UN
-
జనాభా తగ్గుతోంది... వృద్ధులు పెరుగుతున్నారు
ఇటు జనాభా క్షీణిస్తోంది. అటు వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చైనా సహా అనేక దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లివి. పెళ్లికి, పిల్లలను కనేందుకు యువతరం పెద్దగా ఇష్టపడటం లేదు. కాస్త అటూ ఇటుగా ప్రపంచమంతటా ఇదే ధోరణి పెరుగుతోంది. దాంతో ఏ దేశంలో చూసి నా జనాభా క్రమంగా తగ్గుతోంది. 2024లో చైనా జనాభా 10.4 లక్షలు తగ్గింది. అక్కడ జనాభా తగ్గడం వరుసగా ఇది మూడో ఏడాది. జపాన్లోనైతే 15 ఏళ్లుగా జనాభా వరుసగా తగ్గుము ఖం పడుతోంది. దక్షిణ కొరియాలో 2023లో కాస్త పుంజుకున్న జనాభా ఈ ఏడాది మళ్లీ తగ్గింది. ఇటలీలో జననాల సంఖ్య 19వ శతాబ్దం తరవాత తొలిసారి 4 లక్షల కంటే తక్కువకు పడిపోయింది. 63 దేశాలు, భూభాగాల్లో జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరిందని ఐరాస అంచనా. వచ్చే 30 ఏళ్లలో మరో 48 దేశాలు ఆ స్థాయికి చేరతాయని సంస్థ పేర్కొంది. 60 ఏళ్లలో ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందని, అక్కడినుంచి క్షీణించడం మొదలవుతుందని అభిప్రాయపడింది. చైనాలో రిటైర్మెంట్ వయసు పెంపు మరోవైపు ఆరోగ్య సంరక్షణ, మెరుగైన జీవనశైలి, ఆయుర్దాయం పెరుగుదల తదితరాలతో చాలా దేశాల్లో వృద్ధుల జనాభా నానాటికీ పెరిగిపోతోంది. చైనాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దాంతో ఆర్థిక వృద్ధి దెబ్బ తింటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు చైనా నానా ప్రయత్నాలు చేస్తోంది. పురుషుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 63 ఏళ్లకు పెంచింది. ఫ్యాక్టరీ, బ్లూ కాలర్ ఉద్యోగాల్లో మహిళలకు 50 నుంచి 55కు, వైట్–కాలర్ ఉద్యోగాల్లో 55 నుంచి 58కు పెంచింది. 2022 నుంచి చైనాలో జనాభా తగ్గుముఖం పట్టడం మొదలైంది. దాంతో అత్యధిక జనాభా రికార్డును 2023లోనే భారత్కు కోల్పోయింది. ఒకే సంతానం నిబంధనను సడలించి ముగ్గురిని కనేందుకు అనుమతించినా లాభం లేకపోయింది. 140 కోట్లున్న చైనా జనాభా 2050 నాటికి 130 కోట్లకు తగ్గుతుందని అంచనా. ఇటలీదీ అదే వ్యథ... ఇటలీలో కూడా జనాభా నానాటికీ తగ్గిపోతోంది. 2023లో 5.94 కోట్లుండగా 2024 చివరికి 5.93 లక్షలకు తగ్గింది. 2008లో 5.77 లక్షలున్న వార్షిక జననాల సంఖ్య 2023 నాటికి ఏకంగా 3.8 లక్షలకు పడిపోయింది! ఇటలీ ఏకీకరణ తరువాత జననాల సంఖ్య క్షీణించడం అదే తొలిసారి! పిల్లల సంరక్షణ ఖరీదైన వ్యవహారంగా మారడం, తక్కువ జీతాలు, వృద్ధ తల్లిదండ్రులను చూసుకునే సంప్రదాయం వంటివి ఇటాలియన్లకు భారంగా మారుతు న్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ మంది పిల్లలను కనాల్సిందిగా పోప్ కూడా ఇటీవలే ఇటాలియన్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా 2033 కల్లా ఏటా కనీసం 5 లక్షల జననాలే లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నిరోధించడానికి జనాభా అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. దక్షిణ కొరియాలో విదేశీయుల రాక పుణ్యమా అని 2023లో జనాభా పుంజుకుంది. నిజానికి అధిక పోటీ విద్యా విధానంలో పిల్లలను పెంచడానికి అధిక ఖర్చు, మహిళలే శిశు సంరక్షణ చేపట్టా లనే ధోరణి వల్ల అక్కడ కొన్నేళ్లుగా జనాభా తగ్గుతోంది. వర్కింగ్ వీసా ప్రోగ్రాం పొడిగింపు వల్ల విదేశీ నివాసి తుల సంఖ్య 10% పెరిగి 10.9 లక్షలకు చేరింది. ఫలితంగా జనాభాలో కాస్త పెరుగుదల నమోదై 5.18 కోట్లకు చేరింది. కానీ వీరిలో ఏకంగా 90.5 లక్షల మంది 65, అంతకు మించిన వయసువారే! వృద్ధుల జనాభా పెరగడం కార్మికుల కొరతకు దారి తీస్తోంది.జపాన్లో అలా.. జపాన్ అయితే జనాభా సంక్షోభమే ఎదుర్కొంటోంది! 2008లో 12.8 కోట్లుండగా ప్రస్తుతం 12.5 కోట్లకు పడిపోయింది. జననాల సంఖ్య కూడా బాగా తగ్గుతోంది. యువత పెళ్లి, పిల్లలను కనడంపై తీవ్ర విముఖత చూపుతుండటం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. ఉద్యోగావకాశాల లేమి, జీవన వ్యయానికి తగ్గ వేతనాలు లేకపోవడం, కార్పొరేట్ సంస్కృతి పనిచేసే మహిళలు పని చేసేందుకు అనుకూలంగా లేకపోవడం వంటివి సమస్యను మరింత పెంచుతున్నాయి. 2070 నాటికి జపాన్ జనాభా 8.7 కోట్లకు పడిపోతుందని అంచనా. జనాభా సమస్యకు తోడు వృద్ధుల సంఖ్య కూడా జపాన్ను కలవరపరుస్తోంది. అక్కడ ప్రతి 10 మందిలో నలుగురు వృద్ధులే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒడిదుడుకుల్లో జనాభా పెరుగుదల!
జనాభా పెరగడంపై మీ అభిప్రాయం ఏంటని అడిగితే ఏం సమాధానమిస్తారు.. ప్రజలు పెరిగితే మంచితే కదా..శ్రామిక అవసరాలు తీరుతాయి.. అని కొందరు అంటారు. జనాభా ఎక్కువైతే మౌలిక అవసరాలకు ఎక్కువ ఖర్చు చేయాలి..ఉపాధి కరవవుతుంది..నిరుద్యోగం పెరుగుతుంది..ఆకలి అధికమవుతుంది.. అని ఇంకొందరు అభిప్రాయపడుతారు. ప్రాంతాలవారీగా స్థానిక అవసరాలు, అక్కడి ప్రజల అవగాహన, సదుపాయాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం..వంటి చాలా కారణాలు జనాభాను ప్రభావితం చేస్తాయి. ఈ జనాభా పెరుగుదలలోని తారతమ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అసమానతలను పెంచుతున్నాయి. 1950 నుంచి 2023 వరకు ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల ఎలా ఉందో తెలియజేస్తూ ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది.జనాభా పెరుగుదల కొన్ని ప్రాంతాలను వృద్ధి పథంలోకి తీసుకెళితే..మరికొన్ని ప్రాంతాలను నష్టాల్లోకి నెట్టేస్తోంది. యువత ఎక్కువగా ఉన్న భారత్లో శ్రామికశక్తికి ప్రస్తుతం ఢోకాలేదు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతాల సరసన చేరిన జపాన్ వంటి దేశాల్లో యువతలేక అల్లాడిపోతున్నారు. పిల్లల్ని కనడానికి ప్రభుత్వం అక్కడి దంపతులకు ప్రత్యేక వెసులుబాటు అందిస్తోంది. అక్కడ జనాభా తగ్గిపోవడానికి ప్రధాన కారణం యువత వివాహాలకు సుముఖంగా లేకపోవడం, వివాహమైనా పిల్లలను కనడానికి ఆసక్తిచూపకపోవడమేనని తెలుస్తోంది. నిరుద్యోగం, అధిక జీవన వ్యయం, మహిళల పట్ల వివక్ష తదితర సమస్యలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. వివాహం చేసుకుని సంతానాన్ని కనే వారికి జపాన్ ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా యువత నిర్ణయంలో పెద్ద మార్పు ఉండడంలేదని తెలుస్తోంది. జపాన్ 2070నాటికి 30శాతం మేర జనాభాను కోల్పోయే ప్రమాదం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.ఆసియాలో..ఆసియాలో 1950లో ఏటా జనాభా పెరుగుదల దాదాపు 58 కోట్లుగా ఉండేదని నివేదిక చెబుతుంది. 73 ఏళ్ల తర్వాత 2023లో అది 65 కోట్లుగా ఉంది. 1990ల్లో గరిష్ఠంగా జనాభా పెరుగుదల సుమారు 90 కోట్లకు చేరింది. క్రమంగా తర్వాతికాలం నుంచి పడిపోయింది. 2012లో ఘణనీయంగా దిగజారింది. చారిత్రాత్మకంగా భారత్, చైనా, ఇండోనేషియా..వంటి దేశాల్లో 20వ శతాబ్దంలో పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ పురోగతి, ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో జనాభా పెరిగింది.ఆఫ్రికా.. ఆకలిరాజ్యంఓ వైపు జనాభాలేక ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంటే ఆఫ్రికాలో మాత్రం అందుకు భిన్నంగా జనాభా పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం..1950లో ఏటా సరాసరి 98 లక్షల జనాభా పెరుగుదల ఉండే ఆఫ్రికాలో 2023 నాటికి అది 4.6 కోట్లకు చేరింది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సరైన ఉపాధి అవకాశాలులేక అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పోషకాహారలోపంతో ఉన్నవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆకలి తాండవిస్తోంది.యూరప్లో..పారిస్, లండన్, బ్రిటన్..వంటి ప్రాంతాల్లోని ప్రజల్లో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. దాంతో ఏళ్లకాలం నుంచే ఎక్కువగా పిల్లల్ని కనకుండా జాగ్రత్త పడ్డారు. సరాసరి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను మాత్రమే కనేవారు. అది ప్రస్తుతం మరింత తగ్గిన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 1950లో ఏటా జనాభా పెరుగుదల 95 లక్షలుండే యూరప్లో 2023 నాటికి అది 63 లక్షలకు చేరింది.అగ్రరాజ్యం అమెరికాలో..క్రిస్టఫర్ కొలంబస్ 1490లో అమెరికాను కనుగొనే దానికంటే ముందు అక్కడ కేవలం రెండు తెగలకు చెందిన ప్రజలే ఉండేవారు. దాంతో జనాభా తక్కువగా ఉండేది. క్రమంగా విద్యా వ్యవస్థ విస్తరించింది. అమెరికాలో స్త్రీ, పురుష భేదాలు తక్కువగా ఉంటాయి. దాంతో దాదాపు అందరూ ఉద్యోగాలు చేసేవారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అమెరికాలో నివసించడం ఖర్చుతో కూడుకున్న విషయం. కాబట్టి పిల్లల్ని తక్కువగానే కనేవారు. దంపతులిద్దరు ఉద్యోగాలు చేయడంతో డబ్బు ఆదా అయ్యేది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేవారు. సంస్థలు స్థాపించేవారు. అక్కడి జనాభాకు ఉపాధి దొరకండంతోపాటు మరింత మంది అవసరం ఏర్పడేది. దాంతో ఇతర దేశాల నుంచి అమెరికాకు వలసలు పెరిగాయి. కానీ అక్కడి ప్రజలు మాత్రం జనాభా పెరుగుదలపై అప్రమత్తంగానే ఉన్నారు. 1950లో జనాభా ఏటా పెరుగుదల 40 లక్షలుగా ఉండేది. ప్రస్తుతం అదే కొనసాగుతోంది.ఇదీ చదవండి: భారత్లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థజనాభా ఎక్కువగా ప్రాంతాల్లో జననాల నియంత్రణ ఆవశ్యకత పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాని పెరుగుదలకు అవసరమయ్యే చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. జనాభా తారతమ్యాలు ఏర్పడకుండా ప్రపంచదేశాలు కొన్ని నియమాలు రూపొందించుకుని వాటిని పాటించాలని కోరుతున్నారు. -
ఐరాసలో పెరగనున్న పాక్ ప్రభావం
లోక్సభ ఎన్నికల హడావిడిలో ఈ వార్త అంతగా దృష్టిలో పడలేదుగానీ, భద్రతా మండలిలో రెండేళ్ల కాలానికి పాకిస్తాన్ ఎన్నిక కావడం భారత్ పట్టించుకోవాల్సిన అంశమే. ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ ‘ఓఐసీ’కి చెందిన ఐదు సభ్యదేశాలు భద్రతా మండలిలో ఉండటమూ పాక్కు కలిసొచ్చేదే. కశ్మీర్పై చర్చను తనకు అనుకూలంగా మార్చడానికి అది ప్రయత్నించవచ్చు. ఉక్రెయిన్ లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆహార భద్రత ఐరాస ఎజెండాలో కీలకమైంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి దృఢమైన యంత్రాంగాలు ఉన్నప్పటికీ, పాక్ తన ఆహార భద్రతకు సంబంధించిన సమస్యగా ఈ అంశాన్ని చర్చలోకి తేగలదు. ఒక భారతీయుడిని ఐరాస నిర్వచించిన ఉగ్రవాది జాబితాలో చేర్చడానికి కూడా పాక్ ప్రయత్నించవచ్చు.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోకి పాకిస్తాన్ ఇటీవల ఎన్నికైన విషయాన్ని, భారత్లో విస్తృతంగా నివేదించి ఉంటే, అది భారతీయులను కలవరపరిచి ఉండేది. భారత్ లోక్సభ ఎన్నికల్లో కూరుకుపోవడంతో, ఐక్యరాజ్య సమితి అత్యున్నత కమిటీలో పాకిస్తాన్ స్థానం గురించిన వార్తలకు దేశంలో పెద్దగా స్పందన లభించలేదు. ఐరాసలోని 193 సభ్య దేశాలలో 182 పాకిస్తా¯Œ కు అనుకూలంగా ఓటు వేసిన ఈ ఎన్నిక, మూడవ దఫా అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానానికి పెద్ద సవాలుగా మారనుంది.2025 జనవరి 1న భద్రతామండలిలో రెండేళ్ల కాలానికి చేరనున్న పాకిస్తాన్, సోమాలియాల ఎంపికతో ఐక్యరాజ్యసమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థలో ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్’కు చెందిన ఐదు సభ్యదేశాలు ఉంటాయి. మొత్తం ప్రపంచం చట్టబద్ధంగా కట్టుబడి ఉండే నిర్ణయాలు చేసే ఏకైక ఐరాస సంస్థ అయిన భద్రతామండలి ఎన్నుకున్న సభ్యుల సంఖ్యలో ఇది సగం. అటువంటి నిర్ణయాలను మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వీటో ద్వారా తిరస్కరించవచ్చన్నది మరొక విషయం. ఈ సభ్యదేశాలనే పి–5 లేదా బిగ్ ఫైవ్ అంటారు. ఇప్పుడు ఇస్లామాబాద్కు ఐరాస భద్రతామండలి తలుపులు తెరిచినంత మాత్రాన, భారత్ ఏదైనా దౌత్యపరమైన ముప్పును ఎదుర్కొంటుందని అర్థం కాదు. ప్రమాదం ఉండదు, కానీ సవాలు మాత్రం ఉంటుంది. అందువల్ల, భారత్ నిశ్చింతగా ఉండకూడదు. న్యూయార్క్లోని ఐరాస కార్యాలయంలో భారత శాశ్వత ప్రతినిధి పదవి ఖాళీగా ఉంది. పాకిస్తాన్ తరఫున గత ఐదేళ్లుగా ఈ పదవిని నిర్వహిస్తున్న మునీర్ అక్రమ్ ఒక ఘోరమైన రాయబారి. ఆయన అంతకుముందు కూడా 2002 నుండి ఆరేళ్ల పాటు అదే పదవిలో ఉన్నారు. 1994లో ఐరాస మానవ హక్కుల సంఘం ఎజెండాలో కశ్మీర్ను చేర్చడంలో అక్రమ్ రహస్య దౌత్యం దాదాపుగా విజయం సాధించింది. మరుసటి సంవత్సరం, ఆయన అధికారికంగా జెనీవాలో ఐరాస శాశ్వత ప్రతినిధిగా నియమితులవడమే కాకుండా ఏడేళ్లు ఈ పదవిలో కొనసాగారు. కాబట్టి, లోక్సభ ఎన్నికల ప్రచారం మధ్యలో పదవీ విరమణ చేసిన భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్థానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన భారత ప్రభుత్వం వెంటనే భర్తీచేయాలి.వచ్చే ఏడాది ద్వైవార్షిక సమీక్ష కోసం కౌంటర్ టెర్రరిజం డాక్యుమెంట్ ఐక్యరాజ్యసమితి వద్దకు తిరిగి వస్తుంది. ఈ సమీక్షలోని పాఠం సరిహద్దు ఉగ్రవాద బాధితురాలిగా భారత్కు ముఖ్యమైనది. అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని రాజ్య విధాన సాధనంగా ఉపయోగించిన పాకిస్తాన్ వంటి మొండి రాజ్యాల కారణంగా, ఉగ్రవాదానికి విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన నిర్వచనాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రూపొందించలేకపోయారు. అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఆ సమావేశంలో సోమాలియాది కూడా సందేహాస్పద వైఖరి కావడంతో, జనరల్ అసెంబ్లీపై ఈ రెండు దేశాల ప్రభావమూ పడుతుంది. అదే సమయంలో భారత్ మరో ప్రమాదం నుంచి తనను కాపాడుకోవలసి ఉంది. ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ ‘ఓఐసీ’కి చెందిన ఐదుగురు భద్రతా మండలి సభ్యులు ఒక భారతీయుడిని ఐక్యరాజ్యసమితి నిర్వచించిన ఉగ్రవాది జాబితాలో చేర్చడానికి కలిసి పని చేసే అవకాశం ఉంది. వాళ్లు కచ్చితంగా భద్రతా మండలి ప్రసిద్ధ తీర్మానం 1267 ప్రకారం, ఒక హిందువును ఉగ్రవాది జాబితాలో చేరడాన్ని చూడాలనుకుంటారు. 1999లో ఆమోదం పొందిన ఈ తీర్మానం ప్రకారం, ఉగ్రవాది జాబితాలో చేరిన అపఖ్యాతి ఒసామా బిన్ లాడెన్ది. న్యూఢిల్లీలోని హిందూ జాతీయవాద ప్రభుత్వం ఈ విషయంలో ఓఐసీకి మేత అవగలదనే చెప్పాలి. అయితే 2024లోనూ, వచ్చే ఏడాదిలోనూ మోదీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం భారత్లో ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఇది చాలావరకు ఆధారపడి ఉంటుంది.1267 తీర్మానంతో ఏర్పాటు చేసిన ఆంక్షల కమిటీ ద్వారా అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘గ్లోబల్ టెర్రరిస్ట్’ జాబితాలో చేర్చడంలో అమెరికాతో కలిసి పనిచేసిన భారత్ సఫలీకృతమైంది. ఆ ఘటన పాక్ రాయబారి అక్రమ్ను ఇప్పటికీ గాయపరుస్తూనే ఉంది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద చర్యలకు మక్కీయే కారణమని ఆ తీర్మానం ఇచ్చిన వివరణ పాక్ బాధను మరింత పెంచింది. ఈ మక్కీ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు స్వయానా బావ.రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసిన తర్వాత, భద్రతా మండలిలో పాకిస్తాన్ ‘సంప్రదింపులు’ మాత్రమే చేయగలిగింది. ఇటువంటి ప్రక్రియ మండలి సభ్యుల మధ్య అంతర్గత చర్చలను సూచిస్తుంది. ఈ చర్చల గురించి బహిరంగంగా ఎటువంటి రికార్డూ ఉండదు. ఇప్పుడు పాక్ భద్రతా మండలిలోకి ప్రవేశించిన తర్వాత, మిగతా ఓఐసీ సభ్యదేశాల మద్దతుతో కశ్మీర్పై చర్చను తనకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నించవచ్చు. అవి ‘బహిరంగ సంప్రదింపుల’ ద్వారా జరిగే అవకాశం ఉంది. అంటే వాటి గురించి మీడియాకు, ప్రజలకు తెలియజేస్తారని అర్థం. సందర్భానుసారంగా ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్ కూడా ఆ చర్చల గురించి ప్రపంచానికి తెలియజేయవచ్చు. భారత్ దృక్కోణం నుండి ప్రమాదం ఏమిటంటే, ఇటువంటి జిత్తులు కొనసాగుతున్నప్పుడు కశ్మీర్ సమస్యపై ఐరాస పూర్తి దృష్టి పడుతుంది. అయినప్పటికీ భద్రతా మండలిలో వీటో కలిగివున్న పి–5 దేశాలపైనే ఏదైనా ఆధారపడి ఉంటుంది.15 మంది సభ్యులతో కూడిన భద్రతామండలి పనికి ఆటంకం కలగకుండా గతంలో భారత్, పాక్ సహజీవనం చేశాయి. రెండు దేశాలూ చివరిసారిగా 2012లో కలిసి పనిచేశాయి. కానీ తర్వాతరెండు విషయాలు మారిపోయాయి. ఐరాసలో అప్పటి పాకిస్తాన్ మిషన్ కు ‘డాన్’ మీడియా గ్రూప్ను కలిగి ఉన్న హరూన్ కుటుంబానికి చెందిన హుస్సేన్ హరూన్ నాయకత్వం వహించారు. ఆయన చాలామంది పాకిస్తాన్ కెరీర్ దౌత్యవేత్తల మాదిరిగా కాకుండా భారత్కు వ్యతిరేకంగా ఎప్పుడూ నోరు జారలేదు. రెండవ మార్పు ఏమిటంటే, అప్పట్లో 2012లో ప్రపంచం చాలా భిన్నమైనదిగానూ, తక్కువ సంక్లిష్టమైనదిగానూ ఉండేది.ఇటీవలి సంవత్సరాలలో ఐరాసలో దురదృష్టవశాత్తు ప్రత్యర్థులు, శత్రువుల మధ్య రహస్య, బహిరంగ ఘర్షణకు అవకాశాలు పెరిగాయి. అందువల్ల, భారత్తో తన ద్వైపాక్షిక సమస్యలను అంతర్జాతీయీకరించడానికి పాకిస్తాన్ కు మరిన్ని అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు, ముఖ్యంగా ఉక్రెయిన్లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆహార భద్రత అనేది ఐరాస ఎజెండాలో కీలకంగా ఉంది. వివాదాలను పరిష్కరించడానికి సింధు జలాల ఒప్పందానికి సంబంధించి దృఢమైన యంత్రాంగాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ తన ఆహార భద్రతకు సంబంధించిన సమస్యగా ఈ అంశాన్ని గట్టిగా చర్చలోకి తీసుకురాగలదు. వారు తమ కుతంత్రాలలో విజయం సాధించకపోవచ్చు కానీ ఇస్లామాబాద్ ప్రయత్నం చేయకుండా మాత్రం ఉండిపోదు. ఐరోపా పార్లమెంట్ ఎన్నికలలో యూరప్ మితవాదం వైపు దూసుకెళ్లిన తర్వాత, ఐరాస చర్చల్లో ఇస్లామోఫోబియా కూడా ఎక్కువగా ఉంటుంది. భద్రతా మండలిలో ఓఐసీ దౌత్యవేత్తల సంఖ్య పెరగడం వారికి దేవుడిచ్చిన వరం. ఐక్యరాజ్యసమితిలో తన ప్రయోజనాలను ముందుకు తీసుకురావడానికి పాకిస్తాన్ దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటుంది.- వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- కేపీ నాయర్ -
మేజర్గారి ప్రసంగం మెగా హిట్
ప్రతిష్ఠాత్మక ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్’ అందుకోవడంతో వార్తల్లోకి వచ్చిన మేజర్ రాధికాసేన్ తన ‘వైరల్ స్పీచ్’ ద్వారా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘జెండర్–సెన్సిటివ్ పీస్కీపింగ్ ప్రాముఖ్యత గురించి తన ప్రసంగంలో నొక్కి చెప్పింది సేన్. ‘జెండర్–సెన్సిటివ్ పీస్కీపింగ్ అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు. అది అందరి బాధ్యత. మహిళల ఆరోగ్యం, విద్య, శిశుసంరక్షణ. లింగసమానత్వం, లైంగిక హింసను ఎదుర్కోవడం లాంటి అంశాలపై కమ్యూనిటీలతో మమేకమయ్యే అవకాశం లభించింది’ అంటుంది సేన్. ప్రసంగం అనంతరం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రాధికసేన్ను నిజమైన నాయకురాలిగా, మోడల్గా అభివర్ణించారు. -
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అత్యున్నత గౌరవం లభించింది. యూఎన్ ఆమెను ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించి గౌరవించింది. ఇంతకీ ఎవరా అధికారిణి?. ఆమెకు ఎందుకు యూఎన్ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది అంటే.. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకురాలిగా పనిచేసినందుకుగానూ భారత ఆర్మీ అధికారిణి మేజర్ రాధికా సేన్కి 2023 ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆమె యూఎన్ శాంతి పరిరక్షకురాలిగా మహిళలు, బాలికల హక్కుల కోసం చేసిన విశేషమైన కృషికి గానూ యూన్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సత్కరించి గౌరవించింది.ఇవాళ (మే 29) యూఎన్ శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సం పురస్కరించుకుని భారత ఆర్మీ అధికారిణి రాధికా సేన్ని ఇలా అవార్డుతో సత్కరించి గౌరవించింది యూఎన్. ముఖ్యంగా 2000లో భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా సంఘర్షణ, లైంగిక హింసలకు గురవ్వుతున్న బాలికలను రక్షించేందుకు ఆమె చేసిన విశేషమైన కృషిని ఇలా అవార్డుతో గుర్తించింది. ఎవరీ రాధిక సేన్..?⇒హిమచల్ప్రదేశ్లో జన్మించిన రాధికా సేన్ తొలుత బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్లో వృత్తిలో కొనసాగించారు. అయితే ఆమె బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తుండగానే ఇండియన్ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది. అలా సేన్ 2023లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి శాంతి పరిరక్షకురాలిగా నియమితులయ్యారు. ఆతర్వాత ఆమె ఏప్రిల్ 20024 వరకు ఇండియన్ రాపిడ్ డిప్లాయ్మెంట్ బెటాలియన్తో ఎంగేజ్మెంట్ ప్లాటూన్ కమాండర్గా పనిచేశారు.⇒మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న రెండవ భారతీయ శాంతి పరిరక్షకురాలు రాధికా సేన్ నిలిచారు. సేన్ కంటే ముందు, మేజర్ సుమన్ గవానీ దక్షిణ సూడాన్లోని UN మిషన్తో ఆమె చేసిన సేవకు ఇలాంటి గుర్తింపునే పొందారు. 2019లో మేజర్ సుమన్కి ఈ అత్యున్నత గౌరవం లభించింది. ⇒యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో మోహరించిన దాదాపు 6,603 మంది భారతీయ సిబ్బందిలో సేన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తరుఫున దాదాపు 1,954 మంది వ్యక్తులతో కలిసి పనిచేశారు. వారిలో 32 మందికి పైగా మహిళలు ఉండటం విశేషం. ఆమె పని మహిళలు ఏకం చేసేలా..సమస్యలు చర్చించడం, సురక్షితమైన ప్రదేశాలుగా మార్చడం. ⇒యూఎన్ ప్రకారం.. సేన్ లింగ సమానత్వంపై దృష్టి సారించి తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్సీ)లో శాంతి పరిరక్షక ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. ఆమె కమ్యూనిటీలకు సహాయం చేస్తpూ..కమ్యూనిటీ అలర్ట్ నెట్వర్క్లను కూడా స్థాపించారు. (చదవండి: మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!) -
అఫ్గాన్లో ఆకస్మిక వరదలు.. 300 మందికి పైగా మృతి
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ ఉత్తరప్రాంతంలో శుక్రవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో 300 మందికి పైగా ప్రజలు మృతి చెందినట్లు ఐరాస ఆహారం విభాగం తెలిపింది. వెయ్యి వరకు నివాసాలు ధ్వంసం కాగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని పేర్కొంది. బాధితులకు ఆహారం అందజేస్తున్నట్లు శనివారం తెలిపింది. బఘ్లాన్, బాదాక్షాన్, ఘోర్, హెరాట్, టఖార్ ప్రావిన్స్ల్లో ఎక్కువ నష్టం సంభవించినట్లు తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. బఘ్లాన్లో 131 మంది, టఖార్లో 20 మంది మరణించారని వెల్లడించింది. డజన్ల కొద్దీ గల్లంతయ్యారని కూడా తెలిపింది. బఘ్లాన్లో వరదల్లో చిక్కుకుపోయిన వారిని వైమానిక దళం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందని తెలిపింది. 100 మందికి పైగా క్షతగాత్రులను సైనిక ఆస్పత్రులకు తరలించినట్లు రక్షణ శాఖ వివరించింది. -
గడ్డకట్టే చలిలో యూఎన్ అత్యున్నత దౌత్యవేత్త సాహసం..! ఐతే..
