో తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణం, ఈ మే నెలలో తండ్రి కింగ్ ఛార్లెస్-3కి పట్టాభిషేకం దరిమిలా.. మధ్యలో ఈ అన్నదమ్ముల ఘర్షణ గురించి వెలుగులోకి రావడం, అదీ హ్యారీ ఆత్మకథ ద్వారా కావడం ఇక్కడ గమనార్హం. కలిసిపోతారనుకున్న అన్నదమ్ములను.. ఆ ఆత్మకథ మరింత దూరం చేసేలా కనిపిస్తోంది!. 2020లో రాజరికాన్ని, బ్రిటన్ వదిలేసి హ్యారీ-మార్కెల్ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది. ఆ సమయం నుంచే ఆ అన్నదమ్ముల మధ్య గ్యాప్ వచ్చింది. అయితే.. 2021లో ఈ ఆలుమగలు ఓప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించడం ద్వారా రాజకుటుంబంలోని అన్నదమ్ములు, వాళ్ల వాళ్ల భార్యల మధ్య కలహాలు వెలుగులోకి రావడం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి కూడా. -
ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. రాజకుటుంబంలోని సభ్యులందరితో పాటు 2,000 మంది అతిథులు, విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే రాణి అంత్యక్రియల్లో ఆమె మనవడు, కింగ్ చార్లెస్-3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ వ్యవహరించిన తీరుపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాణి భౌతికకాయం వెస్ట్మినిస్టర్ అబెలో ఉన్నప్పుడు ఆమెకు నివాళిగా అందరూ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ద కింగ్'ను ఆలపించారు. అయితే డేగ కళ్లున్న కొందరు ఈ సమయంలో ప్రిన్స్ హ్యారీని వీడియో తీశారు. ఆయన పెదాలు కదపనట్లు, జాతీయ గీతం ఆలపించనట్లు అందులో కన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. Prince Harry not singing the national anthem 👀 #queensfuneral pic.twitter.com/laNk5JMZ6R — Kieran (@kierknobody) September 19, 2022 ప్రిన్స్ హ్యారీ.. రాణికి మీరిచ్చే మర్యాద ఇదేనా? అని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరొకొందరు మాత్రం ప్రిన్స్ హ్యారీకి మద్దతుగా నిలిచారు. ఆయన జాతీయ గీతాన్ని ఆలపించారని, పెదాలు కదిలాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరేమో.. జాతీయ గీతం మారింది కాబట్టి ఆయనకు కష్టంగా అన్పించిందేమో ఓ సారి అవకాశం ఇచ్చిచూద్దాం అన్నాడు. మరో నెటిజన్.. ఈ కార్యక్రమంలో ఇంకా చాలా మంది ప్రిన్స్ హ్యారీలాగే ప్రవర్తించారని, కింగ్ చార్లెస్ కూడా పెదాలు కదపలేదన్నారు. వాళ్లను పట్టించుకోకుండా ఈయనపైనే ఎందుకుపడ్డారని ప్రశ్నించాడు. మరికొందరు మాత్రం తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు నోట మాటరాదని, అందుకే ప్రిన్స్ హ్యారీ జాతీయ గీతాన్ని ఆలపించలేకపోయి ఉండవచ్చని ఆయనకు అండగా నిలిచారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. దీన్ని సీరియస్గా తీసుకోవద్దని సూచించారు. చదవండి: బ్రిటన్ రాణి అంత్యక్రియలు పూర్తి.. ప్రపంచ దేశాల అధినేతలు హాజరు -
హ్యారీకి అవమానం
లండన్: రాణి అస్తమయం నేపథ్యంలో విభేదాలు పక్కన పెట్టి దగ్గరవుతున్నారని భావించిన రాకుమారులు విలియం, హ్యారీ మధ్య దూరాన్ని మరింతగా పెంచే ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. ఇది హ్యారీకి తీరని అవమానం కూడా మిగిల్చిందట. రాణి ఎలిజబెత్–2 మనవలు, మనవరాళ్లు శనివారం రాత్రి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. విలియంతో పాటు హ్యారీ కూడా రాజు చార్లెస్–3 ప్రత్యేక అనుమతితో ఈ సందర్భంగా సైనిక దుస్తులు ధరించారు. కానీ వాటిపై ఉండాల్సిన రాణి అధికార చిహ్నమైన ‘ఈఆర్’ను తొలగించారు. పెద్ద కుమారుడైన యువరాజు విలియం సైనిక దుస్తులపై మాత్రం ఈఆర్ చిహ్నం అలాగే ఉంచారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక హ్యారీకి గుండె పగిలినంత పనైందట. తండ్రితోనూ సోదరునితోనూ హ్యారీకి సత్సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే. రాచకుటుంబం అభ్యంతరాలను కాదని ఆయన అమెరికా నటి మెగన్ మార్కెల్ను పెళ్లాడినప్పటినుంచీ విభేదాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదా వదులుకున్నారు. దాంతో ఆయన సైనిక దుస్తులు ధరించే అర్హత కోల్పోయారు. ‘‘నాయనమ్మ అంత్యక్రియల సందర్భంగా ప్రత్యేక అనుమతితో వాటిని ధరిస్తే ఇంతటి అవమానం జరిగిందంటూ హ్యారీ కుమిలిపోయారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసిన పనేనని భావిస్తున్నారు. ఎందుకంటే సైనిక దుస్తులు ధరించే అర్హత లేని ఎలిజబెత్–2 కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ సైనిక దుస్తులపై కూడా అధికార చిహ్నాన్ని యథాతథంగా కొనసాగించారు. కేవలం తన దుస్తులపై మాత్రమే తొలగించడం హ్యారీకి మరింత మనస్తాపం కలిగించింది’’ అని ఆయన మిత్రున్ని ఉటంకిస్తూ సండే టైమ్స్ కథనం పేర్కొంది. అంతేకాదు, ఆదివారం రాత్రి బకింగ్హాం ప్యాలెస్లో దేశాధినేతలకు చార్లెస్–3 అధికారిక విందు కార్యక్రమానికి కూడా హ్యారీ దంపతులను దూరంగా ఉంచారు. గురువారం హ్యారీ 38వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా మెగన్తో కలిసి కార్లో వెళ్తుండగా విలియం తన ముగ్గురు పిల్లలను స్కూలు నుంచి కార్లో తీసుకొస్తూ ఎదురయ్యారు. ఇద్దరూ కార్ల అద్దాలు దించుకుని క్లుప్తంగా మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారట. -
Queen Elizabeth 2: ఏడుస్తున్న చిన్నారిని కౌగిలించుకున్న మేఘన్.. వీడియో వైరల్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం మరణించిన తర్వాత ఆమెకు నివాళులు అర్పించేందుకు వేల మంది విండ్సోర్ కాస్టిల్కు తరలివెళ్లారు. రాణి మనవడు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్, మరో మనవడు ప్రిన్స్ విలియమ్, అతని భార్య కేట్ మిడిల్టన్ కలిసి ఈ కోటకు వెళ్లారు. రాణికి సంతాపం తెలిపేందుకు వచ్చినవారికి ధన్యవాదాలు తెలిపి వారితో కాసేపు ముచ్చటించారు. అయితే హ్యారీ భార్య మేఘన్.. కోట బయట ఏడుస్తున్న ఓ టీనేజర్ను ఆప్యాయంగా పలకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ బాలికతో మేఘన్ మాట్లాడిన తీరును నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ వీడియోలో ప్రిన్స్ హ్యారీ కోట బయట ఉన్నవారితో మాట్లాడుతుండగా.. నలుపు రంగు దుస్తుల్లో ఉన్న అతని భార్య మేఘన్ ఓ టీనేజర్ దగ్గరకు వెళ్లింది. ఏడుస్తున్న ఆ చిన్నారిని నీ పేరేంటని అడిగింది. అందుకు ఆ బాలిక అమెల్కా అని బదులిచ్చింది. నీపేరు చాలా బాగుందని చెప్పిన మేఘన్.. రాణికి నివాళులు అర్పించేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పింది. మూడు గంటలుగా వారంతా వేచి చూస్తున్నారని తెలిసి ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు ఏడుస్తున్న అమెల్కాను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది. ఈ వీడియోను ఓ వ్యక్తి మొదట టిక్టాక్లో షేర్ చేశాడు. ఆ తర్వాత అది వైరల్గా మారింది. View this post on Instagram A post shared by MEMEZAR • Comedy and Culture (@memezar) 2018లో ప్రేమ పెళ్లి చేసుకున్న హ్యారీ, మేఘన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. 2021 మార్చి నుంచి వీరు రాజకుటుంబానికి దూరంగా అమెరికాలోని నివసిస్తున్నారు. రాణి మరణానికి ముందు అనుకోకుండా వారు బ్రిటన్లోనే ఉన్నారు. దీంతో కుటంబసభ్యులతో వెళ్లి రాణికి నివాళులు అర్పించారు. రాణి మరణంతో హ్యారీ, మేఘన్ మళ్లీ రాజకుటుంబానికి దగ్గరయ్యే అవకాశాలున్నాయని సన్నిహితవర్గాలు భావిస్తున్నాయి. చదవండి: బ్రిటన్ రాణి ఆ రోజే చనిపోతుందని ముందే చెప్పాడు.. ఇప్పుడు కింగ్ చార్లెస్ -
ఎడింబర్గ్కు రాణి భౌతికకాయం.. రాకుమారుల ఐక్యత!
లండన్: రాణి ఎలిజబెత్–2 చివరియాత్ర లాంఛనంగా మొదలైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్హౌస్ ప్యాలెస్కు తరలించారు. ఈ సందర్భంగా తమ రాణిని కడసారి చూసుకునేందుకు ప్రజలు దారికిరువైపులా వేలాదిగా బారులు తీరారు. శవపేటికతో కూడిన వాహన కాన్వాయ్ వారి నివాళుల మధ్య ఆరు గంటల పాటు ప్రయాణించి ఎడింబర్గ్ చేరింది. రాణి భౌతికకాయాన్ని సోమవారం మధ్యాహ్నం దాకా ఎడింబర్గ్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మంగళవారం విమానంలో లండన్కు తరలిస్తారు. వెస్ట్మినిస్టర్ ప్యాలెస్లో నాలుగు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం 19న అంత్యక్రియలు జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో పాటు పలువురు ప్రపంచ దేశాధినేతలు పాల్గొననున్నారు. రాకుమారుల ‘ఐక్యత’ విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్ చార్లెస్–3 కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు. విండ్సర్ ప్యాలెస్ నుంచి నలుగురూ కలిసే బయటికొచ్చారు. బయట రాణికి నివాళులు అర్పించేందుకు గుమిగూడిన ప్రజలతో కాసేపు కలివిడిగా గడిపారు. మరోవైపు, సోమవారం రాజ దంపతులు వెస్ట్మినిస్టర్ హాల్లో పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో పాల్గొని రాణికి నివాళులర్పిస్తారు. ఇదీ చదవండి: కడసారి చూపునకు కూడా రానివ్వలేదా? -
రాణి కడసారి చూపునకు... మెగన్ను రానివ్వలేదు!
లండన్: బ్రిటన్ నూతన రాజు చార్లెస్–3 కుటుంబంలో కొన్నేళ్లుగా నెలకొన్న విభేదాలు రాణి ఎలిజబెత్–2 అస్తమయం సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. చార్లెస్, ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియంతో చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీకి చాలా ఏళ్లుగా సత్సంబంధాలు లేని విషయం తెలిసిందే. రాజకుటుంబం అభ్యంతరాలను పట్టించుకోకుండా అమెరికా నటి మెగన్ మార్కెల్ను హ్యారీ పెళ్లాడటంతో విభేదాలు బాగా ముదిరాయి. తర్వాతి పరిణామాల నేపథ్యంలో హ్యారీ దంపతులు సంచలన రీతిలో రాజరిక హోదానే వదులుకునేందుకు దారితీశాయి. ఈ నేపథ్యంలో గురువారం స్కాట్లండ్లోని బాల్మోరల్ కోటలో మృత్యుశయ్యపై ఉన్న రాణిని చూసేందుకు మెగన్ రావడానికి వీల్లేదని చార్లెస్ పట్టుబట్టారట. హ్యారీ దంపతులు గురువారం లండన్లోనే ఉన్నారు. రాణి కడసారి చూపుకు వారిద్దరూ బాల్మోరల్ బయల్దేరుతున్నట్టు తెలియగానే చార్లెస్ నేరుగా హ్యారీకి ఫోన్ చేసి, ‘‘అతి కొద్దిమంది రక్త సంబంధీకులం తప్ప ఎవరూ రావడం లేదు. కేట్ మిడిల్టన్ (విలియం భార్య) కూడా రావడం లేదు. కాబట్టి మెగన్ రాక అస్సలు సరికాదు’’ అని చెప్పినట్టు సమాచారం. దాంతో హ్యారీ ఒంటరిగానే వెళ్లి నాయనమ్మకు నివాళులు అర్పించారు. గురువారమే మొదటిసారిగా కొత్త స్కూల్కు వెళ్తున్న తన ఇద్దరు పిల్లల కోసం మిడిల్టన్ లండన్లోనే ఉండిపోయారు. ముందునుంచీ విభేదాలే విలియం, హ్యారీ సోదరుల మధ్య ఏనాడూ పెద్దగా సఖ్యత లేదు. తండ్రితో, అన్నతో మనస్ఫర్ధలను పలుమార్లు టీవీ ఇంటర్వ్యూల్లో హ్యారీ బాహాటంగానే వెల్లడించారు. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అమెరికా నటి అయిన మెగన్తో తన ప్రేమాయణం వారికి నచ్చకపోయినా పట్టించుకోలేదు. గొడవల నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదాను వదులుకుని రెండేళ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 2021లో ప్రఖ్యాత అమెరికా టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రేకు వారిచ్చిన ఇంటర్వ్యూ పెను సంచలనం సృష్టించింది. రాజ కుటుంబీకుల జాత్యహంకార వ్యాఖ్యలు, ప్రవర్తన తననెంతగానో గాయపరిచాయంటూ మెగన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘‘పెళ్లికూతురుగా ముస్తాబవుతున్న సమయంలో మిడిల్డన్ నన్ను సూదుల్లాంటి మాటలతో తీవ్రంగా గాయపరిచింది. తట్టుకోలేక ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నా’’ అంటూ దుయ్యబట్టింది. ఈ ఆరోపణలు, మొత్తంగా బ్రిటన్ రాచరిక వ్యవస్థపైనే ఆమె ఎక్కుపెట్టిన పదునైన విమర్శలు అప్పట్లో పెను దుమారం రేపాయి. రాజ కుటుంబానికి మాయని మచ్చగా మిగల్చడమే గాక వారి హృదయాల్లో మంటలు రేపాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలను మరింత పెంచాయి. తల్లిదండ్రులుగా చార్లెస్, కెమిల్లా పూర్తిగా విఫలమయ్యారంటూ హ్యారీ కూడా దుయ్యబట్టారు. తండ్రి అయితే తన ఫోన్ కూడా ఎత్తడం మానుకున్నారని ఆరోపించారు. ఒకవైపు రాణి ఎలిజబెత్ భర్త ఫిలిప్ మరణించిన దుఃఖంలో ఉన్న రాజ కుటుంబాన్ని ఈ ఆరోపణలు మరింత కుంగదీశాయి. ఆ సమయంలో నిండుచూలాలిగా ఉన్న మెగన్ ఫిలిప్ అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. అయితే హ్యారీతో పాటు మెగన్ను కూడా రాణి ఎంతో ఇష్టపడేవారనే చెబుతారు. మెగన్ అమెరికా వెళ్లి రాణి అంత్యక్రియల సమయానికి లండన్ తిరిగొస్తారని సమాచారం. దూరమైన కుటుంబీకులను విషాద సమయాలు దగ్గర చేస్తాయంటారు. బ్రిటిష్ రాజ కుటుంబం విషయంలో అది నిజమవుతుందో లేదో అంత్యక్రియల నాటికి స్పష్టత వస్తుంది. -
బ్రిటన్ రాణి మరణానికి ముందు ఇంత జరిగిందా?
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు రాజకుటుంబ నివాసం బల్మోరల్ కాస్టిల్లో జరిగిన విషయాలపై బ్రిటీష్ మీడియా ఆసక్తికర కథనాలు ప్రచురించింది. ఎలిజబెత్ కుమారుడు ప్రిన్స్ చార్లెస్ తన చిన్న కూమారుడు హ్యారీకి ఓ విషయం తేల్చిచెప్పినట్లు పేర్కొంది. ఎలిజబెత్ను చివరి క్షణాల్లో చూసేందుకు హ్యారీ తన భార్య మెర్కెల్ను తీసుకురావద్దని చార్లెస్ చెప్పారని వెల్లడించింది. 'మహారాణి చనిపోయే ముందు అతి తక్కువ మంది దగ్గరి బంధువులే పరిమిత సంఖ్యలో ఆమెతో పాటు ఉంటున్నారు. ఇలాంటి బాధాకరమైన సమయంలో మెర్కెల్ను ఇక్కడకు తీసుకురావడం సరికాదు. అందుకే ఆమెను తీసుకురావొద్దు' అని ప్రిన్స్ చార్లెస్ తన కుమారుడు హ్యారితో చెప్పినట్లు ది సన్, స్కై న్యూస్ వార్తా సంస్థలు తెలిపాయి. ఈ కారణంతోనే గురువారం ఎలిజబెత్ చనిపోవడానికి ముందు హ్యారీనే బల్మోరల్ క్యాస్టిల్కు చివరగా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మరణాంతరం శుక్రవారం రోజు క్యాస్టిల్ను వీడిన తొలి వ్యక్తి కూడా హ్యారీనే అని సమాచారం. దీంతో బ్రిటన్ రాజకుటుంబంలో వివాదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. నానమ్మతో అన్యోన్యంగా.. గతంలో ఎలిజబెత్ ఆమె మనవడు హ్యారీల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 2016లో బరాక్ ఒబామా, మిచేలీ ఒబామా దివ్యాంగుల కోసం ఇన్విక్టస్ గేమ్స్ కాంపిటీషన్ను ప్రారంభించినప్పుడు ఎలిజబెత్, హ్యారీల రియాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ గేమ్స్కు హ్యారీనే ప్రమోటర్గా వ్యవహరించారు. ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు.. అయితే అమెరికాకు చెందిన మేఘన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హ్యారికి రాజకుటుంబంతో సంబంధాలు బలహీనపడ్డాయి. ఈ దంపతులు 2021 మార్చిలో ఓప్రా విన్ఫ్రేకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేఘన్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకుటుంబంలో తాను జాతివివక్షను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అది భరించలేక తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. అంతేకాదు తాను గర్భవతిగా ఉన్నప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ ఏ రంగులో ఉంటాడా? అని రాజకుటుంబంలో చర్చించుకునేవారని తెలిపారు. మేఘన్ తల్లి నల్లజాతీయురాలు కాగా.. తండ్రి శ్వేతజాతీయుడు. అప్పటి నుంచి మరింత దూరం ఈ ఇంటర్వ్యూ అనంతరం రాజకుటుంబంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే బకింగ్హామ్ ప్యాలెస్ వీటిని తోసిపుచ్చింది. మేఘన్ ఆరోపణలు ఆందోళన కల్గించాయని పేర్కొంది. అప్పటినుంచి హ్యారీ దంపతులకు రాజకుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. ఇద్దరూ ఆమెరికాలో నివాసముంటున్నారు. తమకు రాజకుటుంబం హోదా వద్దని ప్రకటించారు. అయితే తల్లి మృతి అనంతరం కొత్త రాజుగా బాధ్యతలు చేపట్టిన కింగ్ చార్లెస్ తన మొదటి ప్రసంగంలో హ్యారీ, మేఘన్ల గురించి ప్రస్తావించారు. విదేశాలో నివసిస్తున్న ఈ ఇద్దరిపై కూడా తనకు ప్రేమ ఉందని పేర్కొన్నారు. అయితే ఎలిజబెత్-2 మరణానికి ముందు హ్యారీ బ్రిటన్లోనే ఉన్నారు. అయితే ఇది యాదృచ్చికమే అని బ్రిటీష్ మీడియా సంస్థలు తెలిపాయి. చదవండి: తీవ్ర దుఃఖంలో ఉన్న కింగ్ చార్లెస్కు ముద్దు పెట్టిన మహిళ -
అగ్గి రాజేసిన భార్యలు.. ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యేనా?
రాజకుటుంబంలో మునుపెన్నడూ చూడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఊహించలేనంతగా కుటుంబంలో మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయి. దివంగత ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానాకు పుట్టిన బిడ్డలిద్దరూ.. తిరిగి మునుపటిలా అనోన్యంగా పలకరించుకునే పరిస్థితులు కనిపించడం లేవు. అందుకు కారణం భార్యాలు రాజేసిన చిచ్చే కారణమనే చర్చ నడుస్తోంది అక్కడ. తల్లి ప్రిన్సెస్ డయానా(బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ మొదటి భార్య) చనిపోయి పాతికేళ్లు గడుస్తున్నాయి. ఆమె సంతానం ప్రిన్స్ విలియమ్(40), హ్యారీ(37)ల మధ్య మనస్పర్థలు మాత్రం ఏళ్లు గడుస్తున్నా సమసిపోవడం లేదు. మెగ్జిట్(రాయల్ డ్యూటీస్ నుంచి ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ తప్పుకుంటున్నట్లు ప్రకటించడం) తర్వాత ఈ ఇద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది లేదు. విలియం.. రాయల్ స్థాపనను స్వీకరించి.. మరిన్ని బాధ్యతలను చేపట్టి హుందాగా ముందుకెళ్తున్నాడు. ఇక హ్యారీ ఏమో కాలిఫోర్నియాలో జీవితం కోసం రాజ సంప్రదాయాలను తిరస్కరించి, భార్యతో కలిసి రాజప్రసాద వ్యవహారాలపై సంచలన ఆరోపణలు చేశాడు. ► అన్నదమ్ముల వైరం చాలా దూరం వెళ్లిందని, వాళ్లు తిరిగి కలుసుకోవడం అనుమానమేనని రాజ కుటుంబ వ్యవహారాలపై తరచూ స్పందించే రిచర్డ్ ఫిట్జ్విలియమ్స్ పేర్కొన్నాడు. పరిస్థితులనేవి ఎలా మారిపోయాయో ఆయన పాత సంగతుల్ని గుర్తు చేస్తూ మరీ చెప్తున్నారాయన. ► 1997 ఆగష్టు 31వ తేదీన 36 ఏళ్ల వయసులో డయానా రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటికి విలియమ్ వయసు 15, హ్యారీ వయసు 12. ► ఇద్దరూ ఎటోన్ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నారు. విలియమ్ పైచదువులకు యూనివర్సిటీ వెళ్లగా.. హ్యారీ మాత్రం మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నాడు. ► తన ప్రియురాలు కేట్ మిడెల్టన్తో 2011లో విలియమ్ వివాహం జరిగే నాటికి.. ఈ అన్నదమ్ముల అనుబంధం చాలా బలంగా ఉండిపోయింది. ► ఈ అన్నదమ్ముల వల్లే రాజకుటుంబం బలోపేతం అయ్యిందంటూ చర్చ కూడా నడిచింది. కానీ.. ► హ్యారీ 2018లో మేఘన్ను వివాహం చేసుకోవడం, భార్య కోసం రాజరికాన్ని వదులుకోవడంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. ► రాజకుటుంబంలో చెలరేగిన అలజడి.. అంతర్గతంగా ఏం జరిగిందో బయటి ప్రపంచానికి ఓ స్పష్టత లేకుండా పోయింది. కానీ, అప్పటి నుంచి ఆ అన్నదమ్ముల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. ► ఏడాది తర్వాత ఓ ఇంటర్వ్యూలో ‘మా అన్నదమ్ముల దారులు వేరంటూ’ హ్యారీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ► ఆపై హ్యారీ, మేఘన్లు రాజరికాన్ని వదిలేసుకుంటూ.. అమెరికాకు వెళ్లిపోవడంతో ఇంటి పోరు రచ్చకెక్కింది. ► ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో.. మేఘన్, కేట్ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై విస్తృత స్థాయిలో చర్చ కూడా నడిచింది. ► తన తల్లి డయానాను వెంటాడిన పరిస్థితులే తన భార్యకూ ఎదురుకావడం ఇష్టం లేదంటూ హ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకుటుంబంలో కలహాల తీవ్రతను బయటపెట్టాయి. ► ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో భార్యాభర్తలిద్దరూ చేసిన వ్యాఖ్యలపై ప్రిన్స్ విలియమ్ స్పందించాడు. తమదేం రేసిస్ట్ ఫ్యామిలీ కాదంటూ ఆరోపణల్ని ఖండించాడు. ► చాలాకాలం ఎడమొహం పెడమొహం తర్వాత.. 2021 జులైలో కెన్సింగ్టన్ ప్యాలెస్ బయట డయానా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఈ ఇద్దరు అన్నదమ్ములు హాజరయ్యారు. దీంతో ‘ఒక్కటయ్యారంటూ’ కథనాలు వచ్చాయి. ► అయితే.. ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో సోదరుడు, అతని భార్య చేసిన వ్యాఖ్యలపై ప్రిన్స్ విలియమ్ తీవ్రంగానే నొచ్చుకున్నట్లు ఉన్నాడు. అందుకే ఆ తర్వాత సోదరుడిని కలుసుకున్నప్పటికీ ముఖం చాటేస్తూ వచ్చాడు. ► ఆ ప్రభావం జూన్ 2022 క్వీన్ ఎలిజబెత్ 2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో స్పష్టంగా కనిపించింది. ► ఏ కార్యక్రమంలోనూ ఈ ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకోలేదు. ► హ్యారీ, మేఘన్లు ఈ సెప్టెంబర్లో యూకే వెళ్లనున్నారు. రాణి విండ్సోర్ ఎస్టేట్లో బస చేయనున్నారు. ఇది ప్రిన్స్ విలియమ్ కొత్త ఇంటికి దగ్గర్లోనే ఉండడం గమనార్హం. ► ఇక ప్రిన్స్ విలియమ్ కూడా ఎర్త్షాట్ ప్రైజ్ సమ్మిట్ కోసం సెప్టెంబర్లోనే కాస్త వ్యవధితో న్యూయార్క్కు వెళ్తున్నాడు. ఆ సమయంలో హ్యారీని కలిసే అవకాశాలు కనిపించడం లేదు. ► అయితే ఈ పర్యటనలోనూ విలియమ్-హ్యారీ కలిసే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఎంత మనస్పర్థలు నెలకొన్నప్పటికీ ఈ ఇద్దరూ కలుస్తారనే ఆశాభావంలో ఉన్నారు రాజకుటుంబ బాగోగులు కోరుకునేవాళ్లు. -
Shilpa Yarlagadda: పింక్ రింగ్ శిల్ప!
తాజాగా టైమ్ మ్యాగజీన్ కవర్ ఫోటో మీద ప్రిన్స్ హారీ మేఘనా మెర్కెల్ జంట ఆకర్షణీయంగా కనిపించింది. అయితే వీరిద్దరూ ధరించిన డ్రెస్లు, ఆభరణాలలో ముఖ్యంగా మెర్కెల్ వేలికి తొడిగిన ‘డ్యూయెట్ పింక్ డైమండ్ రింగు’ ప్రత్యేకంగా ఉండడంతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక మహిళ మరొకరికి మద్దతు ఇస్తోంది అని చెప్పే ‘పింక్ వాగ్దానం’కు గుర్తుగా ఈ రింగును రూపొందించినట్లుగా ఆ ఉంగరాన్ని డిజైన్ చేసిన సంస్థ ‘శిఫాన్’ చెబుతోంది. రింగు బాగా పాపులర్ అవ్వడంతో రింగును రూపొందించిన డిజైనర్ శిల్పా యార్లగడ్డ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. శిల్ప పేరు తెరమీదకు రావడానికి ఒక పింక్ డైమండ్ రింగేగాక, చిన్న వయసులోనే డైమండ్ జ్యూవెలరీ స్టార్టప్ను ప్రారంభించి విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్గా రాణిస్తూ, తనకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని ఔత్సాహిక ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించడానికి వినియోగించడం మరో కారణం. ఒక పక్క తన చదువు ఇంకా పూర్తికాలేదు. కానీ తను ఒక సక్సెస్ ఫుల్ ఎంట్రప్రెన్యూర్గా రాణిస్తూ.. తనలాంటి ఎంతోమందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా పనిచేస్తోంది శిల్పా యార్లగడ్డ. శిఫాన్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో పెరిగిన శిల్పా యార్లగడ్డ భారత సంతతికి చెందిన అమ్మాయి. శిల్ప హైస్కూల్లో ఉన్నప్పుడు నాసా, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్లలో ఇంటర్న్షిప్ చేసింది. అప్పుడు కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంది. ఈ క్రమంలోనే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎమ్ఐటీ మొదటి ఏడాది చదివేటప్పుడు.. తన చుట్టుపక్కల ఉన్న జ్యువెలరీ సంస్థలన్నీ పురుషులే నిర్వహించడం చూసేది. ఈ రంగంలోకి మహిళలు కూడా అడుగుపెట్టాలి అని భావించి... వివిధ రకాల ఆభరణాలను ఎలా తయారు చేయాలి? తక్కువ ఖర్చులో మన్నిక కలిగిన ఆభరణాల తయారీ ఎలా... అనే అంశాలపై గూగుల్లో త్రీవంగా వెతికేది. త్రీడీ ప్రింటింగ్ ద్వారా తక్కువ ఖర్చులో అందమైన జ్యూవెలరీ తయారు చేయవచ్చని తెలుసుకుని స్నేహితులతో కలిసి 2017లో డైమండ్స్కు బాగా పేరున్న న్యూయార్క్లో ‘శిఫాన్’ పేరిట జ్యూవెలరీ స్టార్టప్ను ప్రారంభించింది. శిఫాన్ ప్రారంభానికి ‘అన్కట్ జెమ్స్’ సినిమా కూడా శిల్పకు ప్రేరణ కలిగించింది. వజ్రాలతో తయారు చేసిన సింగిల్ పీస్ జ్యూవెలరీని విక్రయించడం ప్రారంభించింది. 2 018లో ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో స్టైలిస్ట్ నికోల్ కిడ్మ్యాన్స్ క్లైంట్ శిఫాన్ సంస్థ రూపొందించిన రింగ్ ధరించి రెడ్ కార్పెట్పై నడవడంతో అప్పుడు శిఫాన్కు మంచి గుర్తింపు వచి్చంది. అప్పటి నుంచి శిఫాన్ డైమండ్ జ్యూవెలరీ విక్రయాలు పెరిగాయి. డ్యూయెట్ హూప్స్.. గతేడాది నవంబర్లో ‘డ్యూయెట్ హూప్స్’ పేరుమీద రెండో జ్యూవెలరీని ప్రారంభించింది శిల్పా యార్లగడ్డ. ఆదర్శవంతమైన దంపతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పింక్ డైమండ్ రింగును అందుబాటులోకి తీసుకొచ్చారు. పింక్ డైమండ్ రింగు స్పైరల్ ఆకారంలో అడ్జెస్టబుల్గా ఉంటుంది. మొదట ఒక పెద్ద సైజులో డైమండ్, దాని తరువాత చిన్న డైమండ్ ఉండడం ఈ రింగు ప్రత్యేకత. ఈ మోడల్ రింగును ఆమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్ ఒబామా, టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ధరించడంతో ఆ మోడల్ బాగా పాపులర్ అయింది. అయితే ఈ పింక్ రింగును అమ్మగా వచ్చే ఆదాయంలో యాభై శాతం డబ్బును ‘స్టార్టప్ గర్ల్ ఫౌండేషన్’కు శిల్ప అందిస్తోంది. ఇప్పటికే పెప్పర్, ఇటెర్నెవా, కిన్షిప్, సీ స్టార్ వంటి కంపెనీలకు నిధులు సమకూర్చింది. కాగా పింక్ రింగ్ ధర 155 డాలర్ల నుంచి 780 డాలర్లు ఉండడం విశేషం. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ ఫైనలియర్ చదువుతోన్న శిల్ప తన చదువు పూర్తయ్యాక పూర్తి సమయాన్ని శిఫాన్ కోసం కేటాయించనుంది. కాలం తిరిగి రాదు జ్యూవెలరీ తయారీ పరిశ్రమ మహిళలకు సంబంధించినది. కానీ ఈ పరిశ్రమలన్నీ పురుషులే నిర్వహిస్తున్నారు. అందుకే ఈ రంగంలో ఎక్కువమంది మహిళలు రావాలనుకున్నాను. ఈ క్రమంలోనే స్టార్టప్ గర్ల్ ఫౌండేషన్లకు నిధులు సమకూర్చి ప్రోత్సహిస్తున్నాను. ఒక పక్క చదువుకూంటూ మరోపక్క ఒక కంపెనీ స్థాపించి దాని ఎదుగుదలకు కృషిచేయడం సవాలుతో కూడుకున్నది. కానీ ‘జీవితంలో ఏదైనా తిరిగి తెచ్చుకోవచ్చు గానీ కరిగిపోయిన కాలాన్ని వెనక్కు తెచ్చుకోలేం’ అని ఒకరిచి్చన సలహా నా మనస్సుకు హత్తుకోవడంతో ఈ రెండూ చేయగలుగుతున్నాను. చదవండి: Mystery: న్యోస్ సరస్సు.. రాత్రి రాత్రే ఆ ఊళ్లన్నీ శ్మశానాలైపోయాయి! -
తల్లిదండ్రులైన హ్యారీ దంపతులు.. బుజ్జాయి పేరేమిటంటే!
