Russia attacks
-
చెర్నోబిల్ రియాక్టర్పై రష్యా డ్రోన్ దాడి
కీవ్: తమ రాజధాని కీవ్ ప్రాంతంలో ఉన్న చెర్నోబిల్ అణువిద్యుత్ ప్లాంట్ రక్షణ కవచంపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. శక్తివంతమైన పేలుడు పదార్థాలతో గురువారం రాత్రి జరిపిన ఈ దాడితో ప్రొటెక్టివ్ కంటెయిన్మెంట్ షెల్ దెబ్బతిందని, మంటలు చెలరేగాయని ఆయన చెప్పారు. అయితే, ఈ ఘటనతో ఆ ప్రాంతంలో రేడియో ధార్మిక స్థాయిలు సాధారణంగానే ఉన్నాయన్నారు. మంటలను అదుపు చేశామన్నారు. పుతిన్ చర్చలకు సిద్ధంగా లేరన్న విషయం దీనినిబట్టి అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఘటనకు రష్యాను బాధ్యురాలిగా చేయాలన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దాడి సమాచారాన్ని అమెరికాతో పంచుకుంటామని జెలెన్స్కీ చెప్పారు. ఈ ఘటనను అంతర్జాతీయ అణు శక్తి ఏజెన్సీ(ఐఏఈఏ) ధ్రువీకరించింది. అయితే, దాడిలో రక్షణ కవచం దెబ్బతిన్నట్లుగా ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదని వివరించింది. అణు రియాక్టర్కు బయటివైపు రక్షణగా 2016లో అత్యంత భారీ కాంక్రీట్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద 1986 చెర్నోబిల్ దుర్ఘటన జరిగినప్పుడే లోపలి వైపు రక్షణ ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. వీటివల్ల ప్రమాదకరమైన రేడియో ధార్మికత బయటకు లీక్ అయ్యేందుకు అవకాశం లేదు. కాగా, జెలెన్స్కీ ఆరోపణలపై రష్యా తీవ్రంగా స్పందించింది. అణు వ్యవస్థలు, అణు విద్యుత్ ప్లాంట్లపై దాడులు జరిగాయంటూ ఉక్రెయిన్ చెప్పేదంతా అబద్ధమని కొట్టిపారేసింది. తమ సైన్యం ఇలాంటివి చేయదని రష్యా అధ్యక్ష భవనం ప్రతినిధి దిమిత్రీ పెష్కోవ్ స్పష్టం చేశారు. శాంతి ఒప్పందం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో చర్చలకు అవరోధం కలిగించేందుకు ఉక్రెయినే ఇలాంటివి చేయిస్తోందని ఆరోపించారు. -
ఆగని రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం జపోరిఝియా ప్రాంతంలోని పట్టణంపై రష్యా ప్రయోగించిన మిస్సైల్ దాడిలో 13 మంది ఉక్రేనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 30 మంది గాయాలపాలయ్యారని రీజనల్ గవర్నర్ ఇవాన్ ఫెడరోవ్ తెలిపారు. రక్తమోడుతున్న పౌరులను నగర వీధిలో రోడ్డుపైనే ప్రథమ చికిత్సనందిస్తున్న దృశ్యాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన టెలిగ్రామ్ సోషల్మీడియా ఖాతాలో పోస్ట్చేశారు. ‘‘కేవలం సాధారణ పౌరులున్న సిటీపై దాడి చేస్తే అమాయకులు చనిపోతారని తెలిసీ రష్యా దారుణాలకు ఒడిగడుతోంది’’అని జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గత మూడేళ్లుగా తరచూ రష్యా గగనతల దాడులతో ఉక్రేనియన్ల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత యూరప్లో అతిపెద్ద సంక్షోభంగా మారిన ఈ యుద్ధంలో ఇప్పటిదాకా వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. -
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి
కీవ్: ఉక్రెయిన్ సైనిక మౌలిక వసతులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా శుక్రవారం 93 క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడికి తెగబడింది. ఏకంగా 200 డ్రోన్లతో దాడి చేసింది. గత మూడేళ్లలో రష్యా ఒకే రోజులో చేసిన అతిపెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా నుంచి దూసుకొచ్చిన వాటిల్లో 11క్రూయిజ్ క్షిపణులుసహా 81 మిస్సైళ్లను పశి్చమదేశాలు అందించిన ఎఫ్–16 యద్ధవిమానాల సాయంతో నేలమట్టంచేశామని ఆయన చెప్పారు. ‘‘ పెనుదాడులతో ఉక్రేనియన్లను భయపెడుతున్న రష్యాకు, పుతిన్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. పెద్ద ప్రతిఘటన, భారీ ఎదురుదాడితో రష్యా ఉగ్రచర్యలను అడ్డుకుందాం’’ అని జెలెన్స్కీ తన టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా చెప్పారు. ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామికవాడల్లో ఇంధన, శక్తి వనరులు, మౌలిక వసతులను ధ్వంసంచేయడమే లక్ష్యంగా తమ సైన్యం దాడులు చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమ బొగ్గు విద్యుత్ ఉత్పత్తికేంద్రాలకు భారీ నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్లోని అతిపెద్ద ప్రైవేట్ విద్యుత్ సంస్థ డీటెక్ తెలిపింది. ఉక్రెయిన్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారీని నిలువరించడమే లక్ష్యంగా ఇంధన వ్యవస్థలపైనే రష్యా తరచూ దాడులుచేస్తుండటం తెల్సిందే. నవంబర్ 28న చేసిన ఇలాంటి దాడిలో 200 మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. నాటి నష్టం కారణంగా 10 లక్షల కుటుంబాలు అంధకారంలో ఉండిపోయాయి. -
యుద్ధానికి తెర దించేందుకు..రష్యా రెడీ!
రెండున్నరేళ్లు దాటిన యుద్ధం. కనీవినీ ఎరగని విధ్వంసం. ఇరువైపులా లెక్కకైనా అందనంత ఆస్తి, ప్రాణనష్టం. యుద్ధంలో నిజమైన విజేతలంటూ ఎవరూ ఉండరని ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నిరూపిస్తోంది. అగ్ర రాజ్యపు అపార ఆర్థిక, సాయుధ సంపత్తి ముందు ఏ మూలకూ చాలని ఉక్రెయిన్ యుద్ధంతో కకావికలైంది. ఆర్థికంగా, సైనికంగా మాత్రమే గాక జనాభాపరంగా, అన్ని రకాలుగానూ దశాబ్దాలు గడిచినా కోలుకోలేనంతగా నష్ట పోయింది. అమెరికా, యూరప్ దేశాల ఆర్థిక, సాయుధ దన్నుతో నెట్టుకొస్తున్నా ట్రంప్ రాకతో ఆ సాయమూ ప్రశ్నార్థకంగా మారేలా కన్పిస్తోంది. అదే జరిగితే చేతులెత్తేయడం మినహా దాని ముందు మరో మార్గం లేనట్టే. ఇంతటి యుద్ధం చేసి రష్యా కూడా సాధించిన దానికంటే నష్టపోయిందే ఎక్కువ. అందులో ముఖ్యమైనది సైనిక నష్టం. యుద్ధంలో ఇప్పటికే ఏకంగా 2 లక్షల మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి! దీనికి తోడు కనీసం మరో 5 లక్షల మంది సైనిక విధులకు పనికిరానంతగా గాయపడ్డట్టు సమాచారం. ఇది ఆ దేశానికి కోలుకోలేని దెబ్బే. యువతను నిర్బంధంగా సైన్యంలో చేర్చుకునే ప్రయత్నాలూ పెద్దగా ఫలించడం లేదు. యుద్ధ భూమికి పంపుతారనే భయంతో రష్యా యువత భారీ సంఖ్యలో వీలైన మార్గంలో దేశం వీడుతోంది. దాంతో సైనికుల కొరత కొన్నాళ్లుగా రష్యాను తీవ్రంగా వేధిస్తోంది. మరో దారి లేక సైన్యం కోసం ఉత్తర కొరియా వంటి దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి! దీనికి తోడు సుదీర్ఘ యుద్ధం కారణంగా ప్రధానమైన ఆయుధ నిల్వలన్నీ దాదాపుగా నిండుకోవడంతో రష్యాకు ఎటూ పాలుపోవడం లేదు. ఉక్రెయిన్పై సైనిక చర్యను ఇంకా కొనసాగించే విషయంలో స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే రుజువైంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి ఏదో రకంగా తెర పడాలని ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా కోరుకుంటున్నట్టు సమాచారం. ఇటీవలి పుతిన్ ఉన్నత స్థాయి భేటీలో ఈ అంశమూ చర్చకు వచ్చిందంటున్నారు.ఇవీ షరతులు...→ భూతల యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యానికి గతంలోలా కొన్నాళ్లుగా పెద్దగా ప్రతిఘటన ఎదురవడం లేదు.→ దాంతో నెనెట్స్క్ తదితర ఉక్రెయిన్ భూభాగాల్లోకి రష్యా నానాటికీ మరింతగా చొచ్చుకుపోతోంది.→ కానీ ఇందుకు చెల్లించుకోవాల్సి వస్తున్న సైనిక, ఆయుధ మూల్యం తదితరాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఆలోచనలో పడేసినట్టు వార్తలొస్తున్నాయి. ఏదోలా ఉక్రెయిన్పై యుద్ధానికి తెర దించేందుకే ఆయన మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.→ కొన్ని ప్రధాన షరతులకు ఉక్రెయిన్ అంగీకరించే పక్షంలో యుద్ధా్దన్ని నిలిపేసేందుకు పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.→ ఆక్రమిత ప్రాంతాలకు తోడు మరింత భారీ భూభాగాన్ని ఉక్రెయిన్ తమకివ్వాలని పుతిన్ పట్టుబడుతున్నారు.→ అది కనీసం అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన వర్జీనియా పరిమాణంలో ఉండాలని కోరుతున్నారు.→ ఉక్రెయిన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో సభ్యత్వం ఇవ్వరాదని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ డిమాండ్ను నాటో పరిగణనలోకే తీసుకోవద్దని కోరుతున్నారు. యుద్ధంలో మరణించిన రష్యా సైనికులు: 1.5 లక్షల నుంచి 2లక్షలుగాయపడ్డ సైనికులు: 5 లక్షల పైచిలుకువామ్మో సైన్యం!రష్యా యువతలో వణుకుసైన్యంలో చేరడమనే ఆలోచనే రష్యా యువతకు పీడకలతో సమానం! కొత్తగా చేరేవారిని వేధించడంలో రష్యా సైనికుల ట్రాక్ రికార్డు సాధారణమైనది కాదు! రిటైరైన తర్వాత కూడా వాటిని గుర్తుకు తెచ్చుకుంటూ వణికిపోయే పరిస్థితి! వాటి బారిన పడే బదులు బతికుంటే బయట బలుసాకైనా తినొచ్చని రష్యా యూత్ భావిస్తుంటారు. డెడొవ్షినా అని పిలిచే ఈ వేధింపుల జాఢ్యం ఇప్పటిది కాదు. రష్యా సైన్యంలో 17వ శతాబ్దం నుంచే ఉందని చెబుతారు. దీనికి భయపడి రష్యా యువత సైన్యంలో చేరకుండా ఉండేందుకు వీలైనంతగా ప్రయత్నిస్తుంటుంది. ఉక్రెయిన్ యుద్ధంలో కనీవినీ ఎరగనంత సైనిక నష్టం జరుగుతుండటంతో భారీగా రిక్రూట్మెంట్కు రష్యా రక్షణ శాఖ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. యువతీ యువకులకు వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా సైన్యంలో చేరాలని పేర్కొనే ‘డ్రాఫ్ట్ నోటీస్’ పంపిస్తోంది. దాంతో సైనిక జీవితాన్ని తప్పించుకునేందుకు రష్యా యువత లక్షలాదిగా విదేశాల బాట పట్టారు. అలా వెళ్లలేని వారిలో చాలామంది ఫేక్ మెడికల్గా అన్ఫిట్ సర్టిఫికెట్లు సమర్పిస్తుంటారు. ఆ క్రమంలో అవసరమైతే తమ ఎముకలు తామే విరగ్గొట్టుకుంటారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! దాంతో చెచెన్యా, యకుట్జియా, దగెస్తాన్ వంటి సుదూర ప్రాంతాల నుంచి సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన యువతను రక్షణ శాఖ కొన్నాళ్లుగా ప్రధానంగా టార్గెట్ చేస్తోంది. ఖైదీలను నిర్బంధంగా సైన్యంలో చేరుస్తోంది. ఇలాంటి వారిని సైన్యంలో దారుణంగా చూస్తున్నారు. చనిపోతే మృతదేహాలను గుర్తించి గౌరవప్రదంగా కుటుంబీకులకు అప్పగించే పరిస్థితి కూడా ఉండటం లేదు! దీనికి తోడు రష్యాలో మామూలుగానే సైనికులు దారుణమైన పరిస్థితుల్లో పని చేయాల్సి ఉంటుంది. వారికి అత్యంత అవసరమైన పౌష్టికాహారానికే దిక్కుండదు! పైగా సరైన వైద్య సదుపాయమూ అందదు. సంక్షేమం దేవుడెరుగు, చివరికి సైనికుల భద్రతకు కూడా ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యమివ్వదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మామూలు సమయాల్లోనే పరిస్థితి ఇలా ఉంటుందంటే ఇక యుద్ధ సమయాల్లోనైతే సైనికుల భద్రత, సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ సర్కారు అక్షరాలా గాలికే వదిలేస్తుంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
15 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. కారణం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న మొత్తం 275 కంపెనీలకు సంబంధించి ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా భారత్, చైనా, స్విట్జర్లాండ్, తుర్కియేకు చెందిన సంస్థలుండడం గమనార్హం.ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు సైనికపరంగా ప్రత్యేక్షంగా, పరోక్షంగా సాయం చేస్తున్న కంపెనీలపై అమెరికా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 275 కంపెనీలు రష్యాకు సహకరిస్తున్నాయని అమెరికా భావిస్తోంది. దాంతో ఉక్రెయిన్కు నష్టం వాటిల్లుతున్నట్లు అమెరికా అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టినట్లు యూఎస్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: డ్రోన్ కొనుగోలుకు రూ.8 లక్షలు సాయంఅమెరికా ఆంక్షలు విధించిన భారత్కు చెందిన 15 కంపెనీల జాబితాను విడుదల చేశారు. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.అభర్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్డెన్వాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ఎమ్సిస్టెక్గెలాక్సీ బేరింగ్స్ లిమిటెడ్ఆర్బిట్ ఫిన్ట్రేడ్ ఎల్ఎల్పీఇన్నోవియో వెంచర్స్కేడీజీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ఖుష్బూ హోనింగ్ ప్రైవేట్ లిమిటెడ్లోకేష్ మెషీన్స్ లిమిటెడ్పాయింటర్ ఎలక్ట్రానిక్స్ఆర్ఆర్జీ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్షార్ప్లైన్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్శ్రీఘీ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్శ్రేయ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ -
గూగుల్ ఆస్తులమ్మినా తీరనంత జరిమానా!
గూగుల్కు రష్యా కోర్టు భారీ షాకిచ్చింది. 20 డెసిలియన్ డాలర్లు (20,000,000,000,000,000,000,000,000,000,000,000 డాలర్లు) జరిమానా చెల్లించాలని మాస్కో కోర్టు టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ను ఆదేశించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభ సమయంలో సంస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఇందుకు కారణమని కోర్టు తెలిపింది. ఈమేరకు రష్యా మీడియా సంస్థ ఆర్బీసీ(రాస్బైజెన్స్ కన్సల్టింగ్) వివరాలు వెల్లడించింది.ఆర్బీసీ తెలిపిన వివరాల ప్రకారం..‘మాస్కో కోర్టు గూగుల్కు భారీ జరిమానా విధించింది. కంపెనీ 20 డెసిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ రష్యాకు చెందిన 17 టీవీ ఛానెళ్లు, మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022లో ఉక్రెయిన్పై దాడికి ఆదేశించిన తర్వాత ఈ ఛానెళ్లపై వేటు వేశారు. అందుకు వ్యతిరేకంగా మీడియా ఛానళ్లు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు న్యాయపరమైన అంశాలకు లోబడి గూగుల్కు భారీ జరిమానా విధించింది. కోర్టు తీర్పు ప్రకారం గూగుల్ బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లను తొమ్మిది నెలల్లోపు పునరుద్ధరించవలసి ఉంటుంది’ అని పేర్కొంది.‘గూగుల్ మరింత మెరుగవ్వాలి’క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ అంశంపై మాట్లాడారు. ‘గూగుల్పై నిర్దిష్టంగా ఎంతమొత్తం జరిమానా విధించారో కచ్చితంగా చెప్పలేను. గూగుల్ మా దేశ కంపెనీలపై ఆంక్షలు విధించడం సరైన విధానం కాదు. మీడియా సంస్థలు, బ్రాడ్కాస్టర్ల హక్కులను హరించకూడదు. కోర్టు నిర్ణయంతో గూగుల్ తన పరిస్థితిని మరింత మెరుగు పరుచుకునేందుకు వీలుంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.2020లోనే కొన్ని ఛానెళ్లపై వేటుగూగుల్ రష్యాలోని ప్రైవేట్ మిలిటరీ సంస్థ వాగ్నర్ గ్రూప్ మెర్సెనరీ చీఫ్ ప్రిగోజిన్, ఒలిగార్చ్ మలోఫీవ్లకు చెందిన ఛానెళ్లను 2020లో బ్లాక్ చేసినట్లు రష్యాకు చెందిన ఎన్బీసీ న్యూస్ ఛానల్ తెలిపింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో యూట్యూబ్ మరిన్ని ఛానెళ్లను నిషేధించిందని పేర్కొంది.రష్యా గూగుల్ ఎల్ఎల్సీ దివాలా!గూగుల్ మార్కెట్ విలువ మొత్తంగా అక్టోబర్ నాటికి 2.15 ట్రిలియన్ డాలర్లు(రూ.179 లక్షల కోట్లు)గా ఉంది. కానీ కంపెనీకి విధించిన జరిమానా చాలా రెట్లు ఎక్కువ. గూగుల్ రష్యాలోని తన అనుబంధ సంస్థ ‘గూగుల్ ఎల్ఎల్సీ’ దివాలా కోసం జూన్ 2022లో దాఖలు చేసింది. కానీ దాని పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కోర్టు పేర్కొంది.(Apple: భారత్లో కొత్తగా నాలుగు అవుట్లెట్లు!)గూగుల్ స్పందన ఇదే..‘రష్యాతో కొన్ని చట్టపరమైన అంశాలపై చర్చించాల్సి ఉంది. బ్లాక్ చేసిన ఛానెళ్లకు సంబంధించి కోర్టు కాంపౌండింగ్ పెనాల్టీలను విధించింది. అదే తుది నిర్ణయంగా జరిమానా కట్టాలని పేర్కొంటుంది. దీనిపై రష్యా జ్యుడిషియరీలో చర్చించాల్సి ఉంది. ఈ అంశాలు కంపెనీ విధానాలపై ఎలాంటి ప్రభావం చూపవు’ అని తెలిపింది. -
ఉక్రెయిన్పై దాడులు.. పుతిన్ దళంలోకి ‘కిమ్’ సైన్యం
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండేళ్లకు పైగా సాగుతున్న దాడుల్లో రెండు దేశాల సైన్యం వీరోచితంగా పోరాడుతూనే ఉంది. ఇప్పటికే ఈ యుద్ధంలో ఎంతో మంది చనిపోయారు. ఈ పోరులో ఉక్రెయిన్ సైన్యం.. రష్యా భూభాగంలో అడుగుపెట్టింది. రష్యాతో పోరులో ఉక్రెయిన్కు సాయం చేసేందుకు ఇప్పటికే పలు దేశాలు ముందుకు వచ్చాయి. మరోవైపు.. రష్యాకు సాయం చేసేందుకు ఉత్తర కొరియా బలగాలు రంగంలోకి దిగాయి.ఉక్రెయిన్తో యుద్ధంలో మరింతగా పోరాడేందుకు ఉత్తర కొరియా తన బలగాలను రష్యాలోకి తరలిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా నాటో వెల్లడించింది. ఇప్పటికే రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కిమ్ బలగాలను మోహరించినట్లు నాటో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో కొన్ని బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మీడియాకు తెలిపారు. ఇక, ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఇది రెండు మధ్య యుద్ధాన్ని మరింత ప్రోత్సహిస్తుందని అన్నారు.NATO confirms North Korean troops have been sent to Russia to support its war in Ukraine. This marks a dangerous escalation, violating UN resolutions and risking global security. As Putin turns to Pyongyang for military aid, democracies must unite to uphold peace and security.… pic.twitter.com/kHT1g57y68— Pete (@splendid_pete) October 28, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉత్తర కొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే పుతిన్.. ఉక్రెయిన్పై పోరుకు నార్త్ కొరియా సాయం కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. అందులో భాగంగానే ఉత్తర కొరియా సైన్యం రష్యాకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కొద్ది రోజుల క్రితమే ఉత్తర కొరియా సైన్యంలోకి భారీగా యువత వచ్చి చేరారు.మరోవైపు.. రష్యాలోకి కిమ్ సేన ప్రవేశించే అంశంపై ఇటీవల అమెరికా స్పందించింది. ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. కచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోనుందో అనే చర్చ కూడా జరుగుతోంది. -
రష్యా యుద్ధం ఆగాలంటే అదొక్కటే మార్గం: జెలెన్ స్కీ
కీవ్: ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రష్యాపై ఉక్రెయిన్ సైన్యం దాడులను తీవ్రతరం చేసింది. ఇదే సమయంలో రష్యా బలగాలు కూడా ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్క్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం వారి దాడులను ఆపగలిగే అవకాశముందని చెప్పుకొచ్చారు.ఇక, తాజాగా ఓ వీడియోలో జెలెన్ స్కీ మాట్లాడుతూ.. రష్యాపై దాడులను తీవ్రతరం చేసి ఆస్తులను ధ్వంసం చేసినప్పుడు మాత్రమే వారు వెనక్కి తగ్గుతారు. అప్పుడు యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. రష్యా భూభాగంలో సైనిక లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఉక్రెయిన్ సైన్యానికి అనుమతించాలని అమెరికాను కోరారు. రష్యాలో సుదూర క్షిపణులు ప్రయోగించడానికి తమకు అనుమతి ఇవ్వాలన్నారు. ఈ విషయమై తమ భాగస్వామ్య దేశాలతో చర్చిస్తున్నామని, వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో ఉక్రెయిన్పై రష్యా దాడులను కూడా ప్రస్తావించారు. ఈనెల 30వ తేదీన ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడిలో ఆరుగురు పౌరులు మరణించారు. 97 మంది గాయపడ్డారని చెప్పారు. Il discorso del Presidente d’Ucraina Volodymyr Zelenskyy. pic.twitter.com/5UzBII0WdS— Ukr Embassy to Italy (@UKRinIT) September 1, 2024 ఇదిలా ఉండగా.. ఆగస్టు 30-31 తేదీల్లో ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్టెమ్ ఉమరోవ్ వాషింగ్టన్లో అమెరికా అధికారులు, నిపుణులతో సమావేశమయ్యారు. రష్యాతో పోరులో ఉక్రెయిన్కు కావాల్సిన ఆయుధాలు గురించి చర్చించారు. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్ సైన్యం రష్యా భూభాగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. -
Russia-Ukraine war: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా
కీవ్: దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. సోమవారం ఉదయం నుంచి పలు నగరాల్లోని మౌలిక వనరులు, విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా వివిధ రకాలైన 40 వరకు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో కనీసం 31 మంది చనిపోగా మరో 154 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కీవ్లోని చిన్నారుల ఆస్పత్రి సహా పలు నివాస ప్రాంతాలపై క్షిపణులు పడటంతో భారీగా పేలుళ్లు సంభవించాయి. పలు చోట్ల మంటలు వ్యాపించాయి. రాజధాని కీవ్లోని 10 జిల్లాలకు గాను ఏడు జిల్లాల్లో జరిగిన దాడుల్లో 14 మంది చనిపోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మూడంతస్తుల నివాస భవనం పూర్తిగా ధ్వంసమైంది. మరో నగరం క్రివ్యి రిహ్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 47 మంది గాయపడ్డారు. కీవ్లోని రెండంతస్తుల చిన్నారుల ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఆపరేషన్ థియేటర్, ఆంకాలజీ విభాగం దెబ్బతిన్నాయి. ఆస్పత్రిలోని పదంతస్తుల ప్రధాన భవనం కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ఘటన నేపథ్యంలో ఆస్పత్రిలో వారందరినీ ఖాళీ చేయిస్తున్నారు. ఆస్పత్రిపై దాడిలో ఏడుగురు చిన్నారులు సహా 16 మంది గాయపడినట్లు మేయర్ విటాలి క్రిట్్చకో చెప్పారు. ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగల హైపర్సోనిక్ కింఝాల్ మిస్సైళ్లు కూడా ఉన్నాయని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. మొత్తం 40 క్షిపణుల్లో 30 వరకు కూల్చి వేశామని, వీటిలో కింఝాల్ రకానివి 11 ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్కు మరింత సాయం అందించేందుకు గల అవకాశాల్ని పరిశీలించేందుకు వాషింగ్టన్లో నాటో దేశాలు మంగళవారం భేటీ అవుతున్న వేళ రష్యా భారీ దాడులకు పూనుకుందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రిపై దాడిని జర్మనీ, చెక్ రిపబ్లిక్ తీవ్రంగా ఖండించాయి. అయితే, తాము ఉక్రెయిన్ రక్షణ, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని రష్యా ఆర్మీ పేర్కొంది. ఉక్రెయిన్ క్షిపణి రక్షణ వ్యవస్థల వల్లే ఆస్పత్రికి నష్టం వాటిల్లినట్లు తెలిపింది. -
G7 Summit 2024: జీ7 ప్యాకేజీ ఎప్పుడు? ఎలా?
28 నెలలుగా కొనసాగుతున్న రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ చాలావరకు ధ్వంసమైంది. యుద్ధం ఆగేదెన్నడో, ఉక్రెయిన్ పునరి్నర్మాణం మొదలయ్యేదెప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జీ7 దేశాల కూటమి 50 బిలియన్ డాలర్ల (రూ.4.17 లక్షల కోట్లు) రుణ ప్యాకేజీని ప్రకటించడం ఉక్రెయిన్కు ఎంతగానో ఊరట కలిగించే పరిణామం అనే చెప్పాలి. వివిధ దేశాల్లో ఉన్న రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయం నుంచే ఈ ప్యాకేజీని ఉక్రెయిన్కు ఇవ్వనున్నట్లు జీ7 దేశాలు వెల్లడించాయి. దీనిపై ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ విజేతగా నిలవడానికి ఈ సాయం ఒక గొప్ప ముందడుగు అని అభివరి్ణంచారు. ఈ నేపథ్యంలో జీ7 ప్రకటించిన రుణ ప్యాకేజీ, ఉక్రెయిన్కు కలిగే లబ్ధి, ఇందులో ఇమిడి ఉన్న ఇబ్బందులు, వివిధ దేశాలు స్తంభింపజేసిన రష్యా ఆస్తుల గురించి తెలుసుకుందాం. 2022 ఫిబ్రవరిలో రష్యా సైన్యం ఉక్రెయిన్పై హఠాత్తుగా దాడికి దిగింది. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ సైతం ఎదురుదాడి ప్రారంభించింది. ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. వేలాది మంది సామాన్య ప్రజలు, సైనికులు మరణించారు. ఉక్రెయిన్పై దాడులు ఆపాలంటూ పశి్చమ దేశాలు హెచ్చరించినా రష్యా లెక్కచేయడం లేదు. దీంతో రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టడానికి తమ దేశంలో ఉన్న రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను పశి్చమ దేశాలు స్తంభింపజేశాయి. ఈ ఆస్తుల విలువ 300 బిలియన్ డాలర్ల (రూ.25.06 లక్షల కోట్లు) వరకు ఉంటుంది. వీటిపై ప్రతి సంవత్సరం 3 బిలియన్ డాలర్ల (రూ.25 వేల కోట్లు) వడ్డీ, ఆదాయం లభిస్తోంది. రష్యా ఆస్తులు చాలావరకు ఐరోపా దేశాల్లో ఉన్నాయి. ఉక్రెయిన్పై దాడులు చేస్తున్నందుకు రష్యా పరిహారం చెల్లించాల్సిందేనని అమెరికా సహా పశి్చమ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు రష్యా ఒప్పుకోవడం లేదు. దాంతో రష్యా ఆస్తులపై వస్తున్న వడ్డీని, ఆదాయాన్ని పరిహారం కింద ఉక్రెయిన్కు ఇవ్వాలని తాజాగా జీ7 దేశాలు నిర్ణయించాయి. ఇబ్బందులు ఏమిటి? విదేశాల్లో ఉన్న ఆస్తులు ఒకవేళ మళ్లీ రష్యా నియంత్రణలోకి వస్తే రుణాన్ని తిరిగి చెల్లించడం కష్టమే. స్తంభింపజేసిన రష్యా ఆస్తులను శాంతి చర్చల్లో భాగంగా విడుదల చేయాల్సి వస్తే రుణాన్ని చెల్లించడానికి జీ7 దేశాలు మరో మార్గం వెతుక్కోవాలి. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రష్యా ఆస్తులపై కొన్నిసార్లు అనుకున్నంత వడ్డీ గానీ, ఆదాయం గానీ రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులెదురవుతాయి. అలాగే రుణ భారాన్ని జీ7 దేశాలన్నీ పంచుకోవాల్సి ఉంటుంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మరో వారం రోజుల్లో తుది ప్రణాళికను ఖరారు చేయనున్నారు. యూరప్లోని రష్యా ఆస్తులపై ఆంక్షలను కొనసాగించడానికి ప్రతిఏటా యూరోపియన్ యూనియన్(ఈయూ)లో ఓటింగ్ జరుగుతోంది. ఈయూలోని ఏ ఒక్క సభ్యదేశం వీటో చేసినా ఆంక్షలు రద్దవుతాయి. ఆస్తులు రష్యా అ«దీనంలోకి వెళ్లిపోతాయి. ఈయూలోని హంగేరీ దేశం ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోంది. ఒకవేళ హంగేరీ వీటో చేస్తే ఉక్రెయిన్ రుణ ప్యాకేజీ ప్రణాళికలు మొత్తం తలకిందులవుతాయి. తమ ఆస్తులపై వచ్చే వడ్డీని, ఆదాయాన్ని పశి్చమ దేశాలు మింగేస్తామంటే రష్యా చూస్తూ కూర్చోదు కదా! కచ్చితంగా ప్రతీకార చర్యలకు దిగుతుంది. రష్యాలోనూ పశి్చమ దేశాల ఆస్తులున్నాయి. వాటిని రష్యా ప్రభుత్వం గతంలోనే స్తంభింపజేసింది. తమ ఆస్తులపై వడ్డీని కాజేసినందుకు ప్రతిచర్యగా పశ్చిమదేశాల ఆస్తులపై వడ్డీని సైతం రష్యా లాక్కొనే అవకాశం లేకపోలేదు. హక్కులు బదిలీ చేయడం సాధ్యమేనా? రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయాన్ని నష్టపరిహారంగా ఉక్రెయిన్కు ఇవ్వాలనుకోవడం బాగానే ఉన్నప్పటికీ ఇందులో చట్టపరమైన అవరోధాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రష్యా అంగీకారం లేకుండా ఇలా చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంటున్నారు. మొండిగా ముందుకెళ్తే తీవ్ర వివాదానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తొలుత న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఒక దేశానికి సంబంధించిన ఆస్తులను స్తంభింపజేసిప్పటికీ వాటిపై హక్కులను ఇతర దేశాలకు బదిలీ చేయడం సాధ్యం కాదు. అవి ఎప్పటికైనా సొంత దేశానికే చెందుతాయి. భౌగోళికంగా తమ దేశంలో ఉన్న ఇతర దేశాల ఆస్తులను ఆయా దేశాల అనుమతి లేకుండా స్వా«దీనం చేసుకొని అనుభవిస్తామంటే కుదరదు. రష్యా ఆస్తులను ఎలా వాడుకోవచ్చు? రష్యా ఆస్తులపై వచ్చే వడ్డీ, ఆదాయాన్ని నేరుగా ఉక్రెయిన్కు ఇచ్చేసే అవకాశం లేదు. జీ7లోని ఏ దేశమైనా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకొని ఆ సొమ్మును ఉక్రెయిన్కు ఇవ్వొచ్చు. రుణాన్ని తీర్చేయడానికి రష్యా ఆస్తులపై వస్తున్న వడ్డీ, ఆదాయాన్ని చెల్లించవచ్చు. తమకు అందే సొమ్మును ఆయుధాలు కొనుగోలు చేయడానికి, దేశ పునరి్నర్మాణానికి ఉక్రెయిన్ ఉపయోగించుకొనేందుకు ఆస్కారం ఉంది. జీ7 నుంచి రుణ ప్యాకేజీ ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్కు చేరే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి రాబోయే పదేళ్లలో 486 బిలియన్ డాలర్లు (రూ.40.58 లక్షల కోట్లు) అవసరం. ఇది ముమ్మాటికీ దొంగతనమే: పుతిన్ రష్యా ఆస్తులపై వచ్చే ఆదాయంతో ఉక్రెయిన్కు ప్యాకేజీ ఇవ్వాలన్న జీ7 దేశాల నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ దొంగతనమేనని చెప్పారు. చోరులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తమ ఆస్తుల జోలికి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. పుతిన్ శుక్రవారం రష్యా విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జీ7 దేశాల నిర్ణయంపై చర్చించారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా దొంగతనం కచ్చితంగా దొంగతనమే అవుతుందన్నారు. జీ7 దేశాల నిర్ణయాన్ని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా శుక్రవారం ఖండించారు. ఈ నిర్ణయం చట్టపరంగా చెల్లదని తేలి్చచెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Russia-Ukraine war: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లో దాడులు..
