siege
-
‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
కామారెడ్డి క్రైం: పుట్టబోయే బిడ్డను వదిలించుకోవాలనుకున్న ఓ గర్భిణి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా డెలివరీ చేయడంతోపాటు నవజాత శిశువును విక్రయించిన ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బట్టబయలైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి వివరాలు వెల్లడించారు. పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో.. జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు కామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేశ్తో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సాన్నిహిత్యం ఉండటంతో ఆ కారణంగా పెళ్లి సమయానికే ఆమె గర్భం దాలి్చంది. పెళ్లయిన నెల రోజులకు భర్తకు ఈ విషయం తెలియడంతో నాటి నుంచి లావణ్య పుట్టింట్లోనే ఉంటోంది. పుట్టబోయే బిడ్డ తనతో లేకపోతే భర్త మళ్లీ చేరదీస్తాడని భావించిన లావణ్య.. ఏప్రిల్లో శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సమని్వత ఆస్పత్రిని సంప్రదించింది. గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న వైద్యుడు ఇట్టం ప్రవీణ్కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు ఈ ఆస్పత్రిని నడుపుతున్నారు. అందుకు అంగీకరించిన వారు మొత్తం రూ. 2 లక్షలకు లావణ్య, ఆమె కుటుంబ సభ్యులతో బేరం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కాస్త నగదు, ఫోన్ పే ద్వారా రూ. లక్షా 30 వేలను లావణ్య కుటుంబ సభ్యులు చెల్లించారు.ఏప్రిల్ 11న అర్ధరాత్రి లావణ్యకు డెలివరీ చేయగా ఆడపిల్లకు జన్మనిచి్చంది. అప్పటికే రాజంపేటకు చెందిన ఇట్టం బాలకృష్ణ ద్వారా అతని బంధువైన సిరిసిల్లకు చెందిన దేవయ్యతో బిడ్డను కొనే వారితో డాక్టర్, ఆయన తండ్రి ఒప్పందం చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాన గ్రామానికి చెందిన భూపతి అనే వ్యక్తికి పిల్లలు లేకపోవడంతో పసిబిడ్డను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. రూ. 20 వేలు తీసుకుని ఏప్రిల్ 12న పాపను భూపతి దంపతులకు అప్పగించారు. మహేశ్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి.. విషయం తెలుసుకున్న లావణ్య భర్త మహేశ్ డీసీపీవో స్రవంతికి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యుడు ఇట్టం ప్రవీణ్ కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు, ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, వాచ్మన్ బాలరాజుతోపాటు లావణ్య, మధ్యవర్తులు బాలకృష్ణ, దేవయ్య, భూపతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. పసిపాపను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. 2021లో కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నడిపిన డాక్టర్ ప్రవీణ్, ఆయన తండ్రి ఓ గర్భిణికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తేలడంతో సిద్దిరాములుతోపాటు కొందరిని అరెస్టు చేసి ఆస్పత్రిని సీజ్ చేశారు. -
ఎక్కడికక్కడే అరెస్టులు.. టీజీపీఎస్సీ వద్ద హైటెన్షన్
హైదరాబాద్, సాక్షి: నిరుద్యోగ జేఏసీ ఆందోళన నేపథ్యంలో నగరంలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు డిమాండ్ల సాధనతో ఆందోళనకు దిగిన జేఏసీ కార్యకర్తలు.. టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. అయితే అప్పటికే నగరమంతా భారీగా మోహరించిన పోలీసులు.. ఎక్కడికక్కడే వాళ్లను అరెస్ట్ చేశారు. బీజేవైఎం, బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ హైదరాబాద్లోని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపు ఇచ్చింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర శివారుల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు.. ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీజీపీఎస్సీ కార్యాలయం వైపు దూసుకెళ్లే యత్నం చేసిన విద్యార్థి సంఘం నేతల్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాటపట్టారు. -
ఏబీవీపీ TGPSC ముట్టడి విఫలం.. నాంపల్లిలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: ఏబీవీపీ ముట్టడి ప్రయత్నంతో నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక వాతావరణం నెలకొంది. గ్రూప్ ఉద్యోగాలు, డీఎస్సీ పోస్టుల డిమాండ్తో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు మంగళవారం ఉదయం టీజీపీఎస్సీ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. అయితే.. ఒక్కసారిగా వాళ్లు కమిషన్ భవనం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. పలువురు ఏబీవీపీ కార్యకర్తల్ని, విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్లో 1:100 పిలవాలని, గ్రూప్ 2 లో పోస్టులు పెంచి, డిసెంబర్ లో గ్రూప్ టు పరీక్షలు నిర్వహించాలని, టీచర్ పోస్టుల్ని పెంచి డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని టీజీపీఎస్సీని డిమాండ్ చేస్తోంది ఏబీవీపీ. -
నకిలీ పత్రాలు.. ఫోర్జరీ సంతకాలు
గచ్చిబౌలి (హైదరాబాద్): ఫోర్జరీ డాక్యుమెంట్లతో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)కు బురిడీ కొట్టించాలనుకున్న టీవీ–5 సాంబశివరావుకు బుర్ర తిరిగిపోయే ఎదురుదెబ్బ తగలింది. పచ్చ మీడియాలో ఒకటైన టీవీ–5లో సాంబశివరావు కీలకంగా వ్యవహరిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. కాగా భూ యజమానికి తెలియకుండా నకిలీ పత్రాలతో హైదరాబాద్లోని మాదాపూర్లో ఆయ న నడిపిస్తున్న పెట్రోల్ బంక్ను హెచ్పీసీఎల్ ప్రతినిధులు బుధవారం సీజ్ చేశారు. ఫోర్జరీ సంతకాలతో ప్లాట్ను అగ్రిమెంట్ చేసుకొని, దాన్ని హెచ్పీసీఎల్కు లీజుకు ఇచ్చాడని ప్లాట్ యజమాని సరనాల శ్రీధర్రావు హెచ్పీసీఎల్కు చేసిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో కంపెనీ అధికారులు రంగంలోకి దిగారు. ఫోర్జరీ చేసిన స్థలానికి బుధవారం కంచె వేయడంతో పాటు పెట్రోల్ బంక్ను పాక్షికంగా సీజ్ చేశారు. ఆ స్థలంలో ఉన్న పెట్రోల్ పంపులను మూసి వేశారు. ఆయిల్ సంస్థలతో మంచి సంబంధాలున్నాయని నమ్మించి.. సాంబశివరావుపై ఇటీవల మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సరనాల శ్రీధర్ భార్యకు శేరిలింగంపల్లిలోని మాదాపూర్ గ్రామం, సర్వే నంబరు–64, హుడా టెక్నో ఎన్క్లేవ్, సెక్టార్– 3లోని ప్లాట్ నంబరు–26లో 600 చదరపు మీటర్ల (717.60 చదరపు గజాలు) స్థలం ఉంది. 2018లో సాంబశివరావు వీరిని కలిసి, తనకు ఆయిల్ సంస్థలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ డీలర్షిప్ ఇప్పిస్తామని నమ్మించాడు. ప్లాట్కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా నకిలీపత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలతో భూ యజమానులకు తెలియకుండా పెట్రోల్ బంక్ డీలర్షిప్ను డాక్టర్ కొల్లి సౌమ్య పేరు మీదకు సాంబశివరావు బదలాయించాడు. జర్నలిస్టులు, పోలీసుల పేరుతో భయపెట్టి.. తన స్థలంలో అక్రమంగా పెట్రోల్ బంక్ను నడుపుతున్నట్లు తెలుసుకున్న శ్రీధర్రావు షాక్కు గురయ్యారు. 2021లో దీనిపై సాంబశివరావును నిలదీశారు. దీంతో సాంబశివరావు ఎదురుదాడికి దిగాడు. హెచ్పీసీఎల్తో డీలర్షిప్ అగ్రిమెంట్కు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. రాజకీయ నాయకులు, జర్నలిస్ట్లు, పోలీసు అధికారులతో తనకున్న పరిచయాలను ప్రస్తావిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయభ్రాంతులకు గురైన శ్రీధర్రావు ఆ డీలర్షిప్ను తమ పేరు మీదకు బదలాయించాలని కోరారు. లక్షల్లో వసూలు చేసి డీలర్షిప్ బదలాయించకుండా.. అయితే కొంత నగదు చెల్లిస్తేనే డీలర్షిప్ను బదలాయిస్తానని సాంబశివరావు చెప్పాడు. వేరే దారిలేక 2021, మార్చిలో రూ.లక్షల్లో నగదు బదలాయించామని శ్రీధర్రావు పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపారు. అయినప్పటికీ డీలర్షిప్ను బదలాయించకపోవడంతో ఈ ఏడాది జనవరి 31న శ్రీధర్రావు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్పీసీఎల్ ప్రతినిధులకు సైతం శ్రీధర్రావు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హెచ్పీసీఎల్ అధికారులు సాంబశివరావు నడుపుతున్న పెట్రోల్ బంక్ను సీజ్ చేశారు. చీటింగ్ కేసును నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసు స్టిక్కర్ తగిలించి.. గంజాయి తరలించి
రామచంద్రాపురం (పటాన్చెరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని బాలానగర్ ఎస్వోటీ, రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ నరేందర్రెడ్డి అందించిన వివరాలివి. మహారాష్ట్ర బడ్లాపూర్కు చెందిన ధీరజ్ మున్నాలా డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటాడు. అందులో సరైన ఆదాయం రాకపోవడంతో స్నేహితుడు ప్రశాంత్ సంజయ్ షిండేతో కలిసి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయించాలని నిర్ణయించాడు. ఇన్నోవా కారు అద్దెకు తీసుకొని ఇద్దరూ విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వినయ్ మండల్ ద్వారా కిలో రూ.3 వేల చొప్పున 58.5 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని 39 ప్యాకెట్లుగా విభజించి కారులో పెట్టుకుని మహారాష్ట్రకు బయల్దేరారు. వీరు గంజాయి తరలిస్తున్నట్లు గురువారం సాయంత్రం బాలానగర్ ఎస్వోటీ పోలీసులు, రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందింది. దీంతో రామచంద్రాపురం పట్టణ పరిధిలోని ఇక్రిశాట్ వద్ద గంజాయి తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని పట్టుకున్నారు. అందులో ఉన్న ధీరజ్ మున్నాలా జైస్వాల్, ప్రశాంత్ సంజయ్ షిండేలను అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటపడింది. కాగా ఇన్నోవా వాహనానికి నంబర్ ప్లేట్ మార్చి, ముందు భాగంలో పోలీస్ స్టిక్కర్ను పెట్టుకొని గంజాయిని తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. దాంతో వారి వద్ద నుంచి రూ.11 లక్షల 70 వేల విలువైన 58.8 కిలోల గంజాయిని, ఇన్నోవా కారు, డూప్లికేట్ నంబర్ ప్లేట్, కొడవలి, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
గ్రూప్-2 వాయిదా వేయండి.. టీఎస్పీఎస్సీ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఆగష్టు 29, 30తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తత చోటు చేసుకోగా.. భారీగా ట్రాఫిక్ ఝామ్ అయ్యింది. ఇప్పటికే గ్రూప్ - 1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 వంటి పరీక్షలను పూర్తి చేయగా.... గ్రూప్ - 2 నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. పేపర్ లీకేజీ వ్యవహారంతో బోర్డు ప్రతిష్ట మసకబారిపోగా.. ఇక నుంచైనా అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది. గ్రూప్-2 పరీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోజుల్లో మిగతా ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్, కాలేజీలు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది. మరోవైపు.. జీవో నెంబర్ 46 రద్దు కోరుతూ డీజీపీ కార్యాలయం ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థులు సైతం ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. -
కిడ్నీ రాకెట్పై సర్కారు సీరియస్
మహారాణిపేట/సింహాచలం: విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు ఈ ఉదంతంపై విచారణ వేగవంతం చేశారు. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతోపాటు పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టారు. పెందుర్తిలో కిడ్నీ మార్పిడి చేసిన తిరుమల ఆస్పత్రిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, జీవన్దాన్ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించారు. డబ్బు ఆశ చూపించి గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన మధురవాడ వాంబే కాలనీకి చెందిన జి.వినయ్కుమార్కు పెందుర్తి తిరుమల ఆస్పత్రిలో కిడ్నీ తీసుకున్న విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం రూ.8.50 లక్షలు ఇవ్వకుండా కేవలం రూ.2.50 లక్షలు ఇవ్వడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రికే అనుమతి లేదు కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు పెందుర్తిలో కిడ్నీ మార్పిడి చేసిన తిరుమల ఆస్పత్రిపై డీఎంహెచ్వో పి.జగదీశ్వరరావు, జీవన్దాన్ కో–ఆర్డినేటర్ రాంబాబు, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఆస్పత్రి అనుమతులు, ఇటీవల జరిగిన సర్జరీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో ఆర్థో ఓపీలు, సర్జరీలు చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ఇందులో రెండు ఆపరేషన్ థియేటర్లు కూడా ఉండటాన్ని గమనించారు. ఐదేళ్లుగా పెందుర్తిలో తిరుమల ఆస్పత్రి కార్యకలాపాలు సాగిస్తోంది. దీనికి ఎటువంటి అనుమతి లేదని అధికారుల విచారణలో నిర్ధారణ అయింది. కనీసం తాత్కాలిక ఆనుమతి కూడా లేదన్న విషయం తెలుసుకుని అధికారులు కంగుతిన్నారు. అనుమతులు లేని ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా, నేరపూరితంగా సర్జరీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఆ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడు మాత్రమే ఉండగా.. కిడ్నీ మారి్పడి ఎలా చేశారు, ఎవరు చేశారన్న విషయంపైనా ఆరా తీశారు. తమ ఆస్పత్రిలో ఎముకలకు సంబంధించిన వైద్యమే తప్ప ఎలాంటి కిడ్నీ మారి్పడి ఆపరేషన్లు జరగలేదని ఆస్పత్రి ఎండీ పరమేశ్వరరావు అధికారులకు చెప్పారు. ఆస్పత్రి సీజ్ : వైద్య సేవలు, సౌకర్యాలపై అధికారులు కలెక్టర్ మల్లికార్జునకు ప్రాథమిక నివేదికను అందజేయగా.. ఆస్పత్రిని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో డీఎంహెచ్వో జగదీశ్వరరావు, పెందుర్తి తహసీల్దార్ సమక్షంలో ఆస్పత్రిని సీజ్ చేశారు. మోసం, మానవ అవయవాల మారి్పడి చట్టం 1995, ఐపీసీ 18, 19తో పాటు 420 ఆర్/డబ్ల్యూ 120(బీ) కింద కేసు నమోదు చేశారు. -
కారులో రూ.2.10 కోట్ల నగదు ఎవరిది!
