Charge Sheet
-
జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల ఛార్జ్ షీట్లో కీలక అంశాలు!
జానీ మాస్టర్ (Jani Master) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ మహిళ కొరియోగ్రాఫర్(choreographer) ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల కేసులో ఆయనను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు కావడంతో జానీ విడుదలయ్యారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.లైంగిక వేధింపులకు పాల్పడ్డారు: ఛార్జ్ షీట్లో పోలీసులుపలు ఈవెంట్స్ పేరుతో మహిళ కొరియోగ్రాఫర్ను లైంగిక వేధింపులకు గురి చేశాడని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఆమెను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి వేధింపులకు గురి చేసినట్లు అందులో ప్రస్తావించారు. కాగా.. తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఓ మహిళ కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: పెళ్లి చేసుకోమని ఆమె నన్ను వేధించేది: జానీ మాస్టర్)అసలేం జరిగిందంటే..టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. మధ్యప్రదేశ్కి చెందిన బాధితురాలు 2017లో జానీ మాస్టర్కి పరిచయమైంది. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరింది. ఓ షో కోసం ముంబయికి వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని తనని బెదిరించే వాడని, షూటింగ్కు సంబంధించిన వాహనంలో కూడా తనని వేధించాడని బాధితురాలు వాపోయింది. దీంతో జానీపై లైంగిక వేధింపుల కేసుతో పాటు పోక్సో కేసు కూడా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ, బీఆర్ఎస్ చార్జిషీట్
-
ఏడాది పాలన.. ఎడతెగని వంచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన ఎడతెగని వేదనను మిగిల్చిదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ పాలన అంతా పరపీడన పరాయణత్వంలా మారిందని విమర్శించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడుతామని అధికారంలోకి వచ్చి.. ఏడాదిలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎరుగని నిర్బంధకాండను రేవంత్ ప్రభుత్వం అమలుచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పాలనపై ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ తరఫున హరీశ్రావు చార్జిషీట్ విడుదల చేశారు. త్వరలో ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలపై మరో చార్జిïÙట్ విడుదల చేస్తామని ప్రకటించారు. ‘సీఎం సొంత ఊరికి ఎవరైనా వెళ్లాలంటే స్థానిక పోలీస్స్టేషన్లో అనుమతి తీసువాల్సిన పరిస్థితి. బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూల్చి ఎమర్జెన్సీని తలపిస్తున్నాడు’అని మండిపడ్డారు. శ్వేతపత్రాల పేరిట రోత పత్రాలు.. ‘రేవంత్ పాలన ప్రతికూల దృక్పథంతో ప్రారంభం కావడంతో ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. శ్వేతపత్రాల పేరిట రోత పత్రాలు విడుదల చేసి రాష్ట్రం దివాలా తీసిందనే నెగెటివ్ ఇమేజ్ సృష్టించారు. రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. ప్రభుత్వ ౖశాఖల మధ్య సమన్వయం లేదు. సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనే పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెచ్చుమీరాయి.కృష్ణా నది ప్రాజెక్టులపై పదేండ్లు కేసీఆర్ కాపాడిన హక్కులను.. అధికారంలోకి వచ్చి నెల తిరక్కుండానే కేంద్రానికి కట్టబెట్టారు. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగితే, రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగింది. రైతు సంక్షేమానికి రాహుకాలం.. వ్యవసాయానికి గ్రహణం పట్టింది. బడిలో చదువుకోవాల్సిన పిల్లలు ఆసుపత్రుల్లో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. హైడ్రా రూపంలో రేవంత్ రెడ్డి విధ్వంసం సృష్టించారు. మూసీ ప్రక్షాళన పేరిట మూటలు వెనకేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిక్క విధానం, తిట్ల పురాణం అవలంబిస్తున్న సీఎంకు దుర్భాష దురంధరుడు అనే బిరుదు ఇవ్వవచ్చు’అని హరీశ్రావు ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్ పాలనపై బీజేపీ చార్జ్షీట్
-
ఐదు నెలల కూటమి సర్కార్ వైఫల్యాలపై ఛార్జ్షీట్
సాక్షి, విజయవాడ: ఐదు నెలల కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయన్నారు. కూటమి నేతలకు ఎలా పాలించాలో తెలియక వైఎస్ జగన్పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అవినీతి, అరాచకాలు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు ఇవే ఈ ఐదు నెలల్లో జరిగాయన్నారు.కేంద్రంతో పొత్తులో ఉండి కూడా కేంద్రాన్ని నిధుల కోసం నిలదీయడం లేదు. ప్రతీకారంపై పెట్టిన దృష్టి పథకాల అమలుపై పెట్టడం లేదు. అప్పుల మీద పెట్టిన దృష్టి సంక్షేమంపై పెట్టలేదు. గతంలో అమ్మఒడి పథకంపై అనేక ఆరోపణలు చేశారు. కూటమి వచ్చాక ప్రతీ బిడ్డకు తల్లికి వందనం ఇస్తామని చెప్పి అమలు చేయలేదు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం తలకిందులైంది. నాడు-నేడు పేరుతో వైఎస్ జగన్ చేసిన పాఠశాలల అభివృద్ధిని మీరు కొనసాగిస్తారా లేదా? దీనికి సమాధానం చెప్పాలి’’ అంటూ పోతిన మహేష్ నిలదీశారు.గతంలో డిజిటల్ విద్యపై విద్యార్థులను ట్రోల్ చేశారు. మరి ఇప్పుడు విద్యార్థులకు డిజిటల్ విద్యను ఎందుకు అందించలేకపోతున్నారు?. పేదల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకం కూటమి వచ్చాక కుంటుపడింది. పేదలు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుందామంటే దానిపై 18 శాతం జీఎస్టీ వేస్తుంటే.. కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?. రెడ్ బుక్ అమలు మీద పెట్టిన శ్రద్ధ మహిళల రక్షణ మీద పెట్టకపోవడం దారుణం. కూటమి వచ్చాకే మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు.’’ అని పోతిన మహేష్ మండిపడ్డారు.వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి వాళ్లని కూడా మోసం చేశారు. నిత్యావసర ధరలు తగ్గించడానికి సమావేశాలు పెట్టరు గానీ మద్యం పాలసీపై మాత్రం మంత్రి వర్గ సమావేశాలు పెడతారు. గతంలో కౌలు రైతులకు ఆర్థిక సాయం చేసిన పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వచ్చాక కౌలు రైతుల ఊసే లేదు. రైతు భరోసా, పంట రుణాలు, పంట నష్టాలపై ఎందుకు మాట్లాడం లేదు?పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితుల గురించి ఎందుకు మాట్లాడం లేదు? 30 వేల కోట్లు ఉంటేనే నిర్వాసితులకు న్యాయం చేయగలమని పవన్ మాట్లాడారు. ఆ 30 వేల కోట్లు మీరు ఇస్తారా? కేంద్రం నుంచి తెస్తారా?. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం తాండవిస్తోంది. యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటే.. వాళ్లను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా మార్చడంపై చంద్రబాబు, పవన్ దృష్టి పెడుతున్నారు. నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ భృతి అన్నారు.. ఇప్పుడు దాని ఊసే లేదు ..రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నీ ట్విట్టర్లోనే వస్తాయి కానీ రాష్ట్రానికి మాత్రం రావు. బీసీలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్లు బీసీ రక్షణ చట్టం ఎందుకు చేయడం లేదు?. అమరావతి నిర్మాణానికి అప్పులు ఎందుకు చేయాల్సి వస్తోంది? ఇప్పటికే రూ.26 వేల కోట్లు అప్పు తెచ్చారు. అమరావతి నిర్మాణానికి అమరావతే నిధులు తెచ్చుకుంటుందన్న చంద్రబాబు ఇపుడు అప్పులెందుకు?. అమరావతి నిధుల కోసమే పశ్చిమ నియోజకవర్గం త్యాగం చేస్తున్నామన్నారు. కానీ ఇప్పుడా ఎమ్మెల్యే వారాలబ్బాయి లా తయారయ్యాడు.. దీనికి పవన్ కల్యాణ్ జవాబు చెప్పాలి’’ అని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.పవన్ కల్యాణ్ ఆయన శాఖలను వదిలేసి ఇతర శాఖలలో తలదూర్చుతూ.. సకల శాఖామంత్రిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు, పవన్లు జగన్ భజన మానేసి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి. జగన్, షర్మిళల విషయమేమి రాష్ట్ర సమస్య కాదు.. వారి మీద దృష్టి తగ్గించి ప్రజా సమస్యలపై మాట్లాడాలి. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని చట్ట పరంగా శిక్షించాలి అంతేగాని కక్షపూరిత రాజకీయాలు చేయకూడదు’’ అని పోతిన మహేష్ హితవు పలికారు. -
నటి హేమ డ్రగ్స్ సేవించినట్లు ఛార్జ్షీట్లో పోలీసులు పేర్కొన్నారు
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై ఛార్జ్ షీట్
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపలకు పాల్పడినట్లు జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వచ్చిన ఆరోపణలు కర్ణాటకలో సంచలనం సృష్టించాయి. ఈ కేసులో సిట్ అధికారులు శుక్రవారం ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రజ్వల్ రేవణ్ణ ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణపై చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రజ్వల్పై హోలెనరసిపూర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు అధికారి సుమారాణి 137 మంది సాక్షులను విచారించారు. ఆ వివరాలతో 2000పైగా పేజీల చార్జ్షీట్ను కోర్టుకు సమర్పించారు. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.2019 నుంచి 2022 మధ్య హోలెనరసిపురలోని తన నివాసంలో పనిచేసిన పనిమనిషిని హెచ్డీ రేవణ్ణ లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితుడు రేవణ్ణ మహిళలను లైంగికంగా వేధించారని చార్జిషీట్లో పేర్కొంది. మహిళలపై లైంగిక వేధింపుల కేసులో హెచ్డీ రేవణ్ణ ఏ1, ప్రజ్వల్ రేవణ్ణగా ఏ2గా ఉన్నారు. -
ఆన్లైన్లో నకిలీ ప్రశ్నాపత్రం.. విద్యార్థిపై సీబీఐ ఛార్జ్షీట్?
