trade unions
-
ఆర్టీసీలో అసంతృప్తి స్వరం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ప్రధాన సంఘాలకు నాయకత్వం వహించిన నేతల్లో ఎక్కువమంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలంగా ఉన్నా, ప్రస్తుతం వారు కూడా ఇతర సంఘాల తరహాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సోనియాగాంధీ పుట్టిన రోజు నాటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ప్రత్యక్ష పోరాట కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ అంటూ లేదు. కొన్ని సంఘాలు కలిపి ఒక కమిటీగా, మరికొన్ని సంఘాలు కలిపి ఒక సంఘంగా పనిచేస్తున్నాయి. ఈ రెండు జేఏసీలతో సంబంధం లేకుండా కొన్ని సంఘాల ప్రతినిధులు సొంతంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ కారి్మకుల సమస్యల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం స్పందించని నేపథ్యంలో అన్ని సంఘాలు కలిపి ఒక జేఏసీగా ఏర్పడి ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమయ్యేలా చేస్తామంటూ కొన్ని సంఘాలు చెబుతున్నాయి. కార్మిక సంఘాల గుర్తింపే ప్రధాన లక్ష్యం గత ప్రభుత్వం ఆర్టీసీలో కార్మిక సంఘాల ఉనికి లేకుండా చేసింది. వాటి స్థానంలో డిపోల్లో ఉద్యోగుల ఆధ్వర్యంలో సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేసి ఆయా అంశాలు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత అప్పగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తోంది. దీంతో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో కార్మిక సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. కార్మిక సంఘాలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవటంతో ఇటీవల ఓ సంఘం సీఎంకు సీఐటీయూ ప్రతినిధుల ద్వారా వినతిపత్రం ఇప్పించాల్సి వచి్చంది. కార్మిక సంఘాలను భాగస్వాములను చేయాలి ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటంతోపాటు వారికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే అందించాలి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశంతో సంబంధం లేని 11 అంశాలను ముందుగా పరిష్కరించాలి. ప్ర భుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతో సంబంధం ఉన్న మరి కొన్ని అంశాలను పరిష్కరించాల్సి ఉంది. ఆయా అంశాలపై తీసు కునే నిర్ణయాల్లో కార్మిక సంఘాలను భాగస్వాములను చేయాలి. – వీఎస్రావు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఇవీ డిమాండ్లు.. » ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ ప్రకటించటం మినహా ప్రస్తుత ప్రభుత్వం దానిని అమలులోకి తేలేదు. ఫలితంగా ఆర్టీసీ ఉద్యోగులు.. ఆర్టీసీ ఉద్యోగులుగానే ఉండిపోవాల్సి వచ్చింది. దీన్ని ప్రధాన డిమాండ్గా కొన్ని సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. » సరిపోను డ్రైవర్లు లేక ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. దీనివల్ల వారు తీవ్ర ఒత్తిడి ని ఎదుర్కొంటున్నారు. దీన్ని నివారిస్తూ అన్ని రకాల పోస్టుల్లో ఖాళీలు భర్తీ చేయాలన్న డి మాండ్ను అన్ని సంఘాలు పేర్కొంటున్నాయి. » సాంకేతిక సమస్యలతో జరిగే పొరపాట్లు, చి న్నచిన్న తప్పిదాలకు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, వెంటనే వారికి ఉద్యో గ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. » 2021 వేతన సవరణ జరపాలని, 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, చనిపోయిన, మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిచ్చి వారిని పూర్తిస్థాయి ఉద్యోగులుగా తీసుకోవాలని, ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య తగ్గించి, అవసరమైన సంఖ్యలో బస్సులను సొంతంగా సమకూర్చుకోవాలని, మహిళా ఉద్యోగులను రాత్రి 8 తర్వాత పని చేయించవద్దని, రిటైర్ అయిన వారికి ఇవ్వాల్సిన అన్ని బకాయిలు చెల్లించాలని... ఇలా పలు అంశాలను ప్రభుత్వం ముందుంచుతున్నారు. -
రిపోర్టు అన్నారు...రిక్తహస్తం చూపారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. 317 జీవో వల్ల ఎదురైన సమస్యలపై తమ వాదనను సీఎస్ ముందు ఉంచారు. వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ హామీ ఇచి్చనట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం భేటీ కావడం తెలిసిందే. ఆర్థిక అంశాలపై మార్చి వరకు వేచి ఉండాలని సూచించిన ఆయన.. 317 జీవో ద్వారా జరిగిన తప్పిదాలను సరిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఈ దిశగా వేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సీఎస్ సమక్షంలో పరిశీలించాలని ఉద్యోగులకు సూచించారు.ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం సీఎస్ను కలిశారు. అయితే మంత్రివర్గ ఉససంఘం 317 సమస్యల పరిష్కారానికి సూచించిన సాధ్యాసాధ్యాలను సీఎస్ బహిర్గతపరచలేదని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. నివేదిక చూపిస్తామని పిలిచి సూచనలు ఇవ్వాలంటూ పంపాశారని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక 317 జీవో వల్ల పలువురు ఉద్యోగులకు జరిగిన నష్టం, స్పౌజ్ కేసుల పరిష్కారం, అనారోగ్యంతో బాధపడే వారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీలు తదితర అంశాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.మంత్రివర్గ ఉపసంఘం నివేదిక గురించి పలువురు ఉద్యోగ నేతలు సీఎస్ను అడగ్గా ఆ ఫైల్ సర్క్యులేషన్లో ఉందని.. బహుశా కేబినేట్ పరిశీలనకు వెళ్లే వీలుందని ఆమె సర్దిచెప్పినట్లు సమాచారం. మరోవైపు ఆందోళన బాట పట్టాలనుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏ ప్రకటిస్తారా లేదా అనే అంశాన్ని పరిశీలించాక తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. సీఎస్తో భేటీలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, పింగిలి శ్రీపాల్రెడ్డి, ఏలూరు శ్రీనివాస్రావు, చావా రవి, వి. రవీందర్రెడ్డి, లచ్చిరెడ్డి, హనుమంతరావు, కత్తి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదాయం తగ్గింది.. మార్చి దాకా అడగొద్దు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. వచ్చే మార్చి 31 వరకు ఎలాంటి ఆర్థికపరమైన ఒత్తిడులు చేయవద్దని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరించేందుకు సర్కారు సిద్ధంగా ఉందని.. దీనికి సంబంధించి మంత్రులతో కమిటీ వేస్తున్నామని తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)ఆందోళన బాట పడతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఏసీ ప్రతినిధులతో సీఎం రేవంత్ గురువారం సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి జేఏసీ నుంచి హాజరైన 36 మందికి మాట్లాడే అవకాశం కల్పించారు. వారు చెప్పిన అంశాలు, సమస్యలను విన్నారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులను ఉద్దేశించి సీఎం రేవంత్ 15 నిమిషాల పాటు మాట్లాడారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. డీఏలపై ఆలోచన చేస్తాం.. ప్రభుత్వం ఇవ్వాల్సిన 5 డీఏలను తక్షణమే విడుదల చేయాలని సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కనీసం మూడు డీఏలను వెంటనే ఇవ్వాలని.. 26న జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏలపై ప్రకటన చేయాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని, ఏమాత్రం వీలైనా ఎంతో కొంత న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. పెండింగ్ బిల్లులు, నగదు రహిత ఆరోగ్య కార్డుల జారీ అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నామని తెలిపారు. డీఏల విషయంలో ప్రభుత్వానికి ఒకట్రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. 317 జీవో సమస్యలను పరిష్కరిస్తాం.. స్థానిక జిల్లాలకు ఉద్యోగుల బదిలీ కోసం తీసుకొచ్చిన 317 జీవోతో ఏర్పడ్డ సమస్యలను పరిష్కారిస్తామని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదికను శుక్రవారం ఉద్యోగ ప్రతినిధుల ముందే తెరుస్తామని చెప్పారు. అందులోని అంశాలను పరిశీలించి, తగిన సలహాలు ఇస్తే.. సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. భట్టి నేతృత్వంలో మంత్రుల కమిటీ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో.. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబులతో కమిటీ వేస్తున్నట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. దీపావళి పండుగ తర్వాత ఈ కమిటీ సంఘాల నేతలతో సంప్రదింపులు జరుపుతుందని.. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వానికి సూచనలు చేస్తుందని తెలిపారు. సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, అదనపు కార్యదర్శి జనరల్ పింగిలి శ్రీపాల్రెడ్డి, కో–చైర్మన్ చావా రవితోపాటు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎంకు సమస్యలు వివరించాం ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులంతా సీఎంతో నేరుగా మాట్లాడారు. అన్ని సమస్యలను ఆయన ముందు పెట్టారు. తొలి సమావేశం సుహృద్భావ వాతావరణంలోనే జరిగింది. సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నాం. – మారం జగదీశ్వర్, జేఏసీ అధ్యక్షుడు కనీసం రెండు డీఏలైనా ఇవ్వాలి తక్షణమే రెండు డీఏలైనా ఇస్తే ఉద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం కుదురుతుంది. ప్రతీ దానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ముడిపెట్టడం సరికాదు. ప్రభుత్వంతో కలసి ప్రజలకు సేవ చేసేందుకు ఉద్యోగులు అన్నివేళలా కృషి చేస్తారు. – చావా రవి, జేఏసీ కో–చైర్మన్ కొంత సానుకూలం సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. ప్రభుత్వం మార్చి 31 వరకూ సమయం కావాలని కోరింది. ఇది న్యాయమైన కోరికే. అయితే, పెండింగ్లో ఉన్న 5 డీఏల విషయంలో కనీసం రెండు ఇవ్వడానికి కేబినేట్ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. – పింగిలి శ్రీపాల్రెడ్డి, జేఏసీ అదనపు సెక్రటరీ జనరల్ సీపీఎస్ వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వంపై నయాపైసా భారం పడని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేయాలి. సీపీఎస్తో రెండు దశాబ్దాలుగా సామాజిక భద్రత లోపిస్తోంది. భవిష్యత్తులోనూ ఇది అధిక భారంగా మారుతుంది. కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు రాజస్థాన్, ఛత్తీస్గడ్, జార్ఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలు ఈ విధానాన్ని రద్దు చేశాయి. రాష్ట్రంలోనూ సీపీఎస్ను రద్దు చేస్తే ఎల్బీ స్టేడియంలో రెండు లక్షల కుటుంబాలతో ధన్యవాదాలు తెలుపుతాం. – సీఎంకు సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ వినతి పరిస్థితి బాగోలేదు.. సహకరించండి!ఉద్యోగుల డిమాండ్లన్నీ న్యాయమైనవేనని, వాటిని పరిష్కరించేందుకు తమకు అభ్యంతరం లేదని సీఎం రేవంత్ తెలిపారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలన్నారు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉందని.. కొన్నాళ్లుగా వివిధ శాఖల ఆదాయం కూడా తగ్గిందని తెలిపారు. వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆర్థిక అంశాల్లో తమపై ఒత్తిడి తేవొద్దని కోరారు. ఆర్థిక అవసరాలు లేని బది లీలు, పాలనాపరమైన అంశాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. -
సివిల్ సప్లైస్లో కంత్రీ ప్లాన్
సాక్షి, అమరావతి: పౌరసరఫరాల సంస్థలో బదిలీల పర్వం ఉద్యోగుల్లో చిచ్చురేపుతోంది. బదిలీల ప్రక్రియ కోసం సంస్థ నియమించిన ఫోర్ మెన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి.. మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పేర్లకు పట్టం కట్టడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీవోలను, ఉద్యోగుల వినతులు, మానవీయ కోణాలను పట్టించుకోకుండా ఇష్టానుసారం బదిలీలు చేశారంటూ మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఐదేళ్లు ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు చేపట్టింది. వీరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థ ఉద్యోగుల నుంచి రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తులు ఆహా్వనించింది. ఇవన్నీ కేవలం ప్రక్రియలో భాగంగా చేపట్టారే తప్ప.. క్షేత్ర స్థాయిలో విస్మరించారు. వాస్తవానికి ఫోర్మెన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి 20 మందికి పైగా ఉద్యోగుల బదిలీకి సిఫారసు చేస్తే ఆదివారం మధ్యాహ్నం నాటికి ఆ మేరకు అధికారులు నివేదిక రూపొందించారు. తీరా సాయంత్రానికి మంత్రి కార్యాలయం నుంచి మరో జాబితా వచ్చింది. అందులో పేర్కొన్న వ్యక్తులకు మాత్రమే బదిలీ చేయాలని సాక్షాత్తూ మంత్రి హుకుం జారీ చేయడం.. ఎండీ వారిని బదిలీ చేయడం చకచకా జరిగిపోయాయి. చేతులు మారిన ముడుపులు? పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయంలో పని చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఏకంగా తొమ్మిది మందిని ప్రధాన కార్యాలయంలో నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో తప్పనిసరి బదిలీలు లేనివారు, రిక్వెస్టు కూడా పెట్టుకోని వారు ఉండటం గమనార్హం. ఇక్కడే మొత్తం బదిలీల్లో తెనాలి, విజయవాడలోని ప్రముఖ హోటళ్ల వేదికగా భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిస్తున్నాయి. డీఎం పోస్టుకు డిమాండ్ ఉన్నచోట రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు, మిగిలిన జిల్లాల్లో రూ.10 లక్షలకు పైగా రేట్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆరోపణలున్నా పట్టించుకోలేదు విజయనగరం జిల్లా డీఎం తప్పనిసరిగా బదిలీ కావాల్సి రావడంతో ఆమెను ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. అదే ఉద్యోగిని తిరిగి వెనక్కి పంపించే ఉద్దేశంతో అక్కడి పోస్టును వేకెంట్గా చూపించి వదిలేసినట్టు తెలుస్తోంది. కర్నూలులో డీఎంగా పనిచేస్తున్న ఉద్యోగిని రిక్వెస్ట్ పెట్టుకోకుండానే ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆమెపై హైదరాబాద్లో పని చేస్తున్నప్పటి నుంచి వివిధ ఆరోపణలతో చార్జెస్ నమోదయ్యాయి. ఇదే మాదిరిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిధుల దురి్వనియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని, రెండేళ్లు ఉద్యోగంలో చెప్పాపెట్టకుండా మాయమైన మరో ఉద్యోగిని సైతం ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయడంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. దీనిపై పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ను వివరణ కోరగా.. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేశామన్నారు. బదిలీల్లో ఎవరి సిఫారసులు తావివ్వలేదన్నారు. రొటేషన్ పద్ధతిలో ఫీల్డ్లోని ఉద్యోగులను ప్రధాన కార్యాలయానికి, ఇక్కడి ఉద్యోగులను ఫీల్డ్కు పంపించామన్నారు. భారీ దోపిడీకి కుట్ర! ఉద్యోగుల బదిలీలను అడ్డం పెట్టుకుని భారీ దోపిడీకి కుట్ర పన్నారనే ఆరోపణలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. అక్టోబర్ నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రారంభిస్తుండటం, డిసెంబర్, జనవరిలో పండుగలు ఉండటంతో పౌరసరఫరాల సంస్థలో భారీఎత్తున నిత్యావసర సరుకులకు టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారీగా కాంట్రాక్టులు ఉంటాయి. ఈ సందర్భంలో సదరు కాంట్రాక్టర్లను లొంగదీసుకుంటే భారీగా కమీషన్లు కొట్టేయొచ్చనే కుట్రకు బీజం వేశారు. అంటే అకౌంట్స్, ఫైనాన్స్, టెండర్ల వంటి కీలక పోస్టులు మంత్రికి అనుకూలమైన వ్యక్తులు ఉంటే వారి ద్వారా భారీగా కమీషన్లు దండుకునే ప్రణాళికలో భాగంగానే మొత్తం బదిలీల ప్రక్రియ నడిచినట్టు తెలుస్తోంది. అందుకే ప్రధాన కార్యాలయంలో మంత్రి చెప్పిన వారికి కీలక పోస్టింగ్లు కట్టబెట్టనున్నారు. వీరి సహాయంతో నెలావారీ వసూళ్లు మంత్రి కార్యాలయానికి నేరుగా చేరిపోయేలా స్కెచ్ వేసినట్టు సమాచారం. అందుకే కొంత మంది ఉద్యోగులపై గతంలో చార్జెస్ నమోదైనప్పటికీ అవి తేలకుండా తిరిగి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వడంపై దోపిడీ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. -
పదోన్నతులు ఎలా ?
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖలో పదోన్నతులు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఈఓ నుంచి ఏఓకు, ఏఓ నుంచి ఏడీఏ పోస్టులకు పదోన్నతులు నిర్వహించేందుకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు ఉత్తర్వు లు ఇచ్చారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ కన్వీనర్గా, సహకార శాఖ కమిషనర్, ఉపకార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శులు సభ్యులుగా రెండేళ్ల కాల పరిమితితో డీపీసీని ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖలోని మొదటి, రెండోస్థాయి గెజిటెడ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించడమే దీని ఉద్దేశమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలంటే, ఆయా పోస్టుల్లో ప్రస్తుతమున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలి. ఉదాహరణకు ఏఓ నుంచి ఏడీఏ పోస్టుల్లోకి ప్రమోషన్ ఇవ్వాలంటే, ఏడీఏ పోస్టుల్లో ఖాళీలు ఉండాలి. కానీ ఏడీఏ నుంచి డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు పదోన్నతులు జరపకుండా, ఖాళీలు ఎలా ఏర్పడతాయని వ్యవసాయ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అతి కొద్దిగా మాత్రమే రిటైర్మెంట్లు ఉంటాయి. కాబట్టి పూర్తిస్థాయిలో ప్రమోషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఇక ఏఈఓ నుంచి ఏఈలుగా పదోన్నతులు ఇవ్వాలన్నా అటువంటి క్లిష్టమైన పరిస్థితే తలెత్తుతుంది. పైస్థాయిలో కూడా ప్రమోషన్లు ఇవ్వకుండా మొదటి, రెండోస్థాయి గెజిటెడ్ ఆఫీసర్ల పదోన్నతులు చేయడం కుదరదని అంటున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులువ్యవసాయశాఖలో దాదాపు 500 మందికి పైగా పదోన్నతు లకు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒకేసారి అన్ని శాఖల్లో పదోన్నతులు జరిగినా, వ్యవసాయశాఖలో మాత్రం చేయలేదు. ఉద్యోగ సంఘాల మధ్య సమన్వయం లేదని సాకులు చెబుతూ పదోన్నతులు ఆపేశారని అంటున్నారు. ఏఓ స్థాయి నుంచి అడిషనల్ డైరెక్టర్ కేడర్ వరకు పదోన్న తులు జరగాలి. సర్వీస్ రూల్స్ ప్రకారం పదోన్నతులు నిర్ణీత కాలంలో జరపకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని సంఘాల నేతలు అంటున్నారు. పదోన్నతులు రాకపోవడం వల్ల సీనియర్లు మనోవేదనకు గురవుతున్నారు. దీనివల్ల పోస్టింగ్ల్లోనూ అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నా రు. ఇప్పుడు కేవలం రెండు కేడర్లలో పదో న్నతులకు మాత్రమే డీపీసీని ఏర్పాటు చేశారు. దీని వల్ల పైస్థాయిలో కద లిక రాకుంటే వీటికి కూడా ప్రమోషన్లు ఇచ్చే పరి స్థితి ఉండదని అంటున్నారు. ఆయా విషయాలపై ఇటీవ ల అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవ స్థాపక అధ్యక్షుడు కె.రాము లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎన్నికలకు ముందే విజ్ఞప్తి చేశారు. కానీ ప్రక్రియ మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. బదిలీల మాటేంటి?గత ప్రభుత్వంలో అంటే దాదాపు ఐదారేళ్ల క్రితం వ్యవసాయ శాఖలో బదిలీలు జరిగాయి. అవి కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అనేకమంది ఉద్యోగులు ఒకే చోట తిష్టవే యగా, కొందరు కుటుంబాలకు దూరంగా ఉంటూ అన్యా యానికి గురవుతున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు వ్యవసా య ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నాయి. ఉద్యోగు ల్లో దాదాపు 2 వేల మందికి పైగా బదిలీలకు ఎదు రుచూస్తున్నారు. కొందరైతే అక్రమ బదిలీలు చేయించుకుంటున్నారన్న విమర్శ లున్నాయి. మరికొందరైతే డిప్యూ టేషన్లు చేయించుకుంటున్నారు. వ్యవసాయ శాఖ లో చాలామంది డిప్యూటేషన్లు, ఓడీలు, ఫారిన్ సర్వీసులపై ఉంటున్నారు. బదిలీలు జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికీ డిప్యూటేషన్లకు వందల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆ అధికారి వెల్లడించారు. నిర్ణీత సమయం ప్రకారం బదిలీ లు జరగాలని, అది ఉద్యోగుల హక్కు అని ఆయన వ్యాఖ్యానించారు. -
డీఏపై కేబినెట్లో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) మంజూరుతో పాటు ఇతర అంశాలపై ఈ నెల 12న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలపై కక్ష గట్టి రద్దు చేస్తే, ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేశారని ఎద్దేవా చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగ సంఘాలు ఉండాల్సిందేనని, మంత్రివర్గ ఉప సంఘం శాఖల వారీగా సంఘాలతో సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో ఆదివారం సాయంత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనసాగింపుపై త్వరలో నిర్ణయం గత పదేళ్లుగా తమ సమస్యలను చెప్పుకోవడానికి ఉద్యోగులకు అవకాశం లభించలేదని, వారి ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారని సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఆ మేరకు ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఇన్నాళ్లూ ఉద్యోగ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా కేసీఆర్ కుటుంబ సభ్యులే వ్యవహరించారని విమర్శించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గవర్నర్ను సంప్రదించి ప్రొఫెసర్ కోదండరాంను శాసనమండలికి పంపుతామని, ఆయన ఎమ్మెల్సీగా ఉంటే మండలికి గౌరవమన్నారు. బడులు, కళాశాలలకు ఉచిత విద్యుత్! ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా బాధ్యత ప్రభుత్వానిదేనని, దీనిపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఉద్యోగుల తరఫున ప్రాతినిధ్యం ఉండాలన్నారు. తెలంగాణ బాపు జయశంకరే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది అసంబద్ధమేనని రేవంత్రెడ్డి అన్నారు. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడతారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ, తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారని, శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారని తెలిపారు. తెలంగాణ బాపు తానే అని కేసీఆర్ చెప్పుకుంటున్నారని, అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలని విమర్శించారు. తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకరే అని, తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదని అన్నారు. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలన ను గాడిలో పెడుతున్నామని, తాము పదేళ్లు అధి కారంలో ఉండటం ఖాయమని సీఎం అన్నారు. -
ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటాం
సాక్షి, అమరావతి : ఉద్యోగులకు సంబంధించిన అంశాలను సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, మరో ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఆందోళనను విరమించుకోవాలని కోరగా.. వారు అంగీకరించారని తెలిపారు. ఇవ్వాల్సిన సమయంలోనే పీఆర్సీని ప్రకటిస్తామన్నారు. మధ్యంతరం భృతి (ఐఆర్) ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదని, పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ ఇస్తారని, ఇవ్వాల్సిన సమయంలోనే పీఆర్సీ ఇస్తున్నప్పుడు ఐఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లు కోవిడ్ ప్రభావంతో పీఆర్సీ ఆలస్యమైందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. మార్చిలోపు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను చెల్లిస్తామన్నారు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్పై వచ్చి న అభ్యర్థనను సీఎం జగన్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో కొత్త పీఆర్సీకి సంబంధించిన ఫిట్మెంట్, డీఏ, జీపీఎఫ్, ఎస్ఎల్ఎస్ బిల్లుల చెల్లింపు వంటి పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో ప్రభుత్వ సర్విసెస్ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ సర్విసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సెర్ప్ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అలాగే, సెర్ప్ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉద్యోగ సలహాదారులు ఎన్.చంద్రశేఖరరెడ్డి, సీఎస్ జవహర్రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఫైనాన్స్ మినిస్టర్ సమావేశపు హాల్లో ఈ సమావేశం నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగుల క్రమబద్దికరణకు సంబంధించిన క్యాడర్ ఫిక్సేషన్, పేపిక్సేషన్ అంశాన్ని చర్చించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ గౌరవ స్పెషల్ సీఎస్ బి.రాజశేఖర్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అడిషనల్ సీఈవో విజయకుమారి, అడ్మిన్ డైరెక్టర్ సుశీల, సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు టి.ధనంజయరెడ్డి, కె.నాగరాజు, జె.శోభన్బాబు ఎంఎస్ మూర్తి, అబ్దుల్ రెహమాన్, ఆదయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన కార్మికులు
సాక్షి నెట్వర్క్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఐక్య కార్మిక సంఘాల అధ్వర్యంలో ఆయా కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్లో వ్యవసాయ మార్కెట్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. హనుమకొండలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లిలోని సింగరేణి గనుల్లో అన్ని సంఘాల నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జనగామలో రైల్వేస్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యా లీగా వచ్చి ధర్నా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచే పార్టీలు, సంఘాల నాయకులు ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే, అధికారులు ముందుగానే దూరప్రాంత సర్విసులు రద్దుచేశారు. మిగతా సర్విసులు మధ్యాహ్నం తర్వాత మొదలయ్యాయి. కాగా, ఖమ్మం రూరల్ మండలం కాశిరాజుగూడెం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులను కూడా నిరసనకారులు అడ్డుకున్నారు. హాల్ టికెట్లు చూపించినా అనుమతించకపోవడంతో విద్యార్థులు కన్నీటిపర్యంతం కాగా, ఇతరులు సర్దిచెప్పడంతో పంపించారు. ఇక సింగరేణివ్యాప్తంగా సమ్మె పాక్షికంగానే సాగింది. 39,010 మంది కార్మికులకు 18,072 వేల మంది(60 శాతం) విధులకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. అయితే, రోజువారీ లక్ష్యంలో 10 శాతం మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. -
