Kanimozhi
-
TN: అన్నామలైకి కనిమొళి స్ట్రాంగ్ కౌంటర్
చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి డీఎంకే ఎంపీ కనిమొళి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(మార్చ్ 28)రాత్రి కరూర్లో నిర్వహించిన సభలో కనిమొళి మాట్లాడారు. ‘ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ గతంలో కరూర్ నుంచి పోటీ చేశారు. సెంథిల్ బాలాజీ భయంతోనే ఈ ఎన్నికల్లో అన్నామలై కరూర్ నుంచి పోటీ చేయడం లేదు’ అని కనిమొళి సెటైర్లు వేశారు. గతంలో కరూర్ నుంచి ఒక మంత్రి ఉండేవాడని, ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నాడని ఇటీవల కరూర్లో నిర్వహించిన ప్రచారంలో అన్నామలై ప్రస్తావించినందునే కనిమొళి ఆయనకు కౌంటర్ ఇచ్చారు. పార్లమెంటులో మాట్లాడిన ఎంపీలను సస్పెండ్ చేస్తారని, బయటమాట్లాడిన వారిని జైలుకు పంపుతారని కేంద్ర ప్రభుత్వంపై కనిమొళి విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు గెలుచుకునే అవకాశాలు కూడా లేవన్నారు. ప్రస్తుతం కరూర్ నుంచి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ జోతిమణి పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి.. కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ రాజీనామా -
ఇండియా కూటమి రాకతో
సాక్షి, చెన్నై: రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం చేపట్టి పార్లమెంట్ ఆమోదం పొందిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకు రావడం తథ్యం అని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆ పార్టీ మహిళా విభాగం నేతృత్వంలో చెన్నై వైఎంసీఏ మైదానంలో మహిళా హక్కు మహానాడు శనివారం రాత్రి జరిగింది. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన, డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో జరిగిన ఈ మహానాడుకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తూ, దేశంలో మహిళలు వివిధ రంగాలలో పురోగమిస్తున్నారని అన్నారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం కావాలనే కాంక్షతో ఆది నుంచి కాంగ్రెస్ పొరాడుతున్నట్లు పేర్కొన్నారు. ఒక మహిళ చదువుకుంటే, ఆ కుటుంబమే చదువుకున్నట్లని వ్యాఖ్యానించారు. మహిళా నాయకత్వం విస్తృతం, మహిళ చేతికి అధికారంలోకి వస్తే దేశం బలోపేతం అవుతుందన్న కాంక్షతో గతంలోనే 33 శాతం రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టామన్నారు. యూపీఏ హయాంలోనే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినా, ఏకాభిప్రాయం కుదరక పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందలేక పోయినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ఆ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిందని గుర్తు చేస్తూ, దీనిని ఎప్పుడు అమలు చేస్తారో అన్నది స్పష్టం చేయడం లేదన్నారు. రేపు చేస్తారా..? ఎల్లుండి చేస్తారా..? ఏడాది తర్వాత చేస్తారా..? రెండేళ్ల తర్వాత చేస్తారా...? అని ప్రశి్నస్తూ, ఈ బిల్లు అమలు అన్నది రానున్న ఇండియా కూటమి ద్వారానే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ చట్టం కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని గుర్తుచేస్తూ, ఇండియా కూటమి రాకతో ఈ చట్టం అమల్లోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాం«ధీ, జమ్మూకశీ్మర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, బిహార్ ఆహార శాఖ మంత్రి లేషి సింగ్, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుష్మితా దేవ్, ఢిల్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో పథకాల అమలు భేష్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరు ప్రశంసనీయంగా ఉందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కనిమొళి కరుణానిధి అభినందించారు. కనిమొళి అధ్యక్షతన 11 మంది ఎంపీలతో కూడిన బృందం విశాఖ జిల్లాలోని ఆనందపురం, పద్మనాభం మండలాల్లో శనివారం పర్యటించింది. కేంద్ర నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించారు. శొంఠ్యాంలోని రామ్సాగర్ అమృత్ సరోవర్ ట్యాంకుతోపాటు, చందక గ్రామంలో వ్యవసాయ భూరీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. పద్మనాభం మండలం రెడ్డిపల్లి సచివాలయంలో అందుతున్న సేవల గురించి ఆరా తీసింది. వివిధ గ్రామాలకు చెందిన స్వయం సహాయక బృందాల సభ్యులతో మాట్లాడి పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. సచివాలయాల సేవలు అద్భుతం అనంతరం నగరంలోని ఓ హోటల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన సంస్థ విభాగాలకు సంబంధించిన జిల్లా అధికారులు, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ అధికారులతో శనివారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరుని ప్రశంసించారు. సమావేశంలో పార్లమెంటరీ కమిటీ సభ్యులు మాల రాజ్యలక్ష్మీషా, అజయ్ ప్రతాప్సింగ్, తలారి రంగయ్య, నరాన్భాయ్ జె.రత్వా, ఏకేపీ చిన్రాజ్, రాజీవ్ దిలేర్, మహ్మద్ జావెద్, వాజేసింగ్భాయ్ రత్వా, ఇరన్నా కడాది, నరేంద్రకుమార్తో పాటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. -
మహిళా డ్రైవర్కు కారును గిఫ్ట్గా ఇచ్చిన కమల్ హాసన్
ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ గొప్ప మనసు చాటుకున్నారు. వివాదంలో చిక్కుకొని ఉద్యోగం కోల్పోయిన మహిళా బస్డ్రై వర్కు మహిళకు కారును గిఫ్ట్గా ఇచ్చి ఆశ్యర్యపరిచారు. కొయంబత్తూర్కు చెందిన మహిళా డ్రైవర్ షర్మిలను కమల హాసన్ తన కార్యాలయానికి పిలిపించుకొని ‘కమల్ కల్చరల్ సెంటర్’ ద్వారా కారును బహుమతికి అందించారు. ఇప్పటివరకు ఉద్యోగిగా ఉన్న ఆమె.. ఇకపై ఎంతో మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కొయంబత్తూర్ మహిళా బస్ డ్రైవర్ షర్మిల చుట్టూ ఇటీవల జరిగిన చర్చతో కలత చెందాను. తన వయసులోని ఎంతో మంది యువతకు ఆమె ఆదర్శం. షర్మిల కేవలం డ్రైవర్గా మాత్రమే ఉండిపోకూడదు. తనలాంటి అనేకమంది షర్మిలలను తీర్చిదిద్దాలని నేను ఆశిస్తున్నా. కమల్ కల్చరల్ సెంటర్ తరఫున ఆమెకు కారును అందిస్తున్నాం. దానిని ఆమెకు అద్దె సర్వీసుల కోసం వినియోగించుకోవచ్చు. అలాగే గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగి మరెందరికో ఉపాధి కల్పించాలని ఆశిస్తున్నా’ అని కమల్ పేర్కొన్నారు. (చదవండి: రెచ్చిపోయిన దొంగలు.. గన్తో బెదిరించి.. కారును అడ్డగించి.. వీడియో వైరల్..) కాగా, 24 ఏళ్ల షర్మిల కొయంబత్తూరులో తొలి మహిళా డ్రైవర్. గాంధీపురం నుంచి సోమనూర్ వరకు వ్రైవేటు సంస్థకు చెందిన బస్సును నడుపుతున్నారు. గతంలో బీజేపీ నేత వనతి శ్రీనివాసన్ ఈమె బస్సులో ప్రయాణించగా.. గత శుక్రవారం ఉదయం డీఎంకే ఎంపీ కనిమొళి.. షర్మిల నడిపిన ప్రైవేటు సంస్థకు చెందిన బస్సులో కోయంబత్తూరులోని గాంధీపురం నుంచి పీలమేడు వరకు ప్రయాణించారు. అయితే, షర్మిల పబ్లిసిటీ మోజులో పడిందని ఆ బస్సు యాజమాన్యం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు బస్ కండక్టర్ మాటలు నమ్మి యాజమాన్యం తనను అవమానపర్చిందని, అందుకే కలల కొలువుకు దూరమైనట్టు షర్మిల మాట్లాడిన వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. (చదవండి: కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయిందా?.. అసలేం జరిగిందంటే..) Coimbatore's first woman bus driver #Sharmila who quit her job after a controversy erupted over issuing of bus ticket to DMK MP Kanimozhi, has now been presented a new car by MNM leader #KamalHaasan to continue her journey as an entrepreneur. @IndianExpress pic.twitter.com/SyMS059KvS — Janardhan Koushik (@koushiktweets) June 26, 2023 -
కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయిందా?..
-
సుప్రీం కోర్టులో కనిమొళికి భారీ ఊరట
ఢిల్లీ: డీఎంకే నేత కనిమొళి కరుణానిధికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఎంపీగా ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను .. సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆమె ఎన్నిక సమర్థనీయమేనని తీర్పు ఇచ్చింది. 2019 ఎన్నికల సమయంలో తూతుక్కుడి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కనిమొళి. అయితే ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ సనాతన కుమార్ అనే ఓటర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. నామినేషన్ సమయంలో.. ఎలక్షన్ అఫిడవిట్లో కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సరిగా పొందుపర్చలేదని, మరీ ముఖ్యంగా భర్త పాన్ నెంబర్ను జత చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేశాడతను. అయితే.. తన భర్త సింగపూర్ పౌరుడని, ఆయనకు పాన్ నెంబర్ ఉండదని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టేయాలని ఆమె అభ్యర్థించారు. కానీ, మద్రాస్ హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ తరుణంలో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. అయితే మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం 2020, జనవరిలో స్టే విధించింది. ఇవాళ(గురువారం) ఆ పిటిషన్ విచారణకు రాగా.. ఎలక్షన్కు సంబంధించిన పిటిషన్ను కొట్టేస్తూ.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను పరిశీలించాలన్న కనిమొళి అభ్యర్థనను స్వీకరిస్తున్నట్లు జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ఇదీ చదవండి: ఇలాంటివి చూసేందుకే అంత కష్టపడ్డామా? -
కనిమొళిపై కుష్బు ప్రశంసల జల్లు
డీఎంకే ఎంపీ కనిమొళిపై నటి, బీజేపీ నాయకురాలు కుష్బు ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల డీఎంకే పార్టీ ప్రచారకర్త సాధిక్ ఒక కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాళ్లు కుష్బు, గౌతమి, నమిత, గాయత్రి రఘురాంను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అవి పెద్ద దుమారానికే దారి తీశా యి. సాధిక్ వ్యాఖ్యలతో కుష్బు తీవ్రంగానే ఖండించారు. కాగా సాధిక్ వ్యవహారంపై తాజాగా డీఎంకే పార్టీ ఎంపీ కనిమొళి తీవ్రంగా ఖండించారు. (చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత పోటీలో విజయ్, అజిత్ సినిమాలు) ఏ పార్టీకి చెందిన వారైనా, సందర్భం ఏమైనా మహిళలను అవమానించడం సహించరానిదన్నారు. ఒక స్త్రీగా, మనిషిగా తాను క్షమాపణ చెప్పుకుంటున్నానని, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్టాలిన్, పార్టీ తరఫున కూడా క్షమాపణ చెప్పుకుంటున్నానని ట్వీట్ చేశారు. కనిమొళి క్షమాపణపై స్పందించిన కుష్బు ధన్యవాదాలు, కానీ మీ మనస్త్వత్వం, ఆచరణకు నిజంగా అభినందనీయం. మహిళల మానానికి, ఆత్మాభిమానానికి మీరెప్పుడు అండగా నిలుస్తారని ట్విట్టర్లో ప్రశంసించారు. -
బీజేపీలోని నటీమణులంతా ‘ఐటమ్’లు.. డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: బీజేపీ నేతలుగా మారిన పలువురు నటీమణులపై డీఎంకే నేత సాధైయ్ సాధిక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడు బీజేపీలో ఉన్న సీనియర్ నటీమణులు ఖుష్బు, నమితా, గౌతమి, గాయత్రి రఘురామన్లు ‘ఐటమ్’లు అంటూ వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీజేపీలో మహిళ నేతలుగా ఉన్న నలుగురు నటీమణులు పెద్ద ఐటమ్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘తమిళనాడులో బీజేపీ బలపడుతుందని ఖుష్బూ చెబుతోంది. అమిత్షా తలపై వెంట్రుకలైనా మొలుస్తాయోమో కానీ తమిళనాడులో బీజేపీ మాత్రం వికసించదు. డీఎంకేను నాశనం చేసి బీజేపీని బలోపేతం చేసేందుకు వీళ్లు (వేశ్యలు) ఉపయోగపడతారా?. వారి వల్ల కాదు. నా సోదరుడు ఇళయ అరుణ కుష్బుతో ఎన్నోసార్లు కలిశాడు. అంటే నా ఉద్ధేశం ఆమె డీఎంకేలో ఉన్నప్పుడు ఆమెతో దాదాపు ఆరుసార్లు సమావేశాల్లో పాల్గొన్నారు.’ అంటూ విపరీత అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. .@arivalayam functionary Saidai Sadiq's derogatory remarks on women BJP leaders left many in the state's ruling party red-faced. Sadiq's remarks targetting leaders including @khushsundar drew sharp criticism from BJP leaders and others. Watch here : https://t.co/DVbwYrAz6G pic.twitter.com/6NpvZH6Khk — South First (@TheSouthfirst) October 28, 2022 డీఎంకే చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకురాలు ఖుష్భూ తీవ్రంగా ఖండించారు. ‘పురుషులు స్త్రీలను దుర్భాషలాడటం, అది వారి పెంపకం, వారు పెరిగిన విషపూరిత వాతావరణాన్ని అందరికీ తెలిసేలా చేస్తుంది. ఈ పురుషులు స్త్రీ గర్భాన్ని అవమానిస్తారు. అలాంటి పురుషులు తాము కళైజ్ఞర్ అనుచరులుగా చెప్పుకుంటారు. ఇదేనా సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ నమూనా పాలన’ అంటూ ట్విటర్ వేదికగా సాధిక్ వ్యాఖ్యలను ఎండగడుతూ డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, ఎంపీ కనిమొళిని ట్యాగ్ చేశారు. When men abuse women,it just shows wat kind of upbringing they have had & the toxic environment they were brought up in.These men insult the womb of a woman.Such men call themselves followers of #Kalaignar Is this new Dravidian model under H'ble CM @mkstalin rule?@KanimozhiDMK — KhushbuSundar (@khushsundar) October 27, 2022 దీనిపై స్పందించిన డీఎంకే నేత కనిమొళీ ఖుష్బూకి క్షమాపణలు తెలియజేశారు. మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారు ఎవరైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ పార్టీ వారైనా వాటిని సహించలేమన్నారు. తమ నాయకుడు సీఎం స్టాలిన్గానీ, పార్టీ అధిష్టానంగానీ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని స్పష్టం చేశారు. అనంతరం సాధిక్ సైతం తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. ఎవరిని కించపరచడం తమ ఉద్ధేశం కాదని వెల్లడించారు. అయితే బీజేపీ అధిష్టానం చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. డీఎంకే మంత్రులను పందులు, జంతువులు అంటూ మాట్లాడారని, . జర్నలిస్టులను కోతులతో పోల్చాడని.. బీజేపీ నేతలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. -
స్త్రీలకు ఏ హక్కులుండాలో ఇంకా పురుషులే నిర్ణయిస్తారా?
ఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న స్టాండింగ్ కమిటీలో ఒక్కరే మహిళ ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీజేపీ నేత వినయ్ సహస్రబుద్దే నేతృత్వంలోని 31 మందితో కూడిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ ఒక్కరే మహిళ అనే విషయం విదితమే. దీనిపై డీఎంకే ఎంపీ కనిమొళి సోమవారం తీవ్రంగా స్పందించారు. ‘ప్రస్తుతం పార్లమెంటులో మొత్తం 110 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును 30 మంది పురుషులు, ఒక మహిళ ఉన్న ప్యానెల్ (కమిటీ)కి అప్పగించాలని నిర్ణయించింది. దేశంలోని ప్రతీ యువతిపై ప్రభావం చూపే కీలకాంశమిది. స్త్రీలకు ఏ హక్కులుండాలనేది ఇంకా మగవాళ్లే నిర్ణయిస్తున్నారు. మహిళలను మౌనప్రేక్షకుల్లా మార్చేస్తున్నారు’ అని ట్విట్టర్ వేదికగా కనిమొళి ధ్వజమెత్తారు. ‘స్రీలకు, భారత సమాజానికి సంబంధించిన అంశంపై మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉన్న కమిటీ అధ్యయనం చేస్తుందనే విషయం తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. అందువల్ల ఈ బిల్లుపై జరిగే చర్చల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం, భాగస్వామ్యం ఉండేలా చూడాలని మిమ్మల్ని కోరుతున్నాను. భాగస్వామ్యపక్షాలందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం అత్యంత ముఖ్యం. అందరి వాదనలూ... ముఖ్యంగా మహిళల అభిప్రాయాలను స్టాండింగ్ కమిటీ వినాలి.. అర్థం చేసుకోవాలి’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు రాసిన లేఖలో శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. మహిళా ఎంపీల అందరి అభిప్రాయాలు వినండి: సుస్మితా దేవ్ కనీస వివాహ వయసు పెంపుపై మహిళా ఎంపీలు అందరి అభిప్రాయాలను స్టాండింగ్ కమిటీ వినాలని సుస్మితా దేవ్ కమిటీ చైర్మన్ సహస్రబుద్దేకు లేఖ రాశారు. ‘రాజ్యసభ నియమావళిలోని 84(3), 275 నిబంధనల కింద కమిటీ ఎదుట ప్రత్యక్షంగా హాజరయ్యి లేదా రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశాన్ని మహిళా ఎంపీలకు కల్పించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. దానికోసం కమిటీ ఛైర్మన్గా మీకున్న అధికారాలను ఉపయోగించండి. మహిళా ఎంపీలకు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు తగిన సమయాన్ని కేటాయించండి. రాజ్యసభలో 29 మంది, లోక్సభలో 81 మంది మహిళా ఎంపీలున్నారు’ అని సుస్మిత లేఖలో పేర్కొన్నారు. -
TN: కేసుల నుంచి ఆ ముగ్గురికీ ఉపశమనం
సాక్షి, చెన్నై: గత ప్రభుత్వం వేసిన పరువు నష్టం దావా కేసుల్లో డీఎంకే ఎంపీలు కనిమొళి, దయానిధి మారన్, కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్కు విముక్తి లభించింది. సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు చేసినట్టు గత ప్రభుత్వ హయాంలో వీరిపై దావా దాఖలైంది. ఈ పిటిషన్ విచారణలో ఉండగా, రాష్ట్రంలో అధికారం మారింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కారు ఆ కేసుల్ని కొనసాగించలేమని, రద్దు చేయాలని కోర్టుకు సూచించింది. దీంతో ఆ ముగ్గురి మీద వేర్వేరుగా దాఖలైన పిటిషన్లు తిరస్కరిస్తూ, కేసు నుంచి విముక్తి కల్పిస్తూ సోమవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చిక్కుల్లో ఎస్పీ వేలుమణి.. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి చిక్కుల్లో పడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన పిటిషన్పై పది వారాల్లో చార్జ్షీట్ దాఖలుకు ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. ఎస్పీ వేలుమణిపై టెండ్లర్లలో అక్రమాలు అనేక ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ దాడులు సైతం జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఎస్పీ వేలుమణికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీ ఆర్ ఎస్భారతి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. చార్జ్షీట్ దాఖలు చేయాలని, విచారణను త్వరితగతిన ముగించాలని ఏసీబీని కోర్టు ఆదేశించింది. -
90 వేలకు చేరువలో కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరిగిపోతోంది. 80 వేల మార్క్ చూసిన మర్నాడే ఒక్క రోజులో 90 వేలకి దగ్గరలో కేసులు నమోదవడం ఆందోళన పుట్టిస్తోంది. కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్లో మూడు రెట్ల వేగంతో కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 89,129 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,92,260కి చేరుకుంది. కరోనా మరణాలు ఒక్క రోజులోనే రెట్టింపయ్యాయి. మొత్తంగా 714 మంది కరోనాతో మరణించినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 6,58,909కి చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 5.32శాతంగా ఉన్నాయి. ► ఎనిమిది రాష్ట్రాల నుంచి కరోనా కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం కేసుల్లో 81.42% కేసులు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ► దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 10 జిల్లాల నుంచే సగం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. పుణె, ముంబై, నాగపూర్, థానే, నాసిక్, బెంగుళూరు అర్బన్, ఔరంగాబాద్, ఢిల్లీ, అహ్మద్నగర్, నాందేడ్ జిల్లాల నుంచి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ► గత రెండు నెలల కాలంలో యాక్టివ్ కేసుల్ని పరిశీలిస్తే మహారాష్ట్రలో తొమ్మిది రెట్లు అధికంగా కేసులు నమోదవుతూ ఉంటే, పంజాబ్లో ఏకంగా పన్నెండు రెట్లు అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి. ► కరోనా మరణాల్లో 85శాతం ఆరు రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు నమోదు కాకపోవడం ఊరట కలిగించే అంశం. ఒడిశాలో 10 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ ఒడిశాలో ముందుజాగ్రత్తగా 10 జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సోమవారం నుంచి రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. రాష్ట్రంలో రోజుకి 500 వరకు కేసులు నమోదవుతున్నాయి. కనిమొళికి కరోనా పాజిటివ్ డీఎంకే లోక్సభ ఎంపీ కనిమొళికి కరోనా పాజిటివ్గా తేలింది. ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కరోనా సోకడంతో కనిమొళి ఎన్నికల సభలన్నీ రద్దు చేసుకొని ఆస్పత్రిలో చేరారని డీఎంకే వర్గాలు తెలిపాయి. -
కరుణానిధి కుమార్తెకు కరోనా.. ఆందోళనలో డీఎంకే
చెన్నె: స్టార్ క్యాంపెయినర్గా ఉండడం.. అధికారంలోకి దూరమై పదేళ్లు కావడంతో ఈసారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో వీలైనంత ఎక్కువగా ప్రచార కార్యక్రమాల్లో మునిగారు. రోజు భారీ బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్యం పాలయ్యారు. ఆమెకు తాజాగా కరోనా వైరస్ సోకింది. తాజాగా చేసుకున్న పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ తేలింది. డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి ముద్దుల కూతురు కనిమొళి. ఆమె తూత్తుకుడి నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన సోదరుడు డీఎంకే అధినేత స్టాలిన్ను ముఖ్యమంత్రి చేసేందుకు శక్తి మేర కష్టపడుతున్నారు. ఈ క్రమంలో విస్తృత పర్యటనలు చేయడం.. ప్రజలను కలవడం చేయడంతో ఆమెకు కరోనా సోకింది. పాజిటివ్ తేలిన వెంటనే ఆమె ఐసోలేషన్లోకి వెళ్లారు. అయితే ఆమె చెన్నెలోని అపోలో ఆస్పత్రి చేరినట్లు తెలుస్తోంది. ఆమెకు కరోనా సోకిన విషయం తెలియగానే ఆమె సోదరుడు స్టాలిన్ ఆమె ఆరోగ్య వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల పాటు ఆమె ఎన్నికల ప్రచారానికి దూరం ఉండనున్నారు. స్టార్ క్యాంపెయినర్గా ఉన్న కనిమొళి కరోనా సోకడంతో డీఎంకే ఆందోళనలో పడింది. చదవండి: ప్రసంగం ఆపి వైద్యులను పంపిన ప్రధాని -
'నా కొడుకు రాజకీయాల్లోకి రాడు'
సాక్షి, చెన్నై: తన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఎంపీ కనిమొళి స్పష్టం చేశారు. డీఎంకేలో వారసత్వ రాజకీయాలు ఎక్కువే అన్న విష యం తెలిసిందే. కరుణానిధి వారసుడిగా స్టాలిన్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వారసుడు ఉదయనిధి స్టాలిన్ సైతం రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే కాదు, చేపాక్కం– ట్రిప్లికేన్ నుంచి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాడు. కరుణ గారాల పట్టి కని మొళి సైతం డీఎంకేలో కీలకంగానే ఉన్నారు. భవిష్యత్తులో ఈమె కుమారుడు సైతం రాజకీయాల్లోకి రావచ్చన్న చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఓ మీడియా ఇంటర్వ్యూలో తన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. అన్న, చెల్లెల అనుబంధమేగానీ, తమ మధ్య గొడవలు ఇప్పటివరకు లేదని, ఎన్నటికీ రావని స్పష్టం చేశారు. చదవండి: డీఎంకే అభ్యర్థులుగా తెలుగు ప్రముఖులు 215వ సారి నామినేషన్; భార్య నగలు కుదువపెట్టైనా సరే -
ఆమెకు హిందీ తెలుసు; నిజంగా సిగ్గుచేటు!