సాక్షి,న్యూఢిల్లీ : యూజీసీ-నెట్ పేపర్ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ స్కూల్ విద్యార్ధి యూజీసీ- నెట్ నకిలీ ప్రశ్నాపత్రాన్ని టెలిగ్రాంలో షేర్ చేసినట్లు సీబీఐ గుర్తించింది. సదరు విద్యార్ధిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. జూన్ 18న నిర్వహణ.. ఆ వెంటనే పరీక్ష రద్దు కేంద్ర విద్యా శాఖ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హతను నిర్ణయించేందుకు యూజీసీ-నెట్ పరీక్షను నిర్వహిస్తుంటుంది. అయితే ఎప్పటిలాగే కేంద్రం ఆ పరీక్షను జూన్ 18న నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 317 నగరాల్లో 1205 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షను 11 లక్షల మంది రాశారు. అనూహ్యాంగా యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాలు డార్క్ వెబ్లో లీక్ అయ్యాయని, టెలిగ్రామ్ యాప్లో షేర్ అయ్యిందని కేంద్రానికి సమాచారం అందింది.వెంటనే ఆ మరుసటి రోజే (జూన్19) పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సత్వరమే విచారణ చేపట్టాలని కేంద్రం సీబీఐకి ఆదేశాలు జారీచేశారు. స్కూల్ విద్యార్థిపై CBI ఛార్జ్షీట్!దీంతో రంగంలోకి దిగిన సీబీఐ పేపర్ లీకేజీ జరిగిందా? జరిగితే అందుకు కారకులు ఎవరనేది ఇలా అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో సీబీఐ తన దర్యాప్తులో జూన్ 18న జరిగిన పరీక్షకు సంబంధించి లీకైన ప్రశ్నాపత్రం స్క్రీన్షాట్ను ఓ పాఠశాల విద్యార్థి టెలిగ్రామ్లో షేర్ చేసినట్లు సీబీఐ బృందం గుర్తించింది. ఈ అంశంపై సదరు పాఠశాల విద్యార్ధిపై సీబీఐ ఛార్జ్షీట్ను దాఖలు చేయనుందని సమాచారం. యూజీసీ పరీక్ష కొత్త తేదీలు ఇవేకేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన యూజీసీ నెట్ 2024 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) సిద్ధమైంది. ఇప్పటికే ఆ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను సైతం ప్రకటించింది. ఆగస్టు 21, సెప్టెంబర్ 4 మధ్య ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎన్టీఏ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక సీఎస్ఐఆర్ నెట్ పరీక్షను జులై 25-27 మధ్య, ఎన్సెట్ పరీక్షను జులై 10న నిర్వహించనున్నట్లు తెలిపింది. -
కేజీవాల్పై ఈడీ ఛార్జిషీట్లో కవిత పేరు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు బుధవారం జూలై 15కి వాయిదా వేసింది.ఈ కేసులో కేజ్రీవాల్ ప్రతిస్పందనకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు అభ్యర్థించారు. దీంతో హైకోర్టు ఈ కేసును జూలై 15కి వాయిదా వేసింది.కాగా లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఈడీ కేసులో కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో 38 మంది నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చార్జిషీట్లో అరవింద్ కేజ్రీవాల్తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది. 232 పేజీల ఛార్జ్ షీట్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది.ఈ కేసులో కేజ్రీవాల్ను కింగ్పిన్గా, కుట్రదారుడిగా ఈడీ అభివర్ణించింది. లిక్కర్ స్కాంలో పొందిన డబ్బును గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని ఆరోపించింది. కేజ్రీవాల్, వినోద్ చౌహన్తో వాట్సాప్ చాట్లను ఈడీ చార్జిషీట్లో ప్రస్తావించింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్పై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లో కవిత పేరును కూడా ప్రస్తావించింది. కవిత మాజీ పీఏ అశోక్ కౌశిక్ ద్వారా రూ. 25 కోట్ల లావాదేవిలు జరిగినట్లు ఈడీ తెలిపింది. కవిత దగ్గర నుంచి రెండు బైకుల్లో నగదు తీసుకెళ్ళి దినేష్ అరోరాకు అప్పగించారు. ఢిల్లీలోని వినోద్ చౌహన్ దగ్గర అశోక్, దినేష్ అరారోలు కలుసుకున్నారు. గోవా ఎన్నికల సందర్భంగా వినోద్ చౌహన్ డబ్బుల పంపిణీ చేశాడు. ముత్త గౌతమ్ సంబంధించిన మీడియా సంస్థ ద్వారా హవాలా లావాదేవీలు జరిగాయి.అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్తో కలిసి ఏడు కోట్ల రూపాయలను అవార్ల ద్వారా అరవింద్ సింగ్ ఇచ్చారు. 45 కోట్ల రూపాయలను గోవాకు హవాలా ద్వారా సాగర్ పార్టీలకు చేరవేశారు. ముత్త గౌతమ్కు సంబంధించిన చారియట్ మీడియా ద్వారా మీడియా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగాయి. చారియట్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు తోపాటు చాలామందికి లింకులు ఉన్నాయని ఈడీ పేర్కొంది.మరోవైపు కేజ్రీవాల్, ఆప్పై దాఖలు చేసిన చార్జిషీట్ను ఢిల్లీ కోర్టు మంగళవారం విచారణకు తీసుకుంది. కేజ్రీవాల్కు సమన్లు పంపింది.కాగా మార్చి 21న ఈడీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, జూన్ 26న అవినీతి కేసులో ఆప్ అధినేతను సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ అరెస్టు, రిమాండ్ను సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలైన పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ కేసులో గత వారం ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించేందుకు దర్యాప్తు సంస్థకు కోర్టు ఏడు రోజుల గడువు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 17కు వాయిదా వేసింది.. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్పై ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన ముఖ్యంమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ను ఢిల్లీ ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. లిక్కర్ కేసులో ఈడీ 7వ సప్లిమెంటరీ చార్జి షీట్ దాఖలు చేసింది. తాజా ఛార్జ్ షీట్లో కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా జూలై 12వ తేదీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది.మరోవైపు.. తనను సీబీఐ అరెస్ట్ చేయటం, మూడు రోజుల కస్టడీకి తీసుకోవటంపై అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. దీంతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇక.. ఈ రెండు పిటిషన్లపై జూలై 17న విచారణ జరగనుంది. -
రూ. 25లక్షల ఒప్పందం.. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో అయిదుగురు నిందితులపై నవీ ముంబై పోలీసులు తాజాగా దాఖలు చేసిన చార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సల్మాన్ ఖాన్ను హత్య చేసేందుకు కరుడుగట్టిన బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర బయటపడింది. కాగా గత ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరైన అనుజ్ థాపన్ అనే నిందితుడు మే 1న పోలీసు లాకప్లో ఆత్మహత్య చేసుకున్నాడు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా కుట్ర పన్నిందని నవీ ముంబై పోలీసులు తేల్చారు. మొత్తం ఐదుగురు నిందితులపై తాజాగా 350 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. వీరిపై హత్యకు కుట్ర, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపారు. రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు పేర్కొన్నారు.నిందితుల ముఠా ఏకేK-47, ఏకే-92, M16 రైఫిల్స్ వంటి అధునాతన మారణాయుధాలను పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు 2022లో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే ‘జిగానా పిస్టల్’ను కూడా తెప్పించేందుకు పథకం సిద్ధం చేసినట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు.సల్మాన్ హత్య కుట్రలో భాగంగా సల్మాన్ పన్వెల్ ఫామ్హౌస్ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్కు వెళ్లే గోరేగావ్ ఫిల్మ్ సిటీని బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహిస్తూ.. నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇక హత్య చేసేందుకు 18 ఏళ్ల లోపు బాలుళ్లను నియమించుకున్నారని ఛార్జ్ షీట్ పేర్కొంది.నిందిత మైనర్లు దాడి చేసేందుకు ఉత్తర అమెరికా నుంచి పనిచేస్తున్నట్లు భావిస్తున్న గ్యాంగులోని కీలక వ్యక్తులైన గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూశారని పోలీసులు వెల్లడించారు. హత్య తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు పారిపోయేలా ప్రణాళిక కూడా సిద్ధమైంది. -
దర్శన్ కేసులో త్వరలో చార్జిషీటు!
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరుకోగా త్వరలో కోర్టుకు చార్జ్షీట్ సమర్పింనున్నట్టు పోలీసుల సమాచారం. దర్శన్తో పాటు మొత్తం 17మంది నిందితుల మొబైల్ ఫోన్లలోని డాటాను రిట్రీవ్ చేస్తున్న పోలీసులు అది పూర్తయితే త్వరలో చార్జ్షీట్ తయారు చేయనున్నారు. సీఐడీ టెక్నికల్ సెల్లో డిజిటల్ సాక్ష్యాల సేకరణ జరుగుతోంది. అనేక ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు.జైలు మార్పు అధికారుల నిర్ణయం: హోంమంత్రిదర్శన్ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి తుమకూరు జిల్లా జైలుకు మార్చాలనేది జైలు అధికారుల నిర్ణయమని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని హోంమంత్రి జీ పరమేశ్వర్ అన్నారు. మంగళవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన నిందితులు అందరూ ఒకే చోట ఉండడం మంచిది కాదని జైలు అధికారులు భావించారన్నారు. దర్శన్, మరో ముగ్గురిని తుమకూరు జైలుకు తరలిస్తారని తెలిసిందన్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది తనకు తెలియదని, అది హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.నటి పవిత్రగౌడకు రూ. 2 కోట్లు!ఈ హత్య కేసులో నటి పవిత్రగౌడ అరైస్టెన సమయంలో విధుల్లో ఉన్న విజయనగర మహిళా పీఎస్సైకి పోలీసు శాఖ నోటీసులు ఇచ్చింది. మహిళా పీఎస్సై విధుల్లో నిర్లక్ష్యం వహించారని, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు పవిత్రగౌడకు సౌందర్య జగదీష్ అనే వ్యాపారవేత్త రూ.2 కోట్ల నగదు ఇచ్చారని విచారణలో తేలడంతో కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.దర్శన్ అభిమాని అరెస్టుయశవంతపుర: నిర్మాత ఉమాపతిగౌడను అంతు చూస్తానని బెదిరించిన నటుడు దర్శన్ అభిమాని చేతన్ని బెంగళూరు బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. దర్శన్ గురించి ఉమాపతి చెడుగా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చేతన్ బెదిరించాడు. దీంతో ఫిర్యాదు రాగా అరెస్టు చేసి మళ్లీ విడుదల చేశారు.సీఎంను కలిసిన రేణుకాస్వామి తల్లిదండ్రులు శివాజీనగర: హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తల్లిదండ్రులు మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన నివాస కార్యాలయం కృష్ణాలో కలిశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రేణుకాస్వామి మృతితో తమకు దిక్కుతోచడం లేదని వాపోయారు. రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఉద్యోగ భరోసా ఇచ్చారని తెలిసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: నాంపల్లి కోర్టులో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో హైడ్రామా నడిచింది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కోర్టు వెనక్కి పంపగా.. ఇదే అదనుగా ఈ కేసులో నిందితుడు ప్రణీత్రావు బెయిల్ కోసం ప్రయత్నించాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్టు చోటు చేసుకుంది.ఛార్జ్షీట్లో కొన్ని తప్పిదాలను గుర్తించిన నాంపల్లి కోర్టు.. దానిని పోలీసులకు తిప్పి పంపించింది. అయితే ఈ గ్యాప్లో ప్రణీత్ రావు కోర్టును ఆశ్రయించాడు. తొంభై రోజుల్లో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించాడు. అయితే ఈలోపే తప్పులు కరెక్ట్ చేసిన పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అంతేకాదు.. బెయిల్ ఇస్తే ప్రణీత్రావు సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని వాదించారు. కొత్త ఛార్జ్షీట్ పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా.. పోలీసుల వాదనతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఫలితంగా.. ప్రణీత్రావు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. -
ల్యాండ్ ఫర్ జాబ్ : లాలూ ప్రసాద్ యాదవ్కు మరో ఎదురు దెబ్బ
