vk singh
-
ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగక్కర్లేదు
ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగక్కర్లేదు -
తెలంగాణలో కొత్తగా 3 ఎయిర్పోర్టులే సాధ్యం: వీకే సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మూడు ప్రాంతాలను మాత్రమే కొత్తగా విమానాశ్రయాల నిర్మాణానికి సాంకేతికంగా అనువైన ప్రదేశాలుగా గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆరు విమానాశ్రయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) చేసిన అధ్యయనం ప్రకారం ఈమేరకు కేంద్రం వెల్లడించింది. వరంగల్ (బ్రౌన్ఫీల్డ్), ఆదిలాబాద్ (బ్రౌన్ఫీల్డ్), జక్రాన్పల్లి (గ్రీన్ఫీల్డ్) ప్రాంతాలు మాత్రమే సాంకేతికంగా సాధ్యమయ్యేవని ఏఏఐ నివేదికలో పేర్కొంది. అయితే తక్షణ భూసేకరణ అవసరాన్ని నివారించడానికి చిన్న విమానాల ప్రైవేట్ కార్యకలాపాల కోసం ఈ మూడు ప్రాంతాల్లో సాధ్యమయ్యే స్థలాలను అభివృద్ధి చేసి, ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏఏఐ కోరిందని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీలు మాలోత్ కవిత, వెంకటేశ్ నేత, రంజిత్రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. హైదరాబాద్లో ఏవియేషన్ వర్సిటీకి నో హైదరాబాద్లో రాజీవ్గాంధీ జాతీయ ఏవియేషన్ వర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి 2018లో వచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనను ఆర్జీఎన్ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించలేదని వెల్లడించారు. ఎంపీ రంజిత్రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి ఈమేరకు బదులిచ్చారు. -
నేరాలు మెండుగా.. జైళ్లు నిండుగా
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నేపథ్యంలో ప్రతి ఏటా జైలుకు చేరే ఖైదీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేర ప్రవృత్తి, ఆర్థిక అసమానతలు, క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు దారుణమైన నేరాలకు కారణమవుతున్నాయి. తద్వారా కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. హత్యలు, దోపిడీలతో పాటు ఈ మధ్య కాలంలో సైబర్, ఆర్థిక నేరాలు, లైంగిక దాడుల సంఖ్య పెరుగుతోంది. పర్యవసానంగా ఖైదీలతో జైళ్లు నిండిపోతున్నాయి. జైళ్ల సామర్ధాద్యనికి మించి ఖైదీలు కిక్కిరిసి పోతున్నారు. ఈ కారణంగా జైళ్లలో శుచి, శుభ్రత కరువవడంతో పాటు రక్షణ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఖైదీల మధ్య గొడవలు, దాడులు చేసుకుంటున్నాయి. పెరగని జైళ్ల సామర్థ్యం 2016 నుంచి 2021 వరకు జైళ్లలో మగ్గుతున్న ఖైదీల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నిర్మించిన జైళ్లు అప్పటి జనాబా దామాషాకు సరిపోయేలా ఏర్పడినివి. ప్రస్తుతం జనాభా విపరీతంగా పెరిగి, నేరాలు పెరుగుతున్నా జైళ్ల సామర్థ్యం మాత్రం పెరగడం లేదు. అవే జైళ్లలో ఖైదీలను కుక్కుతున్నారు. 73 శాతానికి పైగా విచారణ ఖైదీలే.. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న నిందితుల్లో 73 శాతం వరకు విచారణలో ఉన్న ఖైదీలే ఉండడం ఆందోళన కల్గిస్తున్న అంశం. వివిధ రకాల నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు తీర్పులు వెలువడక, ఇతరత్రా కారణాలతో జైళ్లలోనే ఉండాల్సి వస్తోంది. బెయిల్ పొందడానికి న్యాయ సహకారం అందనివారు కూడా పెద్దసంఖ్యలో ఉంటున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న 1,319 జైళ్లలో 2021 నాటికి 5,54,034 మంది ఖైదీలు ఉండగా.. వీరిలో విచారణ ఖైదీలే 4,27,165 మంది ఉండటం గమనార్హం. అంటే వీరంతా నేరారోపణలకు గురై, ఇంకా శిక్షపడకుండా, న్యాయస్థానాల్లో కేసులు వివిధ స్థాయిల్లో విచారణలో ఉన్నవారన్నమాట. వీరందరికీ శిక్ష పడుతుందా? లేదా? అన్నది న్యాయస్థానాల తీర్పుపై ఆధారపడి ఉంటుంది. యూపీలో అత్యధికం.. జైళ్లలో మగ్గుతున్న వారిలో ఎక్కువమంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే.. అత్యల్పంగా లక్షద్వీప్లో ఉన్నారు. శిక్ష పడిన ఖైదీలతో పాటు విచారణ ఖైదీలు, ముందస్తుగా అదుపులోకి తీసుకునే నేరస్తుల జాబితాలోనూ సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో ఉంది. ఉత్తర్ప్రదేశ్లో 63,571 ఖైదీలకు సరిపోయే విధంగా జైళ్లు ఉంటే.. ప్రస్తుతం ఆ జైళ్లలో ఏకంగా 1,17,789 మంది ఖైదీలు ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్లో వంద మంది ఖైదీల సామర్థ్యం ఉన్న జైలులో 185 మంది వరకు ఉంటున్నారు. దాని తర్వాత స్థానాల్లో బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ఖైదీల్లో 56.1 శాతం ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జైళ్ల సామర్థ్యం కంటే ఖైదీలు పది శాతం తక్కువగా ఉండడం గమనార్హం జైళ్ల శాఖకు రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే బడ్జెట్లో హర్యానా వంద శాతం ఖర్చు చేస్తూ మొదటి స్థానంలో ఉంటే.. ఆంధ్రప్రదేశ్ 96.8 శాతంతో రెండో స్థానంలో ఉంది. జైళ్లలో చికిత్స కష్టమే.. జైళ్లలో కిక్కిరిస్తున్న ఖైదీల కారణంగా అనేక సవాళ్లు తలెత్తుతున్నాయి. జైళ్లలో ఏళ్లకేళ్లు ఉంటున్న వారికి అస్వస్థత ఏర్పడితే.. తక్షణమే వారికి వైద్య సదుపాయం కల్పించడానికి అనువైన సౌకర్యాలు లేవు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది లేక వారికి చికిత్స అందించడం ఆలస్యం అవుతోంది. దీనివల్ల కొన్ని సందర్భాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని జైళ్లలో ఖైదీలు ఉండే సామర్థ్యంతో పోల్చుకుంటే మెడికల్ సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు. గోవాలో 84.6 శాతం, కర్ణాటక 67, లద్దాక్ 66.7, జార్ఖండ్ 59.2, ఉత్తరాఖండ్ 57.6 శాతం తక్కువ సిబ్బంది ఉన్నట్లు ప్రిజన్స్ స్టాటిస్టిక్స్ ఇండియా–2021 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సంస్కరణ శూన్యం సంస్కరణల కేంద్రాలుగా ఉండాల్సిన జైళ్లలో..ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారా? నేరస్తులు పరివర్తనం చెందుతున్నారా? జైలు నుంచి విడుదలైన తర్వాత ఎలాంటి జీవితం కొనసాగిస్తున్నారు? మళ్లీ నేరాల వైపు మళ్లుతున్నారా? ఈ మేరకు పరిశీలన జరుగుతోందా? అంటే..లేదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఏవైనా ఘోరమైన నేరాలు జరిగినప్పుడు తాత్కాలికంగా ఈ అంశంపై దృష్టి పెడుతున్నారని, ఆ తర్వాత షరా మామూలే అనే విమర్శలు ఉన్నాయి. సంస్కరణలతోనే నేరాల సంఖ్య తగ్గుతుందని, తద్వారా ఖైదీల సంఖ్య తగ్గుతుందని జైళ్ల విభాగం విశ్రాంత ఉన్నతాధికారులు అభిప్రాయం పడుతున్నారు. సంస్కరణలు అవసరం జైళ్లలో ఖైదీలను పశువుల్లా చూస్తున్నారు. ఖైదీలంటే పూర్తి చులకన భావన సరికాదు. వారిని సన్మార్గంలో నడిపించడానికి జైళ్ల సంస్కరణలు అవసరం. జైలుకు వచ్చేవారిని కఠినంగా శిక్షించాలనే అభిప్రాయం సరికాదు. కఠిన శిక్ష అనేది మానవత్వానికి వ్యతిరేకంగా నేరం చేయడమే. జైళ్ల సంస్కరణలు రాకుండా సమాజంలో నేరాలను అరికట్టడం సాధ్యం కాదు. బ్రిటిష్ హయాంలో స్వాంతంత్య్ర సమరయోధులను తప్ప.. మిగిలిన ఖైదీలను బాగానే చూసేవారు. జైళ్ల సంస్కరణలు తీసుకురావాలని కేంద్రానికి, అన్ని రాష్ట్రాలకు నేను పలుమార్లు విజ్ఞప్తి చేశా. కానీ స్పందన లేదు. – జైళ్ల విభాగం మాజీ డీజీపీ వీకే సింగ్ -
లిథియం అయాన్ నుంచి బయటకు రావాలి
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీలు) లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ వాడకం విషయంలో భారత్ ఆరంభంలోనే బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రి వీకే సింగ్. ఈ కమోడిటీపై మన దేశానికి ఎటువంటి నియంత్రణ లేదంటూ ఈ సూచన చేశారు. భవిష్యత్తులో గ్రీన్ రవాణా కోసం హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్స్ కీలకమని, దీనికి ఎంతో భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డారు. ఈ రంగంలోని కంపెనీలు ఏక కాలంలో కొత్త టెక్నాలజీలపైనా పనిచేయాలని సూచించారు. ఢిల్లీలో ‘ఈవీ ఇండియా 2022’ సదస్సు జరిగింది. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మంత్రి మాట్లాడారు. లిథియం అయాన్ బ్యాటరీలపై ఆధారపడడాన్ని తగ్గించడం ఎలా అన్న దానిపై దేశీయంగా ఎంతో పరిశోధన కొనసాగుతున్నట్టు చెప్పారు. సోడియం అయాన్, జింక్ అయాన్ టెక్నాలజీలపై పరిశోధనలు నడుస్తున్నాయని వివరించారు. లిథియం అయాన్ను మన దేశం ఉత్పత్తి చేయడం లేదంటూ.. దీనిపై మనకు ఎటువంటి నియంత్రణ లేని విషయాన్ని సింగ్ గుర్తు చేశారు. దీన్ని పూర్తిగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం మన దేశంలో విక్రయిస్తున్న ఈవీలన్నీ కూడా లిథియం అయాన్ బ్యాటరీతో తయారైనవే కావడం గమనార్హం. ‘‘గ్రీన్ హైడ్రోజన్ విషయంలో మనం జపాన్ స్థాయిలోనే ఉన్నాం. సోలార్ ఇంధనం ధర మన దగ్గర చాలా తక్కువ. కనుక గ్రీన్ హైడ్రోజన్ విషయంలో మనకు ఎంతో అనుకూలత ఉంది’’అని సింగ్ పేర్కొన్నారు. -
సైన్యంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారు: మాజీ ఆర్మీ చీఫ్ ఫైర్
అగ్నిపథ్పై ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్కీమ్పై తగ్గేదేలే అంటూ త్రివిధ దళాధిపతులు క్లారిటీ ఇచ్చిన విషయాన్ని తెలిసిందే. ఇక, తాజాగా కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అగ్నిపథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిపై వీకే సింగ్ మండిపడ్డారు. వీకే సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్ స్కీమ్ నచ్చకపోతే అభ్యర్థులు.. దానిని ఎంచుకోవద్దని ఘాటుగా స్పందించారు. అగ్నిపథ్ స్కీమ్ నచ్చని వారు సాయుధ దళాల్లో చేరవద్దని కోరారు. భారత సైన్యం సైనికులుగా చేరమని బలవంతం చేయదని, సైన్యంలో చేరాలనుకునే వారు తమ ఇష్టానుసారం డెసిషన్ తీసుకోవచ్చని తెలిపారు. ‘‘అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ నచ్చకపోతే, అందులో చేరండి అని మిమ్మల్ని అడుగుతున్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా బస్సులు, రైళ్లను తగలబెడుతున్న వారిని సాయుధ దళాల్లోకి తీసుకుంటామని ఎవరు చెప్పారు. మీరు అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తేనే మిమ్మల్ని ఎంపిక చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే 1999 యుద్ధం తర్వాత కార్గిల్ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు అగ్నిపథ్ గురించి ప్రస్తావన వచ్చిందని ఆయన వెల్లడించారు. #WATCH | Nagpur | It's a voluntary scheme... Those who want to come can come...Who is saying you to come? You are burning buses and trains, has anyone told you that you will be taken to the army?..: Union Minister and former Army chief VK Singh on #AgnipathScheme pic.twitter.com/Egh1VqQX7Y — ANI (@ANI) June 19, 2022 ఇది కూడా చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత -
సిరాలో తప్ప చట్టాల్లో నలుపు ఎక్కడ?
బస్తి(ఉత్తరప్రదేశ్): వ్యవసాయ చట్టాలను రాయడానికి వినియోగించిన సిరా మాత్రమే నలుపు అని, చట్టాల్లో ‘నలుపు’ ఎక్కడ ఉందని కేంద్ర మంత్రి వి.కె.సింగ్ రైతు సంఘాల నాయకుల్ని ప్రశ్నించారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను ఈ నాయకులు పట్టించుకోరా? అని నిలదీశారు. వివాదాస్పద సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి ప్రధాని మోదీ జాతికి క్షమాపణలు చెప్పిన మర్నాడు శనివారం కేంద్ర విమానాయాన శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్ విలేకరుల సమావేశంలో రైతు సంఘాలను తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఇటీవల ఒక రైతు సంఘం నాయకుడితో తాను జరిపిన సంభాషణని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘ఒక్కోసారి మనం విషయాలన్నీ ఎంతో బాగా అర్థం చేసుకుంటాం. కానీ వేరేవరో ఏదో చెప్పగానే గుడ్డిగా వారిని అనుసరిస్తాం. నన్ను కలిసిన ఒక రైతు సంఘం నాయకుడిని నేను ఇదే విషయాన్ని అడిగాను. చట్టాల్ని లిఖించడానికి వాడిన సిరాలో తప్ప నలుపు ఎక్కడ ఉందని సూటిగా ప్రశ్నించాను’’ అని వీకే సింగ్ అన్నారు. -
ఎయిరిండియాపై కెయిర్న్ దావా ప్రభావం ఉండదు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటాల విక్రయంపై కెయిర్న్ ఎనర్జీ, దేవాస్ మల్టీమీడియా సంస్థలు దాఖలు చేసిన కేసుల ప్రభావమేమీ ఉండదని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు. సొంత మేనేజ్మెంటు, బోర్డుతో ఎయిరిండియా ప్రత్యేకంగా కార్పొరేట్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోందని లోక్సభలో ఆయన తెలిపారు. పన్ను వివాదంలో కేంద్రం నుంచి పరిహారం రాబట్టుకునే క్రమంలో బ్రిటన్ సంస్థ కెయిర్న్ ఎనర్జీ.. విదేశాల్లోని భారత ఆస్తులను జప్తు చేసుకునేందుకు వివిధ దేశాల్లో కేసులు వేసింది. ఇందులో భాగంగా ఎయిరిండియా ఆస్తుల జప్తుపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఏవియేషన్’ సవాళ్ల పరిష్కారానికి సలహా బృందాలు కాగా, విమానయాన పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల పరిష్కారానికి గాను పౌర విమానయాన శాఖ మూడు సలహా బృందాలను ఏర్పాటు చేసింది. ఎయిర్లైన్స్ సంస్థలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, కార్గో (సరుకు రవాణా) విమానయాన సంస్థలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థలు, ఫ్లయింగ్ శిక్షణా కేంద్రాలు, మరమ్మతులు, నిర్వహణ సంస్థలకు ఇందులో చోటు కల్పించింది. కరోనా మొదటి విడతలో రెండు నెలల పాటు విమానయాన సర్వీసులు మూతపడ్డాయి. రెండో విడతలోనూ సర్వీసులు, ప్రయాణికుల సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకుని నిర్వహించాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఈ పరిశ్రమలోని సంస్థలపై గట్టిగానే పడింది. దీంతో భారీ నష్టాలతో వాటి ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారాయి. దీంతో పౌర విమానయాన శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం గమనార్హం. ‘‘పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చైర్మన్గా మూడు సలహా బృందాలను ఏర్పాటు చేయడమైనది. ఈ బృందాలు క్రమం తప్పకుండా సమావేశమై పలు అంశాలపై చర్చించడంతోపాటు.. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తాయి’’ అంటూ పౌర విమానయాన శాఖ ప్రకటన విడుదల చేసింది. -
నా తమ్ముడికి బెడ్ కేటాయించండి: కేంద్రమంత్రి అభ్యర్థన
లక్నో: కరోనా దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్లో కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక రాష్టాల్లో ప్రజలు ఆక్సిజన్ సిలెండర్లు, బెడ్ల కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే అనేక ఆసుపత్రుల్లో కరోనా సోకిన వారు బెడ్లు లేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కాగా, సాక్షాత్తు కేంద్రమంత్రి ఒకరు.. కరోనా సోకిన తన సోదరుడికి ఆసుపత్రిలో బెడ్ కేటాయించాల్సిందిగా కోరారు. దీన్ని బట్టి చూస్తే... వీఐపీలకే ఇలాంటి పరిస్థితుంటే.. ఇక మాముల ప్రజలు పరిస్థితులను ఊహించుకొవచ్చు. అయితే, కేంద్రమంతి వీకే సింగ్ ఘజియాబాద్ నియోజకవర్గంలో తన సోదరుడికి బెడ్ను కేటాయించాల్సిందిగా కోరారు. ఈ మేరకు ట్వీటర్లో ఆయన చేసిన ట్వీట్ మన దేశంలో వైద్యపరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఒక కేంద్ర మంత్రి మెడికల్ సాయం కావాలని కోరడం బాధకరమని, దీన్ని బట్టి మనం చాలా దారుణ పరిస్థితుల్లో ఉన్నామని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైన ప్రజలందరు విధిగా మాస్క్ను ధరించి, కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. అదేవిధంగా కోవిడ్ టీకాను వేసుకోవాలని పేర్కొన్నారు. చదవండి: కనీసం 15 రోజులు లాక్డౌన్ విధించాలి! -
ప్రైవేటు చేతుల్లోకి విద్యుత్ పంపిణీ రంగం!