చెన్నై: ‘‘నాకు హిందీ మాట్లాడటం వచ్చా? రాదా? అన్నది కాదు ఇక్కడ సమస్య. హిందీ వస్తేనే నన్ను భారతీయురాలిగా గుర్తిస్తాననడం సిగ్గుచేటు’’ అంటూ డీఎంకే నేత, లోక్సభ ఎంపీ కనిమొళి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హిందీ అనువాదకురాలిగా పనిచేశారంటూ తన గురించి వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత హెచ్ రాజా తీరుపై మండిపడ్డారు. హిందీ భాషకు జాతీయతకు ముడిపెట్టడం సరికాదంటూ హితవు పలికారు. కాగా కేరళలోని కోళీకోడ్ ఎయిర్పోర్టు వద్ద ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్లిన కనిమొళికి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ మహిళా జవాను ‘మీరు భారతీయులేనా?’అని తనను ప్రశ్నించినట్లు ఈ తూతుక్కుడి ఎంపీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. హిందీ భాష వ్యతిరేకోద్యమానికి నిలయమైన తమిళనాడులో ఈ విషయంపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. రాజకీయ దుమారం రేగింది.(ఎన్ఈపీ 2020: తమిళనాడు కీలక నిర్ణయం) ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత పి. చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంతో పాటు పలువురు తమిళనేతలు సీఎస్ఐఎఫ్ తీరును ఖండిస్తూ ఆమెకు మద్దతు తెలిపారు. అయితే తమిళనాడు బీజేపీ నేత హెచ్ రాజా మాత్రం కనిమొళి ట్వీట్పై అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘భారత ఉప ప్రధాని దేవీలాల్ తమిళనాడుకు వచ్చినపుడు ఆయన హిందీ ప్రసంగాన్ని కనిమొళి తమిళంలోకి అనువదించారు. కాబట్టి తనకు హిందీ తెలియదని చెప్పడం పచ్చి అబద్ధం అని తేలింది. ఎన్నికలు ఇంకా సమీపించలేదు కదా’’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (కేరళలో కనిమొళికి చేదు అనుభవం) ఇందుకు ఆమె సైతం అదే స్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ నేనెవరికీ హిందీ అనువాదకురాలిగా పనిచేయలేదు. తెలియని భాషలో నేనెలా మాట్లాడగలను? నా విద్యాభ్యాసం అంతా తమిళ, ఆంగ్ల భాషల్లోనే సాగింది. ఢిల్లీలో ఉన్నా నాకు హిందీ రాదు. ఈ విషయం చాలా మంది రాజకీయ నాయకులకు కూడా తెలుసు. అయినా ఇక్కడ సమస్య భాష గురించి కాదు. భాషను జాతీయతతో ముడిపెట్టడం గురించి. ఒకే భాష, ఒకే మతం, ఒకే సిద్ధాంతం పాటిస్తేనే భారతీయులా. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కొందరు ఈ విషయం గురించి రాజకీయం చేయడం సిగ్గుమాలిన చర్య’’ అంటూ కనిమొళి కౌంటర్ ఇచ్చారు. -
కేరళలో కనిమొళికి చేదు అనుభవం
సాక్షి, చెన్నై: ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన కేరళలోని కోళీకోడ్ ఎయిర్పోర్టుకు వెళ్లిన డీఎంకే నేత, లోక్సభ సభ్యురాలు కనిమొళి దయానిధికి చేదు అనుభవం ఎదురైంది. ఘటనాస్థలంలో విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ మహిళా జవాను ‘మీరు భారతీయులేనా?’అని ప్రశ్నించి కనిమొళిని అవమానించారు. ఈ విషయాన్ని కనిమొళి ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘ విమానం ప్రమాదం జరిగిన కోళీవుడ్ ఎయిర్పోర్టుకు ఈ రోజు ఉదయం వెళ్లాను. అయితే, అక్కడున్న ఓ సీఐఎస్ఎఫ్ మహిళా జవాను హిందీలో నాతో ఏదో చెబుతోంది. నాకు హిందీ రాదని, దయచేసి తమిళం లేదంటే ఇంగ్లిష్లో మాట్లాడమని సూచించాను. దానికి ఆ జవాను స్పందన చూసి మతి పోయింది. హిందీ తెలియదా? ఇంతకూ మీరు భారతీయులేనా? అని ఆమె నన్ను ప్రశ్నించింది. అంటే హిందీ భాష వచ్చినవారు భారతీయులు అన్నట్టేనా!’అని ఎంపీ కనిమొళి ట్విటర్లో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కారు బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. #hindiimpostion హ్యాష్ టాగ్ను పోస్టు చేశారు. కాగా, కనిమొళికి కలిగిన అసౌకర్యంపై సీఐఎస్ఎఫ్ స్పందించింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యురాలిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఏ ఒక్క భాషపై తమకు పక్షపాతం లేదని స్పష్టం చేసింది. (26కి చేరిన మృతుల సంఖ్య) Today at the airport a CISF officer asked me if “I am an Indian” when I asked her to speak to me in tamil or English as I did not know Hindi. I would like to know from when being indian is equal to knowing Hindi.#hindiimposition -
దీపికపై ట్రోలింగ్.. స్పందించిన కనిమొళి
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను డీఎంకే ఎంపీ కనిమొళి పరామర్శించారు. బుధవారం జేఎన్యూకు వెళ్లిన కనిమొళి యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్యూఎస్యూ) అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్తో మాట్లాడారు. ఈ సందర్భంగా దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కనిమొళి మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్ నటి దీపికా పదుకొనేపై జరుగుతున్న ట్రోలింగ్ను తప్పుబట్టారు. తను చాలా వరకు హిందీ సినిమాలు చూడనని.. కానీ దీపికకు మద్దతుగా ఛపాక్ సినిమాను చూస్తానని చెప్పారు. కాగా, మంగళవారం సాయంత్రం జేఎన్యూకు వెళ్లిన దీపిక.. ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. వారికి సంఘీభావం తెలుపుతూ క్యాంపస్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు దీపికను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె తాజా చిత్రం ఛపాక్ను బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఆమె ప్రదర్శించిన ధైర్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్ హారో అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
రాహుల్ వ్యాఖ్యల్లో తప్పేముంది : కనిమొళి
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడులను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పార్లమెంట్లో పెను దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలు మహిళలపై లైంగిక దాడులను ప్రోత్సహించేవిలా ఉన్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడుతూ ఆయన క్షమాపణను డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పేది లేదని రాహుల్ తేల్చిచెప్పినా ఆయన వ్యాఖ్యలపై పాలక, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై డీఎంకే నేత కనిమొళి స్పందిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు సభ వెలుపల చేశారని, గతంలో తాము ఇలాంటి ఉదంతాలను ప్రస్తావిస్తే సభ వెలుపల జరిగిన వాటిని ఉటంకించరాదని తమను అనుమతించని విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాని నిత్యం మేకిన్ ఇండియా గురించి చెబుతుంటారని, దాన్ని తాము గౌరవిస్తామని అయితే వాస్తవంగా దేశంలో జరుగుతున్నదేంటని కనిమొళి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చెప్పదలుచుకున్న ఉద్దేశం కూడా ఇదేనని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ మేకిన్ ఇండియా జరగకపోయినా దేశంలో మహిళలపై లైంగికదాడులు మాత్రం జరుగుతున్నాయని ఇదే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోందని చెప్పారు. కనిమొళి వ్యాఖ్యలపైనా స్మృతి ఇరానీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు వ్యతిరేకంగా కూడా మీరు పార్టీలకు అతీతంగా వ్యవహరించలేకపోతున్నారని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
లోక్సభ డిప్యూటీ స్పీకర్గా కనిమొళి..!
సాక్షి, చెన్నై: పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ పదవి డీఎంకేకు దక్కే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జోరందుకుంది. ఇందులో ఆ పార్టీ ఎంపీ కనిమొళి పేరు ప్రప్రథమంగా పరిశీలనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ప్రతి పక్షాల తరఫున ఆమెకు చాన్స్ దక్కడం ఖాయం అన్నట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి దేశ ప్రజలు ఊహించని రీతిలో మళ్లీ పట్టం కట్టారు. బీజేపీ కూటమి 352 స్థానాల్ని దక్కించుకోగా, అందులో బీజేపీ అభ్యర్థులే 303 మంది విజయఢంకా మోగించారు. ఇక, కాంగ్రెస్ తరఫున 52 మంది, ఆ కూటమిలోని డీఎంకే తరఫున 23 మంది పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పగించేందుకు తగ్గట్టుగా ప్రధాని నరేంద్రమోదీ సర్కారు నిర్ణయించినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. 2014లో కూడా డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతి పక్షానికి అప్పగించడంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన అన్నాడీఎంకేకు ఆ చాన్స్ దక్కింది. ఆ పార్టీ తరఫున తంబిదురై డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. అదే బాణిలో తాజాగా కూడా ప్రతిపక్షాలకు ఆ పదవిని అప్పగించేందుకు తగ్గట్టుగా కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఈ పదవిని కాంగ్రెస్కు అప్పగించే అవకాశాలు ఎక్కువేనని సమాచారం. అయితే, కాంగ్రెస్లో ఆ పదవిని చేపట్టేందుకు ఏ ఒక్క ఎంపీ సిద్ధంగా లేనట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో మిత్ర పక్షం డీఎంకేకు ఆ పదవిని అప్పగించేందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ పరిశీలన జరిపి ఉన్నట్టు తెలిసింది. ఇందుకు తగ్గట్టుగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తోనూ కాంగ్రెస్ వర్గాలు చర్చించినట్టు ప్రచారం. కనిమొళికి చాన్స్ ..... దివంగత డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి గతంలో రాజ్యసభ సభ్యురాలుగా వ్యవహరించారు. రెండుసార్లు ఆమె రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఢిల్లీ కొత్తేమీ కాదు. అక్కడి ఎంపీలతో ఆమెకు పరిచయాలు ఎక్కువే. తాజాగా ఆమె తూత్తుకుడి నుంచి ప్రప్రథమంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయకేతనం ఎగుర వేశారు. తొలిసారిగా పార్లమెంట్లో అడుగు పెట్టనున్న కనిమొళికి పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల ఉప నేత పదవిని స్టాలిన్ కేటాయించారు. ఆ పార్టీ పార్లమెంటరీ నేత పదవిని సీనియర్ నేత టీఆర్బాలుకు, విప్ పదవి ఎ.రాజాలకు అప్పగించారు. అయితే, ప్రప్రథమంగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా లోక్సభలో అడుగు పెట్టనున్న కనిమొళిని అందలం ఎక్కించే విధంగా కాంగ్రెస్ పరిశీలన జరిపి ఉన్నట్టు తెలిసింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ అభ్యర్థిత్వం తమిళనాడు నుంచి దక్కే విధంగా డీఎంకేతో ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు సంప్రదింపుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతి ఫలం అన్నట్టుగా కనిమొళికి డిప్యూటీ స్పీకర్ పదవి అప్పగించే విధంగా చర్చ సాగి ఉన్నట్టు ప్రచారం. మన్మోహన్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి పరోక్షంగా స్టాలిన్ అంగీకరించి ఉన్నట్టు, అందుకే కనిమొళి పేరును కాంగ్రెస్ పరిశీలనలోకి తీసుకున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్పీకర్గా కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ పేరు పరిశీలనలో ఉన్న దృష్ట్యా, ప్రతి పక్షాల తరఫున మహిళగా కనిమొళికి చాన్స్ ఇచ్చే రీతిలో ప్రయత్నాలు సాగుతున్నట్టు డీఎంకేలోనూ చర్చ సాగుతుండడం గమనార్హం. కనిమొళి విషయంలో స్టాలిన్ సైతం సానుకూలత వ్యక్తం చేసినట్టు చర్చ సాగుతున్న దృష్ట్యా, కనిమొళి పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అయ్యేనా అన్నది మరి కొద్దిరోజుల్లో తేలనుంది. ఇక, తమిళ మీడియాల్లో సైతం కనిమొళి డిప్యూటీ స్పీకర్ ఖాయం అన్నట్టుగా చర్చ జోరందుకోవడం గమనార్హం. -
డిఎంకే కార్యాలయంపైనా ఐటీ దాడి
-
కనిమొళి ఇంట్లో ఐటీ సోదాలు
చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడిలో డీఎంకే నాయకురాలు కనిమొళి ఇంట్లో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. కనిమొళి తూత్తుకుడి స్థానం నుంచే బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిలిసై సౌందరరాజన్తో పోటీ పడుతున్నారు. గురువారమే ఇక్కడ పోలింగ్ జరగనుంది. సోదాల్లో ఏం దొరికాయన్నది వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనీ, స్వతంత్ర సంస్థలను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లు, రాష్ట్రాలకు ఎన్నికల ప్రధానాధికారుల నియామకంలో సంస్కరణలు తెచ్చేందుకు తాము కృషి చేస్తామనీ, ఇందుకోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని ఆయన పేర్కొన్నారు. -
హిందూ మతం: ఇవేమి తిప్పలు స్టాలిన్ బాబు!
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) నాయకులు అవకాశం దొరికినప్పుడల్లా తాము హిందూ వ్యతిరేకులం కాదని, మత వ్యతిరేకులం అస్సలు కాదని పదే పదే చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఏప్రిల్ 9వ తేదీన దక్షిణ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తమది హిందూ వ్యతిరేక పార్టీ కాదని, హిందూయిజం ఒక్క భారతీయ జనతా పార్టీ సొత్తు కాదని అన్నారు. ఒక దశలో ఆయన డీఎంకే హిందూత్వ పార్టీ కాకపోతే డీఎంకేలో ఉన్న వారు ఎవరని ఆయన ప్రశ్నించారు. అసలు ఆయన ఎందుకు పదే పదే హిందూ వ్యతిరేకులం కాదని చెప్పుకోవాల్సి వస్తోంది? అందుకు దారితీసిన కారణాలు ఏమిటీ? ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతిస్తున్న ‘ద్రావిడార్ కళగం’ అధ్యక్షుడు కే. వీరమణి గత మార్చి 27వ తేదీన ఓ సభలో మాట్లాడుతూ.. తమిళనాడులో సంచలనం సృష్టించిన ‘పొలాచ్చి సెక్స్ కుంభకోణం’ కేసు నిందితులను హిందువులు ఆరాధించే శ్రీకష్ణుడితో పోల్చారు. అందుకు హిందూ మక్కల్ కాట్చి అనే పార్టీ ఏప్రిల్ నాలుగో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి బీజేపీ, పాలకపక్ష ఏఐఏడీఎంకే.. డీఎంకే, ద్రావిడార్ కళగంలు హిందూ వ్యతిరేకులంటూ విమర్శిస్తూ వస్తున్నాయి. ఈవీ రామస్వామి పెరియార్ 1920లో ఓ సామాజిక ఉద్యమంలో భాగంగా ద్రావిడార్ కళగంను ఏర్పాటు చేశారు. డీఎంకేగానీ, అన్నా ఏఐఏడీఎంకేగానీ ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చాయి. హిందువులను, హిందువుల ఆచారాలను విమర్శిస్తూనే ఈ రెండు ద్రావిడ పార్టీలు ఎదిగాయి. డీఎంకే నాయకుడు, స్టాలిన్ తండ్రి ఎం. కరుణానిధి నాస్తికుడు. ఏ రోజున గుళ్లూ గోపురాలు దర్శించలేదు. నాస్తికుడిగానే ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. తూత్తుకుడి నుంచి డీఎంకే అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేస్తున్న స్టాలిన్ సోదరి కనిమోళి ఎన్నికల ప్రచారంలో భాగంగా గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారు. పైగా తండ్రి కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయాల్లో పలు మత కార్యక్రమాలు జరిగేవని చెబుతున్నారు. హిందు వ్యతిరేకులు అన్న ముద్ర పడితే ఎక్కడ ఓట్లు రాలవేమోనన్న భయం పట్టుకున్నది వారికి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమంటే ఇదేనేమో! -
కోడ్ ఉల్లంఘించిన నటుడిపై కేసులు
టీ.నగర్: ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారనే ఆరోపణలతో డీఎంకే నేతలపై శుక్రవారం కేసులు నమోదయ్యాయి. కనిమొళిపై కేసు: హారతి పట్టిన వారికి నగదు అందజేయడంతో కనిమొళిపై శుక్రవారం కేసు నమోదైంది. తూత్తుకుడి నియోజకవర్గంలో డీఎం కే అభ్యర్థి కనిమొళి ప్రచారం చేపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం తిరుచెందూర్ అసెంబ్లీ పరిధి ప్రాంతాల్లో ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్తో కని మొళి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హారతి పడుతూ కనిమొళికి స్వాగతం పలికిన మహిళలకు అనితా రాధాకృష్ణన్ నగదు అందజేసి న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీంతో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి నట్లు ఏరల్ తహసీల్దార్ ముత్తురామలింగంకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో కనిమొళి, అనితా రాధాకృష్ణన్ సహా ఏడుగురిపై తిరుచెందూర్ తాలూకా పోలీసు స్టేషన్లో మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఉదయనిధి స్టాలిన్పై కేసు: కల్లకురిచ్చిలో ఉదయనిధి స్టాలిన్పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. పార్లమెంటు ఎన్నికల్లో కల్లకురిచ్చి నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి పొన్ గౌతమ్ సిఖామణి పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ గత 23వ తేది కల్లకురిచ్చి కూడలిలో ఓపెన్టాప్ వ్యాన్లో ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ సమయంలో ఉదయసూర్యుడి చిహ్నా నికి ఓట్లను అభ్యర్థించారు. ఆయన వెంట శంకరాపురం అసెంబ్లీ సభ్యుడు ఉదయసూర్యన్, ఇతరులు ఉన్నారు. ఇదిలాఉండగా ఎన్నికల స్క్వాడ్ అధికారి ముఖిలన్ కల్లకురిచ్చి పోలీసు స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశాడు.అందులో ఉదయనిధి స్టాలిన్, ఉదయసూర్యన్ ఇతర నిర్వాహకులు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను మీరి ఒకే చోట గుంపుగా ట్రాఫిక్కు అంతరాయం కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఉదయనిధి స్టాలిన్, ఎమ్మెల్యే ఉదయసూర్యన్లపై పోలీసులు మూడు సెక్షన్ల కింద గురువారం కేసు నమోదు చేశారు. -
అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే, అన్నా డీఎంకే
చెన్నై: తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు లోక్సభ ఎన్నికల కోసం తమ అభ్యర్థులను ఆదివారం ప్రకటించాయి. కనిమొళి, దయానిధి మారన్, ఎ.రాజ, టీఆర్ బాలు సహా పలువురికి డీఎంకే లోక్సభ టికెట్లను కేటాయించింది. డీఎంకే జాబితాలో ఏకంగా 12 కొత్త ముఖాలున్నాయి. 20లో ఇద్దరు మహిళలకు మాత్రమే ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్తోపాటు తమిళనాడులోని పలు చిన్న పార్టీలు, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీతోపాటు చిన్న పార్టీలు ఉండటం తెలిసిందే. అన్నాడీఎంకే తమ పార్టీనేగాక, కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులను కూడా ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో కలిపి 40 లోక్సభ స్థానాలుండగా, డీఎంకే, అన్నాడీఎంకేలు రెండూ చెరో 20 స్థానాల్లో పోటీ చేస్తూ మిగిలిన 20 స్థానాలను మిత్రపక్షాలకు వదిలేశాయి. 8 స్థానాల్లో ఇరు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది. డీఎంకే కూటమిలో అత్యధికంగా కాంగ్రెస్కు పది స్థానాలు దక్కగా, సీపీఐ, సీపీఎం, వీసీకేలు చెరో రెండు, మిగిలిన చిన్న పార్టీలు తలో సీటును దక్కించుకున్నాయి. ఇక అన్నా డీఎంకే కూటమిలో పీఎంకే 7, బీజేపీ 5, డీఎండీకే 4 చోట్ల పోటీ చేయనున్నాయి. మిగిలిన నాలుగు సీట్లను చిన్న పార్టీలకిచ్చారు. తొలిసారి లోక్సభకు కనిమొళి పోటీ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సోదరి కనిమొళి తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆమె ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉండగా, ఆ పదవీకాలం ఈ జూలైతో ముగియనుంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కనిమొళి తూత్తుకుడి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. లోక్సభ ఎన్నికలతోపాటే తమిళనాడు లో 18 నియోజకవర్గాలకు శాసనసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా డీఎంకే ప్రకటించింది. -
కరుణ అందుకే శాకాహారి అయ్యారు!