చైనాలోని యూఎన్ అత్యున్నత దౌత్యవేత్త సిద్ధార్థ్ ఛటర్జీ చేసిన యోగా నెట్టింట సంచలనం రేపుతుంది. మైనస్ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో 'ఓం' కార పఠనంతో బ్రీతింగ్ వ్యాయామాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకు సంబంధించిన నాలుగు నిమిషాల నిడివి గల వీడియోని ఛటర్జీ "బ్రీతింగ్ ఫర్ గుడ్ హెల్త్" అనే పేరుతో పోస్ట్ చేశారు. ఆయన ఆ వీడియోలో బీజింగ్లోని గడ్డకట్టుకుపోయిన సరస్సుపై కూర్చొని శ్వాసకు సంబంధించిన వ్యాయమాలు చేశారు. ఇది శారీరక, మానసికి ఆరోగ్యాన్ని కాపాడే బెస్ట్ వ్యాయామాలని వీడియో ప్రారంభంలోనే చెప్పారు. పొట్టను లోపలకి, బయటకు వదిలేలా లోతైన శ్వాస వ్యాయామాలు 'ఓం' కార పఠనంతో మొదలవ్వుతుందని అన్నారు. మనం ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టేటప్పుడు మొదట పని శ్వాస పీల్చుకోవడం. ఇక ఆఖరి పని దాన్ని విడిచిపెట్టయడమే అని చెప్పారు. ఇర ఆయన ఆ ఎముకలు కొరికే చలిలో పొట్టకు సంబంధించిన బ్రీతింగ్ ఎక్సర్సైజుల తోపాటు శీర్షాసనం వంటివి యోగాసనాలు వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేగాకుండా ఈ వ్యాయామాల వల్ల కరోనా వంటి మహమ్మారిల నుంచి తట్టుకునేలా రోగనిరోధక శక్తిని అందిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఆయన 2020లొ చైనాలో యూఎన్ అత్యున్నత దౌత్యవేత్తగా నియమితులైన టైంలో అధిక కొలస్ట్రాల్, బీపీ, అధిక హృదయ స్పందన రేటు, ప్రీ డయాబెటిక్, ఒబెసిటీ వంటి సమస్యలతో బాధపడుతుండేవారు. ఆ తర్వాత ఈ యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజులు, సరైన జీవన శైలితో అనూహ్యంగా 25 కిలోల బరువు తగ్గడం జరిగింది. ఇక భారత్కి చెందిన ఛటర్జీ చైనాలోని యూఎన్ కార్యాలయానకి అధిపతిగా నియమించడం అప్పట్లో ఓ సంచలనంగా నిలిచింది. ఎందుకంటే తూర్పు లడఖ్ ప్రతిసష్టంభన, భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతల నడుమ ఆయన నియామకం జరగడమే అందుకు కారణం. కాగా, ఛటర్జీ కుటుంబం బంగ్లాదేశ్ నుంచి కోల్కతాకు వలస వచ్చిన కుటుంబం. చిన్నప్పుడు బాల్యంలో ఆయన పోలియో బాధితుడు. సరైన చికత్స తీసుకుని పోలియో నుంచి పూర్తిగా రికవరయ్యాడు. ఆ తర్వాత 1981లో రెండో ప్రయత్నంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. అక్కడ నుంచి ఆయన ప్లేయర్గా, బాక్సర్గా మారి ఎన్నో టైటిల్స్ అందుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎలైట్ పారా రెజిమెంటల్లో చేరారు. ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లి అక్కడ ఐవీ లీగ్ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చేరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూఎన్ మిషన్కి నాయకత్వం వహించారు. ఆయన భార్య బాన్ హ్యూన్ హీ భారత్లోని యూనిసెఫ్ సామాజిక విధానానికి చీఫ్గా ఉన్నారు. ఆయన దౌత్యవేత్తగా తన 24 ఏళ్ల కెరీర్లో కెన్యా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఇరాక్, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్ (డార్ఫర్), ఇండోనేషియా, బోస్నియా అండ్ హెర్జెగోవినా చైనా పొరుగు దేశం ఇరాకీ కుర్దిస్తాన్ వంటి దేశాలలో పనిచేశారు. ఛటర్జీ యూఎన్ శాంతి పరిరక్షణ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP), UNICEF, UN పాపులేషన్ ఫండ్ (UNFPA), రెడ్ క్రాస్ ఉద్యమం, UNOPS,UN భద్రతలలో కూడా పనిచేశారు. తన దౌత్యపరమైన పనుల తోపాటు అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా ప్రజలను చైతన్యపరిచేలా..ముఖ్యంగా ఒత్తిడిని తట్టుకుని యాక్టివ్గా ఉండేలా చేసే శ్వాస వ్యాయమాలను సాధన చేస్తున్న వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు సిద్ధార్థ్ ఛటర్జీ. VIDEO | Siddharth Chatterjee, the head of the #UN in China, is making waves on Chinese social media where he showcased his tough yoga and fitness exploits, including breathing exercises in sub-zero temperatures, which he says helped him to maintain physical and mental… pic.twitter.com/4q5nifvJHC — Press Trust of India (@PTI_News) April 16, 2024 (చదవండి: మొలకలు వచ్చిన ఆలు, కలర్ మారిన ఆకుకూరలు వండేస్తున్నారా..?) -
తప్పొకరిది! శిక్ష అందరికా?
అంతకంతకూ తీవ్రమవుతున్న పాలస్తీనా సంక్షోభం వారం రోజుల్లో అనేక మలుపులు తిరిగింది. దక్షిణాఫ్రికా వేసిన జాతి విధ్వంసం కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) చేసిన ప్రాథమిక నిర్దేశం ఒకవైపు, పాలస్తీనా శరణార్థులకై ఏర్పాటైన ఐరాస సహాయ సంస్థ ‘యూఎన్ఆర్డబ్ల్యూఏ’ (అన్రా)కు నిధులు ఆపేస్తున్నట్టు అమెరికా, మరో 8 దేశాలు ప్రకటించడం మరోవైపు, అమెరికా శిబిరాలపై డ్రోన్ దాడులు ఇంకోవైపు... ఇలా అనేక పరిణామాలు సంభవించాయి. గాజా యుద్ధానికి దారి తీసిన అక్టోబర్ 7 నాటి ‘హమాస్’ ఆకస్మిక దాడి, అపహరణలు, హత్యల్లో ‘అన్రా’ సిబ్బంది కొందరు పాలుపంచుకున్నారని ఇజ్రాయెల్ ఆరోపణ. 190 మంది దాకా ‘అన్రా’ ఉద్యోగులు ఇస్లా మిక్ జిహాదీ తీవ్రవాదులైన ‘హమాస్’ వర్గీయులుగానూ వ్యవహరించారని అది అంటోంది. అయితే కొందరు తప్పు చేశారని గాజాలోని లక్షల మందికి ప్రాణాధారాన్ని ఆపేయరాదని ఐరాస అభ్యర్థన. ఎప్పుడో 1948లో అరబ్ – ఇజ్రాయెలీ యుద్ధం సందర్భంగా దాదాపు 7 లక్షల మంది పాలస్తీనీయులు ఇప్పుడు ఇజ్రాయెల్ అంటున్న ప్రాంతంలోని తమ ఇల్లూ వాకిలీ వదిలేసి పోవాల్సొచ్చింది. ఆ శరణార్థుల సాయానికై 1949లో ‘అన్రా’ ఏర్పాటైంది. గాజా, ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, లెబనాన్, సిరియా, జోర్డాన్లలో విద్య, ఆరోగ్యం, సహాయ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టే ఈ సంస్థ ద్వారా సుమారు 59 లక్షల మంది పాలస్తీనా శరణార్థులు సాయం పొందుతున్నారు. ఇప్పటికే మానవీయ సంక్షోభంలో చిక్కుకున్న గాజాలోని ప్రజానీకానికి తిండి, నీళ్ళు అందిస్తున్నది ప్రధానంగా ఈ సంస్థే. అమెరికా లాంటి పలు దేశాల స్వచ్ఛంద విరాళాలతో నడిచే ఆ సంస్థపై ఆరోపణలు చేసి, నిరూపించకుండానే నిధులు ఆపేస్తే లక్షలాది అమాయకుల పరిస్థితి ఏమిటి? ఐరాస శరణార్థి సహాయ సంస్థకు నిధులిచ్చే దేశాల మాట అటుంచితే, అసలు సామాన్య పౌరులకు కష్టం వాటిల్లకుండా చేయగలిగినదంతా చేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) నిర్దేశించింది. అయినా ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతోంది. గాజా ప్రాంతంపై దాడులు కొనసాగిస్తూ, అమాయకుల ఆయువు తీస్తోంది. ఆ మధ్య కొద్దివారాల పాటు గాజాలోని ప్రధాన నగరం నుంచి వెనక్కి తగ్గినట్టే తగ్గిన ఇజ్రాయెల్ సోమవారం మళ్ళీ భీకర దాడులకు దిగింది. ఇజ్రాయెల్ అమానవీయ యుద్ధంలో ఇప్పటికే 26.5 వేల మంది పాలస్తీనీయులు మరణించారు. తీరం వెంట ధ్వంసమైన భవనాల శిధిలాల కింద ఇంకెన్ని వేల మృతదేహాలున్నాయో తెలీదు. అంతకంతకూ క్షుద్రమవుతున్న ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఇక, గాజా ప్రకంపనలు ఇతర చోట్లకూ విస్తరించాయి. ఆదివారం సిరియా సరిహద్దు సమీపంలోని జోర్డాన్ ఈశాన్య ప్రాంతంలో డ్రోన్ దాడులు జరిగాయి. అమెరికా సైనికులు ముగ్గురు మరణించారు. ఈ దాడులు ఇరాన్ అండతో సిరియా, ఇరాక్లలో నడుస్తున్న తీవ్రవాద వర్గాల పని అన్నది అమెరికా మాట. ఆ పాపంలో తమకేమీ భాగం లేదన్నది ఇరాన్ ఖండన. నిజానికి, ఇజ్రాయెల్ – హమాస్ల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి పశ్చిమాసియాలో పలు ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక శిబిరాలపై పదులకొద్దీ దాడులు జరిగాయి. అమెరికాకు ప్రాణనష్టం మాత్రం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్ భీకర ప్రతీకార యుద్ధాన్ని గుడ్డిగా సమర్థిస్తూ వస్తున్న అగ్రరాజ్య విస్తృత రక్షణ వ్యవస్థల్ని దాటుకొని మరీ ఈ దెబ్బ తగలడం గమనార్హం. దాంతో, అమెరికా అధినేత సైతం ఇరాన్ మద్దతున్న తీవ్రవాదవర్గాలపై ప్రతీకార దాడులు చేయాలని హూంకరించారు. అలాగని నేరుగా ఇరాన్పై దాడికి దిగలేదు. ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవాలని నేతలు కోరినా, అది తేనెతుట్టెపై రాయి వేయడమే. ఆ ప్రాంతంలో దీర్ఘకాలంగా నిలబడి కలబడుతున్న తీవ్రవాద బృందాలే అందుకు సాక్ష్యం. ప్రాంతీయ పోరాటాల్లో తలదూర్చినప్పుడల్లా తలబొప్పి కడుతూనే ఉందని అగ్రరాజ్యం మర్చి పోకూడదు. పశ్చిమాసియాలో ఇప్పటికే దానికి అనేక శత్రువులున్నారు. ఇరాన్పై దుందుడుకుగా ప్రవర్తిస్తే పరిస్థితి చేయి దాటుతుంది. చివరకు ఈ యుద్ధం ప్రపంచ స్థాయిలో పెద్దదవుతుంది. ఇటీవల ఎర్రసముద్రంలోని దాడులతో అస్తుబిస్తు అవుతున్న ప్రపంచ వాణిజ్యానికి అది మరో అశని పాతం అవుతుంది. అది గ్రహించే అమెరికా అనివార్యంగా సంయమనం చూపాల్సి వచ్చింది. ఇంకోపక్క మరో విడత కాల్పుల విరమణకై అరకొర ప్రయత్నాలు సాగుతున్నా, అవేవీ ఫలించడం లేదు. తాజాగా అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ అధినేత ఆదివారం ప్యారిస్లో ఇజ్రాయెల్, ఈజిప్టు, ఖతార్కు చెందిన ఉన్నతాధికారులను కలిశారు. మిగిలిన బందీలను హమాస్ విడుదల చేస్తే, మరొక సారి కాల్పుల విరమణ పాటించేలా చర్చించి, ఒప్పించాలని ప్రయత్నం. కానీ, ఫలితం శూన్యం. ఇజ్రాయెల్ సైనికచర్యను తప్పుబడుతూ దక్షిణాఫ్రికా వేసిన జాతి విధ్వంసం కేసు తేలేసరికి ఏళ్ళు పడుతుంది. ఈలోగా ఐసీజే గురువారం ఇచ్చిన ప్రాథమిక నిర్దేశం ఏ పక్షం వైపూ మొగ్గకుండా ఆచరణాత్మక ధోరణిలో సాగింది. గాజాలో అత్యవసర ప్రాథమిక సేవలు, మానవతా సాయం అందించాలని టెల్ అవీవ్ను కోరింది. అదే సమయంలో హమాస్ చేతిలోని బందీల పట్ల ఆందోళన వెలి బుచ్చుతూ, వారి విడుదలకు పిలుపునిచ్చింది. ఇలాంటి సమతూక ధోరణినే ఆశ్రయిస్తూ అమెరికా, ఐరోపా సమాజం సహా పాశ్చాత్యదేశాలన్నీ చర్చలతో పరిష్కారానికి మనసు పెట్టాలి. అంతు లేని యుద్ధానికి ఇజ్రాయెల్ను అనుమతిస్తున్న తమ విధానాలపై పునరాలోచన చేయాలి. ఆచరణాత్మక పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి. ఇరుపక్షాలనూ అంగీకరింపజేయాలి. కొందరు తప్పు చేశారని, ‘అన్రా’ నిధులను ఆపి అందరినీ శిక్షించడం శాంతిస్థాపనకు దోహదం చేయదని గ్రహించాలి. -
ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం.. భారత్ ఆమోదం
న్యూయార్క్: ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆక్రమిత సిరియన్ గోలన్ హైట్స్ నుండి ఇజ్రాయెల్ వైదొలగాలని పిలుపునిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 91 దేశాలు ఓటు వేశాయి. ఐరాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. నవంబర్ 28, మంగళవారం నాడు ఓటింగ్ జరిగింది. "ఆక్రమిత సిరియన్ గోలన్ ప్రాంతం నుండి జూన్ 4,1967 నాటి రేఖ వరకు వైదొలగాలని ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఐరాస భద్రతా మండలి తీర్మానిస్తోంది' అని పేర్కొంటూ ఐరాస అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. 1967 యుద్ధంలో సిరియా నుంచి గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, చైనా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియా సహా 91 దేశాలు ఐక్యరాజ్యసమితిలో తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఈ తీర్మాణానికి 8 దేశాలు-- ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, మైక్రోనేషియా, ఇజ్రాయెల్, కెనడా, మార్షల్ దీవులు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, జపాన్, కెన్యా, పోలాండ్, ఆస్ట్రియా, స్పెయిన్ సహా 62 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇదీ చదవండి: జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం -
జరిగింది చాలు, మానవ హక్కులను కాపాడండి : యూఎన్లో మౌన నిరసన
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ముగింపు సమావేశం సందర్భంగా కొంతమంది మానవ హక్కుల ప్రతినిధులు మౌనంగా నిరసన తెలిపారు. జెనీవాలో జరిగిన రెండు రోజుల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమీక్ష ముగింపులో భాగంగా రాయబారి మిచెల్ టేలర్ ప్రసంగం సందర్భంగా సామాజిక, జాతి, న్యాయ ఉద్యమకారులు పలువురు ఈ నిరసన వ్యక్తం చేశారు. మిచెల్ మాట్లాడుతున్న సమయంలో గాజాలో ఇజ్రాయెల్ చర్యలను సమర్ధిస్తున్న ఆమెరికాకు వ్యతిరేకంగా మానవ హక్కులను, గౌరవాన్ని కాపాడండి అంటూ ప్రతినిధులు మౌనంగా లేచి నిలబడి, వెనక్కి తిరిగి నిల్చున్నారు. ముందుగా డిగ్నిటీ డెలిగేషన్ సభ్యులు ఈ మౌన నిరసనకు దిగారు. అమెరికా న్యాయ వ్యవస్థ, చట్టాలు, విధానాలపై, వైఖరికి పట్ల తాము చాలా నిరాశకు గురయ్యామని అలయన్స్ శాన్ డియాగో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్రియా గెర్రెరో అన్నారు. గ్వామ్, ప్యూర్టో రికో, హవాయి తదితర ప్రాంతాల ప్రతినిధులుఇందులో ఉన్నారు. జెనీవాలోని యుఎన్లోని యుఎస్ రాయబారి మిచెల్ టేలర్ బుధవారం యుఎన్ మానవ హక్కుల కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలు, సిఫార్సులను వచ్చే నెల (నవంబర్ 3న) విడుదల చేయనుంది. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే బైడెన్ సలహామేరకు రఫా సరిహద్దు గుండా గాజా ప్రజలకు ఆహార పదార్థాలు, మందులు అనుమతించడానికి ఎట్టకేలకు ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలా ఉంటే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) కూడా ఇజ్రాయెల్ చేరుకున్నారు. కష్టాల్లో ఉన్న దేశానికి మద్దతుగా ఉంటాం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము ఎపుడూ నిలబడతామంటూ గురువారం ట్వీట్ చేశారు. రిషీ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో సమావేశంకానున్నారు. At the UN Human Rights Committee, many delegates turned their backs on US Ambassador Michelle Taylor in silent protest against the American backing of Israel's war-crimes in Gaza. Huge. The world is slowly waking up to their lies and deceit. #Gaza pic.twitter.com/YIEHKY114D — Advaid അദ്വൈത് (@Advaidism) October 19, 2023 I am in Israel, a nation in grief. I grieve with you and stand with you against the evil that is terrorism. Today, and always. סוֹלִידָרִיוּת pic.twitter.com/DTcvkkLqdT — Rishi Sunak (@RishiSunak) October 19, 2023 -
అరబ్ దేశాలపై నిక్కి హేలి ఫైర్
న్యూయార్క్ అరబ్ దేశాలపై రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి నిక్కి హేలి ఫైరయ్యారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను విమర్శిస్తున్న అరబ్ దేశాలు.. పాలస్తీనియన్లను ఎందుకు ఆహ్వానించట్లేదని మండిపడ్డారు. ఇరాన్ న్యూక్లియర్ డీల్పై మాజీ అధ్యక్షుడు బరాక్ బామా, జో బైడెన్ను విమర్శించారు. హమాస్, హెజ్బొల్లాను పెంచి పోషిస్తున్నారని ఇరాన్ను దూషించారు. 'పాలస్తీనా అమాయక ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ అరబ్ దేశాలు ఏం చేస్తున్నాయి? ఖతార్, లెబనాన్, జోర్డాన్, ఈజిప్టు దేశాల పాత్ర ఎంటి? ఈజిప్టుకు ఏడాదికి బిలియన్లు కొద్ది అమెరికా డబ్బుల్ని ఇస్తోంది. పాలస్తీనియన్ల కోసం గేట్లు తెరవలేరా..?' అని నిక్కి హేలి అన్నారు. 'పాలస్తీనియన్లు వారికి వద్దు. వారి పక్కనే హమాస్ ఉంచుకోవాలనుకోరు. మరి ఇజ్రాయెల్ ఎందుకు వారిని ఉంచుకుంటుంది? పాలస్తీనియన్లను అరబ్ దేశాలు రక్షించాలనుకోరు. వారిని తమ దేశాల్లో ఉంచుకోవాలనుకోరు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ను నిందిస్తుంటారు. పశ్చిమాసియా సమస్యలను పరిష్కరించగల సత్తా వారికి ఉంది. కానీ చేయరు. హమాస్తో నిత్యం కలిసి పనిచేస్తుంటారు. వారికి నిధులను సమకూరుస్తారు. ఇజ్రాయెల్ దాడులపైనే మాట్లాడుతున్నారు. హమాస్ ఏం చేసిందో మాట్లాడరు. హమాస్ అరాచకాలపై పెదవి విప్పరు.' అని నిక్కి హేలి మండిపడ్డారు. ఇదీ చదవండి ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది.. -
మట్టిలో మాణిక్యాలు ఆంధ్రా-అమెరికా ప్రతి విద్యార్థి చూడాల్సిన వీడియో
-
అమెరికా ప్రభుత్వంతో ఏపీ విద్యార్ధుల సమావేశం
ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యత, పేద విద్యార్ధులను పెద్ద చదవులు చదివించాలనే ఆయన సంకల్పం ఎంతో ప్రతిష్టాత్మమైన అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యేలా చేసింది. పదిరోజుల అమెరికా పర్యటనలో ఉన్న మన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు మంగళవారం ముఖ్యమైన US డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ సమావేశంలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు మన విద్యార్ధులు. ఐక్యరాజ్య సమితి సభ్యుడు ఉన్నవ షకిన్ కుమార్, SPD శ్రీనివాస్, KGBV సెక్రటరీ మధుసూధనరావు నేతృత్వంలోని బృందం ఈ సమావేశంలో పాల్గొంది. అమెరికాలో అమలవుతున్న విద్యావిధానం పై అమెరికా ప్రతినిధి రోసీ ఎడ్మండ్ మన విద్యార్ధులకు అర్ధమయ్యేలా వివరించారు. AP ప్రభుత్వం అందించే విద్యా ప్రయోజనాల ప్రాముఖ్యత వారి జీవితాలపై దాని ప్రభావం గురించి ఒక ప్రదర్శనను అందించారు. విద్యార్థులు గోరుముద్ద పథకం గురించి వారి ఖాతాల్లోకి రూ. 15000 అందుకోవడం వల్ల వారి తల్లులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన నూతన విద్యావిధానం అది ప్రతి ఒక్క విద్యార్ధికి ఎలా ఉపయోగపడుతుందో విద్యా ర్ధులు చెప్పారు. నాడు నేడు కింద క్లాస్ రూమ్ స్ట్రక్చర్ పూర్తిగా మార్చిన విధానం ఫోటోలను మన విద్యార్ధులు వారికి చూపించారు. క్లాస్ రూమ్స్ ప్రైవేటుకు ధీటుగా డిజిటల్ బోర్స్డ్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ఫర్నీచర్, ప్లేగ్రౌండ్స్, డిజిటల్ లైబ్రరీ, ఆడపిల్లలకు సానీటరీ నాప్కిన్స్, బాలికల కోసం ఏర్పాటు చేసిన నూతన టాయిలెట్స్ గురించి చక్కగా వివరించారు మన విద్యార్ధులు. స్కాలర్షిప్తో USA, కెనడా, ఆస్ట్రేలియా, UK లోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొందేందుకు జగనన్న విదేశీ విద్యా కానుక పెట్టారని చెప్పారు. ఇది USAలోని 200 విశ్వవిద్యాలయాలతో ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు USAలో చదువుకోవాలనే వారి కలను సాధించేలా చేస్తోందని వారు చెప్పారు. ఇండియా డెస్క్ ఆఫీసర్, క్వాడ్, US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ రజనీ ఘోష్ మాట్లాడుతూ విద్యార్థులు పెద్ద చదువులు చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను సాధించాలని ప్రోత్సహించారు. తాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి డిప్లొమాట్ కావడానికి చాలా కష్టపడ్డానని విద్యార్థులకు చెప్పింది. విద్యార్థులకు ఇంగ్లీష్ చాలా మంచిదని, వారు కష్టపడి పని చేసి మంచి విద్యా ఫలితాలను సాధిస్తే భవిష్యత్తులో భవిష్యత్ దౌత్యవేత్తలు కూడా అవుతారని ఆమె చెప్పారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్లో ఇండియా డెస్క్ ఆఫీసర్గా ఉన్న ఆమె, యుఎస్ఎలో ఉన్నత చదువుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి తమ విభాగం సిద్ధంగా ఉందని విద్యార్థులకు చెప్పారు. విద్యార్థు్లు చెప్పినవన్ని విన్న తరువాత, ఆమె విద్యార్థుల విశ్వాసాన్ని మెచ్చుకుంది. విద్యార్ధినులను USA కు డెలిగేషన్కు పంపినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు, ఇది AP రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు విద్యను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. సీనియర్ ఆఫీసర్, ఎడ్యుకేషన్ USA, US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ రోజీ ఎడ్మండ్ మాట్లాడూతూ USAలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాల గురించి విద్యార్థులకు వివరించారు. కొలంబియా, ప్రిన్స్టన్, హార్వర్డ్, న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ మొదలైన ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొందేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ శిక్షణ కార్యక్రమం పేద మెరిట్ విద్యార్థులకు సహాయపడుతుందని ఆమె ప్రశంసించారు. USAలో ఇంటర్న్షిప్లు, ఇతర ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్లను అభ్యసించడానికి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం బ్యూరోస్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ల గురించి ఆమె విద్యార్థులకు వివరించారు. వివిధ ఫెలోషిప్ ప్రోగ్రామ్ల క్రింద USAలో చదువుకోవడానికి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత ఆర్థిక సహాయం గురించి ఆమె వివరించారు. USAలోని 400 యూనివర్శిటీలు US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ గుర్తింపు పొందాయని, విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, EDUCATION USA మెరిట్ విద్యార్థులకు ఉచిత స్కాలర్షిప్, విమాన ఛార్జీలు పొందడంలో సహాయపడుతుందని ఆమె విద్యార్థులకు వివరించారు.అమెరికా ప్రభుత్వ అధికారులతో మీటింగ్ అనంతరం అమరికాలో ఉన్నత విద్యా అవకాశాలపై విద్యార్ధులు తమకున్న ప్రశ్నలకు సమాధానాలడిగి నివృత్తి చేసుకున్నారు. బ్యూరోలు, భారత ప్రభుత్వం మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి విద్యార్థులకు ఎలాంటి అవకశాలుంటాయని అమెరికా ప్రభుత్వ ప్రతినిధులను అడిగి తమ ప్రశ్నలకు సమాధాలు రాబట్టుకున్నారు మన విద్యార్ధులు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సీనియర్ ఎక్స్టర్నల్ ఆఫీసర్ మోలీ స్టీఫెన్సన్ మాట్లాడుతూ విద్యార్థులు ఇంగ్లీష్లో చక్కటి ప్రదర్శన ఇచ్చినందుకు ప్రశంసించారు. ఈ వయస్సులో విద్యార్థులు చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడడాన్ని తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఆమె విద్య యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ విద్యార్ధుల ప్రతినిధి బృందంలో 8 మంది బాలికలకు అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్తానికి అభినందనలు తెలిపింది. భారత్-అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఆమె అన్నారు. పాఠశాలల నిర్వహణ వ్యవస్థ, AP ప్రభుత్వం యొక్క విద్యా కార్యక్రమాల అమలును కూడా ఆమె ప్రశంసించారు. :యునైటెడ్ నేషన్స్ స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ సభ్యుడు ఉన్నవ షకిన్ కుమార్ మాట్లాడుతూ యూఎస్ డిపార్ట్ మెంట్ స్టేట్ అధికారులు ఏపీ విద్యార్ధుల బృందానికి ఇంత సమయం కేటాయించి విద్యార్ధులకు సలహాలు సూచనలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యార్ధులను అమెరికా పంపినందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి , విద్యాశాఖామంత్రి బొత్ససత్యనారాయణ, కమిషనర్ సురేష్ కుమార్, విద్యార్థులలో USA డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ఎరిక్ క్రిస్టెన్సన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
‘వాళ్ల చిరునవ్వులే ఆ విషయాన్ని చెప్తున్నాయ్’
సాక్షి, గుంటూరు: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ (Gita Gopinath)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ నుంచి వెళ్లిన విద్యార్థులు ఐఎంఎఫ్ కార్యాలయంలో సందడి చేశారు. వాళ్లను ఆహ్వానించి ముచ్చటించినందుకుగానూ సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మా పిల్లలను కలుసుకున్నందుకు, సాదరంగా వాళ్లను ఆహ్వానించినందుకు గీతాగోపినాథ్ గారికి థ్యాంక్స్. వాళ్ల చిరునవ్వులే ఆ విషయాన్ని చెబుతున్నాయ్’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘చదువు అనేది వ్యక్తిగత జీవితాలను మార్చడమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చడంలో అతిపెద్ద ఉత్ప్రేరకం అని నేను నిజంగా నమ్ముతున్నాను. మా పిల్లలే ఇందుకు నిదర్శనం. అంతర్జాతీయ వేదికపై మన రాష్ట్రాన్ని ఎంతో గర్వంగా, ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లలను చూసినప్పుడు నేను గర్వంతో నిండిపోయాను!’’ అని పోస్ట్ చేశారాయన. అంతకు ముందు గీతా గోపినాథ్ సైతం పిల్లలతో ఉన్న ఫొటోను తన ఎక్స్లో ట్వీట్ చేశారు. అమెరికా, ఐరాస పర్యటనలో భాగంగా.. వాళ్లను ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం వద్ద కలుసుకున్నట్లు ఆమె పోస్ట్ చేశారు. వాళ్లను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ఆమె ట్వీట్లో తెలియజేశారు. Thank you for meeting our children and receiving them with such warmth @GitaGopinath garu, their bright smiles say it all! I truly believe that education is the biggest catalyst in not just transforming individual lives but in transforming entire communities. Our children are… https://t.co/WKek9sMdh9 — YS Jagan Mohan Reddy (@ysjagan) September 27, 2023 -
ఏపీ విద్యార్థులు ఐక్యరాజ్యసమితికి వెళ్లడం మనకే గర్వకారణం’
