Tamil remake
-
భాషా తమిళ రీమేక్.. అయితే హీరోగా రజినీకాంత్ కాదట..!
చిత్రసీమలో హిట్ చిత్రాలను రీమేక్ చేయడం అనేది చాలా కాలం నుంచి జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా వచ్చిన కొన్ని చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయి కూడా. గతంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన బిల్లా చిత్రాన్ని అదే పేరుతో దర్శకుడు విష్ణువర్ధన్ చేశారు. రజనీకాంత్ పాత్రలో అజిత్ నటించి హిట్ కొట్టారు. తాజాగా మళ్లీ అలాంటి ప్రయత్నమే జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రజినీకాంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం బాషా. ఒక సాధారణ యువకుడు పరిస్థితుల ప్రభావంతో ఎలా అండర్ వరల్డ్ డాన్గా మారాడో..? తిరిగి మళ్లీ ఎలా మంచిగా మారి జన స్రవంతిలోకి కలిసిపోయాడు? అన్న ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం టాలీవుడ్లోనూ రజనీకాంత్కు స్టార్ ఇమేజ్ను తీసుకొచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని దర్శకుడు విష్ణువర్ధన్ కొన్ని మార్పులు చేసి రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులోనూ అజిత్ను కథానాయకుడిగా ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. కాగా తునివు చిత్రం తర్వాత అజిత్ తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ చిత్రం నుంచి దర్శకుడు విఘ్నేశ్ శివన్ వైదొలిగారు. అందుకు కారణం కథలో అజిత్ చెప్పిన మార్పులకు ఈయన అంగీకరించ పోవడమేనని సమాచారం. ఇప్పుడు తాజాగా అజిత్ చిత్రానికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా తదుపరి విష్ణువర్ధన్ దర్శకత్వంలో భాషా చిత్రానికి రీమేక్లో నటించడానికి అజిత్ మరోసారి సాహసం చేస్తారా? అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
‘‘గతం తాలూకు ఆలోచనలతో మనం దిగాలుగా ఉంటే అది బాధ. భవిష్యత్ గురించి ఆలోచిçస్తుంటే అది ఆశ. కానీ ఆలోచనలతో ఈ వర్తమాన క్షణాలను ఆస్వాదించడం మనం మర్చిపోతున్నాం. అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. ఈ విషయాన్నే శ్రీ కార్తీక్ ‘ఒకే ఒక జీవితం’తో చెప్పాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అనేది ఒక భాగం మాత్రమే. నా పాత్ర, వెన్నెల కిశోర్, ప్రియదర్శి.. ఇలా ఏదో ఒక క్యారెక్టర్తో ప్రతి ఆడియన్ కనెక్ట్ అవుతారు’’ అన్నారు శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ‘‘ఈ చిత్రంలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించాను. పదేళ్ల తర్వాత నేను చేసిన తెలుగు చిత్రం ఇది. ఈ సినిమాతో నాకు శర్వానంద్ మూడో కొడుకు అయ్యారు (నవ్వుతూ). ఈ సినిమాలో ముగ్గురి జర్నీ చూస్తారు. ఈ ముగ్గురూ కాలంతో ఆడుకుని ఓ అంశాన్ని కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు విధి మాత్రం మారదు. ఎందుకనేది థియేటర్స్లో చూడాలి’’ అన్నారు అమల. ‘‘నేను తెలుగువాడినే. మా అమ్మగారి మాతృభాష తెలుగు. ఇప్పుడు మా అమ్మగారు లేరు. మా అమ్మ గురించి తీసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ‘అమ్మ’ పాట చిరకాలం నిలిచిపోతుంది’’ అన్నారు శ్రీ కార్తీక్. ‘‘మా బ్యానర్ నుంచి వచ్చిన ‘ఖాకీ’, ‘ఖైదీ’ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ నమ్మకంతోనే తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఒకే ఒక జీవితం’ చేశాం’’ అన్నారు ఎస్ఆర్ ప్రభు. ‘‘అమలగారు నాకు స్ఫూర్తి’’ అన్నారు రీతూ వర్మ. -
‘అర్జున్ రెడ్డి’ ముద్దుగుమ్మ రైజా విల్సన్ (ఫోటోలు)
-
ఫహద్ ఫాజిల్, నజ్రియాల ట్రాన్స్ తమిళ్ ట్రైలర్ రిలీజ్
సబ్బుల యాడ్ తరహాలో కొందరు మతాన్ని ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత హెచ్.రాజా అన్నారు. ఫహద్ ఫాజిల్, ఆయన భార్య నజ్రియా జంటగా నటించిన మళయాళ చిత్రం ట్రాన్స్. దర్శకుడు గౌతమ్ మీనన్ విలన్గా నటించిన ఈ చిత్రాన్ని అన్వర్ రషీద్ తెరకెక్కించారు. అక్కడ మంచి విజయాన్ని సాధించిన దీన్ని ధర్మ విజువల్ క్రియేషన్స్ సంస్థ అధినేత తమిళంలో నిలై మరందవన్ అనే పేరుతో అనువదిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. ఇందులో బీజేపీ నాయకుడు హెచ్.రాజా, కల్యాణరామన్, అశ్వథ్థామన్, హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్ తదితరు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్.రాజా మాట్లాడుతూ తమిళ ప్రజలను ఒక స్థాయికి తీసుకురావడానికే ఈ చిత్రాన్ని నిర్మించినట్లు భావించవచ్చునన్నారు. వివేకానంద చెప్పినట్లుగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తూనే ఉండాలనే పరిస్థితి నెలకొందన్నారు. చదవండి: హీరోల కోసమే వందల కోట్లు ఖర్చు, అందుకే తమిళ సినిమా నశిస్తోందంటూ నిర్మాత ఆవేదన కేజీఎఫ్ 2 దూకుడుకు దద్దరిల్లుతున్న బాక్సాఫీస్ -
మానాడు రీమేక్లో రానా సోదరుడు అభిరామ్
శింబు హీరోగా ఇటీవల వచ్చిన మానాడు చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శింబుకు జోడీగా కల్యాణి ప్రియదర్శన్ నటించింది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తెలుగు రీమేకర్లో రానా నటిస్తున్నట్లు రీసెంట్గా వార్తలు వినిపించాయి. చదవండి: బాలయ్య మూవీ ఆఫర్ వదులకున్న నటి రాశి, ఆ సీన్పై అభ్యంతరంతోనేనట.. తాజాగా మానాడు రీమేక్ అతడి సోదరుడు అభిరామ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ మూవీ రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మొదట ఈ రీమేక్లో రానా నటించనున్నాడని టాక్ వినిపించగా.. తాజాగా అభిరామ్ పేరు తెరపైకి వచ్చింది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో అభిరామ్ ఒక సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే 'మానాడు' రీమేక్ మొదలవుతుందని అంటున్నారు. -
తమిళ హిట్ మూవీని రీమేక్ చేయనున్న రానా?
Rana Daggubati To Starer In Simbus Maanadu Movie: శింబు హీరోగా ఇటీవల వచ్చిన మానాడు చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శింబుకు జోడీగా కల్యాణి ప్రియదర్శన్ నటించింది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్టులో రానా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక రానా నటించిన '1945' సినిమా ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బాలీవుడ్లో రీమేక్ కానున్న '96' మూవీ
తమిళ సూపర్ హిట్ 96 చిత్రం క్లాసిక్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. త్రిష, విజయ్ సేతుపతి ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించారు. 2018లో విడుదలైన 96మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని జానుగా రీమేక్ చేయగా, సమంత, శర్వానంద్ లీడ్ రోల్స్ పోషించారు. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయనున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అజయ్ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇక ఈ రీమేక్ చిత్రానికి సంబంధించి దర్శకుడు, నటీనటులు ఎవరన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. -
అమ్మను కావడానికి ఇంకా టైమ్ ఉంది.. ప్రియమణి క్లారిటీ
పదేళ్ల క్రితం ‘పరుత్తివీరన్’కి జాతీయ అవార్డు అందుకున్నారు. అందులో పల్లెటూరి పిల్ల ముత్తళుగు. ఇప్పుడు ‘నారప్ప’లోనూ అంతే.. పల్లెటూరి సుందరమ్మ. పెళ్లీడుకొచ్చిన అబ్బాయికి తల్లి. అంత పెద్ద కొడుకు ఉన్న వయసు కాదు ప్రియమణిది. కానీ పాత్ర ఏదైనా చేయాలని ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. వెంకటేశ్, ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘నారప్ప’ ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రియమణి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... ► ‘నారప్ప’ అంటే కెరీర్ ఆరంభంలో మీరు నటించిన ‘పరుత్తివీరున్’ గుర్తుకు వచ్చింది. ఆ సినిమాలో ముత్తళగు పాత్రలో కనిపించినట్లుగానే ఇప్పుడు ‘నారప్ప’లో సుందరమ్మ లుక్ కూడా ఉంది... ‘పరుత్తువీరన్’లో విలేజ్ అమ్మాయిని. ఇందులోనూ అంతే. అయితే తెలుగులో ‘నారప్ప’లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. తమిళంలో విలేజ్ క్యారెక్టర్లు చేశాను కాబట్టి తెలుగులో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదీ వెంకీసార్తో వర్క్ చేయడం అంటే నాకు ఒక బోనస్. తెలుగు సినిమా కాబట్టి డబుల్ బోనస్. ► ఉన్నదానికంటే బ్రైట్గా కనబడటానికి మేకప్ చేసుకుంటారు. కానీ ‘నారప్ప’, ‘విరాటపర్వం’లో ట్యాన్ అయిన స్కిన్తో కనబడాల్సి రావడం గురించి.. ‘నారప్ప’లో నేను మాత్రమే కాదు.. సినిమాలో ఉన్న నటీనటులందరూ కాస్త డల్గానే కనబడాలి. ట్యాన్ అయినట్లుగా కనిపించాలి. ‘విరాటపర్వం’లో నక్స్లైట్ (పాత్ర పేరు భారతక్క)ని కాబట్టి స్కిన్ టోన్ని డార్క్ చేయించాం. మామూలుగా బ్రైట్గా కనిపించడానికి మేకప్ చేసుకోవాలి. సుందరమ్మ, భారతక్క పాత్రల్లో డల్గా కనిపించడానికి కష్టపడాలి (నవ్వుతూ). ► తమిళ ‘అసురన్’కి రీమేక్‘నారప్ప’. తమిళంలో మంజు వారియర్ చేసిన పాత్రను తెలుగులో మీరు చేశారు కాబట్టి పోలికలు పెట్టే అవకాశం ఉంటుంది... రీమేక్ చేసేటప్పుడు పోలికలు పెడతారు. ఏమీ చేయలేం. అది సహజం. మంజు వారియర్ అద్భుతమైన నటి. అయితే నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఎంత చేయాలో అంతా చేశాను. పేరు వస్తే హ్యాపీ. ► రొటీన్కి భిన్నంగా సుందరమ్మ పాత్రకు చీర కాస్త పైకి కట్టుకుని కనిపించారు.. కాస్ట్యూమ్స్ గురించి చెప్పండి? అన్నీ కాటన్ చీరలే కట్టుకున్నాను. చీర కట్టుకుని బయటకి రాగానే నా పర్సనల్ స్టాఫ్ ‘ఏంటి మేడమ్.. ఇంత పైకి కట్టుకున్నారు’ అన్నారు. వాళ్లంతా ముంబయ్వాళ్లు. ఈ క్యారెక్టర్కి ఇలానే కట్టాలన్నాను. హెయిర్ స్టయిల్ కూడా నేనే చెప్పి చేయించుకున్నాను. పొరపాటున ఫేస్ ఫ్రెష్గా కనిపించిందనుకోండి.. వెంటనే వచ్చి డల్ చేసేసేవారు (నవ్వుతూ). ► ఓకే.. కరోనా వల్ల అన్నీ తలకిందులు కావడంతో ‘ఫ్యూచర్ ప్లాన్స్’ గురించి చాలామంది ఆలోచించడంలేదు. మరి.. మీరు? నిజానికి నేనెప్పుడూ ఫ్యూచర్ని ప్లాన్ చేయలేదు. ఒక పదేళ్లల్లో ఇది చేయాలి? రెండేళ్లల్లో ఇలా ఉండాలి.. ఇది చేయాలి అని నేనెప్పుడూ ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు. జీవితం ఎటు వెళితే అలా వెళుతుంటాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని, మన ఫ్యామిలీని సేఫ్గా కాపాడుకోవడం ముఖ్యం. అందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు, తీసుకోనివాళ్లు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థర్డ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంటుందట. అందుకే అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పని ఉంటేనే బయటికెళ్లాలి. ఇంట్లో ఉన్నప్పుడు ‘నారప్ప’ని చూడాలని కోరుకుంటున్నాను. ► ఈ సినిమాలో పెళ్లి వయసులో ఉన్న అబ్బాయికి అమ్మలా నటించారు.. ఇకముందు కూడా చేస్తారా? ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్లో, ఒక మలయాళం సినిమాలోనూ అమ్మ పాత్ర చేశాను. ఒక పాత్రని పాత్రలా చూడగలగాలి. ఆ పాత్ర ప్రేక్షకులను మెప్పించేలా చేయాలి. ఒక క్యారెక్టర్ ఒప్పుకునే ముందు నేను అనుకునేది ఇదే. ► సినిమాల్లో, వెబ్ సిరీస్లో తల్లి పాత్రలు చేస్తున్నారు. మరి.. రియల్ లైఫ్లో ఎప్పుడు..? (నవ్వుతూ) ఇప్పుడు కాదండీ.. కొంచెం టైమ్ పడుతుంది. ► మీ భర్త ముస్తఫా ఎలా ఉన్నారు? ఆయన యూఎస్లో ఉన్నారు. తన పనులతో బిజీ. ఎవరు ఎక్కడ ఉన్నా ఈ కరోనా టైమ్లో సేఫ్టీగా ఉండటం ముఖ్యం. ఆ విషయంలో మేం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ► మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెప్పారు కదా.. అనంతపురం స్లాంగ్ని పట్టగలిగారా? రెగ్యులర్ తెలుగు అయితే ఇబ్బంది ఉండేది కాదు. అనంతపురం స్లాంగ్కి నాకు కొంచెం టైమ్ పట్టింది. అనంతపురం నుంచి ఒకాయన వచ్చి నేర్పించారు. డబ్బింగ్ చెప్పే ముందు పదాలు ఎలా పలకాలో చెప్పేవారు. రెండు మూడుసార్లు అనుకుని చెప్పేశాను. అయితే పదీ ఇరవై నిమిషాల్లోనే స్లాంగ్ని పికప్ చేయగలిగాను. ► ఈ సినిమాలో మిమ్మల్ని కష్టపెట్టిన సీన్? ఉంది. ఆ సీన్ గురించి చెబితే కథ మొత్తం చెప్పినట్లే. నాకు ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా ఇష్టం. ఛాలెంజ్గా తీసుకుంటాను. ఈ సినిమాలో అలాంటి ఒక సీన్ ఉంది. అది నాకు పెద్ద సవాల్లా అనిపించింది. ఫిజికల్గా ఛాలెంజ్ కాదు.. మెంటల్లీ ఛాలెంజ్ అన్నమాట. బాగా చేయగలిగాను. ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. -
స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రం 'ఉప్పెన'. ఈ నెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి రికార్డులు సృష్టిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం... లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్ సేతుపతి నటన ఈ సినిమా విజయంలో సగ భాగం అయింది. అయితే ఈ సినిమాను టాలీవుడ్తో పాటు తమిళ్లో కూడా విడుదల చేయాలని తొలుత భావించారట. విజయ్ సేతుపతికి అక్కడ భారీగా క్రేజ్ ఉంది కాబట్టి తప్పకుండా ఉప్పెనను తమిళ్లో డబ్ చేసి విడుదల చేయాలని అనుకున్నారట. కానీ విజయ్ సేతుపతి మాత్రం వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. కథ బాగుందని, డబ్ చేయడం కంటే రీమేక్ చేస్తే మంచి వసూళ్లను రాబడుతుందని సలహా ఇచ్చారట. అందుకే తమిళ్లో విడుదల చేయకుండా కేవలం తెలుగులో మాత్రమే ఉప్పెనను విడుదల చేసింది చిత్ర బృందం. తమిళ రీమేక్ రైట్స్ను విజయ్ సేతుపతి తీసుకోబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమాను స్టార్ హీరో కొడుకుతో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగా ఉప్పెన నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్..ఆల్ ఇండియా రికార్డులను బద్దలు కొట్టాడు. దీంతో ఈ సినిమాపై తమిళ హీరో దళపతి విజయ్ కన్ను పడిందట. ఉప్పెన తమిళ రీమేక్తో కొడుకు జాన్సన్ సంజయ్ను హీరోగా పరిచయం చేయాలని విజయ్ భావిస్తున్నాడట. దీనికి సంబంధించి ఇప్పటికే ఉప్పెన ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్తో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఉప్పెన తమిళ రీమేక్ పనులు ప్రారంభం కానున్నాయి. మరి అదే జరిగితే హీరోయిన్గా కృతి శెట్టినే తీసుకుంటారా? లేదా కొత్త హీరోయిన్తో ప్రయోగం చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. చదవండి : (21 ఏళ్ల ఆల్టైం రికార్డులను తుడిచిపెట్టిన ‘ఉప్పెన’ ) (అదేంటో తెలుసుకోలేను.. బుచ్చిబాబుపై సుకుమార్ ఎమోషనల్) -
కొత్త అవతారం
సిమ్రాన్ ఫుల్ ఎగ్జయిట్మెంట్తో ఉన్నారు. కథానాయికగా తన కెరీర్లో ఎన్నో సూపర్హిట్లు అందుకున్న సిమ్రాన్ ఇప్పుడు ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ఉంది. బాలీవుడ్ సూపర్హిట్ ఫిల్మ్ ‘అంధా ధున్’ తమిళ రీమేక్లో ఆమె నటించనున్నారు. ఆ సినిమాలో తబు చేసిన బోల్డ్ క్యారెక్టర్ని సిమ్రాన్ చేయనున్నారు. ఈ సందర్భంగా సిమ్రాన్ మాట్లాడుతూ – ‘‘తబు చేసిన పాత్రను నేను చేయటం పెద్ద బాధ్యతగా అనుకుంటున్నాను. ఈ బోల్డ్ క్యారెక్టర్ను ఎంత ఛాలెంజింగ్గా చేస్తానో చూడాలి. ఓ కొత్త అవతారంలో కనిపించనున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘అంధా ధున్’ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ చేస్తున్నారు. తెలుగు రీమేక్లో నితిన్ చేస్తున్న విషయం తెలిసిందే. -
రీమేక్ సినిమా కోసం మెగాస్టార్కు రూ.60 కోట్లు!