సాక్షి, హైదరాబాద్: ‘టెలికం రంగం తరహాలో విద్యుత్ పంపిణీ రంగాన్ని డీ లైసెన్స్డ్ చేస్తున్నాం. ప్రస్తుతమున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అలాగే ఉంటాయి. విద్యుత్ పంపిణీ వ్యవస్థ (వైర్లు) నిర్వహణ డిస్కంల పరిధిలోనే ఉంటుంది. డిస్కంలకు పోటీగా ఎవరైనా ప్రైవేటు ఆపరేటర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకోవచ్చు. వీళ్లు ఎవరి నుంచైనా విద్యుత్ కొనుగోలు చేసి ఎవరికైనా అమ్ముకోవచ్చు. డిస్కంల వైర్లను వాడుకుని తమ వినియోగదారులకు విద్యుత్ అమ్ముకుంటారు. దీంతో విద్యుత్ పంపిణీ రంగంలో డిస్కంల గుత్తాధిపత్యం కనుమరుగవుతుంది..’అని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు–2020పై బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల విద్యుత్ శాఖ కార్యదర్శులు, విద్యుత్ సంస్థల సీఎండీలతో మాట్లాడారు. ‘ప్రైవేటు ఆపరేటర్లతో పోటీ పడి వినియోగదారులకు డిస్కంలు విద్యుత్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎవరు తక్కువ ధరకు అమ్మితే వినియోగదారులు వారి వద్ద విద్యుత్ కొంటారు. పోటీతో వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుంది..’అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ‘ఇకపై డిస్కంలు రెండు రకాల వ్యాపారాలు చేయాలి. వినియోగదారులకు విద్యుత్ను అమ్ముకోవడంతో పాటు ప్రైవేటు ఆపరేటర్లతో వైర్ల వ్యాపారం చేయాలి. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే వినియోగదారులపై డిస్కంలు విధించే వీలింగ్ చార్జీలు.. తమ సొంత వినియోగదారులతో సమానంగా ఉండాలి. వివక్షకు ఆస్కారం ఉండదు. ఫలాన వారికి వైర్లు ఇవ్వబోమని డిస్కంలు చెప్పడానికి వీల్లేదు..’అని ఆర్కే తెలిపారు. క్రాస్ సబ్సిడీ కోసం సెంట్రల్ ఫండ్.. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వే తదితర కేటగిరీల వినియోగదారులపై అధిక విద్యుత్ చార్జీలు విధించి, వ్యవసాయం, గృహ వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్ను డిస్కంలు పంపిణీ చేస్తున్నాయి. దీనిని క్రాస్ సబ్సిడీ అంటారు. విద్యుత్ టారీఫ్లో క్రాస్ సబ్సిడీని కొనసాగించడానికి ‘యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్’పేరుతో ప్రత్యేక ఫండ్ పెట్టనున్నామని ఆర్కే సింగ్ తెలిపారు. అదనంగా వసూలు చేసే మొత్తాన్ని ఈ ఫండ్లో జమా చేసి సబ్సిడీ వినియోగదారులకు ఇస్తామన్నారు. ఈ ఫండ్ కేంద్రం పరిధిలో ఉంటుందని వెల్లడించారు. అదనపు చార్జీలు వచ్చే ప్రాంతంలోని ఆపరేటర్లకు లాభాలు, సబ్సిడీ వినియోగదారులున్న ప్రాంతాల్లోని ఆపరేటర్లకు నష్టాలు రావచ్చు. లాభాల్లో ఉన్న ఆపరేటర్ నుంచి అదనపు చార్జీలను ఈ ఫండ్లో జమ చేసి నష్టాల్లో ఉండే ఆపరేటర్లకు బదిలీ చేస్తామని ఆయన వివరించారు. లాభాలు వచ్చే ప్రాంతాలను ఆపరేటర్లు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉండదని, జిల్లాల వారీగా వారికి కేటాయింపులు చేస్తామని ఆయన తెలిపినట్టు సమాచారం. పీపీఏలన్నీ పంచుకోవాలి.. ‘ప్రస్తుతం డిస్కంలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందా (పీపీఏ) లను తమ వద్దే పెట్టుకోవాలంటే అన్నింటిని పెట్టుకోవాలి. లేకుంటే ప్రైవేటు ఆపరేటర్లతో అన్నింటిని పంచుకోవాలి. అధిక విద్యుత్ ధరలు కలిగిన పీపీఏలను ప్రైవేటు ఆపరేటర్లకు వదులుకుని తక్కువ ధరలు కలిగిన వాటిని తమ వద్దే పెట్టుకుంటామంటే కుదరదు.. డిస్కంలు పీపీఏలను పంచుకోవడానికి ముందుకురాకుంటే ప్రైవేటు ఆపరేటర్లు కొత్త పీపీఏలు చేసుకుంటారు..’అని ఆర్కే సింగ్ వెల్లడించారు. ప్రైవేటు గుత్తాధిపత్యానికి నో చాన్స్.. భవిష్యత్తులో ప్రైవేటు ఆపరేటర్లందరినీ ఓ ప్రైవేటు కంపెనీ కొనేసి ప్రైవేటు గుత్తాధిపత్యానికి తెరతీయడానికి అవకాశం ఇవ్వకుండా విద్యుత్ బిల్లులో ఏమైనా రక్షణ కల్పిస్తారా? అని రాష్ట్రాల అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఎవరు తక్కువ ధరకు విద్యుత్ అమ్మితే వినియోగదారులు వారి వద్ద కొంటారని, ప్రైవేటు గుత్తాధిపత్యానికి అవకాశం ఉండదని కేంద్రమంత్రి స్పష్టం చేసినట్టు తెలిసింది. వినియోగదారులు తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చే కంపెనీకి మారితే వారికి అదే మీటర్ కొనసాగిస్తారా? విద్యుత్ చౌర్యానికి ఎవరు బాధ్యులు? కేసులెవరు పెట్టాలి? మీటర్ రీడింగ్ ఎవరు తీస్తారు? మీటర్లను ఎవరు నిర్వహిస్తారు? అన్న అంశాలపై పరిశీలన చేస్తామని కేంద్రమంత్రి బదులిచ్చినట్టు తెలిసింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (అప్టెల్) ప్రాంతీయ బెంచ్ను దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలు కోరాయి. మరి ఉద్యోగుల పరిస్థితేంటి?: ట్రాన్స్కో, జెన్కో సీఎండీ విద్యుత్ సవరణ బిల్లు–2020ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం చేసిన తీర్మానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు కేంద్రమంత్రికి తెలియజేశారు. తెలంగాణ డిస్కంలలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్నారని, ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతిస్తే వారి గతేంటని ఆయన కేంద్రమంత్రిని ప్రశ్నించారు. ప్రస్తుతం మీటర్ రీడింగ్ నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయడం వరకు అన్ని పనులు ప్రైవేటు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే చేస్తున్నారని కేంద్రమంత్రి బదులిచ్చినట్టు తెలిసింది. ప్రైవేటు ఆపరేటర్లతో విద్యుత్ ఉద్యోగులపై ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రైవేటు ఆపరేటర్లతో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, ప్రస్తుత ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అక్కడికి వెళ్తారని ఆయన చెప్పినట్టు సమాచారం. తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు నిబంధన ఆచరణలో తెలంగాణకు సాధ్యం కాదని, ఈ విషయంలో జరిమానా విధించాలన్న యోచనను వెనక్కి తీసుకోవాలని ప్రభాకర్రావు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ను కోరారు. ఈ విషయంపై పరిశీలన చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
వీకే సింగ్ వీఆర్ఎస్కు టీ సర్కార్ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి వినోయ్కుమార్ సింగ్(వీకే సింగ్) వీఆర్ఎస్కు తెలంగాణ సర్కార్ బ్రేక్ వేసింది. రెండు కేసుల్లో శాఖపరమైన పెండింగ్లో ఉన్న కారణంగా వీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు వీకే సింగ్కు ప్రభుత్వం తెలిపింది. కాగా జూన్ 26న వీకే సింగ్ వీఆర్ఎస్ అభ్యర్థన పెట్టుకున్నారు. అయితే వీకే సింగ్ పెట్టుకున్న వీఆర్ఎస్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు అక్టోబర్ 2న తెలంగాణ సర్కార్ ఆయనకు నోటీస్ పంపించింది. ఈ ఏడాది నవంబర్ 30న వీకే సింగ్ సర్వీసు ముగియనుంది. అయితే తనకు అక్టోబర్ 2న ప్రీ రిటైర్మెంట్ ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు. జైళ్లశాఖ డీజీగా పనిచేసిన ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. (చదవండి : డీజీపీగా పదోన్నతి ఇవ్వకుంటే రాజీనామా) అయితే కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వటం లేదని ప్రభుత్వంపై కినుక వహించారు. తన సేవలకు తగిన గుర్తింపు లేదంటూ వీకే సింగ్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా వీకే సింగ్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలోనే జూన్ 26న వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్ఎస్ పెట్టుకున్న కొద్దిరోజుల్లోనే ఆయనను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. స్టేట్ పోలీస్ అకాడమీ నుంచి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలంటూ వీకే సింగ్కు అప్పట్లో ప్రభుత్వం ఆదేశించింది. కానీ దీనికి ఒప్పుకోని వీకే సింగ్ రాజీనామాకు కూడా సిద్దపడ్డారు. -
కరోనా ఎఫెక్ట్! వీకే సింగ్పై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) డైరెక్టర్, ఏడీజీ వీకేసింగ్పై బదిలీ వేటు పడింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్గా ఉన్న వీవీ శ్రీనివాస్రావుకు టీఎస్పీఏ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. (చదవండి: రాజకీయాల్లో చేరను: వీకే సింగ్) కారణాలివేనా కాగా, తనకు ప్రి మెచ్యూర్ రిటైర్మెంట్ కావాలని ఈనెల 24న కేంద్ర హోం మంత్రికి వీకే సింగ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వటం లేదని ప్రభుత్వంపై కినుక వహించారు. తన సేవలకు తగిన గుర్తింపు లేదంటూ వీకే సింగ్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు పోలీసు అకాడెమీలో 180 మందికి కరోనా సోకినట్టుగా వీకే సింగ్ నేడు ధ్రువీకరించారు. అయితే, ప్రభుత్వ ప్రకటన వెలువడకముందే కేసుల విషయాన్ని బహిర్గతం చేయడం కూడా వీకే సింగ్ బదిలీకి కారణం కావొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పోలీస్ అకాడమీలో మొత్తం 200 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు సమాచారం. (చదవండి: తెలంగాణ పోలీసు అకాడమీలో కరోనా కలకలం) -
రాజకీయాల్లో చేరను: వీకే సింగ్
సాక్షి, హైదరాబాద్: తాను రాజకీయాల్లో చేరడం లేదని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) డైరెక్టర్, ఏడీజీ వీకేసింగ్ అన్నారు. ముందస్తు రాజీనామాను ఆమోదించాలని కేంద్రానికి తాను రాసిన లేఖపై పలు ప్రచారాలు జరుగుతున్న వేళ గురువారం ఆయన మరో లేఖను విడుదల చేశారు. ‘రాజకీయ నేతలు ఏ రాష్ట్రాన్నీ బంగారంగా మార్చలేరు, రాజ్యాంగపరంగా ప్రజలే కీలకమైనా, వారు బలవంతుల చేతుల్లో కీలుబొమ్మలయ్యారు. దీనికి రాజకీయాలను, నేతలను తప్పుబట్టలేం, లోపం ప్రజల్లోనే ఉంది. అందుకే వివేకానంద, మహాత్మాగాంధీ, అన్నాహజారే బాటలో పయనిస్తూ ప్రజల కోసం పాటుపడతా. సుపరిపాలనతో ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందిన దేశాలకంటే మంచి ప్రగతిని సాధిస్తుంది. దీనికి టీఎస్పీఏనే చక్కటి ఉదాహరణ. ముందస్తు రిటైర్మెంట్కు కేంద్రం అనుమతించగానే నా భవిష్యత్ ప్రణాళికలను వెల్లడిస్తా’అని లేఖలో స్పష్టం చేశారు. -
రాజీనామా చేసిన వీకే సింగ్
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి వినోయ్కుమార్ సింగ్ (వీకేసింగ్) తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఆయన బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్గా వీకే సింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. తన రాజీనామాను కేంద్ర హోం శాఖ మంత్రికి పంపించారు. కాగా, కొద్ది రోజుల క్రితమే తన రాజీనామా గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని అర్హతలున్న తనకు డీజీపీగా పదోన్నతి కల్పించాలని, అలాకాని పక్షంలో తాను రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ ప్రభుత్వానికి లేఖ ద్వారా విన్నవించారు. మరోవైపు ఈ ఏడాది నవంబర్ 30న వీకే సింగ్ సర్వీసు ముగియనుంది. అయితే తనకు అక్టోబర్ 2 ప్రీ రిటైర్మెంట్ ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు. జైళ్లశాఖ డీజీగా పనిచేసిన ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
'చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలి'
సాక్షి, ఢిల్లీ : చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని కేంద్ర రోడ్లు, రవాణా సహాయశాఖ మంత్రి, మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ విజయ్కుమార్ సింగ్ పేర్కొన్నారు. చైనాతో యుద్దం అనేది చివరి అస్త్రంగా వాడాలని, మొదట చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని దానికి చాలా దారులు ఉన్నాయని తెలిపారు. హిందుస్తాన్ టైమ్స్ ఇంటర్య్వూలో పాల్గొన్న వీకే సింగ్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నారు. (పక్కా ప్రణాళితోనే భారత సైన్యంపై దాడి) మాజీ ఆర్మీ చీఫ్గా మీ గ్రౌండ్ రిపోర్టు ఏమిటి ? ప్రస్తుతం అక్కడ పరిస్థితి భారత బలగాల నియంత్రణలోనే ఉంది. ఘర్షణ జరిగిన గల్వాన్ లోయ పిపి 14 పాయింట్ వద్ద చైనా సైనికుల నుంచి ఎలాంటి ఆక్రమణలు, చొరబాట్లు లేవు. పిపి 15 పాయింట్ నుంచి చైనా ప్రతీ ఏడాది అక్రమంగా రావాలనుకున్న ప్రతీసారి భారత బలగాలు వారిని అడ్డుకుంటూనే ఉంటాయి. గల్వాన్ లోయ తమదేనని చైనా అంటుంది.. దీనిపై మీ స్పందన ? అదంతా తప్పుడు ప్రచారం. గల్వాన్ లోయ చైనా ఎల్ఏసీలో లేదు. వారు మన భూభాగంలో లేరు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) అనేది 1959లో ఇచ్చిన మ్యాప్ నుంచి ఒక వివరణగా మాత్రమే ఉంది. మొదటినుంచి ఈ అంశంపై చైనీయులు ఏదో విధంగా తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. కానీ ఇరు దేశాలు తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని రక్షించుకోవడానికే ఎప్పుడు ప్రాధాన్యతనిస్తాయి. ఘర్షణలో చైనా సైనికులు ఎంతమంది చనిపోయారనే దానిపై ఆ దేశం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? 1962లో భారత్- చైనా మధ్య జరిగిన యుద్ధంలో కూడా ఎంతమంది మరణించారనేది వెల్లడించలేదు. మనకు తెలిసినంత వరకు ఇరు దేశాల నుంచి దాదాపు 2వేల మంది సైనికులు తమ ప్రాణాలు కోల్పోయారు. కానీ అప్పుడు కూడా చైనా అసలు లెక్క వివరించకుండా కేవలం 200 మందే ప్రాణాలు కోల్పోయారని వాదించింది. ఇప్పుడు కూడా మన ప్రభుత్వ లెక్కల ప్రకారం 43 మంది చైనా సైనికులు హతమయ్యారని పేర్కొన్నారు. ఆ సంఖ్య ప్రకటించాలా వద్దా అనేది చైనా నిర్ణయించుకోవాలి. అసలు ఆరోజు ఘర్షణలో దాదాపు 600 మంది ఉండి ఉంటారని అనిపిస్తుంది. ఒకరినొకరు తోసుకోవడం, రాడ్లతో కొట్టకోవడం వంటివి చేశారు. ఏదైతేనేం ఇరు దేశాల సైనికులకు నష్టం జరిగింది. (గల్వాన్ ఘటన: ఏం జరుగుతుందో చూడాలి!) అఖిల పక్ష సమావేశం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని అభివర్ణించారు. దీనిపై మీ సమాధానం? దీనిపై నేను నేను స్పందించలేను. ఎందుకంటే ఇంటెలిజెన్స్ విభాగం రా(రిసెర్చ్ అనాలిసిస్ వింగ్) ఆధ్వర్యంలో నడుస్తుంది. కానీ ఇంటలిజెన్స్ వైఫల్యం మాత్రం కాదని కచ్చితంగా చెప్పగలను . ఎందుకంటే వారు ఎల్వోసీ, ఎల్ఏసీ వద్ద జరిగే ఘర్షణల్లో తలెత్తకుండా నిషేదించబడ్డాయి. ఈ నిర్ణయం వారి ప్రభుత్వ హయాంలోనే(2012)లో జరిగిందని సోనియా గాంధీ తెలుసుకుంటే మంచింది. -
డీజీపీగా పదోన్నతి ఇవ్వకుంటే రాజీనామా
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి వినోయ్కుమార్ సింగ్ (వీకేసింగ్) మరోసారి వార్తల్లో నిలిచారు. అన్ని అర్హతలున్న తనకు డీజీపీగా పదోన్నతి కల్పించాలని, అలాకాని పక్షంలో తాను రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ ప్రభుత్వానికి లేఖ ద్వారా విన్నవించారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)కు డైరెక్టర్గా ఉన్న వీకే సింగ్ (ఏడీజీ) ఈనెల 21న ప్రభుత్వ సీఎస్కు లేఖ రాశారు. ఓ కాపీని సీఎం కేసీఆర్కు కూడా పంపిన ఆ లేఖలో ..1987 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన తనకు 33 ఏళ్లు సేవలందించిన అనుభవం ఉందని, తాను ఇప్పటికే డీజీపీ పోస్టు కోసం ఎంప్యానెల్ అయ్యానని, నిబంధనల ప్రకారం ఆ పదవికి తాను అన్ని విధాలా అర్హతలు కలిగి ఉన్నానని తెలిపారు. -
డంపింగ్ యార్డుల్లా పోలీస్ శిక్షణ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు శిక్షణ కేవలం తంతులా మారిందని, దేశం, రాష్ట్రాల్లోని వివిధ పోలీసు శిక్షణ కేంద్రాలు డంపింగ్ యార్డుల్లా మారాయని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) డైరెక్టర్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆర్బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమీలో మాట్లాడుతూ.. ‘పోలీసు శిక్షణ ఒక తంతులా మారింది. దేశంలోని పోలీసు ట్రైనింగ్ అకాడమీలు డంపింగ్ యార్డుల్లా మారాయి. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్వీఎన్పీఏ) నుంచి శిక్షణ పూర్తి చేసుకుని బయటికి వస్తున్న ఐపీఎస్లలో కూడా అంకితభావం కొరవడటం బాధాకరం. ప్రస్తుత శిక్షణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడట్లేదు. క్షేత్రస్థాయిలో ప్రజలకు పనికొచ్చేలా పోలీసు శిక్షణను సంస్కరించాలి. దేశంలో బ్రిటిష్ కాలం నాటి పోలీసు విధానాల్లో మార్పులు రావాలి. డబ్బులు, పరపతి ఉన్న వారితో పోలీసులు స్నేహంగా మెదులుతున్నారు. విధి నిర్వహణలో నిత్యం వందలాది మంది ప్రాణాలర్పిస్తున్నా.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకభావం కారణంగా పోలీసులపై సదభిప్రాయం కలగట్లేదు. ఈ విషయంలో మార్పురావాలి. అందుకే పోలీసు శిక్షణలో సమూల సంస్కరణలు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ప్రజలకు అనుకూలంగా లేదు. జైలులో ఉంటున్న ఖైదీల్లో 90 శాతం పేదవారే, 70 శాతం శరణార్థులు ఉన్నారు. వారు ఎందుకు అరెస్టయి జైల్లో ఉన్నారో తెలుసుకోలేని దుర్భర స్థితిలో ఉన్నారు. శిక్షణలో ఒకలా.. విధుల్లో మరోలా.. ‘శిక్షణలో పోలీసులు నేర్చుకున్న దానికి, విధుల్లో చేరాక చేస్తున్న దానికి సంబంధం ఉండట్లేదు. ప్రజల బాధలు తెలిసేలా.. శిక్షణ సమయంలోనే అనాథ, వృద్ధ, షెల్టర్హోమ్లు సందర్శించేలా చూస్తున్నాం. ఇంటెలిజెన్స్, ఏసీబీ ఇతర శాఖల అధికారులతో తరగతులు నిర్వహిస్తాం. అంకితభావంతో పనిచేసే పోలీసులను తయారు చేయడం మా సంకల్పం. అందుకే ప్రతి పోలీసు అ«ధికారికి శిక్షణ కాలం నుంచే అబ్జర్వేషన్ రిపోర్ట్ ప్రవేశపెట్టనున్నాం. భవిష్యత్తులో పోస్టింగులు, బదిలీల్లో ఇదే ప్రామాణికం కానుంది. దీనికి డీజీపీ కూడా సుముఖత వ్యక్తం చేశారు. పోలీసులు చట్టానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. సమాజంలో పోలీసు కావాలంటే దేహదారుఢ్యమే ముఖ్యం కాదు.. శారీరక లోపాలున్నా నిజాయతీగా పనిచేయొచ్చు. ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలంగాణ అవినీతిలో ముందు ఉండటం బాధాకరం. పోలీసులు సమర్థంగా పనిచేస్తే ఇలాంటివి జరగవు. నేషనల్ పోలీస్ అకాడమీనే కాదు.. దేశంలో ఎవరూ చేయలేని నూతన సంస్కరణలను టీఎస్పీఏలో తీసుకొస్తాం. చట్టాలు, ఆయుధ, శారీరక, ఆత్మరక్షణ శిక్షణే కాదు.. ప్రజలకు సేవలు చేసేందుకు దోహదపడేలా ప్రయోగశాలగా మారుస్తాం. వ్యవస్థను మార్చలేను.. కానీ శిక్షణ విధానాన్ని మార్చగలను. ఈ నెల 24 నుంచి ఎస్సైలకు శిక్షణ ప్రారంభమవుతుంది’అని వీకే సింగ్ వివరించారు. -
