anjali
-
హీరోయిన్ అంజలితో రిలేషన్? కోన వెంకట్ ఆన్సరిదే..
రచయితగా, నిర్మాతగా రెండు దశాబ్దాలుగా సినీసీమలో కొనసాగుతున్నాడు కోన వెంకట్ (Kona Venkat). ఒకప్పుడు ఎక్కువ హిట్లు అందుకున్న ఆయన ఈ మధ్యకాలంలో జిన్నా, గీతాంజలి మళ్లీ వచ్చింది వంటి చిత్రాలతో పరాజయాల బాట పట్టాడు. హీరోయిన్ అంజలితో నిశ్శబ్ధం, డిక్టేటర్, గీతాంజలి, గీతాంజలి మళ్లీ వచ్చింది, శంకరాభరణం.. ఇలా పలు సినిమాలు చేశాడు. దీంతో దర్శకుడికి, అంజలికి మధ్య ఏదో ఉందన్న రూమర్స్ మొదలయ్యాయి. అంజలిపై సాఫ్ట్ కార్నర్వీరు రిలేషన్లో ఉన్నారని పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్పై కోన వెంకట్ స్పందిస్తూ.. అంజలి (Actress Anjali) పై నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. తనను చెల్లిగా, కూతురిగా, స్నేహితురాలిగా.. ఎలా పిలవమన్నా పిలుస్తాను. తన వ్యక్తిగత జీవితం చాలా తక్కువమందికే తెలుసు. తన బాల్యం సంతోషకరంగా సాగలేదు. పేరెంట్స్ దగ్గర కూడా ఎప్పుడూ లేదు. పిన్ని దగ్గరే పెరిగింది. ఆమె కూడా సరిగా చూసుకునేది కాదు.ఆస్తి కబ్జాతనకు ఒక సపోర్ట్ కావాలనిపించింది. తన బాధ చెప్పుకునేందుకు ఓ మనిషి ఉంటే బాగుండనిపించింది. నా కూతురికి ఏదైనా అవసరం ఉందంటే ఎలా నిలబడతానో అంజలికి కూడా ఎల్లప్పుడూ అలాగే నిల్చున్నాను. దాన్ని రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. నేనవేవీ పట్టించుకోను. గీతాంజలి సినిమా సమయంలోనే అంజలి నాకు తొలిసారి పరిచయమైంది. అదే సమయంలో చెన్నైలో తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె పిన్నివాళ్లు అంజలి ఆస్తిని కబ్జా చేశారు. అలాంటి సమయంలో నిస్వార్థంగా తనకు అండగా నిలబడే ఓ స్నేహితుడు అవసరం అనిపించింది. నా చేతుల మీదుగా ఇవ్వమని ఆశపడిందినన్ను ఫ్రెండ్, అన్న, తండ్రి, గురువు, దైవం.. ఏదనుకున్నా పర్లేదు. నేను పోలీసులతో మాట్లాడి తనకు అండగా నిలబడ్డాను. ఆమె తొలిసారి బీఎమ్డబ్ల్యూ కారు కొనుకున్నప్పుడు నా చేతుల మీదుగా ఇవ్వమని అడిగింది. సరేనని నా చేతులమీదుగా కారు తాళాలు తన చేతికిచ్చాను. దానికి నేనేదో ఆమెకు కారు గిఫ్ట్ ఇచ్చానని రాసేశారు. మా అనుబంధానికి మీరు ఏ పేరైనా పెట్టుకున్నా నేను పట్టించుకోను అని కోన వెంకట్ చెప్పుకొచ్చాడు.చదవండి: #SSMB29: వాట్ ద ఎఫ్.. రాజమౌళి? -
సోషల్ మీడియాలో హీరోయిన్ అంజలి కొత్త ఫోటోలు హల్ చల్
-
Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ
టైటిల్: మదగజరాజానటీనటులు:విశాల్, సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్, మణివణ్ణన్ (లేట్), నితిన్ సత్య, సడగొప్పన్ రమేష్, ఆర్. సుందర్ రాజన్, మొట్టా రాజేంద్రన్, మనోబాలా (లేట్), స్వామినాథన్, జాన్ కొక్కెన్, టార్జాన్, విచ్చు విశ్వనాథ్ తదితరులునిర్మాణ సంస్థ: జెమినీ ఫిల్మ్ సర్క్యూట్కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సుందర్ సితెలుగు విడుదల: సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్సంగీతం: విజయ్ ఆంటోనిఎడిటర్: శ్రీకాంత్ ఎన్.బి.విడుదల తేది: జనవరి 31, 2025తమిళ స్టార్ విశాల్ 12 ఏళ్ల క్రితం నటించిన చిత్రం ‘మదగజరాజా’(Madha Gaja Raja ). కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ.. ఈ ఏడాది జనవరి 12 తమిళ్లో రిలీజై పెద్ద విజయం సాధించింది. చాలా కాలం తర్వాత విశాల్ సినిమా రూ. 50 కోట్ల కలెక్షన్స్ని రాబట్టింది. అయితే సంకాంత్రి బరిలో పెద్ద చిత్రాలు ఉండడంతో తెలుగులో రిలీజ్ కాలేదు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు(జనవరి 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ మాదిరే ఇక్కడ కూడా ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచిందా? మదగజరాజా తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?అరకు చెందిన మదగజరాజా( అలియాస్ ఎంజీఆర్(విశాల్)(Vishal) ఓ కేబుల్ ఆపరేటర్. తండ్రి స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్సై. తండ్రికి తోడుగా ఉంటూ.. ఊర్లోనే ఉంటుంటాడు. ఓ కేసు విషయంలో అరకు వచ్చిన అగ్గిపెట్ట ఆంజనేయులు కూతురు మాధవి(అంజలి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. మాధవి కూడా ఎంజీఆర్ని ప్రేమిస్తుంది. కానీ ఓ కారణంగా ఆమె తండ్రితో కలిసి అరకు నుంచి వెళ్లిపోతుంది(Madha Gaja Raja Review)రాజా ఈ బాధలో ఉండగానే.. తన కూతురు పెళ్లికి రావాలంటూ చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పిన మాస్టార్ నుంచి ఫోన్ కాల్వస్తుంది. ఈ పెళ్లి వేడుకలో బాల్య స్నేహితులంతా కలుస్తారు. పెళ్లి అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో తన స్నేహితులకు ఏవో సమస్యలు ఉన్నట్లు రాజాకు తెలుస్తుంది. ఈ సమస్యలకు మీడియా బలంతో పాటు రాజకీయ పలుకుబడి ఉన్న కాకర్ల విశ్వనాథ్(సోనూసూద్) కారణమని తెలిసి రాజా హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మీడియాను అడ్డుపెట్టుకొని కాకర్ల ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు? తన స్నేహితులకు కాకర్ల చేసిన మోసం ఏంటి? చివరకు తన స్నేహితుల సమస్యలను తీర్చాడా లేదా? ఈ కథలో మాయ(వరలక్ష్మి శరత్ కుమార్) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ సినిమా ఇప్పుడు తెరకెక్కించింది కాదు. 12 ఏళ్ల క్రితమే రూపొందింది. అప్పటికి ఇప్పటికీ వెండితెరపై చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకుల మైండ్సెట్ కూడా మారిపోయింది. డిఫరెంట్ కంటెంట్, కొత్త పాయింట్ ఉన్న చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ పాత సినిమాలను గుర్తు చేసింది మదగజరాజా. కథ, కథనంలో ఎలాంటి కొత్తదనం లేదు. కమర్షియల్ ఫార్మాటులో సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన సుందర్ సి. ఈ సినిమాను కూడా అదే పంథాలో తెరకెక్కించాడు. లాజిక్స్ని పట్టించుకోకుండా ఓన్లీ కామెడీని నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అదే సినిమాను నిలబెట్టింది. రొటీన్ కథే అయినప్పటికీ ఈ సినిమాలోని కామెడీ సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా హీరో స్నేహితుడుగా సంతానం పండించిన కామెడీ థియేటర్స్లో నవ్వులు పూయిస్తుంది. కొన్ని చోట్ల కామెడీ కోసం వాడే సంబాషణలు ఇబ్బందికరంగా ఉన్నా.. ఓ వర్గం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.కథగా చెప్పాలంటే ఇది చాలా చిన్న సినిమా. రాష్ట్ర రాజకీయాలను శాసించే ఓ వ్యక్తిని సామాన్యుడు ఎలా ఢీ కొట్టాడు అనేది ఈ సినిమా కథ. స్నేహితుల కష్టాలను తీర్చడం కోసం హీరో రంగంలోకి దిగడం కూడా పాత పాయింటే. అయితే అసలు స్టోరీ అంతా సెకండాఫ్లోనే ఉంటుంది. ఫస్టాఫ్లో అసలు కథేమి ఉండదు. కానీ ఎక్కడా బోర్ కొట్టదు. దానికి కారణం సంతానం పండించిన కామెడీనే. సంతానం వేసిన ప్రతి పంచ్ థియేటర్స్లో నవ్వులు పూయిస్తుంది. కొన్ని చోట్ల శ్రుతిమించినట్లు అనిపించినా సంతానం ట్రాక్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక సెకండాఫ్ని సీరియస్గా మార్చే అవకాశం ఉన్నా.. మళ్లీ కామెడీనే నమ్ముకున్నాడు దర్శకుడు. కాకర్లను బురిడీ కొట్టించేందుకు హీరో చేసే పనులు వాస్తవికానికి దూరంగా ఉంటాయి. మంత్రి సత్తిబాబు డెడ్బాడీతో హీరో, అతని గ్యాంగ్ చేసే హంగామా నవ్విస్తుంది. అయితే ఇవన్నీ సన్నివేశాలుగా చూస్తేనే బాగుంటుంది. కానీ కథగా చూస్తే అతికినట్లుగా అనిపిస్తుంది. సీన్ టు సీన్ కంటిన్యుటీ ఉండదు. ఫస్టాఫ్ కథకి సెకండాఫ్ కథకి సంబంధమే ఉండదు. ఇలాంటి లాజిక్స్కి పట్టించుకోకుండా కొంచెం అతి అయినా పర్లేదు భరిస్తామని అనుకుంటే.. ఈ చిత్రం మిమ్మల్ని అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే..మాస్ యాక్షన్ సినిమాలు విశాల్కి కొత్తేమి కాదు. కెరీర్ ప్రారంభం నుంచి ఈ తరహా పాత్రలు చేస్తూనే ఉన్నాడు. మదగజరాజాలోనూ మరోసారి మాస్ పాత్రనే పోషించాడు. యాక్షన్తో పాటు కామెడీ కూడా బాగానే పండించాడు. ఈ చిత్రం కోసం ఓ పాటను కూడా ఆలపించాడు. తెరపై ఆయన చేసే కొన్ని పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలీ ఇద్దరూ తెరపై అందాలు ఆరబోయడంలో పోటీ పడ్డారు. వారిద్దరి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. గ్లామర్ పరంగా మాత్రం మంచి మార్కులు కొట్టేశారు. సోనూసూద్ తనకు అలవాటైన విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. తెరపై స్టైలీష్గా కనిపించాడు. సంతానం కామెడీ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఆయన పండించిన కామెడీ మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. మనోబాలతో పాటు మిగిలిన నటీటనులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. విజయ్ ఆంటోనీ అందించిన నేపథ్య సంగీతం, పాటలు 12 ఏళ్ల క్రితం వచ్చిన మాస్ కమర్షియల్ సినిమాలను గుర్తు చేస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. తెరపై ఒకచోట తమిళ పేర్లు..మరోచోట తెలుగు పేర్లు కనిపిస్తాయి. విశాల్తో సహా అందరి పాత్రలకు వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. విజువల్స్గా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
తమిళ్లో పెద్ద హిట్.. తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుంది: అంజలి
విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘మద గజరాజా’(Madagada Raja ). ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలి హీరోయిన్లుగా నటించారు. సుందర్. సి దర్శకత్వంలో జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న తమిళంలో విడుదలైంది. ఈ సినిమా తమిళంలో హిట్ మూవీగా నిలిచి, రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించిందని చిత్రబృందం పేర్కొంది. కాగా ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ను అదే టైటిల్తో సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ నెల 31న తెలుగులో విడుదల చేస్తోంది.హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంజలి(Anjali) మాట్లాడుతూ– ‘‘మంచి కమర్షియల్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ మూవీ, తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. విశాల్ యాక్షన్, సంతానం కామెడీ, మ్యూజిక్, సుందర్ సర్ డైరెక్షన్ తో కలర్ ఫుల్ మూవీ ఇది. మూవీ లవర్స్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. థియేటర్స్ లో చూడండి. తప్పకుండా నచ్చుతుంది' అన్నారు.హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘హీరోయిన్గా నా ఫస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో వెస్ట్రన్ హీరోయిన్గా కనిపిస్తాను.ఈ సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్. మంచి ఎంటర్ టైనర్. ప్రతి ఎపిసోడ్ ని ఎంజాయ్ చేస్తారు. ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్ టైనర్. జనవరి 31న తెలుగు రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి'నిర్మాత జెమిని కిరణ్ మాట్లాడుతూ.. ఒక హీరో ఇద్దరు హీరోయిన్స్ తో వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం అని ఈ సంక్రాంతికి ఇక్కడ పెద్ద హిట్ కొట్టారు. అలాగే అక్కడ విశాల్ గారు మదగజరాజా తో తమిళ్ లో పెద్ద విజయం అందుకున్నారు. అక్కడ వి ఇక్కడ వి. ఖచ్చితంగా ఇక్కడ కూడా సూపర్ హిట్ కొడతారు. ఈ సినిమా తమిళ్లో సూపర్ డూపర్ హిట్టు. ఇక్కడ కూడా అలానే అవుతుందని ఆశిస్తున్నాను. థాంక్యూ ఆల్ ది బెస్ట్' అన్నారు. -
'మదగజరాజా'మూవీ ప్రెస్మీట్లో హీరోయిన్ అంజలి,వరలక్ష్మి (ఫొటోలు)
-
గేమ్ ఛేంజర్ డిజాస్టర్పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ..
గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie) రిజల్ట్పై హీరోయిన్ అంజలి (Anjali) తొలిసారి స్పందించింది. కొన్ని ఫలితాలను చూసినప్పుడు బాధగా అనిపిస్తుందని పేర్కొంది. ఈ సంక్రాంతికి అంజలి నటించిన రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి గేమ్ ఛేంజర్ కాగా మరొకటి మదగజరాజ. పన్నెండేళ్లక్రితం అంజలి హీరోయిన్గా నటించిన మదగజరాజ ఎట్టకేలకు తమిళనాట విడుదలైంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో జనవరి 31న రిలీజ్ చేస్తున్నారు.అంతవరకే నా పనిఈ సినిమా సమావేశంలో అంజలికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. గేమ్ ఛేంజర్ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఆ సినిమాకు మంచి ఫలితం వచ్చుంటే బాగుండేది కదా.. దానిపై మీ ఫీలింగ్ ఏంటి? అన్న ప్రశ్నకు.. ఒక నటిగా నా పాత్రకోసం నేను బాధ్యత తీసుకోగలను. నా పాత్రను ఎలా పోషించాలి? అందుకోసం వందశాతం ఎఫర్ట్స్ పెడుతున్నానా? లేదా? అన్నదే నా చేతిలో ఉంటుంది. అక్కడితోనే నా పనైపోతుంది. మా సినిమాను జనాలు ఆదరించాలన్నది మా తపన. అందుకోసం ప్రమోషన్స్కు వెళ్తుంటాము. ప్రేక్షకులకు మా సినిమా చూడమని చెప్తాము.ఎవరూ సినిమా బాగోలేదని అనలేదుఅయినా గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడాలంటే దానికోసం ప్రత్యేక ఇంటర్వ్యూ పెట్టాలి. ఎందుకనేది మీ అందరికీ తెలుసు. కొన్ని సినిమాలపై నమ్మకం ఉంచి నటిస్తాము. నేను గేమ్ ఛేంజర్ను పూర్తిగా నమ్మాను. ఈ సినిమా చూసిన జనరల్ ఆడియన్స్ ఎవరూ గేమ్ ఛేంజర్ బాగోలేదని చెప్పలేదు. మంచి సినిమా అని కితాబిచ్చారు. సినిమా బాగుండటం వేరు, మంచి సినిమా వేరు. బాధగా ఉందిగేమ్ ఛేంజర్ మంచి సినిమా.. మీరు చాలా బాగా యాక్ట్ చేశారు అని నాతో చాలామంది అన్నారు. అది నాకు చాలు. అయినా సరే.. కొంత బాధగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. మదగజరాజ సినిమా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చుంటే ఒప్పుకునేవారా? అన్న ప్రశ్నకు.. అంజలి, వరలక్ష్మి (Varalaxmi Sarathkumar).. కథ ఎవరు చెప్తున్నారనేదాన్ని బట్టి తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నారు.గేమ్ ఛేంజర్ఇదిలా ఉంటే రామ్చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత విజయం రాబట్టలేకపోయింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. చరణ్ ద్విపాత్రాభినయం చేయగా అంజలి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: సినిమాలు వదిలేయాలనుకున్నాను: అప్సరా రాణి -
మొగలిరేకులు సీరియల్ నటి పదో పెళ్లి రోజు.. భర్తతో ఆనందంగా.. (ఫోటోలు)
-
అదిరిపోయే పంచ్లతో 'మదగజరాజా' తెలుగు ట్రైలర్
విశాల్(Vishal ) నటించిన ‘మదగజరాజా’(Madha Gaja Raja) చిత్రం సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ సంక్రాంతికి కోలీవుడ్లో విడుదలైంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్కు దగ్గరలో ఈ మూవీ ఉంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వర్షన్ కూడా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రం జనవరి 12న తమిళంలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మంచి స్పందన లభించిందని యూనిట్ పేర్కొంది. కాగా ఈ జనవరి 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar) హీరోయిన్స్గా నటించారు. తెలుగు వర్షన్లో సినిమా రానున్నడంతో తాజాగా ‘మదగజరాజా’ ట్రైలర్ను హీరో వెంకటేశ్ హైదరాబాద్లో విడుదల చేశారు. కామెడీ ప్రధానంగా ఈ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జానర్ సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు సుందర్.సి. దిట్ట అని చెప్పవచ్చు. ఆయన తన మార్క్ మాస్ అంశాలతో ఈ మూవీని రూపొందించారు. ఇందులో హీరోయిన్ సదా కూడా ఒక ఐటెమ్ సాంగ్లో కనిపించింది. -
నిర్మాత లవ్ రిజెక్ట్ చేశా.. ఆ కోపంతో రైల్లో నుంచి తోసేయాలని..: దృశ్యం నటి
దృశ్యం సినిమాతో పాపులరైంది అంజలి నాయర్ (Anjali Nair). తాజాగా ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. అంజలి మాట్లాడుతూ.. ఉన్నయే కాదలిప్పన్ (Unnaiye Kadhalipen) అనే తమిళ సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీ నిర్మాత నాకు ప్రపోజ్ చేశాడు. అతడు ఆ సినిమాను నిర్మించడంతో పాటు అందులో విలన్గానూ నటించాడు. తన ప్రపోజల్ను నేను తిరస్కరించాను. దాంతో అతడు నేను వేరే సినిమాకు వెళ్లినప్పుడు ఆ సెట్స్కు వచ్చి వేధింపులకు గురి చేశాడు.రైల్లో నుంచి నెట్టేయాలని..ఒకసారి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా వచ్చి నా బ్యాగు తీసుకున్నాడు. తిరిగిచ్చేయమని అతడిని వెంబడించినప్పుడు రైలు డోర్ దగ్గర నన్ను బయటకు నెట్టేయాలని చూశాడు. ఒకసారి అతడి సోదరి నాకు ఫోన్ చేసి ఆమె తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. నన్ను చూడాలని కలవరిస్తోందని చెప్పింది. అతడు ఇంట్లో ఉంటే రానని చెప్పాను. అందుకామె.. తన సోదరుడు ఇంట్లో లేడని స్విట్జర్లాండ్కు వెళ్లిపోయాడని, కంగారుపడాల్సినం అవసరం లేదని సర్ది చెప్పింది.కత్తితో బెదిరించి సంతకం..నిజమేననుకుని వెళ్లాను. నేను ఇంట్లో ఓ గదిలోకి వెళ్లగానే బయట నుంచి గడియ పెట్టారు. ఆ గదిలో ఆ రాక్షసుడు ఉన్నాడు. కొన్ని పేపర్లు నా ముందు పెట్టి సంతకం పెట్టమన్నాడు. కత్తితో బెదిరించడంతో సంతకం చేశాను. ఆ పేపర్లలో లవ్ లెటర్ కూడా ఉంది. తర్వాత ఎలాగోలా ఆ గది నుంచి బయటపడ్డాను. అయితే అతడి నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్గా నటించాలని కాంట్రాక్ట్ పేపర్పై నాతో బలవంతంగా సంతకం చేయించుకున్నాడని అర్థమైంది.(చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లి రాజు.. తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్!)అంత చెండాలంగా లెటర్ రాస్తారా?నేను సినిమా చేయనని చెప్పాను. ఆధారాలతో సహా అతడిపై కేసు పెట్టాను. అప్పుడు అతడు నేను రాసినట్లుగా లవ్ లెటర్స్ను సాక్ష్యంగా చూపించాడు. నేనొకటే అడిగా.. ప్రేమించే ఏ అమ్మాయైనా అంత చెండాలంగా లవ్ లెటర్ రాస్తుందా? అని ప్రశ్నించాను. ఆ కేసు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తర్వాత మళ్లీ ఎప్పుడూ అతడు నాకు కనిపించలేదు అని చెప్పుకొచ్చింది. సినిమాఅంజలి.. మలయాళంలో ద కింగ్ అండ్ ద కమిషనర్, 5 సుందరికల్, పట్టం పోలే, వెనిసిలె వ్యాపారి, ఏంజెల్స్, టమార్ పడార్, 100 డిగ్రీ సెల్సియస్, సెకండ్స్, సెంట్రల్ థియేటర్, లైలా ఓ లైలా, బెన్, దూరం, తీరం, ఆమి, దృశ్యం 2, మాన్స్టర్ సినిమాలు చేసింది. తమిళంలో ఇదువుమ్ కాదంధు పొగుం, నెల్లు, ఆగడు సినిమాలు చేసింది. ఇటీవలే చిత్తా(తెలుగులో చిన్నా) సినిమాకుగానూ ఉత్తమ సహాయ నటిగా రాష్ట్రీయ అవార్డు గెలుచుకుంది. కాగా అంజలి దర్శకుడు అనీశ్ను 2011లో పెళ్లి చేసుకుంది. వీరికి అవని అనే కూతురు ఉంది. 2016లో అతడికి విడాకులు ఇచ్చింది. 2022లో అజిత్ రాజును రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఓ కూతురు పుట్టింది.చదవండి: నాన్న చేసిన పనికి అమ్మ ఏడుస్తూ... ఈ బతుకే వద్దనుకున్నా! -
సంక్రాంతి వచ్చెనట సందడి తెచ్చెనట!
మంచుకు తడిసిన ముద్దబంతులు... ముగ్గులు... పూలు విచ్చుకున్న గుమ్మడి పాదులు... కళ్లాపిలు.... వంట గదుల్లో తీపీ కారాల ఘుమఘుమలు...కొత్త బట్టలు... కొత్త అల్లుళ్ల దర్పాలు...పిల్లల కేరింతలు... ఓపలేని తెంపరితనాలుసంక్రాంతి అంటే సందడే సందడి.మరి మేమేం తక్కువ అంటున్నారు సినిమా తారలు.మా సంక్రాంతిని వినుమా అని ముందుకొచ్చారు.రచయిత్రులు ఊసుల ముత్యాల మాలలు తెచ్చారు.‘ఫ్యామిలీ’ అంతా సరదాగా ఉండే సంబరవేళ ఇది.ప్రతిరోజూ ఇలాగే పండగలా సాగాలని కోరుకుంటూసంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.ఇన్పుట్స్ : సాక్షి సినిమా, ఫ్యామిలీ బ్యూరోమన పండుగలను ఎన్నో అంశాలను మిళితం చేసి ప్రయోజనాత్మకంగా రూపొందించారు మన పెద్దలు. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా పండుగ విధులుగా చెప్పి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగా వాటిని రూపొందించారు. మన పండుగల్లో ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞానాలు మిళితమై ఉంటాయి. తెలుగువారి ప్రధానమైన పండుగ సంక్రాంతిలో కూడా అంతే! ప్రధానంగా చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు సౌరమానాన్ని పాటించే ముఖ్యమైన సందర్భం ఇది. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15 కాని, 16వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14 కాని, 15 వ తేదీ వరకు కాని ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఆ రోజు నుండి సూర్యుడు తన గమన దిశని దక్షిణం నుండి ఉత్తరానికి మార్చుకుంటాడు కనుక మకర సంక్రమణానికిప్రాధాన్యం. ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. బొమ్మల కొలువుపెట్టుకునే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అసలు ప్రధానమైనది సంక్రాంతి. ఈ పుణ్యకాలంలో దానాలు, తర్పణాలుప్రాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం,పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయనివారు ఈ రోజు చేస్తారు. అసలు మూడురోజులు పేరంటం చేసే వారున్నారు. సంక్రాంతి మరునాడు కనుము. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి,పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె పొట్టేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. నాగలి, బండి మొదలైన వాటిని కూడా పూజిస్తారు. ఇప్పుడు ట్రాక్టర్లకి పూజ చేస్తున్నారు. భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి, వ్యవసాయ పనిముట్లకి కూడా తమ కృతజ్ఞతలని తెలియచేయటం పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవమర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పంటను పాడుచేసే పురుగులని తిని సహాయం చేసినందుకు పక్షులకోసం వరికంకులను తెచ్చి కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’,‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’,‘కనుము నాడు మినుము తినాలి’ అనే సామెతలు కనుముకి పితృదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. మొత్తం నెల రోజులు విస్తరించి, నాలుగు రోజుల ప్రధానంగా ఉన్న పెద్ద పండగ సంక్రాంతి తెలుగువారికి ఎంతో ఇష్టమైన వేడుక. – డా. ఎన్.అనంతలక్ష్మిముక్కనుముముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. సంక్రాంతికి అందరూ తమ గ్రామాలకి చేరుకుంటారు. అల్లుళ్లు, ముఖ్యంగా కొత్త అల్లుళ్లు తప్పనిసరి. నెల రోజులు విస్తరించి, నాలుగు రోజులు ప్రధానంగా ఉండే సంక్రాంతి పెద్దపండుగ. పెద్దల పండుగ కూడా. పెద్ద ఎత్తున చేసుకునే పండుగ కూడా.థీమ్తో బొమ్మల కొలువుసంక్రాంతికి ప్రతియేటా ఐదు రోజులు బొమ్మలు కొలువు పెడుతుంటాం. చిన్నప్పటి నుంచి నాకున్న సరదా ఇది. నేను, మా అమ్మాయి, మనవరాలు కలిసి రకరకాల బొమ్మలను, వాటి అలంకరణను స్వయంగా చేస్తాం. ప్రతి ఏటా ఒక థీమ్ను ఎంచుకుంటాం. అందకు పేపర్, క్లే, అట్టలు, పూసలు, క్లాత్స్.. ఎంచుకుంటాం. ఈ సారి ఉమెన్ పవర్ అనే థీమ్తో నవదుర్గలు పెట్టాం. అమ్మ వార్ల బొమ్మలు ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయి. గుడిలాగా అలంకారం చేశాం. గుడికి అమ్మాయిలు వస్తున్నట్టు, పేపర్లతో అమ్మాయిల బొమ్మలను చేశాం. తిరుపతి చందనం బొమ్మల సేకరణ కూడా ఉంది. ఆ బొమ్మలతో కైలాసం అనుకుంటే శివపార్వతులుగా, తిరుపతి అనుకుంటే వెంకటేశ్వరస్వామి, పద్మావతి... ఇలా థీమ్కు తగ్గట్టు అలంకరణ కూడా మారుస్తాం. ఈ బొమ్మల కొలువుకు మా బంధువులను, స్నేహితులను పిలుస్తుంటాం. ఎవరైనా అడిగితే వాళ్లు వచ్చేవరకు ఉంచుతాం. – శీలా సుభద్రాదేవి, రచయిత్రిపండగ వైభోగం చూతము రారండి– రోహిణితమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న రోహిణి అనకాపల్లి అమ్మాయి అనే విషయం చాలామందికి తెలియదు. అయిదేళ్ల వయసులో చెన్నైకి వెళ్లిపోయినా... అనకాపల్లి ఆమెతోనే ఉంది. అనకాపల్లిలో సంక్రాంతి జ్ఞాపకాలు భద్రంగా ఉన్నాయి. నటి, స్క్రీన్ రైటర్, పాటల రచయిత్రి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి మొల్లెటి... ‘సంక్రాంతి ఇష్టమైన పండగ’ అంటుంది, ఆనాటి పండగ వైభోగాన్ని గుర్తు చేసుకుంటుంది.నా చిన్నప్పుడు .. సంక్రాంతికి స్కూల్కి సెలవులు ఇచ్చేవారు. అదో ఆనందం. అలాగే కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్లు. ఇంట్లో చక్కగా పిండి వంటలు చేసి పెట్టేవాళ్లు. ఫుల్లుగా తినేవాళ్లం. మాది అనకాపల్లి. నాకు ఐదేళ్లప్పుడు చెన్నై వెళ్లిపోయాం. సో... నాకు ఊహ తెలిశాక జరుపుకున్న పండగలన్నీ చెన్నైకి సంబంధించినవే.సంక్రాంతికి నెల ముందే నెల గంట పడతారు. అప్పట్నుంచి రోజూ ముగ్గులు పెట్టేవాళ్లం. అయితే ఎవరి ముగ్గు వారిది అన్నట్లు కాకుండా మా ముగ్గుకి ఇంకొకరు రంగులు వేయడం, మేం వెళ్లి వాళ్ల ముగ్గులకు రంగులు వేయడం... ఫైనల్లీ ఎవరి ముగ్గు బాగుందో చూసుకోవడం... అవన్నీ బాగుండేది. నేను రథం ముగ్గు వేసేదాన్ని. ఇక సంక్రాంతి అప్పుడు గంగిరెద్దుల సందడి, హరిదాసులను చూడడం భలేగా అనిపించేది. సంక్రాంతి నాకు ఇష్టమైన పండగ. ఎందుకంటే మనకు అన్నం పెట్టే రైతుల పండగ అది. వారికి కృతజ్ఞత తెలపాలనుకుంటాను. రైతుల విలువ పిల్లలకు చెప్పాలి. ఏమీ చెప్పకుండా పండగ చేసుకుంటే ఇది కూడా ఓ వేడుక అనుకుంటారు... అంతే. అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో పిల్లలకి చెప్పాలి. అర్థం తెలిసినప్పుడు ఇంకాస్త ఇన్ వాల్వ్ అవుతారు.ఇప్పుడు పండగలు జరుపుకునే తీరు మారింది. వీలైనంత వైభవంగా చేయాలని కొందరు అనుకుంటారు. అయితే ఎంత గ్రాండ్గా చేసుకుంటున్నామని కాదు... అర్థం తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా అనేది ముఖ్యం. తాహతుకి మించి ఖర్చుపెట్టి పండగ చేసుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.సంక్రాంతి అంటే నాకు గుర్తొచ్చే మరో విషయం చెరుకులు. చాలా బాగా తినేవాళ్లం. ఇప్పుడూ తింటుంటాను. అయితే ఒకప్పటి చెరుకులు చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పటి జనరేషన్ చెరుకులు తింటున్నారో లేదో తెలియడం లేదు. షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. అయితే చెరుకు కొరుక్కుని తింటే పళ్లకి కూడా మంచిది. మన పాత వంటకాలు, పాత పద్ధతులన్నీ మంచివే. ఇలా పండగలప్పుడు వాటి గురించి చెప్పడం, ఆ వంటకాలు తినిపించడం చేయాలి.నెల్నాళ్లూ ఊరంతా అరిసెల వాసనపండగ మూడు రోజులు కాదు మాకు నెల రోజులూ ఉండేది. వ్యవసాయం, గోపోషణ సమృద్ధిగా ఉండటం వల్ల నెల ముందు నుంచే ధాన్యం ఇల్లు చేరుతుండేది. నెల గంటు పెట్టగానే పీట ముగ్గులు వేసేవారు. వాటిల్లో గొబ్బిళ్లు పెట్టేవారు. రోజూ గొబ్బిళ్లు పెట్టి, వాటిని పిడకలు కొట్టేవారు. ఆ గొబ్బి పిడకలన్నీ పోగేసి, భోగిరోజున కర్రలు, పిడకలతోనే భోగి మంట వేసేవాళ్లు. మామూలు పిడకల వాసన వేరు, భోగి మంట వాసన వేరు. ప్రధాన సెలబ్రేషన్ అంటే ముగ్గు. బొమ్మల కొలువు పెట్టేవాళ్లం. అందరిళ్లకు పేరంటాలకు వెళ్లేవాళ్లం. ఊరంతా అరిసెల వాసన వస్తుండేది. కొత్త అటుకులు కూడా పట్టేవారు. చెరుకు గడలు, రేగుపళ్లు, తేగలు, పిల్లల ఆటలతో సందడిగా ఉండేది. బంతిపూల కోసం అక్టోబర్లో మొక్కలు వేసేవాళ్లం. అవి సంక్రాంతికి పూసేవి. కనుమ నాడు గోవులను అలంకరించి, దండం పెట్టుకునే వాళ్లం. చేసుకున్న పిండి వంటలు పంచుకునేవాళ్లం. హరిదాసులకు, గంగిరెద్దుల వాళ్లకు ధాన్యాన్ని ఇచ్చేవాళ్లం. ఇప్పటికీ పండగలను పల్లెలే సజీవంగా ఉంచుతున్నాయి. పట్టణాల్లో మాత్రం కొన్నేళ్లుగా టీవీల్లోనే సంక్రాంతి సంబరాలను చూస్తున్నాం. – రమారావి, కథకురాలు, ఆధ్యాత్మికవేత్తనా జీవితంలో సంక్రాంతి చాలా స్పెషల్– మీనాక్షీ చౌదరి‘ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు’ అనేది మన అచ్చ తెలుగు సామెత. తెలుగుతనం ఉట్టిపడే పేరున్న మీనాక్షీ చౌదరి తెలుగు అమ్మాయి కాదు. ఉత్తరాది అమ్మాయి మీనాక్షీ చౌదరి కాస్త బాపు బొమ్మలాంటి తెలుగింటి అమ్మాయిగా మారడానికి మూడు సంవత్సరాల కాలం చాలదా! మీనాక్షీ నటి మాత్రమే కాదు స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ (2018) కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమా తో తెలుగు తెరకు సైలెంట్గా పరిచయం అయిన చౌదరి ‘హిట్: ది సెకండ్ కేస్’తో హిట్ కొట్టింది. సూపర్హిట్ సినిమా ‘లక్కీభాస్కర్’ లో సుమతిగా సుపరిచితురాలైంది. కొందరికి కొన్ని పండగలు ప్రత్యేకమైనవి. సెంటిమెంట్తో కూడుకున్నవి. మీనాక్షీ చౌదరికి కూడా సరదాల పండగ సంక్రాంతి ప్రత్యేకమైనది. సెంటిమెంట్తో కూడుకున్నది. ఈ హరియాణ అందాల రాశి చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు ఇవి.మాది హర్యానా రాష్ట్రంలోని పంచకుల. మూడేళ్లుగా నేను హైదరాబాద్లో ఉంటూ తెలుగు సినిమాల్లో పని చేస్తున్నాను కాబట్టి సంక్రాంతి పండగ గురించి నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జనవరిలో ఒక సెలబ్రేషన్ (సంక్రాంతి) ఉంది. సంక్రాంతి–సినిమా అనేది ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ . సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అన్నది సినిమాల రిలీజ్కి, సెలబ్రేషన్స్ కి చాలా మంచి సమయం. కుటుంబమంతా కలిసి సందడిగా పూజలు చేసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అది నాక్కూడా చాలా ఎగ్జయిటెడ్గా ఉంటుంది. గాలిపటాలంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఎగరేయడంలో నేను చాలా బ్యాడ్ (నవ్వుతూ). అయినా, మా ఫ్రెండ్స్తో కలిసి మా ఊర్లోనూ, హైదరాబాద్లోనూ ఎగరేసేందుకు ప్రయత్నిస్తుంటాను. హైదరాబాద్లో ప్రతి ఏటా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గాలిపటాలు ఎగరేయడం అన్నది కూడా ఒక ఆటే. సంక్రాంతి టు సంక్రాంతి2024 నాకు చాలా సంతోషంగా, గ్రేట్ఫుల్గా గడిచింది. గత ఏడాది మంచి సినిమాలు, మంచి కథలు, పాత్రలు, మంచి టీమ్తో పని చేయడంతో నా కల నిజం అయినట్లు అనిపించింది. 2025 కూడా అలాగే ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నాను. చూస్తుంటే సంక్రాంతి టు సంక్రాంతి వరకు ఓ సర్కిల్లా అనిపిస్తోంది. నా జీవితం లో కూడా సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకంటే గత ఏడాది నేను నటించిన ‘గుంటూరు కారం’ వచ్చింది.. ఈ ఏడాది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలవుతోంది! అందుకే చాలా సంతోషంగా... ఎగ్జయిటింగ్గా ఉంది.ముగ్గుల లోకంలోకి– దివి వాఢత్యాదివి పదహారు అణాల తెలుగు అమ్మాయి. ఎం.టెక్ అమ్మాయి దివి మోడలింగ్లోకి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. ‘బిగ్బాస్4’తో లైమ్లైట్లోకి వచ్చింది. హీరోయిన్గా చేసినా, పెద్ద సినిమాలో చిన్న పాత్ర వేసినా తనదైన మార్కును సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలలో మెరిసినా, నాన్–గ్లామరస్ పాత్రలలో కనిపించినాతనదైన గ్రామర్ ఎక్కడీకి పోదు! మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లుగానే... మహా పండగ సంక్రాంతి కోసం ఎదురు చూడడం దివికి ఇష్టం. సంక్రాంతి వస్తే చాలు... ఆమెకు రెక్కలు వస్తాయి. సరాసరి వెళ్లి విజయవాడలో వాలిపోతుంది. పండగ సంతోషాన్ని సొంతం చేసుకుంటుంది. భోగిమంటల వెలుగు నుంచి గగనసీమలో గాలిపటాల వయ్యారాల వరకు దివి చెప్పే సంక్రాంతి కబుర్లు...