గనులు తెచ్చి.. ఉపాధినిచ్చే...ఘనులెవరు..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సింగరేణి కార్మికుల డిమాండ్లను పరిష్కరించి తమ బతుకుల్లో వెలు గులు నింపాలని అన్ని కార్మి క సంఘాలు డిమాండ్ చేశాయి. సింగరేణి కార్మి కుల ఎజెండాపై గురువారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన ‘సాక్షి చర్చా వేదిక’లో అన్ని గుర్తింపు, జాతీయ, విప్లవ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. కెంగర్ల మల్లయ్య– టీజీబీకేఎస్, వాసిరెడ్డి సీతారామయ్య– ఏఐటీయూసీ, జనక్ ప్రసాద్–ఐఎన్టీయూసీ, రియాజ్ అహ్మద్– హెచ్ఎంఎస్, యాదగిరి సత్తయ్య–బీఎంఎస్, తుమ్మల రాజారెడ్డి– సీఐటీయూ,జి.రాములు– ఏఐఎఫ్టీయూ, విశ్వనాథ్, నరేష్–ఐఎఫ్టీయూ పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ, యాంత్రీకరణ, కాంట్రాక్టు కార్మి కుల క్రమబద్దీకరణ, రెండుపేర్లకు చట్టబద్ధత, ఆదాయపు పన్ను మినహాయింపు, సొంతింటికల, డీఎంఎఫ్ నిధుల మళ్లింపు వంటి ప్రధాన సమస్యలపై ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రాజకీయ పార్టీలు కేవలం వాగ్దానాలతో కాలయాపన చేయడమే తప్ప.. ఇంతవరకూ ఆ సమస్యలను పరిష్కరించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగనులు, ఉపాధి ఎక్కడ...? తెలంగాణ రాష్ట్రం వస్తే.. కొత్త గనులు వచ్చి స్థానికులకు ఉపాధి లభిస్తుందనుకున్న తమ ఆశలు అడియాసలయ్యాయని కార్మిక సంఘాల నేతలు వాపోయారు. ఇక్కడ మరో 180 ఏళ్లకు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. యాంత్రీకరణ వల్ల ఉపాధి అవకాశాలు తగ్గినా.. ఏటా ఐదు కొత్త గనులు ప్రారంభించి, దాదాపు లక్ష మందికి కల్పించే వీలుందని సింగరేణి ఉన్నతాధికారులే ధ్రువీకరించారని గుర్తు చేశారు. కానీ 1.16 లక్షల మంది కార్మికులున్న సంస్థను ఇపుడు 40 వేలకు కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంస్థలో 40 వేలమంది కాంట్రాక్టు కార్మి కులు ప్రాణాంతక పరిస్థితుల్లో పనిచేస్తున్నా.. వారికి అత్తెసరు వేతనాలే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవీ డిమాండ్లు ♦ కాంట్రాక్టు కార్మి కులను వెంటనే క్రమబద్దీకరించాలి. ♦ ఆదాయపు పన్ను మినహాయింపులో స్లాబ్ మార్చడం లేదా పార్లమెంటులో చట్టం ద్వారా శాశ్వత ఉపశమనం కల్పించాలి ♦ డీఎంఎఫ్టీ (డిస్ట్రిక్ట్ మిమినరల్ ఫౌండేషన్ ట్రస్ట్) నిధులను సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు మళ్లించకుండా సింగరేణి ప్రభావిత గ్రామాల్లోనే ఖర్చు చేయాలి. ♦ ఇక రెండు పేర్ల చట్టబద్ధతపై విధానపరమైన నిర్ణయం తీసుకుని వారి వారసులకు 40 ఏళ్ల వయోపరిమితితో కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించాలి. ♦ బొగ్గు ఆధారిత పరిశ్రమలను నెలకొల్పి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న డిమాండ్ను నిలబెట్టుకోవాలి ♦ సింగరేణి డిక్లరేషన్ తేవాలి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా డిక్లరేషన్ తరహాలో అన్ని పార్టీ లు సింగరేణి డిక్లరేషన్ చేసిన వారికే ఈ ఎన్నికల్లో ఓటేస్తామని స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో సింగరేణి మనుగడకు గతంలో పార్టీలు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే తమ డిమాండ్లను మేనిఫెస్టోలో చేరుస్తారో వారికే తమ సంఘాలు, కార్మి కులు మద్దతు తెలుపుతాయని నేతలు స్పష్టం చేశారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవ వేళ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభవార్త అందించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమ బద్ధీకరణకు సంబంధించి ఐదేళ్ల సర్వీసు నిబంధనను ఎత్తివేస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకు న్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన మాట ప్రకా రం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ గత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు 2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులరైజేషన్ చేసేలా నిబంధన విధించారు. తాజాగా సీఎం జగన్ ఐదేళ్ల నిబంధనను తొలగిస్తూ సంబంధిత ఫైలుకు మంగళవా రం ఆమోద ముద్ర వేశారు. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేయాలనే ఉద్దేశంతో ఏ సంఘం డిమాండ్ చేయకుండానే స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్ల నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసు కున్నారు. ఈ నిర్ణయంతో 2014 జూన్ 2వ తేదీకి ముందు నియమితులై ఇప్పటి వరకు కొన సా గుతున్న కాంట్రాక్టు ఉద్యోగులందరి సర్వీసును రెగ్యులరైజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేస్తా నని గత ఎన్నికల ముందు సీఎం జగన్ హామీ ఇచ్చి న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల కాంట్రాక్టు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలియ చేస్తున్నారు. నాడు బాబు సర్కారు నమ్మక ద్రోహం.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయబోమని, సుప్రీం కోర్టు తీర్పు అందుకు అనుమతించదని గ తంలో చంద్రబాబు ప్రభుత్వం సాకులు చెప్పింది. ఎ న్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా సుప్రీం కోర్టు తీర్పు పేరుతో కాంట్రాక్టు ఉద్యోగులను మో సం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యు లరైజేషన్పై ముగ్గురు మంత్రుల బృందాన్ని నియ మిస్తూ 2014 సెప్టెంబర్ 9న చంద్రబాబు సర్కారు జీవో 3080 జారీ చేసింది. ఐదేళ్ల పాటు సమావేశాలతో సాగదీసిన మంత్రుల బృందం చివ రికి కోర్టు తీర్పును బూచిగా చూపిస్తూ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సాధ్యం కాదంది. నేడు మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేర కు న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులను అధిగ మించి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్కు సిద్ధ మైంది. ప్రభ్వుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను అర్హత, సర్వీసును పరిగణలోకి తీసుకుని వీ లైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫేస్టోలో హామీ ఇచ్చారు. ఆ ప్రకారం రెగ్యులరైజేషన్పై ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. మంత్రుల కమిటీతో పాటు సీఎస్ అధ్యక్షతన వర్కింగ్ క మిటీని నియమించింది. ఈ కమిటీలు న్యాయ పరమైన, చట్టపరమైన చిక్కులపై చర్చించాయి. రెగ్యులరైజేషన్పై నిషేధం విధిస్తూ 1994లో చేసిన చట్టంలో సవరణలు చేయాలని కమిటీలు సూచించాయి. ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు దొడ్డి దారి కాకూడదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. కాంట్రాక్టు ఉద్యోగు ల క్రమబద్ధీకరణకు చిక్కులు ఎదురుకాకుండా న్యా యపరంగా అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణ లోకి తీసుకుంది. నాడు బాబు సర్కారు కోర్టు తీ ర్పును బూచిగా చూపిస్తూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా మోసగించగా సీఎం జగన్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటూనే క్రమబద్ధీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం హర్షం కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్ విషయంలో తొలుత విధించిన ఐదేళ్లు సర్వీసు నిబంధనను తొలగిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర పాలిటెక్నిక్ ఆల్ కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. మాట నిలబెట్టుకున్న సీఎం జగన్కు కృతజ్ఞతలు వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెటు్టకున్న ముఖ్యమంత్రి జగన్కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తరపున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. వేల మందికి మేలు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేకూరుతోందని ఎమ్మెల్సీ తమటం కల్పలత పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్కు కాంట్రాక్టు ఉద్యోగులందరూ రుణపడి ఉంటారన్నారు. మనసున్న ముఖ్యమంత్రి వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. సీఎం వైఎస్ జగన్ మనసున్న ముఖ్యమంత్రిగా మరోసారి నిరూపించుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. – కె.మురళిరెడ్డి, యూనివర్సిటీస్ వైఎస్సార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిరస్మరణీయమైన రోజు కాంట్రాక్టు ఉద్యోగులకు ఇది జీవితంలో మరిచిపోలేని రోజు అని తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో కాంట్రాక్టు అధ్యాపకులు కూడా రెగ్యులరైజ్ అవుతారని తెలిపారు. ఎన్నికల హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్కు కాంట్రాక్టు ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. – ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి వెలుగులు నింపిన సీఎం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 5 వేల మందిని రెగ్యులరైజ్ చేసేలా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం తమ జీవితాల్లో వెలుగులు నింపుతోందని గవర్నమెంట్ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. మాటకు కట్టుబడ్డ సీఎం జగన్కు సంఘం నేతలు వై.రామచంద్రారెడ్డి, చంద్రమోహన్రెడ్డి, కరీంఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ రెగ్యులర్ చేస్తున్న సీఎం జగన్కు రుణపడి ఉంటామని ఏపీ పాలిటెక్నిక్ ఆల్ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.సాయిరాజు పేర్కొన్నారు. – గవర్నమెంట్ కాంట్రాక్టు లెక్చరర్స్ ఫెడరేషన్ -
రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణలపై ఉద్యోగ సంఘాల భేటి
అమరావతి: జోనల్ వ్యవస్థలో మార్పులపై ఉద్యోగ సంఘాలతో జీఏడి సెక్రెటరీ పోలా భాస్కర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన, జిల్లాల విభజన తర్వాత ఇప్పటి వరకు పాత విధానంలోనే జరుగుతున్న ఉద్యోగాల భర్తీ పై చర్చ జరిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలకు తెలియజేసి వారి నుంచి పలు సూచనలు, సలహాలను స్వీకరించారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, బండి.శ్రీనివాసులు, బొప్పరాజు, ఆస్కార్ రావు తదితర నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్టు రిక్రూట్మెంట్)కు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు 1975కు సవరణ ప్రతిపాదనపై నివేదికలను అధికారులు సిద్దం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి పోస్టుల భర్తీపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను అధికారులు తీసుకుంటున్నారు. ఇదీ చదవండి: గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్ -
ప్రభుత్వ ఉద్యోగుల 341 డిమాండ్లు పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు 461 డిమాండ్లలో 341 డిమాండ్లను పరిష్కరించామని, మిగతా వాటిని కూడా సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కేఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. సీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎస్ వివరించారు. ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన డిమాండ్లను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సీఎస్ జవహర్రెడ్డి మాట్లాడుతూ.. శాఖల స్థాయిలో ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, చాలా వరకు పరిష్కరించినట్లు చెప్పారు. ఆరేడు నెలలుగా ఉద్యోగ సంఘాలతో తరచూ మంత్రివర్గ ఉప సంఘం, అధికారులు సమావేశమై చర్చిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత వరకు అన్ని డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబీకులకు కారుణ్య విధానంలో త్వరలోనే 1042 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగుల వేతన సవరణకు మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 12వ పీఆర్సీని కూడా నియమించినట్లు చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంపై త్వరలో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ఆ శాఖల ఉన్నతాధికారులు వివరించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.ప్రవీణ్ కుమార్, అజయ్ జైన్, బి.రాజశేఖర్, ఎం.టి. కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్య కార్యదర్శులు చిరంజీవి చౌదరి, జయలక్ష్మి, శశిభూషణ్ కుమార్, ప్రవీణ్ ప్రకాశ్, శ్యామల రావు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల నుండి రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రెవెన్యూ సర్వీసెస్ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు సాయి శ్రీనివాస్, ఎం.కృష్ణయ్య, ఎన్.వెంకటేశ్వర్లు, జి.హృదయరాజు, సీహెచ్ శ్రావణ్ కుమార్, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు, ఏపీజీఈఏ జనరల్ సెక్రటరీ జె.ఆస్కార్ రావు, ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ల అధ్యక్షులు సి.గోపాలకృష్ణ, ఎస్.మల్లేశ్వరరావు, వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షుడు వేణుమాధవరావు, ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సంఘం అధ్యక్షుడు రజనీష్ బాబు, జూనియర్ వెటర్నరీ అధికారులు, వెటర్నరీ లైవ్స్టాక్ అధికారులు సంఘం అధ్యక్షుడు సేవా నాయక్ తదితరులు పాల్గొన్నారు. వేగంగా సమస్యల పరిష్కారం హర్షణీయం: బండి శ్రీనివాసరావు 40 ఏళ్ల చరిత్రలో తొలిసారి చాలా గొప్ప జాయింట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. వేగంగా సమస్యల పరిష్కారం హర్షణీయం. 40 రోజుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్నారు. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్లో 16 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాం. పెన్షనర్ల డిమాండ్లు పరిష్కరించాలని కోరాం. పోలీసులు, ఉద్యోగులకు సరెండర్ లీవుల బకాయిలు రూ. 800 కోట్లు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో క్లియర్ చేస్తామన్నారు. యూరోపియన్ ఏఎన్ఎంలను రెగ్యులరైజేషన్, ఎంపీడీవోల ప్రమోషన్లలో మినిస్టీరియల్ సిబ్బందికి 34 శాతం కోటాపై సానుకూలంగా స్పందించారు. 2004 కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి ఓపీఎస్ అమలు చేయమని కోరాం. మన్మోహన్ సింగ్ ను పీఆర్సీ కమిషన్ చైర్మన్గా నియమించడం హర్షణీయం. ఓపీఎస్ టు జీపీఎస్ గతంలోకంటే బాగుంది: వెంకట్రామిరెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులందరి క్రమబద్ధీకరణకు ఒకే జీవో ఇస్తామన్నారు. వారు పనిచేసే చోట రెగ్యులర్ చేసేంత వరకు నోటిఫికేషన్లు ఇవ్వొద్దని కోరాం. ఓపీఎస్ టు జీపీఎస్ గతంలోకంటే బాగుంది. జీపీఎస్ ఉత్తర్వులు ఇచ్చే ముందు ఉద్యోగ సంఘాలతో చర్చించాలని కోరాం. అందుకు సీఎస్ అంగీకరించారు. జగనన్న లే అవుట్లలో ఇచ్చిన స్థలం కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉద్యోగులకు వంద ఎకరాలు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరాం. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని, జీతాలు పెంచాలని కోరగా సీఎస్ అంగీకరించారు. గ్రీవెన్స్ డే నిర్వహించడం సంతోషం: బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇకపై నాలుగు నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మొదటిసారిగా గ్రీవెన్స్ డే నిర్వహించడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం హర్షణీయం. 2014 జూన్ 2 నాటికి ఉద్యోగంలో చేరిన కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలి. జీతాలు, పింఛన్లు 1వ తేదీన చెల్లించాలని కోరాం. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇవ్వడం సంతోషం. ఆర్టీసీ ఉద్యోగుల అలవెన్సులు కూడా జీతాలతో కలిపి ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను బలోపేతం చేయాలని, తక్షణమే ట్రస్ట్ అకౌంట్లో డబ్బులు జమ చేయాలని కోరాం. -
ఎగవేతదారులతో బ్యాంకుల రాజీకి వ్యతిరేకత
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులతో బ్యాంకులు రాజీ పరిష్కారానికి ఆర్బీఐ అనుమతించడాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజీ పరిష్కారం, సాంకేతికంగా రుణాల మాఫీ పేరుతో ఆర్బీఐ ఇటీవలే ఓ కార్యాచరణను ప్రకటించింది. ఇది బ్యాంకుల సమగ్రత విషయంలో రాజీపడడమేనని, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చడమేనని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఉద్దేశపూర్వక ఎగవతేదారుల సమస్య పరిష్కారానికి కఠిన చర్యలనే తాము సమర్థిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకటించాయి. మోసం లేదా ఉద్దేశపూర్వక ఎగవేతదారులంటూ వర్గీకరించిన ఖాతాల విషయంలో రాజీ పరిష్కారానికి అనుమతించడం అన్నది న్యాయ సూత్రాలకు, జవాబుదారీకి అవమానకరమని వ్యాఖ్యానించాయి. నిజాయితీ పరులైన రుణ గ్రహీతలను నిరుత్సాహపరచడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఆర్బీఐ తాజా ఆదేశాలు షాక్కు గురి చేశాయని పేర్కొన్నాయి. ఇది బ్యాంకింగ్ రంగం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని నీరు గారుస్తుందని, డిపాజిట్ల నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆర్బీఐ తన నిర్ణయాన్ని ఉపంసహరించుకోవాలని డిమాండ్ చేశాయి. -
వేల కళ్లలో వెలుగులు
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: కాంట్రాక్టు ఉద్యోగుల రెండు దశాబ్దాల కలను నెరవేరుస్తూ క్రమబద్ధీకరణ నిర్ణయంతో వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ చిత్రపటాలకు రాష్ట్రవ్యాప్తంగా క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)ను ప్రభుత్వంలో విలీనం చేసి 010 పద్దు కింద ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీతాలు చెల్లించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తమవుతోంది. ♦ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, కార్వేటినగరం, పలమనేరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఉద్యోగులు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ♦ విజయనగరం జిల్లా కేంద్రంలో సీఎం జగన్ చిత్రపటానికి కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బంది క్షీరాభిషేకం చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరులో సీఎం జగన్, మంత్రి దాడిశెట్టి రాజా ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ♦ సీఎం జగన్ మాట తప్పని, మడమ తిప్పని నేతగా మరోసారి రుజువు చేసుకున్నారని విజయనగరం జిల్లా వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.కనకరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీవైవీపీ కార్యాలయం వద్ద ఉద్యోగులతో కలిసి ఆయన సీఎం జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ♦ తమ జీతాలను ఏకంగా 23 శాతం పెంచిన ముఖ్యమంత్రి జగన్కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆరోగ్యశ్రీ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. అసోసియేషన్ సభ్యులు శుక్రవారం గుంటూరులో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనిని కలసి ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.అశోక్కుమార్, అధ్యక్షుడు ఎ.విజయ్భాస్కర్ తదితరులున్నారు. ♦ ఏపీ ఎన్జీవోలు కర్నూలు కలెక్టరేట్ వద్ద ప్లకార్డులతో ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. నంద్యాలలో మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి నివాసంలో గవర్నమెంట్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ♦ కడపలో కాంట్రాక్టు లెక్చరర్ల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ సురే‹Ùబాబు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మ శివప్రసాద్రెడ్డి, ఏపీఎన్జీవోస్ నేతలు పాల్గొన్నారు. ♦ క్రమబదీ్ధకరణ ద్వారా సీఎం జగన్ 10 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్విసెస్ అసోసియేషన్ (ఏపీ హంస) అధ్యక్షుడు అరవా పాల్, జనరల్ సెక్రటరీ ఆర్.గోపాల్రెడ్డి ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఏపీవీవీపీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 14 వేల మంది ఉద్యోగులకు భరోసా కల్పించారన్నారు. ♦ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరించి ముఖ్యమంత్రి జగన్ మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారి జీవితాల్లో వెలుగు నింపారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. విజయవాడ వైఎస్సార్ పార్క్లో కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. -
ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం
సాక్షి, అమరావతి: అడగకుండానే 12వ పీఆర్సీని ఏర్పాటు చేసినందుకు.. సీపీఎస్ ఉద్యోగులకు ఊరటనిస్తూ జీపీఎస్ విధానాన్ని తెచ్చి నందుకు.. పది వేలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించినందుకు.. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ను ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వారు సీఎంతో సమావేశమైన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా సీఎం పాటుపడుతున్నారని ప్రశంసించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఉద్యోగుల కోసం పరితపిస్తున్న సీఎం జగన్ ప్రజలతో పాటు ఉద్యోగుల సంక్షేమానికీ పెద్దపీట వేస్తున్నారు. అడగకుండానే 12వ పీఆర్సీ ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 25 ఏళ్లుగా పనిచేసినా.. చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉంది. ఇప్పుడు ఒక్క నిర్ణయంతో వారి ఉద్యోగాలను క్రమబద్దీకరించారు. ఏపీవీపీని ప్రభుత్వంలో విలీనం చేసి... ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులకు 010 ద్వారా వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో ఒకే హెచ్ఆర్ఏ ఇచ్చారు. సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎస్ ద్వారా 50 శాతం ఫిట్మెంట్తో పెరిగే ధరలకు అనుగుణంగా డీఏలు ఇచ్చి పెన్షన్ ఇస్తామని చెప్పడం ద్వారా భవిష్యత్కు భరోసా ఇచ్చారు. మా కోసం ఇంతగా పరితపిస్తున్న సీఎం జగన్కు కృతజ్ఞతలు. జగన్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం. సీఎం వైఎస్ జగన్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు భారీ ఎత్తున పాలాభిషేకాలు చేస్తున్నారు. – బండి శ్రీనివాసరావు, అధ్యక్షుడు, ఏపీఎన్జీవో సంఘం మానవతామూర్తి సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ 2008లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. 2014 ఎన్నికల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరిస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మోసం చేశారు. సీఎం జగన్ ఇచ్చి న మాట మేరకు 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపిన మానవతామూర్తి. గతంలో పీఆర్సీ కోసం రోడ్డెక్కితే టీడీపీ సర్కార్ గుర్రాలతో ఉద్యోగులను తొక్కించింది. ఇప్పుడు ఎవరూ అడగకుండానే సీఎం వైఎస్ జగన్ పీఆర్సీని ప్రకటించి.. ఉద్యోగుల పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. – శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీఎన్జీవో సంఘం ఎప్పటికీ రుణపడి ఉంటాం.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎం జగన్కు కృతజ్ఞతలు. ఎప్పటికీ రుణపడి ఉంటాం. – రత్నాకర్ బాబు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నేత జీపీఎస్తో మేలు జరుగుతుందని భావిస్తున్నాం జీపీఎస్లో పది శాతం ఉద్యోగి షేర్, ప్రభుత్వ షేర్ కొనసాగుతుందని సీఎం జగన్ చెప్పారు. ఉద్యోగి రిటైర్ అయ్యాక గ్యారెంటీ పింఛన్ వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. జీపీఎస్తో ఉద్యోగులకు 60 శాతం ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నాం. – మురళీ మోహన్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత 15 ఏళ్ల సమస్యకు సీఎం పరిష్కారం ఆస్పత్రుల్లో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు. రెగ్యులర్ ఉద్యోగులమైనా మాకు జీతాలు రావటం లేదు. కానీ సీఎం జగన్ దృష్టికి రాగానే ఒకే ఒక్క సంతకంతో సమస్య తీర్చారు. వైద్య విధాన పరిషత్ ద్వారా అత్యంత మెరుగైన సేవలు అందిస్తాం. – సురేష్ కుమార్, ఏపీవీపీ సంఘం నేత నా 23 ఏళ్ల సర్విసులో ఇది అద్భుతం నా 23 ఏళ్ల సర్విసులో ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల పరీక్షలకు సంబంధించి పరికరాలు ఏర్పాటు చేయడం అద్భుతం. కాంట్రాక్టు ఉద్యోగులమైన మమ్మల్ని రెగ్యులరైజ్ చేసినందుకు సీఎం జగన్కు ధన్యవాదాలు. – వీఏవీఆర్ కిశోర్, ఏపీ కాంట్రాక్టు ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
Manifesto: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి
(సాక్షి, అమరావతి) : ఓట్లడిగేటప్పుడు వందలకొద్దీ హామీలివ్వటం... తీరా ఆ ఓట్లతో గెలిచాక హామీలను పక్కనబెట్టడం!. దశాబ్దాలుగా ఇక్కడ చూస్తున్నది అదే. అలవికాని హామీలను చూసి చూసి అలసిపోయిన జనం... ఎన్నికలప్పుడు పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకు విలువివ్వటమే మానేశారు. వాటినసలు చూడకుండానే పక్కనబెట్టేస్తున్నారు. కాకపోతే 2019 ఎన్నికల్లో... ఈ పరిస్థితి మార్చాలని సంకల్పించారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. నాడు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్సార్ సీపీ తరఫున ఒకే ఒక పేజీ మేనిఫెస్టోను విడుదల చేశారు. దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తానని స్పష్టంగా చెప్పారు. జనం జై కొట్టారు. ఓ కొత్త చరిత్రకు అంకురార్పణ జరిగింది. మరి సింగిల్ పేజీ మేనిఫెస్టోతో ఎన్నికల్లో పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి... ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశారు? ఆ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశారా? దీనికి నిజాయితీగా వినవచ్చే సమాధానం ఒక్కటే. అది... ‘ఆ రెండూ తప్ప’ అని!. ఎందుకంటే మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకున్న జగన్... తొలి ఏడాదే దాన్లో పేర్కొన్న 95 శాతం హామీలను అమల్లోకి తెచ్చారు. మిగిలిన సంక్లిష్టమైన హామీలను కూడా సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. కాకపోతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను (సీపీఎస్) రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను (ఓపీఎస్) తిరిగి అమల్లోకి తెస్తామన్న హామీని అమలు చేయలేకపోయారు. ఓపీఎస్ను తిరిగి తేవటం ఆచరణ సాధ్యం కాదని తేలినా... ఉద్యోగులకిచ్చిన హామీ మేరకు మెరుగైన పెన్షన్ పథకాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం రెండేళ్లుగా రకరకాల గ్రూపులతో చర్చించి కసరత్తు చేస్తూ వచ్చింది. చివరకు వారి ప్రయోజనాలను కాపాడేలా గ్యారంటీడ్ పెన్షన్ పథకానికి (జీపీఎస్) రూపకల్పన చేసింది. ఉద్యోగ వర్గాలంతా ఈ జీపీఎస్పై సంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీన్ని అమల్లోకి తేవటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది కూడా. ఇక అమలు కాని హామీల్లో రెండవది మద్య నియంత్రణ. దశలవారీగా మద్యం వినియోగాన్ని తగ్గిస్తూ చివరకు దాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నా... రకరకాల సాంకేతిక, ఆర్థిక కారణాలతో పూర్తి స్థాయిలో ఆ హామీ అమలు కాలేదు. కాకపోతే నియంత్రణ దిశగా బలమైన అడుగులుపడ్డాయి. 2018–19తో పోలిస్తే విక్రయాలు 50 శాతానికన్నా తగ్గాయంటే నియంత్రణ దిశగా అడుగులు పడ్డాయన్నది స్పష్టంగా తెలియకమానదు. కాకపోతే ఈ రెండంశాలూ హామీ ఇచ్చినట్లుగా నూటికి నూరు శాతం అమలు కాలేదు కనక... మేనిఫెస్టోలో 99 శాతమే అమలయ్యిందని చెప్పాలి. నూటికి 99 శాతం మార్కులే ఇవ్వాలి. ఇక్కడ గమనించాల్సిందొక్కటే. అసలు మేనిఫెస్టోను ఇంత చిత్తశుద్ధితో అమలు చేసిన ప్రభుత్వాలను మనమెన్నడైనా చూశామా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏం జరిగిందో ఎవరికి తెలియదని? 2014లో ఆయన ఇచ్చిన ఏ హామీనైనా గెలిచాక అమలు చేశారా? అసలు మేనిఫెస్టోనే పార్టీ వెబ్సైట్లో నుంచి తొలగించిన చరిత్ర ఆయనది. ఒకటికాదు రెండు కాదు... వందలకొద్దీ హామీలనిచ్చారు. కానీ తొలి నాలుగున్నరేళ్లూ ఒక్క హామీని కూడా పట్టించుకోలేదు. మళ్లీ 2019లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయనగా హడావుడిగా కొన్ని హామీలను అరకొరగానైనా అమలు చేశామని చూపించుకోవటానికి ప్రయత్నించారు. కొద్ది మంది ఖాతాల్లో రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతిని జమచేయటం... పసుపు కుంకుమ కింద మహిళల ఖాతాల్లో నగదు వేయటం... ఇవన్నీ ఎన్నికలకు కేవలం రెండుమూడు నెలల ముందు చేశారు. అంతేకాదు! ఈ రాష్ట్రానికి తీరప్రాంతమే మణిహా రమంటూ రకరకాల గ్రాఫిక్లు చూపించి... ఎన్నికలకు కేవలం 20 రోజుల ముందు పోర్టులకు శంకుస్థాపనలంటూ హడావుడి చేశారు. భోగాపురం విమానాశ్రయానిదీ అదే కథ. విచిత్రమేంటంటే ఇలా ఏ హామీనీ అమలు చెయ్యని చంద్రబాబు నాయుడు... 2019 ఎన్నికల్లో మాత్రం తాను చెప్పివన్నీ చేశానని, మళ్లీ గెలిపిస్తే ఇంకేదో చేస్తానంటూ స్వర్గాన్ని గ్రాఫిక్లలో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు కూడా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం నిజాయితీగా తన పనితీరుకు మార్కులు వేసుకుంటున్నారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ అమలు చేయటానికి ప్రయత్నించటంతో పాటు రెండంశాలు తప్ప మిగిలివన్నీ 100 శాతం అమలు చేశారు. 99 శాతం మార్కులు సాధించగలిగారు. రాజకీయ వర్గాలు ఈ రెండు మేనిఫెస్టోలనూ ‘విశ్వసనీయత– వంచన’తో పోలుస్తున్నది కూడా అందుకేనేమో!!. ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే.. రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాలతో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని సాధించాక 2019 మే 30న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుక్షణమే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ.. వృద్ధాప్య పింఛన్ను పెంచే ఫైలుపై తొలి సంతకం చేశారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 56 శాతం పదవులు ఇచ్చి సామాజిక విప్లవానికి తెరతీశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే.. నవరత్నాలతో 95 శాతం హామీలను అమలు చేశారు. కోవిడ్ కష్టకాలంలోనూ మాట తప్పకుండా వాటిని కొనసాగించారు. ఉద్యోగులు అడగక ముందే 12వ పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం... సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా జీపీఎస్ (గ్యారంటీ పెన్షన్ స్కీమ్) విధానానికి ఆమోదం తెలపటం... కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపడంతో మేనిఫెస్టో అమల్లో మరింత ముందడుగు వేసినట్లయింది. 99 శాతం హామీలను నెరవేర్చినట్లయింది. ఇబ్బందుల్లోనూ చెప్పిన దాని కంటే మిన్నగా.. 2020లో ప్రపంచ వ్యాప్తంగా విజృంభించిన కరోనా మహమ్మారి ప్రభావం రాష్ట్రంపైనా పడింది. ఆర్థిక ఇబ్బందులను సృష్టించింది. కరోనా కష్టకాలంలోనూ.. ఆర్థిక ఇబ్బందులున్నా హామీల అమల్లో సీఎం వైఎస్ జగన్ వెనుకంజ వేయలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నీ అమలు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు రైతులకు ఇస్తాన ని మేనిఫెస్టోలో చెప్పిన సీఎం జగన్.. దాన్ని మరో వెయ్యి పెంచి ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చేలా అమలు చేస్తున్నారు. అంటే.. రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు అదనంగా రూ. 17,500 ప్రయోజనం చేకూరుస్తున్నారు. మేనిఫె స్టోలో ఇచ్చిన హామీలతోపాటు ఇతర పథకాలనూ అమల్లోకి తెచ్చారు. 2019 ఎన్నికల తర్వాత.. జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్.. తిరుపతి లోక్సభ, ఆత్మకూరు, బద్వే లు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రికార్డు విజయాలు సాధించడమే ఆయనపై జనానికున్న నమ్మకానికి నిదర్శనం. అర్హతే ప్రామాణికం కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ చూడకుండా.. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అంతే పారదర్శకంగా అమలు చేస్తున్నారు. నాలుగేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.16,786 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఇతరత్రా రూపాల్లో లబ్ధి చేకూర్చిన పథకాలు కూడా కలిపితే (డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ) లబ్ధిదారులకు రూ.3.10 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. ఇచ్చిన మాట మేరకు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి పేరిట ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంతోపాటు పక్కా గృహాన్ని మంజూరు చేసి, నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇలా 31 లక్షల మందికి ఇంటి స్థలాలను ఇచ్చి.. వారి పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన దాఖాలు గతమెన్నడూ లేవు. -
ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించింది. 2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని వెల్లడించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కలిగిన ఉద్యోగ సంఘాల నాయకులతో సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉద్యోగులకు అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు. పీఆర్సీ, డీఏ బకాయిలు రెండింటినీ కలిపి ఒకటిగా చేసి చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయని, ప్రభుత్వం అందుకు అంగీకరించినట్లు చెప్పారు. మూడు నెలలకు ఒక విడత చొప్పున, సంవత్సరానికి నాలుగు విడతలు, నాలుగేళ్లలో 16 విడతల్లో ఈ బకాయిలను ఉద్యోగులకు ఇస్తామని వివరించారు. మొదటి సంవత్సరం పది శాతం, రెండో సంవత్సరం 20 శాతం, మూడో సంవత్సరం 30 శాతం, నాలుగో సంవత్సరం 40 శాతం చొప్పున ఇస్తామన్నారు. ఏటా పది శాతం చొప్పున పెంచుకుంటూ నాలుగు సంవత్సరాల్లో మొత్తం బకాయిలను ఇస్తామన్నారు. దీనికి ఉద్యోగ సంఘాలు అంగీకరించాయన్నారు. సీపీఎస్ కంటే మెరుగ్గా ఉద్యోగులకు సీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని అమలు చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ఇకపై 010 పద్దు ప్రకారం జీతాలు చెల్లిస్తామన్నారు. త్వరలో కొత్త పీఆర్సీ కమిటీని నియమిస్తామని వెల్లడించారు. ఉద్యోగుల స్పెషల్ పే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ అంశాలన్నింటికీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం శాఖల వారీగా ఉత్తర్వులిస్తామన్నారు. ఆలస్యమైనా.. అనుకూలంగానే ఇది ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వమని, ఉద్యోగులంతా తమ సోదరులేనని మంత్రి బొత్స పేర్కొన్నారు. తమ కుటుంబాల్లోనూ ఉద్యోగులున్నారని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల వల్ల వారికి ఇవ్వాల్సిన వాటి విషయంలో కొంత ఆలస్యం జరిగిందే కానీ, ఉద్యోగుల పట్ల సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి మొదటిరోజు చెప్పిన మాటకే సీఎం కట్టుబడి ఉన్నారని, దాని ప్రకారమే వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఓపిగ్గా సంప్రదింపులు జరిపిన ఉద్యోగ సంఘాలకు బొత్స అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్యం) చిరంజీవి చౌదురి, ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ కేవీవీ సత్యనారాయణ (సర్వీసెస్, హెచ్ఆర్), కార్యదర్శి పి.భాస్కర్, ఎస్టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, పీఆర్టీయు అధ్యక్షుడు కృష్ణయ్య, యూటీఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు, ఏపీజీఈఏ కార్యదర్శి ఆస్కార్రావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 71 డిమాండ్లు నెరవేరాయి: బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎదుట ఉంచిన 71 డిమాండ్లలో దాదాపు అన్నీ పరిష్కారమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు చెప్పారు. అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఐదేళ్లకోసారి పీఆర్సీ డిమాండ్ను పోరాడి సాధించుకున్నాం. ఆ డిమాండ్ ప్రకారం 7వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో పీఆర్సీ కమిషన్ను నియమిస్తామన్నారు. స్పెషల్ పే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొత్తగా ఏర్పడిన 8 జిల్లాలకు హెచ్ఆర్ఏను 16 శాతం పెంచడం మంచి విషయం. ఇన్నాళ్లూ వైద్య శాఖలో ఏబీవీపీని ఓ ప్రైవేట్ కంపెనీలా చూసేవారు. వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు దక్కినందుకు అభినందిస్తున్నాం. సీపీఎస్ ఉద్యోగుల విషయాన్ని కేబినెట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. అన్నీ పాజిటివ్ అంశాలే : వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన సమావేశంలో అన్ని అంశాలు ఉద్యోగులకు పాజిటివ్గా ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. సీఎం గతంలో చెప్పినట్లుగా పీఆర్సీ కమిషన్ను నియమిస్తామన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారికి పెన్షన్ భద్రత కల్పించేలా చూస్తామన్నారు. స్పెషల్ పే ఇవ్వడానికి అంగీకరించారు. డీఏ, పీఆర్సీ బకాయిలను నాలుగేళ్లలో విడతలవారీగా ఇస్తామన్నారు. పలు సానుకూల నిర్ణయాలు: బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లను చాలా వరకు నెరవేర్చింది. ఉద్యోగులకు అనుకూలంగా చాలా సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. పీఆర్సీ, డీఏ బకాయిలు మొత్తం రూ.7 వేల కోట్లు ఉంటాయి. వాటిని నాలుగేళ్లలో విడతలవారీగా చెల్లించేందుకు అంగీకరించారు. విభజన నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సుమారు 7, 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు అంగీకరించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపైనా సానుకూలంగా స్పందించారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వచ్చే కేబినెట్లో తీర్మానం చేస్తామన్నారు. ఇది కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.మురళీరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. 2014కు ముందు ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ నిర్ణయం తీసుకోవడం వారికి శుభవార్త అంటూ ఈ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతీ ఉద్యోగి సీఎంకు అండగా నిలుస్తారన్నారు. 22 ఏళ్ల సుదీర్ఘ కల నెరవేరుతోంది.. సీఎంకు ఏపీ స్టేట్ కాంట్రాక్టు ఫార్మసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఏపీ స్టేట్ కాంట్రాక్టు ఫార్మాసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ స్వాగతించింది. 22 ఏళ్ల తమ సుదీర్ఘ కలను నెరవేరుస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2001 నుంచి శాశ్వత ఉద్యోగ నియామకాలకు స్వస్తి పలికి కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకుంటూ వచ్చారని.. ఇప్పుడు 2–06–2014కు ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని ముఖ్యమంత్రి జగన్ రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.రత్నాకర్బాబు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
గతంలో ఉద్యోగ సంఘాలను రాజకీయాలకు వాడుకున్నారు: సజ్జల
సాక్షి, విజయవాడ: గతంలో ఉద్యోగ సంఘాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేవారు. ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. కాగా, సజ్జల బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఉద్యోగులు లేకుండా ఏమీ చేయలేము. లక్ష్యాన్ని చేరుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి సరైన మార్గంలోనే వెళ్తుంది. గతంలో ఉద్యోగ సంఘాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేవారు. కానీ, సీఎం వైఎస్ జగన్ మాత్రం ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగంగానే చూస్తున్నారు. పరిపాలన ఎలా ఉండాలో మూడున్నర ఏళ్లలో సీఎం వైఎస్ జగన్ చూపించి ఒక రోల్ మోడల్గా నిలిచారు. ప్రతిపక్షం మాయల మరాటీగా మీడియా మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని అబద్దాలను ప్రచారం చేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
భౌగోళికంగా విడిపోయినా మనసులు కలిసే ఉన్నాయి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ భౌగో ళికంగా విడిపోయినప్ప టికీ మన మనసులు కలిసే ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యా టక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొ న్నారు. తెలుగు ప్రజలకు మంత్రి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా వెళ్లి శ్రీనివాస్గౌడ్ దర్శించుకున్నారు. అనంతరం రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీలోని జేఏసీ, అమరావతి ఉద్యోగుల సంఘాల నాయకులు బొప్పరాజు, వైవీ రావు తదితరులు మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో చిరకాల మిత్రుడు బొప్పరాజుతో కలసి కొన్ని దశాబ్దాలు ఉద్యోగ సమస్యలపై కలసి పనిచేశామని గుర్తు చేశారు. ప్రభు త్వంతో ఘర్షణ వైఖరి లేకుండా సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి, ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకొని వెళుతూ పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలనే సంకల్పం విజయ వంతం కావాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు భగవంతుడు మరింత శక్తినివ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. -
సీఎం జగన్ ను కలిసిన పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు
-
కార్మిక హక్కులకు అసలు ప్రమాదం
మంచి జీవితాన్ని గడిపే హక్కు, సంపదను కొంతమంది చేతుల్లో కేంద్రీకరించని ఆర్థిక వ్యవస్థ, పనిలో మానవీయ పరిస్థితులు... ఇలా రాజ్యాంగ ప్రవేశికలో ప్రజల మనోభావాలన్నింటికీ రూపమివ్వడమే కాకుండా సోషలిస్టు అనే పదం కూడా జోడించారు. కానీ ఆచరణలో వేతనాలు, జీవన ప్రమాణాలు, యూనియన్ పెట్టుకునే హక్కు గగన కుసుమాల్లాగే మారాయి. వందేళ్లుగా అనేక పోరాటాలు, త్యాగాలతో కార్మికులు తమ హక్కులను కాపాడుకుంటూ వచ్చారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 46 లేబర్ చట్టాలను తొలగించి వాటి స్థానంలో 4 చట్టాలను తీసుకురావాలనుకుంటోంది. కార్మిక సంఘాలు ఈ మార్పుల పట్ల తీవ్ర ఆందోళనగా ఉన్నాయి. వారి డిమాండ్ల పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న మౌనం ప్రమాదకరంగా కనిపిస్తోంది. భారతీయ కార్మికవర్గం మొదటినుంచీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటంలో పాలు పంచుకుంటూ వచ్చింది. 1908లో ముంబైలో చేసిన ఆరురోజుల సమ్మె, 1913లో కెనడాలోని పంజాబీ వలస కార్మికులు స్థాపించిన గదర్ పార్టీ, 1930లో నాలుగురోజుల పాటు నడిచిన సోలాపూర్ కమ్యూన్ లాంటి వాటివల్ల భారత కార్మికవర్గం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 1930లో కార్మికులు కలకత్తా కాంగ్రెస్ సెషన్లోకి దూసుకెళ్లినప్పుడు పూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రకటించడానికి దారి తీసింది. 1937లో కిసాన్ సభ, వర్కర్స్ పీసెంట్స్ పార్టీ కార్యాచరణలు, యునైటెడ్ ప్రావెన్స్లలో జమీందారీ వ్యవస్థ రద్దు తీర్మానాలకు దారితీశాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ దళాలకు సరఫరాలు తీసుకెళ్లడానికి 1945లో ముంబై, కలకత్తా డాక్ వర్కర్లు తిరస్కరిం చారు. 1946లో రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటుకు ముంబై కార్మిక వర్గం ఇచ్చిన వీరోచిత మద్దతు బ్రిటిష్ రాజ్కి చివరి సమాధి రాయిగా మారింది. ఈ కాలంలోనే, దేశంలో మొట్టమొదటి కార్మిక వర్గ సమాఖ్య అయిన అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు (ఇది తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీకి అనుబంధ సంస్థగా మారి పోయింది) బలమైన రాజకీయ మద్దతు లభించింది. లాలా లజపతి రాయ్ నుంచి జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సరోజిని నాయుడు వరకు ఈ సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు. మరోవైపున 1944లో ‘ఎ బ్రీఫ్ మెమొరాండమ్ అవుట్లైనింగ్ ఎ ప్లాన్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా’ (బాంబే ప్లాన్గా సుప్రసిద్ధమైంది) ప్రచురితమైంది. ఈ ప్లాన్పై జేఆర్డి టాటా, ఘన శ్యామ్ దాస్ బిర్లా, అర్దెషిర్ దలాల్, లాలా శ్రీరామ్, కస్తూర్ బాయి లాల్ భాయి, అర్దేషిర్ దారాబ్ ష్రాఫ్, పురుషోత్తమ్ దాస్ ఠాకూర్దాస్, జాన్ మథాయి వంటి ప్రముఖులు సంతకాలు పెట్టారు. జోక్యం చేసుకునే ప్రభుత్వం, ప్రభుత్వ రంగానికి ప్రాముఖ్యత ఉండే ఆర్థిక వ్యవస్థను బాంబే ప్లాన్ ప్రబోధించింది. ఆనాటి పెట్టుబడిదారీ వర్గం జాతీయవాద ఆకాంక్షలను ఒక మంచి మౌలికరంగ వ్యవస్థను అభి వృద్ధి చేసేవైపునకు మళ్లించాలనీ, అది దేశీయ ప్రైవేట్ పరిశ్రమకు పునాది వేస్తుందనీ భావించింది. మంచి జీవితాన్ని గడిపే హక్కు, సంపదనూ, ఉత్పత్తి సాధనా లనూ కొంతమంది చేతుల్లో కేంద్రీకరించని ఆర్థిక వ్యవస్థ, స్త్రీపురుషు లకు సమానవేతనం, ఆర్థిక అవసరాల పేరిట కార్మికుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టకపోవడం, వృద్ధాప్యం, వ్యాధులు, అంగవైకల్యం వంటి అంశాలలో సాయం చేయడం... ఇలా రాజ్యాంగ ప్రవేశికలో ప్రజల మనోభావాలన్నింటికీ రూపమివ్వడమే కాకుండా సోషలిస్టు అనే పదం కూడా దానికి జోడించారు. కానీ ఆచరణలో వేతనాలు, జీవన ప్రమాణాలు, యూనియన్ పెట్టుకునే హక్కు, అస్థిరత నుంచి పరి రక్షించే హక్కు వంటివి గగన కుసుమాల్లాగే మారాయి. 1920లో ఏఐటీయూసీ ఏర్పడిన నాటి నుంచీ గత వందేళ్లుగా అనేక పోరాటాలు, అనంత త్యాగాల నుంచే కార్మికులు తమ హక్కు లను కాపాడుకుంటూ వచ్చారు. భద్రతా ప్రమాణాలను నెలకొల్పి, పరిమిత పనిగంటలను కల్పించిన ఫ్యాక్ట రీస్ యాక్ట్, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, కనీస వేతనాల చట్టం వంటివి స్వాతంత్య్రం సిద్ధించిన ప్రారంభ సంవత్స రాల్లోనే ఏర్పడుతూ వచ్చాయి. 1950లలో విభిన్న కార్మిక బృందాలు తమ సమ్మె శక్తి ద్వారానే డాక్ వర్క్స్ చట్టం, గనుల చట్టం, ప్లాంటేషన్ యాక్ట్, సినీ వర్కర్స్ యాక్ట్, వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ వంటివి సాధించుకున్నారు. పెరుగుతున్న ప్రైవేట్ రంగం, రాజకీయాల్లో ప్రైవేట్ పరిశ్రమ దారుల బలం పెరుగుతూ వచ్చిన క్రమంలో రకరకాల పరిణామాలు సంభవించాయి. ప్రభుత్వ రంగం అనేది సామాజిక, ఆర్థిక సము ద్ధరణ లక్ష్యంతో పనిచేయడం కాకుండా లాభాలను సృష్టించే రంగంగా మారిపోసాగింది. శాశ్వత కార్మికులు సోమరులుగా ఉంటు న్నారనీ, కూర్చుండబెట్టి మరీ జీతాలు ఇస్తున్నారనే భావాలు కొత్తగా ఏర్పడే క్రమంలో లేబర్ వెసులుబాటు పేరుతో ఉద్యోగాల్లోకి తీసు కోవడం, ఉద్యోగాల్లోంచి తొలగించడం వంటి పద్ధతులు పుట్టు కొచ్చాయి. వెనువెంటనే మానవశక్తిని తగ్గిస్తూ, యాంత్రికీకరణను పెంచే ధోరణులు ప్రారంభమయ్యాయి. మొదట్లో పర్మనెంట్ వర్కర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. వారి స్థానంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరగసాగింది. 1950ల చివరలో భిలాయి స్టీల్ ప్లాంటులో 96 వేలమంది పర్మనెంట్ కార్మికులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య పదివేలకు పడిపోయింది. వారి స్థానంలో 40 వేలమంది కాంట్రాక్టు కార్మికులు వచ్చి చేరారు. వీరికి పర్మనెంట్ కార్మికుల జీతాల్లో మూడో వంతు కూడా దక్కడం లేదు. 1970లో వచ్చిన కాంట్రాక్ట్ లేబర్ (క్రమబద్ధీకరణ మరియు రద్దు) చట్టం పారిశ్రామిక రంగంలోని కార్మి కులకు అనుకూలంగా ఉన్న చిట్టచివరి చట్టాల్లో ఒకటి. కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థను తొలగించడం సాధ్యం కాకున్నా కాంట్రాక్ట్ కార్మికుల పని పరిస్థితులను మెరుగుపర్చి వారి వేతనాలకు, నిత్యాసరాలకు హామీ ఇచ్చేందుకు ఈ చట్టం వీలు కల్పించింది. కీలకమైన ఉత్పత్తి రంగంలో నిపుణ శ్రమలు, కఠిన శ్రమలు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా నామమాత్రపు కూలీ మాత్రమే దక్కుతోంది. 1974లో చారిత్రాత్మక రైల్వే సమ్మెలో 17 లక్షలమంది పాల్గొనగా 20 రోజులపాటు భారతదేశం స్తంభించిపోయింది. ఎమ ర్జెన్సీ విధింపునకు, నూతన పాలనకు కూడా ఇదొక కారణమని చెబుతుంటారు. ఈ సమ్మె తర్వాతే రైల్వే కార్మికుల్లో కాంట్రాక్టీరణ శర వేగంతో సాగింది. ఈరోజు లోకో పైలట్లు, ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామి నర్లు వంటి వివిధ విభాగాల కార్మికులు రైల్వే నియమాకం చేసినవారు కాదు. కేటరింగ్ స్టాఫ్, క్లీనింగ్ స్టాఫ్, గ్యాంగ్మెన్లు కూడా కాంట్రాక్టు కార్మికులుగా మారిపోయారు. ముంబైలో 1982లో 65 మిల్లులలోని 2.5 లక్షలమంది మిల్లు కార్మికులు తలపెట్టిన గొప్ప సమ్మె విషాదకరగా మిల్లులు మూసి వేతకు, భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు దారితీసింది. అప్పట్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు తమకు రావలసిన బకాయిల కోసం నేటికీ దీనంగా ఎదురుచూస్తున్నారు. 2011–12లో గుర్గావ్లో మారుతి సుజుకిలో జరిగిన సాహసోపేతమైన సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణిచేశారు. ఆ ఫ్యాక్టరీకి చెందిన మేనేజర్ హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలో కొంతమంది కార్మిక నేతలు నేటికీ జైల్లో ఉంటున్నారు. ఉద్యోగాల వాటా ప్రకారం చూస్తే దేశ అసంఘటిత రంగంలో 83 శాతం మంది ఉండగా 17 శాతం మాత్రమే సంఘటిత రంగంలో ఉంటున్నారు. కానీ ఎంప్లాయ్మెంట్ స్వభావం బట్టి చూస్తే, మన దేశంలో 92.4 శాతం మంది కార్మికులు అనియత రంగంలోనే ఉన్నా రని బోధపడుతుంది. వీరంతా రాతపూర్వక కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో లేరు కాబట్టి లేబర్ చట్టాలు వీరికి వర్తించవు. భారత్లో నిజవేతన పెరుగుదల ఆసియాలోనే అతి తక్కువ అని అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది. 2015–2018 వరకు భారత్లో నిజ వేతన పెరుగు దల 2.8 నుంచి 2.5 శాతానికి దిగజారుతూ వస్తోందని తెలిపింది. పాకిస్తాన్, శ్రీలంక, చైనా, నేపాల్ వంటి పొరుగు దేశాలతో పోలిస్తే కూడా భారత్లో నిజవేతన పెరుగుదల చాలా తక్కువగా నమోదైంది. ఈరోజు, కార్మికుల్లో చాలా తక్కువమంది యూనియన్లలో ఉంటున్నారు. అసంఘటిత రంగంలోని వివిధ సెక్షన్ల కార్మికులు ప్రత్యే కించి నిర్మాణ కార్మికులు, సఫాయి కర్మచారీలు, హాకర్లు వంటి వారు తమను కాపాడే చట్టాల కోసం పోరాడుతున్నారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశంలోని 46 లేబర్ చట్టాలను తొలగించి వాటిస్థానంలో 4 చట్టాలను తీసుకురావాలనుకుంటోంది. కానీ బీజేపికి చెందిన భార తీయ మజ్దూర్ సంఘంతో సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు ఈ మార్పుల పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ కార్మిక సంఘాల కనీసపాటి డిమాండ్ల పట్ల కూడా కేంద్రం ప్రదర్శిస్తున్న మౌనం మరింత భయంకరంగా కనిపిస్తోంది. వ్యాసకర్త న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త -
28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు మద్దతు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని ట్రేడ్ యూనియన్లు ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్కేవీ కార్మిక విభాగం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. సార్వత్రిక సమ్మె విజయవంతానికి అన్ని ట్రేడ్ యూనియన్లతో ఆదివారం మంత్రుల నివాసంలోని క్లబ్హౌజ్లో తెలంగాణ రాష్ట్ర సన్నాహక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ పీఎస్యూల ప్రైవేటీకరణ, కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక చర్యలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. లాభాలతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కుట్ర పూరితంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయించిందన్నారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, టీఆర్ఎస్కేవీ, ఐఎఫ్టీయూ, రైల్వే, బ్యాంక్, బీడీఎల్, హెచ్ఏఎల్, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ తదితర సంస్థల కార్మిక సంఘాల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్, పీఎస్యూ కార్మిక సంఘాల రాష్ట్ర కన్వీనర్ వి.దానకర్ణాచారి, రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఎల్.రూప్ సింగ్ పాల్గొన్నారు. -
హృదయాలను కదిలిస్తున్న జ్యూట్ మిల్లు కార్మికుల ఆవేదన
-
కేంద్రానికి ఈమెయిల్ ద్వారా మెసేజ్లు
-
AP: చర్చలకు సరే
సాక్షి, అమరావతి: పీఆర్సీ జీవోలను రద్దు చేస్తే కానీ మంత్రుల కమిటీతో చర్చలకు హాజరు కాబోమని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాలు పట్టువిడుపు ప్రదర్శించాయి. మంత్రుల కమిటీ నుంచి తమకు లిఖిత పూర్వకంగా ఆహ్వానం వస్తే చర్చలకు వెళతామని సోమవారం పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆ తరువాత కొద్దిసేపటికే మంత్రుల కమిటీ నుంచి వారికి లిఖితపూర్వక ఆహ్వానం అందడంతో ప్రతిష్టంభనకు తాత్కాలికంగా తెరపడింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో చర్చలకు రావాలని మంత్రుల కమిటీ తరఫున జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఆహ్వానించారు. పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, కె. వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కేవీ శివారెడ్డి, సీహెచ్ కృష్ణమూర్తి తదితర 20 మంది పేర్లను లేఖలో పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాకు ఆర్థిక శాఖ కాన్ఫరెన్స్ హాలులో సమావేశానికి రావాలని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి పంపిన ఆహ్వానంలో సూచించారు. చర్చలకు సిద్ధమే: స్టీరింగ్ కమిటీ మంత్రుల కమిటీతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ప్రస్తుత పరిణామాలు, కార్యాచరణ, ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాత జీతాలే ఇవ్వాలని కోరతాం: బొప్పరాజు ఈనెల 3వ తేదీన చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి అల్లూరి సీతారామరాజు వంతెన మీదుగా భాను నగర్ చేరుకుని సభ నిర్వహిస్తామన్నారు. 7వతేదీ నుంచి సమ్మె తలపెట్టిన నేపథ్యంలో న్యాయపరమైన అంశాలను ఎదుర్కొనేందుకు ఇద్దరు హైకోర్టు సీనియర్ న్యాయవాదులు వైవీ రవి ప్రసాద్, సత్యప్రసాద్లను నియమించుకున్నామని తెలిపారు. కొత్త జీవోలను నిలిపివేసి పాత జీతాలే చెల్లించాలని చర్చల్లో కోరతామన్నారు. మేం రాలేదనడం సరికాదు: బండి ఉద్యోగ సంఘాలు చర్చలకు రావడం లేదని మంత్రుల కమిటీ పేర్కొనడం సరికాదని ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పారు. స్టీరింగ్ కమిటీలోని 9 మంది సభ్యులంతా చర్చలకు సంబంధించిన అంశంపై సంతకాలు చేసి పంపినట్లు తెలిపారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదో అర్ధం కావడం లేదన్నారు. రివర్స్ పీఆర్సీతో గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. భయపెట్టేలా మెమోలు: సూర్యనారాయణ తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ కోరారు. జీతాల చెల్లింపుపై అధికారులు భయపెట్టే విధంగా ఖజానా శాఖ ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఆటవిక చర్యని విమర్శించారు. ఆర్ధికశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. బెదిరింపులకు లొంగేది లేదని, అవసరమైతే న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఆర్థిక శాఖలోని ఐఏఎస్ అధికారులపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రింటెడ్ చార్జీ మెమోలకు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనల ప్రకారం సీసీఏ రూల్ 20 ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాలన్నారు. సర్వీస్ రిజిస్టర్ లేకుండా పే ఫిక్సేషన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. చలో విజయవాడ సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని స్టీరింగ్ కమిటీ సభ్యులు పరిశీలించారు. -
త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ!
సాక్షి, అమరావతి: వేతన సవరణ సంఘం సిఫారసులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ తన సిఫారసులను ముఖ్యమంత్రికి అందజేసిన నేపథ్యంలో అందులోని అంశాలపై చర్చోపచర్చలు జోరందుకున్నాయి. అంతిమంగా త్వరలో ఉద్యోగ సంఘాల∙నేతలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. దీనికి ముందస్తుగా మంగళవారం పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. విడివిడిగా కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకున్న సజ్జల... ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా ఉన్నారని, కరోనా రాకుంటే ఈ పాటికే పీఆర్సీ ప్రకటించేవారని చెప్పారు. కోవిడ్ కారణంగా ప్రభుత్వం ఏ రకంగా దెబ్బతిన్నదీ వారికి వివరించారు. గడిచిన రెండు సంవత్సరాల్లో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో రూ.22వేల కోట్లు కోవిడ్ కారణంగా తగ్గిపోయింది. దీనికితోడు కోవిడ్ నివారణ, నియంత్రణ కోసం మరో రూ.8వేల కోట్లు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. మొత్తంగా ఈ రెండేళ్లలో కోవిడ్ కారణంగా రూ.30వేల కోట్ల భారం ప్రభుత్వంపై అదనంగా పడింది. వీటికితోడు ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే... ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటించింది. ఐఆర్ అమలు చేయటం వల్ల 2018–19లో రూ.52,512 కోట్లుగా ఉన్న జీతాలు, పెన్షన్ల వ్యయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.67,340 కోట్లకు చేరిపోయింది. ఇక శాతం పరంగా చూస్తే రాష్ట్ర సొంత ఆదాయంలో 2018–19లో 84 శాతంగా ఉన్న జీతాలు, పెన్షన్ల వ్యయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 111 శాతానికి చేరింది. ఈ పరిస్థితిల్లో ఫిట్మెంట్ను గనక మరింత పెంచితే దాన్ని భరించే పరిస్థితి ఉండదని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని సజ్జల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ మొత్తం వ్యయంలో చూసుకున్నా 2018–19లో జీతాలు, పెన్షన్ల కోసం పెడుతున్నది 32 శాతంగా ఉండగా 2020–21లో ఇది ఏకంగా 36 శాతానికి చేరిపోయింది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఈ వ్యయం మన రాష్టంలోనే అత్యధికంగా ఉంది. ఈ పరిస్థితులన్నిటి దృష్ట్యా ప్రభుత్వానికి సహకరించాలని ఉద్యోగ సంఘాలను ఆయన కోరినట్లు సమాచారం. ఐఆర్ ఇవ్వడం వల్ల ఖజానాపై రూ.15,839.99 కోట్ల భారం పడగా... అంగన్వాడీలు, ఆశావర్కర్లు, శానిటరీ వర్కర్లు, ఎన్ఎన్ఎంలు, హోంగార్డులు.. ఇలా పలువురు ఉద్యోగులకు జీతాలు పెంచటాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అయితే కార్యదర్శుల కమిటీ నివేదికలోని ప్రధాన అంశమైన 14.29 ఫిట్మెంట్ను అంగీకరించేది లేదని దాదాపు అన్ని సంఘాల నేతలూ నొక్కి చెప్పారు. దీనిపై తాము ముఖ్యమంత్రిని కలిసినపుడు చెబుతామని, ఆయన సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ చర్చల్లో ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ నేతృత్వంలో పలు సంఘాలు పాల్గొన్నాయి. అనంతరం రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించిన అంశాలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అసంతృప్తితో మెజారిటీ ఉద్యోగులు అధికారుల కమిటీ సిఫార్సులేవీ ఉద్యోగులు ఆశించిన రీతిలో లేవని సజ్జలకు చెప్పాం. మెజారిటీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని విన్నవించాం. 34 శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని కోరాం. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉద్యోగులకు సీఎం మంచి చేస్తారని నమ్ముతున్నాం ఉద్యోగులకు సీఎం జగన్ మంచి చేస్తారనే నమ్మకంతో ఉన్నాం. ఉద్యోగులకు 55 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి. హామీలు అమలయ్యే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది. – బండి శ్రీనివాసరావు, ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు, ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ 55 శాతం ఫిట్మెంట్ ఇస్తేనే అంగీకరిస్తాం సీఎస్ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నామని సజ్జలకు తెలియజేశాం. 14.29 శాతం ఫిట్మెంట్ను రెండు జేఏసీలూ వ్యతిరేకించాయి. ఫిట్మెంట్, మానిటరీ బెనిఫిట్ అమలు, లబ్ధిపై తేడాలున్నాయి. సీఎం జగన్తో చర్చల్లో మేము దీనిపై స్పష్టత తీసుకుంటాం. 55 శాతం ఫిట్మెంట్ ఇస్తేనే అంగీకరిస్తాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, అమరావతి జేఏసీ చైర్మన్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫిట్మెంట్, మానిటరింగ్ బెనిఫిట్స్ ఇవ్వాలి 2018 జూలై నుంచి ఫిట్మెంట్, మానిటరింగ్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరాం. సెంట్రల్ పే కమిషన్ ప్రకారం.. ఫిట్మెంట్ అంగీకారం కాదని తెలిపాం. – సూర్యనారాయణ, అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం హర్షణీయం. – మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్, ఏపీఎంఎస్ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పి.మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శులు టీవీ మార్కండేయ హనుమంతరావు సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ హర్షణీయం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సైతం కొత్త పీఆర్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించడం హర్షణీయం. – గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.అంజన్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు విపర్తి నిఖిల్ కృష్ణ, సుజత్ భార్గవ్ కుమార్ -
సింగరేణిలో సమ్మె సైరన్
శ్రీరాంపూర్ (మంచిర్యాల): సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సుదీర్ఘ విరామం తర్వాత సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి సమ్మెకు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేసి ప్రైవేటుకు అప్పగించేం దుకు చేస్తున్న ప్రయత్నాలను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం చర్యలను నిరసిస్తూ డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్లో 5 జా తీయ సంఘాలతోపాటు సింగరేణిలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు జేఏసీగా ఏర్పడి ఈ నిర్ణయం తీసుకున్నారు. టీబీజీకెస్ నేతలు ఇప్పటికే కొద్దిరోజుల కిందట సమ్మెనోటీసు ఇచ్చారు. జేఏసీ కూడా సింగరేణి యాజమా న్యానికి మంగళవారం మరో నోటీసు ఇవ్వనున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామస్వామి తెలిపారు. కార్మిక నేతలు మొత్తం 9 డిమాండ్లను నోటీసులో పేర్కొన్నారు. -
స్టీల్ప్లాంట్ వేతన చర్చల్లో ప్రతిష్టంభన
ఉక్కు నగరం (విశాఖ): స్టీల్ప్లాంట్ కార్మికుల వేతన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆరు రోజులుగా జరుగుతున్న చర్చల్లో కార్మిక సంఘాల డిమాండ్లపై యాజమాన్యం మొండి వైఖరి అవలంబించడంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. చర్చల్లో కార్మిక సంఘాల్లో విభేదాలు వచ్చాయని, వాటిని యాజమాన్యం ఉపయోగించుకుని డిమాండ్లు నెరవేర్చడంలో అలసత్వం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016 డిసెంబర్ 31తో ఉక్కు కార్మికులకు గత వేతన ఒప్పందం గడువు ముగిసింది. 2017 జనవరి 1 నుంచి జరగాల్సిన వేతన సవరణ నాలుగున్నరేళ్లు కావస్తున్నా జరగకపోవడంతో కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. కార్మిక సంఘాలు తొలుత ఈ ఏడాది మే 6న సమ్మె చేయాలని సంకల్పించగా సెయిల్ చైర్మన్ వేతన సవరణకు హామీ ఇవ్వడంతో దాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత జరిగిన సమావేశాల్లో కూడా యాజమాన్యం కార్మిక సంఘాల డిమాండ్లకు పొంతన లేని ప్రతిపాదనలు చేసింది. దీంతో ఆగ్రహించిన కార్మిక సంఘాలు ఈ నెల 29న సమ్మె చేస్తామని యాజమాన్యానికి నోటీసిచ్చాయి. సమ్మె నివారణా చర్యల్లో భాగంగా నేషనల్ జాయింట్ కమిటీ ఫర్ స్టీల్ (ఎన్జేసీఎస్) ఆధ్వర్యంలో ఆరు రోజులుగా వేతన చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో కార్మిక సంఘాలు 15% ఎంజీబీ డిమాండ్ చేయగా యాజమాన్యం 13% ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ప్రధానంగా పెర్క్స్ అంశంపై ఇరువర్గాల మధ్య పీటముడి బిగిసింది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల వలే రివైజ్డ్ బేసిక్పై 35% పెర్క్స్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేయగా యాజమాన్యం 15% ఇస్తామని ప్రతిపాదించింది. 15% అంగీకరిస్తే జూనియర్ కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లనుందని కార్మిక సంఘాలు చెప్పినప్పటికీ యాజమాన్యం వైఖరిలో మార్పు రాలేదు. -
సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే..