టాలీవుడ్లో తిరుగు లేని హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. పండగ పూట బాస్ సినిమా రిలీజైతే వార్ వన్సైడ్ అయిపోతుంది. అంతటి క్రేజ్ ఉన్న చిరంజీవి ఖైదీ నం.150తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక నుంచి ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని అభిమానులకు మాటిచ్చారు. కానీ అలా జరగలేదు. ఖైదీ నం.150 విడుదలైన రెండేళ్లకు సైరా వచ్చింది. బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రానికి చిరు రూ. 40 కోట్లు అందుకున్నారట. తర్వాత కొరటాల శివతో చేస్తున్న ఆచార్య సినిమాకు రూ.50 కోట్లు తీసుకుంటున్నారట. ఇందులో కాజల్ హీరోయిన్గా నటించనుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. (చదవండి: రౌడీ బేబి @ వందకోట్లు) తండ్రి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే చిరు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ స్టార్ అజిత్ చిత్రం 'వేదాళం' రీమేక్లో నటించేందుకు ఓకే చెప్పారు. బిల్లా, శక్తి వంటి సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన మెహర్ రమేశ్ ఈ రీమేక్ బాధ్యతలు తీసుకున్నారు. తెలుగువారికి కనెక్ట్ అయ్యేలా మార్పుచేర్పులు కూడా చేశారు. అయితే ఇందులో నటించేందుకు మెగాస్టార్ కళ్లు చెదిరే పారితోషికాన్ని అందుకోనున్నట్లు వినికిడి. ఏకంగా తన రెమ్యూనరేషన్ను రూ.60 కోట్లకు ఫిక్స్ చేశారు. బాస్ సినిమా అంటే కాసుల వర్షం కురవడం ఖాయమన్న దీమాతో నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ మెగా పేమెంట్కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. (చదవండి: చిరంజీవికి కరోనా రాలేదు) -
ఫ్లాష్బ్యాక్ నారప్ప
వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. 2019లో విడుదలై తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. చిత్రనిర్మాతలు డి. సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను మాట్లాడుతూ– ‘నారప్ప’ సినిమా లాక్డౌన్కు ముందే 60 రోజులపాటు షూటింగ్ జరుపుకుంది. తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ మధ్యే షూటింగ్ను హైదరాబాద్లో పునః ప్రారంభించాం. ప్రియమణి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలతో పాటు కై్లమాక్స్ను చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్తో దాదాపు 80 శాతం సినిమా పూర్తవుతుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: వెట్రిమారన్. -
ఉదయ్తో ఆర్టికల్ 15
అజిత్తో హిందీ ‘పింక్’ని తమిళంలో రీమేక్ చేశారు బోనీ కపూర్. ఇప్పుడు మరో రీమేక్ను ప్రకటించారు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించి, మెప్పించిన ‘ఆర్టికల్ 15’ని తమిళంలో రీమేక్ చేయనున్నారు బోనీ. ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ కులవివక్ష ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి చట్టం, న్యాయం అందరికీ సమానమే అని చాటిచెప్పిన చిత్రమిది. హిందీలో ఆయుష్మాన్ పోషించిన పాత్రను తమిళంలో ఉదయ్నిధి స్టాలిన్ చేయనున్నారు. అరుణ్రాజా కామరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. జీ స్టూడియోస్, రోమియో పిక్చర్స్తో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రొడక్షన్ హౌస్పై తమిళ రీమేక్ను నిర్మించనున్నట్లు బోనీ కపూర్ తెలిపారు. ‘పింక్’ తర్వాత అజిత్తో తమిళంలో ‘వలిౖమై’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు బోనీ. ‘ఆర్టికల్ 15’ రీమేక్ షూటింగ్ని ఈ ఏడాది చివరలో ప్రారంభిస్తారట. -
ఉప్పెన రీమేక్లో స్టార్ హీరో తనయుడు
హిట్ సాంగ్స్తో రిలీజ్కు ముందే క్రేజ్ సంపాదించుకున్న చిత్రం "ఉప్పెన". ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడింది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.. కృతీశెట్టి కథానాయికగా పరిచయమవుతోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇందులో విలన్గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ లెటెస్ట్ వార్త ఫిల్మీదునియాలో మార్మోగిపోతోంది. దీని ప్రకారం విజయ్ సేతుపతి ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులు కొన్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ మంచి ప్రేమ కథతో తన కొడుకును హీరోగా పరిచయం చేయాలని చూస్తున్న స్టార్ హీరో విజయ్కు కథ వినిపించినట్లు తెలుస్తోంది. (మనసు మనసు దగ్గరైతే ధక్ ధక్ ధక్) ఈ సినిమాపై విజయ్ కూడా ఆసక్తి కనబర్చగా, తన కొడుకు జాసన్ సంజయ్ విదేశాల నుంచి తిరిగి రాగానే మరోసారి చర్చించి దాదాపు సినిమాకు ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తున్న సంజయ్ అది పూర్తవగానే ఈ సినిమాలో నటించే అవకాశాలున్నాయి. అయితే పరిస్థితులు ఎక్కడికక్కడ సద్దుమణిగితే ఈ ఏడాది చివర్లో రీమేక్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తమిళ రీమేక్కు డైరెక్షన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కరోనా విలయం ముగిసిన తర్వాతే ఈ రీమేక్కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి. (కరోనా.. కొడుకు గురించి హీరో విజయ్ ఆందోళన!) -
తమిళంలోకి ఆర్టికల్ 15
గత ఏడాది హిందీలో మంచి విజయం సాధించిన చిత్రం ‘ఆర్టికల్ 15’. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో జరుగుతున్న అణచివేతను ఈ సినిమాలో చర్చించారు. సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని సమాచారం. ‘ఆర్టికల్ 15’ తమిళ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తీసుకున్నారు. బోని ఆ మధ్య హిందీ ‘పింక్’ చిత్రాన్ని తమిళంలో అజిత్తో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేశారు. ‘ఆర్టికల్ 15’ తమిళ రీమేక్లో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా నటిస్తారట. అరుణ్ కామరాజ్ దర్శకత్వం వహించ నున్నారు. -
అల రీమేక్లో...
అల్లు అర్జున్ హీరోగా మొన్న సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, యస్. రాధాకష్ణ నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందనే వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా తమిళంలోనూ రీమేక్ కానుందనే వార్త వచ్చింది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ రైట్స్ తీసుకుందట. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. -
కన్నడంలో నిన్ను కోరి
నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ముఖ్య తారలుగా 2017లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘నిన్ను కోరి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతోంది. అథర్వా మురళి, అనుపమా పరమేశ్వరన్ జంటగా ‘తలళ్లి పోగాదే’ టైటిల్తో ఈ రీమేక్ తెరకెక్కుతోంది. తాజాగా కన్నడంలోనూ ‘నిన్ను కోరి’ రీమేక్ కాబోతోందని సమాచారం. కన్నడ పాపులర్ నటుడు ధృవ్ సార్జా ఈ రీమేక్లో హీరోగా నటించనున్నారు. నంద కిశోర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. -
‘దిల్’ రాజుకి ఏమైనా మెంటలా!
‘‘తమిళచిత్రం ‘96’ని తెలుగులో రీమేక్ చేస్తున్నాం అని వార్తలు రాగానే వీళ్లకేమైనా పిచ్చా? ‘దిల్’ రాజుకేమైనా మెంటలా? అని కామెంట్స్ వినిపించాయి. నేను ఏ ఫీలింగ్తో అయితే ఉన్నానో రేపు సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళ చిత్రం ‘96’కి ఇది రీమేక్. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘నా 17 ఏళ్ల కెరీర్లో ఇది తొలి రీమేక్. తమిళంలో రిలీజ్ కాకముందే చూశాను. తమిళం అర్థం కాకపోయినా ఆ పాత్రలతో కనెక్ట్ అయి ప్రయాణించాను. అప్పుడే రీమేక్ చేయాలని నిశ్చయించుకున్నాను. నాపై నమ్మకం ఉంచి సినిమా చేయమని సమంతకు చెప్పాను. సినిమా చూసి చేస్తానని శర్వా (శర్వానంద్) చెప్పాడు. ‘జాను’ చూశాక అమ్మాయిలు శర్వాతో, అబ్బాయిలు సామ్తో లవ్లో పడతారు. అలాంటి లవర్ మనకు లేరని ఈర్ష్య పడతారు’’ అన్నారు. ‘‘రీమేక్ చేయాలా వద్దా? అని మాట్లాడుకుంటున్నప్పుడు రాజు అన్న ‘నన్ను నమ్ము’ అన్నారు. ఆయన జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ‘శతమానం భవతి’ అప్పుడు కూడా ఇదే అన్నారు. నాకు మంచి హిట్ ఇచ్చారు. ఈసారి కూడా అదే చేస్తారనుకుంటున్నాను. సమంతగారు లేకపోతే నేను అంతగా యాక్ట్ చేయలేకపోయేవాడినేమో. లవ్ ఫెయిల్యూర్ అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే ఫస్ట్ లవ్ అందరికీ గుర్తుంటుంది. ఈ పదేళ్లలో ఇలాంటి లవ్స్టోరీ రాలేదనుకుంటున్నా’’ అన్నారు శర్వానంద్. ‘‘రీమేక్ మూవీ కోసం రాజుగారు కలుస్తాను అంటే భయపడ్డాను. ఒకవేళ ఆయన్ను కలిస్తే సినిమాకి ఓకే చెప్పేస్తాను. ఆయన బ్యానర్తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమా ఒప్పుకున్నాను. ప్రతిరోజూ సెట్లో మ్యాజిక్ జరగాలంటే కష్టం. కానీ శర్వానంద్ వల్ల ఆ కష్టాన్ని దాటేశాం. నా పర్ఫార్మెన్స్కి వచ్చే క్రెడిట్ మా ఇద్దరికీ దక్కుతుంది’’ అన్నారు సమంత. -
టబు పాత్రలో రమ్యకృష్ణ
హిందీలో ‘అంధాధూన్’ ఘనవిజయం సాధించింది. జాతీయ ఉత్తమ హిందీ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే సినిమాకి కీలకంగా నిలిచిన టబు పాత్రకు, ఆమె నటనకు కూడా విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆ పాత్రను తమిళంలో రమ్యకృష్ణ పోషించనున్నారని తెలిసింది. ‘అంధాధూన్’ తమిళ రీమేక్ హక్కులను నటుడు, దర్శకనిర్మాత త్యాగరాజన్ తీసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు, ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ హీరోగా నటించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. హిందీలో టబు చేసిన పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఆ పాత్రకు రమ్యకృష్ణ అయితే బావుంటారని చిత్రబృందం భావించారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘అంధాధూన్’ తెలుగు రీమేక్లో నితిన్ నటిస్తారు. -
ఏజెంట్ సంతానం?
ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) నెల్లూరు బ్రాంచ్లో కేసులు సాల్వ్ చేశారు ఏజెంట్ ఆత్రేయ. ఇప్పుడు ఈ బ్యూరో చెన్నైలో కూడా ఓపెన్ కానుందని తెలిసింది. మరి అక్కడి కేసులను ఎవరు సాల్వ్ చేస్తారంటే... ఏజెంట్ సంతానం అని తెలిసింది. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన డిటెక్టివ్ చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. కామెడీ ఏజెంట్గా కితకితలు పెట్టారు నవీన్. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని తెలిసింది. నవీన్ పాత్రలో తమిళ హాస్య నటుడు సంతానం కనిపించనున్నారట. దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియలేదు. త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. -
సౌండ్ ఇంజనీర్ కాబోతున్నారు
సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ వచ్చేలా ‘రంగస్థలం’ సినిమాతో మోత మోగించారు. ఇప్పుడు ఆ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్, సమంత జంటగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. సౌండ్ ఇంజనీర్ (వినికిడి లోపం ఉన్న వ్యక్తిని సరదాగా ఇలా అంటారు) చిట్టిబాబు పాత్రలో చరణ్ కనిపించారు. ఇప్పుడు సౌండ్ ఇంజనీర్గా మారబోతున్నారు లారెన్స్. ‘రంగస్థలం’ తమిళ రీమేక్లో రామ్చరణ్ పాత్రను రాఘవ లారెన్స్ చేయనున్నారట. ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తారని సమాచారం. -
మరో రీమేక్?
తమిళంలో అజిత్ మంచి క్రేజ్ ఉన్న మాస్ హీరో. అలాంటి హీరో మాస్ ఎలిమెంట్స్ లేని ‘పింక్’ చిత్రం రీమేక్లో నటించి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా ‘నేర్కొండ పార్వై’గా తమిళంలో రీమేకై మంచి విజయం సాధించింది. బోనీ కపూర్ నిర్మించారు. ప్రస్తుతం అజిత్ చేస్తున్న 60వ చిత్రాన్ని కూడా బోనీయే నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే అజిత్ మళ్లీ ఓ హిందీ చిత్రాన్ని రీమేక్ చేసే ప్లాన్లో ఉన్నారని తెలిసింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా అనుభవ్ సిన్హా రూపొందించిన చిత్రం‘ఆర్టికల్ 15’. ఈ చిత్రం తమిళ రీమేక్లో అజిత్ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే.. అజిత్ 59వ సినిమాను నిర్మించి, 60వ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించిన బోనీ కపూరే ఈ ‘ఆర్టికల్ 15’ తమిళ రైట్స్ కూడా కొనుగోలు చేశారట. అంటే.. అజిత్తో మూడు సినిమాల డీల్ని బోనీ కుదుర్చుకుని ఉంటారనుకోవచ్చు. -
సౌత్ క్వీన్కు కత్తెర్లు
‘‘మా కష్టాన్ని వృథా చేయకండి’’ అని వాపోతున్నారు కాజల్ అగర్వాల్. రమేష్ అరవింద్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ప్యారిస్ ప్యారిస్’. హిందీ హిట్ చిత్రం ‘క్వీన్’కు ఇది తమిళ రీమేక్. ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి పాతిక కత్తెర్లు ఇచ్చింది సెన్సార్ బోర్డ్. దీంతో ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రబృందం రివైజింగ్ కమిటీకి వెళ్లింది. ఇటీవల ఈ విషయంపై కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందిస్తూ –‘‘హిందీ ‘క్వీన్’ చిత్రాన్ని దక్షిణాది ప్రేక్షకులకు చూపించాలని ఓ మంచి ప్రయత్నం చేశాం. కానీ సెన్సార్ వారు ఇన్ని కట్స్ చెప్పారన్నప్పుడు షాకయ్యాను. వారు చెప్పిన కట్స్లో చాలా సన్నివేశాలు మన నిత్య జీవితంలో జరిగేవే ఉన్నాయి. ఈ విషయమే నిర్మాతలకూ చెప్పి సరైన యాక్షన్ తీసుకోమని కోరాను. ఈ సినిమా కోసం చాలా కాలం సమష్టిగా కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గ ఫలాన్ని అందుకోవాలనుకుప్పుడు ఇలా జరుగుతోంది. ఎటువంటి సెన్సార్ కట్స్ లేకుండానే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. హిందీ ‘క్వీన్’ చిత్రం తెలుగు వెర్షన్ ‘దటీజ్ మహాలక్ష్మి’గా మలయాళంలో ‘జామ్ జామ్’గా, కన్నడలో ‘బటర్ఫ్లై’గా రీమేక్ అయ్యాయి. ‘జామ్ జామ్’, ‘బటర్ ఫ్లై’ చిత్రాలకు సెన్సార్ బోర్డ్ యుఏ సర్టిఫికెట్ ఇచ్చింది. -
జెర్సీ రీమేక్లో అమలాపాల్!