పోలీస్ అకాడమీ డైరెక్టర్ హాట్ కామెంట్స్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీ వల్ల ఎలాంటి లాభం లేదని, దీని కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న డబ్బు వృథా అవుతోందని ఆయన గురువారం పేర్కొన్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని ఆయన పేర్కొన్నారు. పోలీసులు ప్రవర్తన సరిగ్గా లేదని ఆయన తప్పుబట్టారు. జైల్లో ఉన్నవారు 90 శాతంమంది పేదవారేనని, తినడానికి తిండి కూడా లేనివారే జైళ్లలో మగ్గుతున్నారని ఆయన పేర్కొన్నారు. మరికొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్కు వచ్చామో కూడా తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పోలీసు అకాడమీలో ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే డంపింగ్ యార్డ్లుగా పోలీస్ అకాడమీలు నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న ఐపీఎస్లు సైతం ప్రజల్లో పోలీసులుపై ఉన్న అభిప్రాయాన్ని మార్చలేకపోతున్నారు. దేశంలోని పోలీస్ అకాడమీలన్నీ డంపింగ్ యార్డ్లుగా మారాయి. ఈ అకాడమీలో పోలీసులు తీసుకుంటున్న శిక్షణ వల్ల సమజానికి ఎలాంటి ఉపయోగం లేదు. జైలుకు వచ్చే నేరస్తులు తోటి ఖైదీలను చూసి నేరాల్లో చేయడంలో కొత్త టెక్నీక్ నేర్చుకొంటున్నారు. కానీ పోలీసులు మాత్రం వాస్తవానికి అనుగుణంగా ఉండలేకపోతున్నారు. బ్రిటీష్ కాలం నాటి ఆనవాయితే నేటికీ.. పోలీసులు సామాజిక కార్యకర్తలగా వ్యవహరించాలి. డబ్బు, అధికారం ఉన్న వాళ్ళతోటే పోలీసులు స్నేహంగా ఉంటున్నారు. బ్రిటీష్ కాలం నాటి ఆనవాయితే ఇప్పటికీ కొనసాగుతోంది. పోలీసులు ప్రభుత్వానికి జవాబుదారీ కాదు.. చట్టానికి, న్యాయానికి మాత్రమే జవాబుదారీ. అకాడమీలో ఇస్తున్న శిక్షణ గ్రౌండ్ లెవల్కు లింకై ఉండాలి. పోలీస్ శిక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. కానీ దానివల్ల ఎలాంటి లాభం లేదు. పోలీస్ శిక్షణ కేంద్రాలు కాలేజ్లు, స్కూళ్లు కావు. ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తించాలనేది శిక్షణలో నేర్పించాలి. పోలీసులు చెప్పిన మాట ప్రజలు వింటున్నారు. అయినా, ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు. దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టం ప్రజలకు విరుద్ధంగా ఉంది. దేశంలో ఎంతమంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రజల నుంచి ప్రశంసలు లభించడం లేదు. అది నన్ను తీవ్రంగా బాధించింది ఎస్పీ నుండి ఎస్హెచ్వో వరకు గ్రౌండ్ లెవల్లో వారి పనితీరు ఆధారంగా అబ్జర్వేషన్ రిపోర్ట్ను డీజీకి అందజేస్తున్నాం. ఆ రిపోర్ట్ ఆధారంగానే ప్రమోషన్లు ఉండాలి. దీనిపై డీజీపీ కూడా హామీ ఇచ్చారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బాధ్యతలు తీసుకున్న తరువాత నూతన మార్పులు తీసుకొస్తున్నాను. వ్యక్తిత్వ వికాసం, కౌన్సెలింగ్ కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. ఈ నెల 24న ప్రారంభమయ్యే కొత్త బ్యాచ్కి నూతన పద్ధతులను అమలు చేస్తాం. పోలీస్ ఆఫీసర్ కావాలంటే.. దేహ దారుఢ్యం అవసరం లేదు. దివ్యాంగులు కూడా పోలీస్ ఆఫీసర్ కావొచ్చు. పోలీస్ ఆఫీసర్కి వ్యక్తిత్వం ఉండాలి, బాధితులు పట్ల సానుభూతి ఉండాలి. అవినీతిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందన్న ఓ సర్వే నన్ను తీవ్రంగా బాధించింది. వ్యవస్థను మార్చలేను కానీ, శిక్షణలో మార్పులు తీసుకొస్తా. గతంలోనూ సంచలన వ్యాఖ్యలు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా ఉన్న వీకే సింగ్ను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసి.. పోలీస్ అకాడమీ డైరెక్టర్గా నియమించిన సంగతి తెలిసిందే. ప్రిటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఉన్న సమయంలోనూ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదని, తెలంగాణ కోసం ఓ మిషన్ను ఏర్పాటు చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. తాను తీసుకొచ్చే మిషన్ పాలసీలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తెలిపిన ఆయన.. ప్రజలకి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. జైళ్ల శాఖలో విధులు నిర్వర్తించిన సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం తనను స్టేషనరీ డిపార్ట్మెంట్కు బదిలీ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో చేయడానికి పని లేదని.. దీనిని మూసివేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. ఈ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ. 50 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ఇక్కడ పనిచేసే వాళ్లు ఉన్నా.. వారికి రోజుకు 2 గంటలు మాత్రమే పని ఉంటుందన్నారు -
పోలీస్ అకాడమీ డైరెక్టర్గా వీకే సింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపీఎస్లను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా ఉన్న వీకే సింగ్ను పోలీస్ అకాడమీ డైరెక్టర్గా నియమించారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఉన్న సంతోష్ మెహ్రాను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సంజయ్ కుమార్ను ఫైర్ సర్వీస్ డీజీగా నియమించగా, ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్న గోపీకృష్ణను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా బదిలీ చేశారు. -
తెలంగాణలో నలుగురు ఐపీఎస్లు బదిలీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్గా సంతోష్ మెహ్రాను బదిలీ చేయగా, ఆయన స్థానంలో వీకే సింగ్ నియామకం అయ్యారు. ఫైర్ సేఫ్టీ డీజీ గోపీకృష్ణ స్థానంలో సంజయ్ కుమార్ జైన్ను నియమించింది. అలాగే గోపీకృష్ణ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగాన్ని మూసేయాలి..
సాక్షి, హైదరాబాద్ : ప్రిటింగ్ అండ్ స్టేషనరీ డీజీ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఓ మిషన్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. తాను తీసుకొచ్చే మిషన్ పాలసీలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తెలిపియన ఆయన.. ప్రజలకి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. జైళ్ల శాఖలో విధులు నిర్వర్తించిన సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం తనను స్టేషనరీ డిపార్ట్మెంట్కు బదిలీ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో చేయడానికి పని లేదని.. దీనిని మూసివేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. ఈ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ. 50 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ఇక్కడ పనిచేసే వాళ్లు ఉన్నా.. వారికి రోజుకు 2 గంటలు మాత్రమే పని ఉంటుందన్నారు. జైళ్ల శాఖలో పనిచేసిన కాలంలో ఆనంద ఆశ్రయం ఏర్పాటు చేసి 15 వేల మంది బిచ్చగాళ్లకు ఆశ్రయం కల్పించినట్టు చెప్పారు. సర్వీస్లో బదిలీలు సాధారణం అని అన్నారు. సరైన పోస్టింగ్ ఇవ్వకపోవడంతో తాను రాజకీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సరైన పోస్టింగ్ ఇవ్వకపోతే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని.. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చిన ప్రజలకు సేవ చేస్తానని వెల్లడించారు. జైళ్ల శాఖలో అవినీతి చేయడంతోనే తనను బదిలీ చేశారనే ప్రచారం అవాస్తవం అని తెలిపారు. కావాలంటే తనపై విచారణ చేపట్టవచ్చన్నారు. ఇప్పుడు తాను రాజీనామా చేస్తే అనేక ఆరోపణలు వస్తాయని పేర్కొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ శాఖలో నార్త్ ఆఫీసర్స్కు ప్రాముఖ్యత లేదనిది వాస్తవం కాదని.. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా తాను ఖండిస్తున్నట్టు తెలిపారు. కాగా, చాలా కాలంగా జైళ్ల శాఖలో పనిచేస్తున్న వీకే సింగ్ను ప్రభుత్వం ఇటీవల బదిలీ చేయడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. -
నిర్మాణ రంగంలోకి జైళ్ల శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జైళ్లశాఖ వినూత్న కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే పలు సంస్కరణలు ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధిస్తోన్న జైళ్లశాఖ.. ఖైదీల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో సఫలీకృతమైంది. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 17 జైళ్లు మూసివేసింది. 2014లో 80 వేల మంది ఖైదీలు ఉండగా 2018కి 55 వేలకు తగ్గడమే ఇందుకు కారణం. ఇపుడు వాటిని యాచకులు, వృద్ధులకు పునరావాస కేంద్రాలుగా మార్చి పలువురి చేత శభాష్ అనిపించుకుంది. 1.25 లక్షలమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దింది. మరో సంచలనం దిశగా ఆ శాఖ త్వరలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. నిపుణులైన ఖైదీలు, నిష్ణాతులైన జైలు ఉద్యోగులు, మాజీ ఉద్యోగులతో రాష్ట్రంలో రెండు చోట్ల హౌసింగ్ సొసైటీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వరంగల్, హైదరాబాద్లో ఏర్పాటు రాష్ట్రంలో 2 చోట్ల ఈ హౌసింగ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ప్రతిపాదించారు. మొదటిది వరంగల్లో, రెండోది హైదరాబాద్ శివారులో. ఒక్కో హౌసింగ్ సొసైటీకి దాదాపు 20 ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనా వేశారు. దీనికి ఇప్పటికే వరంగల్, హైదరాబాద్లోని శంషాబాద్, శ్రీశైలం రోడ్డులో స్థలాలను పరిశీలించారు. అనువైన స్థలం దొరకగానే ఆ భూముల్లో హౌసింగ్ సొసైటీలను నిర్మించనున్నారు. ఇప్పటికే పలువురు ఖైదీలు నిర్మాణరంగం, ఎలక్ట్రిసిటీ, కార్పెంటరీ, పెయింటింగ్, ప్లంబింగ్ పను ల్లో నైపుణ్యం సాధించారు. వీరి నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుంటే ఖైదీలకు అనుభవం, మానవ వనరుల వినియోగం 2 విధాలా మంచి ఫలితాలు సాధించాలన్నది యోచన. ఇందుకోసం జైలు ఉన్నతాధికారులు, కొందరు విశ్రాంత ఉద్యోగులతో కలసి ఈ సొసైటీల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏం చేస్తారు: పలు భారీ రియల్ ఎస్టేట్ సంస్థలతో ఒప్పందం లేదా ప్రభుత్వ ఆర్డర్ల ప్రకారం.. భారీ నిర్మాణాలను చేపట్టడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణను చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం జైళ్లశాఖ ఓ నివేదిక రూపొందిస్తోంది. అది పూర్తయి, అనుమతి వస్తే, నిర్మాణ రంగంలోకి జైళ్లశాఖ రాక ఇక లాంఛనమే కానుంది. ఖైదీల్లో సత్ప్రవర్తన కోసమే రాష్ట్ర జైళ్లను ఖైదీల రహిత జైళ్లుగా మార్చాలన్న ఉద్దేశంతో చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తుండటం శుభపరిణామం. ఇపుడు మేం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నాం. ఇప్పటికే జైళ్లలో ఖైదీలకు నిర్మాణం, కార్పెంటరీ, ఎలక్ట్రిక్ పనుల్లో శిక్షణ ఇస్తున్నాం. నేరస్తులను నిపుణులైన ఉద్యోగులుగా మలిచి బయటికి పంపడమే లక్ష్యంగా వీటిని చేపడుతున్నాం. కొత్త ఉపాధి కలిపిస్తే వారి జీవితాల్లో తప్పకుండా పరివర్తన ఉంటుంది. – వీకే సింగ్ డీజీ, జైళ్ల శాఖ -
రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి జైళ్ల శాఖ
హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్లు ఆ శాఖ డీజీ వినయ్కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం చంచల్గూడలోని జైళ్ల శాఖ శిక్షణా సంస్థ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, పెట్రోల్ బంకుల ద్వారా 2020 నాటికి రూ.100 కోట్ల ఆదాయం, 2025 నాటికి రూ.200 కోట్ల ఆదాయం గడించడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్లు నిర్మిస్తున్న విధంగానే, జైళ్ల శాఖ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి సరసమైన ధరలకే గేటెడ్ కమ్యూనిటీ తరహాలో మధ్య తరగతికి ఇళ్లు కట్టి ఇస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల విడుదలైన ఖైదీలకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందని చెప్పారు. జైళ్ల శాఖ ఏ వ్యాపారం చేపట్టినా విజయవంతమైందని, ఈ ప్రాజెక్టు కూడా విజయం సాధిస్తుందన్నారు. మరో 3 నెలల వ్యవధిలో 20 నూతన పెట్రోల్ బంకులను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ప్రైవేటు భూముల యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల నిర్వహణ పెద్ద సమస్యగా మారిందని, వాటి నిర్వహణను ప్రభుత్వం జైళ్ల శాఖకు అప్పగిస్తే బాగుంటుందని అన్నారు. మరో 6 నెలల్లో 400 మంది విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నేరాల అదుపు వల్ల 49 జైళ్లలో 17 మూసివేశామన్నారు. ఆ జైళ్లలో ఆశ్రమాలను నెలకొల్పేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. హౌసింగ్ సొసైటీ ద్వారా వరంగల్, హైదరాబాద్ జైళ్ల సిబ్బందికి సొంత ఇళ్లు అందించనున్నట్లు తెలిపారు. -
ప్రధాని మోదీ విదేశీయానం ఖర్చు 2 వేల కోట్లు
న్యూఢిల్లీ: 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీయా నానికి రూ.2,021 కోట్లు ఖర్చయినట్లు ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ శుక్రవారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. ఇప్పటి వరకు 48 విదేశీ పర్యటనల్లో 55 దేశాలను ప్రధాని సందర్శించారని వివరించారు. ప్రధాని పర్యటనల కారణంగా భారత్కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) గణనీయంగా పెరిగాయని తెలిపారు. 2014–18 సంవత్సరాల మధ్య ప్రధాని మోదీ పర్యటించిన దేశాల్లో ఎఫ్డీఐలు అత్యధికంగా వచ్చే మొదటి పది దేశాలు కూడా ఉన్నాయన్నారు. 2014లో 30,930.5 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎఫ్డీఐలు పర్యటనల ఫలితంగా 2017 నాటికి 43,478.27 మిలియన్ డాలర్లకు చేరాయని తెలిపారు. యూపీఏ–2 హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనల ఖర్చు 2009–14 సంవత్సరాల మధ్య రూ.1,346 కోట్లని వీకే సింగ్ పేర్కొన్నారు. -
అన్ని పార్లమెంటు స్థానాల్లోనూ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు
న్యూయార్క్: దేశంలోని మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. న్యూయార్క్లోని భారత కాన్సులేట్లో ఆయన ‘పాస్పోర్ట్ సేవా’ కార్యక్రమాన్ని ప్రారంభించాక మాట్లాడారు. పౌరులకు పాస్పోర్టు సేవలను సులభతరం చేసే లక్ష్యంతో వచ్చే మార్చి కల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. దీని వల్ల ప్రతి ఒక్కరికీ 50–60 కిలోమీటర్ల దూరంలోనే పాస్పోర్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 365 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయన్నారు. వచ్చే నాలుగు నెలల్లో తమ మంత్రిత్వ శాఖ వివిధ దేశాల్లో ఉన్న భారత పౌరుల కోసం అక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలోనూ పాస్పోర్ట్ సేవా పథకాన్ని ప్రారంభించనుందని తెలిపారు. విదేశాల్లో భారతీయులు పాస్పోర్టు రెన్యువల్ చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. -
‘ఆర్మీ చేతిలో ఆయన కీలుబొమ్మ’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఇమ్రాన్ ఖాన్పై భారత విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ పలు ఆరోపణలు చేశారు. పాక్ సైన్యం చేతిలో ఆయన కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని వీకే వ్యాఖ్యానించారు. ఇప్పటికీ కూడా పాక్ విషయంలో ఎలాంటి మార్పు రాలేదని.. ఇంతకు ముందు పాక్ను పాలించిన వారి అడుగు జాడల్లోనే ఇమ్రాన్ కూడా నడుస్తున్నాడని ఆయన అభిప్రాయడ్డారు. ఢిల్లీలో ఫిక్కీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహంచిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై చర్చించారు. ఇమ్రాన్ ఖాన్ సైన్యం చేతిలో కీలుబొమ్మలా వ్యవరించడం వల్లే పాక్ సరిహద్దుల్లో పరిస్థితులు మునుపటిలానే ఉన్నాయని పేర్కొన్నారు. సైన్యాన్ని ఆసరాగా తీసుకుని ఆయన పాలన చేస్తున్నారని.. పాక్ విషయంలో భారత్ స్పష్టమైన వైఖరిని కలిగి ఉందన్నారు. పంజాబ్లో గల వివాదాస్పద కర్తార్పూర్ రహదారిని తిరిగి ప్రారంభించాల్సిందిగా పాక్ నుంచి ప్రతిపాదన వచ్చిందన్న వార్తలను సింగ్ తోసిపుచ్చారు. పాక్ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెల్చిచెప్పారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తే సిక్కుల గురువైన గురు నాయక్ 550వ జయంతి ఉత్సవాలు సందర్భంగా ఆ కారిడార్ను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. కాగా గురు నాయక్ 550వ జయంతి ఉత్సవాలను 2019లో నిర్వహించనున్నారు. -
ట్రంప్-కిమ్ పంచాయితీ..భారత్ పెద్దరికం
ప్యోంగ్యాంగ్: అగ్రరాజ్యం అమెరికా, తూర్పుఆసియా దేశం ఉత్తరకొరియాల మధ్య పంచాయితీ తీర్చడానికి భారత్ పెద్దరికం వహించనుంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఈమేరకు బుధవారం ప్యోంగ్యాంగ్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ చరిత్రాత్మక భేటీపై నీలినీడలు కమ్ముకున్నవేళ భారత మంత్రి పర్యటన అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సింగ్ ఎందుకు వెళ్ళారు?: అణ్వస్త్రాల నిరాయుధీకరణకు సిద్ధమని కొద్దిరోజుల కిందటే ప్రకటించిన కిమ్.. వైరిపక్షాలతో చర్చలకు సిద్ధమని కొద్దిరోజుల కిందటే ప్రకటించడం, జూన్ 12న సింగపూర్లో ట్రంప్-కిమ్ భేటీకి రంగం సిద్ధం కావడం తెలిసిందే. అంతలోనే అనూహ్యంగా ప్లేటు ఫిరాయించిన కిమ్.. సదరు చర్చలు ఏకపక్షంగా, కొరియాకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని ఆరోపిస్తూ ప్రక్రియను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి కీలక దశలో చర్చల ప్రక్రియను నిలిపేయడం సరికాదని నచ్చజెప్పేందుకే భారత్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో ఉత్తరకొరియాపై ఆంక్షల విధింపు తీర్మానంపై భారత్ సైతం సంతకం చేసినప్పటికీ.. మిగతాదేశాల మాదిరి దౌత్యసంబంధాలను మాత్రం తెంచుకోలేదు. ప్యోంగ్యాంగ్లో ఇప్పటికీ భారత దౌత్యకార్యాలయం కొనసాగుతున్నది. 2015లో ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించారు కూడా. ఉత్తరకొరియాతో సుహృద్భావ సంబంధాల నేపథ్యంలోనే భారత్.. ‘ట్రంప్-కిమ్ల చర్చ’ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కిమ్తో మాట్లాడుతారా?: ప్యోంగ్యాంగ్కు వచ్చిన భారత మంత్రికి ఉత్తరకొరియా మంత్రులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ట్రంప్-కిమ్ల భేటీకి మార్గం సుగమమం చేయాలన్న లక్ష్యంతోనే ఆయన కొరియా ప్రతినిధులతో చర్చలు జరుపనున్నారు. అయితే, అధినేత కిమ్ జాంగ్తో వీకే సింగ్ మాట్లాడుతారా, లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
దేశ ప్రగతిలో దక్కన్ పాత్ర కీలకం
హైదరాబాద్: ఉత్పాదక రంగ బలోపేతానికి ఆర్థిక దౌత్యం దోహదం చేస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ అన్నారు. ఆదివారం ఇక్కడి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, ఐఎస్బీ సంయుక్తంగా ‘డెక్కన్ డైలాగ్’ పేరిట నిర్వహించిన మొదటి సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆర్థిక దౌత్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల ద్వారా ప్రపంచంలో భారత దేశం ప్రత్యేక స్థానం పొందిందన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయులు మనదేశ ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థికంగా రాష్ట్రాలు బలోపేతం కావడానికి, రాష్ట్రాలకు పెట్టుబడులు సమకూరడానికి మరింత తోడ్పాటు అందిస్తామన్నారు. దేశప్రగతిలో దక్కన్ ప్రాంతం పాత్ర కీలకంగా మారిందన్నారు. పెట్టుబడులకు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ స్వర్గధామంగా మారిందని రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా సులభతర వాణిజ్య విధానాల అమలు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ముందున్నదని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో ఉపాధి కల్పన పెద్ద సవాలుగా మారిందని, దానికి కొత్త పరిశ్రమల ఏర్పాటే పరిష్కారమన్నారు. భారతదేశం విభిన్న సంస్కృతులు, వేషభాషలకు నిలయమని, ప్రతి 200 కిలోమీటర్ల దూరానికి అనేక మార్పులు కలిపిస్తాయన్నారు. కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి వినోద్ కే జాకబ్, యూఎన్వో మాజీ శాశ్వత ప్రతినిధి టీపీ శ్రీనివాసన్, కెనడా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ దావుబేనీ, టర్కీ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ అద్నాన్ అల్టే ఆల్టినోర్స్, యూఎస్ కాన్సల్ జనరల్ కేథరిన్ బి హడ్డా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వీకే యాదవ్, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
డైమండ్ కింగ్ నీరవ్ మోదీ అక్కడే ఉన్నాడా?