మాది హైదరాబాదే అయినా, నేను పుట్టింది విజయవాడలో. ఊహ తెలిసినప్పటి నుంచి సంక్రాంతి వచ్చిందంటే చాలు, విజయవాడలోని మా అమ్మమ్మగారి ఇంట్లో వాలిపోతా. వారం ముందు నుంచే మా ఇంట్లో పండుగ సందడి మొదలయ్యేది. మా మామయ్యలు, పిన్నులు, చుట్టాలందరితో కలసి గారెలు, అరిసెలు ఇలా ఇతర పిండి వంటలు చేసుకుని, ఇరుగు పొరుగు వారికి ఇచ్చుకుంటాం. పండుగ రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకునేవాళ్లం. తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేసి, ముగ్గులు పెడతాం. అమ్మమ్మ పూజ చే స్తే, మేమంతా పక్కనే కూర్చొని, దేవుడికి దండం పెట్టుకునేవాళ్లం. కానీ ఆ రోజుల్ని ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా. ఏది ఏమైనా సంక్రాంతికి కచ్చితంగా ఊరెళతాను. ఆ మూడు రోజుల పాటు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో కలసి పండుగ చేసుకోవటం నాకు చాలా ఇష్టం. సాయంత్రం స్నేహితులతో కలసి సరదాగా గాలిపటాలు ఎగరేస్తా. ఇప్పుడు నటిగా ఎదుగుతున్న సమయంలో సంక్రాంతి జరుపుకోవటం మరింత ఆనందంగా ఉంది. ఊరెళితే చాలు, అందరూ ఇంటికొచ్చి మరీ పలకరిస్తుంటారు. వారందరినీ చూసినప్పుడు నాపై నాకే తెలియని విశ్వాసం వస్తుంది. చివరగా సంక్రాంతికి ప్రత్యేకించి గోల్స్ లేవు కాని, అందరినీ సంతోషంగా ఉంచుతూ, నేను సంతోషంగా ఉంటే చాలు. ఇక నన్ను బాధించే వ్యక్తులకు, విషయాలకు చాలా దూరంగా ఉంటా. ఇంటర్వ్యూ: శిరీష చల్లపల్లిమర్చిపోలేని పండుగ– అంజలి‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో సీత ఎవరండీ? అచ్చం మన పక్కింటి అమ్మాయి. మన బంధువుల అమ్మాయి. తన సహజనటనతో ‘సీత’ పాత్రకు నిండుతనం తెచ్చిన అంజలికి... ‘మాది రాజోలండీ’ అని చెప్పుకోవడం అంటే ఇష్టం. మూలాలు మరవని వారికి జ్ఞాపకాల కొరత ఉంటుందా! కోనసీమ పల్లె ఒడిలో పెరిగిన అంజలి జ్ఞాపకాల దారిలో వెళుతుంటే....మనం కూడా ఆ దారిలో వెళుతున్నట్లుగానే, పల్లె సంక్రాంతిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంటుంది! ఒకటా ... రెండా... పండగకు సంబంధించిన ఎన్నో విషయాలను నాన్స్టాప్గా చెబుతుంది. అంజలి చెప్పే కోనసీమ సంక్రాంతి ముచ్చట్లు తెలుసుకుందాం...చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే తెలుగమ్మాయిలందరికీ నటి అంజలి ఓ స్ఫూర్తి. మనందరి అమ్మాయి.. తెలుగమ్మాయి.. ఈ పెద్ద పండుగను ఎలా జరుపుకుంటుందంటే...కోనసీమజిల్లా రాజోలు మా ఊరు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.. అందరికీ వారం ముందు నుంచి పండుగ మొదలయితే, మాకు నెల ముందు నుంచే ఇంకా చెప్పాలంటే పండుగయిన తర్వాతి రోజే.. వచ్చే సంక్రాంతి కోసం ఏర్పాట్లు చేస్తుంటాం. మా తాతయ్య సుబ్బారావుగారు పండుగలంటే అందరూ కలసి చేసుకోవాలని చెప్పేవారు. అందుకే, చిన్నప్పటి నుంచే నాకు అదే అలవాటు. మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందరూ వస్తే ఇల్లు మొత్తం నిండిపోయేది. అయినా సరే, ఏ పండుగైనా అందరం కలసే జరుపుకుంటాం. ఇంట్లోనూ పొలాల్లోనూ ఘనంగా పూజలు నిర్వహిస్తాం. చిన్నప్పుడు కజిన్స్ అందరం కలసి ఉదయాన్నే భోగి మంటలు వేయటానికి, అందులో ఏమేం వేయాలో అనే విషయాల గురించి వారం ముందు నుంచే మాట్లాడుకునేవాళ్లం. తాతయ్య పిండివంటలన్నీ చేయించేవారు. అందుకే, ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూసేదాన్ని. కాని, సిటీకి వచ్చాక అంత ఎంజాయ్మెంట్ లేదు. చిన్నతనంలో మా పెద్దవాళ్లు ముగ్గు వేస్తే, మేము రంగులు వేసి, ఈ ముగ్గు వేసింది మేమే అని గర్వంగా చెప్పుకుని తిరిగేవాళ్లం. అందుకే, ముగ్గుల పోటీల్లో నేనెప్పుడూ పాల్గొనలేదు. గాలిపటాన్ని కూడా ఎవరైనా పైకి ఎగరేసిన తర్వాత ఆ దారాన్ని తీసుకుని నేనే ఎగరేశా అని చెప్పుకుంటా. అందుకే, సంక్రాంతి నాకు మరచిపోలేని పండుగ.నిండుగా పొంగితే అంతటా సమృద్ధిసంక్రాంతి పండగ అనగానే తెల్లవారకుండానే పెద్దలు పిల్లల్ని నిద్రలేపడం, చలికి వణుకుతూ ముసుగుతన్ని మళ్లీ పడుకోవడం ఇప్పటికీ గుర్తు వస్తుంటుంది. సందడంతా ఆడపిల్లలదే. ముగ్గులు వేయడం, వాటిల్లో గొబ్బెమ్మలు పెట్టి, నవధాన్యాలు, రేగుపళ్లు వేసేవాళ్లం. ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఆవు పిడకల మీద మట్టి గురిగలు పెట్టి, పాలు పొంగించేవాళ్లం. ఎటువైపు పాలు పొంగితే అటువేపు సస్యశ్యామలం అవుతుందని నమ్మకం. నిండుగా పొంగితే అంతటా సమృద్ధి. మిగిలిన గురుగుల్లోని ప్రసాదాన్ని అలాగే తీసుకెళ్లి లోపలి గదుల్లో మూలకు పెట్టేవారు ఎలుకల కోసం. సాధారణ రోజుల్లో ఎలుకలు గింజలు, బట్టలు కొట్టేస్తున్నాయని వాటిని తరిమేవారు. అలాంటిది సంక్రాంతికి మాత్రం, బయట పక్షులతోపాటు ఇంట్లో ఎలుకలకు కూడా ఇలా ఆహారం పెట్టేవాళ్లు. ముగ్గులు పెట్టడంలో ఇప్పడూ పోటీపడే అమ్మాయిలను చూస్తున్నాను. మేం ఉండేది వనపర్తిలో. అప్పటి మాదిరిగానే ఇప్పడూ జరుపుకుంటున్నాం. – పోల్కంపల్లి శాంతాదేవి, రచయిత్రి -
‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగాఫ్యాన్స్ మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్(Ram Charan) సోలో హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ షో బొమ్మ పడిపోయింది. తెలంగాణలో శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి షోస్ పడనున్నాయి. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.గేమ్ ఛేంజర్ కథేంటి? ఎలా ఉంది? శంకర్, చరణ్ ఖాతాలో భారీ హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.గేమ్ ఛేంజర్ సినిమాకు ఎక్స్లో మిక్స్డ్ టాక్ వస్తుంది. సినిమా బాగుందని కొందరు.. ఆశించిన స్థాయిలో సినిమాలేదని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. చరణ్ నటన అదిరిపోయింది కానీ.. శంకర్ మేకింగ్ బాగోలేదని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. పాటలు అయితే తెరపై చూస్తే అద్భుతంగా ఉన్నాయట. రా మచ్చా మచ్చా పాట అదిరిపోయిందంటూ చాలా మంచి నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #GameChanger Strictly Average 1st Half! Follows a predictable commercial pattern so far. A few IAS blocks have came out well along with an interesting interval block. The love story bores and the comedy is over the top and ineffective. Ram Charan is doing well and Thaman’s bgm…— Venky Reviews (@venkyreviews) January 9, 2025ఊహించదగిన కమర్షియల్ ఎలిమెంట్స్తో ఫస్టాఫ్ యావరేజ్గా ఉంది.కొన్ని ఐఏఎస్ బ్లాక్లు బాగా వచ్చాయి, అలాగే ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్లాక్ కూడా వచ్చింది. ప్రేమకథ బోరింగ్గా ఉంది. కామెడీ కూడా అతిగా ఉంది మరియు అసమర్థంగా ఉంది. రామ్ చరణ్ బాగా చేస్తున్నాడు. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. సెకండాఫ్ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#GameChanger#RamCharan𓃵 #GameChangerReviewGood 1st halfAa dhop song kuni scenes teseste inka bagunu Interval scene 🔥🔥Thaman Bgm🔥🎇🎇Raa Macha Macha song🥵🔥🔥🔥#ShankarShanmugham #KiaraAdvani #Thaman https://t.co/l8Gg6IgdfK— Lucky⚡️ (@luckyy2509) January 9, 2025 ఫస్టాఫ్ బాగుంది. దోప్ సాంగ్ ఇంకాస్త బాగా తీయాల్సిది. ఇంటర్వెల్ సీన్అదిరిపోయింది. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. రా మచ్చా మచ్చా సాంగ్ అద్భుతం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#GameChanger First Half Review:Shankar's vintage taking shines as he delivers a gripping first half packed with grandeur, emotional highs, and slick action. Ram Charan impresses with his powerful performance, while Thaman's BGM and song picturization elevate the experience. A…— Censor Reports (@CensorReports) January 9, 2025 ఫస్టాఫ్ అదిరిపోయింది. అద్భుతమైన సన్నివేశాలు, భావోద్వేగాలు, యాక్షన్తో శంకర్ మరోసారి తన టేకింగ్ పవర్ని చూపించాడు. రామ్ చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. తమన్ బీజీఎం అదిరిపోయిది. సెకండాఫ్పై హైప్ పెంచేలా ఇంటర్వెల్ సీన్ ఉందని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.Appanna Emotional shot!❤️💥👌#Anjali shared about the same scene & Said that #RamCharan will win National Award for sure🔥🔥#UnstoppableWithNBKS4#UnstoppableWithNBK#GameChanger#GameChanagerpic.twitter.com/a8AjdNpEya— Vishnu Writess (@VWritessss) January 8, 2025#GameChangerReview1st Half - ⭐⭐⭐Entry SongsBuildupthat Traffic Dance 😭🤮Love scenesFlat Screenplay Interval okay #RamCharan is Good#SSThaman Rocked it 💥💥#Shankar Proved he is not back 😭 #GameChanger #KiaraAdvaniHope 2nd Half Will Blast 🤞🏻🤞🏻... pic.twitter.com/oDstZwzvo0— Movie_Gossips (@M_G__369) January 9, 2025Gamechanger 1st half review Poor pacing👎🏻Boring love track 😴Decent performance from RC👍🏻RC looks 🫠Only hope is 2nd half 🙌BGM okaish 👍#GameChangerReview— ✌🏼 (@UGotLazered) January 9, 2025#GameChanger #GameChangerReview ⭐⭐⭐⭐ 4/5!!So far, fun mass, masala, entertainment. Awesome. That’s @shankarshanmugh for us 👌🏼👌🏼👌🏼🔥🔥❤️❤️❤️. What a technical brilliance 👏🏼👏🏼👏🏼 #RamCharan𓃵 #KiaraAdvani #Sankar #kiaraadvanihot #RamCharan #disastergamechanger… pic.twitter.com/NI0hDd9aDO— the it's Cinema (@theitscinemaa) January 9, 2025Appanna Characterization decent but routine n predictable with stammering role Once appanna died, same lag continues ..Very good climax is needed now #GameChanger #GameChangerReview https://t.co/UEpuZ74o1t— German Devara⚓️🌊 (@HemanthTweets39) January 9, 2025#GameChanger Tamil version!Good first half🔥👍Dialogues are good can feel the aura of @karthiksubbaraj in the build up of the story!Already better than @shankarshanmugh ‘s last three movies, Charan and SJS good.@MusicThaman 🔥#Gamechangerreview— Water Bottle🇵🇹 (@waterbotttle_07) January 9, 2025#GameChanger First Half:A Good First Half Thats Filled With Visual Extravaganza. Interval Ends With A Bang & A Great Twist That Keeps You Anticipated For The Second Half. Ram Charan At His Absolute Best In Dual Roles, You Can Witness The Efforts He Has Put In With Each Scene 👏 pic.twitter.com/Q3jrXfWykB— CineCritique (@CineCritique_) January 9, 2025#GameChanger#GameChangerReview First Half:Very Entertaining, fast paced screenplay by @shankarshanmugh sir. Superb first half. #SJSuryah and #RamCharan𓃵mass acting 🔥🔥🔥@MusicThaman Music is top work and #Dhop song is Hollywood level making #BlockbusterGameChanger— Mr.Professor (@EpicViralHub_) January 10, 2025SPOILER ALERT !! ⚠️⚠️IPS, IASInterval bang kosam CMMalli ventane IASImmediate ga Chief Electoral OfficerMalli climax bang kosam CMNeeku ishtam ochinattu thippav atu itu @shankarshanmugh 🤦🏻#GameChanger— . (@UrsPG) January 10, 2025Shankar’s corruption theme is outdated and he should choose a different script. Else its a Game Over for him.#GameChanger— CB (@cinema_babu) January 10, 2025భారతీయుడు శంకర్ చివరికి ఎన్. శంకర్ అయిపోతాడు అనుకోలేదు 🙏Outdated & Cringe #GameChanger— 🅰️⛓️ (@UaReports689gm1) January 10, 2025#RamCharan #GameChanger•More of a message-driven movie.•Set against a political backdrop.•Unbelievable solutions in the narrative.•Commercial elements are relatively less.•Every actor excelled in their roles, which is a very, very big plus for the movie!— USAnINDIA (@USAnINDIA) January 10, 2025 -
‘గేమ్ ఛేంజర్’ మూవీ HD స్టిల్స్
-
గేమ్ చేంజర్ ప్రత్యేకం: అంజలి
‘‘గేమ్ చేంజర్’ చిత్రంలో నాపాత్ర పేరుపార్వతి. మా అమ్మ పేరు కూడాపార్వతి. శంకర్గారు ఈ చిత్ర కథ, నాపాత్ర గురించి చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకొచ్చారు. శంకర్గారు నా నటన చూసి చాలా చోట్ల మెచ్చుకున్నారు. నా కెరీర్లో ‘గేమ్ చేంజర్’ సినిమా, నాపాత్ర చాలా ప్రత్యేకం’’ అని అంజలి చెప్పారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అంజలి విలేకరులతో పంచుకున్న విశేషాలు... ⇒ నేను నటించిన ‘గేమ్ చేంజర్’(తెలుగు), ‘మదగజరాజ’(తమిళ్) సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలవుతుండటంతో హ్యాపీగా ఉంది. ఈ రెండు చిత్రాలకు మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉంది. ‘గేమ్ చేంజర్’లో నేను చే సినపార్వతిపాత్ర ఆడియన్స్ కి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నా కెరీర్లో ఇదే బెస్ట్ క్యారెక్టర్. ఈపాత్రతో నాకు జాతీయ అవార్డు వస్తుందని అంటున్నారు. కథ విన్నప్పుడు నాకూ అలానే అనిపించింది. అదే నిజమైతే అంతకంటే గొప్ప సక్సెస్ ఇంకేం ఉంటుంది.⇒ఈ మూవీలో రామ్చరణ్ చేసిన అప్పన్న, నేను చేసినపార్వతిల ప్రేమ, వారి బంధం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. చరణ్ సెట్స్లో అందరితోనూ బాగా మాట్లాడతారు. ‘దిల్’ రాజుగారి బ్యానర్లో మూడో సినిమా, శంకర్గారి దర్శకత్వంలో తొలి సినిమా, రామ్ చరణ్గారితో మొదటి సినిమా.. ఇలా అన్ని రకాలుగా ఈ చిత్రం నాకు ప్రత్యేకం. శంకర్, మణిరత్నంగార్ల చిత్రాల్లో నటించాలని అందరికీ ఉంటుంది. శంకర్గారి చిత్రంలో ఛాన్స్ రావడం నా అదృష్టం. ‘గేమ్ చేంజర్’ చూసిన చిరంజీవిగారు.. నాపాత్రను మెచ్చుకోవడమే పెద్ద అవార్డులా అనిపిస్తోంది. తమన్ సంగీతానికి మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. -
‘గేమ్ ఛేంజర్’ HD మూవీ స్టిల్స్
-
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
తెలుగు బ్యూటీ అంజలి స్టన్నింగ్ లుక్స్ (ఫొటోలు)
-
చీరలో సన్నజాజితీగలా అంజలి, క్యూట్ పప్పీతో హ్యపీగా (ఫోటోలు)
-
అంజలికి రజతం
టిరానా (అల్బేనియా): ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా రెజ్లర్ అంజలి (59 కేజీలు) రజత పతకం కైవసం చేసుకుంది. 55 కేజీల పురుషుల విభాగంలో చిరాగ్ ఫైనల్కు దూసుకెళ్లి మరో పతకం ఖాయం చేశాడు. 55 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో రామచంద్ర మోర్, మహిళల 68 కేజీల విభాగంలో మోనిక కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఆదివారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరడంతో పాటు మరో పతకం ఖాయం కాగా... అంతకు ముందు శుక్రవారం మన రెజ్లర్లు రెండు కాంస్యాలు గెలుచుకున్నారు. దీంతో ఓవరాల్గా భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. మహిళల 59 కేజీల సెమీఫైనల్లో అరోరా రుసో (ఇటలీ)పై విజయం సాధించిన అంజలి... తుది పోరులో ఉక్రెయిన్ రెజ్లర్ సొలోమియా చేతిలో ఓడింది. పురుషుల 55 కేజీల ఫైనల్లో అడిమాలిక్ కరాచోవ్ (కిర్గిస్తాన్)తో చిరాగ్ తలపడనున్నాడు. 18 ఏళ్ల చిరాగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–0తో ఒజావా గుకుటో (జపాన్)పై గెలిచాడు. క్వార్టర్స్లో లుబుస్ లబాటిరోవ్పై సెమీఫైనల్లో అలాన్ ఒరల్బేక్ (కజకిస్తాన్)పై గెలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. అభిషేక్ (61 కేజీలు), సుజీత్ (70 కేజీలు) కాంస్య పతకాల కోసం పోటీ పడనున్నారు. -
సంక్రాంతి బరిలో..?
‘గేమ్ చేంజర్’ సినిమా సంక్రాంతికి విడుదల కానుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. తండ్రీకొడుకులుగా రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేసిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ పతాకాలపై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అంజలి, ఎస్జే సూర్య, సునీల్, జయరాం, ప్రియదర్శి, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ‘గేమ్ చేంజర్’ సినిమాను క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబరులో విడుదల చేయనున్నట్లుగా ఇటీవల ‘దిల్’ రాజు పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. మరి... ‘గేమ్ చేంజర్’ వాయిదా పడిందా? ఒకవేళ పడితే వచ్చే సంక్రాంతి బరిలో నిలుస్తుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
ఈ దుఃఖం తీర్చేదెవరు?
(గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి) : ‘హైడ్రా’తో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపై తొలుత హర్షం వ్యక్తమైంది. కానీ ఆ తర్వాత హైడ్రా వ్యవహరిస్తున్న తీరు మా త్రం కుటుంబాల్లో కన్నీళ్లు నింపేలా ఉందంటూ బాధితులు మండిపడుతున్నారు. ఇళ్లలోనో, దుకాణాల్లోనో, షెడ్లలోనో నివ సిస్తున్న.. వ్యాపారాలు చేసుకుంటున్న వారికి కనీస సమాచారం ఇవ్వకుండా, ఇచ్చినా ఖాళీ చేసేందుకు సమ యం ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమదుఃఖం తీర్చేదెవరని.. తమకు జరిగిన నష్టాన్ని పూడ్చేదెవరంటూ కన్నీళ్లుపెడుతున్నారు. చాలా వరకు పేదలు, మధ్యతరగతివారే.. ఇళ్లు కట్టుకున్నవారే కాదు.. స్థలాలు, నిర్మాణాలను లీజుకు తీసుకుని వ్యాపారాలు పెట్టుకున్నవారూ హైడ్రా కూల్చివేతల్లో తీవ్రంగా నష్టపోయారు. ఎక్కడెక్కడి నుంచో బతుకుదెరువు కోసం వచ్చి.. కడుపు కట్టుకుని సంపాదించుకుంటున్న తమ బతుకులు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న షెడ్లను, భవనాలను ఉన్నట్టుండి కూల్చడంతో.. తీవ్రంగా నష్టపోయామని, ఇక తమ బతుకులు కోలుకునే అవకాశమే కనిపించడం లేదని కన్నీళ్లు పెడుతున్నారు. ఈ నెల 8న సున్నంచెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలోని ఒక గోడౌన్, మూడు భవనాలు, 20 గుడిసెలను అధికారులు కూల్చివేశారు. అందులో ఒక గుడిసెలో నివాసం ఉంటున్న బలహీనవర్గాలకు చెందిన ఎన్.నర్సింహ, అంజలి దంపతులు ఇరవయ్యేళ్ల క్రితం మాదాపూర్కు వలస వచ్చారు. స్థానిక నేతల సూచనతో అక్కడ గుడిసె వేసుకొని కూలిపనులు చేసుకుంటూ బతుకుతున్నారు. వారి కుమారుడు సాయిచరణ్ (17) కేన్సర్ వ్యాధితో బాధపడుతూ రెండు నెలల క్రితమే మృతిచెందాడు. ఆ దుఃఖం నుంచి కోలుకోకముందే వారి గుడిసె నేలమట్టమైంది. తలదాచుకునేందుకు నర్సింహ సోదరి ఇంటికి వెళ్లారు. కానీ అటు కుమారుడిని, ఇటు గూడును కోల్పోయిన ఆవేదనతో.. అంజలి ఈనెల 21న ఛాతీనొప్పికి గురైంది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి ఆమె మృతి చెందింది. పాత జ్ఞాపకాలను వెతుక్కుంటూ కూల్చిన గుడిసె వద్దకు వచ్చిన నర్సింహ.. కొడుకు, భార్య ఇద్దరూ మరణించాక, తాను ఎవరి కోసం బతకాలో అర్థం కావడం లేదని వెక్కివెక్కి ఏడ్చారు. రోడ్డున పడ్డ బతుకులు.. కూకట్పల్లికి చెందిన విజయ్ప్రతాప్గౌడ్ది మరో కన్నీటి వ్యథ. కేటరింగ్ చేసే ఆయన వద్ద 68 మంది పనిచేస్తున్నారు. వారందరికీ అదే జీవనాధారం. విజయ్ప్రతాప్ భూమిని లీజుకు తీసుకొని, రూ.40 లక్షల వ్యయంతో షెడ్లు, సామగ్రి ఏర్పాటు చేసుకున్నారు. నల్లచెరువులో హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఆయన షెడ్లనూ కూల్చేశారు. కనీసం కేటరింగ్ సామగ్రి బయటికి తీసుకువెళ్లే అవకాశం ఇవ్వలేదని ఆయన వాపోయారు. తనతోపాటు పనిచేసేవారంతా ఉపాధి లేక రోడ్డునపడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. కొంత గడువైనా ఇవ్వాల్సింది సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలతో తీవ్రంగా నష్టపోయానని మరో బాధితుడు పునారాం పేర్కొన్నారు. అక్కడ లక్షలు ఖర్చుపెట్టి గోడౌన్ నిర్మాణం చేపట్టానని, శానిటరీ సామాగ్రి కొంత అందులోనే ఉండిపోయిందని వాపోయారు. కొన్నిరోజులు గడువు ఇచ్చి ఉంటే సామగ్రిని పూర్తిగా తరలించే అవకాశం ఉండేదన్నారు. గోడౌన్, సామగ్రి కలిపి రూ.50 లక్షలకుపైగా నష్టపోయి.. రోడ్డునపడ్డానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భవతి అన్నా కనికరించలేదు! కూకట్పల్లిలో రవి జిరాక్స్, ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించిన దుకాణం నిర్వహిస్తున్నాడు. హైడ్రా ఒక్కసారిగా కూల్చివేతలు చేపట్టడంతో తీవ్రంగా నష్టపోయానని వాపోయాడు. తన భార్య గర్భవతి అని, సామగ్రి తీసుకునేందుకు కాస్త గడువు ఇవ్వాలని కోరినా అధికారులు కనికరించలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను, మరికొందరు కలసి నాలుగు రోజులు కష్టపడి కొంత సామగ్రిని బయటికి తీసినా.. అది చాలా వరకు పాడైపోయిందని వాపోయారు. తనతో పాటు మరెందరో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. -
అందాల తారలు, గారాల బెస్ట్ ఫెండ్స్ (ఫొటోలు)
-
ఆయన అడిగిన ప్రశ్న ఎంతో బాధించింది: నటి అంజలి అమీర్
మలయాళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ మారిన హేమ కమిటీ రిపోర్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మాలివుడ్లో మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ నుంచి పలు సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు హీరోయిన్లు, ఇతర నటులు గతంలో తమ చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా మలయాళ తొలి ట్రాన్స్జెండర్ నటి అంజలి అమీర్ తన అనుభవాలను పంచుకున్నారు.మలయాళ నటుడు నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అంజలి అమీర్ ఇలా పంచుకున్నారు. ' 2018లో మమ్ముట్టి నటించిన పెరున్బు అనే తమిళ సినిమాలో నేను కీలక పాత్ర పోషించాను. ఆ సినిమాలో సూరజ్ వెంజరమూడ్ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన నుంచి నాకు ఒక ప్రశ్న ఎదురైంది. లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు స్త్రీలలాగా ఎలా సుఖం పొందుతారని సూరజ్ వెంజరమూడ్ నన్ను ప్రశ్నంచారు. అప్పుడు నేను చాలా కలత చెందాను. ఆయన అడిగేంత వరకు, నేను అలాంటి బాధాకరమైన అనుభవాలను ఎప్పుడూ ఎదుర్కోలేదు. నేను బలంగా ఉన్నాను, కానీ ఈ ప్రశ్న నాకు చాలా కోపం తెప్పించింది. అతడిని హెచ్చరించి మమ్ముట్టికి, దర్శకుడికి తెలియజేశాను. ఆపై వెంటనే సూరజ్ వెంజరమూడ్ క్షమాపణలు చెప్పాడు. మరలా నాతో అలా మాట్లాడలేదు. నేను ఆయన్ను అభినందిస్తున్నాను.' అని అంజలి అమీర్ అన్నారు. సూరజ్ వెంజరమూడ్ టాలీవుడ్కు పరిచయమే.. డ్రైవింగ్ లైసెన్స్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, జనగణమన చిత్రాలతో పాటు నాగేంద్రన్స్ హానీమూన్స్ వెబ్ సిరీస్తో ఆయన తెలుగు వారికి దగ్గరయ్యాడు.ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఇతరుల పట్ల గౌరవంగా ఉంటారని అంజలి పేర్కొంది. అన్ని విభాగాల్లో మాదిరి ఇక్కడ కూడా మంచివాళ్లతో పాటు చెడువాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ కొందరు మాత్రమే కాంప్రమైజ్లు, ఫేవర్లు అడిగేవాళ్లు ఉన్నారని అంజలి పేర్కొంది. -
రాజాసాబ్ బ్యూటీ బర్త్డే.. చీరకట్టులో ఊర్వశి..
రాజాసాబ్ సెట్లో నిధి అగర్వాల్ బర్త్డే సెలబ్రేషన్స్ ఫ్యామిలీతో హీరో శ్రీవిష్ణు శ్రీలీల ఫన్నీ వీడియోప్రభాస్ కొత్త సినిమా హీరోయిన్ ఇమాన్విప్రియాంక జైన్ వరలక్ష్మి వ్రతంనిండైన చీరకట్టులో ఊర్వశి రౌతేలా View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Sree Vishnu (@sreevishnu29) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Imanvi (@iman1013) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Nidhi Agarwal (@nidhiagarwal_) -
సైజ్ జీరోలో సంయుక్త .. గ్లామర్ డోస్ పెంచేసిన జగతి మేడమ్
జిమ్లో 108రోజుల వర్కౌట్తో సైజ్ జీరోకు చేరుకున్న సంయుక్త మీనన్ స్టైలిష్, క్లాస్గా మెరిసిపోతున్న హన్సిక గ్లామర్ డోస్ పెంచేసిన 'గుప్పెడంత మనసు' జగతి మేడమ్ View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
50 సినిమాల తర్వాత.. మారిపోయిన అంజలి కెరీర్..
-
బోల్డ్ సీన్స్ చేశాక భావోద్వేగానికి గురయ్యాను: అంజలి
హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ బహిష్కరణ. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రా అండ్ రస్టిక్ డ్రామాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఇందులో అంజలి పుష్ప అనే వేశ్య పాత్రలో నటించింది. ఈ పాత్రకు వస్తోన్న రెస్పాన్స్పై అంజలి స్పందిస్తూ.. ‘‘‘బహిష్కరణ’ సిరీస్లో పుష్ప పాత్రకు మంచి స్పందన వస్తోంది. రా అండ్ రస్టిక్ రోల్లో నటించటాన్ని ఎంజాయ్ చేశాను. ఎందుకంటే పుష్ప పాత్రలో చాలా డెప్త్ ఉంది. ఆమె పాత్రలో భావోద్వేగాలను చాలా శక్తివంతంగా చూపించారు’’ అంది.ఎమోషనల అయ్యా..పాత్రకు తగ్గట్లు కొన్ని బోల్డ్ సీన్స్లో అంజలి నటించింది. దాని గురించి మాట్లాడుతూ ప్రారంభంలో బోల్డ్ సీన్స్లో నటించటం కాస్త ఇబ్బందిగా అనిపించింది. బోల్డ్ సీన్లో నటించిన తర్వాత ఓసారైతే చాలా ఎమోషనల్ అయ్యాను. అందుకు కారణం, అలాంటి సన్నివేశంలో తొలిసారి నేను నటించటమే కారణం. బోల్డ్ సీన్లో నటించేందుకు ముందుగా సన్నద్ధం కాకపోయినా ఛాలెంజింగ్గా తీసుకుని నటించాను. ఈ పాత్ర నాకు కొత్తే అయినా దాన్ని ఎలా చేయాలనే దానిపై నాకు అవగాహన ఉంది. జాగ్రత్త తీసుకున్నారునేను ఆ బోల్డ్ సీన్స్లో నటించేటప్పుడు సెట్స్లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. దర్శకుడు ఆ విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. అందువల్ల నేను కంఫర్ట్గా నటించగలిగాను అని తెలిపింది. బహిష్కరణ సిరీస్ విషయానికి వస్తే.. రిలీజైన మూడు రోజుల్లోనే 35 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ను రాబట్టుకుంది. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ను ప్రశాంతి మలిశెట్టి రూపొందించారు. చదవండి: 70కి పైగా ఆడిషన్స్.. కాంప్రమైజ్ అడగడంతో ఏడ్చేశా: హీరోయిన్ -
అలాంటి సన్నివేశాల్లో నటించడం కష్టం
జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. ఆ విషయాన్ని పక్కన పెడితే నటి అంజలి చేసే పాత్రలన్నీ కచ్చితంగా వైవిధ్యంగా ఉంటున్నాయి. ఈమె కథానాయకిగా నటించినా, ఐటమ్ సాంగ్లో నటించినా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. తమిళంలో కట్రదు తమిళ్, అంగాడి తెరు, అరవాన్, ఇరైవి, తరమణి వంటి చిత్రాల్లో అంజలి నటనే ఇందుకు నిదర్శనం. అలాగే తెలుగులోనూ గీతాంజలి, సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు వంటి చిత్రాలు అంజలిలోని నటనకు అద్దం పట్టాయి. కాగా ఈమె తాజాగా నటించిన ఏళు కడల్ ఏళు మలై త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అవార్డులు, ప్రశంసలను అందుకుంది. అలాగే తెలుగులో శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్చరణ్కు జంటగా నటించారు. కాగా అంజలి తెలుగులో నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. ఇందులో ఈమె బెడ్రూమ్ సన్నివేశాల్లో, సహా నటుడితో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం చర్చనీయాంశంగా మారింది. దీని గురించి అంజలి ఒక భేటీలో పేర్కొంటూ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం కష్టతరం అన్నారు. చిత్రం యూనిట్లో పలువురు మగవారి మధ్య అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందని, ఆ పరిస్థితుల్లో నటించడం కష్టం అని అంజలి పేర్కొన్నారు. -
'ఇంటిమేట్ సీన్స్'.. అందరినీ పంపించాకే తీశారు: అంజలి
ఇటీవల విశ్వక్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మెప్పించిన టాలీవుడ్ నటి అంజలి. ఇందులో వేశ్య పాత్రలో కనిపించి ఫ్యాన్స్ను అలరించింది. మరోసారి అలాంటి డిఫరెంట్ పాత్రతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా అంజలి కీ రోల్ పోషించిన వెబ్ సిరీస్ బహిష్కరణ. ఇందులో ఆమె వేశ్య పాత్రలోనే కనిపించారు. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అంజలి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సిరీస్లో ఇంటిమేట్ సీన్స్ చేయడంపై ఆమె స్పందించింది.అంజలి మాట్లాడతూ.. 'నా కెరీర్ ప్రారంభంలో మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్ట్లనే ఎంచుకుంటా. కొన్ని సినిమాల కోసం ఏకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. యాక్షన్ సీన్స్ కూడా డూప్ లేకుండా చేస్తా. నవరస అనే వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు కాస్ట్యూమ్ కారణంగా కొన్ని గంటలపాటు వాష్రూమ్కు కూడా వెళ్లలేదు. అయితే ఈ సిరీస్లో ఇంటిమేట్ సీన్స్లో నటించడంతో కాస్తా గందరగోళానికి గురయ్యా. ఆయితే ఆ సీన్స్ చేసేటప్పుడు అందరినీ బయటకు పంపి షూట్ చేశారు. నేను ఇప్పటివరకు ఇలాంటివి చేయలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నా పాత్రకు అనుకున్నదానికంటే మంచి స్పందన వచ్చింది.' అని తెలిపింది.అంతే కాకుండా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై కూడా రియాక్ట్ అయింది. నా గురించి ఎవరైనా తప్పుగా రాసినప్పుడు బాధపడతానని వెల్లడించింది. అలా వస్తున్నాయని చెప్పి.. నేను పెళ్లి చేసుకోలేను కదా? అని నవ్వుతూ సమాధామిచ్చింది. తనకు సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానంటోంది అంజలి. -
బుల్లితెర నటి అంజలి కూతురు చందమామ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
వేశ్య పాత్రలో టాలీవుడ్ హీరోయిన్.. అంచనాలు పెంచేసిన ట్రైలర్!
టాలీవుడ్ భామ అంజలి ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో అభిమానులను అలరించింది. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్తో ఫ్యాన్స్ను పలకరించేందుకు వస్తోంది. అంజలి లీడ్ రోల్లో వస్తోన్న వెబ్ సిరీస్ బహిష్కరణ. ముకేశ్ ప్రజాపతి దర్శకత్వంలో రూపొందించిన ఈ సిరీస్ను జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్లపై ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు.విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో వస్తోన్న సిరీస్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. 'మంచోడు చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా..? చెడ్డోడి చరిత్ర తెలుసుకోవడమే..' అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ సిరీస్లో అంజలి వేశ్యపాత్రలో కనిపించనుంది. దీంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్లో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఈనెల 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. Thrilled to Launch the trailer for #BahishkaranaOnZee5! Always was impressed with the director @iamprajapathi with his work in BiggBoss and now this!!Anjali looking good bringing strength and depth to her character Pushpa!!https://t.co/ewhjAwzSFD@yoursanjali @ZEE5Telugu…— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 10, 2024 -
'కల్కి' బ్యూటీ జీరో సైజ్ గ్లామర్.. బికినీలో పాయల్ డ్యాన్స్!