‘‘కథాబలం ఉన్న కథలు, బలమైన పాత్రలు రావడంలేదు. అందుకే సినిమాలు వదిలేద్దామనుకున్నా’’ అని ఇటీవల ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమలా పాల్ చెప్పారు. అయితే కథాబలం ఉన్న స్క్రిప్ట్ కావడంతో ‘ఆమె’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు అమలా పాల్కి మరో బలమైన పాత్ర చిక్కింది. ‘జెర్సీ’ తమిళ రీమేక్లో అమలా పాల్ను కథానాయికగా అడిగారట. తెలుగు సినిమా చూసినవారికి కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలిసే ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని అమలా పాల్ ఒప్పుకున్నారట. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళ రీమేక్ని హీరో రానా నిర్మించనున్నారు. నాని పాత్రలో విష్ణు విశాల్ నటిస్తారని తెలిసింది. అయితే ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రం హిందీ రీమేక్ని ‘దిల్’ రాజు, నాగవంశీ నిర్మించనున్నారు. ఇంకా తారాగణం ఎంపిక కాలేదు. -
ట్రాఫిక్ సిగ్నల్ కథేంటి
‘ఎరుపు పసుపు పచ్చ’ ఈ మూడు రంగులను మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడీ రంగులనే సినిమా టైటిల్గా ఫిక్స్ చేశారు తమిళ దర్శకుడు శశి. ‘బిచ్చగాడు’ చిత్రాన్ని రూపొందించిన శశి కొత్త తమిళ చిత్రం ‘సివప్పు మంజళ్ పచ్చై’. సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్ కుమార్ హీరోలుగా నటించారు. రమేశ్ పిళ్లై నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో ‘ఎరుపు పసుపు పచ్చ’ టైటిల్తో అనువదిస్తున్నారు. రమేశ్ పిళ్లై మాట్లాడుతూ– ‘‘ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కి, బైక్ రేసర్కి మధ్య సాగే ఎమోషనల్ కథ ఇది. మంచి ఫ్యామిలీ డ్రామా. యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ మొదటివారంలో విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘నా గత చిత్రం ‘బిచ్చగాడు’ని బాగా ఆదరించారు. నా నుంచి ఏం ఆశిస్తారో అవన్నీ ఆలోచించి ఈ కథ తయారు చేశాను. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు శశి. -
గ్యాంగ్స్టర్ గానా బజానా!
సెటిల్మెంట్స్ చేయాల్సిన గ్యాంగ్స్టర్ సెట్లో స్టెప్పులేశాడు. ఇదంతా ‘వాల్మీకి’ సెట్లో జరిగిందని తెలిసింది. వరుణ్ తేజ్, అధర్వ ముఖ్యతారాగణంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజాహెగ్డే, మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నారు వరుణ్. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ మాస్ సాంగ్ను చిత్రీకరించారని తెలిసింది. ఈ పాటకు వరుణ్ వేసిన స్టెప్స్ అదుర్స్ అని సమాచారం. అలాగే ఈ సినిమా చిత్రీకరణలో తొలిసారి పాల్గొన్నారు పూజా హెగ్డే. గురువారం పూజ వాల్మీకి సెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... తమిళ చిత్రం ‘జిగర్తండా’కు ఇది రీమేక్. ఓ గ్యాంగ్స్టర్ జీవితం ఆధారంగా సినిమా తీయాలని రియల్ గ్యాంగ్స్టర్ జీవితంతో ట్రావెల్ అయ్యే ఓ ఫిల్మ్ మేకర్ కథ ఆధారంగా ‘జిగర్తండా’ తెరకెక్కింది. ∙అధర్వ, వరుణ్ తేజ్ -
సమంతలా నటించలేకపోయేదాన్నేమో!
‘‘రాక్షసుడు’ కథ నచ్చింది. ఇది తమిళ ‘రాక్షసన్’ సినిమాకి రీమేక్. నేను తమిళ సినిమా చూడలేదు. మా నాన్నగారు చూసి ‘రాక్షసన్’ చాలా బాగుంది.. చూడమంటే చూశా. కథ అద్భుతంగా ఉంది’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించారు. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ పంచుకున్న విశేషాలు. ► క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ఇది. నాకు థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టం. అందుకే ఈ కథకి బాగా కనెక్ట్ అయ్యాను. ఇందులో నేను టీచర్ పాత్రలో కనిపిస్తాను. సినిమాలో ఎక్కువ భాగం చీరలో ఉండటం సౌకర్యంగానే అనిపించింది. ఎందుకంటే ఐదో తరగతి నుంచే నాకు చీరలు కట్టుకోవడం అలవాటు. డ్యాన్స్, ఇతర ప్రోగ్రామ్స్ టైమ్లో చీరలో ఉండేదాన్ని. సినిమాలో నన్ను చూసి ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో అనే టెన్షన్ ఉంది. ► తమిళ ‘రాక్షసన్’లో అమలా పాల్ చేశారు. ఆమె కళ్లు చాలా బాగుంటాయి. అమలా పాల్ పాత్ర నేను చేయడం హ్యాపీగా ఉంది. అయితే ఆమెలా కాకుండా నా శైలిలో నటించాను. ఈ సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ సమయంలో నా వాయిస్ బాగాలేదు. ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించమని రమేష్ వర్మగారితో అంటే, ఆయన నేనే చెప్పాలనడంతో చెప్పాను. ► దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్న ఓ మలయాళ సినిమాకి డైరెక్టర్ శ్యాంసు జ్యభ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశా. ఓ సినిమా కోసం యూనిట్ పడే కష్టం ఏంటో తెలుసుకోవాలి.. అప్పుడే వృత్తిపై నాకు మరింత గౌరవం పెరుగుతుందని అసిస్టెంట్గా చేశా. వైవిధ్యమైన అనుభూతి కలిగింది. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తా. కొన్ని ఐడియాలు ఉన్నాయి. నేను దర్శకత్వం వహించే సినిమాల్లో జీవితం కనిపించాలి. ► నా మాతృభాష మలయాళం అయినా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి ఇక్కడే నాకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు రెండో ఇల్లు లాంటిది. నటిగా సంతృప్తి ఉండదు. మంచి సినిమాలు, పాత్రలు వస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకూ నాకు చాలెంజింగ్ పాత్ర రాలేదు. తెలుగు ‘నిన్ను కోరి’ తమిళ్ రీమేక్లో నటిస్తున్నా. నివేదా థామస్ పాత్రను నా శైలిలో చేయనున్నా. ఇది నాకు చాలెంజిగ్ పాత్ర అనుకుంటున్నా. ‘ఫిదా’ సినిమాలో సాయిపల్లవి, ‘మహానటి’లో కీర్తీ సురేశ్ చేసిన పాత్రలంటే చాలా ఇష్టం. నటిగా నేనేంటో నిరూపించుకునే అలాంటి పాత్రలు చేయాలనుంది. ‘రంగస్థలం’ సినిమా అవకాశం కోల్పోవడం కొంచెం బాధగానే ఉంది. అయితే ఆ పాత్రలో సమంతకంటే నేను బాగా చేయలేనేమో? అనిపించింది. -
తలకిందుల ఇంట్లో తమన్నా!
ఇంట్లోని గడియారం, అల్మరా, అద్దం.. ఇలా అన్ని వస్తువులు తలకిందులుగా కనిపిస్తున్నాయి. అదే ఇంట్లో ఉన్న తమన్నా మాత్రం కుర్చీలో దర్జాగా కూర్చుని నవ్వుతున్నారు. విశేషం ఏంటంటే.. తమన్నా కూర్చున్న కుర్చీ మాత్రం తలకిందులుగా లేదు. ఇక్కడున్న ఫొటో చూశారుగా. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా తమిళ చిత్రంలోని స్టిల్ ఇది. రోహన్ వెంకటేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘పెట్రోమాక్స్’ అనే టైటిల్ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ను తాప్సీ విడుదల చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తెలుగులో హిట్ సాధించిన ‘ఆనందోబ్రహ్మ’ సినిమాకు ‘పెట్రోమాక్స్’ తమిళ రీమేక్ అని టాక్. తెలుగు వెర్షన్లో తాప్సీ నటించిన విషయం తెలిసిందే. అందుకే తమిళ రీమేక్ని ఆమె చేతుల మీదుగా విడుదల చేయించి ఉంటారు. -
ది బాస్
నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు శ్రియ. కథానాయికగా వైవిధ్యమైన పాత్రలతో పాటుగా కమర్షియల్ గెటప్లు వేశారు. ఆండ్రీ కొచ్చివ్తో గత ఏడాది శ్రియ వివాహం జరిగింది. చిన్న బ్రేక్ తర్వాత ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేయడానికి శ్రియ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఆర్. మాదేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సండక్కారి: ది బాస్’ సినిమాలో శ్రియ నటిస్తున్నారని కోలీవుడ్ టాక్. 2012లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ మూవీ ‘మై బాస్’ చిత్రానికి ఇది తమిళ రీమేక్ . యాక్షన్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. లండన్, న్యూయార్క్తో పాటుగా కొచ్చి, గోవాలో షూట్ ప్లాన్ చేశారట. శ్రియ నటించిన తమిళ చిత్రం ‘నరగాసురన్’, హిందీ చిత్రం ‘తడ్కా’ విడుదల కావాల్సి ఉంది. -
తమిళంలో నిన్ను కోరి
మంచి ప్రేక్షకాదరణ దక్కిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం సాధారణమే. ఆ జాబితాలోకి తాజాగా ‘నిన్ను కోరి’ చిత్రం కూడా చేరిందట. నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ ముఖ్య తారాగణంగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిన్ను కోరి’ చిత్రం తెలుగులో మంచి హిట్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతోందని సమచారం. అధర్వ, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య తారలుగా ఇటీవల కన్నన్ దర్శకత్వంలో కోలీవుడ్లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇది ‘నిన్ను కోరి’ చిత్రానికి తమిళ రీమేక్ అని టాక్. మరి.. తెలుగులో ఆది పినిశెట్టి చేసిన పాత్రను తమిళంలోఎవరు? చేస్తారో చూడాలి. -
ఐ లవ్ యూ చెబుతారా?
కన్నడ, తెలుగు భాషల్లో హీరో ఉపేంద్రతో ‘ఐ లవ్ యూ’ చెప్పించారు దర్శకుడు ఆర్. చంద్రు. ప్రేమలో కొత్తకోణం చూపించాం అంటూ తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 14న రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని తెలిసింది. ఈ తమిళ రీమేక్ను కూడా ఒరిజినల్ చిత్రాన్ని తెరకెక్కించిన ఆర్. చంద్రునే డైరెక్ట్ చేస్తారట. ‘‘ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడం సంతోషంగా ఉంది. ఇంకా నటీనటులను ఫైనలైజ్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్లో కార్తీ నటిస్తే బావుంటుంది అనుకుంటున్నాను. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో చేస్తాం’’ అని దర్శకుడు పేర్కొన్నారు. మరి తమిళంలో కార్తీ ‘నాన్ ఉన్నై కాదలిక్కరేన్’ అని చెబుతారా? అదేనండీ... తమిళంలో ఐ లవ్ యూ చెబుతారా? వేచి చూడాలి. -
నాన్న ఎప్పుడూ నా వెనకుంటారు
నటుడికి తొలి సినిమా చాలా ముఖ్యం. ఏ అడ్డంకులు లేకుండా మంచి హిట్ సాధించాలనుకోవడం సహజం. అలాంటిది ఎంతో కష్టపడి తీసిన సినిమా బాగా రాలేదని మళ్లీ మొదటి నుంచి తీయాలని నిర్మాతలు అనుకుంటే? ఆ యాక్టర్ కాన్ఫిడెన్స్లో కచ్చితంగా డిస్ట్రబెన్స్ వస్తుంది. అయితే విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్కి ఇలా జరిగినా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు ధృవ్. మొదట బాలా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘వర్మ’ టైటిల్తో తీశారు. ఆ చిత్రాన్ని ఆపేసి, ‘ఆదిత్యవర్మ’ పేరుతో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టి, పూర్తి చేశారు. ‘ఆదిత్య వర్మ’ పూర్తి కావడం వెనక తన తండ్రి సహకారం ఉందని భావోద్వేగంతో ధృవ్ రాసిన లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘సెట్ను ప్రతిరోజూ సందర్శిస్తూ, మమ్మల్ని మా శక్తిమేరకు పని చేసేలా ప్రోత్సహిస్తూ,్త, మా అందరి విజన్ను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ నన్ను ‘ఆదిత్య వర్మ’ను చేశారు మా నాన్న. నా మీద నాకున్న నమ్మకాన్ని కోల్పోనివ్వకుండా, నా వెనకే ఉంటూ, నాకన్నీ నేర్పిస్తూ ఉన్నావు, ఉంటావు కూడా నాన్నా! నువ్వు లేకుండా ఏదీ అంత సులువుగా జరిగేది కాదు. నన్నెవరో అడిగారు.. ‘సినిమాకు అంత కష్టపడ్డారు కదా, టీజర్లో మీ నాన్నగారి పేరెక్కడా? అని. ఆయన పేరు నా పేరు వెనక, ఆయనెప్పుడూ నా వెనక ఉంటారు’ అని బదులిచ్చాను. నువ్వు గర్వపడేలా చేస్తాను నాన్నా’’ అని పేర్కొన్నారు. ‘ఆదిత్య వర్మ’ టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
ఆదిత్య వర్మ రెడీ
‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ పడాల్సిన ఇబ్బందులు పడింది. చూడాల్సిన చిక్కులు చూసేసింది. ఇక ఆడియన్స్ సినిమా చూడటమే తరువాయి. ఈ రీమేక్ ద్వారా విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్నారు. తొలుత ఈ సినిమాని ‘వర్మ’ టైటిల్తో బాలా డైరెక్ట్ చేశారు. అవుట్పుట్ నచ్చలేదని నిర్మాణ సంస్థ మళ్లీ మొదటి నుంచి షూటింగ్ మొదలెట్టారు. ప్రస్తుతం వర్మ టైటిల్ను ‘ఆదిత్య వర్మ’గా మార్చి గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఒరిజినల్ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో గిరీశయ్య పని చేయడం విశేషం. ఇందులో బన్నితా సంధు, ప్రియా ఆనంద్ కథానాయికలు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. టీజర్ ఆదివారం రిలీజ్ అయింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. రిలీజ్కు ‘ఆదిత్య వర్మ’ రెడీ అంటోంది చిత్రబృందం. -
దానాల ప్రభు
తమిళ యంగ్ హీరో హరీష్ కల్యాణ్ కొత్త చిత్రం కోసం దానాలు చేసే ప్రభువుగా మారిపోయారు. ఇంతకి ఏం దానం చేస్తారు? అన్నదానమా? భూములా? కాదు. డబ్బులా? కానే కాదు. వీర్యం దానం చేస్తాడట. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘విక్కీ డోనర్’ తమిళ రీమేక్లో హరీష్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన నాని ‘జెర్సీ’లో నాని కుమారుడిగా నటించింది ఇతగాడే. ఆ సినిమా క్లైమాక్స్లో తండ్రి గురించి ఎమోషన్ స్పీచ్ ఇచ్చి, అందర్నీ ఆకట్టుకున్నాడు హరీష్ కల్యాణ్. ఇక అతను చేయనున్న ‘విక్కీ డోనర్’ రీమేక్ విషయానికొస్తే.. ‘యుద్ధం శరణం’ ఫేమ్ కృష్ణ మరిముత్తు ఈ రీమేక్ను డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి ‘దారాళ ప్రభు’ అనే టైటిల్ను అనుకుంటున్నారని తెలిసింది. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
చూపు లేని పాత్రపై కన్ను
2018లో బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాల్లో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ‘అంధాధూన్’ చిత్రం ఒకటి. ఆయుష్మాన్ ఖురానా అంధ పియానో ప్లేయర్ పాత్రలో కనిపించారు. ఇక్కడే కాదు, చైనాలోనూ ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసే ఆలోచన ఉందని ధనుష్ పేర్కొన్నారు. ‘‘2009 నుంచి రీమేక్ సినిమాల్లో నటించడం తగ్గించాను. కానీ ‘అంధాదూన్’ చాలా అద్భుతమైన సినిమా. ఆల్రెడీ ఈ రీమేక్ రైట్స్ తీసుకునే ప్రయత్నాల్లో మా టీమ్ ఉంది. ఇలాంటి అద్భుతమైన థ్రిల్లర్స్ను తమిళ ప్రేక్షకులకు తప్పకుండా చూపించాలనే ఉద్దేశంతోనే రీమేక్ చేయాలనుకున్నాను’’ అని పేర్కొన్నారు. హిందీ సినిమా చూసినవాళ్లకు ఇందులో హీరో చూపు లేనివాడు అనే విషయం తెలిసే ఉంటుంది. ధనుశ్లో మంచి నటుడు ఉన్నాడు. ఈ పాత్రను అద్భుతంగా చేయగలరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
కోలీవుడ్కు మహర్షి?