సాక్షి, విజయవాడ. పదో తరగతి ఫలితాల్లో టాపర్స్ గా నిలిచిన ప్రభుత్వ విద్యార్థులే ఐక్యరాజ్యసమితికి వెళ్లడం జరిగిందని.. ఇది రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించడం మానేసి నిరుత్సాహపరిస్తే వారితో పాటు తల్లిదండ్రుల మనోభావాలు కూడా దెబ్బతింటాయని హితవు పలికారు. దీనిపై కూడా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, మార్పులతో ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయని అధునాతన వసతులు, డిజిటల్ విద్యా బోధన తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తద్వారా మెరుగైన విద్యార్థులుగా తీర్చిదిద్ది ప్రపంచంతో పోటీ పడేలా చేస్తోందన్నారు. డిసెంబర్ 21న 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్ల పంపిణీ చేపడతామని స్పష్టం చేశారు. 8,9,10 తరగతుల మ్యాథ్స్, సైన్స్ పాఠ్యాంశ పుస్తకాల మార్పుపై ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవసరమైన మేరకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ కు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో టీచర్ పోస్టుల ఖాళీల భర్తీపై కూడా త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అవినీతికి తావు లేకుండా.. చిత్తశుద్ధితో పని చేస్తోందని.. ఎక్కడా, ఏ అవకతవకలు జరిగినట్లు తెలిసినా, ఏ మాత్రం నిర్లక్ష్యం చూపకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సీమెన్స్ కంపెనీ గుజరాత్లో ఒప్పందం చేసుకుని, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందని, అందుకు చాలా తక్కువ పెట్టుబడి పెట్టారన్నారు. అక్కడ సాఫ్ట్ వేర్ ఇచ్చి పిల్లలకు శిక్షణ కూడా ఇచ్చారని చెప్పారు. సీపీఎస్ విధానంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎక్కువ అవుతుందన్న నేపథ్యంలో కేంద్రం కూడా ఒప్పుకోవడం లేదు కాబట్టి జీపీఎస్ తీసుకురావడం జరిగిందన్నారు. ఉద్యోగులందరూ దీనిపై సహృదయంతో ఆలోచన చేసి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. -
ఐరాస వేదికగా ఖలిస్థానీ ప్రశ్నలకు ట్రూడో ఎడముఖం
న్యూయార్క్: ఐరాస వేదికగా ఇండియా-కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించడానికి జస్టిన్ ట్రూడో నిరాకరించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పాత్రపై ట్రూడో చేసిన ఆరోపణలపై పీటీఐ అడిగిన ప్రశ్నలను దాటవేశారు. జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి 78వ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా పాల్గొన్నారు. వాతావరణ లక్ష్యాలు, ఉక్రెయిన్ అంశాలపై భద్రతా మండలిలో మాట్లాడారు. ఈ క్రమంలో రెండు సందర్భాల్లో ట్రూడోని పీటీఐ ప్రశ్నించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ట్రూడో చేసిన ఆరోపణలను ఇండియా ఖండించిన అంశంపై ప్రశ్నించారు. కానీ ఏ మాత్రం స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు. Visuals of Canadian PM Justin Trudeau at United Nations (UN) headquarters in New York, US. pic.twitter.com/itdbUnI2tm — Press Trust of India (@PTI_News) September 21, 2023 ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం పాత్ర ఉందని జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్లో ఆరోపణలు చేశారు. భారత దౌత్య అధికారిని ఆ దేశం నుంచి బహిష్కరించారు. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. నిరాధారమైన ఆరోపణలుగా పేర్కొంటూనే కెనడా దౌత్య అధికారిని ఇండియా కూడా బహిష్కరించింది. కెనడా, భారత్ మధ్య దౌత్య పరమైన సంబంధాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. కెనడా ప్రయాణికులకు ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశానికి వెళ్లదలచినవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. ఇదీ చదవండి: ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ పాత్రపై అనుమానాలు.. -
అప్పటి దాకా ధాన్యం ఒప్పందం ఉండదు
మాస్కో: యుద్ధం కొనసాగుతున్న వేళ నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్ ధాన్యం రవాణా కారిడార్ను పునరుద్ధరించాలంటే పశ్చిమ దేశాలు ముందుగా తమ డిమాండ్లను అంగీకరించాల్సిందేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. దీంతో, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియా దేశాలకు ఎంతో కీలకమైన ఆహార ధాన్యాల సరఫరాపై నీలినీడలు అలుముకున్నాయి. టర్కీ, ఐరాస మధ్యవర్తిత్వంతో కుదిరిన ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందం నుంచి జూలైలో వైదొలిగింది. ఈ ఒప్పందం పునరుద్ధరణపై చర్చించేందుకు సోమవారం రష్యాలోని సోచిలో తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్తో ఆయన సమావేశమయ్యారు. రష్యా నుంచి ఆహారధాన్యాలు, ఎరువుల ఎగుమతులకు గల అవరోధాలను తొలగిస్తామన్న వాగ్దానాలను పశ్చిమదేశాలు నిర్లక్ష్యం చేశాయని ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది వరకు రికార్డు స్థాయిలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం ఓడల రాకపోకలు, బీమాకు సంబంధించిన అవరోధాల కారణంగా తీవ్రంగా దెబ్బతిందన్నారు. పశి్చమదేశాలు ఇచి్చన వాగ్దానాలను నెరవేర్చిన పక్షంలో కొద్ది రోజుల్లోనే ఒప్పందంపై సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో త్వరలోనే పురోగతి సాధిస్తామని ఎర్డోగన్ చెప్పారు. -
టెక్ ఉద్యోగులకు ఊరట! సానుకూల విషయాన్ని చెప్పిన ఐఎల్వో
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ప్రపంచంలో చాట్జీపీటీ (ChatGPT) రాక సంచలనాన్ని సృష్టించింది. తర్వాత క్రమంగా, మరిన్ని కంపెనీలు తమ సొంత ఏఐ సాధనాలతో ముందుకు వచ్చాయి. ఈ ఏఐ టూల్స్తో కొలువుల కోత తప్పదని, వేలాది ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళన సర్వత్రా నెలకొంది. దీనికి తోడు ఎలాన్ మస్క్ సహా అనేక టెక్ కంపెనీ అధినేతలు, సీఈవోలు సైతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఉద్యోగాలకు ముప్పు తప్పదని హెచ్చరించారు. ఈ భయాందోళనల నేపథ్యంలో టెక్ ఉద్యోగులకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పింది ఐక్యరాజ్యసమితి (UN)కి చెందిన అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ (ILO). ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని, ఏఐ టెక్నాలజీ ఉద్యోగులను రీప్లేస్ చేయలేదని ఐఎల్వో తాజా అధ్యయనం వెల్లడించింది. ఐఎల్ఓ ఇటీవలి అధ్యయనం ప్రకారం.. ఏఐ టెక్నాలజీ మనుషులు చేసే పనులను మార్చేస్తుంది తప్ప ఉద్యోగాలకు ముప్పు కాబోదు. అయితే ఏఐ రాకతో చాలా ఉద్యోగాలు, పరిశ్రమలు పాక్షికంగా యాంత్రీకరణకు గురవుతాయని ఐఎల్ఓ స్టడీ పేర్కొంది. చాట్జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్ వల్ల ప్రయోజనమే తప్ప విధ్వంసం ఉండదని వివరిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలేం ఊడిపోవని, కాకపోతే పనిలో నాణ్యత, ఉద్యోగుల పనితీరు మెరుగు వంటి అంశాలకు దోహదం చేస్తుందని ఐఎల్ఓ అధ్యయనం పేర్కొంది. నూతన టెక్నాలజీ ప్రభావం వివిధ ఉద్యోగాలు, ప్రాంతాలకు వేర్వేరుగా ఉంటాయని, పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగాలపైనే ఈ ప్రభావం కాస్త ఉండే అవకాశం ఉందని ఐఎల్ఓ స్టడీ అంచనా వేసింది. ఇదీ చదవండి: ఏఐ ముప్పు లేని టెక్ జాబ్లు! ఐటీ నవరత్నాలు ఇవే.. -
ఐరాస సదస్సుకు ఎటపాక కేజీబీవీ విద్యార్థిని
ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఐరాస సదస్సుకు అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఎటపాక కేజీబీవీ విద్యార్థిని మోతుకూరి చంద్రలేఖ ఎంపికైంది. 2022–23 విద్యాసంవత్సరం పదవ తరగతిలో 523 మార్కులు సాధించి జిల్లాలోని 19 కేజీబీవీల్లో టాపర్గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల పాఠశాలల టాపర్స్కు జగనన్న ఆణిముత్యాలు పథకంలో భాగంగా గత నెలలో ఆన్లైన్లో పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ పరీక్షలో చంద్రలేఖ 100 మార్కులకు గాను 94 మార్కులు సాధించి ఆన్లైన్ ఇంటర్వ్యూకు ఎంపికైంది. ఈమెతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీల నుంచి ఇద్దరు ఇంటర్వ్యూకు హాజరు కాగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన చంద్రలేఖ ఐరాస సదస్సుకు ఎంపికైంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి శుక్రవారం ఆమెకు సమాచారం అందింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విద్యా ప్రమాణాలపై ఐరాస సదస్సులో చంద్రలేఖ మాట్లాడనున్నట్లు గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిణి కె.సూర్యకుమారి తెలిపారు. త్వరలో విద్యార్థిని యూఎస్ఏ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. కాగా, సీఎం జగన్ సంకల్పం నెరవేరుతోందనడానికి ఈ పేదింటి విద్యార్థిని ఇప్పుడు ఐరాస సదస్సుకు వెళ్లడమే నిదర్శనం. -
‘హ్యూమన్ రైట్స్ హీరో-2023’గా హెరాల్డ్ డిసౌజా
ఇండియన్-అమెరికన్ లేబర్ ట్రాఫికింగ్ సర్వైవర్, యాక్టివిస్ట్ హెరాల్డ్ డిసౌజాను హ్యూమన్ రైట్స్ హీరో అవార్డు- 2023తో సత్కరించారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో 17వ వార్షిక అంతర్జాతీయ మానవ హక్కుల యూత్ సమ్మిట్ సందర్భంగా హెరాల్డ్ డిసౌజా ఈ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది సమ్మిట్ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనకు సంబంధించి 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. డిసౌజాతో సహా అంతర్జాతీయ వక్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు దీనిలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. వర్క్షాప్లు, ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఈ సంవత్సరం సమానత్వం, గౌరవం, ఐక్యత థీమ్తో కార్యక్రమం జరిగింది. ‘ప్రతి బిడ్డకు మానవ హక్కులు తెలియజేయాలి’ డిసౌజా తన ప్రసంగంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డకు మానవ హక్కులకు సంబంధించిన 30 ఆర్టికల్స్ నేర్పించాలని అన్నారు. అవి 1948లో ఐక్యరాజ్యసమితి రూపొందించిన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే పత్రంలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో తన ముందు ప్రేక్షకుల్లో కూర్చున్న ప్రతీ ప్రతినిధి నిజమైన హీరోనే అని డిసౌజా అభివర్ణించారు. మనుషుల అక్రమ రవాణా, తరలింపు నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించి, గౌరవించి, అవార్డు ఇచ్చినందుకు యూత్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ మేరీ షటిల్వర్త్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మానవ అక్రమ రవాణాదారుని చేతిలో.. డిసౌజా హ్యూమన్ ట్రాఫికర్గా యుఎస్కి వచ్చారు. 18 నెలలకు పైగా ఆయన మానవ అక్రమ రవాణాదారుని చేతిలో దోపిడీకి గురయ్యారు. తన స్వేచ్ఛను కోల్పోయారు. నేడు ఆయన ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. హెరాల్డ్ డిసౌజా న్యాయవాది, పబ్లిక్ స్పీకర్. అతని చేదు అనుభవం అతనికి జీవితంలో కొత్త లక్ష్యాన్ని, అర్థాన్ని అందించింది. డిసౌజా ఐస్ ఓపెన్ ఇంటర్నేషనల్కు సహ-వ్యవస్థాపకుడు. ఈ సంస్థ హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి ప్రాణాలతో బయటపడిన వారి సమాచార పరిశోధనకు సహకరిస్తుంది. బాధితులకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తుంటుంది. కార్మికుల అక్రమ రవాణాను అంతం చేయడానికి.. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 2015లో యునైటెడ్ స్టేట్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్లో సభ్యునిగా డిసౌజాను నియమించారు. ట్రాఫికింగ్ను పర్యవేక్షించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫీస్కు నిపుణుల సలహాదారుగా కూడా డిసౌజా వ్యవహరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అట్లాంటాకు చెందిన స్వచ్ఛంద సంస్థ శారీస్ టు సూట్స్ వ్యవస్థాపకుడు పట్టి త్రిపాఠి మాట్లాడుతూ డిసౌజా తన కుటుంబంతో కలిసి కార్మికుల అక్రమ రవాణాను అంతం చేయడానికి, దీనిపై మరింత అవగాహన పెంచడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భయం నుంచి స్వేచ్ఛకు.. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి 46 దేశాలకు చెందిన అగ్రశ్రేణి ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశంలోని మంగళూరుకు చెందిన డిసౌజా ప్రస్తుతం ఒహియోలోని సిన్సినాటిలో ఉంటున్నారు. అతని జీవిత అనుభవాలు అతనిని.. బానిసత్వం నుండి క్రియాశీలతకు, బాధ నుంచి ఆనందానికి, భయం నుంచి స్వేచ్ఛకు.. ఇప్పుడు ‘హ్యూమన్ రైట్స్ హీరో అవార్డ్ 2023’అందుకునేందుకు సహకరించాయి. ఇది కూడా చదవండి: కొడుకు బర్త్డేకి తల్లి సర్ప్రైజ్.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోందంటూ.. -
ప్రకృతిని కాపాడుకుందాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం..
న్యూయార్క్: ప్రకృతిని కాపాడుకుంటూ.. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పరస్పర సమన్వయంతో ముందుకెళ్లినపుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్న సమయానికి చేరుకోవచ్చని.. భారత పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పనిచేద్దామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో ఆర్థిక ప్రగతి, సామాజిక, పర్యావరణ సుస్థిరత అంశంపై న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరం (HLPF) వేదికగా జరిగిన సదస్సులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశంలో భారతదేశం తరపున పాల్గొనడం గర్వంగా ఉందన్న కిషన్ రెడ్డి.. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో గత దశాబ్ద కాలంగా ఆర్థిక, సామాజిక, పర్యావరణ స్థిరత్వమే ప్రధాన ఎజెండాగా చేపట్టిన పాలసీలు, ప్రాధాన్యతలతో భారతదేశం సాధిస్తున్న ప్రగతిని వివరించారు. గత పదేళ్లుగా పర్యావరణ సుస్థిరత కోసం మోదీ సర్కారు చేస్తున్న కృషి కారణంగా.. నేడు టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు ఎజెండా నిర్దేశించడంతోపాటు ముందుండి విజయవంతంగా నడిపామని కేంద్ర పర్యాటక మంత్రి వివరించారు. జీ-20 ప్రెసిడెన్సీ ద్వారా పర్యాటక వర్కింగ్ గ్రూపు సమావేశాల నిర్వహణతోపాటుగా గోవాలో గత నెలలో జరిగిన జీ20 సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల పర్యాటక మంత్రుల సమావేశంలో ఏకగ్రీవంగా ‘గోవా రోడ్ మ్యాప్’కు ఆమోదం తెలిపిన విషయాన్నీ కిషన్ రెడ్డి ప్రస్తావించారు. ఈ గోవా రోడ్ మ్యాప్లో.. గ్రీన్ టూరిజం (సుస్థిర, బాధ్యతాయుతమైన, హరిత పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా సరైన ఫలితాలను సాధించడం), డిజిటలైజేషన్ (పర్యాటక రంగంలో సుస్థిరత, సమగ్రతను సాధించేందుకు డిజిటలైజేషన్ ద్వారా ఓ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటుచేసుకోవడం), స్కిల్స్ (యువత నైపుణ్యాలకు పదునుపెడుతూ పర్యాటక రంగంలో ఉపాధి, వ్యాపారసామర్థ్యాన్ని పెంచేలా చర్యలు), టూరిజం MSMEs (పర్యాటక రంగంలోని MSME లకు, స్టార్టప్లకు, ప్రైవేటు రంగానికి సరైన ప్రోత్సాహాన్ని అందిస్తూ.. సృజనాత్మకతకు పెద్దపీట వేయడం), డెస్టినేషన్ మేనేజ్మెంట్ (గమ్యస్థానాల్లో అవసరమైన నిర్వహణ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంపై పునరాలోచన తద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సమగ్రమైన విధానంతో ముందుకెళ్లడం) అనే ఐదు కీలకమైన అంశాలపై ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని కేంద్రమంత్రి గుర్తుచేశారు. గోవా రోడ్ మ్యాప్ ద్వారా.. ప్రత్యక్షంగా, సానుకూలంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా అడుగులు పడ్డాయన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి ఆలోచనల మేరకు.. ఘనమైన భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం కేంద్రంగా పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచస్థాయి మౌలికవసతుల కల్పనతో ముందుకెళ్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు, వారసత్వాన్ని కాపాడుకునేందుకు.. వివిధ దేశాలతో కలిపి థీమ్ బేస్డ్.. బుద్దిస్ట్ సర్క్యూట్, రామాయణ సర్క్యూట్, హిమాలయన్ సర్క్యూట్, హెరిటేజ్ సర్క్యూట్ మొదలైన వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ పర్యాటక విధానం ముసాయిదాలో ఇలాంటి వాటికి సరైన ప్రాధాన్యత కల్పించామన్నారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్తోపాటు ప్రపంచ పర్యాటకానికి కూడా ఎంతో సానుకూల ఫలితాలను అందిస్తుందన్నారు. ప్రకృతితో అనుసంధానమైన జీవన విధానం వంటివి భారతదేశంలో పర్యాటకాభివృద్దికి సానుకూలమైన అంశాలన్నారు. భారతదేశ సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేద, యోగ, నేచురోపతి వంటివన్నీ.. ప్రకృతితో మమేకమైన జీవించాలన్న ఆలోచనను ప్రతిబింబిస్తాయని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అనే భారతీయ జీవన విధానాన్ని దృష్టిలో ఉంచుకుని.. రానున్న రోజుల్లో ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ దిశగా మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే.. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా జీవనవిధానాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసే ఉద్దేశంతో.. మిషన్ లైఫ్ (LiFE లైఫ్స్టయిల్ ఫర్ ఎన్విరాన్మెంట్) ను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేసిన భారత పర్యాటక మంత్రి.. ప్రజలతోపాటు పర్యాటకులు కూడా చిన్న ఆలోచనలు, చిన్న మార్పుల ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావొచ్చన్నారు. పర్యావరణ స్పృహతోపాటు పర్యాటకానికి సరైన గుర్తింపును తీసుకొచ్చే లక్ష్యంతో పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో.. ‘యువ టూరిజం క్లబ్’లను ఏర్పాటుచేశామన్నారు. తర్వాతి తర్వాతమైన భారతపౌరుల్లో పర్యాటక, పర్యావరణ స్పృహను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ క్లబ్స్ ద్వారా సానుకూల ఫలితాలు కనబడుతున్నాయన్నారు. 2030 నాటికి పూర్తిచేసేలా నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. పర్యాటక రంగ సుస్థిరత, సమగ్రత లక్ష్యాల ప్రాధాన్యతతో భారత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను చూసేందుకు ‘మీరంతా భారత్ కు రండి’ అని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు శ్రీ సాబా కొరోశీ, ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి (UNECOSOC) అధ్యక్షురాలు శ్రీమతి లాషెజరా స్టోయేవాతోపాటుగా.. వివిధ దేశాల పర్యాటక మంత్రులు, UNWTO ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, ప్రపంచ పర్యాటక రంగ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యరాజ్యసమితిలో కిషన్ రెడ్డి ప్రసంగం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో జూలై 13, 14 తేదీల్లో న్యూయార్క్లో జరగనున్న ప్రపంచ ‘హై లెవల్ పొలిటికల్ ఫోరమ్’లో ప్రధాన వక్తగా ప్రసంగించనున్నారు. ఈ అవకాశం లభించిన తొలి భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి కావడం గమనార్హం. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వేదికగా జరగనున్న ‘హై లెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశాల్లో ఆయన వివిధ దేశాల ప్రజా ప్రతినిధులు, అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారతదేశం జీ–20 సమావేశాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, ‘జీ–20 దేశాల టూరిజం చైర్’హోదాలో కిషన్ రెడ్డి ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఇటీవలే గోవాలో జీ–20 దేశాల పర్యాటక మంత్రులు, 9 ప్రత్యేక ఆహా్వనిత దేశాల మంత్రుల సమావేశాలు విజయవంతంగా జరగడం, ఈ సందర్భంగా భారతదేశం చేసిన ప్రతిపాదనలను సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం, అత్యవసర కార్యాచరణ కోసం ప్రపంచ దేశాలు, వివిధ భాగస్వామ్య పక్షాలను (వ్యాపార సంస్థలు) ఏకం చేయాల్సిన ఆవశ్యకత’ఇతివృత్తం (థీమ్)తో న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి వేదికగా ఈ సమావేశాలు జరగనున్నాయి. పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో సాధించిన ప్రగతిని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ఈ హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ వేదికగా సమీక్షించనున్నారు. ఈ ఏడాది ‘కరోనానంతర పరిస్థితుల్లో పర్యాటక రంగాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ఉద్దేశించిన 2030 ఎజెండా అన్ని స్థాయిల్లో అమలు’పై కూడా ఈ సందర్భంగా చర్చించనున్నారు. -
ఒడిశా ఘటనపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సానుభూతి
ఒడిశా రైలు ప్రమాదంపై ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విచారాన్ని వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ కూడా ఆదివారం జరిగిన ప్రార్థనల్లో చనిపోయిన 275 మంది మృతికి సంతాపాన్ని తెలిపారు. "ఒడిశా బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం అత్యంత విషాదకరం. ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాను. గాయాల బారిన పడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు అండగా మా ప్రార్ధనలు ఉంటాయి." -ఆంటోనియో గుటెర్రెస్ వాటికన్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం జరిగిన ప్రార్థనల్లో ప్రత్యేకంగా ఒడిశా ప్రమాదం గురించి ప్రస్తావించి మృతులకు సంతాపాన్ని తెలియజేశారు. " ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందినవారి ఆత్మలను పరలోకంలో ప్రభువు అంగీకరించును గాక. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనలోని బాధితులకు నా ప్రార్ధనలు తోడుగా ఉంటాయి. గాయపడినవారికి, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను." - పోప్ ఫ్రాన్సిస్ బాలాసోర్ ఘటనలో 275 మంది మరణించగా వెయ్యికి పైగా గాయపడ్డారు. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా ఈ ట్రైన్ యాక్సిడెంట్ మిగిలిపోతుంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపి, మరెందరినో దిక్కులేని వారిగా మిగిల్చిన ఈ సంఘటనపై ప్రపంచవ్యాప్తంగా చాలామంది నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. -
హిరోషిమాలో నిష్ఠుర నిజాలు
జపాన్లోని హిరోషిమా వేదికగా మూడు రోజులు సాగిన జీ7 దేశాల సదస్సు రష్యాపై మరిన్ని ఆంక్షలు, చైనాపై ఘాటు విమర్శలు, ఉక్రెయిన్ అధినేత ఆశ్చర్యకర సందర్శనతో ఆదివారం ముగిసింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లతో కూడిన ‘జీ7’లో భాగం కానప్పటికీ, ఈ 49వ సదస్సుకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకున్న భారతదేశం ప్రాధాన్యం ఈ వేదిక సాక్షిగా మరోసారి వెల్లడైంది. భారత ప్రధానికి అమెరికా, ఆస్ట్రేలియా అధినేతల ప్రశంసల నుంచి పాపువా న్యూ గినియా ప్రధాని చేసిన పాదాభివందనం దాకా అనేకం అందుకు నిదర్శనాలు. రష్యా దాడి నేపథ్యంలో యుద్ధబాధిత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైన ఆయన సంక్షోభ పరిష్కారానికి వ్యక్తిగతంగానూ చొరవ చూపుతానడం పెద్ద వార్త. అంతటితో ఆగక ఆ మర్నాడే ఐరాసపై విమర్శల బాణం ఎక్కుపెట్టి, పరిస్థితులకు తగ్గట్టుగా సంస్కరణలు చేయకుంటే ఐరాస, భద్రతా మండలి కేవలం కబుర్లకే పరిమితమైన వేదికలుగా మిగిలిపోతాయనడం సంచలనమైంది. నిష్ఠురమైనా భారత ప్రధాని వ్యాఖ్యలు నిజమే. మూడేళ్ళక్రితం తూర్పు లద్దాఖ్ వెంట భారత్తో చైనా ఘర్షణ మొదలు తాజా ఉక్రెయిన్ సంక్షోభం దాకా అన్నిటినీ దృష్టిలో ఉంచుకొనే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టం. ప్రపంచ శాంతి, సుస్థిరతలకు ఎదురయ్యే సమస్యల్ని చర్చించి, ఘర్షణల్ని నివారించాల్సిన ఐరాస ఆ పని చేయలేక ఇటీవల నామమాత్రంగా మారిన సంగతి చూస్తు న్నదే. సమస్యల్ని ఐరాసలో కాక, ఇతర వేదికలపై చర్చించాల్సి రావడం వర్తమాన విషాదం. అదే సమయంలో అంతర్జాతీయ చట్టం, ఐరాస నియమావళి, ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వ భౌమాధికారాన్ని ప్రపంచ దేశాలన్నీ గౌరవించి తీరాలంటూ జీ7 వేదికగా భారత ప్రధాని కుండ బద్దలు కొట్టారు. కాదని ఏకపక్షంగా వాస్తవస్థితిని మార్చే ప్రయత్నాలకు ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలి అన్న మోదీ వ్యాఖ్యలు పరోక్షంగా చైనాను ఉద్దేశించినవే. భద్రతా మండలిలో భారత సభ్యత్వానికి జరుగుతున్న సుదీర్ఘ కాలయాపన కూడా మోదీ మాటలకు ఉత్ప్రేరకమైంది. గమ్మత్తేమిటంటే, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం 1945 నాటి ప్రపంచ దేశాల పరిస్థితులకు అనుగుణంగా ఉన్న భద్రతామండలిని వర్తమాన కాలమాన పరిస్థితులకు తగ్గట్టు సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని మీడియా ఎదుట అంగీకరించడం. ఇక, సాధారణ అలవాటుకు భిన్నంగా ఒక రోజు ముందు శనివారమే వెలువడ్డ జీ7 విధాన ప్రకటన డజన్ల కొద్దీ పేజీలున్నా – అందులో ప్రధానంగా చైనాపై విసిరిన బాణాలే ఎక్కువ. కనీసం 20 సార్లు చైనా నామ స్మరణ సాగింది. తైవాన్, అణ్వస్త్రాలు, ఆర్థిక నిర్బంధం, మానవహక్కులకు విఘాతం, అమెరికా సహా పలు దేశాలతో బీజింగ్కు ఉన్న ఉద్రిక్తతలు ప్రకటనలో కనిపించాయి. సహజంగానే డ్రాగన్ ఈ ప్రకటనను ఖండించింది. ఇదంతా ‘పాశ్చాత్య ప్రపంచం అల్లుతున్న చైనా వ్యతిరేక వల’ అని తేల్చే సింది. రష్యా సైతం ఈ సదస్సు తమపైనా, చైనాపైనా విద్వేషాన్ని పెంచి పోషించే ప్రయత్నమంది. యాభై ఏళ్ళ క్రితం ఒక కూటమిగా ఏర్పడినప్పుడు ఏడు పారిశ్రామిక శక్తుల బృందమైన ‘జీ7’ దేశాలు ప్రపంచ సంపదలో దాదాపు 70 శాతానికి ప్రాతినిధ్యం వహించాయి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి వాటా 44 శాతమే. నిజానికి, 2007–08లో ప్రపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో ‘జీ20’ కూటమి ఏర్పాటయ్యాక అంతర్జాతీయ ఆర్థిక మేనేజర్గా ‘జీ7’ వెలుగు తగ్గింది. అయితే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అగ్రశ్రేణిలో నిలిచిన ఈ దేశాలు ఇప్పటికీ తామే ప్రపంచ విధాన నిర్ణేతలమని చూపాలనుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ఆ ఆలోచన, ఆకాంక్ష అత్యవసర మయ్యాయి. వర్తమాన ప్రపంచ అధికార క్రమాన్ని సమర్థించే శక్తులన్నీ ఒక్కచోట చేరి ఈ సదస్సును వినియోగించుకుంటున్నాయి. ఉక్రెయిన్పై దాడి అంతర్జాతీయ సమాజ విధివిధానాలకే సవాలని జపాన్ ప్రధాని పదే పదే పేర్కొన్నది అందుకే! స్వదేశంలోని రాజకీయ అంశాలతో తన పర్యటనలో రెండో భాగాన్ని రద్దు చేసుకున్నా ‘జీ7’కు మాత్రం అమెరికా అధ్యక్షుడు హాజరైందీ అందుకే! అదే సమయంలో 2.66 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో, తమ సభ్యదేశాలైన ఫ్రాన్స్, ఇటలీ, కెనడాల కన్నా పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ను అనేకానేక కారణాల వల్ల జీ7 విస్మరించే పరిస్థితి లేదు. ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని, సరఫరా వ్యవస్థల్లో చిక్కులతో అనేక పాశ్చాత్య దేశాలు చిక్కుల్లో పడ్డాయి. అటు రష్యాతో, ఇటు పాశ్చాత్య ప్రపంచంతో సంబంధాల్లో సమతూకం పాటిస్తుండడం భారత్కు కలిసొస్తోంది. భవిష్యత్తులో చర్చలు, దౌత్యంతో యుద్ధం ఆగాలంటే – ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భారత్ మధ్యవర్తిత్వం కీలకం. కిందపడ్డా తనదే పైచేయిగా ఉండేలా ‘జీ7’కు భారత్ ఆ రకంగా అవసరమే. భారత్ సైతం ఒకపక్కన చైనా దూకుడును పరోక్షంగా నిరసిస్తూనే, రష్యా సాగిస్తున్న యుద్ధంపై తటస్థంగా ఉంటూ శాంతి ప్రవచనాలు చేయక తప్పని పరిస్థితి. భారత ప్రధాని అన్నట్టు చర్చలే అన్ని సమస్యలకూ పరిష్కారం. సమస్యను రాజకీయ, ఆర్థిక కోణంలో కాక మానవీయ కోణంలో చూడా లన్న హితవు చెవికెక్కించుకోదగ్గదే. ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధిలో వెనకబడ్డ దక్షిణార్ధగోళ దేశాలకు భారత్ గొంతుక కావడమూ బాగుంది. ప్రపంచ అధికార క్రమంలో గణనీయ మార్పుల నేపథ్యంలో ఇలాంటి శిఖరాగ్ర సదస్సులు, సమాలోచనలు జరగడం ఒకరకంగా మంచిదే. సమస్యల్ని ఏకరవు పెట్టడం సరే కానీ, సత్వర పరిష్కారాలపై జీ7 దృష్టి నిలిపిందా అంటే సందేహమే! -