కీవ్: ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమణలో ఉన్న ఖెర్సన్, లుహాన్స్క్లపై జరిగిన దాడుల్లో కనీసం 28 మంది మృతి చెందారు. ఖెర్సన్లోని సడోవ్ పట్టణంపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన గైడెడ్ బాంబు, క్షిపణి దాడుల్లో 22 మంది చనిపోగా మరో 15 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. అదేవిధంగా, లుహాన్స్క్ నగరంపై శుక్రవారం జరిగిన దాడిలో మరో రెండు మృతదేహాలు బయటపడటంతో మరణాల సంఖ్య ఆరుకు చేరిందని స్థానిక అధికారులు శనివారం వెల్లడించారు. దీంతోపాటు, కుబాన్, అస్ట్రఖాన్,, తుల, క్రిమియా ప్రాంతాల్లో ఉక్రెయిన్ ప్రయోగించిన 25 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఆక్రమిత జపొరిఝియాకు 900 కిలోమీటర్ల దూరంలోని కాకసస్ నార్త్ ఒస్సేతియాలోని సైనిక స్థావరం లక్ష్యంగా ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ను ధ్వంసం చేసినట్లు వివరించింది. -
Russia-Ukraine war: ఆక్రమిత ఉక్రెయిన్పై దాడి.. 28 మంది మృతి
మాస్కో: ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత లిసిచాన్స్క్ నగరంలోని ఓ బేకరీపై జరిగిన దాడిలో 28 మంది మృతి చెందారు. రష్యా నియమించిన స్థానిక అధికారి ఈ విషయం వెల్లడించారు. బేకరీ కుప్పకూలిపోవడంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన మరో 10 మందిని కాపాడినట్లు చెప్పారు. ఘటనపై ఉక్రెయిన్ అధికారులు స్పందించలేదు. ఈ శీతాకాలంలో సుమారు 930 మైళ్ల మేర విస్తరించి ఉన్న యుద్ధ క్షేత్రంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. రష్యా, ఉక్రెయిన్ సైన్యాలు ఎక్కువగా దీర్ఘ శ్రేణి దాడులపైనే ఆధారపడ్డాయి. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో రష్యా బలగాలు పలు ప్రాంతాల్లో తమ సేనలపైకి పదేపదే దాడులతో ఒత్తిడి తీవ్రతరం చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. -
ఉక్రెయిన్పై రష్యా దాడి.. ఖచ్చితంగా ఉత్తర కొరియా మిసైల్!
ఉక్రెయిన్పై రష్యా దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్లోని ఖార్కివ్ నగరంపై మిసైల్ దాడి చేసింది. ఖార్కివ్పై రష్యా ప్రయోగించిన మిసైల్ ఆ దేశానికి చెందినది కాదని ఉక్రెయిన్ ప్రతినిధి డిమిట్రో చుబెంకో అన్నారు. జనవరి 2 తేదీని ఖార్కివ్ నగరంపై దాడి చేసిన రష్యా మిసైల్ గమనిస్తే.. రష్యా దేశానికి చెందినది కాదని తెలుస్తోందని పేర్కొన్నారు. గతంలో రష్యా ప్రయోగించిన మిసైల్ కంటే పెద్దదిగా ఉందని అన్నారు. దాని తయారి విధానం చూస్తే.. అధునాతనమైనదిగా లేదని చెప్పారు. గతంలో ఖార్కివ్పై రష్యా ప్రయోగించిన మిసైల్.. ఇప్పటి మిసైల్ను పరిశీలిస్తే అది ఉత్తర కొరియాకు చెందినదిగా నిర్థారించడానికి అవకాశలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నాజిల్, ఎలక్ట్రికల్ వైండింగ్స్, పలు పరికారలు కూడా చాలా వ్యత్యాసంతో ఉన్నాయని తెలిపారు. ఇది ఖచ్చితంగా ఉత్తర కొరియా మిసైల్ అని తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నట్లు కూడా డిమిట్రో చుబెంకో తెలిపారు. అందుకే రష్యా వేసిన మిసైల్ ఉత్తర కొరియా నుంచి సరఫరా చేసినట్లుగా అనుమానం కలుగుతోందని తెలిపారు. రష్యా ఖార్కివ్ నగరంపై చేసిన మిసైల్ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 60 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. చదవండి: Hamas Attackers: ‘వాళ్లు మనుషులు కాదు.. పెద్దగా నవ్వుతూ రాక్షస ఆనందం’ -
ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ దాడులు
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నూతన సంవత్సరాని స్వాగతం పలికే కొన్ని గంటల మందు రాత్రి ఉక్రెయిన్పై రష్యా సైన్యం డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడులకు తెగపడింది. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాల్లో సుమారు రష్యా 90 డ్రోన్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ సోమవారం తెలిపంది. Shahed drone attack on Odessa has been underway in New Year's Eve for more than two hours. Debris of kamikaze drones caused several fires in residential buildings so far. At least one person was killed. pic.twitter.com/kX1lxLijvj — Olga Klymenko (@OlgaK2013) January 1, 2024 ఈ డ్రోన్ దాడుల్లో 15 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు ఉక్రెయిన సైన్యం పేర్కొంది. డ్రోన్ దాడుల్లో సమారు ఏడుగురు తీవ్రంగా గాపడినట్లు తెలిపింది. రష్యా చేసిన షాహెద్ డ్రోన్ దాడులతో ఒడెస్సాలోని పలు భవనాల్లో భారీగా మంటల్లో కాలిపోయాయి. అయితే ఉక్రెయిన్ సైతం తమపై దాడులు చేస్తోందని రష్యా ప్రకటించింది. చదవండి: జపాన్లో సునామీ హెచ్చరికలు -
జెలెన్స్కీ సొంత నగరంపై క్షిపణి దాడులు
కీవ్: రష్యా సోమవారం ఉదయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరం క్రివి్వ్యరిహ్పై రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో పదేళ్ల బాలిక సహా ఆరుగురు చనిపోయారు. ఈ దాడుల్లో ఓ అపార్టుమెంట్, నాలుగంతస్తుల యూనివర్సిటీ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పదేళ్ల బాలిక, ఆమె తల్లి సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 64 మంది గాయాలపాలయ్యారని నీప్రో గవర్నర్ సెర్హీ లిసాక్ తెలిపారు. ఇంకా కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెప్పారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు. రష్యా పాక్షికంగా ఆక్రమించిన డొనెట్స్క్ ప్రావిన్స్లో జరిగిన దాడిలో ఇద్దరు చనిపోగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడికి కారణమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. కాగా, మాస్కోపైకి ఆదివారం డ్రోన్లను ప్రయోగించిన ఉక్రెయిన్ సోమవారం రష్యాలోని బ్రియాన్స్క్పై డ్రోన్ దాడి జరిపింది. ఎవరూ చనిపోయినట్లు సమాచారం లేదని స్థానిక గవర్నర్ చెప్పారు. ఖరీ్కవ్, ఖెర్సన్, డొనెట్స్్కలపై రష్యా శతఘ్ని కాల్పుల్లో ముగ్గురు చనిపోగా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. -
ఉక్రెయిన్పై రష్యా దాడులు.. 8 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్ వ్యాప్తంగా రష్యా సాగించిన దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. డొనెట్స్క్లోని నియు–యోర్క్పై రష్యా సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కొస్టియాంటీనివ్కాపై జరిగిన రాకెట్ల దాడిలో 20 వరకు ఇళ్లు, కార్లు, గ్యాస్ పైప్లైన్ ధ్వంసం కాగా ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. చెరి్నహివ్పై రష్యా క్రూయిజ్ మిస్సైళ్లు పడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జపొరిఝియా అణు ప్లాంట్ పొరుగునే ఉన్న పట్టణంపై రష్యా దాడిలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఇలా ఉండగా, నల్ల సముద్రం ధాన్యం రవాణా ఒప్పందాన్ని రద్దు చేసిన రష్యా ఉక్రెయిన్ నౌకా తీర ప్రాంతం ఒడెసాను లక్ష్యంగా చేసుకుంది. రష్యా మిలటరీ ప్రయోగించిన రెండు క్రూయిజ్ మిస్సైళ్లు గిడ్డంగులపై పడటంతో మంటలు చెలరేగి పరికరాలు ధ్వంసమయ్యాయని, 120 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు బూడిదయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది. క్రిమియాపై దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడినట్లు రష్యా తెలిపింది. ఈ పరిణామంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్లను పశ్చిమదేశాలు నెరవేర్చి, ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని సూచించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్ చేసి మాట్లాడతానని, వచ్చే నెలలో తుర్కియేలో ఆయనతో భేటీ ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. కాగా, రష్యా ఆక్రమిత క్రిమియాలో వారం వ్యవధిలో రెండోసారి డ్రోన్ పేలింది. క్రాస్నోవార్డిస్క్లోని ఆయిల్ డిపో, ఆయుధ గిడ్డంగిలను డ్రోన్ బాంబులతో పేల్చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. సోమవారం ఉక్రెయిన్ జరిపిన దాడిలో రష్యాను కలిపే కీలకమైన క్రిమియా వంతెన కొంతభాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా, జపొరిఝియా ప్రాంతంలో ఉక్రెయిన్ శతఘ్ని కాల్పుల్లో రియా వార్తా సంస్థకు చెందిన రష్యా జర్నలిస్టు ఒకరు మృతి చెందారు. -
ఉక్రెయిన్పై రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్పై రష్యా సైన్యం శనివారం ఉదయం జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగినట్లు ఉక్రెయిన్ తెలిపింది. డొనెట్స్క్ ప్రాంతంలోని బఖ్ముత్, లీమాన్, మరింకా నగరాల పరిసరాల్లో రెండు సైన్యాలకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఇలా ఉండగా, ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాలను వెళ్లగొట్టేందుకు జరుగుతున్న పోరాటంలో తుది వరకు యూరప్తోపాటు ఈయూ మద్దతుగా నిలుస్తాయని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ హామీ ఇచ్చారు. శనివారం ఈయూ అధ్యక్ష బాధ్యతలను స్పెయిన్ చేపట్టిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. -
ఉక్రెయిన్పై రష్యా దాడులు: 22 మంది దుర్మరణం
కీవ్: రష్యా దాడుల్లో శుక్రవారం 22 మంది ఉక్రేనియన్లు దుర్మరణం పాలయ్యారు. ఉమాన్లో 9 అంతస్తుల నివాస భవనంపై క్షిపణి దాడిలో ముగ్గురు చిన్నారులతో పాటు 20 మంది చనిపోయారు. ఇప్పటిదాకా యుద్ధ చాయలు కనిపించని ఈ నగరంపై రష్యా తొలిసారి లాంగ్రేంజ్ క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు 2 నెలల తర్వాత రాజధాని కీవ్లోని ఓ నివాస భవనంపై క్షిపణి దాడి జరిగింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన 21 క్రూయిజ్ మిస్సైళ్లను, రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. నీప్రో నగరంలోని నివాస ప్రాంతాలపై రష్యా బలగాల దాడిలో రెండేళ్ల చిన్నారి, ఆమె తల్లి చనిపోగా మరో నలుగురు గాయపడినట్లు గవర్నర్ చెప్పారు. ఈ దాడులతో ఉద్దేశపూర్వకంగా బెదిరించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ అంటుండగా తమ దీర్ఘ శ్రేణి క్షిపణులు లక్ష్యాలను ఛేదించినట్లు రష్యా చెబుతోంది. రష్యా ఆక్రమిత డొనెట్స్క్పై ఉక్రెయిన్ బలగాల రాకెట్ దాడిలో ఏడుగురు పౌరులు దుర్మరణం చెందినట్లు నగర మేయర్ చెప్పారు. -
ఉక్రెయిన్ చేతికి ‘పేట్రియాట్’
కీవ్: అమెరికా అత్యాధునిక పేట్రియాట్ గైడెడ్ క్షిపణి వ్యవస్థ ఉక్రెయిన్ చేతికొచ్చింది. దీంతో రష్యా యుద్ధమూకలను మరింత దీటుగా ఎదుర్కొంటామని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ బుధవారం ట్వీట్చేశారు. ‘ భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ రాకతో మా గగనతలానికి మరింత రక్షణ చేకూరింది’ అని ఆయన అన్నారు. శత్రు సేనల నుంచి దూసుకొచ్చే క్షిపణులు, స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైళ్లను ఈ వ్యవస్థతో కూల్చేయొచ్చు. క్రూయిజ్ క్షిపణులు, స్వల్ప శ్రేణి మిస్సైళ్లతోనే ఉక్రెయిన్ పౌర మౌలిక వసతులు ముఖ్యంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలను రష్యా ధ్వంసం చేస్తున్న విషయం విదితమే. అందుకే జనావాసాలు, మౌలిక వసతుల రక్షణ కోసం కొంతకాలంగా పేట్రియాట్ సిస్టమ్స్ సరఫరా చేయాలని అమెరికాను ఉక్రెయిన్ కోరుతోంది. ఇన్నాళ్లకు అవి ఉక్రెయిన్ చేతికొచ్చాయి. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ కోసం ఏడ్చేవాళ్లెవరు?
(ఎస్.రాజమహేంద్రారెడ్డి) : సరిగ్గా ఏడాది క్రితం యముని మహిషపు లోహపు గంటల గణగణలు విని ప్రపంచం యావత్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ గణగణలు దిక్కులు పిక్కటిల్లేలా భూగోళమంతా మారుమోగుతాయేమోనని ఆందోళన పడింది. రష్యా సమరనాదం ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేసి అనివార్యంగా ప్రపంచ దేశాలను రెండుగా చీల్చడం ఖాయమని పరిశీలకులూ భయంభయంగానే అంచనా వేశారు. మిత్ర దేశం బెలారస్ భుజం మీద ట్యాంకులను మోహరించి ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగింది. చిరుగాలికే వొణికిపోయే చిగురుటాకులా ఉక్రెయిన్ తలవంచడం ఖాయమనే అనుకున్నారంతా! యుద్ధమంటేనే చావులు కదా. మృతదేహాల ఎర్రటి తివాచీ మీద నుంచే విజయం నడిచో, పరుగెత్తో వస్తుంది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ, ప్రపంచం దృష్టంతా రణక్షేత్రంపైనే నిలిచింది. అయ్యో అన్నవాళ్లున్నారు, రెండు కన్నీటి చుక్కలతో జాలి పడ్డవారూ ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైరి పక్షాల వైపు నిలిచిన దేశాలు మాట సాయమో, మూట సాయమో, ఆయుధ సాయమో చేసి తమ వంతు పాత్రను పోషిస్తూనే ఉన్నాయి. తటస్థంగా ఉన్నవాళ్లూ ఉన్నారు. చమురు కోసమో, తిండిగింజల కోసమో రష్యాపై ఆధారపడ్డ దేశాలు ఇప్పుడెలా అని తల పట్టుకుని ఆలోచనలో పడ్డాయి. ఒకవైపు రష్యా వైఖరిని వ్యతిరేకిస్తూ మరోవైపు దిగుమతులను స్వాగతించడం ఎలాగన్నదే వాటిముందు నిలిచిన మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇండియాకు ఇవేమీ పట్టలేదు. ఉక్రెయిన్లో వైద్యవిద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకు రావడాన్నే యుద్ధం తొలినాళ్లలో లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే భారత్ తటస్థ ధోరణికే కట్టుబడింది. నెలలు గడిచి యేడాది పూర్తయ్యేసరికి రెండు దేశాలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. మిగతా దేశాలు తమ సమస్యలను తమదైన రీతిలో, రష్యా మీద ఆధారపడాల్సిన అవసరం లేనంతగా పరిష్కరించుకున్నాయి. ఇప్పుడు యుద్ధం హాలీవుడ్ వార్ సినిమాయే.. ప్రాణ నష్టం గణాంకాలే! యుద్ధం కూడా రోజువారీ దినచర్యలా రొటీన్గా మారిపోయినప్పుడు ఒక్క కన్నీటి బొట్టయినా రాలుతుందా? అయినా ఉక్రెయిన్ కోసం ఏడ్చేవాళ్లెవరు? తండ్రినో, భర్తనో, కొడుకునో కోల్పోయిన అభాగ్యులు తప్ప! పక్కింటి గొడవ స్థాయికి... యుద్ధం తొలినాళ్లలో ఇకపై చమురెలా అన్నదే యూరప్ను వేధించిన ప్రశ్న. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు తమ చమురు అవసరాల్లో దాదాపు 40 శాతం రష్యాపైనే ఆధారపడేవి. సహాయ నిరాకరణలో భాగంగా ఆ దిగుమతులను నిలిపివేయక తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో జర్మనీ నుంచి ఇటలీ దాకా, పోలండ్ దాకా తమ దిగుమతుల పాలసీని మార్చుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. అధిక ధరకు చము రును ఇతర దేశాల నుంచి కొనాల్సి వచ్చినా, పొదుపు మంత్రంవేసి కుదుటపడ్డాయి. ప్రత్యామ్నా య మార్గం దొరికే వరకు యుద్ధం తమ గుమ్మం ముందే కరాళ నృత్యం చేస్తోందన్నంతగా హడలిపోయి ఉక్రెయిన్ పట్ల కాస్త సానుభూతిని, కాసిన్ని కన్నీటి బొట్లను రాల్చిన ఈ దేశాలన్నీ ఒక్కసారిగా కుదుటపడి ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పుడు యుద్ధం ఈ దేశాలకు పక్కింటి గొడవే..! ఇక భారత్ విషయానికొస్తే నాటో దేశాల సహాయ నిరాకర ణతో లాభపడిందనే చెప్పాలి. బ్యారెళ్లలో మూలుగుతున్న చమురును ఏదో ఒక ధరకు అమ్మేయాలన్న వ్యాపార సూత్రాన్ని అనుసరించి రష్యా భారత్కు డిస్కౌంట్ ఇస్తానని ప్రతిపాదించింది. ఫలితంగా గత ఏడాది మార్చి 31 దాకా రష్యా చమురు ఎగుమతుల్లో కేవలం 0.2 శాతంగా ఉన్న భారత్ వాటా ఈ ఏడాది ఏకంగా 22 శాతానికి చేరింది! యుద్ధమంటే బాంబుల మోత, నేలకొరిగిన సైనికులు, ఉసురు కోల్పోయిన సామాన్య పౌరులు మాత్రమే కాదు, కొందరికి వ్యాపారం కూడా! భారత్కు చమురు లాభమైతే ఆయుధ తయారీ దేశాలకు వ్యాపార లాభం. యుద్ధమంటే ఆయుధ నష్టం కూడా. జర్మనీ, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, పోలండ్ లాంటి దేశాలు సరిగ్గా దీన్నే తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఆయుధ ఉత్పత్తిని పెంచి, సొమ్ము చేసుకుంటున్నాయి. ఏడాది తిరిగేసరికి యుద్ధం చుట్టూ పరిస్థితులు ఇంతలా మారితే కదనరంగంలో పిట్టల్లా రాలుతున్న వారి గురించి ఎవరాలోచిస్తారు? ప్రాథమ్యాల జాబితాలో యుద్ధం ఇప్పుడు చిట్టచివరి స్థానానికి నెట్టివేతకు గురైంది. రణక్షేత్రంలోని వైరి పక్షాలకు తప్ప మిగతా దేశాలకు ఇప్పుడది కేవలం ఒక వార్త మాత్రమే! బావుకున్నదేమీ లేదు మిత్ర దేశాలు, శత్రు దేశాలు, తటస్థ దేశాలను, వాటి వైఖరులను పక్కన పెడితే వైరి పక్షాలైన రష్యా, ఉక్రెయిన్ కూడా బావుకున్నదేమీ లేదు. ప్రాణనష్టం, ఆయుధ నష్టాల్లో హెచ్చుతగ్గులే తప్ప రెండు దేశాలూ తమ పురోగతిని ఓ నలభై, యాభై ఏళ్ల వెనక్కు నెట్టేసుకున్నట్టే! శ్మశాన వాటికలా మొండి గోడలతో నిలిచిన ఉక్రెయిన్ మునుపటి స్థితికి చేరుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో యుద్ధం ముగిస్తే తప్ప అంచనా వేయలేం. యుద్ధం వల్ల పోగొట్టుకున్న పేరు ప్రతిష్టలను, కోల్పోయిన వీర సైనికులను రష్యా వెనక్కు తెచ్చుకోగలదా? ఏడాదైనా ఉక్రెయిన్పై పట్టు బిగించడంలో ఘోరంగా విఫలమైన రష్యా సైనిక శక్తి ప్రపంచం దృష్టిలో ప్రశ్నార్థకం కాలేదా? నియంత పోకడలతో రష్యాను జీవితాంతం ఏలాలన్న అధ్యక్షుడు పుతిన్ పేరు ప్రతిష్టలు యుద్ధంతో పాతాళానికి దిగజారలేదా? ఆయన తన రాజ్యకాంక్షను, తన అహాన్ని మాత్రమే తృప్తి పరచుకోగలిగారే తప్ప... ప్రపంచాన్ని కాదు, తన ప్రజలను కానే కాదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరిస్థితి కూడా పుతిన్కు భిన్నంగా ఏమీ లేదు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్టు జెలెన్స్కీ హాస్య నటుడి నుంచి హీరో అయ్యారు. రష్యా క్షిపణి దాడుల్లో దేశం వల్లకాడులా మారుతున్నా జెలెన్స్కీపై మాత్రం పొగడ్తల వర్షం కురుస్తూనే ఉంది. ఆయన ఎక్కడికెళ్లినా రాచ మర్యాదలతో స్వాగతం పలుకుతున్నారు. సాహసివంటూ పొగుడుతున్నారు. దేశం నాశనమవుతోందని బాధ పడాలో, ఎగురుతున్న తన కీర్తిబావుటాను చూసి సంతోషించాలో జెలెన్స్కీకి అర్థం కావడం లేదు. బహుశా ఆయన త్రిశంకుస్వర్గంలో ఉండి ఉంటారు. కొసమెరుపు కదనరంగంలో గెలుపోటములు ఇప్పుడప్పుడే తేలే అవకాశమే లేదు. ఎవరిది పైచేయి అంటే చెప్పడం కూడా కష్టమే. స్థూలంగా చెప్పాలంటే రష్యా ఆక్రమించుకున్న భూభాగంలో 54 శాతాన్ని ఉక్రెయిన్ మళ్లీ తన అధీనంలోకి తెచ్చుకుంది. అన్ని రోజులూ ఒక్కరివి కాదంటారు కదా! ఒకరోజు రష్యాదైతే మరో రోజు ఉక్రెయిన్ది..అంతే! ఇప్పుడు ఈ యుద్ధం ప్రపంచానిది ఎంతమాత్రం కాదు, రష్యా–ఉక్రెయిన్లది మాత్రమే. కొనసాగించడంతో పాటు ముగించడం కూడా ఆ రెండు దేశాల చేతుల్లోనే ఉంది. అయినా ఈ యుద్ధాన్ని ఎవరు పట్టించుకుంటున్నారిప్పుడు? -
Russia-Ukraine war: క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా
కీవ్: ఉక్రెయిన్పై రష్యా మరోసారి దాడులు తీవ్రతరం చేసింది. కీలక పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్పై గురి పెట్టింది. లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రావిన్స్లతోపాటు రాజధాని కీవ్, లీవ్పైనా క్షిపణి దాడులు జరిగాయని ఉక్రెయిన్ సైనిక వర్గాలు తెలిపాయి. ‘‘గురువారం సాయంత్రం నుంచి 71 క్రూయిజ్ క్షిపణులను, 35 ఎస్–300 క్షిపణులను, 7 షహెడ్ డ్రోన్లను ప్రయోగించారు. 61 క్రూయిజ్ మిస్సైళ్లు, 5 డ్రోన్లను కూల్చేశాం’’ అని చెప్పింది. విద్యుత్ వ్యవస్థలపై దాడులతో కొన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఖర్కీవ్లో క్షిపణి దాడిలో ఏడుగురు గాయపడినట్లు అధికారులు చెప్పారు. జపొరిజియాపై గంట వ్యవధిలోనే 17సార్లు క్షిపణి దాడులు జరిగాయి. ఐదు క్షిపణులను, 5 షాహెద్ కిల్లర్ డ్రోన్లను కూల్చివేశామన్నారు. రష్యా క్షిపణులు రెండు రొమేనియా, మాల్దోవా గగనతలంలోకి వెళ్లినట్లు ఉక్రెయిన్ సైనిక జనరల్ ఒకరు చెప్పారు. నిరసనగా మాల్దోవా తమ దేశంలోని రష్యా రాయబారికి సమన్లు పంపింది. డొనెట్స్క్లో రష్యా అదనంగా బలగాలను రంగంలోకి దించింది. లుహాన్స్క్ ప్రావిన్స్పై పట్టు సాధించేందుకు రష్యా ఆర్మీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
కీవ్పై మరోసారి పేట్రేగిన రష్యా
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ శనివారం ఉదయం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. డ్నిప్రొవ్స్కీ ప్రాంతంలోని కీలకమైన మౌలిక వసతులే లక్ష్యంగా రష్యా ఈ దాడులకు ఒడిగట్టినట్లు భావిస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. క్షిపణి దాడులతో పలు ప్రాంతాల్లో 18 వరకు భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల మంటలు లేచాయి. ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది. కీవ్పై జనవరి ఒకటో తేదీ తర్వాత రష్యా దాడులు జరపడం ఇదే ప్రథమం. అంతకుముందు ఉక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్లోని పారిశ్రామిక ప్రాంతంపై రష్యా రెండు ఎస్–300 క్షిపణులను ప్రయోగించిందని ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. కీలక నగరం సొలెడార్ తమ అధీనంలోకి వచ్చిందంటూ రెండు రోజుల క్రితం రష్యా ప్రకటించగా, ఉక్రెయిన్ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. రాజధాని కీవ్, ఇతర నగరాలను లక్ష్యంగా చేసుకొని రష్యా క్షిపణి దాడులకు తెగబడుతుండడంతో ఉక్రెయిన్కు అండగా నిలవడానికి బ్రిటన్ ముందుకొచ్చింది. ట్యాంకులు, శతఘ్ని వ్యవస్థలను ఉక్రెయిన్కి పంపిస్తామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శనివారం నాడు హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో సునాక్ మాట్లాడారు. అనంతరం బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఛాలెంజర్ 2 ట్యాంకులు, ఇతర శతఘ్ని వ్యవస్థ సాయంగా అందిస్తామని సునాక్ హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే ఎన్ని ట్యాంకులు పంపిస్తారో, ఎప్పటిలోగా అవి ఉక్రెయిన్ చేరుకుంటాయో వెల్లడించలేదు. బ్రిటీష్ ఆర్మీ చాలెంజర్ 2 ట్యాంకులు నాలుగు వెంటనే పంపిస్తారని, మరో ఎనిమిది త్వరలోనే పంపిస్తారంటూ బ్రిటన్ మీడియా తెలిపింది. ఉక్రెయిన్లో మౌలికసదుపాయాలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులకు తెగబడుతోంది. -
రష్యా క్రూరత్వం.. ఉక్రెయిన్పై ఒకేసారి 120 మిసైల్స్తో అటాక్!
కీవ్: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై కొద్ది నెలలుగా భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. ప్రధాన వనరులను ధ్వంసం చేస్తూ ఉక్రేనియన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరోమారు క్షిపణుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు దేశవ్యాప్తంగా ఒకేరోజు 120 మిసైల్స్ను ప్రయోగించింది. ఏ వైపు నుంచి బాంబులు పడతాయోనని అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేలా చేసింది. భారీ స్థాయిలో మిసైల్స్ ప్రయోగించినట్లు ఉక్రెయిన్ మిలిటరీ వెల్లడించింది. ‘డిసెంబర్ 29. భారీ స్థాయిలో మిసైల్స్తో దాడి జరిగింది. ఆకాశం, సముద్రం నుంచి శుత్రు దేశం ఉక్రెయిన్ను చుట్టుముట్టి మిసైల్స్తో విరుచుకుపడింది. ’అని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది ఉక్రెయిన్ వైమానిక దళం. మరోవైపు.. 120 మిసైల్స్ ప్రయోగించినట్లు అధ్యక్షుడి సహాయకుడు మైఖైలో పోడోల్యాక్ తెలిపారు. గురువారం ఉదయమే ఉక్రెయిన్ వ్యాప్తంగా రాజధాని కీవ్తో పాటు ప్రధాన నగరాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ క్రమంలోనే విద్యుత్తుకు అంతరాయం ఏర్పడొచ్చని, ప్రజలు నీటిని నిలువ చేసుకోవాలని కీవ్ మేయర్ విటాలి క్లిట్స్కో అప్రమత్తం చేశారు. అలాగే.. రెండో పెద్ద నగరం ఖార్కివ్లోనూ వరుస పేలుళ్లు జరిగాయి. ఇదీ చదవండి: క్యాసినో హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది సజీవ దహనం.. -
రష్యా మాస్టర్ ప్లాన్.. చలికి గడ్డకట్టుకుపోతున్న ఉక్రేనియన్లు!