ఏదైనా సినిమా రిలీజై మంచి హిట్ సాధించినప్పుడు ఆ సినిమాను తమ భాషలో రీమేక్ చేయాలనుకుంటారు హీరోలు. కానీ ‘మహర్షి’ కొంచెం ఫాస్ట్గా ఉన్నాడు. రిలీజ్ కాకముందే రీమేక్ అవ్వడానికి రెడీ అవుతున్నాడని తెలిసింది. కెరీర్లో 25వ సినిమా కోసం ‘రిషి’గా మారి ‘మహర్షి’ సినిమా చేశారు మహేశ్బాబు. మే 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ కాకముందే ‘మహర్షి’ రీమేక్ కాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను తమిళంలో విజయ్ రీమేక్ చేయనున్నారని తెలిసింది. ఆల్రెడీ మహేశ్ చేసిన ‘ఒక్కడు, పోకిరి’ సినిమాల తమిళ రీమేక్స్లో విజయ్ నటించారు. రెండూ పెద్ద హిట్స్గా నిలిచాయి. ఇప్పుడు ‘మహర్షి’ రీమేక్లో నటిస్తే ఇది మూడో సినిమా అవుతుంది. ఈ సినిమాను ఎవరు రూపొందిస్తారు? నిర్మిస్తారు అన్న సంగతి తెలియాల్సి ఉంది. -
ఫారిన్లో పాట
తెలుగు సెన్సేషన్ ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్యవర్మ’లో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ నటిస్తున్న విషయం తెలిసిందే. గిరీశాయ దర్శకత్వంలో రూపొందుతోంది. హిందీ చిత్రం ‘అక్టోబర్’ ఫేమ్ బన్నితా సాంధు ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. నటి ప్రియా ఆనంద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ముకేశ్ మెహతా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సాంగ్ షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్లో జరుగుతోంది. ‘‘చాలా వేగంగా చిత్రీకరణ జరుగుతోంది. పోర్చుగల్లో సాంగ్ షూట్ చేస్తున్నాం. 65 శాతం సినిమా పూర్తయింది. ఈ మధ్యే సినిమా ప్రారంభించాం. అంతలోనే 65 శాతం పూర్తి చేశాం. రికార్డు టైమ్’’ అన్నారు సినిమాటోగ్రఫర్ రవి. కె. చంద్రన్. ఇది వరకు ‘అర్జున్రెడ్డి’ తమిళ రీమేక్ ధ్రువ్ హీరోగా బాల దర్శకత్వంలో ‘వర్మ’ పేరుతో ప్రారంభమై, రిలీజ్కి రెడీ అయిన విషయం తెలిసిందే. కాకపోతే అవుట్పుట్ తాము ఆశించినట్లుగా రాలేదని భావించిన ఈ4 ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వారు సినిమా మొత్తాన్ని రీ–షూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఆదిత్య వర్మ’గా టైటిల్ని మార్చారు. పూర్తయిన సినిమాని మళ్లీ మొదలుపెట్టి, తీయడం అరుదుగా జరుగుతుంటుంది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
రాక్షసుడు
‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. మల్లి జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని.. చూడకుంటే నాకు వెన్నెలేది...’ పాట వినగానే చిరంజీవి నటించిన ‘రాక్షసుడు’ సినిమా గుర్తుకురాకమానదు. రాధ, సుహాసిని హీరోయిన్లుగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమా 1986లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘రాక్షసుడు’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ‘రైడ్, వీర’ చిత్రాల ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘రాచ్చసన్’ చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతోంది. హవీష్ లక్ష్మణ్ ప్రొడక్షన్లో ఏ స్టూడియోస్ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్లో సినిమా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్. -
టెంపర్లో బ్లాక్ బస్టర్
‘బ్లాకు బస్టర్.. బ్లాకు బస్టరే.. నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాకుబాస్టరే...’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ‘సరైనోడు’ సినిమాలో ఈ పాటకు అల్లు అర్జున్ వేసిన స్టెప్పులకు తెలుగులో ఫుల్ విజిల్స్ పడ్డాయి. ఇప్పుడీ ట్యూన్ తమిళ్లో వినిపించనుంది. తమిళ వెర్షన్ ‘బ్లాక్బస్టర్..’ పాటకు విశాల్ డ్యాన్స్ చేయనున్నారు. ఎన్టీఆర్ సూపర్ హిట్ ‘టెంపర్’ చిత్రం తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ అవుతోంది. ఇందులో విశాల్, రాశీఖన్నా జంటగా నటిస్తున్నారు. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఠాగూర్’ మధు నిర్మాత. ‘టెంపర్’ సినిమాలో వచ్చే ‘ఇట్టాగె రెచ్చిపోదాం పిల్లా’ పాట ప్లేస్లో ‘బ్లాక్ బస్టర్’ సాంగ్ ట్యూన్ను వాడుకుంటున్నారట. ఈ స్పెషల్ సాంగ్లో స్టెప్పులేయడానికి తొలుత సన్నీ లియోన్, శ్రుతీహాసన్ పేర్లు వినిపించాయి. లేటెస్ట్గా ఈ సాంగ్లో విశాల్తో శ్రద్ధాదాస్ కాలు కదుపుతున్నారట. ఈ స్పెషల్ సాంగ్తోనే శ్రద్ధ తమిళ ఎంట్రీ ఇవ్వనున్నారు. సమ్మర్లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్ సి యస్. -
ఒకమ్మాయి.. ఇద్దరు ప్రేమికులు
ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా తనయుడు శంతన్ భాగ్యరాజా, సృష్టి డాంగే జంటగా నటించిన తమిళ చిత్రం ‘ముప్పరి మనమ్’. ఆది రూపన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భాను క్రియేషన్స్ పతాకంపై భువన్ కుమార్ అల్లం ‘లవ్ గేమ్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘గతంలో ‘సారథి’ అనే స్ట్రయిట్ సినిమా నిర్మించాను. తమిళంలో దాదాపు 40 చిత్రాలకు పైగా చూసి శంతన్ భాగ్యరాజా నటించిన ‘ముప్పరి మనమ్’ చిత్రం నచ్చడంతో ‘లవ్ గేమ్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నాం. ప్రెజెంట్ ట్రెండ్కి కనెక్టయ్యే కాన్సెప్ట్తో రూపొందిన చిత్రమిది. తెలుగులో ఇప్పుడు ఇలాంటి చిత్రాల హవా నడుస్తోంది. ఒక అమ్మాయి తన స్వార్థం కోసం ఇద్దరు అబ్బాయిలతో ఎలా గేమ్ ఆడిందనేది కథ. వెన్నెలకంటిగారు మంచి సంభాషణలు అందించారు. జీవీ ప్రకాష్కుమార్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. మార్చి 2న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరపనున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటి రమ్యకృష్ణ, నటుడు, దర్శకుడు భాగ్యరాజా, హీరో సందీప్ కిషన్, సంగీత దర్శకుడు తమన్ తదితరులు హాజరు కానున్నారు. మార్చి 8న సినిమాని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. -
వర్మ కాదు... ఆదిత్యవర్మ
తెలుగు హిట్ ‘అర్జున్రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. అవుట్పుట్ నచ్చక మళ్లీ ఈ సినిమా తీయాలని నిర్మాతలు అనుకున్న విషయం తెలిసిందే. హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ‘వర్మ’ను ప్రారంభించారు. రీషూట్ చేయాలనుకున్న తర్వాత హీరోగా ధృవ్నే ఉంచారు కానీ దర్శకుడు బాలా స్థానంలో గిరీశాయ అనే దర్శకుడిని తీసుకున్నారు. హీరోయిన్గా బన్నితా సాదును తీసుకున్నారు. రవి. కె చంద్రన్ను కెమెరామెన్గా తీసుకున్నారు టీమ్. తాజాగా ఈ సినిమాకు ‘ఆదిత్యవర్మ’ అనే టైటిల్ను ఖరారు చేయడంతో పాటు ధృవ్ లుక్ను కూడా రిలీజ్ చేశారు. ఇక చిత్రదర్శకుడు గిరీశాయ గురించి చెప్పాలంటే... తెలుగు ‘అర్జున్రెడ్డి’ సినిమాకు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారట. అలాగే తెలుగు ‘అర్జున్రెడ్డి’ చిత్రానికి సంగీతం అందించిన రధన్నే ‘ఆదిత్యవర్మ’కు మ్యూజిక్ అందించబోతుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ను త్వరగా కంప్లీట్ చేసి జూన్లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
వర్మ ప్రేయసి
తెలుగు హిట్ ‘అర్జున్రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’తో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇక విడుదల కావడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో ‘తూచ్.. అవుట్పుట్ నచ్చలేదు’ అంటూ నిర్మాతలు మళ్లీ తీయడానికి రెడీ అయిపోయారు. ధృవ్నే హీరోగా ఈ సినిమా మొత్తాన్ని రీ–షూట్ చేయనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. దర్శకుడు, హీరోయిన్ ఇతర తారాగణం స్థానంలో కొత్తవారు ఉంటారు. ఈ కొత్త వెర్షన్కు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే పాత వెర్షన్లో హీరోయిన్గా నటించిన మేఘా చౌదరి స్థానంలో బన్నితా సాంధును ఎంపిక చేశారు టీమ్. ఈ విషయాన్ని నిర్మాతలు ధృవీకరించారు. ఇంతకుముందు వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘అక్టోబర్’లో హీరోయిన్గా నటించారు బన్నిత. ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ‘అక్టోబర్’ చిత్రంలో నటించడానికి ముందు వాణిజ్య ప్రకటనల్లో కనిపించారామె. 2016లో గాయకుడు కిశోర్ కుమార్ ‘ఏక్ అజ్నబీ హసీనా’ అనే పాటను రీ–క్రియేట్ చేసిన మ్యూజిక్ వీడియోతో ఫేమస్ అయ్యారు బన్నిత. -
పాంచ్ పటాకా
గతేడాది సిల్వర్ స్క్రీన్ మీద ఒక్కసారే కనిపించారు క్యాథరీన్. అదీ తమిళ చిత్రం ‘కలకలప్పు 2’లో. 2018లో తనను స్క్రీన్ మీద బాగా మిస్ అయిన ఫ్యాన్స్కు ఈ ఏడాది పాంచ్ పటాకా ఇవ్వనున్నారు. ఈ ఏడాది క్యాథరీన్కు 5 రిలీజులున్నాయి. ‘అత్తారింటì కి దారేది’ తమిళ రీమేక్ ‘వందా రాజావాదాన్ వరువేన్’లో హీరోయిన్గా చేస్తున్నారు. ‘నీయా’ సీక్వెల్ ‘నీయా 2’, ‘అరువమ్’, ఏడేళ్ల తర్వాత మలయాళంలోకి కమ్బ్యాక్ ఇస్తూ చేసిన ‘అన్నెకిల్లమ్ అల్లెన్కిల్లమ్’ సినిమాలు రిలీజ్కు రెడీ అయ్యాయి. ఇంకా తెలుగులో సంతోష్ శివన్, రవితేజ కాంబినేషన్లో చేయనున్న సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారు. ఇవే కాకుండా విజయ్ దేవరకొండ సినిమాలోనూ చాన్స్ కొట్టేశారని టాక్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాశీఖన్నా, తమిళ భామ ఐశ్వర్యా రాజేశ్, బ్రెజిల్ మోడల్ ఇసబెల్లా హీరోయిన్స్గా కనిపించనున్నారు. ఇందులో మరో హీరోయిన్గా క్యాథరీన్ కూడా ఎంపికైనట్టు సమాచారం. మొత్తానికి గతేడాది వచ్చిన గ్యాప్ని ఈ ఏడాది గ్యాప్ లేకుండా సినిమాలతో నింపేసినట్టున్నారు క్యాథరీన్. -
మిస్ శ్వేత
ఇటీవల అజిత్ పూర్తి చేసిన ‘విశ్వాసం’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ హిట్ ‘పింక్’ తమిళ రీమేక్లో ఆయన లాయర్గా నటించనున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో నజ్రియా, కల్యాణీ ప్రియదర్శన్, శ్రద్ధాశ్రీనాథ్ నటించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో శ్వేత అనే పాత్రను నజ్రియా చేయబోతున్నట్లు కోలీవుడ్ సమాచారం. బోనీకపూర్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుందని టాక్. ఈ సినిమాకు ‘ఖాకి’ ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తారు. -
అప్పుడు పదహారు కేజీలు తగ్గాను
‘‘కథే హీరో అని ఫీల్ అవుతాను. అందుకే కేవలం హీరో పాత్రలే చేయాలని ఇండస్ట్రీకి రాలేదు నేను. ఆసక్తికరంగా ఉండే లీడ్ రోల్స్ చేయడానికి కూడా రెడీగా ఉండాలనుకుని వచ్చాను. నా వల్ల కథకు ఓ ఇంపార్టెన్స్ ఉండాలనుకుంటాను. ఆ ప్రాసెస్లో నాకు నచ్చిన పాత్రలు చేస్తూ వెళ్తున్నాను. ఐడియాలజీ డిఫరెంట్గా ఉన్న నెగటీవ్ పాత్రలు చేయడానికి కూడా ఓకే’’ అన్నారు సత్యదేవ్. గోపీ గణేశ్ దర్శకత్వంలో సత్యదేవ్, నందితా శ్వేత జంటగా రూపొందిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. తమిళ చిత్రం ‘చతురంగ వేటై్ట’కి తెలుగు రీమేక్ ఇది. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో రమేష్ పిళ్లై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా సత్యదేవ్ చెప్పిన సంగతులు. ► పేదవాడికి, ధనవంతుడికి పోగొట్టుకోవడానికి ఏమీ ఉండదు. మధ్యతరగతివారు అవకాశాల కోసం చూస్తుంటారు అందుకే వారిని టార్గెట్ చేసి మోసం చేయడానికి కొందరు ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి అంశాల ఆధారంగానే మా ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రం రూపొందింది. ఉత్తమ్ కుమార్, కెప్టెన్ సాగర్, కుభేర గోస్వామి, ఆకాష్ విహారి అని ఇలా డిఫరెంట్ పేర్లతో మోసం చేసే క్యారెక్టర్లో నేను నటించాను. డబ్బంటే ఇష్టం ఉన్న హీరో జీవితంలోకి డబ్బంటే విపరీతమైన ఇష్టం ఉన్న విలన్ వచ్చినప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయి? అనేవి సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. రెండు జీవితాలు ఉండే గొంగళిపురుగు లాంటి క్యారెక్టర్ హీరోది. ► దర్శకుడు గోపీ గణేశ్ అన్న ఈ సినిమాకు చాలా కష్టపడ్డారు. ఆయనకు సినిమా తప్ప వేరే వ్యాపకం లేదు. నిర్మాత రమేష్ పిళ్లైగారు తమిళంలో చాలా సినిమాలు చేశారు. ఈ సినిమాకు సమర్పకులుగా ఉన్నారు శివలెంక కృష్ణప్రసాద్గారు. కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఇందులో ధనశెట్టి పాత్రలో పృథ్వీరాజ్గారు బాగా నటించారు. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా ‘అర్జున్రెడ్డి’ రేంజ్లో ఆడియన్స్కు రీచ్ అవుతుందని ఆయన అనడం హ్యాపీగా ఉంది. ఆ నమ్మకం మాకూ ఉంది. ఈ చిత్రంలో కోర్టు ఎపిసోడ్ బాగా వచ్చింది. సినిమా రిలీజయ్యాక నచ్చితే ఆడియన్స్ చిన్న క్లాప్ కొట్టాలని కోరుకుంటున్నాను. ► ‘అంతరిక్షం’, ‘మెంటల్మదిలో..’ లాంటి డిఫరెంట్ సినిమాల్లో డిఫరెంట్ లుక్స్లో కనిపించాను. డైరెక్టర్స్ ఎలా కావాలంటే ఆ లుక్లోకి మారిపోతా. పూరిగారి ‘జ్యోతిలక్ష్మి’ ఆడిషన్స్కు వెళ్లినప్పుడు నాతో పాటు దాదాపు 500 మంది పోటీపడ్డారు. అప్పుడు నా వెయిట్ 90 కేజీలు. పూరిగారు నన్ను చూసి వెయిట్ తగ్గి రమ్మన్నారు. రెండు నెలల్లో 16 కేజీలు తగ్గి ఆయన దగ్గరకు వెళ్లాను. అప్పుడు నువ్వే లీడ్ యాక్టర్ అన్నారు. అప్పట్నుంచి నా కెరీర్లో చేంజ్ వచ్చింది. ► నేను హీరోగా ‘మెంటల్మదిలో..’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా, ‘గువ్వా గోరింకా’, ‘47’ సినిమాలు చేస్తున్నాను. టెర్రరిజం బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఓ హిందీ చిత్రంలో లీడ్ యాక్టర్గా చేస్తున్నా. -
శర్వా @ త్రీ షేడ్స్!