అత్యధిక జనాభా భారత్దే: ఐరాస
న్యూయార్క్: ప్రపంచంలో అత్యధిక జనాభా దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం గణాంకాలతో కూడిన డేటాను విడుదల చేసింది. చైనా జనాభా 142.57 కోట్లు కాగా, దానిని అధిగమించి భారత్ 142.86 కోట్ల జనాభాతో అగ్రస్థానంలో నిలిచినట్లు ఐరాస వెల్లడించింది. అంటే చైనా కంటే 29 లక్షల జనాభా భారత్లో ఎక్కువగా ఉందన్నమాట. 1950 నుంచి ఐక్యరాజ్య సమితి అత్యధిక జనాభా దేశాల జాబితాను విడుదల చేస్తోంది. ఈ లిస్ట్లో భారత్ అగ్రస్థానంలో నిలవడం ఇదే ప్రథమం. అయితే ఈ గణాంకాలపై భారత్ నుంచి అధికారిక నిర్ధారణ లేదు. ఎందుకంటే ప్రతీ పదేళ్లకొకసారి భారత్లో జనాభా లెక్కల ప్రక్రియను కేంద్రం చేపడుతుంది. అయితే.. 2011 తర్వాత 2021లో జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉండగా, కరోనా కారణంగా అది వాయిదా పడింది. మరోవైపు చైనాలో 2022లో జనాభా పెరుగుదలలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. 1960 తర్వాత ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే. అక్కడి పరిస్థితులు, చట్టాలు అందుకు కారణం కాగా, జనాభా పెరుగుదల రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సైతం విఫలమవుతున్నాయి. 2022లో ఏకంగా 8,50,000 జనాభా తగ్గిపోయింది అక్కడ. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ బుధవారం ది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, 2023', '8 బిలియన్ లైవ్స్, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్: ది కేస్ ఫర్ రైట్స్ అండ్ ఛాయిసెస్' పేరుతో ఒక జాబితా విడుదల చేసింది. భారత్, చైనా తర్వాత జనాభాలో అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్లు ఈ లిస్ట్లో తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇదీ చదవండి: రాక్షస క్రీడకు శిక్ష తప్పదు.. -
మహిళలు బాలికలపై హింస ప్రబలంగా ఉంది! యూఎన్లో భారత్
మహిళలు, బాలికలపై ఉగ్రవాదులు సాగిస్తున్న హింస ప్రబలంగా ఉందని భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మహిళల శాంతి భద్రతలకు సంబంధించి 1325 రిజల్యూషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగించారు. ఈమేరకు రుచిరా మాట్లాడుతూ.. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం తదితరాలు మానవహక్కులను తీవ్రంగా ఉల్లంఘించేవి. పైగా ప్రపంచ శాంతి భద్రతలకు నిరంతరం ముప్పుగా కొనసాగుతున్నాయి. దీని కారణంగా మహిళలు, బాలికలు తీవ్రంగా కలత చెందుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రకాల తీవ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభించాలని ఆమె పిలుపునిచ్చారు. అక్టోబర్లో మహిళల శాంతి భద్రతలపై ఐరాస భద్రతా మండలి 1325వ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం సంఘర్షణలు, శాంతి చర్చలు, శాంతి నిర్మాణం, శాంతి పరిరక్షణ, మానవతా ప్రతిస్పందన, తదితరాల్లో మహిళల పాత్రను తెలియజేస్తోంది. అంతేగాదు ఇది సంఘర్షణ అనంతర పునర్నిర్మాణం, సమాన భాగస్వామ్యం, శాంతి భద్రతలకు సంబంధించి అన్ని రకాలుగా వారి పూర్తి ప్రమేయానికి సంబంధించిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. మహిళలకు మంచి అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి చట్టబద్ధమైన నియమాలు తప్పనిసరి. అలాగే అఫ్ఘనిస్తాన్ పరిస్థితిని ప్రస్తావిస్తూ.. ఆగస్టు 2021లో భారత్ కౌన్సిల్ ఆఫ్ది ప్రెసిడెన్సీలో ఆమోదించిన యూఎన్ఎస్సీ తీర్మానం 2593 ప్రకారం.. అప్ఘనిస్తాన్లో మహిళల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రాతినిథ్య పాలన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. అలాగే మహిళలపై హింసకు పాల్పడే వారి శిక్షార్హత గురించి తనిఖీ చేయడంలో జాతీయ అధికారులు ఐక్యరాజ్యసమితి, ప్రాంతీయసంస్థలకు సాయం చేయాలి. సంఘర్షణ అనంతర పరిస్థితుల్లో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతలు, హింసలను పరిష్కరించడంలో సభ్యదేశాలకు మద్దతు ఇవ్వాలి. శాంతిస్థాపన ప్రయత్నాలలో మహిళలపై దృష్టి పెట్టడం అత్యంత కీలకం. ఇలాంటి వాటిని ముందుకు తీసుకువెళ్లడంలో మహిళా పోలీసు అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. అలాగే భారత్లో లింగ సమానత్వాన్ని స్వాగతిస్తున్నాం. జనవరి 2023లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యక్రమాలకు అత్యధికంగా సైన్యాన్ని అందించిన దేశాలలో భారత్ ఒకటి. 2007 లైబీరియాలో మొత్తం మహిళా పోలీసుల విభాగాలను ఏర్పాటు చేసిన మొదటి దేశం భారతదేశం. అంతేగాదు మహిళ రక్షణ సలహాదారుల విస్తరణకు భారత్ మద్దతు ఇస్తోంది. మహిళా శాంతి భద్రతల ఎజెండాను బలోపేతం చేస్తున్నప్పటికీ శాంతి స్థాపనలో మహిళలు ఇప్పటికీ తక్కువగానే ప్రాతినిధ్యం వహించడం బాధకరం. కానీ భారత సాంస్కృతిక సంప్రదాయల్లో భూమిని తల్లిగా పరిగణించటం ప్రజలకు నేర్పింది. దేశ సాధికారతకు మహిళ పురోగతి చాలా ముఖ్యమని భారత్ గట్టిగా విశ్వసిస్తుందని రుచిరా అన్నారు. (చదవండి: వక్రీకరించే వైఖరిని మార్చుకోమంటూ యూఎస్కి చైనా స్ట్రాంగ్ వార్నింగ్) -
భారత ప్రధానమంత్రి కసాయి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో నోటి దురుసు ప్రదర్శించారు. ఐరాస భేటీ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్కు ఒక విషయం చెప్పదల్చుకున్నా. లాడెన్ చచ్చిపోయాడు గానీ గుజరాత్ ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న కసాయి బతికే ఉన్నాడు. ఆయనే భారత ప్రధాని. ఆయన్ను అమెరికాలో అడుగుపెట్టకుండా అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఆయన ఆరెస్సెస్ ప్రధాని. ఆరెస్సెస్ విదేశాంగ మంత్రి. అసలు ఆర్ఎస్ఎస్ హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందింది!’’ అన్నారు. బిలావల్ తొలుత ఐరాస భేటీలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. వేలాది మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్ర సంస్థ అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్కు, భారత పార్లమెంట్పై దాడి చేసిన ముష్కరులకు ఆశ్రయమిచ్చిన పాక్కు నీతి బోధలు చేసే అధికారం లేదంటూ విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా బదులిచ్చారు. ఈ విమర్శలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోదీపై బిలావల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవి అనాగరికంగా, పాక్ స్థాయిని మరింత దిగజార్చేలా ఉన్నాయంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తీవ్రంగా ఖండించారు. 1971లో ఏం జరిగిందో బిలావల్ మర్చిపోయినట్లున్నారని భారత్ చేతిలో పాక్ ఓటమిని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. -
భారత్ మానవ హక్కుల రికార్డుపై.. యూఎన్ చీఫ్ సీరియస్
ముంబై: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తన మూడు రోజుల పర్యటనలో భారత్ మానవ హక్కుల రికార్డుపై విమర్శలు కురిపించారు. ఈ మేరకు ఆయన ముంబైలో ప్రసంగిస్తూ...ప్రభుత్వ విమర్శకులు, జర్నలిస్టులు, మహిళా రిపోర్ట్ర్లపై దాడులు అధికమైపోయాయి. మానవ హక్కుల మండలిలో ఎన్నుకోబడిన సభ్య దేశంగా భారత్కి ప్రపంచ మానవ హక్కులను రూపొందించడం, మైనారిటీ వర్గాల సభ్యులతో సహా అందరి హక్కులను రక్షించడం, ప్రోత్సహించడం వంటివి చేయాల్సిన బాధ్యత ఉంది. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్ల భారత్లో సాధించిన విజయాలను గురించి కూడా ప్రశంసించారు. అలాగే భారత్లో వైవిధ్యం గొప్పగా ఉంటే సరిపోదని, హక్కులు రక్షింపబడాలి. అలాగే ద్వేషపూరిత ప్రసంగాలను నిర్ద్వద్వంగా ఖండించి విలువలను కాపాడుకోవాలి. మానవహక్కులను భారత న్యాయవ్యవస్థ నిరంతరం రక్షిస్తూ ఉండాలి. ఈ ప్రసంగంలో భారత్ కర్భన ఉద్గారాలు తగ్గించే విషయం గురించి కూడా ప్రస్తావించారు. పునరుత్పాదక శక్తి కోసం లక్ష్యాలను నిర్దేశిస్తున్నప్పటికీ భారత్ మాత్రం 70 శాతం బొగ్గును వినయోగిస్తోంది. భారత్ వంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ చర్యలు మరిన్ని తీసుకోవాలి. ఆరవ వంతు మానవాళి అధికంగా ఉన్న భారత్ 2030 కల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తుంద? లేక విచ్ఛన్న చేస్తుందా? అని ప్రశ్నించారు. (చదవండి: మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..) -
ర్యాంకులు పోనాయండీ!
ప్రపంచవ్యాప్తంగా ఇది ఆందోళనకర అంశం, తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన విషయం. ఐరాస లెక్క ప్రకారం వరుసగా రెండో ఏడాదీ పలు దేశాల ‘మానవాభివృద్ధి సూచిక’ (హెచ్డీఐ) స్కోరు కిందకు పడింది. మన దేశపు ర్యాంకు మునుపటితో పోలిస్తే రెండు స్థానాలు కిందకు పడింది. ఐరాస అభివృద్ధి సంస్థ (యూఎన్డీపీ) 2021–22 మానవాభివృద్ధి నివేదిక (హెచ్డీఆర్) ‘అనిశ్చిత పరిస్థితులు, అస్థిర జీవితాలు – మారుతున్న ప్రపంచంలో భవిష్యత్ రూప కల్పన’ ఈ చేదునిజాన్ని బయటపెట్టింది. తొంభై శాతానికి పైగా దేశాలు 2020లో కానీ, 2021లో కానీ హెచ్డీఐ స్కోరులో వెనకబడ్డాయి. నలభై శాతానికి పైగా దేశాలైతే ఆ రెండేళ్ళూ ర్యాంకుల్లో కిందికి వచ్చేశాయి. గత వారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం మానవాభివృద్ధిలో మొత్తం 191 దేశాల్లో మన దేశం రెండు స్థానాలు కిందకొచ్చి, 132వ ర్యాంకుకు చేరింది. గడచిన 32 ఏళ్ళలో ఇలా వరుసగా రెండేళ్ళు సూచికలో దిగజారడం ఇదే తొలిసారి. మానవాభివృద్ధి పరామితుల ప్రకారం బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకల కన్నా మనం వెనకబడే ఉన్నాం. దేశం సుభిక్షంగా ఉంది, స్థూల జాతీయోత్పత్తిలో బ్రిటన్ను దాటేశాం లాంటి కబుర్లతో కాలక్షేపం చేస్తున్న వారికి ఇది కనువిప్పు. హెచ్డీఐలో వివిధ దేశాల ర్యాంకులు పడిపోవడానికి కనివిని ఎరుగని సంక్షోభాలు కారణం. గత పదేళ్ళలో ఆర్థికపతనాలు, వాతావరణ సంక్షోభాలు, కరోనా, యుద్ధం లాంటి గడ్డు సమస్యల్ని ప్రపంచం ఎదుర్కొంది. ప్రతి సంక్షోభం ప్రపంచాభివృద్ధిపై ప్రభావం చూపింది. అయితే, అందులో కరోనాది అతి పెద్ద పాత్ర అని ఐరాస నివేదిక సారాంశం. ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారితో మానవ పురోగతి కనీసం అయిదేళ్ళు వెనక్కి వెళ్ళింది. అంతటా అనిశ్చితి ప్రబలింది. హెచ్డీఐకి లెక్కలోకి తీసుకుంటున్న అంశాల్లో లోపాలున్నాయని కొన్ని విమర్శలు లేకపోలేదు. అయితే, మరే సూచికా లేని వేళ ప్రతి దేశపు సగటు విజయాన్నీ లెక్కించడానికి ఉన్నంతలో ఇదే మెరుగైనదని ఒప్పుకోక తప్పదు. ఆర్థిక అసమానత్వం, లైంగిక అసమానత్వం, బహుముఖ దారిద్య్రం లాంటి ఆరు వేర్వేరు మానవాభివృద్ధి సూచీల ద్వారా ఈ ర్యాంకులు లెక్కకట్టారు. స్విట్జర్లాండ్ 0.962 స్కోరుతో ప్రథమ ర్యాంకు దక్కించుకుంది. భారత్ కేవలం 0.633 స్కోరుతో అగ్రశ్రేణికి సుదూరంగా నిలిచిపోయింది. విషాదమేమిటంటే, మానవాభివృద్ధిలో మన స్కోరు ప్రపంచ సగటు 0.732 కన్నా తక్కువ. పొరుగున ఉన్న చైనా హెచ్డీఐ స్కోర్ 1990 నుంచి ఏటా పెరుగుతుంటే, మన పరిస్థితి తద్భిన్నంగా ఉంది. మన దేశంలో ఆర్థిక అసమానతలూ ఎక్కువే. జనాభాలో అతి సంపన్నులైన 1 శాతం మంది ఆదాయ వాటా, నిరుపేదలైన 40 శాతం మంది వాటా కన్నా ఎక్కువని తాజా లెక్క. ఇంతటి అసమానత చైనా, స్విట్జర్లాండ్లలో లేదు. లింగపరంగా చూస్తే, మన దేశ తలసరి ఆదాయంలో పురుషుల కన్నా స్త్రీలు చాలా వెనుకబడి ఉన్నారు. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల ప్రాతిపదికన లెక్కకట్టే బహుముఖ దారిద్య్రం లోనూ భారత్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. 2019 నాటి యూఎన్డీపీ అంచనాల ప్రకారం... ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనాలో 5.4 కోట్ల మంది బహుముఖ దారిద్య్రంలో ఉంటే, రెండో అత్యధిక జనాభా ఉన్న భారత్లో ఆ సంఖ్య 38.1 కోట్ల పైచిలుకే. అయితే, 2019 – 2020 మధ్య మన దేశంలో లింగ అసమానత దారుణంగా పెరగగా, తాజా నివేదికలో ఆ కోణంలో కొద్దిగా మెరుగుదల సాధించడం ఉపశమనం. మొత్తానికి, అన్నీ కలిపి చూస్తే మానవాభివృద్ధిలో మన స్కోరునూ, దరిమిలా ఇతర దేశాల మధ్య మన ర్యాంకునూ కిందకు గుంజాయి. అయితే, సంతోషించదగ్గ అంశం ఏమంటే – కరోనాలో ఏడాది లోపలే భారత్ టీకాను అభివృద్ధి చేయడం, ధనిక దేశాలకు సైతం కరోనా నిరోధానికి సహకరించడం! ఇది మన మానవ సామర్థ్యమే! అదే సమయంలో కనీస ఆదాయ హామీకై దేశంలో జరుగుతున్న ప్రయత్నాలూ యూఎన్డీపీ ప్రశంసలు అందుకున్నాయి. అలాగే కరోనా అనంతరం ఆర్థికంగా మన దేశపు పనితీరు పొరుగు దేశాల కన్నా మెరుగ్గా ఉండడం ఆశాకిరణం. అభివృద్ధి అజెండా అమలుకు నిధులు వెచ్చించే వీలుంటుంది. అయినా, ఇప్పటికీ అనేక అంశాల్లో ఇతర దేశాలు మెరుగ్గా ఉన్నాయనేది నిష్ఠురసత్యం. పౌష్టికలోప జనాభా, బాలల మరణాల రేటు తదితర అంశాలతో లెక్కించే ‘ప్రపంచ ఆకలి సూచి’ (2020) ప్రకారం కూడా 107 దేశాల్లో మనది 94వ స్థానం. వీటికి తోడు ఇప్పుడు ఉక్రెయిన్లో యుద్ధం, ప్రపంచాన్ని పూర్తిగా వదిలిపోని కరోనా, భూతాపోన్నతి ముప్పేటదాడి చేస్తున్నాయి. అన్నీ కలసి ప్రపంచ ఆహార సంక్షోభానికి దారి తీయవచ్చని ఐరాస హెచ్చరిస్తోంది. నిలకడైన అభివృద్ధి, సామాజిక భద్రత, సత్వర సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి పెడితేనే అనిశ్చితి నుంచి బయటపడగలమంటోంది. ఐరాస మాట చద్దిమూట. పాలకులు దీన్ని పరిగణనలోకి తీసుకొని, పకడ్బందీగా మానవాభివృద్ధి ప్రణాళికలు రచించాలి. పర్యావరణ సంక్షోభ నివారణ లక్ష్యాలను చేరుకొనేందుకూ కృషి చేయాలి. ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతూ, ఉపాధి హామీ తగ్గుతున్న సమయంలో ఎన్నికల వ్యూహాలు కాస్త ఆపి, నిలకడగా చేతల్లోకి దిగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతరాలు తగ్గించుకొని, సమన్వయంతో సాగాలి. కానీ, పైచేయి కోసం ప్రయత్నాలతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా సహకార స్ఫూర్తి కొరవడుతున్న వేళ ప్రగతి బాటలో కలసి సాగడానికి మన పాలకులు సిద్ధమేనా? -
50 మిలియన్ల మందికి పైగా ప్రజలు బానిసత్వంలోనే: యూఎస్ రిపోర్ట్
జెనీవా: ప్రపంచంలో 50 మిలియన్ల మంది ప్రజలు బలవంతపు పనిలో లేదా బలవంతపు వివాహంలో చిక్కుకున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇటీవలకాలంలో ఆ సంఖ్య మరింత గణనీయంగా పెరిగినట్లు యూఎన్ తెలిపింది. యూఎన్ 2030 నాటికి అన్నిరకాల ఆధునిక బానిసత్వాన్ని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐతే అనుహ్యంగా 2016 నుంచి 2020 మధ్యకాలంలో సుమారు 10 మిలియన్ల మంది బలవంతపు కార్మికులుగా లేదా బలవంతపు వివాహాల్లో చిక్కుకున్నారని యూఎన్ నివేదికలో పేర్కొంది. వాక్ ఫ్రీ ఫౌండేషన్తో పాటు యూఎన్ లేబర్ అండ్ మైగ్రేషన్ ఏజెన్సీల అధ్యయనం ప్రకారం గతేడాది చివరి నాటికి సుమారు 28 మిలియన్ల మంది ప్రజలు బలవంతపు పనిలోకి నెట్టివేయబడ్డారని, దాదాపు 22 మిలియన్ల మంది బలవంతంగా వివాహం చేసుకున్నారని తెలిపింది. దీనిని బట్టి ప్రపంచంలో ప్రతి 150 మందిలో దాదాపు ఒకరు ఆధునిక బానిసత్వంలో చిక్కుకున్నారని అధ్యయనం వెల్లడించింది. ఆధునిక బానిసత్వం మెరుగవకపోవడం దిగ్బ్రాంతికరం అని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్ఓ) అధిపతి గైరైడర్ అని తెలిపారు. అదీగాక కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను మరింత దిగజార్చింది. దీంతో చాలామంది కార్మికుల రుణాలను పెంచిందని అధ్యయనం గుర్తించింది. అంతేగాక వాతావరణ మార్పు, సాయుధ పోరాటాల ప్రభావాల కారణంగా ఉపాధి, విద్యకు అంతరాయం తోపాటు తీవ్రమైన పేదరికం తలెత్తి అసురక్షిత వలసలకు దారితీసిందని తెలిపింది. దీన్ని దీర్ఘకాలిక సమస్యగా యూఎన్ నివేదిక అభివర్ణించింది. పిల్లల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు బలవంతపు శ్రమలోకి నెట్టబడటమే కాకుండా వారిలో సగానికి పైగా వాణిజ్యపరమైన లైంగిక దోపిడికి గురవుతున్నారని నివేదిక పేర్కొంది. అలాగే వలస కార్మకులు, వయోజన కార్మికులు బలవంతపు పనిలో ఉండే అవకాశం మూడురెట్లు ఉందని పేర్కొంది. ఈ నివేదిక అన్ని వలసలు సురక్షితంగా, క్రమబద్ధంగా ఉండేలా చూసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది అని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) అధిపతి ఆంటోనియో విటోరినో ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: శిక్షణ విన్యాసాల్లో అపశ్రుతి.... హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి) -
శాంతి కమిషన్లో మోదీ పేరు... ప్రతిపాదించిన మెక్సికో
ప్రపంచ శాంతి కోసం ఐదేళ్ల కాలానికి ఆయా దేశాల మధ్య సంధిని ప్రోత్సహించేలా ముగ్గురు ప్రపంచ నాయకులతో కూడిన అత్యున్నత కమిషన్ని రూపొందించనున్నారు. ఐతే మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఆ కమిషన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉండాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ముగ్గురు ప్రపంచ నాయకులతో కూడిన కమిషన్లో భారత ప్రధాని పేరుని ప్రతిపాదించినట్లు తెలిపారు. తాను రాత పూర్వకంగా ఒక ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితికి అందజేస్తానని కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపేలా ఐదేళ్ల సంధి కాలానికి ఒక ఒప్పందం కుదుర్చునేలా ప్రతిపాదన సమర్పించడం ఈ కమిషన్ లక్ష్యం. ఈ అత్యున్నత కమిషన్లో పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తోపాటు భారత ప్రధాని మోదీ ఉండాలని మెక్సికో అధ్యక్షుడు ప్రతిపాదించారు. ఆ ముగ్గురు నాయకులు ప్రతి చోట యుద్ధాన్ని ఆపేసేలా ఒక ప్రతిపాదనను అందజేయడమే కాకుండా ఐదేళ్ల యుద్ధాన్ని నిలిపేసేలా ఐదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. తద్వారా ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు తమ ప్రజలను ఆదుకోవడమే కాకుండా ఉద్రిక్తతలు తలెత్తకుండా శాంతిగా ఉంటాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదిక చర్యలకు స్వస్తి పలకాలని పిలుపునిస్తూ మెక్సికో అధ్యక్షుడు.. రష్యా, చైనా, అమెరికా వంటి దేశాలను శాంతిని కోరేందుకు ఆహ్వానించారు. ఈ మూడు దేశాలు తాము ప్రతిపాదిస్తున్న మధ్యవర్తిత్వాన్ని అంగీకరిస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఈ ప్రతిపాదిత సంధి తైవాన్, ఇజ్రాయోల్, పాలస్తీనా వంటి దేశాలతో కూడా ఒప్పందం చేసుకునేలా మార్గం సుగమం అవుతుందని చెప్పారు. అదీగాక ఈ ఒక్క ఏడాదిలోనే ఎన్నో ఘర్ణణలతో కూడిన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని, ఎంతోమంది ప్రజలు చనిపోవడం, నిరాశ్రయులవ్వడం జరిగిందని చెప్పారు. (చదవండి: 'తగ్గేదే లే' అని తెగేసి చెబుతున్న చైనా! ఎనీ టైం రెడీ!) -
ముంచుకొస్తున్న ఇసుక కొరత
గాలి, నీరు తర్వాత మనిషి అత్యధికంగా ఉపయోగించే, అత్యధికంగా దుర్వినియోగం చేసే ప్రకృతి వనరు ఇసుక! భూమిపై మానవుడు అత్యధికంగా తవ్వితీసుకునేది కూడా ఇసుకే! అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న మనిషి అక్రమ తవ్వకాల ప్రభావంతో ఇసుక కొరత పొంచి ఉందంటోంది ఐరాస నివేదిక. ఎడారుల్లో ఇసుక తుఫానులు ముంచెత్తుకొస్తాయి. అవి వచ్చినప్పుడు ప్రజా జీవనం అతలాకుతలం అవుతుంది. అయితే ప్రపంచమంతటినీ ఇబ్బంది పెట్టే తుఫాను ఇసుక కొరత రూపంలో రాబోతోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇసుక కొరత పెరిగిపోతోందని, తక్షణమే దీనిపై స్పందించకుంటే సమస్యలు తప్పవని, అందుకే తస్మాత్ జాగ్రత్త అని ప్రపంచ దేశాలకు సూచించింది. ఇసుక సంక్షోభం తలెత్తకుండా ఉండాలంటే బీచ్ల తవ్వకంపై నిషేధం సహా పలు చర్యలు తీసుకోవాలని కోరింది. పలు దేశాల్లో ఇసుక వాడకంపై ప్రభుత్వ ఆజమాయిషీ లేదని, ఈ పద్ధతి సరికాదని తెలిపింది. ప్రపంచంలో అతిగా తవ్వితీసే ఉత్పత్తుల్లో ఇసుక ప్రథమస్థానంలో నిలుస్తోంది. చాలా దేశాల్లో ఇసుక అక్రమ మైనింగ్ సాధారణంగా మారింది. భౌగోళిక ప్రక్రియల కారణంగా ఇçసుక ఏర్పడుతుంది. ఇందుకు వందల సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఇలా ఉత్పత్తయ్యే ఇసుక కన్నా మనిషి తవ్వేస్తున్న ఇసుక పరిమాణం ఎక్కువని ఐరాస అనుబంధ సంస్థ యూఎన్ఈపీ విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఇసుకపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకుంటే భవిష్యత్ తరాల అవసరాలకు తగిన లభ్యత ఉండదని హెచ్చరించింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందిస్తే సంక్షోభం రాకముందే అరికట్టవచ్చని యూఎన్ఈపీ ఎకానమీ డివిజన్ డైరెక్టర్ షెహీలా అగర్వాల్ ఖాన్ చెప్పారు. మనిషికి 17 కిలోలు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా గ్లాసు, కాంక్రీట్, నిర్మాణ పదార్ధాల వాడకం మూడురెట్లు పెరిగింది. దీనివల్ల వీటి ముడిపదార్ధమైన ఇసుక వాడకం ఏడాదికి 5వేల కోట్ల టన్లుకు చేరింది. అంటే సరాసరిన ప్రతి మనిషి రోజుకు 17 కిలోల ఇసుక వాడుతున్నట్లవుతోంది. విచ్చలవిడి ఇసుక తవ్వకాలతో నదులు, సముద్రతీరాలు ధ్వంసమవడమే కాకుండా చిన్నద్వీపాలు కనుమరుగవుతున్నాయని ఐరాస నివేదిక తెలిపింది. పర్యావరణ పరిరక్షణలో ఇసుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. వరదల నుంచి రక్షణగా నిలుస్తుంది. భూముల క్రమక్షయాన్ని తగ్గిస్తుంది. ఇసుక అక్రమ వాడకం పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసి జీవవైవిధ్యతను కనుమరుగు చేస్తుంది. ఇప్పటికే భూమిపై కొన్ని చోట్ల ఇలాంటి దుస్థితి ఏర్పడింది. ఉదాహరణకు దక్షిణాసియాలో పొడవైన మీకాంగ్ నదిలో ఇసుక అక్రమమైనింగ్ కారణంగా డెల్టా ప్రాంతమంతా మునిగిపోయింది. పలు సారవంతమైన భూములు ఉప్పునీటి కయ్యలుగా మారాయి. శ్రీలంకలోని నదిలో ఇసుక తవ్వకాలు నీటి ప్రవాహ దిశనే మార్చివేశాయి. దీంతో నదిలోనించి సముద్రంలోకి వెళ్లకుండా సముద్రపు నీరు నదిలోకి రావడం మొదలైంది. ప్రపంచమంతా ఈ పరిస్థితులు రాకుండా నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదిక చర్చించింది. బీచ్ల్లో ఇసుక తవ్వకాలను నిషేధించాలని సూచించింది. ఇలా ఏర్పడుతుంది.. శిలల క్రమక్షయంతో ఇసుక ఏర్పడుతుంది. ఇందుకు వందల, వేల సంవత్సరాల సమయం పడుతుంది. క్వార్ట్›్జశిలలు శిధిలమయ్యేందుకు మరింత ఎక్కువ సమయం పడుతుంది. నదులు, ప్రవాహాల్లో నీటివేగం రాళ్లను కదిలిస్తుంది. దీనివల్ల అవి ప్రవాహం వెంట దొర్లుకుంటూ రాపిడి, క్రమక్షయం చెందుతూ వస్తాయి. వీటివల్ల ఇసుక మేటలు ఏర్పడతాయి. సముద్ర తీరాల్లో అలల ప్రభావం వల్ల ఇసుక ఉత్పత్తి అవుతుంది. బీచ్లో ఇసుక రంగు ఎర్రగా ఉండేందుకు ఐరన్ ఆక్సైడ్ కారణమని నిపుణులు తెలిపారు. సాధారణ ఇసుక రేణువు వ్యాసం 0.3 నుండి 2 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. ఎడారి ఇసుక సమృద్ధిగా ఉన్నప్పటికీ, అది కాంక్రీటు తయారీకి సరిపోదు. అందుకే నదులు, బీచ్ల్లో ఇసుక తవ్వకాలు జరుపుతారు. -
హద్దు మీరితే ప్రకృతి శిక్షే.. ఏడాదికి 560 విపత్తులు!