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత దివంగత కరుణానిధి ఒకప్పుడు మాంసాహారి. అయితే, ఒకే ఒక్క ఘటన ఆయన్ను పూర్తి శాకాహారిగా మార్చి వేసింది. శాకాహారిగా మారడం వెనుక ఉన్న నేపథ్యాన్ని డీఎంకే ఎంపీ, ఆయన కూతురు కనిమొళి శనివారం మీడియాతో చెప్పారు. ‘కరుణానిధి మాంసాహారి. ఆయన ఇంట్లో ఉన్నంతసేపూ నల్ల రంగు పెంపుడు కుక్క వెన్నంటే ఉండేది. తాను తినే ప్రతీదాన్ని ఆ కుక్కకు ఆయన పెట్టేవారు. అయితే, తనకు ఎంతో ఇష్టమైన ఆ కుక్క మరణంతో కరుణానిధి మారిపోయారు. మాంసాహారాన్ని మానేసి పూర్తి శాకాహారి అయ్యారు. ఆ కుక్క కళేబరాన్ని మా ఇంటి వెనుక ఖాళీ స్థలంలో పూడ్చి పెట్టి, ఓ మొక్క నాటారు. ఆనాటి మొక్క నేడు పెద్ద చెట్టుగా ఎదిగింది’ అని కనిమొళి గతాన్ని గుర్తుచేసుకున్నారు. -
కరుణానిధి అంత్యక్రియలను అడ్డుకోవాలనే...
సాక్షి, చెన్నై : దివంగత నేత, కలైంజ్ఞర్ కరుణానిధి అంత్యక్రియల విషయంలో పళనిసామి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి మండిపడ్డారు. కరుణానిధి అంత్యక్రియలు అడ్డుకోవడంలో శ్రద్ధ చూపిన ప్రభుత్వం.. తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమ తెరవకుండా వేదాంత గ్రూపును మాత్రం అడ్డుకోలేకపోయిందని విమర్శించారు. పర్యావరణ నిబంధనలు, కోర్టులో పిటిషన్లను సాకుగా చూపుతూ అధికార అన్నాడీఎంకే ప్రభుత్వం మెరినా బీచ్లో కరుణానిధి అంత్యక్రియలకు అడ్డుపుల్ల వేసిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా తూత్తుకుడిలోని స్టెరిలైట్ పరిశ్రమ తెరిచేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్.. వేదాంత గ్రూపునకు గురువారం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కనిమొళి ప్రభుత్వ తీరును విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా..? ‘స్టెరిలైట్ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. కానీ పరిశ్రమను తెరిచేందుకు వేదాంత గ్రూపునకు ఎన్జీటీ షరతులతో కూడిన అనుమతినిచ్చింది. కలైంగర్ అంత్యక్రియలను మెరీనా బీచ్లో జరగకుండా అడ్డుకునేందుకు సీఎస్ వైద్యనాథన్(ప్రభుత్వ న్యాయవాది) తీవ్రంగా శ్రమించారు. కానీ ప్రజల ప్రాణాలు బలిగొన్న పరిశ్రమను తెరవకుండా సరైన వాదనలు వినిపించలేకపోయారు. తమిళనాడును అన్ని విధాలుగా దిగజార్చేందుకే సీఎం ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నారేమో అనే సందేహం కలుగుతుందంటూ’ కనిమొళి ట్వీట్ చేశారు. Vedanta approached the NGT against this order & Senior Counsel CS.Vaidhyanathan represented TN govt. Counsel for TN govt should have prepared adequately to defend the TN govt order of closure. But, the briefing & discussion on yesterday's hearing was done only at 10am yesterday. — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 The briefing and discussion on the hearing should have been done by Counsel CS.Vaidhyanathan at least a day before. But, CS.Vaidhyanathan was busy justifying the denial of space to our leader Kalaignar at Marina in Madras HC yesterday. 3/4 — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 Or was this done deliberately by the government for Edappadi Palaniswami is taking TN to its lowest point in governance. 4/4 — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 -
నాన్న బాగానే ఉన్నారు: కనిమొళి
సాక్షి, చెన్నై: నగరంలోని కావేరీ ఆస్పత్రి వద్ద మీడియా ప్రతినిధులు, డీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. డీఎంకే అధినేత ఎంకే కరుణానిధి తీవ్ర అస్వస్థతతో ఇదే ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత రాత్రి పరిస్థితి విషమించటంతో 94 ఏళ్ల కరుణానిధిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఉదయం ఆయన కుమార్తె కనిమొళి ఆస్పత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం నాన్న ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. బీపీ కంట్రోల్లోకి వచ్చింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతంగా తిరిగొస్తారు. మరికాసేపట్లో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని చెప్పారు’ అని కనిమొళి అన్నారు. ‘కరుణానిధి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నాం. వైద్యులతో చర్చించి మెరుగైన చికిత్సలు అందిచాలని కోరాం. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు’ అని తమిళనాడు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ భాస్కర్ తెలిపారు. పరామర్శల వెల్లువ... కాగా, కావేరి ఆస్పత్రికి వెళ్లిన తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్.. మాజీ సీఎం కరుణానిధిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, తనయుడు స్టాలిన్ను అడిగి తెలుసుకున్నారు. ఆర్కే నగర్ ఎమ్మెల్యే దినకరన్, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, సీనియర్ నటుడు ప్రభు, పాండిచ్చేరి మాజీ సీఎం రంగస్వామి తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. మరోవైపు సీఎం పళనిస్వామి కూడా వైద్యులను ఫోన్ చేసి పరిస్థితి ఆరా తీశారు. అసరమైతే ప్రభుత్వం తరపున మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన కోరారు. గుండెపోటుతో... కుటుంబ సభ్యులు, ముఖ్య నేతలు ధైర్యం చెబుతున్నప్పటికీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం ఇంకా ఆందోళన చెందుతూనే ఉన్నారు. కరుణానిధి అస్వస్థత వార్త తట్టుకోలేక డీఎంకే కార్యకర్త ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. మృతుడిని తిరువారూర్ ముత్తుపేటకు చెందిన తమీమ్గా గుర్తించారు. -
‘13 మంది రక్తం తాగిన పళనిస్వామి ప్రభుత్వం’
సాక్షి, చెన్నై: పళనిస్వామి ప్రభుత్వం రక్తం రుచి మరిగిందని డీఎంకే నాయకురాలు కనిమొళి మండిపడ్డారు. తూత్తుకుడి (ట్యూటికోరిన్)లో వేదాంత గ్రూపునకు చెందిన స్టెరిలైట్ పరిశ్రమ విస్తరణను అడ్డుకోవడానికి స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు మంగళవారం నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన కారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. వారికి సంతాపం ప్రకటిస్తూ కనిమొళి ఆధ్వర్యంలో శుక్రవారం తూత్తుకుడిలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. డీఎంకేతో పాటు కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతున్న కనిమొళితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు. స్టెరిలైట్ పరిశ్రమ వల్ల తమ బతుకులు బుగ్గిపాలవుతున్నాయని ఎదురు తిరిగిన అమాయకులను ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 13 మందిని పొలీసుల తూటాలు బలితీసుకుంటే ఆత్మరక్షణ కోసం జరిగిన కాల్పుల్లో వారు మృతి చెందారని ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గుచేటని కనిమొళి మండిపడ్డారు. ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపులోనే ఉంది.. తూత్తుకుడిలో ప్రజా ఆందోళనలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పీ మురళీ రాంబ తెలిపారు. పరిస్థితిలో అదుపులోనే ఉందనీ.. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు పట్టణంలో సరిపడా బలగాలను మోహరించామని అన్నారు. కాగా, ప్రజల ఆందోళనల నేపథ్యంలో పర్యావరణ హితం కోరి స్టెరిలైట్ పరిశ్రమ విస్తరణను నిలిపి వేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ‘ప్రభుత్వం స్టెరిలైట్ పరిశ్రమపై తీసుకునే చర్యలపై ఒక స్పష్టత వచ్చింది. పరిశ్రమను అడ్డుకునేందుకు ప్రభుత్వం సిధ్దంగా ఉంది’అని తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి తెలిపారు. టీఎన్పీసీబీ అనుమతులను రెన్యువల్ చేయకుండానే పరిశ్రమను నడపాలని చూస్తున్నారని కాలుష్య నియంత్రణ బోర్డు ఆరోపించింది. -
తూత్తుకుడి: సీబీఐతో విచారణ జరిపించాలి
సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో స్టెరిలైట్ కర్మాగారం విస్తరణను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. కాల్పులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నేడు తమిళనాడు వ్యాప్తంగా బంద్కి పిలుపునిచ్చాయి. బంద్లో ప్రధాన ప్రతిపక్షం డీఎంకేతో సహా కాంగ్రెస్, వామపక్షలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. బంద్లో పాల్గొన్న డీఎంకే నేత కనిమొళితో సహా, ఇతర ప్రధాన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తుత్తుకుడి ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని న్యాయవాది జీఎస్ మణి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వచ్చే వారం విచారణకు అవకాశం ఉంది. కాగా పిటిషన్లో పూర్తి వివరాలను పొందుపరిచి సోమవారం మరో పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాదిని ఆదేశించింది. -
కేసీఆర్ ఫ్రంట్.. కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు!
సాక్షి, చెన్నై : జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా, ప్రాంతీయ పార్టీలతో కూటమిని ఏర్పాటుచేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల నాయకులను ఆయన కలుస్తూ వచ్చారు. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, దేవేగౌడ, కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్ తదితరులు కలిసిన ఆయన చెన్నైకి వెళ్లి డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన తనయుడు స్టాలిన్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. డీఎంకే నేతలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. డీఎంకే ఎంపీ, కరుణానిధి తనయురాలు కనిమొళితో కూడా సమావేశమై.. కేసీఆర్ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్పై స్పందించిన డీఎంకే ఎంపీ కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వదులుకునే ఆలోచనే లేదని, ఆ పార్టీతో పొత్తు కొనసాగుతుందని కనిమొళి స్పష్టం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ రహిత ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రయత్నిస్తుండగా.. కాంగ్రెస్కు దూరం జరగబోమని కనిమొళి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
కేసీఆర్తో భేటీ అయిన డీఎంకే ఎంపీ కనిమొళి
-
సీఎం కేసీఆర్తో కనిమొళి భేటీ
సాక్షి, చెన్నై: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై వివిధ రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు చెన్నైలో పర్యటిస్తున్నారు. ఆదివారం చెన్నైలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధితో భేటీ అయిన ఆయన.. ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్తోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ క్రమంలో రెండో రోజు పర్యటనలో భాగంగా కేసీఆర్తో డీఎంకే ఎంపీ కనిమొళి బేటీ అయ్యారు. స్థానిక ఐటీసీ చోళ హోటల్లో కేసీఆర్తో సమావేశమైన ఆమె ఫెడరల్ ప్రంట్, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించనున్నారు. వారితో పాటు మంత్రులు కేకే, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమావేశంలో ఉన్నారు. -
రాజా, కనిమొళికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసుకు సంబంధించి టెలికం మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళికి ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. ఈ కేసులో వారిని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాలని కోరింది. మనీ ల్యాండరింగ్ కేసులోనూ వారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఈడీ వేసిన పిటిషన్పై కూడా ఇలాంటి ఆదేశాలే జారీచేసింది. తదుపరి విచారణ జరిగే మే 25 లోగా స్పందనలు తెలపాలని వారికి సూచించింది. -
రాజా, కనిమొళికి నోటీసులు..
సాక్షి, న్యూఢిల్లీ: 2జీ కుంభకోణంలో టెలికంశాఖ మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు ఇతర నిందితులకు ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. 2జీ స్కాంలో రాజా, కనమొళిని నిర్దోషులుగా ప్రకటిస్తూ.. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. సీబీఐ అభ్యర్థనపై విచారణ ప్రారంభించిన హైకోర్టు.. ఇప్పటివరకు నిందితులకు సంబంధించి ఈడీ, పీఎంఎల్ఏ అటాచ్ చేసిన ఆస్తుల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. గత ఏడాది డిసెంబర్ 21న 2జీ కేసులో కనిమొళి, రాజాలకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ.. వారిని నిర్దోషులుగా కింది కోర్టు ప్రకటించింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సీబీఐ హైకోర్టును ఆశ్రయించడంపై టెలికం మాజీ మంత్రి ఏ రాజా స్పందించారు. సీబీఐ అప్పీలుకు వెళ్లడం సాధారణ పరిణామమేనని, ఇది తాము ఊహించిందేనని, ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదని ఆయన అన్నారు. -
తిరుమల శ్రీవారిపై వ్యాఖ్యలు.. కనిమొళిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ ఎంపీ కనిమొళిపై సైదాబాదు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఎంపీ కనిమొళి ఇటీవల ఓ సమావేశంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని కించపరిచేలా ప్రసంగించారు. దానిపై హైదరాబాద్లోని సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని న్యాయవాది కషింశెట్టి కరుణాసాగర్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐపీసీ 295–ఎ, 298, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. గురువారం ఈ పిటిషన్ను కోర్టు విచారించింది. కోర్టు ఆదేశాల మేరకు కనిమొళిపై సైదాబాదు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం గురించి కనిమొళి మాట్లాడుతూ.. 'దేవుడి ముందు అందరూ సమానమే అని చెబుతారు. అదంతా పచ్చి అబద్ధం. ఎక్కువ డబ్బు చెల్లించి టికెట్లు కొంటే భగవంతుడు త్వరగా ప్రత్యేక దర్శనం ఇస్తాడు. లేనిపక్షంలో 10 గంటలు, 20 గంటలు లేక రోజుల తరబడి శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో నిల్చోవాలి. ఆ దేవుడు అంటే అంతే. శ్రీవారి హుండీ వద్ద సెక్యూరిటీ కాపలా ఎందుకు కాస్తున్నారు. నిజంగా అక్కడ దేవుడు ఉంటే ఆ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏముందని' తిరుమల శ్రీవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డీఎంకే ఎంపీపై చెన్నైలోనూ పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. -
ఆయన పరామర్శలో రాజకీయం లేదు
డీఎంకే మహిళా విభాగం నేతగానే తాను ముందుకు సాగుతానని కరుణానిధి గారాల పట్టి కనిమొళి వ్యాఖ్యానించారు. మహిళా విభాగం కార్యదర్శిగా కొనసాగుతానని, డీఎంకేలో తనకు తగిన గౌరవం, బాధ్యతలు అప్పగించి ఉన్నారని వివరించారు. అంతకు మించి తాను ఎలాంటి పదవుల్ని ఆశించడం లేదని స్పష్టంచేశారు. 2జీ కేసు సృష్టించిన వాళ్లు ఎందరో ప్రస్తుతం లాభపడి ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ అధినేత కరుణానిధికి ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శలో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. సాక్షి, చెన్నై: 2జీ స్పెక్ట్రమ్ కేసు నుంచి విముక్తి లభించడంతో చెన్నై చేరుకున్న డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళికి ఆ పార్టీ వర్గాలు శనివారం చెన్నైలో బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. డీఎంకే మహిళా విభాగ కార్యదర్శి, ఎంపీ వ్యవహరిస్తున్న కనిమొళి ఆనందానికి ప్రస్తుతం అవధులే లేవు. చెన్నై ఆళ్వార్పేట సీఐటీ కాలనీలోని నివాసంలో రాత్రి కొన్ని పత్రిక, మీడియా చానళ్లతో కనిమొళి ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుకున్నారు. రాజకీయాలకు అతీతంగా మానవీయతతో తనకు అభినందన తెలిపిన చిన్నమ్మ శశికళ కుటుంబానికి చెందిన టీటీవీ దినకరన్, కృష్ణప్రియలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. డీఎంకే నిర్వీర్యం లక్ష్యంగా.. డీఎంకేని నామ రూపాలు లేకుడా చేయడం లక్ష్యంగా సాగిన కుట్రలో భాగమే 2జీ అని వ్యాఖ్యానించారు. ఇది సృష్టించిన కేసు అని, దీన్ని పనిగట్టుకుని అతి పెద్ద కేసుగా తీర్చిదిద్దారని వివరించారు. తమిళనాట డీఎంకే అనేది లేకుండా చేయడం కోసం 2జీని ఆయుధంగా తమ మీద విసిరారని, అయితే, ఇది పటాపంచలు చేశామన్నారు. డీఎంకే తల ఎత్తుకుని నిలబడే స్థాయిలో ఈ కేసు తీర్పు వెలువడిందని వ్యాఖ్యానించారు. అప్పీలుకు వెళ్లినా ధైర్యంగా కేసును ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం వచ్చిన తీర్పే సుప్రీం కోర్టులోనూ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధారాలు లేవు ఈ కేసులో తమను ఇరికించిన సీబీఐ ఆధారాల్ని సేకరించలేక చతికిలపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలంజర్ టీవీలో తాను కేవలం రెండు వారాలు మాత్రమే డైరెక్టర్గా వ్యవహరించినట్టు పేర్కొన్నారు. కలంజర్ టీవీ టెలికాస్టింగ్కు ముందే తాను ఆ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. ఇందుకు తగ్గ ఆధారాలు సీబీఐ వద్ద కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ టీవీలో తనవాట 20 శాతం మాత్రమేనని, రాజీనామా అనంతరం తానెప్పుడూ ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇందుకు తగ్గ ఆధారాలను సమర్పించడంతోనే కోర్టులో కేసులు నిలబడ లేదని పేర్కొన్నారు. ఎదురుచూడలేదు ఈ కేసును తాను ఎదురు చూడలేదన్నారు. ఇది తనకు రాజకీయంగా అనుభవాన్ని నేర్పినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో తానెప్పుడు నీరసించలేదని, ధైర్యంగానే ఎదుర్కొన్నాని తెలిపారు. అప్పీలుకు వెళ్లినా అదే స్థాయిలో ఎదుర్కొంటానని వ్యాఖ్యానించారు. అనేకమంది కలిసి కట్టుగా కుట్రపన్ని ఈ కేసును సృష్టించారని, ఇందులో ఉన్నవాళ్లు అనేకమంది ప్రస్తుతం లాభపడ్డ వారేనని వివరించారు. ఈ కేసును అతి పెద్దదిగా తీర్చిదిద్దడంలో కిరణ్ బేడీ కూడా ఒకరు అని, అయితే, ప్రస్తుతం ఆమె గవర్నర్ హోదాలో ఉండడం బట్టి చూస్తే, ఇలా లాభపడ్డ వారు చాంతాడు అంత అని తెలిపారు. ఇక పార్టీమీదే దృష్టి 2జీ కేసును కాంగ్రెస్ వేయలేదని, ఇతరులు వేస్తే కోర్టు పర్యవేక్షణలో విచారణ సాగిందన్నారు. ఇన్నాళ్లు తరచూ కోర్టుకు వెళ్లాల్సి రావడంతో ఇతర విషయాల మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేని పరిస్థితి ఉండేదన్నారు. ఇక, తన దృష్టి అంతా పార్టీ మీదేనని వ్యాఖ్యానించారు. పూర్తిస్థాయిలో రాజకీయాలకు పరిమితం కానున్నట్టు, ప్రజల్ని కలవబోతున్నట్టు తెలిపారు. అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి ముందుకు సాగనున్నట్టు, మహిళా విభాగం కార్యదర్శిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను పార్టీపరంగా ఏ పదవిని ఆశించడం లేదని ముగించారు. ఆయన పరామర్శలో రాజకీయం లేదు పార్లమెంట్లో గానీయండి, ఢిల్లీలో ఇతర సందర్భాల్లో గానీయండి ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే కలిసినా, ఎదురుపడ్డా, కరుణానిధి గురించి, ఆయన ఆరోగ్యం గురించి మోదీ తప్పనిసరిగా అడిగేవారని వివరించారు. అందులో భాగంగానే చెన్నైకి వచ్చారే గాని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టంచేశారు. బీజేపీకి, డీఎంకేకి సిద్ధాంతాలపరంగా అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని సూచించారు. మహిళా విభాగం నేతగానే.. కరుణానిధి అనేక కేసుల్ని ఎదుర్కొన్నారని, ఆయన జీవితాన్ని చూసి తానూ పాఠం నేర్చుకున్నట్టు తెలిపారు. తాను ఆనందంగా, ధైర్యంగా ఉండాలన్నదే తండ్రి ఆశయం అని చెప్పారు. 2జీ రూపంలో కాంగ్రెస్కూ కష్టాలు తప్పలేదని పేర్కొన్నారు. వారికి రాజకీయంగా పెద్ద నష్టం తప్పలేదన్నారు. 2జీని భూతద్దంలో పెట్టి చూపించ బట్టే బీజేపీ, అన్నాడీఎంకేలు అధికారంలోకి రాగలిగాయని విమర్శించారు. ఏదేని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే, అందులో ప్రభుత్వ నిబంధనలు, సిద్ధాంతాలు ఇలా ఎన్నో అంశాలు ఉంటాయని, ఇవన్నీ పరిశీలించకుండా అనుమతులు ఇచ్చేయడం ఎవరి తరం కాదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కోర్టు పర్యవేక్షణలో జరిగిన కేసు కాబట్టి తప్పకుండా న్యాయం తమవైపు ఉంటుందని ఎదురుచూశానన్నారు. ఇప్పుడే అదే జరిగిందన్నారు. -
నిర్దోషులుగా తేలిన తర్వాత తొలిసారి చెన్నైకి..