‘పడి పడి లేచె మనసు’ అంటూ ఈ శుక్రవారం ఓ ప్రేమకథను మన ముందుకు తీసుకువస్తున్న శర్వానంద్ మరో లవ్స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం. విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్లో ప్రేమ్కుమార్ తెరకెక్కించిన ఫీల్గుడ్ లవ్స్టోరీ ‘96’. తమిళనాట ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. వెంటనే తెలుగు రీమేక్ హక్కులను ‘దిల్’ రాజు సంపాదించుకున్నారు. ఈ రీమేక్లో శర్వానంద్ హీరోగా నటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో హీరోయిన్గా సమంత నటించనున్నారని టాక్. ఆల్రెడీ శర్వానంద్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి సూపర్హిట్ లవ్స్టోరీలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుధీర్వర్మతో చేస్తోన్న గ్యాంగ్స్టర్ డ్రామా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఆ తర్వాత ‘96’ రీమేక్ పట్టాలెక్కుతుందట. ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ రీమేక్కు దర్శకుడు. కాగా, తమిళ వెర్షన్లో హీరో ట్రావెల్ ఫొటోగ్రాఫర్. 15 ఏళ్లు, 19 ఏళ్లు, 37 ఏళ్ల వయసుతో మూడు రకాల షేడ్స్లో విజయ్ సేతుపతి కనిపించారు. సో.. రీమేక్లోనూ హీరో పాత్ర అదే పోషించనున్నారు. -
అతిథులుగా...
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య పాత్రల్లో అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పింక్’. 2016లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్లో వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో అమితాబ్ పాత్రలో అజిత్ నటించనున్నారు. ‘చదురంగవేట్టై’ ఫేమ్ వినోద్ ఈ రీమేక్కి దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నటి విద్యాబాలన్లను అతిథి పాత్రల్లో నటింపజేసేందుకు బోనీకపూర్ చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అజిత్ తాజా చిత్రం ‘విశ్వాసం’ సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత ‘పింక్’ సినిమా రీమేక్కి కొబ్బరికాయ కొట్టనున్నారు. అమితాబ్, విద్యా ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? కూసింత ఓపిక పడితే తెలుస్తుంది. అమ్మ విద్యాబాలన్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో 3 సినిమాలు తెరకెక్కనున్నాయి. తమిళ ప్రజలు ‘అమ్మ’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే జయలలితను ఎవరు ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో ఇప్పటికే షూటింగ్ మొదలెట్టేశారు. ఇందులో జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. సీనియర్ దర్శకులు భారతీ రాజా కూడా ఈ విప్లవ నాయకురాలు పై ఓ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరితో పాటు మరో దర్శకుడు ఏఎల్ విజయ్ కూడా జయలలిత బయోపిక్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో అమ్మ పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటి విద్యాబాలన్ నటించనున్నార ట. ఈ సినిమా కోసం ఆమె బరువు పెరగనున్నారని భోగట్టా. ఇక జయలలిత రాజకీయ జీవితంలో ముఖ్యులైన ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేశారని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా జయలలిత జయంతి రోజున (ఫిబ్రవరి 24) ప్రారంభం కానుందట. -
కాఫీ తాగి.. కబుర్లు చెప్పి!
రాత్రివేళ సముద్రతీరానికి వెళ్లిన కథానాయిక రాశీఖన్నా పొద్దుపొద్దున్నే మేడపై కాఫీ తాగి బస్టాండ్కి వెళ్లారు. అక్కడ స్కూల్కి వెళ్తోన్న చిన్నారులతో కబుర్లు చెప్పారు. ఇవన్నీ ‘అయోగ్య’ సినిమాలోని సీన్స్ అన్నమాట. విశాల్ హీరోగా వెంకట్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అయోగ్య’. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ సినిమాకు తమిళ రీమేక్ ఇది. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ పాండిచ్చేరిలో జరిగింది. హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. పాండిచ్చేరి షెడ్యూల్ పూర్తవడంతో చెన్నై చేరుకున్నారు రాశీ. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ఒక కథానాయికగా నటించనున్నారామె. -
రెండోసారి
మాస్ హీరో విశాల్, మిల్కీ బ్యూటీ తమన్నాకి రెండోసారి జోడీ కుదిరిందా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ‘పందెం కోడి 2’ తర్వాత విశాల్ నటిస్తున్న చిత్రం ‘అయోగ్య’. తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’ తమిళ రీమేక్ ఇది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రం తర్వాత సుందర్.సి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు విశాల్. ఇందులో ఆయనకి జోడీగా తమన్నాని తీసుకున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. విశాల్–తమన్నా రెండేళ్ల క్రితం ‘కత్తి సండై’(తెలుగులో ‘ఒక్కడొచ్చాడు) చిత్రంలో నటించి, ప్రేక్షకులను అలరించారు. తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో మొదలు కానుంది. -
మరోసారి అత్తగా..
ఇటీవల వచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంలో పవర్ఫుల్ అత్తగా కనిపించిన రమ్యకృష్ణ మరోసారి అత్త పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సుందర్ సి. దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తున్నారు. ముందుగా నదియా పాత్రలో ఖుష్భు కనిపిస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా శింబు అత్త పాత్రను రమ్యకృష్ణ పోషించనున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్స్గా మేఘా ఆకాశ్, కేథరీన్ థెరీసా నటిస్తున్నారు. ఫైనల్గా అత్త దొరికేసింది. ఇక అత్తారింటికి దారి వెతికే పనిలో బిజీ అయ్యారు శింబు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. -
వర్మ వచ్చేశాడు
తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా తమిళం, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ రీమేక్ ‘వర్మ’లో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించారు. ఈ చిత్రానికి బాల దర్శకత్వం వహించారు. ఇందులో బెంగాలీ మోడల్ మేఘా చౌదరి కథానాయికగా నటించారు. ఈశ్వరీరావ్, రైజా విల్సన్, ఆకాశ్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి రధన్ స్వరకర్త. ఆదివారం ధృవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లను విడుదల చేశారు. అలాగే ‘వర్మ’ తెలుగు పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు టీమ్. సో... ‘వర్మ’ చిత్రం తెలుగులో కూడా ఏమైనా డబ్ అవుతుందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే హిందీ ‘అర్జున్రెడ్డి’లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. తెలుగు వెర్షన్ని తెరకెక్కించిన సందీప్రెడ్డి వంగానే హిందీ రీమేక్కి దర్శకుడు. ఈ చిత్రానికి ముందుగా తారా సుతారియాను హీరోయిన్గా అనుకున్నారు. కానీ డేట్స్ కుదరక వీలు పడలేదట. ఇప్పుడీ పాత్రను కియారా అద్వానీ చేయబోతున్నారని బాలీవుడ్ లేటెస్ట్ టాక్. -
మాటల తూటా
‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం’ సినిమాలతో సూపర్ సక్సెస్ఫుల్గా ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ. తన లేటెస్ట్ మూవీ ‘నోటా’లో యువ రాజకీయ నేతగా కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమాలో పదవీ బాధ్యతలు ఎప్పుడు తీసుకున్నారో థియేటర్లో తెలిసే సమయం ఆసన్నమైంది. విజయ్ దేవరకొండ, మెహరీన్ కౌర్ జంటగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ, తెలుగు ద్విభాషా పొలిటికల్ థ్రిల్లర్ ‘నోటా’. ఈ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు విజయ్. స్టూడియో గ్రీన్ బ్యానర్పై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాను అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో మెహరీన్ జర్నలిస్ట్గా కనిపించనున్నారు. ‘గీత గోవిందం’లో కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్లో కనిపించిన విజయ్ దేవరకొండ ‘నోటా’లో అందుకు పూర్తి భిన్నంగా కనిపించనున్నారు. వాడి వేడి డైలాగ్స్తో ఈ చిత్రం ఉత్కంఠభరితంగా సాగుతుందట. నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు సంగీతం: శ్యామ్ సీ.యస్, కెమెరా: శాంతన్ కృష్ణన్. -
మామియార్ వీట్టుక్కు...
అత్తను తీసుకురావడానికి మేనల్లుడు శింబు తన ప్రయత్నాలను మొదలెట్టేశారు. మరి అత్తను తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఎలాంటి పథకాలను రచిస్తున్నాడు? అత్తారింటికి దారిని ఎలా కనుక్కున్నాడో తెలుగు సినిమా చూసినవాళ్లకు తెలుసు. తమిళంలో మామియార్ వీట్టుకు (అత్తారింటికి) అడ్రస్ ఎలా కనిపెడతాడో చూడాలి. శింబు హీరోగా సుందర్ సి. దర్శకత్వంలో తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మేఘా ఆకాశ్ కథానాయిక. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జార్జియాలో ఆరంభమైంది. ఇందులో శింబుకు అత్తగా అప్పటి స్టార్ హీరోయిన్, దర్శకుడు సుందర్ భార్య ఖుష్బు యాక్ట్ చేయనున్నారట. చిత్రబృందం మాత్రం ఆ విషయంలో అప్డేట్ ఇవ్వలేదు. -
అత్తారింటికి దారేది: శింబుతో మేఘా రొమాన్స్!
సాక్షి, తమిళసినిమా : నటుడు ధనుష్తో జోడీ కట్టిన హీరోయిన్ తాజాగా శింబుతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోందట. నటుడు శింబు చిన్న గ్యాప్ తరువాత మళ్లీ బిజీ అయ్యిపోతున్నారు. ఈయన మణిరత్నం దర్వకత్వంలో నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘సెక్క సివంద వానం’ (తెలుగులో నవాబ్) సినిమా త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక, దర్శకుడు వెంకట్ప్రభు దర్శకత్వంలో మానాడు అనే చిత్రం, గౌతమ్మీనన్ దర్శకత్వంలో విన్నైతాండి వరువాయా- 2 చిత్రాలలో నటించడానికి శింబు కమిట్ అయ్యారు. అదేవిధంగా ఇటీవల లైకా సంస్థ కూడా శింబుతో చిత్రం చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్ద తెలుగులో పవన్కల్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్ర రీమేక్ హక్కులను పొందిన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రీమేక్లో పవన్కల్యాణ్ పాత్రలో శింబు నటించనుండగా.. ఆయనకు జోడీగా మేఘాఆకాష్కు అవకాశం వరించిందట. ఈ అమ్మడు ఇప్పటికే కోలీవుడ్లో ధనుష్కు జంటగా ‘ఎన్నై నోక్కి పాయుం తూటా’ చిత్రంతోపాటు ఒరు పక్క కథై, అధర్వకు జతగా బూమరాంగ్ చిత్రాలలో నటిస్తోంది. అయితే ఈ మూడింటిలో ఏ ఒక్క చిత్రం ఇంకా తెరపైకి రాలేదు. తెలుగులో ఇప్పటికే లై, ఛల్ మోహనరంగా వంటి చిత్రాల్లో నటించింది. ఇక, అత్తారింటికి దారేది చిత్రంలో సమంత పాత్రను మేఘా ఆకాశ్ పోషించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మరో పాత్రను నటి ప్రణీత చేయగా.. తమిళంలో ఆ పాత్ర ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. -
వైభవ్ కోరి...
‘అర్జున్ రెడ్డి, అత్తారింటికి దారేది, ఆర్ఎక్స్ 100’ తర్వాత మరో తెలుగు సినిమా తమిళంలోకి ఎగుమతి కానుంది. 2017లో రిలీజ్ అయిన ‘నిన్ను కోరి’ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో వైభవ్. దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ్ అనే సంగతి గుర్తుండే ఉంటుంది. ‘గొడవ’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తమిళంలో బిజీ ఆర్టిస్ట్గా ఉన్నారు. శివా నిర్వాణ దర్శకత్వంలో నాని, ఆది పినిశెట్టి, నివేథా ముఖ్య పాత్రల్లో కనిపించిన చిత్రం ‘నిన్ను కోరి’. తెలుగులో నాని పోషించిన క్యారెక్టర్ను తమిళంలో వైభవ్ చేస్తున్నారు. ఆది పినిశెట్టి, నివేథా పాత్రలను ఇంకా ఫైనలైజ్ చేయాల్సి ఉంది. ఈ రీమేక్ను కాస్మో కిరణ్ నిర్మించనున్నారు. ఇంకా దర్శకుడు ఎంపిక పూర్తి కాలేదు. -
కోలీవుడ్కు ప్రేమతో..!
ఒక భాషలో ఘనవిజయం సాధించిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవ్వటం చాలా కాలంగా జరుగుతోంది. ఇటీవల తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను తమిళ నాట రీమేక్ చేసేందుకు దర్శక నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అత్తారింటికి దారేది సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ శింబు హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ టెంపర్ను అయోగ్య పేరుతో విశాల్ హీరోగా ప్రారంభించారు. తాజాగా ఈ లిస్ట్లో మరో సినిమా చేరింది. ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్లో కనిపించిన ఈ సినిమా కోలీవుడ్లో రీమేక్ కానుంది. ఓ స్టార్ హీరో ఈ రీమేక్లో నటించనున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
విశాల్ ఎక్స్ప్రెస్
విశాఖ ఎక్స్ప్రెస్ తెలుసు ఈ విశాల్ ఎక్స్ప్రెస్ ఏంటీ? అనుకుంటున్నారా. విశాల్ స్పీడ్ చూసి ఇలాగే అనుకోవాలేమో. ఈ ఏడాది సమ్మర్లో ఒకసారి ‘అభిమన్యుడి’గా కనిపించిన ఆయన దసరాకు ‘పందెం కోడి 2’గా రానున్నారు. ఈ సినిమా రిలీజ్కు రెడీ అవుతుండగానే మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేసి, పొంగల్కి వస్తున్నట్టు అనౌన్స్ చేశారాయన. యన్టీఆర్, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘టెంపర్’ తమిళ రీమేక్ ‘అయోగ్య’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు విశాల్. గురువారం ఈ చిత్రం ఆరంభమైంది. ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన వెంకట్ మోహన్ దర్శకుడు. రాశీ ఖన్నా కథానాయిక. దర్శకుడు కేయస్ రవికుమార్, పార్తీబన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ‘‘నా ఫస్ట్ అసిస్టెంట్ వెంకట్ మోహన్ డైరెక్టర్గా మారారు. తనకి, టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు మురుగదాస్. -
తెరపైకి అమ్మ జీవితం
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తొలిసారి ఓ హీరోయిన్ బయోపిక్తో తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం సినిమాలు చూడటం మానేసినవాళ్లను సైతం థియేటర్స్కి రప్పించింది. ఇప్పుడు తమిళ ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా ముద్ర వేసుకున్న జయలలిత జీవితం సిల్వర్ స్క్రీన్కి రానుంది. ఎన్టీఆర్ బయోపిక్ ‘యన్.టి.ఆర్’ చిత్రాన్ని నిర్మిస్తున్న విబ్రి మీడియా బ్యానర్ జయలలిత బయోపిక్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించనుంది. ‘మదరాసు పట్టణం’ చిత్రంతో దర్శకుడిగా పలు అవార్డులు అందుకున్న విజయ్ ఈ సినిమాకి దర్శకుడు. విబ్రి మీడియా డైరెక్టర్, ‘సైమా’ అవార్డ్స్ చైర్మన్ బృందాప్రసాద్ అడుసుమిల్లి మాట్లాడుతూ– ‘‘ఒక సాధారణ రాజకీయ నేత నుంచి రాజకీయ శక్తిగా మారిన మహిళల్లో జయలలిత ఒకరు. భారత రాజకీయాల్లో ఆమె ప్రస్థానం ఒక చెరగని సంతకం. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టినరోజుని పురస్కరించుకుని సినిమా ప్రారంభించనున్నాం. అదే రోజు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘జయలలితగారి బయోపిక్కి విజయ్ ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటున్నాడు. బాలీవుడ్, సౌత్కు చెందిన ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించనున్నారు. 2019లోనే ఈ సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత విష్ణు ఇందూరి. -
పక్కా ప్లాన్
ఈ ఏడాది దసరాకు ‘పందెంకోడి 2’ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు విశాల్. ఇదే స్పీడ్లో నెక్ట్స్ ఇయర్లో ఏ ఏ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలో కూడా ఇప్పుడే ఆయన ప్లాన్ గీస్తున్నారని కోలీవుడ్ టాక్. తెలుగు ‘టెంపర్’ తమిళ రీమేక్లో విశాల్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రాశీఖన్నా కథనాయికగా నటిస్తారు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. సెట్స్పైకి వెళ్లనున్న విశాల్ నెక్ట్స్ చిత్రమిదేనట. ఈ చిత్రంతో పాటు లక్ష్మణ్ డైరెక్షన్లో విశాల్ ఓ సినిమా చేస్తారని సమాచారం. ఈ రెండు చిత్రాల షూటింగ్ ఒకేసారి జరిగేలా విశాల్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారట. ఈ రెంటినీ వచ్చే ఏడాది ఫస్టాఫ్లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారట. ఇక 2005లో వచ్చిన ‘పందెంకోడి’ చిత్రానికి ‘పందెంకోడి 2’ సీక్వెల్ అని తెలిసిన విషయమే. లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