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం భారత్బంద్లో భాగంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్, రైతు సంఘాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ మీదుగా వైఎంసీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ఏకపక్ష నిర్ణయాలకు కాలం చెల్లిందని, ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలని అన్నారు. రైతులపై నిర్బంధాన్ని ఆపటంతోపాటు డాక్టర్ స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుచట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రైతే రాజు అని అంటున్న సీఎం కేసిఆర్ వారు పండించిన పంటలను ఎందుకు కొనడంలేదని ప్రశ్నించారు. చర్చల పేరుతో రైతు సంఘాల నాయకులను కేంద్రం పిలిచి నాటకాలు ఆడుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల కార్యకర్తలు, నాయకులు ప్లకార్డులను ప్రదర్శించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఐ నేత నారాయణ, రైతు సంఘాల నాయకులు టి.సాగర్, పశ్య పద్మ, కెచ్చల రంగయ్య, అచ్చుత రామారావు, ఉపేందర్రెడ్డి, జక్కుల వెంకటయ్య, కన్నెగంటి రవి, బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు, న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, సాదినేని వెంకటేశ్వర్రావు, గాదగోని రవి, ఎస్.ఎల్.పద్మ, జి.అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఉక్కు పోరాట కమిటీ 5కె రన్
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఉద్యమం నానాటికి బలపడుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలంటూ విశాఖలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. ఇప్పటికే కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై స్టీల్ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పోరాట కమిటీ సారథ్యంలో చేపడుతున్న రిలే దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. శనివారం జరిగిన దీక్షల్లో ఉక్కు ఎల్ఎంఎంఎం, డబ్ల్యూఆర్ఎం అర్ ఎస్ అండ్ ఆర్ ఎస్ విభాగాల కార్మీకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉక్కు పోరాటానికి మద్దతు తెలిపిన హీరో చిరంజీవికి కార్మిక సంఘాలు, పోరాట కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ నెల 25 నుంచి సమ్మెకు వెళ్లే ముందు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగానే కూర్మన్నపాలెం కూడలి నుంచి గాజువాక వరకు ఆదివారం 7 గంటలకు 5కె రన్ చేపట్టనున్నారు. అలాగే 15వ తేదీన పరిపాలన భవనం వద్ద ధర్నా, 20న కేంద్ర కారి్మక సంఘాల సారధ్యంలో ఢిల్లీలో అఖిలపక్షాల నాయకులను కలిసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు మంత్రి రాజశేఖర్ తెలిపారు. ఉక్కు అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు తెలుగు తల్లి విగ్రహం కూడలి నుంచి కూర్మన్నపాలెం ఆర్చ్ వరకు సైలెంట్ మార్చ్ నిర్వహించనున్నట్లు సీ కోర్ కమిటీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ప్రకటించారు. అదే విధంగా ఉక్కునగరం క్వార్టర్లలో రాత్రి 7 గంటల నుంచి 7.15 వరకు విద్యుత్ దీపాల్ని ఆపి.. నిరసన తెలపాలని నిర్ణయించారు. అదేవిధంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో పెదగంట్యాడ జంక్షన్లో శనివారం పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రాణాలైనా అరి్పస్తాం.. విశాఖ ఉక్కును పరిరక్షిస్తామంటూ నినాదాలు చేశారు. -
కేంద్ర బడ్జెట్పై కార్మిక సంఘాల కన్నెర్ర
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఇక కార్మిక సంఘాలు పోరాట బాట పట్టనున్నారు. ప్రైవేటీకరణతో పాటు బడ్జెట్లో పొందుపరిచిన ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం దేశవ్యాప్త నిరసనలకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కార్మిక చట్టాలను రద్దు చేయడంతో పాటు పేద కార్మికులకు ఆహారం, ఆదాయం కల్పించాలనే డిమాండ్పై 10 కార్మిక సంఘాలు ఆందోళనలు చేయనున్నాయి. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ రేపు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నాయి. ఈ మేరకు మంగళవారం కార్మిక సంఘాల సంయుక్త ఫోరం ఓ ప్రకటన విడుదల చేసింది. నిరసనల్లో భాగంగా బుధవారం భారీ ప్రదర్శనలు, కార్యస్ధానాల్లో సమావేశాలు నిర్వహించి లేబర్ కోడ్స్ను ప్రతులను దగ్ధం చేస్తామని ఫోరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జాతి వ్యతిరేక విధ్వంసకర విధానాలకు నిరసనగా భవిష్యత్లో తమ పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ తిరోగమన దిశగా ఉండటంతో పాటు వాస్తవ పరిస్థితికి దూరంగా ఉందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. వెంటనే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్పై ఫిబ్రవరి 3వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. -
నేడు భారత్ బంద్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు భారత్ బంద్ జరగనుంది. ఈ దేశవ్యాప్త నిరసనకు ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఆర్ఎస్ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆయా పార్టీల కార్యకర్తలు బంద్లో చురుగ్గా పాలుపంచుకోనున్నారు. బంద్లో పాల్గొని, రైతుల న్యాయబద్ధ డిమాండ్లకు మద్దతివ్వాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్ను పాటించాలని ఎవరినీ ఒత్తిడి చేయవద్దని సూచించాయి. శాంతియుతంగా నిరసన తెలపాలని, అంబులెన్స్లు, ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. మరోవైపు, రైతులు ప్రకటించిన భారత్ బంద్నకు నైతిక మద్దతు తెలుపుతున్నామని పది కార్మిక సంఘాల ఐక్య కమిటీ సోమవారం ప్రకటించింది. బంద్కు మద్దతు తెలుపుతూనే, కార్మికులు విధుల్లో పాల్గొంటారని పేర్కొంది. డ్యూటీలో ఉండగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తారని, విధుల్లోకి వెళ్లేముందు కానీ విధులు ముగిసిన తరువాత కానీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపింది. కార్మికులు స్ట్రైక్ చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని హిందూ మజ్దూర్ సభ ప్రధాన కార్యదర్శి హర్భజన్ సింగ్ వివరించారు. కాగా, బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. ఢిల్లీ–మీరట్ ఎక్స్ప్రెస్ హైవేపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు కోవిడ్–19 ముప్పు పొంచి ఉన్న కారణంగా, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని, శాంతిసామరస్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీలోని పలు సరిహద్దుల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఢిల్లీ సరిహద్దుల్లో గత 12 రోజులుగా నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర మంత్రులు ఇప్పటివరకు ఐదు విడతలుగా జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిసిన విషయం తెలిసిందే. మరో విడత చర్చలు బుధవారం జరగనున్నాయి. వేలాదిగా రైతులు నిరసన తెలుపుతున్న సింఘు సరిహద్దును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సందర్శించారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. ‘తాత్కాలిక జైళ్లుగా ఢిల్లీలోని స్టేడియంలను వాడుకునేందుకు అనుమతించాలని మాపై భారీగా ఒత్తిడి వచ్చింది. మేం వారి ఒత్తిడికి తలొగ్గలేదు. అది ఉద్యమానికి సహకరించింది’ అని కేజ్రీవాల్ తెలిపారు. రైతులకు కష్టం కలగకుండా తమ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ‘ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక సేవకుడిలా మీ వద్దకు వచ్చాను’ అని రైతులతో పేర్కొన్నారు. ఆప్ నేతలు, కార్యకర్తలు రైతులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మద్దతివ్వండి బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. బంద్లో పాల్గొనేలా ఎవరినీ ఒత్తిడి చేయవద్దని తమ మద్దతుదారులను కోరాయి. శాంతియుతంగా బంద్ జరపాలని, హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని భారతీయ కిసాన్ ఏక్తా సంఘటన్ అధ్యక్షుడు జగ్జిత్ సింగ్ దాలేవాలా కోరారు. ‘మేం పిలుపునిచ్చిన బంద్ రాజకీయ పార్టీలిచ్చే బంద్ లాంటిది కాదు. ఇది ఒక సైద్ధాంతిక లక్ష్యం కోసం మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు.. నాలుగు గంటల పాటు జరిపే ప్రతీకాత్మక బంద్. ఈ నిరసనతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేది మా ప్రధాన ఉద్దేశం. అందుకే ఆ నాలుగు గంటల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం’ అని రైతు సంఘం నేత రాకేశ్ తికాయిత్ వివరించారు. ఆ నాలుగు గంటల పాటు దుకాణాలను మూసేయాలని వ్యాపారస్తులను కోరుతున్నామన్నారు. ఆ నాలుగు గంటల పాటు టోల్ ప్లాజాలను, కీలక రహదారులను నిర్బంధిస్తామని వెల్లడించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళన కొనసాగు తుందని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ స్పష్టం చేశారు. తాజా చట్టాలు రైతులకు లబ్ధి చేకూరుస్తాయని ఇన్నాళ్లు చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి సవరణలు చేసేందుకు సిద్ధమని ఎందుకు చెప్తోందని మరో రైతు నేత దర్శన్ పాల్ ప్రశ్నించారు. బంద్కు మద్దతుగా మంగళవారం అన్ని రవాణా కార్యకలాపాలను నిలిపేస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) ప్రకటించింది. ఏఐఎంటీసీ దేశవ్యాప్తంగా దాదాపు 95 లక్షల మంది ట్రక్కు యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో, దేశవ్యాప్తంగా నిత్యావసరాల రవాణాపై ప్రతికూల ప్రభావం పడనుంది. అతిపెద్ద రైల్వే కార్మిక విభాగాలైన ‘ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్’, ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్’ కూడా బంద్కు మద్దతు ప్రకటించాయి. బంద్కు మద్దతుగా రైల్వే కార్మికులు నిరసన ప్రదర్శనలు చేస్తారని తెలిపాయి. కాగా, తమ కార్యకలాపాలు మంగళవారం కూడా కొనసాగుతాయని వాణిజ్యవేత్తల సంఘం సీఏఐటీ, ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేశాయి. బంద్లో నేరుగా పాల్గొనబోవటం లేదని బ్యాంక్ యూనియన్లు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. విరామ సమయాల్లో బంద్కు మద్దతుగా బ్యాంక్ బ్రాంచ్ల ముందు ప్లకార్డులను ప్రదర్శిస్తారని తెలిపింది. ప్రతిపక్షాల ద్వంద్వ నీతి రైతుల ఉద్యమానికి మద్దతివ్వడం విపక్షాల ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ విమర్శించింది. సాగు చట్టాల్లోని నిబంధనలను కాంగ్రెస్, ఎన్సీపీ తదితర విపక్షాలు గతంలో మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాన్ని రద్దు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఉన్న అన్ని ఆంక్షలను తొలగిస్తామని 2019 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పేందుకు కుట్ర చేస్తున్నాయని ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతూ.. ఉనికి కోసం రైతు ఉద్యమాన్ని వాడుకుంటున్నాయని, రైతుల్లోని కొన్ని వర్గాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు. 16 రాష్ట్రాలపై ప్రభావం బంద్ వల్ల 16 రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని సూచించింది. బంద్లో పాల్గొనే వామపక్ష అనుకూల అతివాదులు సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని జోనల్ మేనేజర్లకు సూచించారు. సైకిల్పై 300 కి.మీ. పంజాబ్, హరియాణాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు వెళ్లి నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ఇద్దరు యువకులు సైకిల్ మీద ఏకంగా 300 కిలోమీటర్లు ప్రయాణించారు. జోవన్ ప్రీత్ సింగ్ (24), గురిందర్ జీత్ (26)లు పంజాబ్లోని బర్నాలా నుంచి రెండు రోజుల క్రితం ప్రయాణమై సోమవారానికి ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు. ట్రాక్టర్లలో ప్రయాణించాలంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, అందుకే సైకిళ్లపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దారిపొడవునా అప్పటికే రైతులు ఉండటంతో తిండికేమీ లోటు లేదని, రాత్రి వేళ ట్రాక్టర్లలో పడుకున్నామని చెప్పారు. ఆ చట్టాలు మంచివే.. కొత్త సాగు చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి చెప్పారు. ఈ చట్టాలను సమర్ధిస్తున్న రైతుల బృందంతో తోమర్ సోమవారం సమావేశమయ్యారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, హరియాణాకు చెందిన రైతు కన్వల్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఈ బృందం తోమర్ను కలిసింది. ఈ బృందంలో భారతీయ కిసాన్ యూనియన్(అత్తార్) జాతీయ అధ్యక్షుడు అత్తార్ సింగ్ సంధూ కూడా ఉన్నారు. సాగు చట్టాలను రద్దు చేయవద్దని, అవసరమైతే కొన్ని సవరణలు చేయాలని ఈ బృందం మంత్రిని కోరింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని తమ ప్రభుత్వం ఎదుర్కోగలదని తోమర్ వ్యాఖ్యానించారు. రైతుల కోసం వైఫై.. ఢిల్లీ–హరియాణా సరిహద్దుల వద్ద ఉన్న రైతులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ఢిల్లీకి చెందిన ఓ ఎన్జీఓ ముందుకు వచ్చింది. ఢిల్లీ సరిహద్దు వద్ద ఓ రూటర్ ఏర్పాటు చేశామని, అలాగే హరియాణా సరిహద్దు వద్ద పోర్టబుల్ డివైజ్ల నుంచి వైఫై సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రైతులు తమ ఇంట్లో ఉన్నవారితో మాట్లాడుకుంటారని, రైతుల పిల్లలు ఆన్లైన్ క్లాసులకు హాజరువుతారని ఎన్జీవో సభ్యులు తెలిపారు. అర్జున, పద్మ అవార్డులను వెనక్కు ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్తున్న మాజీ క్రీడాకారులు రైతుల డిమాండ్లు ► ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. ► కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని వ్యవసాయ చట్టంలో చేర్చాలి. ► మండీల నుంచి కొనుగోళ్లను ప్రభుత్వమే చేపట్టాలి. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవసాయ కోర్టులు నెలకొల్పాలి. రైతుల అనుమానాలు ► సాగు రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ► ఒకే దేశం –ఒకే మార్కెట్ విధానంతో భవిష్యత్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అన్నదే లేకుండా పోతుంది. ► మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుంది. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాలను సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ పరిధిలోనే పరిష్కరించుకోవాల్సి రావడం. ► కాంట్రాక్ట్ ఫార్మింగ్తో భూములకు రక్షణ కరువవుతుంది. ► నిత్యావసర సరుకుల సవరణ చట్టంతో వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏమంటోంది? ► సాగు చట్టాలకు రైతు సంఘాలు కోరిన మేరకు సవరణలు చేపట్టేందుకు సిద్ధం. ► కనీస మద్దతు ధర విధానం యథా ప్రకారం కొనసాగుతుంది. దీనిపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. ► రాష్ట్రానికి చెందిన మండీలను ప్రభావితం చేయడం మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తాం. ► రైతులు అభ్యంతరం తెలుపుతున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ► కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాలను సూచనలు కోరుతున్నాం. పీటముడి ఎక్కడ? ► వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీసం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది. -
చర్చల్లో ప్రతిష్టంభన.. పట్టువీడని రైతులు
న్యూఢిల్లీ : ఆందోళన బాట పట్టిన రైతు సంఘాలతో కేంద్రం జరుపుతున్న చర్చలు మరోసారి ఎటూ తేలకుండానే ముగిశాయి. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో వ్యవసాయ చట్టాల రద్దుపైనే రైతు సంఘాల ప్రతినిధులు ప్రధానంగా పట్టుబట్టారు. అయితే, నిర్దుష్ట ప్రతిపాదనలు చేసేందుకు కేంద్రం 9వ తేదీ వరకు సమయం కోరింది. దీంతో 11 రోజులుగా దేశ రాజధాని కేంద్రంగా చేపట్టిన రైతు సంఘాల ఆందోళన మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధనకు 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్కు పలు ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రులు, 40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ఐదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. దాదాపు 4 గంటలపాటు జరిగిన చర్చలకు కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాయకత్వం వహించారు. చర్చల్లో రైల్వేలు, వాణిజ్యం, ఆహారం శాఖల మంత్రి పీయూష్ గోయల్, పంజాబ్కు చెందిన ఎంపీ, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ పాల్గొన్నారు. గత సమావేశాల్లో చర్చల సందర్భంగా హామీ ఇచ్చిన అంశాలపై కేంద్రం తీసుకున్న చర్యలను వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ వారికి వివరించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చర్చల ప్రారంభం సందర్భంగా పంజాబీలో మంత్రి సోమ్ ప్రకాశ్ వారికి తెలిపారు. ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు గట్టిగా పట్టుబడ్డారు. స్పష్టమైన హామీ లభించకుంటే బయటకు వెళ్లిపోతామంటూ తెగేసి చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందనీ, వారి సమస్యలను పరిష్కరిస్తామని దీంతో మంత్రులు వారికి సర్దిచెప్పారు. అయితే, సాగు చట్టాల రద్దు విషయం తేల్చాలంటూ రైతు ప్రతినిధులు గంటపాటు మౌనవ్రతం సాగించారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు, అంతర్గతంగా చర్చలు జరిపి నిర్దిష్ట ప్రతిపాదనలు తయారు చేసేందుకు ఈ నెల 9 వరకు సమయం కావాలని ప్రభుత్వ ప్రతినిధులు కోరారు. దీంతో చర్చలు ఎటూ తేలకుండానే వాయిదా పడ్డాయి. ఆహారం, టీ వెంట తెచ్చుకున్న రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సింఘూ వద్ద ఆందోళన సాగిస్తున్న ప్రాంతం నుంచి చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు ఆహారం, టీ తమతోపాటు తెచ్చుకున్నారు. గురువారం కూడా రైతులు ఆహారం, టీతోపాటు మంచినీరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. రైతు ప్రతినిధుల సూచనలు కోరాం: తోమర్ చర్చల అనంతరం మంత్రి తోమర్ మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాల నేతల నుంచి నిర్దిష్ట సూచనలను కోరాం. అయితే, చలి తీవ్రత దృష్ట్యా ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధులు, మహిళలు, పిల్లల్ని ఇళ్లకు పంపించాలని కోరాం’అని తెలిపారు. వివిధ పార్టీలు..సంఘాల మద్దతు 8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు కాంగ్రెస్తోపాటు ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్షాలు, డీఎంకే మద్దతు ప్రకటించాయి. బంద్కు 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక మద్దతుగా నిలిచింది. రైతులకు మద్దతుగా పంజాబ్కు చెందిన పలువురు మాజీ క్రీడాకారులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తమ పద్మశ్రీ, అర్జున అవార్డులను వాపసు చేసేందుకు ఢిల్లీకి బయలుదేరారు. రహదారులే గ్రామాలుగా... ఢిల్లీకి వెళ్లే కీలక రహదారులపై రైతులు నిరసలు తెలుపుతుండటంతో గడిచిన 10 రోజులుగా ఈ మార్గాల్లో ట్రాపిక్ జాంలు పెరిగిపోయాయి. దీంతో పోలీసులు కొన్ని మార్గాలను మూసివేసి, మరికొన్ని రోడ్లలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. దీర్ఘకాలం పోరుకు రైతులు సమాయత్తం అవుతుండటంతో కొన్ని రోడ్లు గ్రామాలుగా మారిపోయాయి. రైతులు రోడ్లపైనే ట్రాక్టర్లు నిలిపి, వాటిపై టెంట్లు వేసుకున్నారు. అక్కడే వంటావార్పూ చేపట్టారు. అవసరమైన సరుకులు, కాయగూరలు వంటివి అక్కడికి అందుతున్నాయి. సెల్ఫోన్లకు సోలార్ ప్యానళ్లతో చార్జింగ్ చేసుకుంటున్నారు. ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధుల కోసం కొందరు వైద్యులు వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేశారు. వృద్ధులు హుక్కా పీలుస్తూ కాలం గడుపుతున్నారు. చర్చలకు ముందు ప్రధానితో భేటీ రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలకు వెళ్లేముం దు మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్లు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రైతుల ముందుంచబోయే ప్రతిపాదనలపై వారంతా కలసి చర్చించినట్లు సమాచారం. రైతుల ఆందోళనలపై కేంద్ర మంత్రులతో ప్రధాని చర్చలు జరపడం ఇదే మొదటి సారి. రైతు ప్రతినిధుల మౌనవ్రతం చర్చల సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతు సంఘాల ప్రతినిధులంతా మౌనవ్రతం పాటించారు. ప్రధానమైన ఈ డిమాండ్ కేంద్రానికి సమ్మతమా కాదా స్పష్టం చేయాలని కోరుతూ ప్రతినిధులు అవును/ కాదు అని రాసి ఉన్న కాగితాలను వారు నోటికి అతికించుకున్నారని పంజాబ్ కిసాన్ యూనియన్ నేత రుల్ధు సింగ్ తెలిపారు. ప్రభుత్వం వారిని మాట్లాడించేందుకు మౌనంతోనే సమాధానం చెప్పారని మరో నేత కవితా కురుగంటి వెల్లడించారు. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు. సాగు చట్టాలకు ప్రభుత్వం పలు సవరణలు చేస్తామంటూ ముందుకు వచ్చిందనీ, తాము మాత్రం పూర్తిగా రద్దు చేయాలని కోరామని బీకేయూ ఏక్తా అధ్యక్షుడు జోగిందర్ సింగ్ ఉగ్రహన్ చెప్పారు. శనివారం సింఘూ వద్ద జరిగిన ధర్నాలో నినదిస్తున్న రైతుల పిల్లలు చర్చల విరామ సమయంలో వెంట తెచ్చుకున్న ఆహారం తింటున్న రైతు సంఘాల ప్రతినిధులు -
నవంబర్ 26 సార్వత్రిక సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు
సాక్షి, ముంబై: కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు నవంబర్ 26న జరగనున్న ఒక రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. ఈ సమ్మెలో తామూ పాల్గొంటామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకటించింది. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నిర్ణయించామని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన లోక్సభ సెషన్లో 'ఈజీ ఆఫ్ బిజినెస్' పేరిట మూడు కొత్త కార్మిక చట్టాలను ఆమోదించిందని, ప్రస్తుత 27 చట్టాలను తుంగలో తొక్కి పూర్తిగా కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ కొత్త చట్టాలను తీసుకొస్తోందని ఏఐబీఈఏ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. తద్వారా 75 శాతం మంది కార్మికులను చట్టపరిధిలోంచి తప్పించి వారికి రక్షణ లేకుండా కేంద్రం చేస్తోందని ఆరోపించింది. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల జాతీయ కార్మిక సదస్సు పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టాలని నిర్ణయించాయి. భారతీయ మజ్దూర్ సంఘ్ మినహా పది కేంద్ర కార్మిక సంఘాలు నవంబర్ 26 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
సింగరేణి ప్రైవేటీకరణ దుర్మార్గచర్య
సాక్షి, హైదరాబాద్: సింగరేణి, దాని పరిధిలోని 11 బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వివిధ రాజకీయ పార్టీల రౌండ్టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. కరోనా పరిస్థితుల ముసుగులో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ను తెరమీదకు తెచ్చారని, లాభాల బాట లో ఉన్న సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరించడం దుర్మార్గమైన చర్య అని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. సింగరేణి పరిరక్షణకు కార్మిక సంఘాలతో కలసి అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉద్యమించాలని, ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ అంశంపై గవర్నర్, సీఎం, సీఎస్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై స్పందించిన సీఎం కేసీఆర్, సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదని నేతలు ప్రశ్నించారు. బుధ, గురువారాల్లో కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న నిరసనలకు అఖిలపక్షం మద్దతు ప్రకటించింది. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్ ఎదుట నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించారు. మంగళవారం మఖ్దూం భవన్లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తే దేశ ఆర్థిక పరిస్థితి ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి పోతుందని, ప్రజాస్వామ్యాన్ని ప్రైవేట్ శక్తులు శాసించే పరిస్థితి వస్తే అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం బడాబాబుల చేతుల్లో బందీ అయ్యే పరిస్థితి వస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. సింగరేణి పరిరక్షణకు విశాల ఉద్యమాన్ని చేపట్టాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని చాడ ధ్వజమెత్తారు. సమావేశంలో ఎల్.రమణ (టీటీడీపీ), డీజీ నరసింహారావు (సీపీఎం), కె.గోవర్ధన్, రమాదేవి (న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు), వివిధ కార్మిక నేతలు తదితరులు పాల్గొన్నారు. -
టికెట్ తీసుకోరే..
సాక్షి, హైదరాబాద్: ‘బస్సులో టికెట్ తీసుకోకుంటే ఇక బాధ్యత ప్రయాణికుడిదే. ప్రయాణికులకు విధించే పెనాల్టీలు పెంచండి. టికెట్ తీసుకోనందుకు ప్రయాణికులనే పూర్తి బాధ్యులను చేయండి.’ఇదీ ఆర్టీసీ సమ్మె ముగిసిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశం. దీనికి సంబంధించి ఉత్తర్వులు రానప్పటికీ ఆర్టీసీ అధికారులు మాత్రం దాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ చర్యతో ప్రయాణికుల్లో భయం కలిగి టికెట్ తీసుకోని వారి సంఖ్య బాగా తగ్గాలి. కానీ పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో ఇటీవల క్రమం తప్పకుండా చెకింగ్స్ చేయిస్తుండటంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ సమస్య హైదరాబాద్లో మరీ ఎక్కువగా ఉంది. ఉదాహరణకు గతేడాది మార్చిలో ఉప్పల్ డిపో పరిధిలో టికెట్ లేని ప్రయాణికుల నుంచి వసూలు చేసిన పెనాల్టీ మొత్తం రూ. 450కాగా, మేలో రూ. వెయ్యిగా నమోదైంది. కానీ ఈ సంవత్సరం జనవరిలో అదే డిపో పరిధిలో టికెట్ లేని ప్రయాణికుల నుంచి పెనాల్టీగా వసూలైన మొత్తం రూ. 58 వేలుగా, ఫిబ్రవరిలో ఇప్పటివరకు ఆ మొత్తం రూ. 31 వేలుగా నమోదైంది. ఇక హైదరాబాద్ రీజియన్ పరిధిలో జనవరిలో ఆ మొత్తం రూ. 2.5 లక్షలుగా రికార్డయింది. ఫిబ్రవరి ప్రథమార్థంలో ఇప్పటివరకు రూ. 85 వేలుగా నమోదైంది. దీన్ని ఆర్టీసీ తీవ్రంగానే పరిగణిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్లో 10వ నంబర్ బస్సు తిరిగే మార్గంలో 24 డిపోలకు చెందిన 70 మంది సిబ్బంది ద్వారా ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేసింది. వందల మంది ప్రయాణికులు పట్టుబడ్డారు. కిం కర్తవ్యం?: గతంలో ఇలాంటి ప్రయాణికులు చెకింగ్లో పట్టుబడితే కండక్టర్లకు మెమోలు జారీ చేసేవారు. కొన్ని సందర్భాల్లో సస్పెండ్ కూడా చేసేవారు. ఇది వారి ఉద్యోగ భద్రతకు ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని కార్మిక సంఘాలు అప్పట్లో తీవ్రంగా పరిగణించాయి. ఇటీవలి సమ్మె నోటీసులో కూడా ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చాయి. అయితే చర్యలు తీసుకుంటారన్న భయంతో కండక్టర్లు టికెట్ల జారీలో అప్రమత్తంగా ఉండేవారు. కిక్కిరిసిన బస్సుల్లో తప్ప మిగతా బస్సుల్లో ప్రయాణికులు ఠంచన్గా టికెట్ తీసుకొనేవారు. తాజాగా టికెట్లెస్ ప్రయాణాలు పెరిగిపోవడంతో అధికారులు ఎలా వ్యవహరిస్తారన్నది చర్చకు దారితీస్తోంది. -
విద్యుత్ చార్జీలు పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయని, డిస్కంలను పరిరక్షించేందుకు రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచాల్సిందేనని విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.రాష్ట్రంలో భారీగా పెరిగిన డిమాండ్కు తగ్గట్టు విద్యు త్ సరఫరా చేసేందుకు డిస్కంలు భారీగా వ్యయం చేస్తున్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు చేయనున్న ప్రతిపాదనలను ఆమోదించాలని రాష్ట్ర విద్యుత్ ని యంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. డిస్కంల నష్టాలను పూడ్చడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన మేరకు విద్యుత్ రాయితీలు విడుదల చేయించాలని కోరాయి. గత నెల 29న ఈఆర్సీ నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ సలహా సంఘం సమావేశంలో ఉద్యోగ, కార్మిక సంఘాల నేత లు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని చార్జీల పెంపు తప్పనిసరని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో చర్చించిన విషయాల(మీటింగ్ మినిట్స్)ను ఈఆర్సీ బుధవారం బహిర్గతం చేసింది. డిస్కంల ప్రయోజనాల పరిరక్షణకు విద్యుత్ చార్జీల పెంపు తప్పనిసరి అని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ అధ్యక్షుడు జి.సాయిబాబు సమావేశంలో డిమాండ్ చేశారు. ఆర్థిక నష్టాల్లో ఉన్నామని డిస్కంల యాజమాన్యాలు ఉద్యోగ సంఘాలతో జరిపే సమావేశాల్లో పేర్కొంటున్నా యని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షుడు కె.ప్రకాశ్ తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచితే డిస్కంలపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూని యన్ (327) అధ్యక్షుడు ఈ.శ్రీధర్ పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించేందుకూ డి స్కంల వద్ద డబ్బులుండడం లేదని, వీటి కోసం కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నాయని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఎంఏ వజీర్ ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని కేటగిరీల వినియోగదారులపై విద్యుత్ చార్జీలు పెంచాలని కోరారు. -
బెంగాల్లో బంద్ హింసాత్మకం