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకుని భారీ కుంభకోణంలో ముంచెత్తిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. తొలుత అతను స్విట్జర్లాండ్కు పారిపోయినట్టు వార్తలు రాగ, తర్వాత న్యూయార్క్లో ఉన్నట్టు రిపోర్టు పేర్కొన్నాయి. అతను ఎక్కడ ఉన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతం అతను హాంకాంగ్లో ఉన్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ పార్లమెంట్కు తెలిపింది. పీఎన్బీ కుంభకోణ కేసులో భాగంగా నీరవ్ మోదీని ప్రొవిజనల్ అరెస్ట్(తాత్కాలిక నిర్భందం) చేయాలని హాంకాంగ్ అథారిటీలను కోరినట్టు ప్రభుత్వం గురువారం పేర్కొంది. ‘హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్ను, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను నీరవ్ దీపక్ మోదీని అరెస్ట్ చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. 2018 మార్చి 23నే ఈ అభ్యర్థనను సమర్పించాం’ అని మంత్రిత్వ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. ఇప్పటికే మంత్రిత్వ శాఖ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిల పాస్పోర్టులను రద్దు చేసినట్టు కూడా సింగ్ చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్ల రూపాయలను ముంచెత్తిన క్రమంలో రెండు నెలల క్రితం నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్తో, వీరి పాస్పోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మోసం వెలుగులోకి రాకముందే వీరు దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు వీరిని వెనక్కి రప్పించాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. -
ఆ 38 మృతదేహాలను భారత్కు..
అమృత్సర్: పొట్టకూటికోసం ఇరాక్ వెళ్లి, అంతర్యుద్ధం సమయంలో ఐసిస్ చేతిలో కిరాతకంగా హతమైన 38 మంది భారతీయు మృతదేహాలు సోమవారం స్వదేశానికి చేరుకున్నాయి. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఆర్మీ విమానంలో బాగ్ధాద్ నుంచి అమృత్సర్(పంజాబ్)కు తరలించారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సూచనమేరకు సహాయ మంత్రి వీకే సింగ్ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకుగానూ సింగ్ ఆదివారం ఆర్మీకి చెందిన విమానంలో బాగ్ధాద్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అత్యధికులు పంజాబీలే: ఇరాక్లో చనిపోయిన 39 మందిలో ఒక మృతదేహానికి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సిన ఉండగా, మిగిలిన 38 మంది మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. వీరిలో అత్యధికులు పంజాబీలే కావడం గమనార్హం. సోమవారం తీసుకొచ్చిన 38 మృతదేహాల్లో 27 దేహాలను పంజాబ్లోనే దించేశారు. అక్కడి నుంచి ఆయా మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. మిగిలిన మృతదేహాలను పట్నాకు తరలించారు. బాగ్ధాద్లోని భారత రాయయార కార్యాలయం మృతదేహాల తరలింపులో కీలక పాత్ర పోషించింది. కాగా, ఆ 39 మందిని చంపేశారు మంత్రి ఆగ్రహం: 38 మృతదేహాలతోపాటు అదే విమానంలో తిరిగొచ్చిన మంత్రి వీకే సింగ్ను అమృత్సర్ ఎయిర్పోర్టు నుంచి పంజాబ్ రాష్ట్ర మంత్రులు నవజ్యోత్ సింగ్ సిద్దూ, ఇంకొందరు తోడ్కొని వెళ్లారు. అనంతరం వీకే సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తారా?’ అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది ఫుట్బాల్ ఆడినట్లో లేదా బిస్కెట్లు తయారుచేసినంత సులువైన పనికాదు. ఇప్పటికిప్పుడు పరిహారంపై నన్నడిగితే ఏం చెప్పాలి? కేంద్రం, రాష్ట్రాలు ఉమ్మడిగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అప్పటిదాకా నేనేమీ చెప్పలేను’’ అని విసుక్కున్నారు. బాగ్ధాద్ విమానాశ్రంలో దృశ్యాలు.. -
38 మంది భారతీయుల మృతదేహాల తరలింపు
-
కాంగ్రెస్ ట్వీట్.. సెల్ఫ్ గోల్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్లో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్పై చేసిన పోస్ట్ వారికి సెల్ఫ్ గోల్ అయింది. ఇరాక్లో 39 మంది భారతీయులు మరణించడం.. విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ వైఫల్యంగా మీరు భావిస్తున్నారా? అంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన నెటిజన్లు.. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2900 మంది యూజర్లు ఈ ట్వీట్ను లైక్ చేయగా 3200 మంది రీట్వీట్ చేశారు. మొత్తంగా 33, 879 మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. 24 శాతం మంది సుష్మా వైఫల్యం చెందారని ఏకీభవించగా... 76 శాతం మంది సుష్మాకు అనుకూలంగా ఓటేసి కాంగ్రెస్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. 2014లో ఇరాక్లోని రెండో అతిపెద్ద నగరం మోసుల్లో పంజాబ్కు చెందిన 39 మంది భారతీయ కూలీలు కిడ్నాప్కు గురయ్యారు. ఇంతకాలం వారంతా క్షేమంగా ఉన్నారంటూ చెప్పిన విదేశాంగ శాఖ.. వారు ప్రాణాలతో లేరంటూ గత వారం పార్లమెంట్లో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ అంశపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఆందోళన చేసింది. అయితే ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ వారికి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఇరాక్లో ఐసిస్ ఉగ్రవాదుల చేతుల్లో హతమైన 39 మంది భారతీయుల మృతదేహాలను వారం రోజుల్లో భారత్కు తీసుకురానున్నట్లు సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. ఇందుకోసం విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్వయంగా ఇరాక్ వెళ్లి లాంఛనాలన్నీ పూర్తి చేస్తారని తెలిపారు. -
ఖైదీలకు క్షమాభిక్ష @356
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని నాలుగు గోడల మధ్య నుంచి ఎదురుచూస్తున్న ఖైదీల క్షమాభిక్ష అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. సత్ప్రవర్తన కింద ఐదేళ్ల జైలు, రెండేళ్ల రిమిషన్ పూర్తిచేసుకున్న ఖైదీలను క్షమాభిక్షపై విడుదలకు శుక్రవారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది నేతృత్వంలో సుదీర్ఘ భేటీ జరిగింది. భేటీలో జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్, ఐజీ నర్సింహా, న్యాయశాఖ కార్యదర్శి తదితరులు ఖైదీల విడుదల మార్గదర్శకాలపై తుది కసరత్తు చేసినట్లు తెలిసింది. అనంతరం మార్గదర్శకాలను సీఎస్ ఎస్పీ సింగ్కు పంపించినట్లు సమాచారం. మార్గదర్శకాలకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వగానే క్షమాభిక్ష జీవోను గణతంత్ర దినోత్సవం రోజు(జనవరి 26)న జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంశాఖ వర్గాలు లిపాయి. చర్లపల్లి, చంచల్గూడ, వరంగల్ కేంద్ర కారాగారాలు, జిల్లా జైళ్లలో మొత్తం 356 మంది ఖైదీలు క్షమాభిక్ష జాబితాలో ఉన్నట్టు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో మార్గదర్శకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
ధైర్యం నింపేందుకే ఆ వీడియో.. కేంద్ర మంత్రి క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సైనికుడి వీరమరణానికి చెందిన చివరి వీడియోపై కేంద్రమంత్రి వీకే సింగ్ స్పష్టతను ఇచ్చారు. ఆ వీడియోను తాను యువ సైనికుల్లో ధైర్యాన్ని నింపేందుకే పోస్ట్ చేసినట్లు తెలిపారు. గత శనివారం పాకిస్థాన్ బలగాల కాల్పుల్లో నలుగురు భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత పలు వీడియోలు బయటకు వచ్చాయి. అందులో భాగంగానే కేంద్రమంత్రి వీకే సింగ్ కూడా ఓ సైనికుడి చివరి వీడియో అంటూ విడుదల చేశారు. అయితే, ఆ వీడియో అందరూ మొన్న పాక్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన మేజర్ మోహర్కార్ ప్రఫుల్లా అంబదాస్ది అని అనుకున్నారు. కానీ, ఆ వీడియో 2009నాటిదని వీకే సింగ్ స్పష్టం చేశారు. ఛత్తీసగఢ్లోని బస్తర్లో మావోయిస్టులు దాడి చేసిన సమయంలో సీఆర్పీఎఫ్ అధికారి సత్వంత్ సింగ్ చివరి ఘడియలకు సంబంధించిన వీడియో అని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఈ వీడియోను తనకంటే దేశమే ముఖ్యమనుకొని సరిహద్దుల్లో ప్రాణాలు ఫనంగా పెడుతున్న యువ సైనికులకు ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని, నాయకత్వాన్ని నూరిపోసేందుకు పోస్ట్ చేసినట్లు వీకే సింగ్ స్పష్టం చేశారు. I am well aware that the video I shared is an old video from the CRPF. The intent of sharing this video is to showcase to all the courage, valor and leadership of young officers who are always putting the nation before the self. — Vijay Kumar Singh (@Gen_VKSingh) 27 December 2017 -
హైదరాబాద్లో ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ ఆపరేషన్
-
నగరానికి ఇవాంకా.. బిచ్చగాళ్లు ఆ వంక!
సాక్షి, హైదరాబాద్: బిచ్చగాళ్ల కోసం గాలింపు మొదలైంది. కనిపించిన వారి నల్లా పోలీసులు అదుపులోకి తీసుకుం టున్నారు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో యాచనను నిషేధిస్తూ మంగళవారం వెలువడిన ఉత్తర్వులు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై బిచ్చగాళ్ల కోసం గాలించడం, చిక్కిన వారిని ఆనందాశ్రమాలకు తరలించడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ వాణిజ్య సదస్సు, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ రాక నేపథ్యంలో ఆపరేషన్ ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ సాగుతోంది. బుధవారం నగర పోలీసులు దాదాపు 70 మంది బిచ్చగాళ్లను పున రావాస కేంద్రాలకు తరలించారు. మరికొందరికి స్థాని కంగా కౌన్సెలింగ్ ఇచ్చి వారి స్వస్థలాలకు పంపారు. ప్రత్యేక నిఘా... ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసులు బహిరంగ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. రహదారులు, జంక్షన్లు, పార్కులు, ప్రార్థనామందిరాల వద్ద బిచ్చగాళ్ల కదలికల్ని గమనిస్తున్నారు. రహదారులపై కనిపించిన బిచ్చగాళ్ల వివరాలను ట్రాఫిక్ పోలీసులు శాంతిభద్రతల విభాగానికి అందిస్తున్నారు. ఆయా చోట్ల చిక్కిన బిచ్చగాళ్లకు పోలీసులు తొలుత కౌన్సెలింగ్ ఇస్తూ ప్రతిఘటన ఎదురుకాకుండా చూస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతోపాటు వాతావరణ మార్పుల నేపథ్యంలో కొందరు బిచ్చగాళ్లు అనారోగ్యానికి గురై కన్నుమూశారని, ఫుట్పాత్లపై నిద్రిస్తున్న వారిపై దాడులు, హత్యలు సైతం జరిగాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంచల్గూడ, చర్లపల్లి జైళ్లలోని ఆనందాశ్రమాలకు తరలిస్తున్నామంటూ నచ్చజెబుతున్నారు. పని చేస్తే నగదు చెల్లింపు... బిచ్చగాళ్లు మాత్రం ఈ నోటిఫికేషన్లు, ఆపరేషన్లు, సదస్సుల విషయం తమకు తెలియదని వాపోతు న్నారు. భిక్షమెత్తుకోనివ్వకపోతే తమ కడుపు నిండేది ఎలాగంటూ పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆ ఆశ్రయాల్లో వీరికి ఆహారం, వస్త్రాలు, వైద్యం తదితర సౌకర్యాలు కల్పించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. కర్మాగారాల్లో పని చేయడానికి ఆసక్తి చూపినవారికి ఎనిమిది గంటలకు రూ.400 చొప్పున చెల్లిస్తున్నారు. బాండ్ రాసి ఇస్తే ఇళ్లకు ఆసక్తి ఉన్న బిచ్చగాళ్లకు విద్య, వృత్తివిద్యల్లో శిక్షణలు ఇచ్చి నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల జీతం వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఎవరైనా తమ ఇళ్లకు వెళ్లిపోవాలని అనుకున్నా, వారికోసం సంబంధీకులు వచ్చినా మరోసారి బిక్షాటన చెయ్యమంటూ బాండ్ రాయించుకుంటున్నాం. ఈ రకంగా ఇప్పటికే 40 మందిని వారి ఇళ్లకు పంపాం. ఇలా వెళ్లినవారు మళ్లీ నగరంలో బిచ్చమెత్తుతూ చిక్కితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. – వీకే సింగ్, జైళ్ళ శాఖ డీజీ -
భారీగా ఐపీఎస్ల బదిలీలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కీలకమైన అధికారులతో పాటు పలు జిల్లా ఎస్పీలను సైతం బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు పోలీస్ శాఖలో చర్చ సాగుతోంది. డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు 4 గంటలకు పైగా కసరత్తు చేసినట్టు తెలిసింది. రెండ్రోజులుగా ఇదే అంశంపై ఉన్నతాధికారులు, సీఎంవో అధికారులతో ప్రతిపాదనలపై కసరత్తు చేసి నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ ముగ్గురితో పాటు.. రాష్ట్ర కేడర్కు చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి రిపోర్టు చేశారు. 1987 బ్యాచ్కు చెందిన అదనపు డీజీపీ సంతోశ్మెహ్రా, ఐజీలు అనిల్ కుమార్, దేవేంద్ర సింగ్ చౌహాన్లకు పోస్టింగ్స్ కల్పించాల్సి ఉంది. వీరిని నియమించాలంటే పలువురు అధికారులకు స్థానచలనం తప్ప దని పోలీస్ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో శాంతిభద్రతల ఐజీ పోస్టు ఖాళీగా ఉంది. నగర కమిషనరేట్లోని ట్రాఫిక్ అదనపు కమిషనర్ పోస్టు ఐజీ క్యాడర్ పోస్టు. ఈ రెండింటినీ అనిల్కుమార్, దేవేంద్ర సింగ్ చౌహాన్తో భర్తీ చేస్తారని, సైబరాబాద్ కమిష నర్ సందీప్ శాండిల్య సైతం బదిలీ కాబో తున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానంలో మహిళా ఐపీఎస్ అధికారి ఒకరికి అవకాశం కల్పించే యోచన ఉన్నట్టు సమాచారం. నగర కమిషన రేట్ పరిధిలోని శాంతి భద్రతల అదనపు కమిషనర్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్లను మార్పు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశా రని తెలిసింది. వరంగల్ కమిషనర్ సుధీర్ బాబు రెండేళ్లు పూర్తి చేయడంతో అక్కడ మరో డీఐజీ స్థాయి అధికారిని నియమించే అవ కాశం ఉంది. వరంగల్ జోన్లోని ముగ్గురు ఎస్పీలు, హైదరాబాద్ జోన్లోని ఒక ఎస్పీకి స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వంపై మంత్రుల ఒత్తిడి పదోన్నతులు పొందబోతున్న నాన్ క్యాడర్ ఎస్పీలను జిల్లా బాధ్యులుగా నియమించుకోవాలన్న ఆలోచనలో పలు వురు మంత్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అనుభవం లేకుండా పదే పదే పొరపాట్లు చేస్తున్న జూనియర్ ఎస్పీలను మార్చి వారి స్థానంలో నాన్క్యాడర్ ఎస్పీ లను నియమించుకునేందుకు ఇప్పటికే ఇద్దరు మంత్రులు సిఫారసు లేఖలను ప్రభుత్వ పెద్దలకు అందించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాచకొండ జాయింట్ కమిషనర్ తరుష్జోషీ కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ స్థానంలో డీఐజీ స్థాయి అధికారిని నియ మించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తోం ది. ఫైర్ విభాగం డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్, జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్లకు స్థాన చలనం ఉండనున్నట్టు తెలుస్తోంది. సంతోశ్ మెహ్రాను జైళ్ల శాఖ డీజీగా, వీకేసింగ్ను ఫైర్ విభాగం, రాజీవ్ రతన్ను ఆపరేషన్స్ లేదా ఆర్గనైజేషన్కు మార్చే అవకాశాలున్నట్టు సమాచారం. వీకేసింగ్, గోపీకృష్ణ, సంతోశ్ మెహ్రా వచ్చే ఏడాది డైరెక్టర్ జనరల్ హోదా పదోన్నతి పొందనున్నారు. -
కాంగ్రెస్ వల్లే.. అవి జరిగాయా?