ఇటు ఇండియా అటు అమెరికా
ఉదోగ్యం విషయంలో పక్కాగా ఉంటాడా పోలీస్. తప్పు చేసినవాణ్ని ఎదిరించే విషయంలో అస్సలు లెక్క చేయడు. ఇలాంటి క్యారెక్టర్స్ని రవితేజ సునాయాసంగా చేసేస్తారు. ‘విక్రమార్కుడు, మిరపకాయ్’ వంటి సినిమాలు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్గా కనిపించనున్నారు. వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీ హాసన్ కథానాయికగా నటించనున్నారని సమాచారం. తమిళ ‘తేరీ’కి రీమేక్గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ను జెట్ స్పీడ్తో కంప్లీట్ చేస్తున్నారాయన. ఎందుకంటే ఈ షెడ్యూల్ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటొనీ’ (అఅఆ) షూటింగ్లో జాయిన్ అవ్వనున్నారట. ‘అఅఆ’ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకేసారి రెండు సినిమా షూటింగ్స్తో ఇటు ఇండియా అటు అమెరికా షిఫ్ట్ అవుతూ ఉంటారట రవితేజ. -
అప్పుడు మొళి... ఇప్పుడు కాట్రిన్ మొళి
హిందీ హిట్ మూవీ ‘తుమ్హారీ సులూ’ తమిళ రీమేక్లో జ్యోతిక నటించనున్న విషయం తెలిసిందే. రాధామోహన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు ‘కాట్రిన్ మొళి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పదేళ్ల క్రితం రాధామోహన్ డైరెక్షన్లో వచ్చిన ‘మొళి’ సినిమాలో ‘కాట్రిన్ మొళి’ అనే సాంగ్ నుంచి ఈ టైటిల్ తీసుకోవడం విశేషం. గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సొంతంగా సంపాదించాలనుకునే పాత్రలో జ్యోతిక కనిపించనున్నారు. ఆమె భర్తగా విద్దార్థ్, బాస్ పాత్రలో మంచు లక్ష్మీ నటించనున్నారు. ‘మా చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం’ అన్నాయి చిత్రవర్గాలు. జూన్లో సెట్స్పైకి వెళ్లనున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్లో రిలీజ్ కానుంది. -
సూర్య పగ
తమిళనాడులో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా అనితా ఉదీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్య ది గ్రేట్’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. సంజయ్, రవి బమ్మావల్, అనిత, తలైవాసల్ విజయ్, ఆదిత్యా మీనన్ ముఖ్య తారలుగా నటించారు. విదీషా ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై షీతల్ గుప్తా, ఎన్.జి. రాజ్కుమార్ నిర్మించారు. ‘‘బాధ్యత లేని యువత జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి? అన్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. కాలేజీ గొడవల్లో తోటివారి కారణంగా హీరో సూర్య ప్రాణ స్నేహితులు హత్యకు గురవుతారు. శత్రువులపై సూర్య ఎలా పగ తీర్చుకున్నాడు? అన్న అంశాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటాయి. వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం: బోబో శశి, ఎడిటింగ్: ఎల్.కె. విజయ్. -
టెంపర్ బంపర్
రాశీఖన్నా వెరీ కూల్ గర్ల్. అయితే తన టెంపర్ చూపించడానికి రెడీ అయ్యారని సమాచారమ్. ఎందుకలా అంటే? సినిమా కోసం. ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన ‘టెంపర్’ తమిళ రీమేక్లో రాశీని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. విశాల్ హీరోగా నటించనున్న ఈ సినిమాకి మురుగదాస్ వద్ద ‘స్పైడర్’ చిత్రానికి దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన వెంకట్ మోహన్ దర్శకత్వం వహించనున్నారట. వరుస విజయాలతో రాశీ ఖన్నా తెలుగులో దూసుకెళుతున్నారు. ఆల్రెడీ తమిళంలో మూడు సినిమాలు సైన్ చేశారు. ఇప్పుడు ‘టెంపర్’ చాన్స్. ఇది కచ్చితంగా బంపర్ ఆఫరే. ఎందుకంటే ‘టెంపర్’లో హీరోయిన్ క్యారెక్టర్కి ప్రాధాన్యత ఉంది. యాక్ట్ చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది. సో.. రాశీ ఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ బ్యూటీ అమలాపురంలో ఉన్నారు. నితిన్ హీరోగా రాశీఖన్నా, నందితా శ్వేత హీరోయిన్లుగా రూపొందుతోన్న ‘శ్రీనివాస కల్యాణం’ షూటింగ్ జరుగుతోందక్కడ. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
బాలా చేతిలో మరో వారసురాలు
దర్శకుడు బాలా మరో నట వారసురాలిని నటిగా మలచనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే బదులు వస్తోంది. వైవిధ్యభరిత కథా చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు బాలా. సేతు, పితామగన్, నందా, నాన్కడవుల్ ఇలా ఒకదానికొక్కటి సంబంధం లేని కథా చిత్రాల సృష్టి కర్త బాలా. ఇటీవల జ్యోతిక, జీవీ ప్రకాశ్కుమార్లు నటించిన నాచియార్ చిత్రంతో మరో సారి తన సత్తా చాటుకున్నాడు. ఈ దర్శకుడు తాజాగా తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్రెడ్డి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ చిత్రం ద్వారా నటుడు విక్రమ్ కొడుకు ధృవ్ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది కూడా. అయితే ఇందులో నాయకి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. తెలుగులో ఈ పాత్ర పోషించిన మరాఠీ భామ శాలినిపాండే విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. ఇక అర్జున్రెడ్డి తమిళ రీమేక్కు బాలా వర్మ అనే టైటిల్ను పెట్టారు. ఇందులో శాలినిపాండే పాత్రలో చిల్లన్ను ఒరు కాదల్ చిత్రంలో బాల నటిగా నటించిన శ్రియశర్మను నటింపజేయడానికి చర్చలు జరిగాయి. ఆ తరువాత తెలుగులో నటించిన శాలినిపాండేనే తమిళంలోనూ నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో పేరు వెలుగులోకి వచ్చింది. సీనియర్ నటి గౌతమి కూతురు సుబ్బులక్ష్మీని బాలా కథానాయకిగా పరిచయం చేయనున్నారన్నదే ఆ న్యూస్. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. వర్మ చిత్ర షూటింగ్ రెండో షెడ్యూల్ త్వరలో చెన్నైలో నిర్వహించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో ధృవ్తోపాటు సుబ్బులక్ష్మీ పాల్గొనే అవకాశం ఉంది. -
స్టైలిష్ బాస్
ఏదైనా కంపెనీకు బాస్ అంటే ఎలా ఉండాలి? హైఫై లుక్స్, ట్రెండీ డ్రెస్లు వాటన్నింటికంటే ముఖ్యమైనది ఆ కంపెనీకి ప్లస్ అయ్యే వాటిని వెంటనే గుర్తించగలగటం. ప్రస్తుతం ఇలాంటి క్యారెక్టరైజేషన్తో కూడిన స్టైలిష్ బాస్ పాత్రనే పోషించనున్నారు లక్ష్మీ మంచు. హిందీలో హిట్ సాధించిన ‘తుమ్హారీ సులు’ తమిళంలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. విద్యా బాలన్ పాత్రను జ్యోతిక పోషించనున్నారు. కె.రాధా మెహన్ దర్శకత్వం వహిస్తున్నారు. తుమ్హారీ సులు సినిమాలో విద్యా బాలన్ బాస్గా నేహా ధూపియ పోషించిన పాత్రను తమిళ రీమేక్లో మంచు లక్ష్మీ పోషిస్తున్నారు. తన క్యారెక్టర్ గురించి లక్ష్మీ మాట్లాడుతూ–‘‘ఇటీవల అన్నీ డీ–గ్లామర్ రోల్స్ చేశాను. రేడియే చానల్ హెడ్ రోల్లో చాలా గ్లామరస్గా కనిపించనున్నాను. ఈ స్టైలిష్ బాస్ క్యారెక్టర్ చేస్తున్నందుకు చాలా ఎగై్జటింగ్గా ఉంది. సూర్య జ్యోతిక ఈ రోల్కు నేను బాగా సూట్ అవుతానని ఫీలయ్యారని డైరెక్టర్ చెప్పారు’’ అని పేర్కొన్నారు. -
తుమ్హారీ జో...
‘పెళ్లయిన తర్వాత మహిళలు కేవలం గృహిణిగా ఇంటికి అంకితం అయిపోవటం కాదు, వాళ్లకూ ఉద్యోగం చేయాలనే ఆశలుంటాయి. వారి కాళ్ల మీద వారు నిలబడాలనే కోరికలుంటాయి. అవి కలలు లాగే మిగిలిపోవద్దు’ అనే కథాంశంతో విద్యాబాలన్ ముఖ్య పాత్రలో వచ్చిన హిందీ చిత్రం ‘తుమ్హారీ సులు’. రేడియో జాకీ కావాలనే సులోచన పాత్రలో విద్యాబాలన్ కనిపించారు. ఇప్పుడు ఇదే సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారు దర్శకుడు రాధామోహన్. ఈ తమిళ రీమేక్లో సులోచన పాత్రలో జ్యోతికను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్యారెక్టర్స్ను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు జ్యోతిక. సెకెండ్ ఇన్నింగ్స్ను కూడా రీమేక్ (మలయాళ మూవీ ‘హౌ ఓల్డ్ ఆర్ యు’ రీమేక్ ‘36 వయదినిలే’) తో స్టార్ట్ చేసిన జ్యోతిక ఈ రీమేక్లోనూ కూడా నటించనున్నారని సమాచారం. 2007లో రాధామోహన్ దర్శకత్వం వహించిన ‘మొళి’లో జ్యోతిక నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. ఇప్పుడు ‘తుమ్హారీ సులు’ కుదిరే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇదిలా ఉంటే.. లకలక అంటూ ‘చంద్రముఖి’ సినిమాలో భయపెట్టిన జ్యోతిక పాత్రను హిందీ రీమేక్ ‘భూల్ భులేయా’లో విద్యాబాలన్ పోషించారు. ఇప్పుడు విద్యాబాలన్ సూపర్ హిట్ ‘తుమ్హారీ సులు’ సినిమాను తమిళంలో జ్యోతిక పోషిస్తుండటం విశేషం. -
రా ఏజెంట్
తమిళ హీరో ‘జయం’ రవి సీక్రెట్ ఆపరేషన్ ఏదో చేయడానికి రెడీ అవ్వబోతున్నారట. మరీ.. అంత సీక్రెట్గా చేయాల్సిన అవసరం ఏంటి? అనే విషయానికి ‘బేబి’ రూపంలో సీల్వర్ స్క్రీన్పైనే సమాధానం దొరకుతుందని కోలీవుడ్ టాక్. ఆల్మోస్ట్ మూడేళ్ల క్రితం అక్షయ్కుమార్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ ‘బేబి’. ఈ సినిమాలో అక్షయ్ రా (రీసెర్చ్ అండ్ ఎనాలిసెస్ వింగ్) ఏజెంట్గా నటించారు. ఇప్పుడు ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేయబోతున్నారట. ఇందులో అక్షయ్ పాత్రలో కనిపించనున్నారట ‘జయం’ రవి. అహ్మద్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాకు మధి కెమెరామేన్గా వర్క్ చేయబోతున్నారని చెన్నై ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే శక్తి సుందర్రాజన్ దర్శకత్వంలో ‘జయం’ రవి హీరోగా రూపొందిన ‘టిక్. టిక్. టిక్’ చిత్రం జనవరి 26న విడుదల కాలేదు. ‘‘రిపబ్లిక్ డే రోజున టిక్.టిక్.టిక్ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. కొత్త రిలీజ్ డేట్ను త్వరలో ఎనౌన్స్ చేస్తాం’’ అన్నారు ‘జయం’ రవి. -
ఇప్పుడు క్రైమ్!
ఫుల్గా లవ్ చేసింది. అర్జున్ రెడ్డిని పీకల్లోతు ప్రేమించింది. ఇప్పుడు జీవీ ప్రకాశ్కుమార్ని ఫుల్గా లవ్ చేస్తోంది. అవును మరి.. తెలుగులో షాలినీపాండే ఫస్ట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ లవ్స్టోరీ అని తెలిసిందే. ఇప్పుడు తమిళంలో చేస్తోన్న ‘100% లవ్’ రీమేక్ కూడా లవ్స్టోరీయే. ఇందులో జీవీ ప్రకాశ్కుమార్ సరసన నటిస్తోంది షాలిని. ఇప్పుడు షాలిని క్రైమ్ వైపు టర్న్ తీసుకుందని కోలీవుడ్ సమాచారం. జీవా∙హీరోగా డాన్ సాండీ దర్శకత్వంలో విజయేంద్ర వర్మ నిర్మాణంలో తమిళంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో షాలినీపాండేని కథానాయికగా ఎంపిక చేశారు. ఇది క్రైమ్ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా అన్నది కోలీవుడ్ టాక్. ‘‘మా సినిమాలో బిగ్ సర్ప్రైజ్ ఉంది. అదేంటనేది ఇప్పుడే చెప్పను. జనవరిలో షూట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శకుడు. ‘‘ స్క్రిప్ట్లో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆధారంగా జీవాను తీసుకున్నాం. ఫ్రెష్ అండ్ యంగ్ టాలెంట్ ఉన్న అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలని షాలినీ పాండేని ఎంపిక చేశాం’’ అన్నారు నిర్మాత. -
టెంపర్గా విశాల్
తమిళసినిమా: నటుడు విశాల్ టెంపర్ అయ్యిపోతున్నారు. ఈయన దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా, తమిళ నిర్మాతలమండలి అధ్యక్షుడిగా ఏక కాలంలో రెండు అత్యంత బాధ్యతాయుతమైన పదవులను నిర్వహిస్తున్నారన్న విషయం తెలిసిందే. మరో పక్క కథానాయకుడు, నిర్మాతగానూ బాధ్యతలను చేపడుతున్నారు. ఈ కారణంగా విశాల్ టెంపర్ అవుతున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే. టాలీవుడ్లో ఎన్టీఆర్ నటించిన చిత్రం టెంపర్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్టీఆర్కు మంచి విజయాన్ని కట్టబెట్టింది. కాగా ఆ చిత్రం తమిళ రీమేక్లో విశాల్ నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. విశాల్ హీరోగా నటించి తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన తాజా చిత్రం తుప్పరివాలన్. అనుఇమానువేల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్మక్రమాలను పూర్తి చేసుకుంది. శనివారం చిత్ర ట్రైలర్ విడుదలైంది.కాగా చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. దీంతో విశాల్ తదుపరి నటించే చిత్రం టెంపర్ రీమేక్నేనని తెలిసింది. అయితే ఈ చిత్రానికి దర్శకుడెవరు? కథానాయకి, ఇతర నట వర్గ విషయాలను త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. విశాల్ హీరోగా సండైకోళి–2 చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండు చిత్రాల్లో ఏది ముందు ప్రారంభం అవుతుందన్న విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
క్వీన్గా కాజల్
తమిళసినిమా: నటి కాజల్ అగర్వాల్ టైమ్ ఇప్పుడు వెలిగిపోతోందనవచ్చు. ఆ మధ్య తెలుగులో చిరంజీవితో ఖైధీనంబర్ 150 చిత్రంలో రొమాన్స్ చేసి హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత రానాతో నటించిన నేనేరాజు నేనేమంత్రి చిత్రం కూడా మంచి సక్సెస్నే అందుకుంది. తాజాగా కోలీవుడ్లో అజిత్తో తొలిసారిగా జత కట్టిన వివేకం చిత్రం విడుదలై మిశ్రమ స్పందనను పొందుతున్నా, వసూళ్ల పరంగా కుమ్మేస్తోంది. ఇక ఇందులో కాజల్అగర్వాల్ పాత్రకు, ఆమె నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. వివేకం చిత్రంలో కాజల్ది చాలా కీలకపాత్రగా నిలిచింది. ఈ చిత్రానికి అందుతున్న ప్రశంసలలో మునిగి తేలుతున్న కాజల్అగర్వాల్ ఇకపై ఇలాంటి బలమైన పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకున్నట్లు అంటున్నారు. తదుపరి విజయ్తో నటిస్తున్న మెర్శల్ చిత్రం దీపావళికి సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే హిందీ సంచలన చిత్రం క్వీన్ రీమేక్ గురించి చాలానే ప్రచారం జరిగింది. ఈ చిత్ర దక్షిణాది రీమేక్లో కంగణారావత్ పాత్రల్లో నటించే నటి ఎవరన్న విషయం గురించి సమంత నుంచి మిల్కీబ్యూటీ తమన్నా వరకూ చాలా మంది నటీమణులు పేరు ప్రచారం జరిగింది. కాగా చివరికి తమిళ, తెలుగు భాషల్లో క్వీన్గా నటి కాజల్అగర్వాల్ నటించనున్నట్లు తాజా సమాచారం. కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు కోలీవుడ్లో సక్సెస్ కోసం పాకులాడిన కాజల్అగర్వాల్ ఇప్పుడు స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. -
100% లవ్లో లావణ్య
తమిళసినిమా: నటి లావణ్య త్రిపాఠికి కోలీవుడ్లో ఇప్పుడు టైమ్ వచ్చినట్లుంది. వరుసగా అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ఆదిలో బ్రహ్మ చిత్రంలో శశికుమార్కు జంటగా తమిళ చిత్ర పరిశ్రమకు దిగుమతి అయిన అయోధ్య నగరానికి చెందిన బ్యూటీ లావణ్యత్రిపాఠి. ఆ చిత్రం ప్రేక్షకాదరణను పొందకపోవడంతో ఇక్కడ అమ్మడిని పట్టించుకోలేదు. అయితే టాలీవుడ్లో అందాలరాక్షసి నంటూ పరిచయమైన లావణ్యకు అక్కడ లక్ బాగానే వరించింది. అక్కడ సక్సెస్ఫుల్ నాయకిగా రాణిస్తున్న అ భామపై ఇప్పుడు కోలీవుడ్ దృష్టి సారిస్తోంది. ఇప్పటికే లావణ్య నటించిన మాయవన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో అవకాశం లావణ్యను వరించిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నాగచైతన్య, తమన్నా జంటగా తెలుగులో రూపొందిన 100% లవ్ చిత్రం అక్కడ సూపర్హిట్ అయ్యింది. ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ దాన్ని తమిళంలో రీమేక్ చేయనున్నార ఆయన శిష్యుడు చంద్రమౌళి మెగాఫోన్ పట్టనున్న ఈ చిత్రంలో నాగచైతన్య పోషించిన పాత్రలో జీవీ.ప్రకాశ్కుమార్ నంటించనున్నారు.కాగా తమన్నా పాత్రను తమిళంలోనూ ఆమెనే నటించనుందని, కాదు నటి హెబ్బాపటేల్ నటించనుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా వందశాతం లవ్లో నటి లావణ్య త్రిపాఠి పడనున్నట్లు సమాచరం. ఇదే నిజమైతే జీవీ.ప్రకాశ్కుమార్, లావణ్యత్రిపాఠిల జంటను కోలీవుడ్లో చూడబోతున్నామన్నమాట.ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో నాజర్, లీవింగ్స్టన్, అంబిక నటించనున్నారు. త్వరలో సెట్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం షూటింగ్ను 90 శాతం లండన్లోనూ మిగిలి 10 శాతాన్ని ఇండియాలో నిర్వహించనున్నట్లు తెలిసింది. -
అసలు సంగతి దాచేసి...