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ఎదురు దెబ్బ తగిలింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూపై సీబీఐ మరో ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్లో లాలూతో పాటు మరో 71 మందిని చేర్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగానే ఆ ఛార్జ్ షీట్లపై విచారణ చేపట్టాలా? వద్దా? అనే అంశంపై న్యాయమూర్తి జులై 6న తేల్చనున్నారు.గత మే 29న ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి సీబీఐని నిలదీశారు. ఛార్జిషీటు దాఖలు చేసేందుకు ప్రతి తేదీకి మరింత సమయం కావాలని సీబీఐ కోరడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 7లోగా తుది నివేదికను దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించారు. ఢిల్లీ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాజాగా కోర్టు ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది.ఉద్యోగాలే లేవు.. అయినప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు రైల్వేమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో జోనల్ రైల్వేలలో ఉద్యోగాలపై అధికారిక నోటిఫికేషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ పాట్నా, ముంబై, జబల్పూర్, కోల్కతా, జైపూర్, హాజీపూర్లలో ఉన్న వివిధ జోనల్ రైల్వేలలో లాలూ ప్రసాద్ యాదవ్ నియమించారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, సహచరుల పేరుతో భూములను తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి.కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ అంటే?ఒక వ్యక్తికు సంబంధించిన ఏదైనా కేసును దర్యాప్తు సంస్థలు పూర్తి విచారణ చేపట్టిన అనంతరం.. సదరు వ్యక్తి నేరం చేశారని నిర్ధారిస్తూ అభియోగాలు మోపుతూ కోర్టు దాఖలు చేసే దానిని కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ అంటారు. -
కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్పై నేడు విచారణ జరగనుంది. 8000 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసినా ఈడీ.. పలు ఆధారాలను కోర్టుకు అందజేసింది. కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ను కాగ్నిజెన్స్లోకి కోర్టు తీసుకోనుంది.కవిత సహా ఐదుగురు నిందితులపై ఆరవ చార్జిషీట్ నమోదైంది. ఒక్కొక్క నిందితుడిపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. తొలి రోజు నిందితుడు ప్రిన్స్ కుమార్పై అభియోగాలను పరిశీలించిన కోర్టు.. నేడు కవితపై అభియోగాలను పరిగణలోకి తీసుకోనుంది. మరికొంత కాలం కవితని కస్టడీనే ఉంచాలని ఈడీ కోర్టును కోరుతుంది.చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత చట్ట ప్రకారం కస్టడీ అవసరం లేదని కవితను జైల్ నుంచి విడుదల చేయాలని న్యాయవాది నితీష్ రాణా కోరగా, చార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై స్పెషల్ కోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టనుంది. చార్జిషీట్లో అంశాలపై జడ్జి మరికొంత సమాచారం కోరారు.ఈడి వాదనలు:ఈడీ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఐదుగురు నిందితుల పాత్రలపై ఆధారాలతో సహా వివరాలను పొందుపరించింది. ఐదుగురు నిందితుల్లో కవిత, దామోదర్, ప్రిన్స్కుమార్, అరవింద్ సింగ్ , చరణ్ ప్రీత్ లపై సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు ఈడీ తెలిపింది. ఒక్కొక్క నిందితుడికి సంబంధించి అన్ని వివరాలు చార్జిషీట్లో ఉన్నాయని ఈడీ పేర్కొంది. తొలుత కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు ఈడీ సిధ్దమవ్వగా, అయితే కవిత పాత్ర మినహా మిగతా నలుగురు నిందితుల పాత్ర వివరించాలని జడ్జి సూచించారు. దాంతో ప్రిన్స్ కుమార్ పాత్రను కోర్టుకు ఈడీ వివరించింది.ప్రిన్స్ కుమార్ చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశారని, 100 కోట్ల ముడుపులు హవాలా మార్గంలో తరలించడంలో ప్రిన్స్ కుమార్ పాత్ర ఉంది. హవాలా ఆపరేటర్ ఆర్. కాంతి కుమార్ ద్వారా సుమారు 16 లక్షల రూపాయలు ప్రిన్స్ కుమార్కి అందాయి. 3 కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్ నంబర్గా వాడి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నాడు. అందుకు సంబంధించి కాల్ రికార్డింగ్లు, కాల్ డేటా ఇతర ఆధారాలు సేకరించామని ఈడీ తెలిపింది. హవాలా చెల్లింపుల కోసం ప్రిన్స్ కుమార్ మూడు మొబైల్ నెంబర్ వాడినట్లు కోర్టుకు ఈడీ తెలుపగా, మధ్యలో జోక్యం చేసుకొన్న జడ్జి కావేరి బవేజా ఆ మూడు నెంబర్ ఎవరి పేరు మీద ఉన్నాయని ప్రశ్నించారు. వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులను జడ్జి సూచించారు. మరో నిందితుడు అర్వింద్ సింగ్ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించాడని.. 7వ సప్లిమెంటరీ చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును ఈడీ న్యాయవాది జోహెబ్ హుస్సేన్ కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్ గుప్తా, జొహెబ్ హొస్సేన్లు కోరారు. కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమ్ఆద్మీపార్టీ (AAP) పేరును నిందితుల జాబితాలో చేర్చుతూ ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. దీంతో దర్యాప్తు సంస్థ చరిత్రలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును నిందితులుగా ప్రస్తావించినట్లైంది. మద్యం పాలసీ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వు చేసింది.కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ జరిగే సమయంలో ఈడీ తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మాట్లాడుతూ.. ఆప్పై ఛార్జ్ షీట్ నమోదు చేస్తున్నామని, అందులో ఆప్ పార్టీని నిందితులుగా చేర్చినట్లు కోర్టుకు తెలిపారు. ఈ కేసు 2021- 22కి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు విచారణ జరిపే సమయంలో మద్యం కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు ఆమ్ఆద్మీ పార్టీ అయినప్పుడు.. ఆ పేరును నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని గతేడాది అక్టోబర్లో సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ఆ నేపథ్యంలో ఈడీ దీనిపై కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వివిధ వ్యక్తుల నుంచి అందిన రూ.100 కోట్ల ముడుపులను ఆప్.. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని ఈడీ ఆరోపించింది. తాజాగా ఆప్ను నిందితుల జాబితాలో చేరుస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ నేత కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 18 మందిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. వీరిలో సంజయ్ సింగ్ బెయిల్ మీద బయటకు వచ్చారు. లోక్సభ ఎన్నికల తరుణంలో మే 10న కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
పోలీసుల కళ్లెదుటే ‘మణిపూర్ ఘోరం’
మణిపుర్లో మైతీ తెగకు చెందిన మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ తెగ మహిళను నగ్నంగా ఊరేగించి.. లైంగిక హింసకు పాల్పడిన ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్లో షాకింగ్ విషయాలను వెల్లడించింది. బాధిత మహిళలు సాయం చేయమని కోరినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, వారు ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిగుంపుకే సహకరించేలా వ్యవహరించారని తెలిపింది.కాంగ్పోక్పీ జిల్లాలో మైతీ అల్లరిగుంపు చేతికి చిక్కిన ఇద్దరు కుకీ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరారు. అయితే పోలీసులే స్వయంగా బాధితులను ఆ అల్లరిగుంపకు అప్పగించినట్లు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. దీంతో ఆ అల్లరి మూక ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది.బాధితురాళ్లలో ఒక మహిళ తమను కాపాడి, సురక్షిత ప్రాంతాని తీసుకుళ్లాలని పోలీసులను కోరారు. అయితే జీపు తాళాలు తమ వద్ద లేవని పోలీసులు అబద్దాలు చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్ పేర్కొంది. మరోవైపు.. అల్లరిగుంపు చేతికి చిక్కిన మూడో మహిళ వారి నుంచి త్రుటిలో తప్పించుకొంది.గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత జులై నెలలో వైరల్గా మారి దేశమంతా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గౌహతి సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు అయింది.ఈ దాడుల్లో అల్లరిగుంపు చేతిలో మృతిచెందిన కుకీ తెగకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరులేని నదిలోకి విసిరేసినట్లు తెలిపింది. మైతీ గుంపు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి.. పోలీసులు పారిపోయినట్లు సీబీఐ మూడు పేజీల ఛార్జిషీటులో పేర్కొంది. -
15 నిర్వాకాలు.. 50 అంశాలు
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలు, మోసాల పేరిట కాంగ్రెస్ ఆ పార్టీపై చార్జిషీట్ వేసింది. ‘నయవంచన’పేరుతో విడుదల చేసిన అభి యోగ పత్రంలో.. తెలంగాణకు చేసిన ద్రోహం, నిధుల విడుదలలో వివక్ష, రైతులు, పేదలు, యువతకు దోఖా, ప్రాజెక్టుల కేటాయింపు, విద్యాసంస్థల ఏర్పాటులో మోసం పొందుపరిచింది. దేశాన్ని అమ్మేస్తున్న మోదీ, రైతు వ్యతిరేక బీజేపీ, సామాన్యుడిపై ధరల మోత, పబ్లిసిటీ సర్కార్, దేశ సార్వ¿ౌమత్వానికి భంగం, నిరంకుశత్వ మోదీ, పెరిగిపోయిన నిరుద్యోగం, ఎలక్టోరల్ బాండ్ల స్కామ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేకి మోదీ, ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం తదితర అంశాలను మోదీ నిర్వాకాల పేరుతో ప్రస్తావించింది. మోదీ జుమ్లాలు: మోదీ జుమ్లాలంటూ ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు, 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు, 2022 కల్లా అందరికీ ఇళ్లు, 100 రోజుల్లో నల్లధనం వెనక్కు తెచ్చి ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమ, నిత్యావసరాల ధరల తగ్గింపు, అవినీతిని రూపుమాపడం, నోట్ల రద్దుతో నల్లధనం నిర్మూలన, చైనా ఆక్రమణ వంటి అంశాల్లో బీజేపీ మాట తప్పిందని, మోసం చేసిందని పేర్కొంది. కాకినాడలో ఒక్క ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం నుంచి డాలర్తో రూపాయి విలువను రూ.40కి తీసుకెళ్తానని చెప్పి రూ.85కు దిగజార్చడం.. వరకు మొత్తం 50 అంశాలను ఈ 15 నిర్వాకాల్లో ప్రస్తావించింది. ప్రజలకు ప్రశ్నలు: లోక్సభ ఎన్నికల ప్రచారంలో వినియోగించనున్న ఈ చార్జిషీట్లో ప్రాసతో కూడిన 7 ప్రశ్నలను తెలంగాణ ప్రజలకు చార్జి షీట్ ద్వారా కాంగ్రెస్ వేసింది. యువతా.. ఈ మోసాలను సహిద్దామా?, రైతులారా.. ఈ వంచకులను క్షమిద్దామా?, దళిత, గిరిజనులారా ఈ దగాకోరులను నమ్ముదామా?, బీసీల్లారా ఈ అహంకారులను ఆదరిద్దామా?, ఈ భారం ఇంకా భరిద్దామా?, మహిళలారా.. ఈ అసమర్థులకు మద్దతిద్దామా?, ఈ కార్పొరేట్ శక్తులకు తలొగ్గుదామా? అంటూ ప్రశ్నలు సంధించింది. ‘పదేళ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం.. ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం..’అనే నినాదంతో బీజేపీపై చార్జిషీట్ను ముగించింది. -
ఎయిరిండియా మాజీ సీఎండీ, ఐబీఎం, ఎస్ఏపీ కంపెనీలపై సీబీఐ కొరడా.. కారణం..
సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిన విషయంలో ఎయిరిండియా మాజీ సీఎండీ, ఎస్ఏపీ ఇండియా, ఐబీఎమ్లపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. 2011లో రూ.225 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ను ఎయిరిండియా కొనుగోలు చేసిన విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా కనుగొన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సీబీఐకు సిఫారసు చేసింది. దాంతో సీబీఐ దాదాపు ఆరేళ్ల దర్యాప్తు చేసింది. ఎయిరిండియా మాజీ సీఎండీ అరవింద్ జాధవ్, ఐబీఎమ్ ఇండియా, ఎస్ఏపీ ఇండియా, మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 120-బీ(క్రిమినల్ కాన్స్పిరసీ), అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం ఛార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐకి సీవీసీ ఇచ్చిన నోట్లో..సరైన టెండర్ ప్రక్రియను అనుసరించకుండా ఎస్ఏపీ ఏజీ నుంచి ఈఆర్పీ సాఫ్ట్వేర్ వ్యవస్థను ఎయిరిండియా ఎంపిక చేసిందని పేర్కొంది. ఈ విషయం ఎయిరిండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పింది. ఈ కాంట్రాక్టుకు పౌర విమానయాన శాఖ నుంచి అనుమతులు లేవనే ఆరోపణలున్నాయి. అయితే 2009, 2010ల్లో కార్యదర్శుల బృందం, మంత్రుల బృందానికి ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు ఎయిరిండియా చెబుతోంది. ఇదీ చదవండి: రూ.32 లక్షల సైకిల్ - ఎందుకింత రేటు? ఇదిలా ఉండగా, అప్పటికే ఒరాకిల్ నుంచి అదే మాదిరి ఈఆర్పీ సాఫ్ట్వేర్ ఉంది. మళ్లీ ఎందుకు సాఫ్ట్వేర్ తీసుకున్నారనేదానిపై సరైన వివరణ లేదు. ఒరాకిల్ సాఫ్ట్వేర్లో సమస్యలున్నాయని అంటున్నా సరిచేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు కనిపించలేదని తెలిస్తుంది. ఓపెన్ టెండర్ ప్రక్రియను నిర్వహించకుండానే ఎస్ఏపీ, ఐబీఎమ్లకు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టును అప్పగించారనే వాదనలున్నాయి. -
అది పచ్చపన్నాగమే..