చుడీదార్లో హీరోయిన్ అంజలి నవ్వుల హరివిల్లుటూ పీస్ బికినీలో డ్యాన్స్ ఇరగదీసిన పాయల్ రాజ్పుత్టెంపరేచర్ పెంచేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ పాలక్ తివారీసన్నజాజి నడుముతో కాక రేపేస్తున్న దిశా పటానీ.. 'కల్కి' స్టిల్స్పొట్టి జీన్ నిక్కర్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చేస్తున్న శివాత్మికతమ్ముడితో కలిసి క్యూట్ పోజులిచ్చిన యాంకర్ శ్రీముఖిక్లోజప్ పిక్స్తో మరింత అందంగా ఆండ్రియా జెర్మియా View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by neha sargam (@nehasargam) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rathika Ravinder (@rathikaravinder) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by PayalS Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) -
16 అడుగుల ఎత్తు నుంచి దూకిన అంజలి!
ఏపాత్రలో అయినా ఒదిగిపోయే అతి కొద్దిమంది నటీమణుల్లో అంజలి ఒకరు అని చెప్పవచ్చు. ఈ పదహారణాల తెలుగుఅమ్మాయి ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడిని మార్చి తెలుగులో నటిగా పరిచయమైనా, తమిళంలో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత తెలుగులోనూ మంచి మంచి పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అంజలి పేరు చెపితే తమిళం, తెలుగు భాషల్లో చాలా చిత్రాలే గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా తమిళంలో కట్రదు తమిళ్, అంగాడి తెరు, తెలుగులో గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు వంటి చిత్రాలు అంజలి కెరీర్లో గుర్తింపు పొందాయి. కెరీర్ ప్రారంభంలో పలు వివాదాల్లో చిక్కుకున్న అంజలి ఆ తర్వాత వాటికి దూరంగా రావడం విశేషమే. అయితే ఇప్పటికీ అవివాహితగానే కొనసాగుతున్న అంజలి కెరీర్ పరంగా అర్ధ సెంచరీని దిగ్విజయంగా టచ్ చేయడం మరో విశేషం. ఇప్పటికీ సినిమాలు, వెబ్ సీరీస్ల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. కాగా అంజలి కథానాయకిగా నటిస్తున్న 50వ చిత్రం ఈగై. అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంలో పలు ఆసక్తికరమైన సన్నివేశాలు చోటుచేసుకుంటాయని తెలిసింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఒక సన్నివేశం కోసం అంజలి 16 అడుగుల ఎత్తు నుంచి ఎలాంటి డూప్ లేకుండా కిందికి దూకినట్లు చిత్రవర్గాలు తెలిపాయి. కాగా శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ కథానాయకుడిగా నటిస్తున్న గేమ్చేంజర్ చిత్రంలో అంజలి ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. -
మరోసారి వేశ్య పాత్రలో టాలీవుడ్ హీరోయిన్.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్!
హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన నటి అంజలి. ఇటీవల విశ్వక్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో మెప్పించింది. ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది.అంజలి ప్రస్తుతం మరోసారి అలాంటి విభిన్నమైన పాత్రతో అభిమానులను పలకరించనున్నారు. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ బహిష్కరణ. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో ముఖేష్ ప్రజాపతి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్పై రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ ఈనెల 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్ గురించి అంజలి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.అంజలి మాట్లాడుతూ..'పుష్ప పాత్ర పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాత్ర చేయడంతో నాకు సంతృప్తి కలిగింది. ఒక అమాయకపు వేశ్య నుంచి సమాజంలో అసమానతలను ఎదుర్కొనే స్త్రీ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. పుష్ప అంటే ఓ మిస్టరీ అని.. ఇందులో ఆమె చేసిన ప్రయాణం, వచ్చిన మార్పుని చూడాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ సిరీస్లో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, చైతన్య సాగిరాజు, బేబీ చైత్ర కీలక పాత్రలు పోషించారు.A tale of misused power and enraged beauty.Get ready for #Bahishkarana on 19th July#BahishkaranaOnZee5 @PixelPicturesIN @Prashmalisetti @iamprajapathi @yoursanjali @AnanyaNagalla @RavindraVijay1 @prasannadop @SidharthSadasi1 pic.twitter.com/bvtplrLhgV— ZEE5 Telugu (@ZEE5Telugu) July 4, 2024 -
ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు హీరోయిన్
ఓటీటీలు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే సినిమాల్ని ఎక్కువగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోహీరోయిన్లు సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లిస్టులో వెంకటేశ్, రానా, నాగచైతన్య, అంజలి లాంటి వాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు హీరోయిన్ చేరింది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో)మల్లేశం, వకీల్ సాబ్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల.. వీటితో పాటు ప్లే బ్యాక్, శాకుంతలం, మళ్లీ పెళ్లి, తంత్ర, అన్వేషి సినిమాలు చేసింది గానీ బ్రేక్ అందుకోలేకపోయింది. ఈ ఏడాది 'తంత్ర' అనే హారర్ మూవీతో వచ్చింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో 'పొట్టేల్' అనే మూవీ ఉంది.మరోవైపు ఓటీటీలోకి కూడా అనన్య నాగళ్ల ఎంట్రీ ఇస్తోంది. 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్లో కీలక పాత్ర చేస్తోంది. అంజలి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత రెండేళ్ల నుంచి సెట్స్పై ఉన్న ఈ సిరీస్ నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. అంజలికి పుట్టినరోజు విషెస్ చెబుతూ చిన్న వీడియో రిలీజ్ చేశారు. అంజలి ఇప్పటికే ఓటీటీలో నవరస, ఫాల్, ఝాన్సీ సిరీస్ లు చేసింది. ఇకపోతే 'బహిష్కరణ' సిరీస్ ని త్వరలో సిరీస్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.(ఇదీ చదవండి: ‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి..) Happy Birthday @yoursanjaliWe cannot wait for the world to see your new avatar from #Bahishkarana#BahishkaranaOnZee5 Coming Soon!@PixelPicturesIN @Prashmalisetti @iamprajapathi @prasannadop@SidharthSadasi1 pic.twitter.com/YW4Stiidvy— ZEE5 Telugu (@ZEE5Telugu) June 16, 2024 -
అంజలి బర్త్డే స్పెషల్.. ఫ్యాన్స్ను ఫిదా చేసే ఫోటోలు చూశారా..?
-
ఓటీటీలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. అధికారిక ప్రకటన
టాలీవుడ్ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు మే 31న థియేటర్స్లోకి వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా విశ్వక్ అభిమానులకు విజిల్స్ కొట్టించే సినిమా అని కూడా చెప్పవచ్చు. తాజాగా విశ్వక్ ఫ్యాన్స్కు శుభవార్త వచ్చేసింది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.విష్వక్ సేన్, అంజలి, నేహాశెట్టి, నాజర్, పి.సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' జూన్ 14న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది.గోదావరి నేపథ్యంలో సినిమా అంటే పచ్చటి పల్లెసీమల్లో కనిపించే వాతావరణమే గుర్తొస్తుంది. అయితే, అందుకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది పగ, ప్రతీకారాలతో ఓ యువకుడి ప్రయాణాన్ని దర్శకుడు కృష్ణచైతన్య అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులు అంజలి పాత్రకు కాస్త ఎక్కువ మార్కులే పడుతాయి. విష్వక్ నటనకు ఏమాత్రం పేరు పెట్టాల్సిన పనిలేదని చెప్పవచ్చు. సినిమా విడుదలయిన వారంలోనే రూ. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో థియేటర్లో రన్ అవుతుంది. అయితే, కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మరోసారి సినిమా చూడొచ్చని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
అలాంటి వాళ్లు పనికిమాలిన పని చేసిన తప్పులేదు: బాలకృష్ణపై నటి ఫైర్
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ వివాదాస్పద ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసిపోయేలా లేదు. ఇప్పటికే ఆయన తీరును పలువురు సినీతారలు సైతం తప్పుబడుతున్నారు. ప్రముఖ సింగర్ చిన్మయి, బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా సోషల్ మీడియా వేదికగా బాలయ్యపై విమర్శలు చేశారు. హన్సల్ ఏకంగా ఈ చెత్తమనిషి ఎవరంటూ ట్విటర్లో రిప్లై ఇచ్చారు. తాజాగా మరో నటి సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ తీరుపై విరుచుకుపడింది. ఇంతకీ ఆమె ఏమన్నారో ఓ లుక్కేద్దాం.రిధి డోగ్రా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బాలకృష్ణపై పోస్ట్ చేసింది. ఆ వీడియోను షేర్ చేస్తూ విమర్శలు చేసింది. అతను ఆ మహిళను కించపరిచేలా వ్యవహరించినప్పటికీ ఆమె నవ్వుతోంది. ఎందుకంటే బాగా డబ్బు, పేరున్న మగాళ్లు పనికిమాలిన పని చేసిన ఈ ప్రపంచం తప్పుపట్టదు. ఎందుకంటే అలాంటి పురుషులు ఏం చేసినా పర్వాలేదు అనే స్థాయికి తీసుకొచ్చారు. ఒకవేళ అదే సమయంలో అంజలి కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఇప్పటికే విపరీతంగా ట్రోలింగ్కు గురయ్యేది అంటూ రిధి డోగ్రా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా వైరల్గా మారింది. -
బాలయ్య దెబ్బకు అంజలి భయపడిందా ? ట్వీట్ కు కారణం అదేనా
-
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ
టైటిల్: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, హైపర్ ఆది తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకుడు: కృష్ణ చైతన్యసంగీతం: యువన్ శంకర్ రాజాసినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి విడుదల తేది: మే 31, 2024మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రయోగాత్మకంగా చేసిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 90లో సాగుతుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్ అలియాస్ రత్న(విశ్వక్ సేన్) అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వేశ్య రత్నమాల(అంజలి) అతనికి మంచి స్నేహితురాలు. తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది. దాని వెనుక స్థానిక ఎమ్మెల్యే దొరస్వామి రాజు(గోపరాజు రమణ) ఉన్నారని తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామి కుడిభుజంలా మారతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ(నాజర్) కూతురు బుజ్జి(నేహా శెట్టి) ప్రేమలో పడి ఆమె కోసం నానాజీకి దగ్గరవుతాడు. ఇలా ఇద్దరి రాజకీయ నాయకులను వాడుకొని రత్నాకర్ ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తనను నమ్మించి మోసం చేసిన రత్నాకర్పై దొరస్వామి ఎలా పగ తీర్చుకున్నాడు? పిల్లను ఇచ్చిన మామ నానాజీని రత్నాకర్ ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత భర్తే తన తండ్రిని చంపాడని తెలిసిన తర్వాత బుజ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రత్నాకర్ ఎదుగుదలకు కారణమైన సొంత మనుషులే అతన్ని చంపేందుకు ఎందుకు కత్తి కట్టారు?(లంకలో ఎవరినైనా చంపాలని ఫిక్స్ అయితే ఆ ఊరి గుహలో ఉన్న అమ్మవారికి మొక్కి చంపాల్సిన వ్యక్తి పేరు అక్కడ రాస్తారు. దాన్నే కత్తి కట్టడం అంటారు) సొంత మనుషులే తనపై కత్తి కట్టారని తెలిసిన తర్వాత రత్నాకర్ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్ రాజకీయాల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. గోదావరి ప్రాంతానికి చెందిన ఒక స్లమ్ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు? ఎదిగిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గత సినిమాల్లో గోదావరి అంటే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉన్నట్లు చూపించేవారు. కానీ ఈ సినిమాలో గోదావరిలో ఉండే మరో కోణాన్ని చూపించారు. విలేజ్ రాజకీయాలు ఎలా ఉంటాయి? నా అనుకునే వాళ్లే ఎలా వెన్నుపోటు పొడుస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే రియలిస్టిక్ పేరుతో హింసను ఎక్కువగా చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే సినిమా కథంతా వాస్తవికానికి దూరంగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తీరు సినిమాటిక్గా అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రౌడీలా ప్రవర్తించడం.. ప్రత్యర్థుల దాడి.. హీరోయిన్తో ప్రేమలో పడడం.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగవు. కత్తికట్టడం గురించి చెబుతూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. ఎంట్రీ సీన్తో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించాడు. హీరో ఎమ్మెల్యే దొరస్వామి దగ్గరకు వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే కథ పరంగా కాదు కానీ హీరో ఎదిగిన తీరు మాత్రం పుష్ప సినిమాను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్గానే ఉంటుంది.ఎవరెలా చేశారంటే.. రత్న అలియాస్ రత్నాకర్ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే భిన్నమైన పాత్ర తనది. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. గోదావరి యాస మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. అక్కడక్కడ ఆయన ఒరిజినల్ (తెలంగాణ) యాస బయటకు వచ్చింది. రత్నమాల అనే పవర్ఫుల్ పాత్రలో అంజలి చక్కగా నటించింది.బుజ్జిగా నేహాశెట్టి తెరపై అందాలను ప్రదర్శిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఐటమ్ సాంగ్లో ఆయేషా ఖాన్ అందాలతో ఆకట్టుకుంది. విలన్గా యాదు పాత్రలో గగన్ విహారి ఆకట్టుకున్నాడు. నాజర్, సాయి కుమార్ హైపర్ ఆదితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత పరంగా సినిమా చాలా బాగుంది. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టి, సాక్షి వెబ్డెస్క్ -
'అలాంటి వారిని అంటే సమాజమే ఒప్పుకోదు'.. బాలకృష్ణ వివాదంపై సింగర్ ట్వీట్
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ.. హీరోయిన్ అంజలి పట్ల వ్యవహరించిన తీరు టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది. మహిళలంటే ఆయననకు ఎంత చులకనో అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా బాలయ్య తీరుపై నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు. అయితే గతంలోనూ బాలయ్య నోటీ దురుసుతో ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం చాలాసార్లు జరిగింది. తాజాగా ఈ వివాదంపై సింగర్, ఫెమినిస్ట్ చిన్మయి శ్రీపాద స్పందించారు. ఈ అంశంపై తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.చిన్మయి తన ట్వీట్లో రాస్తూ.. 'ఈ వీడియోను షేర్ చేస్తున్న వారిలో నేను గమనించిన అతిపెద్ద సమస్యల్లో ఇది ఒకటి. ఆమె నవ్వు వైపు చూడండి. ఆమెకు ఉండాలి కదా. ఇలాంటివీ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్పై స్పందించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది మోరల్ పోలీసింగ్ కంటే పవిత్రమైంది. హరిశ్చంద్ర, శ్రీరామచంద్రమూర్తి లేదా వారి బంధువుల అవతారాలు అర్థం చేసుకోకపోవడం పొరపాటే అవుతుంది. పవర్లో ఉన్న వారిని తప్పుగా చూపేందుకు ఈ సమాజమే ఒప్పుకోదు. ముఖ్యంగా డబ్బు, కులం, రాజకీయ బలం నుంచి వచ్చిన వారిని. అయినా ఇందులో మీకు ఎలాంటి నష్టం లేనప్పుడు.. మహిళలకు ఎలా ప్రవర్తించాలో చెప్పకండి.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. One of the biggest problems that I notice from people sharing this“Look at her laughing. She should have _____”1. It is NOT possible to respond according to your spectator response as you watch this on your device. This most moral policing, holier than thou - pure as driven… https://t.co/nzTOlGJm0J— Chinmayi Sripaada (@Chinmayi) May 30, 2024 -
త్వరలో శుభవార్త.. పెళ్లి గురించి హింట్ ఇచ్చిన హీరోయిన్ అంజలి..!
-
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గ్యాంగ్ స్టర్ మూవీ కాదు: దర్శకుడు
‘గోదావరి అనగానే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా చూపిస్తారు. కానీ నిజానికి మా ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టిన కథే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అని దర్శకుడు కృష్ణ చైతన్య అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ కృష్ణ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కంటే ముందే నేను దర్శకత్వం వహించాల్సిన సినిమాలు ఉన్నా.. అనివార్య కారణాల వల్ల అవి అలస్యం అయ్యాయి. చాలా గ్యాప్ రావడంతో నాలో భయం మొదలైంది. ఇదే విషయాన్ని త్రివిక్రమ్తో పంచుకున్నాను. ఆయన సూచనతో విశ్వక్ సేన్కి కథ చెప్పగా.. అది ఆయనకు నచ్చడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదలైంది.⇒ ఇది కల్పిత కథనే. దీనిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. దీని ద్వారా ఒక మంచి కథను చూపించవచ్చు, ఒక మంచి ఎమోషన్ ను చూపించవచ్చు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ విజువల్ ని చూపించవచ్చు అని భావించాను. నా ఆలోచనకు తగ్గట్టుగా సితార లాంటి మంచి నిర్మాణ సంస్థ దొరికింది. కొందరు ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది గ్యాంగ్ స్టర్ మూవీ కాదు.⇒ విశ్వక్ సేన్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదట ఏదైతే కథ రాసుకున్నామో.. అదే విశ్వక్ తో చేయడం జరిగింది. అయితే విశ్వక్ తెలంగాణలో పెరిగిన వ్యక్తి కాబట్టి.. గోదావరి మాండలికాన్ని సరిగ్గా చెప్పగలడా అని కొంచెం సందేహం కలిగింది. కనీసం రెండు మూడు నెలలు ట్రైనింగ్ అవసరమవుతుంది అనుకున్నాను. కానీ నెల రోజుల లోపులోనే నేర్చుకొని ఆశ్చర్యపరిచాడు.⇒ మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. సంభాషణల పరంగా రెండు చోట్ల మాత్రమే మ్యూట్ వేశారు. అవే మీరు ట్రైలర్ లో చూశారు. ట్రైలర్ కి సెన్సార్ అభ్యంతరాలు ఉండవు. అందుకే ఆ సన్నివేశాల్లోని భావోద్వేగాన్ని బాగా అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆ సంభాషణలను ట్రైలర్ లో అలాగే ఉంచడం జరిగింది. సినిమాలో మాత్రం ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు.⇒ యువన్ శంకర్ రాజా లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో పని చేయాలంటే మొదట భయపడ్డాను. ఆయన స్థాయికి నా మాట వింటారా అనుకున్నా. కానీ ఆయన మాత్రం తన అనుభవంతో.. నేను కోరుకున్నట్టుగా, సినిమాకి కావాల్సిన అద్భుతమైన సంగీతాన్ని అందించారు.⇒ ఇది నాకు చాలా చాలా ఇష్టమైన కథ. ఆ ఇష్టంతోనే ఈ సినిమా చేశాను. నేను అనుకున్న భావోద్వేగాలు తెరమీద చక్కగా పలికాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మాత్రం హృదయాన్ని హత్తుకుంటాయి.⇒ మహా భారతంలోని "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాట నాకు చాలా ఇష్టం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాటే చెబుతాను. -
హీరోయిన్ని తోసేసిన బాలకృష్ణ.. అందరిముందు మద్యం తాగుతూ!
హీరో బాలకృష్ణ మరోసారి అనుచితంగా ప్రవర్తించారు. స్టేజీపై తన పక్కనే నిలబడి ఉన్న హీరోయిన్ అంజలిని తోసేశారు. అయితే ఆమె తమాయించుకుని నిలబడింది. అదే టైంలో లోపల ఇబ్బందిగా ఉన్నప్పటికీ బయటకు నవ్వుతూ కవర్ చేసింది. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు)విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా మే 31న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చిన బాలకృష్ణ చాలా చీప్గా ప్రవర్తించాడు. హీరోయిన్ అంజలిని నెట్టేయడంతో పాటు అందరిముందు వాటర్ బాటిల్లో మద్యం సేవించారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.బాలకృష్ణని చేసిన దాన్ని ఆయన ఫ్యాన్స్ సమర్ధించుకుంటారేమో! కానీ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం, నోటీ దురుసుతో ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం గతంలోనూ పలుమార్లు జరిగింది. అమ్మాయిలు, నర్సులపై గతంలో చౌకబారు కామెంట్స్.. 'అక్కినేని తొక్కినేని' అని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అనడం లాంటివి బాలకృష్ణ ఎలాంటి వాడో చెప్పకనే చెబుతుంటాయి. కొన్నాళ్ల ముందు తమిళ హీరోయిన్ విచిత్ర కూడా ఇతడు పేరు చెప్పకుండా తనని ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. ఇలా చెప్పుకొంటూ పోతే బాలకృష్ణ బాగోతాలెన్నో!(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
పెళ్లి గురించి హింట్ ఇచ్చేసిన తెలుగు హీరోయిన్.. త్వరలో శుభవార్త
జనాల్లో హీరోయిన్ల పెళ్లిళ్ల మీద ఉన్న ఆసక్తి మరి దేనిపైనా ఉండదేమో? వారు ప్రేమలో పడితే వార్త, పెళ్లి కాకపోతే వార్త, పెళ్లి అయితే వార్త.. ఇలా ఉంటుంది హీరోయిన్ల పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఇలాంటి వాటి వల్ల వాళ్లకి పెద్ద తలనొప్పి అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి వాటిని కొందరు ఎంజాయ్ చేస్తారు. కాగా హీరోయిన్ అంజలి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. కారణం ఈమెకు 36 ఏళ్లు.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది)మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు అంజలిని వెంటాడుతూనే ఉన్నాయి. తెలుగు, తమిళంలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు కథానాయికగా చేస్తూనే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా చేస్తోంది. కొన్నాళ్ల క్రితం ఈమె రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే న్యూస్ వచ్చింది. అందరూ ఇది నిజమే అనుకున్నారు. కానీ ఇది కేవలం రూమర్ మత్రమే అని తేలింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి రూమర్స్పై స్పందించింది.ఇప్పటికే నాకు మూడు నాలుగు పెళ్లిళ్లు చేశారు. మొదట్లో ఇలాంటి వార్తలు విన్నపుడు బాధపడ్డా కానీ ఆ తర్వాత పట్టించుకోవడం మానేశానని అంజలి చెప్పింది. తనపై వస్తున్న వదంతుల కారణంగా నిజంగా ఓ వ్యక్తిని తీసుకెళ్లి ఇతన్నే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పినా ఇంట్లో ఎవరూ నమ్మరని చెప్పుకొచ్చింది. తను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని కానీ దానికి చాలా టైమ్ ఉందని క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం నటిగా బిజీగా ఉన్నానని ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే మూవీస్ చేస్తానని మాటిచ్చింది.(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?) -
మందేసి హీరోయిన్ అంజలిని స్టేజ్ పై తోసేసిన బాలకృష్ణ
-
అంజలి ఎంత ముద్దుగుందో.. (ఫోటోలు)
-
రత్నమాల నా కెరీర్లో గుర్తుండిపోతుంది: అంజలి
‘‘నన్ను ఎక్కువగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో చూడాలనుకుంటారు. కానీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నేను చేసిన రత్నమాల పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. ‘ఈ పాత్రకు మీరే న్యాయం చేయగలరు’ అని కృష్ణచైతన్య అన్నారు. ఇంత మంచి పాత్ర చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని అంజలి అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా, నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘రత్నమాల పాత్ర కోసం ఈ తరహా (మాస్) సంభాషణలు నా నోటి నుంచి రావడం ఇదే మొదటిసారి. చిత్రీకరణ, డబ్బింగ్ సమయంలో కొత్త అనుభూతి పొందాను. రత్నమాల నా సినీ కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’’ అన్నారు. పెళ్లి గురించి అడిగితే – ‘‘నా పెళ్లికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతానికి నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే’’ అన్నారు అంజలి. ‘‘ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’లో ఓ కథానాయికగా చేస్తున్నాను. తెలుగులో మరో సినిమా, తమిళ, మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు అంజలి. -
‘రత్నమాల’నా కెరీర్లో గుర్తుండి పోతుంది: అంజలి
ఇంతవరకు నేను అన్ని సినిమాల్లోనూ పక్కింటి అమ్మాయిలా నటించాను. కానీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రత్నమాల అనే ఓ డిఫరెంట్ రోల్లో నటించాను. ఆహార్యం, నేను పలికే సంభాషణలు కొత్తగా ఉంటాయి. మనసులో ఏది అనుకుంటే అది బయటకు చెప్పే పాత్ర. లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను. రత్నమాల నా సినీ కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’ అని అన్నారు తెలుగు బ్యూటీ అంజలి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా అంజలి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ⇢ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రత్నమాల అనే మాస్ పాత్ర చేశాను. అలాంటి పాత్ర చేయడం, ఈ తరహా సంభాషణలు నా నోటి నుంచి రావడం ఇదే మొదటిసారి. అసలు ఈ సంభాషణలు నిజంగా సినిమాలో ఉంచుతారా అనుకున్నాను. చిత్రీకరణ, డబ్బింగ్ సమయంలో కొత్త అనుభూతిని పొందాను.⇢ కృష్ణ చైతన్య మొదటిసారి కలిసి ఈ కథ చెప్పినప్పుడు.. ఈ పాత్రకు నన్ను ఎంపిక చేయడానికి కారణం ఏంటని అడిగాను. ఎందుకంటే నన్ను ఎక్కువగా అందరూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలలో చూడాలి అనుకుంటారు. కానీ ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే చైతన్య ఏమన్నారంటే.. నాకు అద్భుతంగా నటించే నటి కావాలి, అందుకే మీ దగ్గరకు వచ్చాను, మీరు ఈ పాత్రకు న్యాయం చేయగలరు అన్నారు. ఆయన ఏ నమ్మకంతో చెప్పారో తెలియదు కానీ.. ఇంత మంచి పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది.⇢ ఈ సినిమాలో విశ్వక్ సేన్, నా పాత్రల బంధం స్వీట్ గా ఉంటుంది. మా పాత్రల పేర్లు కూడా ఒకేలా ఉంటాయి. ఆయన రత్నాకర్, నేను రత్నమాల. ఇద్దరినీ రత్న అని పిలుస్తారు. ⇢ రత్నమాల తరహా పాత్రలు నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తారసపడతాయి. నేను అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు చూశాను. దేనిని లెక్క చేయకుండా పైకి రఫ్ గా కనిపిస్తారు.. కానీ వాళ్ళ మనసు మాత్రం చాలా మంచిది. రత్నమాల పాత్రలోకి వెళ్ళడానికి కాస్త సమయం తీసుకున్నాను. లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను.⇢ విశ్వక్ నాకు ముందు నుంచి స్నేహితుడు. అందుకే మా మధ్య సెట్ లో మంచి సమన్వయం ఉంటుంది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి.. ఎటువంటి సన్నివేశాల్లోనూ మేము నటించడానికి ఇబ్బంది పడలేదు.⇢ దర్శకుడు కృష్ణ చైతన్య మాకు ఏం చెప్పారో అదే తీశారు. ఒక దర్శకుడు ఏం ఆలోచించాడో.. దానిని అలాగే తెరమీదకు తీసుకురావడం అనేది చాలా మంచి లక్షణం. కృష్ణ చైతన్య ఏదైతే రాసుకున్నారో.. దానిని ఇంకా మెరుగ్గా తెరమీదకు తీసుకొచ్చారు.⇢ ప్రస్తుతం తెలుగులో గేమ్ చేంజర్తో పాటు తమిళంలో మూడు సినిమాలు, అలాగే మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను.⇢ పెళ్ళి అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్ళికి ఇంకా సమయం ఉంది. కొంతకాలంగా నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే. -
పెళ్లి కోసం అబ్బాయిని తీసుకెళ్లినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు: అంజలి
తెలుగు బ్యూటీ అంజలి పెళ్లిపై చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. మొదట్లో ఓ తమిళ హీరోతో పెళ్లి అని పుకార్లు వచ్చాయి. దానిపై అంజలి వివరణ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు ఎలాంటి రూమర్స్ రాలేదు. మళ్లీ ఆమె సినిమాలతో బీజీ అయిన తర్వాత ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుందనే ప్రచారం జరిగింది. అంతేకాదు త్వరలోనే సినిమాలకు పుల్స్టాప్ పెట్టి అమెరికాలో సెటిల్ అవుతుందనే ప్రచారమూ జరిగింది. అయితే వీటిని అంజలి ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అయినా కూడా ఈ మ్యారేజ్ రూమర్స్ వస్తునే ఉన్నాయి. తాజాగా అంజలి తన పెళ్లిపై వస్తున్న పుకార్లపై స్పందించింది. ‘ఇప్పటికే సోషల్ మీడియా నాకు మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసింది(నవ్వూతూ..). మొదట్లో ఇలాంటి రూమర్స్ వస్తే ఇంట్లో వాళ్లు కంగారు పడేవాళ్లు. కానీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ మధ్య నేను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యాననే పుకారు వచ్చింది. అమెరికాలోనే ఉన్న మా అక్క నాకు కాల్ చేసి..‘పెళ్లి అయిందటగా’ అని అడిగింది. ఏమో మరి నాకే తెలియదు అని చెప్పా(నవ్వుతూ..). నా పెళ్లిపై వచ్చిన రూమర్స్ కారణంగా..నేను ఒక అబ్బాయిని తీసుకెళ్లి ఇతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు. పెళ్లి అయితే కచ్చితంగా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. ప్రస్తుతం నేను సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. పెళ్లి చేసుకుంటే.. పర్సనల్ లైఫ్కి కూడా టైమ్ కేటాయించాలి. అందుకే కొంచెం టైమ్ తీసుకొని పెళ్లి చేసుకుంటా. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను’ అని అంజలి చెప్పుకొచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదలకు సిద్ధంగా ఉంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి మరో హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న విడుదల కాబోతుంది. -
ఫోన్ తీయనందుకే అంజలి హత్య
హుబ్లీ: నగరంలోని వీరాపుర ఓణిలో ఈ నెల 14వ తేదీ తెల్లవారు జామున జరిగిన అంజలి అంబిగేర హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం ఎదుట నిందితుడు నిజాలను చెప్పినట్లుగా తెలుస్తోంది. నిందితుడు గిరీష్ తాను మొదట అంజలిని మైసూరుకు రమ్మని పిలిచాను. అయితే ఆమె రాలేదు. హత్య చేయడానికి ముందు రోజు అంజలికి రూ.1000 ఫోన్ పే చేశాను. డబ్బులు పంపాక ఆమె తన ఫోన్ నెంబర్ను బ్లాక్ చేసింది. ఈ కారణంతోనే కోపం తట్టుకోలేక హత్య చేసినట్లుగా నిందితుడు గిరీష్ అలియాస్ విశ్వ సీఐడీ అధికారుల వద్ద విచారణ సందర్భంగా నోరు విప్పాడు. కాగా గత ఏప్రిల్ 18న విద్యార్థిని నేహా హిరేమఠ హత్య చేసిన మాదిరిగానే అంజలి హత్య కూడా జరిగిన సంగతి తెలిసిందే. కాగా అంతకు ముందు నిందితుడు అంజలిని నేహా మాదిరిగానే చంపుతానని బెదిరించేవాడని అంజలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ
హారర్ సినిమాలకు ఓటీటీలో మంచి గిరాకీ ఉంటుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఇలా ఎంటరవ్వగానే అలా ట్రెండయిపోతాయి. థియేటర్లలో పెద్దగా కలెక్షన్స్ రాబట్టని చిత్రాలు కూడా మినిమమ్ గ్యారెంటీ వ్యూస్ రాబడతాయి. తాజాగా ఓ తెలుగు హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.గత నెలలో రిలీజ్తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ గీతాంజలి అనే హిట్ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కింది. కోన వెంకట్ కథ అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, రవిశంకర్, సత్య, బ్రహ్మాజీ, అలీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. సడన్గా ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది.కథ విషయానికి వస్తే..దర్శకుడు శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి) తీసిన మూడు చిత్రాలు ఫ్లాప్ అవుతాయి. మరో ఛాన్స్ కోసం ఫ్యామిలీని వదిలేసి హైదరాబాద్లో తిరుగుతుంటాడు. సరిగ్గా అప్పుడే ఊటీకి చెందిన వ్యాపారవేత్త విష్ణు (రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా (శ్రీకాంత్ అయ్యంగార్) శ్రీనివాస్కు ఫోన్ చేసి తనతో సినిమా నిర్మిస్తానని చెపుతాడు. హీరోయిన్గా ఊటీలో కాఫీ కేఫ్ రన్ చేస్తున్న గీతాంజలి(అంజలి)ని తీసుకోవాలని విష్ణు సూచిస్తాడు. అయితే షూటింగ్ అంతా సంగీత్ మహల్లోనే పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. అక్కడున్న దెయ్యాలతో శ్రీను టీమ్కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడే షూటింగ్ చేయాలని ఎందుకు కండీషన్ పెట్టాడు? గీతాంజలి ఆత్మ మళ్లీ ఎలా? ఎందుకు? వచ్చింది? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! చదవండి: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ -
Anjali: అంజలి సారీ లుక్.. తనకన్నీ అలా సెట్టవుతాయంతే! (ఫోటోలు)
-
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు చంపేస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటే భయమేస్తోంది. ఇలాంటి టైంలో థియేటర్కి వెళ్లి చూడటం కంటే ఓటీటీలో మూవీస్ చూడటానికే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రస్తుతం 'మంజుమ్మల్ బాయ్స్', 'సైతాన్' లాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)హీరోయిన్ అంజలి తెలుగమ్మాయి. అప్పట్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ ఓ మాదిరి సక్సెస్ మాత్రమే అందుకుంది. తన 50వ సినిమాగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చేసింది. ఈ మధ్యే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో జనాలు అంతంత మాత్రంగానే వెళ్లారు.థియేటర్లలోకి ఏప్రిల్ 11న వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాని ఇప్పుడు నెల తిరిగిసరికల్లా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుందని సమాచారం. హిట్ మూవీ కాదు కాబట్టి పెద్దగా హడావుడి లేకుండా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. 2014లో వచ్చిన 'గీతాంజలి' మూవీకి దీన్ని సీక్వెల్గా తెరకెక్కించారు. కాకపోతే తొలి భాగంలా హిట్ కొట్టలేకపోయారు.(ఇదీ చదవండి: సమ్మర్ స్పెషల్.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్లు) -
లైట్ బ్లూ సారీ లో నటి అంజలి లుక్స్.. ఫోటోలు
-
మిక్స్డ్ టాక్.. రూ.50 కోట్లు కావాలంటున్న డైరెక్టర్
ఒకప్పుడు అరుదుగా సీక్వెల్స్ తీసేవారు.. ఇప్పుడు సీక్వెల్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. అలా పదేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్గా నిలిచిన మూవీ గీతాంజలి. దశాబ్దం తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్గా గీతాంజలి మళ్లీ వచ్చింది తెరకెక్కించారు. అంజలి హీరోయిన్గా నటించిన ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్, సత్య, సునీత్ ప్రధాన పాత్రలు పోషించారు. కోన వెంకట్ కథ అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. ఆ దేవుడిని ఒకటే అడిగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తొలిరోజే మిక్స్డ్ టాక్ అందుకుంది. గురువారం నాడు కోన వెంకట్ మీడియా ముందు మాట్లాడుతూ.. 'తిరుపతిలో దేవుడి ముందు నిలబడ్డప్పుడు ఒకటే కోరుకున్నా.. 27 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. బ్లాక్బస్టర్లు, ఫ్లాపులు చూశాను. తొలిసారి సక్సెస్ కావాలని భగవంతుడిని వేడుకున్నాను. సక్సెస్ కావాలి సక్సెస్ అనేది మనకంటూ కొత్త శక్తినిస్తుంది. కొత్త కథలను, కొత్తవారిని పరిచయం చేసేందుకు బలాన్నిస్తుంది. నేను చూసింది చాలు.. నా ద్వారా పదిమంది పరిచయం కావాలి, ఇండస్ట్రీకి మేలు జరగాలని కోరుకున్నాను. ముఖ్యంగా ఇది అంజలి 50వ సినిమా కావడంతో ఈ చిత్రానికి కనీసం రూ.50 కోట్లు అయినా వచ్చేట్లు చూడమని అడిగాను. తప్పకుండా ఆ నెంబర్స్ వస్తాయని ఆశిస్తున్నాను. త్వరలోనే రూ.50 కోట్ల ఫంక్షన్లో కలుద్దాం' అని చెప్పుకొచ్చాడు. చదవండి: హీరోయిన్ను పెళ్లాడిన దర్శన్? ఫోటో వైరల్! -
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ రివ్యూ
