Shafali Verma
-
‘పునరాగమనం చేస్తా’
న్యూఢిల్లీ: దాదాపు ఐదేళ్ల పాటు భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్గా పలు విజయాల్లో భాగంగా ఉన్న షఫాలీ వర్మ(Shafali Verma) మూడు నెలల క్రితం టీమ్లో చోటు కోల్పోయింది. ముందుగా ఆస్ట్రేలియాతో, ఆపై స్వదేశంలో వెస్టిండీస్, ఐర్లాండ్లతో సిరీస్లకు కూడా ఆమెను ఎంపిక చేయలేదు. అయితే ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో చెలరేగిన షఫాలీ పరుగుల వరద పారించింది. సీనియర్ వన్డే చాలెంజర్ టోర్నీలో 5 మ్యాచ్లలోనే 82.80 సగటుతో 414 పరుగులు సాధించింది. ఇదే జోరులో తాను భారత జట్టులోకి పునరాగమనం చేస్తాని షఫాలీ విశ్వాసం వ్యక్తం చేసింది. ‘గత కొన్ని నెలలు నా జీవితంలో కఠినంగా గడిచాయి. నాన్నకు అనూహ్యంగా గుండెపోటు వచ్చిన రెండు రోజులకే టీమ్లో స్థానం కోల్పోయాను. మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డా. అయితే నా కుటుంబం నాకు అండగా నిలిచి ప్రోత్సహించింది. అందుకే మళ్లీ మైదానంలో పట్టుదలగా ఆడగలిగా. నాకు అవకాశం వచ్చిన ప్రతీసారి భారీగా పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టా. అందు కోసం పట్టుదలగా సిద్ధం కావడమే నేను చేయగలిగింది. ఇలాగే ప్రాక్టీస్ కొనసాగించి పరుగులు సాధిస్తే తిరిగి భారత జట్టులో రాగలను’ అని షఫాలీ వ్యాఖ్యానించింది. డబ్ల్యూపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షఫాలీ ప్రస్తుతం సన్నాహకాల్లో ఉంది. సీజన్ ఆరంభానికి ముందు క్యాపిటల్స్ నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంప్లో ఆమె పాల్గొంటోంది. డబ్ల్యూపీఎల్ మ్యాచ్ల ద్వారా ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో తాను నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది. ‘డబ్ల్యూపీఎల్లో ప్లేయర్లకు ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం లభిస్తుంది. ఆటలో స్వల్ప మార్పులు కూడా చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా చూస్తే ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో నేర్చుకోగలిగాను. అనుభవజు్ఞలైన విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం రావడం ఎంతో మేలు చేస్తుంది. మైదానంలో కీలక సమయాల్లో, మైదానం బయట కూడా ప్రశాంతంగా ఎలా ఉండవచ్చో వారిని చూస్తే తెలుస్తుంది. తాజా సీజన్ కోసం మా జట్టు సన్నాహాలు చాలా బాగా సాగుతున్నాయి’ అని షఫాలీ పేర్కొంది. డబ్ల్యూపీఎల్ రెండు సీజన్లలో కూడా ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ సాధించడంలో మాత్రం విఫలమైంది. -
షఫాలీ విధ్వంసకర శతకం వృథా.. బెంగాల్ ప్రపంచ రికార్డు
బీసీసీఐ దేశవాళీ సీనియర్ మహిళల వన్డే టోర్నీ(Senior Women’s One-Day)లో సోమవారం నాటి మ్యాచ్లో పరుగుల వరద పారింది. తద్వారా లక్ష్య ఛేదనలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. హరియాణా, బెంగాల్ జట్ల మధ్య జరిగిన పోరులో ఈ ఘనత చోటు చేసుకుంది.కాగా సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ 5 వికెట్లతో హరియాణాపై నెగ్గింది. ముందుగాబ్యాటింగ్ చేసిన హరియాణా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. షఫాలీ ఊచకోతహరియాణా బ్యాటర్లలో కెప్టెన్ షఫాలీ వర్మ (115 బంతుల్లో 197; 22 ఫోర్లు, 11 సిక్స్లు) విధ్వంసం సృష్టించింది. షఫాలీకి సోనియా (61; 5 ఫోర్లు, 3 సిక్స్లు), రీమా (58; 8 ఫోర్లు), త్రివేణి (46; 5 ఫోర్లు) అండగా నిలిచారు.తనుశ్రీ సర్కార్ ధనాధన్ సెంచరీఅనంతరం బెంగాల్ 49.1 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసి ఛేదనలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. బెంగాల్ ఓపెనర్లు ధారా గుజ్జార్, సస్తి మొండల్ కేవలం 9.1 ఓవర్లలోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గుజ్జార్ 49 బంతుల్లో 69, మొండల్ 29 బంతుల్లో 52 పరుగులు బాదారు. ఇక ఆల్రౌండర్ తనుశ్రీ సర్కార్(Tanusree Sarkar) ఆకాశమే హద్దుగా చెలరేగి.. 83 బంతుల్లోనే 113 రన్స్ రాబట్టింది. ప్రియాంక బాల 81 బంతుల్లో 88 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది.కాగా 2019లో కాంటర్బరీ టీమ్ 309 పరుగుల లక్ష్యాన్ని విధించగా ... నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ 312 పరుగులు చేసి గెలిచిన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. బెంగాల్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తనుశ్రీ సర్కార్ (83 బంతుల్లో 113; 20 ఫోర్లు) శతకం సాధించింది. చదవండి: BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్? -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్పై వేటు
ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. అదే విధంగా ఎప్పటిలాగే ఆమెకు డిప్యూటీగా స్మృతి మంధాన వ్యవహరించనుంది.అయితే ఈ జట్టులో భారత స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మకు చోటు దక్కలేదు. జట్టు ఎంపికకు షఫాలీని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఆమెను పక్కన పెట్టడానికి గల కారణాన్ని అయితే సెలక్టర్లు వెల్లడించలేదు. షెఫాలీ మాత్రం ప్రస్తుతం పెద్దగా ఫామ్లో లేదు.ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో షఫాలీ వర్మ కేవలం 56 పరుగులు మాత్రమే చేసింది. ఆమె వన్డేల్లో హాఫ్ సెంచరీ సాధించి ఏడాది దాటింది. మరోవైపు హర్లీన్ డియాల్, టిటాస్ సాధు తిరిగి జట్టులోకి వచ్చారు. హర్లీన్ చివరగా భారత్ తరపున 2023లో ఆడింది. అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉంటుంది. డిసెంబర్ 5న బ్రిస్బేన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.భారత మహిళల జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు , అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, సైమా ఠాకూర్ -
ధనాధన్ ఇన్నింగ్స్.. కెరీర్ బెస్ట్ స్కోర్! కానీ..
నేపాల్తో మ్యాచ్లో భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఆది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పరుగుల వరద పారించింది. ఈ క్రమంలో తన టీ20 కెరీర్లోనే అత్యుత్తమ స్కోరు సాధించింది.కానీ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. వుమెన్స్ ఆసియా కప్ టీ20- 2024లో భాగంగా భారత్- నేపాల్ మధ్య మంగళవారం మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంకలోని డంబుల్లా వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో ఓపెనర్ షెఫాలీ వర్మ టీమిండియాకు శుభారంభం అందించింది. కేవలం 48 బంతుల్లోనే 81 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరో ఓపెనర్ హేమలత(42 బంతుల్లో 47) కలిసి షెఫాలీ తొలి వికెట్కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.ఇక షెఫాలీ వర్మ అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఇదే అత్యధిక స్కోరు(81) కావడం విశేషం. అంతేకాదు వుమెన్స్ టీ20 ఆసియా కప్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో క్రికెటర్గా షెఫాలీ నిలిచింది. 2018 నాటి టోర్నీలో 69 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ జాబితాలో షెఫాలీ కంటే ముందు వరుసలో ఉంది.ఓవరాల్గా శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(119 నాటౌట్) స్థానాన్ని మిథాలీ రాజ్, షెఫాలీ వర్మ ఆక్రమించారు. ఇక భారత్ తరఫున టీ20లలో షెఫాలీ సాధించిన పదో అర్ధ శతకం ఇదే. అంతేకాదు టీమిండియా తరఫున అతిపిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్ కూడా షఫాలీ వర్మనే కావడం విశేషం. ఇరవై ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 79 అంతర్జాతీయ టీ20లు ఆడి 1906 పరుగులు చేసింది.ఇక నేపాల్తో మ్యాచ్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో సగం ఆట(10 ఓవర్లు) ముగిసేసరికి నేపాల్ మూడు వికెట్లు కోల్పోయి కేవలం 48 పరుగులు మాత్రమే చేసింది.ఇదిలా ఉంటే.. ఆసియా టీ20 కప్-2024లో భారత్ ఇప్పటికే సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. పాకిస్తాన్, యూఏఈలపై గెలుపొందిన హర్మన్ప్రీత్ కౌర్ సేన.. ఈ మ్యాచ్లోనూ గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది. -
T20I: టీమిండియా ఘన విజయం.. ఇలా ఇది మూడోసారి
India Women vs South Africa Women, 3rd T20I: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ను 1–1తో సమంగా ముగించింది. చెన్నై వేదికగా మంగళవారం జరిగిన చివరిదైన మూడో టీ20 మ్యాచ్లో.. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది.తొలి టీ20లో దక్షిణాఫ్రికా నెగ్గగా... రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఇక 2006 నుంచి ఇప్పటి వరకు 187 టీ20 మ్యాచ్లు ఆడిన భారత జట్టుకిది 100వ విజయం కావడం విశేషం. ప్రత్యర్థి జట్టుపై టీమిండియా 10 వికెట్లతో నెగ్గడం ఇది మూడోసారి.ఈ మ్యాచ్ కంటే ముందు భారత జట్టు 2016లో ఆస్ట్రేలియాపై, 2019లో వెస్టిండీస్పై 10 వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో టాస్ నెగ్గిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 17.1 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది.పూజ వస్త్రకర్కు 4 వికెట్లుభారత పేస్ బౌలర్ పూజా వస్త్రకర్ 13 పరుగులిచ్చి 4 వికెట్లు, స్పిన్నర్ రాధా యాదవ్ 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు. అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు.అనంతరం 85 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఆడుతూపాడుతూ ఛేదించింది. 10.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 88 పరుగులు చేసి టీమిండియా గెలిచింది. Series Levelled ✅#TeamIndia and @ProteasWomenCSA share the honours in the T20I series. 🤝 🏆#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/RS3yCOjH2Q— BCCI Women (@BCCIWomen) July 9, 2024 స్మృతి మంధాన (40 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా... షఫాలీ వర్మ (25 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) కూడా రాణించింది. పూజా వస్త్రకర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. A clinical 🔟-wicket win in the 3rd T20I 🥳The @IDFCFIRSTBank #INDvSA series is drawn 1⃣-1⃣Scorecard ▶️ https://t.co/NpEloo6GAm#TeamIndia pic.twitter.com/f1wcGPWWKo— BCCI Women (@BCCIWomen) July 9, 2024 -
టీ20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన ఏకైక టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా విధించిన 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు వికెట్ నష్టపోకుండా ఛేదించింది. షెఫాలీ వర్మ(24), సతీష్(13) పరుగులతో నాటౌట్గా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 603 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ(205) డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన(146), రిచా ఘోష్(86) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 266 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫాలోన్ గండం దాటలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా 8 వికెట్లతో దెబ్బతీసింది.ఈ క్రమంలో ఫాలో ఆన్ ఆడిన సఫారీలు సెకెండ్ ఇన్నింగ్స్లో 373 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో భారత్ ముందు దక్షిణాఫ్రికా కేవలం 37 పరుగులు మాత్రమే లక్ష్యంగా ఉంచింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఊదిపడిసేన భారత్.. ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక సెకెండ్ ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో సునే లూస్(109), వోల్వార్డ్ట్(109) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో దీప్తీ శర్మ, గైక్వాడ్, రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షఫాలీ వర్మ, హర్మాన్ ప్రీత్ కౌర్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్లో 10 వికెట్లతో సత్తాచాటిన స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
భారత మహిళా క్రికెటర్లా మజాకా!..జూలు విదిల్చిన శివంగులు (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ నమోదు
భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృస్టించింది. టెస్ట్ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. స్వదేశంలో సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఈ రికార్డును సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసింది. ఈ మ్యాచ్కు ముందు ఓ టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసింది. ఓవరాల్గా మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా 600 స్కోర్ దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో టీమిండియా మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది. టెస్టు క్రికెట్లో తొలి రోజుతో పాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ చేసిన 431 పరుగులు టెస్ట్ల్లో తొలి రోజుతో పాటు ఒకే రోజు చేసిన అత్యధిక స్కోర్గా ఉండింది.టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-5 టీమ్ స్కోర్లు..భారత్- 603/6ఆస్ట్రేలియా- 575/9ఆస్ట్రేలియా- 569/6ఆస్ట్రేలియా- 525న్యూజిలాండ్- 517/8కాగా, సౌతాఫ్రికాతో మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు శతకాల మోత మోగించి పరుగుల వరద పారించారు. ఓపెనర్ షపాలీ వర్మ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (194 బంతుల్లో 205) నమోదు చేయగా... మరో ఓపెనర్ స్మృతి మంధన (149) టెస్ట్ల్లో తన రెండో సెంచరీ సాధించింది. మంధన, షఫాలీతో పాటు జెమీమా రోడ్రిగెజ్ (55), హర్మన్ప్రీత్ (69), రిచా ఘోష్ అర్ద సెంచరీలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ను 603 పరుగుల వద్ద (6 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది.భారత ఇన్నింగ్స్లో మరిన్ని హైలైట్స్..2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్గా షఫాలీ నిలిచింది.292 తొలి వికెట్కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్లు విండీస్పై తొలి వికెట్కు 241 పరుగులు జతచేశారు. -
షఫాలీ విశ్వరూపం
భారత మహిళా క్రికెటర్లా... మజాకా! దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో చెన్నైలో ఆరంభమైన ఏకైక టెస్టును టీమిండియా రికార్డుల జడివానతో మొదలుపెట్టింది. ‘ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ’... తొలి వికెట్కు అత్యధిక భాగస్వామ్యం... ఒకేరోజు అత్యధిక జట్టు స్కోరు... ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు... ఇలా ఒకటేమిటి అన్ని కలగలిపి అతివల క్రికెట్లో అపూర్వ రికార్డుల జాతరను మన మహిళల జట్టు ఆవిష్కరించింది. ఈ మ్యాచ్ను చూసిన వారందరికి ఆడుతోంది అమ్మాయిలేనా? జరుగుతోంది టెస్టా లేదంటే వన్డేనా అన్న అనుమానం కలగకమానదు. అంతలా... ఆకాశమే హద్దన్నట్లుగా హర్మన్ప్రీత్ బృందం సఫారీపై సూపర్గా ఆడింది. చెన్నై: భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో విశ్వరూపమే చూపెట్టింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (197 బంతుల్లో 205; 23 ఫోర్లు, 8 సిక్స్లు) అంతర్జాతీయ మహిళల క్రికెట్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించింది. మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (161 బంతుల్లో 149; 27 ఫోర్లు, 1 సిక్స్) కూడా సఫారీ బౌలర్లను చితగ్గొట్టి మరీ శతకాన్ని పూర్తి చేసుకుంది. దీంతో శుక్రవారం మొదలైన ఈ ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి 98 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీస్కోరు కాదు... ఒక్క రోజే రికార్డు స్కోరు నమోదు చేసింది. పరుగు... ప్రవాహమైందిలా! టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్లు స్మృతి, షఫాలీ పరుగులు మొదలుపెట్టారు. ఇది పట్టాలెక్కగానే ప్రవాహం ఆ వెంటే రికార్డుల విధ్వంసం రోజంతా కొనసాగింది. 14వ ఓవర్లో భారత్ స్కోరు 50కి చేరింది. స్మృతి 78 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. దీంతోనే ఇది టెస్టు కాదని వన్డేనేమో అనే అనుమానం మొదలైంది.షఫాలీ 66 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించడం, జట్టు స్కోరు వన్డేలకు దీటుగా 24.4 ఓవర్లలోనే 100కు చేరడంతో ఇది ఏ మ్యాచ్ అబ్బా అని అభిమానులు క్రికెట్కు సంబంధించిన వెబ్సైట్లలో ఏ ఫార్మాట్ అనే ఎంక్వైరీ చేసుకునేలా చేసింది. లంచ్ విరామానికి 130/0 స్కోరు చేసింది. ఆ తర్వాత రెండో సెషన్లోనూ ఓపెనర్లు షఫాలీ, స్మృతిల బ్యాటింగ్ దూకుడుతో 39 ఓవర్లలోనే భారత్ 200 స్కోరును అవలీలగా దాటేసింది. ఈ క్రమంలో ముందుగా షఫాలీ 113 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకోగా, స్మృతి 122 బంతుల్లో శతకాన్ని సాధించింది. 194 బంతుల్లో ‘ద్విశతకం’ ఎట్టకేలకు 52వ ఓవర్లో స్మృతి అవుటైంది. 54వ ఓవర్లో జట్టు స్కోరు 300 పరుగులకు చేరుకుంది. అప్పుడు తెలిసొచ్చింది స్కోరైతే వన్డే తీరు... ఫార్మాట్ అయితే సంప్రదాయ పోరు అని! కాసేపటికే శుభా సతీశ్ (15) వెనుదిరిగింది. 334/2 స్కోరు వద్ద టీ బ్రేక్కు వెళ్లారు. తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (94 బంతుల్లో 55; 8 ఫోర్లు) అండతో షఫాలీ 194 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించింది. 73వ ఓవర్లోనే భారత్ 400 పరుగుల మైలురాయిని వేగంగా అందుకుంది. షఫాలీ రనౌట్ కాగా... క్రీజులో పాతుకుపోయినా జెమీమా కూడా (85 బంతుల్లో) ఫిఫ్టీ సా«ధించింది. 95వ ఓవర్లో భారత్ 500 అసాధారణ స్కోరును ఒక్కరోజులోనే సాధించింది. స్కోరు వివరాలు భారత మహిళల తొలి ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (రనౌట్) 205; స్మృతి (సి) డెర్క్సెన్ (బి) టకర్ 149; శుభ (సి) జాఫ్తా (బి) డి క్లెర్క్ 15; జెమీమా (సి) డి క్లెర్క్ (బి) టకర్ 55; హర్మన్ప్రీత్ (బ్యాటింగ్) 42; రిచా ఘోష్ (బ్యాటింగ్) 43; ఎక్స్ట్రాలు 16; మొత్తం (98 ఓవర్లలో 4 వికెట్లకు) 525. వికెట్ల పతనం: 1–292, 2–325, 3–411, 4–450. బౌలింగ్: క్లాస్ 14–2–63–0, డెర్క్సెన్ 11–0–60–0, నదినె 10–1–62–1, టుమి 10–0– 55–0, నొంకు లులెకొ లబ 24–1–113–0, డెల్మి టకర్ 26–1–141–2, సునె లుస్ 3–0–15–0.1 మహిళల క్రికెట్లో షఫాలీ 194 బంతుల్లో సాధించిన వేగవంతమైన డబుల్ సెంచరీ కొత్త రికార్డు. ఇదే ఏడాది దక్షిణాఫ్రికా జట్టుపైనే అనాబెల్ సదర్లాండ్ (ఆ్రస్టేలియా) 248 బంతుల్లో ద్విశతకం చేసింది. 2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్గా షఫాలీ నిలిచింది. 292 తొలి వికెట్కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్లు విండీస్పై తొలి వికెట్కు 241 పరుగులు జతచేశారు. 525 టెస్టు క్రికెట్లో మ్యాచ్ తొలిరోజుతోపాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ తొలిరోజు 431 పరుగులు చేసింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఒకే రోజు 525 పరుగులు!
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలి రోజు టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. మొదటి రోజు ఏకంగా టీమిండియా 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన సెంచరీతో మెరిసింది. 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్లతో 205 పరుగులు చేయగా.. మంధాన 161 బంతుల్లో 149 పరుగులు చేసింది.వీరితో పాటు జెమిమా రోడ్రిగ్స్(55) పరుగులతో రాణించింది. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ కౌర్(42), రిచా ఘోష్(43) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డెల్మీ టక్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. డీక్లార్క్ ఒక్క వికెట్ సాధించింది.చరిత్ర సృష్టించిన టీమిండియా..ఇక ఈ మ్యాచ్లో అద్బుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. పురుషుల, మహిళల టెస్టు క్రికెట్లో ఒక రోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది.అంతకుముందు 2002లో బంగ్లాదేశ్పై శ్రీలంక ఒకే రోజులో 9 వికెట్లు కోల్పోయి 509 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో లంకేయుల రికార్డును భారత మహిళలు బద్దలు కొట్టారు. ఇప్పటివరకు మహిళల టెస్టు క్రికెట్లో అయితే 431 పరుగులే అత్యధిక కావడం గమనార్హం. -
చరిత్ర సృష్టించిన "లేడీ సెహ్వాగ్".. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ! వీడియో
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత ఓపెనర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో షఫాలీ వర్మ విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగింది. టెస్టు క్రికెట్ అన్న విషయం మర్చిపోయిన షఫాలీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. సౌతాఫ్రికా బౌలర్లకు వర్మ చుక్కలు చూపించింది. షఫాలీ బౌండరీల వర్షం కురిపించింది. ఈ క్రమంలో కేవలం 194 బంతుల్లోనే తన తొలి డబుల్ సెంచరీ మార్క్ను షఫాలీ అందుకుంది. వరుసగా సిక్స్లు బాదుతూ షఫాలీ తన స్టైల్లో ద్విశతకం నమోదు చేసింది. ఓవరాల్గా 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్లతో 205 పరుగులు చేసి పెవిలియన్కు చేరింది. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో షఫాలీ వర్మ వెనుదిరిగింది. ఇక డబుల్ సెంచరీతో చెలరేగిన ఈ లేడీ సెహ్వాగ్.. పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.షఫాలీ సాధించిన రికార్డులు ఇవే..మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్గా షఫాలీ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆసీస్ ఆల్రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సదర్లాండ్ 256 బంతుల్లో ద్విశతకం నమోదు చేసింది. తాజా మ్యాచ్లో కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసిన వర్మ.. అన్నాబెల్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. అదేవిధంగా టెస్టు క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత మహిళా క్రికెటర్గా షఫాలీ నిలిచింది. షఫాలీ కంటే ముందు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ టెస్టుల్లో ద్విశతకం నమోదు చేసింది. THE MOMENT SHAFALI VERMA CREATED HISTORY. ⭐- She scored Fastest Double Hundred in Women's Test Cricket History. 🔥 pic.twitter.com/94zBj5zY01— Tanuj Singh (@ImTanujSingh) June 28, 2024 -
సౌతాఫ్రికాతో మ్యాచ్.. టీమిండియా ఓపెనర్ల సెంచరీలు
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికా వుమన్స్ టీమ్తో ఇవాళ (జూన్ 28) మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు స్మృతి మంధన (149), షఫాలీ వర్మ (165) సెంచరీల మోత మోగించారు. స్మృతి. షఫాలీ సెంచరీలతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 60 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. స్మృతి, శుభ సతీష్ (15) ఔట్ కాగా.. షఫాలీ, జెమీమా రోడ్రిగెజ్ (1) క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో డి క్లెర్క్, డెల్మి టక్కర్ తలో వికెట్ పడగొట్టారు.భీకర ఫామ్లో స్మృతి..సౌతాఫ్రికాతో సిరీస్లలో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అరివీర భయంకర ఫామ్లో ఉంది. వన్డే సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు, ఓ 90 ప్లస్ స్కోర్ చేసిన మంధన.. తాజాగా టెస్ట్ల్లో సెంచరీ చేసింది. మంధనకు టెస్ట్ల్లో ఇది రెండో సెంచరీ. స్మృతితో పాటు సెంచరీ చేసిన షఫాలీ వర్మకు టెస్ట్ల్లో ఇది తొలి సెంచరీ.మ్యాచ్ హైలైట్స్..టెస్ట్ల్లో స్మృతి మంధనకు రెండో సెంచరీ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా)టెస్ట్ల్లో షఫాలీ వర్మకు తొలి సెంచరీప్రస్తుత భారత మహిళల క్రికెటర్లలో స్మృతి మంధనవే అత్యధిక సెంచరీలు (2)మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (స్మృతి, షఫాలీ-292 పరుగులు)భారత మహిళల క్రికెట్ జట్టు తరఫున అత్యధిక భాగస్వామ్యం (స్మృతి, షఫాలీ-292 పరుగులు) -
మెరిసిన షఫాలీ: భారత్దే టి20 సిరీస్
సిల్హెట్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయంతో మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే టి20 సిరీస్ను 3–0తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టి20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. తొలుత బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఓపెనర్ దిలారా అక్తర్ (27 బంతుల్లో 39; 5 ఫోర్లు), కెప్టెన్ నిగర్ సుల్తానా (36 బంతుల్లో 28; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ (2/22), శ్రేయాంక (1/25), రేణుక (1/25), పూజ (1/26) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 18.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (38 బంతుల్లో 51; 8 ఫోర్లు), స్మృతి మంధాన (42 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 91 పరుగులు జోడించడంతో విజయం మరింత సులువైంది. ఈ నెల 6న నాలుగో టి20 కూడా ఇదే వేదికపై జరుగనుంది. -
స్మృతి మెరుపులు వృథా
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలని ఆశించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు నిరాశ ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు జట్టు 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ ప్లేయర్లు మరిజాన్ కాప్, జెస్ జొనాసెన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ లీగ్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచిన బెంగళూరుకు ఇదే మొదటి పరాజయం కావడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి ఓడిపోయింది. స్మృతి మంధాన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్ల భరతం పట్టిన స్మృతి 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 74 పరుగులు చేసింది. సోఫీ డివైన్ (17 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్లు)తో తొలి వికెట్కు 77 పరుగులు జోడించిన స్మృతి... రెండో వికెట్కు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) జత చేసింది. మరిజాన్ కాప్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి గురి తప్పిన స్మృతి క్లీన్ బౌల్డ్ అయింది. అప్పటికి బెంగళూరు స్కోరు 112. స్మృతి అవుటయ్యాక వచ్చిన బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు విజయతీరానికి చేరలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కాప్ (2/35), జెస్ జొనాసెన్ (3/21), అరుంధతి రెడ్డి (2/38) రాణించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు సాధించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (17 బంతుల్లో 11; 2 ఫోర్లు) విఫలమైనా... షఫాలీ వర్మ (31 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్లు), అలైస్ క్యాప్సీ (33 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. రెండో వికెట్కు 83 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక మరిజాన్ కాప్ (16 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్లు), జెస్ జొనాసెన్ (16 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించి ఢిల్లీకి భారీ స్కోరును అందించారు. నేడు జరిగే మ్యాచ్లో యూపీ వారియర్స్తో గుజరాత్ జెయింట్స్ తలపడుతుంది. -
చరిత్ర సృష్టించిన షఫాలీ వర్మ.. తొలి భారత క్రికెటర్గా
భారత మహిళల జట్టు యువ బ్యాటర్ షఫాలీ వర్మ అరుదైన ఘనత సాధించింది. ఏషియన్ గేమ్స్-2023లో భాగంగా క్వార్టర్ ఫైనల్-1లో మలేషియాపై షఫాలీ వర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించింది. తద్వారా ఏషియన్ గేమ్స్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన మొదటి భారత క్రికెటర్గా షఫాలీ చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక హాఫ్ సెంచరీని షఫాలీ కేవలం 31 బంతుల్లోనే సాధించింది. ఓవరాల్గా 39 బంతులు ఎదుర్కొన్న వర్మ.. 4 ఫోర్లు, 5 సిక్స్లతో 67 పరుగులు చేసింది. అయితే దురదృష్టవశాత్తూ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయింది. అయినప్పటికీ మలేషియా కంటే భారత్ ర్యాంక్ అత్యధికంగా ఉండడంతో.. ఉమెన్ ఇన్ బ్లూ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. వర్షం కారణంగా రద్దు అయిన ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన మలేషియా తొలుత భారత్ను బ్యాటింగ్ అహ్హనించింది. బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన, షాపాలీ వర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం మంధాన తొలి వికెట్గా వెనుదిరిగింది. భారత్ స్కోర్ 59/1 ఉండగా వర్షం మొదలైంది. ఆతర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించారు. అనంతరం బ్యాటింగ్ మొదలెట్టిన భారత్ నిర్ణీత 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి భారత్ 173 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ పాటు పాటు రోడ్రిగ్స్(47 నాటౌట్), రిచా ఘోష్(7 బంతుల్లో 21 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ దుమ్మురేపారు. ఆ తర్వాత మలేషియా ఇన్నింగ్స్ ఆరంభంలో మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. చదవండి: Gambhir-SRK Viral Photo: షారుఖ్ ఖాన్తో ఫొటో.. బాలీవుడ్ కింగ్ మాత్రమే కాదు..: గంభీర్ పోస్ట్ వైరల్ .@TheShafaliVerma was a class act with the bat in the 19th #AsianGames quarter-final 🏏💥 React to her 🔥innings in one emoji 💬#SonySportsNetwork #Hangzhou2022 #TeamIndia #Cheer4India #IssBaarSauPaar pic.twitter.com/v7TVVeKB9K — Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2023 -
బంగ్లాదేశ్తో తొలి టీ20.. ఆంధ్ర స్పిన్నర్ ఎంట్రీ!