కీవ్: ఉక్రెయిన్పై రష్యా 76 క్షిపణులతో జరిపిన దాడుల బీభత్సం అంతా ఇంతా కాదు. విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని రష్యా చేసిన దాడులతో పలు నగరాలు అంధకారంలో మగ్గిపోయాయి. గడ్డకట్టించే చలిలో విద్యుత్ సదుపాయం లేకుండా చేస్తే ఆ చలిని తట్టుకోలేక సైనికులు, పౌరులు ఉక్రెయిన్ వీడి వెళ్లిపోతారన్న వ్యూహంతో రష్యా ఈ దాడులకు దిగింది. 76 క్షిపణుల్లో ఎన్నింటిని ఉక్రెయిన్ వాయు సేన అడ్డుకోగలిగిందో స్పష్టమైన అంచనాలు లేవు. క్రివీయ్ రియా ప్రాంతంలో రాకెట్ దాడిలో ఒక ఇల్లుపూర్తిగా ధ్వంసం కావడంతో అందులో ఉన్న కుటుంబసభ్యులు నలుగురు మరణించారు. వారిలో ఏడాదిన్నర వయసున్న బాలుడు ఉండడం అందరినీ కంట తడిపెట్టిస్తోంది. నికోపోల్, మార్హానెట్స్, చెర్వోనోహ్రిహోరి్వకా వంటి నగరాల్లో విద్యుత్ లైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా నగరాల్లో జీరో కంటే తక్కువకి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. విపరీతమైన చలి వణికిస్తూ ఉన్న సమయంలో విద్యుత్ లేకపోవడంతో హీటర్లు పని చేయక ప్రజలు గడ్డకట్టుకుపోతున్నారు. ప్రస్తుతం అధికారులు విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. మరోవైపు రష్యా మరిన్ని క్షిపణి దాడులు చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఇదీ చదవండి: చైనాలో వచ్చే ఏడాది కోవిడ్తో 10 లక్షల మంది మృతి? -
ఉక్రెయిన్పై 100 మిసైల్స్తో విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా పట్టుకోల్పోతోందనే వాదనల వేళ మాస్కో సేనలు రెచ్చిపోయాయి. ఉక్రెయిన్పై మంగళవారం మిసైల్స్ వర్షం కురిపించాయి. విద్యుత్తు రంగాలే లక్ష్యంగా రష్యా బలగాలు 100కుపైగా క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. దీంతో తమ దేశంలో మరోమారు విద్యుత్తుకు అంతరాయం ఏర్పడి అంధకారంలోకి వెళ్లినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ‘100కుపైగా మిసైల్స్ను రష్యా బలగాలు ప్రయోగించాయి. అక్టోబర్ 10వ తేదీన అత్యధికంగా 84 మిసైల్స్ను ప్రయోగించగా.. ఆ సంఖ్యను మంగళవారం దాటేశాయి మాస్కో సేనలు. వారి ప్రాథమిక టార్గెట్ కీలకమైన మౌలిక సదుపాయాలు. కొన్ని క్షిపణులను కూల్చివేశం. అయితే వాటి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ ప్రతినిధి యూరీ ఇగ్నాత్. ఇదీ చదవండి: చైనా అధ్యక్షుడికి చిరునవ్వుతో షేక్ హ్యండ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఇదే తొలిసారి! -
ఎట్టకేలకు పుతిన్ సేనలకు ఊహించని పరాభవం.. ఫుల్ జోష్లో ఉక్రేనియన్లు
ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా సేనలు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా రష్యా సైన్యం.. ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది. బాంబు దాడులతో ఉక్రెయిన్ సేనలను, ఆ దేశ పౌరులను భయభాంత్రులకు గురిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఉక్రెయిన్ యుద్ధం తీరు క్రమక్రమంగా మారిపోయింది రష్యాపై ఉక్రెయిన్ సైన్యం ఆధిపత్యం కొనసాగించే స్థితికి చేరుకుంది. ఇప్పటికే పలు నగరాలను ఆక్రమించుకున్న రష్యా సేనలను తరిమికొట్టి ఉక్రెయిన్ సైనం వారి దేశంలోని కీలక నగరాలను మరలా స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సైన్యం మరో విజయం సాధించింది. ఉక్రెయిన్లోని కీలక నగరమైన ఖేర్సన్ నగరాన్ని ఉక్రెయిన్ తిరిగి ఆక్రమించుకుంది. కాగా, తాజాగా రష్యా దళాలు ఖేర్సన్ను వీడుతున్నాయి. ఖేర్సన్ దాని పరిసర ప్రాంతాల నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ మేరకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు రష్యా పేర్కొంది. నిప్రో నది పశ్చిమ తీరం నుంచి బలగాలను పూర్తిగా వెనక్కు తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే నగరంలోకి ప్రవేశించిందని ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. ఈ పరిణామాన్ని ‘కీలక విజయంగా’ అభివర్ణించింది. Video of the occupation of Kherson before its liberation Kherson is forever Ukraine🇺🇦#Kherson #Ukraine #KhersonisUkraine #Україна #Херсон pic.twitter.com/SUq4SvPZuJ — Ukraine-Russia war (@UkraineRussia2) November 12, 2022 ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ స్పందించారు. ఈ సందర్భంగా ‘ఖేర్సన్ నగరం ఇక మాదే’ అంటూ ప్రకటించారు. ‘మన ప్రజలు, మన ఖేర్సన్’ అంటూ టెలిగ్రామ్లో రాసుకొచ్చారు. ప్రస్తుతానికి ఉక్రెయిన్ బలగాలు నగర శివార్లలో ఉన్నాయని, ప్రత్యేక విభాగాలు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయని తెలిపారు. రష్యా సేనలు పేలుడు పదార్థాలను వదిలిపెట్టాయన్న అనుమానంతో వాటిని తొలగించేందుకు సంబంధిత నిపుణులు రంగంలోకి దిగినట్లు చెప్పారు. ఇక, ఈ విజయంతో ఉక్రెయిన్ సైన్యం, పౌరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చి.. ఉక్రెయిన్ జెండాలను ఎగురవేస్తూ విజయం మాదే అంటూ సంబురాలు జరుపుకుంటున్నారు. After months of occupation #Ukrainians come to the streets & central squares of their villages & cities with Ukrainian flags to meet 🇺🇦soldiers and feel the relief, because people of #Ukraine are born to be free. 🎵Kalush Orchestra & The Rasmus#Kherson #StandWithUkraine️ pic.twitter.com/GEG76odo96 — MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) November 11, 2022 ఇది కూడా చదవండి: బ్రిటన్ రాజు చార్లెస్-3కు ఊహించని షాక్ -
ఉక్రెయిన్పై రష్యా రాకెట్ల వర్షం.. ఆ నగర ప్రజలకు హెచ్చరిక!
కీవ్: ఉక్రెయిన్పై రష్యా సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. తమ దేశంపై రష్యా బలగాలు అర్ధరాత్రి రాకెట్లతో విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. ప్రముఖంగా విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. దాని ద్వారానే దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందన్నారు. పవర్ కట్తో కీవ్ సహా చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. ‘మా దేశంపై ఉగ్రవాద చర్యలను రష్యా తీవ్రతరం చేసింది. రాత్రి మా శత్రుదేశం భారీ స్థాయిలో దాడి చేసింది. 36 రాకెట్లు ప్రయోగించింది. అయితే, అందులో చాలా వరకు కూల్చేశాం. కీలకమైన మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులపై దాడులు చేస్తోంది. ఇవి ఉగ్రవాద వ్యూహాలే.’ అని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు జెలెన్స్కీ. ఖేర్సన్ నగరాన్ని వీడండి.. రష్యా విలీనం చేసుకున్న ఉక్రెయిన్లోని దక్షిణ ప్రాంతం ఖేర్సన్ నగరాన్ని వీడి ప్రజలు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రష్యా అనుకూల అధికారులు హెచ్చరించారు. ఉక్రెయిన్ ప్రతిదాడులు పెంచిన క్రమంలో ఈ మేరకు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన కారణంగా నగరంలోని ప్రజలంతా నైపెర్ నదికి అవతలివైపు వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: ‘బ్రిటన్ ప్రధానిగా బోరిస్ సరైన వ్యక్తి’.. భారత సంతతి ఎంపీ మద్దతు -
ఇరాన్ ‘డ్రోన్’లతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి.. రష్యా కొత్త పంథా!
కీవ్: వారాంతం ముగిసి సోమవారం విధుల్లోకి వెళ్లే ఉద్యోగులతో బిజీగా మారిన ఉక్రెయిన్ రాజధానిని రష్యా డ్రోన్లు చుట్టుముట్టాయి. ఆత్మాహుతి బాంబర్లుగా మారి బాంబుల వర్షం కురిపించాయి. దీంతో బాంబు శబ్దాల హోరుతో కీవ్ దద్దరిల్లింది. ప్రాణభయంతో జనం సమీప సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. బాంబుల ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. కొద్దిరోజులుగా కీవ్పై దాడి ఎక్కుపెట్టిన రష్యా వైమానిక దళం దెబ్బకు రాజధాని ప్రజలు నిరంతరం ఆకాశం వైపు చూస్తూ భయంభయంగా బయట సంచరిస్తున్నారు. గతంలో క్షిపణి దాడులకు దిగిన రష్యా బలగాలు ఈసారి ఇరాన్ తయారీ షహీద్(జెరాన్–2) డ్రోన్లకు పనిచెప్పాయి. కీవ్లో ధ్వంసమైన ఒక భవంతి శిథిలాల నుంచి 18 మందిని ఉక్రెయిన్ సేనలు సురక్షితంగా కాపాడాయి. డ్రోన్ల దాడిలో కీవ్లో ఓ గర్భిణి, ఆమె భర్త సహా మొత్తం నలుగురు, సుమీ ప్రాంతంలో మరో నలుగురు కలిపి మొత్తం 8 మంది మరణించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా యుద్ధ విమానం కూలిపోయి నలుగురు మృతి చెందిన క్రమంలో ఈ దాడులు చేసినట్లు సమాచారం. డ్రోన్ల దాడిని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఖండించారు. రష్యాకు డ్రోన్లు అందిస్తున్న ఇరాన్పై ఆంక్షలు విధించాలను యూరోపియిన్ యూనియన్ను కోరారు. ఇదీ చదవండి: పుతిన్ వార్నింగ్ని బేఖాతారు చేస్తూ..నాటో సైనిక కసరత్తులు -
Russia-Ukraine war: రష్యా ప్రతీకారం
జపొరిజాజియా: రష్యా–క్రిమియా ద్వీపకల్పాన్ని అనుసంధానించే కీలక వంతెనపై ఉక్రెయిన్ అనుకూల వర్గాలు పేలుళ్లకు పాల్పడిన నేపథ్యంలో పుతిన్ సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది. ఉక్రెయిన్లోని జపొరిజాజియా సిటీపై నిప్పుల వర్షం కురిపించింది. శనివారం అర్ధరాత్రి తర్వాత వరుసగా రాకెట్లు ప్రయోగించింది. ఈ ఘటనలో 12 మంది పౌరులు మృతిచెందారు. 60 మందికి పైగా గాయపడ్డారు. రష్యా దాడుల్లో 20 ప్రైవేట్ నివాస గృహాలు, 50 అపార్టుమెంట్ భవనాలు దెబ్బతిన్నాయని సిటీ కౌన్సిల్ కార్యదర్శి అనాతోలివ్ కుర్టెవ్ చెప్పారు. జపొరిజాజియాలో రష్యా రాకెట్ దాడులను ఉక్రెయిన్ సైన్యం ధ్రువీకరించింది. పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారని పేర్కొంది. రష్యా దాడుల పట్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. రష్యా అంతర్జాతీయ ఉగ్రవాది అంటూ మండిపడ్డారు. తమను ఎవరూ రక్షంచలేరా? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అమాయకులను బలి తీసుకున్నారు: జెలెన్స్కీ వాస్తవానికి దక్షిణ ఉక్రెయిన్లోని జపొరిజాజియా ప్రస్తుతం రష్యా ఆధీనంలోనే ఉంది. ఈ ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేస్తూ రష్యా అధినేత పుతిన్ ఇటీవలే సంతకాలు చేశారు. జపొరిజాజియా ప్రావిన్స్ మొత్తం చట్టబద్ధంగా తమదేనని వాదిస్తున్నారు. గత గురువారం ఇదే సిటీపై రష్యా సైన్యం జరిపిన క్షిపణి దాడుల్లో 19 మంది బలయ్యారు. తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని రష్యా ఇటీవల తరచుగా దాడులు చేస్తుండడం గమనార్హం. తాజా రాకెట్ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ దయ, కరుణ లేకుండా అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్నారని దుమ్మెత్తిపోశారు. అది అక్షరాలా రాక్షసకాండ అని ధ్వజమెత్తారు. ఈ దాడులకు ఆదేశాలిచ్చినవారు, వాటిని పాటించినవారు తప్పనిసరిగా చట్టానికి, ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. వంతెన భద్రత పెంచాలని ఆదేశాలు ఉక్రెయిన్కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని 2014లో రష్యా ఆక్రమించింది. రష్యా–క్రిమియాను అనుసంధానించే వంతెనపై శనివారం భారీ ఎత్తున పేలుళ్లు జరిగాయి. వంతెన కొంతవరకు ధ్వంసమైంది. ఈ పేలుళ్లకు ఇంకా ఎవరూ బాధ్యత వహించలేదు. ఇదంతా ఉక్రెయిన్ అనుకూలవర్గాల పనేనని రష్యా నిర్ణయానికొచ్చింది. ప్రతీకార చర్యల్లో భాగంగా జపొరిజాజియాను లక్ష్యంగా చేసుకుంది. వంతెనకు, అక్కడున్న ఇంధన రంగ మౌలిక సదుపాయాలకు భద్రత పెంచాలంటూ పుతిన్ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. భద్రత కోసం ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ను రంగంలోకి దించారు. పుతిన్ ‘ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్’ ప్రారంభించారని రష్యా ప్రజాప్రతినిధులు కొందరు తెలిపారు. తూర్పు డొనెట్స్క్ రీజియన్లోని బఖ్ముత్, అవ్దివ్కా నగరాల్లో రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ సాగింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సైనిక దళాల అధికారి ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రస్తుతం రెండు నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ జవాన్ల మధ్య ఘర్షణలో వాటిల్లిన ప్రాణనష్టంపై వివరాలు తెలియరాలేదు. రష్యా సైన్యానికి కొత్త కమాండర్ రష్యా–క్రిమియా వంతెనపై పేలుళ్ల తర్వాత రష్యా ఒక్కసారిగా అప్రమత్తయ్యింది. ఉక్రెయిన్లో తమ సైనిక బలగాలకు సారథ్యం వహించడానికి ఎయిర్ఫోర్స్ చీఫ్ జనరల్ సెర్గీ సురోవికిన్ను నియమిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇకపై ఉక్రెయిన్లో సైనిక ఆపరేషన్లను ఆయనే ముందుండి నడిపిస్తారని స్పష్టం చేసింది. సురోవికిన్ను కొన్ని నెలల క్రితం దక్షిణ ఉక్రెయిన్లో రష్యా సేనలకు ఇన్చార్జిగా నియమించారు. ఇప్పుడు పదోన్నతి కల్పించారు. ఆయన గతంలో సిరియాలో రష్యా సైన్యానికి సారథ్యం వహించారు. సిరియాలోని అలెప్పో నగరంలో పెను విధ్వంసానికి సురోవికిన్ ప్రధాన కారకుడన్న ఆరోపణలున్నాయి. -
రష్యా కు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్
-
రష్యాకు గట్టి షాక్.. ఉక్రెయిన్ చేతికి ‘విలీన’ ప్రాంతాలు!
కీవ్: ఉక్రెయిన్పై కొన్ని నెలలుగా సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ క్రమంలోనే నాలుగు కీలక ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఆ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అయితే.. ఉక్రెయిన్ తెగువకు రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పుతిన్ సేనలను చుట్టుముడుతూ.. ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది ఉక్రెయిన్. కీవ్ వ్యూహరచనతో రష్యా సేనలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కీలక ప్రాంతాలను వదిలి వెనక్కి మళ్లుతున్నట్లు రష్యా సైతం ఒప్పకోవటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. తాజాగా మరో రష్యాకు గట్టి షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. క్రెమ్లిన్ విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించిన నాలుగు ప్రాంతాల్లోని 400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకున్నట్లు ప్రకటించింది. ‘అక్టోబర్ నెల మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఖేర్సన్ ప్రాంతంలో సుమారు 400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.’ అని ఉక్రేనియన్ దక్షిణ ఆర్మీ కమాండ్ ప్రతినిధి నటాలియా గుమెనియుక్ వెల్లడించారు. మరోవైపు.. ఈ వాదనలను తోసిపుచ్చింది రష్యన్ ఆర్మీ. రష్యా సరిహద్దు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సేనలను మరింత వెనక్కి పంపించినట్లు పేర్కొంది. దడ్చనీ, సుఖనోవ్, కడాక్, బ్రుస్కినస్కో ప్రాంతాల్లో చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. తమ బలగాలు అడ్డుకుంటున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: విలీనానికి రష్యా చట్టసభ సభ్యుల ఆమోదం -
Russia Ukraine War: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్లో నాలుగు ప్రాంతాల విలీనం ఒప్పందంపై సంతకాలు చేయడానికి కొన్ని గంటల ముందే రష్యా క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లతో ఉక్రెయిన్లోని పలు నగరాలపై విరుచుకుపడింది. జపోరిజియా నగరంలోని మానవతా కాన్వాయ్పై జరిపిన దాడిలో 30 మంది మరణించారు. రష్యా ఆక్రమిత భూభాగంలో ఉన్న తమ బంధువులకి వస్తు సామాగ్రిని అందించడం కోసం వెళుతుండగా ఆ మానవతా కాన్వాయ్పై దాడులు జరిగాయి. రష్యాలో తయారైన ఎస్–300 క్షిపణులతో ఈ దాడులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. విలీన ఒప్పందంపై పుతిన్ సంతకం ఉక్రెయిన్లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకునే ఒప్పందంపై అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం సంతకాలు చేశారు. డాంటెస్క్, లుహాన్సŠక్, ఖెర్సాన్, జపోరిజియా ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపామని ఆ ప్రాంత ప్రజలు రష్యాలో విలీనమవడానికి అంగీకరించాయని ఇప్పటికే రష్యా ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు చెందిన రష్యా అనుకూల పాలకులు హాజరవగా క్రెమ్లిన్లో జరిగిన ఒక కార్యక్రమంలో పుతిన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ తమ దేశంలో విలీనమైన ప్రాంతాలను అన్ని విధాల కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధంపై ఉక్రెయిన్ వెంటనే శాంతి చర్చలకు రావాలని కోరారు. తమ దేశంలో విలీనమైన ప్రాంతాలను మళ్లీ వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని పుతిన్ తేల్చి చెప్పారు.తమ దేశాన్ని ఒక కాలనీగా మార్చి, తమ ప్రజల్ని పిరికివాళ్లయిన బానిసలుగా మార్చడానికి పశ్చిమ దేశాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్, పశ్చిమ దేశాలు ఆ విలీనాన్ని అంగీకరింబోమని స్పష్టం చేశాయి. ప్రజాభిప్రాయం పేరుతో వారిపై తుపాకులు పెట్టి బలవంతంగా విలీనం చేసుకున్నారని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నాయి. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటో కూటమిలో తమ దేశాన్ని చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రష్యాకి చెందిన వెయ్యి మంది ప్రజలు, సంస్థలు తమ దేశానికి రాకుండా అమెరికా వారి వీసాలపై నియంత్రణ విధించింది. -
వ్యక్తి విషాదం
యుద్ధాన్ని నేను ద్వేషిస్తాను, అన్ని రూపాల్లోని యుద్ధాన్నీ నేను ద్వేషిస్తాను అంటాడు ఆర్చెమ్ చపేయే. ఈ ఉక్రెయినియన్ రచయిత తనను తాను ‘పసిఫిస్ట్’ అని చెప్పుకొంటాడు. శాంతి కాముకుడు అని ఈ మాటకు విస్తృతార్థం. యుద్ధం, హింస... ఏ కోశానా సమర్థనీయం కావు అనేది ఇలాంటివాళ్ల భావన. పాపులర్ ఫిక్షన్, క్రియేటివ్ నాన్ –ఫిక్షన్ రచనలతో ఆర్చెమ్ ఉక్రెయిన్ లో మంచి ఆదరణ ఉన్న రచయిత. నాలుగుసార్లు ‘బీబీసీ ఉక్రెయిన్ బుక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఫైనలిస్టు. ఫొటోగ్రఫీ, విజువల్ స్టోరీ టెల్లింగ్ మీద కూడా ఈమధ్యే మక్కువ పెంచుకున్నాడు. ఈమధ్యే అంటే ఉక్రెయిన్ మీద రష్యా దాడికి దిగకముందు! రాజధాని నగరం కీవ్ మీద బాంబుల మోత మొదలుకాగానే ఆయన చేసిన మొదటి పని – ముందు తన కుటుంబాన్ని అక్కడి నుంచి సురక్షితమైన చోటుకు తరలించడం! రెండోది – యుద్ధంలో చేరడానికి తన పేరును నమోదు చేసుకోవడం! యుద్ధం మీద ఆర్చెమ్ అభిప్రాయాలు ఏమీ మారలేదు. కానీ అణిచివేత తన మీద మోపిన యుద్ధం కాబట్టి దీన్నుంచి పారిపోలేనంటాడు. ఓలెహ్ సెన్ త్సోవ్ – రచయిత, దర్శకుడు. ‘క్రిమియా’ ఆయన స్వస్థలం. ఉక్రెయిన్ లో భాగంగా ఉన్న క్రిమియాను రష్యా తన అనుబంధంగా మార్చుకున్నప్పుడు చేసిన నిరసనలకు గానూ తీవ్రవాద ఆరోపణల మీద అరెస్టయ్యాడు. ఐదేళ్లు జైల్లో ఉన్నాడు. (బలవంతపు సప్లిమెంట్స్, మెడికేషన్ కలుపుకొని) 145 రోజుల పాటు చేసిన నిరవధిక నిరశనకు గానూ దాదాపు చావు దాకా వెళ్లొచ్చాడు. 2019లో నేరస్థుల బదిలీ ఒప్పందం మీద ఉక్రెయిన్ కు వచ్చాక దాడి నేపథ్యంలో ‘ద సెకండ్ వన్స్ ఆల్సో వర్త్ బయ్యింగ్’ అనే వ్యంగ్య నవల రాశాడు. ఉక్రెయిన్ లో 1990ల నాటి నేరస్థుల గ్యాంగుల నేపథ్యంలో సాగే ‘రైనో’ సినిమా 2020లో విడుదలైంది. దానికి సానుకూల సమీక్షలు వచ్చాయి. అయితే, మళ్లీ యుద్ధం మొదలుకాగానే ప్రాదేశిక భద్రతా దళంలో చేరిపోయాడు. ఇంకా ఈ జాబితాలో స్తానిస్లావ్ అసెయేవ్, క్రిస్టియా వెంగ్రీనియుక్ లాంటి ఉక్రెయిన్ రచయితలూ ఉన్నారు. అమెరికా రచయితలు ఎర్నెస్ట్ హెమింగ్వే, ఇ.ఇ. కమ్మింగ్స్, టి.ఇ. లారెన్స్, జె.ఆర్.ఆర్. టోల్కీన్ లాంటివాళ్లు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. జె.డి. శాలింజర్ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. జార్జ్ ఆర్వెల్ స్పానిష్ సివిల్ వార్లో పాల్గొని గాయపడ్డాడు. తెలుగు కవి, కథకుడు శిష్టా›్ల ఉమామహేశ్వరరావు; మరో రచయిత అంగర వెంకట కృష్ణారావులు కూడా యుద్ధ అనుభవం ఉన్నవారే! అసలు కవిగానో, రచయితగానో ఉండటమే... దానికదే ఒక యుద్ధం కదా! ఈ రచయితలు మనకు గుర్తున్నది వాళ్లు పట్టుకున్న ఆయుధం వల్ల కాదు, వారి రచనల వల్ల! కాకపోతే అది వారికి ఒక అనుభవంగా పనికివచ్చింది. కానీ ఆ ‘అనివార్యత’ ఎంత దుర్మార్గమైనది? రాసుకోగలిగేవాడు రాసుకునే, ఆనందంగా నర్తించే అమ్మాయి నర్తిస్తూ ఉండగలిగే ప్రపంచాన్ని కోరుకోవడం మరీ అంత పెద్ద కోరికా? లేక, ఇంకో తలంలో వీటన్నింటికీ కారణం అవుతున్న ‘ఇంకో’ మనిషి బుద్ధి అంత చిన్నదా? యుద్ధం అనేది ఏ ఒక్క రూపంలోనో ఉండదని అందరికీ తెలుసు. నేరుగా సరిహద్దు యుద్ధాలు చేయకపోయినా, భిన్నరకాల యుద్ధాల్లో ఎందరు తెలుగు కవులు పాల్గొనలేదు! భావజాల పోరాటాలు మాత్రం యుద్ధం కాదా? సమస్య ఏమిటంటే– ఈ యుద్ధాలు గీతకు అటువైపు ఉన్నావా, ఇటువైపు ఉన్నావా అని తేల్చుకునే విపత్కర పరిస్థితిలోకి మనిషిని నెడతాయి. దీనికి స్పందించడం తప్ప ఇంకో మార్గం ఉండదు. అప్పుడు సమూహంగా మాట్లాడటం తప్ప వ్యక్తికి విడిగా చోటుండదు. వ్యక్తి అనేవాడు లేకుండాపోవడం కంటే బౌద్ధిక విషాదం ఏముంటుంది? అవసరాన్ని బట్టి మనిషి వ్యక్తిగానూ, సమూహంగానూ ఉంటాడు. కానీ సరిగ్గా అదే సందర్భంలో గీతకు అటువైపు ఉన్నవాడు కేవలం విడి మనిషిగానే ఉండదలిస్తే! నేటికి సత్యాలుగా కనబడినవి, రేపటికి మబ్బుల్లా కదిలిపోవని ఎవరూ చెప్పలేరు. కానీ యుద్ధాలు, భావజాలాల్లో వర్తమానపు కొలేటరల్ డ్యామేజ్ అనబడే అనివార్య నష్టం లెక్కలోకి రాదు. వీళ్ల వల్ల గాయపడ్డ ఆ ‘ఎదుటి’ మనిషి ఎవరో వీరికి ఎప్పటికీ సంపూర్ణంగా తెలియకపోవచ్చు. నిరసనకారుల గుంపును చెదరగొట్టడానికి పోలీసులు చేసే లాఠీఛార్జీలో రెండు దెబ్బలు తినేవాడి నొప్పి ఎవరికీ పట్టదు. ఏ కోర్టులూ, ఏ ప్రజాసమూహాలూ దీనికి న్యాయం చేయలేవు. కానీ ఒక్కడు మాత్రం తన జీవితకాలం ఆ రెండు దెబ్బల బరువును మోయాల్సి వస్తుంది. ఆ చివరి మనిషి గాయానికి కూడా లేపనం పూయనంతవరకూ, అసలు ఆ మనిషికి గాయం కాని పరిస్థితులు వచ్చేంతవరకూ మనది నాగరిక సమాజం కాబోదు. వేపచెట్టు మీద వాలి కూసేది ఒక కాకి కాదు. అది ‘ఫలానా’ కాకి మాత్రమే అవుతుంది. దాని కూతకు స్పందనగా వచ్చి జతకూడేది కూడా ఇంకో కేవలం కాకి కాదు. అది మరో ఫలానా కాకి అవుతుంది. రెండూ వేర్వేరు కాకులు... ఇద్దరు వేర్వేరు సంపూర్ణ మనుషుల్లా! అవి వాలిన వేపచెట్టుకు కూడా మనం పేరు పెట్టివుండకపోవచ్చుగానీ అది కూడా దానికదే ప్రత్యేక యూనిట్. దానికదే యునీక్. దాన్ని పోలిన చెట్టు, దానిలాగా కొమ్మలను విరుచుకున్న చెట్టు ఇంకోటి ఎక్కడా ఉండదు. మన ఇంట్లో మన కాళ్లకు తగిలే పిల్లి లాంటిది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. కానీ మనుషులే కేవలం సమూహ అస్తిత్వాలకు పరిమితమయ్యే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నప్పుడు, ఇంక పక్షులు, జంతువులు, చెట్లూ చేమలను కూడా విడిగా గుర్తించాలంటే మనిషి ఎంత సున్నితం కావాలి! ఎంత సూక్ష్మం కావాలి! -
ఉక్రెయిన్ జైలుపై భీకర దాడి.. 53 మంది మృత్యువాత!
కీవ్: ఉక్రెయిన్లోని యుద్ధ ఖైదీలను నిర్బంధించిన జైలుపై శుక్రవారం జరిగిన భీకర రాకెట్ దాడిలో 53 మంది చనిపోగా మరో 75 మంది గాయపడ్డారు. మరియుపోల్ నగరం హస్తగతమయ్యాక యుద్ధ ఖైదీలుగా చిక్కిన ఉక్రేనియన్లను రష్యా అనుకూల వేర్పాటు వాదులు ఒలెనివ్కా జైలులోనే ఉంచారు. ఈ ఘటనపై ఉక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అమెరికా రాకెట్ లాంఛర్లతోనే ఉక్రెయిన్ బలగాలు ఈ దాడి చేశాయని రష్యా ఆరోపించింది. ఘటన ప్రాంతంలో పడిన అమెరికా తయారీ రాకెట్ విడిభాగాలను కనుగొన్నట్లు అధికార నొవొస్తి వార్తా సంస్థ తెలిపింది. ఉక్రేనియన్లపై చిత్రహింసలు, మరణశిక్షల అమలును కప్పిపుచ్చుకునేందుకు రష్యానే ఈ దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఇదీ చదవండి: డైనోసార్ అస్థిపంజరానికి 49 కోట్లు.. -
ఒప్పందం జరిగి 24 గంటలు గడవనేలేదు.. ఒడెస్సా పోర్ట్పై రష్యా దాడి
కీవ్: ఆహార సంక్షోభాన్ని అడ్డుకునేందుకు నల్ల సముద్రం మీదుగా ఆహార ధాన్యాలను చేరవేసేలా రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అయితే.. ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఆ మరుసటి రోజే ఉక్రెయిన్లోని ఒడెస్సా పోర్టుపై రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేందుకు ఈ నౌకాశ్రయమే కీలకం కాగా.. దానిపైనే దాడులు జరగటం గమనార్హం. శుక్రవారం నాటి ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్లో నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సాతో పాటు మరో రెండు రేవుల నుంచి ఎగుమతులు ప్రారంభంకావాల్సి ఉంది. తాజాగా ఆయా ఓడ రేవులపై మాస్కో క్షిపణులు దాడి చేశాయంటూ స్థానిక ఎంపీ ఒలెక్సీ గొంచరెంకో విమర్శలు చేశారు. మొత్తం నాలుగు మిసైల్స్ ప్రయోగించగా.. వాటిలో రెండింటిని అడ్డుకున్నట్లు చెప్పారు. ఒడెస్సా పోర్టుపై దాడి ఘటనలో పలువురు గాయపడినట్లు వెల్లడించారు. ఒడెస్సాలో ఆరు పేలుడు ఘటనలు జరిగాయన్నారు. ‘ఒడెస్సా పోర్టుపై మాస్కో దళాలు దాడులు చేశాయి. ఒప్పందం చేసుకుని ఒక్క రోజు గడవకముందే ఈ ఘటన జరగటంతో ఒప్పందాల విషయంలో రష్యా వైఖరి స్పష్టమవుతోంది. ఒడెస్సాను కాపాడుకునేందుకు ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయండి. రష్యాకు బలప్రదర్శన మాత్రమే అర్థమవుతుంది.’ అని ట్వీట్ చేశారు. మరోవైపు.. ధాన్యం ఎగుమతుల ఒప్పందం విషయంలో ఏదైనా విఘాతం కలిగితే.. తద్వారా ఏర్పడే ఆహార సంక్షోభానికి రష్యాదే పూర్తి బాధ్యత అని ఉక్రెయిన్ విదేశాంగ ప్రతినిధి ఓలెగ్ నికొలెంకో పేర్కొన్నారు. ఐరాస, తుర్కియేలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడేందుకు రష్యాకు 24 గంటలూ పట్టలేదంటూ మండిపడ్డారు. మరోవైపు.. ఈ దాడిని ఖండించారు ఐరోపా సమాఖ్య విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి జోసెప్ బోరెల్. ఒప్పందం జరిగిన మరుసటి రోజునే కీలక పోర్ట్పై దాడి చేయటం అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల పట్ల రష్యా వైఖరి స్పష్టమవుతోందన్నారు. ఇదీ చదవండి: రెండేళ్ల క్రితమే మృతి.. ప్రతినెలా ఓనర్కు రెంట్ చెల్లిస్తున్న మహిళ! -
ఉక్రెయిన్ సెక్యూరిటీ చీఫ్కు రష్యాతో లింకులు.. షాకిచ్చిన జెలెన్స్కీ!