బళ్లారి సాక్షి, యశవంతపుర: బాగలకోటె జిల్లా జమఖండి తాలూకా హున్నూర చెక్పోస్టు వద్ద లెక్కలు లేకుండా తరలిస్తున్న రూ.2.10 కోట్ల నగదును ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. చెక్పోస్ట్లో అధికారులు ఒక కారును శోధించగా నగదు కట్టలు లభించాయి. ఈ నగదు ఒక సహకార బ్యాంకుకు చెందినదిగా నగదు తరలింపుదారులు తెలిపారు. అయితే అందుకు సంబంధించి దాఖలాలు చూపలేదని తెలిసింది. పత్రాలను చూపించి నగదు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఆ నగదును జమఖండిలోని ట్రెజరీకి తరలించారు. -
165 ప్రైవేటు ఆస్పత్రులు సీజ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు చేపట్టగా ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్దఎత్తున అవకతవకలు వెలుగుచూశాయి. అవకతవకలను అరికట్టేందుకు 3,810 ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ల్యాబ్లు, క్లినిక్లను ఆయా జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని 1,163 ఆస్పత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 165 ఆస్పత్రులను సీజ్ చేయగా, మరో 106 ఆస్పత్రుల యాజమాన్యాలకు జరిమానాలు విధించి హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్ర ప్రజారోగ్య విభాగానికి నివేదిక సమర్పించగా, అధికారులు మంగళవారం గణాంకాలు విడుదల చేశారు. వామ్మో నాగర్కర్నూల్... అధికారులు సీజ్ చేసిన 165 ఆస్పత్రుల్లో 41 ఆస్పత్రులు నాగర్కర్నూల్ జిల్లాలోనివే కావడం గమనార్హం. ఈ జిల్లాలో మొత్తం 54 ఆస్పత్రులను తనిఖీ చేసిన అధికారులు అందులో 70 శాతం ఆస్పత్రులను సీజ్ చేయడాన్ని చూస్తే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అత్యధిక ఆస్పత్రులు సీజ్ చేసిన కేటగిరీలో నల్లగొండ–17, సంగారెడ్డి–16, భద్రాద్రి కొత్తగూడెం–15, హైదరాబాద్–10, రంగారెడ్డి–10 ఆస్పత్రులు ఉన్నాయి. నోటీసులు జారీ చేసిన కేటగిరీలో హైదరాబాద్–274, కరీంనగర్–124, రంగారెడ్డి –107 ఆస్పత్రులున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నోటీసుల జారీ ప్రక్రియ సాగింది. ప్రస్తుతం నోటీసుల జారీ, సీజ్, పెనాల్టీలతో సరిపెట్టిన వైద్య, ఆరోగ్య శాఖ వాటికి సంబంధించి వచ్చిన వివరణలు, తదుపరి చర్యలకు త్వరలో మరో డ్రైవ్ చేపట్టనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
మంత్రి ఇంటి ముట్టడికి యత్నం
ఒంగోలు టౌన్: జీఓ నెం 279 రద్దుచేసి, ఆర్టీఎంఎస్ విధానాన్ని ఎత్తివేయాలని కోరుతూ మునిసిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి మూడో రోజుకు చేరుకొంది. సమ్మెలో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు ఇంటిని ముట్టడించాలని జిల్లా నాయకత్వం నిర్ణయించింది. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి కార్మికులు, నాయకులు ప్రదర్శనగా బయలుదేరి మంగమూరురోడ్డులోని మంత్రి ఇంటిని ముట్టడించేందుకు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడంతో రోడ్డు మొదట్లోనే ఆందోళనకారులను అడ్డుకున్నారు. తాము లోపలికి వెళతామంటూ ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరకు మంత్రిని కలిసేందుకు ముఖ్య నాయకులకు అనుమతి ఇచ్చారు. మంత్రి శిద్దా రాఘవరావు ఛాంబర్ వద్దకు చేరుకొన్నారు. అక్కడే కలెక్టర్ వినయ్చంద్, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి ఉన్నారు. వారి సమక్షంలో మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అంతకు ముందు మునిసిపల్ కార్మికులను ఉద్దేశించి సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ మునిసిపల్ కార్మికుల ఉనికికి గొడ్డలి పెట్టు అయిన జీఓ నెం 279ని ప్రభ్వుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తుంటే, ఆర్టీఎంఎస్ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. జేఏసీ నాయకుడు శ్రీరాం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో పారిశుద్ధ్య కార్మికులు అంకితభావంతో విధులు నిర్వర్తించడం వల్లనే రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని గుర్తెరగని నగర పాలక సంస్థ కమీషనర్ కార్మికులను ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోకి పారిశుధ్య కార్మికులు ప్రవేశించకుండా ఉండాలన్న ఉద్ధేశంతో గేట్లకు తాళాలు వేయించడం సరికాదన్నారు. కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. జేఏసీ నాయకుడు ఎస్డీ సర్ధార్ మాట్లాడుతూ జీఓ నెం 279 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ ప్రకారం వేతన సవరణ చేయాలన్నారు. మునిసిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు తంబి శ్రీనివాసులు, టి.మహేష్, కె.శ్రీనివాసరావు, యూ రత్నకుమారి పాల్గొన్నారు. 14 మందిపై కేసు నమోదు ఒంగోలు: నగరపాలక సంస్థ కమిషనర్ సంకురాత్రి వెంకట కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 14 మందిపై ఒంగోలు వన్టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈనెల 4వ తేదీ నుంచి ఔట్ సోర్సింగ్ కార్మికులు ఎక్కువమంది సమ్మె చేస్తున్నారు. కొందరు మాత్రం విధులకు హాజరవుతున్నారు. శనివారం కార్మికులు చేస్తున్న పనికి ఆటంకం కలిగించడంతోపాటు శానిటరీ ఇన్స్పెక్టర్ల విధులకు కోర్నిపాటి శ్రీనివాసరావు, కొల్లాబత్తిన గోపి, ఊదరగుడి సామ్రాజ్యం, కాకర్లమూడి సామ్రాజ్యం, తంబి శ్రీనివాసులు(సీఐటీయూ), ఊరగాయల నాగరాజు, రంపతోటి శ్రీనివాసరావు, కోర్నెపాటి రవికుమార్, కోర్నెపాటి బాలకృష్ణ, తేళ్ల విజయ, బందెళ సుబ్బారావు, శ్రీరామ్ శ్రీనివాసరావు, పిల్లి శారద, బండ్ల ఏడుకొండలు అనే వారు ఆటంకం కలిగిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 14 మందిపై కేసు నమోదు చేశారు. -
రక్త ఉత్పత్తుల అక్రమ దందా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రక్త నిల్వలకు సంబంధించిన ప్యాకెట్ల (బ్లడ్ ప్రొడక్ట్స్) అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. లైసెన్సులు లేకుండానే కొన్నిచోట్ల యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కూకట్పల్లిలో ఒక హోల్సేల్ మెడికల్ షాపులో వెయ్యి రక్త ఉత్పత్తుల ప్యాకెట్లను కేంద్ర, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్తంగా పట్టుకుని అక్కడికక్కడే సీజ్ చేశారు. వాటిని ధ్వంసం చేసేందుకు కోర్టు అనుమతి తీసుకోనున్నారు. ఆ ప్యాకెట్లన్నీ కూడా ప్లాస్మా, క్రయో ప్రిస్పరేట్ రక్త ఉత్పత్తులని, వాటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శనివారం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు అధికారులు ఏకధాటిగా ఈ దాడులు చేశారు. ఆ మెడికల్ షాపునకు రక్త ఉత్పత్తులను విక్రయించే లైసెన్సు లేదు సరికదా ఆ ప్యాకెట్లపై కనీసం గడువు తేదీకూడా లేకపోవడం గమనార్హం. ఆ మెడికల్ షాపుకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నెట్వర్క్ ఉందని తెలిసింది. కొన్నేళ్లుగా అక్రమంగా రక్త ఉత్పత్తుల దందా నిర్వహిస్తున్నా ఎవరూ గుర్తించలేదని సమాచారం. పైగా కొందరు అధికారులు కూడా ఆ షాపునకు సహకరిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా రక్త ఉత్పత్తుల విక్రయాలకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలి. అయితే చాలామంది బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ తీసుకొని రక్త ఉత్పత్తులు తయారు చేస్తుంటారు. రక్తం ద్వారా కొన్ని ప్రత్యేకమైన వ్యాధులకోసం రక్త ఉత్పత్తులు తయారుచేస్తుంటారని డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. అలాగే ప్లాస్మా నుంచి ప్లేట్లెట్లు, రెడ్బ్లడ్ సెల్స్ సెపరేట్ చేస్తుంటారు. ఇలా నాలుగైదు రకాల రక్త ఉత్పత్తులకు ఉన్న డిమాండ్తో పలుచోట్ల అక్రమార్కులు లైసెన్సు లేకుండా, ప్రమాణాలు పాటించకుండా తయారుచేస్తుండటం గమనార్హం. అయితే 2012 తర్వాత రాష్ట్రంలో ఎక్కడా రక్త ఉత్పత్తుల విక్రయాలకు లైసెన్సు ఇవ్వలేదని సమాచారం. కూకట్పల్లిలోని ఆ మెడికల్ షాపులో రక్త ఉత్పత్తులను ప్రమాణాల ప్రకారం నిల్వ చేయలేదు. ఉదాహరణకు ప్లాస్మాను మైనస్ 20 డిగ్రీల వద్ద, క్రయోప్రిస్పరేట్ను మైనస్ 80 సెంటీగ్రేడ్ డిగ్రీల వద్ద నిల్వ ఉంచాలి. కానీ వాటిని ఏసీ రూములో పడేశారు. అలాగే వాటిపై లేబుళ్లు లేవు. రక్త ఉత్పత్తులకు ఉన్న డిమాండ్తో ఇష్టారాజ్యంగా వీటిని అమ్ముతున్నారు. పేరుకు అది హోల్సేల్ మెడికల్ షాపైనా ల్యాబ్లా ఉందని అంటున్నారు. ఈ దాడుల్లో డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్లు దాస్, రమ«ధాన్, ఇన్స్పెక్టర్లు నాగరాజు, చంద్రశేఖర్, మురళీకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బెజవాడలో రెండు టన్నుల గంజాయి స్వాధీనం
విజయవాడ: సుమారు రెండు టన్నుల గంజాయిని విజయవాడలో పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి నుంచి మహారాష్ర్ట వెళ్తున్న రెండు కార్లలో గంజాయిని తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుకున్నారు. రామవరప్పాడు వద్ద ఒక కారు దొరకగా..పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటూ పోయిన మరో కారును ఇబ్రహీంపట్నం వద్ద చేజ్ చేసి పట్టుకున్నారు. రెండు కార్లలో కలిపి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నలుగురూ మహారాష్ర్టకు చెందినవారిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెజిటబుల్ కట్లెట్లో బొద్దింకలు, పురుగులు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు విక్రయించడమే కాకుండా, లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న అన్నపూర్ణ థియేటర్లోని క్యాంటీన్ను అధికారులు సీజ్ చేశారు. గవర్నర్పేటలోని అన్నపూర్ణ, శకుంతల థియేటర్స్లో ఆహార పదార్థాలు శుభ్రంగా లేవంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు తనిఖీలో తేలిందని పూర్ణచంద్రరావు తెలిపారు. మినిట్ మెయిడ్ పల్ప్ డ్రింక్ బాటిల్స్కు 4, 5 రోజుల్లో కాలవ చెల్లనున్నట్లు గుర్తించామన్నారు. వెజిటబుల్ కట్లెట్ పూర్తిగా పాడైపోయి పురుగులు పట్టిందని తెలిపారు. బొద్దింకలు, పురుగులు ఆహార పదార్థాల్లో సంచరిస్తున్నాయని చెప్పారు. లేస్, పాప్కార్న్ అన్ఆథరైజ్డ్ ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వైట్ కవర్స్లో ఉంచిన కంపెనీ పేరులేని ఆహార పదార్థాలు గుర్తించామన్నారు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపుతున్నట్లు చెప్పారు. క్యాంటీన్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. క్యాంటీన్లో లభించిన బ్యాచ్కు చెందిన కూల్ డ్రింక్స్ ఎక్కడెక్కడ నిల్వలున్నాయో.. వాటన్నింటిని స్వాధీనం చేసుకోవాలని కోకాకోలా కంపెనీకి నోటీసులు జారీ చేస్తామన్నారు. క్యాంటీన్కు సరుకు సరఫరా చేసే వారికి లైసెన్స్ లేదని తనిఖీల్లో వెల్లడైందన్నారు. శాంపిల్స్ నివేదికలు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైసెన్స్ లేకుండా సరుకు సరఫరా చేసేవారిపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సీజ్
జగ్గయ్యపేట అర్బన్ : ఇంటి పన్ను చెల్లించకపోవటంతో స్థానిక బీఎస్ఎన్ఎల్ సబ్ డివిజినల్ కార్యాలయాన్ని బుధవారం మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు పన్ను వసూళ్లకు వచ్చిన పురపాలక సంఘ రెవెన్యూ అధి కారులు.. కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపివేసి ప్రధాన ద్వారానికి తాళాలు వేసి సీల్ వేశారు. పన్ను చెల్లింపునకు ఈనెల 31 వ తేదీ డెడ్లైన్ కావటంతో మున్సిపల్ కమిషనర్ పి.రమేష్ ఆదేశాల మేరకు పన్ను బకాయిల వసూలు లక్ష్యంతో రెవెన్యూ విభాగం సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీనిలో భాగంగా బీఎస్ఎన్ఎల్ గత 18 ఏళ్లుగా రూ.5.13 లక్షల ఇంటి పన్నును చెల్లించకపోవటంతో అనేకసార్లు నోటీసులు జారీ చేశారు. అయినా ఖాతరు చేయలేదు. దీంతో బుధవారం కార్యాలయానికి వచ్చి మరొకసారి పన్ను బకాయిలు చెల్లించాలని కోరారు. అయినా స్పందించకపోవడంతో రెవెన్యూ ఆఫీసర్ ఆర్. వసంతరావు ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కేజే శంకర్, టీమ్ లీడర్ చావా ప్రేమ్చంద్, సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, బిల్ కలెక్టర్లు నాగరాజు, ఇతర సిబ్బంది కార్యాలయాన్ని సీజ్ చేస్తున్నట్లు నోటీస్ జారీ చేసి ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి సీల్ వేశారు. కాగా ఒక దశలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, సిబ్బందికి.. మున్సిపల్ అధికారులు, సిబ్బందికి తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినా రెవెన్యూ అధికారులు ససేమిరా అనటంతో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఈ విషయాన్ని వారి ఉన్నతాధికారులకు తెలియజేశారు. అలాగే, మున్సిపల్ అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. -
శ్రీధర్ హెల్త్కేర్ ఆసుపత్రి సీజ్
అనంతపురం న్యూసిటీ: నగరంలో వర్ష ఆసుపత్రి ఉదంతం మరువక ముందే మరో ఆస్పత్రి అడ్డగోలు బాగోతం గురువారం వైద్య ఆరోగ్యశాఖాధికారి తనిఖీలో వెలుగుచూసింది. స్థానిక హౌసింగ్బోర్డు రాంనరేష్ ఫంక్షన్ హాల్లో శ్రీధర్ హెల్త్కేర్ హాస్పిటల్లో ఓ వ్యక్తి శంకర్దాదా ఎంబీబీఎస్ అవతారమెత్తాడు. ఎంబీబీఎస్ పట్టా పొందకపోయినా వైద్యుడిగా చెలామణి అవుతున్నాడు. విషయాన్ని ఓ అజ్ఞాతవ్యక్తి డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్ఎస్ అనిల్కుమార్కి సామాజిక మాధ్యమం ద్వారా సమాచారాన్ని అందించారు. దీంతో డీఎంహెచ్ఓ తన బృందంతో కలసి ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. ఆస్పత్రికి రిజిస్ట్రేషన్పై ఆరా తీయగా అలాంటి పేరుతో ఆరోగ్యశాఖలో ఎలాంటి పేరు నమోదు కాలేదనే విషయం వెల్లడయింది. వైద్యుడు కాకుండానే ఎలా చికిత్స చేస్తున్నారని శ్రీధర్బాబును డీఎంహెచ్ఓ నిలదీయగా మౌనమే సమాధానమైంది. ఏం చదువుకున్నావని ఆరా తీయగా.. ఎం.ఫార్మసీ చేసినట్లు తెలిపాడు. ఇంతలోనే నిర్వాహకుని అత్త జోక్యం చేసుకుని తాను విశ్రాంత వైద్యురాలినని చెప్పారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆస్పత్రిని సీజ్ చేశారు. డీఎంహెచ్ఓ వెంట డీఐఓ డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ గంగాధర్ రెడ్డి, డెమో ఉపమాతి తదితరులు ఉన్నారు. -
వర్ష ఆస్పత్రి సీజ్
అనంతపురం న్యూసిటీ: నిబంధనలకు విరుద్ధంగా రక్తమా ర్పిడికి పాల్పడడంతో పాటు నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్న వర్ష ఆస్పత్రిని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సోమవారం సీజ్ చేశారు. నగరంలోని వర్ష ఆస్పత్రిలో రక్తమార్పిడి (బ్లడ్ ట్రాన్స్మిషన్) చేస్తున్నట్లు సమాచారంతో డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్ఎస్ అనిల్కుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు సంధ్య, కేశవరెడ్డిలు ఆదివారం తనిఖీ చేసిన విషయం విదితమే. ఆస్పత్రిలో రక్తమార్పిడి జరిగినట్లు నిర్ధారణ కావడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్ నిర్వహణ, శానిటేషన్ వైఫల్యం, ధరల పట్టిక పొందుపర్చకపోవడం, కేస్షీట్లో వైద్యుల సంతకాలు లేకపోవడం, రిజిస్ట్రేషన్లో పలు లోపాలు అధికారుల తనిఖీలో వెలుగుచూశాయి. ఈ కారణాల రీత్యా ఆస్పత్రిని మూసివేశారు. నగర చరిత్రలో ఆస్పత్రిని సీజ్ చేయడం ఇదే తొలిసారి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ల నిర్వాహకులు ఉలిక్కిపడ్డారు. బ్లడ్ బ్యాగ్స్లు ఎక్కడి నుంచి వచ్చాయోనని డ్రగ్ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. సదరు ఆస్పత్రి నిర్వాహకులపై డ్రగ్ అధికారులు కోర్టులో కేసు నమోదు చేసినట్లు తెల్సింది. వేకువజాము వరకు విచారణ వర్ష ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ సుప్రజ చౌదరి, ఆమె భర్త డాక్టర్ హర్షవర్ధన్ (అపెక్స్ రేడియాలజిస్టు)లను ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం వేకువజాము వరకు డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్ఎస్ అనిల్కుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు సంధ్య, కేశవరెడ్డిలు విచారణ చేశారు. ఆస్పత్రిలో చిల్లవారిపల్లికు చెందిన రాములమ్మ, బుక్కపట్నం చెన్నరాయుడుపల్లికి చెందిన అనితలకు ఎందుకు రక్తమార్పిడి చేశారని, ప్రభుత్వ మార్గదర్శకాలు మీకు తెలియవా అని ప్రశ్నించారు. డ్రగ్ యాక్ట్ ఉల్లంఘిస్తే ఆస్పత్రి సీజ్ చేయడమే కాక కెరియర్పై ప్రభావం చూపుతుందన్నారు. బ్లడ్ బ్యాగులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాల్సిందేనని అధికారులు గట్టిగా నిలదీశారు. ఓ ఏజెన్సీ నిర్వాహకుల ద్వారా బ్యాగులు తీసుకున్నట్లు వారు అంగీకరించారు. సర్వజనాస్పత్రికి రోగుల తరలింపు.. వర్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు రోగులను డీఎంహెచ్ఓ 108 అంబులెన్స్లో సర్వజనాస్పత్రికి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులను నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డీఎంహెచ్ఓ వెంట డెమో ఉమాపతి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూపర్వైజర్ రమణ, సిబ్బంది గంగాధర్ తదితరులున్నారు. -
ఐదులక్షల మందితో పార్లమెంటు ముట్టడిస్తాం
తిరువొత్తియూరు: రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయని పక్షంలో నవంబర్ 20న ఐదు లక్షల మంది రైతులతో కలిసి పార్లమెంటు ముట్టడి చేయనున్నట్టు రైతు సంఘాల అధ్యక్షుడు అయ్యాకన్ను తెలిపారు. నదులను అనుసంధానించాలని, రైతుల డిమాండ్లను నెరవేర్చాలని జాతీయ దక్షిణ భారత నదుల సంధానం రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో తమిళనాడు రైతులు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుచ్చిలో జరిగిన ఓ కార్యక్రమానికి శుక్రవారం హాజరైన అయ్యాకన్ను పత్రికల వారితో మాట్లాడుతూ 41 రోజులుగా నిరవధిక ఆందోళన చేస్తున్నామని రెండవ ఘట్టంగా రోజూ ఒక్కో విధానంలో జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నామని ఈ ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెవిన పడలేదని ఈ చర్య వలన దేశానికి వెన్నముకగా పిలవబడే రైతులు మోసపోయినట్టు తెలిపారు. ఈ కారణంగా తమిళనాడు రైతులు, ఉత్తర రాష్ట్రాలకు చెందిన రైతులతో కలిపి ఐదు లక్షల మందితో నవంబర్ 20వ తేదీన పార్లమెంటు శీతాకాల సమావేశం ప్రారంభం రోజున ముట్టడి చేయనున్నట్టు తెలిపారు. -