సాక్షి, చెన్నై: 2జీ స్పెక్ట్రం కేసులో నిర్దోషులుగా తేలిన కేంద్ర మాజీ మంత్రి ఏ. రాజా, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి శనివారం డీఎంకే అధినేత కరుణానిధిని కలిశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ కుంభకోణంలో రాజా, కనిమొళితో సహా 17 మందిని సీబీఐ ప్రత్యేక కోర్టు రెండు రోజుల క్రితం నిర్దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో చెన్నైకి వచ్చిన కనిమొళి, రాజా ర్యాలీగా బయలుదేరి వెళ్లి కరుణానిధిని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరికి పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ స్టాలిన్, సీనియర్ నాయకులతో సహా వేలమంది కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. యూపీఏ హయాంలో చోటుచేసుకున్న 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణంలో రాజా, కనిమొళితో సహా మొత్తం 17మంది మీద సీబీఐ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు సరైన ఆధారాలను సీబీఐ సమర్పించలేదంటూ.. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటైన యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామి. గతకొంత కాలంగా డీఎంకేను 2జీ స్పెక్ట్రం కేసు వేధిస్తోంది. ఈ కేసులో రాజా సంవత్సరకాలం పాటు జైలులో గడపగా, కరుణానిధి కుమారై కనిమొళి ఏడునెలల పాటు జైలులో ఉన్నారు. ఈ కేసు కారణంగా కరుణానిధి గత ఎన్నికల్లో అధికారానికి దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు డీఎంకేకు అనుకూలంగా తీర్పు రావడంతో పార్టీ శ్రేణులు ఆనందంతో ఉన్నారు. కరుణానిధి అనారోగ్యం కారణంగా ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సంగతి తెలిసిందే. కనిమొళి నిర్దోషిగా తేలడంతో ప్రత్యక్ష రాజకీయాలలో ఆమె చురుగా పాల్గొనే అవకాశముందని మద్దతుదారులు భావిస్తున్నారు. -
2జీ స్పెక్ట్రమ్ కేసుల కథాకమామిషు
సీబీఐ వర్సెస్ ఎ.రాజా (ఏ–1),సిద్ధార్ధ బెహురా (ఏ–2), ఆరేకే చందోలియా (ఏ–3),షాహిద్ ఉస్మాన్ బల్వా (ఏ–4) వినోద్ గోయెంకా (ఏ–5), కనిమొళి కరుణానిది (ఏ–17) తదితరులు చార్జిషీట్లోని ప్రధానాంశాలు ః 2008లో యూనిఫైడ్ యాక్సెస్ సర్వీసెస్( యూఏఎస్) లైసెన్స్ల ఎంట్రీ ఫీజును టెలికాం శాఖ రూ.1,658గా నిర్ధారించింది. 2001లో టెలికాం శాఖ సెల్యులర్ మొబైల్ టెలిఫోన్ సర్వీస్ (సీఎంటీఎస్)లైసెన్స్లను వేలం వేశాక ఎంత మొత్తం వచ్చిందో 2008లోనూ «అవే ధరలను నిర్ణయించారు. యూఏఎస్ లైసెన్సులకు దరఖాస్తు చేసుకోవాలని 2007 సెప్టెంబర్ 25న ప్రకటన జారీచేసి, అక్టోబర్ 1 తరువాత వచ్చే వాటిని స్వీకరించమని టెలికాం శాఖ పేర్కొంది. కొన్ని కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకే ఈ మార్పు చేశారు. లైసెన్సుల కేటాయింపు నియమ నిబంధనల్లో మంత్రి రాజా ఆధ్వర్యంలో పలు మార్పులు జరిగాయి. కొన్ని కంపెనీలు వేలంలో పాల్గొనకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ 1) రాజా, 2) షాహిద్ ఉస్మాన్ బల్వా, 3) వినోద్ గోయెంకా, 4)ఆసిఫ్ బల్వా, 5) రాజీవ్ అగర్వాల్, 6)కరీం మెరానీ 7)శరద్ కుమార్ 8) ఎంకే దయాళు అమ్మాళ్, 9) కనిమొళి కరుణానిధి 10)పి.అమృతం, 11)మెసెర్స్ స్వాన్ టెలికాం 12)మెసెర్స్ సినీయుగ్ మీడియా తదితరులు. ఈడీ ప్రధాన అభియోగాలు ః సీబీఐ కేసుకు అదనంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ. నిందితులు మనీలాండరింగ్కు పాల్పడినట్లు రూ.223.55 కోట్ల ఆస్తుల జప్తు సందర్భంగా స్పష్టమైనట్లు వెల్లడి. తాము నమోదుచేసిన కేసుకు సంబంధించి తగిన ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్న ఈడీ. మనీలాండరింగ్ ద్వారా సంపాదించిన సొమ్ము ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయా వ్యక్తులు, సంస్థల వద్దే ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు వెల్లడి. సీబీఐ వర్సెస్ 1) రవికాంత్ రుయా, 2) అన్షుమన్ రుయా, 3) ఐపీ ఖైతాన్, 4) కిరణ్ ఖైతాన్ 5) వికాస్ షరాఫ్ తదితరులు చార్జిషీటులోని అంశాలుః లెటర్ ఆఫ్ ఇంటెంట్ సమర్పించిన అన్ని కంపెనీల అర్హతలను పరిశీలించిన సీబీఐ. 2007 సెప్టెంబర్లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న మెసెర్స్ లూప్ టెలికాం మెసెర్స్ ఎస్సార్ గ్రూపు బినామి అని తెలిసింది. యూఏఈ లైసెన్స్తో 2005 నుంచే ముంబయి సర్వీస్ ఏరియాలో మెసెర్స్ మొబైల్ ఇండియా కార్యకలాపాలు కొనసాగించింది. మెసర్స్ వొడాఫోన్ ఎస్సార్ లిమిటెడ్లో అప్పటికే మెసర్స్ గ్రూపునకు 33 శాతం వాటా ఉన్నట్లు నిర్ధారణ. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఏమీ లేదు.. స్కామే లేదు
న్యూఢిల్లీ : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 1.76 లక్షల కోట్ల స్కాం! స్వతంత్ర భారతదేశంలో ఇంతపెద్ద కుంభకోణమే లేదు.. ఇది అవినీతి విశ్వరూపం.. 2జీ స్కాంపై ఇన్నేళ్లుగా వినిపించిన ఆరోపణలివీ! ఈ కేసు ఓ సంచలనం.. గత ఎన్నికల్లో అధికారపక్షాన్ని కడిగేసేందుకు ప్రతిపక్షాలకు దొరికిన ప్రధాన అస్త్రం!! కానీ ఆ స్కామ్ అంతా ఉత్తిదే అని తేలిపోయింది. ఏమీ లేని చోట ‘స్కామ్’ను సృష్టించినట్లు స్పష్టమైంది. ఏడేళ్లపాటు ఈ కేసును సుదీర్ఘంగా విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ‘‘కొందరు కొన్ని వివరాలను తెలివిగా అటూఇటూ మార్చి ఏమీ లేని చోట స్కామ్ సృష్టించారు’’ అని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ ఉద్ఘాటించారు. 2జీకి సంబంధించి నమోదైన మూడు కేసుల్లో నిందితులపై ఒక్క అభియోగాన్ని కూడా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని, సరైన ఆధారం ఒక్కటి కూడా తమ ముందు ఉంచలేదని ఆయన స్పష్టంచేశారు. సీబీఐ నమోదు చేసిన ప్రధాన కేసులో టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా మొత్తం 17 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. నిందితులపై నేరారోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమైందని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలతో ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందంటూ 2010లో కాగ్ నివేదిక ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. 2008లో యూపీఏ ప్రభుత్వం ‘ముందొచ్చిన వారికి ముందు’ ప్రాతిపదికన 8 కంపెనీలకు 122 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ విధానంతో ఖజానాకు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లిందని, లైసెన్సులు పొందినవారికి అనుచిత లబ్ధి చేకూరిందని కాగ్ నివేదిక ఇవ్వడంతో దేశంలో పెద్ద దుమారం రేగింది. మంత్రి పదవికి ఎ.రాజా రాజీనామా చేశారు. 2011లో ఆయన్ను సీబీఐ ఆరెస్ట్ చేసింది. 15 నెలలపాలు జైల్లో ఉన్నారు. ఇదే కేసులో డీఎంకే అధినేత కరుణానిధి తనయ కనిమొళికి కూడా ఆరు నెలలపాటు జైల్లో ఉన్నారు. 2012లో సుప్రీంకోర్టు సైతం 122 2జీ లైసెన్సులను రద్దు చేసింది. ఒక్క ఆధారం చూపలేదు.. ‘‘నిందితుల్లో ఒక్కరిపై కూడా ప్రాసిక్యూషన్ అభియోగాన్ని నిరూపించలేకపోయింది. ఈ విషయంలో దారుణంగా విఫలమైంది. నేను దాదాపు ఏడేళ్ల నుంచి వేసవి సెలవులతోపాటు అన్ని పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఓపిగ్గా వాదనలు విన్నా. ప్రాసిక్యూషన్ నుంచి ఒక్కరైనా చట్టం ముందు నిలిచే ఆధారాలు పట్టుకొస్తారని ఎదురుచూశా. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది..’’ అని తన 2,183 పేజీల తీర్పులో న్యాయమూర్తి ఓపీ సైనీ వ్యాఖ్యానించారు. కోర్టుకు సమర్పించిన వివరాల్లో కూడా అనేక తప్పులున్నాయని చెప్పారు. కొందరు కొంత సమాచారాన్ని అటూఇటూ మార్చేసి లేని చోట కుంభకోణాన్ని సృష్టించారన్నారు. ‘‘చార్జిషీట్లో పేర్కొన్న అనేక వివరాలు కూడా చివరికి అవాస్తవాలని తేలాయి. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎంట్రీ ఫీజును మార్చాలని సిఫారసు చేశారని, ఎల్వోఐ(లెటర్ ఆఫ్ ఇంటెంట్)లో ఓ క్లాజ్ను రాజా తొలగించారని చెప్పారు. కానీ విచారణలో అదంతా అవాస్తవమని తేలింది’’ అని వివరించారు. 3 కేసులు.. 35 మంది నిందితులు సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం 2జీకి సంబంధించి మూడు కేసుల్లో తీర్పు చెప్పింది. ఇందులో పలు కంపెనీలు సహా మొత్తం 35 మంది నిందితులున్నారు. ఈ మూడింట్లో సీబీఐ దాఖలు చేసిన కేసు (17 మంది నిందితులు) ప్రధానమైనది. ఇందులో రాజా, కనిమొళితోపాటు టెలికం మాజీ కార్యదర్శి సిద్ధార్థ్ బెహురా, రాజా మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఆర్కే చందోలియా, స్వాన్ టెలికం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్ బల్వా, వినోద్ గొయాంక, యునిటెక్ కంపెనీ ఎండీ సంజయ్ చంద్ర, రిలయెన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్(ఆర్ఏడీఏజీ)కు చెందిన ముగ్గురు ఉన్నత ఉద్యోగులు గౌతమ్ దోషి, సురేంద్ర పిపరా, హరి నాయర్లను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ఇక రెండో కేసు ఈడీ నమోదు చేసినది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ జరిగిందంటూ రాజా, కనిమొళిపై ఈడీ ఈ కేసు పెట్టింది. స్వాన్ టెలికం కంపెనీ ప్రమోటర్లు డీఎంకేకు చెందిన కలైంజర్ టీవీ చానల్కు ఈ మొత్తాన్ని లంచంగా ముట్టజెప్పినట్టు అభియోగం మోపింది. చార్జిషీట్లో డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్ పేరును కూడా చేర్చింది. ఇందులో రాజా, కనిమొళి సహా కుసేగావ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కంపెనీకి చెందిన రాజీవ్ అగర్వాల్, చిత్ర నిర్మాత కరీం మొరానీ, కలైంజర్ టీవీ డైరెక్టర్ శరద్ కుమార్, పి.అమృతం తదితరులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ప్రధాన కేసు దర్యాప్తు క్రమంలో సీబీఐ మూడో కేసు నమోదు చేసింది. ఇందులో ఎస్సార్ ప్రమోటర్లు రవికాంత్ రుయా, అన్షుమన్ రుయా సహా మరో ఆరుగురిని నిందితులుగా చేర్చినా.. కోర్టు వారని కూడా నిర్దోషులుగా తేల్చింది. రాజకీయ చిటపటలు తీర్పు వెలువడగానే రాజా, కనిమొళి హర్షం వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ వాగ్బాణాలు సంధించుకున్నాయి. ఎట్టకేలకు న్యాయం నెగ్గిందని డీఎంకే పేర్కొనగా.. తీర్పుపై ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేయాలని ఈ కేసులో మొదట్నుంచీ న్యాయపోరాటం చేస్తున్న బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఇక 2జీపై నివేదిక ఇచ్చిన మాజీ కాగ్ వినోద్ రాయ్పై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, బీజేపీ నేతలు జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును గౌరవించాలని, తమ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలతో బురద చల్లినట్టు తేలిందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. ఈ తీర్పే అంతిమం కాదని, దీన్ని తమ నిజాయతీకి చిహ్నంగా కాంగ్రెస్ వాడుకోవద్దంటూ బీజేపీ దుయ్యబట్టింది. అప్పీలు చేస్తాం: సీబీఐ, ఈడీ తమకు ఇంకా తీర్పు పూర్తి పాఠం అందలేదని, అది చేతికి రాగానే అధ్యయనం చేసి ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేస్తామని సీబీఐ, ఈడీ వెల్లడించాయి. -
సీబీఐ ఇప్పుడేం చెబుతుంది?
మన టెలికాం పరిశ్రమ 5జీ స్పెక్ట్రమ్కు చేరుకుంటున్న తరుణంలో దాదాపు దశాబ్దకాలం నాటి 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో పటియాలా సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు, కేంద్ర టెలి కాం శాఖ మాజీ మంత్రి అండిముత్తు రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు మరో 15మంది నిందితులు కూడా నిర్దోషులని ప్రకటించింది. వీరిలో టెలికాం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఆరోపణలొచ్చిన టెలికాం సంస్థలు సైతం కేసు నుంచి విముక్తమయ్యాయి. సీబీఐ కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట రేట్(ఈడీ) దాఖలుచేసిన మనీలాండరింగ్ ఆరోపణల కేసు కూడా వీగిపోయింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఏడేళ్లపాటు కొనసాగిన ఈ కేసు మన దేశంలో కేసుల తీరు, దర్యాప్తు ప్రక్రియ ఎలా ఉంటాయో నిరూపించింది. కుంభకోణం పర్యవసానంగా ప్రభుత్వ ఖజానా రూ. 1,76,000 కోట్ల మేర నష్టపోయిందని సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) మదింపు వేసిన కేసు ఫలితమే ఇలా ఉన్నదంటే అది సీబీఐ పనితీరుకు అద్దం పడుతుంది. ప్రత్యేక న్యాయస్థానం ఇప్పుడిచ్చిన తీర్పు తుది తీర్పేమీ కాదు. దీనిపై తాము అప్పీల్కు వెళ్తామని సీబీఐ ప్రకటించింది. ఆ సంగతలా ఉంచి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ తీర్పు వెలువరిస్తూ చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి. ‘ఈ ఏడేళ్లూ నేను అన్ని పని దినాల్లోనూ న్యాయస్థానా నికి హాజరయ్యాను. ఆఖరికి వేసవి సెలవులను కూడా వదులుకున్నాను. ఈ రోజు లన్నిటా ఉదయం 10 గంటలు మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకూ న్యాయస్థానంలో కేసును విచారించాను. కానీ పరిగణనలోకి తీసుకోదగిన ఒక్క సాక్ష్యాధారాన్ని కూడా సీబీఐ ప్రవేశపెట్టలేకపోయింది’ అని చెప్పారు. తీర్పు వెలువడ్డాక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ‘మా ప్రభుత్వానికి వ్యతి రేకంగా తీవ్ర స్థాయిలో చేసిన దుష్ప్రచారమంతా నిరాధారమని తేలిపోయింది’ అన్నారు. అయితే ఈ వ్యవహారం ఇంతవరకూ రావడానికి ఆయన నాయకత్వం లోని యూపీఏ ప్రభుత్వం ధోరణి కూడా కారణమని చెప్పకతప్పదు. 2007లో 2జీ స్పెక్ట్రమ్ లైసెన్స్లకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమై 2008 జనవరి 10న అప్పటి టెలికాం మంత్రి రాజా 122 లైసెన్స్లు జారీ చేసిన కొన్ని నెలలకే ఆ విషయంలో ఫిర్యాదులు రావడం మొదలైంది. మొదట్లో వివిధ రంగాల్లో పనిచేసిన ప్రముఖులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇదొక పెద్ద కుంభకోణమని, దర్యాప్తు చేయడం అవసరమని టెలికాం వ్యవహారాలపై నిఘా ఉంచే ఓ స్వచ్ఛంద సంస్థ 2009 మే 4న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కి ఫిర్యాదు చేసింది. ఈలోగా ఎస్–టెల్ సంస్థ లైసెన్స్ల కేటాయింపును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2010 నవంబర్లో కాగ్ నివేదిక 2జీ స్పెక్ట్రమ్ కేటా యింపుల్లో భారీయెత్తున నష్టం వాటిల్లిందని చెప్పింది. ఈ పరిణామాలు వెల్లడైన ప్పుడు వెనువెంటనే రంగంలోకి దిగాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. మొత్తం వ్యవహారంలో ఏమైందో తెలుసుకుని దాన్ని ప్రజల ముందుంచడం, లోపా లను సరిచేయడం... ఏమీ లేదనుకుంటే ఆ సంగతే తేటతెల్లం చేయడం జరగాలి. కానీ విపక్షాల ఒత్తిడి తర్వాత రాజాతో మంత్రి పదవికి రాజీనామా చేయించడం మినహా ప్రభుత్వం ప్రేక్షక పాత్రకు పరిమితమైంది. ఈ తీరు అనేక అనుమానాలకు ఆస్కారమిచ్చింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సీబీఐ విచారణకు ఆదేశించి, తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పింది. ఈ 122 లైసెన్స్లనూ రద్దు చేసింది. మరోపక్క కాగ్ నివేదిక వెలువడ్డాక దానిపై దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటరీ సంఘం(జేపీసీ) నియమించాలని ఆనాడు విపక్షంలో ఉన్న బీజేపీ, మరికొన్ని పార్టీలు పట్టుబడితే పెడచెవిన పెట్టింది. బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యంలోని ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నది గనుక కొత్తగా జేపీసీ అవసరం లేదన్న తర్కానికి దిగింది. ఈ వివాదం పర్య వసానంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకు పోయాయి. కానీ బడ్జెట్ సమావేశాల నాటికల్లా ప్రభుత్వం దిగొచ్చింది. జేపీసీ నియామకానికి అంగీ కరించింది. ఈసారి మరో కొత్త తర్కాన్ని తెరమీదకు తెచ్చింది. పీఏసీ నివేదిక రాబోతున్న తరుణంలో... జేపీసీ పరిశీలిస్తుంది గనుక ఇక పీఏసీ అవసరం లేదని వాదించింది. ఇలా మర్కట తర్కాన్ని మరపిస్తూ చేసిన వాదనలన్నీ ప్రభుత్వం ‘ఏదో’ దాచడానికి ప్రయత్నిస్తున్నదన్న అభిప్రాయాన్ని కలగజేశాయి. అటు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ వ్యవహారం గురించి మాట్లాడలేదు. ట్రాయ్ చైర్మన్గా పనిచేసిన ప్రదీప్ బైజాల్ 2జీ స్పెక్ట్రమ్ స్కాంపై 2015లో పుస్తకం వెలువరించినప్పుడు మాత్రం ‘నేను గానీ, నా కుటుంబం లేదా మిత్రులుగానీ ప్రధాని పదవిని అడ్డుపెట్టుకుని సంపద పోగేయాలనుకోలేద’ని ఆయన చెప్పారు. ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీటు... లిఖితపూర్వకంగా, మౌఖికంగా ప్రాసిక్యూషన్ తన ముందుంచిన వాదనలు, ప్రాసిక్యూటర్ల వ్యవహారశైలి వగైరా లపై తన 1,552 పేజీల తీర్పులో న్యాయమూర్తి చేసిన తీవ్ర వ్యాఖ్యలు తీవ్రమైనవి. టెలికమ్యూనికేషన్ల విభాగం తీసుకున్న, తీసుకోని చర్యలు సృష్టించిన అయో మయం క్రమేపీ పెరిగి పెద్దదై ఏమీ లేనిచోట ఏదో పెద్ద కుంభకోణం జరిగిందన్న అభిప్రాయం ప్రతివారిలోనూ ఏర్పడేలా చేసిందని తీర్పు అభిప్రాయపడింది. నింది తులు పాల్పడ్డారంటున్న చర్యల్లోని అపరాధాన్ని రుజువు చేయడానికి తగిన సాక్ష్యాలు ఈ కేసులో లేవని తేల్చింది. కోర్టుకు దాఖలు చేసిన పత్రాలపై సంతకాలు చేయడానికి కూడా ముందుకురాని ప్రాసిక్యూటర్ల తీరుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఎవరెన్ని చెప్పినా, ఆరోపణలు చేసినా న్యాయస్థానాలకు అంతిమంగా కావలసింది సంశయాతీతమైన సాక్ష్యాధారాలు. ఇంత సుదీర్ఘ సమయం తీసుకుని కూడా వాటిని అందజేయలేక సీబీఐ చతికిలబడింది. ఖజానాకు భారీ నష్టం వాటి ల్లిందని ఆరోపణలొచ్చిన ఈ కేసులో తన వ్యవహారశైలిపై న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలకు ఆ సంస్థ సంజాయిషీ ఇచ్చుకోకతప్పదు. -
కన్నీకి న్యాయం జరిగింది.. చాలా ఆనందంగా ఉంది!