సాక్షి, డెహ్రాడూన్ : దేశాన్ని మత, కుల ప్రాతిపదికన మొదట విభజించింది కాంగ్రెస్ పార్టీనేని కేంద్రమంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. డెహ్రాడూన్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ వల్లే దేశం విడిపోయిందని.. కేవలం మత ప్రాతిపదికన బ్రిటీష్ పాలనలో పాకిస్తాన్ను ఏర్పాటుకు సహకరించిందని అన్నారు. అప్పట్లో మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల్లో విభజన తెచ్చిన కాంగ్రెస్ తరువాత కాలంలో.. ఓట్ల కోసం కులాలను చీల్చిందని తీవ్రమైన పదజాలంతో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం నిరంతరం దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నించిందని అన్నారు. ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాల్లోని ప్రజలకు గతంలో విద్య, ఉద్యోగ, ఉపాధి మార్గాలు లేవని.. ప్రస్తుత మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. -
పొరబాటు ట్వీట్.. నాలుక్కరచుకున్న మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్ ఎయిర్ఫోర్స్(ఐఏఎఫ్) తొలి మార్షల్ అర్జన్ సింగ్ అర్జన్ సింగ్ మృతి చెందారంటూ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకేసింగ్ ట్వీట్ చేయడం కలకలం రేగింది. ‘ఐఏఎఫ్ తొలి మార్షల్ అర్జన్ సింగ్ మృతికి తీవ్ర సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. దేశానికి ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరిచిపోం. సెల్యూట్’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఐఏఎఫ్ వర్గాలు.. ఆయన బతికే ఉన్నారంటూ వెంటనే ప్రకటన విడుదల చేశాయి. రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అర్జున్ సింగ్ను పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసినట్లు వెల్లడించాయి. దీంతో నాలుక్కరుచుకున్న వీకే సింగ్ వెంటనే ఆ ట్వీట్ను తొలగించారు. -
చర్లపల్లి జైలులో వీకే సింగ్ ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్: తెలంగాణ జైళ్లశాఖ డీజీ వినయ్కుమార్ సింగ్ సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు మూడున్నర గంటల పాటు ఆయన జైలులోనే గడిపారు. అక్కడి బ్యారక్లు, భోజనం, ఆస్పత్రితో పాటు ఖైదీలకు వసతులు ఎలా ఉన్నాయని పరిశీలించారు. అనంతరం ఆయన నేరుగా ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఖైదీలకు పేరోల్ రాకపోవడం, దోమల బెడద, కోర్టుల్లో జరిమానాలు కట్టలేకపోవడం వంటి పలు సమస్యలను డీజీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం ఆయన చర్లపల్లి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న వ్యవసాయ పనులను పరిశీలించారు. ఓపెన్ ఎయిర్జైల్ను రిసార్ట్గా మార్చాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా చర్లపల్లి జైలు ఉప పర్యవేక్షణాధికారి దశరధంపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో డీజీ రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపినట్లు సమాచారం. డీజీ జైలుకు వచ్చిన సమయంలో ఉప పర్యవేక్షణాధికారి జైలులో లేనట్లు తెలిసింది. -
అద్దెకు తెలంగాణ జైళ్లు
- ఏడాది తర్వాత అమలుకు యోచన - ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు - జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ వెల్లడి హైదరాబాద్: తెలంగాణ జైళ్లలో ఖైదీల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇక్కడి బ్యారక్లను ఖైదీలు ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాలకు అద్దెకు ఇవ్వాలని జైళ్ల శాఖ యోచిస్తోంది. ఏడాది తర్వాత దీన్ని అమల్లోకి తీసుకురావడానికి వీలుగా రూపొందిం చిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు ఆ శాఖ డీజీ వీకే సింగ్ బుధవారం తెలిపారు. నార్వే తరహాలో రాష్ట్రంలోని జైళ్లను ఇతర రాష్ట్రాల ఖైదీలకు అద్దెకు ఇవ్వాలని యోచిస్తున్నామన్నారు. రాష్ట్ర జైళ్ల సామర్థ్యం 6,848 మంది ఖైదీలు కాగా.. ఈ నెల 15 నాటికి ఆ సంఖ్య 6,083గా ఉందని తెలిపారు. మరో ఏడాది పాటు ఈ ఖైదీల సంఖ్య పరిగణనలోకి తీసుకుని ‘అద్దెకు జైళ్లు’ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. బిహార్, ఉత్తరప్రదేశ్ జైళ్లలో ఖైదీల సంఖ్య సామర్థ్యాన్ని మించిపోయిందని, అలాంటి వారిలో గరిష్టంగా 800 మందికి రాష్ట్ర జైళ్లలో ఖైదు చేసే ఆస్కారం ఉందన్నారు. తద్వారా ఏటా రూ.25 కోట్ల ఆదాయం సమకూర్చుకోవచ్చని స్పష్టం చేశారు. మహాపరివర్తన్, విద్యాదాన్, ఉన్నతి వంటి కార్యక్రమాల వల్ల కరడుగట్టిన నేరస్తులు సైతం జీవనోపాధి పొంది కొత్త జీవితాలు ప్రారంభించారని వివరించారు. ఇటీవల చర్లపల్లి కారాగారాన్ని సందర్శించిన బిహార్ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ అమీర్ సుభాని రాష్ట్రంలోని జైళ్లలో జరుగుతున్న మార్పులు, కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రశంసలు కురిపించారని చెప్పారు. త్వరలో మరో 29 ఖైదీల పెట్రోల్ బంకులు.. జైళ్ల శాఖను ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్లేందుకు ఖైదీలు నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్లు కీలకంగా మారాయని వీకే సింగ్ చెప్పారు. ఈ స్ఫూర్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా మరో 29 పెట్రోల్ బంక్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. చర్లపల్లి జైల్లో 3, వరంగల్ జైల్లో 2, నల్లగొండ జిల్లాలో 5, నిజామాబాద్ జిల్లాలో 1, కరీంనగర్ జిల్లాలో 6, ఖమ్మం జిల్లాలో 1, ఆదిలాబాద్లో 2, వరంగల్ సబ్ జైల్ పరిధిలో 1, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 3, మహబూబ్నగర్ సబ్ జైల్ పరిదిలో 2 బంక్లు, వీటితో పాటు మరో వారం రోజుల్లో సరూర్ నగర్, లింగోజీగూడ, ఆసిఫాబాద్ల్లో ప్రారంభిస్తామన్నారు. -
మంచి ఉగ్రవాది..చెడ్డ ఉగ్రవాది ఉండరు!
బీజింగ్: ఉగ్రవాదంపై పోరాటానికి ఐక్య రాజ్యసమితిలో ఓ సమగ్ర విధానం అవసరమని బ్రిక్స్ దేశాలకు భారత్ స్పష్టం చేసింది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగి స్తున్న ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవాది... చెడ్డ ఉగ్రవాది అని ఉండరని... అందరూ నేరస్తులేనని పరోక్షంగా పాకిస్తాన్ను ఉద్దేశించి పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా అంతమొందించాలన్న విషయాన్ని సదస్సులో నొక్కి చెప్పామని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ మీడియా సమావేశంలో వెల్లడిం చారు. బ్రిక్స్లోని ఐదు దేశాల విదేశాంగ మంత్రులు సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు. -
'ఆ ఆరోపణలు అవాస్తవం, కావాలనే రాద్ధాంతం'
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కుల్భూషణ్ జాదవ్పై చేస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి వీకే సింగ్ తోసిపుచ్చారు. జాదవ్ నిర్దోషి అని, అతని వద్ద భారత పాస్పోర్టు ఉందని ఆయన అన్నారు. వీకే సింగ్ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.... జాదవ్పై గూఢచర్యం ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. పాకిస్తాన్ కావాలనే రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. కాగా భారత గూఢచారిగా అనుమానిస్తున్న కుల్భూషణ్ జాదవ్ కు సోమవారం పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. జాదవ్ గూఢచర్యం, విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్న ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ ఆయన్ను దోషిగా పేర్కొన్నారు. అయితే పాక్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జాదవ్కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందుగానే ఆలోచించి చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన పాక్ జాదవ్కు తక్షణమే ఉరి అమలు చేయమని, క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కాగా జాదవ్ తరఫున ఎవరు వాదించొద్దని లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. మరోవైపు కుల్భూషణ్ అమాయకుడు అయితే అతని వద్ద రెండు పాస్పోర్టులు ఎందుకు ఉంటాయని, ఒకటి హిందు, మరొకటి ముస్లిం పేరుతో పాస్పోర్టులు ఉన్నాయని పాక్ ప్రధాని సలహాదారుడు సత్తాజ్ అజీజ్ ప్రశ్నించారు. -
పంజాబ్ బరిలో 1,145 మంది
చండీగఢ్: 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ ఎన్నికల బరిలో 1,145 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీకే సింగ్ చెప్పారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తయింది. కాంగ్రెస్ 117 స్థానాల్లో, ఆప్ 112, అకాలీదల్ 94, బీజేపీ 23 చోట్ల అభ్యర్థులను నిలబెట్టగా.. బీఎస్పీ 111, తృణమూల్ 20 చోట్ల పోటీ చేస్తున్నాయి. -
ఖైదీ నం.1
జైలు శిక్ష.. ఒక్కరోజే కొత్త అనుభూతినిస్తున్నసంగారెడ్డి పాత జైలు ♦ రూ. 500 కట్టి మీరూ బందీ కావొచ్చు ♦ నాలుగు గోడల మధ్య జీవితం ఉద్విగ్నం, దుర్భరం అంటున్న ‘ఖైదీలు’ ♦ గడచిన 8 నెలల్లో స్వీయబందీలైన 14 మంది సాక్షి, హైదరాబాద్ మనం ఫోన్కు ఖైదీలం. వాట్స్యాప్, ఫేస్బుక్, చాటింగ్.. ఒకటేమిటి ఫోన్ గీసిన గిరిలో బందీలం! చేతిలో ఫోన్ ఆడకపోతే ఆలోచన రాదు, అడుగు పడదు. అలాంటి ఫోన్ మనకు దూరమైతే..? ఆప్యాయంగా పలకరించే మనవాళ్లు కన్పించకుంటే..? ఊహించుకుంటేనే భయంకరం కదా..! మరి రోజులు.. నెలలు.. ఏళ్లు.. ఖైదీలు జైలు గోడల మధ్య ఎలా గడుపుతారు?? ఇదిగో ఇలా... ఆ నాలుగు గోడల మధ్య.. అది సంగారెడ్డి పాత జైలు. ముగ్గురు యువకులు లోనికి ప్రవేశించారు. వారిలో కిషన్, ప్రవీణ్ న్యాయవాదులు. రవి కుమార్ ట్యాక్స్ కన్సల్టెంట్. ఇద్దరు కానిస్టేబుళ్లు వారిని లోనికి తీసుకెళ్లారు. వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు, పర్సులు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఖైదీ యూనిఫామ్తో ఆ ముగ్గురు యువకులు బ్యారెక్స్లోకి వెళ్లారు. సినిమాల్లో చూడ్డమేగానీ జైలు గది ఎలా ఉంటుందో చూసిన అనుభవం లేదు. అందులో కాలుపెట్టగానే మనసులో ఒకింత తెలియని ఆందోళన. కానీ.. నిజం ఖైదీలం కాదుగా.. మరో 24 గంటల్లో విడుదలవుతాం కదా అన్న ఆలోచన మనసును తట్టడంతో మళ్లీ మామూలైపోయారు. రోజంతా జైల్లో గడిపారు. జీవితం అందించిన ఓ కొత్త పాఠాన్ని మదిలో పదిలపరుచుకున్నారు. ‘క్షణికావేశంలో కానీ, వ్యూహాత్మకంగా కానీ నేరం చేయొద్దు..’బయటకు వచ్చిన తర్వాత ఆ ముగ్గురు మౌనంగా ఎవరికివారు అనుకున్నమాట ఇది!! మీరూ ‘ఖైదు’కావొచ్చు... దేశంలో ఎక్కడా లేనట్టు సంగారెడ్డి పాత జైలు ఓ కొత్త అనుభూతిని పంచుతోంది. ఒకప్పుడు కరుడుగట్టిన నేరగాళ్లను ఉంచిన ఈ జైలు ఇప్పుడు... ‘ఖైదీ అనుభవం’పంచుతోంది. తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వీకే సింగ్ ఆలోచన నుంచి పుట్టిన ఓ కార్యక్రమం ‘ఖైదీ’లకు కొత్త అనుభూతిని ఇస్తోంది. జైలు జీవితం ఎలా ఉంటుందన్న ఆసక్తిని స్వీయానుభవంగా మార్చుకోవాలనుకునేవారు ఓ రోజు అందులో అచ్చం ఖైదీలాగా ‘బందీ’కావచ్చు. ఇందుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. గత సంవత్సరం జూన్ 5న మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తోంది. గడచిన ఎనిమిది నెలల్లో 14 మంది ‘జైలు అనుభూతి’పొందారు. హైదరాబాద్ సంస్థానంలో సాలార్జంగ్–1 ప్రధానిగా ఉన్న సమయంలో 1796లో సంగారెడ్డిలో ఈ జైలు రూపుదిద్దుకుంది. తెలంగాణలో ఇదే అతి పురాతన జైలు. ఇప్పుడది చారిత్రక వారసత్వ కట్టడం. కంది సమీపంలో కొత్తగా నిర్మితమైన అధునాతన భవన సముదాయంలోకి జైలు తరలించటంతో ఇప్పుడిది మ్యూజియంగా మారింది. ‘ఖైదీ’లు ఏమంటున్నారంటే..? కొత్త కోణాన్ని పరిచయం చేసింది నాకు కోపం చాలా ఎక్కువ. చిరాకులో ఉన్నప్పుడు నియంత్రణ కోల్పోతా. ఆ సమయంలో ఆవేశం నా మనసు మాట విననివ్వదు. కానీ.. ఈ 24 గంటల ‘జైలు జీవితం’నా స్వభావానికి కొత్త కోణాన్ని పరిచయం చేసింది. ఇప్పుడు ఆవేశానికిలోనయ్యేలోపు మనసు నియంత్రణలోకి వస్తోంది. గొడవలకు దూరంగా ఉంటాను. ఎందుకంటే ఆ ‘జైలు జీవితం’నాకు తారసపడొద్దు. అక్కడ ఒక్కో నిమిషం ఒక రోజుతో సమానం. జీవితంలో అంతకుమించిన దుర్భర ఘట్టం మరొకటి ఉండదేమో విజయ్కుమార్, మహారాష్ట్రలో వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్(పుణె) బాబోయ్.. అదో సాహసం సాయంత్రం నుంచి ఉదయం వరకు ఎవరూ కనిపించరు. బ్యారెక్లో ఒంటరిగా గడపటం.. తలుచుకుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. బయటకు పంపరు, మూత్రవిసర్జన చేయాలన్నా గదిలో ఓ మూలన సగం గోడతో ఉండే టాయిలెటే గతి. బోర్గా అనిపిస్తుంది.. తినాలనిపించదు.. నిద్ర సరిగా ఉండదు. కానీ అదో మంచి అనుభవాన్నిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కారణాలు వెతుక్కుంటాం, పరిష్కారం దిశగా చూస్తాం. ఇక్కడది కనిపిస్తుంది. – సామ్రాట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రజల్లో ఆలోచన పుట్టించాలనే: వీకే సింగ్, డీజీ, తెలంగాణ జైళ్ల శాఖ కొందరికి ఎన్నిసార్లు చెప్పినా కొన్ని విషయాలు బుర్రకెక్కవు. నేరం చేసి జైలుకు వెళ్తే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో స్వయంగా తెసుకుకునేందుకు చక్కటి అవకాశమే ఈ కార్యక్రమం ఉద్దేశం. అండమాన్లోని పురాతన జైలును మ్యూజియంగా మార్చారు. తెలంగాణలో అతి పురాతన జైలు సంగారెడ్డి పాత జైలు. కొత్త భవనం కట్టాక పాతదాన్ని కూల్చకుండా మ్యూజియంగా మార్చాలనుకున్నాం. అందులో ఓ భాగాన్ని అందుకు కేటాయించాం. రెండో భాగాన్ని ‘జైలు అనుభూతి’కోసం వాడాలనుకున్నాం. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోని పురాతన జైళ్లను కూడా ఇలా మార్చాలనే యోచన అధికారుల్లో వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోంది ఇప్పటివరకు 14 మంది ‘ఫీల్ ది జైల్’ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోంది. వేరే రాష్ట్రాల నుంచి యువకులు ఫోన్ చేసి తేదీలు బుక్ చేసుకుంటున్నారు. వచ్చినవారు మంచి అనుభూతితో వెళ్తున్నారు. కొద్దిరోజుల క్రితం అధ్యయనంలో భాగంగా చెన్నై నుంచి ఓ యువతి వచ్చింది. ఆమెకు రక్షణగా ఇద్దరు మహిళా గార్డులను వినియోగించాం. ఎలాంటి భయం లేకుండా జైలు జీవితాన్ని గడిపి వెళ్లొచ్చు. – జి.వెంకటేశ్వర్లు, సంగారెడ్డి జిల్లా సబ్జైళ్ల అధికారి బంగ్లా అధికారుల సందర్శన ఈ జైలును ఇటీవల బంగ్లాదేశ్ అధికారులు సందర్శించారు. ఇక్కడి పరిస్థితులు అధ్యయనం చేసి ఢాకాలోని పురాతన జైలును కూడా ఇలాగే తీర్చి దిద్దాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ దేశ ప్రధాని వద్దకు ఈ ప్రతిపాదన వెళ్లింది. ఆ దేశంలో నేరాల సంఖ్య ఎక్కువే. ప్రజల్లో మార్పు కోసం ఈ ఆలోచన భేషుగ్గా ఉపయోగపడుతుందని అధికారులు యోచిస్తున్నారు. అలాగే వారం క్రితం తీహార్ జైలు అధికారులు వచ్చి చూసి వెళ్లారు. ఇది మంచి ఆలోచన అంటూ కితాబిచ్చారు. ఇదీ టైం టేబుల్.. ఉదయం 6: బ్యారక్ తెరిచి ‘ఖైదీ’ని బయటకు వదులుతారు. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కాసేపు యోగా చేయించి గార్డెనింగ్ పని అప్పగిస్తారు. 7: టీ ఇస్తారు. తర్వాత ‘విద్యాదానం’పథకంలో భాగంగా చదువు నేర్పిస్తారు. అక్షరాస్యులైతే పుస్తకాలిచ్చి చదువుకోమంటారు. 8: బ్రేక్ఫాస్ట్. తర్వాత కాసేపు స్వేచ్ఛగా విహరించే అవకాశం. 11: మధ్యాహ్న భోజనం. అనంతరం విశ్రాంతి మధ్యాహ్నం 2: టీ సాయత్రం 5: రాత్రి భోజనం 6: బ్యారెక్లోకి పంపి తాళం వేస్తారు బ్రేక్ఫాస్ట్ ఇలా.. సోమవారం: చపాతి, ఆలూ కుర్మా; మంగళవారం: పొంగల్; బుధ: చపాతీ కుర్మా; గురు: ఉప్మా; శుక్ర: పొంగల్; శని: చపాతీ కుర్మా; ఆది: పులిహోర లంచ్: అన్నం పప్పు, పచ్చడి, రసం, బుధవారం ఉడికించిన గుడ్డు, ఆదివారం మాంసాహారం (తొలి ఆదివారం మటన్, మిగతా మూడు ఆదివారాలు చికెన్) డిన్నర్: కూర, పెరుగుతో అన్నం నిబంధనలెన్నో... ఈ జైల్లో గడపాలనుకునేవారికి తల్లిదండ్రుల/కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తప్పనిసరి. వారితో ఫోన్లో మాట్లాడించాకే అనుమతిస్తారు. ఆ 24 గంటలు ఫోన్ అనుమతి ఉండదు. ఎలాంటి వస్తువులు లోనికి అనుమతించరు. పుస్తకాలు తెచ్చుకోవచ్చు. కానీ కమ్యూనిస్టు భావజాలంతో కూడినవి ఉంటే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. వచ్చినవారి మానసిక స్థితిని గమనించాకే అనుమతి ఇస్తారు. మైనర్లను అనుమతించరు. -
వరంగల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల పరార్