మనిషి హద్దు మీరితే ప్రకృతి శిక్షిస్తుంది.. పురాణకాలం నుంచీ వింటూనే ఉన్నా మానవ ప్రవర్తన మారడంలేదు, ప్రకృతి విధ్వంసం ఆపడం లేదు. పర్యావరణంపై మనిషి అకృత్యాలు మితిమీరిపోతున్నాయని, ఇలాగే కొనసాగితే ప్రకృతి విలయతాండవాన్ని చవిచూడాల్సివస్తుందని తాజాగా ఐరాస నివేదిక హెచ్చరిస్తోంది. ప్రస్తుత ధోరణులే కొనసాగితే 2030నుంచి ఏడాదికి 560 విపత్తులను మానవాళి చవిచూడాల్సివస్తుందని నివేదిక తెలిపింది. 2015లో అత్యధికంగా 400 విపత్తులు ఎదురైతేనే మనిషి అల్లకల్లోలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఏడాదికి 560 అంటే రోజుకు దాదాపు ఒకటిన్నర విపత్తు ఏదోరూపంలో మనిషిని ఇబ్బందిపెట్టనుందన్నమాట! వరదలు, తుపానులు, భూకంపాలు, కొత్త వ్యాధులు, రసాయన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు.. ఇలా అనేక రూపాల్లో ఇవి ఎదురవుతాయి. 1970– 2000 సంవత్సరం వరకు ప్రపంచంలో ఏదోఒక చోట ఏడాదికి 90– 100 వరకు విపత్తులు వచ్చేవని, కానీ పర్యావరణ విధ్వంసం వేగవంతం కావడంతో విపత్తుల వేగం కూడా పెరిగిందని నివేదిక తెలిపింది. మూడురెట్ల వేడి 2030లో ప్రపంచాన్ని వేడిగాలులు చుట్టుముడతాయని, వీటి తీవ్రత 2001 కన్నా మూడురెట్లు అధికంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. అదేవిధంగా కరువులు 30 శాతం మేర పెరుగుతాయని తెలిపింది. కేవలం ప్రకృతి విధ్వంసాలు మాత్రమే కాకుండా ఆర్థిక మాంద్యాలు, వ్యాధులు, ఆహారకొరతలాంటివి కూడా శీతోష్ణస్థితి మార్పుతో సంభవిస్తాయని హెచ్చరించింది. ఇప్పటికైనా మేల్కోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సిఉంటుందని ఐరాస ప్రతినిధి మమి మిజుటోరి చెప్పారు. 1990ల్లో విపత్తుల కారణంగా సంవత్సరానికి దాదాపు 7వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని, ఇప్పుడీ నష్టం 17వేల కోట్ల డాలర్లకు పెరిగిందని చెప్పారు. విపత్తుల ప్రభావం ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఉంటుందని ఐరాస డిఫ్యూటీ సెక్రటరీ జనరల్ అమినా చెప్పారు. ప్రదేశాలవారీగా ఆసియాపసిఫిక్ ప్రాంతంలో విపత్తుల వల్ల ఏడాదికి జీడీపీలో 1.6 శాతం మేర నష్టపోతుందని తెలిపారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
నవరత్నాలు.. సుస్థిర అభివృద్ధికి మార్గాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిని అభివృద్ధి చెందిన దేశాల ప్రజల స్థాయికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్న కార్యక్రమాలతో పాటు ఇతర మేనిఫెస్టో అంశాలను రూపొందించి అమలు చేస్తోంది. ఈ 17 లక్ష్యాలు, వాటికి అనుగుణంగా 487 రకాల ప్రజల జీవన ప్రమాణాల అంచనా అంశాలపై గ్రామ స్థాయి వరకు ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు, తద్వారా ప్రభుత్వ పథకాలను అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లి, పేదల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఆన్లైన్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఏపీఎస్ఐఆర్డీ) ద్వారా ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 16 వరకు మొత్తం 81 అంశాలపై ఈ శిక్షణ ఇస్తారు. సుస్థిర అభివృద్ధి్ద లక్ష్యాలకు నవరత్నాల అనుసంధానం ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్న విధంగా ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 1.25 యూఎస్ డాలర్లు ఖర్చు చేసే స్థాయిలో ఉంచడం, పురుషులతో సమానంగా మహిళలూ ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉండడం, అందరికీ విద్య వంటి లక్ష్యాల సాధనకు ఒక్కొక్క లక్ష్యానికి వాటితో లింకు ఉన్న నవరత్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేస్తోంది. బడి వయసు పిల్లలందరూ పాఠశాలకు వచ్చేలా అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టింది. పురుషులతో సమానంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడంతో పాటు ఆయా కుటుంబాలను పేదరికానికి దూరం చేసేందుకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత వంటి పథకాలను అమలుచేస్తోంది. ఇలా మొత్తం నవరత్నాల కార్యక్రమాలు ఒక్కొక్క సుస్థిర అభివృద్ధి్ద లక్ష్యాల సాధనలో భాగంగా చేసింది. నవరత్న కార్యక్రమాల ద్వారా గత 34 నెలల్లో రూ. 1.34 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలోనే పేదలకు అందించింది. పనితీరే కొలమానం.. ఐక్యరాజ్యసమితి ప్రమాణాలకు అనుగుణంగా శాఖలవారీగా ఐఏఎస్ అధికారుల పనితీరుకు సైతం ప్రభుత్వం గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. శాఖల్లో చేపట్టిన కార్యక్రమాల ఆధారంగా వారి పనితీరు అంచనా వేస్తోంది. సీఎం, సీఎస్లు వీరి పనితీరును సమీక్షిస్తారని అధికారులు తెలిపారు. ప్రతి దాంట్లో ఓ మార్పునకు సంకేతంగా సీఎం నిర్ణయాలు రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక అంశాల్లో ప్రతి దాంట్లో ఓ బలమైన మార్పు తెచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నవరత్న కార్యక్రమాలు అందులో భాగమే. చదువుకునేందుకు ఎక్కువ మంది పిల్లలను పాఠశాలకు రప్పించడం కోసం లమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. అది కూడా సుస్థిర అభివృద్ది లక్ష్యాల్లో ఒకటి. నాడు– నేడుతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన పెంచడానికి ప్రభుత్వం ఆన్లైన్ శిక్షణ ఇస్తోంది. – జె.మురళి, ఏపీఎస్ఐఆర్డీ, డైరెక్టర్ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు పేదరిక నిర్మూలన ప్రధాన అంశం. ప్రతి వ్యక్తి రోజుకు 1.25 డాలర్లు అంటే మన కరెన్సీలో కనీసం రూ. 95 తన కోసం ఖర్చు పెట్టుకోవడం. ఆ స్థాయిలో కూడా ఖర్చు పెట్టలేని వ్యక్తుల కుటుంబాన్ని బీపీఎల్ కుటుంబంగా పేర్కొంటారు. అందరికీ ఆహారం మరో ప్రధాన అంశం. ఐదేళ్ల లోపు పిల్లలు ఉండే బరువు వంటివి దీనికి కొలమానం. మంచి ఆరోగ్యం, సంతోషకరమైన మానసిక స్థితి నాణ్యమైన విద్య పురుషులు, మహిళల సమానత్వం తాగడానికి పరిశుభ్రమైన నీరు, పరిశుభ్ర వాతావరణం విద్యుత్ సౌకర్యం మౌలిక వసతుల కల్పన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక పురోగతి అసమానతలు తొలగింపు పట్టణీకరణ ప్రజలలో కొనుగోలు శక్తి, ఉత్పత్తి అవకాశాలు పర్యావరణ పరిరక్షణ మత్స్య సంపద పర్యావరణ పరిరక్షణ భూ పరిరక్షణ శాంతి. న్యాయం, బలమైన వ్యవస్థలు లక్ష్యాల సాధనకు వివిధ సంస్థలతో ఒప్పందాలు (చదవండి: విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు...సొరంగ ‘మార్గం) -
ఐరాస హెలికాప్టర్ కూల్చివేత
దకర్: కాంగోలో వేర్పాటువాదులు తెగించారు. ఎనిమిది మంది ఐక్యరాజ్య సమితి శాంతిదూతలు, పర్యవేక్షకులను తీసుకెళ్తున్న ఒక హెలికాప్టర్ను వేర్పాటువాదులు కూల్చేశారు. సోమవారం కాంగో తూర్పుప్రాంతంలో ఎం23 రెబల్స్ గ్రూప్ నేతృత్వంలో ఈ దాడి జరిగిందని, హెలికాప్టర్ జాడ, ప్రయాణికుల కోసం అన్వేషణ కొనసాగుతోందని కాంగో సైన్యం మంగళవారంప్రకటించింది. ఖనిజ సంపదతో నిండిన తూర్పు కాంగోపై పట్టు కోసం చాలా వేర్పాటువాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. (చదవండి: పుతిన్ చేస్తున్న దుర్మార్గాలపై ఆక్రోశమది: బైడెన్) -
బాలికలను స్కూళ్లకు అనుమతించండి...తాలిబన్లను ఆదేశించిన యూఎన్
Taliban on allowing girls in high schools: గతేడాది అఫ్గనిస్తాన్ని స్వాధీనం చేసుకుని తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలికలను పాఠశాలలకు వెళ్లకుండా నిషేధిస్తూ తాలిబాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ విషయమై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు యూఎన్ఎస్సీ సభ్యుల ఈ విషయమై అఫ్గనిస్తాన్కి సంబంధించిన సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి డెబోరా లియోనన్స్తో చర్చించారు. ఆ సమావేశలో బాలికలతో సహా అఫ్గాన్లందరి విద్యా హక్కు గురించి పునరుద్ఘాటించారు. విద్యా హక్కును గౌరవించడమే కాకుండా విద్యార్థులందరూ పాఠశాలకు వెళ్లేలా స్కూళ్లు తెరవాలని తాలిబన్లకు పిలుపునిచ్చారు. అఫ్గనిస్తాన్ ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (యూఎన్ఏఎంఏ) , ఈ సమస్యపై సంబంధిత అఫ్గాన్ వాటాదారులందరితో పరస్పర చర్చ కొనసాగించాలని సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిని ఆదేశించింది. అంతేగాదు ఈ అంశం పురోగతిపై భద్రతా మండలికి తెలియజేయాలని కూడా కోరింది. విద్యతో సహా అన్ని అంశాల్లో అఫ్గనిస్తాన్కు మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాల ప్రాముఖ్యతను భద్రతా మండలి సభ్యులు నొక్కి చెప్పారు. అయితే గతేడాది అఫ్గనిస్తాన్లోని వేలాది మంది సెకండరీ పాఠశాల బాలికలు ఆగస్టు 2021 తర్వాత మొదటిసారి తరగతులకు హాజరు కావడానికి ఆసక్తి కనబర్చారు. కానీ కొన్ని గంటల్లోనే పాఠశాలలను మూసివేయాలని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాదు తాలిబాన్ ప్రభుత్వం తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే వరకు బాలికలు ఇంట్లోనే ఉండాలని సూచించారు కూడా. ఒక వారంలోగా బాలికల మాధ్యమిక పాఠశాలలను తిరిగి తెరవడంలో తాలిబాన్ విఫలమైతే దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని అప్గాన్లోని మహిళా హక్కుల కార్యకర్తలు హెచ్చరించారు. ఇదిలా ఉండగా రాజధాని నగరం కాబూల్లో విద్యార్థినిలు విద్య మన సంపూర్ణ హక్కు అని నినాదాలు చేశారు. అయితే ఈ విషయమై తాలిబానీ విద్యా మంత్రిత్వ శాఖ పూర్తి వివరణ ఇవ్వలేదు. కానీ ఇస్లామిక్ ఎమిరేట్ సీనియర్ నాయకుడు మాత్రం పాఠశాలలను తిరిగి తెరవడానికి ముందు కొన్ని ఆచరణాత్మక సమస్యలను ఇంకా పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. (చదవండి: రష్యా బలగాల ఉపసంహరణ దిశగా వ్యూహం.. భయాందోళనలో ఉక్రెయిన్) -
భారత్ ఆ నిర్ణయం తీసుకుంటే...రాయబారిగా అత్యంత సంతోషిస్తా!
If Indias Position Moved Closer To Ukraine: ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ సంక్లిష్టమైన తటస్థ వైఖరిని అవలంభిస్తోందని భారత్లోని కైవ్ రాయబారి ఇగోర్ పొలిఖా అన్నారు. యూఎన్లోని ఉక్రెయిన్ మానవతా సంక్షోభానికి సంబంధించిన రష్యా తీర్మానానికి భారత్ గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఇగోర్ పొలిఖా ప్రస్తావిస్తూ భారత్ని అభినందించారు. దీంతో రష్యాకు ఒకే ఒక మద్దతుదారు (చైనా) లభించిందని చెప్పారు. అంతేగాక ఉక్రెయిన్కు భారత్ మానవతా సహాయంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన ప్రకటనను కూడా ఆయన ప్రశంసించారు. అదే సమయంలో వాషింగ్టన్లోని ఇతర మిత్ర దేశాలతో పోలిస్తే ఉక్రెయిన్ పై రష్యా దాడి విషయంలో భారత్ స్పందను గురించి కూడా మాట్లాడారు. తాను భారత్ విదేశాంగ విధాన అవసరాలను లోతుగా అర్థం చేసుకున్నాని అన్నారు. ఒక ఇండాలజిస్ట్గా తాను అనేక అధికారిక అనధికారిక విషయాలను అర్థం చేసుకోగలను అని కూడా చెప్పారు. కానీ రాయబారిగా మాకు మద్దతు ఇవ్వండి అని ఒత్తిడి చేయక తప్పడం లేదని అన్నారు. అంతేకాదు భారత్ గనుకు రష్యా దాడికి వ్యతిరేకంగా బలమైన నిర్ణయం తీసుకుంటే తాను రాయబారిగా మరింత సంతోషిస్తానని అన్నారు. ఈ యుద్ధం ఒకరకరంగా అందర్నీ ఒకింత ఒత్తిడికి గురిచేస్తోందని అన్నారు. ఈ యుద్ధం ఇన్ని రోజులు సాగుతుందని రష్యన్ల కూడా అనుకుని ఉండరన్నారు. పైగా రష్యన్లు సైనిక మరణాల గణనను కూడా విడుదల చేయడం లేదని చెప్పారు. వాళ్ల తప్పుడు లెక్కల ప్రకారం నాలుగు రోజ్లులో యుద్ధం ముగిసిపోతుందని పైగా ప్రతి వీధిలో సైనికుడు పుష్ప గుచ్చంతో స్వాగతం పలుకుతారని ఊహించుకుంటోంది రష్యా అని విమర్శించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఇంతమంది మద్దతును కూడగట్టుకుని అతి పెద్ద శక్తిగా అవతరిస్తారని రష్యన్లు ఊహించలేకపోయారని అన్నారు. తమ అధ్యక్షుడు నేపథ్యం అందరికీ తెలుసని కానీ ఈ యుద్ధం మొదలైన తర్వాత చాలా మంది నాయకులు హాస్య నటులుగా మారిపోవడం విశేషం అని వ్యంగ్యంగా అన్నారు. (చదవండి: యుద్ధాన్ని ఆపమని పుతిన్కి చెప్పగలిగేది చైనా మాత్రమే!) -
ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడనున్న మోదీ!
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగిన నేపథ్యంలో ఫిబ్రవరి 26న భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా జెలెన్స్కీతో మాట్లాడారు. తదనంతరం మోదీ మళ్లీ ఈ రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీతో మాట్లాడే అవకాశం ఉందని భారత ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్కు భారతదేశం గైర్హాజరైన తర్వాత, జెలెన్స్కీ ప్రధాని మోదీతో సంభాషించడమే కాక భారతదేశ రాజకీయ మద్దతును కూడా కోరారు. ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి కేంద్రం ఆపరేషన్ గంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేగాదు భారతీయ పౌరులను సురక్షితంగా నిష్క్రమించడానికి ఇప్పటికే ఉక్రెయిన్ను భారత్ సంప్రదించింది కూడా. (చదవండి: మెట్రోలో టికెట్ కొని ప్రయాణించిన ప్రధాని మోదీ.. ఎక్కడంటే!) -
ఉక్రెయిన్ వలసలు 10 లక్షలు
కీవ్: రష్యా దాడుల పర్యవసానంగా ఉక్రెయిన్ జనాభాలో 2% మంది నివాసాలను వదిలిపెట్టి వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. కేవలం వారం రోజుల్లోనే 10 లక్షల మంది వలసబాటపట్టారని తెలిపింది. ఈ శతాబ్దంలోనే అత్యంత వేగవంతమైన వలసలుగా అభివర్ణించింది. దేశంలోని రెండో అతిపెద్ద నగరంతోపాటు, వ్యూహాత్మకమైన రెండు నౌకాశ్రయాలపై రష్యా సైన్యం దాడులు ముమ్మరమయ్యాయి. సుమారు 15 లక్షల జనాభా కలిగిన ఖర్కీవ్ నగర జనావాసాలపై ఒక వైపు బాంబుదాడులు జరుగుతున్నా ప్రజలు అక్కడి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఐరాస వలసల విభాగం తెలిపింది. ఖర్కీవ్ రైల్వే స్టేషన్లో పెద్ద సంఖ్యలో చేరిన ప్రజలు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకుండా వచ్చిన రైళ్లలోకి ఎక్కి వెళ్లిపోతున్నారని పేర్కొంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెలుపల భారీ సంఖ్యలో బారులు తీరిన ట్యాంకులు, ఇతర వాహనాలు రెండు రోజులుగా అక్కడే తిష్టవేశాయని తెలిపింది. అజోవ్ సముద్ర తీర నగరం మరియుపోల్ను రష్యా బలగాలు దిగ్బంధించాయని, నల్లసముద్రంలోని మరో కీలక నౌకాశ్రయం పరిస్థితి అస్పష్టంగా ఉందని బ్రిటన్ రక్షణ మంత్రి చెప్పారు. మరో పెద్ద నగరం ఖెర్సన్ తమ పూర్తి అధీనంలోకి వచ్చిందని రష్యా బలగాలు ప్రకటించుకున్నాయి. దాడులు మొదలైనప్పటి నుంచి 227 మంది పౌరులు చనిపోగా, 525 మంది క్షతగాత్రులైనట్లు యూఎన్హెచ్సీఆర్ తెలపగా, 2 వేల మందికి పైగానే చనిపోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అయితే, సైన్యానికి జరిగిన నష్టాన్ని తెలపలేదు. మొదటిసారిగా, రష్యా కూడా తమ బలగాలకు వాటిల్లిన నష్టం వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు సుమారు 500 సైనికులు చనిపోగా, 1,600 మంది గాయపడినట్లు పేర్కొంది. ఇదే ప్రతిఘటనను కొనసాగించండి రష్యా సేనలను ప్రజలు ప్రతిఘటిస్తున్న తీరుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ప్రశంసలు కురిపించారు. ఇదే ప్రతిఘటనను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆక్రమణదారులను ప్రశాంతంగా ఉండనివ్వవద్దన్నారు. వారు నైతిక స్థైర్యం కోల్పోతారన్నారు. రష్యా సైనికులు సూపర్పవర్ సైనికులు కాదు, అయోమయంలో ఉన్న పిల్లలని అభివర్ణించారు. (చదవండి: ఉక్రెయిన్లో భారత విద్యార్థిపై కాల్పులు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) -
ఉక్రెయిన్ వలసలు 5 లక్షలు: ఐరాస
జెనీవా: రష్యా ఆక్రమణతో ఉక్రెయిన్ నుంచి ప్రజలు భారీగా వలస బాట పట్టారు. దేశం వీడి వెళ్లే వారితో సరిహద్దు పాయింట్లు రద్దీగా మారాయి. కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ నుంచి 5లక్షల మందికి పైగా ప్రజలు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి వలసల విభాగం(యూఎన్హెచ్సీఆర్) హై కమిషనర్ ఫిలిపో గ్రాండి చెప్పారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ పోతోందని ఆయన సోమవారం ట్విట్టర్లో తెలిపారు. -
రష్యా బలగాలు విఫలం?..అందుకే బెలారస్ దిగనుందా?
Belarus may join Ukraine war: ఐక్యరాజ్యసమితిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన పలు వాదనలు వినిపించాయి. గత వారం రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 3 వేల మంది రష్యన్ సైనికులు మరణించారని, దాదాపు 200 మంది సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నామని ఉక్రెయిన్ పేర్కొంది . అయితే వాటిని క్రెమ్లిన్ తిరస్కరించింది. ముందస్తు షరతులు లేకుండా చర్చలు జరపడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ చెప్పారు. అయితే ఇప్పటి వరకు మాస్కో ఉక్రెయిన్ పై జరిపిన దాడిలో 14 మంది చిన్నారులతో సహా 352 మంది మరణించగా, 116 మంది చిన్నారులతో సహా వెయ్యి మంది గాయపడ్డారని తెలిపారు. మరోవైపు బెలారస్ కూడా రష్యాతో జత కట్టి ఉక్రెయిన్కి ఊహించని ఝలక్ ఇచ్చింది. మాస్కో దాడితో ఉక్రెయిన్లోని రష్యా బలగాలు క్షీణించడంతో వారికి సాయంచేసేందుకు బెలారస్ తన దళాలలను పంపనుందని సమాచారం. ముఖ్యాంశాలు: ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున వేళ రష్యా అధ్యక్షుడు మరో కీలక ప్రకటన చేశారు. దేశంలో అణ్వాయుద దళాలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి తోపాటు సాయుధ దళాల జనరల్ చీఫ్ స్టాఫ్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆదేశిశించారు. మరోవైపు ఉక్రెయిన్ పై రష్య చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ ప్రపంచదేశాల గత కొన్నిరోజులుగా రష్యా పై పలు ఆంక్షల విధించాయి. దేశంలో అతి పెద్ద బ్యాంకు అయిన స్విఫ్ట్ నుంచి రష్యాకి సంబంధించిన కీలక బ్యాంకులను తొలగిస్తానంటూ ఊహించని షాక్ ఇచ్చింది. యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ జరిపిన చర్చల్లో రాబోయే 24 గంటలు ఉక్రెయిన్కి కీలకం' అని చెప్పారు. ఉక్రెయిన్కి కావల్సిన రక్షణ సాయాన్ని యూకే దాని మిత్ర దేశాలు తప్పక చేస్తాయని జాన్సన్ హామీ ఇచ్చారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ తమ సహచరుల్లో కూడా చనిపోయిన వారు ఉన్నారని కానీ ఉక్రెయిన్ దళాలతో పోలిస్తే రష్యా చాలా తక్కువ మందిని మాత్రమే నష్టపోయిందని నొక్కిచెప్పారు. యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, 27-దేశాల కూటమి రష్యన్ యాజమాన్యం ఆధ్వర్యంలోనివి లేదా నియంత్రణలో ఉన్న విమానాల కోసం గగనతలాన్ని మూసివేస్తుందని చెప్పారు. అంతేకాదు ఒలిగార్చ్ల ప్రైవేట్ జెట్లతో సహా కెనడా కూడా రష్యన్ ఎయిర్లైన్స్ కోసం తన గగనతలాన్ని మూసివేసిందని తెలిపారు. (చదవండి: బ్యాంక్ దిగ్బంధనం... ఏటీఎంకి క్యూ కట్టిన రష్యన్ వాసులు) -
జీవితాన్ని మలుపు తిప్పిన కెమెరా: మాయ ముక్తై
చిన్న వయసులో బడిలో చదువుకునే అవకాశం రాలేదు ఆమెకు. అయితేనేం, సమాజాన్ని చిన్న వయసులోనే లోతుగా చదివే అవకాశం వచ్చింది. అదే తన ఫిల్మ్మేకింగ్కు ముడిసరుకు, సృజనాత్మకశక్తి అయింది... నాసిక్(మహారాష్ట్ర)కు చెందిన మాయ ముక్తైకి పదమూడు సంవత్సరాల వయసులోనే పెళ్లయింది. చుట్టుపక్కల వాళ్లు చెత్త ఏరుకోవడానికి వెళుతుంటే వారితో పాటు వెళ్లేది. రోజంతా కష్టపడితే ఇరవై రూపాయలు వచ్చేవి. నాసిక్లో ‘కాగడ్ కచ్ పాత్ర కష్టకారి పంచాయత్’ అనే శ్రమజీవుల యూనియన్ ఉంది. ఎవరో చెప్పడంతో ఈ యూనియన్లో చేరింది మాయ. ఇదే తన జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ ఎన్నో విషయాల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. సంతకం చేయడం నేర్చుకున్న రోజు ఎంత సంతోషపడిందో! చైనాలో జరిగే యూఎన్ క్లైమెట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ కోసం ‘కష్టకారి పంచాయత్’ యూనియన్ నుంచి చెత్త ఏరుకొని బతికే ముగ్గురిని ఎంపిక చేశారు. అందులో మాయ కూడా ఒకరు. చైనాలో తనను కెమెరాలు, వీడియోగ్రఫీ తెగ ఆకట్టుకున్నాయి. చైనా నుంచి తిరిగివచ్చిన తరువాత, తనకు వీడియోమేకింగ్లో మెలకువలు నేర్పించాల్సిందిగా యూనియన్ వారిని అడిగింది. ‘అభివ్యక్తి’ అనే ఎన్జీవో సహాయంతో మాయకు వీడియోమేకింగ్ నేర్పించారు. ‘చెత్త ఏరుకునే వారికి కూడా మనసు ఉంటుంది. ఆత్మగౌరవం ఉంటుంది. వారి గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను కూడా వారిలో ఒకరిని కాబట్టి’ అంటూ తమ జీవితాలపై డాక్యుమెంటరీ తీయడానికి అడుగులు వేసింది. తనతో పాటు చెత్త ఏరుకునే మిత్రులు బాగా ప్రోత్సహించి ముందుకు నడిపించారు. డాక్యుమెంటరీ కోసం ఒక డంప్యార్డ్ దగ్గర షూటింగ్ చేస్తుంది మాయ. ఇంతలో ఒక పోలీసు పరుగెత్తుకు వచ్చి ‘ఈ కెమెరా ఎక్కడి నుంచి దొంగిలించావు?’ అని కొట్టడం మొదలుపెట్టాడు. ‘అయ్యా! ఇది నా కెమెరానే’ అని ఆ పోలీసును నమ్మించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అష్టకష్టాలు పడి చేసిన ఆ డాక్యుమెంటరీకి మంచి పేరు వచ్చింది. ఎన్నో అవార్డ్లు వచ్చాయి. ‘మాకంటూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. నా కెమెరా ద్వారా వాటిని వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాను. ఇది నా చేతిలో ఉన్న ఆయుధం. పెద్దల్లో కదలిక తేవడానికి అయిదు నిమిషాల చిత్రం చాలు’ అంటున్న మాయ ఎన్నో సమస్యలు పరిష్కారం కావడానికి కారణం అయింది. నీటి ఎద్దడి తీర్చడం, గృహవసతి కల్పించడం...మొదలైనవి మాయ సాధించిన విజయాలలో ఉన్నాయి. ‘మన సమస్యల పరిష్కారానికి ఎవరో వస్తారని ఎదురుచూడకుండా మనమే కదలాలి. మనం శక్తిహీనులం కాదు. మనకు మనమే శక్తి’ అంటున్న మాయ, సామాజిక కార్యకర్త ఆనంద్తో కలిసి ‘పుకార్ ఫిల్మ్ ప్రొడక్షన్’ను ప్రారంభించింది. దీని ద్వారా శ్రమజీవుల కష్టాలు, సమస్యలకు చిత్రరూపం ఇవ్వాలనుకుంటుంది. త్వరలో యూట్యూబ్ చానల్ కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. ‘తాను నేర్చుకున్న వీడియోమేకింగ్ను డబ్బు సంపాదన కోసం ఉపయోగించి ఉంటే బోలెడు డబ్బు సంపాదించి ఉండేది. అయితే ఆమె తనలాంటి పేదల సమస్యల గురించి తప్ప డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు’ అని మాయ ముక్తైని ప్రశంసిస్తున్నారు ‘కష్టకారి పంచాయత్’ పెద్దలు. -
‘ఆధార్ కార్డు’ మోడల్..! ప్రపంచ వ్యాప్తంగా...!