విశాఖ విమానాశ్రయంలో పక్కా వ్యూహంతోనే జగన్పై హత్యాయత్నం జనబలం లేని చంద్రబాబుకు అడ్డదారిలో అధికారం కట్టబెట్టేందుకు పచ్చపక్షం తెగ తాపత్రయపడుతోంది. ప్రజలను తప్పుదారి పట్టించే రీతిలో అడ్డగోలు కథనాలు వండివారుస్తూ ఆపసోపాలు పడుతోంది. సింగిల్గా పోరాడుతున్న సింహాన్ని చూసి బెదిరిపోతున్న శక్తులన్నీ ఒక్కటై కత్తులు దూస్తున్నాయి. కుట్ర రాజకీయాలు చేస్తూ ప్రతి అంశాన్నీ జగన్కు వ్యతిరేకంగా చూపించేలా కట్టుకథలు అచ్చేయిస్తున్నాయి. చివరకు 2018లో ఆయనపై విశాఖ విమానాశ్రయం వేదికగా జరిగిన హత్యాయత్నం కేసుపైనా దు్రష్పచారానికి ఒడిగడుతున్నాయి. పథకం ప్రకారమే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఓ వైపు ఎన్ఐఏ ధ్రువీకరిస్తున్నా... దానినీ పక్కదారి పట్టించేలా అసత్యాలను ప్రచారం చేయాలని కంకణం కట్టుకున్నాయి. –సాక్షి, అమరావతి ఎన్ఐఏ చార్జిషీట్లో ఏముంది? వైఎస్ జగన్ను హత్య చేసేందుకే నిందితుడు శ్రీనివాస్ ఆయనపై అరచేతిలో ఇమిడిపోయేంత పదునైన కత్తితో దాడికి పాల్పడ్డాడని కోర్టులో దాఖలు చేసిన చార్జ్షీట్లో ఎన్ఐఏ పేర్కొంది. జగన్ మెడ భాగంలో పొడిచి హత్య చేయాలన్నది నిందితుడి లక్ష్యమని కూడా అందులో వివరిస్తూ... చివరికి ఎడమ భుజం భాగంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయమైందని తెలిపింది. మెడమీద సున్నిత ప్రాంతంలో కత్తితో దాడి చేస్తే నరాలు తెగి మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయి వ్యక్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణుల నివేదిక కూడా స్పష్టం చేస్తోంది. నాటి దాడి యాదృచ్చికం కాదనీ... హత్య చేసేందుకు పక్కా కుట్రేనన్నది నిర్ధారణ అవుతోంది. రెస్టారెంట్ యజమాని పక్కా టీడీపీ వైఎస్ జగన్పై హత్యా యత్యానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ పనిచేస్తున్నది విశాఖపట్నం విమానాశ్రయంలోని ‘ఫ్యూజన్ ఫుడ్స్’ రెస్టారెంట్లో. ఆ రెస్టారెంట్ యజమాని అప్పటి అధికార టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి సాక్షాత్తూ నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడు. 2014లో ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించారు కూడా. ఆయన 2017లో విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కించుకున్నది టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖమంత్రిగా ఉన్నపుడే. పక్కా పన్నాగంతోనే ఉద్యోగం 2018 అక్టోబర్ 25వ తేదీన వై.ఎస్.జగన్పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. అప్పటికి 9 నెలల ముందే అంటే 2018, జనవరి 30న యలమంచిలికి చెందిన టీడీపీ నేత సుందరపు విజయ్కుమార్ సిఫార్సుమేరకు హర్షవర్ధన్ తన రెస్టారెంట్లో శ్రీనివాస్కు ఉద్యోగమిచ్చారు. ఈ విషయాన్ని ఆయనే ఎన్ఐఏ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. అప్పటికే ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న జగన్ విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్ వెళ్లి వస్తారన్నది అందరికీ తెలిసిందే. ఆ విషయం తెలుసుకున్న కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడికి రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించి హత్యాయత్నానికి ప్రేరేపించారని తేటతెల్లమవుతోంది. నిందితుడు పాత నేరస్తుడే... కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల(సీఐఎస్ఎఫ్) భద్రతా వలయంలో ఉండే విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్లోగానీ అక్కడ ఉండే షాపులు, ట్రావెల్స్ ఏజెన్సీల డెస్్కలలో ఉద్యోగాల్లో చేరడం అంత ఆషామాషీ కాదు. అభ్యర్థులపై ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. అందుకోసం అభ్యర్థుల నివాస, స్వస్థలాల్లోని పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ కచ్చితంగా సమర్పించాలి. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఆయన స్వస్థలమైన తానేలంకలో పలు వివాదాల్లో ఉన్నట్టు ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని రెస్టారెంట్లో చేర్చుకునేందుకు దాని యజమానే విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకుని ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకు సమర్పించడం.. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని ఆయనే నిర్ధారించడం గమనార్హ. ఠానేలంక పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోకుండా తన రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించడం వెనుక పక్కా కుట్ర ఉంది. టీడీపీ దుష్ప్రచారంపై నిందితుడి నీళ్లు జగన్పై హత్యాయత్నం జరిగిన కొద్ది క్షణాల్లోనే టీడీపీ ఆ నింద తమపైకి రాకుండా దు్రష్పచారానికి తెరతీసింది. నిందితుడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడని.. జగన్కి సానుభూతి రావాలన్న ఉద్దేశంతోనే దాడికి పాల్పడ్డాడని టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టిమరీ వ్యాఖ్యానించారు. అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ సైతం కనీసం ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండానే జగన్కు సానుభూతి తీసుకురావడం కోసమే నిందితుడు దాడికి పాల్పడ్డాడని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక టీడీపీ ‘ముఖ్య నేత’ ఆదేశాలున్నట్టు స్పష్టమవుతోంది. కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగానే సరికొత్త భాష్యాలు చెప్పారన్నది తేటతెల్లమైంది. నిందితుడు శ్రీనివాస్ గతంలో బెయిల్పై విడుదల అయిన తరువాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైఎస్జగన్కు సానుభూతి తీసుకువచ్చేందుకు తాను దాడికి పాల్పడలేదని స్పష్టంగా వెల్లడించడంతో టీడీపీ నేతల దు్రష్పచారం బెడిసికొట్టింది. పచ్చ మీడియా పైశాచిక ఆనందం బాధితునిపై సానుభూతి చూపడం... నిందితుడిపై ఆగ్రహం ప్రదర్శించడం మానవీయ ధర్మం. ఎల్లోమీడియా అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో బాధితుడైన జగన్ను అవహేళన చేయడమే కాకుండా, నిందితుడు ఉపయోగించిన ఆయుధం పేరును కేసుకు జోడించి తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. చంద్రబాబుకు పరిస్థితులు అనుకూలంగా మలిచేందుకు ఏకంగా న్యాయ వ్యవస్థకే దురుద్దేశాలు ఆపాదిస్తోంది. హత్యాయత్నం కేసు దర్యాప్తును విశాఖపట్నం న్యాయస్థానానికి బదిలీ చేయడాన్ని ఈనాడు, ఇతర పచ్చ మీడియా వక్రీకరిస్తోంది. వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణను సాగదీసేందుకే ఆ కేసును విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారని తేల్చేస్తూ న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ న్యాయ వ్యవస్థను కించపరుస్తోంది. అసలు వాస్తవం ఏమిటి? ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఎన్నో కేసులు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయి. మావోయిస్టు పార్టీ, వాటి అనుబంధ సంఘాల కేసులు, వివిధ తీవ్రవాద సంస్థల కేసులు పెండింగులో ఉండటం సమస్యగా మారింది. విజయవాడలో ఉన్న ఒకే ఒక ఎన్ఐఏ న్యాయస్థానం ద్వారా ఈ కేసుల విచారణకు ఎక్కువ కాలం పడుతోందని హైదరాబాద్లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం భావించింది. రాష్ట్రంలో అదనంగా ఎన్ఐఏ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విశాఖపట్నంలో మరో న్యాయస్థానం ఏర్పాటు చేస్తే ఎన్ఐఏ కేసుల విచారణ వేగవంతమవుతుందని చెప్పింది. అందుకే ఎన్ఐఏకు విజయవాడతోపాటు విశాఖç³ట్నంలో కూడా ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానం పరిధిలోకి చేర్చారు. హత్యాయత్నం ఘటన విశాఖపట్నంలో జరిగినందున ఈ కేసు విచారణను కూడా విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయాలని విజయవాడ న్యాయస్థానం నిర్ణయించింది. సమగ్ర దర్యాప్తునకు వినతి ఈ హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని సీఎం జగన్ తరఫు న్యాయవాదులు ఎన్ఐఏను, కోర్టును కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి నిందితుడు శ్రీనివాస్కు సంబంధం ఏమిటి? నిందితుడు పాత నేరస్తుడైనప్పటికీ ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్ఐఏ తన చార్జ్షీట్లో పేర్కొన్న విషయం వాస్తవమే కదా? విమానాశ్రయంలో ఉన్న జగన్కు కాఫీ ఇవ్వడానికి నిందితుడినే ఎందుకు పంపారు? జగన్ను తానే పొడిచానని గతంలో బెయిల్ వచ్చిన సందర్భంలో ఇంటర్వ్యూల్లో శ్రీనివాసరావు చెప్పిన మాట వాస్తవం కాదా? హర్షవర్ధన్ చౌదరికి రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? హర్షవర్దన్ చౌదరి, లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? హర్షవర్దన్కి ఎయిర్పోర్టులో 2017లో కేటరింగ్ కాంట్రాక్టు కేటాయింపు సమయంలో కేంద్రమంత్రిగా ఉన్నది టీడీపీ నేత, చంద్రబాబు సన్నిహితుడు అశోక్ గజపతిరాజే కదా? కథకం ప్రకారం దాడిచేసిన శ్రీనివాసరావును కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర పచ్చ మీడియా ఏకంగా న్యాయప్రక్రియను, విచారణను, దర్యాప్తును పక్కదారి పట్టించేలా వ్యవహరించడం లేదా? హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడ్ని టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లో మీడియా నిరంతరం ఎందుకు మోస్తున్నాయి? అంటే ఇందులో వారి ప్రమేయం ఉన్నట్టేనా? శ్రీనివాస్ను కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లోమీడియా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? -
బీఆర్ఎస్ పాలనలో యువత భవిష్యత్తు నాశనం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో యువత ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతోందని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. సీఎం కేసీఆర్ అసమర్థ పాలనలో యువకులు మద్యానికి బానిసలవుతున్నారని, విద్యారంగానికి కేటాయింపులు తగ్గించి, సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేయక, ఉద్యోగ పరీక్షల నిర్వహణ కూడా సరిగా చేయలేకపోవడంతో రాష్ట్ర యువత నిర్వి ర్యం అయిపోతోందని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ బుధవారం పది అంశాలతో కూడిన యూత్ చార్జిషీట్ను విడుదల చేసింది. యూత్ చార్జిషీట్లోని అంశాలివే.. ♦ దేశంలోనే విద్యారంగానికి తెలంగాణలో కేటాయింపులు తక్కువ. 2014–15లో రాష్ట్ర బడ్జెట్లో 10.98 శాతం నిధులు విద్యకు కేటాయించగా, 2023–24లో 7.6 శాతానికి తగ్గించారు. ♦ కేజీ టు పీజీ విద్యను 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ ఈ తొమ్మిదేళ్లలో ఒక్క కొత్త తరగతి గదిని కూడా నిర్మించలేదు. ఒక్క గంభీరావుపేటలో మాత్రమే కేజీ టు పీజీ క్యాంపస్ను నిర్మించారు. ♦ సీఎస్ఆర్ నిధులతో ఒక్క తరగతి గదినయినా కట్టించాలని కార్పొరేట్ కంపెనీలను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ♦ ప్రతి ఇంటికీ ఉద్యోగం అని కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. కేవలం 60 శాతం ఉద్యోగులతో ఈ 60 శాతం సర్కార్ నడుస్తోంది. ♦ ఉద్యోగ పరీక్షలు రాసే లక్షలాది మంది యువత విశ్వాసాన్ని టీఎస్పీఎస్సీ కోల్పోయింది. ♦ పదో తరగతి నుంచి టీఎస్పీఎస్సీ పరీక్షల వరకు నిర్వహణ వైఫల్యంతో 2014–21 మధ్య కాలంలో తెలంగాణలో 3,600 మందికి పైగా యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ♦జాబ్ కేలండర్ లేకపోవడంతో ఒకే సమయంలో వివిధ పరీక్షలు నిర్వహించి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారు. ♦ రూ.4,592 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుండటంతో వేలాది మంది విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలు సరి్టఫికెట్లు, టీసీలు ఇవ్వడం లేదు. ♦యూనివర్సిటీల్లో 2/3వ వంతు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ వర్సిటీలను నాశనం చేస్తున్నారు. ♦కేసీఆర్ అసమర్థ పాలనతో యువత మద్యానికి, డ్రగ్స్కు, జూదానికి బానిసలవుతున్నారు. వారి భవిష్యత్తు నాశనమవుతోంది. -