కాలిఫోర్నియా: రాచరికాన్ని వదులుకుని సామాన్య జీవితం గడుపుతున్న ప్రిన్స్ హ్యారీస్, మేఘన్ మార్కెల్ దంపతులు ఆనందడోలికల్లో తేలిపోతున్నారు. చుట్టుముట్టిన కష్టాల నడుమ వారింట్లో బోసి నవ్వులు విరబూశాయి. మేఘన్-హ్యారీ దంపతులు ముద్దులొలికే పసిపాపకి తల్లిదండ్రులయ్యారు . జూన్ 4న కాలిఫోర్నియాలోని శాంట బార్బరా కాటేజ్ హాస్పటిల్లో మేఘన్ మార్కెట్ ప్రసవించింది. అప్పుడు హ్యరీ కూడా అక్కడే ఉన్నారు. వారి పేర్ల కలయికతో హ్యారీ, మేఘన్ జీవితాల్లోకి వచ్చిన చిన్నారికి లిల్లీ డయానా అని పేరు పెట్టుకున్నారు. ఈ పేరు వెనక పెద్ద కథే ఉంది. ప్రస్తుతం బ్రిటిష్ రాజకుటుంబ మహారాణి ఎలిజబెత్ చిన్నప్పటి ముద్దుపేరు లిల్లీబెట్. అలాగే రాచరికపు ఆంక్షలను ఎదిరించి చనిపోయిన తన హ్యారీ తల్లి పేరు డయానా. వీరిద్దరి గౌరవార్థం తన కూతురికి లిల్లీబెట్ డయాన మౌంట్బాటెన్ విండ్సర్ గా పేరు పెట్టారు. హ్యారీ- మేఘన్లకు ఇంతకు ముందు ఆర్చీ అనే కొడుకు 2019లో జన్మించాడు. -
అమ్మను చంపేశారు.. తనను కూడా వదలరా?: హ్యారీ
లండన్: ‘‘అమ్మ అంత్యక్రియల నాడు నాకు వినిపించిన గుర్రాల గిట్టల శబ్దం నుంచి.. కారులో నేను అమ్మతో ప్రయాణిస్తుండగా.. మమ్మల్ని వెంటాడిన ఫోటోగ్రాఫర్ల వరకు ప్రతి జ్ఞాపకం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది.. అమ్మను కోల్పోయిన బాధ ఇప్పటికి నన్ను కలచివేస్తూనే ఉంది’’ అంటూ ప్రిన్స్ హ్యారీ భావోద్వేగానికి గురయ్యారు. ఇక అమ్మలాగే.. నా భార్యను కూడా కోల్పోతాననే భయంతోనే రాచకుంటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లానని తెలిపాడు హ్యారీ. ఒక కొత్త టీవీ డాక్యుమెంటరీ సిరీస్ ది మీ యూ కాన్ట్ సీలో తన మనోవేదనను వెల్లడించారు హ్యారీ. హ్యారీ మాట్లాడుతూ.. ‘‘మా అమ్మ తెల్ల జాతీయుడు కానీ మరో వ్యక్తితో రిలేషన్లో ఉన్న నాటి నుంచి.. ఆమె మరణం వరకు ఫోటోగ్రాఫర్లు తనను వెంబడిస్తూనే ఉన్నారు. చివరకు ఏం జరిగిందో అందరికి తెలుసు. ఆమె మరణించిన తర్వాత కూడా వదల్లేదు. ఇప్పుడు తను(మేఫన్) చనిపోయే వరకు కూడా ఆగరు.. చరిత్ర పునరావృతం చేయాలని మీరు భావిస్తున్నారా’’ అంటూ ఆవేదనకు గురయ్యాడు. ఇది ఇలానే కొనసాగితే.. నా జీవితంలో మరో స్త్రీని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చాను’’ అన్నాడు హ్యారీ. హ్యారీ, అతని అమెరికన్ భార్య మేఘన్ మార్కెల్ గురించి బ్రిటిష్ పత్రికలలో జాత్యహంకార వార్తలు వెలువడ్డాయి. అలానే సోషల్ మీడియాలో కూడా ఆమె గురించి తప్పుడు ప్రచారం జరిగింది. ఇక మేఘన్ మొదటిసారి గర్భవతిగా ఉన్నప్పుడు బ్రిటన్లో ఆమెకు ఎదురైన చేదు అనుభవాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని తెలిపాడు హ్యారీ. ఈజిప్టుకు చెందిన తన ప్రియుడు డోడి ఫయేద్తో కలిసి ప్రయాణిస్తున్న కారును ఛాయాచిత్రకారులు వెంబడించడంతో పారిస్లో జరిగిన ప్రమాదంలో యువరాణి డయానా 1997 లో 36 ఏళ్ళ వయసులో మరణించింది. ఆ సమయంలో హ్యారీకి 12 సంవత్సరాలు. ఈ డాక్యుమెంటరీలో, హ్యారీ తన సోదరుడు విలియం, తండ్రి ప్రిన్స్ చార్లెస్, మామ చార్లెస్ స్పెన్సర్తో కలిసి లండన్ వీధుల గుండా డయానా శవపేటిక వెనుక నడుస్తున్న నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ‘‘నేను ఆ దారి వెంబడి నడుస్తున్నాను.. నాకు గుర్రాల గిట్టల శబ్దం వినిపిస్తుంది.. నేను నా శరీరాన్ని విడిచిపెట్టి.. బయటకు వచ్చినట్లు అనిపించింది. ఉక్కిరిబిక్కిరి అయ్యాను’’ అంటూ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు హ్యారీ. ‘‘ఈ బాధను నేను దాదాపు 20 ఏళ్ల పాటు అణిచిపెట్టుకున్నాను.. తాగుడుకు అలవాటు పడ్డాను. కెమరాలు చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. వీరు ఓ నిస్సహాయ మహిళను ఆమె తన కారు వెనక సీటులో మరణించే వరకు వెంటాడారు. ఆ సమయంలో నేను నా తల్లికి సాయం చేయలేకపోయాను.. మా అమ్మకు న్యాయం జరగలేదు.. నా బాల్యంలో మా అమ్మ విషయంలో ఏదైతే జరిగిందో.. దాని గురించి నాకు ఇప్పటికి కోపం వస్తుంది. ఇప్పుడు నాకు 36 ఏళ్లు.. కానీ ఇప్పుడు కెమరాలు చూసినా.. వారు నన్ను వెంటాడుతున్నట్లు ఆందోళనకు గురవుతాను. కెమరాల క్లిక్, ఫ్లాష్ చూస్తే.. నా రక్తం మరిగిపోతుంది’’ అన్నాడు హ్యారీ. ‘‘మేఘన్ను కలిసే వరకు నేను ఈ బాధ అనుభవించాను. ఆ తర్వాతే నేను థెరపీ తీసుకోవడం ప్రారంభించాను. ఇక మా బంధం కొనసాగితేనే.. నేను నా గతాన్ని ఎదుర్కోగలనని అనిపించింది. అందుకే తనను వివాహం చేసుకున్నాను అన్నాడు. ఈ విషయాలన్నింటిని హ్యారీ తన మీ యూ కాన్ట్ సీ సిరీస్లో తెలిపారు. అమెరికన్ టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రేతో కలిసి హ్యారీ నిర్మించిన "మీ యూ కాన్ట్ సీ" సిరీస్ ఆపిల్ టీవీ + లో శుక్రవారం విడుదలైంది. చదవండి: మేఘన్ జాతివివక్ష ప్రకంపనలు -
మా కుటుంబం ‘జూ’లా అనిపించేది: బ్రిటన్ యువరాజు
లండన్: బ్రిటన్ యువరాజు హ్యారీ తన కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం 'ఆర్మ్ చెయిర్ ఎక్స్ పర్ట్' పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితంలోని పలు విషయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. బాధలు, కట్టుబాట్లు నుంచి విముక్తి కోసమే రాజ కుటుంబం బంధాలను తెంచుకుని అమెరికాకు వెళ్లినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడే కాదు తన 20 ఏళ్ళ వయసులో అనేక సందర్భాల్లో ఆయన తన రాజ జీవితాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన చాలా సార్లు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. 2020 ప్రారంభంలో రాజ కుటుంబం తనను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టినట్లు హ్యారీ తెలిపాడు. తన తల్లి వదిలివెళ్లిన డబ్బుతోనే ఆ సమయంలో ఎటువంటి ఆర్థిక సమస్య రాకుండా చూసుకున్నట్లు తెలిపారు. రాజ కుటుంబంలో అలవాట్లు, పద్ధతులు తనకి పెద్దగా నచ్చేవి కాదని ఒక్కోసారి అక్కడ వాళ్లతో జీవించడం జంతుప్రదర్శనశాలలో ఉన్నట్లు అనిపించేదని అన్నారు. తమ పెంపకం విషయంలో తన తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో, రాచబిడ్డల్లా తమను పెంచేందుకు ఎంత ఆవేదన అనుభవించిన రోజులను గుర్తు చేసుకుని బాధని వ్యక్తం చేశాడు. ఇలాంటి పెంపకాన్ని తన పిల్లలకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే భార్యాపిల్లలతో అమెరికాకు వచ్చేశానని ఆయన వివరించారు. ప్రస్తుతం మేఘన్ తో కలిసి ఆయన లాస్ఏంజిలిస్ కు సమీపంలోని మోంటేసిటోలో నివసిస్తున్నారు. అయితే, తన పిల్లల విషయంలో మాత్రం తన తండ్రి చేసిన తప్పే చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ( చదవండి: వైరల్: అతడిపై ‘థూ’ అని ఉమ్మింది.. యుద్ధం మొదలైంది! ) -
ప్రిన్స్ ఫిలిప్ మృతి: అంత్యక్రియలకైనా వస్తాడా.. లేదా?
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) శుక్రవారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బకింగ్హామ్ ప్యాలెస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రిన్స్ ఫిలిప్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో ప్రస్తుతం బ్రిటన్ పౌరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా రాజకుంటుంబాన్ని అభిమానించే వారి మదిలో ఒకటే ప్రశ్న మెదులుతుంది. ప్రిన్స్ ఫిలిప్ మనవడు ప్రిన్స్ హ్యారి తాతను కడసారి చూడటానికి అయినా వస్తాడా.. లేదా అనే దాని మీదే చర్చ జరుగుతోంది. అంతరంగిక విబేధాల వల్ల ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కెల్లు గత కొద్ది కాలంగా రాచ కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత నెలలో ప్రఖ్యాత అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే టాక్ షోలో ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కెల్లు తాము అంతఃపురంలో అనుభవించిన కష్ట నష్టాల గురించి ప్రపంచానికి వెల్లడించారు. జాతి వివక్షను ఎదుర్కొన్నానని.. మీడియా తనపై తప్పుడు కథల ప్రచారం చేసిందని.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు మేఘన్ తెలిపారు. ఇక వీరి ఇంటర్వ్యూ ప్రసారానికి ముందే ప్రిన్స్ ఫిలిప్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తాతను పరామర్శించాల్సిందిగా బకింగ్హామ్ ప్యాలేస్ హ్యారీకి సందేశం పంపింది. కారణాలు తెలియదు కానీ ప్రిన్స్ హ్యారీ మాత్రం తాతగారిని చూడటానికి రాలేదని సమాచారం. మరి ఇప్పుడు అంత్యక్రియలకు అయినా హాజరవుతాడా లేదా అనే ప్రశ్న బ్రిటన్ జనాలను తొలచివేస్తుంది. అయితే దీని గురించి రెండు నెలల క్రితమే ది రాయల్ అజ్బర్వర్ అనే పత్రిక ‘‘అంత్యక్రియలకు హాజరైనప్పుడు ప్రిన్స్ హ్యారీని బ్రిటన్ ప్రజలు బహిరంగంగానే తూలనాడే ప్రమాదాన్ని నివారించడం కోసం హ్యారీని, ఆయన భార్యను ఎక్కడ కూర్చోబెట్టాలన్న దానిపైన కూడా సమాలోచనలు జరుగుతున్నాయి’’ అని ప్రచురించడం గమనార్హం. ప్రస్తుతం హ్యారీ-మేఘన్ మార్కెల్లు అమెరికాలో నివాసం ఉంటున్నారు. చదవండి: వివక్షపై యుద్ధారావం ఆ ఇంటర్వ్యూ -
వివక్షపై యుద్ధారావం ఆ ఇంటర్వ్యూ
తమను వేధింపులకు గురిచేశారని మేఘన్, హ్యారీలు చేసిన ఆరోపణపై అమెరికా, బ్రిటన్ దేశాల్లోని ఛాందసవాదులు మూసపోసిన రీతిలో స్పందించారు. ఒకప్పటి బ్రిటిష్ సామ్రాజ్య పౌరులుగా భారతీయులం బ్రిటిష్ రాజరికంతో ప్రేమ-ద్వేషంతో కూడిన సంబంధంతో ఉంటాం. హ్యారీ, మేఘన్ వంటి గాథలను టీవీ తెరలపై ఆసక్తికరంగా తిలకించడానికి సిద్ధపడతాం కానీ ఈ దంపతులిరువురూ ఎదుర్కొన్న వివక్ష, కపటత్వం వంటివాటిని ఏమాత్రం పట్టించుకోం. అయితే జాత్యహంకారం, స్త్రీ ద్వేషం, వర్గాధిక్యత, చర్మపురంగు వంటి వాటిపట్ల ఆత్రుత వంటివి మన ఇళ్లను కూడా ఇప్పుడు సమీపిస్తున్నాయి. మనలోని ఇదే అలవాట్లను మనం గుర్తించకపోతే, మారకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నవారిమవుతాం. బ్రిటన్ రాజరికం జాతివివక్షా భావాలతో నిండిపోయి ఉందంటూ ప్రముఖ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వూ్యలో మేఘన్ మర్కెల్, హ్యారీ విండ్సార్ ఆరోపించడంతో బ్రిటిష్ రాజరికంపై బాంబు పేలినట్లయింది. ఆ ఇంటర్వూ్యపై వెంటనే ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా బయటపడింది. అదేమిటంటే, స్త్రీ ద్వేషం, జాతి వివక్ష బ్రిటిష్ రాజరికంతో ముడిపడి ఉన్నాయి. ఈ వాస్తవాన్ని బ్రిటిష్ మీడియా మరింత సంక్లిష్టం చేసిపడేస్తోంది. హ్యారీ, మేఘన్లు నిష్కపటమైన, స్వచ్ఛమైన రీతిలో ఓప్రాకు ఇచ్చిన ఆ ఇంటర్వూ్య మనందరి కళ్లు తెరిపించింది. అది బ్రిటిష్ మీడియాను, పవిత్రమైనదిగా భావించే బ్రిటిష్ రాజ రికాన్ని ప్రకంపింపచేసిందన్నది వాస్తవం. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మొత్తం వివాదం నుంచి బ్రిటిష్ రాణిని జాగ్రత్తగా తప్పించి వేయడమే. రాణి సలహాదారులూ రాచరిక వ్యవస్థే దీనంతటికీ కారణమని మీడియా తేల్చేసింది. యువరాణులు, యువరాజుల జిగేల్మనిపించే ఆహార్యం, ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేసేటటువంటి డిజైనర్ దుస్తులు, డైమండ్లు, పాపరాజీ వర్ణించే అద్భుతమైన వారి వివాహ గాథలను దాటి ముందుకు చూస్తే, జాతులను, సహజ వనరులను, ప్రపంచవ్యాప్తంగా స్థానికులను కొల్లగొట్టి మరీ సముపార్జించుకున్న క్రూరమైన స్వీయ సంపద విభ్రమ విలాసాలు బ్రిటిష్ రాచరికం సొత్తుగా ఉన్నాయని మనందరికీ తెలుసు. ఇప్పుడంటే ఆధునిక రాజరికం వాస్తవాధికారం లేని ముదివగ్గును తలపిస్తోంది కానీ ఎలిజబెత్ రాణి పట్ల చెరగని అనుకూలత కారణంగా ఆ గత వైభవాన్ని జనం గుర్తు చేసుకుంటూ ఉంటారు. 1979లో, బ్రిటిష్-జమైకన్ సాంస్కృతిక సిద్ధాంతకర్త స్టూవర్ట్ హాల్ కాకతాళీయంగా ఇదే బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూ్యలో బ్రిటిష్ టెలివిజన్ ప్రసారాల్లో జాతి వివక్ష కొనసాగింపు గురించి మొత్తుకున్నారు. బ్రిటన్లో నివసిస్తున్న నల్లజాతి, ఆసియన్ కమ్యూనిటీ ప్రజల పట్ల జాతివివక్షా వైఖరిని సాధారణీకరించేలా వీరి వ్యాఖ్యలు ఉండేవి. బహుళ జాతి జనాభాతో పెరుగుతూ వచ్చిన బ్రిటన్లో జాతి వివక్షా ధోరణులను వ్యాప్తి చేయడానికి హాస్యాన్ని ఎక్కువగా వినియోగించేవారని రచయిత, పరిశోధకురాలు రైనా జేడ్ పార్కర్ తెలిపారు. మీడియా పాక్షిక దృష్టి కారణంగా కలిగిన ప్రభావాలను పరీక్షించడానికి ప్రయత్నించిన స్టూవర్ట్ హాల్ ఇలాంటి ప్రభావం వ్యక్తిగత దాడికిందే పరిగణించాలి తప్ప దీన్ని ఒక వ్యవస్థాగత సమస్యగా భావించవద్దని అప్పట్లోనే చెవ్పేవారన్నారు. వ్యవస్థలో సంస్థాగతంగా జాత్యహంకారం, స్త్రీ ద్వేషం ఉనికిలో ఉన్న విషయాన్ని అంగీకరించడాన్ని తిరస్కరించడానికి ఇది ఒక ప్రామాణిక వంచనాత్మకమైన ఎత్తుగడ అని హాల్ చెప్పారు. మిశ్రమజాతికి చెందిన మేఘన్ మర్కెల్ బ్రిటన్ యువరాజును అద్భుత గాథలోలాగా పెళ్లాడి, బ్రిటిష్ రాజవంశంలో భాగమైనప్పుడు బ్రిటిష్ టాబ్లాయిడ్లు, ప్రెస్, సామాజిక మీడియా ఫోరంలు ఇదే వివక్షను ప్రదర్శించడం గమనార్హం. పైగా యునైటెడ్ కింగ్డమ్ లోని టాబ్లాయిడ్లు, శ్వేత జాతి మీడియా పండితులు, విశ్లేషకులు ఒక పద్ధతి ప్రకారం ఆమెను పొట్టచీల్చి మరీ పేగులు బయటకు లాగేవిధంగా వ్యవహరించారు. మేఘన్ తోటి కోడలు కేట్ను ఏడిపించింది! మేఘన్ రాణిమందిరం సిబ్బందిని వేధింపులకు గురిచేసింది! వేధించే పెళ్లికూతురు మేఘన్... ఇలాంటి ఎన్నెన్నో ఆరోపణలతో బ్రిటిష్ మీడియా యువరాణితో ఆటాడుకుంది. అమెరికన్ టెలివిజన్ దివా విన్ ప్రేకి ఇచ్చిన ఆ సంచలనాత్మక ఇంటర్వూ్యలో మేఘన్, హ్యారీలు ప్రధానారోపణ చేశారు. మేఘన్పట్ల అన్యాయంగా ప్రవర్తించింది బ్రిటిష్ మీడియా మాత్రమే కాదనీ, ఆమె నివసించే విండ్సార్ మందిరం కూడా ఆమెకు ఏమాత్రం సహాయం చేయలేదని వీరు చెప్పారు. పైగా ఈ వేధింపులో హౌస్ ఆఫ్ విండ్సార్ కూడా అస్పష్టరీతిలో పాల్గొన్నదని మేఘన్ దంపతులు చెప్పారు. ఈ ఆరోపణ బాంబులాగా పేలింది. డయానా గాథలో వెల్లడైన అంశాలు కూడా దీనిముందు సరిపోవని చెప్పాల్సి ఉంటుంది. చరిత్ర తనకు తానే పునరావృతం చేసుకుంటుంది అని హ్యారీ సరిగ్గానే వర్ణించారు. తమ మాతృమూర్తి డయానా తనకు ఎదురైన చేదు అనుభవాల ఫలితంగా ఒంటరితనంలో కూరుకుపోవలసి వస్తే తాము మాత్రం కలిసికట్టుగా తమ సమస్యను పరిష్కరించుకోగలిగినందుకు తామెంతో అదృష్టవంతులమని అందుకు తానెంతో సంతోషపడుతున్నానని హ్యారీ చెప్పారు. ప్రజల అభిమానం చూరగొన్న యువరాణి డయానాను అప్పట్లో వేటాడారు, వెంటాడారు, ఒంటరిని చేసిపడేశారు. అదే సమయంలో ఆమెను ఆరాధించారు, ఆదర్శమూర్తిని చేశారు. అయితే మేఘన్ కూడా డయానా ఎదుర్కొన్న సవాళ్ల బారిన పడినప్పటికీ, అదనంగా తమపై మోపిన జాతివివక్ష, వర్ణవివక్షకు సంబంధించిన భారాలను కూడా మేఘన్ ఎదుర్కొన్నారు. మధ్యతరగతిలో పుట్టి పెరిగిన మేఘన్ తర్వాత తన సొంత కృషితో, హక్కుతో నటిగా, సోషల్ మీడియా స్టార్గా, సెలబ్రిటీగా తన్ను తాను మలుచుకుంది. తన యువరాజుతో కలిసి మరుగుజ్జు శ్వేతజాతి కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు ఈ వివక్షలన్నింటినీ ఆమె అనుభవించింది. మేఘన్ ఎదుర్కొన్న సమస్య సరిగ్గా తన మాతృమూర్తిని వేధించిన పరిస్థితితో సమానమైందని హ్యారీ పేర్కొన్నాడు. అమెరికా, బ్రిటన్ మీడియా ఈ ఉదంతంపై ఊహించిన వైఖరులనే చేపట్టాయి. తమకుతాముగా ప్రవాసంలోకి వెళ్లిన దంపతులపై అమెరికా మీడియా కేంద్రీకరించగా, బ్రిటన్ ప్రెస్ కొన్ని మినహాయింపులను పక్కనబెడితే, తమకెంతో ప్రేమాస్పదమైన రాజకుటుంబంపై ఇన్ని ఆరోపణలు చేస్తారా అంటూ రెచ్చిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెరికాలోని ఛాందసవాద వ్యాఖ్యాతలు సైతం మోర్గన్ వంటి రాజరికం సానుభూతిపరులతో జట్టు కలవడమే. రాజమందిరంలోకి ప్రవేశించాక తనకు ఒనగూరేది ఏమిటనేది మేఘన్కు కచ్చితంగా ముందే తెలుసని, రాజమందిరంలో ప్రవేశించినందుకు ఆమెకు లభ్యమైన సౌకర్యాలపై, హక్కులపై ఆరోపణలు చేయడానికే వీల్లేదని వీరు వాదిస్తున్నారు. సాధారణీకరించి చెప్పాలంటే, జాతివివక్ష, లైంగిక దోపిడీ, జాతిఆధిక్యతా భావం వంటి అంశాలతో వ్యవహరించడంలో సంస్థాగత మార్పులను చేయాల్సిన అవసరముందని ఉదారవాదులు చేస్తున్న వాదనను అమెరికా, బ్రిటన్లోని ఛాందసవాదులు తోసిపుచ్చుతున్నారు. తమను వేధింపులకు గురిచేశారని మేఘన్, హ్యారీలు చేసిన ఆరోపణపై రెండుదేశాల్లోని ఛాందసవాదులు మూసిపోసిన రీతిలో స్పందించడం గమనార్హం. ఘనత వహించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన ఒకప్పటి పౌరులుగా భారతీయులం బ్రిటిష్ రాజరికంతో ప్రేమ–ద్వేషంతో కూడిన సంబంధంతో ఉంటాం. ఒకవైపు బ్రిటిష్ సామ్రాజ్యం కొల్లగొట్టిన కోహినూర్ వజ్రం వంటి భారతీయ విలువైన సంపదలను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తాం. మరోవైపు ఆ రాజవంశంనుంచి ఎవరైనా సభ్యుడు భారత్ సందర్శిస్తే వారి పాదాలు తాకి పూజిస్తాం. రాజరికం వైభవాన్ని ప్రదర్శించే అన్ని కార్యక్రమాలను కళ్లప్పగించి చూస్తుంటాం. హ్యారీ, మేఘన్ వంటి గాథలను టీవీ తెరలపై ఆసక్తికరంగా తిలకించడానికి సిద్ధపడతాం కానీ ఈ దంపతులిరువురూ ఎదుర్కొన్న వివక్ష, కపటత్వం వంటివాటిని ఏమాత్రం పట్టించుకోం. అయితే జాత్యహంకారం, స్త్రీ ద్వేషం, వర్గాధిక్యత, చర్మపురంగు వంటి వాటిపట్ల ఆత్రుత వంటివి మన ఇళ్లను కూడా ఇప్పుడు సమీపిస్తున్నాయి. మనలోని ఈ అలవాట్లను మనం గుర్తించి, మారకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. ఒక్కమాటలో చెప్పాలంటే మనం కూర్చుని ఉన్న అద్దాలమేడను మనం తిరిగి చూడాల్సి ఉంది. సుమన కస్తూరి వ్యాసకర్త రచయిత, పరిశోధకురాలు (ది వైర్ సౌజన్యంతో) -
ప్రిన్సెస్ గౌరమ్మ