టైటిల్: గీతాంజలి మళ్ళీ వచ్చిందినటీనటులు: అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణకథ, స్క్రీన్ప్లే: కోన వెంకట్దర్శకత్వం: శివ తుర్లపాటిసంగీతం: ప్రవీణ్ లక్కరాజుసినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థఎడిటర్: ఛోటా కె ప్రసాద్విడుదల తేది: ఏప్రిల్ 11, 2024తెలుగు బ్యూటీ అంజలి కెరీర్లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ‘గీతాంజలి’ సినిమా ఒకటి. పదేళ్ల క్రితం వచ్చిన ఈ కామెడీ హారర్ అప్పట్లో ఘన విజయం సాధించింది. దశాబ్దం తర్వాత మళ్లీ అదే టీమ్తో గీతాంజలికి సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి అంచనాలతో నేడు(ఏప్రిల్ 11) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గీతాంజలి తరహాలో సీక్వెల్ కూడా హిట్ అయినట్లేనా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. దర్శకుడు శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి) తీసిన మూడు చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో మరో అవకాశం రాదు. సినిమా చాన్స్ కోసం ఫ్యామిలీని వదిలేసి స్నేహితులు ఆరుద్ర(షకలక శంకర్), ఆత్రేయ(సత్యం రాజేశ్)కలిసి హైదరాబాద్లో కష్టపడుతుంటాడు. మరోవైపు వైజాగ్లో ఫాస్ట్పుడ్ సెంటర్ నడుపుకునే అయాన్(సత్య) హీరో కావాలనని కలలు కంటుంటాడు. అయాన్ని హీరో చేస్తానని నమ్మించి అతని నుంచి డబ్బులు వసూలు చేస్తాడు శ్రీనివాస్. ఫ్రెండ్పై నమ్మకంతో హైదరాబాద్ వస్తాడు అయాన్. ఇక్కడకు వచ్చాక అసలు విషయం తెలుస్తుంది. మోస పోయానని తెలిసినా శ్రీనివాస్ పరిస్థితి చూసి ఏమి అనలేకపోతాడు.ఇక సినిమా ఇండస్ట్రీని వదిలేసి వేరే ఏదైనా పని చేసుకుందాని శ్రీనివాస్ గ్యాంగ్తో పాటు అయాన్ కూడా నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఊటికి చెందిన పెద్ద వ్యాపారవేత్త విష్ణు( రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా(శ్రీకాంత్ అయ్యంగార్) నుంచి శ్రీనివాస్కి ఫోన్ కాల్ వస్తుంది. అతనితో ఓ సినిమాను నిర్మిస్తానని విష్ణు చెబుతాడు. హీరోయిన్గా ఊటీలోనే కాఫీ కేఫ్ రన్ చేస్తున్న గీతాంజలి(అంజలి)ని తీసుకోవాలని విష్ణు సూచిస్తాడు. అలాగే షూటింగ్ అంతా సంగీత్ మహాల్లోనే చేయాలని కండీషన్ పెడతాడు. ఆ మహాల్ చరిత్ర ఏంటి? ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలలో శ్రీను టీమ్కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సినిమా షూటింగ్ని అక్కడే చేయాలని విష్ణు ఎందుకు కండీషన్ పెట్టాడు? హ్యాట్రిప్ ఫ్లాపులు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనుతో విష్ణు ఎందుకు సినిమా తీయాలనుకున్నాడు? హీరోయిన్గా అంజలినే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ కథలోకి గీతాంజలి ఆత్మ మళ్లీ ఎలా వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హారర్ కామెడీ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. పదేళ్ల కిందట వచ్చిన గీతాంజలి ముందు కూడా ఈ జానర్లో సినిమాలు వచ్చాయి. కానీ గీతాంజలి తరహాలో అవి విజయం సాధించలేకపోయాయి. ఆ చిత్రం విజయానికి ప్రధాన కారణం కామెడీ, హారర్తో పాటు ఎమోషన్స్ కూడా చక్కగా కుదరడం. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో ఆ ఎమోషన్ మిస్ అయింది. కేవలం కామెడీ, హారర్ ఎలిమెంట్స్తో కథనాన్ని నడింపించారు దర్శకుడు. కథ- కథనంపై ఫోకస్ చేయకుండా కాన్సెప్ట్ని నమ్ముకొని సినిమాను తెరకెక్కించారు.వాస్తవానికి ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. దెయ్యాలతో సినిమా షూటింగ్ అనేది కొత్త పాయింటే. ఆ ఎపిసోడ్ వరకు కామెడీ బాగా వర్కౌట్ అయింది. కానీ మిగతా కథంతా అంతగా ఆకట్టుకునేలా సాగదు. ప్రేక్షకులను నవ్విస్తూనే..కొన్నిచోట్ల భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తిగా సక్సెస్ కాలేదు. కొన్ని సన్నివేశాలు అయితే మరీ రొటీన్గా ఉంటాయి. ఇక ఇలాంటి సినిమాల్లో లాజిక్కులను వెతుకొద్దు. కానీ ఎమోషన్స్ని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో చిత్రబృందం పూర్తిగా విఫలం అయింది.ఎంతసేపు నవ్వించడం మీదనే ఫోకస్ పెట్టారు. పోనీ ఆ కామెడీ అయినా కొత్తగా ఉందంటే అదీ లేదు. ఫస్టాప్లో వచ్చే కామెడీ సీన్స్ అయితే జబర్దస్త్ షోని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ వరకు కథంతా సోసోగానే సాగుతుంది. సెకండాఫ్ ప్రారంభంలో కథనం కాస్త ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది. దెయ్యాలను జూనియర్ ఆర్టిస్టులు అని శ్రీను నమ్మించడం.. ఆ తర్వాత సత్య, సునీల్ పాత్రలు ఆ దెయ్యాలతో జరిపే సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ పరమ రొటీన్గా ఉంటుంది. ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా భయపెట్టలేదు.. కడుపుబ్బా నవ్వించనూ లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం కాస్త ఎంటర్టైన్ అవుతారు. ఎవరెలా చేశారంటే.. గీతాంజలి పాత్రలో అంజలి ఒదిగిపోయింది. అల్రేడీ చేసిన పాత్రే కాబట్టి.. ఇంకాస్త చక్కగా నటించింది. ఇందులో ఆమెకు ఓ యాక్షన్ సీన్ ఉంది. ఆ సీన్లో అదరగొట్టేసింది. ఈ సినిమాకు సత్య పోషించిన పాత్ర హైలెట్ అని చెప్పాలి. అయాన్గా ఆయన పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. శ్రీనివాస్రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రాఫర్ కిల్లర్ నానిగా సునీల్ పండించిన కామెడీ కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది. దెయ్యాలుగా రవిశంకర్, ప్రియ కొన్ని చోట్ల భయపెట్టారు. ఆ పాత్రలకు సరైన ముగింపు ఉండదు. రాహుల్ మహదేవ్ విలనిజం అంతగా పండలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. హారర్ సినిమాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. బీజీఎంతోనే భయపెట్టాలి. కానీ ప్రవీణ్ లక్కరాజు ఆ స్థాయి నేపథ్య సంగీతాన్ని అందించలేకపోయాడు. పాటలు కూడా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. గ్రాఫిక్స్ విభాగం పనితీరు వీక్గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంభాషణలు కొన్నిచోట్ల ట్రెండ్కి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Anjali: అందం అభినయం కలబోసిన తెలుగమ్మాయి అంజలి (ఫొటోలు)
-
Ugadi2024 అంజలి ‘పాప’ ఎంత ముద్దుగుందో..! (ఫోటోలు)
-
హారర్... కామెడీ సమానంగా ఉంటాయి: అంజలి
‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా పాయింట్ను కోన వెంకట్గారు నాలుగేళ్ల ముందే చెప్పారు. అయితే అప్పుడు నేను బిజీగా ఉండటం, ఆ తర్వాత ఈ సినిమాలోని ఇతర నటీనటులు బిజీగా ఉండటంతో కుదరలేదు. మధ్యలో కరోనా వచ్చింది. హారర్, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ చేసిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు హీరోయిన్ అంజలి. ‘గీతాంజలి’కి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవీవీ సినిమాస్తో కలిసి కోన వెంకట్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’కి ఇది సీక్వెల్ కాబట్టి పాత్రలని మార్చలేదు. కానీ, కొత్త క్యారెక్టర్స్ను (అలీ, సునీల్, సత్య) తీసుకొచ్చాం. రొటీన్గా చేస్తే నటిగా నాకు ఆసక్తి ఉండదు కాబట్టి ప్రతి సినిమాకి కొత్తగా ఉండాలనే చూస్తున్నాను. ఈ ఉగాదికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. -
'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'గీతాంజలి మళ్లీ వచ్చింది' ట్రైలర్ చూసేయండి
థియేటర్లో ప్రేక్షకులను భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించిన చిత్రం 'గీతాంజలి'. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికి వచ్చి దాదాపు పదేళ్లు అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా విడుదలకు ఇప్పుడు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో టైటిల్ పాత్రలో అంజలి పోషిస్తుండగా.. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, అలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంజలికి ఇది 50వ చిత్రం. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్ప్లే సమకూర్చడం విశేషం. అంచనాలతో వచ్చిన ప్రేక్షకులు అంతకుమించి ఆస్వాదించేలా ఈ సినిమా ఉంటుందని కోన వెంకట్ చెప్పారు. -
'ఇలాంటి టైటిల్ పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది'
మిర్చి విజయ్, అంజలి నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం వైఫ్. ఈ చిత్రం ద్వారా హేమంత్ నాదం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఒలింపియ మూవీస్ సంస్థ అధినేత ఎస్.అంబేడ్కర్ నిర్మిస్తున్నారు. గతంలో జిప్సీ, డాడా, కలిగేత్తి మూర్కన్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను ఆయన నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. దంపతుల మధ్య నవీన అనుబంధాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఇది ఉంటుందని డైరెక్టర్ హేమంత్ నాదం అన్నారు. అందుకే ఈ చిత్రానికి వైఫ్ అని పేరు పెట్టామని తెలిపారు. ఇలాంటి టైటిల్ను ఇప్పటివరకు ఎవరూ పెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. చదరంగంలో రాణికి అపార శక్తి ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక ఇంటిని చక్కదిద్దడంలో భార్య పాత్ర ముఖ్యమన్నారు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య పెరిగే ప్రేమానుబంధాన్ని ఎమోషనల్గా ఆవిష్కరించే చిత్రమని చెప్పారు. ఈ చిత్రం ద్వారా మిర్చి విజయ్ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కేఏ శక్తివేల్ చాయాగ్రహణం, జెన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో మైత్రేయన్, రెడిన్ కింగ్స్ లీ, కల్యాణి నటరాజన్, విజయ్బాబు, విల్లు, కదిర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. Super happy to present the First Look of my next Romcom #Wife with @RJVijayOfficial 👰🏻♀️🤵🏻 Directed by @dir_hemanathan Produced by @ambethkumarmla @olympiaMovis@Abishek_jg @shakthi_dop @JenMartinmusic @PMohan93 @gayathribala21@sharmaseenu11@VishnuEdavan1 @DoneChannel1 pic.twitter.com/fqnzgwDBaZ — Anjali (@ianjalinair) March 23, 2024 -
ఆమెను చూస్తే గర్వంగా ఉంది
‘‘అంజలిగారి కెరీర్లో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ 50వ సినిమా. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలు చేసి, విజయం సాధించడం గర్వంగా ఉంది. అంజలిగారు వందకుపైగా సినిమాలు చేయాలి. మార్చి 22న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో పాటు నా మూవీ ‘ఓం భీం బుష్’ కూడా విడుదలవుతోంది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించాలి’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ , ఎంవీవీ సినిమాస్పై కోన వెంకట్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న విడుదలకానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కు హీరో శ్రీ విష్ణు, దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ, బుచ్చిబాబు సన అతిథులుగా హాజరయ్యారు. అంజలి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ నా కెరీర్లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. యాభై సినిమాలు చేయడం నాకు సంతోషాన్నిస్తోంది’’ అన్నారు అంజలి. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది’’ అన్నారు కోన వెంకట్. ‘‘ఓ మంచి చిత్రానికి దర్శకత్వం వహించాననే సంతృప్తి కలిగింది’’ అన్నారు శివ తుర్లపాటి. నటులు అలీ, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. -
గీతాంజలి మళ్లీ వచ్చింది.. భయపెడుతోన్న టీజర్
రర్ సినిమాలకు ఎప్పుడూ మంచి గిరాకీయే ఉంటుంది. ఇక్కడ ఎవరు నటించారు? ఎవరు డైరెక్ట్ చేశారు? అనేదానికన్నా కథేంటి? కాన్సేప్ట్ ఏంటి? అనే చూస్తారు ప్రేక్షకులు. అలాంటిది ఆల్రెడీ హిట్ కొట్టిన హారర్ మూవీ గీతాంజలికి సీక్వెల్ తెరకెక్కుతోంది. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంజలి ప్రధాన పాత్రలో నటించిన మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. ఇది అంజలి కెరీర్లో 50వ చిత్రంగా తెరకెక్కింది. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీని రచయిత–నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించారు. శ్రీనివాస్ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. మొదట టీజర్ లాంచ్ ఈవెంట్ను స్మశానవాటికలో చేద్దామనుకున్నారు. తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. హైదరాబాద్లోని ఓ కన్వెన్షన్ హాల్లో శనివారం సాయంత్రం టీజర్ లాంచ్ చేశారు. అంజలి క్లాసికల్ డ్యాన్స్తో టీజర్ మొదలైంది. దెయ్యాలను ఎలా నమ్మారు? అనే దగ్గరి నుంచి దెయ్యాలకు జడుసుకునేవరకు చూపించారు.హారర్తో పాటు కామెడీ కూడా పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చదవండి: మీమర్ పిచ్చి ప్రశ్నలు.. హీరో వద్దని వారిస్తున్నా పదేపదే.. -
ముద్దు సన్నివేశాల్లో నటించడం పై అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
-
ముద్దు సన్నివేశాల్లో నటించడంపై అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగమ్మాయి అంజలి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. కేవలం టాలీవుడ్లో కాకుండా కోలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ..బిజియెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్పై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. సినిమాల్లో ముద్దు సన్నివేశాలు సహజంగా వస్తాయని, అందులో నటించక తప్పదన్నారు. అయితే అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు తనకు కాస్త ఇబ్బందిగానే ఉంటుందని, కానీ కథ డిమాండ్ చేస్తే చేయక తప్పదన్నారు. (చదవండి: రియల్ లైఫ్లో ఒక్కటి కానున్న రీల్ జంట!) ‘ కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు సహనటుడు నా గురించి ఏమనుకుంటాడోనని ఆందోళన కలుగుతుంది..ఇంటిమేట్ సన్నివేశాలు సినిమాకు అవసరం కాబట్టి వాటిని నిరాకరించలేను. అసౌకర్యంగానే వాటిల్లో నటిస్తాను నిజ జీవితంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి సినిమాలో ప్రేమికుల మధ్య ఉండే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే సహనటులతో ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది’ అని అంజలి చెప్పారు. (చదవండి: తెలుగులో ఇదే నా చివరి సినిమా.. మళ్లీ ఆ చాన్స్ రాకపోవచ్చు: మహేశ్ బాబు) ఇక తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి స్పందిస్తూ.. ‘కొందరు నా పర్సనల్ విషయాల గురించి ఇష్టానుసారంగా రాసేస్తున్నారు. గతంలో జర్నీ నటుడు జైతో ప్రేమలో ఉన్నానని రూమర్స్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన వ్యక్తితో పెళ్లి అయిందని వార్తలు రాశారు. అవన్నీ రూమర్స్ మాత్రమే. వాటిని చూసి నవ్వుకుంటాను తప్ప సీరియస్గా తీసుకొను’అని అంజని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అంజలి రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్లో సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. 2014లో ఆమె నటించిన గీతాంజలి సీక్వెల్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. వీటితో పాటు పలు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. -
'హీరోతో లవ్.. వ్యాపారవేత్తతో పెళ్లి'.. అంజలి ఆన్సరిదే!
పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లదెబ్బలు అన్న సామెత మాదిరిగా సెలబ్రిటీల గురించి ముఖ్యంగా సినీ హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో లేనిపోనివి రాసేస్తుంటారు. అంజలి విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ అచ్చ తెలుగమ్మాయి ఫొటో చిత్రం ద్వారా టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది. రామ్ దర్శకత్వంలో 'కట్రదు తమిళ్' చిత్రం ద్వారా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అంజలి అక్కడ తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత తనకు తమిళంలో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. దీంతో అంజలి అక్కడ బిజీ హీరోయిన్గా మారింది. స్టార్ హీరోలతో జోడీ అలాంటి సమయంలోనే పిన్నితో మనస్పర్థలు తలెత్తడంతో హైదరాబాద్కు మకాం మార్చింది. ఇది ఈమెకు ప్లస్సే అయ్యిందని చెప్పవచ్చు. ఇక్కడ వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలు అందుకుంది. ఇకపోతే హీరో జైతో ప్రేమాయణం.. పెళ్లికి సిద్ధం అవుతున్న అంజలి అంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. దాన్ని అప్పట్లోనే అంజలి లైట్ తీసుకుంది. ఇప్పుడేమో.. ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిందని ప్రచారం జరుగుతోంది. తెలియకుండానే పెళ్లి చేస్తున్నారు! దీనిపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన అంజలి సినిమా రంగంలో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని చెప్పింది. దీంతో తనను ఎవరితో కలిపి రాయాలన్నది కొందరు వారే సొంతంగా నిర్ణయించుకుని రాసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మొదట్లో హీరో జైను ప్రేమిస్తున్నట్లు రాశారని, ఇప్పుడు ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయినట్లు ప్రచారం జరుగుతోందని తెలిపింది. తనకు తెలియకుండానే తన పెళ్లి చేసేస్తుండడంతో నవ్వు వస్తోందని పేర్కొంది. తమిళంలో ఈమె నటించిన ఏళు కడల్ ఏళు మలై చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. మరోవైపు గీతాంజలి 2 కూడా త్వరలో రిలీజ్ కానుంది. చదవండి: షూటింగ్లో గాయపడ్డ హీరో నితిన్? -
శ్రీలీలతో పోల్చినందుకు రిపోర్టర్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అంజలి
-
శ్రీలీల 6 సినిమాలు చేస్తోంది.. మీరేమో.. అంజలి రిప్లై ఇదే!
తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో గీతాంజలి(2014) ఒకటి. పదేళ్ల తర్వాత దీనికి సీక్వెల్గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా తెరకెక్కింది. అంజలితో పాటు సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. 'నిన్ను కోరి' సినిమాకు కొరియోగ్రాఫర్గా పని చేసిన శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్ను పరిచయం చేస్తూ విలేకర్ల సమావేశం నిర్వహించారు. శ్రీలీలతో పోలిక.. అంజలి చిరాకు ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ అంజలిని ఉద్దేశిస్తూ ఓ ప్రశ్న అడిగింది. 'తెలుగువారికి మీరంటే చాలా అభిమానం. నేను కూడా మీకు పెద్ద అభిమానిని. అయితే మీకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదని అనిపిస్తోంది. తెలుగమ్మాయి అవడం వల్ల బ్రేక్ రాలేదా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా?' అని అడిగింది. దీనికి అంజలి బదులిస్తూ.. 'నాకు బ్రేక్ రాకపోతే మీకు ఫేవరెట్ హీరో అయ్యేదాన్నే కాదు' అని చెప్పింది. దీనికి సదరు జర్నలిస్టు స్పందిస్తూ.. అలా అని కాదు.. ఈ రోజు శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తోంది. మీరేమో.. అని నసగడంతో అంజలి మధ్యలోనే అందుకుంది. కిక్ ఉంటేనే చేస్తా 'నేనెప్పుడూ ఒకటి, రెండు స్థానాల కోసం పోటీపడలేదు. ఒక్కొక్కరికి ఒక్కో హీరోయిన్ నచ్చుతారు. నాకు స్క్రిప్ట్ నచ్చితేనే, అందులోనూ నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటేనే ఆ సినిమా చేస్తాను. లేదంటే ఆ పాత్ర ఒప్పుకోను. నేను ఒకేసారి నాలుగు సినిమాలు చేయొచ్చు. కానీ నాలుగింటికి బదులు ఒక్క మంచి సినిమా చేయడమనేది నాకిష్టం. నేను తెలుగుతో పాటు ఇతర మూడు భాషల్లోనూ నటిస్తున్నాను. ఒకేసారి అన్ని చోట్లా నేను ఉండలేను. అక్కడో సినిమా, ఇక్కడో సినిమా చేస్తున్నాను. నాకు కిక్కిచ్చే పాత్రలే చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది అంజలి. చదవండి: సీరియల్ నటి ప్రియాంకకు ఆపరేషన్.. గతంలో ఆమె ప్రియుడికి కూడా! -
నవ్విస్తూ...భయపెడుతూ..
అంజలి టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. శ్రీనివాస్ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రచయిత–నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్ను పరిచయం చేస్తూ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంతా ఒక ఎత్తైతే.. క్లైమాక్స్ మరో రేంజ్లో ఉంటుంది. ‘గీతాంజలి’ని ఫ్రాంచైజీగా చేస్తూ, కోనగారు ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చేశారు. కోనగారి కామెడీ ట్రాక్, ఈ సినిమాను ఆయన డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకుడు శివగారికి ఈ సినిమాతో పెద్ద బ్రేక్ వస్తుంది’’ అన్నారు. ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’’ని అమెరికాలో చేద్దామనుకున్నాం. కొన్ని ్రపాక్టికల్ కారణాల వల్ల ఊటీ బ్యాక్డ్రాప్కి మార్చాం. ప్రేక్షకులు వారి అంచనాలకు మించి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు కోన వెంకట్. ‘‘ప్రేక్షకులను భయపెడుతూ, నవ్విస్తూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. ‘‘బ్లాక్బస్టర్ మూవీ ‘గీతాంజలి’కి సీక్వెల్ చేసే అవకాశాన్ని కల్పించిన కోనగారికి, ఎంవీవీగారికి థాంక్స్’’ అన్నారు శివ తుర్లపాటి. నటుడు రవికృష్ణ, ఎడిటర్ చోటా కె. ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు మాట్లాడారు. -
ప్రేమికుల రోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ సినిమా 'రీ రిలీజ్'
దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన 'జర్నీ' సినిమా అప్పట్లో యూత్ను ఎంతగానో కట్టిపడేసింది. అంజలి, జై, శర్వానంద్, అనన్య జోడిగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాను చూసిన వారందరూ ఇప్పటి జనరేషన్లో టువంటి అమ్మాయిలు కూడా ఉంటారా? అనేంతగా సినిమా కథలో హీరోయిన్ పాత్ర ఉంటుంది. ఇందులోని ప్రేమ కథలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మురుగదాస్ నిర్మాణం, ఎం.శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీ.సత్య సంగీతం అందించారు. అప్పట్లో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించింది. 2011 సెప్టెంబర్ 16న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్ను చేశారు. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కాబోతోంది. అసలే టాలీవుడ్లో ఇప్పుడు రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతీ నెల ఏదో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ రీ రిలీజ్లకు థియేటర్లు షేక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘జర్నీ’ని రీ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద ఏ.సుప్రియ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో జర్నీని గ్రాండ్గా మళ్లీ థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ప్రేమికులకు ఈ సినిమా మంచి ఫీస్ట్ లాంటిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
2023.. న్యూ ఇయర్ వేళ.. ఢిల్లీలో జరిగిన ఘోరమిదే!
అది 2023, జనవరి ఒకటి.. దేశమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలుతోంది. ఇంతలో దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్ దేశప్రజలను కలచివేసింది. మర్నాటి ఉదయం వెలుగు చూసిన ఒక వీడియో సంచలనంగా మారింది. అదే.. ఢిల్లీలో నూతన సంవత్సరం వేళ కంఝావాలాలో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ ఘటన. ఒక హోటల్ జరిగిన న్యూ ఇయర్ పార్టీకి హాజరైన అంజలి(20) స్కూటీపై ఇంటికి తిరిగి వెళుతోంది. ఇంతలో అటుగా కారులో వచ్చిన యువకులు ఆమె వాహనాన్ని ఢీకొని, కారుని వేగంగా పోనిచ్చారు. అయితే ఆమె కారు కింద ఇరుక్కుపోయింది. కారు ఆమెను ఈడ్చుకుంటూ 12 కిలోమీటర్లు దూరం వరకూ వెళ్లింది. ఆమె తనను కాపాడాలని అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఆమె మృతి చెందింది. ఈ ఘటన దేశ ప్రజల్లో ఆగ్రహాన్ని నింపింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో అంజలి స్నేహితురాలు నిధిని కూడా విచారించారు. ఆ సమయంలో అంజలి మద్యం మత్తులో ఉందని నిధి పోలీసులకు తెలిపింది. కాగా వారి స్కూటీ కంఝావాలాలోని సుల్తాన్పురి ఏరియాకు చేరుకున్నంతలో మితిమీరిన వేగంతో వచ్చిన ఒక కారు వీరి స్కూటీని ఢీకొంది. దాంతో నిధి ఎగిరి పక్కన పడిపోగా, అంజలి కారు కింద ఇరుక్కుపోయింది. అయితే కారును ఆపకుండా.. కారులో ఉన్న అయిదుగురు నిందితులు 12 కిలోమీటర్ల దూరం వరకూ అంజలిని ఈడ్చుకుంటూ వెళ్లారు. తరువాత ఆమె మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసి పరారయ్యారు. పోలీసుల విచారణలో నిధి.. తమను కారు ఏవిధంగా ఢీకొన్నదో తెలిపింది. అయితే ఆ సమయంలో తాను భయాందోళనకు లోనైనందుకు పోలీసులకు వెంటనే ఈ విషయం చెప్పలేకపోయానని నిధి పేర్కొంది. కాగా తెల్లవారుజామున 3.24 గంటలకు ఒక మృతదేహాన్ని ఈడ్చుకుంటూ ఒక కారు కుతుబ్ మినార్ వైపు అతివేగంతో వెళుతున్నదని ఢిల్లీలోని కంఝావాలా పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది. ఈ ఘటన దర్యాప్తు దరిమిలా విధులలో నిర్లక్ష్యం వహించారంటూ 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. వీరిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 800 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పోలీసులు ఏడుగురిని నిందితులుగా కేసులో చేర్చారు. వీరిలో అమిత్ ఖన్నా, అశుతోష్లపై మోటారు వాహన చట్టం కింద కేసు కూడా నమోదైంది. బాధిత కుటుంబానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇది కూడా చదవండి: 2023లో ప్రధాని మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారు? ఎవరిని కలిశారు? -
గీతాంజలి మళ్లీ వస్తోంది
అంజలి టైటిల్ రోల్లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) హిట్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, ‘షకలక’ శంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్, ఊటీ నేపథ్యాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘‘ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో జరగనున్న ఊటీ షెడ్యూల్తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
Anjali: కుక్కపిల్లకు ఓ రేంజ్లో బర్త్డే సెలబ్రేట్ చేసిన అంజలి (ఫోటోలు)
-
Anjali: వెకేషన్లో చిల్ అవుతున్న బ్యూటిఫుల్ అంజలి (ఫోటోలు)
-
'గేమ్ చేంజర్' షూటింగ్లో రామ్చరణ్కు గాయాలు!
రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సునీల్, నవీన్ చంద్ర, ఎస్జే సూర్య, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ‘గేమ్చేంజర్’ తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 20 నుంచి ప్లాన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ రద్దు అయ్యింది. ‘‘గేమ్చేంజర్’లోని కొందరు ఆర్టిస్టులు షూటింగ్కు అందుబాటులో లేని కారణంగానే ఈ నెలలో జరగాల్సిన షూటింగ్ రద్దు అయింది. అక్టోబర్ రెండోవారంలో తిరిగి షూటింగ్ను స్టార్ట్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే రెండు రోజుల క్రితం రామ్చరణ్కు షూటింగ్లో చిన్న గాయమైందని ఓ వార్త వైరలవుతోంది. గాయం కారణంగా డాక్టర్ పది రోజుల వరకు విశ్రాంతి తీసుకోమన్నారని తెలుస్తోంది. ఈ కారణం వల్ల కూడా షూటింగ్ రద్దైనట్లు సమాచారం. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్. -
ప్రతీకార జ్వాలతో..
అంజలి టైటిల్ రోల్లో, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలో రాజ్కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘గీతాంజలి (2014)’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ని తెరకెక్కిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ఆరంభమైంది. తొలి సీన్కి రామచంద్ర క్లాప్ ఇవ్వగా, స్క్రిప్ట్ని ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రదర్శకుడు శివ తుర్లపాటికి అందజేశారు. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అని ప్రకటించి, శనివారమే షూటింగ్ ఆరంభించినట్లు వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
సినీ కెరీర్లో అరుదైన మైల్స్టోన్ చేరుకున్న ఈ ఐదుగురు
యాభైలో పడ్డారంటే యాభై ఏళ్ల వయసులో పడ్డారనుకుంటున్నారేమో! ఆ మాటకొస్తే.. ధనుష్, విజయ్ సేతుపతి, అంజలికన్నా సీనియర్ ఆర్టిస్ట్ అయిన సిమ్రానే ఇంకా వయసు పరంగా యాభై టచ్ అవ్వలేదు. ఆమె యాభైలోకి అడుగుపెట్టడానికి ఇంకో రెండు మూడేళ్లు పడుతుంది. ఇక ధనుష్, భరత్ నలభై టచ్ చేస్తే.. ఇంకో అయిదు అదనంగా అంటే... సేతుపతి నలభై అయిదు టచ్ చేశారు. అంజలి నలభై లోపే. ఈ అయిదుగురూ అయిదుపదుల్లో పడింది సినిమాల పరంగా. ఈ అయిదుగురూ చేస్తున్న 50వ సినిమా విశేషాల్లోకి వెళదాం... రెండు దశాబ్దాల్లో రెండోది రెండు దశాబ్దాల కెరీర్లో నటుడు– నిర్మాత ధనుష్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘పా. పాండి’ (2017). ఈ సినిమా తర్వాత మరో సినిమా కోసం దర్శకుడిగా ధనుష్ మెగాఫోన్ పట్టాలనుకున్నారు. ‘నాన్ రుద్రన్’గా ప్రచారం జరిగిన ఈ సినిమా ఎందుకో సెట్స్పైకి వెళ్లలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా సెట్స్పైకి వెళ్లింది. అయితే ఇది ధనుష్ కెరీర్లో 50వ సినిమా కావడం విశేషం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా నార్త్ చెన్నై బ్యాక్డ్రాప్లో యాక్షన్ డ్రామాగా ఉంటుందట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో రిలీజ్ కానుంది. మహారాజా హీరో.. విలన్.. సపోర్టింగ్ యాక్టర్... ఇలా పాత్రకు తగ్గట్టు ఇమిడిపోతూ విలక్షణ నటుడిగా ప్రేక్షకుల్లో పేరు సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి. కెరీర్లో విజయ్ సేతుపతి 50 చిత్రాల మైలురాయికి చేరుకున్నారు. ఆయన 50వ సినిమాకు ‘మహారాజా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. నితిలన్ సామినాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ మమతా మోహన్దాస్, నట్టి నటరాజ్, బాలీవుడ్ దర్శక–నిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా తుది దశకు చేరుకున్నాయి. ‘పాషన్ స్టూడియోస్’ సుధన్ సుందరం, జగదీష్ పళనీసామి నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో ఓ స్పష్టత రానుంది. లా స్టూడెంట్ దక్షిణాదిలో నటిగా అంజలికి మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, కీలక పాత్రల్లో నటిస్తున్న అంజలి కెరీర్లో హాఫ్ సెంచరీ కొట్టారు. అదేనండీ.. యాభై సినిమాల మైల్స్టోన్కు చేరుకున్నారు. అంజలి ప్రధాన పాత్రలో అశోక్ వేలాయుధం దర్శకత్వంలో ‘ఈగై’ అనే ఓ కోర్టు డ్రామా మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం అంజలికి 50వది. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రంలో అంజలి లా స్టూడెంట్గా నటిస్తున్నారని, సునీల్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. గ్రీన్ అమ్యూస్మెంట్ ప్రొడక్షన్స్, డీ3 ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. సిమ్రాన్ శబ్దం సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలోనే కాదు..ఉత్తరాదిలో కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు సిమ్రాన్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. సిమ్రాన్ కీలక పాత్ర చేస్తున్న మూవీల్లో ‘శబ్దం’ ఒకటి. ‘ఈరమ్’ (తెలుగులో ‘వైశాలి’) చిత్రం తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతోంది. లక్ష్మీ మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, లైలా కీలక పాత్రధారులు. సిమ్రాన్కు తమిళంలో ఇది 50వ సినిమా కావడం విశేషం. ప్రేమకోసం... దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘కాదల్’ తెలుగులో ‘ప్రేమిస్తే..’గా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత తమిళంలో చాలా సినిమాలే చేశారు భరత్. తెలుగులో మహేశ్బాబు ‘స్పైడర్’, సుధీర్బాబు ‘హంట్’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. కాగా భరత్ కెరీర్లో రూపొందిన 50వ సినిమా ‘లవ్’. వాణీ భోజన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఆర్పీ బాలా దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. -
ఫాక్స్ కార్పొరేషన్ స్ట్రీమింగ్ సర్వీస్కు సీఈవోగా అంజలీ సూద్
ఫాక్స్ కార్పొరేషన్ ఉచిత యాడ్-సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ట్యూబీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా భారతీయ-అమెరికన్ అంజలీ సూద్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 1 నుంచి కంపెనీ సీఈవోగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. విమియో కంపెనీ సీఈవోగా ఉన్న అంజలీ సూద్, తొమ్మిదేళ్లు అక్కడ పనిచేశాక ఇటీవలే పదవి నుంచి వైదొలిగారు. ట్యూబీ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫర్హాద్ మస్సౌదీ అనంతరం ఆమె ఆ కంపెనీగా సీఈవోగా నియమితులయ్యారు. విమియో కంటే ముందు ఆమె టైమ్ వార్నర్, అమెజాన్ కంపెనీల ఫైనాన్స్, మీడియా, ఈ-కామర్స్ విభాగాల్లో పనిచేశారు. సీఈవోగా అంజలి సూద్ నాయకత్వంలో విమియో ప్రపంచవ్యాప్తంగా వీడియో క్రియేటర్లు, ఇతర ప్రొఫెషనల్స్కు కేంద్రంగా మారింది. 300 మిలియన్లకు పైగా యూజర్లను సంపాదించుకోవడంతోపాటు గణనీయమైన ఆదాయాన్నీ ఆర్జించింది. అమెరికాలో ఇటీవల అత్యధికంగా వీక్షించిన ఫ్రీ యాడ్ సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్గా ట్యూబీ నిలిచింది. నీల్సన్ ప్రకారం.. ట్యూబీకి 64 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఈవోగా అంజలీ సూద్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యూబీని ఫాక్స్ కార్పొరేషన్ 2020లో 440 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మొత్తం టీవీ వీక్షణ నిమిషాల్లో ప్లూటోటీవీ, పీకాక్, హెచ్బీవో మ్యాక్స్లను కూడా ట్యూబీ అధిగమించింది. -
తొలి అడుగు
భద్ర, పద్మాకర్ రావ్ హీరోలుగా, నేహా, అంజలి హీరోయిన్లుగా ఉప్పలపాటి శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మిస్పా మూవీ మీడియాపై పద్మాకర్రావ్ చిన్నతోట, ఆర్.సువర్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం కడపలో ప్రారంభమైంది. పద్మాకర్రావ్ చిన్నతోట మాట్లాడుతూ–‘‘పదహారేళ్లుగా మీడియా రంగంలో రాణిస్తున్న మా మిస్పా మూవీ మీడియా సంస్థ నిర్మాణ రంగంలో తొలి అడుగు వేసింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. -
మాస్ రత్నమాల
ఊర మాస్ రత్నమాలగా కనిపించనున్నారు అంజలి. శుక్రవారం (జూన్ 16) ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘వీఎస్ 11’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో ఆమె చేస్తున్న రత్నమాల పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శ కత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రత్నమాలగా అంజలి కనిపించనున్నారు. ఆమె పాత్ర మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. విశ్వక్ సేన్ తొలిసారి ఈ చిత్రంలో క్రూరమైన పాత్రను పోషిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మధాది, సహనిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి. -
అలాంటి వ్యక్తినే మనువాడతా!
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నటి అంజలి. రామ్ దర్శకత్వంలో కట్రదు తమిళ్ చిత్రం ద్వారా కోలీవుడ్కు కథనాయాకిగా పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి అంజలి. ఆ తరువాత అంగాడి తెరు చిత్రంతో నటిగా తానేమిటో నిరూపించుకుంది. ఎంగేయుమ్ ఎప్పోదుమ్, కలగలప్పు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. అదే విధంగా కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్, వెబ్ సీరిస్లోనూ నటిస్తూ ఇప్పటికి బిజీగానే ఉన్నారు. ఇకపోతే వ్యక్తిగత జీవితంలో ప్రేమ, పెళ్లి వంటి పలు వదంతుల్లోనూ చిక్కుకున్నారు. ముఖ్యంగా ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం షూటింగ్ సమయంలో ఆ చిత్ర కథానాయకుడు జయ్తో పరిచయం ప్రేమగా మారడం, ఇద్దరు చాలా కాలం సహ జీవనంలో ఉన్నారు అనే ప్రచారం జోరుగా సాగింది. అంతేగాక నటుడు జయ్, అంజలి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా సాగింది. అలాంటిది మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారంటూ నటి అంజలి హైదరాబాదుకు మకాం మార్చినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం 36 ఏళ్ల ఈ బ్యూటీ సింగిల్ గానే ఉన్నారు. ఇటీవల ఒక భేటీలో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు రిలేషన్షిప్లో మర్యాద చాలా ముఖ్యం అని అంజలి పేర్కొన్నారు. ఆ తర్వాతే ప్రేమ, అభిమానం అన్నీ అన్నారు. మర్యాద లేని వ్యక్తితో సంబంధమే తనకు అవసరం లేదని పేర్కొన్నారు. కెరీర్, రిలేషన్షిప్లలో ఏది కోరుకుంటారు అన్న ప్రశ్నకు తనకు రెండు ముఖ్యమన్నారు. -
‘మూడు తరాల’ మృత్యువాత!