కోల్కతా: ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు బుధవారం జరిగిన భారత్ బంద్ బెంగాల్లో పలు హింసాత్మక సంఘటనలకు దారితీసింది. ఆందోళనకారులు బలవంతంగా బంద్ చేయించారు. పలు ప్రాంతాల్లో బస్సులు, పోలీస్ వాహనాలు ధ్వంసంచేసి నిప్పుపెట్టారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రోడ్లు, రైల్వే లైన్లపై ఆందోళనలు జరగడంతో సాధారణ జనజీవనానికి ఇబ్బంది ఏర్పడింది. మాల్డాలోని సుజాపూర్, బుర్ద్వాన్ జిల్లాలో ఆందోళనకారులు ప్రధాన రహదారిని దిగ్బంధం చేయడం, టైర్లు కాల్చేయడంతోపాటు ప్రభుత్వ బస్సులతోపాటు ఒక పోలీస్ వ్యాన్సహా పలు ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆందోళనకారులు వారిపై నాటుబాంబులతో దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కొన్నిచోట్ల లాఠీచార్జ్కు పాల్పడగా, మరికొన్ని చోట్ల రబ్బరు బుల్లెట్లను కాల్చినట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బారాసాత్, నార్త్ 24 పరగణ ప్రాంతాల్లోని కొన్ని రైల్వే ట్రాక్లపై పోలీసులు కొన్ని నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఆందోళనకారులు ర్యాలీలు నిర్వహించడంతో సామాన్య జనం నానా ఇబ్బందులు పడ్డారు. -
నేడు దేశవ్యాప్త సమ్మె
-
నేడు భారత్ బంద్
న్యూఢిల్లీ: ప్రధాన కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ ప్రభావం కీలకమైన బ్యాంకింగ్, రవాణా తదితర రంగాలపై పడనుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, టీయూసీసీ, యూటీయూసీ తదితర వివిధ రంగాల కార్మిక సంఘాలు, సమాఖ్యలు జనవరి 8వ తేదీన బంద్ పాటించాలంటూ గత ఏడాది సెప్టెంబర్లో తీర్మానించాయి. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్న ప్రభుత్వ నిర్ణయాలు, దేశంలో పెరిగిన నిరుద్యోగిత, దిగజారిన ఆర్థిక పరిస్థితులకు నిరసనగా తాము కూడా సమ్మెలో భాగస్వాములవుతామంటూ రిజర్వు బ్యాంకు ఉద్యోగ సంఘాలైన ఏఐఆర్ బీఈఏ, ఏఐఆర్బీడబ్ల్యూఎఫ్ మంగళవారం తెలిపాయి. కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలు తదితర 12 డిమాండ్లతో కూడిన ఉమ్మడి ఎజెండాపై ఈ నెల 2వ తేదీన జరిపిన చర్చల్లో కార్మిక మంత్రి నుంచి ఎటువంటి హామీ రానందున సమ్మె పిలుపునకు కట్టుబడి ఉన్నట్లు పది కేంద్ర కార్మిక సంఘాలు మంగళవారం ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ సమ్మెలో దేశ వ్యాప్తంగా 25 కోట్లమందికి పైగా పాల్గొంటారని భావిస్తున్నట్లు తెలిపాయి. సమ్మె ప్రభావం బుధవారం బ్యాంకింగ్ సేవలపై పడనుందని ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టాక్ ఎక్సే్ఛంజీకి సమాచారం అందించాయి. బ్యాంకుల్లో నగదు, విత్డ్రా, చెక్ క్లియరింగ్ వంటి సేవలపై బంద్ ప్రభావం పడనుంది. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు యథా ప్రకారం కొనసాగనున్నాయి. అఖిల భారత స్థాయి బంద్ కారణంగా బ్యాంకింగ్, రవాణాతోపాటు ఇతర కీలక రంగాలపైనా ఈ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. పాల్గొంటే కఠిన చర్యలు: కేంద్రం బంద్లో కార్మికులు పాల్గొనకుండా చూడాలంటూ ప్రభుత్వం రంగ సంస్థలను కేంద్రం కోరింది. సమ్మె నేపథ్యంలో అత్యవసర ప్రణాళికలను అమలు చేసి కార్యకలాపాలు యథాతధంగా సాగేలా చూడాలని కోరింది. ఏ విధమైన బంద్, నిరసనల్లో పాల్గొనే ఉద్యోగులపై క్రమశిక్షణ ఉల్లంఘన కింద వేతనంలో కోత వంటి కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన మెమోరాండంలో స్పష్టం చేసింది. ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారిపైనా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. -
ఆ సమ్మెలో 25 కోట్ల మంది
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ కార్మిక సంఘాలతో పాటు, బ్యాంకింగ్ సంఘాలు, వివిధ రంగాల స్వతంత్ర సమాఖ్యలు, సంఘాలు ఆధ్వర్యంలో చేపట్టనున్న అఖిల భారత సమ్మెను భారీగా విజయవంతం చేయాలని పోరాట సంఘాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ "ప్రజా వ్యతిరేక" విధానాలకు నిరసనగా జనవరి 8 న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సుమారు 25 కోట్ల మందికి తక్కువ కాకుంటా పాల్గొంటారని పది కేంద్ర కార్మిక సంఘాలు సోమవారం తెలిపాయి. జనవరి 2, 2020న తమ డిమాండ్లపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కార్మిక మంత్రిత్వ శాఖ విఫలమైందనీ, దీంతో కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి హక్కులను రక్షించుకునేందుకు జనవరి 8న అఖిల భారత సమ్మె చేపట్టనున్నామని 10 కేంద్ర కార్మిక సంఘాలు (సిటియు) సంయుక్త ప్రకటనలో తెలిపాయి. పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా స్వరం పెంచే ఎజెండాతో 60 మంది విద్యార్థుల సంస్థలు, కొన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాలు కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల ఫలితంగా నిజ వేతనాలు పడిపోయాయననీ, అనేక ప్రభుత్వరంగ సంస్థలలో కూడా వేతన సవరణలు పెండింగ్లో ఉన్నాయని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఎయిరిండియా, బీపీసీఎల్ విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనీ పేర్కొన్నాయి. అలాగే బీఎస్ఎన్ఎల్-ఎంటీఎన్ఎల్ విలీనం తరువాత 93,600 టెలికాం కార్మికులు ఇప్పటికే విఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ పథకం) కింద ఉద్యోగాలను కోల్పోయారని విమర్శించాయి. ప్రత్యామ్నాయ విధానాల కోసమే దేశ కార్మికవర్గం ఐక్యంగా పోరాడతామని పేర్కొన్నాయి. దీంతో పాటు, రైల్వేలలో ప్రైవేటీకరణ, 49 రక్షణ ఉత్పత్తి యూనిట్ల కార్పొరేటైజేషన్, ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అలాగే జెఎన్యూలో చెలరేగిన హింసను కార్మిక సంఘాలు ఖండించాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు తమ సంఘీభావం తెలిపారు. 175 మందికి పైగా రైతు, వ్యవసాయ కార్మికుల సంఘాల ఉమ్మడి వేదిక తమ డిమాండ్లతోపాటు ‘గ్రామీణ భారత్ బంద్’ పేరుతో ఈ సమ్మెకు మద్దతిస్తున్నట్టు తెలిపాయి. కాగా 2020 జనవరి 8 న దేశవ్యాప్త సమ్మెకు గత సెప్టెంబర్లో కార్మిక సంఘాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. జనవరి 3న మీడియాతో ఐక్యవేదిక నాయకులు -
ఆర్టీసీ ఒకటేనా.. రెండా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఆర్టీసీ విభజన పెద్ద వివాదాంశం. అధికారులు, కార్మిక సంఘాలు ఒకరి వాదనను ఒకరు ఖండిస్తూ ఫిర్యాదులతో హోరెత్తించారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల్లో రెండు ఆర్టీసీలు ఏర్పాటు కావడంతో అందరూ వివాదాలను ‘మరిచిపోయారు’. అయితే తాజాగా టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణ సందర్భంగా సంస్థ ఉనికినే హైకోర్టు ప్రశ్నించే పరిస్థితి రావడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ అప్పట్లో జరిగిందేమిటి, ఇప్పుడెందుకు ఇది వివాదంగా మారింది? పీటముడి ఇక్కడే... రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం ఆర్టీసీ బస్సులు, సిబ్బంది విభజన విషయంలో పెద్దగా సమస్య లేకున్నా ఆస్తుల విషయంలో పేచీ ఏర్పడింది. హైదరాబాద్లోని ఆర్టీసీ ఎండీ కార్యాలయం, తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి, హకీంపేటలోని ఆర్టీసీ శిక్షణ కేంద్రం, మియాపూర్లోని ఆర్టీసీ బస్ బాడీ యూనిట్... ఇలా 14 ఆస్తులను 58:42 దామాషాలో పంచుకోవాలని ఏపీ అధికారులు, కార్మిక సంఘాలు పేర్కొనగా హైదరాబాద్లో ఆర్టీసీ నిజాం కాలం నుంచి వచ్చిందని, దానిపై పూర్తి హక్కు తెలంగాణకే ఉంటుందని తెలంగాణ అధికారులు, కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. ఆర్టీసీ సాంకేతికంగా ఉమ్మడిగా ఉండేందుకు ఇదే కారణమైంది. కమిటీ సిఫార్సులు ఇచ్చినా... రాష్ట్రం విడిపోయాక రెండుసార్లు ఆర్టీసీ బోర్డు సమావేశాలు జరిగాయి. తొలి సమావేశంలో ఆర్టీసీ ఆస్తులు, అప్పులకు సంబంధించి రెండు వైపుల నుంచి రెండు నివేదికలు అందాయి. వాటిని ఇరుపక్షాలూ పరస్పరం వ్యతిరేకించాయి. ఆ తర్వాత రెండో బోర్డు సమావేశం నాటికి షీలాభిడే కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. అయితే అందులో హెడ్ క్వార్టర్స్ నిర్వచనం ఆంధ్ర నివేదిక ఆధారంగా చేసినట్లు ఉందంటూ తెలంగాణ అధికారులు వ్యతిరేకించారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో సూచించిన విధంగా ఆ సిఫార్సులు లేవంటూ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. కానీ ఇప్పటివరకు హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశం వెలువడలేదు. పాలనాపరమైన వ్యవహారాల కోసం... ఆర్టీసీ చట్టంలోని సెక్షన్–3 ప్రకారం సొంతంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులతో సంయుక్తంగా ఏర్పాటైన కమిటీ పాలనాపరమైన వెసులుబాటు కోసం రెండు వేర్వేరు కార్పొరేషన్లు నిర్వహించుకోవాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం 2016 ఏప్రిల్ 27న ప్రభుత్వ ఉత్తర్వు నం.31 ద్వారా ప్రత్యేకంగా టీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేసుకుంది. ఈ మేరకు ఆర్టీసీ బోర్డు సమావేశంలో తీర్మానం చేసి ఆ ప్రతిని షీలాభిడే కమిటీకి పంపారు. సాంకేతికంగా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి ఆర్టీసీ ఉన్నా ఈ వెసులుబాటుతో విడివిడిగా ఏర్పాటయ్యాయి. జేఎండీ టు ఎండీ... రాష్ట్ర విభజన జరిగే సమయంలో ఉమ్మడి ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి సాంబశివరావు ఉన్నారు. రెండు రాష్ట్రాలు విడివిడిగా ఏర్పడ్డా.. విజయవాడ కేంద్రంగా ఆయన ఆధ్వర్యంలోనే రెండు ఆర్టీసీలు కొనసాగాయి. అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ సారథిగా జేఎండీ పోస్టు ఏర్పాటైంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో దీని ప్రస్తావన ఉన్నందునే తెలంగాణకు ప్రత్యేకంగా జేఎండీని ఏర్పాటు చేశారని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ఆర్టీసీ ఈడీగా పనిచేసి పదవీ విరమణ పొందిన రమణారావును ప్రభుత్వం 2014 ఆగస్టులో ఏడాది కాలానికి ఈ పోస్టులో నియమించింది. ఏడాది తర్వాత ఆయనకు ప్రభుత్వం మళ్లీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. కానీ 2016 ఏప్రిల్లో ప్రభుత్వం టీఎస్ఆర్టీసీకి సోమారపు సత్యనారాయణను చైర్మన్గా నియమించింది. చైర్మన్ ఉండి ఎండీ పోస్టు లేకపోవడం వెలితిగా ఉండటంతో అప్పటివరకు జేఎండీగా ఉన్న రమణారావును అదే సంవత్సరం జూన్ 16న ఎండీగా నియమించింది. కేంద్రం వాదనే మా మాట ‘ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉంది. సాంకేతికంగా విభజన జరగనందున కేంద్రం వాటా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నట్లే. ఇప్పుడున్న బస్సులు, సిబ్బంది దానికి చెందిన వారే. విభజనే జరగని సంస్థలో కొంత భాగాన్ని ఎలా ప్రైవేటీకరిస్తారు? కేంద్రం అనుమతి లేకుండా ఎలా ప్రైవేటీకరిస్తారు? మొన్న కోర్టులో వినిపించిన కేంద్రం వాదననే మేం బలపరుస్తున్నాం’ – ఆర్టీసీ జేఏసీ–1 కన్వీనర్ హన్మంతు, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు తిరుపతి కేంద్రం ఇరుకున పడదా? మోదీ ప్రభుత్వం ఫేమ్ పథకం కింద బ్యాటరీ బస్సులు మంజూరు చేస్తోంది. తొలి విడతలో తెలంగాణ ఆర్టీసీకి 40 ఏసీ బస్సులిచ్చింది. రెండో విడతలో ఏపీకి 300, తెలంగాణ ఆర్టీసీకి 325 కేటాయించింది. మరి సంస్థ ఉమ్మడిగా ఉన్నప్పుడు టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీకి విడివిడిగా ఎలా కేటాయించింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. దీనికి కేంద్రం ఏం సమాధానం చెబుతుంది. అది ఇరుకున పడే విషయమే కదా? – న్యాయ నిపుణులు -
‘విలీనం’ కాకుంటే ఉద్యమమే
సాక్షి, హైదరాబాద్ : సిబ్బందికి వేతనాలు చెల్లించే స్థితిలో కూడా లేనంతటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టీఎస్ఆర్టీసీ మరోసారి సమ్మె దిశగా సాగుతోంది. ప్రభుత్వంలో సంస్థను విలీనం చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్ను తెరపైకి తెచ్చిన కార్మిక సంఘాలు వరసపెట్టి సమ్మె నోటీసులు జారీ చేస్తున్నాయి. 2017తో ముగిసిన వేతన సవరణ ఒప్పందాన్ని పునరుద్ధరించటంలో జరుగుతున్న జాప్యం కూడా కార్మికుల ఆగ్రహానికి కారణమవుతోంది. వీటితో పాటు అంతర్గత నియామకాలు, డ్రైవర్, కండక్టర్లకు ఉద్యోగ భద్రత లాంటి మరో 12 డిమాండ్లను కూడా పేర్కొంటూ సమ్మె నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్లు నోటీసులు ఇవ్వగా, గుర్తింపు పొందిన కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ గురువారం నోటీసు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మరో ప్రధాన కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ నిశితంగా పరిశీలిస్తోంది. దాదాపు అన్ని ప్రధాన కార్మిక సంఘాలు సమ్మెకు సై అంటుండటంతో ఆర్టీసీలో ఉద్యమ సంకేతాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో నీళ్లు చల్లినా.... ఆర్టీసీలో ప్రధానంగా వినిపించే డిమాండ్ వేతన సవరణ. 2015లో సిబ్బందికి ప్రభుత్వం భారీ వేతన సవరణను ప్రకటించింది. అనూహ్యంగా 44 శాతం ఫిట్మెంట్ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంత భారీగా ఇవ్వటం పట్ల కార్మిక సంఘాలే ఆశ్చర్యపోయాయి. ఒకేసారి ఆర్టీసీపై దాదాపు రూ.850 కోట్ల వార్షిక భారం పడటం, దానికి సరిపడా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం లేకపోవడంతో క్రమంగా ఆర్టీసీ కుదేలవుతూ ఇప్పుడు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉంది. నాటి వేతన సవరణ ఒప్పందం 2017తో ముగిసింది. తర్వాత ప్రభుత్వం ఫిట్మెంట్ ప్రకటించకుండా 27 శాతం తాత్కాలిక భృతి ఇచ్చింది. రెండేళ్లు గడిచినా ఫిట్మెంట్ ఊసు లేకపోవడంతో ఇప్పుడు మళ్లీ ఆందోళనకు దిగాయి. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఉమ్మడి రాష్ట్రంలోనే వినిపించింది. ఆర్టీసీని ప్రైవేటీకరించే అవకాశం ఉందన్న ఆందోళన కార్మికుల్లో ఇప్పుడు నెలకొంది. దీంతో సర్కారు అలాంటి నిర్ణయం తీసుకోకుండా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే...పోరాట పంథానే... ప్రభుత్వంలో విలీనం చేయకుంటే పోరాట పంథా తప్పదని ఎంప్లాయీస్ యూనియర్, టీజేఎంయూ నేతలు రాజిరెడ్డి, హన్మంతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. గురువారం తమ కార్యాచరణను ప్రకటి స్తామని టీఎంయూ నేత థామస్రెడ్డి వెల్లడించారు. గుర్తింపు సంఘం టీఎంయూ ఒంటెద్దు పోకడ లకు వెళ్లకుండా అన్ని సంఘాలను కూడగట్టుకుని సంయుక్త కార్యాచరణకు దిగితేనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి కార్మికులకు న్యాయం జరుగుతుందని ఎన్ఎంయూ నేత నాగేశ్వరరావు అన్నారు. -
ఆర్టీసీ నష్టాలు రూ.928 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ రికార్డు సృష్టించింది. కాకపోతే నష్టాల్లో! రూ.వేయికోట్ల నష్టాల మార్కుకు చేరువైంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాని ఏకంగా రూ.928.67 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నట్టు ప్రభుత్వానికి టీఎస్ ఆర్టీసీ నివేదించింది. ఆర్టీసీ ఆవిర్భవించిన 8 దశాబ్దాల చరిత్రలో ఇదే అతి భారీనష్టం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాదిలో స్వల్ప లాభాలు నమోదు చేసిన ప్రగతిరథం నష్టాల బాట వీడనుందనే ఆశ కల్పించింది. కానీ, ఆ తర్వాత క్రమంగా ఏ యేటికాయేడు నష్టాల ఊబిలోకే పరుగులు పెట్టింది. దీంతో సిబ్బందికి జీతాలు చెల్లించటమే గగనంగా మారింది. ఆరేళ్లుగా సిబ్బంది నియామకాలు లేకపోవటంతో డ్రైవర్ల కొర త ఏర్పడింది. కొంతకాలంగా అద్దె బస్సులనే తీసుకుంటోంది. 600 బ్యాటరీ బస్సులు కేటాయించాలంటూ కేంద్రాన్ని కోరాలని నిర్ణయించిన ఆర్టీసీ.. వాటిని కూడా అద్దె బస్సులుగానే ఏర్పాటు చేసుకోవాలనుకుంది. దీంతో అద్దె బస్సుల సంఖ్య పెరిగి ప్రైవేటీకరణకు మార్గం సుగమమవుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రూ.312 కోట్ల ఆదాయం పెరిగినా... ఈసారి ఆర్టీసీలో ఏకంగా రూ.312 కోట్ల మేర ఆదాయం పెరిగినా నష్టాలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. నియంత్రించలేని ఖర్చులు పెరగటంతో నష్టాలు కూడా నమోదయ్యాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ రూ.4,570 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం రూ.4,882 కోట్లుగా తేలింది. అంటే అంతకుముందు సంవత్స రం కంటే రూ.312 కోట్ల ఆదాయం పెరిగింది. బస్సుచార్జీలు పెంచకున్నా ఆదాయం పెరగడం విశేషం. కొంప ముంచిన వడ్డీ, డీజిల్, ఐఆర్ ఆర్టీసీకి రూ.3,500 కోట్లకుపైగా బ్యాంకు అప్పులున్నాయి. వడ్డీ భారం రూ.181 కోట్లు. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే రూ.16 కోట్లు ఎక్కువ. తాజా నష్టాల్లో డీజిల్ వాటా పెద్దదే. చమురు రూపంలో రూ.1,384 కోట్లు ఖర్చయింది. ఇది అంతకుముందు సంవత్సరం కంటే రూ.192.33 కోట్లు ఎక్కువ. గతేడాది ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందికి మధ్యంతర భృతి(ఐఆర్)ని 16 శాతంగా ప్రకటించిం ది. ఇది వెంటనే అమలులోకి రావటంతో వేతన భారం కూడా పెరిగింది. ఆర్థిక సంవత్సరంలో వేత నాల రూపంలో రూ.2,381 కోట్లు చెల్లించారు. ఇది అంతకుముందు ఏడాదికంటే రూ.127.77 కోట్లు ఎక్కువ. మోటారు వెహికిల్ టాక్స్ రూ.174 కోట్లు. ఇలా అన్నీ కలిపి అంతకుముందు సంవత్సరం నష్టాల కంటే రూ.179.76 కోట్లను పెంచుకుని రూ.వేయి కోట్లకు చేరువైంది. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా... ప్రస్తుత ఆర్థిక సంవవత్సరం తొలి త్రైమాసిక నష్టాలను చూస్తే ఏప్రిల్లోనే రూ.38.23 కోట్లు, మేలో రూ.37.96 కోట్లు నష్టాలు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ (రూ.34 కోట్లు), మే(రూ.26 కోట్ల) కంటే చాలా ఎక్కువ. - తెలంగాణలో వేయి గ్రామాలకు బస్సు వసతి లేదు. వీటికి బస్సులు నడపాలంటే కనీసం 1,500 కొత్త బస్సులు కొనాలి. మూడు వేల మంది అదనపు డ్రైవర్లు, కండక్టర్లు కావాలి. - 3 వేల బస్సులు డొక్కుగా మారి నడవటానికి యోగ్యంగా లేవు. వాటిని రీప్లేస్ చేయాలంటే కొత్త బస్సులు కొనాలి. -
స్తంభించిన ప్రజా రవాణా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కార్మిక సంఘాలు ప్రకటించిన రెండ్రోజుల భారత్ బంద్ బుధవారంతో ముగిసింది. బంద్ సందర్భంగా కేరళ, పశ్చిమబెంగాల్లో ఆందోళనకారులు పలుచోట్ల రైళ్లను అడ్డుకోగా, బ్యాంకింగ్, బీమా కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోయాయి. చాలా చోట్ల రవాణా, విద్యుత్ సరఫరా, మైనింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. బెంగాల్ లోని హౌరా జిల్లాలో ఆందోళనకారులు ఓ బస్సుపై రాళ్లవర్షం కురిపించారు. కేరళలోని తిరువనంతపురంలో ఎస్బీఐ ట్రెజరీ శాఖపై దాడిచేశారు. తిరువనంతపురం–హైదరాబాద్ శబరి ఎక్స్ప్రెస్, వేనాడ్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆందోళనకారులు తిరువనంతపురంలో అడ్డుకున్నారు. బంద్ నేపథ్యంలో కేరళలో వాణిజ్య సముదాయాలు, షాపులు రెండో రోజూ మూతపడ్డాయి. తమిళనాట కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు రైళ్లను అడ్డుకోగా, తెలంగాణలోని కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు స్తంభించాయి. అయితే సామా న్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆగిపోయిన 20 వేల కోట్ల లావాదేవీలు గోవాలో ప్రైవేటు బస్సులు, ట్యాక్సీల యాజమాన్యాలు బంద్లో పాల్గొనడంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ముంబైలో అక్కడి రోడ్డు రవాణా సంస్థ ‘బెస్ట్’ జీతాల పెంపు సహా పలు డిమాండ్లతో నిరవధిక బంద్కు దిగడంతో లక్షలాది మంది ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాశారు. అలాగే బెంగళూరులో రద్దీగా ఉండే మేజిస్టిక్ బస్టాండ్లోనూ వామపక్ష ట్రేడ్ యూనియన్లు బస్సుల రాకపోకల్ని అడ్డుకున్నాయి. ఈ బంద్ లో ఆల్ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసో సియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లా యీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) పాలొ ్గనడంతో రూ.20,000 కోట్ల విలువైన చెక్కుల లావాదేవీలు నిలిచిపోయాయి. అయితే ప్రభు త్వ రంగ ఎస్బీఐతో పాటు ప్రైవేటు బ్యాంకుల కార్యకలాపాలు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. -
బ్యాంకింగ్పై బంద్ ప్రభావం పాక్షికం
న్యూఢిల్లీ: ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న రెండు రోజుల బంద్తో మంగళవారం బ్యాంకింగ్ కార్యకలాపాలపై పాక్షికంగా ప్రభావం పడింది. ఒక వర్గం ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) ప్రాబల్యం ఉన్న బ్యాంకుల్లో బంద్ ప్రభావం కనిపించింది. అయితే, బ్యాంకింగ్ రంగంలోని మిగతా ఏడు యూనియన్లు బంద్లో పాల్గొనకపోవడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకుల కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగాయి. ఏఐబీఈఏ, బీఈఎఫ్ఐల్లో సభ్యత్వమున్న ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండటంతో వాటి ప్రాబల్యమున్న పలు బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు, విత్డ్రాయల్, చెక్కుల క్లియరెన్సులు మొదలైన కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు పాటిస్తోందని ఆరోపిస్తూ 10 కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు (మంగళ, బుధవారాల్లో) బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలను వ్యతిరేకిస్తూ, జీతభత్యాల పెంపు డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు గత నెల 21న, 26న సమ్మెకు దిగాయి. -
స్తంభించిన రవాణా, బ్యాంకింగ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన 48 గంటల సమ్మెతో దేశవ్యాప్తంగా రవాణా, బ్యాంకింగ్ రంగాలు స్తంభించాయి. సమ్మె కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సమ్మెకు కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాలు మద్దతు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ర్యాలీ, రాస్తారోకోలు, ధర్నాలు జరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. సమ్మె ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు భారీ ఎత్తున నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎఐటియుసి, సిఐటియు, ఐఎఫ్ టియు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆందోళనలు మిన్నంటాయి. కార్మిక సంఘాల ఆందోళనలకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కేరళలో కార్మిక సంఘాలు రోడ్డెక్కడంతో ప్రజాజీవనం స్తంభించింది. ఒడిశాలోనూ రవాణా వ్యవస్థ స్తంభించింది. -
ఢిల్లీ వీధుల్లో భారీ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కార్మిక లోకం మరోసారి కదం తొక్కింది. ధరల నియంత్రణ, పంటకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత వంటి డిమాండ్లతో బుధవారం రైతు పోరాట ర్యాలీని నిర్వహించారు. అఖిల భారత వ్యవసాయ కార్మికుల యూనియన్ (ఎఐఎడబ్య్లూయూ) ఆధ్వర్యంలో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ ర్యాలీని ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాదిగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు వివిధ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కార్మికులు ర్యాలీలో పాల్గొన్ని నిరసన వ్యక్తం చేశారు. ఎర్రజెండాలతో ఢిల్లీ వీధుల్లో కవాతు నిర్వహించడంతో.. ట్రాఫిక్ అధికారులు ముందస్తుగానే స్పందించి వాహనాలకు వేరే మార్గాలకు మల్లించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని.. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా వదిలేశారని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచుతూ.. కనీస వేతనం 600 చేయాలని డిమాండ్ చేశారు. -
కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు
– డీసీఎల్ మహేశ్వర కుమార్ – 212 మందికి రూ.60,2400 మంజూరు చేయాలని ప్రతిపాదన కర్నూలు (రాజ్విహార్): కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్, చైర్మన్ యు.మహేశ్వర కుమార్ ఆదేశించారు. మంగళవారం స్థానిక ధర్మపేటలోని కార్మిక శాఖ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ దరఖాస్తులపై ఏసీఎల్, ఏఎల్ఓ, కార్మిక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను కార్మికుల చెంతకు చేర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు ట్రేడ్ యూనియన్ల నాయకులు అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. ఈ క్రమంలో 212 పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కల్పించాలని కోరుతూ రూ.60,2400 మంజూరు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు ప్రతిపాదనల పంపించారు. ఇందులో భవన నిర్మాణ కార్మిక కుటుంబాల్లో మెటర్నిటీ (కాన్పు) అలవెన్స్ కింద 154 మందికి రూ.20వేలు చొప్పున రూ.30.80లక్షలు కావాలని, పెళ్లిళ్లకు 33 మందికి రూ.10వేల చొప్పు రూ.3.30లక్షలు, ప్రమాదవశాత్తూ మరణానికి రూ.12.40లక్షలు (ముగ్గురికి), తాత్కాలిక వైకల్యం రూ.2400(ఒకరు), సహజ మరణానికి రూ.13.50లక్షలు(21 మంది) చొప్పున పంపించారు. కార్యక్రమంలో ఏసీఎల్ శేషగిరి రావు, ఏఎల్ఓలు కేషన్న, సుందరేష్, సుబ్బారెడ్డి, విల్సన్, హేమాచారి, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు 98.. నేడు 16
సింగరేణిలో కార్మిక సంఘాల సంఖ్య బోణిచేయని మూడు జాతీయ సంఘాలు ప్రధాన యూనియన్ల వెంటే కార్మికులు తాజా ఎన్నికల్లో మెజార్టీ అనుమానమే మంచిర్యాల సిటీ(ఆదిలాబాద్) : గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పుణ్యమా అని సింగరేణిలో కార్మిక సంఘాల సంఖ్య తగ్గిపోయింది. ఒకప్పుడు 98కి పైగా ఉన్న సంఘాలు 18 ఏళ్ల క్రితం ఎన్నికలు మొదలు కావడంతో బరిలోకి దిగే సంఘాల సంఖ్య క్రమేణ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం పేరుకు 32 సంఘాలున్నా ఆరో దఫా ఎన్నికల్లో పాల్గొనడానికి వివరాలు అందజేసింది 16 సంఘాలే. 2012లో జరిగిన ఎన్నికల్లో కేవలం 9 సంఘాలకు మాత్రమే ఓట్లు వచ్చాయి. సింగరేణిలో మొదటిసారి ఎన్నికలు 1998 సెప్టెంబర్ 14న జరిగాయి. నాటి నుంచి 2012 జూన్ 28 వరకు ఐదు దఫాలుగా నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాన సంఘాలైన ఐఎన్టీయూసీకి ఒక్కసారి, ఏఐటీయూసీ మూడుసార్లు, టీబీజీకేఎస్కు ఒక్కసారి కార్మికులు పట్టం కట్టారు. హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ వంటి జాతీయ సంఘాలు గుర్తింపు హోదా కోసం కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయారు. హెచ్ఎంఎస్ ఒక్కటే ప్రాతినిధ్య సంఘంగా రామగుండం రీజియన్లో ఉనికిని చాటుకుంటోంది. వీటితో పాటు టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ ఆరంభంలోనే శూరత్వం చూపింది. మొదటి ఎన్నికల్లో బెల్లంపల్లి, కార్పొరేట్ ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘంగా గెలిచింది. ఆ తరువాత నుంచి జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చినప్పటికీ ఆ యూనియన్ మెజార్టీ 2012 ఎన్నికల నాటికి 39 ఓట్లకు పడిపోయింది. ఐఎఫ్టీయూ ఐదుసార్లు జరిగిన ఎన్నికల్లో ప్రాతినిధ్య సంఘానికే పరిమితమైపోయింది. 1998లో కొర్పొరేట్, 2001లో ఆర్జీ-1, 2 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘంగా కార్మికుల ఆదరించారు. ఈ సంఘం మెజార్టీ సైతం వందల సంఖ్యకు పడిపోయింది. ఇక ఏఐఎఫ్టీయూ, ఎస్జీకేఎస్(సింగరేణి గని కార్మిక సంఘం) వంటి సంఘాలు కనుమరుగయ్యాయని చెప్పవచ్చు. ఆ మూడు బలాలుంటేనే అధికారం జాతీయ సంఘాలుగా చెప్పుకుంటున్న బీఎంఎస్, సీఐటీయూ, హెచ్ఎంఎస్కు జాతీయ స్థాయిలో ఆర్థిక, అంగ బలం ఉన్నప్పటికీ సింగరేణిలో మాత్రం పట్టు సాధించలేక పోయారు. వేజ్బోర్డులో కీలకపాత్ర పోషించే ఈ సంఘాలు కార్మికుల అభిమానాన్ని మాత్రం చూరగొనలేకపోవడం వెనుక అనేక కారణాలున్నాయి. జాతీయ స్థాయిలో ఉన్న పట్టును స్థానికంగా సద్వినియోగం చేసుకోలేక పోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బలమైన నాయకత్వ లోపమే ప్రధానంగా కనబడుతోంది. మిగతా జాతీయ సంఘాలకు సింగరేణిలో ఉన్న బలమైన క్యాడర్ ఈ సంఘాలకు లేకపోవడం ముఖ్య కారణం. సమస్యలపై స్పందించే గుణమూ తక్కువే. హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ వంటి సంఘాలు ముక్కుసూటిగా వ్యవహరించే స్వభావం ఉండటంతో పాటు ఆయా సంఘాలకు మాతృ పార్టీలు లేకపోవడం, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం లేకపోవడం వల్లే వెనుకబడిపోతున్నాయనే అభిప్రాయాలు ఉన్నారుు. ఆర్థిక వనరులూ తక్కువే. సమైఖ్య రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండి కూడా తన అనుబంధ సంఘాన్ని బలోపేతం చేయకుండానే ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చింది. పోరాట చరిత్ర ఉన్న ఏఐటీయూసీ సైతం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2012లో జరిగిన ఎన్నికల్లో టీబీజీకేఎస్కు 6,587 ఓట్ల తేడాతో అధికారం అప్పగించింది. సింగరేణిలో అధికారం చేజిక్కించుకోవాలంటే పోరాటంతో పాటు అంగ, అర్థ బలం అవసరమే. ఈ మూడు ఉన్న సంఘాలనే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కార్మికులు ఆదరించారని చెప్పవచ్చు. ఐదు సార్లు జరిగిన ఎన్నికల్లో ఆయా సంఘాలు సాధించిన మెజార్టీ వివరాలు యూనియన్ 1998 2001 2003 2007 2012 హెచ్ఎంఎస్ 3,784 2,434 1,583 4,099 5,983 సీఐటీయూ 3,257 5.237 -- 1.291 0,099 బీఎంఎస్ 2,021 0,519 -- 0,184 0,189 టీఎన్టీయూసీ 2,596 9,788 7,609 1,212 0,039 ఐఎఫ్టీయూ 12,674 14,883 3,179 0,720 0,373 ఏఐఎఫ్టీయూ 0,777 0,024 -- -- -- -
వారసత్వ ఉద్యోగాలు వచ్చేనా..?