స్వేచ్ఛను కోరుకునే మనసు ప్రేమలోనైనా బందీగా ఉండలేదు. బ్రిటన్ కుటుంబంలో రాణిలానూ ఉండిపోలేదు. భర్త నుంచి డయానా, బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి మేఘన్.. ఇద్దరూ స్వేచ్ఛను కోరుకున్న వాళ్లే. ఆ స్వేచ్ఛ కోసమే వాళ్లు తమ రెక్కల్ని తెంపుకున్నారు! వాళ్లిద్దరికంటే ముందు ఆ అంతఃపురంలో గౌరమ్మ అనే బాలిక.. ‘ప్రిన్సెస్’ గా స్వేచ్ఛ కోసం పెనుగులాడింది. తన కన్నా ముప్పై ఏళ్లు పెద్దవాడైన భర్తలోని తండ్రి ప్రేమను భరించలేక, క్వీన్ విక్టోరియా కనురెప్పల కింద భద్రంగా జీవించలేక పారిపోవాలని అనుకుంది. సాధ్యం కాలేదు. ప్రేమకు, భద్రతకు బందీగా 23 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది! ఎవరీ ప్రిన్సెస్ గౌరమ్మ? ప్యాలెస్లోకి ఎలా దారి తప్పింది? మేఘన్ రాణివాస జీవితానికి పూర్వఛాయలా అనిపిస్తున్న గౌరమ్మ అసలు ఏ ఊరి చిన్నారి?! ఎవరి పొన్నారి? అన్నమూ నీళ్లూ లేకున్నా మనుషులు కొన్నాళ్లు జీవించి ఉండగలరు. ప్రేమ లేని చోట ఒక్కక్షణం కూడా ఉండలేరు. అది పూరిల్లు అయినా, అంతఃపురం అయినా! లేడీ డయానాకు బకింగ్ హామ్ ప్యాలెస్లో ప్రేమ లభించలేదు. ఆమె కోరుకున్న ప్రేమ.. ప్యాలెస్ నుంచి కాదు. భర్త నుంచి. చివరికి మానసికంగా భర్తకు, ప్యాలెస్కు కూడా దూరం అయ్యారు డయానా. ప్రేమ లేని జీవితం భారమై, దుర్భరమై ప్రేమ కోసం పరుగులు తీస్తూ బతుకునే పోగొట్టుకున్నారు. 1997 ఆగస్టు 31న ప్యారిస్ లో ఆమె ప్రయాణిస్తున్న కారు టన్నెల్ రోడ్డుకు ఢీకొని మరణించారు. బ్రిటన్ ప్యాలెస్ ఎన్నటికీ మరువలేని విషాదం అది. విషాదం కన్నా కూడా విపత్తు. రాజవంశానికి అప్రతిష్టగా మాత్రమే ఆ దుర్ఘటనను ప్యాలెస్ ఆనాడు పరిగణించింది! ∙∙ బ్రిటన్ రాజప్రాసాదం దృష్టిలో అలాంటి అప్రతిష్టనే ఇప్పుడు మేఘన్ మార్కెల్ తెచ్చిపెట్టారు. క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యారీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెరికన్ యువతి మేఘన్. భర్త నుంచి దొరికిన ప్రేమ ఆమెకు అతడి కుటుంబ సభ్యుల నుంచి మాత్రం లభించలేదు. ఉన్నన్నాళ్లు గుట్టుగా ఉన్నారు. ఇంక ఉండలేను అనుకోగానే ప్యాలెస్ నుంచి బయటికి వచ్చేశారు. ప్రిన్స్ హ్యారీ ఆమె వైపు గట్టిగా నిలబడ్డారు కనుకే ఆమె స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకోగలిగారు. ప్యాలñ స్ నుంచి మేఘన్ వెళ్లిపోవడాన్ని పెద్ద విషయంగా లెక్కలోకి తీసుకోని రాణిగారు, తామెందుకని రాచకుటుంబంతో తెగతెంపులు చేసుకుని బయటికి వచ్చారో ఓప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో ఆమె చెప్పడాన్ని మాత్రం తలవంపులుగా భావించారు. ఇప్పుడిక ప్రిన్సెస్ గౌరమ్మ వార్తల్లోకి వచ్చారు. అయితే బ్రిటన్ వార్తల్లోకి కాదు. భారతీయ పత్రికల్లోకి. ‘‘పెళ్లితో ఆ రాజ కుటుంబంలోకి అడుగుపెట్టి నిరాదరణకు గురైన మహిళల్లో డయానా, మేఘన్ మాత్రమే తొలి వ్యక్తులు కారు. పందొమ్మిదో శతాబ్దంలోనే క్వీన్ విక్టోరియా హయాంలో గౌరమ్మ అనే బాలిక ‘ప్రిన్సెస్’గా ఆ బంగారు పంజరంలో చిక్కుకుని బయటికి వచ్చే దారిలేక పారిపోయేందుకు ఆలోచనలు చేసిందని చరిత్రకారులు నాటి సంగతుల్ని మళ్లీ తవ్వి తీస్తున్నారు. ప్రిన్సెస్ గౌరమ్మతో ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ని పోల్చి చూస్తున్నారు. ఎవరీ గౌరమ్మ?! నిజంగానే బ్రిటన్ రాచ కుటుంబం గౌరమ్మ పట్ల అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందా? అది దయలేకపోవడమా లేక కట్టుబాట్లను శిరసావహించమని ఆదేశించడమా? ∙∙ డయానాను పక్కన పెడితే.. బ్రిటన్ రాజకుటుంబంలో వివక్షకు గురైన గోధుమవర్ణ చర్మం గల రెండో మహిళ మేఘన్ మార్కెల్. మొదటి మహిళ ప్రిన్స్ గౌరమ్మ. పదేళ్ల వయసు లో గౌరమ్మ అంతఃపురానికి వచ్చేనాటికి బ్రిటన్ ను క్వీన్ విక్టోరియా పరిపాలిస్తూ ఉన్నారు. గౌరమ్మ తండ్రి కూర్గ్ రాజు చిక్కా వీర రాజేంద్ర. ఈస్ట్ ఇండియా కంపెనీవాళ్లు అతడిని పదవీచ్యుతుడిని చేసి, సంపదను కొల్లగొట్టారు. అందులో కొంత భాగాన్నయినా తిరిగి తనకు దక్కులా చేయమని విన్నవించుకోడానికీ, తన ముద్దుల కూతురు గౌరమ్మను ఆమె రక్షణ కోసం రాణిగారికి దత్తత ఇవ్వడానికి.. ఆ రెండు కారణాలతో.. ఆయన గౌరమ్మను వెంటబెట్టుకుని వెళ్లి రాణిగారిని కలిశారు. అది 1852వ సంవత్సర ఆరం¿¶ కాలం. మొదటి పని కాలేదు. రెండో పని అయింది. విక్టోరియా రాణి గౌరమ్మను దత్తత తీసుకున్నారు. ‘‘నా తల్లి ఇక మీది. తనని మీలో కలిపేసుకున్నా (బాప్తిజం) అభ్యంతరం లేదు’’ అని కూతుర్ని రాణిగారి చేతుల్లో పెట్టి వెనుదిరిగారు వీర రాజేంద్ర. గౌరమ్మ అందంగా ఉంది. ఇకపై మరింత అందంగా మారబోతోంది. అందం మాత్రమే కాదు అలవాట్లు, ఆచారాలు కూడా. 1852 జూన్లో విండ్సర్ క్యాజిల్లో (మరొక రాజసౌధం) గౌరమ్మకు రాచ కుటుంబం బాప్తిజం ఇప్పించడం ఆనాటి పత్రికల్లో విశేష ప్రచారానికి నోచుకుంది. రాణిగారితో కలిసి ఉన్న గౌరమ్మ ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఆనాటి నుంచి గౌరమ్మ ‘ప్రిన్సెస్ గౌరమ్మ’ అయింది. అయితే అది రాణిగారి సంతోషమే కానీ గౌరవ సంతోషం కాదు. ఆ చిన్నారి తన కొత్త పాత్రలో, కొత్త మనుషుల మధ్య, కొత్త ఆచారాల వ్యవహారాలలో ఇమడలేకపోయింది. క్వీన్ విక్టోరియా ఆమెను అమితంగా ఇష్టపడేవారు. అదే ఆ పసిదానికి కష్టాలను తెచ్చిపెట్టింది. చుట్టూ పరిచారకులు ఉండేవారు. తన ఇష్టానుసారం కాలూ చెయ్యి ఆడనిచ్చేవారు కాదు. రాణిగారితో మాటొస్తుందని వారి భయం. అసలు కష్టం ప్రిన్స్ గౌరమ్మకు తన 16వ యేట వచ్చింది. గౌరమ్మను మహారాజా దులీప్ సింగ్కు ఇచ్చి చేయాలని రాణి గారు తలపోయడమే ఆ కష్టం. గౌరమ్మ కన్నా పదహారేళ్లు పెద్దవాడు దులీప్సింగ్. గౌరమ్మకూ పెళ్లంటే ఇష్టం లేదు. ఎప్పుడు ఆ బంధనాల్లోంచి పారిపోదామా అన్నట్లు ఉండేదా అమ్మాయి. అది గమనించాడు దులీప్సింగ్. తనకు ఆమెతో పెళ్లి ఇష్టం లేదన్నాడు. అలా ఆ కష్టాన్ని అతడే తప్పించాడు. అయితే గౌరమ్మకు నిజమైన కష్టం తండ్రిని కలవనివ్వకుండా కట్టడి చెయ్యడం! కలిస్తే మళ్లీ పాతబుద్ధులే వస్తాయని రాణిగారు ఆందోళన చెందేవారట. ‘‘ఎక్కడికైనా పారిపోయి, పనిమనిషిగానైనా బతికేందుకు గౌరమ్మ సిద్ధపడింది’’ అని క్వీన్ విక్టోరియా ఆంతరంగిక కార్యదర్శి ఆ తర్వాతి కాలంలో బహిర్గతం చేసినట్లు చరిత్రకారులు రాశారు. మొత్తానికి ఇప్పుడు మేఘన్కు అయినట్లే, అప్పుడు గౌరమ్మ కు అయింది. ఒక్కరైనా ఆమెను పట్టించుకోలేదు. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న ఆ మనసును తెలుసుకోడానికి ప్రయత్నించలేదు. ఏ ప్రయత్నమూ లేకుండా తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి కల్నల్ జాన్ కాంప్బెల్. ప్రిన్స్ గౌరమ్మ కొత్త పరిచారిక లేడీ లోజిన్ సోదరుడే జాన్ కాంప్బెల్. ∙∙ కాంప్బెల్.. గౌరమ్మ కన్నా 30 ఏళ్లు పెద్ద. వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్లు అక్కడికి రాకపోకలు సాగిస్తుండే దులీప్ సింగ్ గమనించి, రాణిగారికి ఆ విషయాన్ని చేరవేయడంతో క్షణమైనా ఆలస్యం చేయకుండా ఇద్దరికీ వివాహం జరిపించారు. లేడీ లోజిన్ నిర్ఘాంతపోయారు. గౌరమ్మ తమ ఆడపడుచు అవడం లోజిన్కు ఇష్టం లేదు. కానీ రాణిగారి నిర్ణయం! 1861లో ప్రిన్స్ గౌరమ్మకు ఇరవై ఏళ్ల వయసులో ఆడబిడ్డ పుట్టింది. ఆ పాపకు ఎడిత్ విక్టోరియా కాంప్బెల్ అని పేరు పెట్టారు. తర్వాత మూడేళ్లకు ప్రిన్స్ గౌరమ్మ 1864లో తన ఇరవై మూడవ యేట చనిపోయింది. ఆమె మరణానికి కారణం ఏమిటన్నది మాత్రం చరిత్రలో నమోదు అవలేదు! కుటుంబ సభ్యుల ప్రేమ కోసం, స్వేచ్ఛ కోసం పెనుగులాడిన లేడీ డయానా, మేఘన్ మార్కెల్ల జీవితంలోనూ నమోదు కానీ, నమోదు అయ్యే అవకాశం లేని వ్యక్తిగత విషయాలు ఉంటే ఉండొచ్చు. ఓప్రా విన్ ఫ్రేకు ఇచ్చిన ఇటీవలి ఇంటర్వ్యూలో ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్కెల్ -
మేఘన్ జాతివివక్ష ప్రకంపనలు
లండన్: ప్రిన్స్ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్ రాచకుటుంబంలో జాతి వివక్షని ఎదుర్కొంటూ ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని నటి మేఘన్ మార్కెల్ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకంపనలు సృష్టిస్తోంది. మేఘన్ వెల్లడించిన విషయాలు బ్రిటన్ రాచకుటుంబాన్నే సంక్షోభంలో పడేశాయి. ఈ సంక్షోభ నివారణకు రాణి ఎలిజెబెత్–2 ఒక ప్రకటన కూడా సిద్ధం చేశారని , కానీ ఇంకా దానిని విడుదల చేయడానికి ముందు వెనుక ఆలోచిస్తున్నారంటూ బ్రిటన్లో ఓ వర్గం మీడియా కథనాలు ప్రసారం చేసింది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఆ ఇంటర్వ్యూలో తమకి పుట్టబోయే బిడ్డపై కూడా రాచకుటుంబం చర్చించుకుందని, ఆ బిడ్డ నల్లగా పుడతాడని, అందుకే ప్రిన్స్ హోదా, భద్రత కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకుందని వెల్లడించారు. మేఘన్ జాతి వివక్ష ఆరోపణలపై స్పందించాల్సిందిగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ను అడగ్గా ‘‘నాకు రాణి పట్ల అమితమైన గౌరవ భావం ఉంది. కామన్వెల్త్ దేశాలన్నింటినీ ఏకం చేసి ఉంచినందుకు ఆమెను ఎప్పటికీ ఆరాధిస్తాను’’అని జాన్సన్ పేర్కొన్నారు. ‘‘రాచకుటుంబ విషయాలపై తాను ఎప్పుడూ వ్యాఖ్యానించనని, ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉంటాను’’అని జాన్సన్ మాట్లాడేందుకు నిరాకరించారు. మరోవైపు ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు సర్ కేర్ స్టార్మర్ ఇది అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని అన్నారు. తూర్పు లండన్లో ఒక పాఠశాలని దర్శించడానికి వచ్చిన ఆయన దగ్గర మీడియా ఈ అంశాన్ని ప్రస్తావించగా ‘‘రాచకుటుంబం ఇలాంటి సంక్షోభంలో చిక్కుకోవడం అత్యంత విచారకరం. మేఘన్ చెప్పిన జాతివివక్ష, ఆమె మానసిక ఆరోగ్యమనేవి అత్యంత తీవ్రమైన అంశాలు. రాచకుటుంబం కంటే ఇవి పెద్ద విషయాలు. 21వ శతాబ్దాంలో బ్రిటన్లో జాతివివక్షకు సంబంధించిన ఎన్నో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి’’అని స్టార్మర్ వ్యాఖ్యానించారు. మరోవైపు మేఘన్ తండ్రి థామస్ మార్కెల్ కొన్ని సంవత్సరాల తర్వాత తన కుమార్తె ఇలా మాట్లాడడం చూస్తున్నానని అన్నారు. స్పందించిన బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకంపనలకు కారణమైన ప్రిన్స్ హ్యారీ దంపతుల ఇంటర్వ్యూపై బిట్రన్ రాణి ఎలిజబెత్ ఎట్టకేలకు మౌనం వీడారు. హ్యారీ, మేఘన్ దంపతులు గడిచిన రెండేళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసి ఆవేదన చెందుతున్నామనీ, వీటిని వ్యక్తిగతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొంటూ బకింగ్హమ్ ప్యాలెస్ నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదలయింది. ముఖ్యంగా వర్ణ వివక్షపై వ్యక్త పరిచిన అంశాలు తీవ్రమైనవని పేర్కొంది. తమ కుటుంబానికి హ్యారీ, మేఘన్ దంపతులు ఎప్పటికీ అత్యంత ప్రియమైన వారిగానే ఉంటారని తెలిపింది. చదవండి: (ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా) -
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
-
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
లాస్ ఏంజెలిస్/లండన్: ప్రిన్స్ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్ రాచకుటుంబంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, బాధలను అనుభవించానని ఆఫ్రికన్ అమెరికన్ నటి మేఘన్ మార్కెల్ వెల్లడించారు. చాలా ఒంటరితనం అనుభవించానని, తన మానసిక వేదనకు పరిష్కారం లేదనిపించిందని, ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించానని వెల్లడించారు. ఇక జీవించాలనుకోవడం లేదని హ్యారీతో కూడా చెప్పానన్నారు. ఈ విషయంలో వైద్య సహాయం పొందేందుకు కూడా అవకాశం కల్పించలేదని, దానివల్ల రాజకుటుంబ పరువుప్రతిష్టలకు భంగం కలుగుతుందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చాట్ షోలో పలు సంచలన విషయాలను ఆమె ప్రఖ్యాత అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రేతో పంచుకున్నారు. అమెరికాలో సీబీఎస్ నెట్వర్క్ చానల్లో ఆదివారం ఆ కార్యక్రమం ప్రసారమైంది. కుటుంబంతో విభేదాల కారణంగా గత సంవత్సరం మార్చిలో ప్రిన్స్ హ్యారీ దంపతులు, తమ ఏడాది కుమారుడు ఆర్చీతో కలిసి రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. ఓప్రా విన్ఫ్రే కార్యక్రమంలో మేఘన్ భర్త ప్రిన్స్ హ్యారీ కూడా పాల్గొని, పలు రాచకుటుంబ రహస్యాలను వెల్లడించారు. వివాహం తరువాత కొత్తగా రాచకుటుంబంలోకి వెళ్లిన తనకు కొద్ది రోజుల తరువాత ఆదరణ కన్నా అవమానాలే ఎక్కువ ఎదురయ్యాయని మేఘన్ తెలిపారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఊహించని స్థాయిలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానన్నారు. నలుపురంగులో పుడితే ఎలా..? ‘పుట్టబోయే చిన్నారి రంగు గురించి రాచకుటుంబం మాట్లాడుకుంది. నేను నలుపు కనుక బిడ్డ కూడా నలుపు రంగులోనే పుడితే ఎలా?’అని వారు ఆలోచించారని తెలిపారు. పుట్టబోయే బిడ్డకు రాజకుటుంబం నుంచి లభించే ‘ప్రిన్స్’హోదా ఇవ్వకూడదని నిర్ణయించారని, అందువల్ల రాజకుటుంబ సభ్యులకు లభించే భద్రత కూడా అందదని తేల్చేశారని వివరించారు. ఈ విషయాలను హ్యారీ తనతో పంచుకున్నారని, వాటిని జీర్ణించుకోవడం తమకు కొన్నాళ్ల పాటు సాధ్యం కాలేదని తెలిపారు. అయితే, బిడ్డ రంగు గురించిన వ్యాఖ్యలు ఎవరు చేశారన్న విషయాన్ని మేఘన్ వెల్లడించలేదు. వారి పేరు చెబితే.. వారి ప్రతిష్టకు భారీగా భంగం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఆ విషయమై తనతో రాజకుటుంబ సభ్యులు జరిపిన సంభాషణను తాను కూడా బయట పెట్టాలనుకోవడం లేదని హ్యారీ కూడా స్పష్టం చేశారు. కుటుంబం నుంచి దూరంగా వచ్చేసిన తరువాత తన ఫోన్ కాల్స్ను కూడా తన తండ్రి ప్రిన్స్ చార్లెస్ స్వీకరించలేదని హ్యారీ తెలిపారు. అంతకుముందు, నానమ్మ ఎలిజబెత్ రాణితో మూడు సార్లు, తండ్రి ప్రిన్స్ చార్లెస్తో రెండు సార్లు మాత్రం మాట్లాడానన్నారు. ‘నా కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమే. కానీ తప్పదు. నేను, నా భార్య మేఘన్, కుమారుడు ఆర్చీల మానసిక ఆరోగ్యం కోసం రాజ కుటుంబానికి దూరం కావాలన్న నిర్ణయం తీసుకున్నాను’అని హ్యారీ వివరించారు. అవన్నీ అవాస్తవాలు.. బకింగ్హమ్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, రాజకుటుంబం నుంచి డబ్బులు రావడం ఆగిపోయిందని హ్యారీ వివరించారు. ఆ సమయంలో తన తల్లి ప్రిన్సెస్ డయానా తన కోసం దాచిన ఆస్తులే తమను ఆదుకున్నాయన్నారు. తమ వివాహం తరువాత రాజకుటుంబం తనకు, తన భర్తకు సరైన భద్రతను కూడా కల్పించలేదని మేఘన్ ఆరోపించారు. రాయల్ వెడ్డింగ్ సందర్భంగా ఫ్లవర్ గర్ల్ డ్రెసెస్ విషయంలో తన తోటి కోడలు, ప్రిన్స్ విలియం భార్య, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేథరిన్(కేట్) మిడిల్టన్ తన కారణంగా కన్నీళ్లు పెట్టుకున్నారన్న వార్తలను ఓప్రా విన్ఫ్రే ప్రస్తావించగా.. అవన్నీ అవాస్తవాలని మేఘన్ తెలిపారు. ‘నిజానికి జరిగింది వేరే. ఆ ఘటనతో నేనే ఏడ్చాను. ఆ తరువాత కేట్ నన్ను క్షమాపణలు కూడా కోరింది’అని వెల్లడించారు. ‘నిజానికి రాయల్ వెడ్డింగ్కు మూడు రోజుల ముందే మాకు వివాహం జరిగింది. అది మాకు మాత్రమే ప్రత్యేకమైన ప్రైవేట్ విషయం’అని మేఘన్ పేర్కొన్నారు. వివాహమైన మొదట్లో బాగానే చూసుకున్నారని, ఆ తరువాతే వారిలో మార్పు వచ్చిందని మేఘన్ వివరించారు. ‘మొదట్లో నేనేం చేయాలో, ఎలా ప్రవర్తించాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు’అన్నారు. ఎలిజబెత్ రాణితో తనకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని, ప్రిన్స్ ఫిలిప్ ఇటీవల అస్వస్థతకు గురైనప్పుడు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడానని వివరించారు. ‘రాజకుటుంబ క్రియాశీల బాధ్యతల నుంచి తప్పుకుని ఎలిజబెత్ రాణిని బాధపెట్టారా?, ఆమెకు చెప్పకుండా ఆ నిర్ణయం తీసుకున్నారా?’అన్న ప్రశ్నకు.. ఈ విషయమై నానమ్మకు, తనకు మధ్య పలుమార్లు చర్చ జరిగిందని హ్యారీ వెల్లడించారు. నానమ్మ అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. పాప పుట్టబోతోంది రెండో సంతానంగా తమకు పాప పుట్టబోతోందని ప్రిన్స్ హ్యారీ, మేఘన్లు వెల్లడించారు. ‘ఫస్ట్ కుమారుడు. ఇప్పుడు పాప. ఇంతకన్నా ఏం కావాలి? మేం నలుగురం. మాతో పాటు రెండు కుక్కలు. ఇదే మా కుటుంబం’అని హ్యారీ ఆనందంగా వివరించారు. టాక్షోలో ఓప్రా విన్ఫ్రే మొదట మేఘన్తో కాసేపు మాట్లాడిన తరువాత, వారితో హ్యారీ జతకలిశారు. -
ప్యాలెస్లో ఉండగా చనిపోవాలనిపించింది: మేఘన్
వాషింగ్టన్: అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే నిర్వహించే ఇంటర్వ్యూలంటే ప్రపంచ వ్యాప్తంగా జనాలు తెగ ఆసక్తి కనబరుస్తారు. ఎందుకంటే ఆమె ఇంటర్వ్యూలు సాధరణంగా ఉండవు.. వచ్చిన అతిథులు మనసు విప్పి మాట్లాడేలా చేసే శక్తి ఓప్రా సొంతం. ఈ క్రమంలో తాజాగా రెండు రోజుల క్రితం శనివారం ప్రసారం అయిన ఇంటర్వ్యూ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు జనాలు. ముఖ్యంగా బ్రిటన్ ప్రజలు. ఎందుకంటే ఈ సారి ఓప్రా ఇంటర్వ్యూ చేసింది.. రాజకుటుంబం నుంచి వేరు పడిన ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ని. కనుక ఈ ఇంటర్వ్యూ పట్ల అధిక ఆసక్తి కనబరిచారు. ఇక యువరాజు హ్యారీ దంపతులు ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూ శనివారం ప్రసారమయ్యింది. తన క్యారక్టర్పై మీడియా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని మండిపడి మేఘన్ మార్కెల్.. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తమ వివాహం జరిగిన తీరు, ఆ సమయంలో జరిగిన సంఘటనలను మేఘన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజకుటుంబం అధికారికంగా వివాహం నిర్వహించడానికి మూడు రోజుల ముందే తాము రహస్యంగా పెళ్లిచేసుకున్నట్టు తెలిపారు. ఈ విషయం ఎవరికీ తెలియదు, కానీ, ఆర్చ్బిషప్ను పిలిచి తామే ఆయనతో చెప్పామన్నారు మేఘన్. ‘‘ఈ విషయం, ఈ దృశ్యం ప్రపంచం కోసం, కానీ మా ఇద్దరి మధ్య బంధం ముడిపడిపోయింది’’ అని ఆర్చ్బిషప్తో చెప్పినట్టు వివరించారు. హ్యారీ, మేఘన్ మార్కెల్కు అధికారికంగా 2018 మే 19న బెర్క్షైర్ కౌంటీలోని విన్సర్ పట్టణంలోని రాజ భవనం విన్సర్ క్యాజిల్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. గాసిప్లతో సుదీర్ఘకాలం పోరాటం చేయాల్సి వచ్చిందని, ఇదే రాజకుటుంబంతో సంబంధాల్లో మలుపు తిప్పిందని అన్నారు. ఇది నిజం కాదని అక్కడ ప్రతి ఒక్కరికీ తెలుసు, కానీ ప్రచారం మాత్రం రివర్స్లో జరిగిందన్నారు. ఇంటర్వ్యూలోని ఆసక్తికర అంశాలు.... మేఘన్-హ్యారీకి తొలుత కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. అయితే పుట్టిన బిడ్డ విషయంలో రాజ కుటుంబం దారుణంగా ప్రవర్తించిందని.. ప్రొటోకాల్ ప్రకారం తమ బిడ్డకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదని.. పైగా బిడ్డ రంగు గురించి మాట్లాడుకున్నారని తెలిపారు మేఘన్. ప్యాలెస్లో ఉన్నప్పుడు చాలా సార్లు తాను ఒంటిరిగా ఫీలయ్యానని.. చాలా సార్లు చనిపోవాలనిపించింది అన్నారు మేఘన్. తమ వివాహ సమయంలో తోటి కోడలు కేట్ ఏడ్చిందనే వార్తలను మేఘన్ ఖండించారు. ఈ విషయంలో రివర్స్లో ప్రచారం జరిగిందని.. వాస్తవానికి ఏడ్చింది తాను అన్నారు మేఘన్. తన డ్రెస్ విషయంలో కేట్ తనపై కేకలు వేసిందని.. అది తనను చాలా బాధించిందని తెలిపారు. ఈ పరిణామం తర్వాత మీడియాతో తన సంబంధాలు పూర్తిగా మారిపోయాయి అన్నారు. తమ కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కోసం ప్యాలెస్లోని వారు ఎన్ని అబద్దాలు ఐనా చెప్తారన్నారే మేఘన్. తాము రాజ కుటంబం నుంచి విడిపోయి.. ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి విడిగా బతకాలని వెల్లడించినప్పటి నుంచి ప్యాలెస్ నుంచి తమకు డబ్బు రావడం ఆగిపోయిందని తెలిపారు హ్యారీ. తన తల్లి డయానా తన కోసం దాచిన సొమ్ముతోనే ప్రస్తుతం కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపారు. సెక్యూరిటీని కూడా తొలగించారన్నారు. మేఘన్ వల్లనే తాను కుటుంబం నుంచి విడిపోయాననే వార్తల్ని హ్యారీ ఖండించారు. మేఘన్ నా జీవితంలోకి రాక ముందు నుంచే నేను ఈ చట్రం నుంచి బయటపడాలని భావించాను. ఇక్కడ ప్రతి ఒక్కరు ట్రాప్ చేయబడ్డారు. నా తండ్రి, సోదరుడు అందరు ట్రాప్ చేయబడ్డారు.. కానీ వారు బయటపడలేరు.. వారిని చూస్తే నాకు జాలేస్తుంది’’ అన్నారు. అన్నదమ్ములిద్దరి మధ్య ప్రస్తుతం గ్యాప్ వచ్చిందని.. కానీ కాలమే అన్నింటిని నయం చేస్తుందని తెలిపారు హ్యారీ. ‘‘విలియమ్ అంటే నాకు చాల ప్రేమ.. తను నా సోదరుడు. మేం మా అభిప్రాయలను ఒకరితో ఒకరం పంచుకుంటాము. కానీ మేం ఇద్దరం వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్నాం’’ అన్నారు. అంతేకాక త్వరలోనే తమకు ఆడపిల్ల పుట్టబోతుంది అని తెలిపారు. చదవండి: ప్రిన్స్ హ్యారీ మళ్లీ రాచ విధుల్లోకి రారు మీడియా ఒత్తిళ్లు తట్టుకోలేకపోయా -
ప్రిన్స్ ఫిలిప్ ఆఖరి చూపుకైనా వస్తారా..?