కీవ్: ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య కొద్ది నెలలుగా కొనసాగుతూనే ఉంది. రష్యా సేనల బాంబుల వర్షంలో వందల మంది ఉక్రెయిన్ పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ డొమెస్టిక్ సెక్యూరిటీ, స్టేట్ ప్రాసిక్యూటర్లకు షాక్ ఇచ్చారు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. వారిని విధుల్లోంచి తప్పించారు. వారిపై వందలాది దేశద్రోహం, రష్యాతో సంబంధాల కేసులు ఉన్నాయంటూ పేర్కొన్నారు. మాస్కో మిలిటరీ ఆపరేషన్ను తీవ్ర తరం చేసేందుకు వారు సహకరించారని ఆరోపించారు. 'రష్యా ఆక్రమిత ప్రాంతాల్లోని ఎస్బీయూ సెక్యూరిటీ సర్వీస్, ప్రాసిక్యూటర్ కార్యాలయాల్లో పని చేస్తున్న 60 మందికిపైగా అధికారులు ఉక్రెయిన్కు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. అధికారులపై 651 దేశ ద్రోహం, రష్యాతో సంబంధాల కేసులు నమోదయ్యాయి. సెక్యూరిటీ విభాగానికి వ్యతిరేకంగా నేరాల పరంపర.. సంబంధిత నేతలకు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం రాబడతాం.' అని పేర్కొన్నారు జెలెన్స్కీ. సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్ ఇవాన్ బకనోవ్, రష్యా యుద్ధ నేరాలపై వాదనలు వినిపిస్తున్న ప్రాసిక్యూటర్ ఇరినా వెనెదిక్టోవాలాను తొలగించారు జెలెన్స్కీ. ఆదివారం సాయంత్రం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు అధ్యక్షుడు జెలెన్స్కీ. 2014లో రష్యా ఆక్రమించుకున్న క్రిమియాలో ఎస్బీయూ సెక్యూరిటీ చీఫ్గా పని చేసిన అధికారిని ఇటీవలే అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రష్యా సైనిక చర్య చేపట్టిన తొలినాళ్లలోనే సెక్యూరిటీ విభాగంలోని పలువురు ఉన్నతాధికారులను తొలగించినట్లు చెప్పారు. సెక్యూరిటీ చీఫ్పై అన్ని విధాల ఆధారాలు సేకరించామన్నారు. ఇదీ చదవండి: రష్యా దాడిలో చిన్నారి మృతి.. మిన్నంటిన తండ్రి రోదనలు -
Russia Ukraine War: యుద్ధ రక్కసికి బలైన బాల్యం
కీవ్: రష్యా యుద్ధకాంక్షకు బలైన తన చిన్నారి పాపాయి మృతదేహాన్ని చూస్తూ గుండెలవిసేలా రోదించాడు ఓ తండ్రి. ఆ దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఉక్రెయిన్లోని వినిట్సియా సిటీలో గురువారం ఈ చిన్నారిని ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రష్యా సేనలు బాంబులతో దాడిచేశాయి. చిన్నారితో పాటు 24 మంది దుర్మరణం పాలవగా తల్లి తీవ్రంగా గాయపడి ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది! ఇదీ చదవండి: బాలిక అనుమానాస్పద మృతితో... రణరంగమైన స్కూలు -
Ukraine-Russia war: ఉక్రెయిన్పై రష్యా రాకెట్ దాడి
కీవ్: రష్యా శనివారం రాత్రి ఉక్రెయిన్పై జరిపిన రాకెట్ దాడిలో 15 మంది చనిపోయారు. రాకెట్ దాడితో డొనెట్స్క్ ప్రావిన్స్ చాసివ్ యార్ పట్టణంలోని అపార్టుమెంట్ కుప్పకూలింది. శిథిలాల కింద మరో 20 మంది చిక్కుకుని ఉంటారని అధికారులు చెబుతున్నారు. దాడులకు రష్యా విరామం పాటిస్తుందని భావిస్తున్న క్రమంలో తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. జూన్ 21వ తేదీన క్రెమెన్చుక్లోని షాపింగ్ మాల్పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 19 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. సైనిక సంబంధ లక్ష్యాలపైనే దాడులు చేపడుతున్నట్లు చెప్పుకుంటున్న రష్యా తాజా ఘటనపై ఎటువంటి ప్రకటన చేయలేదు. రష్యా అనుకూల వేర్పాటు వాదుల ప్రాబల్యమున్న డోన్బాస్ ప్రాంతంలోని లుహాన్స్క్ ప్రావిన్సుపై పట్టు సాధించిన రష్యా బలగాలు మరో ప్రావిన్స్ డొనెట్స్క్లో పాగానే లక్ష్యంగా కదులుతున్నాయి. ఇలా ఉండగా, ఎటువంటి పోరాట నైపుణ్యం లేని ఉక్రెయిన్ పౌరులతో కూడిన మొదటి బృందం బ్రిటన్కు చేరుకుంది. మొత్తం 10 వేల మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యమని యూకే తెలిపింది. -
ఉక్రెయిన్పై దాడిని ఖండించిన మాస్కో కౌన్సిలర్కు ఏడేళ్ల జైలు
మాస్కో: ఉక్రెయిన్, రష్యా యుద్ధం గత నెలుగు నెలలకుపైగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి రష్యా సేనలు. యుద్ధం ముగించాలని ప్రపంచ నేతలు సూచిస్తున్నా, కఠిన ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గటం లేదు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ దాడిని ఖండించిన మాస్కో కౌన్సిలర్ అలెక్సీ గోరినోవ్కు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖండిస్తూ మాట్లాడటమే ఆయన చేసిన తప్పు. క్రాస్నోసెల్స్కీ మున్సిపల్ కౌన్సిల్కు చెందిన 60 ఏళ్ల గోరినోవ్.. సిటీ కౌన్సిల్ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రశించారు. ఉక్రెయిన్లో వందల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ.. బాలల దినోత్సవంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను తప్పుపట్టారు. ఉక్రెయిన్పై రష్యా దాడిలో చినిపోయిన వారికి సంతాపం తెలుపుతూ కొద్ది సేపు మౌనం పాటించారు. దీంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయనపై అభియోగాలు మోపారు. రష్యా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే కారణంగా కేసు నమోదైనట్లు తీర్పు చెబుతున్న సందర్భంలో న్యాయమూర్తి ఒలెస్యా మెండెలెయెవ తెలిపారు. ఉక్రెయిన్పై సైనిక చర్య తర్వాత అసమ్మతి వాదులను ఎదుర్కొనేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టాల ప్రకారం ఓ వ్యక్తికి జైలు శిక్ష విధించటం ఇదే మొదటి. ఈ కొత్త చట్టాల ప్రకారం.. ప్రభుత్వానికి, ఉక్రెయిన్పై ప్రత్యేక సైనిక చర్యకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారికి గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు శిక్ష విధించేందుకు వీలు కల్పించారు. సైనిక చర్య ద్వారా తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రజల్లో ఆందోళన నెలకొనేలా గోరినోవ్ మాట్లాడారని తీర్పు సందర్భంగా జడ్జి తెలిపారు. విచారణకు హాజరైన సందర్భంగా ఓ చిన్న కాగితంపై 'ఇప్పటికీ ఈ యుద్ధం మీకు అవసరమా?' అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేశారు గోరినోవ్. దానిని కెమెరాకు కనిపించకుండా చేసేందుకు అక్కడి భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. చదవండి: Russia-Ukraine War: అసలు యుద్ధం ముందే ఉంది -
అమెరికాలోని ప్రాంతాన్ని ఆక్రమిస్తాం.. రష్యా షాకింగ్ కామెంట్స్!
ఉక్రెయిన్లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో రష్యా బలగాలు.. ఉక్రెయిన్లోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఉక్రెయిన్లో దాడుల కారణంగా రష్యా, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా.. తాజాగా రష్యా భారీ షాకిచ్చింది. తమపై ఆర్థిక ఆంక్షలను విధిస్తే.. అమెరికాలోని అలాస్కాను తిరిగి స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ ఆక్రమణను కారణంగా చూపించి రష్యాకు చెందిన ఆస్తులను స్తంభింపచేసినా, జప్తు చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా దిగువ సభ స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోదిన్ హెచ్చరించారు. ఇక, రష్యా సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్నప్పుడు 1861 జార్ అలెగ్జాండర్ తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా రష్యాలోని కొంత భూభాగాన్ని అమ్మేశాడు. 1867అక్టోబరు 18లో చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభంలో భాగంగా సోవియట్ యూనియన్లోని అలస్కా, అలూటియన్ దీవులను జార్ అలెగ్జాండర్.. 7.2 మిలియన్ డాలర్లకు అమెరికాకు అమ్మేశాడు. ఆ తర్వాత కొద్ది కాలంలో అలస్కాలో రష్యా కాలనీలు సైతం ఉన్నాయి. ఇక, 1881లో జార్ అలెగ్జాండర్ దారుణ హత్యకు గురయ్యాడు. కాగా, అక్టోబరు 18న అమెరికాలో అలాస్కా విలీనమైన కారణంగా ఆ తేదీన అలాస్కా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్లో రష్యా దాడులు కొనసాగుతుండగా పాశ్చాత్య దేశాలు రష్యపై విధించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పలు దేశాలు రష్యా, అలాగే రష్యన్ బిలియనీర్లకు చెందిన ఆస్తులను జప్తు చేశాయి. దీంతో రష్యా సైతం అమెరికా, ఇతర దేశాలకు చెందిన ప్రముఖులు రష్యాలో అడుగుపెట్టకుండా ఆంక్షలు విధించింది. Kremlin official suggests Russia could one day try to reclaim Alaska from the US https://t.co/TahOMTXDz1 via @Yahoo — Kazimierz (@Dm047Kazimierz) July 8, 2022 ఇది కూడా చదవండి: యుద్ధం ముగించండి.. ససేమిరా అంటున్న రష్యా! -
Russia-Ukraine War: రష్యా బలగాల దాడిలో బ్రెజిల్ మోడల్ మృతి
కీవ్: రష్యా బలగాలు చేసిన క్షిపణి దాడిలో బ్రెజిల్ మాజీ మోడల్, స్నైపర్.. థాలిట డో వల్లె (39) ప్రాణాలు కోల్పోయింది. భీకర యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్లో ఉన్న ఆమె.. ఆ దేశం తరఫున స్నైపర్గా బరిలోకి దిగి రష్యా సేనలకు అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. ఖార్కివ్ నగరంపై రష్యా సైన్యం జూన్ 30న క్షిపణులతో విరుచుకుపడింది. మొదటి క్షిపణి దాడి జరిగినప్పుడు తన ట్రూప్లో థాలిట మాత్రమే ప్రాణాలతో మిగిలింది. కాని ఆ తర్వాత మరో క్షిపణి పడటంతో ఆమె మృతి చెందింది. బంకర్లో ఉన్న థాలిట కోసం వెళ్లిన బ్రెజిల్ మాజీ సైనికుడు డాగ్లస్ బురిగో (40) కూడా క్షిపణి దాడిలోనే మరణించాడు. థాలిటకు గతంలో యుద్ధంలో పాల్గొన్న అనుభవం ఉంది. ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్కు వ్యతిరేకంగా ఆమె పోరాడింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీని తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసింది. ఇరాక్లో పెష్మెర్గాస్ సాయుధ బలగాల తరఫున పోరాడే సమయంలోనే స్నైపర్ శిక్షణ తీసుకుంది. ఆమె అనుభవాలను పుస్తకం రూపంలో తీసుకొచ్చేందుకు ఓ రచయిత బ్రెజిల్ సైనికుడితో కలిసి పనిచేస్తున్నాడు. నటిగా.. థాలటి యుక్త వయసులో నటిగా, మోడల్గా పని చేసింది. లా చదివే సమయంలో ఆమె ఎన్జీఓలతో కలిసి జంతువులను కాపాడే కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె సోదరుడు రొడ్రిగో వైరా.. ఆమె ఓ హీరో అని చెప్పాడు. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు, మనవతా కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు ఆమె దేశాలు సంచరిస్తుంటుందని పేర్కొన్నాడు. ఆమె ఉక్రెయిన్కు వెళ్లి మూడు వారాలే అవుతోందని చెప్పాడు. అక్కడ సహాయక కార్యక్రమాల్లోనే పాల్గొంటూనే షార్ప్ షూటర్గా సేవలందిస్తోందని తెలిపాడు. అదే చివరిసారి ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా బలగాలు బాంబు దాడులు జరిపినప్పుడు థాలిట తృటిలో ప్రాణాలతో బయపడింది. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నానని చెప్పింది. రష్యా బలగాలు డ్రోన్ల ద్వారా తన ఫోన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నందుకు ఎక్కువ మాట్లాడలేనని కుటుంబసభ్యులు వివరించింది. ఆ తర్వాత ఆమె గత సోమవారమే ఖార్కివ్కు వెళ్లింది. అప్పుడే చివరిసారిగా కుటుంబంతో మాట్లాడింది. -
Russia-Ukraine War: లుహాన్స్క్లో జెండా పాతేశాం: పుతిన్
పొక్రోవ్స్క్: తూర్పు ఉక్రెయిన్లోని అత్యంత కీలకమైన డోన్బాస్లో భాగమైన లుహాన్స్క్ ప్రావిన్స్లో రష్యా విజయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఖరారు చేశారు. లుహాన్స్క్లో జెండా పాతేశామని అన్నారు. ఈ ప్రాంతంపై రష్యా సైన్యం పూర్తిస్థాయిలో పట్టుబిగించడంతో ఉక్రెయిన్ సేనలు ఆదివారం వెనుదిరిగాయి. లుహాన్స్క్ను మన దళాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు అధ్యక్షుడు పుతిన్కు తెలియజేశారు. లుహాన్స్క్ ప్రావిన్స్లో పెద్ద నగరమైన లీసిచాన్స్క్ రష్యా వశమయ్యిందని, అక్కడ ఆపరేషన్ పూర్తయ్యిందని పేర్కొన్నారు. కీలక ప్రాంతంలో విజయం దక్కడం పట్ల పుతిన్ హర్షం వ్యక్తం చేశారు. రష్యా సైన్యానికి లక్ష్యంగా మారకుండా లుహాన్స్క్ నుంచి ఉక్రెయిన్ సేనలు వెనక్కి మళ్లాయని స్థానిక గవర్నర్ సెర్హియి హైడై తెలిపారు. మరికొంత కాలం అక్కడే ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. దానికి అధిక మూల్యం చెల్లించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. లుహాన్స్క్లో దక్కిన విజయంతో రష్యా సైన్యం ఇక డొనెట్స్క్లోని సివీరెస్క్, ఫెడోరివ్కా, బఖ్ముత్ వైపు కదిలేందుకు సన్నద్ధమవుతోందని ఉక్రెయిన్ సైనిక వర్గాలు తెలిపాయి. డొనెట్స్క్లో సగం భూభాగం ఇప్పటికే రష్యా నియంత్రణలో ఉంది. స్లొవియాన్స్క్, క్రామటోర్స్క్లో రష్యా వైమానిక దాడులు నానాటికీ ఉధృతమవుతున్నాయి. స్లొవియాన్స్క్లో తాజాగా రష్యా దాడుల్లో తొమ్మిదేళ్ల బాలిక సహా ఆరుగురు మరణించారు. 19 మంది క్షతగాత్రులయ్యారు. క్రామటోర్స్క్లోనూ రష్యా నిప్పుల వర్షం కురిపించింది. రష్యా దృష్టి మొత్తం ఇప్పుడు డొనెట్స్క్పైనే ఉందని బ్రిటిష్ రక్షణ శాఖ పేర్కొంది. పునర్నిర్మాణం.. ప్రపంచ బాధ్యత: జెలెన్స్కీ లుహాన్స్క్ నుంచి తమ దళాలు వెనుదిరగడం నిజమేనని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఆయుధాలు సమకూర్చుకొని, బలం పుంజుకుని పోరాటం కొనసాగిస్తామన్నారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణం ప్రజాస్వామ్య ప్రపంచ ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లో సోమవారం ‘ఉక్రెయిన్ రికవరీ కాన్ఫరెన్స్’లో ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. రష్యా దాడుల్లో దెబ్బతిన్న తమ దేశ పునర్నిర్మాణం అనేది స్థానిక ప్రాజక్టు లేదా ఒక దేశ ప్రాజెక్టు కాదని అన్నారు. ప్రజాస్వామ్య ప్రపంచంలో నాగరిక దేశాల ఉమ్మడి కార్యాచరణ అని వెల్లడించారు. రష్యాతో యుద్ధం ముగిసి తర్వాత తమ దేశ పునర్నిర్మాణానికి 750 బిలియన్ డాలర్లు అవసరమని ఉక్రెయిన్ ప్రధానమంత్రి అంచనా వేశారు. ఈ మేరకు రికవరీ ప్లాన్ రూపొందించారు. -
Russia-Ukraine War: లుహాన్స్క్ రష్యా వశం!
కీవ్: తూర్పు ఉక్రెయిన్లో డోన్బాస్ ప్రాంతంలోని లుహాన్స్క్ ప్రావిన్స్ రష్యా వశమైనట్టు సమాచారం. అక్కడి చివరి ముఖ్య నగరం లీసిచాన్స్క్ను ఆక్రమించినట్టు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ ఆదివారం ప్రకటించారు. దీనివల్ల డోన్బాస్లో జెండా పాతాలన్న లక్ష్యానికి రష్యా చేరువగా వచ్చినట్లయ్యింది. అక్కడి ప్రధాని నగరం సెవెరోడొనెటెస్క్ను రష్యా సేనలు ఇటీవలే స్వాధీనం చేసుకున్నాయి. లీసిచాన్స్క్లో ఉక్రెయిన్ హోరాహోరీగా పోరాడినా లాభం లేకపోయింది. లీసిచాన్స్క్ సిటీ నిజంగా రష్యా ఆధీనంలో వెళ్లిందా, లేదా అనేదానిపై ఉక్రెయిన్ అధికారులు ఇంకా స్పందించలేదు. అయితే, లుహాన్స్క్పై రష్యా జవాన్లు భీకర స్థాయిలో విరుచుకుపడుతున్నట్లు ఆదివారం ఉదయం లుహాన్స్క్ గవర్నర్ సెర్హియి హైడై వెల్లడించారు. ఉక్రెయిన్ ప్రతిదాడుల్లో రష్యా సైన్యానికి భారీ నష్టం వాటిల్లుతోందని తెలిపారు. అయినప్పటికీ రష్యా సేనలు మున్ముందుకు దూసుకొస్తున్నాయని పేర్కొన్నారు. లీసిచాన్స్క్ ఆక్రమణతో ఇక డోంటెస్క్ ప్రావిన్స్లోకి అడుగు పెట్టడం రష్యాకు సులభతరంగా మారనుంది. మరోవైపు స్లొవ్యాన్స్క్లో రష్యా వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో జనం మరణించారని స్థానిక మేయర్ ప్రకటించారు. ఇక మెలిటోపోల్లో రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ఉక్రెయిన్ దాడుల్లో రష్యాకు చెందిన ఒక సైనిక స్థావరం ధ్వంసమయ్యింది. రష్యా భూభాగంలో ఉక్రెయిన్ దాడులు మరోవైపు ఉక్రెయిన్ సైన్యం రష్యా భూభాగంలోకి చొచ్చుకొచ్చి దాడులు చేయడం ఆసక్తికరంగా మారింది. పశ్చిమ రష్యాలో ఆదివారం ఉక్రెయిన్ క్షిపణి దాడుల్లో నలుగురు మృతిచెందారు. కుర్స్క్లో రెండు ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని రష్యా పేర్కొంది. సరిహద్దులోని టెట్కినో పట్టణంలో ఉక్రెయిన్ జవాన్లు మోర్టార్లతో దాడికి దిగారు. బెలారస్లోనూ ఉక్రెయిన్ వైమానిక దాడులు సాగించింది. రష్యాలోని బెల్గరోడ్ నగరంలో భారీ ఎత్తున జరిగిన బాంబు దాడుల్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ముగ్గురు మరణించారు. ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్లో ఆస్ట్రేలియా ప్రధాని పర్యటన ఉక్రెయిన్లో దెబ్బతిన్న పట్టణాలను ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బేనీస్ సందర్శించారు. ఉక్రెయిన్ రష్యా దారుణమైన అకృత్యాలకు తగిన శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. -
Russia-Ukraine War: తూర్పు ఉక్రెయిన్లో భీకర పోరు
కీవ్: తూర్పు ఉక్రెయిన్లో భీకర పోరు కొనసాగుతోంది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను పూర్తిగా ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా సేనలు భారీ స్థాయిలో బాంబు దాడులు చేస్తున్నాయి. వాటిలో పలు నగరాల్లో భవనాలు తదితరాలు నేలమట్టం కావడంతో పాటు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించినట్టు ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. రష్యా దాడుల తీవ్రతను పెంచిన నేపథ్యంలో సెవెరోడొనెట్స్క్లో కెమికల్ ప్లాంటులో చిక్కుకున్న వందలాది పౌరులు, ఉక్రెయిన్ సైనికుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. తనను యూరోపియన్ యూనియన్లో చేర్చుకోవడంపై సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వస్తాయని ఉక్రెయిన్ ఆశాభావం వెలిబుచ్చింది. ఈ మేరకు త్వరలో నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నట్టు దేశ ఉప ప్రధాని ఓలా స్టెఫానిష్నా అన్నారు. మరోవైపు యుద్ధం మొదలైన తొలినాళ్లలో మరణించిన ఉక్రెయిన్ ఫొటో జర్నలిస్టును రష్యా సేనలు సజీవంగా పట్టుకుని దారుణంగా హతమార్చినట్టు తాజాగా వెలుగు చూసింది. రష్యా తరఫున గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై ఓ ఉక్రెయిన్ అధికారిని, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఉక్రెయిన్లో హోరాహోరీగా యుద్ధం: మరో 4 నెలలు?
కీవ్: రష్యా తెర తీసిన అకారణ యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కన్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తమ అందమైన దేశంలో జరిపిన ప్రతి హత్యాకాండకూ, దాడికీ పుతిన్ పశ్చాత్తాపపడేలా చేసి తీరతామన్నారు. ‘‘డోన్బాస్లో రోజుల వ్యవధిలో చేజిక్కించుకుంటానని ఫిబ్రవరిలో యుద్ధ ప్రారంభంలో రష్యా ఆశ పడింది. నాలుగు నెలలవుతున్నా అక్కడ పోరాటం సాగుతూనే ఉంది. అక్కడ రష్యా బలగాలను సమర్థంగా అడ్డుకుంటున్న మా సేనలను చూస్తే ఎంతో గర్వంగా ఉంది’’ అన్నారు. యుద్ధం తొలినాళ్లలో ఆక్రమించుకున్న దక్షిణ ఖెర్సన్ నుంచి కూడా రష్యా బలగాలను తాజాగా వెనక్కు తరిమినట్టు ఆయన చెప్పారు. ఉక్రెయిన్లోని ఆక్రమిత ప్రాంతాల్లో పౌరులకు రష్యా పాస్పోర్టుల జారీ, రష్యా చానళ్ల ప్రసారం, రష్యా స్కూలు యూనిఫాం ప్రవేశపెట్టడం వంటివి జరుగుతుండటం తెలిసిందే. యుద్ధ లక్ష్యాలను త్వరగా సాధించలేమన్న వాస్తవాన్ని రష్యా అర్థం చేసుకుందని, అందుకే అక్టోబర్ దాకా పోరు కొనసాగించాలని నిర్ణయించుకుందని ఉక్రెయిన్ సైన్యం అంచనా వేస్తోంది. డోన్బాస్ చిక్కితే ముందుగానే ముగించొచ్చని భావిస్తోంది. చదవండి: Russia-Ukraine war: మెక్డొనాల్డ్స్ రీ ఓపెన్ హోరాహోరీ లుహాన్స్క్లో ఉక్రెయిన్ అధీనంలో ఉన్న చివరి పెద్ద పట్టణాలు సెవెరోడొనెట్స్క్, లిసిచాన్స్క్ల్లో హోరాహోరీ జరుగుతోంది. సెవెరోడొనెట్స్క్లోని కెమికల్ ప్లాంటులో 400 మంది దాకా ఉక్రెయిన్ సైనికులు చిక్కుపడ్డారని సమాచారం. మారియుపోల్లోనూ ఇలాగే చిక్కుబడ్డ వేల మంది ఉక్రెయిన్ సైనికులు నెలల తరబడి పోరాడి చివరికి లొంగిపోవడం, వారిని రష్యా యుద్ధ ఖైదీలుగా తీసుకెళ్లడం తెలిసిందే. ఉక్రెయిన్కు ఆయుధాలిస్తున్న పశ్చిమ దేశాలే శాంతి ప్రక్రియకు సంధి కొడుతున్నాయని చైనా మండిపడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలకు తమ మద్దతుంటుందని ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ వెయ్ ఫెంగ్ అన్నారు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్పైకి ప్రాణాంతక ఆయుధాలు
కీవ్: భారీ సామూహిక మరణాలే లక్ష్యంగా ఉక్రెయిన్లో రష్యా సేనలు మరిన్ని ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగించవచ్చని ఇంగ్లండ్ రక్షణ శాఖ హెచ్చరించింది. 1960ల నాటి యాంటీ–షిప్ మిస్పైళ్లతో పాటు అణు వార్హెడ్లతో కూడిన కేహెచ్–22 మిస్సైళ్లతో ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చవచ్చని పేర్కొంది. తూర్పు ఉక్రెయిన్లో శనివారం రష్యా దాడుల్లో పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. దక్షిణ ఉక్రెయిన్లో తమ చేజిక్కిన మెలిటోపోల్ సిటీలో పౌరులకు రష్యా పాస్పోర్టులు ఇస్తోంది. జెలెన్స్కీతో ఉర్సులా భేటీ యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వోన్ డెర్ లెయన్ కీవ్లో అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. రష్యా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేసేలా మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలను జెలెన్స్కీ కోరారు. తూర్పు ఉక్రెయిన్ నుంచి వలసలు బాంబులు మోత, ఆహార సంక్షోభం దెబ్బకు తూర్పు ఉక్రెయిన్ నుంచి జనం భారీగా వలస వెళ్తున్నారు. వీరిలో చాలామంది మహిళలు, చిన్నారులు, వృద్ధులే ఉన్నారు. రష్యా అనుకూల వేర్పాటువాదులు మరణశిక్ష విధించిన ముగ్గురు విదేశీయులను కాపాడతామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా చెప్పారు. వారిలో ఇద్దరు యూకే పౌరులు, ఒక మొరాకో పౌరుడున్నారు. మారియూపోల్కు కలరా ముప్పు దక్షిణ ఉక్రెయిన్లోని మారియూపోల్ నగరానికి కలరాతోపాటు ఇతర ప్రాణాంతక రోగాల ముప్పు పొంచి ఉందని స్థానిక మేయర్ బొయ్చెంకో ఆందోళన వ్యక్తం చేశారు. మారియూపోల్లో రష్యా దాడుల్లో చనిపోయిన వారి మృతదేహాలను ఇంకా పూర్తిగా తొలగించలేదని చెప్పారు. వందలాది మృతదేహాలు కుళ్లిపోతున్నాయని, ఫలితంగా జలవనరులు కలుషితం అవుతున్నాయన్నారు. తాగనీరు కలుషితమై రోగాలు దాడి చేసే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే నివారణ చర్యలు చేపట్టకపోతే వేలాది మంది బలయ్యే అవకాశం ఉందని వాపోయారు. హెచ్చరించినా పట్టించుకోలేదు: బైడెన్ లాస్ఏంజెలెస్: ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర గురించి తమ నిఘా సంస్థలు ముందుగానే సమాచారం సేకరించాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఆయన లాస్ఏంజెలెస్లో డెమొక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో నిధుల సేకరణ కార్యక్రమంలో మాట్లాడారు. యుద్ధానికి రష్యా సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అప్రమత్తం చేశానని, అయినప్పటికీ ఆయన పెడచెవిన పెట్టారని అన్నారు. రష్యా ప్రారంభించబోయే యుద్ధం గురించి వినడానికి జెలెన్స్కీ ఇష్టపడలేదని తెలిపారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం గురించి స్పందిస్తూ.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిణామం జరగలేదన్నారు. ఇది అతిశయోక్తి కాదని, ముమ్మాటికీ వాస్తవమేనని స్పష్టం చేశారు. -
Russia Ukraine war: డోన్బాస్పై రష్యా పిడికిలి
కీవ్/మాస్కో/వాషింగ్టన్: తూర్పు ఉక్రెయిన్లో పారిశ్రామికప్రాంతమైన డోన్బాస్పై రష్యా పట్టు బిగుస్తోంది. ఈ ప్రాంతంలో కీలకమైన సీవిరోడోంటెస్క్ శివార్లలోకి రష్యా దళాలు సోమవారం అడుగుపెట్టాయి. లీసిచాన్స్క్ దిశగా దూసుకెళ్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఆయుధ సామగ్రిని ఇక్కడికి తరలిస్తున్నాయి. పుతిన్ సేనలు పెద్ద వ్యూహమే పన్నినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లుహాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ సెర్గీ హైడై స్వయంగా ప్రకటించారు. రష్యా సైన్యం దాడుల్లో తాజాగా ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు మరణించారని, ఐదుగురు గాయపడ్డారని చెప్పారు. డోన్బాస్లో మారియుపోల్ ఉదంతమే పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సీవిరోడోంటెస్క్ రష్యా దక్షిణ సరిహద్దుకు 143 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రస్తుతం ఇక్కడే కేంద్రీకృతమైంది. లుహాన్స్క్ ప్రావిన్స్లో ఉక్రెయిన్ అధీనంలో ఉన్న ప్రాంతాలు సీవిరోడోంటెస్క్, లీసిచాన్స్క్ మాత్రమే. లుహాన్స్క్, డోంటెస్క్ను కలిపి డోన్బాస్గా పిలుస్తారు. డోంటెస్క్, లైమాన్లోనూ రష్యా, ఉక్రెయిన్ దళాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఉక్రెయిన్లోని డోంటెస్క్, లుహాన్స్క్కి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. ఆ రెండు ప్రాంతాలను తాము స్వతంత్ర రాజ్యాలుగానే చూస్తున్నామని తెలిపారు. మైకోలైవ్ షిప్యార్డ్లో ఉక్రెయిన్ సైనిక వాహనాలను తాము ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ చెప్పారు. డోన్బాస్లో పరిస్థితి ఇప్పుడు మాటల్లో వర్ణించలేనంత తీవ్రంగానే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఆయన రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్లో సైనికులతో మాట్లాడారు. మా వద్ద ఆ ప్రణాళిక లేదు: బైడెన్ ఉక్రెయిన్కు తాము ఆయుధాలు పంపించబోతున్నట్లు వస్తున్న వార్తనలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. లాంగ్–రేంజ్ రాకెట్ సిస్టమ్స్ను ఉక్రెయిన్కు ఇవ్వడం లేదని, అలాంటి ప్రణాళికేదీ తమ వద్ద లేదని స్పష్టం చేశారు. బైడెన్ ప్రకటన పట్ల రష్యా భద్రతా మండలి ఉప నేత దిమిత్రీ మెద్వెదేవ్ హర్షం వ్యక్తం చేశారు. కళాకారుల సాయం ఉక్రెయిన్కు చేతనైన సాయం అందించేందుకు కళాకారులు సైతం ముందుకొస్తున్నారు. కొన్ని రోజుల క్రితం యూరోవిజన్ పాటల పోటీలో విజేతగా నిలిచిన కలుష్ ఆర్కెస్ట్రా బృందం(ఉక్రెయిన్) సైతం ఈ జాబితాలో ఉంది. కలుష్ బృందానికి లభించిన ట్రోఫీ క్రిస్టల్ మైక్రోఫోన్ను క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ‘వైట్బిట్’ 9 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ సొమ్ముతో ఉక్రెయిన్ సైన్యానికి మూడు డ్రోన్లు, గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్ అందిస్తామని కలుష్ బృందం వెల్లడించింది. అది చరిత్రాత్మక అవకాశం: స్టోల్టెన్బర్గ్ మాడ్రిడ్లో వచ్చే నెలలో జరగబోయే సదస్సు నాటో కూటమిని బలోపేతం చేసుకోవడానికి ఒక చరిత్రాత్మక అవకాశం అవుతుందని కూటమి సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ సోమవారం చెప్పారు. నాటో కూటమిలోకి స్వీడన్, ఫిన్లాండ్ను ఆహ్వానించేందుకు తాను ఉత్సాహంతో ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. -
Russia-Ukraine war: ముట్టడిలో నగరాలు
పోక్రోవ్స్క్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్లో రష్యా పెను విధ్వంసం సృష్టిస్తోంది. తూర్పున డోన్బాస్లో పలు నగరాలపై బాంబు దాడులతో విరుచుకుపడింది. తయరీ పరిశ్రమకు కేంద్రమైన సెవెరోడోనెట్స్క్ నగరం బాంబులు, క్షిపణుల మోతతో దద్దరిల్లింది. సమీపంలోని లిసిచాన్స్క్ తదితర నగరాలపైనా దాడులు తీవ్రతరమయ్యాయి. డోన్బాస్లో కీలక కేంద్రాలైన ఈ రెండు నగరాలను ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా బలగాలు ముందుకు కదులుతున్నాయి. అయితే ఉక్రెయిన్ దళాలు పలుచోట్ల వాటితో హోరాహోరీ తలపడుతున్నాయి. డోన్బాస్ చాలావరకు రష్యా అనుకూల వేర్పాటువాదుల చేతుల్లో ఉండగా ఈ రెండు నగరాలూ ఉక్రెయిన్ అధీనంలో ఉన్నాయి. అక్కడి సైనిక లక్ష్యాలపై జరిగిన దాడుల్లో పలువురు పౌరులు కూడా బలయ్యారు. పౌర సేవలన్నీ స్తంభించిపోయాయి. సెవెరోలో ఇప్పటికే కనీసం 1500 మందికి పైగా మరణించినట్టు ఉక్రెయిన్ చెబుతోంది. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని బాబ్రోవ్ గ్రామం వద్ద జరిగిన పోరులో రష్యా దళాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు సమాచారం. చాలామంది సైనికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు అవుతున్నట్టు చెబుతున్నారు. లుహాన్స్క్ ప్రాంతంలోని బక్ముట్ నగరంపైనా శనివారం రాత్రి నుంచి దాడులు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్నాయి. మరోవైపు ఉత్తరాన రెండో అతి పెద్ద నగరమైన ఖర్కీవ్తో పాటు , సమీ తదితర ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అక్కడి సరిహద్దు ప్రాంతాలపై క్షిపణి దాడుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు ఉక్రెయిన్ చెబుతోంది. ఈయూ ఆంక్షలను బేఖాతరు చేస్తూ రష్యాతో సెర్బియా మూడేళ్ల గ్యాస్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ దేశం ఇంధన అవసరాల కోసం దాదాపుగా రష్యా మీదే ఆధారపడింది. -
Russia Ukraine war: లైమాన్.. రష్యా హస్తగతం!