ఈఎస్ఐ స్కామ్లో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలుచేసింది. రూ.211 కోట్ల స్కాం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితోపాటు మరో 15 మందిని నిందితులుగా పేర్కొంటూ అభియోగపత్రాలనుసమర్పించారు. ఈఎస్ఐలో మందులు, మెడికల్ కిట్ల కొనుగోలులో గోల్మాల్ జరిగినట్లు దేవికారాణిపై ఆరోపణలు వచ్చాయి. నకిలీ ఇన్ వాయిస్ సృష్టించి పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్లు తేలింది. మెడికల్ క్యాంపు ల పేరుతో నిధులు గోల్మాల్ చేసి, అక్రమ సంపాదనతో 6 కోట్ల విలువ చేసే బంగారాన్ని దేవికరాణి ,ఫార్మసిస్ట్ నాగలక్ష్మి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్లోనూ నిందితులుపెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదుచేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే నిందితులకు చెందిన రూ.144 కోట్ల ఆస్తులు. ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ షాప్లను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన ఎనిమిది ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈస్ఐ కొనుగోళ్ల కుంభకోణం నిందితుల్లో దేవికారాణితోపాటు మాజీ జేడీ పద్మజ, షార్మాసిస్టు కే.నాగమణి, ఇద్దరు కాంట్రాక్టర్లు కే.శ్రీహరిబాబు, పీ.రాజేశ్వరరెడ్డి నిందుతులుగా ఉన్నారు. -
23 నుంచి బీజేపీ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ తమ కార్యాచరణను వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి ఆందోళనలను చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ల నేతృత్వంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు పార్టీ సమావేశాలను నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నిరసనలు, ఆందోళనలకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. 23 నుంచి ప్రజా ఆందోళనలు: కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఉద్యమ కమిటీ సమావేశంలో.. ఈనెల 23 నుంచి నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఆందోళన కార్యక్రమాల ప్రణాళికను ఖరారు చేశారు. 23న అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు, నిరసనలు చేపట్టి.. ఆయా ఎమ్మెల్యేలు గత ఐదేళ్ల చేసిన అవినీతి, అక్రమాలు, హామీల ఉల్లంఘనపై చార్జిషిటును విడుదల చేస్తారు. 24న మంత్రుల ఇళ్ల ముట్టడి, ధర్నాలు చేపట్టి.. మంత్రుల అవినీతిపై చార్జిషిటును విడుదల చేస్తారు. 25న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించి.. కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తారు. అమిత్షా పర్యటన, బస్సు యాత్రలపై..: 27న ఖమ్మంలో నిర్వహించే అమిత్షా సభకు ఏర్పాట్లపైనా రాష్ట్ర బీజేపీ నేతలు మరో సమావేశంలో చర్చించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిన బస్సు యాత్రలపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం సీతారామ దేవాలయం, బాసర సరస్వతి దేవాలయం, అలంపూర్ జోగులాంబ దేవాలయాల నుంచి బీజేపీ బస్సుయాత్రలను ప్రారంభించనున్నారు. అధికార పార్టీ ఉల్లంఘనలపై ఫోకస్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి నేతృత్వంలో జరిగిన బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ చేపట్టే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు స్పందించేలా చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది. ఇక ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో.. నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కాగా సోమవారం పార్టీ అనుబంధ సంఘాలైన ఏడు మోర్చాల సమావేశాలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. -
సీబీఐ ఛార్జ్షీట్ కల్పిత కథ.. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలా: సజ్జల
సాక్షి, అమరావతి: కల్పితమైన కథ సీబీఐ ఛార్జ్షీట్లో కనిపిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలాతో అవసరమైన సరుకుగా ఛార్జ్షీట్ ఉపయోగపడుతుందని మండిపడ్డారు. సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా ఛార్జ్షీట్ దాఖలు చేసిందో చూస్తున్నామన్నారు. ‘‘వివేకా కేసు దర్యాప్తు సీబీఐ చరిత్రలోనే మచ్చుతునక. బేసిక్ లాజిక్ను సీబీఐ మర్చిపోయింది. వ్యవస్థలో చంద్రబాబు వైరస్లా పాకారు. వివేకా హత్య వల్ల నష్టం ఎవరికో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగింది. వివేకా హత్య కేసు ఆధారాలను సీబీఐ ఏం చేసింది?. కథ ఎలా మలుపు తిరగాలో ఆ విధంగా స్టేట్మెంట్ వస్తుంది. గూగుల్ టేక్ అవుట్ నిలబడదని వారికి అర్థమైంది’’ అని సజ్జల పేర్కొన్నారు. ‘‘నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారు. సునీత ఇప్పటివరకు ఆరు, ఏడు స్టేట్మెంట్లు ఇచ్చారు. కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని విషం చిమ్ముతున్నారు. వివేకా పేరు మీద మచ్చ పడకూడదని అవినాష్రెడ్డి, ఆయన కుటుంబం మౌనంగా భరిస్తూ వచ్చారు. వివేకా హత్య కేసులో దోషులు బయటకు రావాలని మొదటి నుంచి కోరుతున్నాం’’ అని సజ్జల తెలిపారు. ‘‘ఏ స్టేట్మెంట్ చూసినా ఒకవైపు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్మెంట్లు మార్చారు. అవినాష్రెడ్డి వైపు చూపేందుకు దస్తగిరిని అప్రూవర్గా మార్చారు. ఆధారాలన్నీ ఒకవైపు చూపిస్తుంటే.. దర్యాప్తు మరోవైపు సాగింది. సునీతకు వాళ్లు సలహాదారులుగా మారారు. అవినాష్రెడ్డికి ఎంపీ టికెట్ 2011లోనే ప్రకటించారు. అవినాష్రెడ్డి ఎంపీగా గెలవడం కోసం వివేకా పనిచేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. చదవండి: మాటలు మార్చారు.. మీకర్థమవుతోందా? ‘‘సునీత చెప్పినవన్నీ అబద్ధాలే.. భారతమ్మ, నేను కలిసి సునీత ఇంటికి వెళ్లలేదు. నా భార్యతో కలిసి ఒకసారి పరామర్శించడానికి వెళ్లా. అవినాష్ను డిఫెండ్ చేయమని సునీతకు చెప్పలేదు. సునీతను ప్రెస్మీట్ పెట్టమని కూడా నేను చెప్పలేదు. గూగుల్ టేక్ఔట్ పేరుతో ముందు అవినాష్ తండ్రిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు గూగుల్ టేక్ ఔట్ ఆధారం కాదని తేలిపోయింది. జూన్ 19న అవినాష్రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సునీతతో మళ్లీ స్టేట్మెంట్ ఇప్పించారు.’’ అని సజ్జల తెలిపారు. చదవండి: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు ఎంపీ అవినాష్రెడ్డి లేఖ -
వివేకా హత్య కేసులో గత చార్జ్ షీట్ కు వ్యతిరేకంగా సీబీఐ తుది చార్జ్ షీట్
-
ఆక్సిజన్ కుంభకోణంపై సీఐడీ చార్జ్షీట్!
వరంగల్: వరంగల్కు ధర్మాస్పత్రిగా పేరుగాంచిన ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఆక్సిజన్ కుంభకోణాన్ని 2013లో ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తేగా.. విషయ తీవ్రతను గమనించిన సీఐడీ అధికారులు 2015లో కేసు నమోదు చేశారు. నెలలు, ఏళ్ల తరబడిగా విచారణ చేసిన అధికారులు శుక్రవారం ఎట్టకేలకు కుంభకోణం జరిగిన విధానంపై చార్జ్షీట్ దాఖలు చేశారు. 2007 నుంచి 2013 వరకు జరిగిన ఆక్సిజన్ టెండర్ విధానంలో నాలుగు కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో రూ.180కు సరఫరా జరిగే ఆక్సిజన్ టెండర్ను రూ.385 కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. అలాగే ఈ కుంభకోణానికి సహకరించిన 13 మంది అడ్మినిస్ట్రేటివ్ అధికారులతోపాటు వరంగల్ తులసీ ఏజెన్సీ నిర్వాహకులను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. సంచలనంగా మారిన ఆక్సిజన్ దందా... ఆక్సిజన్ కాంట్రాక్టర్ వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ ఏకంగా ఓ సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తి ఏసీబీకి పట్టుబడడంతో రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు ఎంజీఎం ఆస్పత్రి పాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. అసలు ఆక్సిజన్ కాంట్రాక్టర్ లక్షల రూపాయలు సూపరింటెండెంట్కు లంచం ఇచ్చేందుకు ఎందుకు ఒప్పుకున్నారు. ఆక్సిజన్ సరఫరాలో ఏం జరుగుతుంది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం విజిలెన్స్, సీఐడీ విచారణకు ఆదేశించింది. అధికారులపై కేసు నమోదు.. ఆక్సిజన్ కుంభకోణంలో తులసీ ఏజెన్సీ నిర్వాహకులు నరహరి బిందురెడ్డి, నరహరి మనోహర్రెడ్డి, 2007 నుంచి 2013వ వరకు అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పని చేసిన 13 మంది అధికారులను నిందితులుగా చార్జ్షీట్లో పేర్కొన్నారు. ఆ కాలవ్యవధిలో పని చేసిన డాక్టర్ రఘురాం, అశోక్కుమార్, ఏ.ఎన్.ఆర్ లక్ష్మి, బలభద్ర పా త్రుని శ్యాంసుందర్రావు, తుంగతుర్తి సురేందర్, డాక్టర్ సత్యదేవ్, నరేంద్రకుమార్, బెంజీమెన్ సామెల్, కొండ్రు నాగేశ్వర్రావు, సుద్దాల లక్ష్మి రాజం, పిల్లి సాంబశివరావు, గంధన్ శేషాచారి నరసింహన్, వరికొటి విష్ణుమోహన్లను నిందితులుగా చార్జ్షీట్లో పేర్లు నమోదు చేశారు. కుంభకోణం వెలుగుచూసింది ఇలా... ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెండర్ల విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో వేలాది మంది పేద ప్రజలకు సేవలందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్యసేవల్లో ఆక్సిజన్ టెండర్ కీలకంగా మారింది. ఇందులో అక్రమాలు జరుగుతున్నట్లు ‘సాక్షి’ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో 2013 మే నెలలో ఆస్పత్రిలోని ప్రధాన వార్డులకు ఆక్సిజన్ ఎలా సరఫరా చేస్తున్నారు.. ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారనే విషయాన్ని పరిశీలించిన ప్రతినిధులకు ఖంగుతినే విషయాలను గమనించాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్లో రూ.180కు లభించే ఆక్సిజన్ సిలిండర్ను ఏకంగా డబుల్ ధరకు రూ. 385కు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు పెద్ద గండి కొడుతున్న విషయాన్ని గమనించి 2013 మే 17వ తేదీన ఆక్సిజన్ ‘టెండర్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనంలో సిలిండర్లో ఎంత కెపాసిటీ గేజ్తో ఆక్సిజన్ నింపాలి.. ఎంత గేజ్తో నింపుతున్నారు అనే విషయం సమగ్రంగా వచ్చింది. ఈ కథనాన్ని ఆసరా చేసుకున్న అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ.. కాంట్రాక్టర్ మనోహర్రెడ్డి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఆతర్వాత కాంట్రాక్టర్ మనోహర్రెడ్డి.. 2013 జూలై నెలలో డాక్టర్ రామకృష్ణకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తీగ లాగితే డొంక కదిలింది.. ప్రభుత్వం విచారణకు ఆదేశించగానే ‘సాక్షి’లో వచ్చిన కథనంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. 2007 నుంచి 2013 వరకు ఆస్పత్రిలో నామినేషన్ పద్ధతిన టెండర్ కేటాయించడంతోపాటు సరఫరా చేసిన సిలిండర్లకు సైతం అద్దె కట్టించుకున్నారు. ఈ విషయం సైతం ‘సాక్షి’ కథనంలో క్షుణ్ణంగా వచ్చింది. ఒక్కో సిలిండర్కు అదనంగా రూ.190తోపాటు, 2007 నుంచి 2013 వరకు ఎంజీఎం ఆస్పత్రి నుంచి రూ.35.29 లక్షల అద్దె చెల్లించినట్లు.. ఈ రకంగా ప్రతి సంవత్సరం లక్షల రూపాయల దోపిడీ జరిగినట్లు గుర్తించారు. -
ఏది నిజం?: బాధితులనే దోషుల్ని చేస్తారా? పాత్రికేయమంటే ఇదేనా డ్రామోజీ?