భయపెట్టే సైలెన్సర్లు సీజ్
కృష్ణరాజపురం : రోడ్లపై వికృత శబ్ధాలను చేస్తూ శబ్దకాలుష్యంతో పాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన మోడిఫైడ్ సైలెన్సర్లు కలిగిన ద్విచక్రవాహనాలను ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ సీజ్ చేశారు. కే.ఆర్.పురం వ్యాప్తంగా ఇటువంటి సైలెన్సర్లు కలిగిన సుమారు 60 బైకులను సీజ్ చేసి ఆ సైలెన్సర్లను తొలగించారు. కొంతమంది యువత ఎక్కువ శబ్ధం వచ్చే సైలెన్సర్లను అమర్చి హల్చల్ చేయడం సిటీలో బాగా పెరిగింది. -
పట్టుకుంటారు.. పక్కన పడేస్తారు
♦ వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాల పరిస్థితి ♦ తుప్పుపట్టి శిథిలావస్థకు చేరుతున్న వాహనాలు ♦ మాయమవుతున్న విడి భాగాలు ♦ 12 ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాల్లో ఇదే తంతు కాశినాయన : పలు కేసుల్లో పట్టుబడిన పలు వాహనాలు పోలీస్స్టేషన్, ఎక్సైజ్, అటవీ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి మగ్గుతున్నారు. దొంగతనాలకు గురైనవి, రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతిన్నవి, అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడినవి, సరైన పత్రాలు లేకుండా సీజ్ చేసిన వాహనాలు ఆయా శాఖల కార్యాలయాల్లో శిథిలావస్థకు చేరుతున్నాయి. అలాగే లారీలు, ఆటోలు, సుమోలు, స్కార్పియోలు, మోటారు సైకిళ్లు తదితర వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడిసి ఎందుకూ పనికిరాకుండా పడి ఉన్నాయి. వాహనాలు పోగొట్టుకున్నవారు కొంత కాలానికి తమ వాహనాలు దొరికాయనే సంతోషం ఎంతో కాలం ఉండడం లేదు. కారణం వాటిని తిరిగి పొందాలంటే చేంతాడంత వ్యవహారం ఉండడమే. ఈలోగా ఆయా వాహనాలకు సరైన రక్షణ లేక అవి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. 1,500 వాహనాలు పనికిరావు జిల్లాలో 12 ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాలున్నా యి. ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాలతో పాటు ఎక్సైజ్, పోలీసుస్టేషన్ల పరి«ధిలో వివిధ కేసుల్లో పట్టుబడినవి దాదాపు 1,500 వాహనాలు న్నాయి. బద్వేలు తాలూకాలో బద్వేలు, పో రుమామిళ్ల అటవీ కార్యాలయాల్లో పట్టుబ డిన వాహనాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో అవి తుప్పుపట్టి పోతున్నాయి. అయినా కూడా అధికారులు వాటిని పట్టించుకో వడం లేదు. ఎక్కువగా ఎర్రచందనం తరలి స్తూ పట్టుబడిన లారీలు, కార్లు, సుమోలు, ఆ టోలు వందల సంఖ్యలో అటవీశాఖ కార్యాలయంలో మగ్గుతున్నాయి. వీటిని అధికారులు పూర్తిగా పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. మాయమవుతున్న వాహనాల విడిభాగాలు ఎర్రచందనాన్ని తరలించేందుకు కండీషన్లో ఉన్న వాహనాలనే ఉపయోగిస్తారు. అవి పట్టుబడితే అటవీశాఖ కార్యాలయానికి చేరతాయి. పట్టుబడిన వాహనాలను కొందరు అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. కొందరు సిబ్బంది పట్టుబడిన వాహనాల విడిభాగాలను తొలగించి విక్రయిస్తున్నట్లు ఆరోపణ లున్నాయి. అంతేకాక గతంలో పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్ కార్యాలయంలో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలు కూడా మాయమైపోయాయి. వాహనాల బ్యాటరీలు, టైర్లు, ఇంజిన్లు వేరుచేసి అ మ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. అయినా కూడా ఉన్నతాధికారులు ఈ విషయమై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. పట్టుకున్న వాహనాలను వేలంలో విక్రయిస్తే అటు పోగొట్టుకున్న యజమానులు గానీ, టెండర్లు వేసే వారు గానీ ఎక్కువ రేట్లకు వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాహనాలను వేలం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కదం తొక్కిన విద్యార్థులు
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి తోపులాటలో గాయపడిన విద్యార్థులు, పోలీసులు పలువురి అరెస్ట్, కేసుల నమోదు అనంతపురం అర్బన్: పాఠశాలలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. డిమాండ్ల సాధనలో భాగంగా తొలుత సప్తగిరి సర్కిల్ నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. గేట్ బయటే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో గేట్ బయటే రోడ్డుపై విద్యార్థులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూర్యచంద్ర, నరేష్, రాష్ట్ర కార్యదర్శి సుశీలమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థుల జీవితాలతో పాలకులు చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్, తెలుగు మీడియంలను సమాంతరంగా కొనసాగించాలన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ చార్జీలు పెంచాలన్నారు. జీఓ 29ని రద్దు చేసి పాఠశాలలు, వసతి గృహాల మూసివేతను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేఎస్ఆర్ కళాశాలకు అనుబంధంగా వసతి గృహం ఏర్పాటు చేయాలన్నారు. కేజీబీవీల్లో విద్యార్థినులకు భద్రత కల్పించాలన్నారు. సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ కలెక్టరేట్లో చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. విద్యార్థుల చర్యని రోప్ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. వెనువెంటనే పోలీస్ బలగాలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో విద్యార్థులకు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దొరికిన వారిని దొరికినట్లే పోలీసులు లాగిపడేశారు. తోపులాటలో పలువురు విద్యార్థులతో పాటు పోలీసులూ గాయపడ్డారు. విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం 341 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ముట్టడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి సంఘం నాయకులను సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ పరామర్శించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, వాటి సాధన కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై పోలీసుల ద్వారా అణచివేతకు సిద్ధపడడాన్ని ఆయన ఖండించారు. -
200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
మిర్యాలగూడ రూరల్: మండలం పరిధిలోని రాయినిపాలెం గ్రామంలో భారీగా నిల్వ ఉంచిన 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మిర్యాలగూడరూరల్ పోలీసులు మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో పట్టుకున్నారు. ఎస్ఐ కుంట శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో మూతబడిన పీఏసీఎస్ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని లారీలోకి డంపు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి బియ్యం పట్టుకున్నారు. బియ్యం భారీగా ఉండడంతో మిర్యాలగూడ డీఎస్పీ రాంగోపాల్రావు దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్పీ వెంటనే అక్కడకు చేరుకుని నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం బియ్యం ఎవరు నిల్వ చేశారన్న విషయంపై విచారించారు. బియ్యం నిల్వ చేసిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన రమణ, సహకరించిన రాయినిపాలెం గ్రామానికి చెందిన జయమ్మ, బియాన్ని తరలించేందుకు వచ్చిన లారీ యజమాని శ్రీనివాస్, డ్రైవర్ సకృపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియాన్ని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. -
వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముట్టడి
డీఎంఅండ్హెచ్వో ఘెరావ్ అంతర్గత బదిలీలు, సస్పెన్షన్కు గురైన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగుల డిమాండ్ సంఘీభావం ప్రకటించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కలెక్టర్ చొరవతో ఆందోళన విరమణ కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) : వైద్య ఆరోగ్య శాఖలో అంతర్గత బదిలీలు, సస్పెన్షన్కు గురైన సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్లతో వైద్య ఆరోగ్య ఉద్యోగ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ డీఎంహెచ్వో కార్యాలయాన్ని ముట్టడించారు. ఏజెన్సీ, జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో ఉద్యోగులు డీఎంహెచ్వో కార్యాలయం వద్దకు చేరుకుని డీఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్యను ఘెరావ్ చేశారు. కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏజెన్సీలో అరకొర సౌకర్యాల నడుమ విధులు నిర్వర్తిస్తూంటే, అనారోగ్యం, రక్తహీనతతో సంభవించిన మరణాలకు సిబ్బందిని బాధ్యులు చేస్తూ సస్షెండ్ చేయడంపై జేఏసీ నాయకులు గొంతి ఆస్కారరావు, ఎస్.విజయకుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎన్ఎం, ఎంపీహెచ్, ఎంపీహెచ్ఈవో, పీహెచ్ఎన్, పారా మెడికల్ సిబ్బందిని బాధ్యులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ఏజెన్సీ ప్రాంతంలో నెలకొన్న సమస్యలు, అంతర్గత సమస్యల పరిష్కారం కోసం అనేక విపతి పత్రాలు అందించినా స్పందించకపోవడంతో మార్చి 23న సమ్మె నోటీసు ఉన్నతాధికారులకు ఇచ్చామన్నారు. అప్పటి నుంచి చర్చలు జరపకపోవడంతో ప్రజాస్వామ్య రీతిలో హక్కుల సాధనకు ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందన్నారు. అత్యవసరసేవల విభాగానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖలో నెలకొన్న సమస్యలను కలెక్టర్, ఐటీడీఏ పీవోల దృష్టికి తీసుకెళ్లడంలో డీఎంహెచ్వో, గిరిజన డీఎంహెచ్వోలు వైఫల్యం చెందారని ఆరోపించారు. కింది స్థాయి íసిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ రోగులు, గర్భిణుల తరలింపునకు పీహెచ్సీకొక అంబులెన్స్, వైద్యాధికారి పర్యటనకు వాహన సౌకర్యం కల్పించాలని కోరారు. రిస్క్ అలవెన్సు మంజూరు చేయాలన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా మూడేళ్లు దాటిన ఉద్యోగులను ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు రిలీవర్తో ముడిపెట్టకుండా చూడాలని కోరారు. తమ సమస్యలపై అధికారులు స్పందించేవరకుఆందోళన విరమించేది లేదని స్పష్టం చేయడంతో డీఎంహెచ్వో ఆందోళనకారులతో చర్చించారు. చర్చలు విఫలం కావడంతో తిరిగి ఆందోళన కొనసాగించారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నేతలు ఉమామహేశ్వరరావు, ఎంవీవీ సత్యనారాయణ, డీఎల్ గంగాధర్, బియన్ మూర్తి, సీహెచ్ శ్రీనివాసరాజు, డీబీవీ ప్రసాద్, భాస్కరరావులతో పాటూ సిబ్బంది పాల్గొన్నారు. అత్యవసర సేవలు నిర్వీర్యం అత్యవసర సేవలైన వైద్య ఆరోగ్యశాఖను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు. మంగళవారం ఆయన డీఎంహెచ్వో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో కాళ్లవాపు, రక్తహీనత సమస్యతో గిరిజనులు చనిపోతుంటే అధికార యంత్రాంగం, ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించే వరకు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. అత్యవసర విభాగానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని వేధింపులకు గురిచేయడం అన్యాయమన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో ఒక్కో రంగాన్ని ప్రైవేటీకరిస్తోందన్నారు. అధికారంలో కొస్తే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు, ఉద్యోగులను తొలగించేందుకు అధికారుల ద్వారా వేధింపులకు పాల్పడడ, అక్రమ సస్పెన్షన్ల పేరుతో మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం తమ వంతు చేయూతనిస్తామని ఆయన సంఘీభావం ప్రకటించారు. పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు ప్రూటీకుమార్, బీసీ నేతలు గుబ్బల వెంకటేశ్వరరావు, బి.ప్రసన్నకుమార్, అల్లి రాజబాబు, బి.గోవిందు, ముత్తు సతీష్, గోపిశెట్టి సత్యనారాయణ, ఎస్సీ నాయకులు జంగా గగారిన్ పాల్గొన్నారు. కలెక్టర్ చొరవతో ఆందోళన విరమణ డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగ సంఘాల నేతలతో కలెక్టర్ బంగ్లాలో చర్చలు జరిపారు. సస్షెండ్కు గురైన సిబ్బందిపై ఉన్న ఉత్తర్వులను రద్దు చేసి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డీఎంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంత పీహెచ్సీ పరిధిలో చేపట్టిన అంతర్గత బదిలీలపై పునసమీక్ష చేయాలని సూచించారు. డీఎంహెచ్ఓ,ఉద్యోగ సంఘాలు ఒక కమిటీ వేసుకుని బదిలీ అవసరంపై చర్చించుకోవాలన్నారు. మిగతా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాలని డీఎంహెచ్వోను కలెక్టర్ ఆదేశించినట్టు జేఏసీ నేలలు ఆస్కారరావు, విజయ్కుమార్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కలెక్టర్కు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. -
పోలీసు జులుంపై జనాగ్రహం
= స్టేషన్ ను ముట్టడించిన ఎస్సీ కాలనీవాసులు = ఎస్ఐ చొరవతో ఆందోళన విరమణ చిలమత్తూరు: పోలీసుల జులుంపై ఆగ్రహించిన ప్రజలు స్టేష¯Œన్ ను ముట్టడించిన సంఘటన సోమవారం ఉదయం మండల కేంద్రమైన చిలమత్తూరులో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు... స్థానిక ఎస్సీ కాలనీలో ఆదివారం మదగలమ్మ జాతర సందర్భంగా అంగన్వాడీ సెంటర్ సమీపంలోని రచ్చకట్ట వద్ద ఐదుగురు చెక్కాబారా ఆడుకుంటుండగా ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. కొందరు పరిగెత్తగా దొరికిన ముగ్గురిని వారు చితకబాదారు. ఆదినారాయణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆ దెబ్బలు చూసి ఆయన భార్యకు, కాలనీవాసులకు పోలీసులపై కోపం కట్టలు తెంచుకుంది. అందరూ కలిసి సోమవారం ఉదయం పోలీసుస్టేçÙ¯ŒS వద్దకొచ్చి బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఇష్టమొచ్చినట్లు కొట్టడమే కాకుండా తమవారి దగ్గరున్న డబ్బులు కూడా లాగేసుకున్నారని ఆ ఇద్దరి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేసేవరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుక్కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ జమాల్బాషా కరువు బృందం బందోబస్తులో ఉన్నప్పటికీ హుటాహుటిన స్టేష¯ŒS వద్దకొచ్చారు. కాలనీ పెద్ద మనషులతో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అందుకయ్యే ఖర్చులు తానే పెట్టుకుంటానని చెప్పారు. అంతేకాకుండా ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన కానిస్టేబుâýæ్లపై తప్పకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
చంద్రలోక్ కాంప్లెక్స్ భవనం సీజ్
రాంగోపాల్పేట్: సికింద్రాబాద్ ప్యారడైజ్ చౌరస్తాలోని చంద్రలోక్ కాంప్లెక్స్ను అధికారులు సీజఃŠ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధరెడ్డిలు మంగళవారం భవనాన్ని సందర్శించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం భవనం రెయిలింగ్ కూలడంతో వెస్ట్మారేడుపల్లికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి దుర్మరణం పాలైన సంగతి విధితమే. మృతుడి కుటుంబానికి రూ.2.5లక్షల నష్టపరిహారం: మేయర్ భవనం రెయిలింగ్ కూలిన ఘటనలో మృతి చెందిన దుర్గయ్య కుటుంబానికి రూ.2లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. ఆపద్భందు పథకం కింద మరో రూ.50 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్మిక శాఖ నుంచి ఏదైనా ఆర్థిక సహాయానికి చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రలోక్ కాంప్లెక్స్ను సీజ్ చేసి జేఎన్టీయూ నివేదిక కోరనున్నట్లు తెలిపారు. పురాతన భవనాల యజమానులు, అసోసియేషన్లు ఇంజనీర్లను ఏర్పాటు చేసుకుని వాటిని పటిష్టం చేయించుకోవాలని కమిషనర్ జనార్ధన్రెడ్డి సూచించారు. భవనంపై ఉన్న సెల్టవర్లు, హోర్డింగ్లపై విచారణ చేపడతామన్నారు. మేయర్ వెళ్లిన 5 నిమిషాలకే.. మేయర్ మీడియాతో మాట్లాడి వెళ్లిన 5 నిమిషాలకే రెయిలింగ్లోని మరికొంత ఊడి పడింది. అంతకు ముందు మేయర్ నిలుచున్న చోటుకు 5 అడుగుల దూరంలోనే శిథిలాలు పడటం గమనార్హం. మళ్లీ కూలే ప్రమాదం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఎస్డీరోడ్ గుండా మళ్లించారు. -
బైబిల్ యూనివర్శిటీ సీజ్
డెంకాడ: మండలంలోని మోదవలస పంచాయతీలో గల బైబిల్ యూనివర్శిటీని శుక్రవారం సాయంత్రం అధికారులు సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ ఉత్తర్వుల మేరకు ఐసీడీఎస్ పీడీ రాబర్ట్స, రెవెన్యూ, పోలీస్ అధికారుల సహాయంతో సీజ్ చేసినట్టు ఎస్ఐ ధనుంజయరావు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా బైబిల్ యూనివర్శిటీ నిర్వహిస్తున్నారన్నారు. క్రై స్తవ బోధనల కోసం వివిధ ప్రాంతాలనుంచి బాల, బాలికలు ఇక్కడ చేరి విద్యనభ్యసిస్తున్నారు. వారిపై యూనివర్శిటీ డెరైక్టర్ లాజరస్ ప్రసన్నబాబు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చారుు. అవన్నీ రుజువు కావడంతో ఆయనపై కేసు నమోదు చేసి ప్రసన్న బాబును అరెస్టు చేశారు. అరుుతే యూనివర్శిటీ మాత్రం యథాతధంగా కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు శుక్రవారం సీజ్చేశారు. -
వామ పక్షాలు BSNL కార్యాలయం ముట్టడి
-
కలెక్టరేట్ ముట్టడి
నల్లగొండ టూటౌన్ : హాస్టల్ విద్యార్థుల మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ను ముట్టడించారు. అంతకుముందు స్థానిక గడియారం సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు కలెక్టరేట్లో చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు సాగర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎర్ర అఖిల్, ఎస్.భిక్షం, జిల్లా ఉపాధ్యక్షుడు బీవీ.చారి, సహాయ కార్యదర్శి బి.లింగయ్య, కోశాధికారి ఎం.చందర్రావు పాల్గొన్నారు. -
ఢాకా కేఫ్ ముట్టడి కేసులో మరో ఇద్దరి అరెస్ట్...