మొదలైన ‘గుర్తింపు’ ఎన్నికల ప్రక్రియ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లేనని అంటున్న అధికారులు డిపెండెంట్ల ఆశలపై నీలినీడలు గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆరవ ధపా గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వారసత్వ ఉద్యోగా ల ప్రకటన చేసే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో మిగతా కార్మిక సంఘాల పరిస్థితి ఎలా ఉన్నా.. 2012లో జరిగిన 5వ దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామనే ప్రధాన హామీతో అధికారంలోకి వచ్చిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నా రు. టీబీజీకేఎస్ తన గుర్తింపు కాలపరిమితి నాలుగేళ్లలో ఆ హామీని నెరవేర్చలేకపోయింది. వారసత్వ ఉద్యోగాలు సాధిస్తాం.. ఇదిగో .. అదిగో వస్తున్నాయంటూ నాయకు లు నమ్మబలికారు. ముఖ్యమంత్రిని కలిశామని, ఆయన ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని గనులపైకి వచ్చిన ప్రతీసారి చెప్పారు. ఆచరణలో మాత్రం పెట్టలేక పోయూరు. నాలుగు జిల్లాల కోల్బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు సైతం సాధారణ ఎన్నికల్లో ఇదే హామీని వళ్లించారుు. చివరకు పుణ్యకాలం పూర్తరుుంది. తిరిగి ఆరవ దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ ఆదే హామీతో ముందుకు వస్తోంది. ఈ ప్రభావం టీబీజీకేఎస్ పై తీవ్రంగా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో.. ఒకప్పుడు బొగ్గుగనుల్లో విధులు నిర్వర్తించి రావడానికి కాలినడకే దిక్కు. భూగర్భంలో కిలోమీటర్ల కొద్ది నడక కారణంగా 50 సంవత్సరాల వయసు పైబడిన కార్మికుల లో ఎక్కువ శాతం మంది మోకాళ్లు, నడుము నొప్పులతో బాధపడేవారు. దీని నుంచి ఉపశమనం పొందడానికి మద్యానికి బానిసయ్యేవారు. ఈ నేపథ్యంలో కార్మికులు విధులకు ఎక్కువగా గైర్హాజరయ్యేవారు. ఆ ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా పడేది. ఆలోచించిన యాజమాన్యం ఈ ప్రతికూల పరిస్థితుల్లో అనారోగ్యంతో పనిచేయ ని కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగావకాశం కల్పించాలని నిర్ణయించింది. 1981 జూన్ 21వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 1998 జూన్ 6 వరకు వారసత్వ ఉద్యోగాలను కొనసాగించారు. తర్వాత కాలంలో సింగరేణిలో యాంత్రీకరణ వేగవంతం కావడంతో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ ఎక్కువగా యంత్రాల తోనే చేపడుతున్నారు. దీంతో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారసత్వ ఉద్యోగాలను యాజమాన్యం నిలిపివేసింది. కేవలం మరణించిన, పూర్తిగా పనిచేయలేక అనారోగ్యంతో ఉన్న, గనుల్లో ప్రమాదాలకు గురైన కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సంస్థ ముందుకు వచ్చింది. అది కూడా నెలకు 25 ఉద్యోగాల చొప్పున ఇవ్వడానికి నిర్ణయించింది. -
సార్వత్రిక సమ్మె విజయవంతం
‘తూర్పు’న సమ్మె విజయవంతం సాక్షి, రాజమహేంద్రవరం: కార్మిక చట్టాలను నీరుగార్చే ప్రయత్నాలను విరమించుకోవాలని, పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని తదితర 18 డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాలు శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఓఎన్జీసీ, కాకినాడ పోర్టు ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. జిల్లా అంతటా బ్యాంకులు మూతపడ్డాయి. కార్మిక సంఘాలు జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించాయి. వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు ర్యాలీల్లో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామర్లకోటలోని ప్రైవేట్ సంస్థ రాక్ సిరామిక్స్ కంపెనీ 12 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా సమ్మె జరిగింది. బెజవాడలో ప్రశాంతంగా సమ్మె.. విజయవాడ: దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కోర్కెల సాధన కోసం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు శుక్రవారం విజయవాడ నగరంలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగుల ఫెడరేషన్లు , బ్యాంకుల ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు వేలాదిమంది విధులను బహిష్కరించి ర్యాలీలో పాల్గొన్నారు. నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కార్మికులు రోడ్లపైకి వచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలలో ఖాళీలను భర్తీ చేయాలని ఆందోళనకారులు నినదించారు. విజయవాడ రథం సెంటర్ నుంచి వేలాది మందితో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో అసంఘటిత రంగంలోని కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు పాల్గొన్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, సీఐటీయూ నాయకులు ముజఫర్ అహ్మద్, గఫూర్ ర్యాలీలో పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఆటో రిక్షా కార్మికులు కూడా నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు నగర సీపీఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ నాయకత్వం వహించారు. సమ్మెలో పాల్గొన్న ఆందోళనకారులు పలు ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. బ్యాంకులు పని చేయలేదు. మున్సిపల్ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు. గుడివాడ, గన్నవరం, నూజివీడు, ఉయ్యూరు, మచిలీపట్నం, ప్రాంతాలలో కూడా సమ్మె ప్రభావం కనిపించింది. వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. -
నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
పాల్గొననున్న పలు సంఘాలు మూతపడనున్న వ్యాపార, విద్యాసంస్థలు న్యూశాయంపేట : కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ శుక్రవారం దేశవ్యాప్త సమ్మెకు పలు సంఘాలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జిల్లాలో సమ్మె జరగనుంది. సమ్మెలో జిల్లాలోని పలు కార్మిక సంఘాలు పాలు పంచుకోనున్నాయి. దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాలు, వివిధ రంగాల్లోని సుమారు 20 ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు ఐక్యంగా సమ్మెకు దిగుతుండగా.. పన్నెండు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి. కాగా, సమ్మె సందర్భంగా శుక్రవారం వాణిజ్య, వ్యాపార కేంద్రాలు, విద్యాసంస్థలు మూతపడనుండగా, రవాణా వ్యవస్థ నిలిచిపోయే అవకాశముంది. సమ్మె విజయవంతంతో సమాధానం చెప్పాలి సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే యత్నాలతో పాటు కార్మికులను గందరగోళానికి గురిచేసేందుకు కేంద్రప్రభుత్వం పన్నుతున్న కుట్రలకు సమ్మెను విజయవంతం చేయడం ద్వారా దీటైన జవాబు చెప్పాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కయ్య పిలుపునిచ్చారు. హన్మకొండ రాంనగర్లోని జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షణ, బ్యాంక్ తదితర రంగాల్లో ఎఫ్డీఐలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందు ఉంచిన ఏ సమస్యను పరిష్కరించకుండా కేంద్రమంత్రులు కార్మికులను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శులు బి.చక్రపాణి, రాగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయండి.. వివిధ కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజాసంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలని పీడీఎస్యు జిల్లా కార్యదర్శి విజయ్ఖన్నా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చిలువేరు శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు ల్యాదళ్ల శరత్ పిలుపునిచ్చారు. సమ్మె విజయవంతానికి సహకరించాలని అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. నగరంలోని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు రవికుమార్, ప్రశాంత్, అశోక్, సురేష్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమ్మెలో గ్రామీణ తపాలా ఉద్యోగులు. తపాలా శాఖలో పనిచేస్తున్న గ్రామీణ తపాల ఉద్యోగులకు సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని, ప్రతీ పోస్టాఫీస్ 8 గంటల డ్యూటీ కేటాయించాలనే తదితర డిమాండ్లతో శుక్రవారం సమ్మెలో పాల్గొంటున్నట్లు ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ వర్కింగ్ ప్రసిడెండ్ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు వారు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. - నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి. – కనీస వేతనం నెలకు రూ.18 వేలు ఇవ్వాలి. – కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని ఎత్తివేయడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. – అసంఘటిత రంగం, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. – కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలి. – కార్మిక చట్టాల సవరణను ఆపాలి. ప్రభుత్వ రంగ సంస్థలో వాటా అమ్మకాన్ని నిలిపి వేయాలి. – రక్షణ, రైల్వే, బ్యాంక్, ఇన్సూరెన్స్ తదితర రంగాల్లో ఎఫ్డీఐలను అనుమంతించొద్దు. – రోడ్డు రవాణా, విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరిచుకోవాలి. పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ చట్టాలను విధిగా అమలుచేస్తూనే పెన్షన్ గ్యారంటీ ఇవ్వాలి. – 45 రోజుల్లో కార్మిక సంఘాల రిజస్ట్రేషన్ పూర్తి చేయాలి. విద్యారణ్యపురి : సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. వివిధ సంఘాల బాధ్యులు కె.సోమశేఖర్, బద్దం వెంకటరెడ్డి, ఎస్.కుమారస్వామి, యూ.అశోక్, కడారి భోగేశ్వర్, టి.సుదర్శనం, టి.లింగారెడ్డి, సుధాకర్, పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. -
ఐఎన్టీయూసీ సంఘాలు ఏకం
10న గోదావరిఖనికి సంజీవరెడ్డి రాక అధికారికంగా ప్రకటించే అవకాశం గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో ఐఎన్టీయూసీకి అనుబంధంగా పనిచేస్తున్న కార్మిక సంఘాలు ఒక్కటికానున్నాయి. రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఒకే బ్యానర్పై కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఐఎన్టీయూసీ అనుబంధంగా కొనసాగుతున్న జనక్ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, ఎస్.నర్సింహారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్కు చెందిన నాయకులు, కార్యకర్తలతో సెప్టెంబర్ 10వ తేదీన గోదావరిఖనిలో సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యఅతిథిగా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి హాజరవుతున్నందున పెద్ద ఎత్తున క్యాడర్ను సమీకరించే పనిలో రెండు యూనియన్ల నాయకత్వం నిమగ్నమైంది. ఎస్సీఎంఎల్యూ ఆస్తుల పరిరక్షణపై దృష్టి ఐఎన్టీయూసీకి అనుబంధంగా ఉన్న సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్(ఎస్సీఎంఎల్యూ)కు మొన్నటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరించిన బి.వెంకట్రావు ఈనెల 18న టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్లో చేరి ఆ యూనియన్కు అధ్యక్షుడయ్యాడు. ఈ నేపథ్యంలో యూనియన్కు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్.నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా త్యాగరాజన్ను నియమిస్తూ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం యూనియన్ పేరుతో కొత్తగూడెం, మణుగూరు, సెంటినరీకాలనీలో సొంత భవనాలున్నాయొ. బెల్లంపల్లి మినహా మిగతా అన్ని ఏరియాల్లో సింగరేణి సంస్థ క్వార్టర్లను సమకూర్చింది. ఈ నేపథ్యంలో యూనియన్కు చెందిన ఆస్తులను, కార్యాలయాలను కాపాడుకునేందుకు కొత్త కార్యవర్గం దృష్టి సారించింది. -
సింగరేణిలో 'గుర్తింపు' ఎన్నికల ప్రక్రియ షురూ
- నేడు కార్మిక సంఘాలతో ఆర్ఎల్సీ భేటీ - యూనియన్ల సభ్యత్వం, ఆడిటింగ్పై దృష్టి కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 5వ దఫా ఎన్నికలు జరిగిన తేదీ ప్రకారం ఈ ఏడాది జూన్ 29తో టీబీజీకేఎస్ గుర్తింపు కాలపరిమితి ముగిసింది. అరుుతే అధికారికంగా ధ్రువీకరణ పత్రం ఇచ్చింది 2012 ఆగస్టు 6న కావడంతో ఆ తర్వాతే ఎన్నికలు జరుగుతాయని అందరూ ఆశించారు. కార్మిక సంఘాలు సైతం ముందస్తుగా ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోరుు గనులపై ప్రచారం ప్రారంభించారు. రాష్ర్టంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సైతం తన అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్కు నూతన కమిటీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో గుర్తింపు ఎన్నికలకు సింగరేణి యూజమాన్యం సైతం ముందుకు వచ్చింది. కార్మికుల సంఘాలతో రీజినల్ లేబర్ కమిషనర్(ఆర్ఎస్సీ) మంగళవారం కొత్తగూడెంలోని ఇల్లెందు అతిథి గృహంలో సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఎన్నికల నిర్వహణపై కార్మిక సంఘాల ప్రతిపాదనలు తీసుకోనున్నారు. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఖరారు కానుంది. గత ఎన్నికల్లో మొత్తం 15 సంఘాలు పోటీపడగా 60,247 మంది ఓటర్లు ఉన్నారు. ఆరో దఫా ఎన్నికల్లో 58,760 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నా రు. ఈ దఫా ఎన్ని సంఘాలు పోటీ పడతాయనే విషయంపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. సంఘాల కార్యకలాపాల పరిశీలన గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్న యూనియన్ల కార్యకలాపాలను ఆర్ఎల్సీ అధికారులు పరిశీలించనున్నారు. ప్రధానంగా యూనియన్ సభ్యత్వం, ఆడిటింగ్పై దృష్టి సారించనున్నారు. ట్రేడ్ యూనియన్ నిబంధనల ప్రకారం యాక్టివ్గా ఉన్న యూనియన్లను పోటీలో నిలిపే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన కొన్ని యూనియన్లు ఇప్పటి కే సింగరేణిలో తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఈ దఫా పోటీ చేసే యూనియన్ల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో తొలుత కేవలం 12 సంఘాలకు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఆర్ఎల్సీ ప్రకటించింది. మూడు సంఘాలు కోర్టుకు వెళ్లి పోటీ చేసే అవకాశాన్ని తెచ్చుకున్నాయి. సెప్టెంబర్లో ఎన్నికలు.. రెండు నెలలుగా కురిసిన వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడిన సింగరేణి సంస్థ గుర్తింపు ఎన్నికలను సెప్టెంబర్లోనే పూర్తి చేసి ఉత్పత్తి లక్ష్యసాధనపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు కీలకమైన సమావేశం మంగళవారం ముగియనుండటంతో ఆ తర్వాత ఎన్నికల తేదీని ప్రకటించేం దుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
'అధిష్టానం నిర్ణయం బాధ కలిగించింది'
కార్యకర్తల అభీష్టం మేరకే భవిష్యత్ నిర్ణయం ‘సాక్షి’తో టీబీజీకేఎస్ నేత మిర్యాల రాజిరెడ్డి రామకృష్ణాపూర్(ఆదిలాబాద్): ‘పొలిటీషియన్లా కాకుండా కార్మికులకు నిస్వార్థంగా సేవ చేయాలనే ఆలోచనతోనే ట్రేడ్ యూనియన్లో చేరాను.. పారదర్శకంగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో హైకమాండ్ నన్ను పక్కనబెట్టడం బాధ కలిగించింది’.. అని టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేత మిర్యాల రాజిరెడ్డి అన్నారు. టీబీజీకేఎస్ నూతన కమిటీ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రశ్న : నూతన కమిటీ ఏర్పాటు క్రమంలో అధిష్టానం మిమ్మల్ని సంప్రదించిందా? జవాబు : సంప్రదించారు. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీని వాస్రెడ్డి నాతో మాట్లాడారు. కొద్దిరోజుల తర్వాత సరైన స్థానంలో నియమిస్తామని చెప్పారు. త్వరలో ఎన్నికలు ఉన్నందున యూనియన్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. నూతన కమిటీ నియామకంలో అధిష్టానం ఆంతర్యమేమిటీ..? గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కమిటీ మార్పు అనివార్యమని అధిష్టానం భావించింది. గెలుపే లక్ష్యంగా కొన్ని సర్ధుబాట్లు తప్పవని, అందుకే నూతన కమిటీని ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్పై ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు..? కొత్తగా ఏ నిర్ణయం తీసుకునేది లేదు. గుర్తింపు ఎన్నికలు జరిగేలోపు సముచిత స్థానం దక్కుతుందనే ఆశిస్తున్నాను. నా అనుచరగణం, నాయకుల కోసం పని చేస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర యూనియన్లో చేరేది లేదు. అధిష్టాన నిర్ణయం మీకెలా అనిపించింది.? ఉన్నట్టుండి కమిటీని మార్చడం కొంత బాధ కలిగిన మాట వాస్తవమే. కాకపోతే ముందస్తుగా అధిష్టానం సంప్రదించింది కాబట్టి ఇబ్బందికరంగా భావించడం లేదు. నన్ను నమ్ముకున్న నాయకులకు, క్యాడర్కు మాత్రం నిరాశ కలిగించింది. కొత్త యూనియన్ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అలాంటి ఆలోచనే లేదు. నేను స్వతహాగా సింగరేణి ఉద్యోగిని. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీసు ఉంది. కార్మిక క్షేత్రంలోనే ఉంటా.. పొలిటీషియన్లా కాకుండా ట్రేడ్ యూనియన్ నాయకుడిలా నిస్వార్థంగా సేవలందిస్తా. ఇతర యూనియన్ల నుంచి పిలుపులు వస్తున్నాయని తెలిసింది..? కొన్ని సంఘాల నుంచి పిలుపులు వస్తున్న మాట వాస్తవమే. నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. తమ యూనియన్లలోకి రమ్మంటున్నారు. అయినా పెద్దగా ఆసక్తి లేదు. అధిష్టానం చెప్పిన విధంగా టీజీబీకేఎస్లోనే కొనసాగుతాం. కార్మికులను, క్యాడర్ను ముందుకు నడిపి యూనియన్ విజయం కోసం పాటుపడతా. మీపై వచ్చిన విమర్శలు మార్పులకు కారణమై ఉంటాయా..? జ: ఇప్పటి దాకా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. నాపై ఎమ్మెల్యేలకు సదాభిప్రాయమే ఉందని మేడం(కవిత) చెప్పారు. పారదర్శకంగా ఉంటానన్న సంకేతాలు అధిష్టానానికి చేరాయి. కాకపోతే ఏవైనా లోపాలుంటే చెబితే సరిచేసుకునే అవకాశం ఉండేది. -
గుర్తింపు పోరు..
సింగరేణిలో ఎన్నికల హడావుడి 23న సంఘాలతో సీఎల్సీ సమావేశం కార్మిక సంఘాలకు చేతినిండా పని మంచిర్యాల సిటీ : సింగరేణి బొగ్గుగని కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలకు కార్మిక శాఖ సన్నద్ధమవుతోంది. ఐదో గుర్తింపు సంఘం కాలపరిమితి జూన్ 29న ముగిసింది. ఆరో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు చీఫ్ లేబర్ కమిషనర్ (సీఎల్సీ) ఈ నెల 23న రిజిస్ట్రేషన్ ఉన్న కార్మిక సంఘాలతో కొత్తగూడెంలో సమావేశం కానున్నారు. కాలపరిమితి ముగిసి సుమారు రెండు నెలలు గడుస్తుండగా.. ఎన్నికలను ఎప్పుడు ఎదుర్కొందామా అని ఎదురు చూస్తున్న కార్మిక సంఘాలకు చేతినిండా పని దొరికింది. సంఘాలకు సంబంధించి.. ప్రభుత్వ పరంగా ఉండే ధ్రువీకరణ పత్రాలతో సమావేశానికి ప్రథమశ్రేణి నాయకులు సన్నద్ధం అవుతున్నారు. పారిశ్రామిక శాంతి కోసం సింగరేణిలో మొట్టమొదటిసారిగా 14 సెప్టెంబర్ 1998న ప్రభుత్వ పరంగా కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ముగిశాయి. ఆ ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీఎంయూ భారీ మెజార్టీతో గెలిచింది. అధికార పార్టీకి ప్రస్తుతం రాష్టంలో ఎక్కడ కూడా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. సింగరేణిలో మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని చెప్పవచ్చు. అధికార పార్టీకి చెందిన సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్కు పూర్తి స్థాయిలో కమిటీని గురువారం ప్రకటించారు. దీంతో సింగరేణిలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలు.. 1998కి పూర్వం సింగరేణి సంస్థలో సుమారు 98 కార్మిక సంఘాలు ఉండేవి. వీటిలో ప్రతి సంఘం కార్మిక శ్రేయస్సు కంటే వారి మనుగడకే ప్రాధాన్యం ఇస్తూ చీటికి మాటికి ప్రతీ చిన్న సమస్యను భూతద్దంలో చూస్తూ వారి ఉనికిని కాపాడుకోవడానకి సమ్మెకు వెళ్లడం జరిగేది. అధిక సంఖ్యలో కార్మిక సంఘాలు ఉండడం వల్ల ఏ సంఘానికి కార్మికులు అండగా ఉంటున్నారో తెలిసేది కాదు. ఏ సంఘాన్ని కార్మికులు ఆమోదిస్తున్నారో కూడా అంతుపట్టేది కాదు. 1991-92 ఆర్థిక సంవత్సరంలో సింగరేణిలో రికార్డు స్థాయిలో 475 సమ్మెలు జరిగాయి. దీని వల్ల పారిశ్రామిక శాంతికి విఘాతం కలిగి సంస్థ అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించక తప్పలేదు. భారతదేశ బొగ్గు పరిశ్రమ చరిత్రలోనే మొదటిసారిగా 14 సెప్టెంబర్ 1998న సీక్రెట్ బ్యాలెట్ ద్వార కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్ల వల్ల సంస్థలో కచ్చితమైన నిబంధలు అమలు కావడంతో 2002-03 ఆర్థిక సంవత్సరంలో సమ్మెల సంఖ్య 35కు చేరుకుని.. నేడు సమ్మెలు ఎరుగని సింగరేణిగా గుర్తింపు సాధించింది. సంఘాలు.. ఒకప్పుడు సింగరేణిలో వందకు చేరువలో సం ఘాలు ఉండగా.. నేడు వాటిని వేళ్లమీద లెక్కించవచ్చు. కార్మిక ఓట్ల ద్వార గెలిచిన సంఘం.. సింగరేణి గుర్తింపు సంఘంగా నమోదవుతుంది. ఏరి యాలో గెలిచిన సంఘాన్ని ప్రాతినిధ్య సంఘంగా పిలుస్తారు. కార్మికులు రెండు ఓట్లు వేస్తారు. ఎన్నికల పుణ్యమాని సింగరేణిలో ప్రస్తుతం ఐదు జాతీయ సంఘాలతోపాటు టీబీజీకేఎస్, టీఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐసీటీయూ, ఎస్జీకేఎస్ మాత్రమే ఉన్నారుు. వీటిలో టీఎన్టీయూసీ, ఎస్జీకేఎస్, ఏఐసీటీయూ ప్రభావం కేవలం ఎన్నికల సమయంలోనే కనిపిస్తోంది. క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించడంతో కార్మికుల్లో సంస్థపై కలిగిన అవగాహన, ప్రభుత్వం, యాజమాన్యంపై పెరిగిన విశ్వాసంతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. దీంతో కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ప్రాతినిధ్య, గుర్తింపు సంఘాలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో సమ్మెలు తగ్గి, కార్మిక సంఘాల ప్రభావం కనుమరుగైందని చెప్పవచ్చు. గుర్తింపు సంఘం ఎన్నికల వివరాలు.... ఎన్నికలు ఎన్నిక జరిగింది కాలపరిమితి కాలం 1వ 14-09-1998 14-09-1998 15-09-2000 2ఏళ్లు 2వ 11-02-2001 11-02-2001 12-02-2003 2ఏళ్లు 3వ 09-05-2003 09-05-2003 10-05-2007 4ఏళ్లు 4వ 10-08-2007 10-08-2007 11-08-2011 4ఏళ్లు 5వ 28-06-2012 28-06-2012 29-06-2016 4ఏళ్లు 6వ ఆరోసారి నిర్వహించే ఎన్నికల తేదీని ప్రకటించాల్సి ఉంది.... -
రెండు పడవలపై ప్రయాణం
రాజకీయ పార్టీ ఒకటి.. కార్మిక సంఘం మరొకటి సింగరేణిలో సంఘాల ముఖ్య నేతల తీరు అయోమయంలో ద్వితీయ శ్రేణి క్యాడర్ గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో పలు యూనియన్లకు సారథ్యం వహిస్తున్న నేతలు రెండు పడవలపై ప్రయాణిస్తున్నారు. రాజకీయ పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీకి అనుబంధ యూనియన్లో కాకుండా మరో యూనియన్ కు నాయకత్వం వహిస్తున్నారు. ఇలా ముఖ్య నేతలు వ్యవహరిస్తుండడం ద్వితీయశ్రేణి నాయకత్వంతో పాటు క్యాడర్ను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఒకసారి నేతల తీరు పరిశీలిస్తే.. సింగరేణిలో ఒక పర్యాయం గుర్తింపు సంఘంగా వ్యవహరించిన ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్(ఎస్సీఎంఎల్యూ)కు వర్కింగ్ ప్రెసిడెంట్గా బి.వెంకట్రావు ఉన్నారు. యూనియన్ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంకట్రావుకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఓ వైపు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే మరోవైపు ఎస్సీఎంఎల్యూకు వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. కాగా జనక్ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, వెంకట్రావు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఎస్సీఎంఎల్యూ కలిసి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంకట్రావు తిరిగి కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జరగ్గా.. ఆయన దానిని ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ పార్టీని వీడను అని ప్రకటించారు. ఇక మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి టీఆర్ఎస్ పార్టీలోనే పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఆయన సింగరేణిలో హెచ్ఎంఎస్కు అనుబంధంగా ఉన్న సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్కు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సింగరేణిలో టీఆర్ఎస్కు అనుబంధంగా టీబీజీకేఎస్ ఉండగా వేణుగోపాలచారి కార్మిక క్షేత్రంలో పర్యటిస్తూ హెచ్ఎంఎస్ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా వ్యవహరిస్తున్న నాయిని నర్సింహారెడ్డి మరోవైపు హెచ్ఎంఎస్ యూనియన్కు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన కూడా సింగరేణిలో పర్యటించిన సమయంలో హెచ్ఎంఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ముఖ్య నేతలు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో పార్టీ అనుబంధ యూనియన్కు వ్యతిరేకంగా.. మరో యూనియన్కు అనుకూలంగా ప్రచారం ఎలా చేస్తారనేదే ప్రశ్నార్థకం గా మారింది. ఒకవేళ పార్టీ అనుబంధ యూనియన్కు కాకుండా మరో యూనియన్ గెలుపుకోసం ప్రచారం చేసినట్లయితే పార్టీ అధిష్టానం వైఖరి ఎలా ఉంటుందనే చర్చ కార్మిక వర్గంలో జరుగుతోంది. అయితే ఇలాంటి నేతల వైఖరి కారణంగా ఆయా యూనియన్ల ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎటూ తేల్చుకోలేని స్థితికి చేరింది. -
అవినీతి రోగానికి ఏసీబీ చికిత్స
సింగరేణి మెడికల్ బోర్డు అక్రమాల్లో కార్మిక నాయకులు, అధికారులు..? తెలంగాణ సర్కారు గుప్పిట నివేదిక..! గుర్తింపు ఎన్నికల ముందు బయటపెట్టే అవకాశం మంచిర్యాల సిటీ(ఆదిలాబాద్) : సింగరేణి మెడికల్ బోర్డుకు పట్టిన అవినీతి రోగానికి రాష్ట్ర ఏసీబీ తనదైన శైలిలో చికిత్స చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బోర్డులోని కొంతమంది అవినీతి, అక్రమాలకు పాల్పడడం వల్ల అనేక మంది కార్మికులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు అదేశించింది. ఏసీబీ ఇచ్చిన నివేదికలో పలు కార్మిక సంఘాలకు చెందిన అగ్రనాయకులతో పాటు కొంతమంది సింగరేణి ఉన్నతాధికారులు, వైద్యాధికారులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు ఆ వివరాలన్నీ గుప్పిట పట్టుకున్న సర్కారు కొద్ది రోజుల్లో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో వాటిని బయటపెట్టే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా కేవలం తప్పులతో దొరికిన నాయకులను టార్గెట్గా చేసుకుని ఎన్నికల్లో లబ్ధిపొందడానికి అధికార పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కార్యకర్తల వద్దే నొక్కేశారు జీవితకాలం సంఘానికి సభ్యత్వం చెల్లించారు. జెండాలు మోశారు. ఉద్యమంలో ముందు నిలబడి పోలీసు కేసుల్లో ఇరుక్కున్నారు. జైలుపాలయ్యారు. ఆర్థికంగా నష్టపోయారు. ఇలా 25 నుంచి 30 ఏళ్లపాటు బొగ్గుబాయిలో పనిచేసి సంఘానికి అండగా నిలిచిన వారెందరో ఉన్నారు. తన కొడుక్కో, అల్లుడికో వారసత్వపు ఉద్యోగం పెట్టించడానికి మెడికల్ అన్ఫిట్కు దరఖాస్తు పెట్టుకున్నారు. ఇంతకాలం చాకరీ చేశాం.. నాయకులు కనికరించకపోతారా అని ఆశపడితే.. ఒక్కో కార్యకర్త నుంచి రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితుల ద్వారా తెలిసింది. పని ఏమైంది నాయకా అంటే తప్పించుకు తిరుగుతున్నారని, కనీసం ఇచ్చిన పైసలైనా ఇమ్మంటే ‘నేనేం చేయాలె నా పైన ఉన్నోడికి ఇచ్చిన.. అక్కడి నుంచి వచ్చినప్పుడే నీకిస్తా.. అప్పటిదాకా నా ఇంటికి రాకు’ అంటూ దబారుుస్తున్నారని కొందరు వాపోయూరు. నాయకులే టార్గెట్ పలు కార్మిక సంఘాలకు చెందిన కొందరు నాయకులు మెడికల్ అన్ఫిట్ కోసం కార్మికుల నుంచి భారీగా వసూలు చేసి మోసం చేశారని ఏసీబీ విచారణలో తేలినట్లు సమాచారం. ఇందులో ప్రతిపక్ష సంఘాలలోని ముఖ్య నాయకులతో పాటు అధికార పార్టీకి చెందిన కార్మిక సంఘం నాయకుల్లో కొందరి భాగస్వామ్యం ఉన్నట్లు తెలిసింది. రానున్న ఎన్నికల్లో ఏసీబీ నివేదికను అస్త్రంగా ఉపయోగించుకుంటే సొంతవారు కూడా బలయ్యే అవకాశం ఉంది. అరుుతే వారిని కాపాడుకోవడానికి అందరినీ ఎన్నికల సమయం నాటికి ఏసీబీకి అప్పగించి, కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకువస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఏసీబీ నివేదికలో వాస్తవాలు ఉన్నప్పటికీ కార్మిక వర్గంలో తన సంఘంపై వచ్చిన వ్యతిరేకతను పోగొట్టడానికి, వివిధ సంఘాలకు చెందిన నాయకులు చేసిన అవినీతిని ముందుకు తీసుకువస్తే కార్మికుల నుంచి సానుభూతి పొందవచ్చని అధకార పార్టీ అలోచనగా తెలుస్తోంది. ఆత్మరక్షణలో అక్రమార్కులు మెడికల్ అన్ఫిట్ చేయిస్తానని కార్మికుల నుంచి వసూలు చేసిన నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు. ఓ ప్రతిపక్ష సంఘానికి చెందిన సీనియర్ నాయకుడు ఈ గండం నుంచి తప్పించమని దక్షిణ తెలంగాణకు చెందిన అధికార పార్టీ మంత్రితో ప్రాదేయపడుతున్నట్లు విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. అరుుతే ఆ నాయకుడిని చేరదీసి బయట పడేస్తే తన పదవికే ముప్పు వస్తుందనే ఆలోచనలో సదరు మంత్రి ఉన్నట్టు సమాచారం. బయట పడే అవకాశం లేనప్పటికీ ఎన్నికల నాటికి చెప్పినట్టు నడుచుకుంటే ఇబ్బంది లేకుండా చూస్తామనే హామీ కోసం ఆ నాయకుడు ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నాటికి ఎవరు ఎక్కడ ఉంటారో, ఏ సంఘంలో ఉంటారో వేచి చూడాల్సిందే. -
టార్గెట్ టీబీజీకేఎస్..!
గుర్తింపు సంఘం ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ? ఆ దిశగా అడుగులు వేస్తున్న సంఘాలు గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో జాతీయ కార్మిక సంఘాలు ఏకం కానున్నాయా..? రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఓడించాల నే లక్ష్యంతో జట్టు కడుతున్నాయా..? ఇందుకు ఇటీవలి పరిణామాలు అనుకూల సంకేతాలిస్తున్నాయి. సింగరేణిలో 1998 నుంచి ప్రారంభమైన గుర్తింపు సంఘం ఎన్నికలు ఇప్పటి వరకు ఐదు సార్లు జరిగాయి. మూడు సార్లు ఏఐటీయూసీ, ఒక్కో సారి ఐఎన్టీయూ సీ, టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా గెలుపొందారుు. ఎన్నిక తేదీని బట్టి చూస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీబీజీకేఎస్ కాల పరిమితి ముగిసింది. అరుుతే సెప్టెం బర్ లేక అక్టోబర్లో గుర్తింపు ఎన్నికలు జరిగే అవకాశాలున్నారుు. ఈ సారి టీబీజీకేఎస్ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనే లక్ష్యంతో పలు జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఏడాది క్రితం నుంచే.. దేశవ్యాప్తంగా బొగ్గుగనుల్లో కార్మికులు ఎదుర్కొంటు న్న పలు సమస్యల పరిష్కారం కోసం ఏడాది క్రితం నుంచి జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో పాటు వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టా యి. ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలనే ఆలోచనకు ఏఐటీయూసీ నుంచి ప్రతిపాదన రాగా అందుకు ఐఎన్టీయూసీ సైతం అంగీకరించింది. త్వరలో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనుండడంతో ఇరు సంఘాలు కలిసి పోటీ చేయడానికి ముందుకు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అయి తే సింగరేణిలో కొనసాగుతున్న ఐఎన్టీయూసీలోని రెండు సంఘాలను కలిపితే తాము కలిసి పోటీ చేయడానికి సిద్ధమని ఏఐటీయూసీ నాయకత్వం ప్రతిపాదన తెచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి సింగరేణిలో ఐఎన్టీయూసీలోని రెండు సంఘాలను కలిపే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ ఒక అవగాహనకు వచ్చి ఏఐటీయూసీ బ్యానర్పైనే సింగరేణి ఎన్నిక ల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు కూడా కోల్బెల్ట్లో ప్రచారం జరుగుతున్నది. ఇదే గనుక నిజమైతే సింగరేణిలో అధికార కార్మిక సంఘం టీబీజీకేఎస్కు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నారుు. ఐఎన్టీయూసీలోని రెండు సంఘాలు, ఏఐటీయూసీ కలిస్తే మరింత బలం పెరిగి గుర్తింపు ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు మొండుగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయకపోవడం, సకల జనుల సమ్మె వేతనాలు చెల్లించకపోవడం ఆ యూనియన్కు ఇబ్బంది కరంగా మారే పరిస్థి తి ఉందని అంటున్నారు. -
ఆర్టీసీలో తరలింపు సెగ!