నాలుగు నెలల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగబోతోంది. మూడు టి20లు, మూడు వన్డే మ్యాచ్ల పర్యటనలో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. బలాబలాలను బట్టి చూస్తే బంగ్లాపై భారత జట్టు అన్ని విధాలా మెరుగ్గా ఉంది. భారత్ కోణంలో చూస్తే పలువురు సీనియర్లు ఈ సిరీస్కు దూరమైన నేపథ్యంలో యువ క్రీడాకారిణులపై ఒక అంచనాకు వచ్చేందుకు ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. కొత్త వికెట్ కీపర్ ఉమా చెట్రి, రాశి కనోజియా, ఆంధ్ర స్పిన్నర్ బారెడ్డి అనూషలపై అందరి దృష్టి నిలిచింది. సీనియర్ స్పిన్నర్లు రాధ యాదవ్, రాజేశ్వర్ గైక్వాడ్ లేకపోవడంతో తన ప్రతిభను ప్రదర్శించేందుకు అనూషకు ఇది మంచి చాన్స్. ఆమె తొలి టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ప్రధాన పేసర్ రేణుకా సింగ్ ఈ సిరీస్లో ఆడటం లేదు. రెండేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి ఎంపికైన పేసర్ మోనికా పటేల్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంది. భారత మహిళల జట్టు కోచ్గా అమోల్ మజుందార్ ఎంపిక దాదాపు ఖాయమైనా...అధికారిక ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అతను కోచ్గా అందుబాటులో ఉండటం లేదు. దాంతో వరల్డ్ కప్ గెలిచిన భారత అండర్–19 జట్టు, ఇటీవల ఆసియా కప్ గెలిచిన అండర్–23 టీమ్లకు కోచ్గా వ్యవహరించిన నూషీన్ అల్ ఖదీర్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించనుంది. తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా): షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), హర్లీన్ డియోల్, యాస్తికా భాటియా (వికెట్కీపర్), దీప్తి శర్మ, దేవికా వైద్య, మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్, బారెడ్డి అనూష -
'ఇంటర్మీడియట్' పాసైన టీమిండియా స్టార్ ఓపెనర్
భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించింది. సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ను క్లియర్ చేసిన షఫాలీ వర్మ.. తన మార్క్ షీట్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. "ఈ ఏడాది మరోసారి 80 ప్లస్ స్కోర్ సాధించాను. కానీ ఈ సారి మ్యాచ్లో కాదు, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్లో. మంచి మార్కులతో పాసైనందుకు చాలా సంతోషంగా ఉంది" అని షఫాలీ తన పోస్ట్కు క్యాప్షన్గా ఇచ్చింది. కాగా కేవలం 15ఏళ్ల వయస్సులోనే షఫాలీ వర్మ భారత తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 2019లో దక్షిణాఫ్రికాపై ఆమె తన తొలి మ్యాచ్ ఆడింది. ఇప్పటివరకు టీమిండియా తరపున 79 మ్యాచ్లు ఆడిన 2106 పరుగులు చేసింది. అదే విధంగా తొట్టతొలి మహిళల అండర్-19 ప్రపంచకప్ను సొంతం చేసుకున్న మొదటి కెప్టెన్గా షఫాలీ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ను షఫాలీ నేతృత్వంలో భారత జట్టు కైవసం చేసుకుంది. మరోవైపు మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించిన షఫాలీ వర్మ.. తన జట్టు ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించింది. చదవండి: IPL 2023: నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆటగాడిగా View this post on Instagram A post shared by Shafali Verma (@shafalisverma17) -
WPL 2023: చెలరేగిన మరిజన్, షఫాలీ.. ఢిల్లీ చేతిలో గుజరాత్ చిత్తు
Gujarat Giants vs Delhi Capitals Women- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అసాధారణ విజయం సాధించింది. బౌలింగ్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజన్ కాప్ (5/15), బ్యాటింగ్లో షఫాలీ వర్మ (28 బంతుల్లో 76 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగారు. దీంతో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై జయభేరి మోగించింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్లో కిమ్ గార్త్ (37 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్గా నిలిచింది. హర్లీన్ డియోల్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు), జార్జియా వేర్హామ్ (25 బంతుల్లో 22; 2 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడారు. ఢిల్లీ మీడియం పేసర్ మరిజన్ (4–0–15–5) బెంబేలెత్తించింది. శిఖాపాండేకు 3 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్ ఆర్డర్లోని తొలి 4 వికెట్లను మరిజనే పడగొట్టింది. దీంతో 28 పరుగులకే గుజరాత్ 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా కేవలం 7.1 ఓవర్లలో 107 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షఫాలీ, కెప్టెన్ మెగ్ లానింగ్ (15 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) అజేయమైన ఓపెనింగ్ భాగస్వామ్యంతో జట్టుకు అలవోక విజయం అందించారు. గార్డ్నెర్ వేసిన 4వ ఓవర్లో షఫాలీ, లానింగ్ కలిసి 4, 4, 6, 1, 4, 4లతో 23 పరుగులు రాబట్టడం విశేషం. షఫాలీ 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. డబ్ల్యూపీఎల్లో నేడు ముంబై ్ఠ Vs యూపీ వారియర్స్ రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసమేల?!
International Women's Day- BCCI- IPL 2023:భారత క్రికెట్ నియంత్రణ మండలి గత ఆర్నెళ్ల కాలంలో రెండు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. లింగ వివక్షను రూపుమాపే క్రమంలో సరికొత్త అధ్యాయాలకు శ్రీకారం చుట్టింది. మహిళా క్రికెట్ను అభివృద్ధి చేసేందుకు గొప్ప ముందడుగు వేసింది. అందులో మొదటిది.. మ్యాచ్ ఫీజులు.. అవును.. పురుషుల క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు చెల్లించే ఫీజులు అసలు లెక్కలోకే రావు! దీంతో మిగతా రంగాల మాదిరే క్రికెట్లోనూ అమ్మాయిల పట్ల ఉన్న వివక్షను తొలగించాలని.. మ్యాచ్ ఫీజుల విషయంలో ఉన్న అంతరాన్ని తొలగించాలంటూ డిమాండ్లు వినిపించాయి. ఇందుకు అనుగుణంగా గతేడాది అక్టోబరులో బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది. ఇక నుంచి భారత మహిళల జట్టు కాంట్రాక్ట్ క్రికెటర్లకు కూడా పురుషుల జట్టుతో సమానంగా మ్యాచ్ ఫీజు చెల్లిస్తామని అక్టోబరు 27న బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు టెస్టు మ్యాచ్కు రూ. 15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు, టి20 మ్యాచ్కు రూ. 3 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు బోర్డు తెలిపింది. మహిళా క్రికెట్ను మరోస్థాయికి తీసుకువెళ్లేలా.. క్రికెటర్లుగా ఎదగాలని కోరుకునే అమ్మాయిల ఆశలకు ఊపిరిలూదుతూ బీసీసీఐ తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చిన రోజును ‘రెడ్ లెటర్ డే’గా అభివర్ణిస్తూ హర్షం వ్యక్తమైంది. సచిన్ టెండుల్కర్, మిథాలీ రాజ్ వంటి దిగ్గజాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ విషయంలోనూ తొలుత న్యూజిలాండే! మహిళా క్రికెట్లో తొలి టీ20 లీగ్ను ప్రవేశపెట్టింది న్యూజిలాండ్. వుమెన్స్ సూపర్ స్మాష్ పేరిట 2007 నుంచి నేటికీ లీగ్ను కొనసాగిస్తోంది. తర్వాత వెస్టిండీస్ ట్వంటీ20 బ్లేజ్ పేరుతో 2012 నుంచి లీగ్ను నిర్వహిస్తోంది. ఇక ఆస్ట్రేలియా.. విజయవంతమైన బిగ్బాష్ లీగ్(పురుషులు)లో మహిళా క్రికెటర్లను భాగం చేసేందుకు 2015లో వుమెన్స్ బిగ్బాష్ లీగ్ను ప్రవేశపెట్టింది. నాటి నుంచి నేటిదాకా ఈ టోర్నీ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లండ్లో చార్లెట్ ఎడ్వర్డ్స్ కప్(2021 నుంచి), భారత్లో వుమెన్స్ టీ20 చాలెంజ్(2018-2022), వెస్టిండీస్లో ట్వంటీ20 బ్లేజ్(2012-), వుమెన్స్ కరేబియన్ లీగ్(2022-), జింబాబ్వేలో వుమెన్స్ టీ20(2020), పాకిస్తాన్లో పీసీబీ ట్రయాంగులర్ ట్వంటీ20(2020), సౌతాఫ్రికాలో వుమెన్స్ టీ20 సూపర్లీగ్(2019-), శ్రీలంకలో వుమెన్స్ సూపర్ ప్రొవెన్షియల్ టీ20 టోర్నమెంట్(2019-).. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మహిళా టీ20 లీగ్లు ఉన్నాయి. అయితే, ఇప్పటికే భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగెస్, పూజా వస్త్రాకర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ తదితరులు పేరెన్నికగన్న బిగ్బాష్ లీగ్లో ఆడారు. ఐపీఎల్తో పాటు డబ్ల్యూపీఎల్ అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుష టీ20లీగ్లను తలదన్నేలా క్యాష్ రిచ్ లీగ్ను రూపొందించిన.. బీసీసీఐ కాస్త ఆలస్యంగానైనా వుమెన్ ప్రీమియర్ లీగ్ను ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా (దేశీ, విదేశీ) ఎంతో మంది పురుష క్రికెటర్లకు లైఫ్నిచ్చిన ఐపీఎల్తో పాటు డబ్ల్యూపీఎల్ను నిర్వహించేందుకు సమాయత్తమైంది. మార్చి 4, 2023న ముంబై ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ మ్యాచ్తో ఈ మహిళా ప్రీమియర్ లీగ్కు తెరలేచింది. ఇద్దరు భారత కెప్టెన్లు(హర్మన్ప్రీత్ కౌర్(ముంబై), స్మృతి మంధాన), ముగ్గురు విదేశీ కెప్టెన్లు(మెగ్ లానింగ్, బెత్మూనీ, అలిసా హేలీ) ఈ లీగ్లో ఆయా జట్లను ముందుకు నడిపిస్తున్నారు. హర్షణీయమే కానీ.. కోట్లలో తేడా అంటే దారుణం! తొలుత మ్యాచ్ ఫీజుల విషయం.. ఇప్పుడు ఇలా టీ20 లీగ్.. మరి నిజంగానే భారత్లో పురుష, మహిళా క్రికెటర్ల మధ్య అంతరాలు పూర్తిగా తొలగిపోయినట్లేనా? అంటే కాదనే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఫీజుల విషయంలో సమానత్వాన్ని అమలు చేసేందుకు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం హర్షణీయమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నిజానికి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్న రెండో బోర్డుగా బీసీసీఐ ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో కూడా వ్యత్యాసం కొనసాగుతున్న వేళ ఇలాంటి నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, కాంట్రాక్టుల విషయంలో ఇంకా ఆ వ్యత్యాసం అలాగే ఉండిపోవడం, ఈ అంశంపై బీసీసీఐ స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. చరిత్ర సృష్టించిన షఫాలీ సేన 2017 వన్డే వరల్డ్కప్లో ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు.. ఇటీవలి ప్రపంచకప్లో సెమీస్ వరకు చేరింది. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన అండర్-19 మహిళా టీ20 ప్రపంచకప్-2023 టోర్నీలో ఏకంగా చాంపియన్గా నిలిచి చరిత్రకెక్కింది. యువ కెరటం షఫాలీ వర్మ సారథ్యంలో ఈ అద్భుతం జరిగింది. వాళ్లకు కోట్లు.. వీళ్లకు లక్షలు అయితే, బోర్డు ఇంతవరకు కాంట్రాక్ట్ మొత్తం విషయంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. పురుష క్రికెటర్లకు ఎ, బి, సి గ్రేడ్లలో వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. 1 కోటితో పాటు ‘ఎ’ ప్లస్ కేటగిరీలో రూ. 7 కోట్లు చెల్లించే బీసీసీఐ.. మహిళా క్రికెటర్లలో ‘ఎ’ గ్రేడ్కు రూ. 50 లక్షలు, ‘బి’, ‘సి’ గ్రేడ్లకు రూ. 30 లక్షలు, రూ. 10 లక్షలు మాత్రమే ఇస్తోంది. పురుషుల క్రికెట్కు ఉన్న ఆదరణ, స్పాన్సర్లు, ప్రేక్షకులు, రేటింగ్లు, బ్రాండ్ వాల్యూ దృష్ట్యా వారికి అంతమొత్తం చెల్లిస్తున్నారన్న మాట కాదనలేని వాస్తవమే. ఆరు రెట్లు అధికం అయితే, ఇరువురి కాంట్రాక్టుల విషయంలో కోట్లల్లో వ్యత్యాసం ఉండటం మరీ దారుణం. ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐపై.. పురుషుల క్రికెట్ స్థాయికి చేరేలా మహిళా క్రికెట్ను మరింత ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. ఇక డబ్ల్యూపీఎల్ విషయానికొస్తే.. ఐదు జట్లలో అత్యధికంగా ముగ్గురు విదేశీ కెప్టెన్లే! వేలంలో అత్యధిక 3.40 కోట్ల రూపాయలు. ఐపీఎల్ వేలంలో 18 కోట్ల పైచిలుకు ధర పలికే ఆటగాళ్ల కంటే దాదాపు ఆరు రెట్లు తక్కువ. ఒకవేళ లీగ్ భారీగా సక్సెస్ అయితే.. ఈ ధరలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ.. కాంట్రాక్ట్ విషయంలో మాత్రం బోర్డు తలచుకుంటేనే మహిళా క్రికెటర్ల భవితవ్యం మారుతుంది. ఆట మీద ప్రేమతో క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్న వాళ్లు ఆర్థికంగా మరింత నిలదొక్కుకునే ఆస్కారం ఉంటుంది. కూతుళ్లను క్రికెటర్లు చేయాలనుకునే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు సైతం కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. ‘‘యా దేవి సర్వభూతేశు, శక్తి రూపేన సమస్థితా’’ అంటూ మహిళా శక్తిని చాటేలా గీతం రూపొందించిన బీసీసీఐ.. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఓ మ్యాచ్ను మైదానంలో ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించిన బోర్డు.. వచ్చే ఏడాది తిరిగేలోపు కాంట్రాక్టుల విషయంలో మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షిద్దాం!! -సాక్షి, వెబ్డెస్క్ చదవండి: IPL 2023: కోహ్లికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్ను తెచ్చుకోనున్న ముంబై ఇండియన్స్ WPL 2023: రెండు ముంబై ఇండియన్స్ జట్లు.. రెండు వేర్వేరు ఆరంభాలు View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
షఫాలీ, లానింగ్ ధనాధన్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో పరుగుల హోరెత్తుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ 200 పైచిలుకు పరుగులు నమోదయ్యాయి. ఢిలీక్యాపిటల్స్ ఓపెనర్లు షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ మెగ్ లానింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు) చెలరేగారు. బౌలింగ్లో తారా నోరిస్ (5/29) నిప్పులు చెరగడంతో ఢిల్లీ 60 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై జయభేరి మోగించింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 223 పరుగుల భారీస్కోరు చేసింది. మహిళల టి20 క్రికెట్లో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్లు లానింగ్, షఫాలీ తొలి వికెట్కు 162 పరుగులు జోడించారు. షఫాలీ 31 బంతుల్లో (5 ఫోర్లు, 3 సిక్స్లు)... లానింగ్ 30 బంతుల్లో (10 ఫోర్లు) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆఖర్లో మరిజన్ కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులే చేయగలిగింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (23 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎలీస్ పెర్రీ (19 బంతుల్లో 31; 5 ఫోర్లు), హీథెర్నైట్ (21 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుగ్గా ఆడారు. తారా నోరిస్ 5, అలైస్ క్యాప్సీ 2 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) హీథెర్నైట్ 72; షఫాలీ (సి) రిచా (బి) హీథెర్నైట్ 84; మరిజన్ కాప్ (నాటౌట్) 39; జెమీమా (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–162, 2–163. బౌలింగ్: రేణుక సింగ్ 3–0–24–0, మేగన్ 4–0–45–0, ప్రీతి 4–0– 35–0, పెర్రీ 3–0–29–0, సోఫీ డివైన్ 1–0–20–0, శోభన 2–0–29–0, హీథెర్నైట్ 3–0–40–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) శిఖా (బి) క్యాప్సీ 35; సోఫీ డివైన్ (సి) షఫాలీ (బి) క్యాప్సీ 14; పెర్రీ (బి) నోరిస్ 31; దిశ (సి) క్యాప్సీ (బి) నోరిస్ 9; రిచా (సి) రాధ (బి) నోరిస్ 2; హీథెర్నైట్ (సి) లానింగ్ (బి) నోరిస్ 34; కనిక (సి) షఫాలీ (బి) నోరిస్ 0; శోభన (సి) రాధ (బి) శిఖా 2; మేగన్ (నాటౌట్) 30; ప్రీతి బోస్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–41, 2–56, 3–89, 4–90, 5–93, 6–93, 7–96, 8–150. బౌలింగ్: శిఖా పాండే 4–0–35–1, మరిజన్ కాప్ 4–0–36–0, జొనసెన్ 4–0–28–0, అలైస్ క్యాప్సీ 2–0–10–2, రాధ యాదవ్ 2–0–24–0, తారా నోరిస్ 4–0–29–5. -
ముంబై ఇండియన్స్ రికార్డు బద్దలు కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్
మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్ విధ్వంసానికి, పరుగుల ప్రవాహానికి వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్లో ఓపెనర్లు షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మెగ్ లాన్నింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు) మెరుపు హాఫ్సెంచరీలతో విరుచుకుపడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. షఫాలీ, లాన్నింగ్లను హీథర్ నైట్ ఒకే ఓవర్లో పెవిలియన్కు పంపడంతో స్కోర్ కాస్త మందగించింది. ఒకవేళ వీరిద్దరూ చివరి వరకు క్రీజ్లో ఉండి ఉంటే సీన్ వేరేలా ఉండేది. ఆఖర్లో మారిజాన్ కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెస్ (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) కూడా చెలరేగి ఆడారు. డీసీ ఇన్నింగ్స్లో తొలి ఓవర్ మినహాయించి ప్రతి ఓవర్లో కనీసం ఓ బౌండరీ నమోదైందంటే డీసీ బ్యాటర్ల విధ్వంసం ఏ రేంజ్ సాగిందో ఇట్టే అర్ధమవుతుంది. ఈ మ్యాచ్లో డీసీ 223 పరుగులు చేయడంతో గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నెలకొల్పిన 207 పరుగుల టీమ్ టోటల్ రికార్డు బద్దలైంది. ముంబై సాధించిన స్కోర్ కంటే డీసీ జట్టు 16 పరుగులు అధికంగా సాధించింది. డీసీ ఓపెనర్లు, ముఖ్యంగా షఫాలీ వర్మ వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీలకు తరలించి, ఐపీఎల్కు డబ్ల్యూపీఎల్ ఏమాత్రం తీసిపోదని చెప్పకనే చెప్పింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ సైతం డీసీ తరహాలోనే రెచ్చిపోవడంతో మ్యాచ్లో విధ్వంసకర వాతావరణం కొనసాగింది. 4 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. కాగా, డబ్ల్యూపీఎల్-2023 తొలి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. -
లేడీ సెహ్వాగ్ విధ్వంసం.. 10 ఫోర్లు, 4 సిక్స్లతో! వీడియో వైరల్
మహిళల ప్రీమియర్ లీగ్-2023 రెండో మ్యాచ్లో భారీ స్కోర్ నమోదైంది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 పరుగులు సాధించింది. తద్వారా తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేసిన 210 పరుగుల అత్యధిక స్కోర్ రికార్డును ఢిల్లీ బ్రేక్ చేసింది. విధ్వంసం సృష్టించిన షఫాలీ వర్మ, లానింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకు ఓపెనర్లు షఫాలీ వర్మ, లానింగ్ అదిరిపోయే శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 162 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వీరిద్దరూ ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా షఫాలీ వర్మ అయితే బౌలర్లను ఊచ కోత కోసింది. బౌండరీలతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ మ్యాచ్లో 45 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 10 ఫోర్లు, 4 సిక్స్లతో 84 పరుగులు చేసింది. ఇక లానింగ్ కూడా 43 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసింది. అదే విధంగా ఆఖరిలో మారిజానే కాప్ కూడా బ్యాట్ ఝులిపించింది. కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్లతో 39 పరుగులు సాధించింది. చదవండి: డివిలియర్స్ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడాడు.. అతడి కంటే రైనా చాలా బెటర్! 6️⃣4️⃣6️⃣ @TheShafaliVerma is dealing in boundaries here in Mumbai 😎🎆 Follow the match ▶️ https://t.co/593BI7xKRy#TATAWPL | #RCBvDC pic.twitter.com/vXl5rOEgSh — Women's Premier League (WPL) (@wplt20) March 5, 2023 Shafali Verma scores a delightful maiden 5️⃣0️⃣ for the @DelhiCapitals 🤩#TATAWPL #CheerTheW #RCBvDC pic.twitter.com/ZedyhvWZDI — JioCinema (@JioCinema) March 5, 2023 -
ఆసీస్ బ్యాటర్పై కోపంతో ఊగిపోయిన షఫాలీ.. గట్టిగా అరుస్తూ! వీడియోవైరల్
మహిళల టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా రైజింగ్ స్టార్ షఫాలీ వర్మ తన సహానాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియా ఓపెనర్ బ్యాటర్ బెత్ మూనీపై కోపంతో షఫాలీ ఊగిపోయింది. ఏం జరిగిందంటే? ఆసీస్ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన రాధా యాదవ్ బౌలింగ్లో.. 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బెత్ మూనీ ఇచ్చిన ఈజీ క్యాచ్ను షఫాలీ వర్మ జారవిడిచింది. అనంతరం 12 ఓవర్లో శిఖాపాండే బౌలింగ్లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా మూనీ షాట్ ఆడింది. ఈ క్రమంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న షఫాలీ ఎటువంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకుంది. ఈ క్రమంలో షాఫాలీ గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంది. మూనీ వైపు వేలు చూపిస్తూ వెళ్లిపో అంటూ గట్టిగా అరిచింది. ఇందుకు సంబంధించిన వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాచ్లో షఫాలీ కేవలం 9 పరుగులు మాత్రమే చేసింది. చదవండి: PSL 2023: పొలార్డ్ స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే? వీడియో వైరల్ Aggression of Shafali Verma. #INDWvsAUSW #ShafaliVerma pic.twitter.com/msTWcMrAx5 — Naveen Sharma (@iamnaveenn100) February 23, 2023 -
వారిపై ఢిల్లీ క్యాపిటల్స్కు అమితమైన ఆసక్తి.. కోహ్లి విషయంలో మాత్రం ఎందుకో అలా..