వరంగల్: పటిష్ట భద్రత ఉండే వరంగల్ సెం ట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరార య్యారు. ఏకే-47 ఆయుధాన్ని అమ్మిన కేసులో శిక్ష అనుభవిస్తున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ సైనికుడు, ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లా కాంకేర్కేరా వాసి సైనిక్సింగ్, ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న బిహార్లోని ఆర్యాల్ ప్రాంతానికి చెందిన రాజేశ్సింగ్ శనివారం తెల్లవారుజామున జైలు ప్రహరీ దూకి పారి పోయారు. వీరిద్దరూ సెంట్రల్జైలులోని హైసె క్యూరిటీ బ్యారక్లో వరంగల్ జిల్లాకు చెందిన మరో ఖైదీతో కలసి ఉంటున్నారు. వీరిలో సైనిక్సింగ్, రాజేశ్సింగ్ కలసి బ్యారక్కు ఉన్న తాళం పగలగొట్టి మూడంచెల భద్రతను దాటి నిరంతరం విద్యుత్ సరఫరా ఉండే గోడ దూకి పారిపోవడం సంచలనంగా మారింది. బ్యార క్కు ఉన్న తాళం పగులగొట్టే సమయంలో శబ్దం వస్తుందని భావించిన ఖైదీలు.. తాళా నికి, దాన్ని పగులగొట్టేందుకు ఉపయోగించిన ఐరన్ రాడ్కు గుడ్డ(క్లాత్)ను చుట్టి తాళం మధ్య లో ఒత్తడంతో తాళం విడిపోరుుందని తెలిసింది. అక్కడ నుంచి వారు తప్పించుకొని ప్రహరీ వద్దకు చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న ఇనుప కొక్కానికి గుడ్డను కట్టి ప్రహరీపై వేసినట్లు తెలిసింది. ఆ కొక్కానికి దుప్పటితో తయారు చేసుకున్న తాడును కట్టి ప్రహారీగోడపైకి చేరుకొన్న ఇద్దరూ గోడ దూకి బయటకు పారిపోరుునట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రౌండ్సకు వచ్చిన జైలు సిబ్బంది.. తాళం పగిలి పోరుు ఉండడం.. బ్యారక్లోని ముగ్గురు ఖైదీలకు ఒక్కరే ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించగా ఇద్దరు తప్పించుకుపోరుునట్లు బయటపడింది. కాగా, ఈ విషయం తెలుసు కున్న ఉన్నతాధికారులు సెంట్రల్ జైలుకు వచ్చారు. తప్పించుకుపోరుున ఖైదీలను పట్టు కునేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. నగరం చుట్టూ నాకాబందీ నిర్వహి స్తూ వాహనాలను తనిఖీలు చేయడం ప్రారం భించారు. కాగా, 20 ఫీట్ల ఎత్తుతో ఉన్న ప్రహరీకి ఇరువైపులా టవర్లు ఉన్నప్పటికీ ఇద్దరు ఖైదీలు ఆ రెండు టవర్ల మధ్య నుంచే దూకి పారిపోవడం పట్ల పలు అనుమా నాలు వ్యక్త మవుతున్నారుు. జైలు లోపల జైళ్ల శాఖకు చెందిన సిబ్బం ది పహారా, వాచింగ్ టవర్లపై ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు నిరంతరం పర్యవేక్షణ, భద్ర త ఉన్న జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకుపోవ డాన్ని చూసి జైళ్ల శాఖతో పాటు సివిల్ పోలీసు యంత్రాంగం నివ్వెర పోరుుంది. ఇద్దరు ఖైదీలు పారిపోవడాన్ని గుర్తించలేదంటే డ్యూటీలో ఉన్నవారు నిద్ర లో కి జారుకున్నారని అధికారులు భావిస్తు న్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో మద్యం బాటిళ్ల మూత ల సీళ్లు కనిపించడం గమనార్హం. జైలును సందర్శించిన డీజీ వీకే సింగ్ వరంగల్ సెంట్రల్ జైలును జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ శనివారం మధ్యా హ్నం సందర్శించారు. ఖైదీలు తప్పించు కున్న తీరును, వారు ఉపయోగించిన ఆయు ధాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జైళ్ల శాఖలో సిబ్బంది కొరత ఉందని, దీనివల్ల భద్రతలో లోపాలున్నాయన్నారు. వరంగల్ సెంట్రల్ జైలులోని 4 వాచ్ టవర్లలో మూడు టవర్లే పనిచేస్తున్నాయని, పనిచేయని టవర్ వద్ద నుంచి ఖైదీలు తప్పించుకున్నారని చెప్పారు. వారిని ఎలాగైనా పట్టుకుంటామని, ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తప్పవని వీకే సింగ్ హెచ్చరించారు. -
నేను వీకే సింగ్ బాధితుడిని
కేంద్ర మంత్రిపై ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ఆరోపణ న్యూఢిల్లీ: భారత ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్పై ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన పదోన్నతిని ఉద్దేశపూర్వకంగా ఆయన అడ్డుకోవాలని చూశారని దల్బీర్ వెల్లడించారు. ఆర్మీ కమాండర్ ఎంపికలో పక్షపాతం చూపారని మాజీ లెఫ్టినెంట్ జనరల్ రవి దస్తానే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిల్కు స్పందిస్తూ వ్యక్తిగత హోదాలో దల్బీల్ తన అఫిడవిట్లో ఈ ఆరోపణలు చేశారు. ‘‘ఆర్మీ కమాండర్గా నా పదోన్నతిని అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతో వీకే సింగ్ నన్నో బాధితుడిని చేయాలని చూశారు. ఆధారాలులేని, ఊహాజనిత, తప్పుడు ఆరోపణలు చేస్తూ నాకు(2012 మే 19) షోకాజ్ నోటీసిచ్చారు’’ అని అఫిడవిట్లో దల్బీర్ పేర్కొన్నారు. ఏ తప్పులేదని విచారణలో తేలినా, దుర్బుద్ధితోనే తనకు నోటీస్ ఇచ్చారని విమర్శించారు. కాగా, 2011 డిసెంబర్ 20 రాత్రి అస్సాంలోని జొర్హాట్ ఆపరేషన్కు సంబంధించి విఫలమయ్యారనే కారణంతో జనరల్ ఆఫీసర్ కమాండింగ్గా ఉన్న దల్బీర్సింగ్పై 2012లో అప్పటి ఆర్మీ చీఫ్ వీకే సింగ్ క్రమశిక్షణ, నిఘా(డీవీ) బ్యాన్ విధించారు. ముందస్తు వ్యూహం ప్రకారమే తనపై డీవీ బ్యాన్, షోకాజ్ నోటీస్ ఇచ్చారని అఫిడవిట్లో జనరల్ దల్బీర్ పేర్కొన్నారు. డీవీ బ్యాన్తో జీవోసీ-ఇన్-సీ ఈస్ట్రన్ కమాండ్ పదోన్నతి కోల్పోయానని చెప్పారు. జొర్హాట్ ఆపరేషన్ సమయంలో తాను వార్షిక సెలవులో ఉన్నానని స్పష్టంచేశారు. 2012 మే 31న వీకే సింగ్ రిటైరైన 15 రోజుల తర్వాత అప్పటి మేజర్ జనరల్ బిక్రమ్ సింగ్ తనపై ఉన్న డీవీ బ్యాన్ను సడలించడంతో జీవోసీ-ఇన్-సీ పదోన్నతికి అడ్డంకులు తొలగిపోయాయన్నారు. కాగా, ఆర్మీ కమాండర్గా పదోన్నతికి అర్హత ఉన్నా బిక్రమ్ సింగ్ తనను తిరస్కరించారని, దల్బీర్ సింగ్కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని పిల్లో దస్తానే పేర్కొన్నారు. అయితే గతంలో సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో దస్తానే విమర్శలను రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. అదే సమయంలో దల్బీర్ సింగ్పై డీవీ బ్యాన్ విషయంలో వీకే సింగ్ తీరును కూడా తప్పుబట్టింది. -
నేను వీకే సింగ్ బాధితుడిని
-
కేంద్రమంత్రిపై ఆర్మీ చీఫ్ తీవ్ర ఆరోపణలు!
న్యూఢిల్లీ: తన పూర్వ ఆర్మీ చీఫ్, కేంద్రమంత్రి వీకే సింగ్పై ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వీకే సింగ్ దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తూ తన ప్రమోషన్ను అడ్డుకోవాలని, నిరంకుశంగా తనను శిక్షించాలనే ఆలోచనతోనే ఆయన ఇలా మిస్టిరియస్గా ప్రవర్తించారని దల్బీర్ సింగ్ ఆరోపించారు. ఈ మేరకు వ్యక్తిగత హోదాలో ఆయన బుధవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. మాజీ ఆర్మీ చీఫ్ లేదా కేంద్రమంత్రిపై ఓ ఆర్మీ అధిపతి ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2012లో అప్పటి ఆర్మీ చీఫ్గా ఉన్న వీకే సింగ్ తనను బాధితుడిని చేసేందుకు ప్రయత్నించారని, ఆర్మీ కమాండర్గా తనకు ప్రమోషన్ దక్కకూడదన్న ఏకైక ఉద్దేశంతో ఆయన ఇలా వ్యవహరించారని దల్బీర్ సింగ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. నిరాధార, ఊహాజనిత, అసత్య ఆరోపణలతో మే 19, 2012న తనకు షోకాజ్ నోటీసు జారీచేశారని, ఆ తర్వాత అక్రమంగా తనపై క్రమశిక్షణ, విజిలెన్స్ (డీవీ) నిషేధాన్ని విధించారని ఆయన తెలిపారు. దల్బీర్ సింగ్ను ఆర్మీ కమాండర్గా నియమించడంలో ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారంటూ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) రవీ దస్తానె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఆయనను ఆర్మీ కమాండర్గా నియమించడంతో జనరల్ బిక్రం సింగ్ తర్వాత ఆర్మీ చీఫ్గా నియమించడానికి మార్గం సుగమమైంది. 2012 ఏప్రిల్, మే నెలల్లో దల్బీర్ సింగ్పై వీకే సింగ్ డీవీ నిషేధాన్ని విధించినా.. ఆయనను ఆర్మీ చీఫ్ గా నియమించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలవ్వగా.. ఈ కేసులో దల్బీర్ సింగ్ అఫిడవిట్ సమర్పించారు. -
కేంద్రమంత్రి భార్యకు బెదిరింపులు!
-
కేంద్రమంత్రి భార్యకు బెదిరింపులు!
న్యూఢిల్లీ: తన సంభాషణలను రహస్యంగా రికార్డు చేసి ఓ వ్యక్తి.. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ భార్య భారతీ సింగ్ ఆరోపించారు. ఢిల్లీకి చెందిన ప్రదీప్ చౌహాన్ తమ కుటుంబానికి తెలిసినవాడని, ఆగస్టు 6న అతనితో తాను మాట్లాడిన మాటల్ని రహస్యంగా రికార్డు చేశాడని, ఆ తర్వాత తనకు రూ. 2 కోట్లు ఇవ్వకుంటే ఆ సంభాషణల్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని భారతీ సింగ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు చౌహాన్ వద్ద లైసెన్స్డ్ రివాల్వర్ ఉందని, దానితో తమ కుటుంబానికి హాని చేస్తానని అతడు బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. తనకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన ఆడియో, వీడియో రికార్డులను బయటపెడతానని చౌహాన్ ఆమె పేర్కొన్నారు. అతని దగ్గర ఉన్న క్లిప్పుల్లో ఏముందో తనకు తెలియదని, కానీ వాటిని బయటపెట్టి తన భర్త పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తానని అతడు ఫోన్లో బెదిరిస్తున్నాడని ఆమె తెలిపారు. నిందితుడు ఆమె సంభాషణల్ని రికార్డు చేసి.. వాటిని వేరే వాటితో మిక్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తున్నదని పోలీసు వర్గాలు తెలిపాయి. -
‘కువైట్ జైల్లో ఉన్న వారి శిక్షను తగ్గించాలి’
సాక్షి, న్యూఢిల్లీః కువైట్లో వివిధ నేరాలకు పాల్పడి 17 మంది భారతీయులు పలు జైళ్లలో ఉన్నారని, వీరిలో 13 మందికి ఉరిశిక్ష పడిందని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ బుధవారం లోక్సభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు వై.ఎస్.అవినాష్రెడ్డి, బుట్టా రేణుక అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఉరిశిక్ష పడిన 13 మంది మాదక ద్రవ్యాల కేసులో అరోపణలు ఎదుర్కొన్నారని, వీరి శిక్షను జీవిత ఖైదుకు తగ్గించాలని కువైట్ను కోరినట్టు తెలిపారు. ఇండియా, కువైట్ల మధ్య ఖైదీల పరస్పర బదిలీకి ఒప్పందం కుదిరిందని, అయితే ఉరిశిక్ష పడిన వారి విషయంలో ఇది వర్తించదని తెలిపారు. -
భారతీయుల కోసం 'ఆపరేషన్ సంకట్ మోచన్'
న్యూఢిల్లీ: దక్షిణ సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వీకే సింగ్ నాయకత్వంలో 'ఆపరేషన్ సంకట్ మోచన్' కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం భారతప్రభుత్వం దక్షిణ సూడాన్ రాజధాని జుబాకు సీ 17 అనే రెండు మిలటరీ విమానాలను గురువారం పంపింది. వీకే సింగ్ తో పాటు విదేశాంగ శాఖకు చెందిన అమర్ సిన్హా, సత్ బిర్ సింగ్, అంజన్ కుమార్ లు వెళ్లారు. దక్షిణ సూడాన్ లోని భారత రాయబారి శ్రీకుమార్ మీనన్ ఈ ఆపరేషను ఆర్గనైజ్ చేస్తున్నారు. సూడాన్ లో 500 మంది భారతీయులున్నారని సమాచారం. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. -
జైళ్లల్లో అవినీతి లేదు: డీజీ వీకే సింగ్
మహబూబ్నగర్ క్రైమ్: రాష్ట్రంలోని జైళ్లలో అవినీతి ఏ మాత్రమూ లేదని, పూర్తిగా పారదర్శకంగా బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నామని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్కుమార్ సింగ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జైలుశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వన్టౌన్ సమీపంలో ఖైదీలతో నిర్వహించనున్న పెట్రోల్ బంకును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇది ఐదవ పెట్రోల్ బంక్ అని తెలిపారు. ఖైదీల్లో మార్పు., వారిలో ఆత్మస్థయిర్యం నింపడం కోసమే ఈ పెట్రోల్బంక్ తెరిచినట్లు తెలిపారు. ఇందులో వారే వర్కర్లుగా ఉంటారని, రోజువారి వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు. -
మీ అయ్య సొత్తా? మీ పేర్లు ఎందుకు పెట్టాలి?
ముంబై: ఢిల్లీలోని అక్బర్ రోడ్డు పేరును మహారాణా ప్రతాప్ రోడ్డుగా మార్చాలంటూ కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ చేసిన ప్రతిపాదన పెద్ద దుమారమే రేపుతోంది. ఈ అంశంపై పెద్ద ఎత్తున సాగుతున్న చర్చలోకి తాజాగా బాలీవుడ్ నటుడు రిషి కపూర్ తలదూర్చాడు. దేశంలోని పలు సంస్థలు, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులకు గాంధీ-నెహ్రూ కుటుంబం పేర్లు ఎందుకు పెట్టారని ఆయన నిలదీశాడు. 'సమాజానికి సేవ చేసిన వారి పేర్లను దేశంలోని కీలక ఆస్తులకు పెట్టాలి. ప్రతిదానికీ గాంధీ పేరు ఎందుకు? నేను దీనిని అంగీకరించను. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అని ఎందుకు పెట్టారు? మహాత్మా గాంధీ పేరో, భగత్ సింగ్ పేరో, అంబేద్కర్ పేరో ఎందుకు పెట్టలేదు? కనీసం నా పేరు రిషి కపూర్ అయినా పెట్టొచ్చు. ఏమంటారు?' అని రిషి కపూర్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. 'దేశఆస్తులకు కాంగ్రెస్ పార్టీ పెట్టిన గాంధీ కుటుంబం పేర్లను మార్చాలి. బాంద్రా/వర్లీ సీలింక్కు లతా మంగేష్కర్ లేదా జేఆర్డీ టాటా లింక్ రోడ్డు అని పేరు పెట్టాలి. మీ అయ్య సొత్తు అనుకుంటున్నారా? ఏమిటి?' అని రిషి నిలదీశాడు. ఢిల్లీలో రోడ్ల పేర్లు మార్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశ ఆస్తులకు పెట్టిన పేర్లను కూడా మార్చాలని, చండీగఢ్లో రాజీవ్గాంధీ పేరు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తన తండ్రి రాజ్కపూర్ దేశం గర్వపడేలా కృషి చేశారని, రాజకీయాల కన్నా ఆయనే ఎక్కువ దేశానికి గర్వకారణమయ్యారని రిషి కపూర్ చెప్పుకొచ్చాడు. Change Gandhi family assets named by Congress.Bandra/Worli Sea Link to Lata Mangeshkar or JRD Tata link road. Baap ka maal samjh rakha tha ? — Rishi Kapoor (@chintskap) 17 May 2016 -
'జాతి వ్యతిరేకులు ఎప్పటికీ హీరోలు అవ్వరు'
మథుర: రాజద్రోహం కేసులో అరెస్టయి రెండు రోజుల కింద విడుదలైన జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ చేసిన వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఖండించారు. హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తనకు ఆదర్శమని చేసిన వ్యాఖ్యలను వీకే సింగ్ తప్పుబట్టారు. జాతి వ్యతిరేకులు ఎప్పటికీ హీరోలు కానే కాదని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లోని మథురలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు యాకుమ్ మెమన్ ఉరితీతను వేముల రోహిత్ వ్యతిరేకించాడు. ఆ సందర్భంగా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రోహిత్ వేములను తనకు ఆదర్శప్రాయుడిగా విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ఎలా ఎంచుకుంటాడన్నారు. రోహిత్ దారిలోనే కన్హయ్య నడిచాడు. అతడిలాగానే పార్లమెంట్ దాడులకు పాల్పడ్డ కేసులో నిందితుడు అఫ్జల్ గురు ఉరితీత అంశాన్ని వ్యతిరేకిస్తూ జేఎన్యూ వర్సిటీలో కార్యక్రమాలు నిర్వహించాడని మంత్రి వీకే సింగ్ గుర్తుచేశారు. ఆరు నెలల తాత్కాలిక బెయిల్ పై కన్హయ్య కుమార్ విడుదలయ్యాక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వర్సిటీలో ఈవెంట్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. -
‘ఢిల్లీ వైపు సైన్యం’ నిజమే...
-
‘ఢిల్లీ వైపు సైన్యం’ నిజమే...
► 2012లో సైనిక దళాల కదలికలపై నాటి కేంద్ర మంత్రి మనీశ్ తివారీ స్పష్టీకరణ ► అప్పుడు ఆర్మీ చీఫ్గా ఉన్నది నేటి కేంద్ర మంత్రి వీకే సింగ్ ► అప్పట్లో యూపీఏ సర్కారుకు, వీకే సింగ్కు మధ్య విభేదాలు! ► సుప్రీంకోర్టు దాకా వెళ్లిన సింగ్ ‘పుట్టినరోజు’ రగడ ► తివారీ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ ► పనిలేని వ్యాఖ్యలన్న వీకే సింగ్ న్యూఢిల్లీ: 2012లో నాటి ఆర్మీ చీఫ్, నేటి కేంద్రమంత్రి జనరల్ వీకే సింగ్ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటుకు ప్రయత్నం జరిగిందన్న వార్త తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చి సంచలనం సృష్టించింది. ‘జనవరి 16, 2012 రాత్రి కీలకమైన రెండు సైనిక దళాలు.. ఒకటి హరియాణాలోని హిసార్ కేంద్రంగా ఉన్న దళం, మరొకటి ఆగ్రాలోని 50వ పారా బ్రిగేడ్.. అనూహ్యంగా, ప్రభుత్వానికి కానీ, మంత్రిత్వ శాఖకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. దేశ రాజధాని ఢిల్లీ వైపునకు కదిలాయి. ఈ విషయాన్ని కేంద్ర నిఘా విభాగం ప్రభుత్వానికి నివేదించింది’ అంటూ ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ ఏప్రిల్ 4న ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ వార్తను అప్పుడే ఆర్మీ ఖండించింది. తాజాగా శనివారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ ఆ ఘటనను ప్రస్తావించారు. ‘ఆ ఘటన దురదృష్టకరమే కానీ వాస్తవం. నేనప్పుడు రక్షణ రంగ స్థాయీ సంఘంలో సభ్యుడిగా ఉన్నాను’ అని తివారీ వ్యాఖ్యానించడంతో సైనిక కుట్ర అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుత కేంద్రమంత్రి జనరల్ వీకే సింగ్ ఘటన జరిగిన సమయంలో సైనిక దళాల ప్రధానాధికారిగా ఉన్నారు. ఆయన జన్మదినానికి సంబంధించిన ఒక వివాదంపై ఆ రోజే(2012, జనవరి 16న) సుప్రీంకోర్టులో కేసు వేశారు. అదే వివాదానికి సంబంధించి అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏతో జనరల్ వీకే సింగ్కు విబేధాలు పొడచూపాయన్న వార్తలూ అప్పుడు ప్రచారంలో ఉన్నాయి. దాంతో సైనిక కుట్రకు జనరల్ సింగ్ ప్రయత్నించారన్న వాదన వినిపించింది. కానీ ఆ వార్తలను నాటి యూపీఏ ప్రభుత్వం, ఆర్మీ ఆ వెంటనే ఖండించాయి. కాగా, మనీశ్ తివారీ చేసిన తాజా వ్యాఖ్యలు సొంతపార్టీ కాంగ్రెస్ను సైతం ఇరుకున పెట్టాయి. దాంతో, తివారీ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ‘సైనిక దళాల కదలికకు సంబంధించిన కథనం అవాస్తవం. ఆర్మీ యూనిట్స్లో అలాంటి కదలికలు సహజమే.. సాధారణమే. వాటిపై ఇప్పుడు మాట్లాడటం అసందర్భం.. అనవసరం.. తప్పు కూడా. అదీకాక మా సహచరుడు(మనీశ్ తివారీ) అప్పుడు భద్రతపై కేబినెట్ కమిటీలోనే కాదు.. సంబంధిత నిర్ణయాలు తీసుకునే ఏ విభాగంలోనూ సభ్యుడు కాదు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వివరణ ఇచ్చారు. సంబంధం లేని విషయాలపై ఇకపై మాట్లాడవద్దంటూ తివారీని సున్నితంగా హెచ్చరించారు. మరోవైపు, తివారీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, నాటి ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ మండిపడ్డారు. ‘ప్రస్తుతం ఏ పనీ లేని వ్యక్తి నుంచి ఆ వ్యాఖ్యలు వచ్చాయం’టూ తిప్పికొట్టారు. నాటి ఘటనలను తాను రాసిన పుస్తకంలో స్పష్టంగా వివరించానని, ముందు ఆ పుస్తకం చదవమని తివారీకి సలహా ఇచ్చారు. అయితే, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మనీశ్ తివారీ ఆదివారం స్పష్టం చేశారు. తివారీ తాజా వ్యాఖ్యలపై నాటి ప్రధాని మన్మోహన్సింగ్, అప్పుడు రక్షణమంత్రిగా ఉన్న ఏకే ఆంటోనీ వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆర్మీలో నైతిక స్థైర్యం దెబ్బదీసేలా రాజకీయ కుట్రలకు పాల్పడటం కాంగ్రెస్కు అలవాటేనని బీజేపీ అధికార ప్రతినిధి సిద్ధార్థ్నాథ్ సింగ్ విమర్శించారు. పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో చర్చించిన అంశాలను బహిరంగపర్చకపోవడం పార్లమెంటరీ సంప్రదాయమని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆర్మీ కదలికలపై వచ్చిన వార్తలను అప్పుడే ఆర్మీ, యూపీఏ ఖండించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
ఔను! సైన్యం అనుమానాస్పద కదలిక నిజమే!