27కు విజయవాడ రావాల్సిందేనని యాజమాన్యం ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్/ విజయవాడ బ్యూరో: ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు నిర్ణయం తీసుకోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నెల 27 కల్లా ఆర్టీసీ ఉద్యోగులు విజయవాడలోని ఎన్టీఆర్ ప్రధాన పరిపాలనా కార్యాలయాని(పండిట్ నెహ్రూ బస్ స్టేషన్)కి తరలి రావాలని ఎండీ నండూరి సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేయడంపై యూనియన్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆస్తుల పంపకాలు పూర్తి కాకుండా ఉద్యోగుల్ని తరలిస్తే హైదరాబాద్లోని ఆస్తులపై వాటా కోల్పోయే ప్రమాదం ఉందంటూ గుర్తింపు సంఘమైన నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే విషయమై ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా చంద్రయ్య, శ్రీనివాసరావు శనివారం విజయవాడలో ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ నెల 17న ధర్నాలు.. దీక్షలు...: ఆర్టీసీ ఉద్యోగుల తరలింపు, ఉమ్మడి ఆస్తుల విషయంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 17న బస్భవన్ వద్ద భోజన విరామంలో ధర్నాలు, రాష్ట్రంలోని అన్ని యూనిట్లలో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని ఎన్ఎంయూ పిలుపునిచ్చింది. ఆస్తులు, ఉద్యోగుల విభజనకు వేసిన కమిటీ ఇంతవరకు సమావేశం కాలేదని, ఈ స్థితిలో ఏకపక్ష నిర్ణయం సరికాదని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు పద్మాకర్, దామోదర్రావులు పేర్కొన్నారు. -
ఐటీ కంపెనీల్లోనూ ట్రేడ్ యూనియన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థలు, కొన్ని ప్రైై వేటు రంగాలకు పరిమితమైన కార్మిక సంఘాలు ఇక నుంచి ఐటీ కంపెనీల్లోనూ పుట్టుకురానున్నాయి. ఇందుకు తమిళనాడు వేదిక అవుతోంది. ఐటీ కంపెనీల్లోని ఉద్యోగులు సైతం కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చంటూ తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 30 లక్షల పైచిలుకు ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల హక్కుల అంశం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఉద్యోగుల హక్కులను కాలరాసే కంపెనీలకు మాత్రం ఇది పెద్ద హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు. సంఘాల ఏర్పాటు ఇబ్బందికర పరిణామమేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సొంత రాజ్యాంగాలకు చెల్లు.. ఉద్యోగుల హక్కుల విషయంలో పెద్ద కంపెనీలు కార్మిక చట్టాల నిబంధనలను అనుసరిస్తున్నాయి. మానవ సంబంధాల విషయంలో అంతర్జాతీయ సంస్థలు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటుండడం ఇందుకు కారణం. తాము ప్రాజెక్టు అప్పగించే ముందు సదరు కంపెనీలో స్నేహపూర్వక వాతావరణం ఉందీ లేనిదీ పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటాయి. సమస్యల్లా కొన్ని చిన్న కంపెనీలతోనే. ప్రమోటర్లు తాము సొంతంగా రాసుకున్న రాజ్యాంగం ప్రకారమే అన్నీ సాగాలని హెచ్ఆర్ విభాగాలను ఆదేశిస్తున్నారు. సెలవులు, అలవెన్సులు, వేతనాల వంటి విషయంలో నిబంధనలను పాటించని కంపెనీలెన్నో ఉన్నాయి. కార్మిక సంఘాలు ఏర్పాటైతే ఇటువంటి సొంత రాజ్యాంగాలకు తావులేదని హెచ్ఆర్ రంగ నిపుణులు బి.అపర్ణరెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోతో అన్నారు. ‘ఉద్యోగులను తొలగించే విషయంలోనూ కంపెనీలు జాగ్రత్త వహిస్తాయి. పనితీరు బాగోలేదంటూ తప్పుడు సాకుతో తొలగించే చాన్స్ లేదు. ఇప్పటి వరకు ఉద్యోగి తన సమస్యను కంపెనీ ఏర్పాటు చేసిన కమిటీకి చెప్పుకునేవారు. అన్యాయం జరిగితే ఇక నుంచి కార్మిక శాఖకు మొరపెట్టుకోవచ్చు. ఉద్యోగుల్లో సై ్థర్యం పెరుగుతుంది. నిబంధనల విషయంలో కంపెనీల్లో క్రమబద్ధత వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగులను బాగా చూసుకుంటాం.. పనితీరు, వ్యాపారం విషయంలో విదేశీ సంస్థలతో భారత ఐటీ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల యోగక్షేమాలకు పరిశ్రమ పెద్దపీట వేస్తోందని ప్రోగ్రెస్ సాఫ్ట్వేర్ ఎండీ రమేష్ లోగనాథన్ అన్నారు. ఉద్యోగికి సమస్య ఏదైనా వస్తే కంపెనీ ఏర్పాటు చేసిన కమిటీ పరిష్కరిస్తోందని చెప్పారు. యూనియన్ ఏర్పాటు చట్టానికి ఏమాత్రం వ్యతిరేకం కాదు. సంఘం ఏర్పాటైనంత మాత్రాన పని వాతావరణం చెడిపోతుందని ఏమీ లేదు. తిరోగమన ప్రభావమేదీ సంస్థలపై ఉండకపోవచ్చు’ అని వివరించారు. ఉద్యోగులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని విజన్ 2కే ప్లస్ ఇంక్ మేనేజింగ్ పార్టనర్ పి.సౌదామిని అన్నారు. ఉద్యోగులు సమస్యలేవైనా ఉంటే సామరస్యంగానే పరిష్కరించుకుంటారని తెలిపారు. సమస్యలు సష్టించిన ఉద్యోగులకు ఇతర సంస్థల్లో అవకాశాలు రావన్నారు. క్లయింట్ల వెనుకంజ.. కార్మిక సంఘాలున్న కంపెనీలతో చేతులు కలిపేందుకు ఎమ్మెన్సీలు విముఖత వ్యక్తం చేస్తాయని ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నేషనల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, గ్లోబల్ ఇన్ఫోవిజన్ ఎండీ ఎస్.పూర్ణచంద్ర రావు వెల్లడించారు. డెడ్లైన్స్పైన పనిచేసే ఈ రంగంలో ఏమాత్రం అనిశ్చితి ఉన్నా ప్రాజెక్టులు రావని హెచ్చరించారు. పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో పరిశ్రమకు నష్టదాయక చర్యలేవీ మంచివి కాదన్నారు. దీర్ఘకాలంలో కంపెనీలకు ప్రమాదమని అన్నారు. పరిశ్రమకు రక్షణ ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టేందుకే ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తారన్నారు. తక్కువ వేతనాలున్న బీపీవో రంగంలో సంఘాల ఏర్పాటుకు ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల్లో అసంతప్తి మొదలైతేనే యూనియన్లు ఏర్పాటవుతాయని హైదరాబాద్కు చెందిన ఐటీ ఉద్యోగి కందుకూరి సురేష్బాబు తెలిపారు. ఇలా సంఘం ఏర్పాటైన కంపెనీలు ఎదగలేవని అన్నారు. డేటాబేస్లో సమాచారం ఉంటుంది కాబట్టి ప్రొఫైల్ బాగోలేని ఉద్యోగికి ప్రపంచంలో ఎక్కడా జాబ్ రాదన్నారు. -
ఇక టెకీల యూనియన్లు!
చెన్నై: దాదాపు 4.5లక్షల మంది టెకీలకు నిలయమైన చెన్నైలో తమిళనాడు ప్రభుత్వం టెకీలు కూడా యూనియన్లను స్థాపించుకోవచ్చని ప్రకటించింది. కార్మిక సంఘాలు వేసిన పిటిషన్ కు సమాధానం ఇచ్చిన ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసింది. 1947 పారిశ్రామిక వివాదాలు యాక్ట్ కింద టెకీ ఉద్యోగులు కూడా సంఘాలను ఏర్పాటు చేసుకుని తన బాధలను వ్యక్తం చేయోచ్చని తెలిపింది. కాగా, ఐటీ సెక్టార్ ఈ ప్రకటనను విపరిణామంగా భావిస్తోంటే.. యూనియన్లు మాత్రం ఇది ఉద్యోగుల పాలిట వరంగా భావిస్తున్నారు. ట్రేడ్ యూనియన్లను స్థాపించుకోవడం ఉద్యోగుల హక్కు అని కొంతమంది యూనియన్ల ప్రతినిధులు అంటున్నారు. హెచ్ సీఎల్ లో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సరిగా పనిచేయడం లేదని గతనెలలో తీసేయగా.. మద్రాసు హైకోర్టు ఉద్యోగిని ఉన్నపళంగా తీసేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్పునిచ్చింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా ఒక పని చేసే వ్యక్తేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఏవరినైనా ఉద్యోగంలో తీసుకున్న తర్వాత వర్క్ మాన్ షిప్ నుంచి ఉన్నపళంగా తప్పించలేరని తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఫ్యాక్టరీలకే పరిమితమైన ట్రేడ్ యూనియన్లు టెకీ కంపెనీల్లో కూడా ఆరంభం కానున్నాయి. -
గుర్తింపు సప్పుడు లేదు
జూన్ 28తో ముగియనున్న టీబీజీకేఎస్ కాలపరిమితి మొదలుకాని సింగరేణి ఎన్నికల ప్రక్రియ సీఎల్సీకి లేఖ రాయని యాజమాన్యం ఒత్తిడి తెస్తున్న కార్మిక సంఘాలు సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలుపొందిన టీబీజీకేఎస్ నాలుగేళ్ల కాలపరిమితి జూన్ 28తో ముగియనున్నది. గడువు ఇంకా ఐదు వారాలు మాత్రమే ఉంది. అరుునా ఇప్పటి వరకు యూజమాన్యం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ముందస్తు పనులు చేపట్టలేదు. కార్మిక సంఘాలు మాత్రం రెండు నెలల క్రితం నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టి గనులను చుట్టి వస్తున్నాయి. - గోదావరిఖని(కరీంనగర్) సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలను సెం ట్రల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉం టుంది. ఇందుకు రెండు మూడు నెలల ముందు నుంచే ప్రక్రియ ప్రారంభించాలి. దీనికంటే ముందు యాజమాన్యం ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లేబర్ కమిషనర్(సీఎల్సీ) కి లేఖ రాయాలి. ఆ తర్వాత సీఎల్సీ నుంచి హైదరాబాద్లోని రీజినల్ లేబర్ కమిషనర్(సెంట్రల్)కు ఓ ప్రత్యే క అధికారిని నియమిస్తూ ఆదేశాలిస్తారు. ఆయన పర్యవేక్షణలో ఆర్ఎల్సీ కార్యాలయానికి చెందిన కార్మిక శాఖ అధికారులు సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల్లో పర్యటించి గనులు, కార్మికుల సంఖ్య, పోలింగ్ జరిగే ప్రాంతాలు తదితర వివరాలను సేకరిస్తారు. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మూడు నెలల ముందు నుంచే ప్రారంభమవుతుంది. అరుుతే ఇప్పటి వరకు యాజమాన్యం ఢిల్లీలోని సీఎల్సీకి ఎన్నికలను నిర్వహించాలని లేఖ రాయలేదు. హైదరాబాద్లోని ఆర్ఎల్సీ అధికారులు సైతం ఎన్నికల విషయమై పెద్దగా పట్టించుకోవడం లేదని స్పష్టమవుతున్నది. గడువు ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి సింగరేణిలో ప్రస్తుతం 11 ఏరియూలున్నాయ. గత ఎన్నికల్లో ఐదు ఏరియూలు గెలిచిన టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా.. రెండేసి ఏరియూలు గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ ప్రాతినిధ్య సంఘాలుగా వ్యవహరిస్తున్నాయి. 2012 జూన్ 28న నిర్వహించిన ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్కు ఆగస్టు 6న యాజమాన్యం అధికారికంగా లేఖ అందజేసింది. దీనిని బట్టి ఆగస్టు 6వ తేదీ వరకు టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా కొనసాగే అవకాశం ఉందని ఆ సంఘం నాయకులు పేర్కొంటున్నారు. ఎన్నికలు జరిగిన జూన్ 28 తోనే కాలపరిమితి పూర్తవుతుందని, దీని ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రాతినిధ్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఏఐటీయూసీ నాయకత్వం ఢిల్లీలోని సీఎల్సీ కార్యాలయానికి లేఖ రాసింది. త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కంపెనీపై ఒత్తిడి తీసుకువస్తున్నది. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన సీఎల్సీకి సైతం నాయకులు వినతిపత్రం అందజేశారు. -
పీఎఫ్పై 8.7% వడ్డీ ఖరారు
వడ్డీ తగ్గింపుపై కార్మిక సంఘాల ఆందోళన న్యూఢిల్లీ: 2015-16 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.7 శాతం వడ్డీని కేంద్రం ఖరారు చేసింది. కార్మిక మంత్రి నేతృత్వంలోని భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్వో ట్రస్టీల సెంట్రల్ బోర్డు(సీబీటీ) ఫిబ్రవరిలో పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని 8.8 శాతం చేయాలని ప్రతిపాదించింది. ఆ నిర్ణయాన్ని పక్కనబెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 8.7 శాతం వడ్డీని ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం లోక్సభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. కాగా దీన్ని కార్మిక వ్యతిరేక చర్యగా అభివర్ణించిన కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఈ నెల 27న ఈపీఎఫ్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన చేయనున్నట్లు బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి విర్జేష్ ఉపాధ్యాయ తెలిపారు. స్వతంత్ర సంస్థ అయిన సీబీటీ నిర్ణయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వేలుపెట్టడం తగదని అన్నారు. ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అశోక్ సింగ్ ప్రభుత్వానికి పీఎఫ్ నిర్ణయాల్లో తలదూర్చే హక్కు లేదన్నారు. సెప్టెంబర్ 2న భారత్ బంద్ ఆందోళనలో దీన్ని ఓ అంశంగా చేరుస్తామన్నారు. -
ఇక్కడ అడుగుకో ‘అంజలి’!
♦ స్పిన్నింగ్ మిల్లుల్లో అంజలిలాంటి మరెందరో బాలకార్మికులు ♦ ‘ఆపరేషన్ స్మైల్-2’ పేరిట అధికారుల దాడులు ♦ శుక్రవారం.. ఒక్క షిప్ట్ తనిఖీలోనే 40 మంది బాలలు ♦ శనివారం మరో 21 మంది బాల కార్మికుల గుర్తింపు ♦ నామమాత్రపు వేతనాలతో కార్మికుల అవస్థలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: అక్కడ పనిచేసే కార్మికులకు పని బాధ్యత లే తప్ప.. వారికున్న హక్కులేంటో తెలియవు. కష్టం వస్తే ఎవరికి చెప్పాలో.. ఎవరు తీరుస్తారో ఇప్పటికీ తెలియదు. వారికి తెలిసిందల్లా యాజమాన్యం చెప్పినట్లు 8 నుంచి 9 గంటలు నిరాటంకంగా శారీరక శ్రమ చేయడమే. బతుకు దెరువు కోసమని రాష్ట్రాలు దాటి వచ్చిన ఈ కార్మికుల పట్ల పాలమూరు జిల్లాలోని పలు స్పిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నాయి. చేతినిండా పని ఉన్నా.. కడుపు నిండే కూలి రాకపోవడంతో ఆయా స్పిన్నింగ్ మిల్లుల్లో దినసరి వేతనంతో పనిచేస్తున్న కార్మికుల జీవనం దుర్భరంగా మారిపోయింది. ముక్కుపచ్చలారని చిన్నారులతో నిత్యం స్పిన్నింగ్ మిల్లులో పత్తి నుంచి దారంతీసే పనిని యథేచ్ఛగా చేయించుకుంటున్నారు. బాల కార్మికులెందరో.. మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి, ఆమన్గల్, బాలానగర్, షాద్నగర్, అడ్డాకుల, మిడ్జిల్ తదితర ప్రాంతాల్లో ఉన్న స్పిన్నింగ్ మిల్లుల్లో అనేకమంది బాలకార్మికులు పనిచేస్తున్నట్లు కార్మికశాఖ అధికారుల బృందం శుక్రవారం ‘ఆపరేషన్ స్మైల్-2’ పేరిట చేసిన ఆకస్మిక దాడుల్లో గుర్తించారు. ఆమనగల్లు, కల్వకుర్తి పట్టణాల్లోని సూర్యలక్ష్మి, సూర్యలత కాటన్ మిల్లులో పనిచేస్తున్న 40 మందిని గుర్తించిన స్మైల్ టీం సభ్యులు మహబూబ్నగర్లోని బాలసదన్కు తరలించారు. అలాగే, శనివారం మిడ్జిల్ మండల పరిధిలోని ఊర్కొండపేట్లో ఉన్న సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో స్మైల్ టీం సభ్యులు తనిఖీలు జరిపి మరో 21 మంది బాల కార్మికులను గుర్తించారు. రోజుకు మూడు షిఫ్టులుగా నడిచే ఈ మిల్లుల్లో ఒక షిఫ్ట్లో పనిచేసే బాలకార్మికుల కష్టాలే కార్మికశాఖ అధికారుల దృష్టికి వచ్చాయని, అంజలిలాంటి వారు ఇంకా అనేక మంది దుర్భర జీవితాన్ని కొనసాగిస్తున్నారని అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ‘సాక్షి’ పత్రికలో కథనం వచ్చేంత వరకు స్పిన్నింగ్ మిల్లుల్లో బాల్యం మసివారుతున్న తీరుపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. అయితే చిన్నారి అంజలి తనను బలవంతంగా అమన్గల్లోని స్పిన్నిం గ్ మిల్లులో అమ్మ పనికి పెట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేసి చదువు పట్ల తనకున్న ఆకాంక్ష తెలియజేయడంతో స్పిన్నింగ్ మిల్లులో మగ్గుతున్న బాలల వేదన వెలుగులోకి వచ్చింది. తక్కువ జీతం.. ఎక్కువ పనిచేస్తారని.. తక్కువ వేతనానికి ఎక్కువ పనిచేస్తారన్న విశ్వాసంతో అనేక స్పిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ఒడిశా, శ్రీకాకుళం, ఛత్తీస్గఢ్ నుంచి కార్మికులను తీసుకొస్తున్నారు. వారికి మిల్లు పరిసరాల్లోనే నివాసం ఏర్పాటుచేస్తున్నారు. వారి ఇళ్లు కూడా పిచ్చుక గూళ్లను తలపించేవిగా ఉన్నాయి. ఒక్కొక్క స్పిన్నింగ్ మిల్లులో 500 నుంచి 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కల్వకుర్తిలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్, ఆమన్గల్ సూర్యలక్ష్మి కాటన్మిల్లు, మిడ్జిల్లోని సూర్యలత స్పిన్నింగ్ మిల్లు, అడ్డాకులలోని ప్రగతి, శ్రీవాస స్పిన్నింగ్ మిల్లుల్లో 20, 25 ఏళ్లుగా కార్మికులుగా పనిచేస్తున్నా.. ఇంకా పర్మనెంట్ చేయలేదు. మిల్లుల్లో జరుగుతున్న తంతు ఇదీ.. మిల్లులో పనిచేసే వారికి మొదట చేరినప్పుడు ఇచ్చే రోజువారీ కూలీని సకాలంలో పెంచడం లేదు. స్కిల్డ్, అన్స్కిల్డ్ లేబర్కు వేతనాల్లో పెద్దగా తేడా లేదు. జిల్లాలోని రెండు మిల్లుల్లో ఒడిశా కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వారు జీతాలను పెంచాలని పెద్దగా డిమాండ్ చేయకపోవడంతో యాజమాన్యాలు వారికే అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నాయి. మిల్లుల వద్ద కార్మిక సంఘాలు ఏర్పాటు చేయాలని ఎవరైనా కార్మికులు ప్రయత్నిస్తే వెంటనే వారిని తొలగిస్తున్నారు. దీనివల్ల ఇతర కార్మికులు సంఘాల జోలికి వెళ్లడం లేదు. మిల్లులో ఇచ్చే కూలిని బయటకు చెప్పడానికి కార్మికులు భయపడే పరిస్థితులున్నాయి. ప్రధాన కార్మిక సంఘాలు కూడా మిల్లుల్లో తమ సంఘం కార్యవర్గం ఏర్పాటు చేసుకోలేకపోతుండటంతో కార్మికుల పక్షాన యాజమాన్యాలను నిలదీసే వారు లేరు. సంఘాలు ఏర్పాటైతే కార్మికుల జీతాలు, ఇతర సౌకర్యాలను పెంచాలని అడిగే అవకాశం ఉన్నందున అవి ఏర్పాటు కాకుండా యాజమాన్యాలు జాగ్రత్త పడుతున్నాయి. జిల్లాలో కేవలం కల్వకుర్తిలోని సూర్యలత కాటన్ మిల్లులో మాత్రమే కార్మిక సంఘం ఉన్నట్లు తెలిసింది. సంక్షేమానికి చెల్లుచీటీ.. రోగాలపాలైన కార్మికులు స్పిన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు దుమ్ము, ధూళి వల్ల దీర్ఘకాలిక రోగాల పాలవుతున్నారు. కొన్ని స్పిన్నింగ్ మిల్లు యాజమాన్యాలైతే.. అనేక మంది కార్మికులకు పీఎఫ్ను సైతం అమలు చేయడం లేదు. ఇదేమని అడిగితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఇటువంటి సౌకర్యాలకు ఆసక్తి కనబర్చరని.. మొత్తం వేతనం ఇవ్వమంటారంటూ కుంటి సాకులు చెబుతుండడం విశేషం. రోజంతా కష్టపడినా నెలకు ఒక్కో కార్మికుడికి గిట్టుబాటయ్యేది రూ. 6 వేల నుంచి రూ.7 వేలు మాత్రమే. ఏ ఒక్క రోజు డ్యూటీకి హాజరుకాకపోయినా ఆ రోజు వేతనంలో కోత పడాల్సిందే. నెలసరి సెలవులు, ఈఎల్, సీఎల్ వంటి లీవుల సౌకర్యాలు మిల్లులో పనిచేసే పర్మనెంట్ కార్మికులకు వర్తిం చాల్సి ఉన్నా ఆయా మిల్లుల్లో వాటి ఊసే కనపడడం లేదు. మిల్లుల్లో జరిగే వ్యవహారాలు బయటకు పొక్కినా దానికి కార్మికులను బలిపశువులుగా చేయడం వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం, వేధించడం ఈ ప్రాంత మిల్లు యజమానులకు పరిపాటిగా మారిందని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంజలిని చదివించేందుకు సిద్ధం: కలెక్టర్ చదువుపై ఆసక్తి ఉన్న అంజలిని చదివించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. అంజలిపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి కలెక్టర్ స్పందించారు. ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. బాలకార్మికులతో పనిచేయించుకుంటున్న స్పిన్నింగ్ మిల్లులపై తక్షణమే విచారణ చేపడతామని, బాలకార్మికులు ఉన్నట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై జిల్లావ్యాప్తంగా ప్రత్యేక దాడులు నిర్వహస్తామన్నారు. 9 ఏళ్ల నుంచి చేస్తున్నా జీతం రూ. 7 వేలే.. తొమ్మిదేళ్ల నుంచి స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నా. వేతనం రూ.7 వేలు వస్తుంది. నెలకు 26 రోజులు కచ్చితంగా పనిచేయాల్సిందే. పీఎఫ్ నెలకు రూ.700 కట్ చేస్తున్నారు. ఆ జీతంతో కుటుంబం గడవటం కష్టంగా ఉంది. వేతనాలు పెంచితే మాకు బాగుంటుంది. - సుల్తానా బేగం, కార్మికురాలు, కల్వకుర్తి రెండు నెలలే పనిచేయాల్సి వచ్చింది నేను బాలానగర్ నుంచి స్పిన్నింగ్ మిల్లులో పనిచేయడానికి రోజూ వస్తుంటా. మూడేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నా. గతేడాది ఆరు నెలలు పనిచేశాను. ప్రస్తుతం పత్తి దిగుబడి తక్కువగా ఉండడంతో రెండు నెలలు మాత్రమే పని ఉంటుందని యజమానులు తెలుపుతున్నారు. మాకు సరిపడా పని ఇవ్వాలి. అలాగే, కూలీ తక్కువగా ఉండటంతో కుటుంబాలు గడవటం కష్టంగా ఉంది. -నిర్మల, రోజు కూలీ, షాద్నగర్ రోజూ రూ. 225 ఇస్తున్నారు రెండేళ్లుగా ఇదే స్పిన్నింగ్ మిల్లో రోజు కూలీగా పనిచేస్తున్నాను. సంవత్సరంలో ఆరు నెలలు పని దొరుకుతుంది. మొదటి సంవత్సరం రోజుకు రూ.180, రెండో సంవత్సరం రోజుకు రూ.190, ప్రస్తుతం రోజుకు రూ.225 ఇస్తూ స్పిన్నింగ్మిల్కు వచ్చిపోవడానికి ఆటోను ఏర్పాటు చేశారు. అదనపు గంటలు పనిచేస్తే భోజనం పెట్టి, మరో రూ.10 ఇస్తున్నారు. కూలి పెంచితే సంతోషిస్తాం. -సంతోష, రోజు కూలీ, బాలానగర్ -
హై‘టెన్షన్’ బతుకులు
రైల్వేస్టేషన్ : రైల్వేలో విద్యుత్ విభాగం కీలకమైంది. హైటెన్షన్ వైర్లుతో విద్యుత్ సరఫరా అవుతుంటోంది. అయితే అంతరాయం కలిగినప్పుడు కార్మికులు ప్రాణాలుకు కూడా లెక్కచేయకుండా పనిచేయాలి. విభాగంలో సమన్వయలోపంతోనూ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. దీంతో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. రైల్వే ట్రాక్ మీద ఉన్న ఇరవై ఐదు వేల కిలోవాట్స్ విద్యుత్ లైన్లో ఆరు నెలల కాలంలో పలువురు కార్మికులు ప్రమాదాలకు లోనయ్యారు. 25 వేల కిలో వాట్స్ విద్యుత్ లైన్లో పనిచేసే కార్మికులకు పూర్తిస్థాయిలో రక్షణ కరువైంది. గతంలో విజయవాడకు చెందిన సీనియర్ సెక్షన్ ఇంజినీరు ఓహెచ్ఈ ఒకరు గన్నవరం రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే యార్డులో విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఇదే డిపోలో హెల్పర్గా పనిచేస్తున్న కార్మికుడు కొండపల్లి యార్డులో విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. విజయవాడ డివిజన్ పరిధిలోని రేగుపాలెంలో ఒక కార్మికుడు ప్రమాదానికి గురయ్యాడు. డిసెంబర్ నుంచి విజయవాడ డివిజన్ పరిధిలోని ఓహెచ్ఈ విద్యుత్ విభాగంలోని పనిచేస్తున్న కార్మికులు ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు. ఎంతో ప్రమాదకరమైన విద్యుత్ లైన్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
సార్వత్రిక సమ్మె సక్సెస్
పరిగి : కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలని టీఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హ న్మంతు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి మాధవరం వెంకటయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పీర్ మహ్మద్ తదితరులు పేర్కొన్నారు. ఆయా పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పరిగిలో చేపట్టిన సార్వత్రిక సమ్మె అందరి భాగస్వామ్యంతో విజయవంతం అ యింది. ఇందులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా లు, వీఆర్ఏలు, ఏఎన్ఎంలు, ఆర్వీఎం కాం ట్రాక్టు ఉద్యోగులు, ఆశ వర్కర్లు సమ్మెలో పాల్గొని పరిగిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు మూసివేయించారు. సీపీఐ ఆధ్వర్యంలో బస్స్టాండు ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛం దంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బస్సులన్నీ డిపోకే పరిమిత మయ్యాయి. సమ్మెలో భాగంగా డిపో ఎదుట టీఎం యూ, టీఎన్ఎంయూ, ఎంప్లాయిస్ తదితర యూనియన్ల ఆర్టీసీ కార్మికులు బస్ డిపో ముం దు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆచా సంఘాలు, యూనియన్ల నాయకులు శ్రీశైలం, వెంకట్, ప్రశాంత్, రాజశేఖర్,రవి, వెంకట్రాములు, మల్లేశం, బాలు, నిరంజన్, ఎస్జేఎం రెడ్డి, శ్రీనివాస్, మంజుల, సక్కుబాయి, స్వరూప, పద్మ పాల్గొన్నారు. -
టీడీపీది కార్మిక వ్యతిరేక విధానం
సాక్షి, హైదరాబాద్: కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్పై బుధవారం శాసనమండలిలో చర్చకు అనుమతించకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టాయి. అధికార టీడీపీది కార్మిక వ్యతిరేక విధానమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్)లు విమర్శించాయి. బుధవారం మండలి సమావేశాలు ప్రారంభం కాగానే బంద్పై చర్చకు అనుమతించాలని కోరుతూ సీపీఐ, పీడీఎఫ్ సభ్యులు చైర్మన్ చక్రపాణికి వాయిదా తీర్మానాలు అందజేయగా, ఆయన తిరస్కరించారు. చర్చకు అనుమతించాలంటే మరో విధానంలో సభ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇదే సమయంలో తక్షణమే బంద్పై చర్చను చేపట్టి, కార్మికులకు సంఘీభావంగా సభలో తీర్మానం చేయాలంటూ వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇంతలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి జోక్యం చేసుకుంటూ దీనిపై వేరే సందర్భంలో చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. ఆ తర్వాత కూడా చర్చకు పట్టుబట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో వైఎస్సార్సీపీ, సీపీఐ, కాంగ్రెస్, పీడీఎఫ్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వ తీరు దారుణం: ప్రతిపక్ష సభ్యులు బంద్లో ఉన్న కార్మికులకు సంఘీభావంగా సభలో చర్చిద్దామంటే ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమని సీపీఐ సభ్యుడు పి.జె.చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మండలి నుంచి వాకౌట్ చేసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. పీడీఎఫ్ పక్ష నేత బాలసుబ్రమణ్యం, కాంగ్రెస్ సభ్యుడు చెంగల్రాయుడు కార్మికులపై ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. -
సమ్మె సంపూర్ణం
డిపోలకే పరిమితమైన బస్సులు * హైదరాబాద్లో రోడ్డెక్కని 70 శాతం ఆటోలు * లారీలు తిరగకపోవటంతో స్తంభించిన సరుకు రవాణా సాక్షి, హైదరాబాద్: రోడ్డు భద్రత బిల్లుతోపాటు కార్మిక చట్టాల్లో మార్పులకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పది ప్రధాన కార్మిక సంఘాల పిలుపుతో బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె సంపూర్ణంగా జరిగింది. తెలంగాణలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజామున కొన్ని జిల్లా సర్వీసులు రోడ్డెక్కినప్పటికీ ఆ తర్వాత ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం ఆరు తర్వాత సమ్మె ముగిసినట్టు ప్రకటించటంతో క్రమంగా బస్సులు రోడ్డెక్కాయి. తెలంగాణలో నిత్యం 11,688 బస్సు సర్వీసులు నడవాల్సి ఉండగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 310 సర్వీసులు మాత్రమే నడిచాయి. బస్సులు తిరగకపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమ్మెకు ఆటో సంఘాలు, లారీ యజమానుల సంఘం సంపూర్ణ మద్దతు తెలపటంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. హైదరాబాద్లో ఒక ఆటో సంఘం సమ్మెలో పాల్గొనకపోవటంతో 30 శాతం వరకు ఆటోలు తిరిగాయి. లారీలు, ట్రాలీలు పూర్తిగా నిలిచిపోవటంతో సరుకు రవాణా కూడా స్తంభించింది. సాధారణంగా దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలు రాష్ట్రంలో అంతగా విజయం సాధించే పరిస్థితి ఉండదు. కానీ, ఈసారి రోడ్డు భద్రత చట్టం, కార్మిక చట్టాల అంశాలు ప్రధాన ఎజెండా కావటంతో స్థానిక సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో సమ్మె విజయవంతమైంది. సింగరేణి కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించటంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. రైల్వే సంఘాలు సమ్మెకు సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించినా.. రైళ్లు మాత్రం యథావిధిగానే నడిచాయి. చాలావరకు బ్యాంకులు యథావిధిగానే పనిచేశాయి. కొన్ని చోట్ల కార్మిక సంఘాల ప్రతినిధులు బ్యాంకులను బలవంతంగా మూసివేయించారు. పలు ప్రాంతాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు జరిగాయి. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని కార్మిక ప్రతినిధులు నినదించారు. భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించేందుకు త్వరలో జాతీయ కార్మిక సంఘాలు ఢిల్లీలో నిర్వహించే సదస్సులో ఆర్టీసీ సహా పలు సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని నిర్ణయించారు. ఏపీలోనూ సమ్మె సక్సెస్ సాక్షి, విజయవాడ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రంలో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మె జయప్రదమైంది. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు నిర్వహించాయి. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కర్నూలులో కార్మికులు, పోలీసులకుమధ్య తోపులాట చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన బ్యాంకులు, ఫ్యాక్టరీలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు మూతపడ్డాయి. బుధవారం మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, లారీలు రోడ్లపైకి రాలేదు. నిరసన ర్యాలీలకు సీపీఐ, సీపీఎం, వైఎస్సార్టీయూసీ రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, మధు, పి.గౌతంరెడ్డి నాయకత్వం వహించారు. రాజధానిలో ప్రశాంతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా ముగిసింది. నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోలు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. స్కూల్ ఆటోలు కూడా బంద్లో పాల్గొనడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. గ్రేటర్లోని 28 డిపోలకు చెందిన సుమారు 3,500 బస్సులు, లక్షకు పైగా ఆటోలు బంద్లో పాల్గొనడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లోకల్ రైళ్లపై ఆధారపడి రాకపోకలు సాగించారు. సమ్మె నేపథ్యంలో ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రయాణికులతో కిక్కిరిసాయి. మరోవైపు రవాణా బంద్ కారణంగా సెవెన్ సీటర్ ఆటోలు, టాటా ఏస్ వంటి వాహనాలు ప్రయాణికులను నిలువుదోపిడీ చేశాయి. -