జీసస్! ప్రిన్స్ ఫిలిప్ (99) ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వస్తున్నాయి. ఆయన్ని లండన్లోని కింగ్ ఎడ్వర్డ్ సెవన్ హాస్పిటల్ నుంచి అత్యవసరంగా లండన్ లోనే ఉన్న సెయింట్ బర్తోలోమ్యూ ఆసుపత్రికి తరలించారు. ‘తాత గారికి గుడ్ బై చెప్పడం కోసం స్టార్ట్ ఇమీడియట్లీ‘ అని యూఎస్లో ఉంటున్న ప్రిన్స్ హ్యారీకి కబురు వెళ్లింది. అయ్యో దేవుడా.. బ్రిటన్ రాచకుటుంబం కోసం పొంచి ఉన్న విపత్తు ఇదొక్కటే కాదు. ఈ నెల 7 న ప్రిన్స్ హ్యారీ (36), మేఘన్ (39) దంపతుల తొంభై నిముషాల ఓప్రా విన్ ఫ్రే ‘టెల్–ఆల్’ ఇంటర్వ్యూ అమెరికన్ టీవీ ఛానెల్ సి.బి.ఎస్.లో ప్రసారం కాబోతోంది! ఆ ప్రసారాన్ని రద్దు చేయించమని, కనీసం వాయిదా వేయించమని రాయల్ ఫ్యామిలీ హ్యారిస్ ను కోరుతోంది. ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం.. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం..’ అని ఏడాది క్రితం రాణిప్రాసాదం వీడి వెళ్లిన హ్యారీ.. తాతగారిని చూడ్డానికి భార్య సహా వస్తారా? ఓప్రా ఇంటర్వ్యూ ఆగిపోతుందా? అందులో ఈ దంపతులు ఏం చెప్పి ఉంటారు? తన భార్యను సరిగా ట్రీట్ చేయనందుకే హ్యారీ తనకా రాచరికం, రాజసౌధం వద్దనుకున్నారా? పెద్దాయన ప్రిన్స్ ఫిలిప్ పరిస్థితి ఏమీ బాగోలేదు! 99 ఏళ్ల వయసులో ఇంకేం బాగుంటుంది అనుకోడానికి మనసు రానంతగా బ్రిటన్ ప్రజలు వారసత్వంగా ఆ కుటుంబంతో బలమైన ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పచురచుకుని ఉన్నారు కనక ఆసుపత్రి నుంచి ఆయన త్వరగా కోలుకుని రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలో అంతర్లయగా మరొక ప్రార్థన కూడా కలిసి ఉంది! కొన్ని నెలల క్రితం బ్రిటన్ రాజ ప్రాసాదాన్ని శాశ్వతంగా వీడి వదిలిపోయిన ప్రిన్స్ హ్యారీ.. దాదాపుగా మరణశయ్యపై ఉన్న తన తాతగారు ప్రిన్స్ ఫిలిప్ను ఆఖరి చూపైనా చూసేందుకు వచ్చేవిధంగా ఆయన మనసు మార్చాలని రాజసౌధంతోపాటు, దేశ ప్రజలూ దేవుణ్ని కోరుకుంటున్నారు. వస్తే ఆయన ఒక్కరే రారు. తన భార్య మేఘన్ మార్కెల్ను వెంటపెట్టుకుని రావలసిందే. ఆమె రాక కనుక క్వీన్ ఎలిజబెత్కు అసహనాన్ని కలిగించే అవకాశం ఉందని తెలిస్తే కనుక ప్రిన్స్ హ్యారీ బ్రిటన్కు రాకపోవచ్చు. అయితే ఆయన భార్య పేరెత్తకుండా బకింగ్హామ్ ప్యాలెస్ ఆంతరంగిక కార్యదర్శులు ‘వెంటనే వచ్చి తాతగారిని చూసి వెళ్లండి’ అని ప్రిన్స్ హ్యారీకి వర్తమానం పంపించారు. అది ఏమాత్రం అస్పష్టంగా లేని వర్తమానం! ‘లండన్ వచ్చి ప్రిన్స్ ఫిలిప్కి ‘గుడ్బై’ చెప్పవలసిందిగా సూచిస్తున్నాం’ అని వారు తెలియజేశారు. ప్రిన్స్ ఫిలిప్ క్వీన్ ఎలిజబెత్ (94) భర్త. ఫిబ్రవరి 16న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి లండన్లోని కింగ్ ఎడ్వర్డ్ సెవెన్ ఆసుపత్రికి మార్చారు. ఆరోగ్యంలో కనీసస్థాయి మెరుగుదల కూడా కనిపించకపోవడంతో మార్చి 1న లండన్లోనే మరొకటైన సెయింట్ బర్తోలోమ్యూ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడే ఆయనలోని ఇన్ఫెక్షన్లకు చికిత్స జరుగుతోంది. అక్కడే ఆయన్ని వైద్య నిపుణుల పరిశీలనలో ఉంచారు. ఈలోపే ప్రిన్స్ హ్యారీ రమ్మని కబురు వెళ్లడంతో.. ప్రిన్స్ ఫిలిప్ ఆరోగ్యంపై అనుమానాలు బ్రిటన్ని కమ్మేశాయి. మొన్నటి వరకు ప్రిన్స్ ఫిలిప్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన రాజకుటుంబం ఇప్పుడు.. తాతగారిని చూడ్డానికి ప్రిన్స్ హ్యారీ వస్తారా రారా అని ఆందోళ చెందుతోందని బ్రిటన్ టాబ్లాయిడ్లు అదే పనిగా ముఖచిత్ర కథనాలను రాస్తున్నాయి. ఆ టాబ్లాయిడ్లే తమను బ్రిటన్ నుంచి తరిమికొట్టాయిని అమెరికాకు మారిన కొత్తలో ప్రిన్స్ హ్యారీ దంపతులు ఆరోపించినప్పటికీ.. రాణిగారి కుటుంబంలో తన సతీమణికి గౌరవ మర్యాదలు లభించడం లేదన్న ఆవేదనతోనే ప్రిన్స్ హ్యారీ తన వంశవృక్షంతో తెగతెంపులు చేసుకున్నారని ఆ కుటుంబానికి సన్నిహితులైన కొందరి నోటి ద్వారా ఏనాడో బహిర్గతం అయింది. క్వీన్ ఎలిజబెత్, మనవడు ప్రిన్స్ హ్యారీ ముఖాముఖి మాట్లాడుకుని కూడా నెలలు అవుతోంది. గతంలో క్రిస్మస్లకు కలుసుకున్న సందర్భంలోనూ ఒకరితో ఒకరు ముభావంగానే ఉండిపోయినట్లు పత్రికలు రాశాయి. ఇప్పుడు ప్రిన్స్ హ్యారీ తన తాతగారిని చూసేందుకు బ్రిటన్కు వస్తారా రారా అనే ఆలోచన కంటే కూడా.. మార్చి 7న అమెరికన్ టీవీ ఛానెల్ సీబీఎస్ ప్రసారం చేయబోతున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ల ఇంటర్వ్యూ ప్రసారం కాకుండా చేయడం ఎలాగన్న దాని గురించే రాణిగారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయమై ఇప్పటికే రాణిగారి ప్రత్యేక ప్రతినిధి ఒకరు హ్యారీతో మాట్లాడి, ఇంటర్వ్యూను అసలే ప్రసారం కాకుండా చేసేందుకు ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకు తగిన కారణమే ఉంది. సీబీఎస్ ఛానల్ కోసం ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్లను ఇంటర్వ్యూ చేసినవారు ఓప్రా విన్ ఫ్రే. ఆమె ఇంటర్వ్యూ చేయడం మామూలుగా ఉండదు. అంతరంగాల్లోకి వెళతారు. ఒకలాటి హృదయోద్వేగ స్థితిని కల్పించి లోపలిదంతా బయటికి లాగేస్తారు. అసలే ఇప్పుడు హ్యారీ, మార్కెల్ తమకు ఏ మాత్రం అలవాటు లేని ఒంటరి జీవితాన్ని కలిసికట్టుగా గడుపుతున్నారు. పైగా మార్కెల్ ఇప్పుడు గర్భిణి. రెండో బిడ్డ కోసం ఆమె సిద్ధంగా ఉన్నారు. ఈ ఫిబ్రవరి 14న వాళ్లే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు కూడా. ఈ స్థితిలో ఓప్రా ఇంటర్వ్యూలో రాజసౌధ అహంకార రహస్యాలు ఏవైనా బయట పెడితే కనుక ఆ వృద్ధ ప్రాణం.. ప్రిన్స్ ఫిలిప్.. ఆవేదన చెందే ప్రమాదం ఉందని క్వీన్ ఆందోళన పడుతున్నారు. అందుకోసమే ఇంటర్వ్యూను ఆపించమని విజ్ఞప్తి చేయిస్తున్నారు. ఆ విజ్ఞప్తిని సీబీఎస్ టీవీ మన్నిస్తుందా, ఒకవేళ సీబీఎస్ మన్నించినా.. ప్రిన్స్ హ్యారీ.. గో ఎహెడ్ అంటారా అన్నది మరొక సందేహం. బ్రిటన్లో ప్రిన్స్ హ్యారీపై కోపగిస్తున్నవారూ ఉన్నారు. పరదేశీ పిల్లను (అమెరికా) చేసుకోవడమే కాకుండా, రాజకుటుంబ నియమాలను గౌరవించని భార్యను ఆయన వెనకేసుకొస్తున్నారని వారి విమర్శ. మరోవైపు బకింగ్హామ్ ప్యాలెస్, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘‘అంత్యక్రియలకు హాజరైనప్పుడు ప్రిన్స్ హ్యారీని బ్రిటన్ ప్రజలు బహిరంగంగానే తూలనాడే ప్రమాదాన్ని నివారించడం కోసం హ్యారీని, ఆయన భార్యను ఎక్కడ కూర్చోబెట్టాలన్న దానిపైన కూడా సమాలోచనలు జరుగుతున్నాయి’’ అని ‘ది రాయల్ అబ్జర్వర్’ పత్రిక రాసింది. మంచిని ఆలోచిస్తున్న పత్రికలు కూడా కొన్ని ఉన్నాయి. తాతగారి ఆఖరిశ్వాసకు ముందరే వచ్చి ప్రిన్స్ హ్యారీ ఆయన్ని సంతోషపరుస్తారనీ, ఓప్రా విన్ఫ్రే కుటుంబ విలువలకు గౌరవం ఇచ్చే మనిషి కనుక తాత్కాలికంగానే అయినా ఇంటర్వ్యూను ఆపేస్తారని ఆ పత్రికలు ఆశిస్తున్నాయి. ఎవరైనా కోరుకునేది మంచే జరగాలని, ఆ కుటుంబానికి కాస్త ఎక్కువ మంచి జరగాలని. బకింగ్హామ్ ప్యాలెస్ నిర్మాణమై ఉన్నది లండన్లోనే అయినా, మూడు వందల ఏళ్లకు పైగా ఆ భవంతిలో ఉంటున్న రాజ కుటుంబాలు ఉంటూ వస్తున్నది మాత్రం బ్రిటన్ ప్రజల గుండెల్లోనే. ప్రిన్స్ ఫిలిప్ ఎవరీయన?! ప్రస్తుత బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్ భర్తే ప్రిన్స్ ఫిలిప్ అన్న సంగతి తెలిసిందే. అదొక్కటే ఆయన గుర్తింపు కాదు. ఎడిన్బరో సామంత రాజు (డ్యూక్). యూకె అధీనంలో ఉన్న స్కాట్లాండ్ దేశపు రాజధానే ఎడిన్బరో. క్వీన్ ఎలిజబెత్తో ఆయనకు 1947లో వివాహం అయింది. ప్రిన్స్ చార్ల్స్, ప్రిన్సెస్ యాన్, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ వీరి సంతానం. ఈ నలుగురిలోకీ పెద్దవారైన ప్రిన్స్ చార్ల్స్ కొడుకే ప్రిన్స్ హ్యారీ. ప్రిన్స్ ఫిలిప్ గ్రీసు, డెన్మార్క్ల రాచకుటుంబీకుడు. క్వీన్ ఎలిజబెత్ బ్రిటన్ దేశస్థురాలు. ప్రిన్స్ ఫిలిప్ బ్రిటిష్ రాయల్ నేవీలో చేరేనాటికే ఉమ్మడి బంధుత్వాల ద్వారా ఒకరికొకరు పరిచయం. క్వీన్కి 13 ఏళ్ల వయసులో ఆయనపై ప్రేమ అంకురించినట్లు, ఆ ప్రేమ.. వివాహానికి దారి తీసినట్లు ఈ దంపతులపై వచ్చిన అనేక డాక్యుమెంటరీ చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఆ తర్వాత రాణి గారు కూడా ప్రిన్స్ ఫిలిప్పై తన ప్రేమ విషయాన్ని నిర్థారించారు. -
మీడియా ఒత్తిళ్లు తట్టుకోలేకపోయా
లండన్: బ్రిటన్ రాచరిక కుటుంబాన్ని వీడి రావడానికి మీడియా పెట్టిన ఒత్తిడే కారణమని ప్రిన్స్ హ్యారీ నిందించారు. బ్రిటన్ మీడియా తమ కుటుంబాన్ని ఊపిరాడనివ్వకుండా చేసిందని, దీని వల్ల ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొన్నానని వెల్లడించారు. అమెరికాలోని సీబీఎస్ చానెల్లో జేమ్స్ కార్డన్ హోస్ట్గా నిర్వహించే లేట్ లేట్ షో కార్యక్రమంలో హ్యారీ పాల్గొన్నారు. ప్రజా సేవ నుంచి తానేమీ దూరంగా పారిపోలేదని స్పష్టం చేశారు. ‘‘‘నేను ఎప్పుడూ ప్రజల నుంచి దూరంగా పారిపోవాలని అనుకోలేదు. కానీ బ్రిటన్ మీడియా వల్ల ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. నా మానసిక ఆరోగ్యం దెబ్బ తింది. అలాంటప్పుడు ప్రతీ భర్త, ప్రతీ తండ్రి ఏం చేద్దామనుకుంటారో నేనూ అదే చేశాను. ఇది బాధ్యతల్ని విడిచిపెట్టడం కాదు. ఒక్క అడుగు వెనక్కి వేయడమే. బ్రిటన్ మీడియా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే’’అని అన్నారు. ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మెఘన్ మెర్కల్ గత ఏడాది జనవరిలో రాచ కుటుంబాన్ని వీడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జంట ఇప్పడు ఇక పూర్తిగా రాచ కుటుంబానికి దూరమయ్యారని గత వారమే బకింగ్çహామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలోని కాలిఫోర్నియాకు మకాం మార్చడానికి ముందు బ్రిటన్లోని టాబ్లాయిడ్లు తమపై జాతి వివక్షని ప్రదర్శించాయంటూ హ్యారీ దంపతులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మెఘన్ తండ్రి శ్వేతజాతీయుడు కాగా,తల్లి ఆఫ్రికన్ అమెరికన్ కావడంతో బ్రిటన్ పత్రికల రాతలు తమను బాధించాయని హ్యారీ చెప్పారు. ఆ సిరీస్ అంతా కట్టుకథే రాచకుటుంబాన్ని వీడిన తర్వాత హ్యారీ ఒక చానెల్కి పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి. రాణి ఎలిజెబెత్పై నెట్ఫ్లిక్స్లో వచ్చిన ది క్రౌన్ సిరీస్లో వాస్తవాలేవీ చూపించలేదని ధ్వజమెత్తారు. నిజజీవితంలో తమ కుటుంబం ఎదుర్కొన్న ఒత్తిళ్ల కంటే, మీడియా కథనాల వల్ల ఎక్కువ ఒత్తిళ్లు ఎదురవుతున్నాయంటూ హ్యారీ వ్యాఖ్యానించారు. -
ప్రిన్సెస్ డయానా రాసిన ఆ ఉత్తరాల్లో ఏముంది..?
ప్రిన్సెస్ డయానా మరణించి దాదాపు 24 ఏళ్లు అవుతున్నప్పటికీ తన వ్యక్తిగత జ్ఞాపకాలతో ఇప్పటికీ వార్తల్లో నిలుస్తుండడం విశేషం. క్లోజ్ ఫ్రెండ్స్కు డయానా స్వయంగా రాసిన ఉత్తరాలు తాజాగా వెలుగులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఎవరూ చదవని రెండు దశాబ్దాల క్రితం నాటి.. దాదాపు 40 ఉత్తరాలను ‘డేవిడ్ లే’ అనే వేలం సంస్థ విక్రయించనుంది. ఈ ఉత్తరాలను డయానా స్నేహితుడు రోజర్ బ్రాంబుల్కు 1990 ఆగస్టు నుంచి 1997 మే నెల మధ్యకాలం లో రాశారు. 1997లో ఆమె మరణించిన తరువాత కంట్రీ ఫామ్ హౌస్లో ఓ కప్ బోర్డులో ఈ ఉత్తరాలు దొరికాయి. ఇన్నేళ్లు చీకట్లో మగ్గిన ఆ ఉత్తరాలు జన బాహుళ్యంలోకి రానున్నాయి. ప్రిన్స్ చార్లెస్తో తన వివాహబంధాన్ని తెంచుకున్న తరువాత రాసిన లెటర్స్ కావడంతో వాటిలో ఏముందోనని ఆసక్తి నెలకొంది. తన కుమారులైన ప్రిన్స్విలియం, హ్యారీల గురించి కూడా దీనిలో డయానా ప్రస్తావించారని వేలం నిర్వాహకులు చెబుతున్నారు. ‘‘డయానా ఓ యాక్సిడెంట్లో మరణించినప్పటికీ ఆమె మృతి వెనుక అనేక అనుమానాలు ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని చాలామంది కుతూహలం చూపుతున్నారు. అందుకే ఆమె జీవితానికి సంబంధించిన మరిన్ని నిజాలు తెలుసుకునేందుకు ఉత్తరాలను వేలం వేస్తున్నట్లు’’ వేలం సంస్థ వెల్లడించింది. మార్చి 18న 39 లెటర్స్ ను వేలం వేస్తున్నామని, మరింత సమాచారం కోసం తమ వెబ్సైట్ను సంప్రదించాలని సంస్థ పేర్కొంది. -
ప్రిన్స్ హ్యారీ మళ్లీ రాచ విధుల్లోకి రారు
లండన్: ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మెఘన్ మార్కెల్ బ్రిటన్ రాజ కుటుంబంలోకి క్రియాశీల సభ్యులుగా తిరిగి రారని బకింగ్ హామ్ ప్యాలెస్ శుక్రవారం ప్రకటించింది. హ్యారీ నానమ్మ, రాణి ఎలిజబెత్–2(94) తరఫున విడుదల చేసిన ఆ ప్రకటనలో..‘డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ ప్రిన్స్ హ్యారీ(36), ఆయన భార్య డచెస్ ఆఫ్ సస్సెక్స్ మెఘన్ మార్కెల్(39) ఏడాదిలోగా తిరిగి క్రియాశీల విధుల్లోకి చేరతామంటూ చేసిన ప్రకటన గడువు పూర్తి కావస్తోంది. దీంతో నిర్ణయం తెలపాల్సిందిగా రాణి వారికి లేఖ రాశారు. తాము తిరిగి రామంటూ హ్యారీ దంపతులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆ విధులన్నీ తిరిగి రాణికే దఖలు పడ్డాయి. వాటిని ఆమె కుటుంబంలోని ఇతరులు తిరిగి పంపిణీ చేయనున్నారు’అని ఆమె వివరించింది. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజకుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్న ప్రిన్స్ హ్యారీ దంపతులు గత ఏడాది మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిప్పుడు అమెరికాలో నివాసం ఉంటున్నారు. -
శుభవార్త చెప్పిన మేఘన్ మార్కెల్
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి తొందర్లోనే మరో వారసుడు రానున్నాడు. బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ మరోసారి తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని బంకింగ్ హమ్ ప్యాలెస్ ప్రతినిధి వాలెంటైన్స్డే రోజున ప్రకటించారు. కాగా, 2018 పెళ్లి బంధంతో ఒక్కటైన హ్యారీ, మార్కెల్ దంపతులకు ఇప్పటికే ఆర్చి జన్మించాడు. కాగా, రాజకుటుంబానికి చెందిన కొన్ని ఆంక్షలు, విభేదాల కారణంగా అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఈ జంట ఉత్తర అమెరికాలోని నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ జంట కాలిఫోర్నియాలోని శాంటా బార్బారాలో ఒక ఇల్లును కూడా కొనుగొలు చేశారు. ఇదిలా ఉండగా.. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా 2020లో మార్కెల్కు గర్భస్రావం అయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. తండ్రితో ఉన్న విభేదాల కారణంగా మార్కెల్ తీవ్ర మానసిక సంఘర్షణ ఎదుర్కొన్నారని, ఆ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం దెబ్బతిని గర్భస్రావానికి దారి తీసినట్టు తెలిసింది. -
ప్రిన్సెస్ డయానాలో ఉన్న ఆకర్షణ అదే: మాజీ లవర్
ప్రిన్సెస్ డయానా అందమైన మహిళ. బ్రిటన్ రాజకుటుంబ వారసుడు ప్రిన్స్ చార్ల్స్ భార్య. వీరికి ఇద్దరు కొడుకులు. ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ. ఇద్దరికీ పెళ్ళిళ్లు అయ్యాయి. ప్రిన్స్ విలియం- కేట్ మిడిల్టన్ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు ప్రిన్స్ లూయీస్, ప్రిన్స్ జార్జ్.. ఒక కుమార్తె ప్రిన్సెస్ చార్లెట్. ప్రిన్స్ హ్యారీ- మేఘన్ మోర్కెల్ జంటకు కొడుకు ప్రిన్సెస్ ఆర్చీ ఉన్నాడు. అన్నీ సజావుగా సాగి, డయానా నేడు బతికి ఉంటే ఇంతటి ముచ్చటైన కుటుంబాన్ని చూసి కచ్చితంగా సంతోషపడేవారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనుమరాలు.. అన్ని బంధాలతో ఆమె జీవితం సంపూర్ణమయ్యేది. కానీ దాంపత్య జీవితంలో చెలరేగిన సంఘర్షణ, భర్తతో విభేదాలు, వ్యక్తిగతంగా మోయలేని నిందలు.. వీటికి తోడు విధి చిన్నచూపు చూడటంతో 1997లో ఫ్రాన్సులో జరిగిన కారు ప్రమాదంలో ప్రిన్సెస్ డయానా దివంగతులయ్యారు. అయితే ఇరవయ్యవ శతాబ్దపు అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డయానా మరణించి రెండు దశాబ్దాలు దాటినా ఆమె జీవితానికి సంబంధించిన విశేషాలతో నేటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ప్రిన్సెస్ డయానా మాజీ ప్రియుడిగా పేరొందిన హసంత్ ఖాన్ ఇటీవల డెయిలీ మెయిల్కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఆమె గురించి మరోసారి చర్చ మొదలైంది. మమ్మీ.. తను మంచివాడు కాదు.. చనిపోవడానికి రెండేళ్ల ముందు అంటే 1995లో డయానా పనోరమకు ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. తప్పుడు బ్యాంకు పత్రాలు చూపించి బీబీసీ సీనియర్ జర్నలిస్టు మార్టిన్ బషీర్.. డయానాను ఇందుకు ఒప్పించారని ఆమె సోదరుడు ఎర్ల్ స్పెన్సర్ ఇటీవల ఆరోపించారు. రాజభవనంలోని కొంతమంది సిబ్బంది ప్రిన్సెస్ వ్యక్తిగత వివరాలు లీక్ చేస్తున్నారని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. మార్టిన్పై ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయ వార్తా సంస్థ సుప్రీంకోర్టు మాజీ జడ్జి లార్డ్ డైసన్ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హార్ట్ సర్జన్ అయిన హసంత్ ఖాన్(పాకిస్తాన్లో జన్మించారు) మాట్లాడుతూ.. మార్టిన్ తన మాటలతో డయానాను ప్రభావితం చేసి, ఆమె మెదడునంతా చెత్తతో నింపేశాడన్నారు. నైతిక విలువలు వదిలేసి, అడ్డదారులు తొక్కి ఎట్టకేలకు ఆమె ఇంటర్వ్యూ తీసుకున్నాడని ఆరోపించారు. ‘‘మా పెళ్లి సమయంలో మేం ముగ్గురం’’ అని తన చేత చెప్పించాడని పేర్కొన్నారు. ‘‘తనొక మోసగాడు. ప్రిన్సెస్ను నేను పెళ్లి చేసుంటానా అంటూ నన్ను అత్యంత వ్యక్తిగత విషయాల గురించి అడిగాడు. బషీర్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని నేను ఆమెకు ఎన్నోసార్లు చెప్పాను. అతడితో మాట్లాడవద్దని హెచ్చరించాను కూడా. నిజానికి ఆమెలో ఉన్న అత్యంత ఆకర్షించే గుణం ఏంటో తెలుసా? తన మానసిక బలహీనతే. దానినే మార్టిన్ అవకాశంగా తీసుకున్నాడు. ఆమె మనసును కకావికలం చేశాడు. డయానా భర్త ప్రిన్స్ చార్లీ కారణంగా నానీ టిగ్గీ గర్భవతి అయ్యారని చెప్పాడు. అతడిని ఆమె నమ్మారు. అయితే అప్పటికి టీనేజర్గా ఉన్న ప్రిన్స్ విలియం.. ‘‘మమ్మీ.. తను అస్సలు మంచి వ్యక్తి కాదు’’ అని హెచ్చరించేంత వరకు ఇది కొనసాగింది’’ అని చెప్పుకొచ్చారు. కాగా హసంత్ ఖాన్, ప్రిన్సెస్ డయానా రెండేళ్లపాటు రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె అతడిని ముద్దుగా మిస్టర్ వండర్ఫుల్ అని పిలిచేవారట. ఇక హ్యారీ జన్మించిన తర్వాత డయానా- చార్లెస్ వైవాహిక బంధంలో విభేదాలు తారస్థాయికి చేరాయంటూ గతంలో వెలువడిన కథనాలు చెబుతున్నాయి.(చదవండి: డయానాలా మాట్లాడగలనా అని భయం) మిస్టర్ వండర్ఫుల్తో సంభాషణ అంతేగాక దాంపత్య జీవితంలో అసంతృప్తి, భర్త ప్రవర్తన కారణంగానే డయానా అభ్రదతాభావానికి లోనై ఇతరులవైపు ఆకర్షితురాలయ్యారని అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె కారు ప్రమాదంలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. అదే విధంగా ఆ సమయంలో భర్త ప్రిన్స్ చార్లెస్, ఇద్దరు కుమారులు విలియమ్, హ్యారీ... స్కాట్లాండ్లో వేసవి సెలవుల్ని గడుపుతుండగా, డయానా ఫ్రాన్స్లో ఉండటంపై విపరీతపు కామెంట్లు వినిపించాయి. ఇక ఖాన్తో ప్రేమలో ఉన్న సమయంలో తన టెలిఫోన్లు ట్రాప్ చేస్తున్నారన్న భయంతో.. డయానా కోడ్ భాషలో మాట్లాడేవారట. బషీర్కు డాక్టర్ జర్మన్, మోల్ అనే ఓ రహస్య పేరుతో అతడు తనను ఇంటర్వ్యూకి ఒప్పించడానికి చేసిన ప్రయత్నాల గురించి తనకు చెప్పినట్లు ఖాన్ వెల్లడించారు. ఇక 1995 నాటి బషీర్ ఇంటర్వ్యూ వల్ల రాజ దంపతుల మధ్య మనస్పర్థలు మరింతగా పెరిగిపోయానని వారి సన్నిహితులు గతంలో పేర్కొన్నారు. -
వైరల్ అవుతున్న క్రిస్మస్ కార్డు
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్ యువరాజు హారి, మేగన్ మార్కెల్ దంపతులు క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన శుభాకాంక్షల కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమ పెంపుడు శునకాల సమక్షంలో రాజ దంపతులు తమ పుత్రరత్నం ఆర్కీతో ముచ్చటిస్తున్న దశ్యంతో ఆ కార్డు విశేషంగా ఆకర్షిస్తోంది. బ్రిటిష్ రాజ కోటల నుంచి ఆ రాజదంపతులు కాలిఫోర్నియాలోని మాంటెసిటి భవనానికి మారిన తర్వాత వారు విడుదల చేసిన తొలి క్రిస్మస్ కార్డు ఇదే కావడం ఓ విశేషం. అయితే తమ తోటలోని చిన్న కుటీరం ముందు పెంపుడు కుక్కలు పూల, గైల సమక్షంలో ఓ చిన్ని క్రిస్మస్ టీ వద్ద వారు ఆర్కీతో ముచ్చటిస్తున్న దశ్యం కూడా చూపరులను ఆకట్టుకుంటోంది. ఆ దశ్యం ఓ అద్భుతమైన పెయింటింగ్లా కనిపిస్తున్నప్పటికీ అది పెయింటింగ్ ఎంత మాత్రం కాదు. అది ఫొటో. దాన్ని మార్కెల్ తల్లి స్వయంగా కెమేరాతో తీయగా, దాన్ని ఆ తర్వాత కంప్యూటర్ ద్వారా ఓ పెయింటింగ్లా మార్చారు. క్రిస్మస్ పవిత్ర దినాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయంగా పలు చారిటీ సంస్థలకు తాము విరాళాలు పంపించినట్లు ఆ క్రిస్మస్ కార్డు ద్వారా మార్కెల్ తెలియజేశారు. ఆ రాజా దంపతులు 18 నెలల క్రితం మాంటెసిటీకి మారారు. అక్కడ 15 మిలియన్ డాలర్లతో (దాదాపు 110 కోట్ల రూపాయల డాలర్లు) ఓ భవనం కొనుగోలు చేసి అందులో ఉంటున్నారు. -
ప్రపంచానికి బ్రిటన్ యువరాజు హెచ్చరిక?
లండన్: ప్రకృతిలో వస్తున్న మార్పులను నియంత్రించడానికి తదుపరి చర్యలపై దృష్టి పెట్టాలని ప్రిన్స్ హ్యారీ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రకృతి నుంచి వచ్చిన ఒక హెచ్చరిక లాంటిదని వ్యాఖ్యానించారు. వాతావరణంలో మార్పులుపై డాక్యుమెంటరీల కోసం స్టీమింగ్ ప్లాట్ ఫామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్తో ఆయన సంభాషించారు. మనుషుల చెడు ప్రవర్తన వల్లే ప్రకృతి తల్లి కరోనాను పంపినట్లుగా ఉందని, నిజంగా మనం దాని గురించి ఒక్కసారి ఆలోచించాలని హ్యారీ అన్నారు. మనం కేవలం మనుషులం మాత్రమే కాదని, ప్రకృతితో ఎంతలా మమేకం అయ్యామో ఇప్పుడు అర్థమవుతోందన్నారు. ప్రకృతి నుంచి చాలా తీసుకుంటామని, అయితే మనం ప్రకృతికి చాలా తక్కువ ఇస్తున్నామన్నారు. హ్యారీ అండ్ మేఘన్, డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సస్సెక్స్, జాతి, పర్యావరణం వంటి అంశాలపై హ్యారీ మాట్లాడారు. ఆకాశం నుంచి వచ్చే ప్రతీ నీటి బొట్టు భూమికి ఉపశమనం కలిగిస్తుందని, అలాగే ప్రతీ మనిషి కూడా ఒక నీటి బిందువులా మారి ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు., ఎందుకంటే చివరిలో ప్రకృతే మన జీవన వనరు అవుతుందని ప్రిన్స్ గుర్తుచేశారు. కరోనా మహమ్మారి ప్రారంభం అయినప్పటినుంచీ శాస్త్రవేత్తలు అటవీ నిర్మూలన, వన్యప్రాణుల అక్రమ రవాణావల్ల జంతువుల నుంచి మనుషులకు వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారన్నారు. ఇంకా దానిపై కఠినమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. -
నువ్వు బాగున్నావు కదా?