వైరారూరల్: ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారిసహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. బాసరలో బాబుకు అక్షరాభ్యాసం చేయించి స్వస్థలానికి తిరిగి వస్తుండగా వారి ప్రయాణం మధ్యలోనే ముగిసింది. వైరా మండలం పినపాక స్టేజీ వద్ద జాతీయ రహదారిపై కారును ఎదురుగా వస్తున్న లారీ అతివేగంతో ఢీకొనడంతో అజ్మీరా రాంబాబు (52), ఆయన కుమార్తె బానోతు అంజలి (25), మనవరాలు బానోతు శ్రీవల్లి (18 నెలలు) మృతి చెందారు. ఇదే ఘటనలో బానోతు బాబు, రాణి, స్వాతి, ప్రవీణ్కు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బోడిమల్లె తండాకు చెందిన అజ్మీరా రాంబాబు, వాచ్యానాయక్ తండాకు చెందిన బానోతు బాబు వియ్యంకులు. బాబు, రాణి కుమారుడైన డెంటల్ డాక్టర్ నవీన్కుమార్తో రాంబాబు కుమార్తె అంజలికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కార్తికేయ, 18 నెలల కుమార్తె శ్రీవల్లి ఉన్నారు. కార్తికేయకు బాసరలో అక్షరాభ్యాసం చేయించేందకు బానోతు బాబు, రాణి దంపతులు వారి కుమారులు నవీన్, ప్రవీణ్, కోడళ్లు అంజలి, స్వాతి, మనవరాలు శ్రీవల్లిని తీసుకుని వియ్యంకుడు అజ్మీరా రాంబాబుతో కలసి బాసర వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి ఖమ్మం చేరుకున్నారు. అక్కడే బంధువుల ఇంట్లో ఉండి శుక్రవారం మధ్యాహ్నం కారులో వాచ్యానాయక్ తండాకు బయలుదేరారు. కారు పినపాక స్టేజీ చేరుకుంటుండగా ఎదురుగా అతివేగంతో వచ్చిన లారీ ఢీకొనడంతో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో రాంబాబు, ఆయన మనవరాలు శ్రీవల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె అంజలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. గాయపడినవారిలో బాబు, ప్రవీణ్, స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న ఏసీపీ ఎం.ఎ.రెహమాన్, సీఐ తాటిపాముల సురేశ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
అర్ధ సెంచరీ కొట్టిన అంజలి.. మరో కొత్త మూవీ ప్రకటించిన హీరోయిన్
అందం, అభినయం ఉన్న అచ్చ తెలుగు అమ్మాయి నటి అంజలి. మొదట్లో తెలుగులో రంగ ప్రవేశం చేసినా గుర్తింపు వచ్చింది మాత్రం తమిళ చిత్రాలతోనే. రామ్ దర్శకత్వం వహించిన కట్టదు తమిళ్ చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన అంజలి తొలి చిత్రంతోనే తానేమిటో నిరూపించుకుంది. ఆ తరువాత అంగాడి తెరు చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమ దృషిని తన వైపు తిప్పుకుంది. అదే విధంగా ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి పలు విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యక స్థానాన్ని ఏర్పరచుకుంది. తెలుగు, మలయాళం వంటి ఇతర భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న అంజలి నట పయనం 17 ఏళ్లు. ఇప్పటికి ఆమె అర్ధసెంచరి కొట్టింది. అవును ఈమె నటిస్తున్న 50వ చిత్రం గురించి శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. అమ్యూజ్మెంట్, ద3 ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ వేలాయుధం దర్శకత్వం వహించనున్నారు. దీనికి ఈగై అనే టైటిల్ నిర్ణయించారు. టైటిల్తో కూడిన ఫస్ట్లుక్ పోస్టర్లు చిత్ర వర్గాలు విడుదల చేశారు. ధరన్కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. #Eegai ⚖️ pic.twitter.com/5oUYSW0J40 — Anjali (@yoursanjali) May 27, 2023 చదవండి: గ్యాప్ రాలేదు, తీసుకున్నా: సాయిపల్లవి -
తెలుగమ్మాయిలకు జాక్ పాట్...బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు
-
హీరోయిన్ అంజలి పెళ్లి కుదిరిందా? మెహందీ ఫోటోలు వైరల్
పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి అంజలి టాలీవుడ్లో కంటే కోలీవుడ్లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.విభిన్నమైన పాత్రలతో తమిళంలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో సినిమాలతో పాటు వెబ్సిరీస్లతోనూ ఆకట్టుకుంది. ఇక అంజలి సినిమాల విషయం పక్కనపెడితే కొంతకాలంగా ఆమె పెళ్లిపై పలు వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలోనూ వార్తల్లో నిలిచిన అంజలి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మెహిందీ ఫోటోలను అంజలి షేర్ చేయడంతో ఆమె పెళ్లి వ్యవహారం మరోసారి హాట్టాపిక్గా మారింది. తన వ్యక్తిగత విషయాలను సినిమా విషయాలను ఎప్పటికప్పుడు పంచుకునే అంజలి తాజాగా కొన్ని మెహందీ ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు అంజలికి పెళ్లి కుదిరిందా అని చర్చిస్తున్నారు. అయితే ఆ ఫోటో అంజలి మెహేంది ఫంక్షన్ కి సంబంధించినవి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.తమిళ కొత్త సంవత్సరం కావడంతో అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన అంజలి ఇలా తన మెహందీ ఫోటోలను పంచుకుంది. దీనికి క్యాప్షన్ కూడా ఇవ్వడంతో అంజలి పెల్లి వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది. View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) -
మానవ మృగాలు.. అంజలిని కాపాడే వీలున్నా..
క్రైమ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కంజావాలా మృతి కేసులో ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితుల(నలుగురు ప్రధాన నిందితులు) పేర్లను చేరుస్తూ.. 20 ఏళ్ల అంజలి మృతికి కారణమయ్యారంటూ ఢిల్లీ పోలీసులు ఛార్జ్షీట్లో పొందుపరిచారు. అంతేకాదు ఆమెను కాపాడే వీలున్నా అందుకు కనీస ప్రయత్నం చేయలేదని, పైగా ఆమెను చంపే ఉద్దేశంతోనే కారుతో ఈడ్చుకెళ్లారని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఘటన సమయంలో బాధితురాలు అంజలిని కాపాడే అవకాశాలు రెండుసార్లు కలిగినా కనికరం లేకుండా నిందితులు ముందుకు సాగారని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. మొదట.. స్కూటీపై వెళ్తున్న ఆమెను కారుతో ఢీ కొట్టారని, అప్పుడే ఆగి ఆమెను రక్షించే వీలున్నా ఆ ప్రయత్నం చేయలేదని తెలిపారు. రెండు.. ఢీ కొట్టిన తర్వాత ఆమె కారు కింద ఇరుక్కుందని వాళ్లకు తెలుసు. దిగి ఆమెను కాపాడే అవకాశం అప్పటికీ ఉంది. అయినా నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఆమెను సుల్తాన్పురి నుంచి కంజావాలా మధ్య 12 కిలోమీటర్లపాటు ఈడ్చుకెళ్లారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న అంజలి, ఆమె స్నేహితురాలిని తొలుత కారుతో ఢీ కొట్టారు నిందితులు. అంజలి కాలు కారు కిందే ఇరుక్కుపోగా.. స్నేహితురాలు కాస్త దూరంలో కింద పడిపోయి భయంతో అక్కడి నుంచి పారిపోయింది. ఆపై అంజలిని కారుతో ఈడ్చుకుంటూ వెళ్లిపోయారు నిందితులు. ఈ క్రమంలో ఆమె ప్రాణం పోతుందని తెలిసినా కూడా నిందితులు ముందుకు సాగడం ఘోరం. ఈ కేసులో నలుగురు నిందితులు అమిత్ ఖన్నా, కృష్ణన్, మనోజ్ మిట్టల్, మిథున్లపై హత్య నేరాభియోగాలను ఛార్జ్షీట్లో నమోదు చేశారు పోలీసులు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం వాళ్లపై అభియోగాలు నమోదు అయ్యాయి. స్కూటీని ఢీ కొట్టి 500-600 మీటర్ల దూరం వెళ్లాక.. డ్రైవర్ పక్క సీట్లో ఉన్న నిందితుడు, వెనకాల ఉన్న నిందితుడు ఇద్దరూ.. ఆమె ఇంకా కారు కింద ఉందా? లేదా? అనేది చూశారు. ఉందని నిర్ధారించుకున్న తర్వాత కూడా కారును ముందుకు పోనివ్వాలని డ్రైవర్ సీట్లో ఉన్న నిందితుడికి సూచించారు. అలా ముందుకు వెళ్లే క్రమంలో.. ఆమె దుస్తులు చినిగిపోయి, వీపు చిట్లిపోయి వెన్నుపూస బయటకు వచ్చేసింది. పుర్రె భాగం సైతం పగలిపోయింది. ఈడ్చుకెళ్లే దారిలోనే ఆమె ప్రాణం పోయిందని శవ పరీక్షలో వెల్లడైంది. తాము చేస్తున్న పని ఆమెను గాయపర్చడమే కాదు.. ప్రాణాలకు ముప్పు కలిగించేదని తెలిసి కూడా మృగాల్లా నిందితులు వ్యవహరించారని, ఈ కేసులో మద్యం మత్తు అనేది కేవలం తప్పించుకునే సాకుగానే కనిపిస్తోంది తప్ప నిందితులు ఘటన సమయంలో స్పృహలోనే ఉన్నారని, వాళ్లకు ఆ నేర తీవ్రత గురించి కూడా తెలుసని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ ఛార్జ్షీట్ ఆధారంగా ఢీల్లీ రోహిణి కోర్టు ఏప్రిల్ 18వ తేదీన వాదనలు విననుంది. -
లవ్ ఫెయిల్యూర్.. పెద్దలు కుదిర్చిన సంబంధానికి అంజలి ఓకే!
పదహారణాల తెలుగు అమ్మాయి నటి అంజలి. అయితే ఈ బ్యూటీలోని నటిని ముందుగా గుర్తించి, ఆదరించింది మాత్రం తమిళ చిత్తమే. ఇక్కడ రామ్, వసంత బాలన్, శరవణన్ వంటి ప్రతిభావంతులైన దర్శకుల చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి చిత్రం కట్రదు తమిళ్తోనే ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్న అంజలి ఆ తర్వాత తమిళంలో వరుసగా చిత్రాలు నటిస్తూ వచ్చారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టి ఈమైపె పడింది. అలా అక్కడ కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కాగా తమిళంలో నటుడు జయ్ సరసన నటించి ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి చిత్రంలో అంజలి నటించారు. అప్పుడే వీరిమధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత బెలూన్ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ మొలకెత్తింది. దీంతో కొన్నాళ్లు జయ్, అంజలి డీప్ లవ్లో మునిగి తేలినట్లు ప్రచారం జరుగుతుంది. ఒక దశలో పెళ్లికి సిద్ధమైనట్లు ప్రచారం హోరెత్తింది. ఆ తర్వాత మనస్పర్థలు కారణంగా విడిపోయినట్లు వార్తలు దొర్లాయి. నటి అంజలి కూడా ఆ మధ్య ఒక భేటీలో జయ్ పేరు చెప్పకుండా ఒక వ్యక్తితో రిలేషన్ ఏర్పరచుకున్న కారణంగా కెరీర్ పై దృష్టి పెట్టలేక పోయానని, అయితే అది తప్పుడు రిలేషన్ షిప్ అని తెలిసిరావడంతో ఆ బంధం నుంచి బయటికి వచ్చి మళ్లీ నటించడం ప్రారంభించానని చెప్పారు. కాగా ఇప్పుడు అంజలి ప్రేమ విఫలం కావడంతో ఇప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లికి సిద్ధమవుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. ఓ వ్యాపారవేత్తతో అంజలి పెళ్లి కుదిరినట్లు, త్వరలోనే ఆమె పెళ్లి గురించి అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇందులో వాస్తవం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. -
పెళ్లికి సిద్ధమైన అంజలి.. ఈ సారైనా..!
నటి అంజలి పరిచయం అక్కర్లేని పేరు. అటు టాలీవుడ్.. ఇటు కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల ఆమె సినిమాలు చేయకపోయినా.. వెబ్ సిరీస్ ఝాన్సీతో ప్రేక్షకులను అలరించింది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా మరోసారి అంజలి పెళ్లి రూమర్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాాగా.. గతంలో ఆమె ఓ డైరెక్టర్ను పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిని కొట్టిపారేసింది అంజలి. కానీ తాజాగా మరోసారి వార్తలు గుప్పుమనడంతో అతను ఎవరా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. టాలీవుడ్లో మహేష్ బాబు-వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలో వెబ్ సిరీస్ల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లాడబోతోందని సమాచారం. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అంజలి తల్లిదండ్రులు యుఎస్లో ఉన్నారు. గతంలో పలుసార్లు పెళ్లి వార్తలొచ్చినప్పటికీ మరోసారి పెళ్లి చేసుకోబోతోందని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్ మూవీ ఆర్సీ15లో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అంజలి పెళ్లి చేసుకోనుందని సమాచారం. -
అత్తెసరు మార్కులు వచ్చే అమ్మాయి నుంచి సీఈఓగా.. లాభాల బాటలో..
పరీక్షల్లో అత్తెసరు మార్కులు వచ్చే అమ్మాయి... మాస్టర్ ప్రశ్న అడిగితే బిత్తరచూపులు చూసే అమ్మాయి... క్లాసురూమ్లో కూర్చొని పాఠం వినడాన్ని భారంగా భావించే అమ్మాయి ‘భవిష్యత్ ఎలా ఉండబోతుంది?’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎవరికైనా కష్టం కాకపోవచ్చు. మరి అదే అమ్మాయి చదువుపై శ్రద్ధ చూపితే...సమాధానం చెప్పడం అంజలి సూద్కు మాత్రమే సాధ్యమవుతుంది. అంజలి సూద్ అమెరికాలోని ఫ్లింట్ నగరం(మిచిగాన్)లో పుట్టింది. తల్లిదండ్రులు పంజాబ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. చిన్నప్పుడు పరీక్షలలో అంజలి చాలా పొదుపుగా తెచ్చుకునే మార్కులను చూసి‘ఈ అమ్మాయి హైస్కూల్ దాటి కాలేజీ గడప తొక్కడం కష్టమే’ అనుకునేవారు పెద్దలు. క్లాస్రూమ్లో టీచర్ ఎప్పుడైనా పాఠానికి సంబంధించిన ప్రశ్న ఏదైనా వేస్తే ఆమె జవాబు చెప్పిన సందర్భం అంటూ లేదు. అలాంటి అమ్మాయి కాస్తా కాలక్రమంలో మారింది, చదువు మీద శ్రద్ధ పెట్టింది. మార్కులు పెంచుకుంటూ పోయింది. ‘బాగా చదువుతున్నావు’ అనే ప్రశంస ఆమెకు మరింత బలాన్ని ఇచ్చి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా చేసింది. ‘వార్టన్ స్కూల్ ఆఫ్ ది యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా’లో ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ చదువుకున్న అంజలి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసింది. చదువు పూర్తయిన తరువాత ఫైనాన్స్, మీడియా, ఇ–కామర్స్కు సంబంధించిన సంస్థల్లో పనిచేసింది. అంజలి ప్రతిభ గురించి ఆ నోటా ఈ నోటా విన్న ఆన్లైన్ వీడియో మార్కెటింగ్ సంస్థ ‘విమియో’ తమ సంస్థలోకి ఆహ్వానించింది. ‘హెడ్ ఆఫ్ గ్లోబల్ మార్కెటింగ్’ ‘జనరల్ మేనేజర్’ (కోర్ క్రియేటర్ బిజినెస్) హోదాల్లో పనిచేసింది. విమియో బిజినెస్ (మార్కెటింగ్, బ్రాండ్స్కు మెంబర్షిప్ ప్లాన్)లాంటి ఎన్నో కార్యక్రమాలను లాంచ్ చేసి సక్సెస్ అయింది. అంజలి సృజనాత్మక ఆలోచనలు, వ్యాపార ఎత్తుగడలు నచ్చి సంస్థ ఆమెను ‘సీయీవో’ స్థానంలో కూర్చోబెట్టింది. సీఈవోగా కొత్త స్ట్రాటజీతో ముందుకు దూసుకు వెళ్లింది. వీడియో క్రియేటర్స్ కోసం కొత్త సాఫ్ట్వేర్ను, టూల్స్ను ప్రవేశ పెట్టింది. ‘మనం చేస్తున్న బిజినెస్ మాత్రమే’ అన్నట్లుగా కాకుండా చుట్టుపక్కల ఏం జరుగుతోందో గమనించడం అంజలి అలవాటు. వీడియో ఎడిటింగ్ అండ్ వీడియో మార్కెటింగ్ సంస్థ ‘మాజిస్టో’ను కొనుగోలు చేయడం ‘విమియో’కు కలిసొచ్చింది. 34 ఏళ్ల వయసులోనే సీయీవోగా బాధ్యతలు చేపట్టి ‘విమియో’ను వరల్డ్స్ లార్జెస్ట్ ఆన్లైన్ యాడ్–ఫ్రీ వీడియో ప్లాట్ఫామ్గా ఉన్నతస్థానంలో నిలిపింది అంజలి. ‘నేను ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చేసిన పనికి గుర్తింపు లభిస్తే చాలు అనుకునేదాన్ని. ఆ గుర్తింపే నన్ను ఇక్కడ వరకు తీసుకువచ్చింది. ఒక పెద్ద బాధ్యత మనల్ని వెదుక్కుంటూ వచ్చినప్పుడు నేను చేయగలనా? అని భయపడడం కంటే ఎందుకు చేయలేను అని అనుకోవడంలోనే సక్సెస్ మంత్ర దాగి ఉంది’ అంటుంది అంజలి. చిన్న వయసులోనే కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరిన అంజలి మహిళలకు స్ఫూర్తిదాయకం. చదవండి: Meenakshi Gadge: ఇది మీనాక్షి ఊరు.. సినిమాల్లోనే ఇలాంటి పల్లె ఉంటుందా? అదేం కాదు.. వైకల్యాన్ని జయించి, స్పూర్తిగా నిలిచిన గీతా ఎస్ రావు -
నటిపై లైంగిక వేధింపులు.. షూటింగ్ అయిపోయాక కూడా..!
సూపర్స్టార్ రజనీకాంత్ 'అన్నాత్తె', మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 'మామనిథన్' చిత్రాలతో పేరు తెచ్చుకున్న మలయాళ భామ అంజలి నాయర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె సంచలన ఆరోపణలు చేసింది. తన సహా నటుడు లైంగిక వేధింపులకు గురి చేశాడని తెలిపింది. అతడి వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించినట్లు నటి వెల్లడించింది. కాగా.. అంజలి మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్గా చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. అంజలి నాయర్ మాట్లాడుతూ.. 'నాది కేరళ అయినప్పటికీ తమిళ భాష బాగా తెలుసు. ఆ కారణంగానే నేను తమిళ చిత్రాల్లో నటించాలనుకున్నా. నా మొదటి తమిళ చిత్రంలో నటిస్తున్నప్పుడు విలన్ పాత్ర పోషిస్తున్న నటుడు అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. అతను ఆ చిత్రానికి సహ-నిర్మాత కూడా. షూటింగ్ అయిపోయినా నన్ను సెట్ నుంచి వెళ్లనివ్వలేదు. నన్ను ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. ఒకసారి నన్ను రైలు నుంచి తోసి చంపడానికి ప్రయత్నించాడు. నన్ను రకరకాలుగా వేధిస్తూనే ఉన్నాడు. అతని వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించా. ఆ కారణంగా కేరళకు తిరిగి వెళ్లా' అని అన్నారు. అంజలి ప్రకటనతో సినీ పరిశ్రమలో దుమారం రేపింది. అంజలి వ్యక్తిగత విషయానికి వస్తే.. అంజలి నాయర్ 2011లో అనీష్ అనే ఫిల్మ్ మేకర్ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతనితో విడాకులు తీసుకుంది. గతేడాది అజిత్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ని పెళ్లి చేసుకుంది. -
అంజలి సూపర్ హిట్ వెబ్సిరీస్ 'ఝాన్సీ'కి సీక్వెల్
తమిళ సినిమా: నటి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ఝాన్సీ. ట్రైబల్ హార్స్ ఎంటర్టైన్మెంట్పై నటుడు కృష్ణ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్కు తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మొదటి భాగం డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయ్యి విశేష ఆదరణను పొందింది. తాజాగా ఝాన్సీ రెండో భాగం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అదే ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా వెబ్ సిరీస్ నిర్మిస్తున్న కృష్ణ మాట్లాడుతూ.. నిజానికి ఈ వెబ్ సిరీస్ను తెలుగులో రూపొందిస్తున్నామని.. తమిళం, హిందీ భాషల్లో అనువాదంగా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చెప్పారు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ వెబ్సిరీస్ తొలి భాగం కంటే రెండో భాగానికి మరింత ఆదరణ లభిస్తోందని అన్నారు. ఝాన్సీ వెబ్ సిరీస్ మూడో భాగాన్ని రూపొందిస్తామని చెప్పారు. నిర్మాతగా కొనసాగుతున్న తాను కథానాయకుడిగా నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. త్వరలోనే తాను నటించే నూతన చిత్రం వివరాలను వెల్లడిస్తానని కృష్ణ చెప్పారు. దర్శకుడు తిరు మాట్లాడుతూ.. దీన్ని తెలుగులో రపొందించినా తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఇప్పుడు హిందీలోన మంచి ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఎంతగానో శ్రమించిన నటి అంజలి, చాందిని, యూనిట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. -
ఐదేళ్ల తర్వాత మళ్లీ అక్కడ అంజలి
తమిళ సినిమా: నటి అంజలి 5 ఏళ్ల తర్వాత మాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చారు. పదహారణాల తెలుగు అమ్మాయి అయిన ఈమె ముందు తమిళంలో కథానాయకిగా రాణించి ఆ తర్వాత మాతృభాష తెలుగులో గుర్తింపు పొందారు. తమిళంలో ఎక్కువగా యువ హీరోలతో జతకట్టిన ఈ బ్యూటీ తెలుగులో మాత్రం బాలకృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ హీరోల సరసన నటించారు. అదేవిధంగా ఐటెం సాంగ్స్లోనూ మెరిశారు. వెబ్ సిరీస్లూ చేస్తున్నారు. తాజాగా శంకర్ దార్శకత్వంలో రామ్చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఒక హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా అంజలి తమిళం, తెలుగు భాషలోనే కాకుండా మలయాళం వంటి ఇతర భాషల్లోనూ నటిగా గుర్తింపు పొందారు. ఈమె 2010లో పైన్స్ అనే చిత్రం ద్వారా మాలీవుడ్లో పరిచయం అయ్యారు. ఆ తరువాత 2018లో రోసాపూ చిత్రంలో నటించారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఎప్పుడు మూడోసారి రట్ట అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. జోసెఫ్ చిత్రం ఫేమ్ జోజు జార్జ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఇందులో నటి అంజలి కథానాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దశలో ఉంది. అంజలి పాత్రతో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. -
యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఢిల్లీలో జనవరి 1న యువతిని కారులో ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది కేంద్ర హోంశాఖ. మొత్తం 11 మంది పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డీసీపీ స్థాయి అధికారితో పాటు 10 మంది పోలీసులపై వేటు వేసింది. జనవరి 1న ఈ ఘటన జరిగిన రూట్లో డ్యూటీ చేసిన అధికారులపై ఈమేరకు చర్యలకు ఉపక్రమించింది. వీరంతా ఆ రోజు మూడు పోలీస్ కంట్రోల్ రూం వ్యాన్లు, రెండు పికెట్లలో విధులు నిర్వహించారు. ఢిల్లీ కంఝవాలాలో జనవరి 1న స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టారు కొందరు యువకులు. మద్యం మత్తులో వాహనాన్ని నడిపారు. అంజలి చక్రాల మధ్య ఇరుక్కున్నా పట్టించుకోకుండా 12 కిలోమీటర్లు కారును అలాగే రోడ్డుపై తిప్పారు. ఈ కిరాతక ఘటనలో యువతి మృతిచెందింది. తెల్లవారుజామున నడిరోడ్డుపై నగ్నంగా ఆమె మృతదేహం లభ్యమవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే అంజలిని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన రోజు విధుల్లో ఉన్న పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆరోజు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను హోంశాఖ సస్పెండ్ చేసింది. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ను ప్రారంభించిన మోదీ.. -
షాకింగ్.. ఢిల్లీ ఘటన అంజలి ఇంట్లో చోరీ.. ఫ్రెండ్ నిధిపైనే అనుమానం!
న్యూఢిల్లీ: ఢిల్లీలో జనవరి 1న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో ఆమె మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అమన్ విహార్లోని ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. కొందరు దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. మరొకొన్నింటిని ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం 7:30గంటల సమయంలో అంజలి తల్లిదండ్రులకు పొరుగింటివారు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇంట్లో టీవితో పాటు ఇతర విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారని అంజలి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ చోరీలో అంజలి స్నేహితురాలు నిధి హస్తం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఇంటివద్ద భద్రతగా ఉన్న పోలీసులు దొంగతనం జరిగిన రోజు ఎందుకు లేరని ప్రశ్నించారు. అయితే పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించాల్సి ఉంది. జనవరి 1న అంజలి, ఆమె స్నేహితురాలు నిధి స్కూటీపై వెళ్తుండగా మద్యం సేవించిన యువకులు కారుతో ఢీకొట్టారు. అంజలి కారు చక్రాల కింద ఇరుక్కున్నా పట్టించుకోకుండా వాహనాన్ని 12 కిలోమీటర్లు తిప్పారు. దీంతో ఆమె దారుణంగా చనిపోయింది. న్యూ ఇయర్ రోజున అంజలి మృతదేహం రోడ్డుపై నగ్నంగా లభ్యమవ్వడం కలకలం రేపింది. అయితే అంజలి కారు కింద పడిపోయినప్పుడు నిధి ఆమె పక్కనే ఉంది. కానీ ఎలాంటి సాయం చేసేందుకు ప్రయత్నించకుండా అక్కడి నుంచి పారిపోయింది. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చదవండి: అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు.. -
కారు కింద ఇరుక్కుందని తెలుసట!
న్యూఢిల్లీ: ఢిల్లీలో డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి దాటాక స్కూటీపై వెళ్తున్న అంజలీ సింగ్ను ఢీకొట్టి, 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటనలో పోలీసు విచారణలో మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. తమ కారు కింద ఒక మహిళ ఇరుక్కుపోయిన విషయం తెలుసునని, కారాపి ఆమెను విడిపించినప్పటికీ హత్య కేసు నమోదవుతుందని భయపడ్డామని నిందితులు తెలిపారని పోలీసులు ఆదివారం వెల్లడించారు. అందుకే, మహిళ శరీరం కారు నుంచి విడిపోయేదాకా ఆపకుండా నడిపినట్లు చెప్పారన్నారు. సుల్తాన్పురి నుంచి కంఝావాలా వరకు పలుమార్లు కారును యూ టర్న్ తీసుకుని 12 కిలోమీటర్ల మేర అంజలిని లాక్కెళ్లగా ఆమె తీవ్ర గాయాలతో చనిపోయిన విషయం తెలిసిందే. తమ కారు కింద ఒక మహిళ ఇరుక్కున్న విషయం తెలియదని, విషయం తెలిశాక అక్కడి నుంచి పరారైనట్లు అంతకుముందు నిందితులు తెలిపిందంతా అబద్ధమని తేలింది. అంజలి, తన స్నేహితురాలు నిధి కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో నిధి స్వల్పగాయాలతో బైటపడగా, అంజలి కారు కింద ఇరుక్కుంది. కాగా, ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
Delhi: దారుణానికి ముందు గొడవ పడ్డ అంజలి, నిధి
న్యూఢిల్లీ: ఢిల్లీలో అంజలీ సింగ్ అనే యువతిని కారు ఢీకొట్టి, 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటనలో మరికొన్ని విషయాలు వెలుగుచూశాయి. డిసెంబర్ 31వ తేదీ రాత్రి అంజలి స్కూటీపై ఆమె స్నేహితురాలు నిధి కూడా ఉన్నట్లు తేలింది. అయితే, అంతకుముందు వారిద్దరూ డబ్బు విషయమై ఘర్షణకు కూడా దిగినట్లు అంజలి స్నేహితుడొకరు వెల్లడించాడు. ఈ కేసులో నిందితులను కాపాడేందుకు యత్నిస్తున్నట్లు అనుమానాలున్న అశుతోష్ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో అనుమానితుడు అంకుశ్ ఖన్నా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇలా ఉండగా, మృతురాలు అంజలీ సింగ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఇదీ చదవండి: అంజలి ఘటనతో అట్టుడుకుతున్న ఢిల్లీ.. మహిళా కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు -
అంజలి కేసు: ఘటన తర్వాత పక్కా ప్లాన్తోనే..
ఢిల్లీ: సుల్తాన్పురి హిట్ అండ్ రన్ కేసు ఊహించని మలుపులు తీసుకుంటోంది. పోలీసుల దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెల్లడి అవుతోంది. ఘటన జరిగిన సమయంలో కారు ఉంది ఐదుగురు కాదని, కేవలం నలుగురే ఉన్నారని తాజాగా పోలీసులు ప్రకటించడం ఈ కేసును మలుపు తిప్పింది. అంతేకాదు.. ఈ కేసులో కారు నడిపింది దీపక్ ఖన్నా కాదని గురువారమే సంచలన ప్రకటన చేశారు పోలీసులు. ఘటన జరిగిన సమయంలో కారు నడిపింది తనేనని దీపక్ ఖన్నా అనే వ్యక్తి పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో దీపక్తో పాటు కారులో ఉన్నారని చెబుతూ ముందుకొచ్చిన మనోజ్ మిట్టల్, అమిత్ ఖన్నా, కృషన్, మిథున్లను పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే.. దర్యాప్తులో వీళ్లను తప్పించేందుకు మరో ఇద్దరు యత్నించారని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించి.. వాళ్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. వాళ్లే కారు ఓనర్ అశుతోష్, మరో నిందితుడు అంకుశ్ ఖన్నా. అయితే.. అంకుశ్ ఖన్నా.. అమిత్ ఖన్నా సోదరుడు. ఘటన జరిగిన సమయంలో డ్రైవింగ్ సీట్లో ఉంది అమిత్ ఖన్నా. ఈ విషయాన్ని సోదరుడికి చెప్పాడు అమిత్. అమిత్ ఖన్నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. దీంతో సోదరుడికి ఏం జరగకూడదనే ఉద్దేశంతో కార్ ఓనర్ అశుతోష్ను కలిసి ఈ ప్రమాద ఘటన గురించి చర్చించాడు అంకుశ్. ఆపై ఎలాగోలా నేరం తనపైనే వేసుకునేలా దీపక్ను ఒప్పించారు. కారు నడిపింది అమిత్ ఖన్నా అని, ఘటన జరిగిన సమయంలో అసలు దీపక్ కారులోనే లేడని, ఇంట్లో ఉన్నాడని పోలీసులు తాజాగా వెల్లడించారు. డబ్బు ఆశ చూపించడం వల్లనో, స్నేహితుడనే కారణంతోనో ఆ నేరం తనపై వేసుకునేందుకు దీపక్ ముందుకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అశుతోష్ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అంకుశ్ ఖన్నా కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో స్కూటీపై వస్తున్న అంజలి సింగ్, నిధిలను కారుతో ఢీ కొట్టారు ఈ నిందితులు. నిధి పక్కకు పడిపోగా.. అంజలి కాలు కారు కింది భాగంలో ఇరుక్కుపోయింది. సాయం కోసం ఆమె అరుస్తుండగానే.. అదేం పట్టనట్లు ముందుకు వెళ్లిపోయారు కారులో ఉన్న వాళ్లు. అది చూసి భయంతో నిధి అక్కడి నుంచి జారుకుంది. అయితే కొద్ది దూరం వెళ్లాక అంజలి మోచేయి భాగం కనిపించిందని, అయినా మద్యం మత్తులో పట్టించుకోకుండా వాళ్లు ముందుకు వెళ్లిపోయారని తెలుస్తోంది. అలా గంట.. రెండు గంటల మధ్య సుల్తాన్పురి నుంచి 13 కిలోమీటర్ల పాటు ప్రయాణించి.. దారిలో యూటర్న్లు కొడుతూ.. కంఝావాలా వద్ద ఆమె మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోయారు. చివరికి కారును అశుతోష్కు అప్పగించి.. ఓ ఆటోలో కారులోని నలుగురు పారిపోయారు. అంజలిని అలా ఈడ్చుకెళ్లే క్రమంలో ఆమె దుస్తులు చినిగిపోవడంతోపాటు తీవ్ర గాయాలై మరణించింది. శరీరంపై 40 గాయాలు అయ్యాయి. చర్మం ఒలుచుకుపోయి ఉంది. పక్కటెముకలు బయటకు పొడుచుకువచ్చాయి. తల పలిగి పుర్రె భాగం బయటకు వచ్చింది. సగం మెదడు ఎక్కడో పడిపోయింది అని శవ పరీక్షలో తేలింది. తల పగిలి, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడం, అవయవాలు దెబ్బ తినడంతో రక్తస్రావం జరిగి ఆమె మృతి చెందని పోస్ట్మార్టం నివేదికలో నిర్ధారణ అయ్యింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు అత్యాచారం జరగలేదని తేలింది. -
Kanjhawala Case:‘సాక్ష్యాలను దాచేందుకు ప్రయత్నం.. సీబీఐకి అప్పగించాలి’
Delhi Horror: ఢిల్లీ కారు ప్రమాదంలో మృతిచెందిన అంజలి సింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశం మొత్తాన్ని కుదిపేసిన ఈ ఘటనలో తవ్వేకొద్ది అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరైన సమయంలో ఢిల్లీ పోలీసులు స్పందించలేదంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. నిందితులకు ఉరితీయాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సుల్తాన్పురి కారు ప్రమాద కేసులో పోలీసుల విచారణ సంతృప్తి కరంగా లేదంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ ఎస్ మలివాల్ మండిపడ్డారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నిధి ఫోన్ స్వాధీనం చేసుకోలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అది ఈ కేసులో చాలా ముఖ్యమైన సాక్షం. ఇందులో పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది. పోలీసుల వైఫల్యం పోలీసులు ఇప్పటికీ యువతి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన 13 కిలోమీటర్ల దూరంలోని అన్నీ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించలేదు. 164 సీఆర్పీసీ ప్రకారం ప్రత్యక్ష సాక్షులు స్టేట్మెంట్ను రికార్డ్ చేయలేదు. కారు చక్రాల కింద యువతి మృదేహం చిక్కుకుందని ఉదయం 2.22 నిమిషాలకు పోలీసులుకు సమాచారం వచ్చింది. కానీ పోలీసులు ఉదయం.4.15 నిమిషాలకు నగ్న స్థితిలో ఉన్న మహిళ మృతదేహం రోడ్డుపై పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న తర్వాతే చర్యలు ప్రారంభించారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని సిఫార్సు చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. 18 బృందాలుగా కాగా అంజలి సింగ్ కేసుపై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. దీనిపై 18 బృందాలు పనిచేస్తున్నాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు అశుతోష్కు చెందినదిగా.. యాక్సిడెంట్ సమయంలో అమిత్ కారు డ్రైవ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో మరో ఇద్దరి(అశుతోష్, అంకుష్) ప్రయేయం ఉన్నట్లు పేర్కొన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వీరిద్దరూ మిగతా అయిదుగురు నిందితులకు స్నేహితులని పేర్కొన్నారు. అయితే వీరు ప్రమాద సమయంలో కారులో లేరని, మిగిలిన ఐదుగురు నిందితులను రక్షించేందుకు ఇద్దరూ ప్రయత్నించారని పేర్కొన్నారు. ఏ సంబంధం లేదు నిందితులకు మృతురాలు, ఆమె స్నేహితురాలు నిధితో ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితులు అనేక సాక్ష్యాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వీలైనంత త్వరలో ఈ కేసులో చార్జీషీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇద్దరు కొత్త నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. నిందితులకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలని భావిస్తున్నారని పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు కారు కింద అంజలి మృతదేహాన్ని గమనించి అక్కడి నుంచి ఆటోలో పరారయ్యాడని, అంజలి ఫోన్ ఇప్పటి వరకు దొరకలేదని వెల్లడించారు. చదవండి: యూపీ సీఎం కాషాయ దుస్తులపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. #StandWithAnjali@priyanktripathi shares more information about Ashutosh, the main owner of the car involved in the death of Anjali.@Aditi14Bhardwaj dissects the details emerging from the latest CCTV footage which shows the accused getting down & checking the car. pic.twitter.com/PiRaH6j83d — TIMES NOW (@TimesNow) January 5, 2023 -
ఆమెను చంపింది ఎవరు?