WPL Auction 2023: నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన తొలి మహిళల ఐపీఎల్ వేలంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్, అండర్-19 వరల్డ్ కప్ 2023 విన్నింగ్ కెప్టెన్, లేడీ సెహ్వాగ్గా పేరొందిన షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. షెఫాలీ కోసం ఆర్సీబీ సైతం తీవ్రంగా పోటీపడినప్పటికీ పట్టు వదలని ఢిల్లీ ఎట్టకేలకు భారత సివంగిని దక్కించుకుంది. షెఫాలీని ఢిల్లీ దక్కించుకున్న తర్వాత సోషల్మీడియాలో ఓ ఆసక్తికర విషయం విపరీతంగా ట్రోల్ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ గతంలోకి ఓసారి తొంగి చూస్తే.. ఈ ఫ్రాంచైజీ అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ల అడ్డాగా పేరొందింది. అండర్-19 వరల్డ్కప్లో భారత్ను జగజ్జేతగా నిలిపిన ఉన్ముక్త్ చంద్ 2011-13 మధ్యలో నాటి ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిధ్యం వహించగా.. 2018 అండర్-19 వరల్డ్కప్లో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన పృథ్వీ షా.. గత నాలుగు సీజన్లు ఢిల్లీ ఫ్రాంచైజీకే ఆడుతున్నాడు. వీరి తర్వాత భారత్ను అండర్-19 వరల్డ్కప్-2022 విజేతగా నిలిపిన యశ్ ధుల్ను 2022 ఐపీఎల్ సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. తాజాగా తొలి మహిళల అండర్-19 టీ20 వరల్డ్కప్ నెగ్గిన భారత యువ జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. భారత అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్లపై అమితాసక్తి కనబరుస్తూ వస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ, 2008 అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్, నేటి భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని మాత్రం ఎందుకో ఆర్సీబీకి వదిలేసింది. పై పేర్కొన్న ఆటగాళ్లలో కొందరు ఢిల్లీకి చెందిన వారు కానప్పటికీ కొనుగోలు చేసిన డీసీ ఫ్రాంచైజీ.. కోహ్లి ఢిల్లీ వాస్తవ్యుడైనప్పటికీ అతన్ని మిస్ చేసుకుంది. -
WPL 2023: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం..
WPL 2023 Auction Details In Telugu: అద్భుతమైన ఆట... నాయకత్వ ప్రతిభ... మార్కెటింగ్కు అవకాశం ఉన్న ప్రచారకర్త... ఒక మహిళా క్రికెటర్లో ఈ మూడు లక్షణాలు ఉంటే ఆమె కోసం జట్లు పోటీ పడటం సహజమే... ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. తొలి మహిళా ప్రీమియర్ లీగ్ వేలంలో అందరికంటే ఎక్కువ విలువతో భారత స్టార్ ప్లేయర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన శిఖరాన నిలిచింది. వేలంలో అందరికంటే ముందుగా ఆమె పేరు రాగా... ముంబై, బెంగళూరు స్మృతిని దక్కించుకునేందుకు హోరాహోరీగా పోటీ పడ్డాయి. చివరకు రూ. 3 కోట్ల 40 లక్షలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ స్టార్లు యాష్లే గార్డ్నర్, నటాలీ సివర్ రూ. 3 కోట్ల 20 లక్షలతో రెండో స్థానంలో నిలిచారు. ఆశ్చర్యకరంగా భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు మాత్రం ఆశించిన విలువ దక్కలేదు. నాలుగు టీమ్లు హర్మన్ కోసం ప్రయత్నించినా...చివరకు రూ. 1 కోటి 80 లక్షల వద్దే హర్మన్ వేలం ముగిసింది. మొత్తంగా చూస్తే పురుషుల ఐపీఎల్ తరహాలో కొన్ని సంచలనాలు, కొంత ఆశ్చర్యం, మరికొంత అనూహ్యం కలగలిపి తొలి మహిళల లీగ్ వేలం సాగింది. అయితే డబ్బుల విలువ, అంకెలను పక్కన పెట్టి చూస్తే భారత మహిళల క్రికెట్లో కొత్త లీగ్, అందు కోసం సాగిన వేలం కొత్త ప్రస్థానానికి పునాది వేసింది. ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మొదటిసారి నిర్వహించబోతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మొదటి అంకమైన ప్లేయర్ల వేలం ఘనంగా ముగిసింది. మొత్తం 448 మంది వేలంలోకి రాగా... ఐదు జట్లలోకి కలిపి మొత్తం 87 మంది ఎంపికయ్యారు. నిబంధనల ప్రకారం గరిష్టంగా టీమ్కు 18 మంది చొప్పున మొత్తం 90 మందికి అవకాశం ఉన్నా.... యూపీ 16 మందికి, ముంబై 17 మందికే పరిమితమయ్యాయి. మిగిలిన మూడు జట్లు బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్ 18 మంది చొప్పున తీసుకున్నాయి. టాప్–10 జాబితాలో వేలంలో ఎక్కువ మొత్తం పలికిన టాప్–10 జాబితాలో భారత్ నుంచి స్మృతి మంధానతో పాటు దీప్తి శర్మ (రూ.2 కోట్ల 60 లక్షలు), జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2 కోట్ల 20 లక్షలు), షఫాలీ వర్మ (రూ. 2 కోట్లు), పూజ వస్త్రకర్ (రూ.1 కోటి 90 లక్షలు), రిచా ఘోష్ (రూ. 1 కోటి 90 లక్షలు), హర్మన్ప్రీత్ కౌర్ (రూ. 1 కోటి 80 లక్షలు) ఉన్నారు. త్రిషకు మొండిచేయి సీనియర్ జట్టుకు ఆడిన షఫాలీ, రిచా కాకుండా ఇటీవల అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు నుంచి ఆరుగురు అమ్మాయిలకు లీగ్లో అవకాశం దక్కింది. అయితే అండర్–19 ప్రపంచకప్లో రాణించిన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషను వేలంలో ఎవరూ తీసుకోలేదు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలోని రెండు వేదికల్లో డబ్ల్యూపీఎల్ నిర్వహిస్తారు. ఈ టోర్నీలో మొత్తం 22 మ్యాచ్లు జరుగుతాయి. మహిళల ప్రీమియర్ లీగ్ కావడంతో వేలం కార్యక్రమాన్ని కూడా మహిళనే నిర్వహించడం విశేషం. 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం కార్యక్రమం చేసిన మల్లిక సాగర్ డబ్ల్యూపీఎల్ వేలంను నిర్వహించింది. వేలం విశేషాలు... అందుకే స్మృతి కోసం పోటీ భారత జట్టు ఓపెనర్ స్మృతి మంధానకు భారీ విలువ పలకవచ్చనే అంచనా తప్పలేదు. ఇప్పటికే మహిళల బిగ్బాష్ లీగ్, ‘హండ్రెడ్’ లీగ్లలో ఆడి ఆమె సత్తా చాటింది. దాంతో సహజంగానే ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. భారీ షాట్లు ఆడగల రిచా ఘోష్పై కూడా జట్లు నమ్మకం ఉంచాయి. టీమిండియా టాప్ ప్లేయర్లలో దీప్తి శర్మ తన సొంత రాష్ట్రం జట్టు యూపీ తరఫున ఆడనుంది. ప్రస్తుతం టి20 క్రికెట్లో వరల్డ్ నంబర్వన్ ఆల్రౌండర్ అయిన యాష్లే గార్డ్నర్పై కూడా టీమ్లు ఆసక్తి చూపించాయి. వారికి కూడా తక్కువేం కాదు ఆసీస్ ఇతర అగ్రశ్రేణి ప్లేయర్లు అలీసా హీలీ, మెగ్ లానింగ్లకు కూడా మంచి విలువ దక్కింది. గుర్తింపు ఉన్నా ఇక.. మహిళల టి20 క్రికెట్లో ఎంతో గుర్తింపు తెచ్చుకొని లీగ్ వేలంలో అమ్ముడు పోకుండా మిగిలిన అగ్రశ్రేణి ప్లేయర్లలో డానీ వ్యాట్, కేథరీన్ బ్రంట్, అమీ జోన్స్, అలానా కింగ్, సుజీ బేట్స్, చమరి అటపట్టు తదితరులు ఉన్నారు. హర్మన్ విషయంలో మాత్రం ►భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కోసం గుజరాత్ మినహా మిగతా నాలుగు జట్లూ పోటీ పడ్డాయి. అయితే చివరకు ఊహించిన మొత్తం మాత్రం ఆమెకు దక్కలేదు. ►అసోసియేట్ దేశాల నుంచి ఒకే ఒక ప్లేయర్ తారా నోరిస్ (అమెరికా) ఎంపికైంది. లెఫ్ట్ఆర్మ్ పేసర్ అయిన తారా స్వస్థలం ఫిలడెల్ఫియా. ►యూఏఈకి చెందిన మనిక గౌర్ కోసం గుజరాత్ ఆసక్తి చూపించింది. అయితే వారి కోటా పూర్తి అయిందని తేలడంతో ఆ జట్టు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ►16 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ పేస్ బౌలర్ షబ్నమ్ షకీల్ ఈ వేలంలో ఎంపికైన అతి పిన్న వయస్కురాలు. స్మృతి తర్వాత వేలంలో టాప్–10 ►యాష్లే గార్డ్నర్ -రూ. 3 కోట్ల 20 లక్షలు ►నటాలీ సివర్ -రూ. 3 కోట్ల 20 లక్షలు ►దీప్తి శర్మ -రూ. 2 కోట్ల 60 లక్షలు ►జెమీమా రోడ్రిగ్స్ - రూ. 2 కోట్ల 20 లక్షలు ►బెత్ మూనీ -రూ. 2 కోట్లు ►షఫాలీ వర్మ -రూ. 2 కోట్లు ►పూజ వస్త్రకర్ -రూ. 1 కోటి 90 లక్షలు ►రిచా ఘోష్ -రూ. 1 కోటి 90 లక్షలు ►సోఫీ ఎకిల్స్టోన్- రూ. 1 కోటి 80 లక్షలు ►హర్మన్ప్రీత్ - రూ. 1 కోటి 80 లక్షలు – సాక్షి క్రీడా విభాగం చదవండి: Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి.. Womens T20 WC 2023: ఇండియా-పాకిస్తాన్ వరల్డ్కప్ మ్యాచ్లో ఘోర తప్పిదం -
WPL Auction: లేడీ సెహ్వాగ్కు భారీ ధర.. ఎన్ని కోట్లంటే?
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో టీమిండియా యువ సంచలనం షఫాలీ వర్మకు జాక్పాట్ తగిలింది. ఈ వేలంలో లేడీ సెహ్వాగ్గా పేరొందిన షఫాలీ వర్మను కొనుగోలు చేయడానికి ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ హోరాహోరీన పోటీపడ్డాయి. ఆఖరికి రూ.2 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ షఫాలీని సొంతం చేసుకుంది. షఫాలీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది. మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భాగంగా పాకిస్తాన్తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో ఆమె కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఈ మ్యాచ్లో 33 పరుగులు చేసిన షఫాలీ.. భారత విజయంలో తన వంతు పాత్ర పోషించింది. అదే విధంగా ఈ ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొట్ట తొలి అండర్-19 ప్రపంచకప్ను కూడా షఫాలీ సారథ్యంలోనే భారత్ కైవసం చేసుకుంది. ఈ టోర్నీ ఆసాంతం షఫాలీ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరించింది. ఇక ఇప్పటివరకు తన కెరీర్లో 52 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన షెఫాలీ వర్మ.. 1264 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్లలో 5 అర్దసెంచరీలు ఉన్నాయి. అదే విధంగా టీ20 క్రికెట్లో 1000 పరుగులు చేసిన అతి పిన్న వయస్కరాలుగా షెఫాలీ చరిత్ర సృష్టించింది. రోడ్రిగ్స్కు భారీ ధర.. ఇక ఈ వేలంలో షెఫాలీ వర్మతో పాటు భారత స్టార్ క్రికెటర్ జెమ్మిమా రోడ్రిగ్స్ను రూ. 2.2 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అదే విధంగా ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ను కూడా రూ1.1కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకుంది. చదవండి: WPL Auction: పాకిస్తాన్పై దుమ్మురేపింది.. వేలంలో ఊహించని ధర! ఎంతంటే? -
అండర్–19 ప్రపంచకప్ విజేతకు ఘనంగా సన్మానం
ఐసీసీ తొలిసారి నిర్వహించిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించిన మన అమ్మాయిలను బీసీసీఐ గౌరవించుకుంది. బుధవారం టీమిండియా, న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టి20 అందుకు వేదికైంది. తొలి అండర్-19 టి20 వరల్డ్కప్ను సాధించిన టీమిండియా సభ్యులను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా సన్మానించింది. న్యూజిలాండ్తో ఆఖరి టి20 పోరుకు ముందు జరిగిన ఈ వేడుకలో బోర్డు ప్రకటించిన రూ. 5 కోట్ల నజరానాను భారత దిగ్గజం సచిన్ చేతుల మీదుగా అండర్–19 జట్టు కెప్టెన్ షఫాలీ వర్మ అందుకుంది. అమ్మాయిలు అద్భుతంగా రాణించారని కితాబిచ్చిన ‘మాస్టర్’... ఈ ఘనతతో మరెంతో మంది మహిళా క్రికెటర్ల కలలకు ఊపిరి పోశారని అన్నారు. Honouring under19 Indian women team for becoming world champion at Ahmedabad @BCCI @sachin_rt @JayShah #INDvsNZ pic.twitter.com/L08NALkWYC — Rajeev Shukla (@ShuklaRajiv) February 1, 2023 This World Cup win has given birth to many dreams. Girls in India & across the world will aspire to be like you. You are role models to an entire generation and beyond. Heartiest congratulations on this stupendous #U19T20WorldCup win.@BCCIWomen @BCCI pic.twitter.com/VJvR0Ls60Z — Sachin Tendulkar (@sachin_rt) February 1, 2023 చదవండి: ఒహో.. చివరికి పృథ్వీని ఇలా కూల్ చేశారా -
పృథ్వీ చేతికి మైక్ ఇచ్చిన ద్రవిడ్.. నవ్వాపుకొన్న గిల్! వీడియో చూశారా?
U19 Women T20 WC- Team India: మహిళా క్రికెట్లో అండర్ 19 స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ట్రోఫీని కైవసం చేసుకుని నీరాజనాలు అందుకుంటోంది టీమిండియా. షఫాలీ వర్మ సారథ్యంలోని టీమిండియా ప్లేయర్లు ఈ ఘనత సాధించి చరిత్రలో తమ పేర్లను పదిలం చేసుకున్నారు. భారత అమ్మాయిలు ఇంతవరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదన్న అపవాదును తుడిచివేస్తూ రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి విజయం తర్వాత షఫాలీ బృందంపై సర్వత్రా ప్రశంసల వర్షం కొనసాగుతోంది. అయితే, వీటిలో బీసీసీఐ షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ రెండో మ్యాచ్ సందర్భంగా.. ప్రపంచకప్ గెలిచిన మహిళా జట్టుకు పురుషుల టీమ్ శుభాభినందనలు తెలిపింది. ఇందులో భాగంగా.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ తొలుత విష్ చేసి టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా చేతికి మైక్ అందించాడు. నవ్వాపుకొన్న గిల్ ఈ క్రమంలో పృథ్వీ విష్ చేస్తుండగా.. జట్టు మొత్తం అతడిని తదేకంగా చూస్తూ నిల్చుని ఉన్నారు. ఇక మరో యువ ఓపెనర్ శుబ్మన్ గిల్.. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మరీ నవ్వాపుకొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన టీమిండియా ఫ్యాన్స్.. ‘‘పాత రోజుల్లో ఏమేం చిలిపి పనులు చేశారో.. అవన్నీ గుర్తొచ్చినట్లున్నాయి! అందుకేనేమో ముసిముసిగా నవ్వుతున్నాడు. ఇద్దరు కెప్టెన్లు.. కోచ్ ఒక్కడే అప్పుడు తనకు డిప్యూటీగా ఉన్న గిల్తో ఓపెనింగ్ స్థానం కోసం ఇప్పుడు పృథ్వీ పోటీపడుతున్నాడు! ఏమిటో!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా పృథ్వీ షా టీమిండియాకు 2018లో అండర్-19 వరల్డ్కప్ అందించాడు. అప్పుడు శుబ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఇక ప్రస్తుత జట్టులో ఉన్న ఇషాన్ కిషన్ కూడా అండర్-19 జట్టుకు సారథ్యం వహించినవాడే! అయితే, అతడి నేతృత్వంలోని టీమిండియా 2016 ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ ద్రవిడ్ ఈ జూనియర్ టీమ్లకు కోచ్గా ఉండటం విశేషం. చదవండి: T20 WC: మరో మిథాలీగా ఎదగాలని ఆ తండ్రి ఆశ.. ‘దంగల్’లో అమీర్ఖాన్లా రామిరెడ్డి! A special message from Lucknow for India's ICC Under-19 Women's T20 World Cup-winning team 🙌 🙌#TeamIndia | #U19T20WorldCup pic.twitter.com/g804UTh3WB — BCCI (@BCCI) January 29, 2023 -
సచిన్ చేతుల మీదుగా సన్మానం
దక్షిణాఫ్రికాలో ఆదివారం ముగిసిన తొలి అండర్–19 మహిళల ప్రపంచకప్ టి20 క్రికెట్ టోరీ్నలో విజేతగా నిలిచిన భారత జట్టుకు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సన్మానించనున్నాడు. బుధవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ ప్రారంభానికి ముందు షఫాలీ వర్మ జట్టుకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. సచిన్ ముఖ్య అతిథిగా హాజరై భారత యువ జట్టును సత్కరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. -
2005 వరల్డ్కప్ టైమ్లో పుట్టినోళ్లు! కుల్దీప్ యాదవ్ కోచ్ దత్తత తీసుకున్న ఆ అమ్మాయి..
దాదాపు 18 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్కప్ ఫైనల్ చేరింది. అయితే ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి రన్నరప్గా నిలవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ స్థాయిలో, ఏ ఫార్మాట్లో కూడా మన టీమ్ వరల్డ్కప్ గెలవలేకపోయింది. నాటి జట్టులో సభ్యురాలిగా ఉన్న ఆఫ్ స్పిన్నర్ నూషీన్ అల్ ఖదీర్ ఇప్పుడు యువ మహిళల టీమ్కు కోచ్. ఇప్పుడు అదే దక్షిణాఫ్రికా గడ్డపై మరో ఫైనల్ ఆడిన భారత బృందం ఈసారి విజేతగా నిలిచింది. దాదాపు 2005 వరల్డ్కప్ జరిగిన సమయంలోనే పుట్టిన అమ్మాయిలంతా ఇప్పుడు విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. సీనియర్ టీమ్ మంచి ఫలితాలు సాధిస్తున్న సమయంలో అండర్–19 జట్టు కూడా తమ స్థాయిని ప్రదర్శించడం శుభపరిణామం. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న వర్ధమాన ప్లేయర్లలో బీసీసీఐ తొలి వరల్డ్కప్ కోసం టీమ్ను ఎంపిక చేసింది. అయితే ఎలాగైనా వరల్డ్కప్ గెలవాలనే ఉద్దేశంతో ఇప్పటికే సీనియర్ టీమ్లో ఆడిన షఫాలీ వర్మ, రిచా ఘోష్లను జట్టులోకి తీసుకుంది. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అమ్మాయిలందరూ తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా రాణించడం విశేషం. శ్వేత సెహ్రావత్ 139.43 స్ట్రయిక్రేట్తో 297 పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలవగా, షఫాలీ (172 పరుగులు), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (116 పరుగులు) అండగా నిలిచారు. బౌలింగ్లో పార్శవి చోప్రా (11 వికెట్లు), మన్నత్ కశ్యప్ (9 వికెట్లు) కీలకపాత్ర పోషించారు. సీనియర్ టీమ్లో జూనియర్గా బ్యాటింగ్పైనే దృష్టి పెట్టిన షఫాలీ ఈ టోర్నీ ద్వారా తన నాయకత్వ ప్రతిభను కూడా ప్రదర్శించడం విశేషం- సాక్షి క్రీడావిభాగం వరల్డ్కప్ సాధించిన బృందం గురించి సంక్షిప్తంగా... షఫాలీ వర్మ (కెప్టెన్): హరియాణాలోని రోహ్తక్కు చెందిన షఫాలీ భారత్ సీనియర్ జట్టు సభ్యురాలిగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భారత్ తరఫున 74 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. రిచా ఘోష్: బెంగాల్కు చెందిన కీపర్ రిచా కూడా సీనియర్ టీమ్ సభ్యురాలిగా 47 మ్యాచ్లు ఆడింది. పార్శవి చోప్రా: యూపీలోని గ్రేటర్ నోయిడాకు చెందిన లెగ్స్పిన్నర్. తండ్రి ఫ్లడ్ లైట్ సౌకర్యాలతో సొంత గ్రౌండ్ ఏర్పాటు చేసి మరీ కూతురును ఆటలో ప్రోత్సహించాడు. ఎండీ షబ్నమ్: విశాఖపట్నానికి చెందిన షబ్నమ్ తల్లిదండ్రులు నేవీలో పని చేస్తారు. శివశివాని స్కూల్లో పదో తరగతి చదువుతోంది. 15 ఏళ్ల వయసులోనే 110 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. సౌమ్య తివారి: స్వస్థలం భోపాల్. టాప్ ఆర్డర్ బ్యాటర్... కోహ్లిని ఇష్టపడే సౌమ్య అతనిలాగే కవర్డ్రైవ్ అద్భుతంగా ఆడుతుంది. టిటాస్ సాధు: బెంగాల్కు చెందిన టిటాస్ తండ్రి ఒక క్రికెట్ అకాడమీ నడపిస్తాడు. బెంగాల్ సీనియర్ టీమ్కు ఇప్పటికే ఆడింది. గొంగడి త్రిష: భద్రాచలంకు చెందిన త్రిష హైదరాబాద్లో స్థిర పడింది. తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్లోకి అడుగుపెట్టి 8 ఏళ్ల వయసులోనే అండర్–16లో ప్రాతినిధ్యం వహించింది. మన్నత్ కశ్యప్: పటియాలాకు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్. ఇటీవల వరుసగా ‘మన్కడింగ్’లు చేసి గుర్తింపు తెచ్చుకుంది. శ్వేత సెహ్రావత్: ఢిల్లీకి చెందిన బిగ్ హిట్టర్. ఆర్థికంగా మెరుగైన నేపథ్యం ఉన్న కుటుంబం. సొప్పదండి యశశ్రీ: హైదరాబాద్కు చెందిన మీడియం పేసర్. టోర్నీ లో ఒక మ్యాచ్ ఆడింది. గాయంతో తప్పుకున్న హర్లీ గలా స్థానంలో జట్టులోకి వచ్చింది. అర్చనా దేవి: ఆఫ్స్పిన్నర్. యూపీలోని ఉన్నావ్ స్వస్థలం. కడు పేదరికం. తండ్రి ఎప్పుడో చనిపోయాడు. కుల్దీప్ యాదవ్ కోచ్ కపిల్ పాండే దత్తత తీసుకొని ముందుకు నడిపించాడు. సోనమ్ యాదవ్: యూపీ లెఫ్టార్మ్ స్పిన్నర్. తండ్రి ఫిరోజాబాద్లో చేతి గాజులు తయారు చేసే పరిశ్రమలో కార్మికుడు ఫలక్ నాజ్: స్వస్థలం యూపీలోని ప్రయాగ్రాజ్. ఈ బౌలింగ్ ఆల్రౌండర్ తండ్రి ఒక ప్రైవేట్ స్కూల్లో ప్యూన్. రిషిత బసు: వికెట్ కీపర్, బెంగాల్లోని హౌరా స్వస్థలం. అద్భుతమైన మెరుపు షాట్లు ఆడుతుంది. మాజీ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లా తన అకాడమీలో ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. చదవండి: Novak Djokovic: తిరుగులేని జొకోవిచ్.. సిట్సిపాస్కిది రెండోసారి.. ప్రైజ్మనీ ఎంతంటే! Hockey World Cup 2023: హాకీ జగజ్జేత జర్మనీ From #TeamIndia to #TeamIndia🇮🇳 Well done!!! We are so proud of you! 🤝 pic.twitter.com/YzLsZtmNZr — BCCI Women (@BCCIWomen) January 29, 2023 -
ICC T20 WC: బీసీసీఐ కానుక రూ. 5 కోట్లు! వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా!