‘ఆర్యూ ఓకే’ అనే భావం భర్త చూపుల్లో మేఘన్కు కనిపించింది! హాస్పిటల్ బెడ్పైన ఉంది మేఘన్. భర్త అలా చూడగానే ఆమెకు విషయం అర్థమైంది. గుండె పగిలి ఒక్కసారిగా ఏడ్చేసింది. మాతృత్వం! ఆ భావనలోనే అమృతం దాగుంది. దేవుడు స్త్రీకిచ్చిన వరం మాతృత్వం అని అంటుంటారు. అందుకే ఎన్నిసార్లు తల్లయినా, మళ్లీ మరో బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆ అమ్మదనాన్ని స్త్రీ కొత్తగా కోరుకుంటుంది. గర్భంలో అప్పుడే ప్రాణం పోసుకుంటున్న జీవిని కంటికి రెప్పలా కాచుకుంటుంది. అయిన వారందరికీ చెప్పుకొని మురిసిపోతుంది. పుట్టబోయే బిడ్డని అందనంత ఎత్తులో చూడాలని కలలు కంటుంది. కానీ.. ఆ కలలు అర్ధంతరంగా కల్లలైపోతే! రేపో మాపో పుడుతుందనుకున్న నలుసు కడుపులోనే కరిగి, అందని లోకాలకు వెళ్లిపోతే! ఆ బాధను భరించడం ఏ తల్లికీ తరం కాదు. ఆ తల్లి కన్నీటిని తుడవడం ఏ ఒక్కరికీ వశం కాదు. 2020 జూలై. అప్పుడే రోజు మొదలవుతోంది. గర్భంతో ఉన్న మేఘన్ మార్కెల్ తన మొదటి కొడుకు డైపర్ మార్చుతోంది. అకస్మాత్తుగా తెలీని నిస్సత్తువ ఏదో ఆవరించినట్లు ఆమె శరీరమంతా తిమ్మిర్లు మొదలయ్యాయి. చేతుల్లో ఒక బిడ్డ, కడుపులో మరో బిడ్డ. చేతుల్లోని ఏడాది బిడ్డను ఉన్నఫళంగా వదిలేయలేదు. వదిలేయకుంటే తనలో ప్రాణం పోసుకుంటున్న మరో బిడ్డపై ఆ క్షణాన పడుతున్న ఒత్తిడి ఏమిటో తెలుసుకోలేదు. మనసేదో కీడు శంకిస్తోంది. ఏమిటది? ఆలోచించే లోపే తనకు తెలీకుండానే చేతుల్లో ఉన్న బాబుతో సహా కింద పడిపోయింది. కళ్లు తెరిచి చూసేసరికి ఆసుపత్రి పడకపై ఉంది! పక్కన భర్త హ్యారీ ఓదార్పుగా ఆమెనే చూస్తూ ఉన్నాడు. కళ్లు తెరిచాక, ‘నువ్వు బాగున్నావ్ కదా?!’ అనే భావం అతడి చూపుల్లో ఆమెకు కనిపించింది. ఆమె చెయ్యి విడువకుండా, దుఃఖాన్ని దిగమింగుకొని, కడుపులోని జీవం కడుపులోనే పోయిందని చెప్పలేకపోతున్నాడు. కడుపు కోతంటే కేవలం తల్లిది మాత్రమే కాదు తండ్రిది కూడా. విషయం ఆమె గ్రహించింది! ఒక్కసారిగా ఆమె గుండె పగిలి పోయింది. తట్టుకోలేక పోయింది. భోరున ఏడ్చేసింది. ∙∙ ప్రిన్స్ హ్యారీని ప్రేమించి, పెళ్లాడి బ్రిటన్ రాజవంశంలోకి అడుగుపెట్టిన మేఘన్ మార్కెల్ను ఈ చేదు ఘటన ఒక్కసారిగా తలకిందులు చేసింది. భర్త హ్యారీ, ముద్దులొలికే తమ చిన్నారి కుమారుడు ఆర్చీ మాత్రమే లోకంగా జీవిస్తూ వస్తోంది ఆమె ఇంతవరకూ. ‘మొదటి బిడ్డను పుట్టగానే నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంత సంతోషం అనుభవించానో.. రెండో బిడ్డను కడుపులోనే పొగొట్టుకున్నప్పుడు అంతకు రెట్టింపుగా బాధపడ్డాను’ అని తాజాగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు రాసిన వ్యాసంతో ఆమె తన వ్యధను దిగమింగుకోలేకపోయారు. బ్రిటన్ రాజవంశానికి చెందిన ఓ ఉన్నత వ్యక్తి ఇలా వ్యక్తిగత విషయాలు బయటకు వెల్లడించడం.. అందులోనూ ఇలాంటి విషయాల గురించి మీడియాతో పంచుకోవడం ఇదే ప్రథమం కాకపోవచ్చు. కానీ ఎంతో ఆవేదనా భరితంగా ‘ది లాసెస్ వియ్ షేర్’ అనే ఆ వ్యాసం కొనసాగింది. కొద్దికాలం క్రితమే బ్రిటన్ రాజప్రాసాదాన్ని వీడిన ఈ దంపతులు ప్రస్తుతం లాస్ ఏజెలిస్లో ఉంటున్నారు. తన వ్యాసంలోనే ఇంకో మాట కూడా రాశారు మేఘన్. గత ఏడాది ప్రిన్స్ హ్యారీ, తను దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు ఒక జర్నలిస్టు.. ‘ఆర్యూ ఓకే’ అని మేఘన్ను అడిగారట. అది మామూలు ప్రశ్నే అయినా అలాంటి పలకరింపు ప్రతి మహిⶠకూ అవసరం అని మేఘన్ అన్నారు. బహుశా తనను వద్దనుకున్న రాజప్రాసాద బాంధవ్యాలను తలచుకుని అలా రాసి ఉండవచ్చు. ఏమైనా భర్త తన పక్కన ఉన్నాడు. ‘ఆర్యూ ఓకే’ అని అతడు తనని అడుగుతున్నట్లే ఉంది ఆమెకు ప్రతి క్షణం. – జ్యోతి అలిశెట్టి, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం -
కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను
లండన్: అమ్మవ్వడంలో ఉండే ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుంది. పండంటి బిడ్డకు జన్మనిస్తేనే తమ జీవితానికి ఓ అర్థం అని భావించే ఆడవారు కొకొల్లలు. బిడ్డను కనడం ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో.. అలానే కడుపులోని ప్రాణి బయటకు రాకముందే కన్నుమూస్తే.. ఆ బాధ వర్ణణాతీతం. అనుభవించడం తప్ప మాటల్లో చెప్పడం కష్టం. ఈ క్రమంలో డచెస్ ఆఫ్ ససెక్స్, ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ సంచలన విషయాలు వెల్లడించారు. రెండవ సారి గర్భవతి అయ్యాక తనకు అబార్షన్ అయ్యిందని.. పుట్టకముందే ఓ బిడ్డను పొగొట్టుకున్నానని తెలిపారు. బ్రిటన్ రాజవంశానికి చెందిన ఓ ఉన్నత వ్యక్తి ఇలా తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు బయటకు వెల్లడించడం.. అందులోనూ ఇలాంటి విషయాల గురించి మీడియాతో మాట్లాడటం ఇదే ప్రథమం. దాంతో ప్రస్తుతం మేఘన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. (చదవండి: ‘ప్రపంచం మొత్తం మీద నా మీదే ఎక్కువ ట్రోలింగ్’) మేఘన్ మార్కెల్ న్యూయార్క్ టైమ్స్తో మాట్లాడుతూ తన ఆవేదనను వెల్లడించారు. విషాదం గురించి మాట్లాడుతూ.. ‘మొదటి బిడ్డను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంత సంతోషం అనుభవించాను రెండో బిడ్డను కడుపులోనే పొగొట్టుకున్నప్పుడు అంతకు రెట్టింపు బాధపడ్డాను. బిడ్డను కొల్పోవడం అంటే భరించలేని బాధను మోయడం. ఎందరో అనుభవిస్తారు.. కొందరు మాత్రమే బయటకు వెల్లడిస్తారు. గుండెని పిండే ఈ వార్త నాకు తెలిసినప్పడు నేను ఆస్పత్రి బెడ్ మీద ఉన్నాను.. నా భర్త నా పక్కనే ఉన్నాడు. కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను. ఆ తర్వాత నేను, నా భర్త నాలానే అబార్షన్ అయ్యి బిడ్డను కోల్పోయిన కొందరిని కలుసుకున్నాము. బాధలో తేడా లేదు. కానీ వీరిలో కొందరు తమకు జరిగిన నష్టం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడ్డారు. ఒంటరిగా బాధను భరించారు’ అని తెలిపారు. ఇక ఈ ఆర్టికల్లో మేఘన్ అనేక సన్నిహిత వివరాలను వెల్లడించారు. మేఘన్, హ్యారీ దంపతులకు కుమారుడు ఆర్చీ ఉన్నారు. (చదవండి: అభద్రతకు గురైన మేఘన్ మార్కెల్) బ్రిటీష్ రాజకుటుంబంలోని సీనియర్ సభ్యుల వ్యవహార శైలికి భిన్నంగా మేఘన్ వ్యక్తిగత వివరాలు తెలిపారు. ఇక 68 ఏళ్ల పాలనాకాలంలో క్వీన్ ఎలిజబెత్ ఎన్నడు ఏ మీడియా సమావేశంలో కూడా తన వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయలేదు. ఇక హ్యారీ సోదరుడు ప్రిన్స్ విలియం, అతడి భార్య కేట్ ఇప్పటి వరకు ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. ప్రతిసారీ పుట్టిన బిడ్డతో కలిసి దంపతులు మీడియాకు ఫోజులిచ్చేవారు. విలియం-కేట్ దంపతులు కూడా తమ వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. -
‘ప్రపంచం మొత్తం మీద నా మీదే ఎక్కువ ట్రోలింగ్’
లాస్ఏంజెల్స్: మేఘన్ మార్కెల్.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ నటిగా తనను తాను నిరూపించుకున్నారు. సెలబ్రిటీ హోదాను అనుభవించారు. ప్రిన్స్ హ్యారీని ప్రేమించి, పెళ్లాడి బ్రిటన్ రాజవంశ కోడలిగా ప్యాలెస్లో అడుగుపెట్టిన తర్వాత ఆమె ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. అయితే రాచ కుటుంబ సభ్యురాలైనంత మాత్రాన ఎన్నడూ తనకున్న ప్రత్యేక గుర్తింపును, అస్థిత్వాన్ని మేఘన్ కోల్పోలేదు. ప్రాణంగా ప్రేమించే భర్త హ్యారీ, ముద్దులొలికే తమ చిన్నారి కుమారుడు ఆర్చీ మాత్రమే లోకంగా బతకాలనుకున్నారు. అందుకోసం రాజ కుటుంబం నుంచి విడిపోయేందుకు కూడా ఆమె వెనుకాడలేదు. భర్తతో కలిసి ధైర్యంగా ముందడుగు వేసి రాజప్రాసాదాన్ని వీడి అమెరికాలో సెటిలయ్యారు. రాచ మర్యాదలు, కట్టుదిట్టమైన భద్రత వంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదా జీవితం గడుపుతున్నారు. తన ఉనికిని చాటుకుంటూ ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న మేఘన్ మార్కెల్ ఒక విషయంలో మాత్రం తీవ్రంగా వేదన చెందారట. గర్భవతిగా ఉన్న సమయంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ ఆమెపై తీవ్ర ప్రభావం చూపిందట. (చదవండి: జోకొట్టే పాపాయి) అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ‘టీనేజ్ థెరపీ’ పోడ్కాస్ట్లో భాగంగా మేఘన్ మార్కెల్ తన మనసులోని భావాలు పంచుకున్నారు. కాలిఫోర్నియా హై స్కూలుకు చెందిన సీనియర్ విద్యార్థులతో మాట్లాడుతూ.. ‘‘ఒకరితో ఒకరు పరిచయం పెంచుకోవడానికి, ప్రపంచంతో అనుసంధానం కావడానికి సోషల్ మీడియా ఎంతగా ఉపయోగపడుతుందో, అదే స్థాయిలో వ్యతిరేక ప్రభావం కూడా చూపుతుంది. నాకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడతాను. మీకు తెలుసా! 2019లో ప్రపంచం మొత్తం మీద విపరీతంగా ట్రోలింగ్ బారిన పడిన వ్యక్తిని నేనే. అప్పుడు ఆర్చీ నా పొట్టలో ఉన్నాడు. ఆ సమయంలో ఆన్లైన్ ద్వారా నా మీద తీవ్ర స్థాయిలో విద్వేషపూరిత కథనాలు వెలువడ్డాయి. అలాంటి అనుభవాలు ఎదుర్కోవడం కాస్త కష్టం. కానీ నేను వాటిని అధిమించాను. అయితే మన గురించి అసత్యాలు ప్రచారమవుతున్నాయని తెలిసినప్పుడు భావోద్వేగానికి లోనవుతాం. అంతిమంగా ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పదిహేనేళ్ల టీనేజర్లు అయినా, 25 ఏళ్ల యువత అయినా.. ఎవరైనా సరే అలాంటి సమయంలో ఒకే రకమైన ఉద్వేగానికి గురవుతారు. ప్రపంచం తమను వేరుచేసినట్లు భావిస్తారు’’అని చెప్పుకొచ్చారు. అయితే వీలైనంత తొందరగా ఇలాంటి ప్రతికూల భావనల నుంచి బయటపడి, మానసిక స్థైర్యంతో ముందుకు సాగితే జీవితాన్ని మళ్లీ సంతోషమయం చేసుకోవచ్చని సూచించారు. View this post on Instagram Thanks Cape Town for another impactful and memorable day! A few more highlights of this very special visit with Archbishop Desmond Tutu #RoyalVisitSouthAfrica Video ©️SussexRoyal A post shared by The Duke and Duchess of Sussex (@sussexroyal) on Sep 25, 2019 at 12:06pm PDT -
అభద్రతకు గురైన మేఘన్ మార్కెల్
లండన్: డచెస్ ఆఫ్ ససెక్స్, ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ గర్భవతిగా ఉన్న సమయంలో రాయల్ ఫ్యామిలీ నుంచి రక్షణ లేదనే భావానికి లోనయ్యారట. ఓ టాబ్లాయిడ్ న్యూస్పేపర్పై వేసిన దావా కేసులో మేఘన్ తరఫు లాయర్లు కోర్టుకు అందజేసిన పత్రాల్లో ఈ విషయం వెల్లడైంది. (టిక్టాక్ బ్యాన్: చైనాకు ఎంత నష్టమో తెలుసా?) 2018 ఆగస్టులో మేఘన్ తన తండ్రి థామస్ మార్కెల్కు రాసిన ఉత్తరాలు ఇవేనంటూ అసోసియేటెడ్ న్యూస్ పేపర్స్ అనే పబ్లిషర్కు చెందిన ‘ది మెయిల్’ట్యాబ్లాయిడ్లో ప్రచురించింది. మేఘన్, ఆమె తండ్రికి మధ్య చానాళ్లుగా విభేదాలు ఉన్నాయి. థామస్, మేఘన్ పెళ్లికి హార్ట్ సర్జరీ వల్ల హాజరుకాలేకపోయారు. (ఈ వార్త చదివితే జన్మలో బీరు తాగరు) మేఘన్కు అతి సన్నిహితులైన ఐదుగురు స్నేహితులు చెప్పారంటూ లేఖల్లోని సారాంశాన్ని ది మెయిల్ టాబ్లాయిడ్లో రాసుకొచ్చింది. దీనిపై మేఘన్ మానసిక సంఘర్షణకు గురయ్యారని, మెంటల్ హెల్త్ దెబ్బతిందని ఆమె తరఫు లాయర్లు కోర్టుకు దాఖలు చేసిన దావా పత్రాల్లో పేర్కొన్నారు. మేఘన్, హ్యారీ దంపతులకు కుమారుడు ఆర్చీ ఉన్నారు. -
ట్రంప్కు ప్రిన్స్హ్యారీ, మార్కెల్ కౌంటర్
వాషింగ్టన్ : ప్రిన్స్హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులకు తాము భద్రత ఖర్చులను చెల్లించలేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్పై హ్యారీ దంపతులు స్పందించారు. తమకు ట్రంప్ ఏమాత్రం సహాయం చెయాల్సిన అవసరం లేదని, తమ వ్యక్తిగత భద్రత ఖర్చులను తామే భరిస్తామని ట్రంప్కు ట్విటర్ వేదికగా బదులిచ్చారు. కాగా బ్రిటన్ రాజకుటుంబ నుంచి విడిపోయిన అనంతరం ప్రిన్స్హ్యారీ, మార్కెల్ జంట తొలుత కెనడా స్థిరపడిన విషయం తెలిసిందే. అనంతరం అమెరికాలోని లాక్ఏంజెల్స్కు మకాం మార్చారు. ఈ నేపథ్యంలో వారికి తమ ప్రభుత్వం భద్రత కల్పించే ప్రసక్తేలేదంటూ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్కు వ్యతిరేకంగా హ్యారీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వారి భద్రతకు ట్రంప్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ‘నేను.. యునైటెడ్ కింగ్డమ్, ఆదేశ రాణికి మంచి స్నేహితుడిని. రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చిన హ్యారీ, మేఘన్.. కెనడాలో శాశ్వతంగా నివసిస్తారని తెలిసింది. ఇప్పుడు వారు కెనడా నుంచి యుఎస్కు వచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. వారి భద్రతా ఖర్చులు మా ప్రభుత్వం చెల్లించదు. వారే స్వయంగా చెల్లించాలి’ అని అంతకుముందు ట్రంప్ ట్విటర్లో పేర్కొన్నారు. -
ప్రిన్స్ హ్యారీ, మేఘన్లకు ట్రంప్ ఝలక్
వాషింగ్టన్ : ప్రస్తుతం కెనడాలో నివశిస్తున్న ప్రిన్స్హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు అమెరికాకు వస్తే వారి భద్రతా ఖర్చులను తమ ప్రభుత్వం చెల్లించే ప్రసక్తేలేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ‘నేను.. యునైటెడ్ కింగ్డమ్, ఆదేశ రాణికి మంచి స్నేహితుడిని. వారిపై నాకు ఎంతో అభిమానం ఉంది. రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చిన హ్యారీ, మేఘన్.. కెనడాలో శాశ్వతంగా నివసిస్తారని తెలిసింది. ఇప్పుడు వారు కెనడా నుంచి యుఎస్కు వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ హ్యారీ దంపతులు యూఎస్ వస్తే వారి భద్రతా ఖర్చులు మా ప్రభుత్వం చెల్లించదు. వారే స్వయంగా చెల్లించాలి’ అని ట్రంప్ పేర్కొన్నాడు. (కరోనా కరాళ నృత్యం) కాగా గతేడాది క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యరీ, మేఘన్ దంపతులు జనవరిలో రాచరిక హోదాను, బ్రిటీష్ రాజ కుటుంబం నుంచి వేరుపడ్డ విషయం తెలిసిందే. స్వతంత్రంగా జీవించాలని నిర్ణయించుకున్న వీరు కెనడాలోని వాంకోవర్ ద్వీపం వద్ద విలాసవంతమైన భవంతిలో తమ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే రాజ కుటుంబం నుంచి వైదొలిగిన నాటి నుంచి వారి భద్రతకు అయ్యే ఖర్చులను చెల్లించడం మానేస్తామని గత నెలలో కెనడియన్ అధికారులు వెల్లడించారు. ఈ దంపతులు ప్రస్తుతం కాలిఫోర్నియాకు మకాం మార్చాతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించారు. (ప్రిన్స్ హ్యారీ దంపతుల భద్రతా ఖర్చుకు ‘నో’) -
వాయిస్ ఓవర్
రాజకుటుంబంలో సభ్యురాలు (క్వీన్ ఎలిజిబెత్–2 మనవడు ప్రిన్స్ హ్యారీని వివాహం చేసుకున్నారు) కావడంతో సినిమాలకు దూరమయ్యారు హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్. అయితే ఇటీవలే రాజకుటుంబం నుంచి తప్పుకుని స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నట్టు ప్రకటించారు. వెంటనే డిస్నీ సంస్థ వాళ్లు మేఘన్ మార్కెల్తో ఓ సినిమాకి ఒప్పందం కుదుర్చున్నారు. ఏనుగుల మీద డిస్నీ సంస్థ ఓ సినిమా తెరకెక్కించింది. ఈ సినిమాలో వచ్చే వాయిస్ ఓవర్ను మేఘన్ మార్కెల్ చెప్పనున్నారు. ఆమె పారితోషికం ఏనుగుల పరిరక్షణకి విరాళంగా వెళ్తుందట. -
మీ భార్యను కౌగిలించుకున్నా.. సారీ!..
లండన్ : ఓ చిన్న కౌగిలితో ఆ కుర్రాడు సోషల్ మీడియా ఫేమస్ అయ్యాడు. అతడు కౌగిలించుకున్నది కూడా ఆశామాషీ వ్యక్తిని కాదులెండి! ఓ యువరాణిని. తను చేసిన తప్పుకు క్షమాపణ కోరుతూ ఆమెభర్తకు లేఖరాయటంతో ఆ కుర్రాడు మరింత పాపులర్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ ఉమెన్స్డేను పురష్కరించుకుని గత శుక్రవారం లండన్లోని ఓ స్కూల్ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడకుండా.. ‘ విద్యార్థుల్లోనుంచి ఎవరైనా వచ్చి ఇంటర్ నేషనల్ ఉమెన్స్ డే ప్రాధాన్యత గురించి మాట్లాడితే బాగుంటుంద’ని అన్నారు. కొద్దిసేపు ఎవరూ పైకి లేయలేదు. ఆ తర్వాత ఎకర్ ఒకోయి అనే విద్యార్థి ధైర్యంగా స్టేజిమీదకు వెళ్లాడు. మైక్ దగ్గరకు వెళ్లిన తర్వాత మేఘన్ మార్కెల్ ఎంతో అందంగా ఉందంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. మాట్లాడుతున్న ఎకర్, పక్కన మేఘన్ మార్కెల్ ఎకర్ మాట్లాడటం ముగించిన తర్వాత మేఘన్ ప్రొటోకాల్ను పక్కన పెట్టిమరీ అతడ్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది. దీంతో అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ సంఘటనపై ఎకర్.. మేఘన్ మార్కెల్ భర్త ప్రిన్స్ హ్యారీకి ఆదివారం లేఖ రాశాడు.. ‘‘ డియర్ హ్యారీ అండ్ మేఘన్ మార్కెల్. హ్యారీ నేను మీ భార్యను కౌగిలించుకున్నందుకు మీరేమీ అనుకోరు కదా! దయచేసి నన్ను క్షమించండి. ఆమెను చూడగానే భావోద్వేగానికి లోనయ్యాను, ఒకింత షాకింగ్గానూ ఉండింది. ఆమె మాటలు వినటం.. ఆమె ముందు మాట్లాడటం నాకెంతో సంతోషాన్నిచ్చింద’ ని పేర్కొన్నాడు. చదవండి : మార్చి 31 నుంచి వారు సామాన్యులు.. ప్రిన్స్ హ్యారీ దంపతుల భద్రతా ఖర్చుకు ‘నో’ -
మార్చి 31 నుంచి వారు సామాన్యులు..
లండన్ : బ్రిటన్ రాజు ప్రిన్స్ హ్యారీ ఆయన భార్య మేఘన్ మార్కెల్ మార్చి 31 నుంచి రాజ కుటుంబంతో సంబంధాలు అధికారికంగా పూర్తిగా తెగతెంపులవుతాయని దంపతుల కార్యాలయం వెల్లడించింది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్లు రాజరిక విధుల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న తరువాత బకింగ్హామ్ ప్యాలెస్ డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సస్సెక్స్ యొక్క "సస్సెక్స్ రాయల్" హోదాను సమీక్షించే క్రమంలో ప్రిన్స్ కపుల్ ఈ విషయం వెల్లడించడం గమనార్హం. రాజకుటుంబం నుంచి తాము దూరమవుతామని ఈ ఏడాది జనవరిలో ప్రిన్స్ దంపతులు ప్రకటించడం బ్రిటన్లో కలకలం రేపింది. ప్రశాంత జీవనం గడిపేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రిన్స్హ్యారీ అప్పట్లో ప్రకటించారు. తాను పుట్టినప్పటి నుంచి తాను ఎక్కడికి వెళ్లినా తనను ఫోటోగ్రాఫర్లు వెంబడించడం, కెమెరాలలో బంధించడం, తన గురించి జర్నలిస్టులు రాయడంతో విసిగిపోయానని చెప్పుకొచ్చారు. మరోవైపు రాజప్రాసాదాన్ని వీడటంతో వారు ఇక రాయల్ హైనెస్ హోదాను కోల్పోతారని, వారు మనసు మార్చుకుని భవిష్యత్లో రాజప్రాసాదంలోకి అడుగుపెడితే ఆ హోదాలు తిరిగి వర్తించే అవకాశం ఉందని బకింగ్హామ్ ప్యాలెస్ పేర్కొంది. హ్యారీస్ దివంగత ల్లి డయానా ప్రిన్స్ చార్లెస్తో విడాకులు పొందినపుడు ఆమె రాయల్ హైనెస్ హోదాను తొలగించారు. చదవండి : ప్రిన్స్ హ్యారీ దంపతుల భద్రతా ఖర్చుకు ‘నో’ -
అమ్మ చనిపోవడం పెద్ద విషాదం: ప్రిన్స్ హ్యారీ
ప్రిన్స్ హ్యారీ ఒక బిడ్డకు తండ్రి అయ్యాక కూడా.. తన తల్లి డయానాతో పెనవేసుకుని ఉన్న తన చిన్ననాటి జ్ఞాపకాలను విడిచిపెట్టలేకపోతున్నారు. యు.ఎస్.లో గురువారం జరిగిన ‘ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు’లో ప్రసంగిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆయనకు తన తల్లి జ్ఞప్తికొచ్చారు. ‘‘నా జీవితంలోని పెద్ద విషాదం మా అమ్మ చనిపోవడం. ఆమె నన్నెంతగా ప్రేమించేవారో ఒక్కో సందర్భాన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంటే మనసుకు తీరని ఆవేదన కలుగుతుంటుంది. నాటి దురదృష్టకర ఘటనన నుంచి బయటపడేందుకు గత ఏడేళ్లుగా నేను థెరపీలో ఉన్నాను’’ అని ప్రిన్స్ హ్యారీ గుండె లోతుల్లోంచి మాట్లాడారు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత.. ‘‘రాజకుటుంబంలోంచి బయటికి వచ్చినందుకు మాకేమీ పశ్చాత్తాపాలు లేవు’’ అన్నారు. దీనర్థం.. అమ్మ తప్ప నాకక్కడ అయివారెవరూ లేరని చెప్పడమే! ఎన్ని చెప్పీ.. తల్లి స్మృతుల్లోంచి హ్యారీని బయటికి తెప్పించలేనని ఆయన భార్య మేఘన్ మార్కల్ అర్థం చేసుకున్నట్లున్నారు.. అందుకే ఆమె కూడా తరచూ భర్తకు తోడుగా డయానా స్మృతుల్లోకి వెళుతుంటారు. డయానా 1997లో పారిస్లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. డయానా వ్యక్తిగత జీవిత సంచలనాలను ఫొటోలుగా తీసేందుకు ఆమె కారును వెంటాడుతున్న రహస్య మీడియా వాహనాలే ఆ ఘోర ప్రమాదానికి కారణం. -
మేఘన్ మార్కెల్ రాయని డైరీ
సంతోషంగా ఉంది. ఈ సమ్మర్కి లాస్ ఏంజెలిస్కి షిఫ్ట్ అయిపోతున్నాం నేనూ, ప్రిన్స్ హ్యారీ, ఆర్చీ. మే ఆరుకు ఏడాది నిండుతుంది ఆర్చికి. పెద్ద రెడ్ కార్పెట్ పరిచి లాస్ ఏంజెలిస్ లోనే ఆస్కార్ వేడుకలంత ఘనంగా చేయాలి ఆర్చి ఫస్ట్ బర్త్డేని.‘‘చేద్దామా అలా.. హ్యారీ’’ అని అడిగాను. నవ్వాడు. ‘‘వేడుక అంటే ముందొచ్చి కూర్చుం టాయి మీడియా దెయ్యాలు. ఆర్చి జడుసు కుంటాడు. ఏకాంతంగా ఏ దీవి లోనికైనా వెళ్లిపోదాం. నువ్వు, నేను, ఆర్చి..’’ అన్నాడు. అతడి కళ్లలోకి చూశాను. మీడియా తన తల్లి ప్రిన్సెస్ డయానాను మింగేసిన కోపం, ఆ కళ్లలో నేటికీ కనిపిస్తూనే ఉంది. నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచేవాడు. ‘ఏమైంది హ్యారీ?’ అని దగ్గరకు తీసుకునే దాన్ని. ‘మా అమ్మ.. మా అమ్మ.. దెయ్యాలు తరుముకుంటుంటే వాటి నుంచి తప్పించుకోడానికి పరుగులు తీస్తోంది. హ్యారీ నువ్వు జాగ్రత్త.. హ్యారీ నువ్వు జాగ్రత్త అని అరుస్తూ నేనెక్కడున్నానా అని నన్ను వెతుక్కుంటోంది. దెయ్యాలు తరుము కుంటుంటే తను కదా జాగ్రత్తగా ఉండాల్సింది. నన్ను జాగ్రత్తగా ఉండమంటోంది..’ అని చెప్పేవాడు. ఆమే బతికి ఉంటే నా భర్త హ్యారీ కూడా ఆమె తర్వాతే నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యేవాడు. ఒక ఆడపిల్ల ఆశలు ఎలా ఉంటాయో ఆమెకు తెలుసు. ఒక ఆడపిల్ల కోరుకునే స్వేచ్ఛకు ఎలాంటి పంజరాలు తయారవుతూ ఉంటాయో ఆమెకు తెలుసు.ప్రిన్సెస్ డయానా చనిపోయారన్న వార్త విన్నప్పుడు.. నేను టీనేజ్లో ఉన్నాను. అయ్యో అనిపించింది. నా వ్యక్తిత్వానికి ఆమె ఒక అభౌతిక స్వరూపం. ప్రిన్సెస్ డయానా ఎంత అందంగా, ఎంత సహజంగా, ఎంత చలాకీగా ఉండేవారు! ఫొటోల్లో చూస్తుండేదాన్ని. లోపల ఉన్న ఏ బాధనో బయటికి రానివ్వని ఆమె హృదయపు లావణ్యాన్ని చాలాసార్లు పట్టుకున్నాను ఆ ఫొటోల్లో. ‘‘సరే హ్యారీ, లాస్ ఏంజెలిస్లోని మన కొత్త ఇంటినే ఏకాంత దీవిలా మార్చు కుందాం’’ అని చెప్పాను. హ్యారీకి కెనడా నచ్చింది కానీ, నేను పుట్టి పెరిగిన లాస్ ఏంజెలిస్ ఇంకా బాగా నచ్చుతుందని చెప్పి ఒప్పించాను. మా పెళ్లయ్యాక రెండు సమ్మర్లు రాణి గారి భవంతిలో ఎలా గడిచాయో తలచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. నేనేనా అక్కడుంది! నేనేనా కాలిపై కాలు వేసుకుని కూర్చోకుండా, మోకాళ్లు రెండూ కలిపి ఒద్దికగా కూర్చోవాలన్న రాణి గారి ఆదేశాన్ని పాటించింది! నేనేనా నా తోడికోడలు కేట్ మిడిల్టన్ మాటలకు రాని నవ్వు నవ్వింది! నేనేనా నా భర్త హ్యారీతో రాజమాత ముభావంగా ఉంటే ‘ఏంటలా ఉన్నారు? నా భర్త చేసిన తప్పేమిటి?’ అని అడక్కుండా ఉండగలిగింది! నేనేనా నేను వేసే ప్రతి అడుగుకూ సమ్మతి తీసుకుని, నేను వేసిన ప్రతి అడుగుకూ సంజాయిషీ ఇచ్చుకుంది! బ్రిటన్లో ఏడాదికి ఒకే సమ్మర్ ఉంటుంది. రాణిగారింట్లో ఏడాదంతా సమ్మరే!! ‘‘ప్రిన్స్ హ్యారీ, ఇకనుంచీ మీరు మీ అభీష్టానుసారం ఇక్కడ ఉండొచ్చు. ఈ రాజ్యానికి మీరే రాజు’’ అన్నాను.. లాస్ ఏంజెలిస్లో ఫ్లయిట్ దిగగానే. పెద్దగా నవ్వాడు హ్యారీ. ‘‘లాస్ ఏంజెలిస్కి రాణి గారు కదా ఉంటారు. రాణీ మేఘన్ మార్కల్’’ అన్నాడు! ఆర్చిని హ్యారీ చేతికి అందించి, హ్యారీ ఛాతీకి నా తలను ఆన్చాను. నా కోసం తన సింహాసన వారసత్వాన్ని వదలుకుని వచ్చాడు. తన తర్వాత వచ్చే ఆర్చి స్థానాన్ని కూడా వదిలేసి వచ్చాడు.‘‘యు ఆర్ మై క్రౌన్’’ అన్నాను. గిలిగింతలు పెట్టినప్పుడు అచ్చు ఆర్చి నవ్వినట్లే నవ్వాడు హ్యారీ. మాధవ్ శింగరాజు -
ప్రిన్స్ హ్యారీ దంపతుల భద్రతా ఖర్చుకు ‘నో’
బ్రిటీష్ రాజ కుటుంబానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పి బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలోని కెనడాలో ఓ విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసి అందులో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెన్ దంపతులు తమ కుమారుడితో సహా నివసిస్తున్న విషయం తెల్సిందే. వారు కెనడాకు వచ్చి మకాం పెట్టినప్పటి నుంచి వారి భద్రతకయ్యే ఖర్చును ఎవరి భరిస్తారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ ఖర్చులను కెనడా ప్రభుత్వం భరిస్తుందని వార్తలు తొలుత వెలువడగా, అందుకు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము చెల్లిస్తున్న పన్నులతో నడుస్తున్న ప్రభుత్వ ఖజానా నుంచి ఎలా సొమ్మును వృధా చేస్తారంటూ పలు వర్గాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. (రాజదంపతుల కొత్త జీవితం!) ఈ నేపథ్యంలో సీటీవీ కోసం ‘నానోస్ రిసెర్చ్ సెంటర్’ ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ప్రిన్స్ హ్యారీ దంపతుల భద్రతకయ్యే ఖర్చును కెనడా ప్రభుత్వం భరించడానికి వీల్లేదంటూ 77 శాతం మంది అభ్యంతం వ్యక్తం చేశారు. 19 శాతం మంది అనుకూలంగా స్పందించారు. మిగతా వారు తటస్థంగా ఉన్నారు. బ్రిటీష్ రాణి వారసులుగా తమ దేశంలో నివసించడం లేదన్న కారణంగానే 77 శాతం మంది ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. (కోటను విడిచినా వారు మా కుటుంబ సభ్యులే..) బ్రిటీష్ రాజ కుటుంబంతో ఎలాంటి తెగతెంపులు చేసుకోకుండా వారంతట వారొచ్చి తమ దేశంలో ఉన్నట్లయితే వారి భద్రతకయ్యే ఖర్చును భరించేందుకు అభ్యంతరం లేదన్నారు. అసలు రాజకుటుంబం వారసులుగా వారు కెనడాలో ఉన్నట్లయితే రాజ కుటుంబమే ఆ ఖర్చులను భరించేది. ఏదేమైనా హ్యారీ దంపతుల భద్రతకు ఏటా మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. (భార్య మేఘన్ ఫొటోలపై హ్యారీ ఆగ్రహం) చదవండి: ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే! -
భార్య మేఘన్ ఫొటోలపై హ్యారీ ఆగ్రహం
లండన్ : బ్రిటీష్ రాజకుటుంబం బాధ్యతల నుంచి తప్పుకున్న హ్యారీ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వ్యక్తిగత జీవన ప్రయాణాన్ని పబ్లిక్ చేస్తున్నారని అన్నారు. తన భార్య మేఘన్ మోర్కెల్, 8 నెలల కుమారుడు ఆర్కీ ఫొటోలను ప్రచురించిన సన్, డెయిలీ మెయిల్ దినపత్రికలపై న్యాయపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు హ్యారీ తరపు న్యాయవాది సదరు వార్తా పత్రికలకు నోటీసులు జారీ చేశారు. కాగా, కుమారుడు ఆర్కీతో కలిసి మోర్కెల్ కెనడాలోని వాంకోవర్ దీవిలోని రీజనల్ పార్క్లోకి అడుగుపెట్టారు. రాజ సంరక్షకులు చివరిసారిగా తోడు రాగా.. భుజానేసుకున్న జోలిలో ఆర్కీ, ముందు రెండు పెంపుడు కుక్కలతో కలిసి మోర్కెల్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే ఇంటికి చేరుకున్నారు. అయితే, ఈ ఫొటోలన్నీ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. (చదవండి : రాజదంపతుల కొత్త జీవితం!) మోర్కెల్ అనుమతి లేకుండా.. సదరు ఫొటోగ్రాఫర్లు దొంగచాటుగా ఫొటోలు తీశారని హ్యారీ చెప్పుకొచ్చారు. కెమెరాలకు, మీడియాకు దూరంగా ఉండాలనే రాజ కుటుంబం నుంచి తప్పుకున్నామని హ్యారీ మరోసారి స్పష్టం చేశాడు. తమ అనుమతి లేకుండా వాంకోవర్ దీవిలోని తమ ఇంటిని ఫొటోలు తీసిన వారిపై కూడా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కెమెరా ‘క్లిక్’మన్నప్పుడల్లా.. తన తల్లి చావే గుర్తుకు వస్తుందని ఈ సందర్భంగా హ్యారీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ప్రిన్స్ హ్యారీ తల్లి, వేల్స్ యువరాణి డయానా 1997లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. మీడియా కంటబడకుండా తప్పించుకునే క్రమంలో ఆమె ప్రమాదం బారిన పడ్డారు. (చదవండి : మేఘన్ రాజ వంశాన్ని చులకన చేసింది) -
రాజదంపతుల కొత్త జీవితం!