UIDAI To Work With World Bank UN To Globalise Aadhaar Model: యుఐడీఏఐ రూపొందించిన ఆధార్ కార్డు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. అంతర్జాతీయ గుర్తింపు ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకుగాను ఆధార్ కార్డు లాంటి మోడల్ను ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్యసమితితో కలిసి యూఐడీఏఐ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూఐడీఏఐ యూనివర్సల్ గ్లోబల్ ఐడెంటిటీ సిస్టమ్పై చురుగ్గా పనిచేస్తోందని సంస్థ పేర్కొంది. ఆధార్పై ఇతర దేశాలు ఆసక్తి..! ఆసియా దేశాలతో పాటుగా, ఇతర దేశాలు కూడా ఆధార్ మోడల్ గురించి తెలుసుకున్నాయని యూఐడీఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సౌరభ్ గార్గ్ అన్నారు.కొన్ని దేశాలు ఇప్పటికే సంస్థ ఉపయోగించిన మోడల్ అనుసరించినట్లు తెలిపారు. ఆధార్లాంటి మోడల్పై ఆసక్తి కనబరుస్తున్నాయని సౌరభ్ వెల్లడించారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన డిజిటల్ మనీ కాన్ఫరెన్స్లో సౌరభ్ గార్గ్ ప్రసంగిస్తూ...ఆధార్ ఆర్కిటెక్చర్ను ప్రతిబింబించేలా ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. దేశ జనాభాలో 99.5 శాతం మందికి ఆధార్ కార్డు ఉందని తెలిపారు. పలు ఆర్థిక సేవలకు ఆధార్ కీలక అంశం పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు. దాంతోపాటుగా భద్రతా ముప్పు సమస్యపై కూడా చర్చించారు. ఆధార్ డిజైన్ అనేది అంతర్నిర్మిత గోప్యతతో కూడిన ఆర్కిటెక్చర్. యూఐడీఏఐ సమ్మతి ద్వారా మాత్రమే ఆధార్ను ఉపయోగించడానికి అనుమతిస్తామని అన్నారు. అంతేకాకుండా భద్రత విషయంలో ఏలాంటి రాజీ ఉండదని పేర్కొన్నారు. ఆధార్ డేటా సిస్టమ్ భద్రత చాలా ముఖ్యమైనదని గార్గ్ చెప్పారు. ఇట్టే పసిగడతాయి..! ఆధార్ డేటా సెంటర్లు సమాచారాన్ని వేరుగా ఉంచుతాయని, సురక్షితమైన స్నేహపూర్వక యంత్రాంగాల ద్వారా మాత్రమే ఆధార్ను యాక్సెస్ అవుతుంది. 24X7 పాటు నడిచే యూఐడీఏఐ సెక్యూరిటీ కేంద్రాల సహాయంతో ఏమి జరుగుతుందనే విషయాన్ని ఇట్టే పసిగడతాయి. చదవండి: ఆండ్రాయిడ్లో అదిరిపోయే ఫీచర్స్..! పిల్లలను, కార్లను కంట్రోల్ చేయొచ్చు....! -
ఐక్యరాజ్యసమితి దినోత్సవం.. చరిత్ర, విశేషాలు
ప్రతి ఏడాది అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు ఈ రోజు ప్రాముఖ్యత, ఏవిధంగా ఏర్పాటైంది తదితర విషయాలను స్మృతి పథంలోకి తీసుకురావడమే కాక రాబోయేతరాలకు చాటి చెప్పేలా ఈ దినోత్సవాన్ని అన్ని దేశాలు కలిసి ఘనంగా నిర్వహిస్తాయి. 1945 అక్టోబర్ 24 ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఈ రోజున ఏడాది ఐక్యరాజ్యసమితి వార్షికోత్సవం (ఐక్యరాజ్యసమితి) దినోత్సవంగా నిర్వహిస్తారు. చరిత్ర: 'యునైటెడ్ నేషన్స్' అనే పేరును యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఉపయోగించారు. యూఎన్లో ఆరు కీలక విభాగాలు ఉన్నాయి. అవి ప్రధానంగా జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, సెక్రటేరియట్ తదితరాలు న్యూయార్క్లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో ఉండగా, అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్స్లోని హేగ్లో ఉంది. ఐక్యరాజ్య సమితి(యూఎన్) ఏర్పడిన సమయంలో యూఎన్ 51 సభ్య దేశాలను కలిగి ఉంది. ఇందులో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉన్నాయి. ప్రాముఖ్యత: ఐక్యరాజ్యసమితి అనేది అంతర్జాతీయ శాంతి, భద్రతల దృష్ట్య దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా దేశాలన్నింటిని ఏకతాటి పైకి తీసుకొచ్చేలా సమన్వయం చేసే కేంద్రంగా ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. యూఎన్ దినోత్సవ వేడుకలు యూఎన్ దినోత్సవం సాధారణంగా న్యూయార్క్లోని ప్రధాన కార్యాలయంలో ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ హాల్లో ఐక్యతకు గుర్తుగా అన్ని దేశాలు కలిసి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అయితే ఈ ఏడాది యూఎన్ డే ప్రత్యక్ష్యంగా అన్ని దేశాలు వేర్వేరుగా ముందుగా రికార్డు చేసిన ప్రదర్శనలతో ఈ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించాయి. ఈ మేరకు అక్టోబరు 21న రిపబ్లిక్ ఆఫ్ కొరియా, శాశ్వత మిషన్ స్పాన్సర్ చేసిన “బిల్డింగ్ బ్యాక్ టు గెదర్ ఫర్ పీస్ అండ్ ప్రోస్పెరిటీ” అనే థీమ్తో ఈ దినోత్సవాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. ‘76 సంవత్సరాల క్రితం విపత్కర సంఘర్షణల నీడ నుండి బయటపడే ప్రపంచానికి యూఎన్ ఆశావాహ దృక్పథంగా ఆవిష్కరింపబడింది. దేశవ్యాప్తంగా ఈ UNని మహిళలు, పురుషులు ఆ ఆశను చిగురించేలా మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎక్స్పో 2020 దుబాయ్ అక్టోబర్ 24న వివిధ అధికారిక కార్యక్రమాలతో ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని గౌరవ దినంగా జరుపుకుంటోంది’ అన్నారు. -
అఫ్గనిస్తాన్ సంక్షోభంపై ఐరాస స్పందన
సాక్షి,న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్ సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది. తమతోపాటు, అంతర్జాతీయ సమాజం కలిసి నిలబడాలని, కలిసి పని చేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ విజ్ఞప్తి చేశారు. హింసను తక్షణమే అంతం చేయాలని పిలుపునిచ్చారు. తాము అఫ్గన్ ప్రజలను విడిచి పెట్టకూడదు, పెట్టలేమని పేర్కొన్నారు. ప్రపంచ తీవ్రవాద ముప్పును అణిచివేసేందుకు తమ వద్ద ఉన్న అన్ని సాధనాల ప్రయోగించాలని ఆయన ప్రపంచానికి పిలుపున్చారు. రాజధాని కాబూల్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత నిర్వహించిన అత్యవసర సమావేశంలో గుటెరస్ మాట్లాడారు. బలప్రయోగంతో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్ల చర్య అంతర్యుద్ధానికి దారితీస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు తాలిబన్లు అప్గన్ను స్వాధీనం చేసుకున్న తరువాత చైనా తాలిబన్లకు మద్దతుగా నిలవగా, అక్కడి సంక్షోభ పరిస్థితులను పరిశీలిస్తున్నామని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈరోజు రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చదవండి: Delivery Guy: ఎంత పని చేశాడు, షాకింగ్ వీడియో If there is zero-tolerance for terrorism in all its forms & manifestations & it's ensured that Afghan territory isn't used by terrorist groups to threaten or attack any other country, then Afghanistan's neighbours & region would feel safer: India's Ambassador to UN, TS Tirumurti pic.twitter.com/WVGJAK4vdM — ANI (@ANI) August 16, 2021 WATCH LIVE: UN Security Council holds a meeting on the situation in Afghanistan https://t.co/uQWuXJZsGt — PBS NewsHour (@NewsHour) August 16, 2021 -
‘టీకాలను భారత్లో కన్నా విదేశాలకే అధికంగా పంపిణీ చేశాం’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్లను రాష్ట్రాలకు సరిపడా సరఫరా చేయడంలో కేంద్రం విఫలమయ్యింది. ఇందుకు మోదీ సర్కార్ అనుసరించిన వ్యాక్సిన్ విధానం కారణంగానే ప్రస్తుతం దేశంలో టీకాల కొరత ఏర్పడిందని జాతీయ స్థాయిలో పలువురు నేతలు మండిపడుతున్నారు. తాజాగా మాజీ బీజేపీ, ప్రస్తుత తృణమూల్ నేత యశ్వంత్ సిన్హా కేంద్ర విధానాలపై ధ్వజమెత్తారు. ఆయన తన ట్విటర్లో.. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి టీకాలకు సంబంధించి తెలుపుతున్న 10 సెకండ్ల వీడియోను ట్వీట్ చేశారు. “ఈ పది సెకన్ల వీడియో మోదీ భండారాన్ని బయటపెట్టింది. భారత్ తన ప్రజలకు ఇచ్చిన దానికన్నా అధిక వ్యాక్సిన్లను విదేశాలకు పంపిందని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి చెప్పారు. మోదీ ఇప్పుడు నిజంగానే ప్రపంచ నేత. భారతీయులు ఎలా పోతేనేం” అని కామెంట్ పెట్టి తీవ్రస్థాయిలో ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్తో పాటుగా ఆయన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత రాయబారి ప్రసంగించిన వీడియో క్లిపింగ్ను జతచేశారు. ఆ వీడియోలో.. భారత్లో సరఫరా చేసిన టీకాల కన్నా అధికంగా 70 దేశాలకు భారత్ టీకాలను సరఫరా చేసినట్లు రాయబారి తెలిపారు. ఇటీవల పరిమిత టీకాల కారణంగా ఢిల్లీలో నాలుగు రోజుల క్రితమే 18-44 ఏళ్ల పిల్లలకు టీకాలు ఆపేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ( చదవండి: వ్యాక్సిన్ల సంఖ్య ఎందుకు తగ్గుతోంది: చిదంబరం ఫైర్ ) A 10 sec video that EXPOSES MODI. India’s representative at the @UN informed the United Nations that India sent more vaccines abroad than has vaccinated its own people. Modi is now truly a world leader. Indians can go to hell. pic.twitter.com/tTF8q60HT5 — Yashwant Sinha (@YashwantSinha) May 16, 2021 -
పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకంజ
వరల్ఢ్ హ్యాపినెస్ రిపోర్ట్లో ఫిన్లాండ్ వరుసగా నాలుగోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 149 దేశాలకు చెందిన ప్రజలు ఎంత సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారనే దానిపై జరిపిన సర్వేలో ఫిన్లాండ్ మరొకసారి టాప్లో నిలిచింది. ఈ మేరకు వరల్ఢ్ హ్యాపినెస్ రిపోర్ట్- 2021ను యూఎన్ సస్టేనబుల్ డెవలప్మెంట్ సోల్యూషన్స్ నెటెవర్క్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ 139వ స్థానంలో నిలిచింది. కాగా, గత ఏడాది కంటే భారత్ హ్యాపినెస్ ఇండెక్స్లో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. కాగా పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ , చైనాల కంటే హ్యాపినెస్ ఇండెక్స్లో భారత్ వెనుకంజలో ఉండడం గమనార్హం. నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ 105, బంగ్లాదేశ్ 101, చైనా 84 వ స్థానంలో నిలిచాయి. చివరి మూడు స్థానాల్లో ఆఫ్ఘనిస్తాన్ 149, జింబాబ్వే 148, రవాండా 147, నిలిచాయి.ప్రతి ఏడాది యూఎన్ హ్యాపినెస్ ఇండెక్స్ను విడుదల చేస్తోంది. ఈ ఇండెక్స్ను గాలప్ వరల్డ్ పోల్ నిర్వహించే ప్రశ్నల ఆధారంగా ప్రపంచ దేశాలకు ర్యాంకులను నిర్ణయిస్తోంది. దాంతో పాటుగా దేశాల జీడిపీ, సామాజిక భద్రతను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ సూచీను ఆయా దేశాల జీడీపీ, సామాజిక భద్రత, దాతృత్వం, ప్రజల ఆరోగ్య స్థితిగతులు, లంచగొండితనం , ప్రజల నిర్ణయాల్లో స్వతంత్రత వంటి విషయాలను పరిగణలోనికి తీసుకుంటుంది. 2021 ప్రపంచంలోనే సంతోషకరమైన మొదటి 20 దేశాల జాబితా... 1. ఫిన్ లాండ్ 2. డెన్మార్క్ 3. స్విట్జర్లాండ్ 4. ఐస్ లాండ్ 5. నెదర్లాండ్స్ 6. నార్వే 7. స్వీడన్ 8. లక్సెంబర్గ్ 9. న్యూజిలాండ్ 10. ఆస్ట్రియా 11. ఆస్ట్రేలియా 12. ఇజ్రాయెల్ 13. జర్మనీ 14. కెనడా 15. ఐర్లాండ్ 16. కోస్టా రికా 17. యునైటెడ్ కింగ్డమ్ 18. చెక్ రిపబ్లిక్ 19. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 20. బెల్జియం -
యూఎన్ మెచ్చిన ఇండియన్
సప్త సముద్రాలు భూమ్మీద. అవన్నీ కలిస్తే.. వికీపీడియా. సమాచార మహా సముద్రం. ఆ సముద్రంలో.. జల్లెడ పట్టే వాలంటీర్ నీతా! అవాస్తవాలను తొలగిస్తుంది. సరైన వాటినే ఉంచుతుంది.ఈ డిజిటల్ యోధురాలిని.. యు.ఎన్.ఒ. ప్రశంసించింది. ఈమధ్య ఒక దినపత్రికలో ఒక వార్తా కథనం వచ్చింది. అందులోని ఒక వాక్యం.. ‘తాజాగా కర్నల్ ఆఫీసర్గా విధుల్లో చేరింది గౌరి. కుర్చీలో కూర్చుంటూ మెడలో ఉన్న తాళిబొట్టును చూసుకుంది. పెళ్లినాటి సంగతులన్నీ గుర్తొచ్చాయి’.. అని. ఆమె భర్త భారత సైన్యంలో మేజర్. ఆయన చనిపోతే నివాళిగా ఆమె కూడా సైన్యంలో చేరింది. చేరిన మాట నిజమే కానీ, ఆ కథనంలో ఉన్నట్లు ‘తాజా’గా మాత్రం కాదు. ఈ ఏడాది మార్చి 7న జాయిన్ అయ్యారు! నాటి ఆమె జాయినింగ్ వార్తను కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఇప్పుడు ఆన్లైన్లో చూసి, తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో గౌరి జాయినింగ్ని ‘తాజా’పరిచేసింది ఆ పత్రిక. ‘ఫ్యాక్చువల్ ఎర్రర్’ ఇది. ఇటువంటి తప్పిదాలు చరిత్రకు తప్ప, మానవులకు ప్రత్యక్షంగా హానికరమైనవి కాకపోవచ్చు. అయితే ఇవే తప్పుల్ని వైద్య, చికిత్సల సమాచారంలో దొర్లించేస్తే?! కోవిడ్కు ఫలానా మందులు పని చేస్తున్నాయని నిర్థారణ కాని ‘వాస్తవాలను’ కూడా రాసేస్తే? సోషల్ మీడియాలో ఇప్పుడు అదే జరుగుతోంది! కోవిడ్పై డాక్టర్లు, వైద్యపరిశోధకులు యుద్ధం చేస్తుంటే, కోవిడ్పై ఇంటర్నెట్లో పోటెత్తుతున్న ఈ తప్పుడు సమాచారంతో డిజిటల్ బ్యాటిల్ చేస్తున్నారు డాక్టర్ నీతా హుస్సేన్. వికీపీడియాలో ఆమె వాలంటరీ ప్రాజెక్టు ఆఫీసర్. కోవిడ్ వ్యాక్సిన్ మీద వస్తున్న సమాచారాన్ని జల్లెడ పట్టి, నికార్సయిన అంశాలను మాత్రమే ఉంచడం ఆమె పని. నీతా కేరళ యువతి. కోళికోడ్ దగ్గరి కున్నమంగళం ఆమె స్వస్థలం. స్వీడన్లో ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితమే ఆమె స్వీడన్లోని గోథెన్బర్గ్ యూనివర్సిటీ నుంచి క్లినికల్ న్యూరోసైన్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు. తాజాగా.. ఐక్యరాజ్యసమితి ట్విట్టర్ హ్యాండిల్పై ప్రత్యక్షం అయ్యారు! ‘నెట్’లోకి అప్లోడ్ అవుతున్న కోవిడ్ ఫేక్ న్యూస్ని తొలగించడంలో నీతా అలుపెరుగని కృషి చేస్తున్నారు అని యు.ఎన్.ఒ. ఆమెను ప్రశంసించింది. వికీపీడియాలో తప్పుల పరిశోధకురాలు నీతా. వాస్తవానికి పదేళ్ల నుంచే వికీలో ఆమె ఈ పనిలో ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా కోవిడ్ సమాచారాన్ని మాత్రమే చూస్తున్నారు. నిర్థారణ అయిన వాటినే ఆమె వికీలో ఉంచుతారు. మిగతా వాటిని తొలగిస్తారు. అంతేకాదు, అపోహల్ని తొలగించే విధంగా వికీలో ఆమె వ్యాసాలు కూడా రాస్తుంటారు. మార్చి నుంచి ఇప్పటి వరకు కోవిద్పై ముప్పై వ్యాసాల వరకు రాశారు. ఆమె తాజా వ్యాసం.. ‘లిస్ట్ ఆఫ్ అన్ప్రోవెన్ మెథడ్స్ అగైన్స్ట్ కోవిడ్–19’. కరోనా వైద్యంగా నిర్థారణ కాని ఆ చికిత్సా విధానాల జాబితాలో మనం నమ్ముతున్న అల్లం, వెల్లుల్లి, ‘సి’ విటమిన్, పుల్లని రుచితో ఉండే పండ్లు కూడా ఉన్నాయి! అంటే ఇవేవీ కరోనాకు పనిచేస్తాయని నమ్మకంగా నిర్థారణ కాలేదని. అలాగే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కోవిడ్ క్రిమి నశిస్తుందన్నదీ అవాస్తవ సమాచారమే అంటారు నీతా. మలేరియా మందు హైడ్రోక్సిక్లోరోక్విన్కూ కోవిడ్ను నయం చేసే శక్తి లేదని కూడా ఆమె కొన్ని పరిశోధనా ఫలితాలను జోడిస్తూ రాశారు. ఆ మధ్య కరోనాకు వైద్యంగా ఉమ్మెత్త విత్తనాల రసం తాగి, ఆసుపత్రి పాలైన వారి గురించి కూడా అందులో ఆమె ప్రస్తావించారు. దాదాపు పద్దెనిమిదేళ్లుగా వికీపీడియా మనకు నమ్మకమైన సమాచార సాధనం. అందులోనూ తప్పులు వస్తుండే మాట వాస్తవమే అయినా.. కోవిద్ లాంటి కల్లోల సమయంలో చాలావరకు నమ్మకమైన సమాచారమూ లభిస్తోంది. నమ్మదగని వాటిని కత్తిరించడానికి నీతా వంటి ప్రాజెక్టు ఆఫీసర్లు ప్రపంచ వ్యాప్తంగా వికీకి 285 భాషల్లో పని చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ని షేర్ చేశాక, నిర్థారణ కాని సమాచారం ఇచ్చామని తెలుసుకున్నప్పుడు వ్యాసకర్తలు క్షమాపణలు చెబుతుంటారు. అయితే అప్పటికే ఆ సమాచారం రౌండ్లు కొట్టడం మొదలయి ఉంటుంది. అలా కాకుండా ముందే నీతా వడగట్టేస్తుంటారు. ‘సరైన దానిని చేర్చడం, సరిగా లేని దాన్ని తొలగించడం ఎంతో సరదా అయిన బాధ్యత’’ అని అంటున్నారు నీతా. కోవిడ్ విషయంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ బులెటిన్లను, ఇంకా కొన్ని నమ్మకమైన పరిశోధనా సంస్థలు, జర్నల్స్ను ఆధారం చేసుకుని.. వికీకి చేరుతున్న వైద్య వ్యాసాల్లోని అపనమ్మక సమాచారాన్ని ఆమె తొలగిస్తున్నారు. వికీలో నీతా రాసిన కొన్ని ఉమన్ బయోగ్రఫీలు కూడా ఉన్నాయి. ‘‘సాధారణ మహిళ జీవిత చరిత్ర కూడా ఇన్స్పైరింగ్గానే ఉంటుంది’’ అంటారు నీతా హుస్సేన్. చమ్మంతి చట్నీ లేదు! వికీపీడియాలో నీతా ప్రయాణం.. పదేళ్ల క్రితం ఆమె కోళికోడ్లోని కాలికట్ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుండగా అనుకోకుండా మొదలైంది. కేరళకు ప్రత్యేకమైన ‘చమ్మంతి’ రెసిపీ అంటే నీతాకు ఇష్టం. కొబ్బరితో చేసే చట్నీ అది. దాని కోసం వికీపీడియా వెదికారు. లేదు! వెంటనే చమ్మంతిపై వికీపీడియాకు వ్యాసం రాసి పంపిస్తే వాళ్లు తమ భాండాగారంలో చేర్చుకున్నారు. -
50 కోట్లకు చేరువలో నిరుద్యోగులు
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా 47 కోట్ల మంది నిరుద్యోగులు, చిరుద్యోగులున్నారని, అర్హులకు సరైన ఉద్యోగం కల్పించకపోతే అది సామాజిక అశాంతికి దారితీస్తుందని ఐక్యరాజ్యసమితి విధాన నిర్ణేతలను హెచ్చరించింది. గత దశాబ్ధంతో పోలిస్తే ప్రపంచ నిరుద్యోగ రేటు నిలకడగానే సాగుతోందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నివేదిక పేర్కొంది. నిరుద్యోగరేటు 5.4 శాతం కొనసాగుతున్నా ఆర్థిక మందగమంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల సంఖ్య మాత్రం కుదించుకుపోతోందని ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక 2019లో 18.8 కోట్ల మంది నిరుద్యోగులుగా నమోదు చేయించుకోగా, ఈ ఏడాది వారి సంఖ్య 19.5 కోట్లకు ఎగబాకుతుందని ఐఎల్ఓ తన వార్షిక ప్రపంచ ఉపాధి..సామాజిక దృక్కోణం పేరిట విడుదలైన నివేదికలో పేర్కొంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 28.5 కోట్ల మందికి అన్ని అర్హతలున్నా అరకొర వేతనాలతో చిరుద్యోగులగానే బతుకుతున్నారని తెలిపింది. ప్రపంచ కార్మిక శక్తిలో దాదాపు 50 కోట్ల మందికి సరైన వేతనాలు అందడం లేదని ఐఎల్ఓ చీఫ్ గై రైడర్ పేర్కొన్నారు. 2009 నుంచి 2019 మధ్య అంతర్జాతీయ స్ధాయిలో సమ్మెలు, ప్రదర్శనలు పెరిగాయని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో 60 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని వీరంతా చాలీచాలని జీతాలతో కనీస సాంఘిక రక్షణలు లేకుండా పనిలో నెట్టుకొస్తున్నారని ఐఎల్ఓ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. చదవండి : మానవాభివృద్ధి సూచీలో భారత్ @ 129 -
కాంగోలో భారత ఆర్మీ అధికారి మృతి
కిన్షాసా: ఐక్యరాజ్యసమితి మిషన్లో భాగంగా డీఆర్ కాంగోలో విధులు నిర్వహిస్తున్న భారత ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ్ సోలంకి మృతిచెందారు. ఈ నెల 8న కయాకింగ్కు దగ్గర్లోని చెగెరా ద్వీపం వద్ద ఆయన కనిపించకుండా పోయారు. ఆయన కోసం తీవ్రంగా గాలించిన అధికారులు గురువారం కివూ నదిలో ఆయన మృతదేహాన్ని వెలికితీశారు. కాగా ఐక్యరాజ్యసమితి మిషన్లో భాగంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగోలో మిలిటరీ స్టాఫ్ అధికారిగా పనిచేస్తున్న భారత ఆర్మీ అధికారి గత నాలుగు రోజుల నుంచి ఆర్మీ శిబిరంలో కనిపించకుండా పోయారని కాంగో ఆర్మీ అధికారులు ప్రకటించారు. దీంతో అతని ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా తప్పిపోయిన అధికారి భారత్కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ్ సోలంకిగా గుర్తించారు. అయితే ఈ నెల 8న కాంగోలోని టెచెరా ద్వీపానికి సమీపంలో ఉన్న కివు సరస్సులోకి కాంగో ఆర్మీ బృందం బోటింగ్కు వెళ్లింది. ఆ బృందంలో గౌరవ్ సోలంకి కూడా ఉన్నారు. కివు సరస్సులో అధికారులంతా బోటింగ్ చేశారు. బోటింగ్ ముగిసిన అనంతరం ఆ ఆర్మీ అధికారుల బృందం తిరగి కాంగోకి చేరుకుంది. కానీ, శనివారం ఆర్మీ శిబిరంలో అధికారులకు సోలంకీ కనిపించకపోవడంతో ఆయన తప్పిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అయితే బోటింగ్కు వెళ్లిన ప్రాంతంలోనే తప్పిపోయి ఉంటారని అధికారులు భావించి.. కివు సరస్సులో హెలికాప్టర్లు, స్పీడ్ బోట్లను ఉపయోగించి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. దీంతో గురువారం ఉదయం పదకొండు గంటలకు టెచెరా ద్వీపంలోని కివు సరస్సులో సుమారు కిలోమీటరు దూరంలో సోలంకీ మృతదేమం లభ్యమైంది. దీంతో కాంగో ఆర్మీ అధికారులు సోలంకి మృతి చెందారని అధికారికంగా ప్రకటించారు. దాంతోపాటు భారత ఆర్మీ అధికారులకు సమాచారం అందించారు. -
మానవాభివృద్ధిలో భారత్ ర్యాంకు 130
న్యూఢిల్లీ: మానవాభివృద్ధి సూచీలో భారత్ ఒక స్థానం మెరుగుపరచుకుని 130వ ర్యాంకు సాధించింది. ఐరాస అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) శుక్రవారం విడుదల చేసిన జాబితాలో 189 దేశాలకు ర్యాంకులు ప్రకటించింది. తాజా ర్యాంకింగ్లో పొరుగు దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ వరసగా 136, 150వ స్థానాల్లో నిలిచాయి. నార్వే, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, ఐర్లాడ్, జర్మనీ వరసగా తొలి ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. 189 దేశాల్లో 59 దేశాలు అధిక మానవాభివృద్ధి గ్రూప్లో, 38 దేశాలు అల్ప మానవాభివృద్ధి గ్రూప్లో ఉన్నాయి. 0.640 హెచ్డీఐ స్కోర్తో భారత్ మాధ్యమిక మానవాభివృద్ధి కేటగిరీలో చోటు దక్కించుకుంది. -
ఐక్యరాజ్యసమితిలో నిధులకు కటకట!
ఐక్యరాజ్యసమితి: ప్రపంచశాంతి పరిరక్షణకు ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రస్తుతం తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అమెరికా, సౌదీ, ఈజిప్ట్, ఇజ్రాయెల్ సహా 81 దేశాలు తమ నిధుల వాటాను చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సభ్య దేశాలన్నీ తమ వాటా నగదును చెల్లించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్ విజ్ఞప్తి చేశారు. ‘ఇలాంటి నగదు కొరత ఇప్పటివరకూ ఎన్నడూ సంభవించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే ఐరాసలో నగదు నిల్వలు ఖాళీ అయిపోతాయి’ అని సభ్యదేశాలకు లేఖ రాశారు. ఈ ఏడాది జూలై 26 నాటికి భారత్ సహా 112 దేశాలు ఐరాసకు బడ్జెట్కు తమ వాటాను చెల్లించాయి. ఇందులో భాగంగా భారత్ రూ.122.9 కోట్లను ఐరాసకు ఇచ్చింది. ఐరాస బడ్జెట్లో 22 శాతాన్ని(రూ.8,157 కోట్లు) అందిస్తున్న అమెరికా.. ప్రపంచశాంతి పరిరక్షక దళాల నిర్వహణకు అందే నిధుల్లో 28.5 శాతం (రూ.15,455 కోట్లు) భరిస్తోంది. -
అక్కడ మగవారూ అత్యాచార బాధితులే...