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన 2జీ కుంభకోణంలో ఢిల్లీ సీబీఐ కోర్టు సంచలన తీర్పున్నిచింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కేంద్ర టెలికం మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే నాయకురాలు కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై డీఎంకే, కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. యూపీఏ సర్కారు ఏ తప్పూ చేయలేదనే విషయాన్ని ఈ తీర్పు చాటుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అటు ఏ రాజా, కనిమొళి సన్నిహితులు కూడా ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనిమొళి సన్నిహితురాలు, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సులే 2జీ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. 'నా స్నేహితురాలైన కన్నీకి న్యాయం జరిగినందుకు ఆనందంగా ఉంది' అంటూ ఆమె ఫొటో పెట్టి సులే ట్వీట్ చేశారు. ఇక, 2జీ తీర్పు అనంతరం కనిమొళి మీడియాతో మాట్లాడుతూ.. తన తప్పులేకపోయినా తనపై కేసు నమోదుచేశారని, కలైంజర్ టీవీలో తాను మైనారిటీ వాటాదారును మాత్రమేనని ఆమె అన్నారు. తీర్పు అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీతో మాట్లాడానని, సత్యమే గెలిచిందని ఆయన అన్నారని చెప్పారు. So happy for my friend kanni.. justice done🙏🏽🙏🏽🙏🏽😀 @KanimozhiDMK pic.twitter.com/NffxsIE1ww — Supriya Sule (@supriya_sule) 21 December 2017 -
2జీ తీర్పుపై మన్మోహన్ కామెంట్స్..!
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేసిన 2జీ స్పెక్టం కుంభకోణంపై పటియాలా హౌజ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ స్పందించారు. 2జీ స్కాం నేపథ్యంలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారమంతా దుష్ప్రచారమేనని ఈ తీర్పు స్పష్టం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. మన్మోహన్సింగ్ నేతృత్వంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా 2జీ స్కాం యూపీఏ సర్కారును అతలాకుతలం చేసింది. ఈ స్కాంలో నిందితుడిగా ఉన్న అప్పటి టెలికం మంత్రి ఏ రాజా, యూపీఏ సర్కారులో భాగస్వామిగా ఉన్న డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. 'తీర్పు చాలా సుస్పష్టంగా ఉంది. యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన తీవ్రస్థాయిలో చేసిన దుష్ప్రచారమంతా నిరాధారమని తీర్పు స్పష్టం చేసింది' అని మన్మోహన్సింగ్ హర్షం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బొగ్గు గనుల కేటాయింపులు, కామన్వెల్త్ క్రీడల వంటి విషయాల్లో జరిగిన కుంభకోణాలు యూపీఏ సర్కారును తీవ్రంగా కుదిపేశాయి. -
కోర్టులో రాజా భార్య, కూతురు కంటతడి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో తీర్పు వెలువడగానే ఈ కేసులో ప్రధాన నిందితుడైన టెలికం మాజీ మంత్రి రాజా భార్య, కూతురు కోర్టులో కంటతడి పెట్టారు. ఈ కేసులో రాజా నిర్దోషి అంటూ పాటియాలా కోర్టు న్యాయమూర్తి సింగిల్ లైన్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వారిద్దరు ఆనంద భాష్పాలు రాల్చారు. అనంతరం రాజాను ఆలింగనం చేసుకొని బావోద్వేగంతో చూస్తూ బయటకు వెళ్లిపోయారు. ఇక డీఎంకే అధినేత కరుణానిధి కూతురు ఈ కేసులో మరో నిందితురాలు కనిమొళి కూడా కంటతడి పెట్టారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో తమకు అండగా తమ వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని మీడియా ద్వారా చెప్పారు. దాదాపు రూ.లక్షా 70వేల కోట్ల విలువైన ఈ కేసులో రాజా, కనిమొళితోపాటు మొత్తం 17మంది డీఎంకే నేతలు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. వీరంతా కూడా నిర్దోషులని కోర్టు ప్రకటించడంతో డీఎంకే పార్టీలో సందడి నెలకొంది. ఇక కనిమొళి సోదరుడు స్టాలిన్ స్వీట్లు పంచారు. కోర్టు బయట వారి మద్దతుదారులు చిందులు వేశారు. -
తీర్పుపై మాజీ సీబీఐ డైరెక్టర్ షాక్
సాక్షి,న్యూఢిల్లీ: 2జీ స్కామ్ కేసులో నిందితులందరినీ నిర్ధోషులుగా కోర్టు ప్రకటించడం పట్ల మాజీ సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ విస్మయం వ్యక్తం చేశారు.ఏ రాజాతో పాటు కార్పొరేట్ల అరెస్ట్కు నేతృత్వం వహించిన సింగ్ తీర్పుపై షాక్కు గురయ్యానన్నారు. 2జీ స్పెక్ర్టమ్ కేటాయింపుల్లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నట్టు సీబీఐ సాక్ష్యాధారాలతో ముందకొచ్చిందని విచారణలో ఏం జరిగిందో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు 2జీ కేసులో ప్రభుత్వంలోని అత్యున్నత స్ధాయిలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు అసత్యమని తేలిందని మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు.2జీ తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ స్పందించారు. 2జీ కేసులో నిరాధార ఆరోపణలు చేసిన కాగ్ క్షమాపక్షలు చెప్పాలని డిమాండ్ చేశారు. తీర్పు వెలువడిన అనంతరం కనిమొళి, రాజా హర్షం వ్యక్తం చేశారు.కష్టసమయంలో తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో సంచలన తీర్పు
-
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం : సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో నిందితులు రాజా, కనిమొళిలు సహా అందరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. పటియాలా కోర్టు తీర్పుతో డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు నిందితులకు శిక్ష విధించడంలో న్యాయవ్యవస్థ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈ రెండుసార్లూ మిత్రపక్షమైన డీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యతే లభించింది. తమ పార్టీ నేతల వ్యాపార అవసరాలకు అనుగుణమైన మంత్రిత్వ శాఖలనే కరుణానిధి పట్టుపట్టి కేంద్రం నుంచి సాధించుకున్నారు. ఇందులో భాగంగానే డీఎంకేకి చెందిన రాజా టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వానికి కాగ్ ఒక నివేదిక సమర్పించింది. భారీ మొత్తంలో కుంభకోణం కావడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రెండు కేసులు పెట్టింది. అలాగే ఎన్ఫోర్సుమెంటు డైరక్టరేట్ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది. సీబీఐ పెట్టిన రెండు కేసుల్లో రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి తదితరులు చిక్కుకున్నారు. వీరితోపాటు టెలికమ్యూనికేషన్స్ మాజీ కార్యదర్శి సిద్దార్థ్ బెహురా, రాజా మాజీ ప్రయివేటు కార్యదర్శి ఆర్కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు దాఖలైంది. పదేళ్ల క్రితం నాటి 2జీ స్పెక్ట్రం కుంభకోణం అప్రతిష్టపాలు చేసిన ఫలితంగా యూపీఏ ప్రభుత్వం గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. -
2జీ స్పెక్ట్రం కేసులో నేడే తీర్పు
-
జైలుకా.. ఇంటికా..!
‘2జీ’. ఈ రెండు అక్షరాలు వింటే డీఎంకే శ్రేణుల గుండెల్లో గత ఆరేళ్లుగా రైళ్లు పరుగెడుతున్నాయి. పదేళ్ల క్రితం నాటి రూ.1.76 లక్షల కోట్ల భారీ కుంభకోణం, ఆరేళ్లుగా సాగుతున్న సీబీఐ, ఈడీ కేసుల విచారణే వారి భయానికి కారణం. ఈ కేసులో గురువారం తీర్పు వెలువడనుండగా రాజా, కనిమొళి దోషులుగా జైలుకా, నిర్దోషులుగా ఇంటికా అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది. ఓవైపు 2జీ స్పెక్ట్రం కేసులో తీర్పు.. ఇదే రోజు ఆర్కే నగర్ ఉప ఎన్నిక.. 2జీ కేసులో శిక్ష పడితే ఆర్కే నగర్ పోలింగ్ సరళిని తారుమారు చేస్తుందని.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందని డీఎంకే నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. సాక్షి, చెన్నై: పదేళ్ల కిత్రం జరిగిన 2జీ స్పెక్ట్రం కుంభకోణానికి గురువారం ముగింపు కార్డు పడనుంది. డీఎంకే నాయకులు రాజా, కనిమొళి ఈ కేసులో చిక్కుకుని ఉండడం.. మరోవైపు ఆర్కే నగర్ ఉప ఎన్నిక కూడా ఇదే రోజు కావడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈరెండుసార్లూ మిత్రపక్షమైన డీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యతే లభించింది. తమ పార్టీ నేతల వ్యాపార అవసరాలకు అనుగుణమైన మంత్రిత్వ శాఖలనే కరుణానిధి పట్టుపట్టి కేంద్రం నుంచి సాధించుకున్నారు. ఇందులో భాగంగానే డీఎంకేకి చెందిన రాజా టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వానికి కాగ్ ఒక నివేదిక సమర్పించింది. భారీ మొత్తంలో కుంభకోణం కావడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రెండు కేసులు పెట్టింది. అలాగే ఎన్ఫోర్సుమెంటు డైరక్టరేట్ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది. సీబీఐ పెట్టిన రెండు కేసుల్లో రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి తదితరులు చిక్కుకున్నారు. వీరితోపాటు టెలికమ్యూనికేషన్స్ మాజీ కార్యదర్శి సిద్దార్థ్ బెహురా, రాజా మాజీ ప్రయివేటు కార్యదర్శి ఆర్కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు దాఖలైంది. కరుణ సహధర్మచారిణిని ప్రశ్నించాలనుకున్న సీబీఐ స్వాన్ టెలికం సంస్థకు 2జీ స్పెక్ట్రం కేటాయింపులకు ప్రతిఫలంగా డీఎంకేకి సొంతమైన కలైంజర్ టీవీ, టీపీ గ్రూపు సంస్థలకు రూ.200 కోట్లు లంచం ఇచ్చిన కేసును సైతం అసలు కేసులోనే చేర్చారు. ఈ కేసులను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ విచారణ చేపట్టారు. రిలయన్స్ టెలికం, స్వాన్ టెలికం, యూనీటెక్ వైర్లెస్ సంస్థలు సైతం కేసు విచారణలను ఎదుర్కొన్నారు. కలైంజర్ టీవీ డైరక్టర్ వ్యవహరిస్తున్న కరుణ సహధర్మచారిణి దయాళుఅమ్మాళ్ను కూడా సీబీఐ ప్రశ్నించాలని భావించింది. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆమెకు జ్ఞాపకశక్తి పూర్తిగా పోయిందని, ఏమీ మాట్లాడుతారో ఆమె తెలియదని కరుణ కుటుంబీకులు నిరాకరించారు. సీబీఐ సిఫార్సు మేరకు కేంద్రం నుంచి వైద్యులు బృందం సైతం చెన్నైకి వచ్చి దయాళుఅమ్మాళ్ను పరీక్షించింది. 2జీ కేసులో మిత్రపక్షం డీఎంకే అని కూడా చూడకుండా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెతకవైఖరి అవలంభిస్తోందని ఆగ్రహించిన కరుణానిధి యూపీఏ నుంచి వైదొలిగారు. ఆ తరువాత దయాళూఅమ్మాళ్ను విచారించే అంశం మరుగున పడింది. 2జీ స్పెక్ట్రం హక్కులను 122 మందికి కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి రూ.30,984 కోట్లు నష్టం సంభవించినట్లు ప్రచార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆరేళ్లు సాగినకేసు గత ఆరేళ్లుగా సాగిన ఈ కేసు విచారణ ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీతో ముగియగా, 21వ తేదీన తీర్పు చెప్పబోతున్నట్లు న్యాయమూర్తి ఓపీ సైనీ ఇటీవల ప్రకటించారు. గురువారం చెప్పబోయే తీర్పుతో పదేళ్ల కిత్రం జరిగిన కుంభకోణానికి ముగింపు కార్డు పడనుంది. తీర్పు చెప్పుతున్నందున కోర్టుకు హాజరుకావాల్సిందిగా రాజా, కనిమొళిలకు ఆదేశాలు అందాయి. పదేళ్ల క్రితం నాటి 2 జీ స్పెక్ట్రం కుంభకోణం అప్రతిష్టపాలు చేసిన ఫలితంగా యూపీఏ ప్రభుత్వం గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. పదేళ్ల క్రితం నాటి కుంభకోణం, ఆరేళ్లుగా న్యాయస్థానంలో నలుగుతున్న కేసుపై గురువారం తీర్పు వెలువడనుంది. రాజా, కనిమొళిలను కోర్టు దోషులుగా నిర్ధారించి జైలు బాటపట్టిస్తుందా, నిర్దోషులుగా పేర్కొని ఇంటికి పంపుతుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఒకే రోజు రెండు టెన్షన్లు దురదృష్టమో, కాకతాళీయమో తెలియదు కానీ కరుణానిధి, స్టాలిన్ సహా డీఎంకే శ్రేణులు గురువారం రెండు టెన్షన్లను ఎదుర్కొంటున్నారు. 2 జీ కేసులో శిక్ష పడితే పార్టీకి చెరగని మచ్చగా మారి ఆర్కేనగర్ ఉప ఎన్నికల పోలింగ్ సరళిని తారుమారు చేస్తుందని భయం. అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనా ప్రభావం చూపుతుంది. అన్నాడీఎంకేకి రాబోయే ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మారుతుంది. -
నటుడి ఇంటి వద్ద పోలీసు భద్రత
కేకే.నగర్(చెన్నై): దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడిన మాట్లాడిన డీఎంకే నేత, నటుడు రాధారవిపై నిరసన జ్వాలలు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో రాధారవి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మింట్లో ఇటీవల జరిగిన డీఎంకే బహిరంగ సమావేశంలో నటుడు రాధారవి మాట్లాడారు. ఆ సమయంలో ఆయన తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తేనాంపేటలో గల రాధారవి ఇంటిని ముట్టడించి పోరాటం చేస్తామని దివ్యాంగుల సంఘ అధ్యక్షుడు రాధాకృష్ణన్ ప్రకటించాడు. దీంతో రాధారవి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. దీనిపై రాధారవి మాట్లాడుతూ తాను దివ్యాంగుల మనసు బాధించేలా మాట్లాడలేదని తెలిపారు. కనిమొళి ఖండన రాధారవి మాటలను డీఎంకే మహిళా విభాగ కార్యదర్శి కనిమొళి తీవ్రంగా ఖండించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ దివ్యాంగులను కించపరిచి వారి మనసులు బాధించే విధంగా రాధారవి మాట్లాడడం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు. ఇకనైనా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని హితవు చెప్పారు. -
పన్నీర్ సెల్వంకు డీఎంకే మద్దతు!
-
పన్నీర్ కు డీఎంకే మద్దతు!
చెన్నై: తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ప్రతిపక్ష డీఎంకే ఆపన్నహస్తం అదించనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అసెంబ్లీలో పన్నీర్ సెల్వంకు బలం నిరూపించుకునే అవకాశం ఇస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ సుబ్బలక్ష్మి జగదీశన్ తెలిపారు. ఎమ్మెల్యేలను నిర్బంధించడం సరికాదని, ఎవరి మద్దతు ఇవ్వాలనే విషయంలో శాసనసభ్యులకు స్వేచ్ఛ ఇవ్వాలని డీఎంకే ఎంపీ కనిమొళి అభిప్రాయపడ్డారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోమని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ పన్నీరు సెల్వం బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే డీఎంకే అండగా నిలబడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నాడీఎంకేలో సంక్షోభం నేపథ్యంలో పన్నీర్ సెల్వంకు మద్దతుగా స్టాలిన్ మాట్లాడుతుండడం చర్చనీయాంశంగా మారింది. శశికళపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పన్నీర్ చర్యలను ఆయన సమర్థిస్తున్నారు. అయితే తామేప్పుడూ పన్నీర్ సెల్వంను సమర్థించలేదని, అంశలవారీ మద్దతు మాత్రమే ఇచ్చామని స్టాలిన్ చెప్పడంతో డీఎంకే వైఖరి స్పష్టమైందన్న వాదనలు విన్పిస్తున్నాయి. త్వరలో శుభవార్త చెబుతానని గవర్నర్ ను కలిసిన తర్వాత సెల్వం అనడంతో బలనిరూపణకు ఆయనకు అవకాశం ఉంటుదని వార్తలు వస్తున్నాయి. -
మేము జోక్యం చేసుకోలేం: మద్రాసు హైకోర్టు
చెన్నై: జల్లికట్టుపై నిషేధం తొలగించాలని తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యహారంలో జోక్యం చేసుకునేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది. జల్లికట్టు అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. మరోవైపు జల్లికట్టుపై నిషేధం తొలగిస్తూ ఆర్డినెన్స్ తేవాలని అన్నాడీఎంకే ఎంపీలు రేపు ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. ఇంతకుముందు ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జల్లికట్టుకు మోదీ ప్రభుత్వం అనుకూలంగా ఉందని తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ తెలిపారు. ప్రజల ఆందోళనలను అర్థం చేసుకోగలమని, జల్లికట్టు అంశం సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు. తమిళ ప్రజల మనోభావాలను గౌరవించాలని డీఎంకే నాయకురాలు కనిమొళి అన్నారు. జల్లికట్టుకు మద్దతుగా ఒక్క చెన్నైలోనే కాదని, రాష్ట్రమంతా ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. -
మేము జోక్యం చేసుకోలేం
-
స్టాలిన్కు పార్టీ పగ్గాలు, కింగ్ మేకర్ ఎంట్రీ!
చెన్నై : తమిళనాట రాజకీయాలు హాట్ హాట్గా మారాయి. జయలలిత మరణంతో ఓ వైపు అన్నాడీఎంకేలో కుర్చీ కోసం కుమ్ములాటలు జరుగుతుంటే...మరోవైపు ప్రతిపక్ష పార్టీ డీఎంకేలోనూ వారసత్వ పోరు మళ్లీ తెరపైకి వస్తోంది. ఈ నెల 4వ తేదీన (బుధవారం) డీఎంకే సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా స్టాలిన్ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి కూడా కీలక పదవి ఇస్తే తిరిగి పార్టీలోకి వస్తానంటూ సంకేతాలు ఇస్తున్నారు. డీఎంకే దక్షిణాది కింగ్మేకర్గా ఒకప్పుడు అళగిరి చక్రం తిప్పిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఆయన్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించేందుకు కుటుంబీకులు కరుణపై ఒత్తిడి కూడా వచ్చింది. దీంతో అళగిరి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరోవైపు కనిమొళికి కూడా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కరుణానిధి పాల్గొంటారా? లేదా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా ఈ సమావేశం గతంలోనే జరగాల్సి ఉండగా, ఆయన అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దాంతో ఈ భేటీ వాయిదా పడింది. కాగా ఈ సమావేశంలో కరుణానిధి పాల్గొంటారని పార్టీ సీనియర్ నేత అన్బళగన్ తెలిపారు. సర్వసభ్య సమావేశంలో స్టాలిన్కు ముఖ్య బాధ్యతలు అప్పగించేవిధంగా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో డీఎంకే సర్వసభ్య సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఆరోగ్యంగా కరుణ
► రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ ►పరామర్శల వెల్లువ డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుమార్తె, ఆ పార్టీ ఎంపీ కనిమొళి ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక, కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై పరామర్శలు వెల్లువెత్తుతున్నారుు. సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం. కరుణానిధి గురువారం ఉదయం న్యూట్రీషన్, డీహైడ్రేషన్ సమస్యతో ఆళ్వార్పేటలోని కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు రెండోరోజు శుక్రవారం అక్కడి వైద్యులు చికిత్స అందించారు. కరుణానిధి వెంట ఆసుపత్రిలో ఆయన కుమారులు స్టాలిన్, అళగిరి, కుమార్తెలు సెల్వి,కనిమొళి ఉన్నారు. వృద్ధులకు చికిత్స అందించే ప్రత్యేక ఐసీయూ యూనిట్ విభాగంలో కరుణానిధి ఉన్నట్టు సమాచారం. ఆయన ఆసుపత్రిలో చేరిన సమాచారంతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఫోన్లో పరామర్శించారు. ఎంపీ, కరుణ గారాల పట్టి కనిమొళితో ఆయన మాట్లాడారు. ఎండీఎంకే నేత వైగో, ఇక, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, సీపీఎం ఎంపీ టీకే రంగరాజన్, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఫోన్ ద్వారా పరామర్శించారు. ఇక, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు, అధికార ప్రతినిధి కుష్బు, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, కేంద్ర మాజీ మంత్రులు టీఆర్ బాలు, పళని మాణిక్యం ఆసుపత్రి వద్దకు చేరుకుని కరుణానిధిని పరామర్శించారు. కరుణానిధిని పరామర్శించినానంతరం మీడియాతో డీఎంకే సంయుక్త ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మాట్లాడుతూ, కరుణానిధి ఆరోగ్యంగానే ఉన్నారని, ఆహారం తీసుకుంటున్నారని వివరించారు. వైద్యుల సూచన మేరకే ఆయన డిశ్చార్జ్ అవుతారనీ, ఆయన నిర్ణయం మేరకు డిశ్చార్జ్ ఇక్కడ ఉండదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాస్త సీఎం జయలలిత డిశ్చార్జ్ విషయంగా అపోలో వర్గాల వ్యాఖ్యల్ని ఎద్దేవా చేస్తున్నట్టు ఉండడం గమనార్హం. ఇక, కనిమొళి మీడియాతో మాట్లాడుతూ అధినేతకు ఎలాంటి సమస్య లేదు అని, ఆయనకు సాధారణ చెకప్ మాత్రమేనని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని ప్రకటించారు. -
కనిమొళి, స్టాలిన్ అరెస్ట్
చెన్నై: కర్ణాటకలో తమిళులపై దాడులకు నిరసనగా తమిళనాడు వ్యాప్తంగా శుక్రవారం చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఆందోళన కారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కొందరు ముఖ్యనేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ⇒ డీఎంకే కార్యకర్తలతో ఆందోళనకు దిగిన ఎంపీ కనిమొళిని పోలీసులు అన్నా సలైలో అదుపులోకి తీసుకున్నారు. ⇒ ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి బయలుదేరిన డీఎంకే నేత స్టాలిన్, నలుగురు ఎమ్మెల్యేలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ⇒ సైదాపేట్ రైల్వే స్టేషన్లో రైతు నాయకుడు ఆర్పీ పాండ్యన్, డీఎంకే కార్యకర్తలతో కలిసి రైల్ రోకో నిర్వహించారు. ⇒ వీసీరే నేత తిరుమవల్వన్, కార్యకర్తలను బేసిన్ బ్రిడ్జ్ సమీపంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ⇒ తిరుచ్చి రైల్ జంక్షన్లో పార్టీ కార్యకర్తలతో రైల్ రోకోలో పాల్గొనడానికి వెళ్తున్న ఎండీఎంకే నేత, రాజ్యసభ సభ్యులు వైకోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ⇒ ప్రతిపక్షాల నిరసన కార్యక్రమాలతో ఏఎంయూ ట్రైన్ సర్వీసులు నిలిపివేశారు ⇒ తంజావూరులో సీపీఐ నేత సీ. మహేంద్రన్ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ⇒ డీఎంకే ఎమ్మెల్యే కార్తీక్, కార్యకర్తలతో కలిసి సింగనల్లూరులో రైల్ రోకో నిర్వహించారు. ⇒ కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో భద్రతా బలగాలను మోహరించారు ⇒ ఐటీ కంపెనీలు, ప్రైవేటు కాలేజీలకు పోలీసులు పటిష్ట భద్రతను కల్పించారు. కర్ణాటకలోని తమిళులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ తదితర సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, పీఎంకే, సీపీఐ, సీపీఎం, తమాకా, వీసీకే తదితర పార్టీలన్నీబంద్కు మద్దతు పలికాయి. బంద్లో రాష్ట్రంలోని 65 లక్షల మంది వ్యాపారులు పాల్గొంటున్నారు. కావేరీ జలాశయం నుంచి తమిళనాడుకు ఈనెల 20వ తేదీ వరకు సెకనుకు 12వేల ఘనపుటడుగల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పును నిరసిస్తూ కర్ణాటకలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన వందలాది వాహనాలను తగులబెట్టి విధ్వంసాలకు పాల్పడ్డారు. తమిళుల కార్యాలయాలు, వ్యాపార సంస్థలను ధ్వంసం చేశారు. తమిళులపై దాడి చేశారు. ఒక తమిళుడిని సజీవదహనం కూడా చేసిన విషయం తెలిసిందే. -
జయమ్మపై కనిమొళి ఫైర్!