కీవ్/మాస్కో: తూర్పు ఉక్రెయిన్లోని డోన్బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైన్యం తీవ్రంగా పోరాడుతోంది. మారియుపోల్ అనంతరం డోన్బాస్పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో పెద్ద నగరమైన లైమాన్ను తమ దళాలు, వేర్పాటువాదులు హస్తగతం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ శనివారం ప్రకటించారు. ముఖ్యమైన రైల్వే జంక్షన్ను సైతం ఆక్రమించినట్లు తెలిపారు. లైమాన్కు విముక్తి కల్పించామని వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24 కంటే ముందు లైమాన్లో 20 వేల జనాభా ఉండేది. యుద్ధం మొదలైన తర్వాత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఉక్రెయిన్ ప్రభుత్వం తరలించింది. ఇక్కడున్న రైల్వే జంక్షన్లో రష్యా దళాలు పాగా వేశాయి. లైమాన్పై పట్టుచిక్కడంతో డోంటెస్క్, లుహాన్స్క్ను స్వాధీనం చేసుకోవడం రష్యాకు మరింత సులభతరం కానుంది. ఈ రెండు ప్రావిన్స్లను కలిపి డోన్బాస్గా వ్యవహరిస్తారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ను ఆక్రమించలేక విఫలమైన రష్యా డోన్బాస్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. లుహాన్స్క్ ప్రావిన్స్లోని నగరాలైన సీవిరోడోంటెస్క్, లీసిచాన్స్క్లో రష్యా వైమానిక దాడుల శనివారం కూడా కొనసాగాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో పరిస్థితి ప్రస్తుతం సంక్లిష్టంగానే ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. అయినప్పటికీ తమ దేశానికి ముప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ఒక స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తుందని అన్నారు. 50 ఏళ్ల దాకా రష్యా సైన్యంలో చేరొచ్చు సైన్యంలో కాంట్రాక్టు సైనికుల నియామకాల కోసం వయోపరిమితిని పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం సంతకం చేశారు. ఈ బిల్లు ప్రకారం.. 50 ఏళ్ల వయసు లోపు ఉన్నవారు కాంట్రాక్టు జవాన్లుగా రష్యా సైన్యంలో చేరి సేవలందించవచ్చు. పురుషులైతే 65 ఏళ్లు, మహిళలైతే 60 ఏళ్లు వచ్చేదాకా సైన్యంలో పనిచేయొచ్చు. వార్షిక బోర్డర్ గార్డ్స్ దినోత్సవంలో పుతిన్ పాల్గొన్నారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లను అభినందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షోల్జ్తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. తమ దేశంపై ఆంక్షలు ఎత్తివేస్తే ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు ఎగమతి చేయడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వొద్దని మాక్రాన్, షోల్జ్కు సూచించారు. ఆయుధాలు సరఫరా చేస్తే ఉక్రెయిన్లో పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. పరిమాణాలను ప్రమాదకరంగా మార్చొద్దని చెప్పారు. -
Ukraine Crisis: యుద్ధం ముగిసింది.. రష్యా సంచలన ప్రకటన
లండన్: ఉక్రెయిన్లోని జైటోమిర్ ప్రాంతంలో భారీ సంఖ్యలో పశ్చిమ దేశాల ఆయుధాలను, సైనిక సామగ్రిని ధ్వంసం చేశామని రష్యా సైన్యం శనివారం ప్రకటించింది. సముద్ర ఉపరితలం నుంచి ప్రయోగించే క్యాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్లతో ఆ ఆయుధాలను అగ్నికి ఆహుతి చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతోపాటు యూరప్ దేశాల నుంచి ఈ ఆయుధాలు ఉక్రెయిన్కు చేరాయని వెల్లడించింది. డోన్బాస్లో రష్యా సేనలను ఎదుర్కొనడానికే వీటిని ఉక్రెయిన్ సిద్ధం చేసుకుందని తెలిపింది. పలుచోట్ల ఉక్రెయిన్ సైనిక పోస్టులను ధ్వంసం చేశామనిపేర్కొంది. ఫిన్లాండ్కు రష్యా గ్యాస్ నిలిపివేత హెల్సింకీ: నాటో కూటమిలో చేరేందుకు ఉత్సాహంగా అడుగులు ముందుకేస్తున్న ఫిన్లాండ్కు రష్యా గట్టి షాకిచ్చింది. శనివారం ఫిన్లాండ్కు గ్యాస్ ఎగుమతులను నిలిపివేసింది. దీంతో రష్యా నుంచి ఫిన్లాండ్కు గత 50 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న గ్యాస్ సరఫరా ఆగిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 7 గంటలకు రష్యా నుంచి సహజ వాయువు సరఫరా నిలిచిపోయినట్లు ఫిన్లాండ్ ప్రభుత్వ రంగంలోని గాసూమ్ గ్యాస్ కంపెనీ ప్రకటించింది. తమ దేశం నుంచి గ్యాస్ దిగుమతి చేసుకొనే దేశాలన్నీ డాలర్లలో కాకుండా రూబుల్స్లోనే చెల్లింపులు చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్ చేశారు. కానీ, ఫిన్లాండ్నిరాకరించింది. ఫిన్లాండ్కు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని రష్యా ఇప్పటికే నిర్ణయించుకుంది. రష్యాతో ఫిన్లాండ్కు 1,340 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. నాటోలో చేరాలన్న ఫిన్లాండ్ ఆకాంక్షను రష్యా వ్యతిరేకిస్తోంది. ‘40 బిలియన్ డాలర్ల’ బిల్లుపై బైడెన్ సంతకం రష్యా దాడుల వల్ల సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్కు అమెరికా అందించనున్న 40 మిలియన్ డాలర్లకు పైగా సాయానికి సంబంధించిన బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ శనివారం సంతకం చేశారు. సియోల్లో పర్యటిస్తున్న బైడెన్ వద్దకు బిల్లు కాపీని అధికారులు విమానంలో అమెరికా నుంచి ఆగమేఘాలపై తీసుకొచ్చారు. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసిపోయే అవకాశం లేదని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అమెరికా సర్కారు ఉక్రెయిన్కు ఇప్పటికే 13.6 బిలియన్ డాలర్ల సాయం అందించింది. కొత్త బిల్లులో భాగంగా 20 బిలియన్ డాలర్ల తోడ్పాటును సైనిక, ఆయుధ రూపంలో ఇవ్వనుంది. రష్యా దాడులను ఉక్రెయిన్ దళాలు సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ సాయం దోహదపడనుందని అమెరికా భావిస్తోంది. అలాగే 8 బిలియన్ డాలర్ల సాధారణ సాయం, ఆహార సంక్షోభాన్ని అధిగమించేందుకు 5 బిలియన్ డాలర్లు, శరణార్థుల కోసం బిలియన్ డాలర్లను ఇవ్వనుంది. మాపై అత్యాచారాలు ఆపండి: కేన్స్ ఫెస్టివల్లో మహిళ అర్ధనగ్న నిరసన ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో శుక్రవారం సాయంత్రం అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్లో రష్యా సైనికుల దాష్టీకాలను వ్యతిరేకిస్తూ ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. రెడ్కార్పెట్పైకి చేరుకోగానే ఒంటిపై బట్టలు విప్పేసింది. తన శరీరంపై ఉక్రెయిన్ జాతీయ పతాకం పెయింటింగ్తోపాటు ‘మాపై అత్యాచారాలు ఆపండి’ అని రాసి ఉన్న ఆక్షరాలను ప్రదర్శించింది. మహిళ శరీరంపై కేవలం ఎరుపు రంగు లో దుస్తులు మాత్రమే ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఫిలిం ఫెస్టివల్లో స్వల్ప అంతరాయం కలిగింది. ⚡️🇷🇸 #Serbia imposed sanctions against #Belarus The country joined the #EU on the issue of restrictions due to the war in #Ukraine. The sanctions are directed against the financial and transport system of Belarus. pic.twitter.com/bmDyiTRxfj — NEXTA (@nexta_tv) May 20, 2022 ఇది కూడా చదవండి: దుస్తులు విప్పేసి ఉక్రెయిన్ మహిళ నిరసన.. వీడియో వైరల్ -
Russia-Ukraine war: రెండు నగరాల ముట్టడి
కీవ్/మాస్కో/ఇస్తాంబుల్: ఉక్రెయిన్లో కీలక నగరం మారియుపోల్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు ముందుకు సాగుతున్నాయి. జంట నగరాలైన సెవెరోడోన్టెస్క్, లిసీచాన్స్క్ను చుట్టుముట్టాయి. ఈ రెండు నగరాలను ఒక నది మాత్రమే వేరు చేస్తుంది. రష్యా సేనలు బాంబుల వర్షం కురిపించడంతో సెవెరోడోన్టెస్క్, లిసీచాన్స్క్ ప్రజలు బెంబేలెత్తిపోయారు. రష్యా దాడిలో నలుగురు మృతి రష్యా క్షిపణి దాడుల్లో నలుగురు పౌరులు మృతిచెందారని ఉక్రెయిన్లోని లుహాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ సెర్హివ్ హైడై చెప్పారు. సీవీరోడోన్టెస్క్ పట్టణంపై జరిగిన దాడుల్లో మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొన్నారు. డోన్టెస్క్లో గత 24 గంటల్లో ఉక్రెయిన్ సైన్యం దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారని, మరో ఐదుగురు గాయపడ్డారని రష్యా అనుకూల వేర్పాటువాదులు ప్రకటించారు. మారియుపోల్లోని అజోవ్స్టల్ స్టీల్ప్లాంట్లో యూలియా పైయీవ్స్కా అనే విద్యార్థిని బాడీ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలు సంచలనాత్మకంగా మారాయి. ఆమె 256 గిగాబైట్ల సామర్థ్యం గల వీడియోలో చిత్రీకరించారు. మార్చి 16న ఆమె, ఆమె డ్రైవర్ను రష్యా జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. సదరు వీడియోలు అసోసియేట్ ప్రెస్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్ దాడిలో రష్యా పౌరుడు బలి సరిహద్దు వద్ద ఉక్రెయిన్ భూభాగం నుంచి జరిగిన దాడిలో తమ పౌరుడి చనిపోయాడని, మరికొందరు గాయపడ్డారని పశ్చిమ రష్యాలోని కుర్స్క్ గవర్నర్ రోమన్ స్టారోవోయిట్ చెప్పారు. మారియుపోల్లో ఉన్న అజోవ్స్టల్ స్టీల్ప్లాంట్ నుంచి రష్యా దళాల నుంచి విముక్తి పొందిన ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు ఇంటర్నేషన్ రెడ్క్రాస్ గురువారం వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీల రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్లు తెలియజేసింది. అప్పటిదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదు రష్యా దళాలు తమ దేశం నుంచి వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారు మిఖాయిలో పోడోలైక్ డిమాండ్ చేశారు. అప్పటిదాకా కాల్పుల విరమణ వినతిని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఉక్రెయిన్లో తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ సూచించారు. క్షమాపణ కోరిన వాదిమ్ శిషిమారిన్ ఉక్రెయిన్లో యుద్ధ నేరాలపై విచారణను ఎదుర్కొంటున్న తొలి రష్యా సైనికుడు వాదిమ్ శిషిమారిన్ గురువారం కోర్టుకు హాజరయ్యాడు. తనను క్షమించాలంటూ ఒలెగ్జాండర్ షెలిపోవ్ భార్య కేటరినా షెలిపోవాను కోరాడు. ఉన్నతాధికారుల ఆదేశాల వల్లే ఫిబ్రవరి 28న ఒలెగ్జాండర్ షెలిపోవ్ను తాను కాల్చి చంపాల్సిన వచ్చిందని తెలిపాడు. యుద్ధ నేరాల కేసులో నేరం రుజువైతే శిషిమారిన్కు యావజ్జీవ కారాగార శిక్ష పడనుంది. పోర్చుగల్ దౌత్యవేత్తల బహిష్కరణ..: రష్యా ప్రభుత్వం పోర్చుగల్ ఎంబసీకి చెందిన ఐదుగురు దౌత్యవేత్తలను బహిష్కరించింది. రెండు రోజుల క్రితమే స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ ఎంబసీల నుంచి దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలు రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ సరుకులపై దిగుమతి సుంకాలు రద్దు ఉక్రెయిన్కు మరింత చేయూతనందించాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకొనే అన్ని రకాల సరుకులపై దిగుమతి సుంకాలు రద్దుచేసింది. యుద్ధం వల్ల నష్టపోతున్న ఉక్రెయిన్కు మరో 300 మిలియన్ డాలర్ల సాయం అందజేస్తామని జపాన్ ప్రకటించింది. ఉక్రెయిన్కు జపాన్ ఇప్పటికే 300 మిలియన్ డాలర్లు అందజేసింది. స్వీడన్, ఫిన్లాండ్ నాటోలో చేరొద్దు: టర్కీ నాటో కూటమిలో చేరాలన్న స్వీడన్, ఫిన్లాండ్ ఆకాంక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు తయీప్ ఎర్డోగాన్ చెప్పారు. ఆ రెండు దేశాలు ఉగ్రవాదానికి అడ్డాగా మారాయని ఆరోపించారు. స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటోలో చేరాలంటే టర్కీ మద్దతు కీలకం. జార్జి డబ్ల్యూ బుష్ వివరణ ‘ఇరాక్పై క్రూరమైన దండయాత్ర సాగించడం అన్యాయం’ అని వ్యాఖ్యానించిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ తాజాగా వివరణ ఇచ్చారు. ఉక్రెయిన్పై అనబోయి పొరపాటున ఇరాక్ అన్నానని చెప్పారు. 2003లో బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఇరాక్పై అమెరికా యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. -
Russia-Ukraine war: రష్యా చేతికి మారియుపోల్
కీవ్: ఉక్రెయిన్లో వరుస ఎదురుదెబ్బలతో డీలా పడ్డ రష్యాకు ఎట్టకేలకు చిన్న ఊరట. కీలక రేవు పట్టణం మారియుపోల్పై రష్యా సైన్యాలు పూర్తిగా పట్టు సాధించాయి. దాదాపు మూడు నెలల పోరాటంలో రష్యాకు చిక్కిన అతి పెద్ద నగరం ఇదే! వాస్తవానికి అజోవ్స్తల్ స్టీల్ ఫ్యాక్టరీ మినహా నగరమంతా ఎప్పుడో రష్యా గుప్పెట్లోకి వెళ్లింది. ఫ్యాక్టరీలో దాగున్న ఉక్రెయిన్ సైనికులు మాత్రం రెండు నెలలుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆహారం తదితర వనరులన్నీ నిండుకోవడంతో ఇక పోరాడలేక వారంతా సోమవారం నుంచి లొంగుబాట పట్టారు. అది బుధవారంతో ముగిసిందని రష్యా ప్రకటించింది. 959 మంది లొంగిపోయినట్టు వెల్లడించింది. వారిని బస్సుల్లో డోన్బాస్లో వేర్పాటువాదుల అధీనంలోని ఒలెనివ్కా నగరానికి తరలించారు. ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా వారికి ఉక్రెయిన్ కూడా మంగళవారమే పిలుపునిచ్చింది. ఖైదీల మార్పిడి కింద వారిని తమకు అప్పగిస్తారని ఉక్రెయిన్ భావిస్తుండగా, రష్యా మాత్రం కొందరినైనా యుద్ధ నేరాల కింద విచారిస్తామని చెబుతోంది. దాంతో లొంగిపోయిన వారి భవితవ్యంపై అయోమయం నెలకొంది. మరోవైపు ఉక్రెయిన్కు అమెరికా అందజేసిన అత్యాధునిక ఆయుధాలతో కూడిన పలు నిల్వలను ధ్వంసం చేసినట్టు రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ చెప్పారు. వాటిలో ఎం777 హొవిట్జర్లు తదితరాలున్నాయన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రష్యా విడుదల చేసింది. చరిత్రాత్మక క్షణం: నాటో చీఫ్ మారియుపోల్ చిక్కిన ఆనందంలో ఉన్న రష్యాకు మింగుడు పడని పరిణామం చోటుచేసుకుంది. నాటో సభ్యత్వం కోసం స్వీడన్, ఫిన్లాండ్ బుధవారం లాంఛనంగా దరఖాస్తు చేసుకున్నాయి. దీన్ని చరిత్రాత్మక క్షణంగా నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోటెన్బర్గ్ అభివర్ణించారు. ‘‘ఈ క్షణాన్ని వదులుకోబోం. ఆ రెడు దేశాలకు తక్షణం సభ్యత్వం ఇచ్చేందుకు చర్యలు చేపడతాం’’ అని ప్రకటించారు. మామూలుగా ఏడాది పట్టే దరఖాస్తు పరిశీలన ప్రక్రియను రెండు వారాల్లో ముగించాలని నాటో నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఫిన్లండ్, స్వీడన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రష్యా మరోసారి హెచ్చరించింది. అయితే అమెరికా, ఇంగ్లండ్తో పాటు పలు నాటో దేశాలు ఇందుకు దీటుగా స్పందించాయి. దరఖాస్తులు ఆమోదం పొందేలోపు ఆ దేశాలపై రష్యా దుందుడుకు చర్యలకు దిగితే వాటికి అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని ప్రకటించాయి. వాటి చేరికకు మొత్తం నాటో సభ్య దేశాలన్నీ అంగీకరించాల్సి ఉంటుంది. టర్కీ వ్యతిరేకత నేపథ్యంలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. నాటోలో చేరే ఉద్దేశం లేదని ఆస్ట్రియా వెల్లడించింది. ప్రతీకార చర్యల్లో భాగంగా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది. ఉక్రెయిన్ పునరుద్ధరణకు 950 కోట్ల డాలర్ల రుణం మంజూరు చేయాలని యూరోపియన్ కమిషన్ ప్రతిపాదించింది. ఉక్రెయిన్కు ఇప్పటికే 410 కోట్ల యూరోల సాయాన్ని సేకరించినట్టు కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ చెప్పారు. సైనికుడి నేరాంగీకారం యుద్ధ నేరాల విచారణ ఎదుర్కొంటున్న ఓ రష్యా సైనికుడు తనపై మోపిన అభియోగాలను అంగీకరించాడు. ఫిబ్రవరి 28న సమీ ప్రాంతంలో కార్లో కూర్చుని ఉన్న ఓ నిరాయుధ ఉక్రెయిన్ పౌరున్ని తలలో కాల్చి చంపినట్టు సార్జెంట్ వడీం షిషిమారిన్ (21) వెల్లడించాడు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్పై భద్రతా మండలి ఏకగ్రీవ ప్రకటన
ఐరాస/జపోరిజియా(ఉక్రెయిన్): ఉక్రెయిన్లో రష్యా యుద్ధంపై, ఫలితంగా ఆ దేశంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. సమస్యకు తక్షణం శాంతియుత పరిష్కారం కనుగొనాలంటూ యుద్ధంపై తొలిసారిగా ఏకగ్రీవ ప్రకటన చేసింది. ఈ దిశగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చేస్తున్న ప్రయత్నాలకు 15 మంది సభ్యుల సమితి పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే ప్రకటనలో యుద్ధం అనే పదాన్ని వాడకుండా జాగ్రత్త పడ్డారు. రక్తపాతం ద్వారా ఏ పరిష్కారమూ దొరకదని, దౌత్యం, చర్చల ద్వారానే యుద్ధానికి ముగింపు పలకాలన్నది ముందునుంచీ భారత వైఖరి అని ఐరాసలో భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ ప్రతీక్ మాథుర్ పునరుద్ఘాటించారు. మే 9 విక్టరీ డే సమీపిస్తున్న నేపథ్యంలో రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సిద్ధమవుతోంది. రెండో అతి పెద్ద నగరం ఖర్కీవ్ను రక్షణపరంగా దుర్భేద్యంగా మార్చేసింది. ఈ నగరాన్ని లక్ష్యం చేసుకుని రష్యా ఉన్నట్టుండి దాడులను తీవ్రతరం చేసింది. మారియుపోల్లో అజోవ్స్తల్ స్టీల్ ఫ్యాక్టరీపైనా దాడులను భారీగా పెంచింది. శుక్ర, శనివారాల్లో ప్లాంటు నుంచి 50 మందికి పైగా బయటపడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. తూర్పున డోన్బాస్లోనూ పోరాటం తీవ్రతరమవుతోంది. లెహాన్స్క్లో రష్యా బలగాలు బాగా చొచ్చుకెళ్లినట్టు సమాచారం. భాగస్వాములను కాపాడుకోలేని అమెరికా బలహీనత వల్లే ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగిందని అల్ఖైదా నేత అల్ జవహరీ విమర్శించారు. అమెరికా అగ్రరాజ్యం కాదు. దిగజారిపోతోంది’’ అన్నారు. రొమేనియా సాయం సూపర్: జిల్ బుఖారెస్ట్: దాదాపు 10 లక్షల మంది ఉక్రెయిన్ శరణార్థులను రొమేనియా ఆదుకున్న తీరు సాటిలేనిదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ కొనియాడారు. 4 రోజుల యూరప్ పర్యటనలో ప్రస్తుతం రొమేనియాలో ఉన్న ఆమె ఆదివారం మాతృ దినోత్సవాన్ని స్లొవేనియాలో ఉక్రెయిన్ సరిహద్దుల సమీప గ్రామంలో శరణార్థులతో గడపనున్నారు. రొమేనియా అధ్యక్షుని భార్య కామెరాన్ అయోహనిస్తో జిల్ భేటీ అయ్యారు. వరల్డ్ చాంపియన్ మృతి అంతర్జాతీయ యుద్ధ క్రీడల్లో ప్రపంచ చాంపియన్, రష్యా యుద్ధ ట్యాంకుల నిపుణుడు బటో బసనోవ్ (25) ఉక్రెయిన్ యుద్ధంలో మరణించాడు. అతని యుద్ధ ట్యాంకును ఉక్రెయిన్ దళాలు పేల్చేశాయి. గతేడాది జరిగిన వరల్డ్ ట్యాంక్ బయాథ్లాన్లో గంటకు 50 మైళ్ల వేగంతో కూడిన లక్ష్యాలను ఒక్కటి కూడా వదలకుండా ఛేదించి బసనోవ్ రికార్డు సృష్టించాడు. యుద్ధంలో 38వ కల్నల్ను రష్యా డోన్బాస్లో కోల్పోయింది. మరోవైపు, రష్యా ల్యాండింగ్ షిప్ను టీబీ2 డ్రోన్ సాయంతో స్నేక్ ఐలాండ్లో ముంచేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధరించిన ఖాకీ జాకెట్ లండన్లో జరిగిన వేలంలో 90 వేల డాలర్ల ధర పలికింది. -
Russia War: వాళ్ల మాటలు నమ్మకండి: జెలెన్ స్కీ వార్నింగ్
ఉక్రెయిన్లో రెండు నెలలకుపైగా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో సైనికులు, సాధారణ పౌరులు మృత్యువాతపడ్డారు. ఇరు దేశాల మధ్య పలుమార్లు శాంతి చర్చలు జరిగినా అవి విఫలమే అయ్యాయి. ఇదిలా ఉండగా.. రష్యా సైనిక కమాండర్ల మాయమాటలు నమ్మి యుద్ధానికి దిగి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఆ దేశ సైనికులకు, యువతకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సూచించారు. యుద్ధంలో మరణిస్తారని, గాయపడతారని తెలిసి కూడా సరైన శిక్షణ లేని యువకులను బలవంతంగా ఉక్రెయిన్కు పంపిస్తున్నారని మండిపడ్డారు. తమ భూభాగంలో అడుగుపెట్టి ప్రాణాలు కోల్పోవద్దని, సొంత దేశంలోనే ఉండిపోవడం మంచిదని చెప్పారు. జెలెన్స్కీతో నాన్సీ పెలోసీ భేటీ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ జెలెన్స్కీతో కీవ్లో సమావేశమయ్యారు. పలువురు అమెరికా చట్టసభ సభ్యులు కూడా ఆమెతో పాటు ఉన్నారు. స్వేచ్ఛకోసం పోరాడుతున్న ఉక్రెయిన్కు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చామని పెలోసీ చెప్పారు. పోరాటం ముగిసేదాకా ఉక్రెయిన్కు అండగా ఉంటామన్నారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే నాన్సీ పెలోసీ ఉక్రెయిన్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా దండయాత్రను ఉక్రెయిన్ ప్రజల ధైర్యంగా, గుండెనిబ్బరంతో ఎదుర్కొంటున్నారని ఆమె ప్రశంసించారు. ఇది కూడా చదవండి: క్షీణించిన పుతిన్ ఆరోగ్యం.. ఈ వారంలో ఆపరేషన్..? -
అది కాళరాత్రి: జెలెన్స్కీ.. ఆయనపై ‘టైమ్’ కవర్ స్టోరీ
యుద్ధం మొదలైన రోజే కుటుంబంతో సహా తనను బంధించేందుకు, హతమార్చేందుకు రష్యా ప్రయత్నించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని రష్యా దళాలు కీవ్లో దిగాయి. మా ఆవిడ, నేను పిల్లలను లేపి విషయం చెప్పాం. అప్పటికే బాంబుల వర్షం మొదలైంది’’ అన్నారు. టైమ్ మేగజైన్కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. టైమ్ తాజా సంచికలో ఆయనపై కవర్స్టోరీ కథనం ప్రచురించింది. -
Russia-Ukraine war: తూర్పున దాడి ఉధృతం
ఇర్పిన్: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాడులను తీవ్రం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ముట్టడి విఫలమైన తర్వాత రష్యా తన దృష్టిని తూర్పు ఉక్రెయిన్వైపు మరలించింది. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్కు కీలకమైన పరిశ్రమలున్నాయి. దీన్ని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చని రష్యా భావిస్తోంది. డోన్బాస్ ప్రాంతంలో రష్యా కాల్పులు అధికమయ్యాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మారియుపోల్లో ఇప్పటికీ ఉంటున్న పౌరులు మరిన్ని ఇక్కట్లు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆ నగరంలోని స్టీల్ప్లాంట్పై రష్యా దాడి ముమ్మరమైనట్లు శాటిలైట్ చిత్రాలు చూపుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్లో ఐరాస చీఫ్ గుటెరస్ పర్యటన కొనసాగుతోంది. యుద్ధంలో అధిక మూల్యం చెల్లించేది చివరకు సామాన్య ప్రజలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధనేరాల గురించి మాట్లాడాల్సివస్తే, అసలు యుద్ధమే నేరమని చెప్పాలన్నారు. మరోవైపు ఉక్రెయిన్కు సహాయం కొనసాగిస్తామని బల్గేరియా కొత్త ప్రధాని భరోసా ఇచ్చారు. రష్యా పౌర నివాసాలపై దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న ఖెర్సాన్ నగరంలో పేలుళ్లు జరిగాయని రష్యా తెలిపింది. పోరు కొనసాగించేందుకు తమకు మరిన్ని ఆయుధాలందించాలని ఉక్రెయిన్ మిత్ర దేశాలను కోరింది. నాటో సాయం 800 కోట్ల డాలర్లు ఇప్పటివరకు ఉక్రెయిన్కు నాటో దేశాలు దాదాపు 800 కోట్ల డాలర్ల సాయం అందించాయని నాటో చీఫ్ స్టోల్టెన్బర్గ్ చెప్పారు. ఉక్రెయిన్కు మరింత సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. నాటోలో చేరాలనుకుంటే ఫిన్లాండ్, స్వీడన్ను సాదరంగా స్వాగతిస్తామని చెప్పారు. రష్యాతో యుద్ధం సంవత్సరాలు కొనసాగినా, తాము ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తామన్నారు. కొత్త శతాబ్దిలో యుద్ధాలు ఆమోదయోగ్యం కావని ఐరాస చీఫ్ గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధంలో నేరాలపై ఐసీసీతో విచారణకు తాను మద్దతిస్తానన్నారు. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు. -
Russia-Ukraine war: రష్యా ధ్వంస రచన
కీవ్/మారియూపోల్: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులకు దిగుతోంది. దేశంలో మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తోంది. తూర్పు ప్రాంతంలోని రైల్వే కార్యాలయాలు, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం సోమవారం క్షిపణుల వర్షం కురిపించింది. పశ్చిమ ప్రాంతంలోనూ రెండు చమురు కేంద్రాలపై దాడికి దిగింది. మధ్య, పశ్చిమ ఉక్రెయిన్లో ఐదు రైల్వే కార్యాలయాలపై దాడులు చేసింది. క్రెమెన్చుక్లోని చమురు శుద్ధి కర్మాగారాన్ని ధ్వంసం చేశాయి. రష్యా యుద్ధ విమానాలు ఆదివారం రాత్రి 56 చోట్ల దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ చెప్పింది. రష్యా ఆయిల్ డిపోలో మంటలు ఉక్రెయిన్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో రష్యా నగరం బ్రియాన్స్క్లో ఆయిల్ డిపోలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దానికి కారణాలు తెలియరాలేదు. ఈ అయిల్ డిపో నుంచి యూరప్కు పైప్లైన్ ద్వారా ముడి చమురు సరఫరా అవుతూంటుంది. పశ్చిమ దేశాల కుట్రలు సాగవు: పుతిన్ తమ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు కుట్ర పన్నుతున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ఆరోపించారు. రష్యాను అంతర్గతంగా ధ్వంసం చేసేందుకు పశ్చిమ దేశాలు సాగిస్తున్న ప్రయత్నాలు ఫలించబోవన్నారు. యుద్ధ పరిస్థితిపై సోమవారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఆ బాలలకు ఈస్టర్ బహుమతులు మారియూపోల్లోని అజోవ్స్టల్ స్టీల్ప్లాంట్ బంకర్లో క్షణమొక యుగంలా గడుతుపున్న ఉక్రెయిన్ బాలల ముఖాల్లో ఈస్టర్ బహుమతులు వెలుగులు నింపాయి. ఉక్రెయిన్ సైన్యం వారికి బహుమతులు అందించింది. మరోవైపు నాటో సభ్యత్వం కోసం స్వీడన్, ఫిన్లాండ్ మే 22 తర్వాత దరఖాస్తు సమర్పించనున్నాయి. ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సోమవారం టర్కీలో పర్యటించారు. ఆయన మంగళవారం రష్యా వెళ్లి పుతిన్తో సమావేశమవుతారు. 28న ఉక్రెయిన్కు వెళ్తారు. రష్యా ప్రభుత్వం 40 మంది జర్మనీ దౌత్య అధికారులను తమ దేశం నుంచి బహిష్కరించింది. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ ఆయుధాగారాలపై రష్యా ముమ్మర దాడులు
కీవ్: ఉక్రెయిన్పై దాడులను ఆదివారం రష్యా తీవ్రతరం చేసింది. సెంట్రల్ ఉక్రెయిన్లో పేలుడు పదార్థాలు, మందుగుండు పౌడర్ తయారీ కంపెనీపై అత్యాధునిక మిసైళ్లు ప్రయోగించినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ తెలిపారు. ఖర్కీవ్ ప్రాంతంలోని బర్వింకోవ్, నోవా ద్మిత్రివ్కా, ఇవనివ్కా, హుతలరివ్కా, వెల్యికాల్లో పలు ఆయుధాగారాలపైనా భారీగా దాడులు చేసినట్టు వివరించారు. 26 ఉక్రెయిన్ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశామన్నారు. మారియుపోల్లోని అజోవ్స్తల్ స్టీల్ ప్లాంటుపై గగనతల దాడులకు దిగింది. తూర్పున డోన్బాస్లో లుహాన్స్క్ ప్రాంతంలోని పొపాస్నా, సివెరోడొనెట్స్క్, డొనెట్స్క్ ప్రాంతంలోని కురఖీవ్ నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. పశ్చిమ డోన్బాస్లోని ద్నిప్రోలోనూ బాంబు దాడులు జరిగాయి. చెడుపై అంతిమంగా మంచి గెలిచి తీరుతుందని, ఈ వాస్తవం రష్యాకు త్వరలో తెలిసొస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. మరణాన్ని జీవనం, చీకటిని వెలుతురు అధిగమిస్తాయని దేశ ప్రజలకిచ్చిన ఈస్టర్ సందేశంలో చెప్పారు. అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, ఆంటోనీ బ్లింకెన్లతో భేటీ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. -
Russia War: ఉక్రెయిన్ సైనికుడిని కాపాడిన ఫోన్.. ఎలాగో తెలుసా..?