కథేంటి? అందులో ఆమె పాత్ర ఏంటి? హీరో ఎవరు? వంటి విషయాలేవీ కాజల్ అగర్వాల్ చెప్పడం లేదు. అసలు సంగతులన్నీ దాచేసి ‘ఓ బడా బాలీవుడ్ సినిమాకి నేను సంతకం చేశానోచ్’ అని చెబుతున్నారామె. ఎవరి పక్కన ఏ సినిమాలో ఛాన్సొచ్చింది? అని కాజల్ను ప్రశ్నిస్తే... ‘‘సరైన సమయం, సందర్భంలో మీ ప్రశ్నలకు సమాధానం చెబుతా’’ అంటున్నారు. ‘‘నేను నటించబోయే కొత్త హిందీ సినిమా ఆగస్టులో ప్రారంభం అవుతుంది. చాలా పెద్ద సినిమా. అందులో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేయబోతున్నా’’ అన్నారు కాజల్. ఈ హిందీ సినిమాతో పాటు ‘క్వీన్’ తమిళ రీమేక్లోనూ కాజల్ నటించడం దాదాపు ఖాయమే. ఆ సినిమా చిత్రీకరణ సైతం ఆగస్టులోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నారీ చందమామ. -
కుమారి కాదల్!
హెబ్బా పటేల్ ఇప్పుడు కాదల్ చేయబోతున్నారు. అదేనండి.. లవ్ చేయనున్నారు. ఎవర్ని అని అడుగుతున్నారా? సంగీతదర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్ని. అయితే ఇది సినిమా ప్రేమ. ‘అలా ఎలా’ చిత్రంతో తెలుగులోకి పరిచయమై, ‘కుమారి 21ఎఫ్’తో బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారు హెబ్బా. ఇప్పుడీ కుమారి తెలుగులో హిట్ అయిన ‘100% లవ్’ తమిళ రీమేక్లో నటించబోతున్నారు. ముందు తెలుగులో చేసిన తమన్నానే తీసుకోవాలనుకున్నారట. ఆ తర్వాత సడన్గా లావణ్యా త్రిపాఠి తెరపైకొచ్చారు. అయితే ఫైనల్గా హాట్ గాళ్ హెబ్బా పటేల్కు ఆ ఛాన్స్ దక్కిందట. అధికారికంగా సైన్ చేయడమే ఆలస్యం. తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్ హీరోగా చంద్రమౌళి దర్శకత్వంలో తెలుగు ‘100% లవ్’కి దర్శకత్వం వహించిన సుకుమార్ ఈ రీమేక్ను నిర్మించనుండటం విశేషం. అన్నట్లు.. మూడేళ్ల క్రితమే హెబ్బా తమిళ పరిశ్రమకు పరిచయమయ్యారు. 2014లో వచ్చిన ‘తిరుమణమ్ ఎన్నుమ్ నిక్కా’లో స్మాల్ రోల్ చేశారు. -
విష్ణువిశాల్తో పెళ్లిచూపులు
నటి తమన్నా యువ నటుడు విష్ణువిశాల్తో పెళ్లిచూపులకు సిద్ధం అవుతోంది. ఏమిటీ నమ్మబుద్ధి కావడం లేదా? నిజమేనండీ బాబు.అయితే రియల్గా కాదులెండి. రీల్లో ఆ తంతంగానికి మిల్కీబ్యూటీ రెడీ అవుతోంది. టాలీవుడ్లో చిన్న చిత్రంగా విడుదలై చాలా పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం పెళ్లిచూపులు. విజయ్దేవరకొండ, రీతువర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తరుణ్భాస్కర్ తెరకెక్కించారు. రెండు కోట్ల రూపాయల లోపు బడ్జెట్తో రూపొందిన ఈ పెళ్లిచూపులు రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ సినీపండితుల్ని ఆశ్చర్యానికిలోను చేసింది. దీన్ని సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రరాష్ట్రం అంతటా విడుదల చేసింది. అలాంటి పెళ్లిచూపులు చిత్ర తమిళ రీమేక్ హక్కులను దర్శకుడు గౌతమ్మీనన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయకిగా ఇప్పటికే నటి తమన్నాను ఎంపిక చేశారు. కథానాయకుడి కోసం చర్చలు జరపగా యువనటుడు ఉదయనిధి స్టాలిన్, విష్ణువిశాల్ పేర్లు పరిశీలనకు రాగా చివరికి విష్ణువిశాల్నే అవకాశం వరించింది. దీనికి గౌతమ్మీనన్ తన శిష్యుడు సెంథిల్ వీరాస్వామిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సొంత సంస్థలో నిర్మించనున్నారు. పొణ్ ఒండ్రు కండేన్ అనే టైటిల్ను నిర్ణయించిన ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. అలా తమన్నా.. విష్ణువిశాల్తో పెళ్లిచూపులకు సిద్ధం అవుతోందన్నమాట. ఇప్పటికే ఈ భామ శింబుతో అన్బానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. ప్రపంచ సినిమానే ఎదురుచూస్తున్న మోస్ట్ వాంటెడ్ చిత్రం బాహుబలి–2 చిత్రం ఏప్రిల్ 28న వెండితెరపైకి రానుంది. -
ప్చ్... సంతోషమే కానీ!
అభిమాన దర్శకుడితో పనిచేసే ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. తమన్నా మాత్రం ఓ పక్క సంతోషపడుతూ... మరోపక్క కొంచెం బాధ పడుతున్నారు. ఎందుకంటే... ఆమెకు అభిమాన దర్శకుడితో పనిచేసే ఛాన్స్ మాత్రమే వచ్చింది. ఆయన దర్శకత్వంలో నటించే ఛాన్స్ ఇంకా రాలేదు. అసలు విషయం ఏంటంటే... ‘పెళ్లి చూపులు’ తమిళ రీమేక్లో తమన్నా నటించనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ రీమేక్కి నిర్మాత. ఆయనతో కలసి పనిచేయాలనేది తమన్నా కల అట! అది తమిళ ‘పెళ్లి చూపులు’ రీమేక్తో తీరనుంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ –‘‘నేను గౌతమ్ మీనన్కి పెద్ద అభిమానిని. ముఖ్యంగా ఆయన సినిమాల్లో మహిళలను చూపించే విధానం నాకు చాలా ఇష్టం. రొమాన్స్ని ఆయన అర్థం చేసుకున్నట్టు... ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. ఎప్పట్నుంచో ఆయనతో కలసి పని చేయాలనుకుంటున్నాను. ‘పెళ్లి చూపులు’ రీమేక్తో ఆయన నిర్మాణంలో నటించే ఛాన్స్ వచ్చింది. సో, ఐయామ్ హ్యాపీ. త్వరలో ఆయన దర్శకత్వంలో నటించే ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. అప్పటివరకూ కొంచెం బాధ ఉంటుంది’’ అన్నారు. గౌతమ్ మీనన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన సెంథిల్ వీరస్వామి ‘పెళ్లి చూపులు’ రీమేక్కి దర్శకుడు. ఈ సినిమాతో పాటు హిందీ హిట్ ‘క్వీన్’ తమిళ రీమేక్లో కూడా తమన్నా నాయికగా నటించనున్న సంగతి తెలిసిందే. -
పెళ్లి చూపులుకి ఓకే!
పెళ్లి కాని అమ్మాయిలను ‘పెళ్లెప్పుడు?’ అని అడుగుతుంటారు. ఈ ప్రశ్న తమన్నా చాలాసార్లు ఎదుర్కొన్నారు. ‘జరిగినప్పుడు చెబుతానండి’ అని సమాధానం ఇస్తుంటారీ బ్యూటీ. ఇప్పుడు పెళ్లిచూపులకు రెడీ అయ్యారు. అయితే ఇవి రీల్ పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ, రితూ వర్మ నటించిన ‘పెళ్లి చూపులు’ తమిళ రీమేక్లో తమన్నా హీరోయిన్గా నటించనున్నారు. ఈ చిత్రం తమిళ హక్కులను దర్శకుడు గౌతమ్ మీనన్ దక్కించుకున్నారు. నూతన హీరోతో ఈ రీమేక్ని తన సహాయ దర్శకుడు సెంథిల్ వీరాస్వామి దర్శకత్వంలో నిర్మించనున్నారు. తమన్నా స్టార్డమ్ ఈ చిత్రానికి వర్కవుట్ అవుతుందని గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. -
కోలీవుడ్ చిన్నవాడు జీవి
లో బడ్జెట్ సినిమాలతో కోలీవుడ్లో స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న యంగ్ హీరో జీవి ప్రకాష్. ముఖ్యంగా రీమేక్ సినిమాల మీద దృష్టి పెట్టిన ఈ యువ నటుడు మంచి విజయాలు సాధిస్తున్నాడు. టాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ప్రేమ కథాచిత్రం సినిమాను తమిళ్లో డార్లింగ్ పేరుతో రీమేక్ చేసిన మంచి విజయం సాధించాడు. ఆ తరువాత కూడా యూత్ను ఆకట్టుకునే కథాంశాలతో దూసుకుపోతున్న ఈ యంగ్, హీరో ఇప్పుడు మరో రీమేక్ మీద కన్నేశాడు. ఇటీవల నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాను కోలీవుడ్లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు జీవి. పెద్ద నోట్ల రద్దు సమయంలో రిలీజ్ అయి కూడా మంచి కలెక్షన్లు సాధించిన ఎక్కడికీ పోతావు చిన్నవాడా, రీమేక్ రైట్స్ కోసం చాలా మంది హీరోలు ప్రయత్నించారు. ఫైనల్గా ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న జీవి, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. -
తమిళులకూ పెళ్లి చూపులు
ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ చూపులు మన తెలుగు సినిమా ‘పెళ్లి చూపులు’పై పడ్డాయి. కొత్త దర్శకుడు తరుణ్భాస్కర్ రాసిన కథ, తీసిన విధానం ఆయనకు బాగా నచ్చడంతో తమిళ ప్రేక్షకులకూ ‘పెళ్లి చూపులు’ చూపించాలని డిసైడ్ అయ్యారు. తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారాయన. ‘‘గౌతమ్ మీనన్ మా సినిమా చూసి ప్రశంసించడంతో పాటు తమిళంలో రీమేక్ చేస్తానని రైట్స్ తీసుకోవడం హ్యాపీగా ఉంది. తమిళ రీమేక్కు ఆయన దర్శకత్వం వహించడం లేదు. దర్శకత్వ బాధ్యతలు మరొకరికి అప్పగించి, నిర్మాతగా వ్యవహరించనున్నారు’’ అని ‘పెళ్లి చూపులు’ నిర్మాతల్లో ఒకరైన రాజ్ కందుకూరి ‘సాక్షి’తో చెప్పారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
కోలీవుడ్కి సంపూ సినిమా
ఆన్లైన్ సెన్సెషన్గా వెండితెర మీదకు ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న స్టార్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. హృదయకాలేయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూ తరువాత పలు చిత్రాల్లో అతిథి పాత్రలతోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కొబ్బరిమట్ట సినిమాలో త్రిపాత్రాభియం చేస్తున్నాడు. పాపరాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడు అనే మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు సంపూ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్లో స్టార్ కమెడియన్ ఒకరు ఈ సినిమా రైట్స్ కోసం ట్రై చేస్తున్నారు. భారీ మొత్తం చెల్లించి రైట్స్ సొంతం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. సంజన మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో డిస్ట్రిబ్యూట్ చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తొలిసారి సంపూర్ణేష్ సినిమాను ఓవర్సీస్లోనూ మిడ్ వెస్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా భారీగా రిలీజ్ చేస్తున్నారు. -
రీమేక్లోనూ తనే చేస్తోంది
ఈ ఏడాది ఘనవిజయం సాధించిన చిత్రాల్లో క్షణం సినిమా ఒకటి. చిన్న సినిమాగా విడుదలైన క్షణం భారీ కలెక్షన్లతో రికార్డ్ సృష్టించింది. అడవి శేష్ హీరోగా నటించిన ఈసినిమాలో ఆదా శర్మ హీరోయిన్గా నటించింది. తెలుగు వర్షన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా రీమేక్పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ క్షణం రీమేక్ రైట్స్ సొంతం చేసుకోవటంతో సినిమా మీద క్రేజ్ మరింత ఎక్కువైంది. తాజాగా ఈ సినిమా కోలీవుడ్ రీమేక్కు రంగం సిద్ధమైంది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సత్యరాజ్, తన కొడుకు శిబిరాజ్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగులో ఆదాశర్మ చేసిన పాత్రను తమిళంలోనే ఆమెతోనే చేయించాలని నిర్ణయించుకున్నారు చిత్రయూనిట్. బిడ్డను కోల్పోయిన తల్లిగా ఆదా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే తమిళ వర్షన్కు ఆమెనే ఎంపిక చేశారు. ఇప్పటికే శింబు హీరోగా తెరకెక్కిన ఇదు నమ్మ ఆలు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఆదా, క్షణం రీమేక్తో తమిళనాట హీరోయిన్గా అడుగుపెడుతోంది. -
రీమేక్ సినిమాలో మరో మెగా హీరో
మెగా హీరోలందరూ రీమేక్ సినిమాల మీదే దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ రీమేక్ను సెట్స్ మీదకు తీసుకువచ్చాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా రీమేక్ సినిమాతోనే రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. విజయ్ హీరోగా ఘనవిజయం సాధించిన కత్తి సినిమాను వినాయక్ దర్శతక్వంలో తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు చిరు. ఇప్పుడు ఈ లిస్ట్లో మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా చేరనున్నాడట. ఇటీవల తమిళ్లో ఘనవిజయం సాధించిన కనిథన్ రీమేక్లో నటించడానికి బన్నీ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అధర్వ, కేథరిన్ థెరిస్సాలు జంటగా తెరకెక్కిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ను బాలీవుడ్లోనూ రీమేక్ చేస్తున్నారు. యంగ్ హీరో అర్జున్ కపూర్ ఈ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిస్సాలు లీడ్ రోల్స్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 22న రిలీజ్కు రెడీ అవుతోంది. సరైనోడు సినిమా రిలీజ్ తరువాత కనీథన్ రీమేక్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
సినిమా బంపర్...మా నాన్న సూపర్!