ఢాకాః బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కేఫ్ సీజ్ కేసులో మరో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశీ మూలాలు కలిగిన.. ఓ బ్రిటిష్ పౌరుడు సహా.. కెనడియన్ యూనివర్శిటీ విద్యార్థి అయిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతనెల్లో జరిగిన ఢాకా మారణహోమం తో వారికి సంబంధాలు ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఢాకా కేఫ్ దాడిలో మరో ఇద్దరు అనుమానితుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశీ మూలాలు కలిగిన బ్రిటిష్ పౌరుడు మస్నత్ కరీం తోపాటు... టొరంటో విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన తహ్మింద్ ఖాన్ లను బుధవారం రాత్రి నిర్బంధించినట్లు పోలీస్ ప్రతినిధి ఏకేఎమ్ షహిదుర్ రెహ్మాన్ వెల్లడించారు. ఎవరినైనా నేరస్థులుగా అనుమానించినప్పుడు వినియోగించే చట్టం ఐపీసీ సెక్షన్ 54 క్రింద వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా విదేశీయులు ఉండే హోలీ ఆర్టిజన్ కేఫ్ ను ముష్కరులు ముట్టడించిన సమయంలో జూలై 1వ తేదీ రాత్రి కరీం, ఖాన్ లు లోపలే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని బంధించి జరిపిన దాడిలో ఇద్దరు పోలీసులతోపాటు 20 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే కమెండోలు జూలై 2వ తేదీ ఉదయం ఢాకా కేఫ్ పై దండెత్తిన సమయంలో వారు బయట ప్రజలతోపాటు కనిపించినట్లు ఆధారాలనుబట్టి తెలుసుకున్నారు. అయితే కరీం, ఖాన్ లు ఇద్దరూ సెక్యూరిటీ సర్వీసెస్ లో ఉండేవారని, వారికి దాడితో ఎటువంటి సంబంధాలు లేవని వారి కుటుంబ సభ్యులు విచారణలో తెలిపారు. కాగా పోలీసులు ఈ వారం మొదట్లో ఢాకా మారణహోమం ప్రధాన సూత్రధారి బంగ్లాదేశ్ మూలాలు కలిగిన కెనడాకు చెందిన వ్యక్తి తమీమ్ చౌదురిగా గుర్తించారు. అతడికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి 25,000 డాలర్లు బహుమతిని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యం.. ప్రస్తుత అరెస్టులకు దారి తీసింది. -
‘బావర్చి హోటల్’ సీజ్
► మునిసిపల్ అధికారుల దాడి ► పరిశుభ్రత లోపించడంతో మూసివేత బోడుప్పల్: పరిశుభ్రత పట్టని ఓ హోటల్ను పీర్జాదిగూడ మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఉప్పల్ డిపో వద్ద ఉన్న బావర్చి హోటల్పై మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్రెడ్డి, శానిటరీ అధికారులు కలిసి బుధవారం ఆకస్మిక దాడి నిర్వహించారు. వివరాలు.. బావర్చి హోటల్ వెనుక వైపు గల మ్యాన్హోల్ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోందని స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం మున్సిపల్ కమిషనర్, శానిటరీ అధికారులు బావర్చి హోటల్ వెనుక ఉన్న మ్యాన్హోల్ను పరిశీలించగా మురుగునీరు, చెత్తా చెదారంతో నిండిపోయి ఉంది. అధికారులు సదరు హోటల్లోని కిచెన్ను పరిశీలించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉంది. ప్లాస్టిక్ డబ్బాల్లో కుళ్లిపోయిన చెత్తాచెదారం ఉంది. దోమలు, ఈగలు ఎగురుతున్నాయి. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో వండిని ఆహార పదార్థాలు తింటే ప్రజలు అనారోగ్యం పాలవడం ఖాయమని భావించిన అధికారులు హోటల్ను సీజ్ చేశారు. దాడిలో శానిటరీ ఇంజినీర్ సుక్రుతారెడ్డి, ఏఈ శ్రీనివాస్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
పుచ్చకాయల మధ్యలో గంజాయి
స్మగ్లర్లు గంజాయి రవాణాకు రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. గంజాయిని పుచ్చకాయల లోడుతో వెళ్తున్న ఓ లారీలో దాచి రవాణా చేస్తుండగా కడియం వద్ద పోలీసుల తనిఖీల్లో బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించి ఒక లారీ, టెంపో, రెండు ఎస్కార్టు కారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన రాజమండ్రి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన గంజాయి సుమారు 4 టన్నులు ఉంటుంది. -
జూలై 18న సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి
భిక్కనూరు: ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని, లేకపోతే తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ మాదిగ హెచ్చరించారు. జూలై 18న సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక నుంచి ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ పాదయాత్ర ఆదివారం భిక్కనూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా రమేశ్ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారం రాగానే మరోమాట మాట్లాడడం సర్వసాధారణంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వర్గీకరణ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, ఉపాధ్యక్షుడు శంకర్, మండల అధ్యక్షుడు పెంటయ్య సాగర్ పాల్గొన్నారు. -
అక్రమంగా తిరుగుతున్న రెండు బస్సులు సీజ్
ఎలాంటి అనుమతులు, రూట్ పర్మిట్ లేకుండా తిరుగుతున్న రెండు ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సులను నల్గొండ జిల్లా భువనగిరిలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరెడ్డి మంగళవారం పట్టుకున్నారు. బ్లూమూన్ ట్రావెల్స్కు చెందిన రెండు బస్సులు వైజాగ్ నుంచి హైదరాబాద్కు ప్యాసింజర్లను తరలిస్తుండగా భువనగిరిలో పట్టుకున్నారు. వీరిపై కేసులు బుక్ చేసి.. బస్సులను సీజ్ చేశారు. -
పిల్లులు.. కుక్కలను తింటున్నారు!
ఐసిస్ అధీనంలోని నగరాల్లో చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా అందంగా కనిపించినవారు కూడా ఎముకల గూడుల్లా తయారయ్యారు. కడుపు నిండని తల్లులు.. తమ బిడ్డలకు పాలు ఇవ్వలేని దీనావస్థకు చేరుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో వాటిని కొనలేక, కడుపు మాడ్చుకోలేక నానా అగచాట్లు పడుతున్నారు. అన్నం స్థానంలో గడ్డి, మూలికలు, వేళ్ల వంటి వాటితో కడుపునింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆకలికి తట్టుకోలేక చివరికి పిల్లులను, కుక్కలను చంపి తినేందుకూ వెనుకాడటం లేదు. సిరియా ముట్టడి ప్రాంతంలో శిశువులు వేలాది మంది పస్తులతో మరణిస్తున్నారు. నెలల వయసులోనే పోషకాహారం అందక తనువు చాలిస్తున్నారు. ఒకప్పుడు చమురు పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన డైర్ అజోర్ ప్రాంతం ఇప్పుడు మహిళలు, పిల్లల మరణాలకు సాక్షీభూతంగా నిలుస్తోంది. మధ్య ప్రాంతం నుంచి తప్పించుకొని డీర్ ఎజోర్ లో చిక్కుకున్న వేలాదిమంది శరణార్థులు తీరని కష్టాలు ఎదుర్కొంటున్నారు. బషర్ అల్ అస్సాద్ అందించే చాలీచాలని సరుకుల పంపిణీ.. శరణార్థులను చిక్కిశల్యమయ్యేలా చేస్తోంది. ఆహారధాన్యాలు అందించాలంటే సైన్యాధీనంలో ఉన్న ఆ ప్రాంతానికి కేవలం కార్గో విమానాలు మాత్రమే చేరే అవకాశం ఉంది. దీంతో చాలా మంది పిల్లలు.. తిండిలేక ఆకలితో మరణిస్తున్నారు. ఎముకల గూడుకు చర్మం అతికించినట్లుగా మారిపోతున్నారు. వేలాదిమంది చిన్నారులతో ఆస్పత్రులు నిండిపోయాయి. అతిసారం వంటి వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని శిశువుల చిత్రాలను చూస్తే అక్కడి వాస్తవిక పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. 11 నెలల నుంచి ఐసిస్ ముట్టడిలో ఉన్న డైర్ అజోర్లో చిక్కుకున్న సుమారు లక్ష మందికి పైగా శరణార్థులు ఆకలి, అనారోగ్యాలతో బాధపడుతూ జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. బషర్ అల్ అస్సద్ అధీనంలోకి డైర్ అజోర్ జిల్లాలు చేరిన 8 నెలలకు ఆ బిడ్డలు పుట్టినట్లు తెలుస్తోంది. పరిస్థితి దీనావస్థలో ఉన్న సమయంలో శుక్ర్ అల్ అఫ్రే. పుట్టాడు. అతని తల్లి మన్నార్ కస్సర్ అల్ డఘిమ్ ఆహారం లేక కనీసం బిడ్డకు పాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరింది. దీంతో పోషకాహారం లేని ఆ చిన్నారి తీవ్ర రక్తహీనతకు లోనయ్యాడు. బిడ్డల ప్రాణాలు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు దుఖసాగరంలో జీవిస్తున్నారు. చావైనా తమను కరుణించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తీవ్ర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. తిండిలేక, బతికేందుకు ఆసరా లేక శరణార్థులు చావే శరణ్యంగా జీవిస్తున్నారు. ముట్టడి ప్రాంతంలో సాధారణ జీవన పరిస్థితులు చిన్నాభిన్నమైపోయాయని, శరణార్థులు తిండిలేక.. ఆకలి తట్టుకోలేక ఏం కనిపించినా తినే స్థితికి చేరారని చెప్తున్నారు. స్థానిక జనజీవనం స్తంభించిపోయి, ఆస్పత్రుల్లో రోగులు, బయట సైనికులను మాత్రమే చూడగలిగే పరిస్థితి దాపురించిందని స్థానిక దుకాణదారుడు అబుల్ ఖాసిం చెప్తున్నాడు. రాత్రి పగలు తేడా లేకుండా తిండి కోసం జనం ఎదురు చూస్తున్నారని, పిల్లలను బతికించుకునేందుకు వేడినీటిలో ఉప్పు కలిపి, బ్రెడ్ తో పెడుతున్నారని అంటున్నాడు. రాను రాను పరిస్థితి మరీ దారుణంగా, భయంకరంగా మారుతోందని చెప్తున్నాడు. కుటుంబ సభ్యుల కడుపు నింపేందుకు పిల్లల అక్రమ రవాణా, వ్యభిచారం వంటి చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు. కొందరు ఆహారం కోసం ఇంట్లోని వస్తువులు, ఇళ్ళూ అమ్మేసిన దాఖలాలున్నాయి. కొందరు గడ్డి, మూలికలు, ఆకులు తింటుంటే.. మరి కొందరు కుక్కలు, పిల్లులను చంపి తినడం శోచనీయంగా మారింది. యుద్ధం కారణంగా నిత్యావసరాల ధరలు వంద రెట్లు పెరిగిపోయాయి. ఇప్పుడక్కడ ముగ్గురికి మాత్రమే తిండి దొరుకుతోంది. ఒకటి సైన్యం, మరొకరు విదేశాల్లో బంధువులు ఉన్నవారు, ఇంకొకరు సంపన్నులు. మిగిలినవారంతా కష్టాల కడలిలో జీవనం సాగిస్తున్నారు. ఆహారం అందే మార్గం లేక, ధరాఘాతాన్ని తట్టుకోలేక పొట్ట చేత పట్టుకొని, కళ్ళల్లో ప్రాణం పెట్టుకొని నిర్జీవంగా బతుకుతున్నారు. -
700 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం
గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల నీలి కిరోసిన్ను పట్టుకున్నారు. గుంటూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆటో నగర్లో నీలి కిరోసిన్ విక్రయిస్తుంటాడు. అతడి దుకాణంపై గురువారం మధ్యాహ్నం పోలీసులు దాడి చేసి 700 లీటర్ల నీలి కిరోసిన్ను పట్టుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నాగరాజు తన సెల్ఫోన్ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. సెల్ఫోన్ సహా కిరోసిన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. -
రూ. 30 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న 25 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధనీం చేసుకున్నారు. దుంగలతో పాటు వాటిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా శ్రీనివాస మాగాపురం వద్ద సోమవారం తెల్లవారుజామున పోలీసులు జరిపిన తనిఖీల్లో 25 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
120 కిలోల గంజాయి పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 120 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు గంజాయితో పాటు తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా జి.మాడుగులలో ఆదివారం చోటుచేసుకుంది. కోరాపల్లి నుంచి నర్సిపట్నం తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్ట్ చేశారు. -
అనంతగిరిలో 500 కేజీల గంజాయి పట్టివేత
అనంతగిరి మండలంలో పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో బుధవారం 500 కేజీల గంజాయి పట్టుబడింది. ఓ మినీ వ్యాన్లో గంజాయి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎర్రచందనం దుంగల స్వాధీనం
సిమెంట్ తయారీ కేంద్రంలో లారీలో అక్రమంగా నిల్వ ఉంచిన 19 ఎర్ర చందనం దుంగలను గుర్తించిన పోలీసులు లారీ సహా దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న సిమెంట్ మిశ్రమం తయారు చేసే కేంద్రంలో ఎర్ర చందనం దుంగలను దాచి ఉంచారనే సమాచారంతో దాడులు నిర్వహించారు. లారీలోని పొట్టు బస్తాల మధ్య దాచి ఉంచిన ఎర్ర చందనం దుంగలు పోలీసులు కనుగొన్నారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకొని వాటి విలువ అంచనా వేస్తున్నారు. -
సిమెంట్ లారీ సీజ్ - వెయ్యి బస్తాల స్వాధీనం
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ శివారులోని ఇక్బాల్పూర్ మార్కెట్ చెక్పోస్టు వద్ద వే బిల్లులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న సిమెంట్ లారీని సోమవారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని నాంధేడ్ నుంచి వే బిల్లులు లేకుండా వచ్చిన ఎంఎక్స్ 26 ఎడి 1285 నంబరు గల లారీ ఖానాపూర్లో సిమెంట్ అన్లోడ్ చేస్తుండగా పోలీసులకు ఎవరో సమాచారం ఇచ్చారు. పోలీసులను చూసిన లారీ డ్రైవర్ లారీని స్టార్ట్ చేసి ఇక్బాల్పూర్వైపు వేగంగా తీసుకెళ్లాడు. జీపులో వెంబడించిన పోలీసులు వ్యవసాయ మార్కెట్ చెక్పోస్టు వద్ద లారీని పట్టుకున్నారు. లారీ క్లీనర్ పోలీసులకు చిక్కాడు. డ్రైవర్ పక్కనున్న పొలాల్లోకి పరుగు తీశాడు. అతనిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పట్టుకున్న లారీలో వెయ్యికి పైగా సిమెంట్ బస్తాలు ఉన్నాయి. లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఖానాపూర్ ఎస్ఐ అజయ్బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