కీవ్: ఉక్రెయిన్లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రష్యా సేనల బాంబు దాడుల్లో ఉక్రెయిన్లో భారీగా ప్రాణ నష్టం చోటుచేసుకుంది. అటు ఉక్రెయిన్ సైన్యంతో పాటుగా రష్యా సైనికులు కూడా వేల సంఖ్యలో మృతి చెందారు. ఇదిలా ఉండగా.. యుద్ధం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తోంది. ఇక, యుద్ధంలో ఓ ఉక్రెయిన్ సైనికుడి వైపు బుల్లెట్ దూసుకొచ్చింది. ఆ బుల్లెట్ నుంచి ఓ స్మార్ట్ ఫోన్ ఉక్రెయిన్ వీరుడి ప్రాణాలను కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో గడ్డకట్టే చలిలో ఇద్దరు ఉక్రెయిన్ సైనికులు మాట్లాడుకుంటున్నారు. ఓ సైనికుడు.. తన షర్ట్ పాకెట్లో స్మార్ట్ మొబైల్ ఉంచుకొని... యుద్ధం చేస్తున్నాడు. ఇంతలో ఎటు నుంచి వచ్చిందో తెలియదు. ఓ బుల్లెట్ తన వైపు దూసుకొచ్చింది. అతనికి తెలియకుండానే అది అతని మొబైల్కి గుచ్చుకొని అక్కడ ఆగిపోయింది. బుల్లెట్ కరెక్ట్గా ఫోన్లో ఇరుక్కుపోయింది. ఒకవేళ ఆ ఫోన్ కనుక అక్కడ పాకెట్లో లేకపోతే సదరు సైనికుడు బుల్లెట్ తగిని చనిపోయే పరిస్థితి ఎదురయ్యేది. అలా ఆ మొబైల్ ఫోన్ సైనికుడి ప్రాణాలను కాపాడింది. -
Russia War: యుద్ధంలో ఊహించని ట్విస్టులు.. టెన్షన్లో జెలెన్ స్కీ!
కీవ్: ఉక్రెయిన్లో రష్యా దాడులు జరుగుతున్న వేళ భయనక వాతావరణం చోటుచేసుకుంది. ఎటు చూసినా శవాలు గుట్టలుగుట్టలుగా పడిపోయి ఉండటం ప్రపంచ దేశాలను కలచివేస్తోంది. కాగా, మారియుపోల్లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, రష్యా ఇలాగే దాడులు కొనసాగిస్తే చర్చలకు అవకాశం ఇకపై ఉండదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మారియుపోల్లో మిగిలిన ఉక్రేనియులను రష్యా సైన్యం చుట్టుముట్టిందన్నారు. దీంతో మారియుపోల్ నగరం దాదాపు రష్యా హస్తగతమైనట్లు తెలుస్తోంది. కానీ, తాము తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఇదిలా ఉండగా.. యుద్దం కారణంగా రష్యాపై ఆంక్షలపర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పుతిన్, రష్యాకు చెందిన పలువురు ప్రముఖులపై అనేక దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా.. రష్యాపై కఠిన ఆంక్షలు విధించడానికి జపాన్, స్విట్జర్లాండ్ అంగీకరించాయి. ఉక్రెయిన్ పౌరులపై దాడులకు రష్యాను జవాబుదారీగా చేయాలని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ఇగ్నాజియో కాసిస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద సోమవారం టోక్యోలో జరిగిన చర్చల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రష్యా నుంచి బొగ్గు దిగుమతులను దశలవారీగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కిషిద తెలిపారు. అలాగే, రష్యాకు చెందిన ప్రముఖుల ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. రష్యా సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించే వస్తువుల ఎగుమతులను కూడా నిషేధిస్తున్నట్టు పేర్కొన్నారు. Cemetery in Irpin#Ukrainian investigators have examined 269 dead bodies in #Irpin, near #Kyiv, since the town was taken back from #Russian forces in late March, a police official said on Monday, as workers dug fresh graves on its outskirts. Video: Reuters pic.twitter.com/Dadl4aPXQz — NEXTA (@nexta_tv) April 18, 2022 మరోవైపు.. ఉక్రెయిన్లో రష్యా తరఫున పోరాడేందుకు సిరియా ఫైటర్లు సిద్ధమవుతున్నారు. సుహైల్ ఆల్ హసన్ డివిజన్కు చెందిన ఫైటర్లతో పాటు మాజీ సైనికులు, తిరుగుబాటుదారులు రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. జనరల్ అలెగ్జాండర్ను ఉక్రెయిన్పై యుద్ధ దళపతిగా పుతిన్ నియమించిన సంగతి తెలిసిందే. గతంలో ఈయనకు సిరియాలో పనిచేసిన అనుభవం ఉంది. ఇంతవరకు దాదాపు 40వేలమంది సిరియన్లు రష్యాతో కలిసి పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు మానవహక్కుల కార్యకర్తలు తెలిపారు. ఇది చదవండి: ‘కుటుంబీకులు’ లేకుండా... లంక కొత్త కేబినెట్ -
Russia-Ukraine War: సామాన్యులే సమిధలు
కీవ్/బుచా: ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి రష్యా సైన్యం క్రమంగా వెనక్కి మళ్లుతోంది. ప్రధానంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం వైపు కదులుతోంది. డాన్బాస్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ రష్యా నియంత్రణలో ఉన్న కీవ్ పరిసర పట్టణాలను ఉక్రెయిన్ సైనికులు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. బుచాతోసహా పలు పట్టణాల్లో రష్యా జవాన్లు దారుణ అకృత్యాలకు పాల్పడినట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. సామాన్య పౌరులపై రాక్షసకాండ జరిపారని, వందలాది మందిని బలితీసుకున్నారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇరైనా వెనెడిక్టోవా చెప్పారు. కీవ్ ఇరుగుపొరుగు పట్టణాల్లో గత మూడు రోజుల్లో 410 మృతదేహాలు గుర్తించామని తెలిపారు. ఇందులో 140 మృతదేహాలకు పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. కీవ్ రీజియన్లోని మోటిజైన్ మేయర్ ఓల్గా సుఖెంకోను, ఆమె భర్త, కుమారుడిని రష్యా సైనికులు హత్య చేశారని, శవాలను ఓ కుంటలోకి విసిరేశారని ఉక్రెయిన్ ఉప ప్రధానమంత్రి వెరెస్చుక్ చెప్పారు. మేయర్, ఆమె కుటుంబ సభ్యులను మార్చి 23న రష్యా జవాన్లు కిడ్నాప్ చేశారని వెల్లడించారు. 11 మంది మేయర్లు, కమ్యూనిటీ పెద్దలను కూడా అపహరించారని తెలిపారు. చెర్నిహివ్ రీజియన్లోని కొన్ని ప్రాంతాలను తాము మళ్లీ స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. చెర్నిహివ్–కీవ్ రహదారిపై సోమవారం నుంచి రాకపోకలు పునరుద్ధరించామని పేర్కొంది. రష్యా దాడుల్లో చెర్నిహివ్ నగరం 80 శాతం ధ్వంసమయ్యిందని స్థానిక మేయర్ వెల్లడించారు. కీవ్కు 75 కిలోమీటర్ల దూరంలోని బలాక్లియాలోని ఓ ఆస్పత్రి రష్యా దాడిలో ధ్వంసమయ్యింది. అందులోని రోగులను బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా రష్యా మళ్లీ దాడి చేయగా ఓ బస్సు డ్రైవర్ మృతి చెందాడని ఖర్కీవ్ గవర్నర్ చెప్పారు. ఆదివారం రాత్రి ఖర్కివ్లో రష్యా జరిపిన దాడుల్లో ఏడుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అంతర్జాతీయ సమాజం ఆగ్రహం ఉక్రెయిన్లో సాధారణ పౌరులను పొట్టనపెట్టుకున్న రష్యాపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా మారణకాండను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ ట్విట్టర్లో ఖండించారు. సాధారణ పౌరులను చంపడం కచ్చితంగా యుద్ధ నేరమేనన్నారు. రష్యా రాక్షసకాండను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్, ఈయూ విదేశాంగ విధానం చీఫ్ జోసెఫ్ బోరెల్, ఎస్తోనియా ప్రధానమంత్రి కజా కల్లాస్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఖండించారు. బుచాలో మారణకాండకు నిరసనగా జర్మనీ 40 మంది రష్యా దౌత్యాధికారులను దేశం నుంచి బహిష్కరించింది. విచారణను రష్యా ఎదుర్కోవాల్సిందే: బైడెన్ ఉక్రెయిన్లో యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యా విచారణను ఎదుర్కోక తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని సోమవారం ప్రకటించారు. నిజానిజాలు నిగ్గుతేల్చాలి: లావ్రోవ్ ఉక్రెయిన్లో తమ దళాలు ఎలాంటి అరాచకాలకు పాల్పడలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. నిజానిజాలను నిగ్గు తేల్చడానికి భద్రతా మండలిని సమావేశపర్చాలన్నారు. ఇంతటి దారుణాలు చూశాక చర్చలు కష్టమే రష్యా సైన్యం అకృత్యాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన బుచా సిటీలో అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటించారు. ‘ కుప్పలు తెప్పలుగా పడిన అమాయకుల మృతదేహాలను చూశాక రష్యాతో చర్చలు జరపాలనే ఆలోచనే చాలా కష్టంగా ఉంది. అందరినీ దా రుణంగా హింసించి చంపారు. చిన్నారులు, మైనర్లుసహా మహిళలను రేప్ చేశారు. జంతువులకంటే హీనంగా ఉక్రెయిన్లను రష్యా సైనికులు పరిగణించారు’ అని జెలెన్స్కీ భావోద్వేగంతో మాట్లాడారు. -
Russia-Ukraine War: ఉక్రెయిన్పై ఆగని బాంబుల వర్షం
బుచా/కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒడెసా సమీపంలో ఆదివారం క్షిపణుల వర్షం కురిపించాయి. ఉక్రెయిన్ సైన్యం ఉపయోగిస్తున్న చమురు శుద్ధి కర్మాగారాన్ని, మూడు చమురు డిపోలను ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కోస్తియాన్టినివ్కా, ఖ్రేసిచేలో ఆయుధ డిపోలను సైతం ధ్వంసం చేశామని తెలియజేసింది. మారియుపోల్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఖర్కీవ్పై 20 వైమానిక దాడులు జరిగాయి. బలాక్లియా పట్టణంలో ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడికి పాల్పడింది. మరోవైపు ఇరు దేశాల మధ్య చర్చలు సోమవారం మళ్లీ మొదలవనున్నాయి. బుచాలో దారుణ దృశ్యాలు కొన్ని వారాలుగా రష్యా సైన్యం నియంత్రణలో ఉన్న రాజధాని కీవ్ ఉత్తర ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. కీవ్కు 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా పట్టణం ఇప్పటికే ఉక్రెయిన్ అధీనంలోకి వచ్చింది. అక్కడ శవాలు వీధుల్లో చెల్లాచెదురుగా దర్శనమిచ్చాయని మీడియా ప్రతినిధలు చెప్పారు. వాటికి సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తూర్పు ప్రాంతంలో రష్యా భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. ఉత్తర ఉక్రెయిన్ నుంచి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించింది. ఉక్రెయిన్లో మందుపాతర్ల బెడద రష్యా జవాన్లు తమ భూభాగంలో ఎక్కడిక్కడ మందుపాతరలు ఏర్పాటు చేశారని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రోడ్లపై, వీధుల్లో, ఇళ్లలో, అఖరికి శవాల లోపలా మందుపాతరలు పె ట్టారన్నారు. మరిన్ని ఆధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలివ్వాలని పశ్చిమ దేశాలను కోరారు. రంజాన్పై యుద్ధ ప్రభావం యుద్ధంతో చమురు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినందున ఈసారి రంజాన్ జరుపుకోవడం కష్టమేనని లెబనాన్, ఇరాక్, సిరియా, సూడాన్, యెమెన్ తదితర దేశాల్లో జనం వాపోతున్నారు. వాటికి గోధుమలు, బార్లీ గింజలు, నూనె గింజలు రష్యా, ఉక్రెయిన్ నుంచే వెళ్తాయి. లిథువేనియాకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు రావిసియస్ మారియుపోల్లో కాల్పుల్లో మృతి చెందారు. రష్యా సైన్యంలో తిరుగుబాటు! సుదీర్ఘ యుద్ధంతో ఉక్రెయిన్లో రష్యా సైనికులు నీరసించిపోతున్నట్లు చెప్తున్నారు. ముందుకెళ్లడానికి వారు ససేమిరా అంటున్నారు. సొంత వాహనాలు, ఆయుధాలనూ ధ్వంసం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులను లెక్కచేయడం లేదు. సైనికుల్లో తిరుగుబాటు మొదలైందని, పుతిన్ మొండిపట్టుపై వారు రగిలిపోతున్నారని ఉక్రెయిన్ అంటోంది. ‘‘సహచరుల మరణాలు రష్యా సైనికులను కలచివేస్తున్నాయి. స్థైర్యం సన్నగిల్లి ఆస్త్ర సన్యాసం చేస్తున్నారు’’ అరని నాటో కూటమి అంటోంది. యుద్ధానికి రష్యా సైన్యం విముఖత వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 1905 జూన్లో రూసో–జపనీస్ యుద్ధంలోనూ వారు ఇలాగే సహాయ నిరాకరణ చేశారు. ఉన్నతాధికారులపై తిరగబడ్డారు. వారి ఆదేశాలను ధక్కిరించారు. -
Russia- Ukraine war: కీలక దశలో దేశ రక్షణ!
రష్యా దురాక్రమణ నుంచి తన దేశాన్ని రక్షించుకోవడం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో అమెరికా మరింత సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ పార్లమెంట్నుంచి కొందరు సభ్యుల బృందం అమెరికాను సందర్శించి మరింత సహాయం అందించాలని కోరింది. తమకు మరిన్ని ఆయుధాలు, ఆర్థిక సాయం అవసరమని పేర్కొంది. ఇదే విషయాన్ని అమెరికా అధిపతి బైడెన్కు జెలెన్స్కీ నేరుగా వెల్లడించారు. తాము స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామని, తమకు సాయం కోరే హక్కు ఉందని ఆయన తాజాగా విడుదల చేసిన వీడియోలో చెప్పారు. కీవ్లోని అధ్యక్ష కార్యాలయం వెలుపల రాత్రి సమయంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. యుద్ధం మొదలై ఐదువారాలు ముగుస్తున్నవేళ ఉక్రెయిన్ నుంచి దాదాపు 40 లక్షలమంది విదేశాలకు శరణార్ధులుగా తరలిపోయినట్లు ఐరాస అంచనా వేసింది. రూబుల్స్లో వద్దు రష్యా గ్యాస్కు యూరోపియన్ కంపెనీలు రూబుల్స్లో చెల్లించాల్సిన అవసరం లేదని రష్యా నుంచి హామీ పొందినట్లు జర్మనీ తెలిపింది. తమ వద్ద గ్యాస్ కొనుగోళ్లను రూబుల్స్లో జరపాలని ఇటీవల రష్యా అల్టిమేటం జారీ చేయడం యూరప్ దేశాల్లో కలకలం సృష్టించింది. మరోవైపు ఈ ఏడాది చివరకు రష్యా దిగుమతులపై ఆధారపడడాన్ని ఆపివేస్తామని పోలండ్ ప్రకటించింది. టర్కీలో జరిగిన చర్చల్లో కొంత పురోగతి కనిపించినా రష్యా, జెలెన్స్కీ ప్రకటనలతో సంధిపై ఆశలు అడుగంటాయి. తమపై రష్యా దాడి కొనసాగిస్తూనే ఉందని కీవ్ తదితర నగరాల మేయర్లు ఆరోపించారు. ఉక్రెయిన్ ఇంధన డిపోలను, స్పెషల్ ఫోర్స్ కేంద్రకార్యాలయాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. రష్యా సైనికులు ఆజ్ఞలు పాటించడం లేదు! ఉక్రెయిన్లోకి పంపిన రష్యా సైనికులు తమకిచ్చిన ఆజ్ఞలు పాటించేందుకు తిరస్కరిస్తున్నారని బ్రిటన్ ఇంటెలిజెన్స్ చీఫ్ జెరెమీ ఫ్లెమింగ్ చెప్పారు. పై అధికారుల మాట వినకపోవడమే కాకుండా సొంత ఆయుధాలనే ధ్వంసం చేస్తున్నారని, ఈ ప్రక్రియలో అనుకోకుండా ఒక ఎయిర్క్రాఫ్ట్ను కూడా కూల్చేశారని గురువారం జెరెమీ చెప్పారు. ఉక్రెయిన్పై దురాక్రమణను పుతిన్ తక్కువగా అంచనా వేశారని ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రజల నుంచి ఇంత ప్రతిఘటన వస్తుందని పుతిన్ ఊహించలేదని, ఆంక్షల వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులను అంచనా వేయలేదని, సొంత మిలటరీ శక్తిని ఎక్కువగా అంచనా వేసుకొని వేగంగా విజయం సాధిస్తామని భావించారని చెప్పారు. ప్రస్తుతం రష్యా సైనికులు నైతిక స్థైర్యం కోల్పోయి ఆజ్ఞలు తిరస్కరిస్తున్నారన్నారు. -
Russia Ukraine war: ఆశలపై నీళ్లు!
కీవ్: తాజా చర్చల నేపథ్యంలో ఉక్రెయిన్ సంక్షోభానికి తెర పడవచ్చన్న ఆశలపై రష్యా నీళ్లు చల్లింది. మంగళవారం నాటి చర్చల్లో పెద్ద పురోగతేమీ లేదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ పెదవి విరిచారు. ఉక్రెయిన్ తన ప్రతిపాదనలను చర్చల సందర్భంగా లిఖితపూర్వకంగా తమ ముందుంచింది తప్ప అంతకంటే పెద్దగా ఏమీ జరగలేదన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు బుధవారం తీవ్రస్థాయిలో కొనసాగాయి. కీవ్, చెర్నిహివ్ నగరాల్లో సైనిక మోహరింపులను తగ్గిస్తామని చెప్పినా అవి దాడులతో మోతెక్కిపోయాయి. చెర్నిహివ్పైనా భీకర దాడులు కొనసాగినట్టు నగర మేయర్ చెప్పారు. దాడుల్ని తగ్గిస్తామన్న హామీని రష్యా నిలబెట్టుకోలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ మండిపడ్డారు. బుధవారం ఆయన నార్వే పార్లమెంటును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. యూరప్ భవితవ్యాన్ని నిర్ణయించే యుద్ధంలో తాము ఒంటరిగా పోరాడుతున్నామని వాపోయారు. అయితే, తటస్థంగా ఉండేందుకు ఉక్రెయిన్ అంగీకరించడం ద్వారా తమ ప్రధాన డిమాండ్లలో ఒకదానికి ఒప్పుకుందని చర్చల్లో రష్యా బృందానికి నేతృత్వం వహించిన వ్లాదిమిర్ మెడిన్స్కీ అన్నారు. అణ్వస్త్రరహితంగా దేశంగా కొనసాగడం వంటి ప్రతిపాదనలన్నింటినీ చర్చల సందర్భంగా సమర్పించిందన్నారు. సెంట్రల్ ఉక్రెయిన్లో మరో రెండు సైనిక ఆయుధాగారాలను లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైళ్లతో ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ చెప్పారు. ప్రకటించింది. మైకోలేవ్లోని ఉక్రెయిన్ ప్రత్యేక దళాల ప్రధాన కార్యాలయాన్ని డోనెట్స్క్ ప్రాంతంలోని ఆయుధ డిపోను ఇస్కండర్ మిసైళ్లతో ధ్వంసం చేశామన్నారు. ఉక్రెయిన్ నుంచి వలసలు 40 లక్షలు దాటినట్టు ఐరాస వెల్లడించింది. మరో కల్నల్ మృతి రష్యా మోటరైజ్డ్ రైఫిల్ బ్రిగేడ్ కల్నల్ డెనిస్ కురిలోను ఖర్కీవ్ వద్ద హతమార్చినట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. దీంతో రష్యా కోల్పోయిన కల్నల్ ర్యాంక్ అధికారుల సంఖ్య 8కి పెరిగింది. నేడు భారత్కు లావ్రోవ్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురు, శుక్రవారాల్లో భారత్లో పర్యటించనున్నారు. రష్యా చమురు దిగుమతులకు రూపాయి–రూబుల్ పద్ధతిలో చెల్లింపులు చేయాలని ఆయన ప్రతిపాదించనున్నారు. ఇప్పటికే సరఫరా ఒప్పందాలు కుదిరిన మిలిటరీ హార్డ్వేర్, ఎస్–400 మిసైల్ వ్యవస్థ విడిభాగాలను సకాలంలో అందించాల్సిందిగా భారత్ కోరే అవకాశముంది. లావ్రోవ్ ప్రస్తుతం చైనాలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఇంగ్లండ్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ కూడా గురువారం భారత్ రానున్నారు. అమెరికా జాతీయ భద్రతా ఉప సలహాదారు దలీప్సింగ్, జర్మనీ విదేశాంగ, భద్రతా వ్యవస్థ సలహాదారు జెన్స్ ప్లాట్నర్ బుధవారమే భారత్ చేరుకున్నారు. రష్యా చమురుకు గుడ్బై: పోలండ్ రష్యా నుంచి చమురు దిగుమతులకు ఈ ఏడాది చివరికల్లా పూర్తిగా మంగళం పాడతామని పోలండ్ ప్రధాని మాటెజ్ మొరావికి ప్రకటించారు. బొగ్గు దిగుమతులను మే కల్లా నిలిపేస్తామని చెప్పారు. ఇతర యూరప్ దేశాలు తమ బాటలో నడవాలని సూచించారు. అమెరికా, సౌదీ, ఖతర్, కజాకిస్థాన్, నార్వే తదితర దేశాల నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను పెంచుకునేందుకు టెర్మినళ్లను విస్తరించేందుకు పోలండ్ చర్యలు చేపట్టింది. జర్మనీ కూడా రష్యా దిగుమతులను వీలైనంతగా తగ్గించుకుంటామని చెప్పింది. గ్యాస్, చమురు, బొగ్గు తదితర రష్యా దిగుమతులకు రూబుల్స్లో చెల్లింపులు చేయాలన్న పుతిన్ డిమాండ్ను యూరప్ దేశాలు నిరాకరించడం తెలిసిందే. అయినా రష్యా మాత్రం రూబుల్స్ చెల్లింపు పథకానికి రూపకల్పన చేస్తోంది. దీని వివరాలను త్వరలో వెల్లడిస్తామని పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ చెప్పారు. యుద్ధ నష్టాలను పుతిన్కు చెప్పలేదు ఉక్రెయిన్తో యుద్ధం వల్ల రష్యాకు జరుగుతున్న సైనిక, ఆర్థిక నష్టాలను కప్పిపుచ్చడం ద్వారా పుతిన్ను ఆయన సలహాదారులు తప్పుదోవ పట్టించారని అమెరికా నిఘా విభాగం అభిప్రాయపడింది. ‘‘బహుశా నిజం తెలిస్తే పుతిన్ ఎలా స్పందిస్తారోనని వాళ్లు భయపడి ఉంటారు. ఆయనకు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలిసొస్తున్నాయి. దాంతో సీనియర్ సైనికాధికారులకు, పుతిన్కు మధ్య టెన్షన్ నెలకొంది’’ అని చెప్పుకొచ్చింది. -
రణరంగంలో రసాయనాయుధాలు!.. ప్రయోగిస్తే పెను విధ్వంసమే
యుద్ధం మొదలెట్టి రోజులు గడుస్తున్నా ఆశించిన ఫలితం రాకపోతే యుద్ధాన్ని ఆరంభించిన పక్షానికి చికాకు, అసహనం పెరుగుతాయి. దీంతో మరింత భయంకరమైన ఆయుధ ప్రయోగానికి దిగే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్పై దాడిలో విజయం కనుచూపుమేరలో కానరాకపోవడంతో రష్యా రసాయనాయుధాల ప్రయోగానికి దిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలై నెల దాటింది. ఇంతవరకు చెప్పుకోదగ్గ విజయం రష్యాకు దక్కినట్లు కనిపించడం లేదు. దీంతో యుద్ధాన్ని ఎలా ముగించాలో అర్థం కాని పుతిన్ భయంకర జనహనన ఆయుధాలను ప్రయోగించవచ్చనే భయాలున్నాయి. రష్యా విజయం కోసం రసాయన ఆయుధాలు ప్రయోగించే అవకాశాలు అధికమని యూఎస్ అనుమానిస్తోంది. ఇందుకోసం ముందుగా ఉక్రెయిన్లో జీవ, రసాయన ఆయుధాలున్నాయని రష్యా ప్రచారం చేస్తోందని, రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ను నిలవరించడానికనే సాకుతో రష్యా రసాయనాయుధాలు ప్రయోగించవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఈ నెల 21న సుమీ నగరంలోని ఒక రసాయన ప్లాంట్ను రష్యా పేల్చివేసింది. దీంతో అక్కడి వాతావరణంలోకి భారీగా అమ్మోనియా విడుదలై స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చింది. గతంలో పుతిన్ రసాయన ఆయుధాల ప్రయోగించిన దాఖలాలున్నాయని, అందువల్ల ఈ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ తన సొంత పౌరులపై రసాయన దాడికి సన్నాహాలు చేస్తోందని అటుపక్క రష్యా విమర్శిస్తోంది. తమపై రసాయన ఆయుధ ప్రయోగ నేరారోపణ చేయడానికి ఉక్రెయిన్ ఈ దారుణానికి తలపడనుందని రష్యా రక్షణ మంత్రి ఆరోపించారు. రష్యా రూటే సెపరేటు కెమికల్ ఆయుధాల ప్రయోగంలో రష్యాకుక ఘన చరిత్ర ఉంది. చాలా సంవత్సరాలుగా పలువురిని రష్యా ఈ ఆయుధాలు ఉపయోగించి పొట్టన పెట్టుకుందన్న ఆరోపణలున్నాయి. తాజాగా సిరియాలో పౌరులపై రసాయనాయుధాలను అధ్యక్షుడు బషర్ రష్యా సహకారంతో ప్రయోగించారని అమెరికా ఆరోపించింది. దీనిపై విచారణకు రష్యా అడ్డుపడుతోందని విమర్శించింది. అలాగే రష్యా ఏజెంట్ సెర్గీ స్కిరిపల్, ఆయన కుమార్తె యూలియాను లండన్లో ఈ ఆయుధాలతోనే రష్యా బలి తీసుకుందని విమర్శలున్నాయి. రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ సంస్థ గ్రు కు చెందిన ఇద్దరికి ఈ ఘటనతో సంబంధం ఉందని బ్రిటన్ ఆరోపించింది. 2020లో పుతిన్ చిరకాల విమర్శకుడు అలెక్సి నవల్నీపై విష ప్రయోగం జరిగింది. స్వదేశంలో ఒక విమాన ప్రయాణంలో ఆయన హఠాత్తుగా అస్వస్థుడయ్యాడు. అనంతరం ఆయన కోమాలోకి జారుకున్నారు. నరాల బలహీనతను కలిగించే కెమికల్ ఆయనపై ప్రయోగించినట్లు జర్మనీలో ఆయనపై జరిపిన పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే రష్యా త్వరలో ఉక్రెయిన్లో కెమికల్ వెపన్స్ వాడబోతుందని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరగవచ్చు? నిజానికి రసాయనాయుధాలున్నాయన్న సాకుతో ఇతర దేశాలపై దాడులు చేసిన సంస్కృతి అమెరికాకే ఉంది. ఇరాక్ విషయంలో అమెరికా చేసిన ఘాతుకాన్ని ప్రపంచం మరిచిపోలేదు. నీవు నేర్పిన విద్యయే.. అన్నట్లు ప్రస్తుతం పుతిన్ అమెరికా చూపిన బాటలో పయనించే యోచనలో ఉన్నారు. రష్యా ఇలాంటి ఆయుధాలను వాడితే తాము తీవ్రంగా స్పందిస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. నాటో సైతం ఇదే తరహా హెచ్చరిక చేసింది. రష్యా మాట వినకుండా వీటిని ప్రయోగిస్తే అప్పుడు తమ కూటమి నేరుగా యుద్ధంలో పాల్గొనాల్సివస్తుందని హెచ్చరించింది. ఒకపక్క దాడి మొదలై ఇన్ని రోజులైనా తగిన ఫలితం రాకపోవడం రష్యాను చికాకు పెడుతోంది. మరోవైపు రష్యా డిమాండ్లను ఉక్రెయిన్ అంగీకరించడంలేదు. ఇప్పటికే అంతర్జాతీయ వ్యతిరేకతను మూటకట్టుకున్న పుతిన్ రసాయనాయుధాల్లాంటి తొందరపాటు చర్యకు దిగకపోవచ్చ ని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ యుద్ధం ఇలాగే మరిన్ని రోజులు కొనసాగితే పుతిన్ మనసు మారే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. అసలేంటీ ఆయుధాలు? నిజానికి ప్రతి ఆయుధంలో కెమికల్స్ ఉంటాయి. ఉదాహరణకు తుపాకీ బుల్లెట్లలో ఉండే గన్ పౌడర్ ఒక రసాయన పదార్ధమే! అయితే జీవులను ఒక్కమారుగా చంపగలిగే ప్రమాదకరమైన వాయువులు లేదా ద్రావకాల మిశ్రమాన్ని అచ్చంగా రసాయనాయుధమంటారు. ఒపీసీడబ్ల్యూ (ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్) ప్రకారం ప్రమాదకర రసాయనాలను కలిగిఉండేలా డిజైన్ చేసిన ఆయుధాలు, వస్తువులను రసాయనాయుధాలంటారు. ఉదాహరణకు అమ్మోనియా అధిక మోతాదులో విడుదలైతే అక్కడున్న మనుషులకు అంధత్వం, ఊపిరితిత్తుల విధ్వంసంతో పాటు మరణం కూడా సంభవించవచ్చు. తొలి ప్రపంచ యుద్ధ సమయంలోనే రసాయనాయుధాల వాడకం జరిగింది. ఆ యుద్ధంలో క్లోరిన్, ఫాస్జీన్, మస్టర్డ్ గ్యాస్ను ఇరుపక్షాలు వినియోగించాయి. కేవలం వీటివల్ల అప్పట్లో లక్ష మరణాలు సంభవించాయి. కాలం గడిచే కొద్దీ అత్యంత ప్రమాదకరమైన రసాయనాయుధాల తయారీ పెరిగింది. కోల్డ్వార్ సమయంలో యూ ఎస్, రష్యాలు ఇబ్బడిముబ్బడిగా వీటిని రూ పొందించాయి. తర్వాత కాలంలో పలు దేశాలు రహస్యంగా వీటి తయారీ, నిల్వ చేపట్టాయి. రసాయనాలు– రకాలు రసాయనాయుధాలను అవి కలిగించే ప్రభావాన్ని బట్టి పలు రకాలుగా వర్గీకరించారు. 1. చర్మంపై ప్రభావం చూపేవి (బ్లిస్టర్ ఏజెంట్స్): ఫాస్జీన్ ఆక్సైమ్, లెవిసైట్, మస్టర్డ్ గ్యాస్. 2. నరాలపై ప్రభావం చూపేవి (నెర్వ్ ఏజెంట్స్): టబున్, సరిన్, సొమన్, సైక్లో సరిన్. 3. రక్తంపై ప్రభావం చూపేవి (బ్లడ్ ఏజెంట్స్): సైనోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ సైనేడ్. 4. శ్వాసపై ప్రభావం చూపేవి (చోకింగ్ ఏజెంట్స్): క్లోరోపిక్రిన్, క్లోరిన్, డైఫాస్జిన్. – నేషనల్ డెస్క్, సాక్షి -
Russia-Ukraine War: ఇండియన్ నన్స్కు ఇక్కట్లు
ఐజ్వాల్: రష్యా దాడితో రణరంగంగా మారిన ఉక్రెయిన్లో భారత్కు చెందిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సంస్థ మిజోరాం విభాగానికి చెందిన నన్స్ సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. యుద్ధం తీవ్రం కావడంతో రాజధానిలో సేవలనందిస్తున్న ఈ నన్స్ నిత్యావసరాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక శిబిరంలో తాము సేవలనందిస్తున్న నిరాశ్రయులతో కలిసి క్షేమంగా ఉన్నామని, అయితే కనీసావసరాల కోసం బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని వివరించారు. ఎన్ని బాధలైనా పడతామని, సేవా కార్యక్రమం విరమించి వెనక్కురామని సిస్టర్ రోసెలా నూతంగి, సిస్టర్ ఆన్ ఫ్రిదా స్పష్టం చేశారు. వీరితో పాటు వేరే దేశాలకు చెందిన మరో ముగ్గురు నన్స్ కలిసి 37 మంది నిరాశ్రయులను, ఒక కేరళ విద్యార్థిని సంరక్షిస్తున్నారు. వీరంతా క్షేమమేనని, కానీ ఆహారం కొరతతో బాధపడుతున్నారని రోసెలా బంధువు సిల్వీన్ చెప్పారు. కీవ్లో తాము బాగానే ఉన్నామని రోసెలా చెప్పారని సిల్వీన్ తెలిపారు. సంస్థలో రోసెలా 1981లో చేరారు. 1991లో ఒక మిషన్ కోసం సోవియట్కు వెళ్లారు. అక్కడ ఆమె 10 ఏళ్లు పనిచేశారు. 2013లో ఆమె ఉక్రెయిన్ చేరారని, రష్యన్ భాషలో ఆమెకు పట్టు ఉందని సిల్వీన్ తెలిపారు. గతంలో రెండుమార్లు మాత్రమే ఆమె ఇండియాకు వచ్చారన్నారు. మరో నన్ ఫ్రిడా 1995లో సంస్థలో చేరారు. అనంతరం అనేక దేశాల్లో సేవలనందించి 2019లో ఉక్రెయిన్ చేరారు. తమ సంస్థకు చెందిన ఐదుగురు నన్స్ ఉక్రెయిన్లో సేవలనందిస్తున్నారరని సంస్థ సుపీరియర్ జనరల్ సిస్టర్ మేరీ జోసెఫ్ చెప్పారు. వీరిని వెనక్కురమ్మని తాము కోరామని, కానీ సేవను విరమించి వచ్చేందుకు వీరు అంగీకరించలేదని తెలిపారు. స్థానికులకు సాయం అందిస్తూ వీరు కీవ్లో తలదాచుకుంటున్నారన్నారు. వీరి భద్రతపై రష్యా, ఉక్రెయిన్, భారత ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. -
ముట్టడిలో మారియుపోల్.. నగరంలో 20 వేలకు పైగా పౌరుల మృతి?