నేను చెప్పిందే తీర్పు.... నేను రాసిందే చరిత్ర!!.నేను పడుకుంటే అది రాత్రి... నేను నిద్రలేస్తే అది ఉదయం... అనుకునే తెగ బలిసిన మోతుబరి తత్వం రామోజీరావుది.ఎందుకంటే... వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం చేసిన నిందితుడుజనిపల్లి శ్రీనివాసరావు 2019 జనవరి 17నే దర్యాప్తుఅధికారులకు వాంగ్మూలమిచ్చాడు. నిందితుడితో పాటు ఇతర అనుమానితులు, సాక్షులు, బాధితుడు వైఎస్ జగన్ తాలూకు వాంగ్మూలాలన్నీ తీసుకున్నాక కొంతమేర దర్యాప్తు జరిపి 2019 జనవరి 27న దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కోర్టుకు చార్జిషీట్ను సమర్పించింది. అందులో... అది హత్యాయత్నమేనని నిర్ధారించింది. వైఎస్ జగన్ను హతమార్చాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం నిందితుడు అన్నీ చేశాడనిస్పష్టంగా తేల్చింది. దీనివెనక ఏమైనా కుట్ర ఉందా?ఎవరైనా ప్రేరేపించారా? అనే విషయాలు తేల్చడానికి ఇంకా దర్యాప్తు అవసరమని కూడా స్పష్టం చేసింది. అంటే ఇక్కడ తెలిసేదేమిటి?వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిందనేది వివాదానికి తావులేని అంశం. తేలాల్సిందల్లా... ఆ హత్యా ప్రయత్నం వెనక ఎవరున్నారనేదే!!. అలా తేల్చడంలో ఆలస్యమవుతోంది కాబట్టి, వేగంగా చేసేలా దర్యాప్తు సంస్థను ఆదేశించాలంటూ తాజాగా కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. ఇదీ జరుగుతున్న వాస్తవం. కానీ రామోజీరావు చేస్తున్నదేమిటి? ఎన్ఐఏ వేసిన చార్జిషీటును కూడా ప్రస్తావించకుండా... అంతకన్నా ముందు... నాలుగేళ్ల కిందట నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని, ఇప్పుడే వెలుగు చూసిందంటూ శనివారంనాడు తన పత్రికలో పతాక శీర్షికన ప్రచురించారంటే ఏమనుకోవాలి? ఈ రామోజీరావు బుద్ధి భూలోకాన్ని దాటి పాతాళానికి పడిపోతున్నదనుకోవాలా?లేక తెగ బలిసిన మోతుబరి వ్యవహారమనుకోవాలా? హత్యాయత్నం జరిగిందని దర్యాప్తు సంస్థలు కూడా తేల్చాక... బాధితుడు వైఎస్ జగన్ను అవమానపరిచేలా, నిందితుడి పక్షాన నిలుస్తూ నిందితుడి ఫోటోలు పతాక శీర్షికల్లో వేస్తూ... ఇలాంటి పనికిమాలిన వార్తలు రాస్తున్నారంటే ఏమనుకోవాలి? బాధితుల్ని వదిలి నిందితులకు కొమ్ముకాసే దగాకోరు పాత్రికేయం చరిత్రలో ఎక్కడైనా ఉందా? బాధితులనే దోషులుగా చూపించే కుట్రలు ఇంకెక్కడైనా జరుగుతాయా? ఇదేం తీరు రామోజీరావ్? ఇంకెన్నాళ్లు ఇలా..? హర్షవర్దన్ చౌదరి పాత్రను, తెలుగుదేశంతో ఆయన సంబంధాలను, ఈ కుట్రపై దర్యాప్తు జరగాల్సిన అవసరాన్ని పేర్కొంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం. నిందితుడు శ్రీనివాసరావు ఫ్యూజన్ ఫుడ్స్ యూనిఫామ్ వేసుకుని, వాటర్ బాటిల్తో వీఐపీ లాంజ్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి పక్కన నిల్చుని అవకాశం కోసం చూశాడని,అవకాశం దొరికిన వెంటనే పదునైన కత్తితో హతమార్చుదామని అనుకున్నాడని.. ఈ క్రమంలోనే జగన్మోహన్రెడ్డి వేగంగా పక్కకు తప్పుకోవటంతో భుజానికి గాయం అయిందని ఛార్జిషీట్లో పేర్కొన్న ఎన్ఐఏ. ఈ కేసులో కుట్ర కోణాన్ని, నిందితుడిని ప్రేరేపించిన పరిస్థితులుంటే వాటిని కూడా దర్యాప్తుచేస్తామని తొలి ఛార్జిషీట్లో కోర్టుకు చెప్పిన ఎన్ఐఏ. కోర్టుకు ఎన్ఐఏ సమర్పించిన అఫిడవిట్లో జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం పోలీస్స్టేషన్లో 2017 మార్చి నెలలో కేసు నమోదు అయినట్లు పేర్కొన్న భాగం జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసు నమోదు కాలేదు అంటూ హత్యాయత్నం జరిగిన నాడే ‘ఈనాడు’ రాసిన వార్త.. (ఫైల్) ఏది నిజం? గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతను లేకుండా చేసే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. ఫలితం... నాటి ఎన్నికల్లో సరైన ప్రతిపక్షమే లేకుండా చేశారు ప్రజలు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబుకు గానీ, ఆయన రాజగురువు రామోజీకి గానీ బుద్ధి రాలేదు. అప్పటి చీప్ట్రిక్స్నే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. అందులో ముఖ్యమైన అంశాలు చూద్దాం... ♦ హత్య జరిగిన రోజే... నిందితుడు శ్రీనివాసరావుపై ఎక్కడా ఎలాంటి పోలీసు కేసులూ లేవని రామోజీరావు రాసేశారు. అంత హడావుడిగా నిందితుడి తరఫున వకాల్తా పుచ్చుకుని ‘ఈనాడు’ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎవరు రాయించారు? మరి తనపై ముమ్మిడివరంలో అప్పటికే పోలీసు కేసులున్నట్లు దర్యాప్తులో తేలింది కదా? దర్యాప్తు జరగకముందే రామోజీకి ఎందుకంత తొందర? ఎవరి ప్రయోజనాల కోసం? ♦ నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ అభిమాని అని... హత్యాయత్నం జరిగిన రోజే ‘ఈనాడు’ రాసేసింది. దీనికోసం వైఎస్ జగన్ – శ్రీనివాసరావు కలిసి ఉన్న ఫ్లెక్సీని సాక్ష్యంగా చూపించింది. కానీ ఆ ఫ్లెక్సీ అప్పటికప్పుడు సృష్టించినదని, నకిలీదని ఆ తరవాత తేలింది. అసలు ‘ఈనాడు’కు ఈ ఫ్లెక్సీ బొమ్మ ఎవరు పంపారు? ♦ నిందితుడి సొంత ఊళ్లో ఇసుక కుప్పపై కప్పిన ఫ్లెక్సీని హత్యాయత్నం జరిగిన మూడురోజుల తరవాత అక్కడ చూశామని అక్కడకు విచారణ నిమిత్తం వెళ్లిన పోలీసులు పేర్కొన్నారు. కానీ నిందితుడి సోదరుడు ఇచ్చి న వాంగ్మూలంలో మాత్రం... ఆ ఫ్లెక్సీ లేదని, వానలకు పోయిందని చెప్పాడు. వీటిలో ఏది నిజం? వానలకు పోతే ఆ తరవాత పోలీసులకు ఎలా దొరికింది? అంటే అది అప్పటికప్పుడు సృష్టించినదనుకోవాలా? ♦ నిందితుడి జేబులో ఓ లేఖ దొరికింది. అందులో... తనకేమైనా అయితే తన అవయవాలు దానం చేయాలని కూడా పేర్కొన్నాడు. ఒకవేళ రామోజీరావు ప్రవచిస్తున్న సిద్ధాంతం ప్రకారం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతోనే... ఆయనకు సానుభూతి రావాలనే ఇదంతా చేస్తే తనకేమైనా అవుతుందనే భయం ఉంటుందా? వేరొకరు చెబుతున్నట్టుగా చేసినప్పుడే... తనకు ఏమవుతుందోనన్న భయం ఉంటుంది. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు రామోజీ? ♦ జగన్ను చంపాలనుకుంటే మాంసం కోయడానికి ఉపయోగించే పెద్ద కత్తి వాడేవాడినని, ఆ ఉద్దేశం లేదు కాబట్టే చిన్న కత్తి వాడానని నిందితుడు చెప్పినట్టు కూడా ‘ఈనాడు’ బాక్సు కట్టి మరీ వేసేసింది. ఎయిర్పోర్టులో జనం ఉంటుండగా... అంతమంది మధ్యలోకి వెళ్లేటపుడు పెద్ద కత్తి తీసుకెళ్లడం సాధ్యమా? చిన్నదైతే కనపడకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే తీసుకెళ్లాడని అర్థం కావటం లేదా? అలాంటి సందేహాలు రామోజీకి రావా? ♦ నిందితుడిపై పోలీసు కేసులేవీ లేవంటూ పోలీసులకు, ఎయిర్పోర్టు సెక్యూరిటీకి డిక్లరేషన్ ఇచ్చి మరీ శ్రీనివాసరావును ఉద్యోగంలోకి తీసుకున్న హర్షవర్దన్ చౌదరి టీడీపీ నాయకుడు కాదా? 2014లో గాజువాక నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించలేదా? అన్ని అబద్ధాలు చెప్పి శ్రీనివాసరావును ఉద్యోగంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చి ంది? ♦ ఎయిర్పోర్టులోని ఫ్యూజన్ఫుడ్స్కు వచ్చే ఉద్యోగులంతా బయోమెట్రిక్ హాజరు వాడుతూ ఉంటారు. శ్రీనివాసరావు తమ దగ్గర ఉద్యోగం చేస్తున్నారనేది ఫ్యూజన్ ఫుడ్స్ చెప్పినదే. దానికి సంబంధించిన రికార్డులన్నీ ఫ్యూజన్ ఫుడ్స్ ఇచ్చి నవే. కానీ బయోమెట్రిక్ హాజరులో ఎన్నడూ శ్రీనివాసరావు వేలిముద్రలు రికార్డు కాలేదని దాన్ని విశ్లేషించిన వర్గాలు చెబుతున్న మాట. ఇదంతా కుట్ర అనటానికి ఇది కూడా ఒక సాక్ష్యాధారమే కదా? ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర విశాఖపట్నంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ విశాఖ ఎయిర్పోర్టులో సీసీ కెమెరాలు పనిచేయటం మానేశాయి. ‘‘ప్రతి శుక్రవారం వైఎస్ జగన్ హైదరాబాద్లోని కోర్టుకు హాజరయ్యేవారు. దానికోసం ఆయన విశాఖ ఎయిర్పోర్టుకు రావటం... హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ విమానాశ్రయంలో దిగటం చేసేవారు. ఇది తెలుసుకున్న శ్రీనివాసరావు పథకం ప్రకారం ఈ హత్యాయత్నానికి ఒడిగట్టారు’’ అని ఎన్ఐఏ తన చార్జిషీట్లో పేర్కొంది. ఇదంతా తెలుసుకున్నాకే సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశారనే అనుమానాలున్నాయి. మరి ఇలా సీసీ కెమెరాలను పనిచేయకుండా చేసే అవకాశం ప్రతిపక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఉంటుందా? ♦ నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అయితే... ఆయనకు తెలుగుదేశం నేత హర్షవర్దన్ చౌదరి ఉద్యోగమెందుకు ఇస్తాడు? అది కూడా ఎయిర్ పోర్టు పోలీసులకు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి మరీ!!. కుట్ర కోణంలో ఇదే అసలు కోణం కదా? లోతైన దర్యాప్తు అవసరం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అడుగుతున్నదొక్కటే. హత్యాయత్నం జరిగిందని ఇప్పటికే ఎన్ఐఏ తే ల్చి... చార్జిషీట్లో కూడా దాన్ని ధ్రువీకరించింది. అయితే ఈ హత్యాయత్నం వెనక ఉన్నదెవరు? దానికి సహకరించింది ఎవరు? కుట్ర ఎవరిది? ఇవన్నీ తేలాలని, దీనికోసం దర్యాప్తునువేగవంతం చేసి... పూర్తి స్థాయి చార్జిషీటును వెయ్యాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరుతున్నారు. ఇదే అభ్యర్థనతో ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై విచారణలో భాగంగానే ఎన్ఐఏకు కోర్టు నోటీసులిచ్చింది. ఆ నోటీసులకు సమాధానంగా కౌంటర్ వేసిన ఎన్ఐఏ.. దర్యాప్తును ఇంకా కొనసాగిస్తున్నామనే చెప్పింది తప్ప ముగించినట్లు పేర్కొనలేదు. కానీ ముగించేసినట్లుగా... కుట్ర కోణం లేదని తేల్చేసినట్లుగా ‘ఈనాడు’ దివాలాకోరు రాతలు రాస్తుండటమే అసలైన దుర్మార్గం. -
మానవ మృగాలు.. అంజలిని కాపాడే వీలున్నా..