సార్వత్రిక బంద్
రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తం బుధవారం సాయంత్రం నుంచి బెంగళూరులో బస్ల సంచారం బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతి రేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా పిలుపునిచ్చిన బంద్ రాష్ట్రంలో విజయవంతమైంది. బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్ర రాజధాని బెంగళూరుతో పాటు రాచనగరి మైసూరు, దావణగెరె, శివమొగ్గ, కోలారు, మండ్య, గుల్బర్గా, మంగళూరు తదితర ప్రాంతాలన్నింటిలో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. బంద్ నేపథ్యంలో బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ బస్లు పూర్తిగా బస్టాండ్లకే పరిమితమయ్యాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు సైతం ముందు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో విద్యాలయాలన్నీ స్తబ్దుగా మారాయి. ఇక ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించని నేపథ్యంలో ఉద్యోగులు ఉదయాన్నే తమ విధుల కోసం బయలుదేరారు. బుధవారం ఉదయం కొన్ని బస్లు రోడ్లపైకి వచ్చినప్పటికీ ఆందోళన కారులు బస్లపై దాడులకు దిగడంతో అధికారుల బస్ల సంచారాన్ని నిలిపేశారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారు బస్ల సంచారం నిలిచిపోవడంతో బస్టాండ్లలోనే కాలాన్ని వెళ్లదీయాల్సి వచ్చింది. బుధవారం ఉదయం నుంచి అక్కడక్కడా కొన్ని ఆటోలు నగర రోడ్లపై కనిపించినా, సాధారణ చార్జీ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఆటో చార్జీలు వసూలు చేయడంతో సామాన్యుడు ఉసూరుమనాల్సిన పరిస్థితి ఎదురైంది. కాగా, మెట్రో రైలు మాత్రం సాధారణంగానే నడిచింది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది నగర వాసులు మెట్రో రైలులో ప్రయాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. కాగా, బుధవారం సాయంత్రానికి తిరిగి బస్ల సంచారం ప్రారంభమైంది. ఇక బంద్ ప్రభావం ఉన్నప్పటికీ నగరంలోని సినిమా థియేటర్లు, హోటళ్లు, పెట్రోల్ బంక్లు సాధారణంగానే పనిచేశాయి. -
స్తంభించిన భారత్
దేశవ్యాప్తంగా సమ్మె కట్టిన కార్మికులు.. ఆగిన జనజీవనం కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా 10 కేంద్ర కార్మిక సంఘాల పిలుపు * 15 కోట్ల మంది కార్మికుల సమ్మె.. స్తంభించిన రవాణా.. పోస్టల్, బీఎస్ఎన్ఎల్ సేవలపై ప్రభావం * సగానికి తగ్గిన బొగ్గు ఉత్పత్తి.. సార్వత్రిక సమ్మెకు అనూహ్య స్పందన: కార్మిక సంఘాల హర్షం * దేశంలో సమ్మె ప్రభావం స్వల్పమే: కేంద్ర ప్రభుత్వం ప్రకటన న్యూఢిల్లీ: కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జరిగిన దేశవ్యాప్త సమ్మె.. వివిధ ప్రాంతాల్లో ప్రజా జీవనంపై ప్రభావం చూపింది. బొగ్గు ఉత్పత్తి, బ్యాంకు లావాదేవీలు, రవాణా సేవలు దాదాపుగా స్తంభించిపోయాయి. సమ్మె సందర్భంగా పశ్చిమబెంగాల్లో ముర్షీదాబాద్ జిల్లా సహా పలు చోట్ల అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, వామపక్షాల కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తటంతో దాదాపు వేయి మందిని అరెస్ట్ చేశారు. కార్మిక చట్టాల్లో మార్పులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణలను వ్యతిరేకిస్తూ, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర ట్రేడ్ యూనియన్లు ఇచ్చిన ఈ సమ్మె పిలుపుతో పదిహేను కోట్ల మందికి పైగా సంఘటిత రంగ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని ఆయా సంఘాల నేతలు పేర్కొన్నారు. కేంద్రంలో అధికార బీజేపీ అనుబంధ కార్మిక సంస్థలయిన బీఎంఎస్, ఎన్ఎఫ్ఐటీయూలు సమ్మెకు దూరంగా ఉన్నాయి. సమ్మె ప్రభావం పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఒడిశా తదితర ప్రాంతాల్లో అధికంగా కనిపించగా.. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, తమిళనాడు, గోవా, గుజరాత్, బిహార్, జార్ఖండ్లలో పాక్షికంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, రాజస్థాన్లలో సాధారణ ప్రజాజీవనంపై సమ్మె ప్రభావం చూపించింది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో మాత్రం.. బ్యాంకుల కార్యకలాపాల్లో మినహా పెద్దగా ప్రభావం లేదు. అయితే ముంబై పోర్టు ట్రస్టులో కార్యకలాపాలూ పూర్తిగా స్తంభించాయి. ప్రభుత్వ నిర్వహణలోని కోల్ ఇండియా సంస్థ రోజు వారీ 17 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా.. బుధవారం సమ్మె కారణంగా అది సగానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా గల 4 లక్షల మంది బొగ్గు కార్మికుల్లో అధికభాగం సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణలోని సింగరేణి కాలరీస్లో సమ్మె సంపూర్ణమైంది. ఎన్ఎండీసీ పైనా సమ్మె ప్రభావం చూపింది. దాదాపు 4,200 మంది కార్మికులు సమ్మె చేయటంతో ఇనుప ఖనిజం ఉత్పత్తి 75,000 టన్నులు పడిపోయింది. విద్యుత్ ఉత్పత్తి, ఇతర సేవలు అధికశాతం సాధారణంగానే కొనసాగాయి. ప్రజల భ్రమలు తొలగిపోయాయి: ట్రేడ్ యూనియన్లు సమ్మె పిలుపుకు అనూహ్య స్పందన లభించిందని.. లక్షలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని పది ట్రేడ్ యూనియన్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. హరియాణా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సులు నిలిచిపోయాయని.. రక్షణ ఉత్పత్తి రంగంలోనూ 5 లక్షల మంది సమ్మెలో పాల్గొన్నారని పేర్కొన్నాయి. పోస్టల్ సేవలు, బీఎస్ఎన్ఎల్ టెలికాం కార్యకలాపాలపైనా సమ్మె ప్రభావం చూపిందని తెలిపాయి. ‘‘ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల పట్ల, ఆహార ధరలను నియంత్రించటంలో వైఫల్యం పట్ల, ఆర్థిక మందగమనాన్ని నిరోధించటంలో వైఫల్యం పట్ల ప్రజలు ఎంతగా భ్రమలు కోల్పోయి ఉన్నారో ఈ సమ్మె చూపుతోంది. కొన్ని ప్రాంతాల్లో బీఎంఎస్ వాళ్లు కూడా సమ్మెలో పాల్గొన్నారు’’ అని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి గురుదాస్దాస్గుప్తా పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లో సమ్మెను విఫలం చేయటానికి మమతా బెనర్జీ ప్రభుతవ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని వామపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునివ్వగా.. కేంద్రంలోని అధికార బీజేపీకి తనను విలువైన మిత్రపక్షంగా చూపుకునేందుకు సీఎం మమత ఈ సమ్మెను వ్యతిరేకించారని విమర్శించాయి. ఆశ్రీత పెట్టుబడుదారుల కోసమే మోదీ సర్కారు: కాంగ్రెస్ సమ్మెకు ప్రతిపక్ష కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. కార్మికుల ఆందోళన పట్ల ప్రభుత్వం సానుభూతిగా లేదని విమర్శించింది. ‘‘దేశంలోని లక్షలాది మంది కార్మికులను పణంగా పెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రయోజనం కలిగించాలనుకున్న బ్రిటిష్ వాళ్ల తరహాలోనే.. ప్రభుత్వానికి మిత్రులుగా ఉన్న ఐదారుగురు ఆశ్రీత వ్యాపారులకు ప్రయోజనం కలిగించాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్సింఘ్వీ విలేకరులతో వ్యాఖ్యానించారు. సమ్మె ప్రభావం స్వల్పమే: కేంద్రం కార్మిక సంఘాల సమ్మె ప్రభావం దేశంలోని చాలా ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం చూపలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కార్మిక సంఘాలు చేస్తున్న 12 డిమాండ్లలో 9 డిమాండ్ల విషయంలో వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు సిద్ధమంటూ సంకేతాలిచ్చింది. మొత్తం 12 కేంద్ర కార్మిక సంఘాల్లో రెండు సంఘాలు సమ్మెలో పాల్గొనలేదని, మూడు సంఘాలు తటస్థంగా ఉన్నాయని.. కేవలం ఏడు సంఘాలు మాత్రమే సమ్మెకు వెళ్లాయని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనినిబట్టి.. కార్మికులు తమ డిమాండ్లను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగినన్ని బొగ్గు నిల్వలు ఉన్నందున.. సమ్మె ప్రభావం పెద్దగా ఉండబోదని బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రి పియూష్గోయల్ పేర్కొన్నారు. మొత్తంగా సమ్మె వల్ల కీలకమైన ప్రభావం ఏమీ లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ వ్యాఖ్యానించారు. కార్మికులు, దేశ ప్రయోజనాల రీత్యా ఆందోళనను విరమించాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారుదత్తాత్రేయ మంగళవారం కార్మిక సంఘాలకు విజ్ఞప్తిచేశారు. ఆయన, కార్మికశాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్తో కలిసి టర్కీలో జీ-20 సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం బయల్దేరి వెళ్లారు. బెంగాల్లో ఘర్షణలు.. వేయి మంది అరెస్ట్ కోల్కతా: కార్మికుల సార్వత్రిక సమ్మె నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ - వామపక్షాల కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ప్రధానంగా ముర్షీదాబాద్ జిల్లాలోని బెర్హాంపూర్, దోమ్కాల్లలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాల నుంచి చిన్నపాటి ఘర్షణల వార్తలు వచ్చాయి. ముర్షీదాబాద్లోని పలు ప్రాంతాల్లో రాళ్లు విసురుకోవటం, స్వల్ప తీవ్రత గల బాంబులు విసురుకోవటం వంటి ఘటనలూ జరిగినట్లు పోలీసులు తెలిపారు. తమ పార్టీ ప్రదర్శనపై తృణమూల్ కార్యకర్తలు దాడి చేయటంతో పార్టీ మాజీ ఎంపీ మొయినుల్హసన్తో పాటు 15 మంది గాయపడ్డారని సీపీఎం పేర్కొంది. అయితే.. తృణమూల్ జిల్లా అధ్యక్షుడు మనన్నన్ హొసైన్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. సీపీఎం కార్యకర్తలే తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని.. ఇందులో తన కారు కూడా ధ్వంసమైందని ప్రత్యారోపణ చేశారు. ఘర్షణలకు సంబంధించి మొత్తంగా కోల్కతా నగరంలో 50 మందిని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 974 మందిని అరెస్ట్ చేసినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ముర్షీదాబాద్ ఘటనలో.. ఎర్రజెండాలు పట్టుకున్న వాళ్లు తృణమూల్ కార్యకర్తలను కొడుతున్నట్లు కనిపించిందని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తృణమూల్ కార్యకర్తలు హింసకు దిగాల్సిన అవసరమేముందని ఆమె వ్యాఖ్యానించారు. అయితే.. సార్వత్రిక సమ్మెను విఫలం చేయటానికి తృణమూల్ సర్కారు పశుబలం ఉపయోగిస్తోందని రాష్ట్ర లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్బోస్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు తనను మిత్రపక్షంగా చూపుకునేందుకు మమత ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కార్మిక సంఘాల డిమాండ్లివీ.. * ధరల పెరుగుదలను నియంత్రించేందుకు అత్యవసర చర్యలు చేపట్టడం. * నిరుద్యోగితను నియంత్రించడం * కార్మిక చట్టాలను నిక్కచ్చిగా అమలు చేయడం * వీటిని ఏకపక్షంగా సవరించకుండా ఉండడం * కార్మికులందరికీ సార్వత్రిక సామాజిక భద్రత * నెలకు రూ. 15 వేలు కనీస వేతనం ఇవ్వడం * పెన్షన్ల పెంపుదల * పీఎస్యూల్లో పెట్టుబడుల వాపసును నిలిపివేయడం * కాంట్రాక్టు వ్యవస్థకు స్వస్తి పలకడం * భవిష్యనిధి, బోనస్లపై పరిమితి తొలగించడం * కార్మిక సంఘాలు 45 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం తప్పనిసరి చేయడం * రైల్వేలు, రక్షణ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిలిపివేయడం కార్మిక సంఘాలు తమ 12 డిమాండ్ల పత్రంపై గత నెలలో మంత్రివర్గ కమిటీతో జరిపిన చర్చలు విఫలమవటంతో బుధవారం దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
సమ్మె...సక్సెస్
నల్లగొండ : కార్మిక సంఘాల ఆధ్వర్యం లో తలపెట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సమ్మె ప్రశాంతంగా ముగి సింది. కార్మిక సంఘాలకు మద్దతుగా వివిధ రాజకీయ పక్షాలు తమ సంఘీభావాన్ని తెలిపాయి. సమ్మెలో కేంద్ర ప్రభు త్వ ఉద్యోగులు, సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలు, ఆర్టీసీ కార్మికులు, ట్రేడ్ యూనియన్లు, ఆటో వర్కర్లు, హమాలీ, భవన నిర్మాణ రంగ కార్మికులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. సమ్మెకు మద్దతుగా బుధవారం జరగాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు. కార్మికులకు సమ్మెకు మద్దతుగా సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జిల్లా వ్యాప్తం గా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వాహనాలు, ఆటోలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు నిలిపేశారు. జిల్లా కేంద్రంలో భోజన విరామసమయంలో రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి సమ్మెకు మద్దతు తెలిపాయి. స్థానిక గడియారం సెంటర్ వద్ద కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. భువనగిరి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఆగిపోయా యి. అన్ని మండలాల్లో వివిధ కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాలు కలిసి బైక్ ర్యాలీలు నిర్వహించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. మిర్యాలగూడలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాజీవ్ చౌక్ వద్ద సభ నిర్వహించారు. వేములపల్లిలో సీఐటీ యూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా....దామరచర్లలో అద్దంకి - నార్కట్పల్లి రహదారిపై కార్మికులు మానవహారం నిర్వహించారు. కోదాడ లో కార్మిక సంఘాలు, అనుబంధ సం ఘాలు కలిసి పట్టణంలో బైక్ ర్యాలీలు నిర్వహించాయి. ఆర్టీసీ బస్టాండ్, రంగా థియేటర్ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. నకిరేకల్లో సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యం లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఆటోలతో ర్యాలీతో నిరసన తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీ లు నిర్వహించారు. చౌటుప్పల్లో సీఐటీ యూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో వ్యాపార సంస్థలను బంద్ చేశారు. సంస్థాన్ నారాయణపురంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. మునుగోడులో ర్యాలీ తీశారు. చండూరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆలేరు ఆత్మకూరు (ఎం), బొమ్మలరామారం, రాజాపేట, గుండా ల, తుర్కపల్లి మండలాల్లో కార్మిక సం ఘాలు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిం చారు. హుజూర్నగర్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, టీఆర్ఎస్కేవీ, వైఎస్సార్సీపీటీ యూ, కార్మిక సంఘాలు, అనుబంధ సం ఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేశారు. మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచ ర్ల, మేళ్లచెర్వులో ప్రధాన రహదారులపై ర్యాలీలు నిర్వహించారు. తిరుమలగిరి, మోత్కూరు, నూతనకల్, తుంగతుర్తి, శాలిగౌరారం, అర్వపల్లి మండల కేం ద్రాల్లో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి రాస్తారోకో చేశారు. దేవరకొండలో కార్మి క సంఘాలు తలపెట్టిన సమ్మెలో ఎమ్మె ల్యే రవీంద్రకుమార్ పాల్గొన్నారు. -
నేడు దేశవ్యాప్త సమ్మె
10 కార్మిక సంఘాల పిలుపు మౌలిక సేవలపై ప్రభావం న్యూఢిల్లీ: కార్మిక చట్టాల్లో మార్పులను వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో నిత్యావసరాలతో పాటు రవాణా, బ్యాంకింగ్ తదితరాలపై ప్రభావం పడనుంది. 10 సంఘాలు సమ్మెలో పాల్గొంటుండగా, బీజేపీ అనుబంధసంస్థ బీఎంఎస్(భారతీయ మజ్దూర్ సంఘ్), నేషనల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సమ్మెలో పాల్గొనొద్దని నిర్ణయించాయి. బ్యాంకులు, బీమా కంపెనీలు తదితర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 10 సంఘాలకు ఉమ్మడిగా 15 కోట్ల మంది సభ్యులున్నారని, రవాణా, విద్యుత్, గ్యాస్, తదితరాల సరఫరాలో అంతరాయం కలగనుందని సంఘాల నేతలు తెలిపారు. అయితే, విద్యుత్, గ్యాస్ వంటి ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు సమ్మెలో లేనందున వీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని బీఎంఎస్ పేర్కొంది. 12 డిమాండ్లు..: కార్మిక చట్టాల్లో చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవద్దనే తదితర 12 డిమాండ్లతో కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. డిమాండ్లపై ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఎలాంటి పరిష్కారం దొరకకపోవడంతో ఈనెల 2న సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించడం తెలిసిందే. కార్మిక సంఘాల తరఫున ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి డీఎల్ సచ్దేవ్ మాట్లాడుతూ.. 'ప్రభుత్వ గుర్తింపు పొందిన 10 సంఘాలు బుధవారం సమ్మె చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీఎంఎస్ శాఖలు కూడా సమ్మెలో పాల్గొంటాయి' అని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు మరికొంత సమయం ఇచ్చేందుకే సమ్మె నుంచి వైదొలగినట్లు బీఎంసీ, నేషనల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ తెలిపాయి. రోడ్డు రవాణా, భద్రత బిల్లును వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల రవాణా సంస్థలతోపాటు బొగ్గు కార్మికులూ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. వీరితోపాటు రిక్షా కార్మికులు, కూలీలు తదితర అసంఘటిత కార్మికులు సమ్మెలో పాలుపంచుకుంటారని ఏఐటీయూసీ నేత గురుదాస్ దాస్గుప్తా చెప్పారు. కాగా, దేశ ప్రజల, కార్మికుల ప్రయోజనాల కోసం సమ్మెను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. సమ్మె నుంచి బీఎంఎస్, నేషనల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్యూనియన్స్ వైదొలగాయని, మరో 2-4 సంఘాలు తటస్థంగా ఉన్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. మౌలిక అవసరాలపై సమ్మె ప్రభావం చూపబోదన్నారు. -
ఎక్కడి బస్సులు అక్కడే
రహదారి బిల్లును వ్యతిరేకిస్తూ నేడు సార్వత్రిక సమ్మె ఆటోలు సహా రవాణా వాహనాలన్నీ నిలిపివేత హైదరాబాద్: జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు బుధవారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. బస్సులతో పాటు ఆటోలు, క్యాబ్లు, లారీలు వంటి ప్రైవేటు రవాణా వాహనాలన్నీ ఆగిపోనున్నాయి. ఎన్ఎంయూలోని ఒక వర్గం మినహా మిగతా కార్మిక సంఘాలన్నీ సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించాయి. దీంతో బుధవారం బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈ సమ్మె నేపథ్యంలో ప్రత్యేకంగా ఆవిర్భవించిన జేఏసీ నేతలు థామస్రెడ్డి, రాజిరెడ్డి, శివాజీ, అంజయ్య తదితరులు సంపూర్ణ సమ్మె నిర్వహిస్తున్నట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కొత్తగా చేయబోయే చట్టం వల్ల రవాణా సంస్థల ప్రైవేటీకరణ జరిగే ప్రమాదం ఉందని, దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు పేర్కొన్నారు. అయితే సమ్మెకు సంబంధించి కార్మిక సంఘాలు ఇప్పటికే నోటీసు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక క్యాబ్ సర్వీసులు, ఆటోలు కూడా నిలిచిపోనున్నాయి. లారీ యజమానుల సంఘం కూడా సమ్మెకు సంఘీభావంగా లారీలను నిలిపివేయనున్నారు. ఇక సార్వత్రిక సమ్మెలో భాగంగా హైదరాబాద్లో మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు, ఆటోలు నిలిచిపోయాయి. ఐటీ కారిడార్లు మినహా నగరంలోని ఇతర ప్రాంతాల్లో సమ్మెలో పాల్గొననున్నట్లు ట్యాక్సీలు, క్యాబ్ల సంఘం ప్రకటించింది. దీంతో నగరంలోని 3,800 బస్సులు, లక్షా 25 వేల ఆటోల్లో రాకపోకలు సాగించే సుమారు 40 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడనుంది. పలు సంఘాల మద్దతు: కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు తెలంగాణ గ్రామీణాభివృద్ధి ఉద్యోగుల సంఘం (సెర్ప్/ఐకేపీ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బుధవారం అన్ని జిల్లాల్లో సెర్ ్ప /ఐకేపీ ఉద్యోగులందరూ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సయ్య పిలుపునిచ్చారు. కాగా సార్వత్రిక సమ్మెకు కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (యూసీసీఆర్ఐ-ఎంఎల్) ఏపీ, తెలంగాణ కమిటీ మద్దతు ప్రకటించింది. ఎన్డీయే ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె పిలుపును బలపరుస్తున్నట్లు ఆ పార్టీ కార్యదర్శి వినోద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
నేడు సర్వం బంద్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్) : కేంద్రప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికుల సంఘాల ఒక్కరోజు సార్వత్రిక సమ్మె నేపథ్యంలో బుధవారం జిల్లాలో సర్వం బంద్కానున్నాయి. బస్సులు, ఆటో లు, ఇతర ప్రజారవాణా వాహనాలు నిలిచిపోనున్నాయి. థియేటర్లు, పెట్రోల్బంకులు మూతపడనున్నాయి. అన్నిరంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. బీఎంఎస్ మినహా దేశవ్యాప్తంగా 12 కార్మికసంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. జిల్లావ్యాప్తంగా సుమారు రెండులక్షల మందికి పైగా వివిధరంగాల కార్మికులు సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఉంది. వీరితోపాటు మరో 20వేల మంది బీడీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఫ్యాక్టరీచట్టం సవరణల పేరుతో కార్మికుల హక్కులను కాలరాస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. సమ్మెకు టీజేఏసీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఉద్యోగ, ఉపాధ్యాయులు మధ్యాహ్నభోజన సమయంలో కలెక్టరేట్ ఆవరణలో ధర్నా నిర్వహించనున్నట్లు టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్రెడ్డి వెల్లడించారు. సమ్మెలో భాగంగా టీఎఫ్టీయూ ఆధ్వర్యంలో కొత్తూరు నుంచి జిల్లాకేంద్రం వరకు మోటార్సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ తెలిపారు. సమ్మెలో భాగంగా టీఎస్ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. రోడ్టు ట్రాన్స్పోర్టు, రోడ్డు భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా ఆర్టీసీ, ఆటో కార్మికులు సమ్మెకు మద్దతు ఇస్తున్నారు. ఈ బిల్లుతో ఆర్టీసీని ప్రైవేట్పరం చేసే కుట్ర జరుగుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. వివిధ సంఘాల మద్దతు నేడు నిర్వహించే సార్వత్రికసమ్మెకు వివిధ కార్మిక, పార్టీలు మద్దతు తెలిపాయి. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పర్వతాలు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాంమోహన్, సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, సీపీఐ జిల్లా కార్యదర్శి బాల్నర్సింహా, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కురుమూర్తి, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి హనుమంతు, టీఎంయూ రీజినల్ కార్యదర్శి డీఎస్ చారీ, ఈయూ రీజినల్ కార్యదర్శిసాయిరెడ్డి, ఎన్ఎంయూ నేత వహిద్, ఎస్డబ్ల్యూఎఫ్ నేత వీరాంజనేయులు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గాలెన్న మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో బంద్కు మద్దతు తెలిపారు. -
రేపు బస్సులు, ఆటోలు బంద్
-
రేపు బస్సులు, ఆటోలు బంద్
సార్వత్రిక సమ్మెకు సిద్ధం మెజారిటీ కార్మిక సంఘాల మద్దతు సిటీబ్యూరో: జాతీయ రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెతో సెప్టెంబర్ 2న (బుధవారం) నగరంలో సిటీబస్సులు, ఆటోలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా జరుగనున్న ఈ సమ్మెను నగరంలో విజయవంతం చేసేందుకు మెజారిటీ ఆర్టీసీ, ఆటో కార్మిక సంఘాలు సన్నద్ధమయ్యాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్లోని 3,800 సిటీ బస్సులు, 1.20 లక్షలకు పైగా ఆటో రిక్షాలు తిరిగే అవకాశం లేదు. ఆర్టీసీ ప్రధాన కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలిపాయి. కార్మికులంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం,తదితర కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతుగా నగరంలో ఆటోల బంద్కు పిలుపునిచ్చాయి. సమ్మెలో భాగంగా బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆటో సంఘాల నేతలు బి.వెంకటేశ్, ఎ.సత్తిరెడ్డి, నరేందర్ తదితరులు తెలిపారు. ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని... ఈ చలానాలు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
పరిశ్రమల్లో సమ్మె ‘సై’రన్
కార్మిక సంఘాల విస్తృత ప్రచారం నగర పరిశ్రమల సమస్యలపై డిమాండ్లు గాజువాక : కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో సమ్మెకు సైరన్ మోగింది. షేర్ల విక్రయం పేరుతో లాభాల్లో ఉన్న ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల్లో మార్పులపై శరవేగంగా ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిడికిలి బిగుస్తోంది. 11 కేంద్ర కార్మిక సంఘాలు 12 ప్రధాన డిమాండ్లపై సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంబంధిత కార్మిక సంఘాలు స్థానిక కార్మిక సంఘాలను సైతం కలుపుకొని సమ్మె సన్నాహాల్లో తలమునకలయ్యాయి. విశాఖ స్టీల్ప్లాంట్, భెల్, షిప్యార్డు వంటి కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమల్లోని ఆయా సంఘాల నాయకులు ఇప్పటికే తమ యాజమాన్యాలకు సమ్మె నోటీసులను సైతం అందజేశారు. సమ్మె విజయవంతానికి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ప్రచారం ముమ్మరం చేశారు. సార్వత్రిక సమ్మె డిమాండ్లు ఇవీ... కార్మిక హక్కులకు భంగం కలిగే చట్ట సవరణను నిలిపివేయాలి. హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులకు, కార్మిక నాయకులకు జైలు శిక్షల ప్రతిపాదనలు రద్దు చేయాలి. {పభుత్వరంగ పరిశ్రమల్లో షేర్ల విక్రయాన్ని నిలిపివేయాలి.రైల్వే, డిఫెన్స్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రద్దు చేయాలి. ప్రధాన పరిశ్రమల్లో... విశాఖపట్నం స్టీల్ప్లాంట్...స్టీల్ప్లాంట్ పెట్టుబడుల విక్రయాల ప్రతిపాదనను విరమించాలి.ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలి.హుద్హుద్ నష్ట పరిహారంగా ప్లాంట్కు రెండేళ్లపాటు టాక్స్ హాలిడే ప్రకటించాలి.స్టీల్ప్లాంట్ నిర్వాసితుల ఉపాధి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి.కార్మికులకు సంబంధించిన అన్ని రకాల హక్కులు, సౌకర్యాలను వెంటనే అమలు చేయాలి.స్టీల్ప్లాంట్ను జాతికి అంకితం ఇస్తున్న సందర్భంగా ప్రతి కార్మికునికి ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలి. భెల్ (బీహెచ్పీవీ)... 1997 వేతన సవరణ అమలు చేయడంతోపాటు, ఏరియర్స్ చెల్లించాలి.రిటైర్ కాబోతున్న కార్మికులు, ఉద్యోగులకు భెల్ మాదిరిగా మెడికల్, పెన్షన్ స్కీమ్లను ప్రకటించాలి.కార్మికులకు కొత్త ఇన్సెంటివ్ స్కీమ్ ప్రకటించాలి.{పమోషన్లను వెంటనే అమలు చేయాలి.ర్వీస్ సెక్షన్లలో ఉన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలి. షిప్యార్డు: షిప్యార్డు కార్మికులకు రావాల్సిన రూ.54కోట్ల గత వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి.ఎల్ అండ్ ఎం సిరీస్ కార్మికులను పర్మినెంట్ చేయాలి.అన్ని కేటగిరీల్లో ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి.పోస్టు రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్ను వెంటనే అమలు చేయాలి.నూతన పింఛను పథకాన్ని ఇతర పరిశ్రమల మాదిరిగా అమలు చేయాలి. కొత్తగా రిక్రూట్ అయినవారికి ప్రమోషన్లలో అన్యాయాన్ని అరికట్టాలి. -
సమ్మెలోనే మునిసిపల్ కార్మికులు
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్) : వేతనాల పెంపు, ఇతర డిమాండ్లతో జిల్లాలోని మునిసిపల్ పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఏలూరు నగరం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో కార్మికుల సమ్మె ఆదివారం 10వ రోజుకు చేరింది. కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో ఆయా పట్టణాల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి చేయి దాటుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విమర్శల పాలవుతోంది. కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఇదిలావుండగా, తాడేపల్లిగూడెంలో మునిసిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి కార్మికులు ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కర్రి నాగేశ్వరరావు, ధనాల వెంకట్రావు, బోడా భోగిరాజు, కాటమరాజు, విజయకుమార్, తాటికొండ శ్రీనివాసరావు, అల్లం రాము, మండెల్లి రామకృష్ణ, కొడమంచిలి ముత్యం, అల్లం నరేంద్రకుమార్ పాల్గొన్నారు.