చెన్నై: డీఎంకే ఎంపీ, కరుణానిధి తనయురాలు కనిమొళి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో తన పేరు ఉన్నంతమాత్రాన అది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపుపై ప్రభావం చూపెట్టబోదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 'అవినీతి గురించి జయలలిత మాట్లాడకూడదు. 2జీ స్పెక్ట్రమ్ విషయంలో మమ్మల్ని విమర్శించడానికి ఆమె ఎవరు? ఆమె చాలా కేసుల్లో దోషిగా తేలారు. తాన్ని కేసులో శిక్ష ఎదుర్కొన్నారు' అని కనిమొళి అన్నారు. ఆమె శుక్రవారం చెన్నైలో డీఎంకే తరఫున సుడిగాలి ప్రచారం నిర్వహించారు. మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా ప్రతి ఇంటికి వంద యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని జయలలిత ప్రభుత్వం నెరవేర్చబోదని కనిమొళి విమర్శించారు. 'ఉచిత విద్యుత్ హామీని ఆమె ఎలా నెరవేరుస్తారు. ఆమె ప్రభుత్వమే గత ఐదేళ్లలో విద్యుత్ చార్జీలను పెంచారు. డీఎంకే మ్యానిఫెస్టోను యథాతథంగా కాపీ చేసి.. దానిపై అన్నాడీఎంకే తమ ముఖ్యమంత్రి స్టిక్కర్ ను అతికించింది. అంతుకుమించి అందులో కొత్తదనమేమీ లేదు' అని కనిమొళి మండిపడ్డారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలపై కనిమొళి కనీసం ఆరు నెలలు జైలులో గడిపిన సంగతి తెలిసిందే. -
మేము రెడీ.. మరి వాళ్లో!
సాక్షి, చెన్నై: అధికారంలోకి రాగానే, తమ వాళ్లకు చెందిన మద్యం తయారీ పరిశ్రమలన్నీ మూత వేయడానికి సిద్ధమయ్యామని డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి అంటున్నారు. ఇది, తానొక్కదాన్నే చెప్పడం లేదని, ఆయా సంస్థలకు చెందిన వాళ్లూ రెడీ అయ్యారని వ్యాఖ్యానిస్తూ, మరి మిడాస్కు తాళం ఎప్పుడు పడుతుందో అని ప్రశ్నించారు. రాష్ర్టంలో సంపూర్ణ మద్యనిషేధం నినాదంతో అన్ని పార్టీలు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో డీఎంకే కూడా ఉంది. అన్నాడీఎంకే మాత్రం దశల వారీ అన్న నినాదాన్ని ప్రకటించి ఉన్నది. డీఎంకే అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం లక్ష్యంగా చట్టం తీసుకొచ్చేందుకు నిర్ణయించి, ప్రజల్లోకి ఆ నినాదాన్ని తీసుకెళ్లే పనిలో పడ్డారు. అయితే, డిఎంకేకు చెందిన నాయకులు అన్నాడీఎంకే వర్గాలపై, అన్నాడీఎంకే నాయకులు డీఎంకే వర్గాలకు సవాళ్లు విసురుతూ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం, అధికారంలోకి రాగానే తమ మద్యం ఫ్యాక్టరీలను మూసి వేయడానికి సిద్ధం అని డీఎంకే నినాదం అందుకోగా, మరీ తమరెప్పుడు అంటూ అన్నాడీఎంకే మద్యం ఫ్యాక్టరీ యజామానుల్ని ప్రశ్నించే పనిలో పడ్డారు. ఈ సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి, ఎంపీ కనిమొళి మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే తమ వాళ్లందరూ మద్యం ఫ్యాక్టరీలను మూసి వేయడానికి సిద్ధం అయ్యారని వ్యాఖ్యానించారు. ఈ మాట అన్నది తాను మాత్రమే కాదు అని, సంబంధిత వ్యక్తులు కూడా స్పష్టం చేసి ఉన్నారన్నారు. అయితే, తాము రెడీ అయ్యామని, అలాంటప్పుడు వాళ్లకు చెందిన ‘మిడాస్’ ఎప్పుడు మూసి వేయబోతున్నారో ప్రశ్నించడంటూ మీడియాకు సూచించారు. అన్నాడీఎంకే వర్గాలకు చెందిన మిడాస్లో అనేక బ్రాండ్ల మద్యం తయారు అవుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు మద్యం సరఫరా అవుతున్నది. ఈ సమయంలో రాష్ట్రంలో ఉన్న మిడాస్ను ఎప్పుడు మూస్తారో అంటూ కనిమొళి ప్రశ్నించడం విశేషం. అయితే, డీఎంకే అధికారంలో వస్తే, సర్వాధికారాలు వారి చేతికి వచ్చినట్టే. అలాంటప్పుడు ‘మిడాస్’ను మూయించ లేరా..?, మరీ, వాళ్లే ఎందుకు తాళం వేసుకోవాలో..? అని పెదవి విప్పే వాళ్లే అధికం. -
రేసులో కనిమొళి
సాక్షి, చెన్నై : దరఖాస్తుల పర్వంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి, కోశాధికారి స్టాలిన్ల కోసమే కాదు... రేసులో కనిమొళి సైతం దిగినట్టున్నారు. ఆమె తమ నియోజకవర్గంలో అంటే.. తమ నియోజకవర్గంలో పోటీ చేయాలంటూ దరఖాస్తులు చేస్తున్న మద్దతుదారులు పెరుగుతున్నారు. అయితే కని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే.డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి. తన గారాల పట్టిని రాజ్యసభకు పంపించి ఉన్నారు. ఎన్నికల సమయాల్లో తాను సైతం అంటూ ప్రచార బరిలో దిగుతూ వచ్చిన కనిమొళి ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల బరిలో మాత్రం దిగలేదు. ఈ సారి పార్టీ పరంగా ఆమెకు పెద్దపీట వేసి ఉన్నారు. మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆ విభాగం బలోపేతానికి శ్రమిస్తూ వస్తున్న కనిమొళిని తాజాగా ఎన్నికల కదనరంగంలోకి దించేందుకు మద్దతుదారులు సిద్ధం అయ్యారు. డీఎంకే దరఖాస్తుల పర్వంలో కరుణానిధి, స్టాలిన్లు తమ నియోజకవర్గంలో అంటే, తమ నియోజకవర్గంలో పోటీ చేయాలని పోటీ పడి మరీ దరఖాస్తులు సమర్పిస్తూ వస్తున్న డీఎంకే నాయకులు సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తున్నది. తాజాగా ఆ రేసులో తానూ అన్నట్టుగా కనిమొళి రంగంలోకి దిగినట్టుంది. కరుణానిధి, స్టాలిన్లతో పాటుగా కనిమొళి కోసం దరఖాస్తులు దాఖలు అవుతోండడం ఇందుకు నిదర్శనం. కనిమొళి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగాలని ఆశిస్తూ, ఆమె తమ నియోజకవర్గం అంటే, తమ నియోజకవర్గంలో పోటీ చేయాలని వేలాది రూపాయలు పెట్టి దరఖాస్తుల్ని కొని మద్దతు పలికే పనిలో కొందరు డీఎంకే వర్గాలు పడ్డాయి. గురువారం కనిమొళి కోసం చెన్నై రాయపురం నియోజకవర్గం, మదురవాయిల్ నియోజకవర్గంలో పోటీ చేయాలంటూ దరఖాస్తులు దాఖలు కావడం విశేషం. ఇక డీఎండీకే వంతు: అన్నాడీఎంకే, డీఎంకే దరఖాస్తుల పర్వం ముగింపు దశలో ఉండగా, పీఎంకే శ్రీకారం చుట్టి ఉన్నది. ఇక డీఎండీకే వంతు వచ్చినట్టుంది. డీఎండీకే తరఫున పోటీకి సిద్ధంగా ఉన్న ఆశావహుల నుంచి దరఖాస్తుల దాఖలుకు తేదీని ఆ పార్టీ అధినేత విజయకాంత్ ప్రకటించారు. ఫిబ్రవరి ఐదో తేదీ ఉదయం పది గంటల నుంచి దరఖాస్తుల్ని కోయంబేడు కార్యాలయంలో విక్రయించనున్నారు. ఫిబ్రవరి 14 సాయంత్రం ఐదు గంటల్లోపు పూర్తి చేసిన దరఖాస్తుల్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక, జనరల్ స్థానానికి దరఖాస్తు రుసుంగా రూ.10 వేలు, రిజర్వుడు స్థానానికి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పుదుచ్చేరిలో పోటీకి సిద్ధంగా ఉండే ఆశావహులు జనరల్కు రూ.5 వేలు, రిజర్వుడుకు రూ.2500 చెల్లించి దరఖాస్తు స్వీకరించాల్సి ఉంటుందని విజయకాంత్ ప్రకటించారు. -
డీఎంకే భవిష్య సారధి ఎవరో చెప్పేసిన కనిమొళి!
చెన్నై : డీఎంకేకు భవిష్యత్ సారథి ఎంకే స్టాలిన్ అని ఆ పార్టీ ఎంపీ కనిమొళి చెప్పేశారు. ఆయన నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్లెవరూ డీఎంకేలో లేరని స్పష్టం చేశారు. డీఎంకే కోశాధికారి స్టాలిన్, ఆ పార్టీ ఎంపీ కనిమొళి అన్నా చెల్లెళ్లు అయినప్పటికీ, వారి మధ్య పదవుల వివాదం సాగుతున్నట్లుగా తమిళనాట ప్రచారం సాగుతోంది. దీనికి కళ్లెం వేస్తూ ఓ ఆంగ్ల మీడియాతో కనిమొళి మాట్లాడారు. డీఎంకేకు భావి నేత స్టాలిన్ అని, ఆయన సారథ్యంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతారని స్పష్టం చేశారు. -
భావి నేత అన్నయ్యే
పార్టీ భవిష్యత్తు ‘స్టాలిన్’ చేతుల్లోనే వ్యతిరేకతకు నో చాన్స్ కనిమొళి స్పష్టీకరణ సాక్షి, చెన్నై : అధినేత కరుణానిధి తదుపరి డీఎంకేకు భవిష్యత్తు నేత ఎంకే స్టాలిన్ అని ఆ పార్టీ ఎంపీ, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కనిమొళి స్పష్టం చేశారు. పార్టీ భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉందని, భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగానే ఉన్నారన్నారు. డీఎంకేలో సాగుతున్న కుటుంబ వారసత్వ పదవుల కుమ్ములాట ప్రచారాలకు కళ్లెం వేస్తూ కనిమొళి ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. డీఎంకేలో కరుణానిధి అధ్యక్ష పదవిని తన్నుకెళ్లడం లక్ష్యంగా ఆయన వారసులు, అన్నదమ్ముళ్లు ఎంకే స్టాలిన్, అళగిరి మధ్య వార్ సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తో అళగిరి ఏకంగా పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దన్నయ్య అళగిరి రాజకీయాలకు దూరంగా ఉండటంతో పాటుగా, సోదరి కనిమొళితో పలు మార్లు భేటీలు కావడం చర్చలకు దారి తీసింది. అదే సమయంలో పార్టీలో తనకంటూ మద్దతు వర్గాన్ని కూడగట్టుకునే పనిలో కనిమొళి ఉరకలు పరుగులు తీయడం చర్చలకు మరింత బలాన్ని చేకూర్చాయి. చిన్న అన్నయ్య స్టాలిన్తో కనిమొళి విభేదించి ముందుకు సాగుతున్నట్టుగా ప్రచారం సైతం ఊపందుకుంది. ఇక, కనిమొళిని అందలం ఎక్కించే విధంగా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పదవి, పార్టీ రాజ్యసభ నేత పదవిని కరుణానిధి కట్టబెట్టడం స్టాలిన్ వర్గంలో కాస్త కలవరాన్నే సృష్టించాయి. కనిమొళికి కరుణానిధి ప్రాధాన్యతను పెంచుతున్నారన్న చర్చ డీఎంకేలో బయలు దేరింది. ఈ పరిస్థితుల్లో ఎవర్ని ప్రచారాలు చేసినా, ఎన్ని కథనాలు రాసినా వాటితో తనకు అనవసరం అని, తన చిన్న అన్నయ్యే డీఎంకే భావి నేత అంటూ కనిమొళి కుండ బద్దలు కొట్టి తాజాగా వ్యాఖ్యానించడంతో పైన పేర్కొన్నట్టుగా కథనాలు, ప్రచారాలకు కల్లెం వేసినట్టు అయింది. డీఎంకే రాజ్య సభ నేత, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కనిమొళి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్న అన్నయ్య డిఎంకే భావినేత అని స్పష్టం చేశారు. డిఎంలో వారసత్వం సమరం మీడియా సృష్టేనని పేర్కొన్నారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవు అని, తామంతా డిఎంకే గొడుగు నీడ ఉన్న సేవకులం అని స్పష్టం చేశారు. డిఎంకే భవిష్యత్తు స్టాలిన్ చేతిలో ఉందని, ఆయన సారథ్యంలో భవిష్యత్తులో అందరూ కలసి కట్టుగా పనిచేస్తారన్నారు. ఆయనకు వ్యతిరేకులు పార్టీలో ఎవరూ లేరు అని ఆయన భావి నేత అన్నది అందరూ కలసి నిర్ణయం తీసుకున్న విషయమేగా అని పేర్కొన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం పరితపించే స్టాలిన్ ఎప్పుడూ తనకు పలాన పదవి కావాలని ఎవర్నీ అడిగింది లేదని, ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఒక దాని తర్వాత మరొకటి దక్కుతూ వస్తున్నాయని వివరించారు. అయితే, అధినేత కరుణానిధితో, తనతో స్టాలిన్కు విభేదాలు ఉన్నట్టుగా మీడియా కథనాలు సృష్టిస్తుండటం కొన్ని సందర్భాల్లో విస్మయానికి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. తాను ఎలాంటి పదవుల్ని ఆశించడం లేదు అని, ప్రజలకు సేవ చేయాలన్నదే తన తపనగా స్పష్టం చేశారు. జయలలిత జైలుకు వెళ్లినంత మాత్రమే ఆమె మీద సానుభూతి పవనాలు లేవు అని, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ఆస్కారం లేదు అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. -
మద్యంపై డీఎంకే ఆగ్రహం
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం నినాదాన్ని డీఎంకే సైతం అందుకుంటోందా? అన్న చర్చ బయలు దేరింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, టాస్మాక్లను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసేస్తున్నారంటూ డీఎంకే మహిళా విభాగం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా టాస్మాక్ మద్యం దుకాణాలు నిలిచాయి. ప్రతి ఏటా వేల కోట్ల మేరకు ఆదాయం వస్తుండడంతో మద్యానికి వ్యతిరేకంగా డీఎంకే, అన్నాడీఎంకేలు ఇంత వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే, ఈ రెండు పార్టీలు రాష్ర్టంలో మార్చి మార్చి అధికారంలోకి వస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం నినాదానికి బలం పెరుగుతోంది. పీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్, డీఎండీకేలు మద్య నిషేధం నినాదంతో ముందుకు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ నినాదానికి పెరుగుతున్న బలమా? లేదా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టాలన్న లక్ష్యమా? ఏమోగానీ డీఎంకే సైతం ఆ నినాదాన్ని అందుకుంటుందా? అన్న చర్చ బయలు దేరింది. ఇన్నాళ్లు మద్యంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని ఆ పార్టీ అనుబంధ మహిళా విభాగం కొత్తగా మద్యంపై గళం విప్పడం గమనించాల్సిన విషయం. మద్యానికి వ్యతిరేకమా..: చతికిలబడ్డ డీఎంకే మహిళా విభాగం బలోపేతం లక్ష్యంగా ఆ విభాగానికి కొత్తగా కార్యదర్శి పగ్గాలు చేపట్టిన కనిమొళి తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. శనివారం అన్నా అరివాలయంలో ఆ విభాగం నేతలతో సమావేశం అయ్యారు. మహిళా విభాగం అధ్యక్షురాలు కాంచన కమలనాథన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కనిమొళి ప్రసంగించే క్రమంలో బలోపేతం లక్ష్యంగా పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. యువజన విభాగం తరహాలో పార్టీకి మహిళా విభాగం కీలకం కావాలని, ఇందు కోసం చేపట్టదలచిన కార్యక్రమాలను వివరించారు. మహిళా సంఘాల్ని ఏకం చేయడం, మహిళా సమస్యలు, దాడులు, రాష్ర్టంలో సాగుతున్న హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టే విధంగా కార్యాచరణను సిద్ధం చేశారు. అనంతరం ప్రత్యేకంగా కొన్ని తీర్మానాలు చేశారు. స్వయం సహాయక మహిళా బృందాల్ని ఎత్తి వేస్తూ తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు హెచ్చరికలు చేశారు. మహిళా స్వయం సహాయక బృందాలకు అండగా తమ విభాగం ఉద్యమించబోతోందని ప్రకటించారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇక, మద్యంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, మందు బాబుల సంఖ్య పెరుగుతోందని శివాలెత్తారు. డీఎంకే హయాంలో మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించామని, అయితే అన్నాడీఎంకే హయాంలో ఆ సంఖ్యను పెంచి ఆదాయం దండుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. డీఎంకే హయంలో ఆ దుకాణాల పని వేళల్ని తగ్గిస్తే, ఇప్పుడు ఆ దుకాణాలు వేకువ జామునే తెరుస్తున్నారని, రాత్రుల్లో ఎప్పుడు మూస్తారో తెలియని పరిస్థితి నెలకొందని మండి పడ్డారు. టాస్మాక్ మద్యం దుకాణాల వ్యవహారంలో అన్నాడీఎంకే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని డీఎంకే మహిళా విభాగం తీర్మానం చేయడం గమనించాల్సిన విషయం. -
కనిమొళికి ఆశీస్సులు
డీఎంకే అధినేత కరుణానిధి గారాల పట్టి కనిమొళి సోమవారం 47వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఆమె మద్దతుదారులు, డీఎంకే వర్గాలు బర్త్డేను ఘనంగా జరుపుకున్నారు. తండ్రి కరుణానిధి, తల్లి రాజాత్తి అమ్మాల్, సోదరుడు స్టాలిన్కు కనిమొళి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. సాక్షి, చెన్నై: కరుణానిధికి గారాలపట్టి కనిమొళి. చిన్న కూతురు అంటే ఎంతో అభిమానం. తన అడుగు జాడల్లో ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అందలం ఎక్కించే యత్నం చేసినా, వారసులు అడ్డుపడడంతో వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. జైలు జీవితం నుంచి బయటకు వచ్చిన తన గారాలపట్టిని మళ్లీ రాజ్యసభలో కూర్చోబెట్టేందుకు కరుణానిధి తీవ్రంగానే యత్నించారు. ఎట్టకేలకు ఆమె గెలవడంతో డీఎంకే రాజ్యసభ నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పరంగా ఆమెను అందలం ఎక్కించాలన్న కాంక్షతో ఉంటున్న కరుణానిధి సోమవారం తన గారాల పట్టికి ఆశీస్సులు అందించారు. ఆశీస్సులు: 2జీ స్పెక్ట్రమ్ కేసులో కనిమొళి జైలు జీవి తాన్ని అనుభవించిన విషయం తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో గత ఏడాది తన బర్త్డేను ఆమె నిరాడంబరంగా జరుపుకున్నారు. 47వ వసంతంలోకి అడుగు పెట్టిన కనిమొళికి శుభాకాంక్షలు తెలియజేయడానికి సీఐటీ కాలనీకి పెద్ద ఎత్తున పార్టీ వర్గాలు, మద్దతు నాయకులు తరలి వచ్చారు. ఉదయాన్నే తండ్రి కరుణానిధి, తల్లి రాజాత్తి అమ్మాల్ పాదాలకు నమస్కరించి, కని మొళి ఆశీస్సులు అందుకున్నారు. తన గారాల పట్టిని ఆప్యాయంగా పలకరిస్తూ, తన ఆశీస్సుల్ని కరుణానిధి అందజేశారు. తల్లిదండ్రుల సమక్షంలో ఆమె కేక్ కట్చేశారు. తండ్రి కరుణానిధికి తినిపించారు. అదే సమయంలో చిన్న అన్నయ్య స్టాలిన్ రావడంతో పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. కనిమొళికి స్టాలిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె ఇంటి వద్ద పండుగ కోలాహలం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మద్దతుదారులు, డీఎంకే వర్గాలు అక్కడికి చేరుకుని బాణసంచాలు పేల్చుతూ, స్వీట్లు పంచారు. డీఎంకే నేతలు టీ ఆర్ బాలు, దయానిధి మారన్, కేపి రామలింగం, సద్గుణ పాండియన్, పుగలేంది, కేపి మునుస్వామి, తాము అన్భరసన్, వాసంతి స్టాన్లీ, అన్భళగన్, శేఖర్ బాబు, టీకేఎస్ ఇళంగోవన్ తదితరులు కనిమొళికి శుభాకాంక్షలు తెలియ జేశారు. -
కనిమొళికి నాన్ బెయిలబుల్ వారెంట్!