265 కేజీల గంజాయి పట్టివేత
పాడేరు - పెద్దబయలు రహదారిపై మఠం జంక్షన్ వద్ద 265 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని వ్యాన్లో తౌడు సంచుల మధ్య దాచి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు పాడేరు సీఐ శ్రీనివాసులు తెలిపారు. -
భారీగా మృత కళేబరాల సీజ్
ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి సమీపంలోని చాకలిగుంట వద్ద భారీగా మృత కళేబరాలు గుర్తించారు. మరో లారీ మృతకళేబరాలతో సిద్ధంగా ఉంది. హైదరాబాద్ నుంచి అక్కడకు తీసుకువచ్చినట్లు తెలిసింది. విషయం తెలిసి సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వీటిని నూనె తయారీలో వాడేందుకు తీసుకువచ్చినట్లు తెలిసింది. -
భారీగా గంజాయి పట్టివేత
అనంత గిరిలో బుధవారం 200 కేజీలగంజాయిని పట్టుకున్నారు. కూరగాయల వ్యాన్లో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి నిందితులను స్టేషన్కు తరలించారు. -
పేలుడు పదార్థాలు స్వాధీనం
నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఫోటోస్టుడియోపై టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం సాయంత్రం దాడిచేసి భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు స్టూడియోపై దాడిచేశారు. స్టుడియో యజమాని రెడ్డి సన్యాసినాయుడును అరెస్ట్చేశారు. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థం విలువ లక్ష రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. -
ఇసుక ట్రాక్టర్లు సీజ్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మరువాడ సమీపంలోని వేగవతి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను సీజ్ చేశారు. -
ఎర్ర చందనం స్వాధీనం
వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల వద్ద భారీగా ఎర్రచందనం పట్టుబడింది. సోమవారం తెల్లవారుజామున వాహనాలను తనిఖీ చేసున్న పోలీసులకు ఓ వ్యాన్ లో రూ.2 కోట్ల విలువైన 110 ఎర్రచందనం దుంగలు లభించాయి. పోలీసులను చూసిన వ్యాన్ డ్రైవర్, కూలీలు పరారయ్యారు. పోలీసులు దుంగలను స్వాధీనం చేసుకుని అటవీ శాఖాధికారులకు అప్పగించారు. -
మలక్పేటలో ఎక్సైజ్ దాడులు
మలక్పేట నియోజకవర్గంలోని సైదాబాద్, సింగరేణి కాలనీ, ఖాజాబాగ్, చింతల్ తదితర ప్రాంతాలలో బుధవారం ఉదయం హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.ఎం.ఫరూక్ ఆధ్వర్యంలో అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1,352 గుడుంబా ప్యాకెట్లు, 130 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఆరుగురిని రిమాండ్కు తరలించారు. మిగతా వారిని బైండోవర్ చేసి వదిలిపెట్టినట్టు అధికారులు తెలిపారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తరలించేందుకు సిద్ధంగా ఉన్న రూ.6 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కా సమాచారంతో మర్రిపాడు ఎస్సై సోమయ్య ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని కుంటనెల్లపాడు సమీపంలో రోడ్డు పక్కన తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 30 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వాటికి సంబంధించి అక్కడే మాటువేసి ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని, రెండు పల్సర్ బైక్లను సీజ్ చేశారు. నిందితులను రిమాండ్కు పంపారు. -
భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం
కర్నాటక రాష్ట్రంలో అక్రమంగా నిల్వ చేసిన రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగల్ని చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలతో పాటు ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఆదివారం బంగారుపాళ్యం, మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్ ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారంతో కర్నాటక రాష్ట్రం దొడ్లబళ్లాపూర్, కడనూర్ గ్రామంలో అంజాద్ కు చెందిన మామిడి తోటలో మూడు టన్నుల ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల జాడ పసిగట్టిన అంజాద్ పారిపోయినట్లు సమాచారం. అరెస్టయిన వారిలో చిత్తూరు నగరంలోని జాన్స్గార్డెన్కు చెందిన మహ్మద్ అల్తాఫ్ హుస్సేన్ (36), తమిళనాడు క్రిష్ణగిరి జిల్లా ఉత్తస్గారై తాలూకా కీలమత్తూరుకు చెందిన ఎస్.అరుల్ (25), ఎస్.శరవన (22)లు ఉన్నారు. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకన్నారు. మండల పరిధిలోని కళ్యాణి డ్యాం సమీపంలోని పెద్దగుండు వద్ద రెండున్నర టన్నుల ఎర్ర చందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు స్కార్పియో, స్విఫ్ట్, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 90 దుంగల విలువ సుమారూ రూ. 2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనావేశారు. -
సిలికాన్ తరలిస్తున్న నాలుగు లారీల పట్టివేత
అధికారయంత్రాంగం పట్టించుకోకున్నా గ్రామస్తులే అప్రమత్తమయ్యారు. తీరప్రాంతం నుంచి అక్రమంగా సిలికాన్ను తరలించుకుపోతున్న లారీలను అడ్డుకున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిల్లకూరు మండలంలో సముద్ర తీరం ప్రాంతంలోని ఇసుక నుంచి సిలికాన్ను వేరు చేసి కొందరు అక్రమంగా తరలించుకుపోతున్నారు. దీనిపై సమీప చింతవరం గ్రామస్తులు సోమవారం ఉదయం ఖనిజంతో వెళ్తున్న నాలుగు లారీలను అడ్డుకున్నారు. పోలీసులు, గనుల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు లారీలను సీజ్ చేశారు. -
బ్లడ్బ్యాంకులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరడా
సాక్షి, హైదరాబాద్: రక్తనిధి కేంద్రాలపై ఔషధ నియంత్రణ శాఖ కొరడా ఝుళిపిం చింది. రాష్ట్రంలోని 132 బ్లడ్ బ్యాంకుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. వీటిల్లో చాలా వరకు రక్తదాతలు, స్వీకర్తల వివరాలు నమోదు చేయకపోగా, నిర్ధేశించిన ధర కన్నా అధిక మొత్తానికి రక్తాన్ని అమ్ముతున్నట్లు గుర్తించింది. అర్హులైన టెక్నిషియన్లు లేకపోవడం, దాత నుంచి సేకరించిన రక్తాన్ని గ్రూపులుగా విభజించి శుద్ధి చేసిన తర్వాత నిల్వచేయడం, చివరకు బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణ, ఇలా అంతా లోపభూయిష్టంగా ఉన్నట్లు వెల్లడయింది. బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రితోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంకులు సహా 109 కేంద్రాలకు నోటీసులు జారీ చేసిం ది. వారంలోగా వివరణ ఇవ్వాలని, లేదంటే లెసైన్స్లను రద్దు చేయడంతోపాటు కేంద్రాలను సీజ్ చేస్తామని హెచ్చరించింది. గతంలో హెచ్చరించినా మారని తీరు... తెలంగాణలో 132 బ్లడ్ బ్యాంకులు రిజిస్ట్రర్ కాగా, ఇందులో 35 స్టోరేజ్ సెంటర్లు ఉన్నా యి. వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే అత్యధికంగా 61 బ్లడ్బ్యాంకులు ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 21 ఉన్నాయి. నోటీసులు అందుకున్న వాటిలో గ్రేటర్లోని బ్లడ్ బ్యాంకులే ఎక్కువ. ఔషధ నియంత్రణ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సుల్తాన్బజార్, పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులతోపాటు నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రి రక్తనిధి కేంద్రాల్లో తనిఖీ నిర్వహించి కనీస వసతులు లేవని నోటీసులు జారీ చేశారు. అక్కడ నిల్వ ఉన్న బ్లడ్ బాటిళ్లను సీజ్ చేశారు. నిలోఫర్లో 45 బాటిళ్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయినా ఆయా బ్లడ్బ్యాంకులు తీరు మార్చుకోలేదు. తలసీమియా బాధితులకు విక్రయం.. డ్రగ్కంట్రోల్ బోర్డు అధికారులు ప్రతి మూడు మాసాలకు ఒకసారి రక్త కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలి. ఆరు మాసాలకోసారి కూడా అటువైపు చూడటం లేదు. రక్తదాన శిబిరాలు నిర్వహించి సేకరించిన రక్తం లో 30 శాతం రక్తాన్ని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఇవ్వాలనే నిబంధన ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. తలసీమియా బాధితులకు రక్తాన్ని ఉచితంగా సరఫరా చేయాలనే నిబంధనను పట్టించుకోకపోగా.. ఒక్కో బాటిల్పై రూ.1200 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒ,ఎ, బి, నెగిటీవ్ రక్తంతో పాటు తెల్లరక్త కణాలు, ప్లాస్మా వంటివి కావాలంటే అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. -
‘దావూద్, సయీద్ ఆస్తులను సీజ్ చేయండి’
న్యూఢిల్లీ: అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీల ఆస్తులను సీజ్ చేయాలని పాకిస్తాన్ను భారత్ కోరనుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల జాబితాలో ఉన్న ఈ ముగ్గురు పాక్లో ఉన్నందున ఆ దేశం వీరి ఆస్తులను సీజ్ చేయాల్సి ఉంటుంది. ఐరాస మండలిలోని అల్ కాయిదా, తాలిబాన్ ఆంక్షల కమిటీ దావూద్పై 2003లో, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు సయీద్, ముంబై ఉగ్రదాడుల సూత్రధారి లఖ్వీలపై 2008లో ఆంక్షలు విధించింది. అందువల్ల వీరి ఆస్తులను సీజ్ చేయడం ఐరాస సభ్య దేశమైన పాక్ బాధ్యత. ‘ఈ ముగ్గురి ఆస్తులను సీజ్ చేశారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఒకవేళ సీజ్ చేయకుంటే ఇప్పుడు తక్షణమే వారి ఆస్తులను సీజ్ చేయండి. దీనిపై పాక్కు త్వరలోనే లేఖ రాయాలనుకుంటున్నాం’ అని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఐరాస ఆంక్షల జాబితాలో ఉంటే వారి ఆస్తులను సీజ్ చేయడంతోపాటు వారి ఆయుధాలను, ప్రయాణాలను నిషేధించాల్సి ఉంటుంది. -
భారీగా ఇసుక డంపులు సీజ్
తాండూరు: యాలాల మండలంలో భారీ ఇసుక డంపును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కాగ్నానది నుంచి అక్రమంగా తరలించిన ఇసుకను మండలంలో పరిధిలో పలుచోట్ల అక్రమార్కులు ఇసుక డంపులను నిల్వ చేశారు. మంగళవారం తాండూరు తహసీల్దార్ గోవింద్రావుతోపాటు యాలాల,తాండూరు రెవెన్యూ అధికారులు ఆయా చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 21 ట్రాక్టర్ల ఇసుక డంపులు బయటపడగా వాటిని సీజ్ చేశారు. యాలాల మండల పరిధిలోని ప్రతిభా స్కూల్ సమీపంలో ఆరు ట్రాక్టర్ల ఇసుక, లక్ష్మీనారాయణపూర్ నుంచి బషీరాబాద్ మార్గంలో కాటన్ ఇండస్ట్రీస్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో మరో 15 ట్రాక్టర్ల ఇసుక డంపులు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి.దాంతో ఇసుక డంపులను సీజ్ చేసినట్టు తహసీల్దార్ పేర్కొన్నారు. సీజ్ చేసిన ఇసుక డంపులు మాయంకాకుండా చూడాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ చాంద్పాషాను తహసీల్దార్ ఆదేశించారు. పాతతాండూరుతోపాటు యాలాల మండలంలోని కాగ్నా నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అంతకుముందు తాండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ సాజిద్ అలీ తహసీల్దార్ గోవింద్రావుతో వాదించారు. చర్యలు తీసుకుంటున్నామని, సిబ్బంది కొరత వల్ల రాత్రి తనిఖీలు చేయడం వీలుకావడం లేదని తహసీల్దార్ వైస్ చైర్మన్తో స్పష్టం చేశారు. చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని కౌన్సిల్ ఎంఐఎం ఫ్లోర్లీడర్అసిఫ్ పేర్కొన్నారు. -
కల్తీ మద్యం విక్రయిస్తున్న షాప్ సీజ్
- పక్కనే బ్లాక్లో అమ్మకాలు - పట్టించుకోని ఎక్సైజ్శాఖ కారేపల్లి: కల్తీ మద్యం విక్రయిస్తున్న కారేపల్లిలోని శ్రీ కనకదుర్గా వైన్షాపును మంగళవారం రాత్రి కారేపల్లి ఎక్సైజ్ సీఐ రమ్యారెడ్డి, సిబ్బందితో వచ్చి సీజ్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆమె ఈ విషయాన్ని తెలిపారు. కారేపల్లి వైన్ దుకాణంలోని మద్యం బాటిల్స్ను వరంగల్లోని లేబోరేటరీలో పరీక్షించామన్నారు. మద్యంలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయిందన్నారు. ఖమ్మం ఎక్సైజ్ డీసీ మహేశ్బాబు ఆదేశాల మేరకు శ్రీ కనకదుర్గా వైన్షాప్ను సీజ్ చేశామన్నారు. బ్లాక్లో ఎంచక్కా.. కారేపల్లిలోని శ్రీ కనకదుర్గా వైన్షాప్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసినా ఎంచక్కా ఆ దుకాణం పక్కనే ఓ బడ్డీ కొట్టులో బ్లాక్లో మద్యం విక్రయూలు జరుపుతున్నారు. ఎక్కువ ధరలు వెచ్చించి మద్యం ప్రియులు ఇక్కడి మందును బ్లాక్లో కొంటున్నారు. ఈ చర్యతో ఎక్సైజ్ అధికారుల ప్రయత్నం వృథా ప్రయూసగానే మిగిలిందని పలువురంటున్నారు. -
సాయివరలక్ష్మి ఆగ్రోఫుడ్స్రైస్మిల్ సీజ్