ICC U19 Inaugural T20 World Cup- Shafali Verma: ఐసీసీ అండర్–19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభినందించింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి కలిపి రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. మరోవైపు ఫైనల్లో ఇంగ్లండ్ను 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ సాధించిన మహిళల టీమ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ యువ జట్టు భవిష్యత్తులోనూ మరిన్ని టోర్నీలో విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అదే విధంగా భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, హార్దిక్ పాండ్యా సేన.. మహిళా టీమ్కు వీడియో సందేశం ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా ‘‘అమ్మాయిలంతా చాలా బాగా ఆడారు. వారి ప్రదర్శన, తమపై తమకు ఉన్న నమ్మకం గురించి ఎంత చెప్పినా తక్కువే. కీలక పాత్ర పోషించిన సహాయక బృందానికి కూడా కృతజ్ఞతలు’’ అంటూ భారత కెప్టెన్ షఫాలీ వర్మ హర్షం వ్యక్తం చేసింది. చారిత్రక విజయంలో జట్టు సమిష్టి ఉందని పేర్కొంది. అదే విధంగా... వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ (సీనియర్ మహిళల టి20 ప్రపంచకప్)ని కూడా అందుకోవాలని ఉందంటూ షఫాలీ తన ఆకాంక్షను తెలియజేసింది. అండర్–19 టి20 ప్రపంచకప్- ఎవరెవరిపై గెలిచామంటే.. ►లీగ్ దశలో: దక్షిణాఫ్రికాపై 7 వికెట్లతో గెలుపు ►యూఏఈపై 122 పరుగులతో విజయం ►స్కాట్లాండ్పై 83 పరుగులతో గెలుపు ►సూపర్ సిక్స్ దశలో: ఆస్ట్రేలియా చేతిలో 7 వికెట్లతో ఓటమి. ►శ్రీలంకపై 7 వికెట్లతో విజయం ►సెమీస్లో: న్యూజిలాండ్పై 8 వికెట్లతో విజయం ►ఫైనల్లో: ఇంగ్లండ్పై 7 వికెట్లతో గెలుపు చదవండి: IND Vs NZ T20: కివీస్పై టీమిండియా గెలుపు U19 Womens WC 2023: వారెవ్వా అర్చన.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్! A special message from Lucknow for India's ICC Under-19 Women's T20 World Cup-winning team 🙌 🙌#TeamIndia | #U19T20WorldCup pic.twitter.com/g804UTh3WB — BCCI (@BCCI) January 29, 2023 -
మహిళల టి20 వరల్డ్కప్: కివీస్పై గెలుపు.. ఫైనల్లో భారత్
ఐసీసీ అండర్-19 మహిళల టి20 వరల్డ్కప్లో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం న్యూజిలాండ్ వుమెన్స్తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 14.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(10) విఫలమైనప్పటికి మరో ఓపెనర్ స్వేతా సెహ్రావత్(45 బంతుల్లో 61 పరుగులు నాటౌట్), సౌమ్య తివారీ(22 పరుగులు) రాణించడంతో భారత్ సులువుగానే విజయాన్ని అందుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్లిమ్మర్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసాబెల్లా గేజ్ 26 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పరశ్వీ చోప్రా మూడు వికెట్లు తీయగా.. తిటాస్ సాదు, మన్నత్ కశ్యప్, షఫాలీ వర్మ, అర్జనా దేవీలు తలా ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ వుమెన్స్, ఆస్ట్రేలియా వుమెన్స్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ విజేతతో జనవరి 29న(ఆదివారం) భారత మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. A dominant performance sends India through to the #U19T20WorldCup final! 📝 Scorecard: https://t.co/nO40lpkR7A Watch the action live and for FREE on https://t.co/5AuGFN3l1C (in select regions) 📺 pic.twitter.com/0Ik8ET7Zbi — T20 World Cup (@T20WorldCup) January 27, 2023 -
టీ20 ప్రపంచకప్ సెమీస్లో టీమిండియా.. కివీస్తో పోరుకు సై
ICC Under 19 Womens T20 World Cup 2023: అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీలో షఫాలీ వర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాలో బుధవారం ‘సూపర్ సిక్స్’ దశ మ్యాచ్లు ముగిశాయి. గ్రూప్–1లో ఉన్న భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు 6 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. సెమీస్ చేరిన జట్లు ఇవే అయితే మెరుగైన రన్రేట్ కారణంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత్ (+2.844), ఆస్ట్రేలియా (+2.210) సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఇక గ్రూపు- 2లో ఉన్న ఇంగ్లండ్ వెస్టిండీస్పై బుధవారం ఘన విజయం సాధించింది. 95 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. ఇక ఇదే గ్రూపులో ఉన్న న్యూజిలాండ్ ఇప్పటికే పాకిస్తాన్పై 103 పరుగుల తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్ ఎప్పుడంటే ఈ నేపథ్యంలో శుక్రవారం(జనవరి 27) జరుగనున్న మొదటి సెమీస్ మ్యాచ్లో భారత్- న్యూజిలాండ్ తలపడనుండగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో సెమీస్ విజేతల మధ్య ఆదివారం ఫైనల్ జరుగనుంది. కాగా ఈ మెగా ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకోలేక ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. చదవండి: IPL: ఆల్టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! కానీ.. Kieron Pollard: విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్ప్రెషన్కు అర్థమేంటి! -
తిప్పేసిన స్పిన్నర్లు.. శ్రీలంకపై టీమిండియా ఘన విజయం
Under 19 Womens T20 World Cup 2023: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్లో భారత అమ్మాయిలు అదరగొడుతున్నారు. గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్ల్లో విజేతగా నిలిచిన భారత్.. సూపర్ సిక్స్లో తొలి మ్యాచ్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ, మరుసటి మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుని శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. A thumping win for India as they move up in the Super 6 table 😍 Watch the Women's #U19T20WorldCup for FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 📝: https://t.co/b2qCbfrjIX pic.twitter.com/PD9U2zJ59t — ICC (@ICC) January 22, 2023 ఈ మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్లు పర్శవి చోప్రా (4-1-5-4), మన్నత్ కశ్యప్ (4-1-16-2), అర్చనా దేవీ (4-0-15-1) అద్భుతమైన గణాంకాలు నమోదు చేసి లంకేయులను తిప్పేశారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 59 పరుగులు మాత్రమే చేయగలిగింది. పర్శవి, మన్నత్, అర్చనాతో పాటు టిటాస్ సాధు (3-0-10-1) ఓ వికెట్ పడగొట్టగా.. సోనమ్ యాదవ్ (3-0-7-0), షెఫాలీ వర్మ (2-0-6-0) వికెట్లు పడగొట్టకున్నా పొదుపుగా బౌలింగ్ చేశారు. A solid bowling performance from India led by Parshavi Chopra's economical spell 🙌 Watch the Women's #U19T20WorldCup for FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 📝 https://t.co/b2qCbfrjIX pic.twitter.com/oRj6gKtDXz — ICC (@ICC) January 22, 2023 అనంతరం 60 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 7.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అడుతూ పాడుతూ విజయం సాధించింది. షెఫాలీ వర్మ (15), శ్వేత సెహ్రావత్ (13), రిచా ఘోష్ (4) తక్కువ స్కోర్లకే ఔటైనప్పటికీ సౌమ్య తివారి (15 బంతుల్లో 28; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చింది. లంక బౌలర్లలో దేవ్మీ విహంగ 3 వికెట్లు పడగొట్టింది. ఈ గెలుపుతో భారత్.. సూపర్ సిక్స్ గ్రూప్-1లో రెండో స్థానానికి ఎగబాకింది. -
టీమిండియాకు తొలి ఓటమి
ICC U19 Womens T20 World Cup: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్-2023లో భారత్కు తొలి ఓటమి ఎదురైంది. గ్రూప్ దశలో 3 మ్యాచ్ల్లో 3 వరుస విజయాలు సాధించి అజేయ జట్టుగా ఉండిన టీమిండియా.. సూపర్ సిక్స్ గ్రూప్-1లో భాగంగా ఇవాళ (జనవరి 21) ఆసీస్తో జరిగిన మ్యాచ్లో పరాజయం పాలై, సెమీస్ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 18.5 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలగా, ఆసీస్ 13.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఆసీస్ 7 వికెట్ల తేడాతో టీమిండియాను మట్టికరిపించింది. భారత ఇన్నింగ్స్లో శ్వేత సెహ్రావత్ (21) టాప్ స్కోరర్గా నిలువగా.. హ్రిషిత బసు (14), టిటాస్ సాధు (14)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఆసీస్ బౌలర్లలో సియన్నా జింజర్ 3 వికెట్లు పడగొట్టగా.. మిల్లీ ఇల్లింగ్వర్త్, మ్యాగీ క్లార్క్ తలో 2 వికెట్లు, కెప్టెన్ రైస్ మెక్కెన్నా, ఎల్లా హేవర్డ్ తలో వికెట్ దక్కించుకున్నారు. స్వల్ప లక్ష్య ఛేదనలో క్లెయిర్ మూర్ (25), ఆమీ స్మిత్ (26) ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో టిటాస్ సంధూ, అర్చనా దేవీ, సోనమ్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. సూపర్ సిక్స్ గ్రూప్-1లో భారత్తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్ జట్టు ఉన్నాయి. గ్రూప్-2లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, రువాండ, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. రెండు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు చేరుకుంటాయి. భారత్.. తమ తదుపరి మ్యాచ్లో రేపు (జనవరి 22) శ్రీలంకను ఢీకొట్టనుంది. కాగా, మహిళ అండర్-19 విభాగంలో టీ20 వరల్డ్కప్ జరగడం ఇదే తొలిసారి. -
టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. యూఏఈపై భారీ విజయం
ICC U19 Women T20 WC 2023: తొలిసారి జరుగుతున్న ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ తొలి మ్యాచ్లో సౌతాఫ్రికాను 7 వికెట్ల తేడాతో ఖంగుతినిపించిన భారత అమ్మాయిలు.. ఇవాళ (జనవరి 16) యూఏఈతో జరిగిన మ్యాచ్లో 122 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. ఫలితంగా 2 మ్యాచ్ల్లో 2 విజయాలతో గ్రూప్-డిలో అగ్రస్థానంలో నిలిచారు. యూఏఈతో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్లు శ్వేత సెహ్రావత్ (49 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు), షఫాలీ వర్మ (34 బంతుల్లో 78; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), వన్డౌన్ బ్యాటర్ రిచా ఘోష్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్ల) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష (5 బంతుల్లో 11; 2 ఫోర్లు) భారీ షాట్లు ఆడే క్రమంలో వికెట్ కోల్పోగా.. సోనియా మెంధియా 2 పరుగులతో నాటౌట్గా నిలిచింది. యూఏఈ బౌలర్లలో ఇందుజ నందకుమార్, మహిక గౌర్, సమైరా తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ.. భారత బౌలర్లు షబ్నమ్ (1/21), టిటాస్ సాధు (1/14), మన్నత్ కశ్యప్ (1/14), పర్శవి చోప్రా (1/13) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 97 పరుగులకు మాత్రమే పరిమితమైంది. యూఏఈ ఇన్నింగ్స్లో లావణ్య కెనీ (24), తీర్థ సతీష్ (16), మహిక గౌర్ (26) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూ భారత ఓపెనర్లు శ్వేత సెహ్రావత్ (57 బంతుల్లో 92 నాటౌట్; 20 ఫోర్లు), షఫాలీ వర్మ (16 బంతుల్లో 45; 9 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడిన విషయం తెలిసిందే. టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో (జనవరి 18) స్కాట్లాండ్ను ఢీకొట్టనుంది. -
భారత బౌలర్లు అదుర్స్.. సౌతాఫ్రికా 54 పరుగులకే ఆలౌట్! సిరీస్ మనదే
TeamIndia Win Final T20I Against South Africa Women- కేప్టౌన్: దక్షిణాఫ్రికా అండర్–19 మహిళల జట్టుతో ఆరో టి20 మ్యాచ్లో భారత అండర్–19 మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం జరిగిన చివరిదైన మ్యాచ్లో గెలిచి సిరీస్ను 4–0తో దక్కించుకుంది. ప్రిటోరియా వేదికగా జరిగిన టీ20లో టాస్ గెలిచిన ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్కు దిగింది. భారత బౌలర్ల ధాటికి 13.2 ఓవర్లలో 54 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్ అమ్మాయి యషశ్రీ 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది.. మిగతా వాళ్లలో.. ఫలక్ నాజ్, సోనమ్ యాదవ్, పార్షవి చోప్రా రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం భారత్ 9.2 ఓవర్లలో 3 వికెట్లకు 55 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్ షఫాలీ వర్మ (22; 3 ఫోర్లు, 1 సిక్స్), హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష (10 నాటౌట్; 1 ఫోర్) రాణించారు. చదవండి: 12 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో ‘మట్టి కుస్తీ’ సవాల్.. ‘హింద్ కేసరి’ విశేషాలు.. పూర్తి వివరాలు Sara Khadem: ఇరాన్లో అడుగుపెడితే చంపేస్తాం.. చెస్ ప్లేయర్కు బెదిరింపు -
T20 Series: అదరగొట్టిన షబ్నమ్.. దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం
India Women Under-19s tour of South Africa, 2022-23- ప్రిటోరియా: వచ్చే నెలలో జరిగే అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్కు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి టి20లో భారత్ 54 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా మహిళలను ఓడించింది. మొదట భారత అండర్–19 జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ షఫాలీ వర్మ (0) డకౌట్ కాగా, శ్వేత (39 బంతుల్లో 40; 5 ఫోర్లు), సౌమ్య (46 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రిచా ఘోష్ 15 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో హ్లుబి, కేలా రేనకె చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా అండర్–19 జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులే చేసింది. ఆంధ్ర సీమర్ షబ్నమ్ షకీల్ (3/15)తో పాటు అర్చన దేవి (3/14) కూడా చెలరేగి ప్రత్యర్థిని పడగొట్టారు. జనవరి 14 నుంచి 29 వరకు తొలి సారి అండర్–19 మహిళల టి20 దక్షిణాఫ్రికాలోనే జరగనుంది. చదవండి: IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్.. భారత కెప్టెన్గా హార్దిక్ పాండ్యా! సూర్యకుమార్కు కీలక బాధ్యతలు #TeamIndia clinch a comprehensive 5️⃣4️⃣-run win against SA U19 Women at the Steyn City Ground & take a 1️⃣-0️⃣ lead in the 5️⃣-match #SAvIND T20I series 👏🏻👏🏻 4️⃣0️⃣ runs each with the bat from Shweta Sehrawat & Soumya Tiwari 👌🏻 3️⃣ wickets apiece for Shabnam Shakil & Archana Devi 🙌🏻 pic.twitter.com/5cjRF5TzPP — BCCI Women (@BCCIWomen) December 27, 2022 -
చేతులెత్తేసిన బ్యాటర్లు.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
ముంబై: బ్యాటింగ్ వైఫల్యంతో భారత మహిళల జట్టు మూడో టి20లో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్ల సిరీస్లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (47 బంతుల్లో 75; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్రేస్ హారిస్ (18 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఆంధ్ర అమ్మాయి అంజలి శర్వాణి, రేణుక సింగ్, దీప్తి శర్మ, దేవిక తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులే చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (41 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిసింది. హర్మన్ప్రీత్ (27 బంతుల్లో 37; 6 ఫోర్లు), దీప్తి శర్మ (17 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్, ఆష్లే గార్డెనర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 17న ఇదే వేదికపై నాలుగో టి20 మ్యాచ్ జరుగుతుంది. చదవండి: Kane Williamson: కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం.. ఇకపై -
ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా ఓపెనర్
మహిళల ఆసియా కప్-2022లో భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ పలు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో మెరుపు అర్ధసెంచరీ (44 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదిన షెఫాలీ.. అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ రికార్డు గతంలో టీమిండియాకే చెందిన జెమీమా రోడ్రిగ్స్ పేరిట ఉండేది. రోడ్రిగ్స్ 21 ఏళ్ల 32 రోజుల వయసులో 1000 పరుగుల మైలురాయిని అందుకోగా.. షెఫాలీ 18 ఏళ్ల 253 రోజుల వయసులో ఆ రికార్డును అధిగమించింది. ఈ రికార్డుతో పాటు షెఫాలీ ఇదే మ్యాచ్లో మరో రికార్డు కూడా సాధించింది. టీ20 అరంగేట్రం తర్వాత వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న మహిళా క్రికెటర్గా రికార్డుల్లోకెక్కింది. షెఫాలీ 3 ఏళ్ల 14 రోజుల్లో ఈ ల్యాండ్మార్కును చేరుకోగా.. గతంలో ఆసీస్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ 3 ఏళ్ల 87 రోజుల్లో ఈ మైలురాయిని చేరుకుంది. పై రెండు రికార్డులతో పాటు షెఫాలీ ఈ మ్యాచ్లో మరో రికార్డును సైతం తన ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 1000 పరుగుల పూర్తి చేసిన మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది. షెఫాలీ 1000 పరుగులను కేవలం 735 బంతుల్లోనే పూర్తి చేసి, మరే మహిళా క్రికెటర్కు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. టాప్ త్రీ బ్యాటర్లు షెఫాలీ వర్మ (55), కెప్టెన్ మంధాన (47), జెమీమా రోడ్రిగ్స్ (35 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులకే పరిమితం కావడంతో భారత్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ, షెఫాలీ వర్మ తలో 2 వికెట్లు పడగొట్టగా.. రేణుక సింగ్, స్నేహ్ రాణా తలో వికెట్ దక్కించుకున్నారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
షఫాలీ ఆల్ రౌండ్ షో.. బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
మహిళల ఆసియాకప్-2022లో భారత్ నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సెల్హెట్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులకే పరిమితమైంది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నిగార్ సుల్తానా 36 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఇక భారత బౌలర్లలో దీప్తి శర్మ, షఫాలీ వర్మ చెరో రెండు వికెట్లు, రేణుకా సింగ్, రాణా తలా వికెట్ సాధించారు. కాగా అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు షఫాలీ వర్మ(55), స్మృతి మంధాన(47) చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో రుమనా ఆహ్మద్ మూడు వికెట్లు సాధించగా.. సల్మా ఖాటన్ ఒక్క వికెట్ పడగొట్టింది. కాగా ఆడిన ఐదు మ్యాచ్ల్లో 4 విజయాలతో భారత్ పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్లో ఆక్టోబర్10న థాయ్లాండ్తో తలపడనుంది. చదవండి: Women's Asia Cup 2022:33 పరుగులకే ఆలౌట్.. మలేషియాపై శ్రీలంక ఘన విజయం -
శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
పల్లెకెలె వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక సరిగ్గా 50 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రేణుక సింగ్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. మేఘనా సింగ్,దీప్తి శర్మలు చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో కాంచన 47 పరుగలతో టాప్ స్కోరర్గా నిలిచింది. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 25.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన(94),షఫాలీ వర్మ (71) పరుగులతో చెలరేగారు. ఇక ఇరు జట్లు మధ్య అఖరి వన్డే గురువారం జరగనుంది. చదవండి: Rishabh Pant: టెస్టుల్లో పంత్ అరుదైన రికార్డు.. 49 ఏళ్ల తర్వాత..! -
IND-W Vs SL-W: భారత మహిళల శుభారంభం
దంబుల్లా: ఫామ్ కోల్పోయి వన్డే ప్రపంచ కప్ జట్టుకు దూరమైన జెమీమా రోడ్రిగ్స్ ఇప్పుడు టి20ల్లో పునరాగమనంతో సత్తా చాటింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా (27 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శనతో గురువారం జరిగిన తొలి టి20లో భారత మహిళల జట్టు 34 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (31 బంతుల్లో 31; 4 ఫోర్లు) కూడా రాణించింది. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (1), ఆంధ్రప్రదేశ్ బ్యాటర్ సబ్బినేని మేఘన (0) విఫలం కాగా, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. చివర్లో దీప్తి శర్మ (8 బంతుల్లో 17 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడింది. లంక బౌలర్లలో ఇనొక రణవీర 3, ఒషాది రణసింఘే 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లంతా సమష్టిగా కట్టడి చేయడంతో చేతిలో వికెట్లున్నా ఛేదనలో శ్రీలంక వెనుకబడిపోయింది. రాధా యాదవ్కు 2 వికెట్లు దక్కాయి. ఇదే వేదికపై ఇరు జట్ల మధ్య రేపు రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. చదవండి: IRE Vs IND T20 Series: ఆ ఐదుగురు ఆటగాళ్లతో జర జాగ్రత్త.. లేదంటే టీమిండియాకు కష్టమే..! -
SPN Vs VEL: చెలరేగిన షఫాలీ.. హర్మన్ప్రీత్ సేనకు తప్పని ఓటమి
Womens T20 Challenge Velocity Vs Supernovas- పుణే: మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో వెలాసిటీ ఏడు వికెట్ల తేడాతో సూపర్ నోవాస్ జట్టుపై ఘనవిజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో మొదట సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ప్రియా (4), డాటిన్ (6), హర్లీన్ డియోల్ (7) టాపార్డర్ చేతులెత్తేయగా, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (51 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), తానియా భాటియా (36; 3 ఫోర్లు) చక్కని పోరాటం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 82 పరుగులు జోడించారు. కేట్ క్రాస్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత వెలాసిటీ 18.2 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (33 బంతుల్లో 51; 9 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో లారా వోల్వర్డ్ (35 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. షఫాలీ అవుటయ్యాక వోల్వర్డ్, కెప్టెన్ దీప్తి శర్మ (25 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు) అబేధ్యమైన నాలుగో వికెట్కు 71 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. డాటిన్ 2 వికెట్లు పడగొట్టారు. వీరోచిత ప్రదర్శన చేసిన హర్మన్ప్రీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. చెరో విజయం సాధించిన సూపర్ నోవాస్ (నెట్ రన్రేట్; 0.912), వెలాసిటీ (నెట్ రన్రేట్; 0.736) రెండేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. సూపర్ నోవాస్ ఫైనల్ చేరాలంటే గురువారం వెలాసిటీతో జరిగే మ్యాచ్లో ట్రయల్ బ్లేజర్స్ జట్టు (నెట్ రన్రేట్; –2.450) భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. చదవండి: IPL 2022 GT Vs RR: అరంగేట్రంలోనే అదుర్స్.. అహ్మదాబాద్కు చలో చలో! READ: @TheShafaliVerma and @LauraWolvaardt starred with the bat as the @Deepti_Sharma06-led Velocity beat Supernovas. 👍 👍 - By @mihirlee_58 Here's the match report 👇 #My11CircleWT20C #SNOvVEL https://t.co/LSTW5mpYeG — IndianPremierLeague (@IPL) May 24, 2022 -
హర్మన్ మెరుపులు.. షఫాలీ విధ్వంసం
రాంచీ: సీనియర్ మహిళల టీ20 టోర్నీలో హర్యానా జట్టు బోణీ కొట్టింది. కెప్టెన్ షఫాలీ వర్మ (23 బంతుల్లో 50; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో విధ్వంసం సృష్టించడంతో హర్మాన్ప్రీత్ నేతృత్వంలోని పంజాబ్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (38 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో రాణించగా.. ప్రగతి సింగ్ (36) పర్వాలేదనిపించింది. అనంతరం 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హర్యానా 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. షఫాలీ ఇన్నింగ్స్కు గట్టి పునాది వేయగా.. సుమన్ గుయిలా (25 బంతుల్లో 31), మాన్సీ జోషి (16 బంతుల్లో 25 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: T20 Trophy: హైదరాబాద్ శుభారంభం -
డివిలియర్స్ను గుర్తు చేస్తూ.. అద్భుతమైన షాట్ ఆడిన భారత ఓపెనర్!