న్యూఢిల్లీ: డీఎంకే ఎంపీ కనిమొళికి స్పెషల్ కోర్టులో చుక్కెదురైంది. ప్రత్యేక కోర్టు కనిమొళికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2జీ స్పెక్ట్రమ్ కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఆతర్వాత కనిమొళి న్యాయవాది కోర్టుకు హాజరై క్షమాపణలు చెప్పడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ను రద్దు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, 2జీ స్పెక్ట్రమ్ కేసులో తుది వాదనలు వినడానికి డిసెంబర్ 19 తేదిని ఢిల్లీ కోర్టు ఫిక్స్ చేసింది. ఈ కేసులో మాజీ టెలికాం మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఇతర 15 మందిపై ఆరోపణలెదుర్కొంటున్నారు. Follow @sakshinews -
సంకటంలో ‘కరుణ’
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధికి సంకట పరిస్థితులు ఎదురవుతున్నాయి. అధికారం లక్ష్యంగా వ్యూహ రచనల్లో ఉన్న తరుణంలో సతీమణి దయాళు అమ్మాల్, గారాల పట్టి కనిమొళిపై నగదు బదలాయింపు నేరారోపణ నమోదు కావడం ఇరకాటంలో పడేస్తోంది. తన కుటుంబీకులు చిక్కుల్లో పడడంతో, ఎలా ఎదుర్కొవాలోనని మల్లగుల్లాలు పడుతున్నారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపు కుంభకోణం డీఎంకేను పతనం అంచుకు చేర్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతుకు దారి తీసింది. కరుణ గారాల పట్టి కనిమొళి, అనుంగు శిష్యుడు రాజా ఈ వ్యవహారంలో నెలల తరబడి కారాగార వాసం అనుభవించి బెయిల్ మీదకు బయటకు వచ్చారు. వాయిదాల మీద వాయిదాలతో విచారణ కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 2జీ కేసుకు అనుబంధంగా దాఖలైన మరో కేసు రాజా, కనిమొళితోపాటుగా తన సతీమణి దయాళు అమ్మాల్ మెడకు చుట్టుకోవడం కరుణానిధిని సంకటంలోకి నెడుతున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాల్లో కరుణానిధి ఉన్నారు. ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన తమ వాళ్ల మీదున్న కేసుల్ని పరిగణనలోకి తీసుకుని అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు శిక్ష పడ్డ నేపథ్యంలో ఎలాంటి వ్యాఖ్యల్ని సంధించ లేదు. తాను ఆనంద పడనూ లేదు, చింతించనూ లేదన్న ఒక్క ముక్కతో తన సమాధానాన్ని ముగించారు. ఈ నేపథ్యంలో అధినేత కుటుంబీకుల మీదున్న కేసుల రూపంలో పార్టీకి ఎక్కడ మళ్లీ గడ్డు పరిస్థితులు నెలకొంటాయోనన్న ఆందోళన డీఎంకే వర్గాల్లో మొదలైంది. నేరారోపణతో సంకటం: జయలలితకు పడ్డ జైలు శిక్షను అస్త్రంగా చేసుకుని కొన్ని పార్టీలు అన్నాడీఎంకే మీద విమర్శలు గుప్పిస్తున్నాయి. తమ బలాన్ని పెంచుకునేందుకు పదేపదే ఆ శిక్షను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి చొచ్చుకెళ్లే యత్నంలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తన వాళ్లపై నేరారోపణ కేసు నమోదు కావడం కరుణానిధికి సంకటంగా మారింది. 2జీ కేటాయింపులకు ప్రతి ఫలంగా కరుణ కుటుంబానికి చెందిన కలైంజర్ టీవీలోకి రూ. 200 కోట్లు వచ్చినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ టీవీలో కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్కు 60 శాతం, కనిమొళికి 20 శాతం, ఆ టీవీ డెరైక్టర్ ప్రసాద్కు మరో 20 శాతం వాటాలు ఉన్నాయి. అయితే, రూ. 200 కోట్ల ఆరోపణల్ని కలైంజర్ టీవీ యాజమాన్యం ఖండించింది. స్వాన్ టెలికాం నుంచి కేవలం అప్పుగా తీసుకుని, తిరిగి చెల్లించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని స్వాన్ టెలికాం కూడా ప్రకటించింది. అయితే, రంగంలోకి దిగిన డెరైక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్(డీవీఏసీ) తన విచారణలో గుట్టును బయటకు లాగింది. చిక్కుల్లో కని, దయాళు అమ్మాల్ డీవీఏసీ విచారణలో వెలుగు చూసిన అంశాలు సీబీఐ కోర్టులో దాఖలయ్యాయి. కేటాయింపులకు ప్రతి ఫలంగా నగదు పరివర్తన జరిగినట్టు వెలుగు చూసింది. దీంతో నగదు పరివర్తనకు సంబంధించి నేరారోపణ కేసు(మనీలాండరింగ్) దాఖలుకు సీబీఐ కోర్టు న్యాయమూర్తి సైనీ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణ నవంబర్ 11 తేదీ నుంచి సాగనుంది. ఈ విచారణ నిమిత్తం కనిమొళి, రాజా, దయాళు అమ్మాల్ పదే పదే ఢిల్లీకి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజుల వరకు మనవళ్లు దయానిధి మారన్, కళానిధి మారన్కు సంబంధించిన కేసుల వ్యవహారం కరుణను ఉక్కిరి బిక్కిరి చేస్తే, తాజాగా కని, దయాళు అమ్మాల్ మెడకు కొత్త కేసు చుట్టుకోవడం డైలమాలో పడేసినట్టు సమాచారం. తాజా పరిణామాలు ఎక్కడ తమ పార్టీకి గడ్డు పరిస్థితులను సృష్టిస్తాయో, ఇతర పార్టీలు ఎక్కడ వేలు ఎత్తి చూపుతూ విమర్శల వర్షం కురిపిస్తాయోనన్న బెంగ డీఎంకే వర్గాల్లో మొదలైంది. ఈ కేసుల వ్యవహారం ఎక్కడ ఎన్నికల నాటికి ముదురుతుందో, ఆ సమయంలో పార్టీ ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందోనన్న ఆందోళన డీఎంకే వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
రాజా, కనిమొళి,అమ్మాళ్పై అభియోగాలు
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో టెలికం మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, డీఎంకే చీఫ్ కరుణానిధి భార్య దయా ళు అమ్మాళ్తో పాటు 16 మందిపై ఢిల్లీ ప్రత్యేక కోర్టు అభియోగాలను ఖరారు చేసింది. నవంబర్ 10 నుంచి వీరిపై విచారణను ప్రారంభించనున్నట్టు శుక్రవారం వెల్లడించింది. ఈ కేసులో అభియోగాలు రుజువైతే రాజా, కనిమొళి ఇతర నిందితులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి ఇది రెండో కేసు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు పది మంది వ్యక్తులు, తొమ్మిది కంపెనీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు ఖరారు చేసింది. ఈ కుంభకోణంలో రాజా, కనిమొళితోపాటు స్వాన్ టెలికాం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్ బాల్వా, వినోద్ గోయంకాల పాత్రపై కోర్టు విచారణ జరపనుంది. ఏప్రిల్ 25న ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీట్లో పేర్కొన్న నిందితులందరిపైనా అభియోగాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఓపీ సైనీ స్పష్టం చేశారు. 208 పేజీల ఉత్తర్వుల్లో రాజా, కనిమొళి, అమ్మాళ్ , శరద్కుమార్ రూ. 200 కోట్లు అక్రమంగా చేతులు మారడానికి సహకరించారని, షాహిద్ బాల్వా, వినోద్ గోయెంకా ఈ మొత్తాన్ని కలైంగర్ టీవీలోకి అక్రమంగా తరలించారని పేర్కొన్నారు. -
ఏ.రాజా, కనిమోళిపై అభియోగాల నమోదు.
-
ఎ.రాజా, కనిమొళిపై ఛార్జిషీట్ నమోదు
న్యూఢిల్లీ : 2జీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే రాజ్యసభ ఎంపీ కనిమొళిపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈడీ దర్యాప్తు నివేదిక ఆధారంగా శుక్రవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఐపీసీ 120-బి కింద నిందితులపై కేసు నమోదు చేసింది. నేరం రుజువైతే వీరికి ఏడేళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఎం.రాజా, కనిమొళితో పాటు డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సతీమణి దయాళ్ అమ్మళ్ సహా 16మందిపై అభియోగాలు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో రాజా, కనిమొళి ఇప్పటికే జైలుకు వెళ్లివచ్చిన విషయం తెలిసిందే. అలాగే స్వాన్ టెలికాం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్, వినోద్ గోయోంకాలపైనా అభియోగాలు నమోదు అయ్యాయి. మరోవైపు నిందితులు మాత్రం తాము ఎలాంటి నేరం చేయలేదని చెబుతున్నారు. తమపై వచ్చిన అభియోగాలపై విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. కాగా ఇదే కేసులో కేంద్ర మాజీ మంత్రి మారన్, ఆయన సోదరుడికి రెండు రోజుల క్రితం ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.. దయానిధి మారన్, కళానిధి మారన్ ఇద్దరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. వారిద్దరితో పాటు మలేషియా వ్యాపారవేత్త టి. ఆనంద్ కృష్ణన్కు కూడా కోర్టు సమన్లు జారీ అయ్యాయి. -
కనిమొళికి నో ఎంట్రీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశ రాజకీయాల్లో ప్రభావశీల శక్తిగా దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితం కావాలని డీఎంకే చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రాజ్యసభ సభ్యురాలు (డీఎంకే) కనిమొళిని కలుసుకునేందుకు మోదీ నిరాకరించి షాక్ ఇచ్చారు. లక్షల కోట్ల రూపాయల కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి రాజా ప్రధాన సూత్రధారిగా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళి పాత్రధారిగా సీబీఐ కేసులు పెట్టింది. అంతేగాక 2 జీ స్పెక్ట్రంకు చెందిన నిధులు అక్రమ మార్గంలో కలైంజర్ టీవీ చానల్కి చేరాయని ఆరోపిస్తున్న సీబీఐ ఆ చానల్ డెరైక్టర్గా వ్యవహరిస్తున్న కరుణ సతీమణి దయాళు అమ్మాళ్ను కూడా కేసులో చేర్చింది. కరుణ సోదరి కుమారుడైన మరో మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్పై కూడా సీబీఐ కేసులు ఉన్నాయి. పదేళ్ల యూపీఏ పాలనలో కేంద్ర కేబినెట్ మంత్రులుగా ఉంటూ కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వీరంతా కరుణ కుటుంబీకులు, డీఎంకే నేతలే కావడం గమనార్హం. ఈ అప్రతిష్టకు తోడు శ్రీలంక వ్యవహారంలో సైతం డీఎంకే సరైన పంథాను అనుసరించలేదని తమిళులు మండిపడుతున్నారు. ఇలా అన్ని కారణాల ఫలితంగా గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే డిపాజిట్టు సైతం కోల్పోయింది. మరో ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా గెలుపు అవకాశాలకు ఆమడ దూరంలో డీఎంకే చతికిలబడి ఉంది. చెక్కుతో చెక్ పెట్టే యత్నం ఎన్నికల నాటికి జవసత్వాలు కూడగట్టుకునే ప్రయత్నాలు సాగిస్తున్న డీఎంకే కాశ్మీర్ వరదల ఉదంతాన్ని రాజకీయంగా 'క్యాష్' చేసుకునే ప్రయత్నం చేసింది. ప్రకృతి విలయానికి సుందర కాశ్మీరం అల్లకల్లోలం కాగా అక్కడి సహాయక చర్యల కోసం భూరి విరాళాలు అందజేయాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాలను ఒక్కసారిగా తమవైపు తిప్పుకునేందుకు ఇదే మంచి తరుణంగా కరుణ భావించారు. అంతేగాక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చేరువ కావడం ద్వారా అన్నాడీఎంకేకు చెక్పెట్టాలని ఎత్తువేశారు. ప్రధాని ఇచ్చిన పిలుపునకు స్పందించి కాశ్మీర్ వరద బాధితుల సహాయార్థం రూ.25 లక్షల విరాళాన్ని గతనెల 13న కరుణ ప్రకటించారు. విరాళ చెక్కును కనిమొళి నేతృత్వంలోని డీఎంకే ఎంపీల బృందం స్వయంగా ప్రధానికి అందజేస్తుందని స్పష్టం చేశారు. ఆ తరువాత ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో అపాయింట్మెంట్కు విజ్ఞప్తి చేసుకున్నారు. దాదాపు నెలరోజులు గడుస్తున్నా ఇంత వరకు పీఎంవో నుంచి పిలుపురాలేదు. అనేక సార్లు చేసిన యత్నాలు విఫలం కావడంతో విసుగుచెందిన డీఎంకే నేతలు తిరిగి చెన్నైకి చేరుకున్నారు. రాజకీయాల్లో దూసుకుపోవడంలో ఆచితూచి అడుగేయాలన్న సిద్ధాంతాన్ని మోదీ పాటిస్తున్నట్లు ఈ ఉదంతం తేటతెల్లం చేసింది. అక్రమార్కులకు మోదీ దూరం ఈ వ్యవహారంపై ఢిల్లీకి చెందిన బీజేపీ సీనియర్ నేత మాట్లాడుతూ, వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ (బీజేపీ) నేతలనే మోదీ దూరం పెట్టారని, ఇటువంటి పరిస్థితిల్లో 2 జీ స్పెక్ట్రం కుంభకోణంలో కూరుకుపోయిన కనిమొళిని ఆయన ఎలా కలుసుకుంటారని వ్యాఖ్యానించారు. కాశ్మీర్ బాధితుల సహాయార్థం చెక్కును అందజేసే సందర్భంగా మోదీ, కనిమొళి కలిసినా జాతీయస్థాయిలో వివాదాస్పద చర్చకు తావిచ్చినట్లు అవుతుందని ఆయన అన్నారు. ఈకారణంగానే కనిమొళి బృందం కలుసుకునేందుకు పీఎంఓ కార్యాలయం నుంచి అనుమతి లభించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామంతో రూ.25 లక్షల కాశ్మీర్ సహాయ నిధి చెక్కు నెల రోజులుగా కనిమొళి వద్దనే కునుకు తీస్తోంది. -
రూ. 200కోట్ల లావాదేవీల్లో రాజా, కనిమొళి అక్రమాలు
కళైనార్ టీవీకి సొమ్ము బదిలీ, ప్రత్యేక కోర్టుకు ఈడీ నివేదన న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోని మనీ ల్యాండరింగ్ అభియోగాల కేసులో నిందితులైన మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా, డీఎంకే మాజీ ఎంపీ కనిమొళి దాదాపు రూ. 200 కోట్ల మేర లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మంగళవారం ఢి ల్లీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. రాజా, కనిమొళిలపై దాఖలైన మనీ లాండరింగ్ అభియోగాలపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ మంగళవారం ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ కోర్టులో తమ వాదనలు వినిపించారు. డీబీ గ్రూప్ కంపెనీనుంచి కనిమొళి గ్రూపు కంపెనీనుంచి వివిధ కంపెనీల ద్వారా డీఎంకే యాజమాన్యంలోని కలైనార్ టీవీకి జరిపిన రూ 200 కోట్ల మేర బదిలీలో నిబంధలను పాటించలేదని ఆనంద్ గ్రోవర్ కోర్టుకు తెలిపారు. ఈ లావాదేవీల్లో కుసేగావోన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సినీయుగ్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను కేవలం డబ్బు బదిలీకోసమే వినియోగించారన్నారు. కాగా, 2జీ కేసులోనే ఈడీ డిప్యూటీ డెరైక్టర్ రాజేశ్వర్ సింగ్ సహా మరి కొందరిని సాక్షులుగా పిలిపించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై ప్రతిస్పందించేందుకు తమకు మరి కొంత వ్యవధి ఇవ్వాలని రాజా, కనిమొళి సహా 15మంది నిందితులు ప్రత్యేక కోర్టును కోరారు. దీంతో కోర్టు కేసు విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. బొగ్గు స్కామ్పై తుది తీర్పు నేడే అక్రమమని సుప్రీంకోర్టు పేర్కొన్న 218 బొగ్గు గనుల కేటాయింపుల భవితవ్యం నేడు తేలనుంది. వాటికి సంబంధించిన తుది తీర్పును బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సుప్రీంకోర్టు వెలువరించనుంది. ఆగస్ట్ 25న ఆ కేటాయింపులను తీవ్రంగా ఆక్షేపిస్తూ పర్యవసానాలను దృష్టిలో పెట్టుకుని వాటిని రద్దు చేయడంలేదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. -
అన్నయ్య కోసం!
పెద్దన్నయ్య అళగిరిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించాలని తండ్రి కరుణానిధిపై ఒత్తిడి తెచ్చేపనిలో గారాల పట్టి కనిమొళి నిమగ్నమయ్యారు. ఈ విషయంపై ఆమె గంటకు పైగా తన తండ్రితో భేటీ అయినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. దక్షిణ తమిళనాడులో పార్టీ బలపడాలంటే అన్నయ్య ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాల్సిం దేనని ఆమె ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇప్పుడు డీఎంకేలో దీనిపైనే చర్చసాగుతున్నట్టు తెలుస్తోంది. చెన్నై : డీఎంకేలో అన్నదమ్ములు అళగిరి, స్టాలిన్ మధ్య సాగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిస్థితుల్ని చక్కదిద్దే పనిలోపడ్డ అధినేత కరుణానిధి మళ్లీ అళగిరిని పార్టీలోకి ఆహ్వానించే విధంగా ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. అళగిరితో సాగిన రాయబారాలు బెడిసికొట్టడంతో ఆయన్ను మళ్లీ ఆహ్వానించాలా? అన్న సందిగ్దతలో డీఎంకే శ్రేణులు పడ్డాయి. ఇందుకు అద్దంపట్టే రీతిలో రెండు రోజుల క్రితం అళగిరి డీఎంకే అధిష్టానంపై విరుచుకుపడ్డారు. స్టాలిన్పై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు అళగిరికి, పార్టీకి మధ్య మరింత ఆగాదాన్ని సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. పార్టీలోకి అళగిరిని మళ్లీ ఆహ్వానించబోమన్న స్పష్టమైన హామీని కరుణానిధి నుంచి స్టాలిన్ తీసుకున్నట్టుగా, అందుకే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరపున సీఎం అభ్యర్థి కరుణానిధి ఉంటారన్న వ్యాఖ్యను స్టాలిన్ చేసినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అళగిరిని పార్టీలోకి ఆహ్వానిస్తే, ఎక్కడ స్టాలిన్ అలక వహిస్తాడోనన్న ఆందోళనలోపడ్డ కరుణానిధి ఆ ప్రయత్నాల్ని విరమించుకునేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెద్దన్నయ్యకు అండగా నిలబడేందుకు కరుణ గారాల పట్టి కనిమొళి సిద్ధమైనట్టు ఉన్నారు. కరుణానిధిని బుజ్జగిం చేందుకు అన్నయ్య తరపున రాయబారం సాగించేందుకు రెడీ అయ్యారన్న ప్రచారం డీఎంకేలో సాగుతోంది. ‘కని’ రాయబారం ఎప్పుడూ కనిమొళి ఇంటిమెట్లు ఎక్కని అళగిరి పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత తొలిసారిగా అడుగు పెట్టారని చెప్పవచ్చు. తన ఆవేదనను అంతా చెల్లెమ్మ వద్ద అళగిరి ఇటీవల వెళ్లగక్కారు. మదురైకు వెళ్లిన సందర్భంలో అన్నయ్యన్ను కనిమొళి ఓదార్చిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో అళగిరి ఎక్కడ శాశ్వతంగా పార్టీకి దూరమవుతారోనన్న ఆందోళనలో పడ్డ కనిమొళి, మళ్లీ ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతల్ని తన భుజాన వేసుకుని ఉన్నారన్న ప్రచారం డీఎంకేలో జోరందుకుంది. కరుణానిధితో ఈ విషయంగా గంటకు పైగా కనిమొళి భేటీ అయినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. దక్షిణ తమిళనాడులో పార్టీ బలపడాలంటే అన్నయ్యను పార్టీలోకి ఆహ్వానించాల్సిందేనని ఆమె ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అన్నయ్య మళ్లీ పార్టీలోకి రాక కోసం కొన్ని పార్టీలు సైతం ఎదురు చూస్తున్నాయన్న విషయాన్ని కరుణ దృష్టికి తీసుకెళ్లినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. కరుణానిధి సీఎం అన్న ప్రకటనను స్వయంగా చిన్నన్నయ్య స్టాలిన్ చేయబట్టే, అదే రోజు ఎండీఎంకే నేత వైగో మిత్రులతో కూటమికి రెడీ అన్న సంకేతాన్ని పంపించారన్న విషయాన్ని గుర్తెరగాలని ఆమె సూచించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఎండీఎంకే నేతలతో పాటు దక్షిణ తమిళనాడులో బలంగా ఉన్న నాడార్లు, ఉత్తర తమిళనాడులో బలంగా ఉన్న వన్నియర్లు, సెంట్రల్ తమిళనాడులోని ముత్తయ్యార్ సామాజిక వర్గాల నాయకులు డీఎంకే వైపు చూస్తున్నారన్న విషయాన్ని వివరించి ఉన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఆ వర్గాలకు న్యాయం చేకూర్చే రీతిలో నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పెద్దన్నయ్యను మళ్లీ ఆహ్వానించాలని కరుణానిధిపై కనిమొళి ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. తనకు కనిమొళి గారాల పట్టి కావడంతో అళగిరిమీద ఉన్న కోపాన్ని కరుణానిధి దిగమింగి, ఎన్నికలు సమీపించనీ.. చూద్దామన్న హామీని ఆమెకు ఇచ్చినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. -
కరుణానిధి భార్య, కుమార్తెకు బెయిల్
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భార్య దయాళు అమ్మల్, కుమార్తె కనిమొళికి తాత్కాలిక ఉపశమనం లభించింది. స్పెక్ట్రం కుంభకోణం సంబంధించి మనీలాండరింగ్ కేసులో దయాళు అమ్మల్, కనిమొళితో పాటు కేంద్ర మాజీ మంత్రి రాజా, ఇతరులకు బెయిల్ దక్కింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరితో ఐదు లక్షల వ్యక్తిగత పూచికత్తు బాండు, అంతే మొత్తాలకు మరో ఇద్దరితో షూరిటీ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా కేసు నుంచి విముక్తి కల్పించాలన్న అమ్మల్ అభ్యర్థను తోసిపుచ్చింది. వీరిందరిపై ఈడీ కేసులు నమోదు చేసింది. -
దయాళ్ అమ్మాళ్కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సతీమణి దయాళ్ అమ్మాళ్కు ఊరట లభించింది. ఢిల్లీ పటియాలా కోర్టు ఆమెకు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ ప్రత్యేక జడ్జి ఓ.పీ. షైనీ ఈ మేరకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. రూ.5లక్షల వ్యక్తిగత బాండ్తో పాటు.. ఇద్దరి పూచీకత్తుపై బెయిల్కు అంగీకరించింది. రెండు రోజుల్లో బెయిల్ బాండ్ పనులు పూర్తి చేయాలని కోర్టు ఈ సందర్భంగా దయాల్ అమ్మళ్కు సూచించింది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో తొమ్మిది మంది బెయిల్ పిటిషన్లపై మాత్రం తీర్పును న్యాయస్థానం రిజర్వ్లో పెట్టింది. కేంద్ర మాజీ టెలికాం మంత్రి, డీఎంకే నేత రాజా డీబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు అక్రమంగా స్పెక్ట్రమ్ లైసెన్స్లు కేటాయించినందుకుగాను....డీఎంకే పార్టీకి చెందిన కళైంగర్ టీవీకి 200 కోట్లు పెట్టుబడుల రూపంలో ముట్టాయని ఈడీ పేర్కొంది. మొత్తం 19 మందిని దోషులుగా పేర్కొంటూ ఈడీ కోర్టుకు చార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
నేడు సీబీఐ కోర్టుకు రాజా, కనిమొళి!