కాంగ్రెస్ నేత మనీష్ తీవారి వ్యాఖ్యలు.. కొట్టిపారేసిన వీకే సింగ్ న్యూఢిల్లీ: మూడేళ్ల కిందట హర్యానా నుంచి ఢిల్లీ వైపుగా సైన్యం అనుమానాస్పదంగా కదిలిన ఘటన నిజమేనంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మనీష్ తివారి పేర్కొనడం రాజకీయ దుమారం రేపుతోంది. మనీష్ తీవారి వ్యాఖ్యలను ఆర్మీ మాజీ చీఫ్, కేంద్రమంత్రి వీకే సింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. 'మనీష్ తివారీకి ఏ పని లేదు. ఇందుకు సంబంధించిన నా పుస్తకం ఒకటి ఉంది. దానిని చదవమనండి. ఆయనకే అంతా తేటతెల్లం అవుతుంది' అని వీకే సింగ్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మనీష్ తివారీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. సైన్యం అనుమానాస్పద కదలిక వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. 2012లో జరిగిన ఈ ఘటన దురదృష్టకరమైనది అయినప్పటికీ నిజమేనని మనీష్ తివారి పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆయన ఆహూతుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. 'ఆనాటి రాత్రి రైసినా హిల్స్ భయభ్రాంతులకు లోనైంది. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండానే రెండు ఆర్మీ యూనిట్లు (2012 ఏప్రిల్ 4న) ఢిల్లీ వైపుగా కదిలాయి. ఇది దురదృష్టకరం అయినప్పటికీ, నిజం' అని చెప్పారు. తాను అప్పుడు రక్షణశాఖపై పార్లమెంటు స్థాయీ సంఘంలో ఉన్నానని, తనకు తెసినంతవరకు ఇది నిజంగా జరిగిన ఘటనేనని అన్నారు. -
వీకే సింగ్ను తొలగించాల్సిందే...
న్యూఢిల్లీ: దళిత చిన్నారుల సజీవదహనం ఉదంతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి వి.కె.సింగ్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని పట్టుబడుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు సోమవారం పార్లమెంటు భవనం వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు ఉభయసభల భేటీకి ముందు.. రాహుల్గాంధీ సారథ్యంలో జరిగిన ఈ నిరసనలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. ఒక కేంద్రమంత్రి ఒక నిర్దిష్ట వర్గానికి-ఆ మాటకొస్తే భారతీయులకు వ్యతిరేకంగా వ్యవహరించిన తీరును బట్టే ఈ అంశా న్ని లేవనెత్తుతున్నామని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఆ అంశంపై ఈ నెల 2వ తేదీన లోక్సభలో తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను రికార్డుల్లో చేర్చలేదంటూ ఖర్గే జీరో అవర్లో స్పీకర్కు ఫిర్యాదు చేసి, నిరసన తెలిపారు. దళిత చిన్నారుల సజీవదహనం సందర్భంగా వీకే సింగ్ చేసిన ‘కుక్క’ వ్యాఖ్యల్లో నేరపూరిత ఉద్దేశ్యం లేదని స్పష్టంచేస్తూ.. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలంటూ వచ్చిన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఆయన మాటల్లో దళితులను కించపరిచే వ్యాఖ్యలు లేవని, కేంద్రప్రభుత్వం బాధ్యత లేదు అని చెప్పేందుకే ‘కుక్క’ వ్యాఖ్యలుచేశారని సోమవారం విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. -
వీకే సింగ్ ను పీకేయాలి.. రాహుల్ నేతృత్వంలో ధర్నా
న్యూఢిల్లీ: దళితులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి వీకే సింగ్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు. ఉభయ సభల ప్రారంభానికి పార్లమెంటు ఆవరణలో సోమవారం ఉదయం ఈ ధర్నా జరిగింది. ఇందులో రాజ్యసభ, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుల గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేతలు ఆనంద్ శర్మ, దీపేందర్ హుడా పాల్గొన్నారు. దళితులను ఉద్దేశించి 'కుక్క' అని వ్యాఖ్యలు చేసిన వీకే సింగ్ ను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఒక అట్టడుగు సామాజిక వర్గం గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతోనే ఈ విషయంలో తాము పట్టుబడుతున్నామని వారు తెలిపారు. హరియాణాలో ఇద్దరు దళిత చిన్నారుల హత్య ఘటనపై స్పందిస్తూ ప్రతి స్థానిక సమస్యకు కేంద్రం బాధ్యత వహించదని, కుక్కలపై రాయి విసిరినా ప్రభుత్వమే బాధ్యత వహించాలా అని ఆర్మీ మాజీ చీఫ్ అయిన వీకే సింగ్ వ్యాఖ్యానించడం తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే. -
వీకే సింగ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన
-
ప్రభుత్వానికి పరీక్షాసమయం
ఈ వారంలో పార్లమెంటు ముందుకు కీలక బిల్లులు ♦ రాజ్యసభకు జీఎస్టీ నివేదిక సమర్పించిన సెలక్ట్ కమిటీ ♦ రెండో వారమంతా పార్లమెంటు సమావేశాల్లో రచ్చ ♦ రాజ్యసభలో విపక్షాల రగడ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం ♦ విపక్ష పార్టీల నేతలతో బీజేపీ చర్చలు న్యూఢిల్లీ: మొదటి వారంలో వివిధ అంశాలపై చర్చలవైపు సాగుతున్నట్లు అనిపించిన పార్లమెంటు.. రెండో వారంలో విపక్షాల ఆందోళనలతో మళ్లీ ‘వర్షాకాల సమావేశాల’ పరిస్థితిని తలపిస్తోంది. మరీ ముఖ్యంగా రాజ్యసభలో విపక్షాల ఆందోళనతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. కేంద్ర మంత్రి వీకే సింగ్ను మంతివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు నిరసనలు చేపట్టడం.. వెల్లోకి దూసుకు రావటంతో.. పరిస్థితి సర్దుకునేలా కనిపించటం లేదు. సభకు వీకే సింగ్ వచ్చినన్ని రోజులు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ తివారీ శనివారం తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం ఆరు బిల్లులు లోక్సభ ముందుకు, ఏడు బిల్లులు రాజ్యసభ ముందుకు రానున్నాయి. దేశాభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని కేంద్రం భావిస్తున్న ప్రతిష్ఠాత్మక వస్తుసేవల బిల్లు (జీఎస్టీ) కూడా రాజ్యసభ జాబితాలో ఉంది. లోక్సభ ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లుకు రాజ్యసభలో మోక్షం లభించలేదు. లోక్సభ నుంచి పెద్దలసభకు వెళ్లిన ఈ బిల్లును విపక్షాల డిమాండ్కు అనుగుణంగా సెలక్ట్ కమిటీకి పంపించారు. దీనిపై సెలక్ట్ కమిటీ తన నివేదికను సమర్పించింది. కాగా, సోమవారం నుంచి చర్చించాల్సిన విషయాలపై.. రాజ్యసభ సభావ్యవహారాల సలహా కమిటీ జీఎస్టీ బిల్లుకు నాలుగు గంటలు, రియల్ ఎస్టేట్ బిల్లుకు రెండు గంటల సమయాన్ని కేటాయించింది. దీనిపై సభలో చర్చ జరగనుంది. అయితే.. జీఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లులకు ఈ శీతాకాలపు సమావేశాల్లోనే పార్లమెంట్ ఆమోదం లభించే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. విపక్ష పార్టీల నేతలతో బీజేపీ ముఖ్యనేతలు చర్చలు జరుపుతున్నారు. కాగా, దేశంలోని వివిధ ప్రాంతాలలో నెలకొన్న కరవు పరిస్థితులపై సోమవారం లోక్సభలో.. నేపాల్లో నెలకొన్న పరిస్థితులు, భారత్-నేపాల్ సంబంధాలపై రాజ్యసభలో స్వల్ప వ్యవధి చర్చ జరగనుంది. జీఎస్టీ బిల్లు దేశానికి చాలా అవసరం అంటూనే.. 18శాతం క్యాప్తోపాటు తాము సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ సూచించింది. ప్రధానితో ‘చాయ్ పే చర్చ’లోనూ చర్చలు లేకుండా బిల్లును ఆమోదిస్తామనటంపై సోనియా గాంధీ హామీ ఇవ్వలేదని.. చర్చ జరిగాకే బిల్లు ముందుకు కదులుతుందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత ఆనంద్ శర్మ తెలిపారు. వీకే సింగ్పై గోబెల్స్ ప్రచారం ఆపండి!: బీజేపీ కేంద్ర మంత్రి వీకే సింగ్ వ్యాఖ్యల వివాదంలో రాజ్యసభలో ఆందోళన చేస్తూ.. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న కాంగ్రెస్పై బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది. వీకే సింగ్ విషయంలో అసత్యాలతో కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని బీజేపీ దళిత నేత బిజయ్ సోన్కర్ శాస్త్రి విమర్శించారు. వీకే సింగ్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో తెలపాలని డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలోనే దళితులపై ఎక్కువ అన్యాయాలు జరిగాయని ఆరోపించారు. 2004-13 మధ్య కాంగ్రెస్ హయాంలోనే హరియాణాలో దళితులపై అత్యాచారాలు రెండున్నశాతం పెరిగినట్లు (మొత్తం కేసులు 3,198 కేసులు) వివరించారు. ఈ ఘటనలపై కనీసం విచారం వ్యక్తం చేసేందుకు కూడా సోనియా గాంధికి సమయం దొరకలేదా అని బిజయ్ ప్రశ్నించారు. -
వీకేసింగ్కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు
-
వీకే సింగ్ వ్యాఖ్యలపై పెనుదుమారం
-
వీకే సింగ్ వ్యాఖ్యలపై పెనుదుమారం
న్యూఢిల్లీ: ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్కు మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. దళితుల చిన్నారుల హత్య, అనంతర పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చిక్కుల్లోకి నెట్టేస్తున్నాయి. హరియాణాలో ఇద్దరు దళిత చిన్నారుల హత్యపై వీకే సింగ్ చేసిన ధుమారం రేపుతున్నాయి. వీకే సింగ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో నిరసన ఆందోళన చేపట్టింది. ప్రసాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన ఆప్ శ్రేణులు వీకే సింగ్పై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. వీకే సింగ్పై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. దేశంలో మత అసహన ఘటనలు పెరిగిపోవడానికి మోదీ సర్కారే బాధ్యత వహించాలంటూ వెల్లువెత్తిన విమర్శలపట్ల వీకే సింగ్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ప్రతి స్థానిక సమస్యకు కేంద్రం బాధ్యత వహించదని, కుక్కలపై రాయి విసిరినా ప్రభుత్వమే బాధ్యత వహించాలా అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. మరోపక్క, కేంద్ర మంత్రులు వీకే వీకే సింగ్, కిరణ్ రిజీజు వ్యవహారం బీజేపీలో కాక రేపుతోంది. వారి మాటలపై పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజీజు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నుంచి వివరణ తీసుకున్నారు. అనంతరం అధికారంలో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాలంటూ రాజ్ నాధ్ హితవు పలికారు. -
కుక్కమీద రాళ్లేస్తే మమ్మల్ని నిందిస్తారా?
న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి వీకె సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హరియాణాలో దళిత కుటుంబంపై దాడి ఉదంతంపై ఆయన గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరో కుక్క ను రాళ్లతో కొడితే దానికి ప్రభుత్వాన్నినిందించాల్సిన అవసరం లేదంటూ వివాదాన్ని రాజేశారు. దళిత చిన్నారుల సజీవ దహనంపై దేశవ్యాప్తంగా చెలరేగిన విమర్శల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అది రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ అంటూ వీకె సింగ్ కొట్టి పారేశారు. ఆ గొడవ కాస్తా వేరే రూపం తీసుకుందని వ్యాఖ్యానించారు ఈ విషయంలో స్థానిక అధికారుల వైఫల్యం చెందితే అప్పుడు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందన్నారు. దీంతో పాటు కుక్క మీద రాళ్లేస్తే దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది.. కానీ ఇది జరగలేదన్నారు. స్థానిక గొడవలతో ప్రభుత్వానికి సంబంధం లేదని తెగేసి చెప్పారు. ప్రతి విషయానికి కేంద్రాన్ని నిందించడం తగదన్నారు. ఓవైపు దేశంలో జరుగుతున్న మతఘర్షణలు చిన్నారుల సజీవ దహనం ఉదంతాలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంటే, బీజేపీ నేతల మాటలు మంటలు రాజేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. వీకే సింగ్ ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హరియాణా ప్రభుత్వం ఈ సంఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖతార్ , పిల్లలను కోల్పోయి,ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించారు. -
కేంద్రమంత్రికి ఝలక్!
న్యూఢిల్లీ: విదేశాంగ సహాయ మంత్రి జనరల్(రిటైర్డ్) వీకేసింగ్కు షాక్ తగిలింది. సొంత కూతురే ఆయన షాక్ ఇచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక ర్యాంకు ఒక పెన్షన్ అమలు కోసం ఆందోళన చేస్తున్న మాజీ సైనికోద్యోగులను వీకే సింగ్ కుమార్తె మృణాళిని పరామర్శించారు. నిరహార దీక్షలు చేస్తున్న వారికి తన మద్దతు తెలియజేశారు. ఒక మాజీ సైనికాధికారిగా కూతురిగా మాజీ సైనికుల ఆందోళనకు తన మద్దతు తెలుపుతున్నానని మృణాళిని తెలిపారు. సాధ్యమైనంత వేగంగా ఈ పథకాన్ని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఒకపక్క ఈ పథకం అమలు చేయడంపై తమకు అభ్యంతరం ఏమీ లేందంటూనే కేంద్రప్ రభుత్వం తాత్సారం చేస్తోంది. మరో పక్క ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై ప్రతి పక్షాలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మత్తిపోస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పథకం అమలుపై కచ్చితమైన ప్రకటన చేయాలని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కుమార్తె ఆందోళన కారులకు మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ డిమాండ్ పై రిటైర్ ఉద్యోగుల ఆందోళనలు నిరాహారదీక్షలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. జంతర్మంతర్ వద్ద మాజీ సైనికోద్యోగుల ఆందోళనకు వివిధ పార్టీ నాయకులు ఇప్పటికే తమ మద్ధతు తెలిపారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తన పూర్తి మద్దతు ప్రకటించారు. -
ప్రధాని స్పందించాల్సిన అవసరం ఏముంది?