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న కీలక మ్యాచ్లో భారత యువ సంచలనం షఫాలీ వర్మ అదరగగొట్టింది. 46 బంతుల్లో 53 పరుగులు చేసిన షఫాలీ వర్మ భారత్కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్లో షఫాలీ వర్మ అద్భుతమైన షాట్లుతో అలరించింది. కాగా ఈ మ్యాచ్లో షఫాలీ... దక్షిణాఫ్రికా దిగ్గజం డివిలియర్స్ను తలపించేలా స్కూప్ షాట్ ఆడింది. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇస్మాయిల్ బౌలింగ్లో.. షఫాలీ వికెట్లు విడిచి పెట్టి ఆఫ్ సైడ్ వచ్చి అద్భుతమైన స్కూప్ షాట్ ఆడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(71), షఫాలీవర్మ(53) కెప్టెన్ మిథాలీ రాజ్(68), హర్మన్ ప్రీత్కౌర్ (48) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్, మసబాట క్లాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అయబోంగా ఖాకా,ట్రాయన్ ఒక్కో వికెట్ సాధించారు. చదవండి: World Cup 2022 Ind W Vs SA W: కీలక మ్యాచ్.. అదరగొట్టిన స్మృతి, షఫాలీ, మిథాలీ.. హర్మన్ సైతం. View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: అదరగొట్టిన స్మృతి, షఫాలీ, మిథాలీ.. హర్మన్ సైతం..
Update: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో మిథాలీ సేన ప్రయాణం ముగిసింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో కనీసం సెమీస్ కూడా చేరకుండానే మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు అదరగొట్టింది. సెమీస్కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మిథాలీ సేన భారీ స్కోరు సాధించింది. కాగా క్రైస్ట్చర్చ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో ఓపెనర్లు స్మృతి మంధాన(71), షఫాలీ వర్మ(53) శుభారంభం అందించగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(68) సైతం అర్ధ సెంచరీతో మెరిసింది. ఇక , వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్కౌర్ 48 పరుగులతో రాణించింది. View this post on Instagram A post shared by ICC (@icc) దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ప్రత్యర్థికి గట్టి సవాల్ విసిరింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్కు రెండు, అయబోంగా ఖాకు ఒకటి, ట్రియాన్కు ఒకటి, మసబాట క్లాస్కు రెండు వికెట్లు దక్కాయి. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: అదరగొట్టిన మిథాలీ సేన.. బంగ్లాపై భారీ విజయంతో..
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళా జట్టు అదరగొట్టింది. ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. హామిల్టన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42)కు తోడు యస్తికా భాటియా అర్ధ శతకంతో రాణించడంతో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. అయితే, గత మ్యాచ్లో అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్ మిథాలీ రాజ్(0) మరోసారి నిరాశపరిచింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. షర్మీన్ అక్తర్ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన బంగ్లా.. 15 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో భారత బౌలర్లు వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. దీంతో 40.3 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మిథాలీ సేన 110 పరుగులతో సునాయాస విజయం సాధించి సెమీస్ మార్గాలను సుగమం చేసుకుంది. ఇక బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా అక్తర్ 2, జహనారా ఆలం ఒక వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా అత్యధికంగా 4 వికెట్లు తీసి సత్తా చాటింది. ఝులన్ గోస్వామికి రెండు, రాజేశ్వరీ గైక్వాడ్కు ఒకటి, పూజా వస్త్రాకర్కు రెండు, పూనమ్ యాదవ్కు ఒక వికెట్ దక్కాయి. ఇక అర్ధ శతకంలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యస్తికా భాటియాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు: భారత మహిళా జట్టు: 229/7 (50) బంగ్లాదేశ్ మహిళా జట్టు: 119 (40.3) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం' -
World Cup 2022: నిరాశ పరిచిన మిథాలీ రాజ్.. రాణించిన మంధాన, షఫాలీ, యస్తికా
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారత జట్టు మెరుగైన స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి పరుగులు సాధించింది. కాగా హామిల్టన్ వేదికగా సాగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన మిథాలీ సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) శుభారంభం అందించారు. దీంతో 14 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. అయితే, బంగ్లా బౌలర్ నహీదా అక్తర్ మంధానను అవుట్ చేయగా.. రీతూ మోనీ వరుసగా రెండు వికెట్లు పడగొట్టింది. ఫామ్లో ఉన్న షఫాలీ వర్మను, కెప్టెన్ మిథాలీ రాజ్(0)ను పెవిలియన్కు పంపింది. View this post on Instagram A post shared by ICC (@icc) దీంతో ఐదు పరుగుల వ్యవధిలోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యస్తికా భాటియా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. అర్ధ శతకం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్(14), రిచా ఘోష్(26), పూజా వస్త్రాకర్(30), స్నేహ్ రాణా(27) పరుగులు సాధించారు. ఈ క్రమంలో భారత్ 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా అక్తర్ 2, జహనారా ఆలం ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: బంగ్లాదేశ్ను చిత్తు చేసిన భారత్.. సెమీస్ ఆశలు సజీవం
ICC Women ODI World Cup 2022 Ind W Vs Ban W : మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 110 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్లో సెమీస్ ఆశలు సజీవంగా భారత్ నిలుపుకుంది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల ధాటికి 119 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్నేహ్ రానా నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించింది. అదే విధంగా గోస్వామి, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు సాధించి తమ వంతు పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో సల్మా ఖతూన్(32) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) రాణించగా.. యస్తికా భాటియా అర్ధ శతకంతో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. 12: 53 PM బంగ్లాదేశ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి ఒక వికెట్ దూరంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే మిథాలీ సేన సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. 12: 42 AM బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి ఇంకా రెండు వికెట్ల దూరంలో నిలిచింది. 12: 37 AM ఏడో వికెట్ డౌన్ బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. 98 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 12: 12 AM ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ ఝులన్ గోస్వామి బౌలింగ్లో సల్మా ఖతూన్ వికెట్ కీపర్ రిచా ఘోష్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. లతా మొండాల్, రీతూ మోనీ క్రీజులో ఉన్నారు. 28 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 76-6 11: 59 AM 25 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ స్కోరు: 69-5 11: 31 AM: భారత బౌలర్లు జోరు మీదున్నారు. వరుస విరామాల్లో వికెట్లు కూలుస్తూ బంగ్లాదేశ్కు చుక్కలు చూపిస్తున్నారు. స్నేహ్ రాణా బౌలింగ్లో రుమానా ఐదో వికెట్గా వెనుదిరిగింది. దీంతో 40 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. 11: 25 AM బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. పూనమ్ యాదవ్ బౌలింగ్లో ముర్షీదా ఖతూన్ అవుట్ అయింది. రుమానా అహ్మద్, లతా మొండాల్ క్రీజులో ఉన్నారు. స్కోరు- 35-4(17 ఓవర్లు) View this post on Instagram A post shared by ICC (@icc) 11: 14 AM: మూడో వికెట్ డౌన్ ప్రపంచకప్ టోర్నీలో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. స్నేహ్ రాణా బౌలింగ్లో నిగర్ సుల్తానా హర్మన్ప్రీత్ కౌర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. అంతకుముందు గైక్వాడ్ షర్మిన్ అక్తర్ను, పూజా వస్త్రాకర్ ఫర్గాగాను అవుట్ చేశారు. 14 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ స్కోరు: 28/3 10: 52 AM: 15 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. పూజా వస్త్రాకర్ బౌలింగ్లో ఫర్గానా హోక్ ఎల్బీగా వెనుదిరిగింది. 9 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ రెండు వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) 10: 40 AM: 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ షర్మిన్ అక్తర్ రూపంలో తొలి వికెట్ను కోల్పోయింది. 5 పరుగులు చేసిన అక్తర్..గైక్వాడ్ బౌలింగ్లో స్నేహ్ రానాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరింది. 6 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) 10: 30 AM: 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నాలుగు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. 09: 51 AM: ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) రాణించగా.. యస్తికా భాటియా అర్ధ శతకంతో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇక బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా అక్తర్ 2, జహనారా ఆలం ఒక వికెట్ పడగొట్టారు. 09: 17 AM:అయ్యో.. యస్తికా హాఫ్ సెంచరీ సాధించిన మరుసటి బంతికే భారత బ్యాటర్ యస్తికా భాటియా అవుట్ అయింది. రీతూ మోని బౌలింగ్లో నహీదా అక్తర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. యస్తికా రూపంలో మిథాలీ సేన ఆరో వికెట్ కోల్పోయింది. పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా క్రీజులో ఉన్నారు. స్కోరు 180-6(44 ఓవర్లలో). 09: 16 AM: అర్ధ శతకం పూర్తి చేసుకున్న యస్తికా ఓవైపు వికెట్లు పడుతున్నా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తూ భారత బ్యాటర్ యస్తికా భాటియా హాఫ్ సెంచరీ చేసింది. 79 బంతులు ఎదుర్కొన్న ఆమె 50 పరుగులు పూర్తి చేసుకుంది. సల్మా బౌలింగ్లో సింగిల్ తీసి అర్ధ శతకం సాధించింది. భారత్ స్కోరు:176-5(43) View this post on Instagram A post shared by ICC (@icc) 09: 00 AM: ఐదో వికెట్ కోల్పోయిన భారత్ రిచా ఘోష్ రూపంలో మిథాలీ సేన ఐదో వికెట్ కోల్పోయింది. నహీదా అక్తర్ బౌలింగ్లో నిగర్ సుల్తానాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ప్రస్తుతం పూజా వస్త్రాకర్, యస్తికా భాటియా(44) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు: 163-5(39 ఓవర్లలో) 08: 43 AM: 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 147/4 యస్తికా భాటియా 37 పరుగులు, రిచా ఘోష్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. 08: 20 AM: 30 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 121/4. యస్తికా భాటియా(20), రిచా ఘోష్(9) బ్యాటింగ్ చేస్తున్నారు. 08: 11 AM: హర్మన్ అవుట్ బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత మహిళా జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. లతా మొండాల్ బౌలింగ్లో వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్(14)గా వెనుదిరిగింది. యస్తికా భాటియా, రిచా ఘోష్ క్రీజులో ఉన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) 08: 04 AM: ఆచితూచి ఆడుతున్న యస్తికా, హర్మన్ భారత బ్యాటర్లు యస్తికా భాటియా, హర్మన్ప్రీత్ కౌర్ ఆచితూచి ఆడుతున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ సింగిల్స్ తీస్తున్నారు. ఈ క్రమంలో 25 ఓవర్లు ముగిసే సరికి మిథాలీ సేన 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. 7: 45 AM: కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ వరుసగా రెండు వికెట్లు కూల్చి జోరు మీదున్న బంగ్లా బౌలర్ రీతూ మోని, నహీదా అక్తర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. వీరి బౌలింగ్లో సింగిల్స్ కూడా తీయలేక యస్తికా, హర్మన్ డిఫెన్స్ ఆడుతున్నారు. 20 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 80/3 7: 40 AM: 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 79-3. యస్తికా భాటియా, హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజులో ఉన్నారు. 7: 33 AM: వరుసగా వికెట్లు పడగొడుతున్న బంగ్లా బౌలర్లు ఆరంభంలో తడబడ్డా బంగ్లా బౌలర్లు వరుసగా వికెట్లు కూలుస్తూ ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటున్నారు. రీతూ మోని మరోసారి భారత్ను దెబ్బకొట్టింది. క్రీజులోకి వచ్చీ రాగానే భారత కెప్టెన్ మిథాలీ రాజ్ను అవుట్ చేసింది. 16 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 74-3 View this post on Instagram A post shared by ICC (@icc) 7: 30 AM: మిథాలీ సేనకు మరో షాక్ తగిలింది. అర్ధ శతకానికి చేరువవుతున్న షఫాలీ వర్మ(42)ను రీతూ మోని పెవిలియన్కు పంపింది. షఫాలీ రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. యస్తికా భాటియా, మిథాలీ రాజ్ క్రీజులో ఉన్నారు. 7: 28 AM: జోరు మీదున్న భారత జట్టుకు బంగ్లా బౌలర్ నహీదా అక్తర్ షాకిచ్చింది. 30 పరుగులతో క్రీజులో ఉన్న మంధానను అవుట్ చేసింది. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 7: 22 AM: బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో మిథాలీ సేనకు శుభారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ అదరగొడుతున్నారు. ఈ క్రమంలో 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 72-0 View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీస్ అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. -
World Cup 2022: ఆసీస్తో పోరు.. అదరగొట్టిన మిథాలీ, యస్తికా, హర్మన్..!
ICC Women World Cup 2022 IND W Vs AUS W: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ మంచి స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు సాధించింది. కాగా న్యూజిలాండ్లోని ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన మిథాలీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తలిగింది. గత రెండు మ్యాచ్లలో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ స్మృతి మంధాన 10 పరుగులకే పెవిలియన్ చేరింది. ఆ తర్వాత మరో ఓపెనర్ షఫాలీ వర్మ 12 పరుగులు సాధించి అవుట్ అయింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక వనౌడౌన్లో వచ్చిన యస్తికా భాటియా (59), కెప్టెన్ మిథాలీ రాజ్(68) కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేసిన ఆసీస్ బౌలర్ డార్సీ బ్రౌన్ మంచి ఫామ్లోకి వచ్చిన యస్తికాను అవుట్ చేసింది. ఆ తర్వాత మిథాలీ అలనా కింగ్ బౌలింగ్లో వెనుదిరిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 57 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆఖర్లో 34 పరుగులు చేసి మెరుపులు మెరిపించిన పూజా వస్త్రాకర్ రనౌట్ కావడంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.ఇక ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్కు మూడు, జెస్ జొనాసెన్కు ఒకటి, అలనా కింగ్కు 2 వికెట్లు దక్కాయి. View this post on Instagram A post shared by ICC (@icc) భారత్ స్కోరు: 277-7 (50 Ov) View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన షఫాలీ వర్మ.. తొలిసారి
ICC Women's T20I: ఐసీసీ టి20 వుమెన్స్ ర్యాంకింగ్స్లో టీమిండియా ప్లేయర్ షఫాలీ వర్మ అదరగొట్టింది. తాజాగా ప్రకటించిన బ్యాట్స్వుమెన్ ర్యాంకింగ్స్లో షఫాలీ 726 పాయింట్లతో తొలిసారి అగ్రస్థానంలో నిలిచింది. ఇక మరో టీమిండియా ప్లేయర్ స్మృతి మంధాన మాత్రం 709 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్తో టి20 సిరీస్కు గాయం కారణంగా దూరమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ బెత్మూనీ 724 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చదవండి: Gautam Gambhir: వెంకటేశ్ అయ్యర్కు వన్డే క్రికెట్ ఆడే మెచ్యూరిటీ లేదు.. ఇక ఇంగ్లండ్తో హోమ్ సిరీస్లో తొలి టి20లో 64 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియన్ కెప్టెన్ మెగ్ లానింగ్ 714 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. అదే మ్యాచ్లో ఆల్రౌండర్ తాహిలా మెక్గ్రాత్ 91 పరుగుల సునామీ ఇన్నింగ్స్తో ర్యాంకింగ్స్లో ఏకంగా 29 స్థానాలు ఎగబాకి 28వ స్థానంలో నిలిచింది. ఇక శ్రీలంక బ్యాటర్ చమేరీ ఆటపట్టు అటు బ్యాటింగ్.. ఇటు ఆల్రౌండ్ విభాగంలో టాప్టెన్లో నిలవడం విశేషం. బ్యాటింగ్లో 8వ స్థానంలో నిలిచిన చమేరీ.. ఆల్రౌండర్ విభాగంలో ఏడో స్థానంలో ఉంది. ఇక ఆల్రౌండర్ విభాగంలో 370 పాయింట్లతో తొలిస్థానంలో నిలవగా.. ఇంగ్లండ్కు చెందిన నటాలీ సీవర్ 352 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. చదవండి: కేశవ్ మహరాజ్ 'జై శ్రీరామ్'.. అభిమానుల ప్రశంసల వర్షం 🔹 Shafali Verma back on 🔝 🔹 Big gains for Chamari Athapaththu 🙌 Here are the movements in this week's @MRFWorldwide ICC Women's Player Rankings 📈 Details 👉 https://t.co/vgKLeRzB8D pic.twitter.com/Eh6A9fi7bj — ICC (@ICC) January 25, 2022 -
మెరిసిన స్మృతి మంధాన .. సిడ్నీ థండర్స్ ఘన విజయం
మెక్కే (ఆ్రస్టేలియా): భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (39 బంతుల్లో 45; 6 ఫోర్లు) మహిళల బిగ్బాష్ లీగ్లో మెరిసింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో చక్కని ప్రదర్శనతో పాటు జట్టుకు ఉపయోగపడే భాగస్వామ్యంతో డిఫెండింగ్ చాంపియన్ సిడ్నీ థండర్స్ను గెలిపించింది. మొదట సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. సిక్సర్స్ జట్టుకు ఆడుతున్న భారత ప్లేయర్ షఫాలీ వర్మ (8) నిరాశపరిచింది. సిడ్నీ థండర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో భారతీయ క్రికెటర్ దీప్తి శర్మ వికెట్లను నేరుగా గిరాటేయడంతో షఫాలీ రనౌటైంది. తర్వాత 15.2 ఓవర్లలోనే సిడ్నీ థండర్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కొరినె హాల్ (19)తో కలిసి తొలి వికెట్కు స్మృతి 53 పరుగులు జోడించడం విశేషం. చదవండి: T20 World Cup: మార్టిన్ క్రో ఆత్మ శాంతించేదెప్పుడు? -
ICC Rankings: స్థానం దిగజారిన షఫాలీ వర్మ.. స్మృతి మంధన మాత్రం
Shafali Verma And Smrithi Mandhana ICC T20 Rankings.. ఐసీసీ మంగళవారం ప్రకటించిన టి20 వుమెన్స్ ర్యాంకింగ్స్లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ(726 పాయింట్లు) టాప్ ప్లేస్ను చేజార్చుకొని రెండో స్థానానికి పరిమితం కాగా.. మరో టీమిండియా బ్యాటర్ స్మృతి మంధన(709 పాయింట్లు) మాత్రం తన మూడో స్థానాన్ని పదిలపరుచుకుంది. ఇక ఆస్ట్రేలియా వుమెన్ బ్యాటర్ బెత్ మూనీ 754 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆసీస్కే చెందిన మెగ్ లానింగ్(698 పాయింట్లు), సోఫీ డివైన్( 692 పాయింట్లు), అలెసా హేలీ(673 పాయింట్లు)లు వరుసగా 4,5,6 స్థానాల్లో నిలిచారు. కాగా ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్పై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. కాగా బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్ 10లో ఐదుగురు ఆసీస్ మహిళా క్రికెటర్లు ఉండడం విశేషం. ఇక బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్కు చెందిన సోఫీ ఎక్కిల్స్టోన్ 771 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. సారా గ్లెన్(ఇంగ్లండ్, 744 పాయింట్లు) రెండో స్థానంలో.. షబ్నిమ్ ఇస్మాయిల్(దక్షిణాఫ్రికా, 718 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఆల్రౌండ్ విభాగంలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ సోఫీ డివైన్ 370 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా.. టీమిండియా నుంచి దీప్తి శర్మ 315 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చదవండి: Virat Kohli: కెప్టెన్గా ఇదే చివరిసారి.. అంపైర్తో కోహ్లి వాగ్వాదం T20 World Cup: రషీద్ ఖాన్ టాప్-5 టీ20 క్రికెటర్ల లిస్టు.. ఎవరెవరంటే! We have a new No. 1 in town 👏 Plenty of movement in this week's @MRFWorldwide ICC Women's T20I Player Rankings 📈 More 👉 https://t.co/9r1AQ9zGSu pic.twitter.com/o0U1hEYJ1T — ICC (@ICC) October 12, 2021 -
పింక్ బాల్ టెస్టుకు వరుణుడి అడ్డంకి..సెంచరీకి చేరువలో స్మృతి మంధాన
Pink Ball Test: భారత్, ఆస్ట్రేలియా మహిళల మధ్య జరుగుతున్నచరిత్రత్మాక డే అండ్ నైట్ టెస్టు మొదటి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. క్వీన్స్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 44.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 132 పరుగులు చేసింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన , షెఫాలి వర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 93 పరుగల బాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా 64 బంతుల్లో 31 పరగులు చేసిన షెఫాలి తొలి వికెట్గా వెనుదిరిగింది. స్మృతి మంధాన 144 బంతుల్లో 80 పరగులు చేసి సెంచరీకు చేరువలో ఉంది. ప్రస్తుతం మంధాన, పూనమ్ రౌత్ క్రీజులో ఉన్నారు. చదవండి: IPL 2021 2nd Phase RCB Vs RR: ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ బౌలర్ సరికొత్త రికార్డు.. -
టాప్ ర్యాంక్లో షఫాలీ వర్మ.. మూడో స్థానంలో స్మృతి మంధాన
ICC T20I Rankings: భారత మహిళా క్రికెట్ టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ టి20ల్లో తన టాప్ ర్యాంక్ను నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన టి20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో ఆమె 759 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో ఆ్రస్టేలియా బ్యాటర్ బెత్ మూనీ (744 రేటింగ్స్)... మూడో స్థానంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (716) ఉన్నారు. బౌలింగ్లో దీప్తి శర్మ ఆరో స్థానంలో... పూనమ్ యాదవ్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. చదవండి: మ్యాచ్ గెలిపించినా అక్షింతలు తప్పలేదు.. టీమిండియా కెప్టెన్పై బీసీసీఐ ఆగ్రహం -
‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ రేసులో టీమిండియా మహిళా క్రికెటర్లు
దుబాయ్: జూన్ నెలకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ నామినీలను ఐసీసీ ప్రకటించింది. కాగా టీమిండియా మహిళల జట్టు నుంచి భారత టీనేజ్ బ్యాట్స్వుమెన్ షఫాలీ వర్మ, ఆల్రౌండర్ స్నేహ్ రాణా ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’ మహిళల కేటగిరీ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టులో రాణించడం ద్వారా గత నెల అవార్డు రేసులో ఉన్నారు. అరంగేట్రం చేసిన టెస్టులోనే వీళ్లిద్దరు అర్ధసెంచరీలతో కదంతొక్కి భారత జట్టును ‘డ్రా’తో గట్టెక్కించారు. ఇక పురుషుల కేటగిరీలో న్యూజిలాండ్ క్రికెటర్లు డెవన్ కాన్వే, జేమీసన్, దక్షిణాఫ్రికా ప్లేయర్ డికాక్ అవార్డు రేసులో ఉన్నారు. టీమిండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కైల్ జేమిసన్ తొలి ఇన్నింగ్స్లో ఐదు, రెండో ఇన్నింగ్స్లో రెండు మొత్తంగా ఏడు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్, టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో బ్యాటింగ్లో డెవన్ కాన్వే మెరిశాడు. కాగా ఈసారి టీమిండియా పురుషుల జట్టు నుంచి ఒక్కరు కూడా ఎంపికవలేదు. ఇక షఫాలీ వర్మ టీ 20 ఫార్మాట్లో ఆకట్టుకోవడంతో.. ఇంగ్లండ్తో జరిగిన టెస్టులు, వన్డేల్లో అరంగేట్రం చేసింది. ఈ సిరీస్లోనూ ఆకట్టుకోవడంతో పాటు ఏకైక టెస్టులో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ హాఫ్సెంచరీలతో ఆకట్టుకుంది. దాంతో రెండు ఇన్నింగ్స్ల్లోనూ అర్థ సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాట్స్వుమెన్గా నిలిచింది. ఆల్రౌండర్ స్నేహ్రాణా ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టును డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించింది. 154 బంతుల్లో 80 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. చివరకు ఇంగ్లండ్ టీంకు విజయాన్ని దూరం చేసింది. బౌలింగ్లోనూ రాణించి నాలుగు వికెట్లు పడగొట్టింది. అవార్డుకు నామినేట్ అయిన ఇంగ్లండ్ బౌలర్సోఫీ ఎకిల్స్టోన్ 8 వికెట్లు పడగొట్టింది. -
'17 అయితే 28 గా చూపించారు.. ఏం తాగి వచ్చారా?'