మిల్లులో ఉన్న బియ్యం ఎఫ్సీఐకి తరలింపు గంట్యాడ: ఫిబ్రవరి 2వ తేదీన వెలుగులోకి వచ్చిన ఫోర్జరీ ట్రక్షీట్ల వ్యవహారంపై ఎట్టకేలకు అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. బినామీ పేర్లతో ఫోర్జరీ సంతకాలు చేసి అటురైతులను,ఇటుప్రభుత్వాన్ని మోసంచేసి అక్రమంగా ధాన్యం కొనుగోలుచేసిన సాయివరలక్ష్మి ఆగ్రోఫుడ్స్ రైస్మిల్ యజమానిపై కేసునమోదుచేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. రైతులు,అయ్యప్ప ట్రేడర్స్ రైస్మిల్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లాయంత్రాంగం విచారణ చేపట్టింది.అధికారులు చేపట్టిన దర్యాప్తులో సాయివరలక్ష్మి ఆగ్రోఫుడ్స్ యజమాని అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో జేసీ ఆదేశాల మేరకు శుక్రవారం మిల్లులో ఉన్న బియ్యం, ధాన్యం నిల్వలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీన పరుచుకున్న బియ్యాన్ని విజయనగరం ఎఫ్సీఐ గొడౌన్కు తరలించగా,ధాన్యాన్ని సమీపానగల రైస్మిల్కు అప్పగిస్తామని తమశీల్దార్ బాపిరాజు తెలిపారు.గ్రామపెద్దల సమక్షంలో నిల్వలను లెక్కించి స్వాధీన పరుచుకున్నారు.అక్రమాలకు పాల్పడిన మిల్ యజమాని కొల్లా బద్రీనాథ్ద్పై 6ఎ కేసుతోపాటు,మిల్ లెసైన్స్ రద్దుచేసి బ్లాక్ లిస్టులో పెట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. బినామీపేర్లతో సంతకాలు ఫోర్జరీ చేసినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సంబంధిత అధికారులకు కలెక్టర్ ఎం.ఎం.నాయక్ ఆదేశాలు జారీచేశారు. రైతుల ఆందోళన మిల్ యజమాని పరారీలో ఉండడంతో మిల్లులో ఉన్న నిల్వలను అధికారులు స్వాదీనం చేసుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిల్లులో ఉన్నధాన్యం రైతులకు ఇప్పించాలని తహశీల్దార్ బాపిరాజును కోరారు.6ఎ కేసు నమోదు చేయడంవల్ల ధాన్యం రైతులకు ఇచ్చే అవకాశంలేదని, ఫిర్యాదు చేసిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తహశీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు కాస్త ఊరట చెందారు. -
నకిలీ ఆధార్ సెంటర్ సీజ్
హన్మకొండ అర్బన్ : హన్మకొండ సుబేదారిలోని నకిలీ ఆధార్ కేంద్రాన్ని రెవెన్యూ, పోలీస్ అధికారులు బుధవారం సంయుక్తంగా దాడి చేసి సీజ్ చేశారు. ఆసరా పింఛన్ల కోసం ఆధార్ కార్డుల్లో వ్యక్తుల వయసు మార్పులు చేస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీనిపై కలెక్టర్కు కొందరు వ్యక్తులు సమాచారం అందించారు. దీంతో బుధవారం రాత్రి సుబేదారిలోని ఎఫ్ఎన్ స్పేస్ ఇంటర్నెట్ సెంటర్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఆధార్ కార్డుల్లో మార్పులు చేస్తున్నట్లు గుర్తించారు. రెండు లాప్ట్యాప్లు, ప్రింటర్లు, ఐరిష్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా, నకిలీ కేంద్రం నిర్వాహకుడికి పాస్వర్డ్ ఎలా వచ్చిందని అధికారులు విచారిస్తున్నారు. గతంలో జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ప్రస్తుతం పనపిచేయడంలేదు. ప్రసుతం స్వాధీనం చేసుకున్న పరికరాలను పరిశీలించి, నిర్వాహకులను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. తనిఖీల్లో హన్మకొండ తహసీల్దార్ చెన్నయ్య, డీఐఓ విజయ్కుమార్, శ్రీధర్, సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సత్యనారాయణ, శివశంకర్, సుబేదారి పోలీసులు పాల్గొన్నారు. -
బైక్ రేసర్లపై కొరడా
ఖైరతాబాద్/ రాంగోపాల్పేట్: బైక్ రేసింగ్లను అరికట్టేందుకు ఆదివారం నెక్లెస్ రోడ్డులో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 72 బైక్లను సీజ్ చేశారు. సైఫాబాద్, రాంగోపాల్పేట్, లేక్ పోలీసులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. యువకులను అదుపులోకి తీసుకొని, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల విలువ చేసే వివిధ రకాల బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అడిషినల్ డీసీపీ రాంమోహన్రావు మాట్లాడుతూ ఇంటర్, డిగ్రీ చదివే పిల్లలు రేసింగ్ మోజుతో ఉదయం లేవగానే బైక్లపై ఇక్కడికి వస్తున్నారు. అతివేగంతో, ఫీట్లు చేస్తూ ప్రమాదాల బారిన పడటమే కాకుండా నెక్లెస్ రోడ్డులో వాకింగ్కు వచ్చే వారిని ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ప్రాణాలపై తెస్తున్నారు. ఇలాంటి రేసింగ్లు ఇక్కడ పూర్తిగా నిషేధించాలనే లక్ష్యంతో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని చెప్పారు. స్పెషల్ డ్రైవ్లో 72 ద్విచక్రవాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు సీజ్ చేసిన వాహనాలు మరోసారి గనుక పట్టుపడితే వారి లెసైన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇంటర్ చదివే విద్యార్థికి రూ. 2 లక్షల విలువ చేసే బైక్ అవసరమా అనే విషయాన్ని తల్లిదండ్రులు ఆలోచించాలని ఆయన సూచించారు. మరో మారు ఇలాగే వచ్చి రేసింగ్లకు పాల్పడి పోలీసులకు చిక్కితే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్లో సైఫాబాద్ ఏసీపీ సురేందర్రెడ్డి, ఇన్స్పెక్టర్లు గంగారెడ్డి, జానకమ్మ పాల్గొన్నారు. -
10 గ్యాస్ సిలిండర్లు సీజ్
నర్సింహులపేట : అక్రమంగా నిల్వ చేసిన 10 గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లయ్ అధికారులు సీజ్ చేసిన సంఘటన మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నారుు. గ్రామంలో కొన్నాళ్లుగా అధిక ధరకు భారత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న వ్యవహారంపై ఇటీవల కొందరు గ్రామస్తులు జాయింట్ కలెక్టర్, డీఎస్ఓకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాలతో సివిల్ సప్లై డీటీ అశోక్ కుమార్ గ్రామానికి చేరుకుని కొనకటి దామోదర్రెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా 10 గ్యాస్ సిలిండర్లు లభ్యమయ్యూయి. ఇంట్లో నిల్వ చేసినందుకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించి సీజ్ చేసి, నాగార్జున భారత్ గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. నిందితుడు దామోదర్రెడ్డిపై 6ఏ కేసు నమోదు చేశారు. మూడు రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు ఇదిలా ఉండగా గ్యాస్ సిలిండర్కు రూ.550 వసూలు చేయడంపై గ్రామానికి చెందిన వీరభద్రి అనే యువకుడు ఇటీవల భారత్ గ్యాస్ కంపెనీకి ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. అరుుతే విషయం తెలుసుకున్న కొనకటి దామోదర్రెడ్డి కుమారుడు వెంకట్రెడ్డి అతడిని గత నెల 27న పిలిచి దుర్భాషలాడాడు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఫిర్యాదు స్వీకరించిన ఏఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. అంతేగాక కనీసం ఫిర్యాదు స్వీకరించినట్లు రశీదు కూడా ఇవ్వలేదని బాధితుడు తెలిపాడు. కాగా తమ ఇంట్లో గ్యాస్ సిలిండర్ల సమాచారం ఇచ్చాడనే నెపంతో అదే రాత్రి సమీపంలోని మరో యువకుడి ఇంటికి వెళ్లి దామోదర్రెడ్డి కుమారుడు దుర్భాషలాడి, భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలిసింది. ఇతడి విషయంలో పోలీసులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. -
31 ఇసుక లారీల సీజ్
ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో పోలీసుల తనిఖీ ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్కు ఇసుక రవాణా చేస్తున్న 31 లారీలను ఆంధ్ర సరిహద్దులో పోలీసులు సీజ్ చేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు పురుషోత్తపురం చెక్పోస్టు వద్ద పట్టణ ఎస్సై కె.వాసునారాయణ సిబ్బందితో తనిఖీ చేసి లారీలను పట్టుకుని పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని లారీలను పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు. 31 లారీల్లో సుమారు 550 టన్నులు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. టెక్కలి ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు ఇచ్ఛాపురం చేరుకుని వాహనాలన్నింటినీ సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. తహశీల్దారు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఒడిశాలోని ఇసుకను ఆంధ్రకు తరలించడానికి ఎలాంటి అనుమతి లేదని ఆర్డీఓ చెప్పారు. లారీలు కావాలనుకుంటే ఇసుక ఇక్కడ వదిలేసి ఖాళీ వాహనాలతో ఆంధ్రలోకి వెళ్లండి లేదా ఇసుకతో సహా తిరిగి ఒడిశా వెళ్లిపోవాలని ఆర్డీఓ లారీ డ్రైవర్లుకు సూచించారు. తమ వాహనాలను విడిచిపెట్టాలని ఆర్డీఓని లారీల సిబ్బంది కోరగా ఆయన అంగీకరించలేదు. కాగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్న లారీల్లో అన్నీ ఆంధ్రావే కావడం గమనార్హం. ఎచ్చెర్లలో పది.. ఎచ్చెర్ల: ఒడిశా నుంచి విశాఖపట్నం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి అధికారులు తనిఖీలు చేసి రెండు 8 లారీలు.. గురువారం సాయంత్రం ఎచ్చెర్ల తహశీల్దారు బందర వెంకటరావు ఆధ్వర్యంలోని బృందం తనిఖీలు చేసి రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ లారీలను పోలీసులకు అప్పగించారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కు ఒడిశా నుంచి ఇసుక తరలింపునకు అనుమతి లేదు. -
అక్రమ ఇసుకపై.. దాడులకు రెడీ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అక్రమ ఇసుక నిల్వలపై దాడులు చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా ఒకేసారి అక్రమ ఇసుక నిల్వలపై దాడులు నిర్వహించి సీజ్ చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా సీజ్ చేసుకున్న నిల్వలను ఇప్పటికే గుర్తించిన ఇసుక రీచ్ల వద్దకు వెంటనే తరలించాలని కూడా యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇసుక నిల్వలు అక్రమంగా దాచి ఉంచారనే సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా ఒకసారి రహస్యంగా సర్వే చేసిన అనంతరం.. దాడులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే ఒకసారి నందికొట్కూరులో ఇటువంటి ఆపరేషన్ ఫెయిల్ అయిన నేపథ్యంలో ఈసారి మరింత జాగ్రత్తగా ‘ఆపరేషన్ అక్రమ ఇసుక’ చేపట్టాలనేది అధికారుల భావనగా ఉంది. జాయింట్ ఆపరేషన్..! రెవెన్యూ, మైనింగ్ అధికారులతో పాటు ఉమ్మడిగా దాడులు నిర్వహించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఎక్కడెక్కడ నిల్వలు ఉన్నాయనే విషయంలో మూడు శాఖల అధికారులు కలిసి చర్చించారు. అక్రమ నిల్వలు ఉన్న ప్రాంతాలపై ఏకకాలంలో సంయుక్తంగా దాడులు చేసి సీజ్ చేయాలని భావిస్తున్నారు. సీజ్ చేసిన ఇసుకను జిల్లా మహిళా సమాఖ్య సహాయంతో ట్రాక్టర్లు, లారీల ద్వారాఅక్రమ ఇసుకపై.. దాడులకు రెడీ! వెంటనే ఇప్పటికే గుర్తించిన నాలుగు ఇసుక రీచ్ల (నిడ్జూరు, జి. శింగవరం, మంత్రాలయం, పూడురు)కు చేరవేయాలని ప్రణాళిక రచించారు. అంతేకాకుండా ఆ ఇసుక రీచ్ల నుంచి కూడా మళ్లీ ఇసుక తరలిపోకుండా.. చుట్టూ సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆయుధాలతో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది (ఆర్మ్డ్ సెక్యూరిటీ)ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సీసీ టీవీలు, సెక్యూరిటీ సిబ్బంది కోసం అధికారులు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. రీచ్లల్లో ఏవీ నిల్వలు.. ఇసుక పాలసీ-2014 కింద ఇసుక అమ్మకాలను మహిళా సంఘాల ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో నాలుగు రీచ్లను గుర్తించారు. అయితే, ఈ ప్రక్రియ ముగిసే సమయానికే రీచ్ల్లోని ఇసుక నిల్వలను మాఫియా మొత్తం తవ్వుకుని తరలించి అక్రమంగా నిల్వ చేసుకుంది. తీరా మహిళా సంఘాలకు అప్పగించే సమయానికి నిల్వలు లేకుండా పోయిన దుస్థితి ఏర్పడింది. జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు ఇసుక రీచ్ల వద్ద కలిపి మొత్తం కేవలం 8,27,467 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు మాత్రమే ఉన్నాయి. వాస్తవంగా ఉన్న డిమాండ్కు ఈ నిల్వలు ఏ మాత్రమూ సరిపోని పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్రమంగా ఉన్న ఇసుక నిల్వలు వీటికి నాలుగైదు రెట్ల మేరకు ఉంటుందనేది అధికారులు అంచనా. అయితే, వాస్తవంగా అంతకంటే ఎక్కువగా ఉంటుందనే వాదన కూడా ఉంది. ఈ నిల్వలను పెంచుకునేందుకు ఇప్పటికే నందికొట్కూరు ప్రాంతంలో భారీగా ఉన్న నిల్వలపై దాడులు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న అక్రమార్కులు ఇసుక నిల్వలను హైదరాబాద్కు వే బిల్లులు లేకుండా తరలించుకుపోతున్నారు. ఈ వ్యవహారంలో ఇటు పోలీసులతో పాటు అటు మైనింగ్ అధికారులకు భారీగా మామూళ్లు ముట్టుతుండటంతో కిమ్మనకుండా ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో నిజాయితీ కలిగిన అధికారులతో కలిసి ‘ఆపరేషన్ అక్రమ ఇసుక’ను చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేశారు. రీచ్ల్లో తవ్వే పరిస్థితీ లేదు...! వాస్తవానికి ఇసుక డిమాండ్ మేరకు సరఫరా చేసేందుకు వీలుగా నిల్వలు పెంచుకునేందుకు వీలుగా రీచ్ల్లో తవ్వకాలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అయితే, ఈ రీచ్ల్లో ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు నిబంధనలు అడ్డువస్తున్నాయి. ఈ రీచ్లన్నీ అంతర్ రాష్ర్ట పరిధిలోకి వస్తున్నాయి. అయితే, అటు కర్నాటక లేదంటే తెలంగాణ రాష్ర్టంతో కలిసి ఉన్నాయి. ఈ రీచ్ల్లో తవ్వకాలు చేపట్టాలంటే ఆయా రాష్ట్రాల అనుమతులు కూడా తప్పనిసరి. మరోవైపు రీచ్ల్లో ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు కేంద్ర అటవీ పర్యావరణశాఖ అనుమతులు తప్పనిసరి. అయితే, ఇక్కడ తవ్వకాలు చేపట్టేందుకు ఇప్పటివరకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు కూడా లభించలేదు. ఈ విధంగా అంతర్ రాష్ర్ట, పర్యావరణ అనుమతుల లేమి ఇబ్బందులతో అడుగు ముందుకు వేయలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అనుమతులు వచ్చేలోగా అక్రమ ఇసుక నిల్వల భరతం పట్టాలనేది అధికారుల అభిప్రాయంగా ఉంది. ఈ ప్రయత్నాలు ఇసుక మాఫియా ముందు ఏ మేరకు ఫలిస్తాయనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. -
సూత్రధారుల గుట్టు రట్టయ్యేనా?