కొన్ని ఘటనలు ఉలిక్కిపడేలా చేస్తాయి. విస్మరిస్తున్న వాస్తవాలను కటువుగా కళ్ళెదుట నిలిపి, జవా బివ్వమని ప్రశ్నిస్తాయి. కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్న క్షణాలలో ఢిల్లీలో జరిగిన దారుణ ఘటన అలాంటిదే. న్యూ ఇయర్ పార్టీ నుంచి స్కూటీ మీద ఇంటికి తిరిగి వెళుతున్న అంజలి అనే 20 ఏళ్ళ చిరుద్యోగిని ఎదురుగా కారులో అయిదుగురు యువకులు ఢీ కొట్టి, సుల్తాన్పురి నుంచి కంఝా వాలా వరకు 12 కి.మీ పైగా అలాగే రోడ్డుపై కారుతో ఈడ్చుకెళ్ళి ప్రాణం తీసిన ఘటన ఘోరం. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని తేల్చినా, తలకూ, వెన్నుకూ బలంగా దెబ్బలు తగిలాయనీ, పక్కటెముకలు బయటకొచ్చాయనీ, మెదడు మిస్సయిందనీ చెబుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది కారు ముందు భాగంలో ఎడమవైపు చక్రం కింద ఇరుక్కొని, రక్షించమని కేకలు పెడుతున్నా పట్టించుకోని వాహనదారుల మదోన్మత్తత వల్ల ఒంటి నిండా 40కి పైగా గాయాలతో బాధితురాలు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తుంది. కాపాడమని ఆమె అరుస్తున్నా, ప్రత్యక్షసాక్షి ఒకరు కారును వెంబడిస్తూ పదే పదే ఫోన్ చేసినా పట్టించుకోని గస్తీ పోలీసుల లోపం కోపం తెప్పిస్తుంది. ఇది అరుదైన ప్రమాదం కాదు, అమానవీయ హత్య అనిపిస్తుంది. మంచు కమ్మేసిన శీతకాలంలో... దారి కనిపించని చిమ్మచీకటిలో... ఢిల్లీలో వెలగని వీధి దీపాలు, లోపభూయిష్ఠ పాలనా వ్యవస్థ, అలక్ష్యం చూపిన పోలీసులు, ఒంటరి స్త్రీని చూస్తే చెలరేగే వంకర బుద్ధులు – ఇలా అందరూ కలసి చేసిన హత్య ఇది. దీంతో, అమృతోత్సవ భారతంలోనూ బయట ఎంత సురక్షితమనే ప్రశ్న ఉదయిస్తుంది. కేంద్ర హోమ్శాఖ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, నివేదిక కోరడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం కాక తప్పలేదు. హంతక వాహనం తమ ముందు నుంచే పోతున్నా పట్టించుకోని పోలీస్ గస్తీ వ్యాన్ సహా అనేక లోపాలు జరిగాయని ఒప్పుకోక తప్పలేదు. మృతురాలితో కలసి ఆ రాత్రి స్కూటీపై ప్రయాణించి, ప్రమాదం జరిగాక ఎవరికీ ఏమీ చెప్పకుండా పోయిన రెండో యువతి నిధి మాటలు, చేష్టలు అనుమానాస్పదమే. కారు కింద యువతి ఉందని తెలీక బండి నడిపామంటున్న నిందితుల మాటలూ నమ్మశక్యం కానివి. వారు అక్కడక్కడే అనేక యూ టర్న్లు తీసుకుంటూ బండి నడిపిన విధానం కారు కింది బాధితురాలి శరీరాన్ని వదిలించుకోవాలని చేసిన ప్రయత్నమే. అందరి దృష్టితో ఇప్పుడిప్పుడే వేగవంతమవుతున్న దర్యాప్తులో పోనూపోనూ మరిన్ని బయటపడవచ్చు. నేరం జరగకుండా నిరోధించాలి, ఒకవేళ జరిగితే త్వరితిగతిన సాక్ష్యాధారాలు సేకరించాలి. ఈ రెంటిలోనూ ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు. ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తూ, తండ్రి లేని కుటుంబానికి తానే ఆధారమైన అమ్మాయి ప్రాణాలు కోల్పోయిన ఈ కంఝావాలా ఘటన అనేక చేదు నిజాలు చెబుతోంది. ఘటనవేళ ప్రత్యక్షసాక్షి పదే పదే ఫోన్ చేసినా, పోలీస్ స్పందన అమితాలస్యమైంది. ప్రమాదం జరిగినా కారును వేగంగా ముందుకూ వెనకకూ దూకిస్తూ, కిలోమీటర్ల దూరం పోనిచ్చిన యువకుల తీరు చట్టమంటే భయం లేనితనానికి ప్రతీక. అలాగే, పోలీసులకూ, పౌరవ్యవస్థలకూ మధ్య సమన్వయమూ కొరవడింది. ‘పోలీస్ కంట్రోల్ రూమ్’ వ్యాన్ తమ దోవలో ఎదురుపడ్డా హంతక వాహనాన్ని ఆపకపోవడం మరీ దారుణం. పోలీస్ స్పందనలో పెరగాల్సిన వేగం సహా ఇది అనేక పాఠాలు నేర్పుతోంది. అయితే, ఈ ఘటన పాలకులు చేపట్టాల్సిన చర్యలకు బదులు ఢిల్లీని పాలిస్తున్న ఆప్, దేశాన్ని పాలిస్తున్న బీజేపీల మధ్య ఆరోపణల పర్వానికి దారితీసింది. అరెస్టయిన నిందితుల్లో ఒకరు బీజేపీ సభ్యుడు కావడం అగ్నికి ఆజ్యం పోసింది. రాజకీయాలు పక్కనపెడితే, ఢిల్లీ లాంటి చోట కొన్నేళ్ళ క్రితం దాకా కేంద్రీయ పోలీసు స్పందనా వ్యవస్థ ఉండేది. ఎక్కడ నుంచి సహాయం కోరుతూ ఏ కాల్ వచ్చినా యంత్రాంగం అప్రమత్తమై, దగ్గరలోని సిబ్బందిని హుటాహుటిన పంపే వీలుండేది. ఆ వ్యవస్థను మార్చేయడం పెద్ద పొరపాటు. ఆ కేంద్రీయ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలి. మహిళా పోలీస్ స్టేషన్లతో పాటు మహిళా గస్తీ సిబ్బంది అవసరం. దాని వల్ల సామాన్య మహిళలకు భరోసా పెరుగుతుంది. 24 గంటల పోలీస్ పోస్ట్ల సమర్థ నిర్వహణ, గస్తీ, ఎలక్ట్రానిక్ నిఘా చట్టాన్ని అతిక్రమించాలనుకొనేవారికి బెదురు పుట్టిస్తాయి. దేశంలో రోజూ 415 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని లెక్క. పైగా, 2021లో రోడ్డు ప్రమాద మరణాల్లో సగం మంది ద్విచక్ర వాహనదారులే. ఈ పరిస్థితుల్లో ఆఫీసు పని ముగిసి, రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చేవారి భద్రత ఎలా? ఇక, క్రికెటర్ రిషభ్ పంత్ ప్రాణాలతో బయట పడ్డ ఘోర రోడ్డు ప్రమాదఘటన లాంటివి రహదారి భద్రతపై దృష్టి పెంచాలని గుర్తు చేస్తున్నాయి. ఒకపక్క అధిక వేగం, తప్పుడు లేన్లలో డ్రైవింగ్, సిగ్నల్స్ ఉల్లంఘన, రోడ్డుపైనే పార్కింగ్, అధిక శబ్దంతో హారన్ కొట్టడం లాంటి అనేక తప్పులు, మరోపక్క మత్తులో అమాయకుల ప్రాణం తీస్తున్న తాజా కంఝావాలా ఘటన లాంటివి జరుగుతుంటే గుడ్లప్పగించి చూస్తే ఎలా? ఒకరు చేసే తప్పుకు వేరెవరికో శిక్ష పడే ఈ రహదారి ఘటనల్లో దోషులు భయపడేలా కఠిన శిక్షలు విధించాలి. అమెరికా లాగా లెక్క దాటి తప్పులు చేస్తే డ్రైవింగ్లైసెన్స్ రద్దు లాంటివి మన దగ్గరా ప్రవేశపెట్టాలి. ‘నిర్భయ’ అత్యాచార – హత్యోదంతం జరిగి పదేళ్ళయినా, పాలకులు చట్టాలు చేయడమే తప్ప ప్రాథమిక చర్యలు విస్మరిస్తున్నారు. ఇలాగైతే... అర్ధరాత్రి సైతం స్త్రీ స్వేచ్ఛగా సంచరించగలిగిననాడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు అన్న గాంధీ మాటల్లో మనకు స్వాతంత్య్రం ఎప్పటికి వచ్చేటట్టు? -
అంజలి కారు కింద పడితే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్వి?
న్యూఢిల్లీ: ఢిల్లీలో యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయ తెలిసిందే. స్కూటీపై వెళ్తున్న అంజలిని మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఢొకొట్టి ఈడ్చుకెళ్లారు. అయితే ఈ సమయంలో ఆమె స్నేహితురాలు నిధి అక్కడే ఉన్నారు. అంజలి కారు కింద నలిగిపోవడం చూసి కూడా ఆమె సాయం చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అక్కడి నుంచి పారిపోయింది. పైగా అంజలిదే తప్పు అని మాట్లాడింది. నిధి తీరుపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ మండిపడ్డారు. చనిపోయిన ఫ్రెండ్ గురించి ఇలా మాట్లాడటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కళ్ల ముందే అంజలి కారు కింద పడి నలిగిపోతుంటే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్వి అని ఫైర్ అయ్యారు. విపత్కర పరిస్థితిలో స్నేహితురాలిని విడిచిపెట్టి వెళ్లిన నీ లాంటి వాళ్లను ఎలా నమ్మాలి అని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఓ వీడియో విడుదల చేశారు. DCW chief @SwatiJaiHind ‘s byte on Anjali’s friend !! pic.twitter.com/0XA42DTOnG — Vandana Singh (@VandanaSsingh) January 4, 2023 జనవరి 1న అంజలి, నిధి స్కూటీపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. కారు చక్రాల కింద అంజలి ఇరుక్కుంది. తాగిన మత్తులో ఉన్న ఐదుగురు యువకులు ఈ విషయాన్ని గమనించకుండా కారును కిలోమీటర్ల మేర తిప్పారు. దీంతో ఆమె దారుణంగా చనిపోయింది. కంఝవాల ప్రాంతంలో ఉదయం అంజలి మృతదేహం నగ్నంగా లభ్యమవ్వడం కలకలం రేపింది. ఈ ఘటనలో నిధికి ఎలాంటి గాయాలు కాలేదు. చదవండి: ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన.. యువతిని బలవంతంగా కారులోకి.. -
అయ్యో అంజలి.. పోస్ట్మార్టం రిపోర్ట్లో షాకింగ్ విషయాలు
ఢిల్లీ: సుల్తాన్పురి-కంఝావాలా మధ్య కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనలో దారుణ రీతిలో ప్రాణం కోల్పోయిన అంజలి(20) కేసులో పోస్ట్మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె ఆల్కాహాల్ తీసుకోలేదని, ఆమె మృతదేహంలో ఆనవాలు కనిపించలేదని స్పష్టం అయ్యింది. అంతేకాదు ఆ ఘటన సమయంలో ఆమె నరకం అనుభవించి ఉంటుందని పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారా స్పష్టం అవుతోంది. మొత్తం ఎనిమిది పేజీల ఆ రిపోర్ట్లో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. ‘‘రోడ్డుపై కిలోమీటర్ల పొడవునా బాడీని ఈడ్చుకెళ్లారు. శరీరం మట్టి కొట్టుకుపోయింది. ఆమె ఒంటిపై 40కి పైగా గాయాలు అయ్యాయి. పక్కటెముకలు బయటకు వెనుకవైపు పొడుచుకువచ్చాయి. రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో శరీరం మొత్తం కమిలిపోయింది. తల పగిలి మెదడు బయటకు వచ్చి.. అందులో కొంత భాగం మిస్సయ్యింది. వెన్నుముక పూర్తిగా విరిగిపోయిందని రిపోర్ట్లో వైద్యులు వెల్లడించారు. తీవ్ర గాయాలతో, రక్త స్రావంతోనే ఆమె మరణించిందని శవ పరీక్ష ద్వారా వైద్యులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో జరిగిన శవ పరీక్ష నివేదికను పోలీసులు స్వీకరించారు. అయితే.. సాధారణ శవ పరీక్ష తర్వాత మరోసారి కెమికల్ అనాలసిస్, బయోలాజికల్ శాంపిల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే తుది ధృవీకరణ చేసినట్లు వైద్యులు ఆ నివేదికలో వెల్లడించారు. పోలీసుల నివేదిక ప్రకారం.. డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత(జనవరి 1న) స్కూటీపై స్నేహితురాలితో వస్తున్న అంజలి సింగ్ను.. వేగంగా వస్తున్న బలెనో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె బాడీని అలాగే కిలోమీటర్ల మేర లాక్కునిపోయింది ఆ కారు. సుల్తాన్పురి-కంఝావాలా మధ్య చక్కర్లు కొట్టి.. చివరకు ఆమె మృతదేహాం కారు నుంచి వేరై రోడ్డు మీద పడిపోయింది. కారులో ఉన్న ఐదుగురు ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. ఈ ఘటన ఢిల్లీని కుదిపేయడంతో పాటు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఘటనపై నిరసనలు వెల్లువెత్తడంతో నిందితులను త్వరగతిన అరెస్ట్ చేసిన పోలీసులు.. మూడు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. బుధవారం(ఇవాళ) సాయంత్రంతో ఆ కస్టడీ ముగియనుంది. ఇక అత్యాచారం జరిగిందనే కోణాన్ని శవ పరీక్ష కొట్టిపారేసింది. ఇక బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన డిప్యూటీ ముఖ్యమంత్రి సిసోడియా.. దారుణ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన అంజలి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. -
‘రక్తమోడుతున్నా ఈడ్చుకెళ్లారు’.. ఢిల్లీ దారుణంపై ప్రత్యక్ష సాక్షి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో యువతిని స్కూటీతో పాటు కారు కింద కిలోమీటర్ల మేరకు ఈడ్చి పొట్టన పెట్టుకున్న దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు ఢీకొనడంతో చక్రాల కింద ఇరుక్కుని, కాపాడండంటూ ఆర్తనాదాలు చేస్తున్నా కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లారని నిధి అనే ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. మృతురాలు అంజలీ సింగ్కు ఆమె స్నేహితురాలే. ఘటన జరిగినప్పుడు అదే స్కూటీపై అంజలీ వెనక కూచొని ఉంది. స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. షాక్తో ఘటన వివరాలను ఆమె ఇంతవరకూ బయట పెట్టలేదు. స్కూటీపై మరో మహిళ ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించిన పోలీసులు ఆరా తీసి ఆమె వాంగ్మూలం నమోదుచేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగిన దారుణం గురించి నిధి వెల్లడించారు. ‘‘మా పరిచయమై 15 రోజులే అయినా మంచి స్నేహితులమయ్యాం. కొత్త ఏడాది వేడుక కల్సి చేసుకుందామనుకున్నాం. హోటల్లో పార్టీ తర్వాత 2 గంటలపుడు బయటకొచ్చి స్కూటీపై వెళ్తున్నాం. ఎదురుగా వస్తున్న కారు హఠాత్తుగా మమ్మల్ని ఢీకొట్టింది. నేను పడిపోయా. కానీ అంజలీ కారు చక్రాల్లో ఇరుక్కుని రక్తమోడుతూ సాయం కోసం అరిచింది. అయినా వాళ్లు వేగంగా అలాగే ఆమెను కారుతో పాటుగా ఈడ్చుకెళ్లారు. వెంటనే ఆపితే ఆమె కచ్చితంగా బ్రతికేది. చక్రాల్లో ఆమె ఇరుక్కుందని తెలిసీ నిర్దయగా అలాగే వెళ్లిపోయారు. ఆ దారుణాన్ని చూసిన షాక్లో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు’’ - నిధి, బాధితురాలి స్నేహితురాలు, ప్రత్యక్ష సాక్షి అయితే స్కూటీ ఎక్కడానికి ముందు హోటల్ బయట వారిద్దరూ గొడవ పడుతున్నట్టు మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. నిధి నుంచి ఏదో లాక్కోవడానికి అంజలి ప్రయత్నిస్తున్నట్టు అందులో కనిపిస్తోంది. బహుశా స్కూటీని ఎవరు నడపాలనే విషయమై వారు వాదించుకున్నారని భావిస్తున్నారు. కాగా ఈ కేసులో అత్యాచారం ఆనవాళ్లు లేవని పోస్ట్మార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. తల, వెన్నెముక, మొండెం కింది అవయవాలకు తీవ్ర గాయాలవడంతో అంజలీ మరణించినట్టు నివేదిక పేర్కొంది. నిందితులు ఆమెను రేప్ చేసి చంపేశారనే ఆరోపణల నేపథ్యంలో మెడికల్ బోర్డు పర్యవేక్షణలో పోస్ట్మార్టం జరిగిందని ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ సాగర్ ప్రీత్ హూడా చెప్పారు. ఝౌంతీ గ్రామంలో నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం, నిందితులను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకోవడం తెల్సిందే. కేసును నీరుగారుస్తున్నారు: ఆప్ దర్యాప్తు వేగంగా ముగించి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ‘ఆప్’ ఎమ్మెల్యేల బృందం వినతిపత్రం ఇచ్చింది. మృతురాలి కుటుంబానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. కేంద్రం సీరియస్ ఘటనపై కేంద్రం సీరియస్గా ఉంది. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దాంతో స్పెషల్ కమిషనర్ శాలినీ సింగ్ నేతృత్వంలో ఢిల్లీ పోలీస్ విభాగం దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటుచేసింది. ఘటన సమయంలో ఇద్దరు నిందితులు తాగి ఉన్నట్లు వార్తలొచ్చాయి. వారి రక్త నమూనాలను పరీక్షకు పంపారని, రిపోర్టులు రావాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కుటుంబానికి ఏకైక దిక్కు మృతురాలు అంజలి తన కుటుంబానికి ఏకైక పెద్ద దిక్కు. తండ్రి ఎనిమిదేళ్ల క్రితమే మరణించాడు. అక్కకు పెళ్లయింది. దాంతో అమ్మ, ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లను ఆమే పోషిస్తోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తూ వారికి ఆసరాగా నిలుస్తోంది. మూత్రపిండాలు దెబ్బ తిన్న తల్లికి తరచూ డయాలసిస్ అవసరం. ఇదీ చదవండి: ఢిల్లీ సుల్తాన్పురి ఘటన: అంజలితో పాటు మరో యువతి కూడా!.. పోలీసులు పట్టించుకోలేదా? -
ఢిల్లీ ఘటనలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
-
అంజలి కారు ముందు పడిపోయింది.. భయంతో పారిపోయా: స్నేహితురాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అంజలి(20) అనే యువతిని కారుతో ఢీకొట్టి లాక్కెళ్లిన ఘటనలో ఆమెతోపాటు తన స్నేహితురాలు కూడా ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు కారు ఢీకొట్టిన సమయంలో అంజలి ఒకరే ఉన్నారని అనుకున్నారు కానీ హోటల్ ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా పార్కింగ్ నుంచి స్కూటీ తీస్తుండగా పక్కన మరో యువతి కూడా కనిపించింది. ఆమే అంజలి స్నేహితురాలు నిధి. ఇద్దరు స్నేహితులు శనివారం సాయంత్రం సుల్తాన్పురిలో న్యూ ఇయర్ ఈవెంట్కు హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 1.45 గంటలకు హోటల్ నుంచి అంజలి స్కూటర్పై బయలుదేరారు. ముందుగా స్కూటీ డ్రైవ్ చేసే విషయంలో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. టూవీలర్ను మొదట నిదీనే డ్రైవ్ చేయగా కొంత సమయం తర్వాత అంజలి డ్రైవింగ్ తీసుకుంది. నిధి వెనకాల కూర్చుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మద్యం మత్తులో అయిదుగురు వ్యక్తులతో వెళ్తున్న కారు స్కూటీని ఢీకొట్టింది. దీంతో అంజలి కారు ముందు పడిపోగా.. నిధి మరోవైపు పడింది. అదృశవశాత్తు ఆమెకు గాయాలేవి అవలేదు. కానీ అంజలి కారు ముందు చక్రాల్లో ఇరుక్కుపోయింది. దీంతో ఆమెను కారుతోపాటే వీధుల గుండా 13 కిమీ ఈడ్చుకెళ్లారు. #WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area. (CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze — ANI (@ANI) January 3, 2023 డ్డ్రైవర్ తప్పిదం వల్లే నిధిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణకు ఆమె సహకరిస్తోందని తెలిపారు. మంగళవారం నిధిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ప్రమాదం జరిగిన తర్వాత భయంతో అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపింది. భయంతో ప్రమాదం గురించి ఎవరికీ చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. కారు డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్లు నిధి కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. స్కూటర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని నిందితులు పేర్కొన్నారు. మరోవైపు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు సైతం ప్రకటించారు. అత్యాచారం జరగలేదు మరోవైపు అంజలిపై హత్యాచారం జరిగినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఢిల్లీ ఆందోళనలు చేపట్టారు. అయితే అంజలిపై అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇక కారు డ్రైవ్ చేసిన వ్యక్తితోపాటు మొత్తం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు నిందితులు అంగీకరించారు. వారిపై నేరపూరిత హత్య అభియోగం, ర్యాష్ డ్రైవింగ్ వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా ఈవెంట్ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న అంజలి సింగ్ను ఢిల్లీలోని సుల్తాన్పురిలో జనవరి 1వ తేదీ తెల్లవారు జామున కొంతమంది యువకులు కారుతో ఢీకొట్టి కొన్ని కిలోమీటర్ల మేర ఆమెను ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. స్కూటర్ను ఢీకొట్టడంతో భయంతో అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే మహిళ శీరరం కారు చక్రాలకు చిక్కుకుందన్న విషయం వారికి తెలియలేదు. సుల్తాన్పూరి నుంచి కంజావాలా వరకు 13 కిలోమీటర్ల మేరకు ఆమెను అలాగే ఈడ్చుకెళ్లారు. చివరికి కంజావాలా వద్ద యూ టర్న్ తీసుకునే సమయంలో మహిళ కారుతోపాటు రావడాన్ని గమనించిన కారులోని ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే కారు ఆపడంతో ఆమె శరీరం పడిపోయింది. దీంతో మళ్లీ అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. అయితే కారుతోపాటు రోడ్డుపై మహిళ శరీరం ఈడ్చుకెళ్లడం చూసిన ప్రత్యక్ష సాక్షులు పోలీసులుకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నెంబర్ ప్లేట్ ఆధారంగా కారును ట్రేస్ చేసిన పోలీసులు అదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దీపక్ ఖన్నా(26), అమిత్ ఖన్నా(25), క్రిష్ణణ్(27), మిథున్(26), మనోజ్ మిత్తల్గా గుర్తించారు. వీరకి కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. దీపక్ ఖన్నా అనే వ్యక్తి కారు డ్రైవ్ చేస్తుండగా.. స్కూటీనిని ఢీ కొట్టిన సమయంలో దేని మీద నుంచో కారు ఎక్కించినట్లు అనిపించిందని దీపక్ పోలీసుల ఎదుట అంగీకరించాడు, అయితే మిగతావాళ్లు మాత్రం తామకు అలాంటిది ఏం అనిపించలేదని తెలిపారు. స్కూటీని ఢీకొట్టిన తర్వాత అక్కడి నుంచి భయంతో పారిపోయినట్లు తెలిపారు. -
ఢిల్లీ ఘటన: అంజలితో పాటు మరో యువతి కూడా!
ఢిల్లీ: దేశ రాజధానిలో అంజలి(20) అనే యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన చర్చనీయాంశంగా మారింది. కొత్త సంవత్సరం మొదటిరోజు వేకువ జామున ప్రాణం పోయి రోడ్డు మీద నగ్న స్థితిలో బాధితురాలు కనిపించిన ఘటన ఢిల్లీని కుదిపేసింది. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపైనా తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే పోలీసుల దర్యాప్తులో.. ఈ హేయనీయమైన ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా.. ఘటన సమయంలో అంజలితో పాటు మరో యువతి కూడా ఉన్నట్లు పోలీసులు దర్యాప్తు ద్వారా ఒక నిర్ధారణకు వచ్చారు. ఆమెను అంజలి స్నేహితురాలిగా భావిస్తున్నారు. అయితే కారు ఢీ కొట్టడంతో స్కూటీ నుంచి కింద పడి గాయాలైన ఆ యువతి.. భయంతో అక్కడి నుంచి పారిపోయి ఇంటికి చేరి ఉండొచ్చని ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఆ యువతి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని, ఆమెను విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడొచ్చని ఆ సీనియర్ అధికారి వెల్లడించారు. #WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area. (CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze — ANI (@ANI) January 3, 2023 పోలీసులు పట్టించుకోలేదు: ప్రత్యక్ష సాక్షి ఇక ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని నిందితులు, వాళ్ల నుంచి స్టేట్మెంట్ రికార్డు నమోదు చేసిన పోలీసులు ప్రకటించారు. కానీ, ప్రత్యక్ష సాక్షి దీపక్ మాత్రం కారులో ఉన్న వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆ యువతిని కారుతో లాక్కెళ్లారని, గంటన్నర పాటు పలుమార్లు యూటర్నులు తీసుకుంటూ దాదాపు 13 కి.మీ. దూరం వాహనాన్ని నడిపారని వెల్లడించడం కలకలం సృష్టిస్తోంది. అంతేకాదు.. అరుస్తూ తన టూవీలర్పై కారును వెంబడించినట్లు అతను తెలిపాడు. ఆపై పోలీస్ కంట్రోల్ రూమ్ వ్యాన్ను ఆపి విషయం దృష్టికి తీసుకెళ్లినా.. కనీసం వాళ్లు స్పందించలేదని, ఆ కారును ఆపే యత్నం చేయలేదని దీపక్ ఆరోపించాడు. ఆపై గంటన్నర సమయంలో 20 సార్లు ఫోన్ చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని దీపక్ మీడియాకు వెల్లడించాడు. మరోవైపు రోడ్డులో పోలీస్ బారికేడ్లు చూసి కారు యూటర్న్ తీసుకోవడం తాను చూసినట్లు ఓ ఫుడ్ డెలివరీ బాయ్ తెలిపాడు. కారుతో నిర్దాక్షిణ్యంగా బాధితురాలిని లాక్కెళ్తున్న సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దర్యాప్తునకు అమిత్ షా ఆదేశం ఢిల్లీ ఘటన కుదిపేస్తుండడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ తరపున విచారణకు ఆదేశించారు. ఢిల్లీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ షాలిని సింగ్ను దర్యాప్తునకు నేతృత్వం వహించాలని, వీలైనంత త్వరగతితన నివేదిక అందజేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇంకోవైపు ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ కూడా పోలీసులకు నోటీసులిచ్చారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిందా అన్న విషయాన్ని తెలపాలని ఆదేశించింది. నేడు శవపరీక్ష నివేదిక వచ్చే అవకాశం ఉండడంతో.. అసలేం జరిగింది అనే దానిపై ఒక స్పష్టత రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ముమ్మాటికీ హత్యాచారమే! ఇదిలా ఉంటే.. సుల్తాన్పురి ఘటనపై ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. తమ కూతురిపై హత్యాచార జరిగి ఉంటుందని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని పలు సంఘాలు, స్థానికులు సుల్తాన్పురి పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టి రహదారిని దిగ్బంధం చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము ఉద్యమించడం ఆపబోమని ప్రకటించారు. భయమా? కావాలనేనా? ఆఫీస్ ముగించుకుని అర్ధరాత్రి(జనవరి 1వ తారీఖు) రెండు గంటల సమయంలో అంజలి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అంజలి ప్రయాణిస్తున్న స్కూటీని నిందితుల కారు ఢీ కొట్టింది. ఘటనకు కారణమైన కారు.. మారుతి బలెనో అసలు ఓనర్ లోకేష్. అతని నుంచి అశుతోష్ అనే వ్యక్తి కారును తీసుకోగా, మళ్లీ అశుతోష్ నుంచి అమిత్, దీప్ ఖన్నాలు కారు తీసుకుని తప్పతాగి చక్కర్లు కొట్టారు. ఖన్నాలతో పాటు స్థానిక బీజేపీ నేత.. రేషన్ షాప్ నడిపించే మనోజ్ మిట్టల్, స్పానిష్ కల్చరల్ సెంటర్లో పని చేసే కృష్ణన్, హెయిర్డ్రెస్సర్గా పని చేసే మిథున్ కూడా కారులోనే ఉన్నారు. దీపక్ ఖన్నా కారు డ్రైవ్ చేయగా.. మనోజ్ పక్క సీట్లో ఉన్నాడు. కారు ఢీ కొట్టిన దేనిమీద నుంచో ఎక్కించినట్లు అనిపించిందని దీపక్ అంగీకరించాడు. అయితే మిగతా వాళ్లు మాత్రం తాము అలాంటిదేం గమనించలేదని చెప్పినట్లు తెలుస్తోంది. స్కూటీని ఢీ కొట్టిన తర్వాత భయంతోనే వాళ్లు అక్కడి నుంచి ఉడాయించినట్లు చెప్తున్నారు. హత్యానేరం కింద కాకుండా.. దోషపూరిత హత్య(culpable homicide) అభియోగం కింద వాళ్లపై కేసులు నమోదు చేశారు. అయితే.. పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా వాళ్లపై కేసు నమోదు మారే అవకాశం ఉంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఆప్ సైతం నిరసనలకు మద్ధతు ప్రకటించింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇంటిమేట్ సీన్స్లో నటించేటప్పుడు క్యారవాన్లో కూర్చొని ఏడ్చాను : హీరోయిన్
తెలుగుమ్మాయి అయినప్పటికీ తమిళనాట మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అంజలి ప్రస్తుతం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్స్లో వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో కీలక పాత్రలో నటిస్తుంది. దీంతో పాటు మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అంజలి ముద్దుసీన్లు, ఇంటిమేట్ సీన్లలో నటించడం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. 'కొన్నిసార్లు పాత్రకు తగ్గట్లు ముద్దుసీన్లలో నటించాల్సి వస్తుంది. మనకు ఇష్టం లేని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం ఇబ్బందే. ఇక కొన్నిసార్లు ఇంటిమేట్ సీన్లలో నటించినప్పుడు క్యారవాన్లోకి వెళ్లి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయినా సీన్ పండటం కోసం నటించాల్సి వస్తుంది' అంటూ ఎమోషనల్ అయ్యింది. -
అంజలి పెళ్లి చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
తమిళసినిమా: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అయితే నటి అంజలి విషయంలో ఇది తారుమారైంది. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి ఈ బ్యూటీ. మొదట్లో తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కోలీవుడ్పై దృష్టి పెట్టింది. కట్రదు తమిళ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజలికి ఆ తర్వాత అంగాడి తెరు, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చదవండి: అనుపమ పరమేశ్వరన్పై నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు దీంతో ఇక్కడ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత తెలుగులోనూ మంచి అవకాశాలు వరించాయి. దీంతో గుర్తింపు పొందిన అంజలి కొన్ని వివాదాస్పద సంఘటనల్లో చిక్కుకుని హైదరాబాద్కు మకాం మార్చారు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ మధ్యలో ఐటెం సాంగ్స్లోనూ మెరుస్తూ బిజీగానే ఉన్నారు. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలోనూ వార్తల్లో నిలిచిన అంజలిని నటుడు జయ్తో కలుపుతూ ప్రచారం జరిగింది. కాగా ఇటీవల అంజలి నటించిన వెబ్ సిరీస్ ఫాల్ ఓటీటీలో విడుదలైంది. చదవండి: ‘కాంతార’ మూవీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు దీని ప్రమోషన్లో భాగంగా చెన్నైకి వచ్చిన అంజలి మీడియాతో ముచ్చటించారు. ప్రేమ పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఈ బ్యూటీ బదిలిస్తూ తనకు ఇదివరకే పెళ్లి జరిగిపోయిందని, అమెరికాలో నివాసం ఉంటున్నట్టు ఇప్పటికే రకరకాల ప్రచారం జరిగిందన్నారు. నిజానికి అవన్నీ వదంతులేనని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే పెళ్లి కచ్చితంగా చేసుకుంటానని, ఆ టైం వచ్చినప్పుడు అందరికీ చెబుతానని అంజలి పేర్కొన్నారు. -
హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న అంజలి 'ఫాల్' వెబ్సిరీస్
తమిళసినిమా: నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఫాల్. ఎస్పీబీ చరణ్, నటి సోనియాఅగర్వాల్, సంతోష్ ప్రతాప్, నమిత కృష్ణమూర్తి, పూర్ణిమా భాగ్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ వెబ్ సీరీస్ను డిస్నీ హాట్స్టార్ సంస్థ నిర్మించింది. దీని ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు సిద్ధార్థ్ రామస్వామి దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి డిస్నీ హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం రాత్రి చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో డిస్నీ హాట్స్టార్ సంస్థ నిర్వాహకులు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నటి అంజలి మాట్లాడుతూ తాను ఇందులో దివ్య అనే పాత్రలో నటించానని చెప్పారు. ఇది రొటీన్ పాత్రలకు భిన్నంగా, కాస్త చాలెంజింగ్గా ఉంటుందన్నారు. థ్రిల్లర్ కథా చిత్రాలను ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుందన్నారు. ఇందులో నటించిన నటినటీలందరికీ ప్రాముఖ్యత ఉంటుందన్నారు. పూరి్ణమా భాగ్యరాజ్తో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. ఆమె మంచి కథలను చెప్పేవారని, తన లవ్స్టోరీ కూడా దాచుకోకుండా చెప్పారన్నారు. డిస్నీ హాట్స్టార్ సంస్థలో తాను నటించిన రెండవ వెబ్ సిరీస్ ఇది అని చెప్పారు. చాలా కంఫర్టబుల్గా చూసుకునే సంస్థ ఇది అని తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ రామస్వామి గురించి చెప్పాలంటే ఆయన చాలా కూల్ పర్సన్ అని పేర్కొన్నారు. తనే చాయాగ్రాహకుడు కావడంతో సన్నివేశాల చిత్రీకరణలో చాలా పర్ఫెక్ట్గా ఉండేవారన్నారు. టెక్నికల్గా కూడా తమకు నటించడం చాలా ఈజీ అయ్యిందన్నారు. వన్ మోర్ టేక్ అన్నదే చేసేవారు కాదని చెప్పారు. ఆయన దర్శకత్వంలో పనిచేయడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. -
హాట్స్టార్లో అంజలి 'ఝాన్సీ' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్
తమిళసినిమా: నటి అంజలి కూడా వెబ్సిరీస్ ప్రపంచంలోకి చేరిపోయింది. ఈమె టైటిల్ పాత్ర పోషిస్తున్న ఝాన్సీ వెబ్సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ వెబ్సిరీస్ను ట్రైబల్ హార్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నటుడు కృష్ణ నిర్మించారు. గణేష్ కార్తీక్ కథ, కథనాన్ని రూపొందించగా తిరు దర్శకత్వం వహించారు. ఒక సంఘటనలో గతాన్ని మరచిపోయిన యువతి తనెవరో, తన గతం ఏమిటో తెలియకుండా జీవిస్తుంది. ఆమెకు ఒక డాక్టర్ గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఆమెకు గతం గుర్తుకొచ్చిందా? ఆ తరువాత ఏం చేసిందన్న ఆసక్తికరమైన అంశాలతో కూడిన వెబ్ సిరీస్ ఝాన్సీ. ఇది గురువారం నుంచి డిస్నీహాట్ స్టార్లో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది తాను నటించిన చిత్రం ఏదీ విడుదల కాలేదని త్వరలో బెల్బాటం చిత్రం విడుదలకు సిద్ధమవుతుందని చెప్పారు. అయితే తనకు నిర్మాత కావాలన్నది చిరకాల కల అని చెప్పారు. ఇది తమ సంస్థలో రూపొందించిన మూడో వెబ్సిరీస్ అని తెలిపారు. దీనికి తిరువూరు బొక్క ఎపిసోడ్ కన్నా దర్శకత్వం వహించమని కోరగా ఆయన వెంటనే అంగీకరించారని చెప్పారు. ఝాన్సీ వెబ్ సిరీస్ చాలా బాగా వచ్చిందని, అయితే తాను ఇందులో నటించలేదని చెప్పారు. ఈ వెబ్సిరీస్కి సహకరించిన డిస్నీ హాట్ స్టార్ సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నిర్మాత తెలిపారు. -
నేను బిగ్బాస్కు రావడానికి ప్రధాన కారణం శ్రీసత్య: అర్జున్
Bigg Boss 6 Telugu, Epsiode 50: బిగ్బాస్ షోలో ఒకరోజు ముందుగానే దీపావళి వేడుకలు జరిగాయి. హీరోయిన్ల డ్యాన్సులు, శ్రీరామచంద్ర పాటలు, హైపర్ ఆది పంచులు.. సెలబ్రిటీ గెస్టులు అంజలి, కార్తీల రాకతో నేటి ఎపిసోడ్ సందడిగా మారింది. మరి ఆ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎలిమినేషన్ గురించి పూర్తిగా తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! తర్వాత కంటెస్టెంట్లను ఏడు జంటలుగా విడగొట్టాడు నాగ్. ఫైమా-రేవంత్, ఇనయ- శ్రీహాన్, శ్రీసత్య- సూర్య, మెరీనా- రోహిత్, కీర్తి-రాజ్, వాసంతి- అర్జున్, గీతూ-ఆదిరెడ్డిలు జోడీగా ఆటలాడారు. ఈ తరుణంలో ఓటీటీ సిరీస్ ఝాన్సీ ప్రమోషన్స్లో భాగంగా అంజలి బిగ్బాస్ షోకి వచ్చి సందడి చేసింది. ఆమెను చూడగానే రేవంత్ అంజలి పాట పాడి హీరోయిన్ను ఫిదా చేశాడు. ఆమె సమక్షంలో జంటలతో డ్యాన్స్ చేయించాడు నాగ్. అది కూడా ఇచ్చిన వస్తువును ఎక్కువగా వాడుతూ స్టెప్పులేయాలన్నాడు. ఇందులో తక్కువ మార్కులు పడ్డ ఇనయ- శ్రీహాన్ గేమ్ నుంచి ఔట్ అయ్యారు. రెండో లెవల్లో అమ్మాయిలు తమ జోడీ అయిన అబ్బాయిలను లేడీస్గా మార్చేశారు. మీసం, గడ్డాలతో చీర కట్టులో కనిపించిన మేల్ కంటెస్టెంట్లను చూసి తట్టుకోలేకపోయాడు నాగ్. అయినా సరే తప్పక వారితో క్యాట్వాక్ చేయించాడు. ఈ రౌండ్లో వాసంతి- అర్జున్ కల్యాణ్కు ఎక్కువ మార్కులు పడ్డాయి. తర్వాత కీర్తి, శ్రీసత్య సేఫ్ అయినట్లు ప్రకటించాడు. అనంతరం సైంటిస్ట్ను పిలుస్తున్నానంటూ హైపర్ ఆదిని స్టేజీ మీదకు ఆహ్వానించాడు నాగ్. వచ్చీ రావడంతోనే కంటెస్టెంట్ల మీద పంచుల వర్షం కురిపించాడు. ముందుగా గీతూ గురించి మాట్లాడుతూ.. అవతలి వాళ్ల మీద కాలూపడమే కాదు తల కూడా ఊపాలి(వాళ్లు చెప్పేది వినాలి) అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అలా ఒక్కొక్కరి గురించి సవివరంగా చెప్తూనే సెటైర్లు వేశాడు. ఫైనల్గా.. ఈ సీజన్లో కంటెస్టెంట్లు టాస్కులు ఎలా ఆడదామనేదానికంటే కూడా ఎప్పుడెప్పుడు అయిపోతాయా? అని ఎదురు చూస్తున్నారని, నామినేషన్స్ సిల్లీగా ఉంటున్నాయని వారి పరువు తీశాడు ఆది. అందరి బండారాలు బయటపెట్టిన తర్వాత బిగ్బాస్ షో నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. హీరోయిన్ అవికాగోర్ స్టెప్పులేయడం ముగియగానే సర్దార్ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. హీరో కార్తీ, దర్శకుడు మిత్రన్, హీరోయిన్ రజీషా స్టేజీపై సందడి చేశారు. సర్దార్ మూవీ చూశాక చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగేందుకు భయపడుతున్నారన్నాడు. ఈ సందర్భంగా నాగ్.. ఇక నుంచి నేను కూడా ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగను అని శపథం చేశాడు. తర్వాత కార్తీ.. ప్రేమ లేదని, ప్రేమించరాదని అని తెలుగులో అద్భుతంగా పాడాడు. హౌస్మేట్స్ కోసం స్వీట్లు కూడా తీసుకొచ్చానని చెప్పాడు. రోహిత్, బాలాదిత్యను సేఫ్ చేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. మూడో లెవల్కు వచ్చేసరికి మూడు జంటలే మిగిలాయి. కళ్లకు గంతలు కట్టుకుని తమ జోడీకి స్వీట్లు తినిపించాలనే టాస్కులో మెరీనా- రోహిత్, ఫైమా- రేవంత్, శ్రీసత్య- సూర్య పాల్గొన్నారు. సత్య ఎక్కువ స్వీట్లు తినడంతో ఆమె జంట విజయం సాధించగా వారికి దీపావళి కానుక అందింది. చివరగా వాసంతి, అర్జున్ నామినేషన్లో ఉండగా వీరిలో అర్జున్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. దీంతో ఒక్కసారిగా సత్య, శ్రీహాన్, రేవంత్ షాక్లోకి వెళ్లిపోయారు. రేవంత్, సత్య కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేశారు. సత్య ఏడవటం చూసి తట్టుకోలేకపోయిన అర్జున్ తనూ కంటతడి పెట్టుకున్నాడు. అనంతరం అర్జున్తో ఐదు ఆటంబాంబులు, ఐదు తుస్సుబాంబులు ఎవరో చెప్పమని గేమ్ ఆడించాడు నాగ్. శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, గీతూ, ఫైమా ఆటంబాంబులు అన్నాడు. కాకపోతే రేవంత్.. ఆటంబాంబు కంటే ఎక్కువ పేలుతున్నాడు, ఫిజికల్ అవ్వకు, ఏది పడితే అది మాట్లాడి గేమ్ పాడు చేసుకోకు అని అతడికి సలహా ఇచ్చాడు. రోహిత్, మెరీనా, కీర్తి, ఇనయ, బాలాదిత్య తుస్సుబాంబులు అని చెప్పాడు. చివరగా అర్జున్ తాను బిగ్బాస్లోకి రావడానికి ప్రధాన కారణం సత్య అన్న విషయాన్ని బయటపెట్టాడు అర్జున్. శ్రీసత్యను ఒక సినిమాకు రిఫర్ చేస్తే ఆమె డేట్స్ ఇవ్వలేనని చెప్పింది. ఎందుకని అడిగితే బిగ్బాస్కు వెళ్తున్నానంది. వెంటనే నేను బిగ్బాస్కు అప్లై చేశాను, వచ్చింది. ఆఫర్ రాగానే ఇంట్లోవాళ్లకు చెప్పకుండా మొదట సత్యకే ఫోన్ చేసి చెప్పాను అని చెప్పుకొచ్చాడు అర్జున్. ఈ విషయం ఇప్పటిదాకా తనకూ తెలియదంది శ్రీసత్య. చదవండి: కొత్త కారు కొన్న హిమజ, వీడియో చూశారా? ఉదయ్కిరణ్తో ఐదు సినిమాలు చేసేదాన్ని, కానీ అంతలోనే -
దివాళీ స్పెషల్: స్టేజీపై కార్తీ, అంజలి.. పంచులతో నవ్వించిన ఆది!