కీవ్: ఉక్రెయిన్పై రష్యా ముట్టడి తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. రేవుపట్టణం మారియుపోల్ను ఆక్రమించే ప్రయత్నాలను రష్యా సైన్యం తీవ్రతరం చేసింది. నగరం వీడాల్సిందిగా ఉక్రెయిన్ దళాలకు సోమవారం సూచించింది. ‘‘తెల్ల జెండాలు ఎగరేసి, ఆయుధాలు వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డవాళ్లంతా హ్యుమానిటేరియన్ కారిడార్ల గుండా సురక్షితంగా వెళ్లిపోయేలా చూస్తాం. మరుక్షణమే నగరంలోకి అత్యవసరాల సరఫరాను అనుమతిస్తాం’’ అని కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సెవ్ చెప్పారు. ఉక్రెయిన్ అందుకు నిరాకరించింది. దాంతో రష్యా దళాలు రెచ్చిపోయాయి. ఎడాపెడా క్షిపణి, బాంబు దాడులతో కనీవినీ ఎరగని రీతిలో నగరంపై విరుచుకుపడుతున్నాయి. ఒక్క మారియుపోల్లోనే కనీసం 20 వేల మంది దాకా మరణించి ఉంటారన్న వార్తలు అందరినీ కలచివేస్తున్నాయి! దీనిపై యూరోపియన్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. రష్యా తీవ్ర యుద్ధ నేరాలకు పాల్పడుతోందంటూ దుమ్మెత్తిపోసింది. మారియుపోల్లో వేలాదిగా పౌరులను అతి కిరాతకంగా, విచక్షణారహితంగా పొట్టన పెట్టుకుంటున్న తీరు దుర్మార్గమని ఈయూ విదేశీ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ విమర్శించారు. ‘‘రష్యా నైతికంగా అధఃపాతాళానికి దిగజారింది. యుద్ధంలోనూ నీతీ నియమాలుంటాయని మర్చిపోయింది’’ అంటూ దుయ్యబట్టారు. రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు సాక్ష్యాలను సేకరిస్తోంది. కీవ్... కదనరంగం: రాజధాని కీవ్ను ఆక్రమించే ప్రయత్నాలను రష్యా మరింత ముమ్మరం చేసింది. ఆదివారం అర్ధరాత్రి రష్యా సైన్యం జరిపిన బాంబు దాడుల్లో జనసమ్మర్ధ ప్రాంతంలోని ఓ షాపింగ్ సెంటర్ నేలమట్టమైంది. కనీసం ఎనిమిది మంది చనిపోయినట్టు సమాచారం. రాజధానిని చుట్టుముట్టి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వీటిని ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. సమీలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో 50 టన్నుల భారీ ట్యాంక్ నుంచి అమోనియా లీకయింది. దాంతో చుట్టుపక్కల రెండున్నర కిలోమీటర్ల మేర వాతావరణం బాగా కలుషితమైనట్టు సమాచారం. తీవ్ర ప్రయత్నాల తర్వాత లీకేజీని అరికట్టారు. ఇతర నగరాలనూ సుదూరాల నుంచి క్షిపణి దాడులతో రష్యా బెంబేలెత్తిస్తోంది. ఉక్రెయిన్ దళాలు రష్యా సైన్యంపై చాటునుంచి దాడులు చేసి పారిపోతూ గెరిల్లా వ్యూహం అనుసరిస్తున్నాయి. ఆహారం తదితర అత్యవసర సరఫరాలను అడ్డుకుంటున్నాయి. రివెన్ సమీపంలో సైనిక శిక్షణ కేంద్రంపై క్షిపణులతో దాడి చేసి 80 మందికి పైగా ఉక్రెయిన్, కిరాయి సైనికులను చంపేసినట్టు రష్యా చెప్పింది. రేవు పట్టణం ఒడెసాపై దాడులను తీవ్రతరం చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారు. దాంతో రష్యా సేనలు యుద్ధ నౌకల నుంచి పౌరులపైకి కూడా క్షిపణులు ప్రయోగిస్తున్నాయి. బెనెట్కు థాంక్స్: జెలెన్స్కీ చర్చల కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెనెట్ చేస్తున్న ప్రయత్నాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ట్ స్కూలుపై బాంబు వేసిన పైలట్ను హతమార్చి తీరతామన్నారు. చర్చల్లో సానుకూల సంకేతాలు కన్పిస్తున్నాయని బెనెట్ చెప్పారు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లను రష్యా స్థానిక కోర్టు నిషేధించింది! మొరాయించిన చెర్నోబిల్ మానిటర్లు ఉక్రెయిన్లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రంలోని రేడియేషన్ మానిటర్లు పని చేయడం లేదు! ఉక్రెయిన్ అణు నియంత్రణ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించింది. ‘‘వాతావరణం క్రమంగా వేడెక్కుతున్న నేపథ్యంలో ప్లాంటు సమీపంలోని అడవులను కాపాడేందుకు అవసరమైన సంఖ్యలో అగ్నిప్రమాపక సిబ్బంది కూడా అందుబాటులో లేరు. ఫలితంగా రేడియేషన్ లీకేజీని అడ్డుకోవడం కష్టం కావచ్చు’’ అని హెచ్చరించింది. శనివారం పోలండ్కు బైడెన్ అత్యవసర చర్చల కోసం ఈ వారాంతంలో యూరప్ రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ట్రిప్లో భాగంగా శనివారం పోలండ్లో కూడా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. గురువారం నాటో నేతలతో శిఖరాగ్ర భేటీలో బైడెన్ పాల్గొంటారు. తర్వాత బ్రసెల్స్ నుంచి పోలండ్ వెళ్తారని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ జాన్ సాకీ తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ చాన్సలర్ షోల్జ్, ఇటలీ, ఇంగ్లండ్ ప్రధానులు మారియో డ్రాగీ, బోరిస్ జాన్సన్లతో కూడా సోమవారం బైడెన్ చర్చలు జరిపారు. -
ఉక్రెయిన్ ఓ శిథిల చిత్రం.. ఎవరిని కదిలించినా కన్నీటి కథలే
రష్యా దండయాత్ర ఉక్రెయిన్ను అన్ని విధాలా కుంగదీస్తోంది. 27 రోజులుగా వచ్చిపడుతున్న బాంబుల వర్షంలో దేశం శిథిలాల దిబ్బగా మారిపోయింది. మళ్లీ కోలుకోడానికి దశాబ్దాలు పట్టేలా కన్పిస్తోంది. రేపటి పౌరులుగా ఎదగాల్సిన బాలలు యుద్ధంలో సమిధలుగా మారుతున్నారు. లక్షలాది మంది ఉక్రెయిన్ చిన్నారుల భవిష్యత్తును యుద్ధం అంధకారమయం చేసేసింది... హంగరీ నుంచి సాక్షి ప్రతినిధి ఇస్మాయిల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ వీడిన వారి సంఖ్య ఇప్పటికే 40 లక్షలు దాటేసింది. వీరిలో సగం మంది 18 ఏళ్లు దాటని వాళ్లేనని గణాంకాలు చెప్తున్నాయి. వీరంతా తల్లులతో పాటు పోలండ్, హంగరీ, స్లొవేకియా, మాల్దోవా, రుమేనియా తదితర దేశాలకు చేరారు. ఏ కొందరో ఎన్జీవోల సాయంతో విదేశాల్లోని తమ బంధువుల ఇళ్లకు చేరుతుండగా మిగతా వారంతా శరణార్థి శిబిరాల్లోనే బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. ఎవరిని కదిలించినా కన్నీటి కథలే వినిపిస్తున్నారు. ఎన్జీవోలు, ప్రభుత్వాల సాయంపై ఆధారపడి కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి! ఏదోలా యుద్ధం ఆగిపోతే తమ దేశానికి తిరిగి వెళ్తామని వీరంతా ఆశగా ఉన్నా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కళ్లముందే యుద్ధం సృష్టించిన బీభత్సాన్ని తలచుకుని వీరంతా ఇప్పటికీ వణికిపోతున్నారు. మారియుపోల్లో తమ ఇంటి ముందే బాంబులు పడటంతో పిల్లలను ఎలాగైనా కాపాడుకోవాలని కుటుంబంతో సహా వలస వచ్చినట్టు హంగరీ రాజధాని బుడాపెస్ట్కు వచ్చిన డేవిడ్ ‘సాక్షి’కి చెప్పాడు. ‘‘కానీ మా ఇద్దరు పసికందుల భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ఆందోళన ఇప్పుడు మమ్మల్ని వెంటాడుతోంది. మెకానిక్గా పనిచేసిన నాకు హంగరీలో ఏ పని చేయాలో తెలియడం లేదు. భవిష్యత్తు అంధకారంగా ఉంది’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పోలండ్ ఆపన్నహస్తం రష్యా, బెలారస్ తరువాత ఉక్రెయిన్తో ఎక్కువ సరిహద్దు పంచుకునేది పోలండ్. యుద్దం మొదలవుతూనే పోలండ్కు భారీగా వలసలు మొదలయ్యాయి. సరిహద్దు నగరం ల్యుబ్లిన్తో పాటు రాజధాని వార్సాకు శరణార్థుల తాకిడి భాగా పెరిగింది. ఇప్పటికే 21 లక్షలకు పైగా పోలండ్ చేరుకున్నారు. ఆ దేశం వారిని సాదరంగా అక్కున చేర్చుకుంటోంది. శరణార్థులకు పోలిష్ నేషనల్ ఐడెంటిటీ నంబర్ (పెసెల్) అనే రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి ఆర్నెల్ల పాటు తమ దేశంలో ఉండేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ సమయంలో వారు ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఉచితంగా వైద్యం అందిస్తారు. పిల్లలకు నెలకు 110 యూరోలు ఇస్తుంది. లక్షన్నరకు పైగా దీనిద్వారా లబ్ధి పొందినట్టు పోలండ్ చెబుతోంది.హంగరీ, రుమేనియా, స్లోవేకియా కూడా శరణార్థుల పట్ల ఉదారంగా వ్యవహిస్తున్నాయి. అయితే శరణార్థులతో పోలండ్ పూర్తిగా నిండిపోతోంది. ఒక్క వార్సాకే 4 లక్షల మంది దాకా వచ్చినట్టు సమాచారం. నగర జనాభాలో ఇది ఐదో వంతు! వీరిని ఎక్కడుంచాలన్నది కూడా సమస్యగా మారింది. ముఖ్యంగా రాత్రిళ్లు మైనస్? డిగ్రీల చలిలో పిల్లలు, మహిళలు అల్లాడుతున్నారు. స్టేడియాలు, కమ్యూనిటీ హాళ్లతో పాటు చాలా ఎన్జీవోలు తమ ఇళ్లను ఉక్రేయినియన్ల కోసం తెరిచిపెట్టాయి. పౌరులు కూడా తోచింది తెచ్చి శిబిరాల్లో ఇస్తున్నారు. విద్యార్థులు, యువకులు సోషల్ మీడియాలో కమ్యూనిటీగా ఏర్పడి సాయం చేస్తున్నారు. భేష్ హంగరీ హంగరీకి కూడా 4 లక్షల దాకా శరణార్ధులు వచ్చారు. గతంలో శరణార్థులను అనుమతించని హంగరీ విధానం మార్చుకుని మరీ ఉక్రేనియన్లకు ఆశ్రయమిస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్కు సన్నిహితుడిగా పేరున్న హంగరీ ప్రధాని విక్టర్ అర్బన్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషమే. రాజధాని బుడాపెస్ట్, జహోని, డెబ్రిసెన్ లాంటి నగరాల్లోనూ శరణార్థులు భారీగా ఉన్నారు. ప్రభుత్వం కంటే ఎన్జీవోలే వీరికి ఎక్కువగా సాయం చేస్తున్నాయి. టాక్సీ డ్రైవర్ల ఔదార్యం శరణార్థులను టాక్సీ డ్రైవర్లు సరిహద్దుల నుంచి పెద్ద నగరాలకు ఉచితంగా చేరేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు! ఎయిర్పోర్టులకు, శిబిరాలకు తీసుకెళ్తున్నారు. 8 గంటలు పని చేసుకున్నాక వారికోసం ఉచితంగా ఈ పని చేస్తున్నట్టు చెప్తున్నారు. ఛిన్నాభిన్నమయ్యాం యుద్ధం మొదలవగానే కీవ్ నుంచి పోలండ్ వచ్చా. మా నాన్న, అన్నయ్య అక్కడే ఉండిపోయారు. మా అమ్మను తీసుకువచ్చే ప్రయత్నం చేసినా సరిహద్దు దాకా రాలేకపోయింది. ఆమెను సరిహద్దుల్లో బంధువుల ఊళ్లో వదిలొచ్చా. మా కుటుంబం బాగా గుర్తుకు వస్తోంది. కనీసం వాళ్లతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎక్కడున్నారో, అసలున్నారో లేదో తెలియదు. బాధ మర్చిపోయేందుకు వలంటీర్గా నాలాంటివారికి సాయం చేస్తున్నాను. ఈ యుద్ధం చాలా క్రూరమైంది. ఇది చేసిన గాయం ఇప్పట్లో మానదు. – మేరీ, శరణార్థి, వార్సా -
పగవారికీ రావొద్దీ కష్టం.. ఈయూ సాయం మరువలేనిది.. గణాంకాలివే!
రష్యా నిర్దాక్షిణ్యంగా కురిపిస్తున్న బాంబుల వర్షానికి గూడు చెదిరిపోయింది. శిథిల దృశ్యాలను చూస్తూ గుండె పగిలిపోతోంది. యుద్ధం ఊరు విడిచి వెళ్లిపొమ్మంటోంది. మగవాళ్లు దేశ రక్షణ కోసం ఆగిపోతుంటే మహిళలు పిల్లాపాపలతో, కట్టుబట్టలతో వలసబాట పట్టారు. వీరిని యూరప్ అక్కున చేర్చుకుంటోంది... కనీవినీ ఎరుగని మానవీయ సంక్షోభంతో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. రష్యా దాడి మొదలైనప్పటి నుంచి దేశం విడిచిన వారి సంఖ్య 33 లక్షలు దాటేసింది. వీరిలో 90 శాతం మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. లక్షలాది మంది సరిహద్దుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇక దేశంలో నిరాశ్రయులైన వారు 65 లక్షల దాకా ఉంటారని ఐరాస హక్కుల మండలి అంచనా. ‘‘ఎప్పుడు ఏ బాంబు వచ్చి మీద పడుతుందో తెలియని దుర్భర పరిస్థితుల్లో ఉన్న జనం వలస బాట పట్టారు. యుద్ధం ఆగితే తప్ప వలసలు ఆగేలా లేవు’’ అని యూఎన్హెచ్ఆర్సీ చీఫ్ ఫిలిప్పో గ్రాండీ అన్నారు. ఉక్రెయిన్లో మహిళల కష్టాలు వర్ణనాతీతం! ‘‘కరెంట్ లేదు. ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేవు. నరకం భరించలేక నానాకష్టాలకోర్చి వలస వచ్చా’’ అని ఓల్హా అనే మహిళ కన్నీరుమున్నీరైంది. శరణార్థులుగా మారితే అల్లకల్లోలం ఉక్రెయిన్ వలసలను చూసి ఇతర దేశాల్లోని శరణార్థులూ చలించిపోతున్నారు. ఈ బాధలు పగవారిక్కూడా వద్దని 13 ఏళ్లప్పుడే సిరియా నుంచి అమెరికా వలస వచ్చిన నిడా అల్జబౌరిన్ చెప్పింది. చిన్నవయసులో శరణార్థులుగా మారితే జీవితం అల్లకల్లోలమవుతుందని ఆవేదన వెలిబుచ్చింది. చిన్నారులను నేరస్తుల ముఠాలు ఎత్తుకెళ్లే ప్రమాదముందని యునిసెఫ్ హెచ్చరించింది. యూరోపియన్ యూనియన్ సాయం ఇలా ఉక్రెయిన్ ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని వస్తున్న వారిని యూరోపియన్ యూనియన్ అక్కున చేర్చుకుంటోంది. ఎక్కడికక్కడ రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వపరంగా నిత్యావసరాలు అందిస్తోంది. మంచి ఆహారం, వైద్య సదుపాయాలతో పాటు సంక్షేమాన్ని కూడా చూస్తోంది. పిల్లలకు స్కూళ్లలో సీట్లు కూడా ఇవ్వనుంది. 27 ఈయూ దేశాలు శరణార్థులకు మూడేళ్ల పాటు ఉండే అవకాశం కల్పించాయి. అమెరికాలోకి శరణార్థులెవరూ రాకపోయినా మానవతా సాయం కింద ఉక్రెయిన్కు ఇప్పటికే 400 కోట్లకు డాలర్లకు పైగా అందించింది. అందులో 104 కోట్ల డాలర్లు శరణార్థులకు ప్రత్యేకించింది. ► ఉక్రెయిన్ నుంచి అత్యధికంగా పోలండ్కు 20 లక్షల మందికి పైగా వలస వెళ్లారు ► 5 లక్షల మంది రుమేనియాకు వెళ్లారు ► మాల్దోవాకు 4 లక్షల మంది వెళ్లారు. ఇక్కడ్నుంచి వేరే దేశాలకు వెళ్తున్నారు. ► 3 లక్షల మంది హంగరీ వెళ్లినట్టు గణాంకాలు చెప్తున్నాయి ► స్లొవేకియాకు 2.5 లక్షల మంది వెళ్లారు – నేషనల్ డెస్క్, సాక్షి -
Russia-Ukraine war: ప్రధాన నగరాలే టార్గెట్
కీవ్/లెవివ్/మాస్కో/వాషింగ్టన్: ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై రష్యా సైన్యం క్షిపణులతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్ శివార్లతో పాటు పశ్చిమాన లెవివ్ సిటీపై శుక్రవారం ఉదయం భీకర దాడులు జరిపింది. లెవివ్ నడిబొడ్డున బాంబుల మోత మోగించింది. కొన్ని గంటలపాటు దట్టమైన పొగ వ్యాపించింది. క్షిపణి దాడుల్లో ఎయిర్పోర్టు సమీపంలో యుద్ధ విమానాల మరమ్మతు కేంద్రం, బస్సుల మరమ్మతు కేంద్రం దెబ్బతిన్నాయి. రష్యా నల్ల సముద్రం నుంచి లెవివ్పై క్షిపణులను ప్రయోగిస్తోంది. రెండు క్షిపణులను నేలకూల్చామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. క్రామాటోర్స్క్ సిటీలో ఇళ్లపైనా క్షిపణులు వచ్చి పడుతున్నాయి. ఖర్కీవ్లో మార్కెట్లను కూడా వదలడం లేదు. చెర్నిహివ్లో ఒక్కరోజే 53 మృతదేహాలను మార్చురీలకు తరలించారు. మారియుపోల్లో బాంబుల మోతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బాంబు దాడులకు గురైన థియేటర్ నుంచి 130 మంది బయటపడగా 1,300 మంది బేస్మెంట్లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు. రష్యా కల్నల్, మేజర్ మృతి ఉక్రెయిన్ సైన్యం దాడుల్లో పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కల్నల్ సెర్గీ సుఖరెవ్, మేజర్ సెర్గీ క్రైలోవ్ కూడా వీరిలో చనిపోయినట్టు రష్యా అధికారిక టెలివిజన్ కూడా దీన్ని ధ్రువీకరించింది. రష్యా ఇప్పటిదాకా 7,000 మందికి పైగా సైనికులను కోల్పోయినట్టు సమాచారం. బైడెన్కు జెలెన్స్కీ కృతజ్ఞతలు తమకు అదనపు సైనిక సాయం అందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ సైనిక సామర్థ్యాన్ని రష్యా సరిగా అంచనా వేయలేకపోయిందన్నారు. ఆపేయండి: హాలీవుడ్ దిగ్గజం ఆర్నాల్డ్ ఉక్రెయిన్పై యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని ప్రఖ్యాత హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ స్వార్జ్నెగ్గర్ రష్యాకు సూచించారు. పుతిన్ స్వార్థ ప్రయోజనాల కోసం రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందన్నారు. ‘‘నా తండ్రి కూడా కొందరి మాయమాటలు నమ్మి హిట్లర్ తరపున రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. భౌతికంగా, మానసికంగా గాయపడి ఆస్ట్రియాకు తిరిగొచ్చారు’’ అన్నారు. మానవత్వం చూపాల్సిన సమయం: భారత్ రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని, సామాన్యులు మృత్యువాత పడుతున్నారని ఐరాసలో భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. నిరాశ్రయులను తక్షణమే ఆదుకోవాల్సిన అవసరముందని భద్రతా మండలి భేటీలో ఆయనన్నారు. భారత్ తనవంతు సాయం అందిస్తోందని గుర్తుచేశారు. ఉక్రెయిన్లో సామాన్యులు చనిపోతుండడం తీవ్ర ఆందోళనకరమని ఐరాస పొలిటికల్ చీఫ్, అండర్ సెక్రెటరీ జనరల్ రోజ్మేరీ డికార్లో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్లో 60.6 లక్షల మంది నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ఉక్రెయిన్తో చర్చల్లో పురోగతి: రష్యా ఉక్రెయిన్తో తాము జరుపుతున్న చర్చల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోందని రష్యా తరపు బృందానికి సారథ్యం వహిస్తున్న వ్లాదిమిర్ మెడిన్స్కీ శుక్రవారం చెప్పారు. ఉక్రెయిన్కు తటస్థ దేశం హోదా ఉండాలని తాము కోరుతున్నామని, ఈ విషయంలో ఒక ఒప్పందానికి ఇరుపక్షాలు దగ్గరగా వచ్చినట్లు వెల్లడించారు. నాటోలో చేరాలన్న ఉక్రెయిన్ ఉద్దేశం పట్ల ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు క్రమంగా తగ్గిపోతున్నాయన్నారు. ర్యాలీలో పాల్గొన్న పుతిన్ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం రాజధాని మాస్కోలో భారీ ర్యాలీలో స్వయంగా పాల్గొన్నారు. ఉక్రెయిన్కు చెందిన క్రిమియా ద్వీపకల్పం రష్యాలో విలీనమై 8 ఏళ్లయిన సందర్భంగా మాస్కోలోని లుఝ్నికీ స్టేడియం చుట్టూ ఈ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. ఉక్రెయిన్పై యుద్ధం సాగిస్తున్న తమ సైనిక బలగాలపై ఈ సందర్భంగా పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉక్రెయిన్లో నాజీయిజంపై పుతిన్ పోరాడుతున్నారని వక్తలన్నారు. రష్యా చమురుపై జర్మనీ ఆంక్షలు! ఉక్రెయిన్పై దండయాత్ర సాగిస్తున్న రష్యాకు ముకుతాడు వేయక తప్పదన్న సంకేతాలను జర్మనీ ఇచ్చింది. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తామని జర్మనీ విదేశాంగ మంత్రి అనాలెనా బెయిర్బాక్ చెప్పారు. చమురు కోసం తాము రష్యాపై ఆధారపడుతున్నప్పటికీ ఇది మౌనంగా ఉండే సమయం కాదన్నారు. క్లిష్ట సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్లో ఫోన్లో దాదాపు గంటపాటు మాట్లాడారు. ఉక్రెయిన్లో కాల్పులు విరమణకు వెంటనే అంగీకరించాలని కోరారు. -
ఉక్రెయిన్పై రష్యా సైన్యం దూకుడు.. చర్చలంటూనే ముట్టడి
కీవ్/వాషింగ్టన్: ఒకవైపు చర్చలు.. మరోవైపు క్షిపణుల మోతలు. ఉక్రెయిన్–రష్యా మధ్య ప్రస్తుతం ఇదీ పరిస్థితి. ఉక్రెయిన్పై రష్యా బలగాలు విరుచుకుపడుతన్నాయి. దండయాత్ర మొదలై మూడు వారాలవుతున్నా ఇంకా లక్ష్యం పూర్తికాకపోవడంతో అసహనంగా ఉన్న రష్యా సైన్యం దూకుడు పెంచింది. ప్రధానంగా రాజధాని కీవ్పై దృష్టి పెట్టింది. కీవ్ చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు నగరం లోపల సైతం బుధవారం రష్యా బలగాలు నిప్పుల వర్షం కురిపించాయి. సెంట్రల్ కీవ్లో 12 అంతస్తుల ఓ అపార్టుమెంట్ భవనం మంటల్లో చిక్కుకుంది. చివరి అంతస్తు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. సమీపంలోని భవనం కూడా ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు తెలిసింది. కీవ్ శివార్లపైనా రష్యా భీకర దాడులు సాగిస్తోంది. బుచాతోపాటు జైటోమిర్ పట్టణంపై బాంబులు ప్రయోగించింది. కీవ్కు ఉత్తరంవైపు 80 కిలోమీటర్ల దూరంలోని ఇవాంకివ్ నగరాన్ని రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకుంది. బెలారస్ సరిహద్దుల్లోని ఉక్రెయిన్ భూభాగాలపై పట్టు సాధించింది. రష్యా నావికా దళం మారియుపోల్, ఒడెశా పట్టణాలపై దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి. రష్యా సేనలను తమ బలగాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. రష్యా అధీనంలో ఉన్న ఖేర్సన్ ఎయిర్పోర్టు, ఎయిర్బేస్పై తమ సైన్యం దాడి చేసిందని, రష్యా హెలికాప్టర్లు, సైనిక వాహనాలను ధ్వంసం చేసిందని తెలిపింది. రెండో పెద్ద నగరమైన ఖర్కీవ్లోకి రష్యా జవాన్లు అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నట్లు వివరించింది. ఉక్రెయిన్కు చెందిన 111 ఎయిర్క్రాఫ్ట్లు, 160 డ్రోన్లు, 1,000కి పైగా మిలటరీ ట్యాంకులతోపాటు ఇతర వాహనాలను తమ సైనికులు ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ ప్రకటించారు. ► ఉక్రెయిన్ నుంచి తమ దేశానికి ఇప్పటిదాకా 47,153 మంది శరణార్థులుగా వచ్చారని, వీరిలో 19,069 మంది మైనర్లు ఉన్నారని ఇటలీ బుధవారం వెల్లడించింది. ► ఉక్రెయిన్తో జరుపుతున్న చర్చల్లో.. ఆ దేశ సైన్యానికి తటస్థ హోదా కోసం తాము ఒత్తిడి పెంచుతున్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. ఉక్రెయిన్ భద్రతకు హామీనిస్తూ అక్కడి సైన్యానికి తటస్థ హోదా ఉండాలని తాము సూచిస్తున్నామని తెలిపారు. ► ఉక్రెయిన్కు సైనిక బలగాలను పంపించే ఉద్దేశం తమకు లేదని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ మరోసారి స్పష్టం చేశారు. ► చెర్నీహివ్ నగరంలో ఆహారం కోసం బారులు తీరిన ప్రజలపై రష్యా కాల్పులు జరిపిందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. ఈ కాల్పుల్లో 10 మంది పౌరులు మృతిచెందారని తెలిపారు. ► తమ దేశంలో మరో మేయర్, ఉప మేయర్ను రష్యా సైన్యం అపహరించిందని రష్యా విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆరోపించారు. అమెరికా సాయం వెంటనే కావాలి రష్యాపై జరుగుతున్న యుద్ధంలో అమెరికా సాయం మరింత కావాలని జెలెన్స్కీ కోరారు. తమకు వెంటనే సాయం అందించాలంటూ అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు విన్నవించారు. ఈ మేరకు జెలెన్స్కీ విజ్ఞప్తిని అమెరికా పార్లమెంట్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. మిలటరీ ఆపరేషన్ సక్సెస్: పుతిన్ ఉక్రెయిన్లో తమ సైనిక చర్చ విజయవంతమైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ దేశంపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను ‘కౌన్సిల్ ఆఫ్ యూరప్’ ఖండించింది. తమ కౌన్సిల్ నుంచి రష్యాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్–రష్యా శాంతి ప్రణాళిక! యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఉక్రెయిన్–రష్యా దేశాలు శాంతి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. కాల్పుల విరమణ, ‘నాటో’లో చేరాలన్న ఆకాంక్షలను ఉక్రెయిన్ వదులుకుంటే రష్యా దళాలు పూర్తిగా వెనక్కి తగ్గడం, సైనిక బలగాల సంఖ్యను కుదించుకోవడానికి ఉక్రెయిన్ అంగీకారం.. వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయని తెలియజేసింది. యుద్ధం ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్(ఐసీజే).. రష్యాను ఆదేశించింది. రష్యాపై ఉక్రెయిన్ ఐసీజేకు రెండు వారాల క్రితమే ఫిర్యాదు చేయడం తెల్సిందే. ఈ కేసులోనే కోర్టు రష్యాను ఆదేశించింది. ఈ కేసులో ఐసీజేలో భారతీయ న్యాయమూర్తి దల్వీర్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటేయడం గమనార్హం. -
రక్షణ రంగంలో సాంకేతికత పెరగాలి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దాడి అంతకంతకూ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భారత్లో భద్రతా సన్నద్ధతపై ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రతపై ఆదివారం ఢిల్లీలో కేబినెట్ కమిటీతో సమావేశమై చర్చలు జరిపారు. త్రివిధ బలగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలను ప్రవేశపెట్టాలని, రక్షణ రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టే దిశగా చర్చలు సాగాయని ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. రక్షణ రంగంలో మేకిన్ ఇండియా సాధిస్తే మన బలం పెరగడంతో పాటు ఆర్థిక రంగం కూడా పుంజుకుంటుందని సమావేశం ఒక అభిప్రాయానికి వచ్చింది. ప్రధాని మోదీ వివిధ దేశాలు రక్షణ రంగంలో వాడుతున్న టెక్నాలజీ, భారత్ పకడ్బందీగా ఎలా ముందుకెళుతోందో వివరించారు. ఖర్కీవ్లో రష్యా బాంబు దాడుల్లో మృతి చెందిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని భారత్కు తిరిగి తేవడానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
Ukraine-Russia War: దిగ్బంధంలో కీవ్
లెవివ్/వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. ఉక్రెయిన్ సైనికులతోపాటు స్థానికుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ రష్యా సైన్యం దూసుకుపోతోంది. కీలక నగరాలపై పట్టు సాధించడానికి గగనతలం నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. రాజధాని కీవ్కు ఇతర ప్రాంతాలతో సంబంధాలను ఆక్రమించేందుకు ఈశాన్యంగా చుట్టుముడుతోంది. కీవ్ శివార్లలో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మరోవైపు పోర్టు సిటీ మారియుపోల్లో చిన్నారులతో సహా 80 మందికి పైగా పౌరులు తలదాచుకున్న మసీదుపై రష్యా సైన్యం శనివారం క్షిపణులతో భీకర దాడికి దిగింది. మారియుపోల్లో యుద్ధ మరణాలు 1,500 దాటినట్లు మేయర్ కార్యాలయం ప్రకటించింది. కీవ్ పరిధిలోని పెరెమోహా గ్రామంలో పౌరులను తరలిస్తున్న వాహన కాన్వాయ్పై రష్యా బాంబు దాడి జరగడంతో ఏడుగురు పౌరులు మరణించారు. మైకోలైవ్ నగరంలోనూ రష్యా బీభత్సం సృష్టిస్తోంది. దాడిలో క్యాన్సర్ ఆసుపత్రి, నివాస సముదాయాలు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. మారియుపోల్ తూర్పు శివారు ప్రాంతాలను రష్యా సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ వలసలు 26 లక్షలు దాటినట్టు సమాచారం. యుద్ధం ఆపాలంటూ పోప్ ఫ్రాన్సిస్ ట్వీట్ చేశారు. జర్మనీ చాన్స్లర్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. కాల్పులు విరమించాలని కోరారు. మరో మేజర్ జనరల్ మృతి యుద్ధంలో రష్యా మరో సైనిక ఉన్నతాధికారిని కోల్పోయింది. మారియుపోల్లో తమ దాడిలో రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ కొలేస్నికోవ్ చనిపోయినట్టు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. రష్యా ఇప్పటికే ఇద్దరు మేజర్ జనరల్స్ను పోగొట్టుకోవడం తెలిసిందే. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన వారిని ఆదుకోవడానికి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు కోసం ఉక్రెయిన్, రష్యాలతో చర్చిస్తున్నట్టు ఐరాస చెప్పింది. 12,000 మంది అమెరికా సైనికులు రష్యాతో సరిహద్దులున్న లాత్వియా, ఎస్తోనియా, లిథువేనియా, రొమేనియా తదితర దేశాలకు 12,000 మంది సైనికులను పంపినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ గెలవలేరన్నారు. రష్యాకు ఎదురొడ్డి ఉక్రెయిన్ ప్రజలు అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. అయితే ఈ యుద్ధంలో తాము భాగస్వాములం కాబోమన్నారు. నాటో సభ్య దేశాల భూభాగాలను కాపాడుకునేందుకు రష్యా సరిహద్దులకు 12,000 అమెరికా సైనికులను పంపించినట్టు చెప్పారు. ఉక్రెయిన్ సైన్యంలోకి... స్నైపర్ వలీ ‘రష్యాపై జరుగుతున్న యుద్ధంలో మాకు సహాయం చేయండి’ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన విజ్ఞప్తి పట్ల కెనడా మాజీ సైనికులు సానుకూలంగా స్పందించారు. కెనడా రాయల్ 22వ రెజిమెంట్కు చెందిన పూర్వ సైనికులు ఉక్రెయిన్ సైన్యంలో చేరారు. వీరిలో ప్రపంచంలోనే అత్యుత్తమ స్నైపర్ వలీ కూడా ఉన్నారు. రష్యా అన్యాయమైన యుద్ధం చేస్తోందని, అందుకే ఉక్రెయిన్కు అండగా రంగంలోకి దిగానని వలీ చెప్పారు. గతంలో ఇరాక్లో ఐసిస్ ఉగ్రవాదులపై పోరాడిన కుర్దిష్ దళాలకు వలీ సాయం అందించారు. వలీ ఒక్కరోజులో కనీసం 40 మందిని హతమార్చగలడంటారు. 2017 జూన్లో ఇరాక్లో 3,540 మీటర్ల దూరంలో ఉన్న ఐసిస్ జిహాదిస్ట్ను సునాయాసంగా కాల్చి చంపాడు. మెలిటోపోల్ మేయర్ కిడ్నాప్ మెలిటోపోల్ మేయర్ను రష్యా సైనికులు అపహరించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా సైన్యం ఐసిస్ ఉగ్రవాదుల్లా రాక్షసంగా ప్రవర్తిస్తోందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బందీలుగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. రష్యాపై పోరాటం కొనసాగించాలని ఉక్రెయిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మేయర్ను రష్యా జవాన్లు కిడ్నాప్ చేస్తున్న వీడియోను ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మీ పిల్లలను యుద్ధానికి పంపొద్దు..రష్యా తల్లులకు జెలెన్స్కీ విజ్ఞప్తి ‘దయచేసి మీ పిల్లలను యుద్ధ రంగానికి పంపకండి, వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకండి’ అని రష్యా మహిళలకు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలను ఉక్రెయిన్లో యుద్ధంలోకి దించేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఉద్యోగాలిస్తాం, కేవలం సైనిక శిక్షణ ఇస్తాం అనే మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని కోరారు. యుద్ధంలో తమ సైనికులు 1,300 మంది అమరులయ్యారని వెల్లడించారు. కీవ్ను స్వాధీనం చేసుకొనేందుకు అమాయకులను రష్యా పొట్టన పెట్టుకుంటోందని ఆరోపించారు. సంక్షోభానికి ముగింపు పలకడానికి ఇజ్రాయెల్లోని జెరూసలేంలో చర్చిద్దామని రష్యా అధ్యక్షుడు పుతిన్కు జెలెన్స్కీ ప్రతిపాదించినట్లు సమాచారం. -
పుతిన్కు కోలుకోలేని దెబ్బ.. వెక్కివెక్కి ఏడుస్తున్న రష్యన్ యువతి..