‘‘ఎవరి సినిమా వాళ్లకు ముద్దు. ఒకవేళ నా సినిమా విడుదలైన రోజున నాన్న నటించిన సినిమా విడుదలైతే, ముందు నా సినిమా చూస్తా.. ఆ తర్వాత నాన్న సినిమా చూస్తా’’ అని ఆ మధ్య ఓ సందర్భంలో శ్రుతీహాసన్ పేర్కొన్న విషయం తెలిసిందే. కమల్ కూడా అలానే అంటారు. ఈ తండ్రీ కూతుళ్లు అంత ప్రొఫెషనల్గా ఉంటారు. కానీ, ఒకరి సినిమాను ఇంకొకరు చూసి, బాగుంటే అభినందించుకుంటారు. ఇప్పుడు శ్రుతి అదే చేశారు. మలయాళ ‘దృశ్యమ్’ తమిళ రీమేక్ ‘పాపనాశమ్’లో కమలహాసన్, గౌతమి భార్యాభర్తలుగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలతో విజయ విహారం చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రుతి చూశారు. ‘‘అద్భుతమైన సినిమా. మొత్తం టీమ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. మా నాన్నని చూస్తే గర్వంగా ఉంది’’ అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అంతే కాదు.. ముంబయ్లో తన స్నేహితులకి ప్రత్యేకంగా ఓ షో ఏర్పాటు చేసి, ఈ చిత్రాన్ని చూపించాలనుకుంటున్నారామె. ఎంతైనా నాన్నంటే అమ్మడికి ఎంత ప్రేమో! -
తమిళంలో ఎవడు మగధీర
రామ్చరణ్, అల్లు అర్జున్ కథానాయకులుగా నటించిన టాలీవుడ్ సూపర్హిట్ చిత్రం ఎవడు. కోలీవుడ్లో మగధీరగా రానుంది. ముగ్గురు ముద్దుగుమ్మలు కాజల్, శ్రుతిహాసన్, ఎమిజాక్సన్ కథానాయికలుగా అభినయంతో పాటు అందాలు తెరపై ఆరబోసిన కలర్ఫుల్ చిత్రం ఎవడు. ఇంతవరకు భారతీయ సినిమాలో రానటువంటి ఒక కొత్త పాయింట్తో భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమ, ప్రతీకారం, యాక్షన్ సన్నివేశాలకు ప్రాముఖ్యత నిస్తూ పక్కా కమర్షియల్ చిత్రంగా ఉంటుంది. ప్రస్తుతం నాగార్జున, కార్తీతో హీరోలుగా ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వంశీ పైడిపల్లి ఈ ఎవడు చిత్రానికి దర్శకుడు. ఒక యువకుడు రెండు రూపాలు. అదెలా, ఎందుకు మారాల్సి వచ్చింది అన్న ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఎవడు చిత్రాన్ని తమిళంలో మగధీరగా ఏవీవీఎస్నాయుడు సమర్పణలో భద్ర కాళీ ఫిలిం పతాకంపై భద్రకాళి ప్రసాద్ అనువదిస్తున్నారు. ఈయన ఇంతకుముందు తమిళంలో వంబు, భద్రత, గాయత్రి ఐపీఎస్, హిందీలో భాష, తదితర చిత్రాలను అనువదించారన్నది గమనార్హం. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకుంటున్న మగధీర చిత్రాన్ని వచ్చే నెలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ చిత్రానికి ఏఆర్కే రాజా మాటలను, వివేకా, స్నేహన్, అరుణ్ భారతి, మీనాక్షి సుందరం పాటలు రాస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. -
రజనీకాంత్కి లాస్... కమలహాసన్కి ప్రాఫిట్!
మలయాళ సినిమా ‘దృశ్యమ్’ తెలుసుగా! ఆ సూపర్హిట్ సినిమా అదే పేరుతో తెలుగులో వెంకటేశ్తో, కన్నడంలో ‘దృశ్య’ పేరుతో హీరో వి. రవిచంద్రన్తో రీమేకై హిట్టయిన సంగతీ తెలిసిందే. తాజాగా తమిళంలో కమలహాసన్తో ‘పాపనాశమ్’గా రిలీజై, హిట్ టాక్తో నడుస్తోంది. తాజా విషయం ఏమిటంటే, అసలీ తమిళ రీమేక్ను మొదట రజనీకాంత్తో చేద్దామనుకున్నారట! మలయాళ ఒరిజనల్కూ, ఇప్పుడీ తమిళ రీమేక్కూ - రెంటికీ దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ నేరుగా రజనీని కలిశారట! స్క్రిప్ట్ నచ్చినప్పటికీ, సినిమాలోని రెండు సీన్స్ పట్ల రజనీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ‘‘సినిమా చివరలో పోలీసులు హీరోను చితగ్గొట్టే సీన్, అలాగే క్లైమాక్స్ సీన్ - ఈ రెండిటి గురించి రజనీ అనుమానపడ్డారు. ఫ్యాన్స్కు నచ్చకపోవచ్చేమోనని అన్నారు. దర్శకుడు జీతూ జోసెఫ్ కూడా ఆ మాటతో ఏకీభవించారు’’ అని కోడంబాకమ్ వర్గాలు ఇప్పుడు బయటపెట్టాయి. మొత్తానికి, అలా రజనీకాంత్ వద్దన్న సినిమా కమలహాసన్ను వరించింది. ఇప్పుడీ తమిళ రీమేక్కు వస్తున్న స్పందన, పత్రికల్లో వస్తున్న రివ్యూలను బట్టి చూస్తే, కమల్కు చాలాకాలం తర్వాత మంచి హిట్ వచ్చినట్లుంది. అంటే, సినిమా వదిలేసి రజనీకాంత్ నష్టపోయారనీ, కమల్ లాభపడ్డారనీ అనుకోవచ్చా? -
మాలీవుడ్ నుంచి మరో బ్యూటీ
కోలీవుడ్కు మాలీవుడ్ నాయకిల దిగుమతి కొనసాగుతోంది. ఆసిన్, నయనతారల నుంచి ఈ తరం లక్ష్మీమీనన్ల వరకు కోలీవుడ్లో జయించిన మలయాళీ భామలే. ఈ వరసలో తాజాగా అనుమోల్ చేరనుంది. ఈ అమ్మడు ఇప్పటికే మలయాళంలో మంచి నటిగా ప్రకాశిస్తోంది. కాగా పరిశ్రమలో సినీ ఎడిటర్లు దర్శకులైన సంఘటనలు అరుదు. అయితే దర్శకత్వానికి ఎడిటింగ్కు చాలా అనుబంధం ఉంటుంది. చిత్రీకరణలో దర్శకుడు ఆశించిన అవుట్పుట్ రాకపోయినా ఎడిటింగ్లో సాధ్యమైనంత వరకు తన భావాలకనుగుణంగా మలచుకోవచ్చు. ఎడిటింగ్లో అంత విషయం ఉందన్నమాట. ఎడిటింగ్లో నేర్పరి అయితే దర్శకత్వంలో సులభంగా రాణించవచ్చు. అలాంటి ధైర్యంతోనే ఏమో యువ ఎడిటర్ ఆంటోని మెగాఫోన్ పట్టడానికి సాహసిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు ఎడిటర్గా పని చేసిన ఈయన మలయాళంలో మంచి విజయం సాధించిన షట్టర్ చిత్ర తమిళ రీమేక్కు దర్శకత్వం వహించనున్నారు. ఇది ఒక వేశ్య ఇతివృత్తంతో కూడిన చిత్రం. మలయాళంలో ఈ పాత్రను సజిత మరత్తిల్ పోషించారు. కేరళ ప్రభుత్వ అవార్డును పొందిన ఈ చిత్ర తమిళ రీమేక్లో మలయాళకుట్టి అనుమోల్ నటించడానికి సిద్ధం అవుతోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో నటుడు సత్యరాజ్ ప్రముఖ పాత్రను పోషించనున్నారు. దర్శకుడు విజయ్ నిర్మించనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో సెట్పైకి వెళ్లనుంది. -
పీకే తెలుగు, తమిళ్ రీమేక్లో కమల్
-
హిందీ ‘దృశ్యం’లో..!
మోహన్లాల్, మీనా జంటగా రూపొందిన మలయాళ సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’లో పోలీసాఫీసర్ పాత్రను ఆశా శరత్ చేశారు. ఇదే పాత్రను తెలుగు ‘దృశ్యం’లో నదియా చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళ రీమేక్లో పోలీసాఫీసర్ పాత్రను ఆశా శరత్ చేస్తున్నారు. ఇప్పుడు హిందీలోనూ ‘దృశ్యం’ తెరకెక్కనుంది. ఈ రీమేక్లో పోలీసాఫీసర్ పాత్రను టబు చేయనున్నారని సమాచారం. హీరోగా అజయ్ దేవగన్ నటించనున్నారు. -
జ్యోతిక ... హౌ ఓల్డ్ ఆర్ యూ
చెన్నై: ప్రముఖ నటి జ్యోతిక తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారా అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ పరిశ్రమ వర్గాలు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'హౌ ఓల్డ్ ఆర్ యూ' చిత్రం తమిళంలో అదే పేరుతో రీమేక్ చేయనున్నారు. 'హౌ ఓల్డ్ ఆర్ యూ' చిత్ర నిర్మాణ హక్కులను జ్యోతిక భర్త, ప్రముఖ హీరో సూర్య సొంత నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్టైన్మెంట్' సొంతం చేసుకుంది. మలయాళంలో నిర్మించిన హౌ ఓల్డ్ ఆర్ యూ చిత్రంలో మంజూ వారియర్ ముఖ్య భూమిక పోషించారు. తమిళంలో రీమేక్ అవుతున్న ఆ చిత్రంలోని మంజూ పాత్రలో జ్యోతిక ఒదిగిపోనున్నారు. మలయాళంలో ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన రోషన్ అండ్రూస్ తమిళంలో నిర్మిస్తున్న చిత్రానికి కూడా దర్శకత్వ వహించనున్నారు. హీరోహీరోయిన్ జ్యోతిక, సూర్యలు ఒకరినోకరు ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితో ఆ ఇద్దరు ఏడు అడుగులు నడిచారు. అనంతరం జ్యోతిక ఇద్దరు చిన్నారులు దివ్య, దియాలకు జన్మ నిచ్చింది. ఏడేళ్ల విరామం తర్వాత జ్యోతిక మరోసారి తెరంగేట్రం చేయనున్నారు. 2007లో మణికందా తమిళ చిత్రంలో జ్యోతిక నటించారు. ఇదే అమె చివరి చిత్రం అన్న సంగతి తెలిసిందే. -
తమిళ దృశ్యానికి చిక్కులు
-
తమిళ దృశ్యానికి సినిమా కష్టాలు
-
తమిళ దృశ్యానికి సినిమా కష్టాలు
మళయాళం, కన్నడం, తెలుగు భాషల్లో భారీగా హిట్టయిన చిన్న సినిమా 'దృశ్యం' ఇప్పుడు సరికొత్త చిక్కులు ఎదుర్కొంటోంది. ఈ సినిమాను తమిళంలో తీయాలని సుప్రసిద్ధ నటుడు కమల్హాసన్ భావించారు. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని, ఆగస్టు మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని భావించారు. 'ఎర్ర గులాబీలు', 'వసంత కోకిల' లాంటి చిత్రాల్లో హిట్ పెయిర్గా నటించిన కమల్హాసన్, శ్రీదేవి ఈ సినిమాలో కూడా ఉంటున్నారు. కానీ శ్రీదేవి మాత్రం ఈ చిత్రంలో కమల్ సరసన హీరోయిన్గా కాకుండా.. తెలుగులో నదియా పోషించిన పోలీసు ఆఫీసర్ పాత్ర పోషించబోతోందని సమాచారం. మలయాళం సినిమాకి దర్శకత్వం వహించన జీతూ జోసెఫ్ ఈ తమిళ వెర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. తెలుగులో ఈ సినిమాకు శ్రీ ప్రియ దర్శకత్వం వహించారు.అయితే ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఇతర టెక్నీషియన్లు, తారాగణం ఎంపిక జరగవలసి ఉంది. ఈ సినిమాను రాజ్ కుమార్ థియటర్స్ మరియు వైడ్ యాంగిల్ క్రియేషన్స్ వారు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం ఘిబ్రన్ అందిస్తున్నారు. అయితే, మళయాళంలో తీసిన మాతృక గురించి బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కోర్టుకెక్కింది. తాను కొన్న జపాన్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇందులో కాపీ చేశారంటూ మళయాళ చిత్ర రచయిత, నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపింది. ఈ వివాదం సమసిపోకుండానే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ కథ తనదని, తాను రాసిన 'ఒరు మజకళాటు' నవలను కాపీ చేశారని ఆరోపిస్తూ.. మలయాళ రచయిత సతీష్ పాల్ కోర్టుకి ఎక్కాడు. దీంతో ఈ సినిమా తమిళ వెర్షన్ షూటింగ్ నిలుపుదల చేయాలంటూ ఎర్నాకుళం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
తమిళ దృశ్యం తెరకెక్కేనా?!
-
బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న ఆది
-
శ్రీకాంత్ హీరోగా తమిళంలో స్వామి రారా
టాలీవుడ్లో నిఖిల్ హీరోగా నటించిన వినోదాత్మక చిత్రం స్వామి రా రా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఇప్పుడు శ్రీకాంత్ హీరోగా కోలీవుడ్లో సామియాట్టం పేరుతో తెరకెక్కుతోంది. శ్రీకాంత్ ఁస్వామి రా రారూ. చిత్ర రీమేక్ హక్కులు పొంది తన సొంత నిర్మాణ సంస్థ గోల్డెన్ ప్రైడ్ పతాకంపై నిర్మిస్తున్నారు. ధనుష్ నటించిన యారడీ నీ మోహినీ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన ఆ తరువాత వరుసగా ఆయన హీరోగా కుట్టి, ఉత్తమ పుత్తిరన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మిత్రన్ ఆర్ జవహర్ తెరకెక్కిస్తున్న నాలుగో చిత్రం సామియాట్టం. శ్రీకాంత్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఒకరు హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రంలో ఎస్ఎస్ మ్యూజిక్ పూజా మురుగదాస్, సంపత్, తెలుగు నటుడు జీవా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమై తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్కు రెడీ అవుతున్న చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ సామియాట్టం పూర్తిగా హాస్యభరిత చిత్రంగా పేర్కొన్నారు. గుండెను పిండే సన్నివేశాలు, బీభత్సం సృష్టించే రక్తపాత సన్నివేశాలు లాంటివి లేకుండా పూర్తి జాయ్ఫుల్ కథా చిత్రం ఇదన్నారు. లోకల్గా చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే హీరోశ్రీకాంత్ బృందం చేతికి వినాయకుడి విగ్రహం వస్తుందన్నారు. అక్కడ నుంచి ఆ స్వామి ఆడించే ఆట కడుపుబ్బ నవ్విస్తుందని తెలిపారు. చెన్నై, పాండిచ్చేరి ప్రాంతంలో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. సుమారు 400 వాణిజ్య ప్రకటనలకు సంగీతాన్ని అందించిన శ్రీవరణ్ ఈ చిత్రం ద్వారా బిగ్ స్క్రీన్కు పరిచయం అవుతున్నట్లు తెలిపారు. -
కోలీవుడ్కు మరో శాండిల్ ఉడ్ బ్యూటీ
కోలీవుడ్కు పరభాషా నటీమణుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక్కడ నేమ్, ఫేమ్తో పాటు పారితోషికం అధికంగానే ముడుతుండటంతో మాలీవుడ్, శాండిల్వుడ్ హీరోయిన్లు నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా శాండిల్ వుడ్ బ్యూటీ దీపా సన్నిధి కోలీవుడ్ తెరంగేట్రం జరిగింది. కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన లుసియా చిత్రం తమిళంలో రీమేక్ అవుతోంది. పిజ్జా ఫేమ్ కార్తిక్ సుబ్బురాజ్ శిష్యుడు ప్రసాద్ రామ ర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తిరుకుమరన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్నారు. కన్నడంలో శృతిహాసన్ నటించిన పాత్రను తమిళంలో రూపా సన్నిధి పోషిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతా న్ని అందిస్తున్న ఈ చిత్రం ఫిజిలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. తమిళంలో ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైందని యూనిట్ వర్గా లు తెలిపాయి. కోలీవుడ్ రంగ ప్రవేశం గురించి నటి దీపా సన్నిధి మాట్లాడుతూ లుసియా చిత్ర తమిళ వెర్షన్లో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిత్రంలో తన పాత్ర ప్రధానంగా ఉంటుందన్నారు. కన్నడంలో శృతిహాసన్ పోషించిన పాత్రను ధరించే అవకాశం రావడం ఆనందంగా ఉం దన్నారు. అనుభవం గల నటుడు సిద్ధార్థ్తో నటించడం ఇంకా సంతోషంగా ఉందన్నా రు. చిత్ర దర్శకుడు ప్రసాద్ రామర్ నుంచి చాలా నేర్చుకుంటున్నానని తెలిపారు. తమిళంలో మరిన్ని చిత్రా లు చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొత్త అవకాశాలు వస్తున్నాయని దీపా సన్నిధి పేర్కొన్నారు. -
తమిళంలో 'అత్తారింటికి దారేది' రీమేక్?
రికార్డు స్థాయి కలెక్షన్ల దిశగా దూసుకెళ్లిపోతున్న 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని తమిళంలో కూడా రీమేక్ చేయనున్నారు. ఇప్పటివరకు ఎవరూ రీమేక్ రైట్స్ను కొనుగోలు చేయలేదు గానీ, చాలామంది మాత్రం ఇందుకు ఆసక్తి చూపిస్తున్నారని సినిమా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్కు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలు తెలిపాయి. తమిళంలో ప్రముఖ నిర్మాత ఒకరు దీనిపై బాగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడవుతుందని అంటున్నారు. తమిళ నటుడు విజయ్ ఈ రీమేక్ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, అయితే ఇంకా ఈ విషయం చర్చల దశలోనే ఉన్నందున దీని గురించి అప్పుడే ఏమీ చెప్పలేమని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బహుశా రెండు వారాల్లో దీని గురించిన స్పష్టత రావచ్చు. ఇంతకు ముందు ఒక్కడు, పోకిరీ, అతనొక్కడే, నువ్వునాకు నచ్చావు లాంటి సినిమాల తమిళ రీమేక్లలో విజయ్ నటించాడు. సెప్టెంబర్ 27న విడుదలైన 'అత్తారింటికి దారేది' ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జల్సా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్ కళ్యాణ్ జోడీగా వచ్చిన ఈ సినిమా అమెరికాలోనూ హల్చల్ చేస్తోంది.