బ్రిస్టల్: టీమిండియా యంగ్ ఉమెన్ క్రికెటర్ షఫాలీ వర్మకు చిత్రమైన అనుభవం ఎదురైంది. అయితే ఆ అనుభవం బ్యాటింగ్ విషయంలో కాదు.. ఆమె వయస్సు విషయంలో. విషయంలోకి వెళితే.. టీమిండియా మహిళల జట్టు ఆదివారం ఇంగ్లండ్ మహిళల జట్టుతో తొలి వన్డే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్తో షఫాలీ వర్మ టీమిండియా తరపున వన్డే క్రికెట్లో 131వ వుమెన్ క్రికెటర్గా అరంగేట్రంచేసింది. 17 ఏళ్ల వయసులోనే షఫాలీ టీమిండియా మహిళల వన్డే జట్టులో చోటు దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఇంతవరకు బాగానే ఉంది. మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా వుమెన్స్ జట్టు బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లుగా షఫాలీ వర్మ, స్మృతి మందన క్రీజులోకి వచ్చారు. మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సోనీ టెన్ చానెల్ నిర్వహకులు షఫాలీ స్టాట్స్ను తప్పుగా చూపెట్టారు. షఫాలీ వయస్సు 17 ఏళ్లు అయితే.. ఆమెకు 28 ఏళ్లు అన్నట్లుగా టీవీలో డిస్ప్లే అయింది. ఇంకేముందు ఇది గమనించిన నెటిజన్లు చానెల్ నిర్వాహకులను సోషల్ మీడియాలో ఒక ఆట ఆడేసుకున్నారు. ''షఫాలీ వయస్సు 17 అయితే.. 28 అని చూపించారు.. ఏం తాగి వచ్చారా..? అరంగేట్రం మ్యాచ్లోనే షఫాలీకి వింత అనుభవం.. ఆమెకు తన వయస్సును తప్పుగా చూపించారని తెలిస్తే ఏమవుతుందో పాపం.. చానెల్ నిర్వాహకులు నిద్రపోతూ పనిచేస్తున్నారు''అంటూ కొందరు కామెంట్లు చేశారు. కాగా షఫాలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా షఫాలీ వర్మ టీ20ల్లో దూకుడైన ఆటతీరు కనబరుస్తూ అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. తన దూకుడైన ఆటతీరుతో సెహ్వాగ్ను గుర్తుకుతెస్తున్న షఫాలీ కొంతకాలంగా మంచి ఫామ్లో ఉంది. ఆమె ఫామ్ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ఆమెకు వన్డేల్లో ఆడే అవకాశం కల్పించింది. కాగా షఫాలీ టీమిండియా తరపున 22 టీ20ల్లో 617 పరుగులు చేయగా.. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక టీమిండియా మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా వుమెన్స్ జట్టు ప్రస్తుతం 36 ఓవర్లు ఆట ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. మిథాలీ రాజ్ 41, దీప్తి శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు షఫాలీ 15, సృ్మతి మందన 10 పరుగులు చేసి ఔటయ్యారు. చదవండి: లూయిస్, గేల్ సిక్సర్ల సునామీ.. విండీస్దే తొలి టీ20 Look at the age of Shafali verma, 28??🤔😒 Google uncle says just 17 years 😐#ENGvIND pic.twitter.com/48RsrPnpXw — Priya💙Addict (@impriyafan) June 27, 2021 Sony people are drunk or what 😭 Showing Shafali's age as 28 — Udit (@udit_buch) June 27, 2021 -
వన్డే సమరానికి ‘సై’
బ్రిస్టల్: ఏడేళ్ల తర్వాత ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్తో చక్కని పోరాటపటిమ కనబరిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు అదే ఉత్సాహంతో వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని మిథాలీ సేన ఆశిస్తోంది. ఈ మ్యాచ్తో భారత టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ వన్డేల్లో అరంగేట్రం చేయనుంది. 2019లో టి20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్కు శ్రీకారం చుట్టిన ఈ హరియాణా టాపార్డర్ బ్యాటర్ ఇంగ్లండ్ గడ్డపైనే ఇటీవల ఏకైక టెస్టు ఆడింది. రెండు ఇన్నింగ్స్ల్లోనూ అర్ధసెంచరీ (96, 63)లతో అదరగొట్టిన షఫాలీ ఇప్పుడు వన్డే కెరీర్కు గొప్ప ప్రారంభం ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సొంతగడ్డపై ఇంగ్లండ్ క్లిష్టమైన ప్రత్యర్థి. కెప్టెన్ హెదర్నైట్, బీమోంట్లతో పాటు బ్యాటింగ్ ఆల్ రౌండర్లు సీవర్, సోఫియా రాణిస్తే భారత్కు కష్టాలు తప్పవు. బౌలింగ్లో కేట్ క్రాస్, ఎకిల్స్టోన్, ష్రబ్సోల్లతో ఈ విభాగం కూడా పటిష్టంగా ఉంది. ఇంగ్లండ్తో ఇప్పటివరకు 71 మ్యాచ్ల్లో తలపడిన భారత్ 30 మ్యాచ్ల్లో గెలిచింది. 37 మ్యాచ్ల్లో ఓడింది. మరో నాలుగు మ్యాచ్ల్లో ఫలితం రాలేదు. -
అదరగొట్టిన షఫాలీ
బ్రిస్టల్: ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు భారత మహిళల క్రికెట్లో కొత్త కెరటాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇప్పటి వరకు కెరీర్లో టి20లు మాత్రమే ఆడిన షఫాలీ వర్మ టెస్టుల్లో కూడా తాను సత్తా చాటగలనంటూ తొలి మ్యాచ్లోనే నిరూపించింది. మ్యాచ్ రెండో రోజు అద్భుత ప్రదర్శన కనబర్చిన షఫాలీ (152 బంతుల్లో 96; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకుంది. అయితే తొలి మ్యాచ్లోనే అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్గా ఈ టీనేజర్ నిలిచింది. షఫాలీకి తోడుగా స్మృతి మంధాన (155 బంతుల్లో 78; 14 ఫోర్లు) కూడా ఆకట్టుకోవడంతో గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. షఫాలీ, స్మృతి తొలి వికెట్కు ఏకంగా 167 పరుగులు జోడించడం విశేషం. అయితే ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి 20 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్లతో పాటు శిఖా పాండే (0), కెప్టెన్ మిథాలీ రాజ్ (2), పూనమ్ రౌత్ (2) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజ్లో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ (4 బ్యాటింగ్), దీప్తి శర్మ (0 బ్యాటింగ్) జట్టును ఆదుకోవాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 59 పరుగులు చేయా ల్సి ఉంది. అంతకు ముందు 269/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 396 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. -
షఫాలీ, రాజేశ్వరి, పూనమ్ రౌత్లకు ప్రమోషన్
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్కుగాను మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. గత ఏడాది కాంట్రాక్ట్లలో 22 మంది ఉండగా... ఈసారి దానిని 19 మందికి పరిమితం చేశారు. వార్షిక కాంట్రాక్ట్ ఫీజుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గ్రేడ్ ‘ఎ’లో ఉన్న వారికి ఏడాదికి రూ. 50 లక్షలు... గ్రేడ్ ‘బి’ వారికి రూ. 30 లక్షలు... గ్రేడ్ ‘సి’ వారికి రూ. 10 లక్షలు లభిస్తాయి. గత ఏడాది కాంట్రాక్ట్ పొందిన ఏక్తా బిష్త్, వేద కృష్ణమూర్తి, హేమలత, అనూజా పాటిల్లకు ఈసారి స్థానం లభించలేదు. టీనేజ్ క్రికెటర్ షఫాలీ వర్మ, లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్, ఓపెనర్ పూనమ్ రౌత్లకు ప్రమోషన్ లభించింది. ఈ ముగ్గురు గ్రేడ్ ‘సి’ నుంచి గ్రేడ్ ‘బి’లోకి వచ్చారు. భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ గ్రేడ్ ‘బి’లోనే కొనసాగనుండగా... బెంగాల్ అమ్మాయి రిచా ఘోష్కు తొలిసారి కాంట్రాక్ట్ దక్కింది. గ్రేడ్ ‘ఎ’ (రూ. 50 లక్షల చొప్పున): హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ యాదవ్. గ్రేడ్ ‘బి’ (రూ. 30 లక్షల చొప్పున): మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, దీప్తి శర్మ, పూనమ్ రౌత్, రాజేశ్వరి గైక్వాడ్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, తానియా, జెమీమా రోడ్రిగ్స్. గ్రేడ్ ‘సి’ (రూ. 10 లక్షల చొప్పున): అరుంధతి రెడ్డి, మాన్సి జోషి, పూజా వస్త్రకర్, హర్లీన్ డియోల్, ప్రియా పూనియా, రిచా ఘోష్. -
Shafali Verma: వన్డేల కోసం శైలి మార్చుకుంటా
న్యూఢిల్లీ: టి20 క్రికెట్లో ఒక్కసారిగా దూసుకొచ్చిన తార షఫాలీ వర్మ. దూకుడైన ఆటకు మారుపేరైన షఫాలీ భారత్ తరఫున తన 22 మ్యాచ్ల స్వల్ప కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఏకంగా 148.31 స్ట్రైక్రేట్తో 617 పరుగులు చేసిన ఈ హరియాణా టీనేజర్... అంతర్జాతీయ క్రికెట్లో అతి పిన్న వయసులో అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తొలి సారి భారత వన్డే టీమ్తో పాటు ఇంగ్లండ్తో జరిగే ఏకైక టెస్టు కోసం కూడా ఎంపికైంది. అయితే తన విధ్వంసక శైలిని పరిస్థితి అనుగుణంగా మార్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నానని షఫాలీ చెప్పింది. ముఖ్యంగా 50 ఓవర్ల మ్యాచ్లో సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్లో నిలబడగలిగితేనే జట్టుకు తాను ఉపయోగపడగలనని ఆమె అభిప్రాయ పడింది. టెస్టు మ్యాచ్ ఆడే తుది జట్టులో అవకాశం లభిస్తే అక్కడా సత్తా చాటగలనని షఫాలీ విశ్వాసం వ్యక్తం చేసింది. మిథాలీ రాజ్ నేతృత్వం లోని భారత జట్టు 2014 తర్వాత తొలి సారి టెస్టు మ్యాచ్ ఆడనుంది. ‘ఏడేళ్ల తర్వాత మన టీమ్కు టెస్టు ఆడే అవకాశం లభించింది. టెస్టు టీమ్లో నాకూ చోటు దక్కడం సంతోషం. ఆ మ్యాచ్ ద్వారా ఎంతో నేర్చుకునే అవకాశం నాకు కలుగుతుంది. సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్లో గడిపే ఓపికతో పాటు ఎలా పడితే అలా బాదేయకుండా సరైన బంతులను ఎంచుకునేందుకు కావాల్సిన అవగాహన కలుగుతుంది. మూడు ఫార్మాట్లు కూడా దేనికదే భిన్నం. కాబట్టి టెస్టు, వన్డేలనుంచి కూడా కొత్త అంశాలు తెలుసుకోగలను. ఎక్కువ మ్యాచ్లలో నాకు అవకాశం దక్కాలని కోరుకుంటా. అప్పుడే బాగా ఆడి నన్ను నేను నిరూపించుకోగలను. నాకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకొని కెరీర్లో ముందుకు వెళ్లగలను. తొలి సారి అవకాశం (వన్డే, టెస్టు) అనేది ఎవరికైనా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రాబోయే సిరీస్లో బాగా ఆడి జట్టును గెలిపించగలిగితే అంతకంటే కావాల్సిందేముంది’ అని షఫాలీ తన మనసులో మాట చెప్పింది. బ్యాటింగ్ కోచ్గా శివ్ సుందర్ దాస్ భారత మహిళల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్గా మాజీ ఆటగాడు శివ్ సుందర్ దాస్ ఎంపికయ్యాడు. త్వరలో జరిగే ఇంగ్లండ్ పర్యటన కోసం దాస్ను బీసీసీఐ నియమించింది. గత కొన్నేళ్లుగా జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రాహుల్ ద్రవిడ్తో కలిసి కోచ్గా అతను పని చేస్తున్నాడు. 2020లో జరిగిన పట్నాలో జరిగిన నాలుగు దేశాల టోర్నీలో భారత మహిళల ‘ఎ’ జట్టుకు పని చేసిన అనుభవం దాస్కు ఉంది. సీనియర్ టీమ్తో జత కట్టడం మాత్రం ఇదే తొలిసారి. 2000–2002 మధ్య కాలంలో భారత్ తరఫున ఓపెనర్గా 23 టెస్టులు ఆడిన శివ్ సుందర్ దాస్ 34.89 సగటుతో 2 సెంచరీలు సహా 1326 పరుగులు చేశాడు. మరో 4 వన్డేల్లో కూడా అతను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా అభయ్ శర్మను ఎంపిక చేసిన బోర్డు...బరోడాకు చెందిన రాజ్కువర్దేవి గైక్వాడ్ను మేనేజర్గా నియమించింది. ఈ పర్యటనలో భాగంగా భారత్ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో ఇంగ్లండ్తో తలపడుతుంది. -
Shafali Verma: షఫాలీ వర్మకు ప్రమోషన్
న్యూఢిల్లీ: భారత మహిళల టి20 సంచలనం షఫాలీ వర్మకు ప్రమోషన్ లభించింది. ఇన్నాళ్లు టి20లే ఆడిన 17 ఏళ్ల హరియాణా అమ్మాయి షఫాలీ ఇప్పుడు తొలిసారి భారత టెస్టు, వన్డే జట్లకూ ఎంపికైంది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత సీనియర్ మహిళల టెస్టు, వన్డే, టి20 జట్లను శుక్రవారం ప్రకటించారు. వచ్చే నెలలో మొదలయ్యే ఈ పూర్తిస్థాయి టూర్లో అమ్మాయిల జట్టు ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్లు ఆడనుంది. ఏడేళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై మహిళల జట్టు మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడనుంది. టెస్టు, వన్డేల జట్లకు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ సారథ్యం వహించనుండగా... టి20 జట్టుకు హర్మన్ప్రీత్ కెప్టెన్గా ఉంటుంది. భారత్ తరఫున 23 టి20 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డికి తొలిసారి వన్డే, టెస్టు జట్టులో స్థానం లభించింది. సీనియర్ పేస్ బౌలర్ శిఖా పాండే, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏక్తా బిష్త్ తిరిగి జట్టులోకి వచ్చారు. గత మార్చిలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టి20 సిరీస్కు శిఖా పాండే, ఏక్తాబిష్త్లను సెలక్టర్లు దూరం పెట్టారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో భారత్ 1–4తో... మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో 1–2తో ఓడిపోయింది. దక్షిణాఫ్రికాతో సిరీస్లో ఆడిన రాజేశ్వరి గైక్వాడ్, మాన్సి జోషి, మోనిక పటేల్, ప్రత్యూష, నుజత్ పర్వీన్, ఆయూషి సోని, సుష్మా వర్మ, శ్వేత వర్మ, యస్తిక భాటియా, హేమలతలను ఇంగ్లండ్తో సిరీస్కు పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తంగా తాజాగా ప్రకటించిన జట్టులో కొత్తగా ఒకే ఒక్కరు వచ్చారు. జార్ఖండ్ వికెట్ కీపర్ ఇంద్రాణి రాయ్ మూడు ఫార్మాట్లకు ఎంపికైంది. అయితే రెగ్యులర్ కీపర్ తానియా భాటియా కూడా జట్టుకు అందుబాటులో ఉంది. ఈ పర్యటన కోసం అమ్మాయిలు ఈ నెల 18న ముంబైలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అక్క డే రెండు వారాలు క్వారంటైన్లో గడిపి జూన్ 2న ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ బయలుదేరుతారు. భారత మహిళల టెస్టు, వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), పూనమ్ రౌత్, ప్రియా పూనియా, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, తానియా భాటియా, ఇంద్రాణి రాయ్, జులన్ గోస్వామి, శిఖా పాండే, పూజ వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాధా యాదవ్. భారత మహిళల టి20 జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా, తానియా భాటియా, ఇంద్రాణి రాయ్, శిఖా పాండే, పూజ వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాధా యాదవ్, సిమ్రన్. -
‘బిగ్బాష్’లో షఫాలీ, రాధ
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ టీనేజ్ సెన్సేషన్ షఫాలీ వర్మకు మరో మంచి అవకాశం లభించింది. ఇంగ్లండ్లో జరిగే ‘హండ్రెడ్’లో బర్మింగ్హామ్ ఫోనిక్స్కు ఆడనున్న షఫాలీ... ఆస్ట్రేలియాలో జరిగే మహిళల బిగ్బాష్ లీగ్ టి20 టోర్నమెంట్లో కూడా బరిలోకి దిగనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. లీగ్లో ఆమె సిడ్నీ సిక్సర్స్ టీమ్కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్లో ప్రస్తుతం నంబర్వన్గా ఉన్న 17 ఏళ్ల షఫాలీ, భారత్ తరఫున 22 మ్యాచ్లలో 148.31 స్ట్రయిక్రేట్తో 617 పరుగులు చేసింది. మరో భారత క్రీడాకారిణి, 21 ఏళ్ల రాధా యాదవ్ కూడా బిగ్బాష్లో ఆడే అవకాశం ఉంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్తో కూడా సిడ్నీ సిక్సర్స్ టీమ్ చర్చలు తుది దశకు చేరాయని సమాచారం. బిగ్బాష్ లీగ్లో భారత్ నుంచి గతంలో హర్మన్ప్రీత్ (సిడ్నీ థండర్), స్మృతి మంధాన (బ్రిస్బేన్ హీట్స్), వేద కృష్ణమూర్తి (హోబర్ట్ హరికేన్స్) ప్రాతినిధ్యం వహించారు. -
Shafali Verma: ‘హండ్రెడ్’లో షఫాలీ
న్యూఢిల్లీ: భారత టీనేజ్ బ్యాటర్ షఫాలీ వర్మకు అరుదైన అవకాశం లభించింది. ఇంగ్లండ్తో తొలి సారి నిర్వహించనున్న ‘హండ్రెడ్’ టోర్నీలో ఆమె పాల్గొననుంది. బర్మింగ్హామ్ ఫోనిక్స్ జట్టుకు షఫాలీ ప్రాతినిధ్యం వహిస్తుంది. న్యూజిలాండ్ దిగ్గజం సోఫీ డివైన్ స్థానంలో చివరి నిమిషంలో ఆమెకు అవకాశం దక్కింది. బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటికే హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మలకు బీసీసీఐ ఎన్ఓసీ మంజూరు చేసింది. భారత్నుంచి నాలుగో ప్లేయర్గా షఫాలీ బరిలోకి దిగనుంది. ప్రస్తుతం ఐసీసీ టి20 ప్రపంచ ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానంలో ఉన్న ఈ హరియాణా అమ్మాయికి ఆస్ట్రేలియాలో జరిగే ఉమెన్ బిగ్బాష్ లీగ్లో కూడా ఆడేందుకు ఆఫర్ వచ్చినట్లు సమాచారం. భారత్ తరఫున 22 టి20లు ఆడిన షఫాలీ...148.31 స్ట్రైక్రేట్తో 617 పరుగులు చేసింది. -
దుమ్మురేపిన షఫాలీ వర్మ..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో భారత టీనేజర్ షఫాలీ వర్మ మళ్లీ ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో షఫాలీ 750 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు టి20ల్లో షఫాలీ 23, 47 పరుగులతో రాణించింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి నంబర్వన్ ర్యాంక్లో ఉన్న బెత్మూనీ (ఆస్ట్రేలియా) 748 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. చదవండి: సవాల్ ఛేదించలేక చాంపియన్ చతికిలపడింది -
ప్రతిభను వెలికితీస్తాం
న్యూఢిల్లీ: యువ ప్రతిభను వెలికితీయడమే తమ ప్యానెల్ లక్ష్యమని భారత మహిళల క్రికెట్ చీఫ్ సెలక్టర్ నీతూ డేవిడ్ అన్నారు. 16 ఏళ్ల వయస్సులోనే సత్తా చాటుతోన్న భారత క్రికెటర్ షఫాలీ వర్మలాంటి ప్లేయర్లను ప్రోత్సహిస్తామని ఆమె చెప్పారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్ని స్థాయిల క్రికెట్లో హిట్టింగ్, ఆట వేగం పెరిగిపోయిందని విశ్లేషించారు. యువ సత్తాతో పాటు అనుభవజ్ఞులు కూడిన జట్టుతో అద్భుతాలు చేయొచ్చని ఆమె వివరించారు. ‘ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో కూడా వేగం చాలా పెరిగింది. గతంలో ఇలా ఉండేది కాదు. ప్లేయర్లు దూకుడుగా ఆడుతున్నారు. వారి ఆలోచనా విధానం మారింది. అందుకు తగినట్లే షఫాలీలా ఆడే వారు కావాలి. మన దగ్గర చాలా మంది యువ ప్రతిభావంతులు ఉన్నారు. తగిన సమయంలో వారికి అవకాశాలు కల్పించాలి. వారితో పాటు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి అనుభవజ్ఞులు ఉంటేనే జట్టుకు సమతూకం వస్తుంది. వారు మెరుగ్గా ఆడినంత కాలం రిటైర్మెంట్ గురించి ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో వారికి బాగా తెలుసు’ అని ఆమె చెప్పుకొచ్చారు. మెగా టోర్నీల్లో తుదిపోరులో జట్టు వైఫల్యంపై దృష్టిసారిస్తామన్న ఆమె భారత్ ప్రపంచకప్ సాధించడమే అంతిమ లక్ష్యమని వ్యాఖ్యానించింది. -
నా శైలిని మార్చుకోను
మహిళల టి20 ప్రపంచకప్లో ఫైనల్ చేరడం కాకుండా ఈ టోర్నీ ద్వారా భారత జట్టుకు జరిగిన మరో మేలు ఒక సంచలన బ్యాటర్ వెలుగులోకి రావడం. 16 ఏళ్ల వయసులోనే దాదాపుగా ప్రపంచకప్ను గెలిపించాల్సిన పెను భారాన్ని ఆ అమ్మాయి మోసింది. దురదృష్టవశాత్తూ టైటిల్ నెగ్గకపోయినా మన మహిళల క్రికెట్ భవిష్యత్ భద్రంగా ఉందన్న ధైర్యం కలిగిందంటే ఆమె ఇచ్చిన ప్రదర్శనే కారణం. ఇదంతా హరియాణా టీనేజర్ షఫాలీ వర్మ గురించే. తన దూకుడైన ఆటతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఆమె కూడా మున్ముందు మరింతగా దూసుకుపోవాలని పట్టుదలగా ఉంది. సాక్షి క్రీడా విభాగం: టి20 ప్రపంచకప్లో షఫాలీ వర్మ 5 ఇన్నింగ్స్లలో కలిపి 158.25 స్ట్రయిక్ రేట్తో 163 పరుగులు చేసింది. ఫైనల్లో షఫాలీ వైఫల్యం భారత జట్టు తుది ఫలితంపై బలంగా పడిందంటే టోర్నీలో ఆమె ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఐపీఎల్ సమయంలో జరిగిన ఉమెన్ చాంపియన్స్ టి20 టోర్నీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షఫాలీ ఏడాది తిరిగేలోగా భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగింది. రాబోయే రోజుల్లోనూ తన సత్తా చాటాలని ఉత్సాహంగా ఉన్న షఫాలీ తన కెరీర్కు సంబంధించి వివిధ అంశాలపై మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే.... ప్రపంచ నంబర్వన్ ర్యాంక్పై... నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్ దాకా చేరడం సంతోషకరమే అయినా మున్ముందు కఠిన పరీక్షా సమయం ఉంది. అయితే నాకు ఎదురయ్యే ఎలాంటి సవాల్కైనా సిద్ధంగా ఉన్నా. రాబోయే రోజుల్లో భారత జట్టు ఎక్కువ మ్యాచ్లు గెలిచేలా ప్రయత్నించడం, వాటిలో నేనూ కీలక పాత్ర పోషించడమే ప్రస్తుతానికి నా దృష్టిలో లక్ష్యాలు. వరల్డ్కప్ ఫైనల్ ఫలితంపై... ఆ రోజు మాకు కలిసి రాలేదు. క్రీడల్లో గెలుపోటములు సహజమే. మేం ఒడిసిపట్టుకొని విజయాన్ని అందుకొనే మరిన్ని అవకాశాలు మున్ముందు వస్తాయి. ఫలితం వచ్చేశాక దానిని మనం మార్చలేం కానీ భవిష్యత్లో ఏం చేయాలో మా చేతుల్లోనే ఉంది. తన వ్యక్తిగత ప్రదర్శనపై... క్రీజ్లోకి అడుగు పెట్టాక వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి భారత జట్టును మెరుగైన స్థితిలో నిలపడమే నా బాధ్యత. ఎందరో ప్రముఖులు నా ప్రదర్శనను ప్రశంసించినప్పుడు గర్వంగా అనిపిస్తుంది. అయితే ట్రోఫీ గెలిచి ఉంటే ఇది మరింత అద్భుతంగా ఉండేది. జట్టులో వాతావరణంపై... చాలా బాగుంటుంది. సీనియర్లే మాట్లాడాలని, జూనియర్లు వారు చెప్పింది వినాలని అస్సలు ఉండదు. కెప్టెన్ హర్మన్ప్రీత్, స్మృతిలాంటి సీనియర్లయితే నన్ను మరింతగా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇక డబ్ల్యూవీ రామన్ సర్ రూపంలో అద్భుతమైన కోచ్ మాకు ఉన్నారు. ఎలాంటి సమస్య గురించి చెప్పినా ఆయన దగ్గర పరిష్కారం ఉంటుంది. తన మార్గనిర్దేశనంతో మనలో ఎనలేని ఆత్మవిశ్వాసం నింపగలరు. స్మృతితో ఓపెనింగ్పై... మేం అతిగా ఆలోచించం. ఇద్దరం సహజసిద్ధమైన ఆటనే ఆడేందుకు ప్రయత్నిస్తాం. కాస్త తేలికైన బంతి పడిందంటే చాలు చితక్కొట్టడమే. దానిపై మరో ఆలోచన లేదు. ఈ విషయంలో ఇద్దరం ఒకే తరహాలో ఆలోచిస్తాం. ఇక మంచి బంతులు వస్తే సింగిల్స్పై దృష్టి పెడతాం. సహజసిద్ధమైన ఆటను ఆడటంలో ఉండే సౌకర్యం మరోదాంట్లో రాదు. దానిని మార్చాలని ప్రయత్నిస్తే అది పని చేయదని నా నమ్మకం. కరోనాతో వచ్చిన విరామంపై... నా ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాను. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండటం కూడా ఎంతో కీలకం. దీనికి సంబంధించి స్పోర్ట్స్ సైకాలజిస్ట్ నాకు ఎంతో సహకరిస్తున్నారు. ఇక ఒక స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీతో ఒప్పందం కుదరడం వల్ల ఆర్థికపరంగా నేను ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఉండగలుగుతున్నా. ఎన్నో కష్టాలకోర్చి నేను ఈ స్థాయికి చేరడానికి కారణమైన మా నాన్నపై కూడా ఇప్పుడు ఆ భారం తగ్గింది. -