కరుణానిధి భార్య దయాళు అమ్మాల్, మరో 16 మందికీ సమన్లు న్యూఢిల్లీ: 2జీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో టెలికాం మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఆ పార్టీ అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాల్తో పాటు మరో 16 మంది నిందితులు సోమవారం ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యే అవకాశముంది. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు గత నెల 2న ఈ కేసు విచారణ ప్రారంభించింది. నిందుతులంతా సోమవారం విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. నిందితుల జాబితాలో స్వాన్ టెలికాం, కుసెగావ్ రియాల్టీ, కళైంజర్ టీవీ, డీబీ రియాల్టీ వంటి 9 సంస్థలతో పాటు కళైంజర్ టీవీ ఎండీ శరత్కుమార్, బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరీం మొరానీ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. 2జీ స్కాంలో భాగంగా నిందితులు మనీ లాండరింగ్కు సంబంధించిన కుట్రలు, నేరాలకు పాల్పడ్డారని ఈడీ తన చార్జిషీట్లో ఆరోపించింది. వారిపై అక్రమ లావాదేవీల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. డీఎంకే ఆధ్వర్యంలోని కళైంజర్ టీవీకి చెల్లించినట్లు చెబుతున్న రూ. 200 కోట్లకు సంబంధించిన లావాదేవీలు సక్రమంగా లేవని, డీబీ గ్రూప్ కంపెనీలకు ప్రభుత్వం నుంచి టెలికాం లెసైన్సులు ఇప్పించినందుకు ప్రతిగానే ఆ సొమ్మును లం చంగా ఇచ్చిందని ఈడీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో అప్పటి టెలికాం మంత్రిగా ఉన్న రాజా ప్రధాన పాత్ర పోషించగా.. కళైంజర్ టీవీలో వాటాలున్న దయాళు అమ్మాల్, కనిమొళితో పాటు ఇతర నిందితులు మనీలాండరింగ్కు సహకరించారని ఈడీ పేర్కొంది. -
824 పేజీలు.. 1700 ప్రశ్నలు
టెలికం శాఖ మాజీ మంత్రి రాజాకు సీబీఐ ప్రత్యేక కోర్టు 1700 ప్రశ్నలు సంధించింది. 2జి స్పెక్ట్రం కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలాన్ని నమోదుచేసే ప్రక్రియను సీబీఐ కోర్టు ప్రారంభించింది. ఇందుకోసం మార్చి 27వ తేదీనే మొత్తం 824 పేజీలతో కూడిన ప్రశ్నలను అందజేసింది. వాటికి రాజా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఓపీ సైనీ రాజా వాంగ్మూలాన్ని సోమవారం ఉదయం నుంచి నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 2జీ స్పెక్ట్రం కేసులో 153 మందిని ప్రశ్నించి 4400 పేజీల వాంగ్మూలాన్ని కోర్టు నమోదుచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు గత సంవత్సరం ఏర్పడింది. 2జీ స్పెక్ట్రం కేటాయింపులో రాజా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వ ఆడిటర్లు తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాజా, కనిమొళి సహా నిందితులంతా ప్రస్తుతం బెయిల్ మీద బయటే ఉన్నారు. -
2జీ కేసులో ఈడీ చార్జిషీట్
-
2జీ కేసులో ఈడీ చార్జిషీట్
రాజా, కనిమొళి సహా 19 మందిపై అభియోగాలు చార్జిషీట్పై నిర్ణయాన్ని 30న వెల్లడిస్తామన్న కోర్టు న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపు కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మాజీ టెలికం మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్, స్వాన్ టెలికాం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్ బల్వా, వినోద్ గోయెంకా సహా 19 మందిని అందులో నిందితులుగా పేర్కొంది. వీరిపై మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద అభియోగాలు నమోదు చేసింది. డీఎంకేకు చెందిన కలైంజ్ఞర్ టీవీకి స్వాన్ టెలికాం ప్రమోటర్లు రూ. 200 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీకి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నవీన్కుమార్ మట్టా ఈ చార్జిషీటును అందజేశారు. ఈ వ్యవహారంలో డబ్బు చేతులు మారిన అంశంపై ఈడీ దర్యాప్తు చేసిందని, మనీల్యాండరింగ్ జరిగినట్లుగా గుర్తించిందని నవీన్కుమార్ చెప్పారు. స్వాన్ టెలికాం సంస్థకు లెసైన్సు ఇప్పించినందుకు బదులుగా... ఆ సంస్థ నుంచి వివిధ మార్గాల్లో కలైంజ్ఞర్ టీవీకి రూ. 200 కోట్లను చేరవేసినట్లుగా వెల్లడైందని తెలిపారు. కాగా, చార్జిషీట్పై తమ నిర్ణయాన్ని ఈ నెల 30న వెలువరిస్తామని పేర్కొంటూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. -
రాజా, కనిమొళిపై ఈడీ చార్జీషీట్ నమోదు!
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంతో సంబంధమున్న మానీలాండరింగ్ కేసులో టెలికాం శాఖా మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమెళిలతోపాటు మరో 17 మందిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జీషీట్ దాఖలు చేసింది. డీఎంకే సుప్రీం ఎం కరుణానిధి భార్య దయాల్ అమ్మాళ్, స్వాన్ టెలికాం ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్స్ షాహీద్ ఉస్మాన్ వినోద్ గోయెంకాల పేర్లను చార్జీషీట్ లో ఈడీ దాఖలు చేసింది. డీఎంకే పార్టీకి చెందిన కలైంజర్ టీవీకి రెండు వందల కోట్ల ముడుపులు చెల్లించారనే ఆరోపలు వచ్చిన సంగతి తెలిసిందే. కుసేగావ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు అసిఫ్ బల్వా, రాజీవ్ అగర్వాల్, బాలీవుడ్ నిర్మాతలు కరీమ్ మోరానీ, కలైంజర్ టీవీ ఎండీ శరద్ కుమార్ లను నిందితులుగా చేర్చింది. -
ముఖ్యమంత్రి జయలలితకు వేల కోట్లు ఎలా వచ్చాయి?
గుమ్మిడిపూండి, న్యూస్లైన్: గతంలో నెలకు రూపాయి మా త్రమే జీతం తీసుకున్న జయలలితకు వేల కోట్లు ఎలా వచ్చాయని డీఎంకే నాయకురాలు కనిమొళి అన్నారు. తిరువళ్లూరు పార్లమెంట్ నియోజకవర్గ డీఎంకే కూటమి అభ్యర్థి రవికుమార్కు మద్దతుగా పెరియపాలెంలో ఎన్నికల ప్రచారం శుక్రవారం రాత్రి నిర్వహించారు. కనిమొళి మాట్లాడు తూ ఆదాయానికి మించి ఆస్తుల కేసు లో బెంగళూరు కోర్టుకు వెళ్లడానికే జయకు సమయం లేదని, మరి ఢిల్లీకి ఎలా వెళ్లగలరని, రాజ్యాంగం, చట్టం పై ఆమెకు గౌరవం లేదన్నారు. హెలి కాప్టర్లో ప్రచారం చేసే ముఖ్యమంత్రికి ప్రజల సమస్యలు తెలుసా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు దేశ భవి ష్యత్ను మార్చేవి కనుక ప్రజా సంక్షేమం పట్టని వారికి బుద్ధి చెప్పాల ని ఓటర్లు కోరారు. ప్రచారంలో జిల్లా డీఎంకే కార్యదర్శి సుదర్శనం, యూ నియన్ కార్యదర్శి జే మూర్తి, యువజన కార్యదర్శి జే మూర్తి, యువజన కార్యదర్శి లోకేష్ పాల్గొన్నారు. -
జయ వైఫల్యాలే విజయ సోపానాలు
కనిమొళి ఇంటర్వ్యూ సి. నందగోపాల్ - సాక్షి, చెన్నై: తమిళనాడులో తొలి ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన డీఎంకేకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రాజకీయాల్లో ‘ప్రాంతీయ’ ప్రాభవానికి ప్రాణం పోసిన డీఎంకేదే. కరుణానిధితో తలెత్తిన విభేదాలతో బయటకు వచ్చిన ఎంజీఆర్ స్థాపించిన అన్నా డీఎంకేకు ప్రేరణ డీఎంకేనే. పార్టీ అధినేత కరుణానిధి జీవించి ఉండగానే, సారథ్య వారసత్వం కోసం ఆయన తనయులు అళగిరి, స్టాలిన్ బహిరంగంగా కీచులాడుకోవడం తెలిసిందే. అన్నదమ్ములిద్దరి మధ్య వారథిగా మారిన ముద్దుల చెల్లెలు కనిమొళి డీఎంకే పగ్గాలను చేపట్టే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలూ ఉన్నాయి. పార్టీపరంగా, కుటుంబపరంగా కీలకపాత్ర పోషిస్తున్న కనిమొళి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు.. ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే సర్కారు వైఫల్యాలే తమకు విజయ సోపానాలుగా మారనున్నాయని కనిమొళి ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమలు విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయని, తమిళనాడుకు రావాలంటేనే పెట్టుబడిదారులు భయపడుతున్నారని ఆమె అన్నారు. విద్యుత్ సంక్షోభానికి గత డీఎంకే ప్రభుత్వమే కారణమని జయలలిత చేస్తున్న ఆరోపణలను కనిమొళి తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిగా కరుణానిధి పలు కొత్త విద్యుత్ పథకాలను ప్రారంభించారని, అన్నా డీఎంకే ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పథకం ఒక్కటైనా పూర్తి చేసిందేమో చెప్పాలని ప్రశ్నించారు. జయ సర్కారు కొత్త పథకాలు చేపట్టకపోగా, గతంలో డీఎంకే సర్కారు ప్రారంభించిన వాటిని అటకెక్కించారని ఆరోపించారు. జయలలితకు అనుకూలంగా వచ్చిన సర్వే ఫలితాలను సైతం కనిమొళి తోసిపుచ్చారు. ఎన్నికల ప్రకటన వెలువడిన మొదట్లో అన్నాడీఎంకే 39 స్థానాలు గెలుచుకుంటుందనే అంచనాలు వెలువడ్డాయని, తర్వాత 20-18 స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలు చెప్పాయని అన్నారు. అయితే, తన తండ్రి కరుణానిధి ప్రచారం ప్రారంభించిన తర్వాత సీన్ మారిపోయిందని, 18 కంటే తక్కువ స్థానాలతోనే జయలలిత సరిపెట్టుకోక తప్పదని అన్నారు. కోటీశ్వరులకే టికెట్లు కట్టబెట్టారన్న ఆరోపణలనూ ఆమె కొట్టి పారేశారు. అభ్యర్థుల్లో కొందరు ధనవంతులు ఉండి ఉండవచ్చని, అయితే, ప్రజాజీవితంలో మమేకమై, మంచి నేపథ్యం గల కొత్త వారికే టికెట్లు ఇచ్చామని చెప్పారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసును ప్రస్తావించగా, అవినీతి ఆరోపణల వెనుక రాజకీయ కారణాలు ఉంటాయని, నిజం నిలకడగా తేలుతుందని అన్నారు. జయలలితపైనా బెంగళూరు కోర్టులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నాయని, అయినా, ఎవరు ఎలాంటి వారో ప్రజల కు తెలుసునని అన్నారు. శ్రీలంక తమిళుల వ్యవహారంలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన మానవ హక్కుల తీర్మానానికి రెండుసార్లు మద్దతు పలికిన భారత్, ఇప్పుడు బహిష్కరించిందన్నారు. యూపీఏలో తాము కొనసాగినప్పుడు తమ ఒత్తిడితో మద్దతునిచ్చిన కేంద్రం, తాము వైదొలగామనే ధీమాతో బహిష్కరించిందని ఆరోపించారు. శ్రీలంక తమిళుల సమస్యలపై డీఎంకే ఎప్పటికీ పోరాడుతుందని కనిమొళి స్పష్టం చేశారు. తన ఇంటికి అళగిరి రావడంపై మాట్లాడుతూ, ఒక చెల్లిగా ఆయన తనను కలుసుకున్నారన్నారు. ఇటీవల తన కు కొంత అనారోగ్యం చేసిందని, అందుకే తనను పరామర్శించడానికి ఆయన ఇంటికి వచ్చారని, తాము రాజకీయాలేమీ మాట్లాడుకోలేదని చెప్పారు. -
అన్నయ్య వస్తే ఆంతర్యమా?
డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి భేటీ గురించి కరుణానిధి గారాల పట్టి కనిమొళి పెదవి విప్పారు. అన్నయ్య కలిసిన మాట వాస్తవమేనని, కుశల ప్రశ్నలు, ఆరోగ్య క్షేమాల గురించి మాత్రమే తనతో అళగిరి వాకబు చే శారని, అందులో ఆంతర్యమేమీ లేదని వివరించారు. శనివారం ప్రచారబాట పట్టే ముందుగా మీడియాతో కనిమొళి మాట్లాడారు. సాక్షి, చెన్నై:డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఓ వైపు ఎంకే స్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలో ఉన్నారు. మరో వైపు తాను సైతం అంటూ అధినేత ఎం కరుణానిధి ప్రచారానికి కదిలారు. వయోభారాన్ని పక్కన పెట్టి రోజుకు రెండు నియోజకవర్గాల్లో ప్రచార సభల రూపంలో కరుణానిధి ముందుకు సాగుతున్నారు. ఇది వరకు ఎన్నికల ప్రచారాలకు ప్రత్యక్షంగా వెళ్లని కరుణానిధి గారాల పట్టి కనిమొళి తాజాగా అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ముందుకు సాగేందుకు సిద్ధం అయ్యారు. శనివారం దక్షిణ చెన్నైలోని తమ పార్టీ అభ్యర్థి టీకేఎస్ ఇళంగోవన్కు మద్దతుగా ఓట్ల వేటతో ప్రచారానికి కనిమొళి శ్రీకారం చుట్టారు. సీఐటీ కాలనీలోని తన నివాసం నుంచి బయలు దేరే ముందుగా ఆమె మీడియాతో మాట్లాడారు. మీడియా సంధించిన ప్రశ్నలకు కనిమొళి సమాధానాలు ఇచ్చారు. ప్రధానంగా గతం వారం తన పెద్ద అన్నయ్య, డీఎంకే బహిష్కృత నేత అళగిరి తనతో భేటీ కావడం గురించి పెదవి విప్పారు. ఇది వరకు ఎన్నడూ లేని రీతిలో కనిమొళి ఇంటికి అళగిరి స్వయంగా వెళ్లడంతో ఆంతర్యాన్ని కని పెట్టే పనిలో రాజకీయ వర్గాలు పడ్డాయి. అయితే, ఇందులో ఎలాంటి రాజకీయం లేదంటూ కనిమొళి స్పష్టం చేశారు. అళగిరి భేటీలో ఆంతర్యమేమిటో..? చెల్లెమ్మను అన్నయ్య కలవడంలో ఆంతర్యం ఉంటుందా? పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరించారే? ఆ విషయం ప్రస్తావనకు రాలేదా..? లేదు. కేవలం నా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కుశల ప్రశ్నలు వేసుకున్నాం. సర్వేలు అన్నాడీఎంకేకు అనుకూలంగా ఉన్నట్టుందే? ఒక్కో సర్వే ఒక్కొకటి చెబుతోంది. తొలుత అన్నాడీఎంకేకు 30 స్థానాలు తథ్యం అని సర్వేలు చెప్పాయి. ఇప్పుడు అదే సర్వేలు 18 నుంచి 20లోపే అంటున్నాయి. ఎన్నికల నాటికి ఆ సంఖ్య మరికొన్ని తగ్గడం తథ్యం. అదెలా తగ్గుతాయో? తమ అధినేత కరుణానిధి ప్రచార బాట పట్టే సరికి సర్వేల్లోను సంఖ్యలు మారాయి. ఇప్పుడు ఆయన సుడిగాలి పర్యటనతో ప్రజల్లోకి వెళ్లారు. అధినేత రాకతో అభ్యర్థుల్లో బలం పెరిగింది. ఎన్నికల నాటికి అన్నాడీఎంకే సీట్ల సంఖ్య తగ్గుతుంది. ఇది మరో సర్వేతో స్పష్టం అవుతుంది. మీ మీద, మీ ఎంపీ రాజా మీద ‘2జీ’అవినీతి ఆరోపణ లు ఉన్నాయే?మరి ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు..? ఇలాంటి ఆరోపణల వెనుక రాజకీయ కారణాలు ఉంటారుు. మా విషయంలో అదే జరిగింది. నిజాలు ఏదో ఒక రోజు బయటకు వచ్చి తీరుతాయి. తాము నిర్దోషులం అని తేలుతుంది. మా మీద మోపిన నిందల గురించే అందరూ ప్రస్తావిస్తున్నారేగానీ, ఏళ్ల తరబడి బెంగళూరు కోర్టులో వాయిదాల మీద వాయిదాలతో సాగుతున్న ఆమె(జయలలిత) అవినీతి కేసు గురించి పట్టించుకోరా? ఎవరు మంచి వాళ్లో, చెడ్డ వారో ప్రజలకు తెలుసు. మీ అభ్యర్థులందరూ కోటీశ్వరులేనట? ఒకరిద్దరు మాత్రమే కోటీశ్వరులు ఉండొచ్చు. మిగిలిన వారందరూ చదువుకున్న విద్యావంతులు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే. ఈలం తమిళుల విషయంలో డీఎంకే కపటనాటకం ప్రదర్శించ లేదా? ఆ అవసరం తమకేంటి. ఈలం తమిళుల సంక్షేమం లక్ష్యంగా ఆ నాటి నుంచి ఉద్యమిస్తున్నదని కలైంజర్ కరుణానిధి. కేంద్రంలోని యూపీఏతో తరచూ ఢీ కొట్టారు. ఆయన ఒత్తిడి మేరకు రెండు సార్లు శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానాలకు ఐక్యరాజ్య సమితిలో భారత్ మద్దతు ఇచ్చింది. తాము ప్రస్తుతం ఆ కూటమిలో లేనప్పటికీ, ఒత్తిడి తెచ్చాం. అయితే, కేంద్రం శ్రీలంకకు వత్తాసు పలికింది. ఇదెలా కపట నాటకం అవుతుంది. ప్రచారంలో తమరి అస్త్రం? రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు. సుపరి పాలన పేరుతో సాగుతున్న అవినీతి బండారాలు. ప్రజల్ని మభ్య పెట్టే విధంగా సాగుతున్న ప్రకటన, ఉత్తర్వుల వ్యవహారాలు. విద్యుత్ సంక్షోభం డీఎంకే ఘనత కాదంటారా..? ఇది ముమ్మాటికి తప్పుడు సంకేతం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కలైంజర్ అనేక విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అన్నీ పూర్తి కావచ్చిన సమయానికి అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేపట్టింది. ఆ పథకాల్ని కొనసాగించి ఉంటే, సంక్షోభం ఉండేది కాదు. కొత్త ప్రాజెక్టులంటూ, తమ ప్రాజెక్టులను పక్కన పెట్టడంతో గ్రామాలు అంధకారంలో మునిగి ఉన్నాయి. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు నిందల్ని మా మీద వేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నాం.