వాషింగ్టన్ : యుద్ధం ఎంతో ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది.. ఎన్నో కుటుంబాలను వీధిపాలు చేస్తుంది. ఇవన్ని ప్రపంచానికి కనిపించే నష్టాలు. యుద్ధం మాటున ప్రపంచానికి కనపడని హింస ఎంతటి భయంకరమో అది అనుభవించే వారికే తెలుస్తుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే సిరియాలో తాండవిస్తున్నాయి. యుద్ధంలో సైనికులు ఒక్కసారే చస్తారు, కానీ అక్కడి ప్రజలు ప్రతినిత్యం చస్తూ బతుకుతున్నారు. యుద్ధంలో కొందరు శరీరావయవాలను కోల్పోతారు, కానీ అక్కడ ఆత్మనే కోల్పోతున్నారు. మనకు మనమే మలినమయ్యామనే భావన ఎంత భయంకరమో అత్యాచారాలకు గురవుతున్న సిరియా మహిళలు చెప్తారు. ఎందుకంటే సిరియా అంతర్యుద్ధంలో పావులుగా మారి బలవుతున్నది వారే కాబట్టి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం తాజాగా విడుదల చేసిన నివేదిక ఒళ్లు గగుర్పొడిచే నిజాలను వెల్లడించింది. ఆ నివేదిక చూస్తే మనం మనుషుల మధ్యే ఉన్నామా అనే అనుమానం వస్తుంది. ఈ నివేదికలో హింసకే హింసను చూపించే సన్నివేశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచాన్ని నివ్వెరపరిచే అరాచకాలకు సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి ఈ నివేదికలో. బషర్ అసద్ నేతృత్వంలో సిరియన్ ప్రభుత్వ దళాలు చేస్తున్న అరాచకాలను బయటపెట్టింది ఈ నివేదిక. తన శత్రువులను అవమానించడానికి, బాధించడానికి వారు లైంగిక వేధింపులను, అత్యాచారాలనే మార్గంగా ఎన్నుకున్నారు. ఈ రిపోర్టులో ఉన్న కథనాలన్ని ఊహించి రాసినవి కాదు. దాదాపు 450మందితో మాట్లాడి, తెలుసుకున్న వారి భయంకరమైన అనుభవాలే ఈ కథనాలు. అన్ని భయంకరమైన లైంగిక వేధింపులకు సంబంధించినవే. ఇంటిని సోదా చేసే నెపంతో ప్రభుత్వం తమ ఒంటిని ఎలా ఆక్రమిస్తుందో తెలిపే విషాదగాథలు. ఇక్కడి వ్యవస్థ అత్యాచారం, లైంగిక అవమానాలను తప్పుగా పరిగణించట్లేదు. పైగా వాటినే ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ సాయుధ దళాలను, కుటుంబ వ్యవస్థను నిర్విర్యం చేస్తుంది. ఈ నివేదిక బాధితులు ఎంత భయంకరంగా అత్యాచారాలకు గురియ్యారో వెల్లడిస్తుంది. తమను శత్రువులుగా భావించి ఇంటిని సోదా చేయాలనే నేపంతో అధికారులు ఎలా తమపై అత్యాచారాలు చేశారో వివరించారు బాధితులు. ఒక మహిళ వీటి గురించి చెప్తూ ‘నా ఇంటిని సోదా చేశారు. ఒక సెక్యూరిటీ అధికారి నన్ను నా గదిలోకి వెళ్లమని చెప్పి నా వెనకే వచ్చాడు. అతను నన్ను తిడుతూ, అతను చెప్పినట్లు చేయమని ఆదేశించాడు. అతడు నన్ను అపవిత్రం చేశాడు...నేను ఇక ఎన్నటికీ పవిత్రంగా మారలేను. నేను చాలా అరిచాను, కానీ ఎవ్వరూ నన్ను కాపాడ్డానికి రాలేదు’ అంటూ విలపించింది. కొన్నిసార్లు వారిని నగ్నంగా వీధుల్లోని యుద్ద ట్యాంకులకు ముందు నడిపించారు. తనను తన అన్న కళ్లముందే అత్యాచారం చేశారని ఒక స్త్రీ ఇంటర్వ్యూ చేసేవారితో చెప్పింది. తనను తన భర్త, ముగ్గురు పిల్లల ఎదుటే అత్యాచారం చేశారని మరో స్త్రీ చెప్పింది. తమ కుటుంబాల్లోని మగవారిని లొంగిపోయేలా వారిని ఒప్పించడం కోసం కొన్నిసార్లు స్త్రీలను, బాలికలను నిర్భంధ గృహాలకు తీసుకెళ్లెవారు. ప్రత్యర్థులు ఉండే ప్రాంతాల్లో, గవర్నమెంట్ చెక్పాయింట్లలో ఉండే అధికారులు కూడా మహిళలను, పిల్లలను ఇలానే వేధించేవారు. వీరందరిరిని గుంపులుగా తరలించే సమాయాల్లో కొందరిని వేరు చేసి వారిపై అత్యాచారాలు జరిపేవారు. కేవలం మహిళలు, పిల్లలే కాదు మధ్యవయస్సు స్త్రీలను కూడా వారు వదల్లేదు. వారిని కూడా ‘సునిశితంగా వెతికేవారు’. ‘ఒక మిలిటరీ అధికారి నన్ను బెస్మెంట్లోకి తీసుకెళ్లి కొట్టాడు, అతడు నా ఛాతీ, జననాంగాలను తాకాడు’ అంటూ ఒక మధ్యవయస్కురాలు తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని గుర్తు చేసుకుంది. మరో స్త్రీ తనకు ఎదురైన మాటలతో చెప్పడానికి వీలుకాని అత్యంత హేయమైన చేదు అనుభవాన్నివివరించింది. నిండా 9ఏళ్లు లేని బాలికల పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. గర్భిణీ స్త్రీలనే కనికరం కూడా చూపలేదు. వారిపై కూడా అత్యాచారాలను కొనసాగించారు. ఎన్నో ప్రాణాలు తల్లి కడుపులోను తుదిశ్వాస విడిచాయి. మహిళందరినీ నగ్నంగా చేసి జనాల ముందు నిలబెట్టెవారు. అంతటితో ఆగక మగ అధికారులు వారి జననాంగాలను తాకుతు హేయంగా ప్రవర్తించేవారు. నిర్బంధ గృహాల్లోని మహిళలపై అత్యాచారాలతో పాటు, వారి సున్నిత శరీరావయవాలను కరెంటు షాక్కు గురిచేసేవారు. కొందరు సామూహిక అత్యాచారాలకు గురయ్యారు. ఎవరిని కదిలించినా ఇలాంటి దీన గాథలే. వారి చేతుల్లో మలినమవ్వకుండా ఉండేందుకు ఒక స్త్రీ తానే తన శరీరాన్ని రక్తం, మూత్రము, పురుగులతో కప్పుకుంది. వేలాది మంది మహిళలను, పిల్లలను నిర్బంధించారు. వారిలో లాయర్లు, జర్నలిస్టులు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకర్తల బంధువులు ఉన్నారు. వారిని కూడా ప్రత్యర్థులుగా, సాయుధ దళాలకు చెందిన వారిగా అనుమానిస్తూ నిర్బంధించేవారు. కేవలం స్త్రీలే కాదు నిర్బంధ గృహాల్లోని పురుషులపై కూడా అత్యాచారాలు చేస్తున్నారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే అధికారులు వారి వినోదం కోసం బంధించిన మగవారి శరీరంలోని సున్నిత ప్రదేశాల్లోకి పైపులను, రాడ్లను తోస్తున్నారు. వారి మగ బంధువులతో కలవమంటున్నారు. ఈ మధ్య ప్రభుత్వ దళాలు వాయుదాడులకు మారడంతో 2015 నుంచి ఈ సంఘటనలు కాస్తా తగ్గాయి. ఇవన్ని ఒక్కచోట జరిగిన సంఘటనలు కావు. దారా, హామ్స్, డమాస్కస్, లటాకియా దాదాపు ఇలా దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలు. జరిగిన నేరాలన్నీ బాధితుల మీద ఎలాంటి ప్రభావం చూపాయి అన్నది ఈ నివేదికలోని మరో ముఖ్యమైన అంశం. జరిగిన సంఘటనలు వారి మనసులో తప్పుచేశామనే భావాన్ని నింపాయి. వారంతా జీవితం పట్ల నిరాశాతో ఉన్నారు. మహిళలు, పిల్లలు తమను తాము తమ కుటుంబాలకు అగౌరవంగా భావిస్తున్నారు. ఒక స్త్రీ అత్యాచారానికి గురికావడం కంటే చనిపోవడం మేలని భావించే వాతావరణంలో ఇలాంటి అకృత్యాలు జరుగుతుండటంతో.. కొన్ని సందర్భాల్లో బాధితుల కుటుంబసభ్యులే వారిని అవమానిస్తున్నారు. వారినే నిందితులుగా చూస్తున్నారు. కొంతమంది పురుషులను నపుంసకులుగా మార్చారు. దీనివల్ల వారు అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించి మిగితా వారితో కలవలేకపోతున్నారు. అత్యాచారానికి గురైన చాలామంది స్త్రీలు, బాలికలు అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. లైంగిక వేధింపులకు భయపడి చాలా కుటుంబాలు వేరే ప్రదేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. సిరియా ప్రభుత్వం వీటన్నింటి గురించి తెలిసి కూడా తెలియనట్లు నటిస్తుంది. ఈ అకృత్యాలకు అడ్డుకట్ట పడేదెప్పుడు అనేదే ఇప్పుడు ప్రపంచదేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న! -
యూఎన్లో పాకిస్థాన్కు షాక్ ఇచ్చిన భారత్
-
అమెరికాకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానం
వాషింగ్టన్: జెరూసలేంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మెజార్టీ దేశాలు ఆమోదించాయి. భారత్తో సహా 128 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. తొమ్మిది దేశాలు అమెరికా నిర్ణయాన్ని సమర్ధించగా.. 35 దేశాలు ఓటింగ్కు గైర్హాజరయ్యాయి. టర్కీ, యెమెన్ దేశాల ప్రతినిధులు ఐరాసలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ.. జెరూసలేం వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించాయి. అన్ని దేశాలు ఐరాస భద్రతా మండలి తీర్మానానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశాయి. -
అమెరికాలో పేదలపై వివక్ష
ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాలో ఆర్థిక అసమానతలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో తేలింది. పేదరికంలో మగ్గుతున్న 4.1 కోట్ల మందికి ఆ దేశంలోని అపార సంపద, ఆధునిక సాంకేతికత, ప్రభుత్వ విధానాలు ఏ విధంగానూ సాయపడటం లేదని వెల్లడైంది. త్వరలో అమల్లోకి రానున్న పన్ను సంస్కరణల చట్టంతో అమెరికా సమాజంలో ఇప్పటికే పెరిగిన ధనిక–పేద తారతమ్యాలు మరింత ఎక్కువ అవుతాయని నివేదికలో ఐరాస ప్రత్యేక ప్రతినిధి ఫిలిప్ ఆల్స్టన్ హెచ్చరించారు. అమెరికాలోని పేదరికం, మానవ హక్కుల అమలును పరిశీలించేందుకు ఆల్స్టన్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఎంతటి శక్తివంతమైన దేశమైనా మానవహక్కుల చట్టాల పరిధిలోనే పనిచేయాల్సిందేనన్న సందేశాన్నిచ్చేలా ఈ కమిటీ పర్యటన సాగింది. అమెరికాలోని సామాజిక, ఆర్థిక అసమానతలు, ఇళ్లూ వాకిలి లేని వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్ణవివక్ష, పరిశ్రమల్లో ఉద్యోగాల తగ్గుదల వంటి అంశాలపై ఆల్స్టన్ దృష్టి సారించారు. కాలిఫోర్నియా, అలబామా, జార్జియా, పశ్చిమ వర్జీనియా, వాషింగ్టన్ డీసీ, అమెరికా పాలనలో ఉన్న ప్యూర్టోరికోల్లో పర్యటించి పేదలు, నిరాశ్రయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి దుర్భర జీవితాల్ని పరిశీలించి ప్రాథమిక నివేదిక విడుదల చేశారు. అమెరికన్ల పౌర, రాజకీయ హక్కులపై పేదరికం ప్రభావాన్ని ఇందులో ప్రస్తావించారు. అమెరికా ప్రజలకు వైద్య సంరక్షణ హక్కు, సొంతిల్లు, ఆహారం వంటి ప్రాథమిక సామాజిక, ఆర్థికహక్కులు కొరవడుతున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. సంపన్నులు, పేదల మధ్య అంతరం ‘అసమానతలు, పేదరికంపై అమెరికా ప్రభుత్వ విధానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో తాజా పన్నుల విధానం ప్రజల సంపద, ఆదాయ వ్యత్యాసాల్ని మరింత పెంచుతుంది. ఒక శాతం సంపన్నులు, పేదరికంలో ఉన్న అమెరికన్ల మధ్య అంతరం మరింత పెరుగుతుంది. సంక్షేమరంగంపై విధించే కోతలు సామాజిక భద్రతను మరింత హరిస్తాయి. చైనా, సౌదీ అరేబియా, రష్యా, యూకే, ఇండియా, ఫ్రాన్స్, జపాన్ల మొత్తం రక్షణ రంగం వ్యయం కంటే అమెరికా అధికంగా ఖర్చు చేస్తోంది. 2013లో శిశు మరణాలు అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోల్చితే అమెరికాలోనే అత్యధికం. మిగతా ఐరోపా దేశాలతో పోల్చితే అసమానతల స్థాయి ఎంతో ఎక్కువగా ఉంది. ప్రజలందరికీ మంచి నీరు, పారిశుద్ధ్యం అందుబాటులో ఉన్న దేశాల్లో అమెరికా ఇంకా 36వ ర్యాంక్లోనే ఉంది. తుర్కెమినిస్తాన్, ఎల్ సాల్వడార్, క్యూబా, థాయ్లాండ్, రష్యాల్లోని జైళ్లలో కంటే అమెరికా జైళ్లలోనే ఖైదీల సంఖ్య ఎక్కువ. ఓఈసీడీ(ఆర్థికంగా అభివృద్ధి చెందిన 35 దేశాల కూటమి) దేశాలతో పోలిస్తే అమెరికాలోనే ఎక్కువ శాతం యువత దారిద్య్రంలో ఉన్నారు. కెనడా, యూకే, ఐర్లాండ్, స్వీడన్, నార్వేలతో పోల్చితే అమెరికా పిల్లల్లో పేదరికం ఎక్కువ’ అని నివేదికలో పేర్కొన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఉ.కొరియాను ధ్వంసం చేస్తాం
ఐక్యరాజ్యసమితి/మాస్కో: ఉత్తర కొరియా చేస్తున్న క్షిపణి పరీక్షలు ఒకవేళ యుద్ధానికి దారితీస్తే మాత్రం ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. అన్ని దేశాలు కలసి ఉత్తర కొరియాతో ఆర్థిక, రాజకీయ సంబంధాలను తెంచుకోవాలని పిలుపునిచ్చింది. అప్పుడు ఆ దేశానికి శిక్ష విధించినట్లు అవుతుందని పేర్కొంది. ఉత్తర కొరియా తాజాగా జరిపిన క్షిపణి ప్రయోగంపై ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో జరిగిన అత్యవసర సమావేశంలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ.. అమెరికాను లక్ష్యంగా చేసుకుని తాజాగా జరిపిన క్షిపణి ప్రయోగంతో ఉత్తర కొరియా ప్రపంచాన్ని యుద్ధపు అంచుల్లోకి తెచ్చిందని మండిపడ్డారు. మంగళవారం ఉత్తర కొరియాలోని సేయిన్నీ అనే ప్రాంతం నుంచి ఓ క్షిపణిని ప్రయోగించగా, దాదాపు 1000 కి.మీ. ప్రయాణించి జపాన్కు చెందిన సముద్రంలో పడిపోయింది. ‘ఒకవేళ యుద్ధం సంభవించిందో.. దానికి ఉత్తర కొరియా దుందుడుకు చర్యలే కారణం. నిజంగా యుద్ధమే వస్తే రెండో మాట లేకుండా ఉత్తర కొరియా సామ్రాజ్యం నేలమట్టం అవడం తథ్యం’ అని హేలీ అన్నారు. తామెప్పుడు ఆ దేశంతోతో యుద్ధాన్ని కోరుకోలేదని ఆమె చెప్పారు. ఉత్తర కొరియాతో సంబంధాలు తెంచుకోవాలన్న అమెరికా పిలుపును రష్యా వ్యతిరేకించింది. ఇది సూపర్ పవర్! సియోల్: ఉత్తర కొరియా బుధవారం పరీక్షించిన హవాసాంగ్–15 క్షిపణి... గత జూలైలో పరీక్షించిన హవాసాంగ్–14తో పోలిస్తే ఎంతో శక్తిమంతమైనది. హవా సాంగ్–15 ఫొటోలు, వీడియోలను ఉ.కొ రియా గురువారం విడుదల చేసింది. దీంతో ప్రపంచంలో ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగల సామర్థ్యాన్ని ఉ.కొరియా మరింత పెంపొందించుకున్నట్లయింది. -
‘నేను ఉగ్రవాదిని కాను’
న్యూఢిల్లీ : ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్.. తాను ఉగ్రవాదిని కాదని ప్రకటించుకున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని హఫీజ్ సయీద్ ఐక్యరాజ్యసమితిలో పిటీషన్ దాఖలు చేశారు. ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సహవ్యవస్థాపకుడిగా పేరొందిన హఫీజ్ సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ పాకిస్తాన్లోని ఒక న్యాయవాద సంస్థ ఐక్యరాజ్య సంస్థలో పిటీషన్ దాఖలు చేసింది. ముంబైదాడుల కేసులో కొన్ని నెలలుగా గృహనిర్భంధంలో ఉన్న హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ కోర్టు ఈ మధ్యే స్వేచ్చను ప్రసాదించింది. ముంబై దాడులు అనంతరం ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సెల్ రిజుల్యూషన్ 1267 మేరకు హఫీజ్ సయీద్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా సమితి ప్రకటించింది. -
ఇద్దరు భారతీయులకు ఓజోన్ అవార్డు
న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణశాఖ మాజీ మంత్రి అనిల్ దవే, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) డిప్యూటీ డైరెక్టర్ చంద్ర భూషణ్లు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా అందించే ఓజోన్ అవార్డులు అందుకున్నారు. రువాండాలో గత ఏడాది కిగాలీ ఒప్పందం కుదరడంలో దవే చొరవకు గుర్తింపుగా ఆయనకు మరణానంతరం ‘రాజకీయ నాయకత్వ అవార్డు’ను ప్రకటించారు. దవే తరఫున భారత పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి అవార్డు స్వీకరించారు. కిగాలీ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించినందుకు చంద్రభూషణ్కు భాగస్వామ్య అవార్డు లభించింది. -
‘వీటో’ మార్పులకు వ్యతిరేకం: అమెరికా
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి (ఐరాస)లోని భద్రతా మండలి శాశ్వత సభ్యులకు మాత్రమే పరిమితమైన వీటో అధికారంలో మార్పులు చేయడం లేదా సభ్యుల సంఖ్యను మార్చడాన్ని శాశ్వత సభ్య దేశమైన అమెరికా వ్యతిరేకిస్తోంది. అయితే భద్రతా మండలిలోని తాత్కాలికమైన 15 మంది సభ్యుల సంఖ్యను పెంచేందుకు మాత్రం మద్దతు పలికినట్లు ఐరాసలో ఉన్నతాధికారి వెల్లడించారు. 21వ శతాబ్దపు వాస్తవికతకు అద్దం పట్టేలా.. ఈ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేలా భద్రతా మండలిలో సంస్కరణలు ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వివరించారు. ఐరాసలో సంస్కరణలకు అమెరికా కట్టుబడి ఉందని, అంతేకాకుండా భద్రతా మండలి విస్తరణకు కూడా మద్దతు పలుకుతున్నట్లు వెల్లడించారు. అయితే వీటో అధికారంలో మార్పులు కానీ పెంపును కానీ అమెరికా వ్యతిరేకిస్తోందన్నారు. -
తీరు మారని అగ్రదేశాలు
ప్రగతి పేరుతో సంపన్న దేశాలు ఇంతకాలం నుంచీ సాగిస్తున్న కార్యకలాపాలు భూగోళానికి మృత్యుపాశాలుగా మారాయని నిర్ధారణైనా ఆ దేశాల వైఖరిలో ఇంకా మార్పు రాలేదు. జర్మనీలోని బాన్ నగరంలో రెండు వారాలపాటు జరిగి శుక్రవారం ముగిసిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)–23 సదస్సు ఆశించిన రీతిలో విజయవంతం కాలేదు. రెండేళ్లనాడు పారిస్ వేదికగా కుదిరిన చరిత్రాత్మక వాతావరణ ఒడంబడిక అమలుకు సంబంధించిన సాంకేతిక అంశాలను నిర్ధారించ డానికి... కాలుష్య నివారణ కోసం అప్పట్లో వివిధ దేశాలు ఇచ్చిన హామీలు ఆ ఒడంబడిక లక్ష్య సాధనకు ఏమేరకు తోడ్పడతాయో తేల్చడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఒడంబడిక అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనల రూపకల్పన కూడా ఇది చేయాల్సి ఉంది. అయితే వాటిపై అరకొర చర్చలే జరిగాయి. ఫలితంగా సదస్సు ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేకపోయింది. వచ్చే ఏడాది మే లో పోలాండ్లోని కటోవైస్లో జరిగే కాప్–24 సదస్సు నాటికి అభివృద్ధి చెందిన దేశాలు తాము ప్రారంభించిన చర్యలేమిటో సూచించే నివేదికను సమర్పించాలని బాన్ సదస్సులో నిర్ణయించడం... 2020లో జరగబోయే కాప్–26 సదస్సులో వ్యవసాయం, ఆహారభద్రత, సామాజికార్ధిక రంగాల్లో తీసుకున్న చర్య లేమిటో అన్ని దేశాలూ నివేదించాలని తీర్మానించడం ఉన్నంతలో ఊరటనిస్తాయి. మొత్తం 196 దేశాల మధ్య పారిస్ ఒడంబడిక కుదిరినప్పుడు అది తమ ఘనతేనని అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పుకున్నారు. రెండేళ్లు తిరిగేసరికల్లా ఆ స్థానంలో డోనాల్డ్ ట్రంప్ వచ్చి ఒడంబడికనుంచి పక్కకు తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అసలు పారిస్ ఒడంబడికపై సంతకాలు చేసిన దేశాలన్నీ ఆ ఒడంబడికను వారి వారి చట్టసభల్లో ప్రవేశపెట్టి ధ్రువీకరించవలసి ఉంది. మన దేశంతోసహా చాలా దేశాలు ఆ పనిచేశాయి. కానీ రష్యా వంటి అగ్ర రాజ్యం ఇంకా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మరోపక్క అమెరికా ఒడంబడిక నుంచి తప్పుకుంటానని బెదిరింపులు ప్రారంభించింది. తమ దేశానికి తీవ్రంగా అన్యాయం చేస్తున్న ఈ ఒడంబడికలో భాగస్వాములం కాదల్చుకోలేదని మొన్న జూన్లో ట్రంప్ ప్రకటించినా కాప్–23 సదస్సుకు ఆ దేశం నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. తమకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ముందుకొస్తే ఇందులో కొనసాగుతామని వాతావరణ అంశాలపై వైట్హౌస్ ప్రత్యేక సలహాదారు జార్జి డేవిడ్ బాంక్స్ చేసిన ప్రతిపాదన కాప్–23 సదస్సుకు రుచించలేదు. పునఃచర్చల ప్రసక్తే లేదని సదస్సు నిర్వాహకులు ప్రకటించారు. అయితే ట్రంప్ వైఖరితో విభేదించే అమెరికాలోని వివిధ రాష్ట్రాలు, నగరాలకు చెందిన నాయకులు ఈ సదస్సుకొచ్చారు. మొత్తానికి ఒడంబడిక అమలు కావాల్సిన 2020 ఎంతో దూరం లేదని తెలిసినా అగ్రరాజ్యాలు ఏవో సాకులు చెబుతూ కాలం గడుపు తున్నాయి. ఇందుకు పారిస్ ఒడంబడిక కుదిరినప్పుడే బీజాలు పడ్డాయి. వాతా వరణ పరిరక్షణకు ఏం చేయాలన్న అంశంపై మాత్రమే అప్పుడు అవగాహన కుదిరింది. దాని అమలుకు సంబంధించిన విధివిధానాలు మున్ముందు ఖరారు చేసుకోవాలని అప్పుడు నిర్ణయించారు. ఒడంబడికను ఉల్లంఘించేవారిపైనా, దాన్నుంచి మధ్యలో వైదొలగేవారిపైనా ఎలాంటి చర్యలుండాలో అప్పుడే నిర్ధారిం చుకుంటే ఇప్పుడీ పరిస్థితి ఏర్పడేది కాదు. తాము ఒడంబడిక అమలుకు అవస రమైన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడమే కాదు... అమలు చేస్తామని ముందుకొస్తున్న బడుగు దేశాలకు అందుకు అవసరమైన సాంకేతికతనూ, ఆర్ధిక సాయాన్ని అందించడంపై కూడా సంపన్న దేశాలు నికరంగా మాట్లాడటం లేదు. ఈ పరిస్థితుల్లో అసలు పారిస్ ఒడంబడిక అమలు పైనే అందరిలోనూ సందేహాలు ఏర్పడుతున్నాయి. ముందు నిర్ణయించినట్టు 2020లో ప్రారంభమవుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వాతావరణ కాలుష్యం వల్ల ముప్పు అంతకంతకూ పెరుగుతోందని శాస్త్ర వేత్తలు చెబుతున్నా, అందుకు దాఖలాలు కళ్లముందు కనబడుతున్నా సంపన్న దేశాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని బాన్ సదస్సు తీరుతెన్నులు చూస్తే అర్ధమవుతుంది. ఈ ఏడాది మన దేశంలోనూ, నైజీరియాలోనూ వరదలు ముంచెత్తాయి. చెన్నై నగరం రెండేళ్ల వ్యవధిలో మూడుసార్లు వరదనీటిలో ముని గింది. మొన్న సెప్టెంబర్లో పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన హార్వే, ఇర్మా పెనుతుఫాన్లు డొమినికన్ రిపబ్లిక్, ప్యూర్టోరికో వంటి కరీబియన్ దేశాలను బెంబే లెత్తించాయి. అమెరికాలోని ఫ్లారిడా, హూస్టన్, టెక్సాస్ తదితర నగరాలు కనీవినీ ఎరుగని వైపరీత్యాన్ని చవిచూశాయి. ఆ నగరాలకు అపార నష్టం సంభవించింది. భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్కన్నా తక్కువ స్థాయికి పరిమిత మయ్యేలా చూడాలని, వీలైతే దాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్కు మించనివ్వరాదని పారిస్ ఒడంబడిక పిలుపునిచ్చింది. కనీసం ఆ స్థాయిలో చర్యలు తీసుకుంటే తప్ప ప్రకృతి వైపరీత్యాలను నిలువరించడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతున్నారు. అయినా బాన్ సదస్సులో పెద్దగా కదలిక లేకపోవడం విచారకరం. మన దేశం 2030 సంవత్సరానికి 200 గిగావాట్ల మేర సౌరశక్తి, ఇతర పునరుత్పాదక ఇంధన వనరులను సమీకరించాలని లోగడే లక్ష్య నిర్దేశం చేసుకుంది. 2030నాటికి బొగ్గు ఆధారిత విద్యుదుత్పాదన ప్రక్రియను పూర్తిగా నిలిపేయాలని బ్రిటన్, కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి 15 దేశాలు నిర్ణయించడం, వచ్చే ఏడాది జరగబోయే కాప్–24 సదస్సుకల్లా కనీసం 50 దేశాలను ఇందులో సమీ కరించాలని నిర్ణయించడం ఒక్కటే ఉన్నంతలో చెప్పుకోదగ్గ పరిణామం. అయితే బొగ్గును అధికంగా వినియోగిస్తున్న చైనా, అమెరికా, రష్యా, జర్మనీ ఈ గ్రూపులో పాలుపంచుకోలేదు. మొత్తానికి అరకొర నిర్ణయాలతో, పైపై మెరుగులతో పరిస్థితి చక్కబడదని... చిత్తశుద్ధితో వ్యవహరించి దృఢమైన నిర్ణయాలు తీసుంటేనే ఈ ధరి త్రిని రక్షించుకోగలమని సంపన్న దేశాలు గుర్తించాలి. పోలాండ్ సదస్సునాటికైనా వాటి తీరు మారాలి. -
‘వీటో’ను ప్రస్తావించకుంటే సభ్యత్వం
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం హోదాను భారత్ పొందాలంటే వీటో (ఏదేనీ శాసనాన్ని తిరస్కరించడానికి గల అధికారం) అంశాన్ని ప్రస్తావించకపోవడమే మార్గమని భారత సంతతి మహిళ, ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు. ప్రస్తుతం ఐరాసలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనాలకు వీటో అధికారాలున్నాయి. ఈ అధికారాన్ని ఆయా దేశాలు ఇతరులతో పంచుకునేందుకు కానీ, పూర్తిగా విడిచిపెట్టేందుకు కానీ సిద్ధంగా లేవని నిక్కీ హేలీ అన్నారు. కాబట్టి వీటో అధికారాల గురించి ప్రస్తావించకపోతే భారత్కు భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం హోదా లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. భద్రతా మండలిలో సంస్కరణలు రావాలని అమెరికా కోరుకుంటోందనీ, అయితే రష్యా, చైనాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని నిక్కీ హేలీ పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ అంశాలపై భారత్–అమెరికా సహకారం పెంపొందించుకోవడంలో కాంగ్రెస్ పాత్ర’ అనే విషయంపై ఓ సంస్థ నిర్వహించిన సమావేశంలో నిక్కీ హేలీ ప్రసంగించారు. భద్రతా మండలి సంస్కరణల్లో కాంగ్రెస్కు ఎక్కువ పాత్ర ఉండదనీ, మండలిలోని సభ్య దేశాలు తమ మాట వినే స్థితిలో లేవన్నారు. సభ్యత్వం పొందేందుకు భారత్ వీలైనన్ని ఎక్కువ దేశాల మద్దతు కూడగట్టుకోవాలని సూచించారు. పాక్పై నిఘాకు భారత్ సాయపడగలదు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై కఠిన వైఖరిని అవలంబించాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై ఓ కన్నేసి ఉంచేందుకు భారత్ తమకు సహకరించగలదని నిక్కీ హేలీ అన్నారు. అఫ్గానిస్తాన్, దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాదంపై పోరుకు ట్రంప్ ఇటీవల కొత్త వ్యూహాన్ని ప్రకటించిన అంశాన్ని ప్రస్తావించిన ఆమె...ఆ వ్యూహంలో ఒక భాగం భారత్తో తమ భాగస్వామ్యాన్ని పెంచుకోవడమేనని చెప్పారు. కాగా, భారత నౌకాదళం విమాన వాహకాలను తయారుచేసేందుకు అవసరమైన ఎమల్స్ (ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టం) టెక్నాలజీని భారత్కు అందించనున్నట్లు ట్రంప్ యంత్రాంగం చెప్పింది. దీపావళి వేడుకల్లో ట్రంప్ శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ పాల్గొన్నారు. ట్రంప్ అధ్యక్షుడైన తరువాత తొలిసారి జరిగిన ఈ వేడుకల్లో ఆయన పాలనా బృందంలోని ఇండో–అమెరికన్లయిన ఐరాసలో యూఎస్ రాయబారి నిక్కీ హేలీ, మెడికేర్, మెడిక్ ఎయిడ్ సర్వీసెస్ పాలనాధికారి సీమా వర్మ, యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ అజిత్ పాయ్ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో పలు రంగాల్లో ఇండో–అమెరికన్ల సేవలను ట్రంప్ కొనియాడారు. భారత ప్రధాని మోదీతో తనకున్న అనుబంధానికి ఎంతో విలువ ఇస్తానని చెప్పారు. -
సాయుధ పోరాటంలో సమిధలవుతున్న చిన్నారులు
ఐక్యరాజ్యసమితి: ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో మావోయిస్టులు, వేర్పాటువాద సంస్థలు చిన్నారుల్ని చేర్చుకోవడంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘సాయుధ పోరాటంలో చిన్నారులు’ పేరిట ఐరాస రూపొందించిన వార్షిక నివేదికను గుటెరస్ విడుదల చేశారు. భద్రతా బల గాలు, సాయుధ గ్రూప్ల మధ్య హింసకు చిన్నారులు బలి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం ఒక్క జమ్మూ కశ్మీర్లోనే దాదాపు 30 స్కూళ్లను వేర్పాటువాదులు ధ్వంసం చేసి, తగులబెట్టారని గుటెరస్ తెలిపారు. తాజాగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు నిర్వహిస్తున్న స్కూళ్లలో సాయుధ శిక్షణను పాఠ్యాంశంగా చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. మావోలు, వేర్పాటు వాదులు తల్లిదండ్రులను బెదిరించి వారి పిల్లల్ని చేర్చుకుంటున్నారని వెల్లడించారు. -
ఉగ్రవాదం.. దేశ విధానమా?!