బిగ్బాస్ షోలో ఉన్న కంటెస్టెంట్లకు దీపావళి ఒకరోజు ముందే వచ్చింది. సెలబ్రిటీల రాకతో నేటి ఎపిసోడ్ చిచ్చుబుడ్డిలా పేలనున్నట్లు కనిపిస్తోంది. కార్తీ, అంజలి స్టేజీపైకి వచ్చి హౌస్మేట్స్తో ముచ్చటించగా హైపర్ ఆది తన పంచులతో కంటెస్టెంట్లను ఓ ఆటాడుకున్నాడు. శ్రీరామచంద్ర పాటలతో ఆకట్టుకోగా రష్మీ, అవికాగోర్ డ్యాన్స్ చింపేశారు. అంజలి కోసం అద్భుతమైన పాట పాడాడు రేవంత్. హీరో కార్తీ దీపావళి సందర్భంగా అందరికీ స్వీట్స్ తీసుకొచ్చానన్నాడు. కానీ అది వారు పొందేందుకు గేమ్ ఆడించాడు. అలాగే ఇంట్లో ఉన్న అబ్బాయిలు అమ్మాయిల గెటప్లు వేసుకుని డ్యాన్స్ చేశారు. ఓవైపు ముఖాన గడ్డం పెట్టుకుని చీర కట్టుతో కనిపించిన వాళ్లను చూసి నాగార్జున ఈ ఘోరం నేను చూడలేను బాబోయ్ అంటూ కళ్లు మూసుకున్నాడు. మరి ఈ పటాకా ఎపిసోడ్ చూడాలంటే నేడు సాయంత్రం ఆరు గంటల వరకు వేచి చూడాల్సిందే! చదవండి: తమ్మీ, నీకు అడుక్కు తిందామన్నా దిక్కుండదు: ఆరోహి బిగ్బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికుందో చెప్పిన హౌస్మేట్స్! -
అంజలి ‘ఝాన్సీ’ వెబ్సిరీస్ ట్రైలర్ చూశారా?
అందాల ముద్దుగుమ్మ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు, తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంజలి తాజాగా ‘ఝాన్సీ’ అనే వెబ్ సిరీస్లో నటించింది. 'ఒక మనిషి జీవితంలో అన్నింటికంటే పెద్ద శిక్ష.. తనెవరో తనకే తెలియకపోవడం' అనే డైలాగ్తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సిరీస్ను తిరు డైరెక్ట్ చేస్తున్నాడు. ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్పై కృష్ణ నిర్మిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా అక్టోబర్ 27న ఈ వెబ్సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కాగా ఇటీవలె మాచర్ల నియోజకవర్గం సినిమాలో స్పెషల్ సాంగ్లో మెస్మరైజ్ అంజలి శంకర్-రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. -
రామ్చరణ్కు భార్యగా అంజలి.. లీకైన ఫోటోలు
ఫ్లాష్బ్యాక్ మోడ్లో ఉన్నారట రామ్చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, జయరామ్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం రామ్చరణ్, అంజలిపై కీలక సన్నివేశాలను తీస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ మరో వారం పాటు అక్కడి లొకేషన్స్లోనే సాగుతుందట. అయితే ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సన్నివేశాలు సినిమాలో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో వస్తాయని, 1930 కాలం నేపథ్యంలో ఈ సీన్స్లో రామ్చరణ్, అంజలి భార్యభర్తలుగా కనిపిస్తారనే ప్రచారం వినిపోస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా నెట్టింట లీక్ అయ్యాయి. అంతేకాదు. ఈ సినిమాలో రామ్చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని టాక్. దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. -
గ్లామర్ డోస్ పెంచిన నో ఆఫర్స్.. మరి ఇకనైనా..
దక్షిణాదిలో తమిళ, తెలుగు చిత్రాలలో హీరోయిన్గా నటించి, మెప్పించి హోమ్లీ గర్ల్ అని మంచి పేరు తెచ్చుకున్న అమ్మడు అంజలి. కోలీవుడ్లో అయితే అంజలి ఓ వెలుగు వెలిగింది. కట్రదు తమిళ్, అంగాడితెరు, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి చిత్రాలతో తమిళ అభిమానులను ఆకట్టుకుంది. భాష ఏదైనా.. ఎలాంటి పాత్రలోనైనా తనని తాను మార్చుకోగల సత్తా ఉన్న నటిగా పేరు తెచ్చుకుంది ఆమె. కానీ అందరు ఊహించినట్టుగా అనుకున్న స్థాయిలో ఆమెకు అవకాశాలు రాలేదు. గ్లామర్ డోస్ పెంచినా అవకాశాలు అంతంత మాత్రమే. కొత్త హీరోయిన్లు రావడంతో ఆశించిన అఫర్స్ అందుకోలేకపోతుంది. ఆకర్షణీయంగా కనిపించేందుకు సిద్ధమైనా.. అవకాశాలు తలుపు తట్టడంలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఈ బ్యూటీ ఉందట. ఆ సమయంలో టాలీవుడ్లో మాచర్ల నియోజకవర్గంలో స్పెషల్ సాంగ్లో నటించే అవకాశం వచ్చింది. దీంతో ఇకపై మరిన్ని అవకాశాలను దక్కించుకునేందుకు ఈ భామ గ్లామర్ డోస్ పెంచింది. -
బొద్దుగా ఉండే అంజలి.. ఇలా అయిపోయిందేంటి?
Actress Anjali Latest Photos: దక్షిణాదిలో తమిళ, తెలుగు చిత్రాలలో హీరోయిన్గా నటించి, మెప్పించి హోమ్లీ గర్ల్ అని మంచి పేరు తెచ్చుకున్న అమ్మడు అంజలి. ఈమె ఇప్పుడు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో కాస్త అంత విరామం తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించడం మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్లలోనూ అందాలను ఆరబోసి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు రామ్చరణ్తో దర్శకుడు శంకర్ నిర్మిస్తున్న చిత్రంలో ముఖ్య భూమికను పోషిస్తోంది. నితిన్ హీరోగా నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం చిత్రంలో ఐటం సాంగ్లో నటించింది. ప్రస్తుతం విదేశాల పర్యటనకు వెళ్లిన ఈ సుందరి అక్కడి నుంచి తన నాజూకుతనాన్ని చూపుతూ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. దీంతో అవి వైరల్గా మారాయి. -
నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్
Mahesh Babu Dance To Nithin Song Goes Viral: హిట్ ప్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ హీరో 'జయం' సినిమా హీరోగా నితిన్కు ఎంత గుర్తింపు తెచ్చిందో చెప్పనవసరం లేదు. ఈ సినిమాలోని 'రాను రానంటూనే చిన్నదో' అనే పాట ఎంత సూపర్ హిట్ అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సాంగ్ యూత్ను ఒక ఊపు ఊపేసింది. తాజాగా ఈ పాటకు అనుగుణంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నితిన్ 'వావ్' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ పాటకు మహేశ్ బాబు నిజంగా స్టెప్పులు వేయలేదు. ఇదంతా కేవలం ఎడిటింగ్తో చేసిన ప్రయోగం. నితిన్ తాజాగా నటించిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీలో 'రారా రెడ్డి' స్పెషల్ సాంగ్లో హీరోయిన్ అంజలి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట చివర్లో 'రాను రానంటూనే చిన్నదో' సాంగ్ను రీమిక్స్ చేసి జోడించారు. ఇప్పుడు ఈ రీమిక్స్కు అనుగుణంగా 'సర్కారు వారి పాట'లోని 'మ.. మ.. మహేశా' స్టెప్పులతో ప్రత్యేకంగా వీడియో క్రియేట్ చేశాడు ఓ నెటిజన్. ఈ స్పెషల్ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా అది కాస్త ట్రెండ్ అయింది. ఈ వీడియోకు నితిన్ 'వావ్.. సూపర్.. పర్ఫెక్ట్ సింక్' అంటూ పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ చలరేగిపోతోంది. చదవండి: నితిన్కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ జీవితంలో వారు మనకు స్పెషల్: నాగ చైతన్య Wowww!! SUPERB and PERFECT SYNC 🔥🔥 https://t.co/KvXrbnzo7t — nithiin (@actor_nithiin) July 12, 2022 -
రా రా రెడ్డి.. . అంజలి స్పెషల్ సాంగ్ ప్రోమో అదిరింది!
నితిన్, కృతీశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిరాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్ చేస్తుంది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: పాకిస్తాన్లో చరిత్ర సృష్టించిన ‘మేజర్’) ‘రారా రెడ్డి.. ’అంటూ సాగే ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా మహతి స్వరసాగర్ లైవ్లీ బీట్లతో ఊర మాస్ ట్రాక్ని స్కోర్ చేశారు. లిప్సిక అద్భుతంగా ఆలపించారు. ఇక నితిన్, అంజలి కలిసే వేసే స్టెప్పులు పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఫుల్ సాంగ్ జులై 9న విడుదల కానుంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్గా నటిస్తున్నాడు. ఆగస్ట్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మరోసారి స్పెషల్ సాంగ్లో అంజలి.. నితిన్తో కలిసి స్టెప్పులు
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం..టైటిల్ అనౌన్స్మెంట్ నుండే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఇటీవల విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆగస్ట్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ని స్టార్ట్ చేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్ చేయబోతుందట. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్ని కూడా విడుదల చేశారు. అందులో అంజలి హాట్ ఫోజుతో కుర్రాళ్ల మతి పోగొట్టేలా ఉంది. ఈ స్పెషల్ సాంగ్కి సంబంధించిన మరో అప్డేట్ని సోమవారం ప్రకటించనున్నారు. అంజలికి ఇది రెండో స్పెషల్ సాంగ్. గతంలో సరైనోడులో అల్లు అర్జున్తో కలిసి స్టెప్పులేసింది. -
ముసలోడికి దసరా పండగ ట్రైలర్ వచ్చేసింది..
నాజర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’. డి. మనోహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, అనిత, కోవై సరళ, శరణ్య, సత్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రాజీనాయుడు, సీతమ్మ వాళ్లె ఆశీస్సులతో రమణ వాళ్లె నిర్మించారు. తెలుగు–తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా పోస్టర్, ట్రైలర్ను నాజర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు. రమణ వాళ్లె మాట్లాడుతూ– ‘‘రెండు గంటలపాటు హాయిగా నవ్వుకునేలా మా సినిమా ఉంటుంది. త్వరలో సినిమా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని నాకు తండ్రి సమానులైన దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణగారికి అంకితం ఇస్తున్నాను’’ అన్నారు. చదవండి 👇 నటుడిని పెళ్లాడనున్న బాలీవుడ్ హీరోయిన్ Rakul Preet Singh: సౌత్, నార్త్ రెండూ కలిస్తే అద్భుతాలే.. -
వాసన్న చొరవ.. నాలుగేళ్ల నిరీక్షణకు తెర..!
సాక్షి, ఒంగోలు: రేయింబవళ్లు కష్టపడి చదివి సాధించిన ఉద్యోగం ఓ చిన్న సాంకేతిక కారణంతో ఆ యువతికి అందకుండా పోయింది. కోర్టు ఆదేశించినా అధికారులు పోస్టు మంజూరు చేయలేదు. ఈ క్రమంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ప్రత్యేక చొరవ తీసుకొని పోస్టు మంజూరు చేయించడంతో ఆ యువతి ఉద్యోగంలో చేరింది. వివరాల్లోకి వెళితే..జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామం యానాది సామాజిక వర్గానికి చెందిన పొట్లూరి హనుమంతరావు, లలితమ్మలకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి అంజలి డీఈడీ పూర్తి చేసిం 2018లో డీఎస్సీ రాయగా మంచి మార్కులతో 3726 ర్యాంకు సాధించింది. ఈ డీఎస్సీలో ఎస్టీ యానాది ఉప కులానికి 8 తెలుగు మీడియం పోస్టులను కేటాయించారు. ఈ క్రమంలో 2020లో డీఎస్పీ 2018 పోస్టులకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలంటూ విద్యాశాఖ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మెసేజ్లు పంపింది. అయితే ఫోన్ ప్రాబ్లం కారణంగా ఆ సమాచారాన్ని అంజలి అందుకోలేకపోయింది. దీంతో ఈమె కంటే ఎక్కువ ర్యాంకులు వచ్చిన అదే సామాజికవర్గానికి చెందిన మరో ఇద్దరు మహిళలు ఉద్యోగాలు సాధించారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న అంజలి అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. చదవండి👉🏾: (మంచి విజన్ ఉన్న యువ సీఎం జగన్: కుమార మంగళం బిర్లా) పూర్వాపరాలను పరిశీలించిన డివిజన్ బెంచ్ అంజలికి పోస్టు కేటాయించాలని, ఒకవేళ పోస్టు ఏదీ ఖాళీగా లేకపోతే సూపర్న్యూమరీ పోస్టు అయినా కేటాయించాలంటూ పాఠశాల విద్యాశాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే పాతికేళ్ల క్రితమే సూపర్ న్యూమరీ పోస్టులకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. దీంతో ఆమె విషయాన్ని పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి అభ్యర్థించింది. బాలినేని ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రికి స్వయంగా లేఖ రాసి పర్యవేక్షించారు. దీంతో అంజలికి గత నెల 10న సూపర్ న్యూమరీ పోస్టు మంజూరైంది. ఆమెకు గుడ్లూరు మండలం చేవూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పోస్టు కేటాయిస్తూ ఉత్తర్వులు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి.జగన్నాథరావు ఉత్తర్వులు జారీ చేశారు. తన ఉద్యోగం పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని పోస్టు మంజూరు చేయించిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. -
రామ్ చరణ్కి జోడిగా అంజలి!, ఏ సినిమాలో అంటే..
Anjali Team Up With Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్- తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో RC15 రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా హైప్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తరచూ ఈ మూవీ నుంచి ఏదొక అప్డేట్ బయటకు వస్తూ సినిమాపై మరింత ఆసక్తికని పెంచుతుంది. ప్రస్తుతం ఇందులో రామ్ చరణ్ విభిన్న పాత్రలపై ఆసక్తి నెలకోగా తాజాగా మరో క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెరపై మరో కథానాయిక పేరు వినిపిస్తోంది. ఇందులో తెలుగు అమ్మాయి అంజలి నటిస్తున్నట్లు సమాచారం. చదవంది: వైరల్ అవుతున్న రామ్ చరణ్ షాకింగ్ లుక్, పంచెకట్టుతో సైకిల్పై ఇలా చరణ్కు జోడిగా అంజలి కనిపించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే చరణ్ ఇందులో తండ్రికొడుకులుగా కనిపంచనున్నాడట. సీనియర్ రామ్ చరణ్కు సరసన అంజలి నటిస్తుండగా, జూనియర్ చరణ్తో కియారా రొమాన్స్ చేయనన్నట్లు తెలుస్తోంది. చరణ్ పంచెకట్టుతో సైకిల్పై వెళుతున్నట్లు ఉన్న ఓ లుక్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది RC15లోని సీనియర్ రామ్చరణ్కు సంబంధించిన లుక్ అంటూ లీకైంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఇంటీవల రాజమండ్రిలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ బ్రేక్ ఇవ్వగా త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుందట. అయితే ఈ షెడ్యూల్ షూటింగ్ దుబాయ్, హైదరాబాద్లో జరగనుందని వినికిడి. -
Youth Pulse: బర్త్డేకి ఆకాశంలో చుక్కలు తెంచుకురమ్మంటావా.. వద్దులే!
‘నీ బర్త్డేకి ఆకాశంలో చుక్కలు తెంచుకురమ్మంటావా’ అని ఆకాశానికి నిచ్చెనలు వేసేవారి కంటే, నేల మీదే ఉండి స్నేహితులకు పచ్చటి మొక్కను కానుకగా ఇచ్చేవారు ఇప్పుడు ఎక్కువయ్యారు. ‘రేపటి సండేను ఎలా ఎంజాయ్ చేద్దాం బ్రో..’ అని ఆరా తీసేవారికి భిన్నంగా ‘రేపటి సండే సరదాగా ఫీల్డ్వర్క్ చేద్దాం’ అని పలుగు పారా అందుకుంటున్న వాళ్లు పెరుగుతున్నారు. అవును...యూత్ మారుతుంది! నిన్నా మొన్నటి వరకైతే యూత్లో కొద్దిమందికి ‘పర్యావరణం’ అనేది ఎకాడమిక్ విషయం మాత్రమే. ఏ ఉపన్యాసం, వ్యాసంలోనో ఆ ‘స్పృహ’ కనిపించి మాయమయ్యేది. కోవిడ్ సృష్టించిన విలయం, దాని తాలూకు నిర్జన నిశ్శబ్ద విరామం తమలోకి తాము ప్రయాణించేలా చేసింది. ప్రకృతి పట్ల ఆసక్తిని పెంచింది. రణగొణధ్వనులతో క్షణవిరామం లేని జీవితంలో ప్రశ్న ఒకటి వచ్చి ఎదురుగా నిలుచుంది. ‘ఏం చేస్తున్నాం? ఏం చేయాలి?’ ఆత్మవిమర్శ అనే పెద్దమాట తగదుగానీ, ఎక్కడో ఏదో మొదలైంది. అదే యూత్ను ‘ఎన్విరాన్మెంటల్ యాక్టివిజమ్’లో చురుకైన పాత్ర నిర్వహించేలా చేస్తుంది. గత రెండు సంవత్సరాల అధ్యయనాలు,సర్వేలు చెబుతున్నది ఏమిటంటే– ‘భారతీయ యువతరంలో పర్యావరణ స్పృహ పెరిగింది’ అని. ( ఉదా: గోద్రెజ్ స్టడీ, క్రెడిట్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్, నీల్సన్) ‘పర్యావరణం’ అనేది యూత్ డిన్నర్ టేబుల్ డిస్కషన్లోకి రావడమే కాదు, ఫ్యాషన్ ఛాయిస్లలో గణనీయమైన మార్పు తీసుకువస్తుంది. ‘గతంలో యువ వినియోగదారులు ప్రింట్ లేదా స్టైల్ నచ్చితే కళ్లు మూసుకొని కొనుగోలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ పీస్ ఎలా తయారైందో అడిగి తెలుసుకుంటున్నారు. అది పర్యావరణహితం కాకపోతే స్టైల్గా ఉన్నాసరే తిరస్కరిస్తున్నారు. వారిలో వచ్చిన మార్పుకు ఇదొక సంకేతంగా చెప్పవచ్చు’ అంటున్నారు ఎకో–కాన్షియస్ ఫ్యాషన్ డిజైనర్ అంజలి పాటిల్. ‘సౌఖ్యం,సుఖం, స్టైల్ వరుసలో ఇప్పుడు పర్యావరణహిత దృష్టి కూడా చేరింది. మనవంతుగా ఏదైనా చేయాలి అనుకోవడమే దీనికి కారణం’ అంటున్నారు మరో డిజైనర్ రజిని అహూజ. టీ–షర్ట్ల ద్వారా కూడా పర్యావరణహిత ప్రచారాన్ని నిర్వహిస్తోంది యూత్. అందమైన వారి టీ–షర్ట్లపై కనిపించే... ‘ఎర్త్ డే ఎవ్రీ డే’ ‘సే నో ప్లాస్టిక్బ్యాగ్’ ‘గుడ్ ఎన్విరాన్మెంట్ పాలసీ ఈజ్ గుడ్ ఎకనామిక్ పాలసీ’....నినాదాలు ఆకట్టుకుంటున్నాయి. కేవలం దుస్తుల విషయంలోనే కాదు ఆహారం, విహారం, వినోదం....మొదలైన వాటిలో కొత్త చాయిస్లు వెదుక్కుంటున్నారు. ప్యాస్టిక్ వ్యర్థాల నివారణపై స్నేహితులతో కలిసి రకరకాల కార్యక్రమాలు చేపడుతున్న స్నేహ షాహి(బెంగళూరు), హితా లఖాని(ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేటర్), వర్ష రైక్వార్ (గ్రాస్రూట్స్ క్లైమెట్ స్టోరీటెల్లింగ్), ‘మార్చ్ ఫర్ క్లీన్’ అంటూ పర్యావరణహితం వైపు అడుగులు వేయిస్తున్న హినా సైఫీ....ఇలా చెప్పుకుంటూ పోతే యువ ఆణిముత్యాల జాబితా చాలా పెద్దది. వారు ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తున్నారు. నదులలోని కిలోల కొద్ది వ్యర్థాలను పైకి తీయడం, మొక్కలు నాటడం, చెట్లకు నీరుపోయడం...కాస్త శ్రమగా అనిపిస్తుందా? ఆ చిరుశ్రమను మరిచిపోవడానికి ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖెల్ జాక్సన్ ‘ఎర్త్సాంగ్’తో పాటు పర్యావరణ పాప్ పాటలు ఎన్నో ఉన్నాయి! చదవండి: Health Tips: ఉడికించిన శనగలు, బొబ్బర్లు తిన్నారంటే.. ఇక -
పెద్దపల్లి: మూడేళ్ల ప్రేమ.. పెళ్లికి నో చెప్పిందని ప్రియురాలి ఇంట్లో చొరబడి..
-
పెద్దపల్లిలో దారుణం.. ప్రియురాలి గొంతుకోసిన ప్రేమోన్మాది
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. అత్యంత కిరాతకంగా గొంతు కోసి యువతిని హతమార్చాడు. రామగుండం కార్పొరేషన్ యైటింక్లైయిన్ కాలనీ కేకే నగర్లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజు, గొడుగు అంజలి అనే ఇద్దరు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అంజలి డిగ్రీ చదువుతుండగా.. ప్రియుడు రాజు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల అంజలి పెళ్లికి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన రాజు.. ప్రియురాలి ఇంట్లోకి చొరబడి గొంతుకోసి హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అంజలి అక్కడిక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు వేగవంతం చేశారు. చదవండి: (పోర్న్ వీడియోలు చూసి రాక్షసంగా.. ఓ చిన్నారి కేకలు వేయడంతో..) -
మెక్సికోలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య
లాస్ఏంజిల్స్: మెక్సికోలో మాదక ద్రవ్యాల ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ప్రమాదవశాత్తూ భారత సంతతి మహిళ సహా ఇద్దరు మృత్యువాతపడ్డారు. హిమాచల్ప్రదేశ్కు చెందిన టెకీ, ట్రావెల్ బ్లాగర్ అయిన అంజలి రియోట్(25) ప్రస్తుతం కాలిఫోర్నియాలోని శాన్జోస్లో ఉంటున్నారు. ఈ నెల 22వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు భర్త ఉత్కర్ష్ శ్రీవాస్తవతో కలిసి సోమవారం ఆమె మెక్సికోలోని తీరప్రాంత రిసార్ట్ టులుమ్కు వెళ్లారు. బుధవారం రాత్రి అంజలి మరో నలుగురు కలిసి అక్కడి రెస్టారెంట్లోని టెర్రస్పై ఉండగా, సాయుధ దుండగులు ప్రవేశించి వారున్న ప్రాంతంలో యథేచ్ఛగా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో అంజలి, మరో మహిళ చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. డ్రగ్స్ నేరగాళ్ల ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ప్రమాదవశాత్తూ వీరు బలయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్ నుంచి లింక్డ్ ఇన్లో ఆమె సీనియర్ సైట్ రిలయబిలిటీ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. అంజలి మరణ వార్తను నమ్మలేకపోతున్నామని సిమ్లాలో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు కె.డి.రియోట్, నిర్మల కన్నీటి పర్యంతమయ్యారు. అంజలి భర్త ఉత్కర్ష్ది మధ్యప్రదేశ్లోని జబల్పూర్. నెట్ఫ్లిక్స్లో సీనియర్ మేనేజర్గా ఉన్నారు. చదవండి: (పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. ఇప్పుడు శ్రీజతో మరో పెళ్లి..) -
ఈ ఫొటోలోని చిన్నారి ఇప్పటి స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టారా?
ఈ మధ్యకాలం సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన సినీ తారలు వ్యక్తిగత విషయాలను, చిన్ననాటి మధుర జ్ఞపకాలను అభిమానులతో పంచుకుంటూ ఫొటోలను షేర్ చేశారు. ఈ క్రమంలో లాక్డౌన్లో రష్మిక మందన్నా, సాయి పల్లవి, కాజల్ల చిన్ననాటి ఫొటోలు హల్చల్ చేయగా.. ఇప్పటికీ పలువురు హీరోహీరోయిన్ల త్రోబ్యాక్ ఫొటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ చిన్నారి ఫొటో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ఫొటో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎరుపు రంగు చీర కట్టుకుని, ఆభరణాలతో అలంకరించుకున్న ఈ చిన్నారి ఎవరాని గుర్తు పట్టలేక నెటిజన్లు ఆలోచనలో పడిపోడుతున్నారు. ఇంతకి ఆమె ఎవరా అని మీరు కూడా ఆలోచిస్తున్నారా?. ఈ చిన్నారి మరేవరో కాదు ‘ఏమో..అదంతే నాకలా తెలిసిపోతుంది’ అంటూ సితమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టులో అలరించిన మన తెలుగమ్మాయి, టాలీవుడ్ హీరోయిన్ అంజలి. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకిల్ సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అంజలి తెలుగు, తమిళంలో బిజీ హీరోయిన్గా అయిపోయింది. ఒక తెలుగమ్మాయి పరిశ్రమలో రాణించడమంటే సాధారణ విషయం కాదు. ‘ఫొటో’ మూవీతో తెలుగు తెరపై మెరిసిన అంజలి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘షాపింగ్ మాల్, ‘గితాంజలి’ వంటి చిత్రాలతో అలరించిన ఆమె వెంకటేష్, బాలకృష్ణ స్టార్ హీరోల సరసన నటించింది. తనదైన నటనతో పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆమె అప్పడుప్పడు స్పెషల్ సాంగ్లో కూడా కాలు కదిపింది. ఈ క్రమంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చిన అంజలి.. చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ ‘వకిల్ సాబ్ మూవీ’తో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్తో అంజలి ఫుల్ బిజీగా మారిపోయింది. -
బ్యాక్లెస్ టాప్ షాకిచ్చిన సమంత..ఈజీగా అర్థం కావొద్దంటున్న అంజలి
అసాధ్యమని భావించినప్పటికీ అధిగమించిన విషయాలు గుర్తు చేసుకోండి అంటోంది సమంత. బ్యాక్లెస్ వైట్ టాప్లో దిగిన ఫోటోని షేర్ చేసి అందరికి షాకిచ్చింది ఈ అక్కినేని కోడలు పిల్ల అంత ఈజీగా అవతలి వాళ్లకు అర్థం కావొద్దని చెబుతోంది హీరోయిన్ అంజలి. మీ గురించి ఆశ్చర్యపోయేలా చేయండి అంటూ వీకెండ్ వైబ్స్ పేరుతో సెల్ఫీలు పోస్టు చేసింది. ‘వ్యాక్సినేషన్ తప్పు చేయదు.. టీకా వేసుకోక తప్పదు’అంటూ టీకా వేయించుకుంటున్నప్పటి ఫొటోని షేర్ చేశాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఫంక్షన్ కోసం కూతరు అర్హని రెడీ చేయిస్తున్న వీడియోని అభిమానులతో పంచుకుంది అల్లు అర్జున్ సతీమణి స్నేహ. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
Father's Day: సర్వస్వం తండ్రే అంటున్న టాలీవుడ్ తారలు
భార్య నవమోసాలు మోసి పిల్లలకు జన్మనిస్తే.. అతడు కంటికి రెప్పలా కాపాడతాడు. బుడిబుడి అడుగులు వేస్తుంటే మురిసి మెరిసిపోతాడు. వారసుల భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా శ్రమించడంలోనే సంతోషం ఉందనుకుంటాడు. పిల్లల ఎదుగుదలను చూస్తూ కష్టాన్ని మర్చిపోతాడు. పొద్దంతా షూటింగ్స్తో అలసిపోయినా పిల్లలు ఎదురు రాగానే వారి చిరునవ్వు చూసి ఆనందంతో పరవశించిపోతాడు. సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటే సంతోషాన్ని కూడా వ్యక్తం చేయలేక భార్య పక్కన నిలబడి విజయగర్వంతో కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా సినీతారలు సోషల్ మీడియా వేదికగా తండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ► నా బలం, మార్గదర్శి, ఆదర్శం, హీరో అన్నీ నా తండ్రే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న: మహేశ్బాబు My hero, guiding light, strength, inspiration.. you're all of this and much more to me. Celebrating you today and every day of the year! Happy Father's Day Nanna ❤️ pic.twitter.com/BujCvGCNec — Mahesh Babu (@urstrulyMahesh) June 20, 2021 ► నాన్నకు కోపం ఎక్కువ. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమకు బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి హ్యాపడీ ఫాదర్స్డే: చిరంజీవి మా నాన్న కి కోపం ఎక్కువ.. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి #HappyFathersDay pic.twitter.com/62jXHkbWTR — Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2021 ► తండ్రితో దిగిన చిన్ననాటి ఫొటోను షేర్ చేసిన అంజలి I Love You and Miss You Daddy. Always and forever. Happy Father’s Day ❤️#daddyslittlegirl #FathersDay pic.twitter.com/nsU6Dy5Tgx — Anjali (@yoursanjali) June 20, 2021 ► నీతో ఉన్న క్షణాలు నా జీవితంలోనే అత్యంత మధురమైనవి: మంచు లక్ష్మీ Happy Father’s Day @themohanbabu ❤️ Most of my favourite memories of life are with you Nana. You’ve been the mentor, leader, best friend and the best inspiration for everyone in the family. We couldn’t have been what we are today without your constant love & support. pic.twitter.com/LnLbgVfaI1 — Lakshmi Manchu (@LakshmiManchu) June 20, 2021 ► నాన్న సినిమాటోగ్రాఫర్ అని చాలా కొద్దిమందికే తెలుసు: దేవి శ్రీ ప్రసాద్ Very Few know that my FATHER’s passion was Photography/Cinematography🎥 Tho he was a Writer/Director🖊 He is d Reason 4 d Photography Passion in me..He taught me😁 Lov U Daddy..4 painting our LIVES with Beautiful COLOURS❤️🎶🤗#HappyFathersDay2021 ❤️@sagar_singer pic.twitter.com/OSN4CSc0q5 — DEVI SRI PRASAD (@ThisIsDSP) June 20, 2021 ► తండ్రి ప్రేమానురాగాలతోటే మేము ఇంతటివాళ్లమయ్యాం: సుధీర్ బాబు And we grew up, with the help of ever growing love and care. Happy #FathersDay Nanna ❤️ Best of the best 🤗 pic.twitter.com/X6RrY5CU8r — Sudheer Babu (@isudheerbabu) June 20, 2021 Happy Father's Day#FathersDay pic.twitter.com/UrXE3rKje8 — Mohanlal (@Mohanlal) June 20, 2021 Happy Father’s Day to the captain of our ship, for smoothly sailing us through thick and thin. I love you Boatloads Dad ❤️😘 #FathersDay pic.twitter.com/TC73g3bVRg — Sidharth Malhotra (@SidMalhotra) June 20, 2021 Nana! I’m so glad our father-son relationship has evolved into such a beautiful friendship over years! Love you 🤗🤗🤗@NagaBabuOffl #happyfathersday pic.twitter.com/cTMWQnoV2C — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) June 20, 2021 You are blessed if the person you learn from the most and the person who makes you laugh the most also happen to be your parent !! Happy Father’s Day @ikamalhaasan 💖 pic.twitter.com/pj4bBSfPhR — shruti haasan (@shrutihaasan) June 20, 2021 -
అంజలి కేక్ కటింగ్, నో ఫీలింగ్ అంటున్న హెబ్బా
♦ ర్యాండమ్ ఫొటో షేర్ చేసిన అనుష్క శర్మ ♦ బర్త్డే సెలబ్రేషన్స్లో అంజలి ♦ వకీల్సాబ్ ప్రమోషన్స్ టైమ్లో అలా.. అంటోన్న అనన్య నాగల్ల ♦ అందాలతో కవ్విస్తోన్న అనసూయ ♦ ఫ్రెండ్స్తో పూల్లో ఎంజాయ్ చేసిన సారా అలీఖాన్ ♦ సూర్యకాంతి అవసరమంటోన్న రాశీ ఖన్నా ♦ స్నేహగీతం పాడుతున్న మధుప్రియ ♦ మహర్షి సినిమా స్టిల్ షేర్ చేసిన పూజా హెగ్డే ♦ ఫ్రేమ్స్తోపాటు తన ఫీలింగ్స్ కూడా నిల్ అంటోన్న హెబ్బా పటేల్ ♦ రోడ్డు పక్కన కాఫీ తాగడం మిస్ అవుతున్నానంటోన్న తాప్సీ పన్ను ♦ ఇన్స్టాగ్రామ్లో 38 మిలియన్ల అభిమానులను సొంతం చేసుకున్న ఊర్వశి రౌతేలా ♦ పొట్టి డ్రెస్సులో అషు డ్యాన్సులు ♦ ఆ ప్రైజ్మనీ మొత్తం ఇచ్చేశానంటోన్న అవికా గోర్ ♦ దోస్త్తో ఫస్ట్ రీల్ చేశానంటోన్న అరియానా గ్లోరీ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Kalpika Ganesh (@iamkalpika) View this post on Instagram A post shared by Kirti Kulhari (@iamkirtikulhari) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Kritika Kamra (@kkamra) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
అచ్చ తెలుగు అమ్మాయి నటి అంజలి పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
-
పెళ్లిపై హీరోయిన్ అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
Anjali: లాక్డౌన్ సమయంలో చాలా మంది హీరో, హీరోయిన్ల పెళ్లిళ్లు జరిగాయి. కొంతమంది చెప్పి చేసుకుంటే.. మరికొంత మంది రహస్యంగా పెళ్లి చేసుకొని షాకిచ్చారు. ఇంకొంత మంది రిలేషన్ షిప్లో ఉండి, పెళ్లి కోసం రెడీ అవుతున్నారు. ఇలా సినీ సెలెబ్రిటీలంతా పెళ్లి బాట పట్టడంతో అందరి చూపు ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్పై పడింది. ఈ లిస్ట్లో హీరోయిన్ అంజలి కూడా ఉంది. ఈ తెలుగమ్మాయి ఈ ఏడాది చివరి నాటికి వివాహం చేసుకోబోతోందని పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై అంజలి స్పందించింది. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చేసింది. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపై మాత్రమే ఉందని, రానున్న రోజుల్లో మంచి పాత్రలు పోషించాలని అనుకుంటున్నాను అని తెలిపింది. ఇక సినిమాల విషయానికి వస్తే. .ఈ మధ్యనే ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోని ఒక ప్రధాన పాత్రలో అంజలి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆమె హీరోయిన్ గా నటించిన ఆనందభైరవి తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో కూడా నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు ఒక తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించబోతున్నట్లు సమాచారం. చదవండి: డైరెక్టర్ను పెళ్లాడిన ప్రముఖ హీరోయిన్ బిగ్బాస్ రియాల్టీ షో: భూమిక క్లారిటి! -
అమ్మగా.. సీఈవోగా అంజలీ సూద్..