యూనివర్సిటీ: ఎస్కేయూలో భారీ కుంభకోణంపై విచారణ కమిటీ చేపడుతున్న దర్యాప్తు రోజుకో మలుపుతిరుగుతోంది. ప్రతిరోజూ కొత్త బినామీ ఖాతాలు బయటపడుతున్నాయి. దీంతో ఆఖాతాలను సీజ్ చేస్తున్నారు. ఏక కాలంలో హైదరాబాదు, బెంగుళూరుల్లోని వివిధ బ్యాంకు ఖాతాలకు నగదును జమ చేయడంపై దర్యాప్తు కమిటీ నివ్వెరపోతోంది. తెరవెనుక సూత్రధారుల ప్రమేయం లేనిదే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దారి మళ్లించే సాహసం చేయలేరని తెలుస్తోంది. భారీగా సొమ్ము స్వాహా చేసిన ఫైనాన్స్ విభాగపు ఉద్యోగులు ఉదయభాస్కర్రెడ్డి, శేషయ్య ఇప్పటికే పరారీలో ఉండగా, వీరిని నడిపించిన సూత్రధారుల్లో గుబులు రేగుతోంది. పీహెచడీ అడ్వాన్స్ ఇంక్రిమెంట్లను కొల్లగొట్టారు: ఎస్కేయూలోని భోదనా సిబ్బందికి చెల్లించిన జీతాల్లో ఫీహెచ్డీ ఇంక్రిమెంట్ల రూపంలో రూ.1,30,69,284 లను చెల్లించారు. సాధారణంగా ఫీహెచ్డీ ఇంక్రిమెంట్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుకు మాత్రమే చెల్లించాలి. తద్భిన్నంగా భోదనా సిబ్బంది అందరికీ చెల్లించారు. ఈ నిబంధనలకు పరిగణలోకి తీసుకున్న ఆడిట్ విభాగం ఎక్కువగా చెల్లించిన ఇంక్రిమెంట్లను రికవరీ చేయాలని 2013 ఏప్రిల్ న రిజిస్ట్రార్ ఆచార్య గోవిందప్పకు సూచించారు. దీంతో తప్పును సరిదిద్దుకొన్న వర్సిటీ యాజమాన్యం వెంటనే వారి జీతాల నుంచి ఈ మెత్తాలను మినహాయించాలని ఆదేశాలు జారీ చేసింది. వీటిలో నుంచి రూ.99,62,562లను చెల్లించారు. తక్కిన రూ.31,33,722లను వెనక్కి తిరిగి చూడకుండా స్వాహా చేసేశారు. వీటికి సంబందించిన వివరాలను ఆడిట్ వాళ్లు అడిగినా కూడా కాలయాపన చేయడంతో పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. బ్యాంకు అధికారులకు బాధ్యత లేదా?.. ఖాతాను ప్రారంబించేటపుడు సవాలక్ష వివరాలను అడిగే బ్యాంకర్లు బినామీ ఖాతాల్లోకి జమ చేసేటపుడు ఎందుకు ఆరాతీయలేదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జీతాలను నేరుగా బినామీ ఖాతాల్లోకి మళ్లించినపుడు ఏర్పడే వ్యత్యాసాన్ని ఎందుకు పసిగట్టలేక పోయాయి. కేవ లం ఫెన్డ్రైవ్ తీసుకవచ్చిన సమాచారాన్ని ,హార్డ్ కాపీలో ఉన్న సమాచారాన్ని సమతుల్యత తేదని ఎందుకు ప్రశ్నించలేదు. ఫెన్డ్రైవ్ను బ్యాంకులోకి తీసుకెళ్లి ఉదయభాస్కర్రెడ్డితోనే ఆన్లైన్లోకి నగదును వేసేలా కంప్యూటర్ ఆపరేట్ చేసే అంత చొరవ ఒక వర్సిటీ ఉద్యోగికి ఎందుకు ఇచ్చినట్లు? బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయిన విజువల్సే ఇందుకు సజీవసాక్షాలు. ప్రస్తుతం నూతన బ్యాంకు మేనేజర్ రాకతో ఈ విషయం బట్టబయలైంది. దీంతో గతంలో పనిచేసిన వారికీ ఈ వ్యవహారంతో సం బంధం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆడిటింగ్ అభ్యంతరాలనూ విస్మరించారు.. ప్రతి నెలా జీతాల బిల్లులో ఆఫీసర్స్, టీచింగ్ స్టాఫ్, నా న్టీ చింగ్స్టాఫ్, హాస్టల్ స్టాఫ్, ఫెన్షన్ ఎంత చెల్లిస్తున్నామనే వి వరాలను ఆడిటింగ్కు తెలుపుతున్నారు. కానీ వీరిలో ఎవరు టీచింగ్, నాన్టీచింగ్ అనే పూర్తి వివరాలు ఇవ్వాలని ఆడిటింగ్ వారు కోరినా నిరాశే ఎదురైందన్నది వారి రిపోర్టు తెలయిచేస్తోంది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన బ్లాక్ గ్రాంట్స్ లో దారి మళ్లించకుండా జాగ్రత్త వహించి దూరవిద్య ఆదాయం,పెన్షన్స్ ,బెనిఫిట్స్ , ఇంక్రిమెంట్లు, వర్సిటీ ఇతర అంతర్గతవనరులకు కన్నం వేశారు. ఎందుకుంటే ప్రతి మూడు నెలలకు వినియోగ పత్రాలను ఆడిట్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతో చిక్కిపోతామనే జాగ్రత్త వహించారు. సీబీఐతో విచారణ చేయించాలి విద్యార్థి సంఘాల డిమాండ్ యూనివర్సిటీ: ఎస్కేయూలోని భారీ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు మంగళవారం వర్సిటీలో ఆందోళనకు దిగారు. వీసీ కే లాల్కిశోర్ తన చాంబర్లో విచారణ కమిటీ అధికారులతో సమావేశమై ఉండగా ఆందోళనకారులు చాంబర్లోకి చొరబడ్డారు. దీంతో చాంబర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను అదుపుచేశారు. విద్యార్థి నాయకులు వీసీతో వాగ్వాదానికి దిగారు. నిధుల స్వాహాకు సంబంధించిన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. వివరాలను వెల్లడించాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం స్టేట్ స్టీరింగ్ కమిటీ మెంబర్ జీవీ లింగారెడ్డి, రవి, క్రాంతికిరణ్, సోమేష్కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, నాగరాజు, ఐకాస నేతలు బాలస్వామి, పరుశురాంనాయక్, కొంకా మల్లిఖార్జున,ఓబులేసు తదితరులు డిమాండ్ చేశారు. విచారణ కమిటీ కన్వీనర్ ఆచార్య రెడ్డి వెంకటరాజు వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లో... ‘ఎస్కేయూ వర్సిటీ బోధనా సిబ్బందికి సంబంధించి ఈ నెల 6న ఉదయ భాస్కర్రెడ్డి ఖాతాలోకి రూ.11 లక్షలు ఆరు ఖాతాల్లోకి జమ కావడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై తనిఖీ నిర్వహించడంతో గుట్టు బయటపడింది. ఈ నెల జీతాల చెల్లింపుల ఖాతాను (హార్డ్ కాపీ)నిర్వహించకపోవడంతో కూపీ లాగడంతో అవినీతి భాగోతం బయటపడింది. వర్సిటీ ఉద్యోగుల నుంచి జీతాలను తమ ఖాతాలోకి మార్చుకోవడం, అరియర్స్, కరువు భత్యం, పెన్షన్లలో అందినకాడికి దారి మళ్లించినట్లు గుర్తించాం. నిన్న, నేడు మరో రెండు బినామీ ఖాతాలు బయటపడ్డాయి. ఉదయభాస్కర్రెడ్డి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లు 1.45 కోట్లు ఉన్నాయి. ఆయన కుటుంబసభ్యుల పేర్లతో 11 ఖాతాల్లోకి నిధులు మళ్లించినట్లు రూఢీ అయింది. శేషయ్య ఆయన కుటుంబసభ్యులకు రెండు బినామీ ఖాతాలు ఉన్నాయి. వీరితో పాటుగా ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తుల వివరాలు విచారణ సమయంలో బయటపెట్టడం అనేతికం. ఈ వివరాలను రహస్య నివేదికలో అందజేస్తాం.’ -
అనుమతి లేని స్కూళ్లపై కొరడా
నిజామాబాద్ అర్బన్ : ఎట్టకేలకు అనుమతిలేని పాఠశాలలపై విద్యాశాఖ స్పందించింది. జిల్లాలోని 2014-15 విద్యాసంవత్సరానికి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసాచారి బుధవారం ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులుగా ప్రభుత్వ అనుమతి లేకుండా, ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. కలెక్టరేట్, విద్యాశాఖ కార్యాలయాల ఎదుట ధర్నాలూ నిర్వహించాయి. నిరసనలు హోరెత్తుతున్న సమయంలో స్పందించిన అధికారులు గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 17 అనుమతి లేని పాఠశాలలను సీజ్ చేయాలని డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. అనుమతిలేనివి ఇంకా మరెన్నో.. 17 పాఠశాలలే కాకుండా జిల్లాలో చాలా వరకు పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. కంఠేశ్వర్లోని బైపాస్రోడ్డు, చంద్రశేఖర్కాలనీలో మూడు పాఠశాలలు, వినాయక్నగర్లో ఐదు పాఠశాలలు, ఖలీల్వాడిలో రెండు పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. 8 పాఠశాలలు ఎలాంటి అనుమతి లేకుండానే ఇతర ప్రాంతాలకు మార్పు చేశాయి. ఇలా జిల్లాలోని 86 వరకు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. వీటిపై కూడా అధికారులు దృష్టిసారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రక్షించేందుకు స్థానిక విద్యాశాఖ అధికారుల ప్రయత్నం! ఇదిలా ఉండగా అనుమతి లేని పాఠశాలలకు స్థానిక విద్యాశాఖ అధికారులే రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్మూర్లో పదకొండు పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. వీటిపై అధికారులు దృష్టిసారించలేదు. కొందరు అధికారులు పాఠశాల యాజమాన్యాలతో కుమ్ముక్కై వీటిని తప్పించినట్లు తెలుస్తోంది. జిల్లా శాఖ అధికారులు వీటిపై దృష్టిసారిస్తే మరిన్ని గుర్తింపులేని పాఠశాలలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
ఏసీబీ చేతిలో కీలక ఫైళ్లు
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలు ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోళ్లు ఫైళ్లు, ఆయిల్ లాగ్ బుక్లు స్వాధీనం ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్ విజయవాడ : ప్రభుత్వాస్పత్రిలోని పలు కీలక ఫైళ్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఫైళ్లతో పాటు, మందుల కొనుగోళ్లు, అంబులెన్స్ ఆయిల్ లాగ్బుక్స్ను అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. కాగా హైదరాబాద్, ఒంగోలు, గుంటూరు, విజయవాడకు చెందిన ఐదు బృందాల ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి బుధవారం వేకువ జాము వరకూ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. వారి తనిఖీల్లో పలులోపాలతో పాటు, సందేహాలున్న ఫైళ్లను సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లి బుధవారం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వారికి ఎక్కడైనా అనుమానం వస్తే ప్రభుత్వాస్పత్రిలోని సంబంధిత సిబ్బందికి ఫోన్ చేసి వివరాలు అడగటంతో పాటు, మరింత సమాచారం కోసం ఇతర ఫైళ్లు కూడా తమకు అందజేయాలని కోరుతున్నారు. అలా పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ తన అభివృద్ధి నిధుల నుంచి ఆస్పత్రికి ఇచ్చిన రూ.20లక్షలకు సంబంధించి ఖర్చు వివరాల ఫైలు కావాలంటూ బుధవారం ఆస్పత్రి అధికారులను కోరినట్లు తెలిసింది. దాంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కోర్ కమిటీ, ఆస్పత్రి డ్రగ్స్ పర్చేజింగ్ కమిటీ సభ్యుల వివరాలు కావాలని అడిగారని సమాచారం. కొంత కాలంగా ఆయా కమిటీల సమావేశాలు నిర్వహించని విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు, ఆ సభ్యులను సైతం విచారించి కారణాలు తెలుసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రతి ఫైలును పరిశీలించడంతో పాటు, రోగులు కేస్ షీటులనూ ఏసీబీ అధికారులు పరిశీలించినట్లు తెలిసింది.ఏసీబీ సిబ్బంది బుధవారం ఆస్పత్రికి వచ్చి డ్రగ్స్టోర్ను పరిశీలించి వారికి కావాల్సిన వివరాలు సేకరించారు. ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్ ఎన్నడూ లేని విధంగా ఏసీబీకి చెందిన ఐదుగురు డీఎస్పీ స్థాయి అధికారులు , పెద్ద సంఖ్యలో సీఐలు, ఎస్ఐలు ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలు నిర్వహించడంతో ఉద్యోగుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని ఫైళ్లను వారి వెంట తీసుకెళ్లడంతో ఏమి జరుగుతుందోనని అయోమయంలో ఉన్నారు. ఏసీబీ అధికారులు పలువురు ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకుంటారనే పుకార్లు రావడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. -
కొరడా
స్కూళ్లపై దాడులు షురూ.. కలెక్టర్ ఆదేశించిన 24 గంటల్లోనే.. ఆర్డీఓల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నారాయణగూడ శ్రీఇంటర్నేషనల్తో బోణీ నేటి నుంచి మిగిలిన డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేట్ స్కూళ్లపై సర్కార్ కన్నెర్ర చేసింది. నిబంధనలు పాటించని సంస్థలపై దాడులకు దిగుతోంది. నగరంలోని ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన 24 గంటల్లోనే విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్లపై చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు శుక్రవారం నారాయణగూడలోని ఓ స్కూల్ను ఏకంగా సీజ్ చేశారు. విద్యావ్యవస్థకు పట్టిన చీడను వదిలించేందుకు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. నగరంలో గుర్తింపు లేకుండా కొనసాగుతున్న పాఠశాలపై విద్యాశాఖ అధికారులు యుద్ధాన్ని ప్రకటించారు. రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారంతో అధికారులు రంగంలోకి దిగారు. నగరంలో అనుమతులు లేకుండా పాఠశాలలు కొనసాగడం, పరిమితికి మించి ఫీజులు వసూలు చేయడం తదితర సమస్యలపై గురువారం కలెక్టర్ మీనా విద్యాశాఖపై సమీక్షించి ప్రైవేట్ యాజమాన్యాల తీరుపై తీవ్రంగా మండిపడిన విషయం తెల్సిందే. నిబంధనలు పాటించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే జైల్లో పెడతామంటూ కలెక్టర్ మండిపడ్డారు. అంతేగాక విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడంతో ఆ అధికారుల్లో చలనం వచ్చింది. కలెక్టర్ హెచ్చరికలు జారీ చేసిన 24 గంటల్లోనే రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శుక్రవారం హిమాయత్నగర్ మండలం నారాయణగూడలోని శ్రీఇంటర్నేషనల్ స్కూల్ను అనుమతి లేదంటూ సీజ్ చేశారు. సదరు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. దాడులను తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రత్యేక బృందాలతో సమావేశాలను నిర్వహించారు. స్థానికంగా ఉప విద్యాధికారులతోపాటు తహశీల్దారు, వీఆర్వోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పోలీస్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ సీజ్ హిమాయత్నగర్:విద్యాశాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం నారాయణగూడలోని శ్రీఇంటర్నేషనల్ స్కూల్కు చేరుకున్నారు. ప్రభుత్వ గుర్తింపు లేనందున సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. స్కూల్ సిబ్బందికి, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెవెన్యూ అధికారులతోపాటు పోలీసులు కూడా రంగప్రవేశం చేయడంతో విద్యాశాఖ అధికారుల పని సులువైంది. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ‘శ్రీఇంటర్నేషనల్ స్కూల్’ను అధికారులు మూసివేశారు. ఒకే భవనంలో పాఠశాలతోపాటు జూనియర్ కళాశాల, కోచింగ్ సెంటర్ను కూడా యాజమాన్యం నడుపుతోంది. హిమాయత్నగర్ డిప్యూటీ ఈఓ సురేశ్కుమార్ , తహశీల్దార్ సుగుణ, పోలీసులు ఈ పాఠశాలను సీజ్ చేశారు. ఈ పాఠశాల్లో సుమారు 450 మంది చదువుతున్నారని, అకస్మాత్తుగా పాఠశాలను సీజ్ చే స్తే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు లేని స్కూళ్లను సీజ్ చేయండి.. రాంగోపాల్పేట్: ప్రభుత్వ గుర్తింపులేని ప్రైవేటు పాఠశాలలను సీజ్ చేయాలని సికింద్రాబాద్ ఆర్డీఓ రఘురాంశర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో సికింద్రాబాద్, మారేడుపల్లి, ముషీరాబాద్ తహశీల్దార్లు విష్ణుసాగర్, సైదులు, సుజాత, ఖైరతాబాద్ డిప్యూటీ తహశీల్దార్ సునీతతోపాటు ఉప విద్యాధికారులు చిరంజీవి, వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు వేణుగోపాలచారి, యాదయ్యలతో సమావేశం నిర్వహించారు. శనివారం నుంచి గుర్తింపు లేని పాఠశాలలను సీజ్ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ఉల్లంఘనుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రభుత్వం పునరాలోచించాలి.. సుల్తాన్బజార్: ప్రైవేటు స్కూళ్ల ఫీజులకు సంబంధించి జారీచేసిన జీఓపై ప్రభుత్వం పునరాలోచించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. శుక్రవారం సాయంత్రం హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి సి.రాంచందర్ మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం నిర్ణయించిన ఫీజులనే ప్రైవేటు పాఠశాలలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పడం అన్యాయమన్నారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మధు, పీసీ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్యాంవెరా, ఇన్నారెడ్డి, కిషన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాప్సి అనుమతి ఉంది.. కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా (కాప్సి) సంస్థ మాకు సీబీఎస్ఈ, ఐజీసీఎస్ఈ అనుమతి ఇచ్చింది. టెన్త్ క్లాస్ కూడా నడుపుకోవచ్చని కాప్సీ తెలిపింది. ఈ విషయం పట్ల విద్యాశాఖ అధికారులకు అవగాహన లేదు. మా సంస్థ విషయంలో తల దూర్చవద్దని (నో ఇంటర్పియర్) హైకోర్టు నుంచి ఆదేశాలున్నాయి. - పెరిక సురేశ్, శ్రీఇంటర్నేషనల్ స్కూల్ డెరైక్టర్ గుర్తింపు లేనందునే సీజ్.. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్న శ్రీఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యాన్ని గత మూడేళ్లుగా పలుమార్లు హెచ్చరించాం. అనుమతి లేకుండా పాఠశాల నడపడం నేరం. పలుమార్లు నోటీసులు జారీ చేశాం. బోధించే సిలబస్ ఏదైనా.. నగరంలో పాఠశాల నడపాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకే సీజ్ చేశాం. - సురేశ్,హిమాయత్న గర్ డిప్యూటీ ఈఓ -
700 బస్తాల రేషన్ బియ్యుం సీజ్