న్యూఢిల్లీ:ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌన ముద్ర దాల్చుతున్నారన్న కాంగ్రెస్ ఆరోపణలపై విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వీకే సింగ్ మండిపడ్డారు. అసలు ప్రధానికి ఆ అంశంపై మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వచ్చే ప్రతీ ఆరోపణపై ప్రధాని స్పందించాలిన కోరడం భావ్యం కాదన్నారు. లలిత్ మోదీ అంశంపై ప్రధానిని ఎందుకు బలవంతం చేస్తున్నారంటూ వీకే సింగ్ ప్రశ్నించారు. అలా చేయడం సరైన పనేనా అంటూ కాంగ్రెస్ ను నిలదీశారు. ఒకవేళ ప్రధాని మాట్లాడాల్సి వస్తే దానికి తగిన సమయంలో తప్పకుండా స్పందిస్తారన్నారు. ఒక న్యూస్ ఛానల్ ఏదో ప్రసారం చేస్తే.. దానికి కూడా ప్రధాని స్పందించాలని అడగడం సరైన పద్ధతి అనిపించుకుంటుందా? అని విమర్శలను తిప్పికొట్టే యత్నం చేశారు. -
పాత్రికేయులను దూషించిన వీకే సింగ్
న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.కె.సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పాత్రికేయులు, మీడియా ప్రతినిధులను ‘ప్రెస్టిట్యూట్స్’ అంటూ దూషణపూర్వకంగా అభివర్ణించి.. ప్రసార సంపాదకుల సంఘం (బీఏఈ) నుంచీ, పలు రాజకీయ పార్టీల నుంచీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. యెమెన్ నుంచి భారతీయులను ఖాళీ చేయించే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రస్తుతం జిబోటిలో ఉన్న వి.కె.సింగ్ మంగళవారం నాడు.. తాను ఇటీవల ఢిల్లీలో పాక్ దౌత్యకార్యాలయం సందర్శనతో పోల్చితే.. భారతీయులను రక్షించే కార్యక్రమం ఏమంత ఉత్సాహకరంగా లేదన్నారు. ఈ వ్యాఖ్యలను ఒక టీవీ చానల్ తన కథనంలో విమర్శించటంపై స్పందిస్తూ.. ‘‘ప్రెస్టిట్యూట్ల’ నుంచి ఏం ఆశిస్తాం’’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. దీనిపై బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ స్పందిస్తూ.. సింగ్ తన వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నారంది. సింగ్ వివాదాస్పద ట్వీట్లతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. -
జిబౌతికి బయల్దేరిన వీకే సింగ్
న్యూఢిల్లీ: యెమెన్లో చిక్కుకుపోయిన 4 వేల మంది భారతీయుల తరలింపు చర్యలను పర్యవేక్షించేందుకు విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ మంగళవారం యెమెన్ పొరుగు దేశమైన జిబౌతికి బయల్దేరారు. తరలింపులో భాగంగా భారత్ ఐదు నౌకలు, నాలుగు విమానాలను రంగంలోకి దించింది. యెమన్లోని ఆడెన్లో చిక్కుకున్న 400 మంది భారతీయులను జిబౌతికి తీసుకొచ్చేందుకు నేవీకి చెందిన ఐఎన్ఎస్ సుమిత్ర నౌక యెమెన్ తీరానికి చేరుకుంది. మార్గ మధ్యంలో ఉన్న మరో నాలుగు నౌకలు రెండు మూడు రోజుల్లో అక్కడికి చేరుకోనున్నాయి. ప్రధాని మోదీ సోమవారం సౌదీ అజీజ్ అల్ సాద్కు ఫోన్ చేసి, భారతీయుల తరలింపునకు సాయం చేయాలని కోరారు. -
రాజీనామా చేస్తాననలేదు: వీకే సింగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి, బీజేపీకి, ప్రధాని మోదీకి సంపూర్ణంగా నిబద్ధుడనని కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ స్పష్టం చేశారు. తాను రాజీనామాకు సిద్ధమయ్యానన్న వార్తలు అవాస్తవమన్నారు. పాకిస్తాన్ హై కమిషన్ వద్ద పాక్ నేషనల్ డే ఉత్సవాలకు హాజరైన అనంతరం తాను చేసిన ట్వీట్లపై ఒక వర్గం మీడియా కావాలనే రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు. కొందరు తన జాతీయవాద వైఖరిని ప్రశ్నించారన్నారు. ఈ మేరకు ఒక ప్రకటనను మంగళవారం ఆయన మీడియా ముందు చదివి వినిపించారు. రాజీనామాకు సిద్ధమయ్యారా? అన్న ప్రశ్నకు.. ఆయన తాను అలాంటి ప్రతిపాదనేమీ చేయలేదని స్పష్టం చేశారు. -
'మత్స్యకారుల భద్రతకు ప్రత్యేక పథకం'
లోక్సభలో ఎంపీ పొంగులేటి ప్రశ్నకు కేంద్రం సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: ప్రాదేశిక జలాల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు. ఈ పథకంలోభాగంగా జీపీఎస్, సమాచార వ్యవస్థ, ఎకో సౌండర్, సెర్చ్, రెస్క్యూ వంటివి అమల్లో ఉన్నాయని వివరించారు. కచ్ఛతీవు ద్వీపంలో ఘర్షణల వ్యవహారంపై శ్రీలంకతో చర్చలు, సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు మరో ఎంపీ బుధవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. జాతీయ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీపై పొంగులేటి, మరి కొం దరు ఎంపీలు అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి రాజీవ్ప్రతాప్ రూఢీ లిఖితపూర్వత సమాధానమిచ్చారు. కేంద్రం లోని 20 మంత్రిత్వ శాఖల విభాగాలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. 12వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం వ్యవసాయేతర రంగాల్లో 5 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. జనవరి 2015-మార్చి 2017 మధ్య 3.29కోట్ల మందిని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి చెప్పారు. -
యూపీలోనూ పాగా వేస్తాం: వీకే సింగ్
ఘజియాబాద్: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ తమ పార్టీ పాగా వేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2016లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టామని చెప్పారు. షహియాబాద్ లో ఆదివారం జరిగిన భారతరత్న మదన్ మోహన్ మాలవ్య, స్వామి వివేకానంద జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. -
జైళ్ల శాఖలో అవినీతిని నిర్మూలించాం: డీజీ వీకే సింగ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖలో అవినీతిని పూర్తిగా నిర్మూలించామని ఆ శాఖ డీజీ వినయ్కుమార్ సింగ్ అన్నారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ చంచల్గూడలోని స్టేట్ ఇన్స్ట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్(సీకా) కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి అవినీతిరహిత శాఖగా జైళ్ల శాఖ రూపుదిద్దుకుందని తెలిపారు. ఈ శాఖను అవినీతిరహితంగా మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. తాము చేపట్టిన సర్వేలో జైళ్లలో అవినీతి చాలా వరకూ అంతం అయ్యిందన్న విషయం స్పష్టమైందన్నారు. జైళ్ల శాఖలో అవినీతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీసుశాఖ, ఇంటెలిజెన్స్ సంస్థలను కోరగా వారి నుంచి ఎలాంటి వ్యతిరేక నివేదిక రాలేదన్నారు. ఈ క్రమంలోనే జైళ్ల శాఖను అవినీతిరహిత శాఖగా ప్రకటించడానికి సాహసం చేశామన్నారు. భవిష్యత్తులో ఈ శాఖలో ఏదైనా అవినీతి జరిగిందని తెలిస్తే తానే బాధ్యత వహిస్తానని డీజీ స్పష్టం చేశారు. చంచల్గూడ జైలు పరిసరాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఈ నెల 13న ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇంచార్జి ఐజీ ఎం.చంద్రశేఖర్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వీకే సింగ్ కు చేదు అనుభవం
అగ్రా: విదేశాంగ సహాయ మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు ఆర్ఎస్ఎస్ ఆయన ఉపన్యాసాన్ని రద్దు చేసింది. ఆగ్రాలో జరుగుతున్న 'యువ సంకల్ప శిబర్'కు ఆదివారం ఆయన హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు సమావేశానికి రావాల్సివుండగా, మధ్యాహ్నం 12.40 గంటలకు వచ్చారు. ఆలస్యంగా వచ్చినందుకు ఆయన ప్రసంగాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఒకరి కోసం తమ షెడ్యూల్ ను పొడిగించలేమని ఆర్ఎస్ఎస్ మీడియా ఇన్చార్జి వీరేంద్ర వర్షనేయ స్పష్టం చేశారు. -
వీకే సింగ్ కు చేదు అనుభవం
అగ్రా: విదేశాంగ సహాయ మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు ఆర్ఎస్ఎస్ ఆయన ఉపన్యాసాన్ని రద్దు చేసింది. ఆగ్రాలో జరుగుతున్న 'యువ సంకల్ప శిబర్'కు ఆదివారం ఆయన హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు సమావేశానికి రావాల్సివుండగా, మధ్యాహ్నం 12.40 గంటలకు వచ్చారు. ఆలస్యంగా వచ్చినందుకు ఆయన ప్రసంగాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఒకరి కోసం తమ షెడ్యూల్ ను పొడిగించలేమని ఆర్ఎస్ఎస్ మీడియా ఇన్చార్జి వీరేంద్ర వర్షనేయ స్పష్టం చేశారు. -
వీకే సింగ్ కు చేదు అనుభవం
అగ్రా: విదేశాంగ సహాయ మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు ఆర్ఎస్ఎస్ ఆయన ఉపన్యాసాన్ని రద్దు చేసింది. ఆగ్రాలో జరుగుతున్న 'యువ సంకల్ప శిబర్'కు ఆదివారం ఆయన హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు సమావేశానికి రావాల్సివుండగా, మధ్యాహ్నం 12.40 గంటలకు వచ్చారు. ఆలస్యంగా వచ్చినందుకు ఆయన ప్రసంగాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఒకరి కోసం తమ షెడ్యూల్ ను పొడిగించలేమని ఆర్ఎస్ఎస్ మీడియా ఇన్చార్జి వీరేంద్ర వర్షనేయ స్పష్టం చేశారు. -
చర్లపల్లి, చంచల్ గూడలో జామర్లు: వీకే సింగ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జైళ్లలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అన్నారు. కరప్షన్ ప్రీ అడ్మిస్ట్రేటివ్ అడ్మిషన్లకు కృషి చేస్తున్నామని వీకే సింగ్ మీడియాకు తెలిపారు. అవినీతిక అడ్డుకట్ట వేయలేకపోతే పూర్తి బాధ్యత నాదేనని ఆయన అన్నారు. 3 నెలల కాలంలో జైళ్లలో అవినీతిని నిర్మూలిస్తామన్నారు. చంచల్ గూడ, చర్లపల్లి జైళ్లలో జామర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అన్ని జైళ్ల శాఖలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విద్యదానం కార్యక్రమం ఖైదీలలో మంచి సత్పలితాలను ఇస్తోందని వీకేసింగ్ చెప్పారు. -
మోడీ సర్కారుకు కొత్త చిక్కు!
కేంద్ర మంత్రి వీకే సింగ్ను తప్పుబట్టిన సైనిక ట్రిబ్యునల్ ►సుక్నా భూ కుంభకోణం కేసులో ఘాటు వ్యాఖ్యలు ►ఆర్మీ చీఫ్గా సైన్యానికి ఆయన మచ్చ తెచ్చారన్న కోర్టు ► సీనియర్ అధికారులను వేధించారు, కోర్టు మార్షల్నూ ప్రభావితం చేశారని మండిపాటు.. ఆర్మీ మాజీ అధికారి రథ్పై కోర్టు మార్షల్ రద్దు న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఆయన కేబినెట్ సహచరుడు, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ గతంలో సుక్నా భూ కుంభకోణం కేసులో వ్యవహరించిన తీరును సైనిక కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సైన్యానికి ఆయన మచ్చతెచ్చారని, సీనియర్ అధికారులపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారిని వేధింపులకు గురి చేశారని, నిబంధనలను అతిక్రమించి మిలటరీ కోర్టును కూడా ప్రభావితం చేశారని సైనిక దళాల ట్రిబ్యునల్(ఏఎఫ్టీ) తాజాగా పేర్కొంది. సైన్యంలోని 33వ పటాళానికి చెందిన మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీకే రథ్పై జరుగుతున్న కోర్టు మార్షల్(సైనిక కోర్టు విచారణ)ను రద్దు చేసింది. ఇంతకాలం వేధించినందుకు, ప్రతిష్ట దెబ్బతీసినందుకు ఆయనకు రూ.లక్ష చెల్లించాలని సైన్యాన్ని ఆదేశించింది. అసలేం జరిగింది? పశ్చిమబెంగాల్లోని సుక్నా ప్రాంతంలో మిలిటరీ కంటోన్మెంట్కు ఆనుకుని ఉన్న 70 ఎకరాల్లో విద్యాసంస్థను నెలకొల్పేందుకు ఓ ప్రైవేటు బిల్డర్కు నిరభ్యంతర పత్రము(ఎన్వోసీ) ఇచ్చారు. దీనిపై అప్పట్లో ఈస్టర్న్ ఆర్మీ కమాండర్గా ఉన్న జనరల్ వీకే సింగ్ దీనిపై సైనిక విచారణ ప్రారంభించారు. రథ్ను దోషిగా తేల్చుతూ ఇందుకు శిక్షగా ఆయన రెండేళ్ల సీనియారిటీని తగ్గిస్తూ 2011లో కోర్టు మార్షల్ నిర్ణయించింది. విద్యా సంస్థ ఏర్పాటు అవసరాన్ని సిఫారసు చేసిన అప్పటి ఆర్మీ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అవదేశ్ ప్రకాశ్పైనా విచారణ కొనసాగించారు. అయితే దీనిపై జనరల్ రథ్ సైనిక ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. వీకే సింగ్ ఈ కేసుకు అనుచిత ప్రాధాన్యమిచ్చారని, ఆయన పుట్టిన సంవత్సరాన్ని 1951కి బదులు 1950గా అవదేశ్ ప్రకాశ్ తేల్చినందున ఆర్మీ చీఫ్గా సింగ్ పదవీ కాలం 8 నెలలకే పరిమితమైందని రథ్ తన పిటిషన్లో వివరించారు. దీంతో తమపై కక్ష పెంచుకుని ప్రతీకార చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ట్రిబ్యునల్... కోర్టు మార్షల్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. సైన్యం పరిధిలో లేని భూమికి ఎన్వోసీ ఇవ్వడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. కాగా దీనిపై జనరల్ రథ్ స్పందిస్తూ.. ఈ తీర్పుతో నా నిర్దోషిత్వం నిరూపితమైందన్నారు. ఇన్నేళ్లుగా తానెంతో వేదనను అనుభవించానన్నారు. సీనియర్ అధికారుల చేతిలో కింది సిబ్బంది బలికాకుండా, ఇలాంటివి పునరావృతం కాకుండా సైన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రిబ్యునల్ తీర్పుపై వీకే సింగ్ ధ్వజం ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని వీకే సింగ్ కోరారు. సైనిక విచారణలో అంతా నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. ట్రిబ్యునల్ తనపై వ్యక్తిగత దాడికి దిగిందని, ఈ వ్యవహారంలో తాను అవినీతిని అడ్డుకోడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. 77 పేజీల తీర్పు మొత్తంలో ఎక్కడా స్కాం గురించి ప్రస్తావించలేదని పేర్కొన్నారు. -
వీకే సింగ్ ‘దుమారం’!
ఉరుము లేకుండా పిడుగు పడటాన్ని ఊహించలేం. కానీ రాజకీ యాల్లో ఏదీ అసాధ్యంకాదు. ఆ సంగతి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి బాగా అర్ధమై ఉంటుంది. ఎవరి దయాదాక్షిణ్యాలూ అవసరం లేని స్థాయిలో సొంతంగా మెజారిటీని సాధించి... పాలనా యంత్రాం గాన్ని పటిష్టపరచడంలో మోడీ నిమగ్నమై ఉండగా హఠాత్తుగా జరిగిన రెండు పరిణామాలు ఆయన సర్కారును ఇరకాటంలో పడేశాయి. ఆ రెండూ సైనిక దళాల ప్రధానికాధికారిగా వచ్చే నెల 31న పదవీబాధ్యతలు స్వీకరించబోతున్న లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్సింగ్ సుహాగ్కు సంబంధించినవే. దల్బీర్సింగ్పై కొన్నాళ్లక్రితం అప్పటి సైనిక దళాల చీఫ్ జనరల్ వీకే సింగ్ తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమై నవని, పథకంప్రకారం చేసినవనీ సుప్రీంకోర్టు ముందు రక్షణ మంత్రిత్వ శాఖ దాఖలుచేసిన అఫిడవిట్ తేల్చిచెప్పింది. వీకే సింగ్ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో సహాయమంత్రిగా ఉన్నారు. ప్రభు త్వంలోని ఒక శాఖ మరో శాఖకు మంత్రిగా ఉన్నవారిని తప్పు బడుతూ అఫిడవిట్ దాఖలుచేయడమే దిగ్భ్రాంతికరంకాగా... వీకే సింగ్ దాన్ని ఇంకొంచెం పొడిగించారు. దల్బీర్సింగ్ ఖూనీకోరులకూ, బందిపోట్లకూ రక్షణ కల్పించిన వ్యక్తి అంటూ ట్వీట్ చేశారు. మరి కొన్నాళ్లలో మన సైన్యానికి నేతృత్వంవహించబోతున్న వ్యక్తి గురించి ప్రభుత్వంలోని మంత్రే ఇలాంటి వ్యాఖ్యలుచేయడంతో అందరూ విస్తుపోయారు. వీకే సింగ్కు వివాదాలు కొత్తకాదు. ఆయన సాధారణ సైనికుడిగా మొదలుపెట్టి సైనిక దళాల చీఫ్గా ఎదిగే క్రమంలో ఎన్నో విజయాలు సాధించివుండవచ్చు. దురదృష్టవశాత్తూ సింగ్ పేరు చెబితే ఈ విజ యాలు కాక వివాదాలు మాత్రమే అందరికీ స్ఫురణకొస్తాయి. సైనిక దళాల ప్రధానాధికారిగా ఉన్నప్పుడు తన పుట్టిన తేదీని మార్చాలని, దాని ఆధారంగా తన రిటైర్మెంట్ తేదీని కూడా సవరించాలని కేం ద్రంతో పేచీకి దిగారు. అది చూస్తుండగానే పెను దుమారంగా మారి ఆయన చివరకు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సైన్యంలో చేరిననాడు సమర్పిం చిన పత్రాల ఆధారంగా చూస్తే వీకే సింగ్ వాదన చెల్లదని, ఆయన కోరుకున్నట్టు పుట్టినతేదీని సవరించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. అటుతర్వాత ఆయన జడ్జీలపైనే వ్యా ఖ్యలుచేశారు. అటుతర్వాత నాసిరకం ట్రక్కుల కొనుగోలుకు తనపై ఒత్తిళ్లు వచ్చాయని, ఒక దళారీ రూ. 14 కోట్లు లంచం ఇవ్వజూపాడని ఆరోపించారు. దానిపై కేంద్రానికి లేఖ రాసినా స్పందనలేదని అన డంతో యూపీఏ సర్కారు ఇరకాటంలో పడింది. తమకు లేఖరాలేదని అప్పటి రక్షణమంత్రి ఆంటోనీ చెప్పినా, యూపీఏ సర్కారు మాటను ఎవరూ విశ్వసించలేదు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి సీబీఐ దర్యాప్తు వరకూ వచ్చింది. ఇంకా కొనసాగుతూనే ఉన్నది. సైనిక దళాల చీఫ్ స్థానంలో ఉన్నవారు ఎవరూ గతంలో ఇలా ప్రభుత్వంతో వివాదాలు తెచ్చుకోలేదు. అందరూ సామరస్య ధోరణిలో పనిచేసి రిటైరైనవారే. ప్రభుత్వానికీ, ఆర్మీ చీఫ్కూ మధ్య విశ్వాసరాహిత్యం ఏర్పడితే దాని ప్రభావం సైనిక దళాలపైన కూడా పడుతుందని, అది దేశానికి మంచిదికాదని రక్షణ రంగ నిపుణులు అప్పట్లో హెచ్చరించారు. ఇదంతా ఒక ఎత్తయితే తాను సైనిక దళాల చీఫ్గా ఉన్నప్పుడు దల్బీర్సింగ్ విషయంలో వ్యవహరించిన తీరు మరో ఎత్తు. దల్బీర్ ఆధ్వర్యంలో పనిచేసిన యూనిట్ 2010లో ముగ్గురిని ఎన్కౌంటర్ పేరిట మట్టుబెట్టిందని, ఆ మరుసటి సంవత్సరం ఒక ఇంటిపై బంది పోటు దొంగతనానికి పాల్పడిందని ఆరోపణలు రావడంతో వీకే సింగ్ ఆయనపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించారు. అయితే, ఈ ఘట నల్లో నిందితులుగా ఉన్న సైనికాధికారులపైనా, జవాన్లపైనా సైన్యం విచారణ జరపడం, చర్యలు తీసుకోవడం పూర్తయింది. ఘటనలతో ప్రమేయం ఉన్నవారిని దల్బీర్ కాపాడటానికి ప్రయత్నించారన్న ఆరో పణల్లో నిజంలేదని ఆ విచారణల్లో వెల్లడయ్యాకే దల్బీర్కు ఈస్ట్రన్ క మాండ్ చీఫ్గా పదోన్నతి వచ్చింది. ఈలోగా వీకే సింగ్ రిటైరయ్యారు. వాస్తవం ఇదికాగా దల్బీర్ ఖూనీకోరులకూ, బందిపోట్లకూ నెలవైన యూనిట్కు నాయకత్వంవహించారని, వారిని కాపాడటానికి ప్రయ త్నించారని వీకే సింగ్ అనడం వాస్తవాలను తారుమారు చేయడమే. ఇప్పుడు దల్బీర్కు సైనిక దళాల చీఫ్గా పదోన్నతి ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యం విషయంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఆ వాస్తవాలనే అఫిడవిట్లో పొందుపరిచింది. అంతేకాదు... మరి కొంచెం ముందుకుపోయి దల్బీర్పై అప్పట్లో తీసుకున్న క్రమశిక్షణా చర్యలు చట్టవిరుద్ధమైనవని, పథకం ప్రకారం చేసినవని తేల్చి చెప్పింది. ఈ అఫిడవిట్ను ప్రమాణంగా తీసుకుంటే వీకే సింగ్ ఇప్పుడు మంత్రి పదవిలో కొనసాగడానికి నైతికంగా అనర్హుడవుతారు. సర్వీ సులో ఉండగా కిందిస్థాయి ఉద్యోగిపై వీకే సింగ్ కుట్రపూరితంగా వ్యవహరించారని ప్రభుత్వమే సుప్రీంకోర్టు ముందు అంగీకరించిన ప్పుడు ఆయనను మంత్రిగా కొనసాగించడంలో ఔచిత్యమేముంటుం దన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ న్యాయ మీమాంస ఇలావుండగానే తన ట్వీట్తో వీకే సింగ్ దాన్ని మరింత జటిలం చేశారు. యూపీఏ సర్కారు అధికారంనుంచి వైదొలగుతూ దల్బీర్ను సైనిక దళాల చీఫ్గా నియ మించడంపై బీజేపీకి అభ్యంతరమున్నా రక్షణమంత్రి అరుణ్ జైట్లీ పరి ణతితో వ్యవహరించి ప్రస్తుత వివాదానికి ఇప్పటికైతే ముగింపు పలి కారు. లేకుంటే ఇది మరింత ముదిరేది. మంత్రులకూ, అధికార యం త్రాంగానికి లక్ష్యాలు నిర్దేశించి చురుగ్గా పనిచేసుకుంటూ పోతున్న ఎన్ డీఏ సర్కారుకు ఇలాంటి వివాదాలు ఇబ్బంది కలిగించేవే. ఏరి కోరి ఇష్టపడి తెచ్చుకున్నందుకు వీకే సింగ్లాంటివారిని అదుపు చేయడం కూడా తన బృహత్తర కర్తవ్యాల్లో ఒకటిగా భావించక తప్పదుమరి!