అంజలీ సూద్ ‘వీమియో’ కంపెనీ సీఈవో. వీడియో హోస్టింగ్, షేరింగ్, సర్వీసెస్ ఇస్తుండే అమెరికన్ కంపెనీ వీమియో. ఆరేళ్ల క్రితం వీమియోలో చేరారు అంజలీ. మొదట మార్కెటింగ్ హెడ్, తర్వాత జనరల్ మేనేజర్, గత నాలుగేళ్లుగా సీఈవో. వీమియో ఈ నెల 25న పబ్లిక్ షేర్స్కి వెళ్లింది. ఆ ఘనమైన సందర్భాన్ని ట్విట్టర్లో చిన్న ఫొటోతో అతి శక్తిమంతంగా ప్రకటించారు అంజలీ సూద్. అది ఆమె నాస్డాక్ బిల్డింగ్ ఎదురుగా నిలుచుని ఉన్న ఫోటో అయితే కాదు. కొడుకును ఎత్తుకుని తన ఆఫీస్ క్యాబిన్ డోర్ దగ్గర నిలుచుని ఉన్న ఫొటో! వీమియోలో మొదట చేరినప్పుడు గానీ, తర్వాత ఆ కంపెనీకి సీఈవో అయినప్పుడు గానీ, రెండేళ్ల క్రితం ఫార్చూన్ అండర్ 40 జాబితాలో 14వ స్థానంలో ఉన్నప్పుడు గానీ అంజలీ సూద్ నుంచి వర్కింగ్ మదర్స్ పొందిన స్ఫూర్తి బయటికేమీ కనిపించలేదు. ఇప్పుడు ఆ కంపెనీ పబ్లిక్ షేర్స్కి వెళ్లి నాస్డాక్లో లిస్ట్ అయినప్పుడు కూడా ఆమె తన రెండేళ్ల వయసున్న కొడుకును ఎత్తుకుని ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేయకపోయి ఉంటే అది కూడా ఒక మామూలు విషయంగానే నిలిచిపోయేది. ఫొటోతోపాటు అంజలి (37) పెట్టిన కామెంట్ ఎలా ఉందో చూడండి. ‘‘అమ్మ కాలింగ్ బెల్ కొట్టడానికి ముందే వచ్చి అదృష్టం ఆమెను హత్తుకుపోయింది’’ అని! పబ్లిక్ షేర్స్కి ఓపెనింగ్ బెల్ ఇవ్వడానికి ముందే తన కంపెనీ ప్రజల్లోకి వెళ్లిపోయింది అని చెప్పడం ఆమె ఉద్దేశం. ‘‘ఇలాంటి రోజు ఒకటి వచ్చిందంటే నమ్మలేక పోతున్నాను’’ అని కూడా ఆ పోస్ట్లో రాశారు అంజలి. ఒక పెద్ద కంపెనీ సీఈవో పింక్ సూట్, బూట్లు ధరించి ఆఫీస్లో తన కొడుకు ను ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటో మహిళా సాధికారతకు మాత్రమే కాదు, సంపూర్ణాధికారతకు ప్రతీకలా కనిపించింది. సాధారణ భాషలో చెప్పాలంటే వర్కింగ్ మదర్స్ అందరికీ ఆ ఫొటో భలే ముచ్చటగా అనిపించింది. బహుశా అంజలిలో ఎవరికి వారు తమను చూసుకుని ఉంటారు. శక్తి పొంది ఉంటారు. ఇంటి పనీ, ఆఫీస్ పనీ అంటూ మల్టీ టాస్కింగ్ చెయ్యడం ఏ తల్లికీ సాధ్యం అయ్యే పని కాదు. ‘‘కానీ పిల్లలు సాధ్యం చేయిస్తారు’’ అని ఒక నెట్ యూజర్ అంజలికి థమ్స్ అప్ ఇచ్చారు. ‘‘అలసిన శరీరానికి విశ్రాంతి, అలసిన మనసుకు పిల్లలు’’ అని మరొక మహిళ ట్వీట్ చేశారు. మొదటి ఫొటోను షేర్ చేసిన నాలుగు నిముషాలకు ఈ ఫొటోను షేర్ చేశారు అంజలి. కంపెనీ ‘పబ్లిక్’ షేర్స్కి వెళ్లిన సందర్భాన్ని డైరెక్టర్స్తో కలిసి షేర్స్ చేసుకుంటున్న ఆ మొదటి ఫొటో కన్నా, కొడుకును ఎత్తుకుని ఉన్న రెండో ఫొటోనే నెటిజన్స్ని ఎక్కువ ఆకట్టుకుంది. అనేక వందలసార్లు షేర్ అయింది. ఒక మదర్.. వర్కింగ్ ఉమన్గా తన కెరీర్లో అద్భుతాలు సాధించడానికి పిల్లలు శక్తినిస్తారు అనే సందేశాన్ని అంజలి ఆ ఫొటో ద్వారా అందించ తలచినట్లున్నారు. అది సరిగ్గా అందవలసిన వారికే అందింది. పిల్లల బాధ్యతలు తల్లి కెరీర్కు ప్రతిబంధకాలు కావని చెప్పలేం. కానీ కెరీర్లోఎదిగే క్రమంలో అవహించే నిస్సత్తువను పోగొట్టే మంత్రదండాలు పిల్లల చిరువ్వులూ, ఇంటికి వచ్చీరాగానే ఎత్తుకోమని ఏడుస్తూ వారు చేసే డిమాండ్లూ! -
‘వకీల్ సాబ్’ మూవీ రివ్యూ
టైటిల్ : వకీల్ సాబ్ జానర్: లీగల్ డ్రామా నటీనటులు : పవన్ కల్యాణ్, శృతిహాసన్, ప్రకాశ్ రాజ్, అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్ సమర్పణ : బోనీ కపూర్ దర్శకత్వం : శ్రీరామ్ వేణు సంగీతం : తమన్ సినిమాటోగ్రఫీ : పీఎస్ వినోద్ ఎడిటింగ్ : ప్రవీన్ పూడి విడుదల తేది : ఏప్రిల్ 09, 2021 అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని ‘వకీల్ సాబ్’గా ఈ శుక్రవారం (ఏప్రిల్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్. పవన్ రీఎంట్రీ మూవీ కావడం.. అందులోనూ అమితాబ్ నటించి బాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ పింక్ సినిమాకు రీమేక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్కు మంచి స్పందన రావడంతో ‘వకీల్ సాబ్’పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ వకీల్ సాబ్ ఏ మేరకు అందుకున్నాడు? పవన్ రీఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ పల్లవి(నివేధా థామస్), జరీనా బేగం(అంజలి), దివ్య నాయక్(అనన్య నాగళ్ళ )వేరు వేరు ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి యువతులు. ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్కు వచ్చి ఒకే ఇంట్లో అద్దెకు ఉంటారు. డ్యూటీకి వెళ్లడం, వచ్చిన డబ్బులు ఇంటికి పంపించడం వీరి కర్తవ్యం. ఇలా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్న ఈ ముగ్గురు ఒక రోజు పార్టీ కోసం బయటకు వెళ్లి రాత్రి క్యాబ్లో ఇంటికి వెళ్తూ అనుకోకుండా ఎంపీ రాజేందర్(ముఖేష్ రిషి) కొడుకు వంశీ(వంశీకృష్ణ) గ్యాంగ్తో రిసార్ట్కి వెళ్తారు. అక్కడ జరిగిన ఓ సంఘటన ఈ ముగ్గురి జీవితాలను మలుపుతిప్పుతుంది. ఈ ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు అవుతుంది. పల్లవిని అరెస్ట్ చేస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఈ ముగ్గురు యువతులకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని క్రమంలో సస్పెండ్కు గురైన లాయర్ సత్యదేవ్ అలియాస్ వకీల్ సాబ్( పవన్ కల్యాణ్) అండగా నిలబడతాడు. అసలు సత్యదేవ్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? అతని చరిత్ర ఏంటి? మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపడుచులకు వకీల్ సాబ్ ఎలా న్యాయం చేశాడు? రాజకీయ నేపథ్యం ఉన్న వంశీని, డబ్బులకు అమ్ముడుపోయే లాయర్ నందా(ప్రకాశ్ రాజ్)ని సత్యదేవ్ ఎలా ఢీకొన్నాడు? అనేదే మిగతా కథ. నటీనటులు అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కల్యాణ్ వెండితెరకు దూరమయ్యాడు. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లి తెరపై కనిపించాడు. వకీల్ సాబ్ పాత్రలో పవన్ పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో పవన్ చెప్పే డైలాగ్స్ అబ్బురపరచడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఇక శృతిహాసన్ చనిపోయినప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్లో పవన్ కల్యాణ్ జీవించేశాడు. అలాగే మధ్యతరగతి చెందిన యువతుల పాత్రల్లో అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ అద్భుతంగా నటించారు. వకీల్ సాబ్ భార్య పాత్రలో శృతిహాసన్ పర్వాలేదనిపిస్తుంది. ఇక క్రిమినల్ లాయర్ నందా పాత్రలో ప్రకాశ్రాజ్ ఎప్పటిమాదిరే జీవించేశాడు. వంశీకృష్ణతో మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కి రీమేకే ఈ వకీల్ సాబ్ సినిమా. సమాజంలో మహిళల పట్ల కొంతమంది వ్యక్తులకు ఉన్న చులకన భావాన్ని, దానివల్ల స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం ‘పింక్’. అక్కడ అమితాబ్ బచ్చన్, తాప్సీ, కృతి కల్హరి, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే సినిమాను అజిత్లో కోలీవుడ్లో రీమేక్ చేశారు. అక్కడా సూపర్ హిట్ అయింది. రెండు చోట్ల సూపర్ హిట్ కావడంతో ఈ కథను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావించాడు నిర్మాత దిల్ రాజు. పవర్స్టార్ పవన్కల్యాణ్ స్టార్డమ్ని దృష్టిలో ఉంచుకుని మూలకథలో ఎలాంటి మార్పులు చేయకుండా, దానికి కొన్ని కమర్షియల్ హంగుల్ని చేర్చాడు దర్శకుడు వేణు శ్రీరామ్. బాలీవుడ్, కోలీవుడ్లో చూపించని విధంగా ఇందులో పవన్ని యంగ్ లుక్లో చూపించారు. అలాగే హీరోకి ప్లాష్ బ్యాగ్ కూడా పెట్టాడు. అయితే అది మాత్రం వర్కౌట్ కాలేదు. సినిమా కథకు అది కాస్త అడ్డంకిగా అనిపిస్తుంది. అలాగే శ్రుతీహాసన్, పవన్ కల్యాణ్ మధ్య వచ్చిన లవ్ సీన్స్కూడా అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్లో కొన్ని చోట్ల అనవసరమైన సీన్స్ కూడా ఉండటం కొంతమేర ప్రతికూల అంశమే. అలాగే ఇంటర్వెల్ వరకు అసలు కథ ముందుకు సాగదు. ఇక సినిమాకు ప్రధాన బలం కోర్టు సీన్స్ . కోర్టు సన్నీవేశాల్లో వచ్చే డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేవిగా ఉంటాయి.‘అడుక్కునోళ్లకి అన్నం దొరుకుంది. కష్టపడినోడికి నీడ దొరుకుంది కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదు’, ‘ఆడది అంటే బాత్రుంలో ఉండే బొమ్మ కాదు నిన్ను కన్న అమ్మ’ లాంటి డైలాగ్స్ హృదయాలను హత్తుకుంటాయి. అయితే సెకండాఫ్ మొత్తం కోర్టు సన్నివేశాలే ఉండడం పవన్ ఫ్యాన్స్కు నచ్చినా.. సాధారణ ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది. అలాగే కొన్ని డైలాగ్స్ పవన్ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టి రాసినట్లుగా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. పలు సన్నివేశాలను తన నేపథ్య సంగీతంతో ఓ రేంజ్కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాలకు తనదైన బీజీఎం ఇచ్చి తమన్ అదరగొట్టాడు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి బాగుంది. కోర్టు సన్నివేశాలను కళ్లకుకట్టినట్లు చూపించాడు. పవీన్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు. ఫస్టాఫ్లో కొన్ని సీన్లకు కత్తెరపడితే బాగుండనిపిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ పవన్ కల్యాణ్, ప్రకాశ్రాజ్ నటన తమన్ సంగీతం కోర్టు సీన్స్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ -
హీరోయిన్ అంజలికి కరోనా..ఆమె ఏమందంటే..
దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. సినీ ఇండస్ర్టీని సైతం కరోనా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, విజయేంద్రప్రసాద్, నివేదా థామస్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ జాబితాలో హీరోయిన్ అంజలి కూడా చేరిందని, ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. గత కొన్ని రోజులుగా అంజలి వకీల్సాబ్ ప్రమోషన్స్లో పాల్గొంటుంది. ఈ సినిమాలో ఈమెతో పాటు కలిసి నటించిన నివేదా థామస్కు ఇటీవలె కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అంజలికి సైతం కరోనా సోకిందని పలు వార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నట్లు రూమర్స్ వినిపించాయి. దీనిపై అంజలి సైతం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఇదంతా నిజమే అనుకొని అంజలికి కరోనా సోకిందనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుండటంతో నటి అంజలి క్లారిటీ ఇచ్చారు. 'నాకు కరోనా వచ్చిదంటూ పలు న్యూస్ ఆర్టికల్స్లో వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. నాకు కరోనా సోకిందనే వార్త పూర్తి అబద్ధం. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నాకు కోవిడ్ రాలేదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి' అంటూ నెటిజన్లను కోరింది. 🙏🏻 pic.twitter.com/6eprZEWJZ4 — Anjali (@yoursanjali) April 8, 2021 చదవండి : బ్రేకప్ తట్టుకోవడం చాలా కష్టం: అంజలి టీకా తీసుకున్నా.. ప్రముఖ నటికి కరోనా -
'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్; అందరి కళ్లు అంజలిపైనే
-
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
లవ్ ఫెయిల్యూర్, చాలా బాధపడ్డా: అంజలి
బొద్దుగుమ్మలా ఉండే అంజలి ఈ మధ్య మరీ సన్నజాజిలా తయారైంది. ఒకప్పుడు తెలుగులోని స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె ఇప్పుడు ఇతర భాషా చిత్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. 'నిశ్శబ్దం' తర్వాత ఈ భామ తెలుగులో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న ఆమె ప్రేమ, పెళ్లి గురించి స్పందించింది. కొన్నాళ్ల క్రితం తాను కూడా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింంది. అయితే ప్రేమలో పడిన మాట వాస్తవమని అంగీకరిస్తూనే కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్లలేదు అని చెప్పుకొచ్చింది. హీరోయిన్ అయినంత మాత్రాన తన మనసేమీ బండరాయి కాదని, ప్రేమ విఫలమైన బాధను భరించడం చాలా కష్టమని తెలిపింది. అలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడ్డానంటే అందుకు తనే తల్లే కారణమని చెప్పింది. ఎన్నో కష్టనష్టాలను భరించిన తల్లిని ఆదర్శంగా తీసుకునే దాన్ని అధిగమించానంది. పెళ్లి గురించి ఇప్పట్లో ఏమీ ఆలోచించడం లేదని స్పష్టం చేసింది. కాగా అంజలి ఇప్పటివరకు సుమారు 48 సినిమాల్లో నటించింది. తాజాగా వకీల్సాబ్తో పాటు తెలుగులో 'ఆనంద భైరవి' సినిమాలోనూ నటిస్తోంది. వీటితోపాటు మలయాళంలో 'భీష్మ పర్వం', కన్నడలో 'శివప్ప', తమిళంలో 'పూచండి' చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం : దిల్ రాజు సోషల్ హల్ చల్ : కన్నుగీటుతో కుర్రకారును కట్టిపడేస్తున్న మోనాల్ -
ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం : దిల్ రాజు
పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్ సాబ్’. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో అభిమానుల మధ్య ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ‘సరిగ్గా చెప్పండి.. ఏం చెప్పారు.. ఏం చేశారు’, ‘అలా జరగద్దు.. జరగకూడదు’ అనే డైలాగ్స్తో టీజర్ సాగుతుంది. టీజర్ విడుదల సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్ను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మనం మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నాం. వెయిటింగ్ పూర్తయింది. ట్రైలర్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే. ఏప్రిల్ 9న లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం’’ అన్నారు. ‘‘ట్రైలర్ కంటే సినిమా ఇంకా బాగుంటుంది’’ అన్నారు వేణు శ్రీరామ్. హిందీ హిట్ ‘పింక్’ చిత్రానికి తెలుగు రీమేక్గా ‘వకీల్ సాబ్’ రూపొందిన విషయం తెలిసిందే. చదవండి: లవ్స్టోరీ’ వాయిదాపై చిత్ర యూనిట్ క్లారిటీ పదహారువందల మందిని ప్రేమించా' -
నేను ఎప్పుడూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాను : టాలీవుడ్ హీరోయిన్
సాక్షి, హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని టాలీవుడ్ నటి అంజలి పేర్కొన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ నిబంధనలపై నగర పోలీసులు ఎంజే మార్కెట్లో శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ట్రాఫిక్ అవగాహనపై సిటీ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు షార్ట్ ఫిలిమ్స్ను అంజలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. తను ఎల్లప్పుడూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తానని పేర్కొన్నారు. నా డ్రైవర్కు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్తానని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవడానికి కారణమవుతోందన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్, డ్రగ్స్, ఇతర చెడు అలవాట్ల కారణంగా సమాజం ప్రభావితం అవుతుందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహణ కోసం కార్యక్రమం ఏర్పాటు చేశామని, ప్రతది రోజు రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైవేలపై జరిగే ప్రమాదాలకు అతివేగం కారణమవుతోందని అన్నారు. సినిమాల్లో పోలీసులను విలన్లుగా చూపిస్తున్నారు కానీ బయట పోలీసులు నిజమైన హీరోలని, ప్రతది ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబద్ సీపీ అంజనీ కుమార్, అడిషనల్ సీపీ అనిల్ కుమార్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. చదవండి: జాగ్రత్త.. ఇక మీకు మామూలుగా ఉండదు! -
ఈరోజు నేను.. రేపు మరొకరు: స్పీకర్ కుమార్తె
న్యూఢిల్లీ: ‘‘ అవాస్తవాలు ప్రచారం చేసే వారి జాడ కనిపెట్టి వారిని జవాబుదారులుగా నిలబెట్టాలి. ఈరోజు నేను బాధితురాలిని అయ్యాను. రేపు మరొకరు. ట్రోలింగ్కు వ్యతిరేకంగా ఓ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది’’ అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తనయ అంజలి బిర్లా అభిప్రాయపడ్డారు. అయితే ట్రోల్స్ వల్ల తనకు కాస్త మంచే జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి వాళ్లను దీటుగా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చిందని తెలిపారు. కాగా అంజలి బిర్లా ఇటీవల ఐఏఎస్గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని అత్యున్నత ఉద్యోగాన్ని పొందారంటూ కొంతమంది ఆమెపై విషం చిమ్మారు. ప్రతిభ లేకపోయినా.. పరీక్ష రాయకుండానే జాబ్ సంపాదించారంటూ సోషల్ మీడియలో విద్వేషపూరిత కామెంట్లు చేశారు. కాగా వాస్తవానికి ఆమె పరీక్షలు రాసి ఇంటర్వ్యూ కూడా పూర్తి చేసి ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఫ్యాక్ట్ చెక్(నిజనిర్ధారణ) సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. అయినప్పటికీ కొంతమంది ఆకతాయిలు అంజలి గురించి అసత్యాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అంజలి బిర్లా.. ‘‘ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాసి ఉద్యోగం పొందానని నేను వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ప్రతికూల కామెంట్ల వలన నా మనసు దృఢంగా తయారైంది. నేను ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటాను. నేనెంతగా హార్డ్వర్క్ చేస్తానో.. నాతో సన్నిహితంగా ఉండేవారికి మాత్రమే తెలుసు. నిజానికి మున్ముందు జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అయితే ట్రోల్స్ కారణంగా పూర్తిస్థాయిలో పరిణతి చెందిన వ్యక్తిగా రూపాంతరం చెందాను’’అని చెప్పుకొచ్చారు. కాగా సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసిన వారికి.. అంజలి బిర్లా ఇప్పటికే కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. యూపీఎస్సీ పరీక్షల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరుగుతుందని, కనీసం వ్యవస్థలనైనా గౌరవించాలంటూ హితవు పలికారు. ఇందుకు సంబంధించిన పోస్టుకు తన ఉత్తీరణ పత్రాలను కూడా జోడించారు. (చదవండి: ఐఏఎస్గా అడ్డదారిలో ఎంపిక కాలే!) -
నవ్వుల జాబిలి అందాల అంజలి
-
అల్లు అర్హ ‘అంజలి’ వీడియో సాంగ్.. ట్రెండింగ్లో
అల్లు అర్హ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం అక్కరలేని పేరు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అయిన అర్హ.. చిన్నతనంలోనే తన క్యూట్నెస్తో ఇప్పటికే అభిమానుల్లో బోలెడంత క్రేజ్ సంపాదించింది. ఆమె ఏం చేసిన సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ క్రియెట్ చేస్తుంది. నేడు(నవంబర్ 21) అర్హ తన నాలుగో పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశాడు. 1990లో విడుదలైన క్లాసిక్ మూవీ అంజలి సినిమాలోని ‘అంజలి అంజలి అంజలి’ అనే పాట ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ పాటలో బేబీ షామిలీ తన నటనతో అందరిని మంత్రముగ్దులను చేసింది. తాజాగా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ను అల్లు అర్హతో మళ్లీ రీ క్రియేట్ చేసి వీడియో సాంగ్ను విడుదల చేశాడు. చదవండి: కూతురు బర్త్డేకు సర్ఫ్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్ ఈ పాటలో ఆర్హ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అచ్చం పాత సినిమా పాట మాదిరిగానే చిన్న పిల్లలందరిని కూడగట్టి సరికొత్తగా షూట్ చేశారు. ఇందులో అర్హతోపాటు తన సోదరుడు అయాన్ కూడా నటించారు. చివర్లో అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వడం పాట మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో తాతయ్యలు అల్లు అరవింద్, కేసీ శేఖర్ రెడ్డి కూడా కనిపించారు. ఇక గణేశ్ స్వామి కొరియోగ్రఫీ చేసిన లేటెస్ట్ అంజలి వీడియో సాంగ్కు సూర్య సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: చిన్నారి స్వాతంత్య్ర యోధులు -
నిశ్శబ్దం ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది
అనుష్క, మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడ్సన్, షాలినీ పాండే ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా చిత్రదర్శకుడు హేమంత్ మధుకర్ మీడియాతో చెప్పిన విశేషాలు. ► కమల్హాసన్ నటించిన ‘పుష్పక విమానం’ సినిమాలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రయోగాత్మక సినిమాగా చేద్దామనుకుని కోన వెంకట్గారికి ఈ కథ చెప్పాను. కోనగారికి కథ నచ్చటంతో ఆయన ద్వారా అనుష్కగారికి, మిగతా నటీనటులకు ఈ కథ చెప్పి, ఒప్పించాను. ప్రయోగాత్మక చిత్రం అంటే నిర్మాతలు ముందుకు రారేమోనని కోన వెంకట్గారి సలహా మేరకు మూకీ సినిమాని కాస్తా డైలాగ్స్తో నింపి మెయిన్ పాత్ర అనుష్క క్యారెక్టర్ను మాత్రం మూకీగా ఉంచాను. అప్పుడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్గారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై సినిమాను నిర్మించటానికి ముందుకు వచ్చారు. ఆయనతో పాటు కోన ఫిల్మ్ కార్పోరేషన్ నిర్మాణ భాగస్వామిగా చేరటంతో మా ‘నిశ్శబ్దం’ తెరకెక్కింది. ► విజువల్గా గ్రాండ్గా కనిపించటంతో పాటు ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ రావటం కోసం, కథానుగుణంగా సినిమాను అమెరికాలో చిత్రీకరించాం. అమెరికాలో పుట్టిన ఇండియన్ అమ్మాయి పాత్ర అనుష్కది. అలాగే అన్ని ముఖ్యపాత్రలు అమెరికా నేపథ్యంలో ఉంటాయి. ఒరిజినాలిటీ మిస్ కాకూడదనే ఉద్దేశంతో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ను పూర్తి నిడివి ఉన్న పాత్రకోసం తీసుకున్నాం. ఒక హాలీవుడ్ నటుడు పూర్తి స్థాయిలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’ అని అనుకుంటున్నాను. ► ఈ సినిమాను కేవలం 55రోజుల్లో తీయగలిగానంటే దానికి కారణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలే. అమెరికాలో షూటింగ్ అంటే వీసాలు, లొకేషన్లు అని ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. నేను చెప్పిన కథను నమ్మి టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గార్లు ఏ లోటు లేకుండా చేయటం వల్లే ఈ సినిమా సాధ్యమయింది. ఈ సినిమాలోని సౌండ్, షానిల్ డియో కెమెరా వర్క్ గురించి సినిమా చూసిన తర్వాత అందరూ మాట్లాడతారని నమ్ముతున్నాను. సంగీత దర్శకుడు గిరీష్, గోపీసుందర్ నేపథ్య సంగీతం పోటాపోటీగా ఉంటాయి. -
షూటింగ్కి రెడీ
కరోనా బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్స్తో బిజీ కాబోతున్నారు శ్రుతీహాసన్. ఇటీవలే కొన్ని యాడ్స్ చిత్రీకరణల్లో పాల్గొన్నారామె. తాజాగా సినిమా చిత్రీకరణలకు కూడా సిద్ధమయ్యారు. అక్టోబర్ నుంచి ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటారట శ్రుతీహాసన్. పవన్ కల్యాణ్, అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ ‘పింక్’కి రీమేక్. ఇందులో పవన్ కల్యాణ్ భార్యగా శ్రుతీహాసన్ నటించనున్నారు. అయితే ఇందులో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని సమాచారం. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ ‘క్రాక్’లోనూ నటిస్తున్నారు శ్రుతి. ఆ సినిమా చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. -
నిశ్శబ్దం కూడా...
ఇప్పటికే పలు చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు ‘నిశ్శబ్దం’ కూడా విడుదల కానుంది. అనుష్క, మాధవన్ జంటగా అంజలి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ సహకారంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తెలుగులో ‘నిశ్శబ్దం’, తమిళ, మలయాళ భాషల్లో ‘సైలె¯Œ ్స’ పేరుతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ‘‘సస్పె¯Œ ్స, థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమిది. మాటలు రాని మరియు వినికిడి లోపం ఉన్న కళాకారిణిగా అనుష్క నటించారు’’ అన్నారు హేమంత్ మధుకర్. ‘‘భారతదేశంతో పాటు 200 దేశాల్లో మా సినిమా విడుదల కానుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. అనుష్క మాట్లాడుతూ– ‘‘నేనిప్పటివరకు చేసిన అన్ని పాత్రలతో పోలిస్తే ఈ చిత్రంలోని సాక్షి పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. నా కంఫర్ట్ జోన్ నుండి నన్ను బయటకు నెట్టివేసిన పాత్ర’’ అన్నారు. -
నడిరోడ్డుపై డాన్స్ చేస్తా..!
సినిమా: నడిరోడ్డుపై డాన్స్ చేస్తా అంటోంది నటి అంజలి. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా బాధ అంతా ఇంతా కాదు. ఎంతోమందిని ఈ వైరస్ పొట్టన పెట్టుకుంటోంది. మరి ఎంతోమందిని ఆర్థిక సమస్యలకు గురి చేస్తోంది. ఇక పలువురికి అసహనానికి గురి చేస్తోంది. ఇలా ఈ మహమ్మారితో అందరూ ఏదో విధంగా బాధింపునకు గురవుతున్నారు. దీనిని అరికట్టడానికి ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా పాటుపడుతున్నాయి. అయినా ఇది ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన పలువురు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక ఆర్థికంగా బలపడిన నటీనటులు కూడా కరోనా దెబ్బకు ఇంటిలోనే మగ్గిపోతున్నారు. చాలామంది ఇంటి పనులు, శారీరక వ్యాయామాలు, యోగాతో కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు సామాజిక మాధ్యమాలలో తమ ఫొటోలను పోస్టు చేస్తూ అభిమానంతో ముచ్చటిస్తూ కాలం గడుపుతున్నారు. అలా అంజలి కూడా ఇంటి పనులు, కసరత్తులు, డాన్స్లతో టైంపాస్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తన ఇన్స్ట్ర్రాగామ్లో తాను మిద్దెపై డాన్స్ చేస్తున్న ఫొటోను పోస్టు చేసింది. అందులో అంజలి పేర్కొంటూ కరోనా సమస్య ముగిసిన వెంటనే బయటికి వచ్చి నడిరోడ్డుపై డాన్స్ చేయాలనుందని పేర్కొంది. ఈ కరోనా కాలంలో ఈ అమ్మడు అంతగా బోర్గా ఫీల వుతోందన్నమాట. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో మూడు చిత్రాలు, తెలుగులో మూడు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అదే విధంగా నటి అనుష్కతో కలిసి నటించిన సైలెన్స్ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. View this post on Instagram Once this ends I wll celebrate like this 💃🏻 till then #throwback #dance #pic 🤷🏻♀️ #happy #sunday A post shared by Anjali (@yours_anjali) on Jul 12, 2020 at 4:11am PDT -
ఇదే చివరి రోజు ఫోటో: అంజలి
లాక్డౌన్ కొనసాగుతున్నవేళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటూ తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ అలరిస్తున్నారు. తాజాగా హీరోయిన్ అంజలి తాను నటించిన ఓ సినిమా షూటింగ్కు సంబంధించిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘నిశ్శబ్దం సినిమా చిత్రీకరణలో భాగంగా చివరిరోజు తీసుకున్న ఫోటో ఇది’ అని ఆమె కామెంట్ జత చేశారు. ఈ ఫోటోలో.. ప్రధాన పాత్రలో నటించిన అనుష్క ముఖానికి, మరో నటుడు సుబ్బరాజు ముఖానికి రక్తం మరకలు ఉండటం గమనించవచ్చు. ఈ ఫోటోను చూస్తే చివరిరోజు ఏదో యాక్షన్ సన్నివేశాన్ని తీసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో అంజలి శక్తివంతమైన పోలీసాఫీసర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. (కాబోయే భార్య అలా ఉండాలి : విజయ్) ‘నిశ్శబ్దం’ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కోన వెంకట్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలినీ పాండే కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్కు మంచి టాక్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్లో సాగుతుంది. ఇక ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందింన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ‘నిశ్శబ్దం’ వాయిదా పడింది. పవర్ఫుల్ పోలీసాఫీసర్గా నటించిన అంజలి నటనను థియేటర్లో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. (పుష్పాభివందనం చేయటం అభినందనీయం : చిరు) View this post on Instagram This pic is frm the last day of shoot fr #nishabdham 👮🏻🤫 #maha #memories #shooting #movies #wrap #seattle #usa #throwback #saturday #happyweekend A post shared by Anjali (@yours_anjali) on May 1, 2020 at 11:37pm PDT -
హీరోయిన్ అంజలి ఫోటోలు
-
వివాహిత దారుణ హత్య
జవహర్నగర్: ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో దారుణ హత్యకు గురైన సంఘటన జవహర్నరగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బృందావన్కాలనీ ఎక్స్సర్వీస్మెన్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా, మందాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్కు కోహెడ మండలం, చెంచాచేరు పల్లి గ్రామానికి చెందిన అంజలి(22)తో 2018లో వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చిన శ్రీకాంత్ క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కొన్నాళ్ల పాటు జవహర్నగర్లో తన అన్న శ్రీనివాస్, వదినలతో కలిసి ఉన్న శ్రీకాంత్ 25 రోజుల క్రితం ఎక్స్సర్వీస్మెన్ కాలనీలోని ఇంట్లోకి వెళ్లాడు. గురువారం రాత్రి అతను క్యాబ్ తీసుకుని బయటికి వెళ్లగా అంజలి తన కుమారుడు చైతును శ్రీకాంత్ సోదరుడి ఇంట్లో వదిలి, తన ఇంటికి వచ్చింది. శుక్రవారం ఉదయం సోదరుడి ఇంట్లో ఉన్న కుమారుడిని తీసుకుని తన ఇంటి వచ్చిన శ్రీకాంత్ అంజలి హత్యకు గురై ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు డాగ్స్వాడ్, క్లూస్టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. కాగా జాగిలం ఘటనా స్థలం నుంచి నేరుగా శ్రీకాంత్ సోదరుడి ఇంటి వద్దకు వెళ్లి ఆగింది. దీంతో పోలీసులు శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్ధలాన్ని మల్కాజిగిరి డీసీపీ రక్షిత పరిశీలించారు. భర్త శ్రీకాంత్తో పాటు అతడి కుటుంబ సభ్యులే అదనపు కట్నం కోసం తమ కుమార్తెను హత్య చేశారని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.