వాంకోవర్: భుజానేసుకున్న జోలిలో సంటోడు, కుడి వైపున నల్లటి లాబ్రడార్ పెంపుడు కుక్క ఓజ్, ఎడమ పక్క మరో జాతికి చెందిన పెంపుడు కుక్క బీగల్ గై వెంట నడుస్తుండగా, వెన్నంటి బ్రిటన్ రాజ రక్షకులు తోడుగా, ముఖాన చెరగని చిరునవ్వుతో మేఘన్ మార్కెల్ రీజనల్ పార్క్లో సామాన్యుల లోకంలోకి ప్రయాణం. ఆమె బ్రిటన్ రాచరికపు వ్యవస్థకు శాశ్వతంగా తిలోదకాలిచ్చి సోమవారం ఉదయమే కెనడా, వాంకోవర్ దీవిలోని రీజనల్ పార్క్లోకి అడుగుపెట్టారు. అక్కడికి సమీపంలో ఉన్న దాదాపు 99 కోట్ల రూపాయల విలువైన భవంతి వరకు మాత్రమే బ్రిటన్ రాజ రక్షకులు ఆఖరి సారిగా వెంట వచ్చారు. ఆమెను సురక్షితంగా భవంతి వద్ద దింపి ఆమె నుంచి శాశ్వతంగా సెలవు తీసుకొకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి మేఘన్ మార్కెల్, ఆమె భర్త ప్రిన్స్ హ్యారీ రక్షణ బాధ్యతలు కెనడా ప్రభుత్వం స్వీకరించింది. ఇందుకోసం కెనడా ప్రభుత్వం ఏటా మూడు కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని భరించాల్సి ఉంటుంది. ప్రిన్స్ హ్యారీ ఆఖరిసారి అధికారిక హోదాలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తోపాటు ఇతర ప్రభుత్వ పెద్దలను కలుసుకొని మంగళవారం వాంకోవర్లోని కొత్త భవంతికి చేరుకుని మార్కెల్ను కలుసుకున్నారు. వారిద్దరు తమ ఎనిమిది నెలల కుమారుడు ఆర్కీతో కలిసి క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులను అదే భవంతిలో జరపుకున్నారు. రాచరికానికి గుడ్బై చెప్పి ఆ దంపతులు శాశ్వతంగా అక్కడే ఉండబోతున్నారు. చదవండి: మేఘన్ మార్కెల్ కొత్త భవంతి ఇదే! మేఘన్ రాజ వంశాన్ని చులకన చేసింది కోటను విడిచినా వారు మా కుటుంబ సభ్యులే.. -
మేఘన్ మార్కెల్పై తండ్రి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, లండన్: బ్రిటన్ యువరాజు ప్రిన్స్హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ రాజకుటుంబం నుంచి అధికారికంగా తప్పుకున్నారు. తమకున్న రాయల్ గుర్తింపుని వదులుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఒప్పందంపై హ్యారీ దంపతులు సంతకాలు చేశారు. ఇకపై వారిద్దరి పేర్లకు ముందు రాచరికాన్ని ప్రతిబింబించే గౌరవ సూచకాలు ఉండవు. అంతేకాదు బ్రిటన్ రాజ కుటుంబం వారసులుగా వారు నిర్వహించే బాధ్యతలకుగాను పన్ను రూపంలో బ్రిటన్ వాసులు చెల్లించే ఆదాయం కూడా ఇకపై వారికి అందదు. కొద్ది రోజుల క్రితమే హ్యారీ దంపతులు రాయల్ ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్లనున్నట్టు చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియకు బ్రెగ్జిట్ను తలపించేలా మెగ్జిట్ అన్న హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ‘హ్యారీ, మేఘన ఇక రాయల్ కుటుంబ సభ్యులు కాదు. వారి పేర్లకు ముందు గౌరవసూచకంగా వాడే టైటిల్స్ను (హెచ్ఆర్హెచ్) ఇకపై వాడకూడదు’’ అని బకింగ్హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే! నెలల తరబడి నిర్మాణాత్మకంగా సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత హ్యారీ దంపతులు రాజభవనం వీడి వెళ్లడానికి తాము సంపూర్ణంగా మద్దతునిస్తున్నట్టుగా రాణి ఎలిజబెత్ చెప్పారు. హ్యారీ, మేఘన్, వారి ముద్దుబిడ్డ ఆర్కీని రాజ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారని 93 ఏళ్ల వయసున్న రాణి తన వ్యక్తిగత ప్రకటనలో తెలిపారు. తన మనవడు, మనవరాలు సొంతంగా తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న నిర్ణయానికి తాను మద్దతిస్తున్నట్టు వెల్లడించారు. హ్యారీ కుటుంబం ఇకపై కెనడాలో నివసించనుంది. అయితే అప్పుడప్పుడు బ్రిటన్లో కూడా కాలం గడుపుతారు. అందుకోసం హ్యారీ ఫ్రాగ్మోర్ కాటేజీని తన వద్దే ఉంచుకున్నారు. ఈ కాటేజీని తన సొంతానికి వినియోగించుకుంటున్నందుకు 24 లక్షల పౌండ్లు చెల్లించాలని హ్యారీ నిర్ణయించారు. చదవండి: ‘నా గుండెను ముక్కలు చేశావు.. నాన్నా!’ మేఘన్కు రాణి ప్రత్యేక సందేశం మేఘన్ మార్కెల్కు రాణి ఎలిజబెత్ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. ‘‘మేఘన్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఎంత త్వరగా ఆమె ఒక ఇంటిదైంది. ఈ రోజు జరిగిన ఒప్పందంతో ఆమె కొత్త జీవితం మరింత సంతోషంగా, శాంతిగా ముందుకు సాగాలని మా కుటుంబం ఆకాంక్షిస్తోంది’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు. మిలటరీ అపాయింట్మెంట్లు సహా రాజకుటుంబం నిర్వర్తించే విధుల నుంచి కూడా వారిద్దరూ తప్పుకున్నట్టు బకింగ్హమ్ ప్యాలెస్ ధ్రువీకరించింది. ఈ పరిణామాన్ని దిగమింగుకోవడం భరించలేని కష్టంగా ఉందంటూ రాజకుటుంబం అభిమానులు పెద్ద సంఖ్యలో పోస్టులు పెట్టారు. మేఘన్ మార్కెల్ తండ్రి థామస్ మార్కెల్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ బ్రిటిష్ రాజ వంశాన్ని తమ కుమార్తె చాలా చులకన చేసిందని మేఘన్ మార్కెల్ తండ్రి థామస్ మార్కెల్ ఆరోపించారు. తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కుమార్తె ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. ప్రిన్స్ హారీ, ఆయన సతీమణి మేఘన్ ఇకపై రాజ వంశ సభ్యులుగా వ్యవహరించబోరని బకింగ్ హాం ప్యాలెస్ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు తమ జీవితాలను తమదైన రీతిలో జీవిస్తారని కూడా తెలిపింది. తాము రాజ వంశానికి సంబంధించిన విధులను తగ్గించుకుంటామని ప్రిన్స్ హారీ, మేఘన్ మార్కెల్ దంపతులు గత నెలలో ప్రకటించారు. దీంతో క్వీన్ ఎలిజబెత్, ఆమె కుటుంబ సభ్యులు, అధికారులు చర్చలు జరిపి, ఈ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు.. ఈ నేపథ్యంలో థామస్ను ఓ ఛానల్ ఇంటర్వ్యూలో.. ప్రతి అమ్మాయి యువరాణి కావాలని కోరుకుంటుందని థామస్ చెప్పారు. అలాంటి కల తన కుమార్తె మేఘన్కు సాకారమైందన్నారు. అటువంటి దానిని ఆమె వదులుకుంది. ఈ పరిణామం చాలా నిరాశ కలిగిస్తోందన్నారు. ఆమె డబ్బు కోసమే ఈ విధంగా చేసినట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు. బ్రిటిష్ రాజ వంశం సుదీర్ఘ కాలం మనగలుగుతున్న గొప్ప వ్యవస్థల్లో ఒకటని ఆయన అన్నారు. 2018లో హారీని మేఘన్ పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి, ఆ దంపతులు రాజ వంశంలో భాగమని.. వారు రాజ వంశానికి ప్రాతినిథ్యం వహించవలసి ఉంటుందని చెప్పారు. అటువంటి రాజ వంశాన్ని వీరిద్దరూ చులకన చేశారని, అగౌరవపరిచారని మండిపడ్డారు. -
కోటను విడిచినా వారు మా కుటుంబ సభ్యులే..
లండన్ : బ్రిటన్ రాజకుటుంబం నుంచి వేరుపడాలని ప్రిన్స్ హ్యారీ మేఘన్ మార్కెల్ దంపతుల నిర్ణయానికి సాండ్రింగ్హామ్ ఎస్టేట్లో జరిగిన సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం క్వీన్ ఎలిజబెత్ ’టూ)వారి నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ రాజకుటుంబంలో ఈ జంట పాత్రకు సంబంధించి మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆమె నొక్కి చెప్పారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం శనివారం రాత్రి క్వీన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇక రాజకుటుంబం నుంచి విడిపోవాలని వారు నిర్ణయించిన క్రమంలో రాయల్ ఫ్యామిలీలో సభ్యులు కానందున సస్సెక్స్ వారి హెచ్ఆర్హెచ్ శీర్షికలను ఉపయోగించరాదని స్పష్టం చేశారు. అయితే, నివేదికల ప్రకారం వారిని డ్యూక్ మరియు డచెస్ ఆఫ్ సస్సెక్స్ అని పిలుస్తారు. మరోవైపు వారి బ్రటిన్ కుటుంబ ఇల్లుగా కొనసాగే ఫ్రాగ్మోర్ కాటేజ్ పునరుద్ధరణపై ప్రభుత్వం వెచ్చించిన సొమ్మును వారు తిరిగి చెల్లించాలని ప్యాలెస్ ప్రకటించింది. వార్తాకథనాల ప్రకారం ఇంటి పునరుద్ధరణకు వెచ్చించిన రూ 22.2 కోట్లను వారు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రాజకుటుంబం నుంచి వేరుపడాలని వారు నిర్ణయం తీసుకున్నా హ్యారీ, మేఘన్, ఆర్చీ తమ కుటుంబ సభ్యుల్లో భాగంగానే ఉంటారని, గత రెండేళ్లుగా వారిపై కొనసాగుతున్న నిఘాతో వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్టు తాను గుర్తించానని ఆమె వ్యాఖ్యానించారు. నెలల తరబడి సాగిన సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. రాజకుటుంబం నుంచి వెనుదిరుగుతూ వారు సకల సౌకర్యాలను కాలదన్నడంతో పాటు హ్యారీ తాను నిర్వర్తించే అధికారిక సైనిక నియామకాల నుంచి కూడా వైదొలగనున్నారు. కాగా మేఘన్ ప్రస్తుతం తన కుమారుడు అర్చీతో కలిసి కెనడాలో ఉన్నారు. కాగా 2018 మేలో తనకంటే మూడేళ్లు పెద్దదైన మేఘన్తో ప్రిన్స్ హ్యారీ వివాహ బంధంతో ఒక్కటవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కల్గించింది. ప్రిన్స్ హ్యారీది రాజకుటుంబం అయితే.. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మేఘన్ మార్కెల్తో కామన్ ఫ్రెండ్ ద్వారా కలిగిన పరిచయం పరిణయానికి దారితీసింది. ప్రిన్స్ పెళ్లాడిన మేఘన్కు ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. చదవండి : మేఘన్ మార్కెల్ కొత్త అవతారం చదవండి :ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే! -
ఆ వార్తని కొట్టిపడేసిన హ్యారీ, విలియమ్స్
లండన్ : రాజ కుటుంబంలో విభేదాలు అంటూ ఓ ఇంగ్లాండ్ వార్తా పత్రిక ప్రచురించిన కథనంపై ప్రిన్స్ హ్యారీ, ప్రిన్స్ విలియమ్స్ స్పందించారు. ఆ వార్తా కథనంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు సోమవారం వారు ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రిన్స్ ఆఫ్ ససెక్స్( హ్యారీ), ప్రిన్స్ ఆఫ్ కేంబ్రిడ్జ్(విలియమ్స్) బంధంపై ప్రచురితమైన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని, ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను కనబర్చుకునే అన్నదమ్ముల గురించి చెడు వార్తలు రాయటం నేరం, ప్రమాదమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ప్రిన్స్ విలియమ్స్ మోసపూరిత బుద్ధి కారణంగానే రాజ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని, విలియమ్స్ చేష్టల కారణంగానే హ్యారీ కుటుంబానికి దూరమవుతున్నాడని సదరు పత్రిక కొద్దిరోజుల క్రితం ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. చదవండి : వేర్వేరు దారుల్లో నడుస్తున్నాం: ప్రిన్స్ హ్యారీ మేఘన్ మార్కెల్ కొత్త అవతారం -
మేఘన్ మార్కెల్ కొత్త అవతారం
లండన్ : ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటామని ప్రకటించిన బ్రటిన్ రాజకుమారుడు 'డ్యూక్ ఆఫ్ ససెక్స్' ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య 'డచెస్ ఆఫ్ ససెక్స్' మేఘన్ మార్కెల్ అప్పుడే ఆ పనిలో పడినట్టు కనిపిస్తోంది. పెళ్లికి ముందు వదిలేసిన వృత్తిని మేఘన్ తిరిగి చేపట్టారు. ఇందుకోసం డిస్నీ లండన్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. సీనియర్ రాయల్స్ పదవి నుంచి వైదొలగాలనే నిర్ణయాన్ని వెల్లడించిన మేఘన్ డిస్నీ లండన్తో వాయిస్ ఓవర్ చెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆరు వారాల విరామం కోసం కెనడాకు బయలుదేరే ముందే నవంబర్లో ఆమె వాయిస్ఓవర్ను రికార్డ్ చేశారట. 2017లో హ్యారీతో నిశ్చితార్థం తరువాత నటనకు గుడ్ బై చెప్పిన మాజీ నటి మేఘన్ తాజాగా డిస్నీతో ఒప్పందం చేసుకున్నారు. ఎనుగుల పరిరక్షణకు, వేటగాళ్ల బారి నుంచి రక్షించేందుకు ఉద్దేశించిన పరిరక్షణా బృందం ‘ఎలిఫెంట్ వితౌట్ బోర్డర్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చేందుకు బదులుగా స్టూడియోతో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టైమ్స్ పేర్కొంది. కాగా బ్రిటన్ రాజకుటుంబ 'సీనియర్ సభ్యుల' బాధ్యతల నుంచి వైదొలగుతామని, బ్రిటన్, ఉత్తర అమెరికా రెండింటిలో ఉండే విధంగా సమతూకంతో సమయం కేటాయించుకొనేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అదే సమయంలో రాణికి (ఎలిజిబెత్-2)సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అలాగే రాజకుటుంబ సంప్రదాయాల పట్ల తమ కుమారుడు ఆర్చీ హారిసన్కు అవగాహన కల్పించడంతోపాటు, కొత్తగా సేవాసంస్థ ఏర్పాటు సహా జీవితంలోని తదుపరి అధ్యాయంపై దృష్టి కేంద్రీకరించే వీలవుతుందని చెప్పారు. మరోవైపు హ్యారీ-మేఘన్ ప్రకటన రాజకుటుంబానికి అసంతృప్తి కలిగించిందని రాజప్రాసాదం బకింగ్హాం ప్యాలస్ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఆయన 20 కోట్లు వదులుకుంటారా!?
బ్రిటీష్ రాచరిక వ్యవస్థ నుంచి తప్పుకొని ఆర్థికంగా స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన ప్రిన్స్ హ్యారీ దంపతులు అందుకు కట్టుబడి జీవిస్తారా? అన్న సంశయం ఇప్పుడు ప్రిన్స్ విలియమ్స్ దగ్గరి నుంచి సామాన్య మానవుడి వరకు కలుగుతోంది. ఇప్పటి వరకు హ్యారీ దంపతుల కోసం ఏటా 8.3 కోట్ల రూపాయలను, వారి ప్రయాణాలకు 5.5 కోట్ల రూపాయలను, వారి వసతులకు 16.5 కోట్ల రూపాయలను ఎస్టేట్ చెల్లిస్తోంది. అంటే ఏటా వారికి 20 కోట్ల రూపాయలపైనే ఖర్చు అవుతోంది. ఇవి కాకుండా దుస్తులు, ఇతర అవసరాల కోసం చేస్తే ఖర్చులు కూడా రాచరిక వ్యవస్థ నుంచే వస్తాయి. ఇదంతా కూడా బ్రిటీష్ పౌరులు పన్నుల పేరిట రాచరిక వ్యవస్థకు చెల్లిస్తున్న సొమ్మే. (చదవండి: ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే!) ప్రిన్స్ హ్యారీ దంపతులు ఆర్థికంగా స్వతంత్రంగా బతకడం అంటే ఈ సొమ్మును పూర్తిగా వదులు కోవాల్సి ఉంటోంది. ఆ దేశ పౌరులు ప్రిన్స్ హ్యారీ దంపతుల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ప్రజల పన్ను డబ్బులను వదులుకోవాలని కోరుతున్నారు. ప్రిన్స్ విలియమ్స్ మాత్రం హ్యారీ దంపతులకు నచ్చచెప్పేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. రాచరిక హోదాను వదులు కోవడం వల్ల హ్యారీ తల్లి డయానా, కారు ప్రమాదంలో అకాల మరణం పాలయ్యిందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయి తల్లి చేసిన తప్పు చేయరాదంటూ నచ్చ చెబుతున్నారు. అన్నా వదినల కారణంగా రాచరిక కుటుంబానికి హ్యారీ దంపతులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారుకానీ, డబ్బులు తెచ్చే హోదాకు దూరంగా ఉండాలని కాదని హ్యారీ సన్నిహితులు చెబుతున్నారు. హ్యారీ రాచరిక పదవులను వదులుకుంటున్నట్లు చెప్పారుకానీ, రాచరిక హోదాను కాదని వారంటున్నారు. చదవండి: తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు.. -
ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే!
బ్రిటీష్ రాచరిక కుటుంబం జీవితం నుంచి విడిపోయి తాము స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నట్లు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కే ప్రకటించి సంచలనం సష్టించిన విషయం తెల్సిందే. హ్యారీ దంపతులు తమ కుమారుడితో కలిసి క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను బ్రిటీష్ కొలంబియాలోని విక్టోరియాలో నీటి ఒడ్డునున్న ప్యాలెస్ లాంటి బంగ్లాలో గడిపారు. ఇక ముందు జీవితం ఆ బంగ్లాలోనే గడపాలని నిర్ణయించుకున్నట్లు తెల్సింది. దాదాపు 18 మిలియన్ డాలర్లు విలువచేసే ఆ బంగ్లాను వారు రష్యాకు చెందిన ఓ బిలియనీర్ నుంచి కొనుగోలు చేసినట్లు తెల్సింది. ఈ విషయాన్ని ధ్రువీకరించడానికి హ్యారీ దంపతులు, వారి ప్రతినిధి నిరాకరించారు. ఆ రష్యా వ్యాపారి కంట్రీ క్లబ్లో షేర్ హోల్డర్ అవడం వల్ల కంట్రీ క్లబ్ పేరుతో ఆ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. బ్రిటన్లో కొత్త చట్టం ప్రకారం ఆస్తులు అమ్మినప్పుడు కచ్చితంగా దాని వెల ఎంతో ప్రకటించి అంత మొత్తానికి పన్ను చెల్లించాలి. ఆ పన్నును తప్పించుకునేందుకే రష్యా వ్యాపారి కంట్రీ క్లబ్ ద్వారా ఆ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. మొత్తం 11,416 చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన ప్రధాన బంగ్లాలో ఐదు బెడ్ రూమ్లు, ఎనిమిది బాత్ రూమ్లు, ఓ హాలు, కిచెన్ ఉన్నాయి. దానికి వెలుపల అతిథుల కోసం 2,349 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బెడ్ రూమ్లు, రెండు బాత్ రూములు గల చిన్న భవనం ఒకటి ఉంది. చదవండి: తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు.. -
తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు..