ఏ సీమల ఏమైతివో
గెలవలేక పోయినప్పుడు భూమి మీద మనమొక్కరిమే ఏకాకిలా మిగిలి పోయినట్లు అనిపిస్తుంది.. సృష్టి ప్రారంభపు ఏకకణ జీవిలా! చేజారిన గెలుపుతో పాటే అన్నీ మనల్ని వదిలేసి పోయినట్లూ ఉంటుంది. చూసుకోం గానీ, ఒకరు మాత్రం ఆ క్షణంలో మన చెయ్యి పట్టుకునే ఉంటారు. ఓటమి! మరి ఒంటరివాళ్లం ఎలా అవుతాం? ఎగరేస్తున్న గాలిపటం తెగిపోతే హటాత్తుగా ఏకాకులై పోతారు చిన్నపిల్లలు. ఇంట్లో వదిలేసి అమ్మ ఊరెళ్లిపోయినా కూడా.. ‘ఏ సీమల ఏమైతివో.. ఏకాకినీ నా ప్రియా..’ అని కృష్ణశాస్త్రిలా విలపిస్తారు. ఆయన్ది కవిత్వం. వీళ్లవి కన్నీళ్లు. అంతే తేడా. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాక చిన్నమ్మాయ్ షఫాలీ వర్మ దుఃఖానికి అంతేలేకుండా పోయింది. చిన్నమ్మాయే. ప్రపంచ కప్ ఫైనల్స్లో ఆడిన అతి చిన్నవయసు అమ్మాయి. పుట్టిన పదహారేళ్ల నలభై రోజులకే పోటీలోకి వచ్చేసింది. ‘షఫాలీని కన్నీళ్లతో చూడలేకపోతున్నా’ అన్నాడు బ్రెట్ లీ. తనకొస్తున్న కన్నీళ్లతో షఫాలీని చూడలేకపోయాడా, కన్నీళ్లతో ఉన్న షఫాలీని చూడలేకపోయాడా! షఫాలీ తనొక్కటే ఏడ్వడం కాదు. క్రీడాదిగ్గజాలకు, ఉద్ధండులకూ ఏడుపులాంటి ఫీలింగ్ని తెప్పించింది. ఒకప్పటి ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ. క్యాచ్ మిస్ అయితే ఎలా ఉంటుందో అతడికి తెలియని బాధ కాదు. క్యాచ్ మిస్ అయిందన్నది టీమ్ పడే బాధ అయితే.. ‘క్యాచ్ని మిస్ చేశానే’ అన్నది ఆ క్యాచ్ పట్టలేకపోయిన వారి బాధ. ఫైనల్స్లో కీలకమైన అలీసా హీలీ క్యాచ్ని మిస్ చేసింది షఫాలీ. అప్పట్నుంచే ఏకాకి అయిపోయింది. తను జారవిడిచింది క్యాచ్ని కాదు, కప్పుని. ఆటకు కనికరం ఉండదు. బ్రెట్లీలా ‘ఓ మై షఫాలీ’ అని సానుభూతి పడదు. కన్నీళ్లు పెట్టుకుంటే వెంటనే పెద్ద వర్షాన్ని కురిపించి, ఆ వర్షం నీళ్లలో కన్నీళ్లను కనబడనీయకుండా చేయదు. తన పనిలో తను ఉంటుంది. వెంటనే గెలిచినవాళ్ల దగ్గరకు వెళ్లిపోయి మెరుస్తున్న కప్పులో తన ముఖం చూసుకుని జుట్టు సవరించుకుంటుంది.. తన జట్టేదో గెలిచినట్లు, తనే గెలిపించినట్లు! అలాంటిది.. ఓడిపోయిన జట్టులోని షఫాలీ కన్నీళ్లను ఎందుకు పట్టించుకుంటుంది? ‘చిన్న పిల్లవు కదా, నెక్స్ట్ టైమ్ బెటర్ లక్’ అంటూ ముంగురుల్ని వేళ్లతో అలా అలా అనేసి ఎందుకు వెళుతుంది? ఆశలు పెట్టుకుంది షఫాలీ.. అందుకొచ్చిన ఏడుపు అది. ‘ఆశలు రాలి ధూళిపడినప్పుడు.. గుండెలు చీల్చు వేదనావేశము బ్రేల్చినప్పుడు.. వివేకము గోల్పడి సల్పినట్టి ఆక్రోశపు రక్త బిందువులతో..’ మేఘసందేశాన్ని రచియించాడు కృష్ణశాస్త్రి. ఈ అమ్మాయి కళ్లు మేఘాలై, ఓటమి వేదనను వర్షించాయి. అనుకుంటాం.. మన ఒంట్లో ఊపిరనేది ఒకటి ఉంటుందని, అందుకని జీవించి ఉంటాం అని. ఊపిరి కాదు ఉండేది. ఆశ. ఆశే ఊపిరికైనా ఆయువు. ఫైనల్స్లో తొలి ఓవర్లోనే రెండు పరుగులకే షఫాలీ ఔట్ అయింది! ఆయువు అవిరై కళ్లల్లోకి ఉబికి వచ్చేసింది. పిచ్, టీమ్, మెల్బోర్న్ మైదానం.. ఏవీ కనిపించడం లేదు. అంతా అలికేసినట్లున్న ఒకటే బ్లర్ పిక్చర్. ఓటమి! షఫాలీ మీద హోప్స్ పెట్టుకుంది భారత జట్టు. షఫాలీ ఉందని హోప్స్ వదులుకుంది ఆస్ట్రేలియా జట్టు. కప్పు కోసం పోటీ పడుతున్న రెండు జట్లకూ షెఫాలీ ముఖ్యం. షఫాలీని నిలబెట్టుకోవడం కోసం టీమ్ ఇండియా, షఫాలీని పడగొట్టడం కోసం టీమ్ ఆస్ట్రేలియా. గెలిస్తే ప్రపంచ కప్పులో భారత మహిళల తొలి విజయం. భారత్ను ఓడిస్తే ప్రపంచ కప్పులో ఆస్ట్రేలియాకు ఐదవ విజయం. అసలు ఫైనల్స్కు ముందే ఆస్ట్రేలియా జట్టుకు టార్గెట్ అయింది షెఫాలీ. ‘ఐ జస్ట్ హేట్ ప్లేయింగ్ ఇండియా.. దే హ్యావ్ గాట్ ద ఉడ్ ఓవర్ మి’ అని అంది మెగాన్ షూట్. ఆస్ట్రేలియా జట్టులో ఫాస్ట్ బౌలర్ తను. ‘గాడ్ ద ఉడ్’ అనే మాట పూర్తిగా ఆస్ట్రేలియా వాళ్లది. ‘ఎక్కడం’ అని అర్థం. ట్రై సీరీస్లో షఫాలీ తన సిక్సర్తో ఆమెను ఎక్కేసిందట. అది గుర్తుంచుకుంది షూట్. బలమైనవాళ్లు కూడా గుర్తుపెట్టుకునేంత షాట్ కొట్టిందన్నమాట షఫాలీ! క్రీడాకారులలో, చిన్నపిల్లల్లో ప్రతీకారేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. పైగా షఫాలీ క్రీడాకారిణి అయిన చిన్నపిల్ల. ఫైనల్స్లో మళ్లీ సిక్సర్లు కొట్టి షూట్ నోటిని ‘ఆ..’ అని తెరిపించాలని కూడా ఆమె అనుకుని ఉండొచ్చు. అది సాధ్యం కాలేదు. తన జట్టును గెలిపించాలని తపించి ఉండొచ్చు. అది సాధ్యం కాలేదు. తొమ్మిదేళ్ల వయసులో.. అబ్బాయిలు మాత్రమే ఆడే అకాడమీలో తనను చేర్పించడానికి అబ్బాయిలా తనకు క్రాఫ్ చేయించి సీటు సంపాదించిన తండ్రికి.. హర్యానా నుంచి ఆస్ట్రేలియా వచ్చే ముందు.. ‘నాన్నా.. కప్పుతో కనిపిస్తాం, చూస్తుండు’ అని షఫాలీ చెప్పే ఉండొచ్చు. అదీ సాధ్యం కాలేదు. సాధ్యం కాలేదూ అంటే ప్రయత్నలోపం కాదని తెలుసుకోడానికి షెఫాలీ మరికొన్ని ఆటలు ఆడాలి. దక్కని గెలుపు మిగిల్చి వెళ్లిన ఒంటరితనాన్ని పోగొట్టి అక్కున చేర్చుకునే మైదానాలు, వాటిలో ఆడవలసిన ఆటలు ఇంకా ఎన్నిలేవు ఈ చిన్నమ్మాయ్కి. -
షఫాలీ చేజారిన టాప్ ర్యాంక్
దుబాయ్: టి20 వరల్డ్ కప్ ఫైనల్లో వైఫల్యం భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ ర్యాంకింగ్పై ప్రభావం చూపింది. సోమవారం విడుదలైన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్లో 16 ఏళ్ల షఫాలీ వర్మ టాప్ ర్యాంక్ నుంచి పడిపోయి 744 రేటింగ్ పాయింట్లతో మూడో ర్యాంక్కు చేరుకుంది. టి20 ప్రపంచకప్లో లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక షఫాలీ ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంది. అయితే ఫైనల్లో షఫాలీ కేవలం రెండు పరుగులు చేసి అవుటవ్వడంతో ఆమె ర్యాంక్ పడిపోయింది. ఫైనల్లో అజేయంగా 78 పరుగులు చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ బెథ్ మూనీ రెండు స్థానాలు పురోగతి సాధించి 762 ర్యాంకింగ్ పాయింట్లతో కొత్త ప్రపంచ నంబర్వన్గా అవతరించింది. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ 750 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్లో కొనసాగుతోంది. భారత్కే చెందిన స్మృతి మంధాన ఏడో ర్యాంక్లో, జెమీమా రోడ్రిగ్స్ తొమ్మిదో ర్యాంక్లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, రాధా యాదవ్, పూనమ్ యాదవ్ వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది ర్యాంక్ల్లో కొనసాగుతున్నారు. -
షఫాలీని అలా చూడటం కష్టమైంది: బ్రెట్ లీ
మెల్బోర్న్: టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు చివరి మెట్టుపై బోల్తా పడింది. లీగ్ దశలో అప్రతిహతవిజయాలతో దూసుకపోయిన హర్మన్ సేన.. ఫైనల్ పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది. లీగ్ దశలో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత జట్టు.. టైటిల్ పోరులో అట్టర్ ఫ్లాఫ్ షోతో నిరుత్సాహపరిచింది. ముఖ్యంగా లీగ్ దశలో బ్యాటింగ్ భారాన్ని మోసిన యువ సంచలనం షఫాలీ వర్మ తుది పోరులో చేతులెత్తేసింది. ఈ క్రమంలో తను ఔటైన తర్వాత, ఓటమి తర్వాత షఫాలీ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే సారథి హర్మన్ప్రీత్ కౌర్, సహచర క్రికెటర్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ వెక్కివెక్కి ఏడ్వసాగింది. (మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ) ఇది సహచర క్రీడాకారిణులతో పాటు ప్రపంచ క్రికెట్ను కూడా కదిలించింది. దీనిపై ఆసీస్ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ.. ఐసీసీకి రాసిన తన కాలమ్లో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘ షఫాలీ ఏడ్వడం నాకు బాధనిపించింది. మ్యాచ్ ముగిసిపోయాక ఆమె కన్నీట పర్యంతం కావడం నాకు చాలా కష్టంగా అనిపింది. కానీ గర్వించదగ్గ క్రికెటర్. ఆస్ట్రేలియాలో ఆమె ప్రదర్శన అద్భుతంగా సాగింది. తొలి టోర్నమెంట్ ఆడటానికి ఇక్కడకు వచ్చిన షఫాలీ తన టాలెంట్తో ఆకట్టుకున్నారు. మానసికంగా ఆమె చాలా ధృఢంగా అనిపించారు. ఇక్కడ నుంచి ఆమె మరింత పరిణితి సాధిస్తుందని అనుకుంటున్నా. ఈ టోర్నమెంట్లో సాధించిన అనుభవంతో ఆమె మరింత రాటుదేలడం ఖాయం. ఆస్ట్రేలియాలో ఆడే తదుపరి టోర్నీల్లో ఆమె చేసే భారీ స్కోర్లు ఎవ్వర్నీ ఆశ్చర్యపరచకపోవచ్చు. సానుకూల ధోరణితో ముందుకు సాగుతుందనే అనుకుంటున్నా. ఇది భారత్ మహిళలకు తీవ్ర నిరాశను మిగిల్చిన రాత్రి. కానీ వారు మరింత ఆశావాహ ధృక్పథంతో రాటుదేలతారు. దీంతో వారు క్రికెట్ ఏమీ ముగిసిపోలేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అనుకోండి’ అని బ్రెట్ లీ రాసుకొచ్చాడు. (ఐసీసీ అత్యుత్తమ వరల్డ్కప్ జట్టు ఇదే..) -
ఐసీసీ అత్యుత్తమ వరల్డ్కప్ జట్టు ఇదే..
దుబాయ్: మహిళల టీ20 వరల్డ్కప్ ట్రోఫీని ఆసీస్ కైవసం చేసుకోగా, భారత్ రన్నరప్గా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆసీస్ మరోసారి కప్ను కైవసం చేసుకుని ఐదోసారి విజేతగా నిలిచింది. దీనిలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తమ అత్యుత్తమ వరల్డ్కప్ టోర్నమెంట్ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది వుమెన్ క్రికెటర్లను ఎంపిక చేసింది. ఈ జట్టుకు ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ను కెప్టెన్గా ఎంపిక చేసిన ఐసీసీ.. భారత్ నుంచి ఇద్దరికి మాత్రమే చోటు కల్పించింది.(మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ) ఇందులో స్పిన్నర్ పూనమ్ యాదవ్ కు ఐసీసీ ఎలెవన్ జాబితాలో చోటు దక్కగా, 12వ క్రీడాకారిణిగా షెఫాలీ వర్మను ఎంపిక చేసుకుంది. ప్రధానంగా వరల్డ్కప్ గెలిచిన ఆసీస్ జట్టు నుంచి ఐదుగురు క్రికెటర్లకు తమ జట్టులో చోటిచ్చిన ఐసీసీ.. ఇంగ్లండ్ నుంచి నలుగుర్నీ తీసుకుంది. దక్షిణాఫ్రికా జట్టు నుంచి ఒక క్రీడాకారిణికి మాత్రమే అవకాశం కల్పించింది. ఐసీసీ వరల్డ్కప్ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇదే.. మెగ్ లానింగ్(కెప్టెన్)(ఆస్ట్రేలియా), అలెసా హీలీ(వికెట్ కీపర్)(ఆస్ట్రేలియా), బెత్ మూనీ(ఆస్ట్రేలియా), నాట్ స్కీవర్(ఇంగ్లండ్), హీథర్ నైట్(ఇంగ్లండ్), లౌరా వాల్వార్డ్(దక్షిణాఫ్రికా), జెస్ జొనాసేన్(ఆస్ట్రేలియా), సోఫీ ఎక్సలీస్టోన్(ఇంగ్లండ్), అన్యా ష్రబ్సోల్(ఇంగ్లండ్), మెగాన్ స్కట్(ఆస్ట్రేలియా), పూనమ్ యాదవ్(భారత్), షెఫాలీ వర్మ(భారత్, 12వ మహిళ) Introducing your Women's #T20WorldCup 2020 Team of the Tournament 🌟 pic.twitter.com/Eb4wQUc7Ls — T20 World Cup (@T20WorldCup) March 9, 2020 -
కన్నీళ్లు కనిపించనీయవద్దు!
సాక్షి క్రీడా విభాగం: మీకు తెలిసిన 16 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? శ్రద్ధగా చదువుకుంటూనో లేక సరదాగా ఆటపాటల్లోనో, ఇంకా చెప్పాలంటే ఏ టిక్టాక్లోనో బిజీగా ఉంటుంది. కానీ షఫాలీ వర్మ దేశం మొత్తం ఆశలను మోస్తూ 86 వేలకు పైగా జనం మధ్యలో మైదానంలోకి దిగి ‘గార్డ్’ తీసుకుంది. గత మ్యాచ్ల తరహాలో ఈసారి ఆమె సఫలం కాలేదు. అంతకుముందు సునాయాస క్యాచ్ను వదిలేసి ప్రత్యర్థికి అవకాశం ఇచ్చిన అపరాధ భావం కూడా వెంటాడి ఉంటుంది. అందుకే ఆట ముగిశాక ఆ టీనేజర్ ఓటమి బాధను తట్టుకోలేకపోయింది. కన్నీళ్లపర్యంతమైన షఫాలీని ఓదార్చడం సహచరుల వల్ల కాలేదు. అయితే ఈ పరాజయం ఆమె ఒక్కదానిది కాదు. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ఆరు నెలల్లో షఫాలీ ఆశించిన దానికంటే అసాధారణ ప్రదర్శన కనబర్చింది. అసలు షఫాలీ ఆట లేకుండా మన టీమ్ తుది పోరు వరకు చేరేదా అనేది కూడా సందేహమే! ఎందుకంటే 5 ఇన్నింగ్స్లలో కలిపి షఫాలీ 163 పరుగులు చేస్తే... జట్టులో టాప్–3 బ్యాటర్లు అనదగ్గ స్మృతి, హర్మన్ కౌర్, జెమీమా కలిసి 14 ఇన్నింగ్స్లలో చేసిన పరుగులు 164 మాత్రమే. ►ముఖ్యంగా గత కొంత కాలంగా హర్మన్, స్మృతి ఈ ఫార్మాట్లో అన్నీ తామే అయి జట్టును నడిపిస్తూ వచ్చారు. మిథాలీ రాజ్ను అసాధారణ పరిస్థితుల్లో పక్కకు నెట్టేసిన తర్వాత వీరిద్దరే కీలకంగా మారారు. పైగా బిగ్బాష్ లీగ్, కియా సూపర్ లీగ్లలో ఆడిన అనుభవంతో వరల్డ్కప్లో వీరిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఐదు ఇన్నింగ్స్లలో నాలుగు సార్లు ‘సింగిల్ డిజిట్’కే పరిమితమైన హర్మన్కు పుట్టిన రోజు చేదు అనుభవాన్ని మిగిల్చింది. స్మృతి ఒక్క మ్యాచ్లోనూ 20 దాటలేకపోయింది. (చదవండి: మన వనిత... పరాజిత) ►షఫాలీకి ముందు సంచలన టీనేజర్గా వెలుగులోకి వచ్చిన జెమీమాకు ఆటపై శ్రద్ధ తగ్గినట్లుంది! బంగ్లాదేశ్పై మాత్రమే ఫర్వాలేదనిపించిన ఆమె ఫైనల్లో ఆడిన నిర్లక్ష్యపు షాట్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ముగ్గురూ విఫలమైన చోట విశ్వ విజేతగా నిలవాలనుకోవడం అత్యాశే అవుతుందేమో. ►బౌలింగ్లో భారత్ పూర్తిగా స్పిన్ బలగాన్నే నమ్ముకుంది. ప్లాన్ ‘బి’ లేకుండా మెగా టోర్నీలో ఒకే తరహా వ్యూహానికి కట్టుబడటం ఫైనల్లో నష్టం కలిగించింది. ఎంసీజీలాంటి ఫ్లాట్పిచ్పై అది పని చేయలేదు. మన పేస్ మరీ బలహీనంగా ఉండటం కూడా సమస్యగా మారింది. ►మ్యాచ్ ఫీజుల పెంపు, కాంట్రాక్ట్లు, అలవెన్స్లు, ఇతర సౌకర్యాలు అత్యుత్తమ ప్రదర్శనకు హామీ ఇవ్వలేవు. ఇకపై సీరియస్గా మహిళల జట్టు ఆటను కూడా సమీక్షించాల్సిన అవసరం ఉంది. మహిళల క్రికెట్ను ముందుకు తీసుకెళ్లాలంటే ఫైనల్లో తప్పనిసరి గెలవాలని ఏమీ లేదు. ఇప్పుడు ఉన్న జోష్ను, జోరును కొనసాగించేందుకు బీసీసీఐకి ఇదే సరైన సమయం. ఎన్నో కష్టాలు దాటి ఇక్కడి వరకు వచ్చాననే కథలకు ఇక గుడ్బై చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మహిళల క్రికెట్కు కూడా ప్రపంచ స్థాయి అత్యుత్తమ సౌకర్యాలు ఉన్నాయి. ఆసీస్ విజయానికి కారణంగా చెబుతున్న బిగ్బాష్ లీగ్ తరహాలో ఐపీఎల్ను నిర్వహించడం అంత సులువు కాదు. సీనియర్ స్థాయిలో కనీసం 40 మంది అగ్రశ్రేణి ప్లేయర్లు కూడా మనకు అందుబాటులో లేరు. అయితే ఇకపై ఎక్కువ విరామం లేకుండా దేశవాళీలో కూడా వీలైనన్ని ఎక్కువ టోర్నీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. షఫాలీ, రిచా ఘోష్లాంటి ప్లేయర్లు చాలెంజర్ ట్రోఫీ నుంచే వెలుగులోకి వచ్చారు. చివరగా... తాజా పరాజయం బాధించవచ్చు. కానీ భవిష్యత్తులో మరింత ఎదిగేందుకు ఈ టోర్నీ ప్రదర్శన స్ఫూర్తిగా నిలవాలి తప్ప నిరాశగా మారిపోకూడదు. ఫైనల్ తర్వాత దిగ్గజ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి చెప్పినట్లు... ‘కన్నీళ్లను ఎక్కడా బయటపడనీయవద్దు. ఓడినప్పుడైతే అసలే వద్దు’! -
ప్రపంచకప్ ఓటమి: షఫాలీ కంటతడి
మెల్బోర్న్: ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు.. అంతకుమించిన ఆకాంక్షల మధ్య టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు చివరి మెట్టుపై బోల్తా పడింది. లీగ్ దశలో అప్రతిహతవిజయాలతో దూసుకపోయిన హర్మన్ సేన.. ఫైనల్ పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది. లీగ్ దశలో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత జట్టు.. టైటిల్ పోరులో అట్టర్ ఫ్లాఫ్ షోతో నిరుత్సాహపరిచింది. ముఖ్యంగా లీగ్ దశలో బ్యాటింగ్ భారాన్ని మోసిన యువ సంచలనం షఫాలీ వర్మ తుది పోరులో చేతులెత్తేసింది. ఆస్ట్రేలియా భారీ లక్ష్యం నిర్దేశించినప్పటికీ షఫాలీ రూపంలో అందరిలోనూ ఓ ధైర్యం ఏర్పడింది. అభిమానులతో పాటు టీమ్ మేనేజ్మెంట్ సైతం పవర్ ప్లే ముగిసే వరకైన హరియాణ క్రికెటర్ క్రీజులో ఉండాలని కోరుకుంది. కానీ తొలి ఓవర్లోనే ఊహించని విధంగా అవుటై తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. షఫాలీ అవుటవ్వడంతోనే టీమిండియా ఓటమికి పునాది రాయి పడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇక అవుటైన తీరు పట్ల ఈ యువ క్రికెటర్ తీవ్ర అసహనానికి గురై భారంగా క్రీజుల వదిలి వెళ్లింది. ఈ క్రమంలో తను ఔటైన తర్వాత, ఓటమి తర్వాత షఫాలీ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే సారథి హర్మన్ప్రీత్ కౌర్, సహచర క్రికెటర్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ వెక్కివెక్కి ఏడ్వసాగింది. ప్రస్తుతం షఫాలీ కన్నీరు పెట్టుకున్న ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆమెకు బాసటగా నిలిచారు. ‘కేవలం పదహారేళ్ల వయసులోనే ప్రపంచ శ్రేణి బౌలర్లను గడగడలాడించావు. నీ ప్రతిభకు అనుభవం తోడైతే టీమిండియాకు మరెన్నో చిరస్మరణీయ విజయాలను అందిస్తావు. టైటిల్ గెలవకున్నా మా హృదయాలను గెలుచుకున్నారు’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. It's ok Shafali verma, you've achieved more than what a 16 year old can do 🔥🔥 don't be sad 😭😭 We are proud you shafali #T20WorldCup #INDvAUS #TeamIndia #T20WorldCupFinal pic.twitter.com/smd68dEp5s — Official Vikash Kumar Verma (@Officialverma5) March 8, 2020 చదవండి: ఈసారి కూడా చాంపియన్ ఆస్ట్రేలియానే షఫాలీ వర్మ అరుదైన ఘనత -
పెవిలియన్కు క్యూ.. సన్నగిల్లిన ఆశలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 30 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభమైన మూడో బంతికే షఫాలీ వర్మ(2) పెవిలియన్ బాట పట్టింది. మెగాన్ షూట్ వేసిన బంతిని అంచనా వేడంలో విఫమైన షఫాలీ కీపర్ క్యాచ్ ఔట్ వెనుదిరిగారు. ఈ క్రమంలో అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన తానియా భాటియా (2 రిటైర్డ్ హర్ట్) గాయం కారణంగా మైదానాన్ని వీడింది. ఈ సమయంలో జట్టను ఆదుకుంటాదనుకున్న జెమీమా రోడ్రిగ్స్ (0) అత్యంత నిర్లక్ష్యపు షాట్తో వికెట్ పారేసుకుంది. దీంతో 8 పరుగులకే రెండు కీలక వికెట్లను టీమిండియా చేజార్చుకుంది. అయితే సీనియర్ బ్యాటర్ స్మృతి మంధాన రెండు ఫోర్లతో ఆశలు రేకెత్తించింది. అయితే సోఫియా ఊరిస్తూ వేసిన బంతికి మంధాన (11) బోల్తాపడింది. దీంతో స్టార్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టి టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లారు. అయితే కీలక సమయంలో ఆదుకుంటాదని భావించిన సారథి హర్మన్ (4) కూడా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఇప్పటికే గెలుపుపై ఆశలు సన్నగిల్లినప్పటికీ.. మిగతా బ్యాటర్లు ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. -
వరల్డ్కప్ ఫైనల్: ఓపెనర్లిద్దరికీ చెరో లైఫ్!