మాస్కో: ఉక్రెయిన్లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సైతం సంభవించింది. రష్యా యుద్ధం ఆపాలంటూ ఇప్పటికే పలు దేశాలు హెచ్చరిస్తూ ఆంక్షలను కూడా విధించినా వ్లాదిమిర్ పుతిన్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు రష్యాపై పుల్ ఫోకస్ పెంచి అష్ట దిగ్బంధనం చేస్తున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ సహా ఇతర దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. అటు వీసా, మాస్టర్ కార్ట్ సైతం తమ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్ కూడా రష్యాలో పనిచేయడం లేదు. తాజాగా యూట్యూబ్ కూడా రష్యాకు సర్ప్రైజ్ షాక్ ఇచ్చింది. రష్యా ప్రభుత్వానికి చెందిన మీడియా ఛానెళ్లను యూట్యూబ్లో బ్లాక్ చేస్తున్నట్లు సంబంధిత సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపింది. తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తున్నట్లు పేర్కొంది. One of the #Russian bloggers cries that in two days her Instagram will stop working She does not care at all about the thousands of dead people, including her compatriots. Obviously, her biggest worry right now is that she won't be able to post pictures of food from restaurants. pic.twitter.com/LSdBiSlwHr — NEXTA (@nexta_tv) March 11, 2022 మరోవైపు.. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఇన్స్టాగ్రామ్పై రష్యా నిషేధం విధించడాన్ని ఆ సంస్థ చీఫ్ ఆడమ్ ముస్సేరీ తప్పుపట్టారు. రష్యా చర్య సరికాదని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో రష్యాకు చెందిన ఓ యువతి ఇన్స్టాగ్రామ్లో తన బ్లాగ్ పనిచేయడం లేదని వెక్కివెక్కి ఏడ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
పోయి పోయి వాళ్లతో ఎందుకు పెట్టుకున్నారయ్యా..
రష్యా సైన్యానికి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా చురకలంటించారు. పోయి పోయి మీరు వాళ్లతో ఎందుకు పెట్టుకున్నారయ్యా. కావాలంటే బ్రిటీషర్లను అడగండి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ మారింది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా సమకాలిన అంశాలపై సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధంపై తన శైలిలో సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తన బాల్యం యుద్ధానికి ఎలా ముడిపడింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయ విద్యార్ధుల్ని కేంద్రం ఎంతమంది స్వదేశానికి తరలిచ్చిందనే విషయాలపై ఎప్పటికప్పుడూ అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఉక్రెయిన్ దేశ భూభాగాల్ని స్వాధీనం చేసుకుంటున్న రష్యా మిలటరీని నినదిస్తూ స్థానికులు ప్లకార్డ్లతో ఆందోళన చేస్తున్న విడియోల్ని సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఉక్రెయిన్ నగరానికి చెందిన ఖేర్సన్ Kherson అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యన్ బలగాలు పెద్ద ఎత్తున మొహరించాయి. అయితే ఆ బలగాలకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. When an army has to face unarmed civilians, they’re facing a weapon more powerful than tanks. Satyagraha will always prove an unconquerable force… Ask the British… https://t.co/2Xpk22b67w — anand mahindra (@anandmahindra) March 5, 2022 ఆ వీడియోలను నెటిజన్లతో పంచుకున్న ఆనంద్ మహీంద్రా..రష్యా సైన్యాన్ని ఉద్దేశిస్తూ ఒక సైన్యం నిరాయుధ పౌరులను ఎదుర్కోవలసి వస్తే..వాళ్లు యుద్ధ ట్యాంకుల కంటే శక్తివంతమైన ఆయుధాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సత్యాగ్రహాం జయించలేని శక్తి. కావాలంటే ఒక్కసారి బ్రిటిష్ వాళ్లని అడగండి అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. చదవండి: యుద్ధం.. ఆ శబ్ధం వింటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది- ఆనంద్ మహీంద్రా -
విరుచుకుపడుతున్న రష్యా బలగాలు.. ఉక్రెయిన్లో బాంబుల వర్షం
కీవ్: ఉక్రెయిన్లో హోరాహోరి పోరు కొనసాగుతోంది. రష్యా బలగాలు ఉక్రెయిన్లో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. వారి దాడులను ఉక్రెయిన్ సైన్యం తిప్పికొడుతున్నప్పటికీ అక్కడ తీవ్ర నష్టం జరుగుతోంది. తాజాగా రష్యా బలగాలు ఉక్రెయిన్లోని అతిపెద్ద నగరం ఖార్కీవ్లో దాడులు కొనసాగిస్తున్నాయి. రష్యా యుద్ద విమానాల దాడుల్లో మంగళవారం ఖార్కీవ్ నగర పరిపాలనా భవనం ఫ్రీడమ్ స్వ్కేర్ కుప్పకూలిపోయింది. మరోవైపు రష్యా బలగాలు ఖార్కీవ్లోని ఓ ఆసుపత్రిపై దాడులు చేసినట్టు ఉక్రెయిన్ సైన్యం పేర్కొంది. రష్యా వైమానిక బలగాలు ఖార్కీవ్లోకి ప్రవేశించాయి. వారు స్థానిక ఆసుపత్రులపై దాడులు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎదురు దాడులు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ ఆర్మీ మంగళవారం ప్రకటించింది. మరోవైపు ఫ్రీడమ్ స్క్వేర్ కూల్చివేత, ఆసుపత్రిపై దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. ఈ దాడి రష్యా ప్రభుత్వ ఉగ్ర చర్య అని జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని ఎవరూ క్షమించలేరంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. తమ బలమేంటో నిరూపించుకుంటామని రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. -
నగరాల్లో హోరాహోరీ..ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాలు
కీవ్: ఉక్రెయిన్పై దాడిలో రష్యా సేనలు కీలక పట్టణాల్లోకి చొచ్చుకువస్తున్నాయి. దీంతో చాలా నగరాల్లో రష్యా బలగాలకు, ఉక్రెయిన్ మిలటరీకి మధ్య హోరాహోరీ పోరాటం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎయిర్ఫీల్డ్స్, ఇంధన నిల్వాగారాలపై దాడులు చేసిన రష్యా బలగాలు ఆదివారం నాటికి ఉక్రెయిన్లోని కీలక నౌకాశ్రయాలను స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు చర్చలకోసం బెలారస్కు బృందాన్ని పంపినట్లు రష్యా ప్రకటించింది. కానీ తమ దేశం నుంచి దాడులకు కేంద్రమైన బెలారస్లో చర్చలకు వెళ్లమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. మరే దేశంలోనైనా చర్చలకు సిద్ధమని తొలుత చెప్పారు, కానీ బెలారస్ సరిహద్దుల్లో చర్చలకు సిద్ధమని తాజాగా ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. ఆదివారం రష్యాలోని ఖార్కివ్ నగరం సమీపంలోకి రష్యా సేనలు చొచ్చుకువచ్చాయి. వీరిని ఉక్రెయిన్ బలగాలు ఎదుర్కొంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నగరం తూర్పున ఉన్న గ్యాస్ లైన్ను రష్యా సేనలు పేల్చివేశాయి. రష్యా నుంచి కాపాడేందుకు అందరూ ఆయుధాలు ధరించాలన్న అధ్యక్షుడి పిలుపుతో పలువురు ఉక్రేనియన్లు కదనరంగంలో పోరాడుతున్నారు. దీంతో రష్యన్ బలగాలకు చాలాచోట్ల ప్రతిఘటన ఎదురవుతోంది. పోరాడుతాం...: ‘‘మేం మా దేశం కోసం పోరాడుతున్నాం, మా స్వతంత్రం కోసం పోరాడుతున్నాం, ఎందుకంటే దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడే హక్కు మాకుంది.’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం ప్రకటించారు. దేశమంతా బాంబులతో దద్దరిల్లుతోందని, పౌర నివాసాలను కూడా విడిచిపెట్టడం లేదని ఆయన వాపోయారు. కీవ్ సమీపంలో భారీ పేలుళ్లతో పాటు మంటలు కనిపించాయి. దీంతో ప్రజలంతా భయంతో బంకర్లలో, సబ్వేల్లో దాక్కుంటున్నారు. నగరంలో 39 గంటల కర్ఫ్యూ విధించారు. కీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా పేలుళ్లు వినిపించాయని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. రష్యాది ఉగ్రవాదమని జెలెన్స్కీ దుయ్యబట్టారు. తమ నగరాలపై రష్యా దాడులకు సంబంధించి అంతర్జాతీయ యుద్ధనేరాల ట్రిబ్యునల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రష్యాను ఐరాస భద్రతా మండలి నుంచి తొలగించాలన్నారు. తీరప్రాంత స్వాధీనం ఉక్రెయిన్ దక్షిణాన ఉన్న కీలక నౌకాశ్రయ నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. దీంతో ఉక్రెయిన్ తీరప్రాంతం రష్యా అదుపులోకి వచ్చినట్లయింది. నల్ల సముద్రంలోని ఖెర్సన్, అజోవ్ సముద్రంలోని బెర్డిన్స్క్ పోర్టులను స్వాధీనం చేసుకున్నామని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి ప్రకటించారు. పలు నగరాల్లో విమానాశ్రయాలు కూడా తమ అదుపులోకి వచ్చాయన్నారు. అయితే ఒడెసా, మైకోలైవ్ తదితర ప్రాంతాల్లో పోరు కొనసాగిస్తున్నామని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. పోర్టులు చేజారడం ఉక్రెయిన్కు ఎదురుదెబ్బని విశ్లేషకులు భావిస్తున్నారు. పొంతన లేని గణాంకాలు యుద్ధంలో ఇరుపక్షాల్లో ఎంతమంది మరణించారు, గాయపడ్డారు అన్న విషయమై సరైన గణాంకాలు తెలియడంలేదు. రష్యాదాడిలో 198 మంది పౌరులు చనిపోయారని, వెయ్యికిపైగా గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ ఆరోగ్యమంత్రి చెప్పారు. రష్యాసేనల్లో 3,500మంది చనిపోయారని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. దాడులు ఆరంభమైన తర్వాత సుమారు 3.68 లక్షలమంది ఉక్రేనియన్లు పొరుగుదేశాలకు వలసపోయారని ఐరాస తెలిపింది. ఒకపక్క రష్యా సేనలు ఉక్రెయిన్లోకి చొచ్చుకుపోతున్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు పలురకాల ఆయుధాలు, మందుగుండు సమాగ్రిని సమకూరుస్తున్నాయి. అదే సమయంలో రష్యాపై భారీ ఆంక్షలను విధిస్తున్నాయి. ఉక్రెయిన్కు 35 కోట్ల డాలర్ల మిలటరీ సాయాన్ని అమెరికా ప్రకటించింది. 500 మిస్సైళ్లు, 1000 యాంటీ టాంక్ ఆయుధాలను పంపుతామని జర్మనీ తెలిపింది. బెల్జియం, చెక్, డచ్ ప్రభుత్వాలు కూడా ఆయుధాలు పంపుతున్నాయి. ఎంపిక చేసిన రష్యా బ్యాంకులను స్విఫ్ట్ (అంతర్జాతీయ బ్యాంకు అనుసంధానిత వ్యవస్థ) నెట్వర్క్లో బ్లాక్ చేసేందుకు యూఎస్, యూకే, ఈయూ అంగీకరించాయి. ఉక్రెయిన్లో తమ స్టార్లింగ్ ఇంటర్నెట్ వ్యవస్థను యాక్టివేట్ చేస్తున్నట్లు బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రకటించారు. ఐరాస అత్యవసర భేటీ! ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణపై చర్చకు 193 మంది సభ్యులతో కూడిన ఐరాస సాధారణ అసెంబ్లీ ‘అరుదైన అత్యవసర ప్రత్యేక సమావేశం’ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భేటీ కోసం భద్రతా మండలిలో ఓటింగ్ జరగనుంది. భద్రతామండలి పూర్తి సమావేశంలో శాశ్వత దేశాలు వీటో అధికారం ఉపయోగించే వీలు లేదు. దాడిపై భద్రతా మండలి తీర్మానాన్ని శుక్రవారం రష్యా వీటో చేయడం తెలిసిందే. రష్యా విమానాలపై ఈయూ నిషేధం రష్యా విమానాలను తమ గగనతలంపై నిషేధించాలని 27 దేశాల యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఉక్రెయిన్కు ఆయుధాల కొనుగోలుకు నిధులు సమకూర్చాలని నిర్ణయించామని ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా చెప్పారు. ఈయూ చరిత్రలో దాడికి గురవుతున్న దేశానికి ఆయుధ సాయం కోసం నిధులందించడం ఇదే తొలిసారన్నారు. -
బాంబుల హోరుతో భయం భయంగా..విద్యార్థులు
సాక్షి, నెట్వర్క్ : ఉక్రెయిన్లో మూడో రోజూ రష్యా దాడులు కొనసాగుతుండడం.. యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు బాంబుల హోరుతో బెంబేలెత్తుతున్నారు. రాజధాని కీవ్లో చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన వైద్య విద్యార్థిని సాయినిఖిత ఉంటున్న అపార్ట్మెంటుకు కిలోమీటర్ దూరంలో శుక్రవారం రాత్రి బాంబులు పడటంతో అక్కడ వారంతా భయంకంపితులయ్యారు. బాంబులు పడిన ప్రాంతమంతా భీకర శబ్దాలతో దద్దరిల్లిందని శనివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పింది. రాత్రంతా బాంబుల శబ్దాలతో నిద్రపోలేదని చెప్పింది. కానీ, శనివారం ఉదయం నుంచీ కర్ఫ్యూ వాతావరణం నెలకొందని వివరించింది. ఎక్కడి వారు అక్కడే ఉండాలంటూ వాట్సప్ గ్రూపులో మెసేజ్లు వస్తున్నాయని అక్కడి పరిస్థితిని నిఖిత వివరించింది. వాహనాలు లేనందున ఎక్కడికీ కదల్లేని పరిస్థితని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ సరిహద్దులకు వెళ్లడం కూడా అంత శ్రేయస్కరం కాదని హెచ్చరించడంతో తామంతా కీవ్లోని అపార్ట్మెంట్లోనే ఉండిపోయామని తెలిపింది. రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి ఫోన్లో మాట్లాడి దైర్యం చెప్పారని, ఆయన సిబ్బంది తరచూ మాట్లాడుతున్నారని చెప్పింది. అలాగే, బి.కొత్తకోట శెట్టిపల్లె రోడ్డులో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామకృష్ణ కూడా తన కుమారుడు ఎస్. చైతన్య కోసం ఆందోళన చెందుతున్నారు. అయితే శనివారం సాయంత్రం చైతన్య సహా పలువురు విద్యార్థులు బస్సులో రుమేనియా దేశానికి బయలుదేరారు. అక్కడినుంచి ప్రత్యేక విమానంలో ముంబై కాని, ఢిల్లీకాని చేరుకుంటారు. బస్సుల కొరతతో విడతల వారీగా.. ఇక భారత్ ఎంబసీ ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులో రుమేనియాకు బయల్దేరామని ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెంకు చెందిన మోతుకూరు నాగప్రణవ్ తెలిపాడు. శనివారం మధ్యాహ్నం ప్రణవ్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. బస్సులో రుమేనియాకు చేరుకునేందుకు ఒకటిన్నర రోజు పడుతుందని, అక్కడ నుంచి స్వదేశానికి వస్తామని తెలిపాడు. ఇక్కడ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 70 మంది విద్యార్థులు ఉన్నారని, ప్రస్తుతం 30 మంది బస్సులో రుమేనియా బయలుదేరామని తెలిపాడు. మరో 20 మంది రాత్రికి, మిగతా 20 మంది రేపు బయల్దేరుతారన్నాడు. బస్సుల కొరత కారణంగా విడతల వారీగా రుమేనియాకు వెళ్లాల్సి వస్తోందని ప్రణవ్ ‘సాక్షి’కి వివరించాడు. మరోవైపు.. విమానాలు లేక దాచేపల్లికి చెందిన కటకం మురళీకృష్ణ, లక్ష్మీ దంపతుల కుమార్తె రమ్యశ్రీ అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. విమానం టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండాపోయిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న మరో యూనివర్సిటీకి రమ్యశ్రీతో పాటు మరికొంతమంది విద్యార్థులను అక్కడి అధికారులు తరలించారు. భయపడొద్దు..మేమందరం ఉన్నాం : కోన రఘుపతి ‘ఉక్రెయిన్ నుంచి ప్రతి ఒక్కరినీ క్షేమంగా తీసుకువచ్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు.. భయపడొద్దు..మేమందరం ఉన్నాం’.. అంటూ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఉక్రెయిన్లో ఉన్న నోషితకు, ఇక్కడ ఆమె తల్లిదండ్రులు శ్రీదేవి, శ్రీనివాసరావుకు ధైర్యం చెప్పారు. వీడియోకాల్లో నోషితతో మాట్లాడిన అనంతరం ఆయన టాస్క్ఫోర్స్ కమిటీతో ఉక్రెయిన్లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ప్రత్యేక విమానాల్లో విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని, అధైర్య పడొద్దని అమలాపురం ఎంపీ అనురాధ తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం విలసవల్లికి చెందిన సలాది గంగా భవాని (భవ్య)కు శనివారం వీడియో కాల్చేసి మాట్లాడారు. భవ్యతో పాటు 20 మంది విద్యార్థులు బంకర్లో ఉన్నారు. -
రష్యన్ మీడియాకి షాక్ ! కఠిన నిర్ణయం తీసుకున్న సోషల్ మీడియా దిగ్గజం
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. మెటా పరిధిలోని ఫేస్బుక్లో రష్యన్ మీడియాకు సంబంధించిన అడ్వెర్టైజ్మెంట్లును నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఫేస్బుక్ వేదికగా రష్యన్ మీడియాకు ఆదాయం సంపాదించే మార్గాలన్నింటినీ మూసి వేస్తున్నట్టు కూడా తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. మెటా ఆధ్వర్యంలో ప్రస్తుతం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఫేస్బుక్ ప్లాట్ఫామ్పై నిషేధం అమల్లోకి రానుంది .మరి మిగిలిన ప్లాట్ఫామ్స్ విషయంలో మెటా నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. మెటా తీసుకున్న తాజా నిర్ణయంతో రష్యన్ మీడియా నుంచి వచ్చే సమాచారం ఇకపై ఫేస్బుక్లో కనిపించవు. అదే విధంగా చాలా వరకు రష్యన్ వీడియోలు, ఇతర సమాచారం కూడా ఫిల్టర్ అవనుంది. రష్యా కమ్యూనిస్టు దేశం కావడంతో అక్కడ మీడియా స్వేచ్ఛ పరిమితం. ప్రభుత్వం కనుసన్నల్లో రష్యన్ మీడియా వెల్లడించే సమాచారామే పెద్ద దిక్కు. తాజా పరిణామాల నేపథ్యంలో రష్యన్ మీడియాపై ఫేస్బుక్లో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దీంతో రష్యాకు సంబంధించిన సమాచారం మరింత తక్కువగా బయటి ప్రపంచానికి వెల్లడి కానుంది. ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ ఇటు అమెరికాతో పాటు అటూ యూరోపియన్ దేశాలు అనేక కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రకటించిన చర్యలన్నీ ప్రభుత్వ పరమైనవే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా వీటికి ప్రైవేటు కంపెనీలు కూడా జత కలుస్తున్నాయి. ముందుగా ఫేస్బుక్ తరఫున మెటా నుంచి ప్రకటన వెలువడింది. మరి ఈ దారిలో మరిన్ని ప్రైవేటు కంపెనీలు నడుస్తాయా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. చదవండి: మాట వినకపోతే కఠిన ఆంక్షలే -
రెచ్చిపోయిన రష్యా ఆర్మీ.. ‘మగధీర’ రేంజ్లో ఉక్రెయిన్ సైన్యం రెస్పాన్స్.. వీడియో వైరల్
కైవ్: ఉక్రెయిన్పై రష్యా సైనిక బలగాలు విరుచుకుపడుతున్నాయి. కనికరం అనేదే లేకుండా రష్యా బలగాలు దాడులు జరుపుతున్నాయి. సైనికులు, పౌరుల ఆర్తనాదాలతో ఉక్రెయిన్ తమ శక్తి మేరకు రష్యాతో పోరాడుతోంది. తమ ప్రాణాలను కూడా సైతం లెక్కచేయకుండా ఉక్రెయిన్ సైనికులు సాహసం ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లోని నల్ల సముద్రంలో ఉక్రెయిన్కు చెందిన స్నేక్ ద్వీపం ఉంది. ఈ ఉద్రికత్తల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం ద్వీపానికి రక్షణగా 13 మంది సైనికులను నియమించింది. వారు విధులు నిర్వహిస్తున్న క్రమంలో రష్యా మిలటరీ ఆ ద్వీపంపై ఫోకస్ పెంచింది. స్నేక్ ఐలాండ్ లక్ష్యంగా రష్యా సైనికులు ముందుకు సాగారు. The 13 heroes of #UKRAINE 🇺🇦 army soldiers who were stationed on snake island in the audio, one says ‘This is it ‘ they are heard telling #Russian warship to go ‘fuck yourself’ all died defending just 25 miles away from #NATO Territory #Ukrainian #UkraineInvasion #RussianArmy pic.twitter.com/fDdCVuc0Cz — Bahaka (@Petebahaka) February 25, 2022 ఈ క్రమంలో సముద్ర జలాల్లో గస్తీ నిర్వహిస్తున్న రష్యాకు చెందిన నేవీ వార్షిప్ ఆ ఐలాండ్ వద్దకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైనికులను గుర్తించిన రష్యా నేవీ.. వారిని లొంగిపోవాలని సూచించారు. లేకపోతే వారిని కాల్చివేస్తామని వార్నింగ్ అనౌన్స్ చేశారు. రష్యా నేవీ వార్నింగ్కు ఉక్రెయిన్ సైనికులు స్పందిస్తూ.. చావనైనా చస్తాం కానీ.. లొంగిపోయే ప్రసక్తే లేదంటూ(బూతు పదజాలంతో) వ్యాఖ్యలు చేశారు. వారి మాటలతో మరింత రెచ్చిపోయిన రష్యా నేవీ.. ఉక్రెయిన్ సైనికులపై వార్షిప్ నుంచి బాంబుల వర్షం కురిపించింది. దీంతో 13 మంది ఉక్రెయిన్ సైనికులు వీర మరణం పొందారు. Ukrainian soldier deployed on Snake Island live streamed the moment a Russian warship opened fire on the Island. 13 soldiers died in the attack. pic.twitter.com/FDe92rYYVR — C O U P S U R E (@COUPSURE) February 24, 2022