ఇరాన్లో యుద్ధ మేఘాలు. ఇండియాలో పౌరసత్వ నిరసనలు. అగ్రరాజ్యాల్లో పర్యావరణ ఉద్యమాలు. ఒక్కోదేశం ఒక్కో సమస్యతో సతమతమౌతోందిప్పుడు. బ్రిటన్ ప్రజలు మాత్రం వీటన్నిటికీ భిన్నమైన ఒక హటాత్పరిణామంతో నివ్వెర పోయి రెండు రోజులుగా రాజప్రాసాదం వైపే చూస్తున్నారు. మనవడు ప్రిన్స్ హ్యారీ తన నానమ్మ క్వీన్ ఎలిజబెత్తో ఓ మాటైనా చెప్పకుండా భార్యతో కలిసి ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. స్వాతంత్య్రం కోసం ఎన్నో దేశాలు బ్రిటన్పై పోరాడి స్వేచ్ఛను సాధించుకు న్నట్లే.. స్వతంత్రంగా జీవించడం కోసం ప్రిన్స్ హ్యారీ.. రాయల్ ఫ్యామిలీ నుంచి వెళ్లిపోతున్నారా?! ఊరంతా తెలిశాక మనకు తెలిసే విషయం ఒకటి ఉంటుంది. మన ఇంటి విషయం! అబ్బాయి బయటేదో ఘనకార్యం చేసి ఉంటాడు. కాలనీ అంతా తెలిశాకే మనకు తెలుస్తుంది. అమ్మాయి ఎవర్నో ప్రేమిస్తుంటుంది. పొరుగూళ్లో బంధువులందరికీ తెలిశాకే, ఆ కబురు మన ఊళ్లో బస్ దిగి, మన ఇంటికి వస్తుంది. నమ్మకం మనకు మన అబ్బాయి మీద, అమ్మాయి మీద. ఆ నమ్మకాన్ని నమ్మకంగా ఉంచడానికి కావచ్చు.. తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు విషయాన్ని దాచి ఉంచీ ఉంచీ ఇక చెప్పకపోతే నమ్మకద్రోహం చేసినట్లవుతుందని మనకు చెప్పేస్తుంటారు. ఇళ్లన్నీ ఒక్కటే. రాజుగారి ఇల్లయినా, పేదవాడి ఇల్లయినా! మనుషులంతా ఒక్కటే. గ్రేట్ బ్రిటన్లో ఉన్నా, పూర్ కంట్రీలో ఉన్నా! అందుకే.. మనవడు హ్యారీ, అతడి భార్య.. ఇల్లొదిలి వెళ్లిపోతున్నారనే విషయం అందరికీ తెలిశాక ఆఖర్న గానీ ఎలిజబెత్ రాణిగారికి తెలియలేదు. అప్పట్నుంచీ ఆమె మనసు మనసులో లేదు. నేనేం తక్కువ చేశాను అని ఆమె విలపిస్తున్నారు తప్పితే, వాళ్లేం ఎక్కువ కోరుకుంటున్నారోనని ఆలోచించడానికి కూడా ఆమెకు మనస్కరించడం లేదు. వెళ్లిపోతున్నారు.. వెళ్లిపోతున్నారు.. ఇదే ఆమె హృదయాన్ని పిండేస్తోంది. బుధవారం సాయంత్రం వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. క్రిస్మస్ వేడుకల కోసం వారం ముందే శాండ్రింగ్ హామ్ ఎస్టేట్కి వెళ్లిన రాణిగారు మూడు వారాలు గడిచిపోతున్నా అక్కడే ఉండిపోడానికి కారణాలు ఏమైనా.. ఇప్పుడామె హుటాహుటిన బకింగ్హామ్ రాజప్రాసాదానికి తిరిగి వచ్చే ఏర్పాట్లలో ఉన్నారు. రాయల్ ఫ్యామిలీలోంచి వెళ్లిపోవాలని మనవడు హ్యారీ, అతడి భార్య కలిసి తీసుకున్న నిర్ణయంగా బ్రిటన్ పత్రికల్లో వస్తున్న వార్తలు.. తిరుగు ముఖానికి ఆమెను తొందర పెడుతున్నాయి. ‘కనీసం వాళ్లు రాణిగారికి చెప్పనైనా లేదు’ (దే డిడిన్ట్ ఈవెన్ టెల్ ద క్వీన్) అని ‘డైలీ మిర్రర్’ తన మొదటి పేజీ నిండా పెట్టిన హెడ్డింగ్ ఆమెను మరింతగా బాధిస్తుండవచ్చు. ప్యాలెస్ తలుపులు తెరుచుకోగానే గుమ్మం ముందు పడి కనిపించే అనేక తుంటరి పత్రికల్లో అదీ ఒకటి. ఈ భార్యాభర్తలిద్దరూ తాము ఇల్లొదిలి వెళ్లిపోతున్నట్లు రాణిగారికి మాట మాత్రంగానైనా చెప్పకపోవడం నిజమే. పైగా ఆ విషయాన్ని వాళ్లు తామిద్దరూ కొత్తగా ప్రారంభించిన వెబ్సైట్ లో బహిరంగ పరచడం ఆ వృద్ధ ప్రాణాన్ని మరింత అలసటకు గురి చేసినట్లు కనిపిస్తోంది. ‘హ్యారీ మొన్న క్రిస్మస్కి కూడా పొడిపొడిగానే మాట్లాడాడు. అది కూడా ఫోన్లో. అప్పుడైనా నేను అతడి అంతరంగాన్ని గ్రహించ వలసింది’’ అని రాణిగారు పొడి బారుతున్న గొంతుతో అన్నట్లు.. ఎప్పుడూ ఆమెను కనిపెట్టుకుని ఉండే వ్యక్తిగత సంరక్షకులు ఒకరు.. తనను పట్టి పీడిస్తున్న మీడియా ప్రతినిధులకు తప్పనిసరై వెల్లడించారు. భార్య మేఘన్ మార్కెల్తో ప్రిన్స్ హ్యారీ ‘‘మా కాళ్లపై మేము నిలబడాలని భావిస్తున్నాం. స్వతంత్రంగా జీవించాలని అనుకుంటున్నాం. మాకొక గుర్తింపు కోసం ఆశపడుతున్నాం. మేము బయటికి రావడం వల్ల రాచ కుటుంబం నుంచి వారసత్వంగా మాకు సంక్రమించవలసిన వాటన్నిటినీ కోల్పోతామని తెలుసు. అయినా అందుకు సిద్ధపడుతున్నాం’’ అని ప్రిన్స్ హ్యారీ, మేఘన్ కలసి చేసిన ఆ ప్రకటన ఎలిజబెత్ రాణి మనసులోనే కాదు, బ్రిటన్ ప్రజల్లోనూ కలవరం రేపుతోంది. ‘కలిసి ఉన్న ఒక గొప్ప కుటుంబం ముక్కలు కాబోతోందే! ఈ విలయాన్ని, విపత్తును నివారించలేకపోతున్నామే.. ఎలా దేవుడా..’ అని ఆ కుటుంబాన్ని తరతరాలుగా అభిమానించే వారు విలవిలలాడుతున్నారు. వారిలో కొందరైతే తమ మనసులో ఉన్న దానిని ఏమాత్రం దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. ‘‘ఈ దుస్థితికి మూల కారణం హ్యారీ భార్య మేఘన్. ఆ మహాతల్లి వల్లే ఇదంతా జరుగుతోంది. హ్యారీ భార్యా విధేయుడైపోయి, కుటుంబాన్ని కాదనుకున్నాడు. కనీసం రాణి గారికి కూడా చెప్పి చేయడం లేదంటే ఏమనుకోవాలి?’’ అని తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు. ఇంట్లోంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం తప్పయినా ఒప్పయినా.. ఇంటికి పెద్దయిన రాణిగారికి చెప్పకపోవడం మాత్రం తప్పే. ప్రస్తుతం రాణిగారు, రాణిగారి భర్త; రాణిగారి కొడుకు, కూతురు; కొడుకు సంతానం, కూతురి సంతానం; వారి జీవిత భాగస్వాములు; వారి సంతానంలో కొందరు.. మొత్తం 24 మంది ‘రాయల్’ టైటిల్ ఉన్నవాళ్లున్నారు. మిగతా ఇంకా ఉన్నారు కానీ, వాళ్లంతా టైటిల్స్ లేనివాళ్లు. ఇప్పుడు బయటికి వెళ్లిపోతున్న హ్యారీ, మేఘన్ సొంతంగా బతకడం కోసం రాయల్ టైటిల్ని కూడా వదులుకోబోతున్నారు. బ్రిటన్లోని విండ్సర్లో ఫ్రాగ్మోర్ కాటేజ్ హ్యారీ పేరు మీద ఉంది. దాన్ని మాత్రం ఉంచుకుంటారు. అప్పుడప్పుడు అక్కడికి వచ్చి పోతుండటానికి. ఇకనుంచీ ఈ దంపతులు ఉండటమైతే బ్రిటన్ కాదు. కెనడా. 2018 మే లో హ్యారీ, మేఘన్ల వివాహం జరిగింది. వారికిప్పుడు ఎనిమిది నెలల కొడుకు. పేరు మౌంట్బ్యాటన్. సింహాసనాన్ని అధిష్టించే వారసత్వపు వరసలో అతడిది ఏడవ స్థానం. అంతఃపురంలో తమ స్థానాలన్నిటినీ వదులుకుని వెళ్తున్న ప్రిన్స్ హ్యారీ దంపతులకు ఆ కుటుంబ సభ్యుల హృదయాలలో మాత్రం స్థానం ఎప్పటికీ ఉంటుంది. అది కాదనుకున్నా పోయేది కాదు. కాదని వెళ్లిపోయినా విడిచి పెట్టేదీ కాదు. గతంలో! కింగ్ ఎడ్వర్డ్ VIII వాలిస్ సింప్సన్తో ఎనిమిదవ ఎడ్వర్డ్ ఇప్పుడు ప్రిన్స్ హ్యారీ బయటికి వెళ్తున్నట్లే.. బ్రిటన్ రాజ కుటుంబపు పూర్వీకుడైన ఎనిమిదవ ఎడ్వర్డ్ మహారాజు కూడా తను ప్రేమించిన యువతి కోసం ప్యాలెస్ను వదులుకున్నవారే! ప్యాలెస్తో పాటు తన సింహాసనాన్ని కూడా! అమెరికన్ వితంతువు అయిన వాలిస్ సింప్సన్ను ప్రేమించిన ఎడ్వర్డ్.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్నందుకు కిరీటాన్ని సైతం కాదనుకున్నారు. ‘‘నేనీ భారాన్ని మోయలేకపోతున్నాను. నేను ప్రేమించిన వ్యక్తి సహాయం, సహకారం లేకుండా ఈ రాజ్యాధికారానికి న్యాయం చేకూర్చలేను’’ అని రాజైన కొద్ది నెలలకే బహిరంగంగా ప్రకటించి పక్కకు తప్పుకున్నారు. ఆ మర్నాడే ఎడ్వర్డ్ తమ్ముడు ప్రిన్స్ ఆల్బర్ట్ బ్రిటన్కు రాజయ్యాడు. ప్రిన్స్ ఫిలిప్ ఎలిజబెత్ (ప్రస్తుత రాణి)తో ప్రిన్స్ ఫిలిప్ రెండవ ఎలిజబెత్ రాణి (హ్యారీ నానమ్మ) భర్త ఫిలిప్ది కూడా ఇలాంటి పరిత్యాగ ప్రేమ కథే. అయితే రివర్స్లో. అతడిది గ్రీసు, డెన్మార్క్ల రాచ కుటుంబం. ఎలిజబెత్ను చేసుకోవడం కోసం తన సొంత రాజ్యాన్ని వదులుకుని బ్రిటన్ కుటుంబంలో సభ్యుడు అయ్యారు. -
బ్రిటన్ రాజ దంపతుల ‘న్యూక్లియర్ బాంబు’ ట్విటర్ గగ్గోలు
లండన్ బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ రాజ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ రాయల్స్ హోదా నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ బ్రిటన్ రాణి ఎలిజబెత్కు ఓ లేఖ రాశారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, తాము నార్త్ అమెరికాకు వెళ్లి ఆర్థికంగా స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు హ్యారీ భార్య మేఘన్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. విరామం కోసం ఆరు వారాల పాటు కెనడా వెళ్లి తిరిగి వచ్చిన జంటఈ ప్రకటన చేయడం విశేషం డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సస్సెక్స్ ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ నిర్ణయంపై సోషల్మీడియాలో దుమారం రేగింది. ఎవరితో సంప్రదించకుండా, ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారనీ, తద్వారా బ్రిటిష్ రాజ కుటుంబంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ట్విటర్లో, ఇన్స్టాగ్రామ్లో వ్యాఖ్యానించారు. గతరాత్రి వారిద్దరూ న్యూక్లియర్ బాంబు పేల్చారని మరొకరు కమెంట్ చేశారు. వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నాను. అయినా...వారు భరించగలరా ట్వీట్లు, హాస్యోక్తులు, వ్యంగ్యచిత్రాల వరద పారుతోంది. మరోవైపు ఇది రాచకుటుంబానికి చెందినవ్యవహారమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. కాగా గతేడాది బ్రిటీష్ రాచకుటుంబంలో ఏర్పడిన విభేదాలే దీనికి కారణమని అభిప్రాయం ప్రధానంగా వినిపిస్తోంది. ప్రిన్స్ హ్యారీ దంపతులు రాచకుటుంబంలో పెద్దలను ఎవర్నీ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బకింగ్హామ్ ప్యాలెస్ పేర్కొంది. ఈ పరిణామంపట్ల క్వీన్ఎలిజబెత్, ప్రిన్స్ చార్లెస్ నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. హ్యారీ ప్రకటనపై స్పందించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2..ఇది చాలా కఠినతరమైన సమస్యన్నారు. స్వతంత్రంగా జీవించాలనే వారి కోరికను అర్ధం చేసుకున్నానని..కానీ దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు. View this post on Instagram “After many months of reflection and internal discussions, we have chosen to make a transition this year in starting to carve out a progressive new role within this institution. We intend to step back as ‘senior’ members of the Royal Family and work to become financially independent, while continuing to fully support Her Majesty The Queen. It is with your encouragement, particularly over the last few years, that we feel prepared to make this adjustment. We now plan to balance our time between the United Kingdom and North America, continuing to honour our duty to The Queen, the Commonwealth, and our patronages. This geographic balance will enable us to raise our son with an appreciation for the royal tradition into which he was born, while also providing our family with the space to focus on the next chapter, including the launch of our new charitable entity. We look forward to sharing the full details of this exciting next step in due course, as we continue to collaborate with Her Majesty The Queen, The Prince of Wales, The Duke of Cambridge and all relevant parties. Until then, please accept our deepest thanks for your continued support.” - The Duke and Duchess of Sussex For more information, please visit sussexroyal.com (link in bio) Image © PA A post shared by The Duke and Duchess of Sussex (@sussexroyal) on Jan 8, 2020 at 10:33am PST -
వేర్వేరు దారుల్లో నడుస్తున్నాం: ప్రిన్స్ హ్యారీ
లండన్ : తామిద్దరం ప్రస్తుతం వేర్వేరు దారుల్లో నడుస్తున్నటికీ.. ఎల్లప్పుడూ అన్నదమ్ముల బంధం కొనసాగుతుందని ప్రిన్స్ హ్యారీ అన్నారు. ప్రతీ బంధంలో చిన్న చిన్న గొడవలు సహజమని.. నేటికీ తాను అన్నయ్యను అమితంగా ప్రేమిస్తున్నానని పేర్కొన్నారు. బ్రిటీష్ రాజవంశ సోదరులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని గత కొంతకాలంగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం.. భార్య మేఘన్ మార్కెల్తో కలిసి దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ ఈ విషయాలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ ఈ క్షణం మేము కచ్చితంగా వేర్వేరు దారుల్లోనే ఉన్నాం. అయితే అత్యవసర సమయాల్లో మేము ఒకరికరం అండగా ఉంటాము. ప్రతిరోజూ నేరుగా కలుసుకోలేకపోవచ్చు కానీ ఆయనను అమితంగా ప్రేమిస్తూనే ఉంటాను. అన్నదమ్ముల మధ్య ప్రేమలు, చిన్న చిన్న గొడవలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతమాత్రాన మా గురించి అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు’ అని చెప్పుకొచ్చారు. ఇక దక్షిణాఫ్రికా దేశాల పర్యటన గురించి చెబుతూ ఇది తన మనసుకు సాంత్వన చేకూరుస్తుందని అన్నారు. తన తల్లి ప్రిన్సెస్ డయానాను గుర్తు చేసుకునేందుకు.. ఆమె అడుగుజాడల్లో నడిచేందుకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఒక రాజకుటుంబీకుడిగా తాను ప్రతీ క్షణం కెమెరా ముందే ఉంటున్నానని, ప్రతి క్షణం తన ఫొటోలు తీస్తున్నారని.. అయితే ఇదంతా తనను ఒక్కసారిగా గతంలోకి తీసుకువెళ్తుందని పేర్కొన్నారు. తన తల్లి జీవితంపై ఇలాంటివి దుష్ప్రభావం చూపాయని.. తన మరణాన్ని కూడా చెడుగా గుర్తుపెట్టుకునేలా చేశాయని విచారం వ్యక్తం చేశారు. ఆ గాయం తనను నేటికీ వెంటాడుతుందని.. తన జీవితంలో అతిపెద్ద విషాదం అని ఉద్వేగానికి గురయ్యారు. కాగా 1997లో బ్రిటన్ యువరాణి డయానా ఫ్రాన్సులో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో భర్త ప్రిన్స్ చార్లెస్, ఇద్దరు కుమారులు విలియమ్, హ్యారీ... స్కాట్లాండ్లో వేసవి సెలవల్ని గడుపుతుండగా, డయానా ఫ్రాన్స్లో ఉండడంపై సందేహాలు రేకెత్తాయి. కారు ప్రమాదంలో డయానాతో పాటు సంపన్న వ్యాపారి కుమారుడు డోడీ అల్ ఫయేద్ కూడా ఉండడంతో మీడియా ఊహాలకు అంతేలేకుండా పోయింది. ఇరవైయ్యవ శతాబ్దపు అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డయానాను తన ప్రియుడితో విహరిస్తున్న సమయంలో పాపరాట్సీ(ప్రముఖ వ్యక్తుల ఫొటోలను వారి అనుమతి లేకుండా తీసే ప్రయత్నం చేసేవారు) వెంటపడటంతో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైందంటూ వార్తలు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. -
వైరల్ అవుతున్న రాయల్ బేబీ ఫోటోస్
ఎప్పటినుంచో అభిమానులు ఎదురు చూస్తున్న రాయల్ బేబీ ఫోటోలు వచ్చేసాయి. స్వయంగా బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు తమ తొలి సంతానాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. దీంతో ఈఫోటోలు వైరల్ గా మారాయి. మగబిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల తరువాత బుధవారం ఉదయం ఈ కొత్త తల్లిదండ్రులు హ్యారీ, మేఘన్ బుధవారం ఉదయం విండ్సోర్ కాసిల్ లోని సెయింట్ జార్జ్ హాల్ లో తొలిసారి మీడియాతో మాట్లాడారు. ‘‘అద్భుతంగా ఉంది. ఈ ప్రపంచంలో ఇద్దరు బెస్ట్ గైస్ నా జీవితంలోకి వచ్చారు’’ అంటూ మేఘన్ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. కాగా సోమవారం(మే-6,2019) ఉదయం 05:26 గంటలకు (స్థానిక సమయం) మేఘన్ మార్కెల్ మగబిడ్డకు జన్మనిచ్చిందని ప్రిన్స్ హ్యారీ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. గతేడాది మే-19,2018న బ్రిటన్లోని బెర్క్ షైర్ కౌంటీ విండ్సర్ లోని సెయింట్ జార్జి చర్చిలో హ్యారీ, మేఘన్ మార్కెల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. -
బ్రిటన్ రాజవంశంలో కొత్త వారసుడు
లండన్: బ్రిటన్ రాజవంశంలో కొత్త వారసుడొచ్చాడు. యువరాజు హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్టించేందుకు ఇప్పటికే ఆరుగురు క్యూలో ఉండగా, ఈ కొత్త వారసుడు ఏడో వాడయ్యాడు. బ్రిటిష్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.26 గంటలకు మేఘన్ ఈ బిడ్డకు జన్మనిచ్చారు. బాబు 3.2 కేజీల బరువు ఉన్నాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని ప్రిన్స్ హ్యారీ విలేకరులకు చెప్పారు. ‘నాకు ఇంతకంటే గొప్ప విషయం ఇప్పటివరకు ఏదీ లేదు. నా భార్యను చూస్తే చాలా గర్వంగా ఉంది. నేను ఇప్పుడు చంద్రుడిపై ఉన్నంత సంతోషంగా ఉంది’ అని హ్యారీ తెలిపారు. -
రాయల్ బేబీ వచ్చేసింది...ప్రిన్స్ హ్యారీ ప్రకటన
బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ లభించింది. మేఘన్ మార్కెల్ సోమవారం ఉదయం 05:26 గంటకు (స్థానిక సమయం) బాలుడికి జన్మనిచ్చారు. మార్కెల్ పురిటి నొప్పులతో ఈ తెల్లవారుఝామున ఆసుపత్రిలో చేరారని బకింగ్ హాం ప్యాలస్ సోమవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే ఆ తరువాత ఈ శుభవార్తను స్వయంగా ప్రిన్స్ హ్యారీ ఇన్వెస్టాగ్రామ్లో వెల్లడించారు. చాలా థ్రిల్లింగా వుందనీ, తల్లి బిడ్డ క్షేమంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమకు మద్దతు అందించిన అందరికీ ప్రిన్స్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఇంకా తాము బిడ్డ పేర్ల గురించే ఆలోచిస్తున్నామంటూ సంతోషాన్ని వెలిబుచ్చారు. దీంతో ఇన్స్టాగ్రామ్లో అభినందనల వెల్లువ కురుస్తోంది. ఈ పోస్ట్కు కేవలం 30 నిమిషాల్లోనే ఏడున్నర లక్షలకు పైగా లైక్లు రావడం విశేషం. క్వీన్ ఎలిజబెత్ -2 ఏడవ ముని మనవడు అవతరించాడు. యువరాజు చార్లెస్, ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హ్యారీతోపాటు విలియం ముగ్గురు సంతానం తరువాత ప్రిన్స్ హ్యారీ మార్కెల్ తొలి బిడ్డ బ్రిటిస్ రాజ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు రాయల్ బేబీ ఫోటోను చూడడానికి ఈ రాజదంపతులు హితులు, సన్నిహితులతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. కాగా ప్రముఖ హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ను గత ఏడాది మే 19న ప్రిన్స్ హ్యారీ వివాహం చేసుకున్నారు. బ్రిటన్లోని బెర్క్షైర్ కౌంటీ విండ్సర్లోని సెయింట్ జార్జి చర్చిలో అత్యంత వైభవంగా ఈ వివాహ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram We are pleased to announce that Their Royal Highnesses The Duke and Duchess of Sussex welcomed their firstborn child in the early morning on May 6th, 2019. Their Royal Highnesses’ son weighs 7lbs. 3oz. The Duchess and baby are both healthy and well, and the couple thank members of the public for their shared excitement and support during this very special time in their lives. More details will be shared in the forthcoming days. A post shared by The Duke and Duchess of Sussex (@sussexroyal) on May 6, 2019 at 6:37am PDT -
రికార్డు తిరగరాసిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే సోషల్ మీడియాలో రికార్డు మోత మోగించారు. ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచిన నిమిషాల వ్యవధిలోనే 1 మిలియన్ ఫాలోవర్స్ మైలురాయిని ఛేదించారు.దీంతో అతివేగంగా గరిష్ట ఫాలోవర్స్ను సాధించిన ఇన్స్టాగ్రామ్ యూజర్గా వీరి ఖాతా గిన్నిస్ రికార్డుల కెక్కింది. ఏప్రిల్ 2వ తేదీన ససెక్స్ రాయల్ పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతా మిలియన్లకొద్దీ ఫాలోవర్లు, లైక్లతో దూసుకుపోతోంది. మొదటి 5గంటల్లో పది లక్షమంది ఫాలోవర్స్ను నమోదు చేసింది. అనంతరం ఈ సంఖ్య రెట్టింపు అయింది. ఇప్పటికే 9లక్షలకు పైగా లైక్స్ను పొందింది. ప్రస్తుతం 2. 6 మిలియన్లతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అతి తక్కువ సంయంలో మిలియన్ల ఫోలోవర్స్ సాధించిన రికార్డు పోప్ ఫాన్సిస్ పేరుతో వుంది. అనంతరం దక్షిణ కొరియా పాప్ సింగర్ కాంగ్ డేనియల్ (11గంటలు) ఈ ఘనతను సాధించారు. ప్రిన్సెస్ యుజెనీ మొదలుకొని డేవిడ్ బెక్హాం, బ్లేక్ లైవ్లీ, గ్వినేత్ పాల్ట్రో, మిండీ కాలింగ్ లాంటి సెలబ్రిటీలు వీరి ఫాలోవర్స్గా ఉన్నారు. ఇంకా మేఘన్ క్లోజ్ ఫ్రెండ్, నటి ప్రియాంకా చోప్రా, టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, జెస్సికా ముల్రనీ ఈ ఖాతాలోని మొదటి అనుచరుల జాబితాలో ఉన్నారు. కాగా కేవలం 23మంది ఫాలోవర్స్ మాత్రమే ససెక్స్రాయల్ అకౌంట్లో ఉన్నారు. కాగా మరో నెలరోజుల్లోనే మేఘన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఇక పుట్టిన బిడ్డ ఫోటో పోస్ట్ చేస్తే ఇంకెన్ని రికార్డు ల మోత మోగనుందోనని భావిస్తున్నారు. -
‘నా గుండెను ముక్కలు చేశావు.. నాన్నా!’
లండన్ : డచెస్ ఆఫ్ ససెక్స్, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ తనకు రాసిన భావోద్వేగ లేఖను ఆమె తండ్రి థామస్ మార్కెల్ బహిర్గతం చేశారు. యువరాణి హోదా పొందిన నాటి నుంచి తనకీ, తన కూతురికీ మధ్య బంధం పూర్తిగా తెగిపోయిందంటూ అనేకమార్లు థామస్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె నుంచి స్పందన రాలేదని, ఈ విషయంలో కలగజేసుకోవాల్సిందిగా బ్రిటన్ మహారాణి ఎలిజబెత్కు కూడా అభ్యర్థించారు. ఈ క్రమంలో గత వారం ఓ మ్యాగజీన్ ఇచ్చిన ఇంటర్య్యూలో భాగంగా మేఘన్ స్నేహితులు.. థామస్ ఎప్పుడూ మేఘన్ను సంప్రదించే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులో మేఘన్ తనకు రాసిన లేఖను థామస్ ఆదివారం బయటపెట్టారు. తన మెసేజ్లకు స్పందనగానే మేఘన్ ఈ లేఖ రాసిందని పేర్కొన్నారు. నా గుండె ముక్కలు చేశావు నాన్నా! ‘నాన్నా.. బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాస్తున్నా. నువ్వింత గుడ్డిగా ఎందుకు ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. నన్ను బాధ పెట్టడానికి ఈ దారి ఎందుకు ఎంచుకున్నావు. నువ్వు నా గుండెను పది లక్షల ముక్కలు చేశావు. నువ్విలా ఎందుకు చేస్తున్నావు. మీడియాతో చెప్పినట్లుగా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే.. ఇలాంటి ఆరోపణలు ఆపెయ్. దయచేసి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వు. ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నా. అబద్ధాలు చెప్పడం మానెయ్. నాకు బాధ కలిగించడం మానెయ్. నా భర్తతో నాకు ఉన్న అనుబంధాన్ని దూరం చేసేందుకు ప్రయత్నించకు. నా పెళ్లికి రాలేకపోయావెందుకు’ అని మేఘన్ పేరిట ఉన్న ఉత్తరాన్ని థామస్ మీడియా ‘డెయిలీ మెయిల్’ ద్వారా బహిర్గతం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ ఈ లేఖ నన్ను చాలా బాధించింది. నేను కుంగిపోయాను. ఈ లేఖను ఎవ్వరికీ చూపించలేదు. కానీ లేఖ రావడం మంచి విషయమే కదా. తను ఒక్క ఫోన్ చేస్తే చాలు ఇదంతా ముగిసిపోతుంది. నా కూతురు ఏదో ఒకరోజు దగ్గరవుతుందనే నమ్మకం ఉంది’ అని వ్యాఖ్యానించారు. కాగా హాలీవుడ్ నటి మేఘన్.. బ్రిటన్ యువరాజు హ్యారీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది మే నెలలో జరిగిన వీరి వివాహ వేడుకకు ఆమె తండ్రి హాజరుకాలేదు. ఇక అప్పటి నుంచి మేఘన్ను మారిపోయిందంటూ ఆమె తండ్రి ఆరోపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. -
‘దయచేసి నా కూతురిని నాకు దగ్గర చేయండి’
లండన్ : తనకి, తన కూతురికి మధ్య ఏర్పడిన ‘అగాథాన్ని’పూడ్చేందుకు బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ చొరవ తీసుకోవాలని మేఘన్ మార్కెల్ తండ్రి థామస్ మార్కెల్ అభ్యర్థించారు. హాలీవుడ్ నటి మేఘన్.. బ్రిటన్ యువరాజు హ్యారీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో జరిగిన వీరి వివాహ వేడుకకు ఆమె తండ్రి హాజరుకాలేదు. ఈ క్రమంలో మేఘన్ పెళ్లైన నాటి నుంచి ఆమెతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని థామస్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేఘన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. తను నాకోసం క్రిస్మస్ కార్డులు పంపుతుందని ఇన్నాళ్లూ ఎదురుచూశాను. తనకు ఎన్నోసార్లు మెసేజ్ కూడా చేశాను. కానీ ఆమె నుంచి ఎటువంటి స్పందనా లేదు. దయచేసి నా కూతురిని నాకు దగ్గర చేయండి. త్వరలోనే బుల్లి మేఘన్ లేదా బుల్లి హ్యారీ రాబోతున్నారు. కాబట్టి ఇటువంటి సంతోష సమయంలో నేను తనని కలవాలనుకుంటున్నాను. ఈ విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే రాణీగారు. కుటుంబంలో తలెత్తిన సమస్యలను క్వీన్ ఎలిజబెత్ పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది. రాజ కుటుంబంలోనైనా, సాధారణ కుటుంబాల్లోనైనా కుటుంబ సభ్యులంతా కలిసి ఉంటేనే సంతోషం కదా. నా బాధను అర్థం చేసుకోండి’ అంటూ థామస్ మార్కెల్ సోమవారం ఎలిజబెత్కు విన్నవించారు. కాగా యువరాణి హోదా పొందిన నాటి నుంచి తన కూతురి మోముపై చిరునవ్వు మాయమైందంటూ థామస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘నా కూతురి నవ్వు ఎలా ఉంటుందో నాకు తెలుసు. చిన్నతనం నుంచి తన నవ్వుని చూస్తున్నాను. ఇప్పుడు ఆమె మొహంలో కనిపించే చిరునవ్వు నిజమైనది కాదు. ఆ చిరునవ్వు వెనక ఎంతో బాధ ఉంది’ అది నాకు స్పష్టంగా కనిపిస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక ‘మేఘన్కు వివాహం అయిన నాటి నుంచి ఆమెతో మాట్లాడలేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. స్వయంగా కలుద్దామంటే ఆమె చిరునామ నా దగ్గర లేదు’ అని ఆయన కంటతడి పెట్టారు. ఇక ఈ విషయంపై క్వీన్ ఎలిజబెత్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. -
ప్రిన్స్ భార్య రానట్లే!
పెళ్లి తేదీ దగ్గర పడటంతో పెళ్లి పనులు ముమ్మరం చేశారు ‘ప్రియానిక్’ (ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్). డిసెంబర్ 3న జో«థ్పూర్లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనుంది. నవంబర్ 28న సంగీత్తో వీరి షాదీ సంబరాలు మొదలవుతాయట. ఈ సంగీత్ కార్యక్రమంలో నిక్ పాటలతో అలరించనున్నారట. అలాగే ఈ ఇద్దరూ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్కు కాలు కదపనున్నారట. దీనికోసం బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ హెగ్డేను ఎంపిక చేసుకున్నారట. ప్రస్తుతం ప్రియాంక తన కొత్త చిత్రం ‘ది స్కై ఈజ్ పింక్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. నవంబర్ 26 వరకూ ఈ షెడ్యూల్ జరగనుంది. ఆ తర్వాత పెళ్లి కోసం బ్రేక్ తీసుకుంటారు. పెళ్లికి హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రియాంక ప్రియ మిత్రురాలు, హాలీవుడ్ నటి, ఇంగ్లాండ్ యువరాజు ప్రిన్స్ హ్యారీని పెళ్లాడిని మేఘన్ మార్కెల్ మాత్రం ఈ వేడుకకు రాలేరని సమాచారం. ఆమె వివాహ వేడుకకు ప్రియాంక హాజరయ్యారు. మరి.. మేఘన్ ఎందుకు రారంటే.. ఆమె గర్భవతి అని సమాచారం. మాకేం కావాలంటే.. సాధారణంగా పెళ్లికి ఏం బహుమతులు తీసుకువెళ్లాలో అని తర్జన భర్జన పడుతుంటారు బంధువులు, సన్నిహితులు. కానీ తన పెళ్లికి హాజరయ్యేవాళ్లకు అలాంటి ఇబ్బందేం పెట్టదలచుకోలేదు ప్రియాంక. తమకేం కావాలో చిట్టీ రాసి మరీ వివరంగా చెప్పారు. దీన్నే ‘బ్రైడల్ రిజస్ట్రీ’ అంటారు. ఈ పద్ధతి విదేశాల్లో చాలా కామన్. అంటే తమకు ఏం కావాలో వాటన్నింటినీ లిస్ట్ రాసి పెళ్లికి బహుమతులు తీసుకురావాలనుకున్న వాళ్ల శిరోభారం తగ్గిస్తుంటారు వధూవరులు. టీవీ, ఎయిర్ ప్యూరిఫైయర్ లాంటివి మాత్రమే కాకుండా తన పెంపుడు కుక్క డయానా కోసం పింక్ కలర్ రెయిన్ కోట్, జీపీయస్ ట్రాకర్, పెట్ బెడ్ కూడా లిస్ట్లో ఉంచారు ప్రియాంక. దీనిని అమేజాన్ షాపింగ్ సైట్లో ఉంచారు. ఈ బ్రైడల్ రిజస్ట్రీలో సేవాభావం కూడా ఉంది. ఈ వెడ్డింగ్ రిజిస్ట్రీ ద్వారా యూనిసెఫ్ సంస్థకు లక్ష డాలర్లు విరాళంగా ఇవ్వనున్నారు అమేజాన్ వాళ్లు. -
బయటికొచ్చిన ఫొటో!
అరుదైన ఫొటోలు ఎవరికి దగ్గర ఉంటాయి? బహుశా అమ్మమ్మల దగ్గర, నానమ్మల దగ్గర. క్వీన్ ఎలిజబెత్ఐఐ ‘రాజమాత’ అయితే అవనీయండి. మొదట మాత్రం ఆమె గ్రాండ్మదర్. ఆవిడ గది నిండా అరుదైన ఫొటోలే. మనవళ్ల చిన్నప్పటివీ, మనవళ్లు పెద్దయ్యాక తీసినవి.. ఇప్పటికింకా తీస్తూనే ఉన్నవీ! గది గోడలపైన, టేబుల్ మీద.. నిద్ర లేవగానే.. (‘నానమ్మా’ అంటూ వాళ్లొచ్చి గుడ్మాణింగ్ చెప్పేలోపే..) వాళ్లను కళ్లారా చూసుకుని ఉల్లాసంగా కళ్లు నులుముకునేందుకు క్వీన్ ఎలిజబెత్ ముచ్చటగా ఎంపిక చేసుకుని పెట్టుకున్న ఫొటోలు అవి. అవన్నీ మీడియాకు రావు. బ్రిటన్లో అంతపెద్ద మీడియా ఉంటుంది కదా, అయినా కూడా రావు. క్వీన్ ఎలిజబెత్ పర్సనల్ కలెక్షన్ అవి. రాజమాతకు చిన్న మనవడు ప్రిన్స్ హ్యారీ అంటే ఇష్టం. ప్రతి సందర్భంలోనూ ఆ సంగతి బయటపడుతూనే ఉంటుంది. హ్యారీ నవ్వు ముఖంలో అతడి తల్లి డయానా స్వర్గకాంతిలా ప్రతిఫలిస్తూ అత్తగారిని పలకరిస్తూ ఉంటుందేమో! అలాగని పెద్ద మనవడంటే ఇష్టం లేకుండా ఉంటుందా? చిన్నవాళ్లకు ప్రతి ఇల్లూ కట్టే ‘పట్టమే’ ఇది. రాజమాత కూడా చిన్న మనవడిపై తమ మురిపాన్ని ఫొటో రూపంలో ఫ్రేమ్ కట్టించి, ఆ ఫ్రేమ్ని టేబుల్ ల్యాంప్కు ఆన్చి, ఎదురుగా పెట్టుకున్నారు. అందులో హ్యారీ ఒక్కడే లేడు. పక్కనే అతడి భార్య మేఘన్ మార్కెల్ ఉన్నారు! లేత నీలం రంగు డ్రెస్లో ఉన్న మేఘన్, నీలం రంగు సూట్లో ఉన్న హ్యారీని అతడి ఛాతీ మీద చేయి వేసి బాగా దగ్గరగా అనుకుని నిలుచున్నారు. మీడియాలో ఎక్కడా కనిపించని ఫొటో అది! ఆ ఫొటోను ఎక్కడ తీశారో తలియడం లేదు కానీ, బహుశా అది ఎంగేజ్మెంట్ టైమ్లోనిది కావచ్చని బ్రిటన్ నుంచి వెలువడే ‘హెల్లో’ మ్యాగజీన్ అంచనా వేస్తోంది. అయినా లోకం చూడని ఈ ఫొటో ఎలా బయటికి వచ్చింది? ఎలాగంటే.. ఆ పత్రిక నిండా డేగకళ్ల రిపోర్టర్లే! బుధవారంనాడు రాజమాతతో మాట్లాడేందుకు ఆస్ట్రేలియా హై కమిషనర్ జార్జి బ్రాండిస్ ఆమె అధికార నివాసానికి వెళ్లినప్పుడు ఆయనతో పాటు లోపలికి వెళ్లిన ఫొటోగ్రాఫర్ వాళ్లిద్దరినీ ఫొటో తీసే సందర్భాన్ని వాళ్లిద్దరి మధ్యలోంచి గదిలో టేబుల్ మీద కనిపిస్తున్న హ్యారీ, మేఘన్ల ఫొటోను ఫొటో తీసే అవకాశంగా మలుచుకున్నాడు. అదిప్పుడు నెవర్– బిఫోర్–సీన్ ఫొటోగా లోకమంతా రౌండ్లు కొడుతోంది. -
రాణిగారికీ రూల్స్ ఉన్నాయి!