వాషింగ్టన్ : అంతర్జాతీయంగా కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమ విధానంగా మార్చుకున్నాయని ఐక్యరాజ్య సమితిలో భారత లీగల్ అడ్వైజర్ యెడ్ల ఉమాశంకర్ పేర్కొన్నారు. ఇటువంటి దేశాలను ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని ఆమె సమితికి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు ఆయుధాలను అందించి, సహకరిస్తున్నదేశాలు.. ఏదో ఒకరోజున వారు కూడా ఫలితం అనుభవిస్తారని చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడంపై జరిగిన చర్చలో ఉమాశంకర్ భారత ప్రతినిధిగా అభిప్రాయాలను వెలువరించారు. ఉగ్రవాదాన్ని నాశనం చేయాలంటే వారికి అందుతున్న మౌలిక వసతులను దెబ్బ కొట్టాలని.. అందులో ప్రధానంగా ఆర్థిక మూలాలను నాశనం చేయాలని పిలుపునిచ్చారు. భారత్ దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఉదుర్కొంటోందని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ఉగ్రవాదులకు ఆర్థిక, ఆయుధ, ఇతర అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్న దేశాలను, వ్యక్తులపై టెర్రరిస్ట్ కేసులు పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె పాకిస్తాన్ను పరోక్షంగా టెర్రరిస్ట్ అడ్డా అని పేర్కొన్నారు. -
మండలిలో భారత్ సభ్యత్వానికి మద్దతు!
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించడానికి మద్దతు ఇవ్వాలని అమెరికాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ప్రతినిధులు తీర్మానం ప్రవేశపెట్టారు. అమెరికా చట్ట సభ్యులు అమీ బెరా, ఫ్రాంక్ పౌలోనేలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టా రు. ప్రపంచ శ్రేయస్సులో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. -
పాక్ లష్కరే, హిజ్బుల్ను సృష్టించింది
-
పాక్ లష్కరే, హిజ్బుల్ను సృష్టించింది
ఐక్యరాజ్యసమితి: భారతదేశం ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మ విద్యాసంస్థల్ని నెలకొల్పి శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వైద్యులు, ఇంజనీర్లను తయారుచేస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల్ని ఉత్పత్తి చేస్తోందని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. ప్రపంచ ఐటీ శక్తిగా భారత గుర్తింపు పొందితే.. ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా పాకిస్తాన్ ఎందుకు అపఖ్యాతి పాలవుతుందో ఆ దేశ పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె సూచించారు. 72వ ఐరాస సాధారణ అసెంబ్లీలో శనివారం సుష్మా ప్రసంగిస్తూ.. విధ్వంసం, మారణహోమం, క్రూరత్వాన్ని ప్రపంచానికి ఎగుమతి చేయడంతో పాకిస్తాన్ ముందువరుసలో ఉందని విరుచుకుపడ్డారు. అలాంటి దేశం ఐరాస వేదికపై నుంచి మానవత్వం గురించి మాట్లాడుతూ.. కపట ప్రదర్శనలో విజేతగా నిలిచిందని సుష్మా స్వరాజ్ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదం మానవజాతి అస్తిత్వానికే ప్రమాదకరమని, ఉగ్రవాదుల జాబితాను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలే ఆమోదించకపోతే.. ఉగ్రవాద భూతంపై అంతర్జాతీయ సమాజం ఎలా పోరాటం చేయగలదని ఆమె ప్రశ్నించారు. ‘కొద్ది గంటల తేడాతో భారత్, పాకిస్తాన్లు స్వాతంత్య్రం పొందాయి. భారతదేశం ప్రపంచ ఐటీ శక్తిగా గుర్తింపు పొందితే.. ఉగ్రవాద ఎగుమతి కేంద్రంగా పాకిస్తాన్ ఎందుకు పేరుపడింది. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని పాకిస్తాన్ రాజకీయ నాయకులకు నేను చెప్పాలనుకుంటున్నాను’ అని సుష్మా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోయడమే ప్రధాన లక్ష్యంగా పాకిస్తాన్ పనిచేసినా.. వాటిని అధిగమించి భారత్ పురోగమించిందని చెప్పారు. ‘స్వాతంత్య్రం అనంతరం గత 70 ఏళ్లుగా భారత్ను అనేక పార్టీలు పాలించాయి. ప్రతీ ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం ఎంతో కొంత పాటుపడ్డాయి. ప్రపంచానికి గర్వకారణమైన ఐఐటీ, ఐఐఎంల్ని నెలకొల్పాం. కానీ ఉగ్రవాదం తప్ప ప్రపంచానికి పాకిస్తాన్ ఏమిచ్చింది?. మీరు ఉగ్రవాదుల్ని తయారు చేశారు. ఉగ్రవాద శిబిరాల్ని ఏర్పాటుచేశారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హక్కానీ నెట్వర్క్ల్ని సృష్టించారు’అని పాకిస్తాన్పై సుష్మా నిప్పులు చెరిగారు. ఉగ్రవాదంపై పెట్టిన సమయాన్ని అభివృద్ధి కోసం ఆ దేశం వినియోగించుంటే.. ఇప్పుడు పాకిస్తాన్, ప్రపంచం సురక్షితంగా ఉండేవని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో భారతదేశం ఒక్కటే కాకుండా.. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్లు కూడా నష్టపోతున్నాయని అన్నారు. మోదీ స్నేహ హస్తాన్ని ఎందుకు తిరస్కరించారు? ఐరాసలో శుక్రవారం పాక్ ప్రధాని చేసిన ఆరోపణల్ని సుష్మా తోసిపుచ్చుతూ.. శాంతి, మైత్రి కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ అందించిన స్నేహ హస్తాన్ని పాకిస్తాన్ ఎందుకు తిరస్కరించిందో సమాధానం చెప్పాలన్నారు. ‘ద్వైపాకిక్ష చర్చల ద్వారా అపరిష్కృత సమస్యల్ని పరిష్కరించుకోవాలని సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ మేరకు భారత్–పాక్లు అంగీకరించిన విషయాన్ని పాక్ ప్రధాని మర్చిపోయారు. వాస్తవాల్ని మర్చిపోవడంలో పాకిస్తాన్ రాజకీయ నాయకులు సిద్ధహస్తులు’ అని సుష్మా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలాగైతే ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు ఎలా.. ‘మన శత్రువు ఎవరో నిర్వచించడంలో మన మధ్య అంగీకారం లేకపోతే కలిసికట్టుగా మనం ఎలా పోరాడగలం? మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు అని తేడాల్ని కొనసాగిస్తే ఉమ్మడి పోరు ఎలా సాధ్యం?’ అని జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్పై చైనా వైఖరిని పరోక్షంగా తప్పుపట్టారు. మసూద్పై నిషేధం విధించాలని ఐరాసలో భారత ప్రతిపాదనను పదే పదే భద్రతామండలి సభ్య దేశం చైనా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఐరాసలో సుష్మా ప్రసంగం అద్భుతం: మోదీ ఐరాసలో సుష్మా స్వరాజ్ ప్రసంగాన్ని ట్విటర్లో ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఉగ్రవాద ముప్పు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం అంశాలపై సుష్మా స్వరాజ్ గట్టి సందేశాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఐరాసలో భార త విదేశాంగ మంత్రి అద్భుత ప్రసంగం చేశారని, ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వపడేలా చేశారని ప్రధాని ట్వీట్ చేశారు. పేదరిక నిర్మూలనే మా లక్ష్యం వాతావరణ మార్పులతో ఉత్పన్నమయ్యే సవాళ్లకు మాటలతో కాకుండా సరైన చేతలతో సమాధానం చెప్పాల్సిన అవసరముందని సుష్మా అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతికంగా, ఆర్థికంగా సాయం చేయాలని సూచించారు. నల్లధనం, అవినీతిని రూపుమాపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమని సుష్మా పేర్కొన్నారు. జీఎస్టీ అమలుతో దేశమంతా ఒకపన్ను పనువిధానం అమలు చేస్తున్నామని చెప్పారు. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే భారతదేశ ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. జన్ధన్, ముద్ర, ఉజ్వల, డిజిటల్ ఇండియా వంటివన్నీ పేదలకు సాధికారత అందించేందుకు ఉద్దేశించినవని చెప్పారు. అణ్వస్త్ర వ్యాప్తి, సముద్ర రవాణా భద్రతకు ముప్పు అంశాలపై ఐరాసలో ఆందోళన వ్యక్తం చేశారు. -
భయంతో.. యూఎన్కు..!?
-
పాల ఉత్పత్తిలో భారత్ నెం1
హైదరాబాద్: వచ్చే పదేళ్లలో భారత్ పాల ఉత్పత్తిలో నెం1గా నిలవనుంది. దీనికి కారణం జనభా పెరుగదలేనని ఐక్యరాజ్య సమితి, ఎకనామిక్ కోఆపరేషన్ సంస్థ(ఓఈసీడీ) రూపోందించిన (2017-2026) వ్యవసాయ అవుట్లుక్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పాల ఉత్పత్తి మూడు రెట్లు అవుతుందని, భారత్ తర్వాత యూరోపియన్ యూనియన్ స్థానంలో నిలుస్తుందని రిపోర్టులో సూచించారు. అంతేకాకుండా జనాభాలో చైనాను మించి అత్యధిక జనాభ గల దేశంగా భారత్ నిలుస్తుందని తెలిపారు. భారత్ ప్రస్తుత జనాభ 130 కోట్లు ఉండగా ఈ సంఖ్య 150 కోట్లకు చేరుతుందని ఓఈసీడీ అంచనా వేసింది. ఇక గోధుమల ఉత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా 11 శాతం పెరగగా.. కేవలం ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో 49 శాతం పెరుగుతోందని పేర్కొంది. భారత్, పాక్, చైనాలో గోధుమల ఉత్పత్తి ఎక్కువగా ఉండబోతుందని ఓఈసీడీ నివేదిక స్పష్టం చేసింది. ఇక రైస్ ప్రపంచ వ్యాప్తంగా 12 శాతం పెరగుతోందని, భారత్, ఇండోనేషియా, మయన్నార్, తైలాండ్, వియత్నంలో ఎక్కువ ఉత్పత్తి ఉంటుందని పేర్కొంది. -
ఐసీటీ సర్వీసులఎగుమతుల్లో భారత్ టాప్
ఐక్యరాజ్యసమితి: ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) సర్వీసుల ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం.. భారత్ చాలా అంశాల్లో మెరుగైన ప్రదర్శన కనబరచింది. అలాగే మరికొన్ని వాటిల్లో అంత మంచి ర్యాంక్లను సాధించలేకపోయింది. గ్రాడ్యుయేట్స్ ఇన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కేటగిరిలో 10వ స్థానాన్ని, ఇ–పార్టిసిపేషన్లో 27వ స్థానాన్ని, గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీస్లో 14వ స్థానాన్ని, గవర్నమెంట్ ఆన్లైన్ సర్వీసెస్లో 33వ స్థానాన్ని, జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 32వ స్థానాన్ని, సృజనాత్మక వస్తువుల ఎగుమతుల్లో 18వ స్థానాన్ని, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పేమెంట్స్లో 29వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఇండియా కొన్ని అంశాల్లో అంతగా మెప్పించలేకపోయింది. రాజకీయ స్థిరత్వం, భద్రతలో 106వ స్థానంలో ఉంది. వ్యాపార పరిస్థితుల్లో 121వ స్థానంలో, ఎడ్యుకేషన్లో 114వ స్థానంలో నిలిచింది. -
అతిపెద్ద సంక్షోభంలో ప్రపంచం!
ఐక్యరాజ్యసమితి: ప్రపంచం అతిపెద్ద మానవ సంక్షోభాన్ని ఎదుర్కోనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. యెమన్, దక్షిణ సూడాన్, సోమాలియా, నైజీరియా దేశాల్లోని రెండు కోట్ల మంది కరువు, ఆకలి దప్పికలతో అలమటించనున్నారని పేర్కొంది. దీనిపై అన్ని దేశాలు సమన్వయంతో పనిచేయకపోతే ప్రజలు ఆకలి బాధలతో పాటు వివిధ వ్యాధులతో మరణించే అవకాశముందని ఐరాస మానవతావాద సంఘం చీఫ్ స్టీఫెన్ ఒబ్రియన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నాలుగు దేశాలకు వెంటనే నిధులు పంపించాలని ఐరాస భద్రతా మండలిలో విజ్ఞప్తి చేశారు. ఈ విపత్తు నివారణకు వచ్చే జూలై వరకు రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. అక్కడి అభివృద్ధి పూర్తిగా మందగిస్తుందన్నారు. ఐదేళ్లలోపు వయసున్న 30 శాతం మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్న విషయం ఐక్యరాజ్యసమితి అధ్యయనంలో వెల్లడైందని చెప్పారు. యెమన్లోని మొత్తం జనాభా 1.8 కోట్ల మందిలో 70 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారన్నారు. అరబ్ దేశాల్లో పేద దేశమైన యెమన్ నుంచి గత రెండు నెలల్లో 48 వేల మంది వలసపోయారని తెలిపారు. ఇటీవల తన పర్యటన సందర్భంగా అక్కడి నేతలను, రెబెల్స్ను కలిసి సాయమందిస్తామని హామీ ఇచ్చినట్లు ఒబ్రియాన్ చెప్పారు. మానవతా కోణంలో చేస్తామన్న సాయాన్ని వారు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారని తెలిపారు. అక్కడి నేతలు తమ ప్రవర్తన మార్చుకోకపోతే రాబోయే మానవ సంక్షోభానికి బాధ్యత వహించక తప్పదన్నారు. అలాగే మూడేళ్ల పౌర యుద్ధంతో ఆర్థికంగా చితికిపోయిన దక్షిణ సూడాన్లో కూడా పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సూడాన్లో కరువును మనుషులే సృష్టించారని చెప్పారు. -
చైనా ద్వంద్వ వైఖరి.. భారత్ రియాక్షన్
న్యూఢిల్లీ: పాకిస్తాన్కు సంబంధించిన జైషే-ఈ-మహ్మద్ అధినేతను బ్లాక్లిస్టులో పెట్టాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ పెట్టిన అభ్యర్థనను చైనా అడ్డగించింది. జైషే-ఈ-మహ్మద్ గ్రూప్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ పలు మాస్టర్ మైండ్ దాడులకు పాల్పడుతున్నారని, జనవరిలో భారత ఆర్మీ బేస్పై జరిపిన దారుణమైన దాడుల్లో అతని హస్తముందని భారత్ ఆరోపిస్తోంది. అజార్ ను బ్లాక్ లిస్టులో పెట్టడాన్ని చైనా అడ్డగించడం.. ఉగ్రవాదం పట్ల ఆ దేశం అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరికి నిదర్శనమని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. 15 దేశాల సెక్యురిటీ కౌన్సిల్ ఇప్పటికే జైషే-ఈ-మహ్మద్ను బ్లాక్ లిస్టులో పెట్టింది. కానీ అజార్ను బ్లాక్లిస్టులో పెట్టలేదు. అయితే అజార్ను కూడా ఆ జాబితాలో చేర్చాలని కోరుతూ భారత్ తొమ్మిది నెలల కిందటే ఐక్యరాజ్యసమితిలో ఓ ప్రతిపాదనను పెట్టినట్టు విదేశీ వ్యవహారాల వికాస్ స్వరూప్ తెలిపారు. అన్ని దేశాల నుంచి పూర్తి మద్దతు వచ్చినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో ఏప్రిల్ నుంచి ఎలాంటి స్పందన తెలుపలేదని పేర్కొన్నారు. తాజాగా తమ అభ్యర్థనను రద్దు చేసినట్టు వికాస్ చెప్పారు. టెర్రరిజం నుంచి వచ్చే పెను ప్రమాదాన్ని చైనా అర్థం చేసుకుంటుందని తాము భావించామని ఆయన అన్నారు. అయితే ఈ విషయంపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెంటనే స్పందించలేదు. ఒకవేళ ఐక్యరాజ్యసమితి సెక్యురిటీ కౌన్సిల్లో అజార్ను బ్లాక్ లిస్టులో పెడితే, గ్లోబల్గా అజార్ ప్రయాణించడాన్ని రద్దు చేయొచ్చు. ఆస్తులు కూడా ఫ్రీజ్ చేసే అవకాశముంటోంది. -
భారత్ ప్రతిపాదనను అడ్డగించిన చైనా
న్యూఢిల్లీ : పాకిస్తాన్కు సంబంధించిన జైషే-ఈ-మహ్మద్ అధినేతను బ్లాక్లిస్టులో పెట్టాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ పెట్టిన అభ్యర్థనను చైనా అడ్డగించింది. ఆ అభ్యర్థనను రద్దు చేసింది. జైషే-ఈ-మహ్మద్ గ్రూప్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ పలు మాస్టర్ మైండ్ దాడులకు పాల్పడుతున్నారని, జనవరిలో భారత ఆర్మీ బేస్పై జరిపిన దారుణమైన దాడుల్లో అతని హస్తముందని భారత్ ఆరోపిస్తోంది. ఈ అటాక్స్ అనంతరం పాకిస్తాన్ సెక్యురిటీ అధికారులు అజార్పై దర్యాప్తు చేపట్టారు. కానీ ఆ దాడులతో అతనికి ఎలాంటి సంబంధాలు లేవని వారు తేల్చారు. 15 దేశాల సెక్యురిటీ కౌన్సిల్ ఇప్పటికే జైషే-ఈ-మహ్మద్ను బ్లాక్ లిస్టులో పెట్టింది. కానీ అజార్ను బ్లాక్లిస్టులో పెట్టలేదు. అయితే అజార్ను కూడా ఆ జాబితాలో చేర్చాలని కోరుతూ భారత్ తొమ్మిది నెలల కిందటే ఐక్యరాజ్యసమితిలో ఓ ప్రతిపాదనను పెట్టినట్టు విదేశీ వ్యవహారాల వికాస్ స్వరూప్ తెలిపారు. అన్ని దేశాల నుంచి పూర్తి మద్దతు వచ్చినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో ఏప్రిల్ నుంచి ఎలాంటి స్పందన తెలుపలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇప్పుడు తమ అభ్యర్థనను రద్దు చేసినట్టు వికాస్ చెప్పారు. టెర్రరిజం నుంచి వచ్చే పెనుప్రమాదాన్ని చైనా అర్థం చేసుకుంటుందని తాము భావించామని ఆయన అన్నారు. అయితే ఈ విషయంపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెంటనే స్పందించలేదు. ఒకవేళ ఐక్యరాజ్యసమితి సెక్యురిటీ కౌన్సిల్లో అజార్ను బ్లాక్ లిస్టులో పెడితే, గ్లోబల్గా అజార్ ప్రయాణించడాన్ని రద్దు చేయొచ్చు. ఆస్తులు కూడా ఫ్రీజ్ చేసే అవకాశముంటోంది. -
అగ్ని-5పై యూఎన్ లో.. :చైనా
బీజింగ్: భారత్ పరీక్షించిన అగ్ని-5 క్షిపణిపై యూఎన్ కౌన్సిల్లో ప్రశ్నిస్తామని చైనా స్పష్టం చేసింది. చైనా యూఎన్ శాశ్వత సభ్యత్వం కలిగిన దేశం. అణు శక్తి పదార్ధాలను ప్రయోగించగలిగే ఆయుధాలను తయారుచేయడంపై భారత్ కు యూఎన్ కొన్ని సూచనలు చేసిందని చైనీస్ విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యుంగ్ పేర్కొన్నారు. జపాన్, భారత మీడియాల్లో అగ్ని-5 చైనాకు చెక్ పెడుతుందనే వార్తలపై ఆమె మాట్లాడారు. మీడియా కథనాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నామని, భారత విదేశాంగ శాఖతో ఈ విషయంపై మాట్లాడతామని తెలిపారు. ఆసియా, యూరప్ ఖండాల్లోని చాలా ప్రాంతాలను అగ్ని-5 చేరుకోగలదని చైనా-పాక్ లకు ఇది చెక్ పెడుతుందని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. పొరుగుదేశాలతో చైనా శాంతిని పాటించాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. చైనా-భారత్ లు విరోధులు కావని భాగస్వాములని రెండు దేశాలు ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. -
మెగాస్టార్ సినిమాకు మరో అరుదైన ఘనత
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ పింక్. సమాజంలో మహిళ మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించటమే కాదు, విమర్శకుల ప్రశంసలు సైతం సొంతం చేసుకుంది. తాప్సీ మరో కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమాలో ఆండ్రియా తరియంగ్, కీర్తి కుల్హర్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింపబడిన ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. త్వరలో పింక్ సినిమాను ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రదర్శించనున్నారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో పింక్ సినిమాను ప్రదర్శించాల్సిందిగా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఆహ్వానించినట్టుగా అమితాబ్ ట్విట్టర్లో వెల్లడించారు. అమితాబ్ బైపోలార్ డిజార్డర్తో ఇబ్బంది పడే లాయర్గా నటించిన ఈ సినిమాకు అనిరుద్ రాయ్ చౌదరి దర్శకుడు.T 2453 - 'PINK' invited for a special screening of the film at UN Head Quarters, in New York .. by Assitant Secretary General .. honoured ! pic.twitter.com/aWHOYt1RIS— Amitabh Bachchan (@SrBachchan) 25 November 2016 -
భారత్పై పాక్ ఫిర్యాదులు..
నియంత్రణ రేఖ వెంబడి తరుచూ జరుగుతున్న కాల్పులు... సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాకిస్తాన్, ఐక్యరాజ్యసమితి తలుపు తట్టింది. ఐక్యరాజ్యసమితిలోని పాకిస్తాన్ అంబాసిడర్ మలీహ లోధి, డిప్యూటీ యూఎన్ సెక్రటరీ జనరల్ జన్ ఎలియాస్సన్, చెఫ్ డి కేబినెట్ సెక్రటరీ జనరల్ ఎడ్మండ్ ములెట్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. ఈ పరిస్థితులు అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్ర ముప్పని ఆమె ఆరోపించారు. ఐక్యరాజ్య సమితి అధికారులతో భేటీ అయిన ఆమె, భారతే నియంత్రణ రేఖ వెంబడి యుద్ధవాతావరణ పరిస్థితులు నెలకొల్పుతుందంటూ పేర్కొన్నారు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ అంతర్జాతీయ సమాజాన్ని దృష్టి మరలిస్తుందని ఆరోపించారు. దీనిపై ఐక్యరాజ్యసమితిలోని శాంతి కార్యకలాపాలు చూస్తున్న డిపార్ట్మెంట్, భారత్, పాకిస్తాన్లోని యూనైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్లకు ఆదేశాలు పంపింది. నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులను నిశితంగా గమనిస్తూ ఉండాలని ఆదేశిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలను నియంత్రించడానికి సహకరిస్తామని యూఎన్ పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సహమిస్తున్న పాకిస్తాన్, నియంత్రణరేఖ వెంబడి తరుచూ చొరబాటులకు ప్రయత్నిస్తూ కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. నిన్న కాక మొన్ననే ఎల్ఓసీ ప్రాంతంలో దాడి జరిపి ముగ్గురు భారత సైనికులను పాకిస్తాన్ ముష్కరుల పొట్టన పెట్టుకున్నారు. ఈ మెరుపుదాడిలో ఒకరి తలను కిరాతకంగా చంపేశారు కూడా. చేసేదంతా చేసి మళ్లీ నియంత్రణ రేఖ వెంబడి భారత్తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయంటూ పాకిస్తాన్ ముసలి కన్నీరు కారుస్తోంది. -
4 నుంచి ప్యారిస్ ఒప్పందం అమల్లోకి
ఐక్యరాజ్యసమితి: కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ఒప్పందంపై మెజారిటీ దేశాలు సంతకాలు చేయడంతో నవంబర్ 4 నుంచి ప్యారిస్ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ వెల్లడించారు. దీన్నోక చిరస్మరణీయ ఘటనగా అవర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్హౌస్ ఉద్గారాల్లో 56 శాతం విడుదల చేస్తున్న 72 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయన్నారు. ఒకప్పుడు ఊహించడానికే సాధ్యం కాని ఈ ఒప్పందం ప్రస్తుతం ఎవరూ అడ్డగించలేని విధంగా అమల్లోకి వచ్చిందన్నారు. -
కశ్మీర్పై పాక్ అభ్యంతరాలు పట్టించుకోలేదు
-
అమెరికా గొప్పదేం కాదు
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా. అత్యంత బలమైన ఆర్ధికవ్యవస్ధ కలిగిన అమెరికా.. గొప్ప దేశం కాదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ప్రజారోగ్యం(వ్యాధుల నిర్మూలన) విషయంలో అమెరికా 28వ స్ధానంలో ఉందని లాన్సెట్ లో ప్రచురితమైన పరిశోధనలో తేలింది. అమెరికా యూఎన్ సూచనలను ఆచరణలో పెట్టడంలో విఫలం చెందడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఓ వైపు అగ్రరాజ్యం ప్రజల ఆరోగ్య విషయంలో వెనుకబడిపోగా.. యూఎన్ సలహాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఐలాండ్, స్వీడన్, సింగపూర్ దేశాలు టాప్ లో నిలిచాయి. పేదరికం, శుభ్రమైన నీరు, విద్య, సామాజిక అసమానతలు, నూతన పద్ధతుల అవలంబనల ఆధారంగా లాన్సెట్ ఈ పరిశోధన చేసింది. 124 దేశాల్లో దాదాపు 1,870మంది పరిశోధకులు ఏడాదిన్నరకాలం పాటు వివిధ అంశాలపై పరిశోధనలు చేసి ఈ వివరాలు రూపొందించింది. తాగునీరు, పరిశుభ్రత, పిల్లల వికాసం తదితర అంశాల్లో యూఎస్ మంచి మార్కులు సంపాదించింది. వైయలెన్స్, సహజ వైపరీత్యాలు, హెచ్ఐవీ, ఆత్మహత్యలు, ఆల్కహాల్ లు యూఎస్ ను ర్యాంకింగ్ స్ధానాల్లో కిందకు దిగజార్చాయి. మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే పబ్లిక్ హెల్త్ పై అమెరికా అంతగా దృష్టిసారించడం లేదని తేలింది. యూఎన్ సూచనలతో సాధించిన దేశాల్లో కొన్ని - టిమోర్ లెస్టే అనే చిన్న దేశం కొన్ని సంవత్సరాల యుద్ధంలోనే గడిపింది. 2000సంవత్సరం తర్వాత ప్రజారోగ్య వ్యవస్ధను పునరుద్ధరించుకుంది. - 1990లో ప్రజారోగ్య వ్యవస్ధ పనితీరును మార్చుకున్న తజకిస్ధాన్ ప్రస్తుతం మలేరియాపై సంపూర్ణ విజయం దిశగా సాగుతోంది. - ప్రపంచంలోనే అత్యధిక ఆరోగ్య ఇన్సూరెన్స్ పాలసీలను ప్రజలకు కొలంబియా అందించింది. క్యాన్స్రర్ లాంటి అతిపెద్ద జబ్బులకు కూడా ఇన్సూరెన్స్ ద్వారా చికిత్సను అందిస్తోంది - రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టం చేసిన తైవాన్.. యాక్సిడెంట్ల మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. - టొబాకో పదార్ధాల వినియోగానికి వ్యతిరేకంగా పాలసీలను తెచ్చిన ఐలాండ్ ర్యాంకుల జాబితాలో ముందంజలో ఉంది. -
అమెరికా ఫస్ట్, భారత్ సెకండ్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి గతేడాదికిగాను 1760 కోట్ల డాలర్ల సరకులను, సేవలను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఎప్పటిలాగే ఈ విషయంలో అమెరికానే అగ్రస్థానంలో నిలవగా భారత్ రెండో స్థానంలో నిలవడం విశేషం. అమెరికా 160 కోట్ల డాలర్ల సరకులను, సేవలను ఐక్యరాజ్యసమితికి అందించగా, భారత్ 120 కోట్ల డాలర్ల సరకులను, సేవలను అందించింది. ఈ విషయంలో తొలి పది స్థానాల్లో అమెరికా, యూరప్ దేశాలు ఉండడం సహజమే అయినప్పటికీ భారత్ లాంటి వర్ధమాన దేశాలు, కెన్యా, లెబనాన్, అఫ్ఘానిస్థాన్, టర్కీ, ఇథియోపియా లాంటి వెనకబడిన దేశాల నుంచి సమితికి ఎగుమతులు పెరగడం ఆశ్చర్యకరం. 2005లో ప్రారంభమైన ఈ కొత్త ట్రెండ్ 2015 నాటికి కూడా కొనసాగింది. ఎక్కువ సరకులను, సేవలను అందించిన టాప్ పది దేశాల్లో అమెరికా, భారత్ ప్రథమ, ధ్వితీయ స్థానాల్లో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, స్విడ్జర్లాండ్, బెల్జియం, అఫ్ఘానిస్థాన్, డెన్మార్క్, ఫ్రాన్స్, యుకె, కెన్యా దేశాలు నిలిచాయి. ముడి సరుకులు కాకుండా 13 సెక్టార్లలో ఐక్యరాజ్య సమితి సరకులను, సేవలను దిగుమతి చేసుకుంటుంది. ఆరోగ్యం, రవాణా, అడ్మినిష్ట్రేషన్, ఆపరేషన్, భవన నిర్మాణం, ఇంజనీరింగ్, ఆహారం, విద్యా, సురక్షిత నీరు, పారిశుద్ధ్యం, మానవతా సాయంచ, సరకులు, ఇతర సేవలు ఈ సెక్టార్లలో ఉన్నాయి. సమితి దిగుమతి చేసుకునే ఎగుమతుల్లో ఆరోగ్య రంగానిదే పెద్ద పీట. మొత్తం దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల్లో 23 శాతం ఆరోగ్య రంగానిదే (ఔషధాలు, వైద్య పరికరాలు).