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియాకు ఆశించిన శుభారంభం లభించలేదు. చెత్త ఫీల్డింగ్ కారణంగా టీమిండియా ప్లేయర్స్ ఆసీస్ ఓపెనర్లిద్దరికీ అవకాశం ఇచ్చారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే దొరికిన అవకాశంతో అలీసా హీలీ, బెత్ మూనీలు రెచ్చిపోతున్నారు. ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో అలీసా హీలీ, బెత్ మూనీలు బ్యాటింగ్కు దిగారు. దీప్తి శర్మ వేసిన తొలి ఓవర్లో హీలీ అటాకింగ్కు దిగింది. వరుస ఫోర్లతో రెచ్చిపోయింది. అయితే తొలి ఓవర్ల ఐదో బంతికి హీలీ ఇచ్చిన క్యాచ్ను షఫాలీ వర్మ జారవిడిచింది. దీంతో హీలీకి తొలి అవకాశం దక్కింది. హీలి ఇచ్చిన క్యాచ్ నేలపాలు చేసిని సమయంలో ఆమె చెసినవి 9 పరుగులు మాత్రమే. ఇక టీమిండియా మరో చెత్త ఫీల్డింగ్ కారణంగా మరో ఓపెనర్ బెత్ మూనికి కూడా లైఫ్ లభించింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మూనీ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను రాజేశ్వరి గైక్వాడ్ నేలపాలు చేసింది. ఈ సమయంలో మూని స్కోర్ 4 పరుగులు మాత్రమే. ఇక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఓ వైపు బౌండరీలు బాదుతూనే మరోవైపు చకచకా సింగ్స్లు తీస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. -
వన్పవర్మెంట్
ఆట అంటేనే పవర్! షాట్ కొట్టడానికి పవర్. క్యాచ్ పట్టడానికి పవర్. షూట్ చెయ్యడానికి పవర్. లాగి వదలడానికి పవర్. పావులు కదపడానికి పవర్. పంచ్ ఇవ్వడానికి పవర్. స్ట్రయికర్ని విసరడానికి పవర్. అన్నిటా ఎంపవర్మెంట్ని సాధించిన మహిళలు ఆటల్లోనూ తమ పవర్ చూపిస్తున్నారు. నెంబర్ వన్ స్థానంతో విజయానికే వన్పవర్మెంట్ తెస్తున్నారు. తల్లి కలనునిజం చేయాలని! సైనా (బ్యాడ్మింటన్) పురుషుల బ్యాడ్మింటన్లో భారత స్టార్ ఆటగాళ్లుగా వెలుగొందిన వారు తెరమరుగై... భారత బ్యాడ్మింటన్ ఉనికి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో తన విజయాలతో కొత్త ఉత్తేజాన్ని తెచ్చింది సైనా నెహ్వాల్. 2008లో జూనియర్ ప్రపంచ చాంపియన్గా అవతరించి తన ముద్ర చాటుకున్నాక వరుస విజయాలు సాధిస్తూ భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చేసింది. హరియాణాలోని హిస్సార్లో జన్మించిన సైనా... తండ్రి హర్వీర్ సింగ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్కు బదిలీ కావడంతో భాగ్యనగరంలో స్థిరపడింది. సైనా తల్లిదండ్రులు హర్వీర్, ఉషా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులు. ఎనిమిదేళ్లకు రాకెట్ పట్టిన సైనా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్న తన తల్లి ఉషా కలను నిజం చేసింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తర్వాత సైనా అంతర్జాతీయస్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. 2015లో ప్రపంచ నంబర్వన్గా నిలిచింది. ఎంతోమంది అమ్మాయిలు ఈ ఆటను కెరీర్గా ఎంచుకునేందుకు ప్రేరణగా నిలిచింది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకొని! అపూర్వీ చండేలా (షూటింగ్) మహిళల షూటింగ్ క్రీడలో భారత్ నుంచి అంజలి భగవత్, సుమా షిరూర్, తేజస్విని సావంత్, హీనా సిద్ధూ తదితరులు అంతర్జాతీయస్థాయిలో మెరిశారు. వారి అడుగుజాడల్లోనే నడుస్తూ భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది అపూర్వీ చండేలా. జైపూర్కు చెందిన 27 ఏళ్ల అపూర్వీ తొలుత ఆటలకంటే చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టేది. కెరీర్లో స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకున్న అపూర్వీని 2008 బీజింగ్ ఒలింపిక్స్ మార్చేశాయి. షూటర్ అభినవ్ బింద్రా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో స్వర్ణం సాధించడం... ఆ తర్వాత బింద్రాకు లభించిన పేరు ప్రతిష్టలు అపూర్వీ మనసు మార్చేశాయి. బింద్రా స్ఫూర్తితో షూటింగ్ వైపు మళ్లిన అపూర్వీ 2012లో జాతీయ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించి భారత జట్టుకు ఎంపికైంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో పసిడి పతకం సాధించిన ఆమె... 2018 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో కాంస్యాలు గెలిచింది. ప్రపంచ చాంపియన్షిప్లో నాలుగో స్థానంలో నిలిచి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఇక 2019లో పసిడి పతకాల పంట పండించింది. మూడు ప్రపంచకప్లలో స్వర్ణాలు నెగ్గిన అపూర్వీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ నంబర్వన్గా నిలిచింది. మకుటంలేని మహరాణి! హంపి (చెస్) మేధో క్రీడ చదరంగంలో అమ్మాయిలు కూడా అద్భుతాలు చేయగలరని ఆంధ్రప్రదేశ్కు చెందిన 32 ఏళ్ల గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి నిరూపించింది. ఐదేళ్ల ప్రాయంలో తండ్రి అశోక్ ప్రోత్సాహంతో చెస్లో ఓనమాలు నేర్చుకున్న హంపి 1997లో అండర్–10 బాలికల ప్రపంచ చాంపియన్గా నిలిచింది. 1998లో అండర్–12... 2000లో అండర్–14 విభాగంలో ప్రపంచ టైటిల్ను సొంతం చేసుకుంది. 2002లో గ్రాండ్మాస్టర్ హోదా పొందిన హంపి 2006 దోహా ఆసియా క్రీడల్లో వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్కు స్వర్ణ పతకాలు అందించింది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు నెగ్గిన హంపి 2016లో తల్లి అయ్యాక రెండేళ్లపాటు ఆటకు విరామం చెప్పింది. 2018లో పునరాగమనం చేశాక... కొన్ని టోర్నీలలో నిరాశాజనక ఫలితాలు వచ్చినా 2019లో ‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి రెండు టోర్నీల్లో విజేతగా నిలిచింది. డిసెంబర్లో మాస్కోలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచి మహిళల విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ ప్లేయర్గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ టోర్నీలోనూ చాంపియన్గా నిలిచి కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్ను అందుకుంది. నాన్న స్వప్నాన్ని సాకారం చేస్తూ! షఫాలీ వర్మ (క్రికెట్) భారత్లో పురుషుల క్రికెట్తో పోలిస్తే మహిళల క్రికెట్కు ఆదరణ అంతంత మాత్రమే ఉన్నా... అవకాశం దొరికినపుడల్లా మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ వేదికపై అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. హరియాణాకు చెందిన 16 ఏళ్ల టీనేజర్ షఫాలీ వర్మ గతేడాది చివర్లో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. 15 ఏళ్లకే భారత్కు ప్రాతినిధ్యం వహించి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందిన షఫాలీ... గత నవంబర్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 49 బంతుల్లో 73 పరుగులు చేసింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో పిన్న వయస్సులో అర్ధ సెంచరీ చేసిన భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో 30 ఏళ్లుగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును ఆమె బద్దలు కొట్టింది. తన కూతురు ఏనాటికైనా భారత జట్టుకు ఆడాలని కలలు కన్న తండ్రి సంజీవ్ స్వప్నాన్ని షఫాలీ తొందరగానే నిజం చేసి చూపించింది. అంతేకాకుండా తన విధ్వంసకర ఆటతో తొలిసారి భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్లో ఫైనల్కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించింది. ఎన్నో...ఎన్నెన్నో! సానియా మీర్జా (టెన్నిస్) ప్రపంచ మహిళల టెన్నిస్ పటంలో సానియా మీర్జా పుణ్యమాని భారత్కు ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆరేళ్ల చిరుప్రాయంలో రాకెట్ పట్టిన సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా పర్యవేక్షణలో అంచెలంచెలుగా ఎదిగింది. 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో మూడో రౌండ్కు చేరిన సానియా... 2007లో సింగిల్స్లో కెరీర్ బెస్ట్ 27వ ర్యాంక్ సాధించింది. సానియా 2009లో మహేశ్ భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో... 2012లో మహేశ్ భూపతితో కలిసి ఫ్రెంచ్ ఓపెన్లో... 2014లో బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జతగా యూఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ సొంతం చేసుకుంది. గాయాల బారిన పడటంతో 2012లో సింగిల్స్కు గుడ్బై చెప్పి డబుల్స్పైనే దృష్టి సారించిన ఈ హైదరాబాదీ... స్విట్జర్లాండ్ మేటి క్రీడాకారిణి మార్టినా హింగిస్తో జతకట్టి గొప్ప విజయాలు సాధించింది. 2015 ఏప్రిల్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను దక్కించుకున్న ఆమె అదే ఏడాది హింగిస్తో జతగా వింబుల్డన్, యూఎస్ ఓపెన్... 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2018లో తల్లి అయిన సానియా రెండేళ్లపాటు ఆటకు దూరమైంది. ఈ ఏడాది మళ్లీ బరిలోకి దిగిన 33 ఏళ్ల సానియా హోబర్ట్ ఓపెన్ టోర్నీలో నదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి టైటిల్ నెగ్గి పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. అర్జున అవార్డు (2004), పద్మశ్రీ (2006), రాజీవ్గాంధీ ఖేల్రత్న (2015), పద్మభూషణ్ (2016) పురస్కారాలు అందుకున్న సానియా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రో–ఆసియా క్రీడలు కలిపి మొత్తం ఆరు స్వర్ణాలు సహా 14 పతకాలు సాధించింది. ‘పంచ్’ మే దమ్ హై మేరీకోమ్ (బాక్సింగ్) క్రీడాకారిణిగా, ముగ్గురు పిల్లల తల్లిగా, భార్యగా, కూతురుగా, పార్లమెంటేరియన్గా... ఇలా ఎన్నో బాధ్యతలు మోస్తూనే దాదాపు రెండు దశాబ్దాలుగా బాక్సింVŠ రింగ్లో తన పంచ్ పవర్ చాటుకుంటోంది మణిపూర్ మెరిక మేరీకోమ్. 37 ఏళ్ల మేరీకోమ్ భారత్లో మహిళల బాక్సింగ్కు ప్రతిరూపం. వేర్వేరు వెయిట్ కేటగిరీల్లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలువడంతోపాటు ఒలింపిక్స్లో, ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్లో ఇలా ప్రతి మెగా ఈవెంట్లో బరిలోకి దిగితే పతకంతో తిరిగొస్తూ ఎందరికో స్ఫూర్తి ప్రదాతలా నిలుస్తోంది. ‘అర్జున అవార్డు’.. ‘రాజీవ్గాంధీ ఖేల్రత్న’... ‘పద్మశ్రీ’.. ‘పద్మభూషణ్’.. ‘పద్మవిభూషణ్’.. ఇలా అన్ని అవార్డులు మేరీకోమ్ను వరించాయి. ఈ ఏడాది జూలై–ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి మేరీకోమ్ తన ఉజ్వల కెరీర్కు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలనుకుంటోంది. సరదాగా మొదలై! అపూర్వ (క్యారమ్) వేసవి సెలవుల్లోనే కాకుండా తీరిక దొరికినపుడల్లా క్యారమ్ బోర్డు ఆట ఆడిన వాళ్లు ఎందరో ఉంటారు. ఇంటి ఆటలోనూ విశ్వవిజేత కావొచ్చని హైదరాబాద్కు చెందిన ఎస్.అపూర్వ నిరూపించింది. ఒకవైపు భారత జీవితబీమా సంస్థ (ఎల్ఐసీ)లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్యారమ్లో ప్రపంచ చాంపియన్గా నిలిచి అపూర్వ అందరిచేతా శభాష్ అనిపించుకుంది. తన తండ్రి ఆయన మిత్రులతో సరదాగా క్యారమ్ ఆడుతున్నపుడు ఈ ఆటపట్ల ఆసక్తి పెంచుకున్న అపూర్వ ఆ తర్వాత ముందుకు దూసుకుపోయింది. 2004లో కొలంబోలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన అపూర్వ... 2016లో బర్మింగ్హమ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్షిప్లో ఏకంగా సింగిల్స్, డబుల్స్, టీమ్ విభాగాల్లో పసిడి పతకాలు సొంతం చేసుకుంది. ఆట ఏదైనా, వయస్సుతో నిమిత్తం లేకుండా పట్టుదలతో కృషి చేస్తే అద్భుతాలు చేయవచ్చని అపూర్వ నిరూపించింది. ఆటో డ్రైవర్ అమ్మాయి! దీపిక కుమారి (ఆర్చరీ) మహిళా విలువిద్య (ఆర్చరీ)లో భారత్ పేరు దశదిశలా వ్యాప్తి చెందేలా చేసిన క్రీడాకారిణి దీపిక కుమారి. జార్ఖండ్కు చెందిన 26 ఏళ్ల దీపికకు ఎలాంటి క్రీడా నేపథ్యం లేకపోయినా స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించింది. దీపిక తండ్రి శివనారాయణ్ మహతో ఆటో డ్రైవర్కాగా... తల్లి గీతా మహతో రాంచీ మెడికల్ కాలేజీలో నర్సుగా పని చేస్తున్నారు. చిన్న వయస్సులోనే ఆర్చరీపై ఆసక్తి పెంచుకున్న దీపికకు సరైన సామాగ్రి అందుబాటులో లేకపోయేది. అయినా ఆమె నిరాశ చెందలేదు. తమ ఊర్లోని మామిడి తోటల్లో మామిడి కాయలను గురి చూసి రాళ్లతో కొట్టేది. 2005లో ఖర్సావన్ పట్టణంలోని అర్జున్ ఆర్చరీ అకాడమీలో... కొన్నాళ్ల తర్వాత జమ్షెడ్పూర్లోని టాటా ఆర్చరీ అకాడమీలో దీపిక శిక్షణ తీసుకుంది. 2009లో 15 ఏళ్ల ప్రాయంలో అమెరికాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్లో దీపిక స్వర్ణ పతకాన్ని నెగింది. ఆ తర్వాత దీపిక వెనుదిరిగి చూడలేదు. 2010 కామన్వెల్త్ గేమ్స్లో దీపిక రికర్వ్ వ్యక్తిగత, మహిళల టీమ్ విభాగాల్లో భారత్కు స్వర్ణ పతకాలు అందించింది. 2012లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ప్రపంచకప్లో దీపిక స్వర్ణ పతకం సాధించడంతోపాటు ప్రపంచ నంబర్వన్గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఆర్చర్గా గుర్తింపు పొందింది. దీపిక ఓవరాల్గా ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 41 పతకాలు సొంతం చేసుకుంది. – కరణం నారాయణ -
షఫాలీ వర్మ అరుదైన ఘనత
న్యూఢిల్లీ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన యువ సంచలనం, డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ అరుదైన ఛాన్స్ కొట్టేసింది. అనతి కాలంలోనే అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న షఫాలీ వర్మను ప్రముఖ శీతల పానీయాల సంస్థ 'పెప్సీ' తమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. టీ 20 ప్రపంచకప్ ప్రదర్శనతో షఫాలీ వర్మ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోవడంతో పలు కంపెనీలు ఆమెకు కోట్లు కుమ్మరించడానికి సిద్ధమయ్యాయి. (ఆసీస్ పేసర్కు షఫాలీ భయం!) ఈ నేపథ్యంలోనే షఫాలీ వర్మతో పెప్సీ ఒక సంవత్సరం పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రముఖ బ్రాండ్తో షఫాలీ కి ఇదే తొలి ఒప్పందం.ఒక ఐకానిక్ బ్రాండ్ పెప్సీతో ఒప్పందం చేసుకోవడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. మంచి పేరున్న బ్రాండ్ 'పెప్సీ'తో అనుబంధం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో అర్ధం కావట్లేదు. మహిళలు తమ జీవితానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇది మా కాళ్లపై మేం నిలబడాల్సిన తరుణం' అని షఫాలీ వర్మ అరుదైన ఘనతవర్మ పేర్కొంది. ప్రపంచకప్ ఫైనల్లోనూ షఫాలీ తన ఫామ్ను కొనసాగిస్తూ భారత్ను విశ్వవిజేతగా నిలపాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా మార్చి 8(ఆదివారం) జరిగే పైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తుది పోరుకు సిద్ధమైంది. గతేడాది సెప్టెంబర్ నెలలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 16 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం షఫాలీ వర్మ ఆరు నెలల కాలంలోనే ప్రపంచ నంబర్వన్గా అవతరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచకప్లో మూడు మ్యాచుల్లో 11 బౌండరీలు, 8 సిక్స్లతో మొత్తంగా 114 పరుగులు చేసి 172.7 స్టైక్రేట్ను నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక టీ20 మ్యాచ్లలో 146.96 స్ట్రైక్ రేట్తో 485 పరుగులు చేసింది. (నంబర్ 1 బ్యాటర్గా షఫాలీ.. ఐసీసీ స్పెషల్ ట్వీట్!) -
ఆసీస్ పేసర్కు షఫాలీ భయం!
మెల్బోర్న్: మహిళల టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక్కడ ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్ అయితే, భారత్ తొలిసారి ఈ మెగా టోర్నీలో ఫైనల్కు చేరింది. దాంతో పోరు ఆసక్తికరమే. కాకపోతే మహిళల టీ20 వరల్డ్కప్లో ఆరంభపు మ్యాచ్ భారత్-ఆసీస్ జట్ల మధ్య జరిగితే, ముగింపు మ్యాచ్ కూడా వీరి మధ్య జరగడం ఇక్కడ విశేషం. కాగా, భారత్తో ఫైనల్లో తలపడటాన్ని ఒకింత ద్వేషిస్తున్నట్లు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మెగాన్ స్కట్ పేర్కొన్నారు. ఇందుకు భారత మహిళా ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతీ మంధానాలే కారణమట. వీరిద్దరికి బౌలింగ్ వేయాలంటే తనకు ఒక రకమైన భయం ఏర్పడిందని మెగాన్ స్కట్ స్పష్టం చేశారు. (ఆసీస్ ఆరోసారి...) ‘ భారత మహిళల జట్టుతో ఫైనల్స్ ఆడటాన్ని అసహ్యించుకుంటున్నా. ఎందుకంటే షఫాలీ, స్మృతీల బ్యాటింగ్ నాకు వణుకు పుట్టిస్తోంది. ప్రధానంగా షఫాలీ ఎఫెన్స్కు నా వద్ద సమాధానం ఉండకపోవచ్చు. స్మృతీ, షఫాలీలు భారత జట్టుకు వెన్నుముక. వారు బలమైన షాట్లతో దాడి చేస్తున్నారు. ఈ వరల్డ్కప్కు ముందు జరిగిన ముక్కోణపు సిరీస్లో షఫాలీ కొట్టిన సిక్స్.. నా కెరీర్లో నేను చూసిన అత్యుత్తమ సిక్స్. ప్రత్యేకంగా వారికి నేను బౌలింగ్ చేయడం అంత మంచి కాదేమో. ఆ జోడికి నా బౌలింగ్ కూడా సరైన మ్యాచింగ్ కూడా కాకపోవచ్చు. ప్రత్యేకంగా చెప్పాలంటే పవర్ ప్లేలో వారికి నేను జోడిని కాను. వారి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా’ అని మెగాన్ స్కట్ పేర్కొన్నారు. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో స్కట్ రెండు వికెట్లు సాధించడంతో పాటు 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే టీమిండియాతో జరుగనున్న ఫైనల్లో మంధాన, షఫాలీలకు కచ్చితమైన బౌలింగ్ వేయకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే ఆందోళనలో ఉన్నారు మెగాన్. ఇందుకు కారణం ఈ టోర్నీ ఆరంభపు మ్యాచ్. ఆ మ్యాచ్లో ఆసీస్పై భారత్ విజయం సాధించి సిరీస్ను ఘనంగా ఆరంభించింది. అయితే ఆసీస్ మ్యాచ్లో స్కట్ వేసిన తన వ్యక్తిగత తొలి ఓవర్లో షఫాలీ ధాటికి బెంబేలెత్తిపోయింది. ఆ ఓవర్లో షఫాలీ నాలుగు ఫోర్లు కొట్టి మెగాన్కు చుక్కలు చూపించింది. ఇదే భయం ఇప్పుడు ఆమెను మరింత కలవర పెడుతున్నట్లు కనబడుతోంది. (తొలిసారి ఫైనల్లో భారత మహిళలు)