బ్రిటన్ యువరాజు హ్యారీని హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ ఇటీవల వివాహమాడిన విషయం తెలిసిందే. యువరాజుని పెళ్లాడటంతో యువరాణి అయిపోయారు మేఘన్. సకల సౌకర్యాలు లభిస్తాయి అనుకోవడంలో ఎటువంటి సందేహాలు లేవు. వాటితో పాటుగా రాజ వంశీకులుగా కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయట ఈ యువరాణిగారికి. రాజకుటుంబంలో సభ్యురాలు అయ్యారు కాబట్టి మేఘన్ మార్కెల్ ఇక మీదట ఇంతకుముందులా మామూలు సిటిజన్ కాదు. రాజకుటుంబీకుల లైఫ్ స్టైల్కు, వాళ్ల పద్ధతులకు అలవాటు పడాలి. అందులో కొన్ని రూల్స్ ఈ విధంగా ఉంటాయని సమాచారం. సెల్ఫీలు తీసుకోవడం, ఆటోగ్రాఫ్లు ఇవ్వడం చేయకూడదు. సోషల్ మీడియాలో అకౌంట్లు ఉండకూడదు. డ్రెస్సింగ్ విషయానికి వస్తే మినీ–స్కర్ట్స్కు దూరంగా ఉండాలి. షెల్ ఫిష్ తినకూడదు. డిన్నర్ను రాత్రి 8.30 నుంచి 10లోపు ముగించేయాలి. మహారాణి కంటే ముందే నిద్రపోకూడదు. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు హస్బెండ్ హ్యారీ పక్కనే కూర్చోవాలి. కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చోకూడదు. కావాలంటే ఒకవైపు వాలుగా కాళ్లు పెట్టుకోవచ్చు. తన కంటే పై స్థాయిలోని వాళ్లు రూమ్లోకి రాగానే మర్యాదపూర్వకంగా గౌరవించాలి. ఇలాంటి కొన్ని నియమాలను రాజకుటుంబంలోకి వెళ్తున్నందుకు మార్కెల్ పాటించాలట. సో.. మార్కెల్ ఇక మీదట పాత మార్కెల్లా ఉండబోరన్నమాట. -
రాణిగారింటి పెళ్లికి మురికివాడల మైనా
మేఘన్ మెర్కెల్! కొత్త పెళ్లి కూతురు. ప్రిన్స్ హ్యారీ భార్య. ఏడాదిగా మెర్కెల్ గురించిన విశేషాలు ధారావాహికగా వచ్చాయి. బ్రిటన్ అంటేనే పెద్ద దేశం. అలాంటి పెద్ద దేశంలో, పెద్దింటికి కోడలిగా వెళ్తున్న అమ్మాయి అంటే సహజంగానే ప్రపంచానికి ఈ ‘సాధారణ యువతి’ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. ఎలా ప్రేమలో పడిందీ, పెళ్లి ఎప్పుడు నిశ్చయం అయిందీ అనే విశేషాల నుంచి.. ఆమెకున్న కాలిగ్రఫీ (సొగసైన చేతిరాతలో నైపుణ్యం) హాబీ వరకు మెర్కెల్ గురించి ప్రతిదీ ప్రధానంగా ఆకర్షించే అంశమే అయింది. మొత్తానికి శనివారం మెర్కెల్, హ్యారీల వివాహం ‘నిరాడంబరమైన వైభవం’తో జరిగింది. మన దేశం నుంచి ఒకరిద్దరికి మాత్రమే పెళ్లి పిలుపు అందింది. ఆ ఒకరిద్దరి లో ముంబై మురికివాడల్లో ఉన్న ‘మైనా’ అనే స్వచ్ఛంద మహిళా సంస్థ ప్రతినిధులు కూడా ఉన్నారు! ఆత్మీయ అతిథిగా ‘మైనా’! ప్రిన్స్ చార్లెస్ డయానాను పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్లిని నేరుగా కానీ, టీవీల్లో కానీ కోట్లాది మంది చూశారు. ఇప్పుడు డయానా చిన్న కొడుకు హ్యారీ పెళ్లికి కూడా అంతే ప్రాధాన్యం లభించింది. యువరాజు పెళ్లిని ఇంట్లో పెళ్లిలా ఇష్టంగా చూశారు మన దేశ ప్రజలు. అదేస్థాయిలో ఈ పెళ్లి కోసం ఎదురు చూశారు కూడా. ముంబయి డబ్బావాలాలైతే.. తమకు తెలిసిన వాళ్లతో మెర్కెల్కు పైథానీ చీర, హ్యారీకి కుర్తా, తలపాగాను బహుమతిగా పంపించారు. ఇక విశిష్ట అతిథుల కేటగిరీలో ప్రియాంక చోప్రా పెళ్లికి వెళ్లొచ్చారు. ఆత్మీయమైన అతిథిగా పైన మనం చెప్పుకున్న ‘మైనా’ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా కూడా ఇన్విటేషన్ అందుకున్నారు. ఆహ్వానం ఎలా వచ్చింది? గత ఏడాది జనవరిలో మేఘన్ మెర్కెల్ ముంబయికి వచ్చి ధారవీ బస్తీ మహిళలతో, ‘మైనా’ ప్రతినిధులతో కలివిడిగా కూర్చుని కబుర్లాడి వెళ్లారు. ‘మైనా’ ప్రత్యేక ఆహ్వానంపై ముంబై వచ్చిన మెర్కెల్.. స్త్రీ సాధికారత దిశగా పనిచేస్తున్న ఈ మహిళల నుంచి స్ఫూర్తి పొందారు. రాయల్ వెడ్డింగ్కి ‘మైనా’ ప్రతినిధులకు ఆహ్వానం అందడానికి ఇదే ప్రధాన కారణం. యువరాజు పెళ్లికి ఆహ్వానం అందుకున్న ఏడు విదేశీ ఎన్జీవోలలో మన ‘మైనా’ ఒకటి. మెర్కెల్ ఇండియాకి రావడానికి కారణం 23 ఏళ్ల సుహానీ జలోటా. సుహానీ యు.ఎస్.లోని డ్యూక్ యూనివర్సిటీ స్టూడెంట్. చురుకైన విద్యార్థి. ఎంటర్ప్రెన్యూరియల్ ఫెలోషిప్లో భాగంగా ముంబైలో ‘మైనా మహిళా ఫౌండేషన్’ ప్రారంభించింది. రుతుక్రమ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత పట్ల మహిళలకు అవగాహన కల్పించడం, పేద మహిళలకు తక్కువ ధరకు శానిటరీ ప్యాడ్స్ అందించడం ఈ ఫౌండేషన్ ఉద్దేశం. ప్యాడ్స్ తయారీ యూనిట్లో పని చేసే 15 మంది, వాటిని పంపిణీ చేసే యాభై మంది కూడా స్థానిక బస్తీ మహిళలే. ‘మైనా’ ఉన్న ధారవి బస్తీ ఆసియాలోనే అతి పెద్దది. ఈ ఫెలోషిప్ ప్రాజెక్టుకు 2015లో ‘కాలేజ్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకుంది సుహానీ. ఆ అవార్డుకి ఎంపికైన తొమ్మిది మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కో మెంటార్ను సూచించింది యూనివర్సిటీ. అలా సుహానీకి మెంటార్గా మెర్కెల్ వచ్చిందని అనుకుంటాం. కానీ కాదు! మెర్కెల్ ప్రత్యేక ఆసక్తి ఓ రోజు సుహానీ తన సహవిద్యార్థితోపాటు ఆమె మెంటార్ అయిన మెర్కెల్ని కలిసింది సుహానీ. ‘మైనా’ గురించి చెప్పినప్పుడు మెర్కెల్ ఎంతో ఆసక్తి చూపించారు. అలా మెర్కెల్ యు.ఎస్. నుంచి ముంబయి వచ్చారు. మైనా మహిళా ఫౌండేషన్లో శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్న బస్తీ మహిళలను కలిశారు. వాళ్లకు సూచనలివ్వడంతోపాటు, చేయగలిగినంత సహాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారామె. పెళ్లి ఆహ్వానానికి నాంది ఆ పరిచయమే. పెళ్లికి వచ్చే వాళ్లు వధూవరులకు బహుమతులు ఇవ్వవద్దని, ఆ డబ్బును ఫౌండేషన్లకు విరాళంగా ఇవ్వమని యువరాజు హ్యారీ, మేఘన్ ముందే ఆçహూతులను కోరారు. రాయల్ వెడ్డింగ్కి మైనా మహిళా ఫౌండేషన్తోపాటు మరో ఆరు చారిటీలకు కూడా ఆహ్వానం అందింది. అవన్నీ స్థానిక బ్రిటిష్ చారిటీలే. ‘‘రాజకుటుంబంలో జరిగే వివాహానికి ఆహ్వానం అందడం ఫెయిరీ టేల్ స్టోరీలాగా ఉందని’’ మైనా మహిళా ఫౌండేషన్ ప్రతినిధి రిషా రోడ్రిగ్స్ పొంగిపోయారు. ఈ పెళ్లికి సుహానీ జలోటాతోపాటు మరో ముగ్గురు ‘మైనా’ మహిళలు కూడా బ్రిటన్కి వెళ్లారు. అరుదైన గౌరవం ఇది. -
రాకుమారుడికి కుర్తా...రాణిగారికి చీర
ముంబై : బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్ మార్కల్(36)ల వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. బ్రిటన్లోని బెర్క్షైర్ కౌంటీ విండ్సర్లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. వారిలో మనదేశానికి చెందిన బాలీవుడ్ నటి ప్రియాంరా చోప్రాతో పాటు ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘మైనా మహిళా ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా కూడా హాజరయ్యారు. వివాహ వేడుక సందర్భంగా ఈ జంటకు వివిధ దేశాల నుంచి బహుమతులు అందుతుండగా, వాటిలో మన దేశానికి చెందినవి కూడా ఉన్నాయ. ఈ రాయల్ వెడ్డింగ్కు మన దేశం నుంచి ముంబైకి చెందిన డబ్బావాలాలు, భారతీయ ‘పెటా’ సంస్థ బహుమతులు పంపారు. చీరను పంపిన డబ్బా వాలాలు.... ముంబైకి చెందిన డబ్బావాలలతో బ్రిటన్ రాజ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. 2003 భారతదేశ పర్యటనకు వచ్చిన ప్రిన్స్ చార్లెస్కు తొలిసారి డబ్బావాలలతో పరిచయం ఏర్పడింది. డబ్బావాలాల పనితీరు, సమయ పాలన, నిబద్థత ప్రిన్స్ చార్లెస్ను ఎంతో ఆకట్టుకున్నాయి. వారి పనితీరును మెచ్చుకోవడమే కాక తన వివాహ వేడుకకు డబ్బావాలాలను కూడా ఆహ్వానించాడు చార్లెస్. నాటినుంచి డబ్బావాలాలకు రాజకుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అయితే ప్రస్తుతం జరిగిన మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీల వివాహానికి వీరిని ఆహ్వానించలేదు. అయినప్పటికీ ప్రిన్స్ చార్లెస్తో ఉన్న అనుబంధం దృష్ట్యా నిన్న జరిగిన ప్రిన్స్ హ్యారీ వివాహానికి డబ్బావాలాల తరుపున వీరు ప్రత్యేక బహుమతులు పంపారు. రాకుమారుడు హ్యారీ కోసం కుర్తా, తలపాగాను, మేఘనా మార్కల్ కోసం పసుపు, ఆకుపచ్చ రంగుల కలయికలో ఉన్న ‘పైథానీ’ చీరను బహుమతిగా పంపారు. అంతేకాక వివాహ వేడుక సందర్భంగా ముంబై ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగుల కుటుంబాలకు మిఠాయిలు పంచారు. ఈ విషయం గురించి డబ్బావాలా అసోసియేషన్ ప్రతినిధి సుభాష్ తాలేకర్ ‘గతంలో ప్రిన్స్ చార్లెస్ వివాహానికి మమ్మల్ని ఆహ్వానించారు. ఆ వేడకకు హాజరయిన మమ్మల్ని సాదరంగా ఆదరించిడమే కాక మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అందుకే ప్రిన్స్ హ్యారీ వివాహా వేడుకకు మమ్మల్ని ఆహ్వానించనప్పటికి, మేము మా సంతోషాన్ని తెలపాలనుకున్నాం. అందుకే ఇలా మా తరఫున బహుమతులు పంపామ’న్నారు. పెటా బహుమతి ‘మెర్రి’... డబ్బావాలాలతో పాటు ‘పెటా’(పిపుల్ ఫర్ ద ఎథికల్ ట్రిట్మెంట్ ఆఫ్ ద అనిమల్స్) కూడా మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీల వివాహానికి బహుమతి పంపింది. వీరి వివాహానికి గుర్తుగా ‘పెటా’ ఒక ఎద్దుకు వీరిద్దరి పేర్లు కలిసేలా ‘మెర్రి’(మేఘన్లో మె, హ్యారీలో రి కలిపి మెర్రి) అనే పేరును పెట్టి, ఆ ఎద్దు ఫోటో తీసి దానితో పాటు ఒక సందేశాన్ని కూడా పంపారు. ‘మెర్’రి(ఎద్దు) ని పూలమాలతో అలంకరించి ఫోటో తీసారు. ఫోటోతో పాటు పంపిన సందేశంలో మెర్రి కథను తెలియజేసారు. ఆ సందేశంలో ‘కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలో గాయలతో, ఒంటరితనంతో బాధపడుతున్న మెర్రిని చూడటం జరిగింది. పాపం అది తన జీవిత కాలమంతా బరువులను మోస్తూ సేవ చేసింది. వయసు పైబడి, అనారోగ్యంతో బాధపడుతున్న మెర్రిని ఇప్పుడిలా ఒంటరిగా వదిలేసారు. మేము ‘మెర్రి’ బాధ్యతను తీసుకుని, దానికి వైద్యం చేయించి ఒక సంరక్షణా కేంద్రానికి తరలించాము. ప్రస్తుతం ‘మెర్రి’ సంరక్షణా కేంద్రంలో విశ్రాంతి తీసుకుంటూ తన మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతుంద’ని తెలిపారు. ‘ఈ రాయల్ వెడ్డింగ్ సందర్భంగా జనాలకు మూగ జీవుల పట్ల దయగా వ్యవహరించాలనే సందేశాన్ని ప్రచారం చేయాలని భావించాము...అందుకే మెర్రి(ఎద్దు) ఫొటోను బహుకరించామ’ని పెటా అసోసియేట్ డైరెక్టర్ సచిన్ బంగోరా తెలిపారు. -
ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ల వివాహ వేడుక
-
రాయల్ వెడ్డింగ్ : ఒక్కటైన వధూవరులు
ఎన్నో రోజులుగా ప్రపంచవ్యాప్త అభిమానులను ఊరిస్తున్న రాయల్ వెడ్డింగ్ విండ్సర్ క్యాజిల్లో కన్నుల పండువగా జరిగింది. వరుడు ప్రిన్స్ హ్యారీ, వధువు మేఘన్ మార్కెల్లు ముసిముసి నవ్వులతో రింగులు మార్చుకుని ఒక్కటయ్యారు. మేఘన్, ప్రిన్స్లను భార్యభర్తలుగా జస్టిన్ వెల్బీ అధికారికంగా ప్రకటించారు.వీరి వివాహ వార్త అధికారికంగా ప్రకటించగానే చాపెల్ వెలుపల సంబురాలు ప్రారంభయ్యాయి. వేడుకకు ముందు.... ప్రిన్స్ను మనువాడేందుకు మేఘన్ చర్చిలోకి రాగానే వివాహానికి వచ్చిన అతిథులందరూ లేచి నిల్చున్నారు. రాయల్ వెడ్డింగ్కు వధువు తండ్రి థామస్ రాలేకపోవడంతో, వరుడు తండ్రి ప్రిన్స్ ఛార్లెస్ ఆమెకు తండ్రిగా విండ్సర్ క్యాజిల్లోకి నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ వివాహానికి భారీ ఎత్తున్న అతిథులు హజరయ్యారు. ఈ వేడుకలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా, డేవిడ్, విక్టోరియా బెక్హాం, జార్జ్, అమల్, టెన్నీస్ స్టార్ సెరెనా విలియమ్స్లు కూడా పాల్గొన్నారు. వివాహ వేడుకతో విండ్సర్ క్యాజిల్ చర్చి వీధులన్నీ గానా బజానాలతో, అతిథులతో కిటకిటలాడాయి. మేఘన్ మార్కెల్, బ్రిటీష్ డిజైనర్ క్లేర్ వెయిట్ కెల్లర్ డిజైన్ చేసిన డ్రెస్ను ధరించారు. ప్రిన్స్ హ్యారీ రింగ్ ప్లాటినం బాండ్తో ఉండగా... మార్కెల్ వెడ్డింగ్ రింగ్ వెల్ష్ గోల్డ్తో రూపొందినట్టు కెన్సింగ్టన్ ప్యాలెస్ చెప్పింది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్లకు బ్రిటన్ ప్రధాని థెరెస్సా మే ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇందు మూలముగా తెలియజేయడం ఏమనగా.. బ్రిటన్ మహారాణి రెండవ ఎలిజబెత్ తన చిన్న మనవడు ప్రిన్స్ హ్యారీ వివాహానికి సమ్మతించారహో..’ బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి మొన్న శనివారమే ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. వీరి వివాహ వేడుక నేడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. -
బ్రిటన్ రాకుమారుడి పెళ్లి... ముంబైలో షాపింగ్
సాక్షి, ముంబై : బ్రిటన్ రాకుమారుడు హ్యారి, రాకుమారి మెఘాన్ మార్కల్ గురువారం ముంబైలో షాపింగ్ చేశారు. అయితే వారి పెళ్లికి సంబంధించిన ఈ షాపింగ్లో ముంబై డబ్బావాలాలు కూడా పాల్గొన్నారు. బ్రిటన్ రాకుమారిడి కుటుంబానికి, డబ్బావాలా వారికి అనుబంధం 2003లో మొదలైంది. ప్రిన్స్ చార్లెస్ తొలిసారిగా 2003లో ముంబైకి వచ్చారు. అప్పుడు వారి పనితనాన్ని, పని పట్ల వారికి ఉన్న నిబద్ధతను చూసి ముగ్దుడైపోయారు. 2005లో జరిగిన చార్లెస్, కెమిల్లా పార్కర్ వివాహానికి హాజరు కావల్సిందిగా డబ్బావాలాలను ఆహ్వానించారు. ప్రస్తుతం హ్యారి పెళ్లి షాపింగ్కు ఈ డబ్బావాలాలు కూడా హాజరయ్యారు. సంప్రదాయ దుస్తులైన కుర్తా పైజామా, పెళ్లి చీరలు, మంగళసూత్రం, ఆకుపచ్చ గ్లాస్ గాజులను రాకుమారుడి దంపతులకు బహూకరించనున్నట్లు ముంబై డబ్బావాలా అసోసియేషన్ అధికారి ప్రతినిధి సుభాశ్ తలెకర్ తెలిపారు. ఈ పెళ్లి సందర్భంగా ముంబైలోని ప్రభుత్వాసుపత్రిల్లో స్వీట్లు పంచుతామని డబ్బావాలాలు చెప్పారు. 33 ఏళ్ల హ్యారి, 36 ఏళ్ల మార్కల్ను మే 19న వివాహాం చేసుకోబోతున్నారు. -
రాయల్ వెడ్డింగ్లో మేఘన్కు లోటు...
లాస్ ఏంజెల్స్ : బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలకు ఎంతో ప్రత్యేకమైన ఈ వేడుకలో మేఘన్ను మాత్రం ఓ లోటు వెంటాడనుంది. ఈ నెల(మే) 19న లండన్లో అత్యంత వైభవంగా జరిగే పెళ్లి వేడుకకు మేఘన్ తండ్రి థామస్ మార్కెల్ హాజరుకావడం లేదని ఓ వెబ్సైట్ పేర్కొంది. గత వారం గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన మేఘన్ తండ్రి థామస్ను ప్రస్తుతం డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా హెచ్చరించారు. 74 ఏళ్ల థామస్కు బుధవారం హార్ట్ సర్జరీ జరగనున్న నేపథ్యంలో ఆస్పత్రి నుంచి కదలకూడదని వైద్యులు చెప్పడంతో కూతురు పెళ్లికి హాజరుకాలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన మెక్సికోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం మేఘన్ సవతి సోదరుడు రాసిన లేఖ మరోసారి చర్చనీయాంశమైంది. 'మేఘన్ మార్కెల్ మీకు తగిన వధువు కాదు. ఆమె నిజ స్వరూపం మీకు తెలియదు. ఆమె మా నాన్నను ఒంటరిగా మెక్సికోలో వదిలేసి వెళ్లిపోయింది. మేఘన్ను నటిని చేసేందుకు నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. అప్పులు కూడా చేశారు. ఆమె నటి అయిన తర్వాత కూడా నాన్న అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిందో మేఘన్ మరిచి పోయింది. నటి అయ్యాక కుటుంబం కష్టాలు తీర్చాల్సిన బాధ్యతలను గాలికొదిలేసిన మేఘన్.. ఉన్నత కుటుంబంలో వ్యక్తి అయ్యాక ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. పెళ్లికి రావాలంటూ తెలియని వారికి కూడా ఆహ్వానాలు పంపుతోంది. కానీ మా కుటుంబంలో ఒక్కరికీ కూడా వివాహ ఆహ్వానం అందలేదని’ అతడు లేఖలో పేర్కొన్నాడు. -
పెళ్లి ఆపేయ్.. రాయల్ ఫ్యామిలీ చారిత్రక తప్పిదం!
లండన్: ఓవైపు బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ల వివాహానికి రాజకుటుంబీకులు ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు పెళ్లి ఆపేయాలంటూ వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. ప్రిన్స్ హ్యారీకి ఆ లేఖ రాసింది మరెవరో కాదు.. మేఘన్ మార్కెల్ సవతి సోదరుడు థామస్ మార్కెల్. ఇప్పటికీ మించి పోయిందేంలేదు.. పెళ్లి ఆపేస్తే మీ కుటుంబానికి మంచిదంటూ హ్యారీని థామస్ హెచ్చరించాడు. ఈ నెల 19న లండన్లోని విండ్సర్ క్యాజిల్లో జరగబోయే రాయల్ వెడ్డింగ్కు ఇప్పటికే ఆహ్వానాలు అందజేశారు. కానీ ఈ నేపథ్యంలో మేఘన్ సోదరుడు రాసిన లేఖ చర్చనీయాంశమైంది. 'మేఘన్ మార్కెల్ మీకు తగిన వధువు కాదు. ఆమె నిజ స్వరూపం మీకు తెలియదు. ఆమె మా నాన్నను ఒంటరిగా మెక్సికోలో వదిలేసి వెళ్లిపోయింది. మేఘన్ను నటిని చేసేందుకు నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. అప్పులు చేశారు. ఆమె నటి అయిన తర్వాత కూడా నాన్న అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెళ్లికి రావాలంటూ తెలియని వారికి కూడా ఆహ్వానాలు పంపుతోంది. కానీ మా కుటుంబంలో ఒక్కరికీ కూడా వివాహ ఆహ్వానం అందలేదు. ఒక వేళ ఆమెను మీ ఇంటి సభ్యురాలిగా చేసుకుంటే రాజకుటుంబం గౌరవ, మర్యాదలు మంటకలిసిపోతాయి. పెళ్లితో రెండు కుటుంబాలు దగ్గరవుతాయి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. మా కుటుంబానికి మేఘన్ చాలా దూరంగా ఉంటోంది. ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిందో మేఘన్ మరిచి పోయింది. ఆమె ఎప్పటికీ నాకు చెల్లెలే. కానీ తన కుటుంబాన్ని, సన్నిహితులను వదిలేసుకుంది. ఎందుకంటే.. మేం సినిమా నిర్మాతలం కాదు. నటి అయ్యాక కుటుంబం కష్టాలు తీర్చాల్సిన బాధ్యతలను గాలికొదిలేసిన మేఘన్.. ఉన్నత కుటుంబంలో వ్యక్తి అయ్యాక ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలని' అని మేఘన్ సోదరుడు థామస్ ప్రిన్స్ హ్యారీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి
‘పెళ్లయ్యాక నువ్వు మొత్తం మారిపోయావు!’ అనే మాటలు బాగా వినిపిస్తుంటాయి స్నేహితుల మధ్య. నిజమే మరి! పెళ్లైపోతే ప్రియారిటీలు, ప్రపంచాలూ మారిపోతాయి. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మేఘన్ మార్కెల్ పెళ్లి చేసుకోబోతోంది. మే 19న పెళ్లి. అదీ ప్రిన్స్ హ్యారీతో. బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీలో పెళ్లంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచ దేశాల పెద్దలంతా ఈ వేడుక కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాల్లో సూపర్స్టార్డమ్ అనుభవించిన మేఘన్, పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమవుతున్నట్టు చెప్పింది. దీంతో ఆమెను ఫ్యాన్స్ ఇప్పట్నుంచే మిస్ అవుతూంటే, బెస్ట్ఫ్రెండ్ ప్రియాంక చోప్రా కూడా అంతే మిస్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇండియన్ సినిమాలో సూపర్స్టార్ అనిపించుకొని ఇప్పుడు హాలీవుడ్లోనూ మెప్పిస్తోన్న ప్రియాంకా చోప్రా, మేఘన్ మార్కెల్ ఎప్పట్నుంచో మంచి ఫ్రెండ్స్. ‘నాకు బెస్ట్ఫ్రెండ్ లాంటిది మేఘన్’ అని చెప్తుంది ప్రియాంక. తాజాగా మేఘన్ పెళ్లి చేసుకోబోతోందంటే ప్రియాంక కూడా ఎమోషనల్ అయిపోతోంది. ఆమెకు స్వయంగా ఒక లెటర్ కూడా రాసి పంపింది. ‘ ‘బిర్యానీ, పౌటిన్లు తింటూ లెక్కలేనని కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఈ మధ్యలోనే తనేంటో తెలుసుకోవడం ఎంత బాగుండేదో! ప్రపంచం గురించి, మనుషుల గురించి, చాలా విషయాల గురించి ఆలోచిస్తుంది మేఘన్. ఈ ప్రిన్సెస్కి ఇప్పుడు ప్రిన్స్ దొరికేశాడు. తన ప్రేమ జీవితం, పెళ్లి జీవితం అద్భుతంగా ఉండాలి. తనెప్పుడూ హ్యాపీగా ఉండాలి.’’ అంటూ ప్రియాంక రాసిన ఈ లెటర్ వాళ్లిద్దరి క్యూట్ ఫ్రెండ్షిప్ను చెప్పకనే బలంగా చెప్పేస్తోంది. ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్, మేఘన్ పెళ్లి తర్వాత కూడా ఇంతే క్యూట్గా ఉండిపోవాలని, మనమూ కాస్త సరదాగా, ఇంకాస్త ఇష్టంగా కోరుకుందాం!! -
ఆ పెళ్లికి ట్రంప్ను ఆహ్వానించలేదు...
లండన్ : బ్రిట్రీష్ యువరాజు, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ప్రిన్స్ హారీ వివాహానికి బ్రిటన్ ప్రెసిడెంట్ థెరిసా మేకు, అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్కు ఆహ్వానం అందలేదు. కారణమేంటంటే ప్రిన్స్ హారీ - మేఘన్ మార్కెల్ల వివాహానికి కేవలం రాజవంశం, మేఘనల కుటుంబాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారిని మాత్రమే ఆహ్వానించాలనుకుంటున్నట్లు రాజ ప్రసాదం వారు ప్రకటించారు. రాజకీయ నాయకులేవరిని ఈ వివాహ వేడుకకు ఆహ్వానించలేదని తెలిపారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు బ్రిటన్ రాజ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికి ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను ఆహ్వానించకుండా ఒబామాను ఆహ్వానించడం బాగుండదనే ఉద్ధేశంతో ఒబామాను కూడా ఆహ్వానించలేదు. ఎందుకంటే బ్రిటన్ రాజ్యంగం చాలా సున్నితమైనది. దాని ప్రకారం బ్రిటన్ ప్రభుత్వం చేసే కార్యకలపాలు బ్రిటన్ రాజ్యంగ సమతౌల్యాన్నీ కాపాడుతూ విదేశీ వ్యవహరాలను సమీక్షించుకోవాలని బ్రిటన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అందువల్లే ఈ వివాహ వేడుకను కేవలం బంధువలు, సన్నిహితుల సమక్షంలోనే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఒక వేళ బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మేను ఆహ్వానించినా ఆమె వస్తుందని నమ్మకం లేదని బ్రిటీష్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.హారీ సోదరుడు కేట్ మిడిల్టన్ వివాహం 2011లె వెస్ట్ మినిస్టర్ అబేలో జరిగింది. ఆ వేడుకకు చాలా మంది ప్రభుత్వ పెద్దలు హజరయ్యారు. అయితే ప్రస్తుతం హారీ వివాహ వేడుక విండ్సర్ కాస్టెల్ జరగనుంది. వైశాల్యంలో వెస్ట్ మినిస్టర్ అబేతో పోల్చితే విండ్సర్ కాస్టెల్ చాలా చిన్నది. హారీ - మేఘనల వివాహం మే 19న జరగనున్న సంగతి తెలిసిందే.