వరదయ్యుపాళెం: వరదయ్యపాళెం బీసీ కాలనీలోని ఓ ఇల్లు, వురో బియ్యుం గోడౌన్లో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యూన్ని శనివారం సాయుంత్రం విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యం 700 బస్తాల్లో వివిధ మోతాదుల్లో ఉండగా, జిల్లాలో ఇంత మొత్తంలో రేషన్ బియ్యం అధికారులకు పట్టుబడడం ఇదే మొదటిసారి. విజిలెన్స్ అధికారుల కథనం మేరకు...కొంత కాలంగా వరదయ్యుపాళెం నుంచి రేషన్ బియ్యుం తమిళ నాడుకు తరలిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులు,రేషన్ షాపుల నుంచి స్థానిక వ్యాపారులు తక్కువ ధరకు రేషన్ బియ్యూన్ని కొనుగోలు చేసి వరదయ్యుపాళెంలోని ఓ ఇంట్లో, వురో గోడౌన్లో నిల్వ చేసేవారు. సేకరించిన రేషన్ బియ్యూన్ని లారీల్లో తమిళనాడులోని రైస్ మిల్లులకు తరలించేవారు. రైస్మిల్లుల్లో రేషన్ బియ్యూన్ని పాలిష్ చేసి గోతాలు వూర్చి సూపర్ ఫైన్ బియ్యుంగా మార్చి తరలించేవారు. వుూడేళ్లుగా రేషన్ బియ్యుం అక్రవు వ్యాపారం గుట్టు చప్పుడుకాకుండా సాగుతోంది. శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యాపారి తెర వెనుక రేషన్ బియ్యుం కొనుగోలు, విక్రయూలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. వరదయ్యుపాళెం బీసీ కాలనీకి చెందిన కొందరు అందించిన సవూచారం మేరకు దాడిచేసి బియ్యూన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బియ్యూన్ని గ్రావు రెవెన్యూ అధికారులు వుధుసూదన్ శర్మ, వునోహర్ రెడ్డి, రజనీ కువూర్కు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన రేషన్ బియ్యుం విలువ సువూరు 5లక్షల రూపాయులకుపైగా ఉంటుందని ప్రాథమిక అంచనా. -
అనుమతుల్లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తాం
ఉప రవాణా కమిషనర్ సీహెచ్ శ్రీదేవి ఏలూరు సిటీ : జిల్లాలో నిబంధనలు పాటించకుండా 842 స్కూల్ బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయని, ఈ నెలాఖరులోగా వాటి యాజమాన్యాలు అనుమతులు పొందకపోతే వాటిని సీజ్ చేస్తామని ఉపరవాణా కమిషనర్ సీహెచ్ శ్రీదేవి హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజ మాన్యాలు కండిషన్లో లేని బస్సులను నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఈ విద్యాసంస్థలకు చెందిన బస్సులను ఉపేక్షించేదిలేదన్నారు. జిల్లాలో సగానికిపైగా స్కూల్ బస్సులు ఫిట్నెస్, రవాణాశాఖ అనుమతులు లేకుండా నడుపుతున్నారని తెలిపారు. జిల్లాలో 1,665 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉండగా వాటిలో 823 బస్సులకు మాత్రమే అనుమతి ఉందన్నారు. మిగిలిన 842 స్కూల్, కళాశాల బస్సులకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న ఏడు బస్సులను సీజ్ చేశామని, వాటిలో కొవ్వూరులో 3, తణుకులో 2, పాలకొల్లులో 1, ఏలూరులో 1 ఉన్నాయన్నారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను ఆకస్మిక తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతి పాఠశాల, కళాశాల బస్సుల్లో డ్రైవర్కు దృష్టి లోపం, బీపీ, చక్కెర వ్యాధి వంటివి ఉండకూడదని, డ్రైవర్ చిరునామా, మొబైల్ నెంబర్ విధిగా ఉండాలని, స్కూల్ చిరునామా, ఫోన్ నెంబర్ డిస్ప్లే చేయాల్సి ఉందన్నారు. ప్రథమ చికిత్స చేసేందుకు కిట్, బస్సు రూట్మ్యాప్ ఉంచాలని, వారంలో ఒకరోజు ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులు బస్సు ఫిట్నెస్ పరిశీలించేలా ఏర్పాటు చేయాలన్నారు. బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల వివరాలతో కూడిన జాబితా ను ఉండాలని డీటీసీ సూచించారు. -
పర్మిషన్ లేని స్కూలు బస్సుల సీజ్
-
ఫిట్నెస్ లేకుంటే సీజ్
డీటీసీ చంద్రశేఖర్గౌడ్ మామునూరు : ఫిట్నెస్లేని ప్రైవేటు పాఠశాల, కళా శాల బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తామని ప్రాంతీయ రవాణ శాఖ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ హెచ్చరించారు. బుధవారం వరంగల్ ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేని, ఫిట్నెస్ లేని వాహనాలల్లో విద్యార్థులను పాఠశాల, కళాశాలలకు తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదాలకు తావివ్వకుండా గురువారం(12వ తేదీ) నుంచి నెలరోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామ న్నారు. టాటా ఏస్, ఆటోరిక్షాల్లో పరిమితికి మించి విద్యార్థులను పాఠశాలలకు త రలించే వాహనాలను సీజ్చేయడమే కాకుండా డ్రైవర్ లెసైన్స్ సైతం రద్దుచేస్తామని చెప్పారు. పాఠశాలలకు బస్సుల్లో పిల్లలను ఎంత మందిని తరలిస్తున్నారు, ఎంతమేరకు పిల్లలుకు రక్షణలో ఉన్నారో మందుగానే తల్లిదండ్రులు గమనించాలని, ఆటోరిక్షాలో పిల్లలను బడికి పంపకుండా జగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల మొదటి సోమవారం వాహనాదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తామని తెలిపారు. టీ ఎస్ సిరీస్ ఉత్తర్వులు విడుదల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నేపథ్యంలో ఈ ప్రాంతంలోని అన్ని రకాల వాహనాలకు టీఎస్ సిరీస్ను ఆమలు చేయాలని బుధవారం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు విడుదల చేసినట్లు డీటీసీ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో లోగోతో కూడిన టీఎస్ సిరీస్ను జిల్లాలో ఆమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్లైడింగ్లో బుక్ చేసుకున్న ప్రతి వాహనానికి టీఎస్ నంబర్ ప్లేట్ విడుదల చేస్తామని వెలడించారు. కొత్త వాహనాలకు కొత్త నంబర్లు రానున్నాయని, పాత వాహనాలకు నంబర్లు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొ న్నారు. 2013-214 వార్షిక బడ్జెట్లో రూ.106కోట్ల ఆదాయం నిర్దేశించగా రూ.85కోట్ల మేరకు సాధించామన్నారు. లైఫ్ టాక్స్ జూన్1లోపు కట్టిన వాహనాలన్నింటికీ ఉమ్మడి రాష్ట్రాల్లో చెల్లుబాటు ఉంటుందని తెలిపారు. పర్మిట్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వాహనాలు తీరిగేందుకు అభ్యంతరాలు ఉండవన్నారు. సమావేశంలో ఆర్టీఓ మాధవరావు, సీనియర్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ జయకుమార్ పాల్గొన్నారు. -
పోలీస్ తనిఖీల్లో రూ.89 లక్షల సీజ్
బాపట్ల, న్యూస్లైన్ ఎన్నికల నేపథ్యంలో రూరల్ జిల్లాలో 36 చెక్పోస్టులు ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు తనిఖీల్లో రూ.89 లక్షల నగదు సీజ్ చేసినట్లు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ తెలిపారు. బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని పొన్నూరు, బాపట్ల, వెదుళ్ళపల్లి చెక్పోస్టులను ఆయన పరిశీలించడంతోపాటు సబ్డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో బుధవారం డీఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అధికారులకు తగు సూచనలు ఇచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 36 చెక్పోస్టులు ఏర్పాటు చేయగా వాటిలో 15 మొబైల్ స్వ్కాడ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి చెక్ పోస్టు వద్ద మూడు విడతలుగా సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. రూ.89 లక్షలతో పాటు 20 కేజీల వెండి, 43 సెల్ఫోన్లు, రెండు కార్లు, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 2,500 మద్యం బాటిళ్లను సీజ్ చేయడంతోపాటు 90 బెల్టుషాపులను మూయించినట్లు చెప్పారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. బాపట్ల పరిధిలోని ఐదు గ్రామాలను ఈపాటికే గుర్తించినుట్లు చెప్పారు. రూరల్ జిల్లా పరిధిలోని 1023 మంది రౌడీషీటర్ల, ఐదు వేలమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఎటువంటి అల్లర్లకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదు చేయండి.. పోలీసులు రాజ్యంగానికి లోబడి మాత్రమే పనిచేస్తారని రూరల్ ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. పోలీసులు ఎటువంటి రాజకీయ నాయకులను లొంగకుండా పనిచేయాలని సూచించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ నోట్లు సముద్ర మార్గంలో వస్తున్నాయనే సమాచారం ఉందని, వాటిని పట్టుకునేందుకు కొన్ని ప్రత్యేక బలగాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఫోన్ నం. 0863 -2232348కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ఎస్పీతోపాటు డీఎస్పీ ఎన్జే రాజ్కుమార్, సీఐలు రామారావు, మల్లికార్జునరావు, ఎస్ఐలు ఉన్నారు. -
ఇదేంది సారూ!!
కామారెడ్డి, న్యూస్లైన్: ఎన్నికల నిబంధనల మాటేమిటోగానీ, సామాన్యులు మాత్రం తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున డబ్బును స్వాధీనం చేసుకుంటోంది. పోలీసులే గాక రెవెన్యూ, పౌర సరఫరాల నిఘా తదితర విభాగాలకు చెందిన అధికారులంతా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలలో లభించిన డబ్బుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే సీజ్ చేస్తున్నారు. దీంతో అత్యవసరంగా డబ్బును తీసుకెళ్తున్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రూ. 50 వేల కన్నా ఎక్కువ డబ్బుంటే అధికారులకు సీజ్ చేసే అధికారం ఉంది. అయితే భిక్కనూరు మండలంలో ఓ వ్యక్తి వద్ద రూ. 40,400 మాత్రమే ఉన్నా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి సీజ్ చేశారు. బాధితుడు బోరుమన్నా వారు వినిపించుకోలేదు. ప్రతిరోజు జిల్లాలో పెద్ద ఎత్తున డబ్బులను సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసిన డబ్బులకు సంబంధించి ఆధారాలను ఆదాయపు పన్ను శాఖకు చూపితే నిబంధనల ప్రకారం విడుదల చేస్తారని అధికారులు బాధితులకు స్పష్టం చేస్తున్నారు. అయితే తమ అవసరాల కోసం వెంట డబ్బులు తీసుకెళ్లేవారిలో అత్యధికులు సామాన్యులే కావడం వల్ల అనేక ఇక్కట్లకు గురికావలసి వస్తోంది. పెళ్లి బంగారం కొనాలన్నా పరేషానే బంగారం ధర అడ్డగోలుగా పెరిగింది. పెళ్లిళ్ల కోసం తక్కువలో తక్కువ ఐదు తులాలు కొనాలన్నా రూ.లక్షన్నర, బట్టల కోసం మరో రూ. 50 వేలు వెం ట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించే సమయంలో తమ వెంట ఉన్న డబ్బులు బంగారం కొనుగోలుకు, బట్టల కొనుగోలుకు అని చెప్పినా అధికారుల అర్థం చేసుకోలేకపోతున్నారని బాధితులు పేర్కొంటున్నారు. ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు.. వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన వారు మరీ ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. నిత్యం లక్షల్లో డబ్బు లు చేతులు మారుతుంటాయి. అయితే వెంట డబ్బు లు తీసుకెళ్లడం ఇబ్బందిగా మారిందని ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ మెడికల్ రిప్రజెంటేటివ్ వద్ద నుంచి డబ్బును సీజ్ చేశారు. టైర్ల షోరూం యజమాని నుంచి, ఓ బీడీ కంపెనీకి చెం దిన గుమస్తా నుంచి డబ్బులను సీజ్ చేయడం వల్ల వారి డబ్బు ఇరుక్కుపోయింది. ఆ డబ్బుకు సంబంధించిన లెక్కలు చూపాల్సిన పరిస్థితుల్లో వారు అవస్థలు పడుతున్నారు. తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీంతో వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శెనిశెట్టి గౌరీశంకర్ ‘న్యూస్లైన్’తో అన్నారు. ఎన్నికల కోసం అక్రమంగా డబ్బు లు రవాణా విషయంలో చర్యలు తీసుకోవడానికి తమకు అభ్యంతరం లేదని, అయితే వ్యాపారులు, సామాన్య ప్రజల విషయంలో సానుభూతితో వ్యవహరించాలని కోరారు. -
ప్రైవేటు బస్సులు సీజ్
అమలాపురం రూరల్, న్యూస్లైన్ :కోనసీమలో రవాణా శాఖ అధికారులు శనివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న రెండు ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. రావులపాలెం, అంబాజీపేటల్లో తనిఖీలు చేశారు. విజయవాడ నుంచి వైజాగ్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాంట్రాక్ట్ పర్మిట్తో స్టేజ్ క్యారేజ్ సర్వీసుగా నడుపుతున్నట్టు గుర్తించి, దానిని సీజ్ చేశామని అమలాపురం ఆర్టీఓ అశోక్కుమార్ ప్రసాద్ తెలిపారు. రావులపాలెంలో హైదరాబాద్ నుంచి అమలాపురం వస్తున్న ప్రైవేటు బస్సును తనిఖీ చేసి, పర్మిట్ లేనట్టు గుర్తించామన్నారు. సీజ్ చేసిన రెండు బస్సులను అమలాపురం ఆర్టీసీ బస్టాండ్కు తరలించామని ఆర్టీఓ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు జీవీ నరసింహారావు, ప్రసాద్ పాల్గొన్నారు. మండపేటలో.. మండపేట : నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను తీసుకువెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును శనివారం రాత్రి మండపేట రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును మండపేటలో అధికారులు తనిఖీ చేశారు. కాంట్రాక్ట్ క్యారేజ్ అనుమతితో స్టేజి క్యారేజ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించామని ఎంవీఐ వి.శ్రీనివాస్ తెలిపారు. బస్సును సీజ్ చేసి రామచంద్రపురం ఆర్టీసీ డిపోకు తరలించినట్టు చెప్పారు. అందులో ప్రయాణిస్తున్న సుమారు 36 మంది ప్రయాణికులను రామచంద్రపురం డిపో నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు తరలించే ఏర్పాట్లు చేశారు. -
300 బస్తాల రేషన్ బియ్యం
పీసీపల్లి, న్యూస్లైన్ : ఓ గోడౌన్లో ఉన్న 300 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేసిన సంఘటన మండలంలోని తలకొండపాడులో బుధవారం రాత్రి జరిగింది. వివరాలు.. ఓ అజ్ఞాత వ్యక్తి జేసీకి ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ మౌలా సాహేబ్, ఎఫ్ఐ జయశ్రీలు ఆ గోడౌన్పై ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో అక్రమంగా పలు రేషన్ దుకాణాల వద్ద సేకరించిన 300 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. డీలర్ పరారీలో ఉండటంతో అధికారులు గోడౌన్ సీజ్ చేశారు. ఈ డీలర్ అక్రమాలపై నాలుగు రోజుల క్రితం సాక్షి పత్రిక ఓ కథనం ప్రచురించింది. అప్రమత్తమై 300 బస్తాల బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండగా అధికారులు పట్టుకున్నారు. ప్రజాప్రతినిధులతో హెచ్చరికలు జారీ చేయించడంతో గోడౌన్ సీజ్ చేసేందుకు అధికారులు ఒకదశలో వెనకడుగు వేశారు. స్థానికులు వాగ్వాదానికి దిగడంతో సీజ్ చేయక తప్పలేదు. 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత మార్కాపురం టౌన్, న్యూస్లైన్ : పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా సేకరించిన రేషన్ బియ్యాన్ని నంద్యాలకు తరలిస్తుండగా రైల్వేస్టేషన్లో రెవెన్యూ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఏఎస్ఓ ఆర్.కోటయ్య కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన సుమారు పదిమంది మార్కాపురంతో పాటు పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన 15 క్వింటాళ్ల బియ్యాన్ని రైల్వేస్టేషన్ లో ఉంచి నంద్యాలకు తరలిస్తుండగా రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. అధికారులు రైల్వేస్టేషన్కు చేరుకుని బియ్యాన్ని పట్టుకున్నారు. నిందితుల్లో కొందరు పరారీకాగా నంద్యాలకు చెందిన కాళంగి సరస్వతి, సరోజలను అదుపులోకి తీసున్నారు. నిందితులపై 6ఎ కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్కు నివేదిక పంపనున్నట్లు కోటయ్య తెలిపారు. దాడుల్లో మార్కాపురం, వైపాలెం ఎన్ఫోర్స్మెంట్ డీటీలు ఎ.వేణుగోపాలరావు, జి.హరనాథ్బాబు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
అనువుతి లేని మెడికల్ షాపు సీజ్
ఉప్పరపల్లి(చెన్నారావుపేట), న్యూస్లైన్ : అనువుతి లేకుండా వుండలంలోని ఉప్పరపల్లి గ్రావుంలో వుందులు విక్రయిస్తున్న మెడికల్ షాపును ఔషధ నియుంత్రణ అధకారి సాంబయ్యు నాయుక్వుంగళవారం సీజ్ చేశారు. ఆయున కథనం ప్రకారం... గ్రావూనికి చెందిన రాచర్ల వేణు ఇదే గ్రావుంలో వుహ్మద్ వుహబూబ్అలీకి చెందిన ఇంటిని కిరాయికి తీసుకుని అనుమతి లేకుండా వుందుల దుకాణం నిర్వహిస్తున్నాడు. వుంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేయుగా షాపులో అనువుతి లేకుండా రూ.30 వేల విలువచేసే 33 రకాల వుందులను అక్రవుంగా అముతున్నట్లు బయుటపడిందన్నారు. ఈ వుందులను వరంగల్లోని అవుద్, హిందూస్తాన్, ఆంజనేయు, లెట్ఫార్మ్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి భారత్ మెడికల్ షాపు పేరు మీద బిల్లులు తీసుకున్నట్లు తేలిందన్నారు. వెంటనే మెడికల్ షాపును సీజ్చేసి, మెడికల్ షాపు యుజవూని వేణు, ఇంటి యుజవూని వుహబూబ్అలీ, భారత్ మెడికల్షాపుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మూడు రేషన్షాపులు సీజ్
సిరిసిల్ల, న్యూస్లైన్ : నిబంధనలు పాటించని మూడు రేషన్ దుకాణాలను సిరిసిల్లలో రెవెన్యూ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థను తహశీల్దార్ జయచంద్రారెడ్డి తనిఖీ చేశారు. పట్టణంలో రేషన్షాపులు, రైస్డిపోలపై దాడులు చేశారు. స్థానిక సుభాష్నగర్లో వి.కళకు చెందిన షాపు సమయానుసారంగా తెరవకపోవడంతో సీజ్ చేశారు. శాంతినగర్లోని బంధం వరలక్ష్మి, గూడెల్లి మధుసూదన్ షాపులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ అన్ని రేషన్ షాపుల్లో ఎలక్ట్రానిక్ కాంటాల ద్వారా సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా డీలర్లు పట్టించుకోవడం లేదన్నారు. గూడెల్లి మధుసూదన్ షాపులో 1.50 క్వింటాళ్ల బియ్యం శాంతినగర్ పాఠశాలకు పంపించకుండా అక్రమంగా నిల్వ ఉంచడంపై మధుసూదన్, హెచ్ఎంకు షోకాజు నోటీసులు జారీ చేశారు. రేషన్ బియ్యం షాపుల్లోకి తరలుతుందన్న సమాచారం మేరకు మార్కెట్లోని రెండు రైస్ డిపోలపై దాడులు చేశారు. ఎఫ్జీఎల్ అనుమతి లేకుండా దుకాణాలు నిర్వహిస్తుండడంతో నోటీసులు జారీ చేశారు. మూడురోజుల్లోగా అనుమతి పొందాలని హెచ్చరించారు. తహశీల్దార్ వెంట వీఆర్వోలు చంద్రమోహన్, వెంకటస్వామి ఉన్నారు.