క్రైమ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కంజావాలా మృతి కేసులో ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితుల(నలుగురు ప్రధాన నిందితులు) పేర్లను చేరుస్తూ.. 20 ఏళ్ల అంజలి మృతికి కారణమయ్యారంటూ ఢిల్లీ పోలీసులు ఛార్జ్షీట్లో పొందుపరిచారు. అంతేకాదు ఆమెను కాపాడే వీలున్నా అందుకు కనీస ప్రయత్నం చేయలేదని, పైగా ఆమెను చంపే ఉద్దేశంతోనే కారుతో ఈడ్చుకెళ్లారని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఘటన సమయంలో బాధితురాలు అంజలిని కాపాడే అవకాశాలు రెండుసార్లు కలిగినా కనికరం లేకుండా నిందితులు ముందుకు సాగారని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. మొదట.. స్కూటీపై వెళ్తున్న ఆమెను కారుతో ఢీ కొట్టారని, అప్పుడే ఆగి ఆమెను రక్షించే వీలున్నా ఆ ప్రయత్నం చేయలేదని తెలిపారు. రెండు.. ఢీ కొట్టిన తర్వాత ఆమె కారు కింద ఇరుక్కుందని వాళ్లకు తెలుసు. దిగి ఆమెను కాపాడే అవకాశం అప్పటికీ ఉంది. అయినా నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఆమెను సుల్తాన్పురి నుంచి కంజావాలా మధ్య 12 కిలోమీటర్లపాటు ఈడ్చుకెళ్లారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న అంజలి, ఆమె స్నేహితురాలిని తొలుత కారుతో ఢీ కొట్టారు నిందితులు. అంజలి కాలు కారు కిందే ఇరుక్కుపోగా.. స్నేహితురాలు కాస్త దూరంలో కింద పడిపోయి భయంతో అక్కడి నుంచి పారిపోయింది. ఆపై అంజలిని కారుతో ఈడ్చుకుంటూ వెళ్లిపోయారు నిందితులు. ఈ క్రమంలో ఆమె ప్రాణం పోతుందని తెలిసినా కూడా నిందితులు ముందుకు సాగడం ఘోరం. ఈ కేసులో నలుగురు నిందితులు అమిత్ ఖన్నా, కృష్ణన్, మనోజ్ మిట్టల్, మిథున్లపై హత్య నేరాభియోగాలను ఛార్జ్షీట్లో నమోదు చేశారు పోలీసులు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం వాళ్లపై అభియోగాలు నమోదు అయ్యాయి. స్కూటీని ఢీ కొట్టి 500-600 మీటర్ల దూరం వెళ్లాక.. డ్రైవర్ పక్క సీట్లో ఉన్న నిందితుడు, వెనకాల ఉన్న నిందితుడు ఇద్దరూ.. ఆమె ఇంకా కారు కింద ఉందా? లేదా? అనేది చూశారు. ఉందని నిర్ధారించుకున్న తర్వాత కూడా కారును ముందుకు పోనివ్వాలని డ్రైవర్ సీట్లో ఉన్న నిందితుడికి సూచించారు. అలా ముందుకు వెళ్లే క్రమంలో.. ఆమె దుస్తులు చినిగిపోయి, వీపు చిట్లిపోయి వెన్నుపూస బయటకు వచ్చేసింది. పుర్రె భాగం సైతం పగలిపోయింది. ఈడ్చుకెళ్లే దారిలోనే ఆమె ప్రాణం పోయిందని శవ పరీక్షలో వెల్లడైంది. తాము చేస్తున్న పని ఆమెను గాయపర్చడమే కాదు.. ప్రాణాలకు ముప్పు కలిగించేదని తెలిసి కూడా మృగాల్లా నిందితులు వ్యవహరించారని, ఈ కేసులో మద్యం మత్తు అనేది కేవలం తప్పించుకునే సాకుగానే కనిపిస్తోంది తప్ప నిందితులు ఘటన సమయంలో స్పృహలోనే ఉన్నారని, వాళ్లకు ఆ నేర తీవ్రత గురించి కూడా తెలుసని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ ఛార్జ్షీట్ ఆధారంగా ఢీల్లీ రోహిణి కోర్టు ఏప్రిల్ 18వ తేదీన వాదనలు విననుంది. -
ఎలుకను చంపిన వ్యక్తిపై కేసు, 30 పేజీల చార్జిషీట్.. 3 ఏళ్లు జైలు శిక్ష?
లక్నో: ఎలుకను చంపినందుకు ఓ వ్యక్తిపై పోలీసులు 30 పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మనోజ్ కుమార్ ఓ ఎలుకను చిత్ర హింసలు పెడుతూ ఉండగా.. జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర శర్మ ఈ మొత్తం ఘటనను చిత్రీకరించి నిందితుడు మనోజ్ కుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విచిత్రమైన ఘటన తెరపైకి వచ్చింది. ఎలుక పట్ల అతను క్రూరంగా వ్యవహరించాడని ఆరోపించారు. శర్మ ఎలుకను కాపాడేందుకు ప్రయత్నించగా అది ఊపిరాడక చనిపోయిందని తెలిపాడు. కాగా మనోజ్పై జంతువుల పట్ల క్రూరత్వం నిరోధక చట్టం, జంతువులను చంపడం లేదా గాయపరచడం కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక, మీడియాలో విడుదలైన వీడియోలు, సంబంధిత వివిధ విభాగాల నిపుణుల అభిప్రాయాలతో సహా 30 పేజీల ఛార్జిషీట్ను పోలీసులు సిద్ధం చేశారు. పోలీసులు ఎలుక మృతదేహాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)కి పోస్ట్మార్టం నిమిత్తం పంపించారు. వాపు కారణంగా ఎలుక ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చార్జిషీట్లో స్పష్టం చేశారు. అంతే కాకుండా మైక్రోస్కోపిక్ పరీక్షలో కూడా ఊపిరాడక ఎలుక చనిపోయిందని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయగా స్థానిక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అటవీ శాఖ చట్టం ప్రకారం... ఎలుకను చంపడం నేరంగా పరిగణించబడదని బుదౌన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్ఓ) అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున చర్యలు తీసుకోవాల్సి ఉందని డిఎఫ్ఓ తెలిపారు. ఏ శిక్ష పడే అవకాశం ఉంది! జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో రూ.10 నుంచి రూ.2000 వరకు జరిమానా, మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, మనోజ్ తండ్రి మధుర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎలుకను, కాకిని చంపడం తప్పుకాదని, అవి హానికర జీవులని, అలాంటి కేసులో మా కుమారుడికి శిక్ష పడితే కోళ్లు, మేకలు, మేకలను చంపే వారందరిపైనా చర్యలు తీసుకోవాలి. చేపలు, ఎలుకలను చంపే మందులను విక్రయించే వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. -
ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో చార్జిషీట్
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో ఏడుగురు నిందితులపై పోలీసులు శనివారం 800 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. దాదాపు 120 మంది సాక్ష్యాలను అందులో పొందుపరిచారు. నిందితుల్లో నలుగురిపై హత్యా నేరం మోపారు. దీనిపై విచారణను ఏప్రిల్ 13కు మెట్రోపాలిటన్ జడ్జి సన్యా దలాల్ వాయిదా వేశారు. గత డిసెంబర్ 31న ఢిల్లీలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుని అర్ధరాత్రి దాటాక స్కూటీపై వెళ్తున్న అంజలీసింగ్ అనే 20 ఏళ్ల యువతిని నిందితులు కారుతో ఢీకొట్టడం, ఆమె కారు కింద చిక్కుకుందని తెలిసి కూడా అలాగే 12 కిలోమీటర్లకు పైగా లాక్కెళ్లడం తెలిసిందే. దాంతో ఒళ్లంతా ఛిద్రమై అంజలి అత్యంత బాధాకరంగా మరణించింది. -
ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ దూకుడు.. రెండో చార్జిషీట్ దాఖలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. 13,657 పేజీలతో కూడిన ఈ అనుబంధ (సప్లిమెంటరీ) చార్జిషీట్లో 12 మంది వ్యక్తులు, సంస్థల పేర్లను ప్రస్తావించింది. గతంలో ఈడీ అరెస్ట్ చేసిన విజయ్ నాయర్, శరత్రెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా పేర్లతోపాటు మరో ఏడు కంపెనీలపై అభియోగాలు మోపింది. అయితే ఈ చార్జిషీట్లోనూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చేర్చకపోవడం గమనార్హం. ఈ వివరాలను ఈడీ అధికారులు శనివారం కోర్టుకు సమర్పించనున్నారు. కాగా, ఇప్పటికే గత ఏడాది నవంబర్లో తొలి చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రుకు సంబంధించిన చార్జిషీట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఈడీ ప్రస్తావించింది. ఇప్పటి వరకు ఈ కేసులో సమీర్ మహింద్రు, శరత్చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరాలను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీలో ఇటీవల అమల్లోకి వచ్చిన ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో సమీర్ మహింద్రు ఒకరు. ఈ కేసులోని నిందితులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా పేరు ఈడీ తొలి చార్జిషీట్లోనూ చేర్చలేదు. అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (బీసీఐ) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో మనీష్ సిసోడియా సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులను ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. ఇదిలా ఉండగా శనివారంతో ఢిల్లీ లిక్కర్ కేసు నిందితులైన విజయనాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి , బినోయ్బాబు జ్యూడిషియల్ కస్టడీ ముగియనుంది. జనవరి 7న శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ చేపట్టనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ నిందితులను ప్రవేశపెట్టనుంది. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు -
ఆరోగ్యం ముసుగులో ఉగ్రవాదం.. పీఎఫ్ఐ చార్జిషీటులో విస్మయకర అంశాలు
సాక్షి, కరీంనగర్: రాడ్డు.. కర్ర..కత్తి ఏ ఆయుధాన్ని ఎలా వాడాలి..? ఎలా దాడి చేయాలి? మనిషి శరీరంలో ఎక్కడెక్కడ సున్నిత ప్రాంతాలు ఉంటాయి..? ఎక్కడ కొడితే ప్రాణాలు పోతాయి..? ఇవీ.. ఆరోగ్య పరిరక్షణ ముసుగులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) రహస్యంగా నిర్వహించిన కార్యకలాపాలు. శారీరక, మానసిక ఆరోగ్యం ముసుగులో పీఎఫ్ఐ చేసిన సంఘ వ్యతిరేక చర్యలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. యోగా.. కరాటే పేరుతో ఆయుధాల వినియోగం, మనుషులను సులువుగా చంపడం ఎలా..? తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారని తేలింది. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో అనేక కీలక విషయాలు వెలుగుచూశాయి. ఇవే విషయాలను ఎన్ఐఏ ఇటీవల దాఖలు చేసిన చార్జిషీటులోనూ పేర్కొంది. శారీరక ఆరోగ్యానికి, ఆత్మరక్షణ పేరిట నడిపిన కరాటే శిబిరాలు, యోగా పేరిట నడిపిన ధ్యానకేంద్రాలన్నీ ఉగ్ర కార్యకలాపాలకు నిలయంగా మారాయని చార్జిషీటులో పేర్కొంది. ఎలా బయటపడిందంటే..? పీఎఫ్ఐ కీలక సభ్యుడు, నిజామాబాద్కు చెందిన (స్వస్థలం జగిత్యాల) అబ్దుల్ఖాదర్ను పోలీసులు నిజామాబాద్లో అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఇతను నిజామాబాద్లో దాదాపు 200 మంది ముస్లిం యువకులకు శిక్షణ ఇచ్చినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. గతేడాది జూలై 4న పోలీసులు అబ్దుల్ ఖాదర్, అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో సాదుల్లా, ఇమ్రాన్, మొబిన్ను మరుసటి రోజు అరెస్టు చేశారు. వీరి నెట్వర్క్ను ఏపీలోని కడప, కర్నూలు నుంచి పీఎఫ్ఐ సభ్యులు ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో నిజామాబాద్ 4వ టౌన్లో పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో నిందితుడు అబ్దుల్ఖాదర్ విదేశాలకు వెళ్లి రావడం, పలు దేశాల నుంచి పీఎఫ్ఐకి నిధులు తెచ్చినట్టు కూడా పోలీసులకు సమాచారం ఉంది. దీంతో ఎన్ఐఏ రంగంలోకి దిగి సెక్షన్ 120 (బి), 153(ఎ), ఐపీసీ సెక్షన్లు 17, 18, 18(ఎ), 18(బి) యూఏ(పి) యాక్ట్ కింద ఆగస్టు 26న తిరిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో అబ్దుల్ ఖాదర్ (ఆటోనగర్, నిజామాబాద్), అబ్దుల్ అహ్మద్ (ముజాహెద్నగర్, నిజామాబాద్), షేక్ ఇలియాస్ అహ్మద్ (ఖాజానగర్, నెల్లూరు), అబ్దుల్ సలీమ్ (ఇస్లాంపూర్, జగిత్యాల), షేక్ షాదుల్లా (గుండారం, నిజామాబాద్), ఫిరోజ్ ఖాన్ (శాంతినగర్, ఆదిలాబాద్), మహమ్మద్ ఉస్మాన్ (తారకరామనగర్, జగిత్యాల), సయ్యద్ యాహియా సమీర్ (ఆటోనగర్, నిజామాబాద్), షేక్ ఇమ్రాన్ (ముజాహెద్నగర్, నిజామాబాద్), మొహమ్మద్ అబ్దుల్ ముబీన్ (హబీబ్నగర్, నిజామాబాద్), మొహమ్మద్ ఇర్ఫాన్ (హుస్సేన్పురా, కరీంనగర్)పై చార్జీషీటు దాఖలు చేసింది. హింసలో సుశిక్షితులు నిజామాబాద్లో శిక్షణ పొందిన 200 మంది యువతను పథకం ప్రకారం ముందుగా ఆరోగ్యం, ధ్యానం పేరిట యోగా, కరాటే అంటూ పోగుచేశారు. ఆపై వారిలో దేశ వ్యతిరేక భావజాలం నింపుతూ వారి మనసులను కలుషితం చేసేందుకు యత్నించారు. యోగా క్యాంపుల ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టడం, కరాటే పేరిట దాడి చేయడంలో తర్ఫీదు ఇచ్చారని ఎన్ఐఏ చార్జిషీటులో పేర్కొంది. గొంతు, తల, ఉదరం తదితర సున్నిత ప్రాంతాలపై దాడి చేయడం, ఎక్కడ కొడితే మనిషి త్వరగా మరణిస్తాడన్న విషయాలపైనా తరగతులు ఇచ్చినట్లు కూడా ఎన్ఐఏ ఛార్జిషీటులో స్పష్టం చేసింది. కొనసాగుతున్న నిఘా.. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాపై ఎన్ఐఏ నిఘా కొనసాగుతోంది. గతంలో క్రియాశీలకంగా ఉన్న సిమి (స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) నిషేధానికి గురవడంతో పీఎఫ్ఐ ముసుగులో తిరిగి కార్యకలాపాలు మొదలుపెట్టినట్టు గుర్తించింది. అందుకే దేశవ్యాప్తంగా దీని కార్యకలాపాలకు కళ్లెం వేసేందుకు గతేడాది సెప్టెంబర్ 18న పీఎఫ్ఐ స్థావరాలపై దాడులు చేసింది. అందులోభాగంగా జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించింది. పలువురి నుంచి కీలక డాక్యుమెంట్లు, పీఎఫ్ఐ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుంది. సంస్థకు సంబంధించి ఇంకా ఎవరైనా సానుభూతిపరులు, స్లీపర్సెల్స్ ఉన్నారా? అన్న కోణంలో నిరంతర నిఘా కొనసాగుతూనే ఉంది. -
కేసీఆర్ కుటుంబంతో ఆ ముగ్గురికి సంబంధాలు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, నల్లగొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పాలనపై బీజేపీ చార్జ్ షీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. చదవండి: ఫాంహౌస్ డీల్పై వెలుగులోకి షాకింగ్ విషయాలు.. రోహిత్రెడ్డి ఫిర్యాదులో ఏముంది? ‘‘పోటీ చేసే అభ్యర్థి ఏం చేశారు ఏం చేయబోతున్నారు అనేది మాట్లాడాలి. తెలంగాణలో మూర్ఖత్వంగా సాగిస్తున్న కేసీఆర్ పాలన అంతం చేసేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశారు. మునుగోడును అభివృద్ధి చేయలేదు. కనీస అవసరాలు తీర్చలేదు. రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తే అసెంబ్లీ నుంచి బయటకు గెంటారు. మునుగోడు ప్రజల కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు’’ అని బండి సంజయ్ అన్నారు. ‘‘సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారు. కేవలం బీజేపీ, మోదీని తిట్టడమే పని పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని పక్కన ఉంచుకుని తిప్పుకోవడమే నేతలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ముందుకుపోతున్నాం. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక ఇది. మునుగోడు ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే ఈ చార్జ్షీట్ విడుదల చేశాం’’ అని బండి సంజయ్ అన్నారు. ఫాంహౌస్ ఎపిసోడ్ అంతా డ్రామా. కేసీఆర్ కుటుంబంతోనే ఆ ముగ్గురికి సంబంధాలు. ఆడియో టేపులు ఇంకా రెడీ కాలేదట. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఇంత అవసరమా. ఢిల్లీలో కేసీఆర్ను ఎవరెవరు కలిశారో వివరాలు బయటపెట్టాలి. కేసీఆర్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ఘటనపై హైకోర్టును ఆశ్రయిస్తాం. సీబీఐ విచారణ కూడా జరగాల్సిందే’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
‘చార్జ్షీట్’లో సుశీల్ పేరు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ను మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టే పరిణామం! దాదాపు ఏడాదిన్నర క్రితం రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ పేరును ఢిల్లీ పోలీసులు తాజాగా చార్జ్ షీట్లో చేర్చారు. సుశీల్తో పాటు మరో 17 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. ఇకపై చార్జ్షీట్కు అనుగుణంగా పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి కోర్టులో విచారణ సాగనుంది. 2021 మే 4 ఛత్ర్శాల్ స్టేడియంలో సాగర్పై దాడి జరగ్గా, తీవ్రంగా గాయపడిన అతను ఆ తర్వాత మృతి చెందాడు. గత ఏడాది మే 23న అరెస్టయిన సుశీల్ ఇంకా తీహార్ జైలులోనే ఉన్నాడు. -
లాలు యాదవ్, భార్య, కూతుళ్లు, మరో 13 మందిపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మంతిగా ఉన్న సమయలో జరిగిన కుంభకోణానికి సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్దాఖలు చేసిందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ కుంభకోణంలో ఆర్జేడి నేత లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతి, ఇద్దరు ముఖ్యమంత్రులు, ప్రస్తుత బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, అలాగే రైల్వేలో ఉద్యోగాలు పొందిన 12 మందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ చార్జిషీట్లో రైల్వే మాజీ జనరల్ మేనేజర్ సౌమ్య రాఘవన్ని కూడా నిందితుడిగా పేర్కొన్నారు. రాఘవన్ రైల్వే బోర్డు ఆర్థిక కమిషనర్గా పదవీ విరమణ చేశారు. రైల్వేలో జరిగిన కుంభకోణానికి సంబంధించి సిబీఐ సెప్టెంబర్ 23, 2021న కేసు నమోదు చేసింది. ప్రాథమిక విచారణ తర్వాత దానిని మే 18న ఎఫ్ఐర్గా మార్చారు. విచారణలో రైల్వే అధికారులు మితిమీరిన తొందరపాటుతో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోనే గ్రూప్ డీ స్థానల్లో అభ్యర్థులను ప్రత్యామ్నాయంగా నియమించినట్లు తెలిపింది. ఈ కుంభకోణంలో వ్యక్తులు తమ పేరు, తమ దగ్గరి బంధువుల పేరు మీద భూములను బదలాయించనట్లు సీబీఐ వెల్లడించింది. ఈ భూమికి అసలు ఉన్న రేటు కంటే తక్కువగా, అలాగే మార్కెట్లో ఉన్న ధర కంటే చాలా తక్కువ ధరకు సేకరించారు. ఈ భూమి బదలాయింపు రబ్రీ దేవి, కుమార్తెలు భారతి, హేమ యాదవ్ల పేర్లతో బదలాయింపులు జరిగాయని సీబీఐ ఆరోపించింది. పాట్నాలో సుమారు 1.05 లక్షల చదరపు అడుగు భూమిని ప్రసాద్ కుటుంబ సభ్యులు అమ్మకందారులకు నగదు రూపంలో చెల్లించి స్వాధీనం చేసుకున్నారని కేంద్ర ఏజెన్సీ ఆరోపించింది. అలాగే ఈ నిందితుల్లో ఏడుగురు అభ్యర్థులు కూడా ఉన్నారని సీబీఐ పేర్కొంది. (చదవండి: దాదాపు రూ. 5 లక్షలు మోసపోయిన ఇన్స్పెక్టర్... 9 ఏళ్లుగా కేసు నమోదుకాక..) -
రోజూ రెండు గంటలు పనిచేస్తే గెలుపు కాంగ్రెస్దే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడులో కాంగ్రెస్కు 97 వేల ఓటు బ్యాంకు ఉందని, ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి కాపాడుకుంటే పార్టీ గెలుపు ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ కార్యకర్త ఉదయం గంట, సాయంత్రం గంట చొప్పున రోజుకు రెండు గంటలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తే లక్ష ఓట్లు సాధిస్తామని చెప్పారు. కాంగ్రెస్ను ఓడించే శక్తి ‘ఆ మోదీకి లేదు.. ఈ కేడీకి లేదు’అని వ్యాఖ్యానించారు. మునుగోడులో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎనిమిదేళ్ల టీఆర్ఎస్, బీజేపీ పాలన వైఫల్యాలపై కాంగ్రెస్ రూపొందించిన చార్జిషీట్ను మాజీ మంత్రి జానారెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడారు. 100 రోజులపాటు మండలాల్లోని నాయకులు తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి టీఆర్ఎస్, బీజేపీ చేసిన మోసాలను పేర్కొంటూ రూపొందించిన చార్జ్షీట్ను, వరంగల్ డిక్లరేషన్ను వివరించాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సర్వం చేసిందని, ప్రజలు ఆయనకు లక్ష ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రూ.22 వేల కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు. తన రాజీనామాతో ఉప ఎన్నికలు వస్తే నిధులు వస్తాయన్న రాజగోపాల్రెడ్డి.. ఒక్కో ఓటును రూ.2 లక్షలకు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఉప ఎన్నిక వస్తే సర్పంచ్లకు, ప్రజాప్రతినిధులకు డబ్బులొచ్చాయి తప్ప ప్రజలకేం రాలేదని చెప్పారు. అమ్ముడుపోయిన సన్నాసులకు మాత్రమే డబ్బులు వచ్చాయన్నారు. కమ్యూనిస్టులను చూస్తే జాలే స్తోందన్నారు. ‘మీ నాయకులను కొనుక్కొని, మీ పార్టీని బొందపెట్టిన టీఆర్ఎస్కు మీరు మద్దతిస్తారా’ అని ప్రశ్నించారు. విలీన దినోత్సవం పేరుతో మత విద్వేషాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మరోవైపు టీఆర్ఎస్ అదే పేరుతో రాజకీయం చేస్తోందన్నారు. ఒక్క ఓటుతో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు. అధికారికంగా నిర్వహిస్తాం ఇప్పటినుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 17 వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో విమోచన వజ్రోత్సవాలు నిర్వహించాలని, ఇందుకు కార్యాచరణను ప్రకటిస్తామని రేవంత్రెడ్డి చెప్పారు. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచి రైతాంగ సాయుధ పోరాటం చేసిన వారి చరిత్రను దేశానికి మరోసారి చాటాలని పిలుపునిచ్చారు. కేంద్రమే రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టి వజ్రోత్సవాలు నిర్వహించాలన్నారు. అక్రమ డబ్బుతో గెలవాలని చూస్తున్నారు: ఉత్తమ్ కాంట్రాక్టుల్లో వచ్చిన అక్రమ డబ్బుతో మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ గెలవాలని చూస్తున్నాయని ఎంపీ ఉత్తమ్ ఆరోపించారు. కాంగ్రెస్ను వదిలి రాజగోపాల్రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయారని విమర్శించారు. డిండి, చర్లగూడెం, కిష్టరాయినిపల్లి, బ్రాహ్మణవెల్లెం ఎత్తిపోతల పథకాలు, చౌటుప్పల్ డిగ్రీ కాలేజీ, మునుగోడులో ప్రభుత్వ జూనియర్ కళాశాలపై కేసీఆర్ హామీ ఇచ్చి మరిచిపోయారన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందని.. నల్లగొండ జిల్లాలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదని మాజీ మంత్రి కె.జానారెడ్డి విమర్శించారు. ఈ భేటీలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మాజీ మంత్రి బలరాంనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, నల్లగొండ, యాదాద్రి డీసీసీ అధ్యక్షులు శంకర్నాయక్, అనిల్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
మతం, ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు: రేవంత్ రెడ్డి
-
అప్పుడు డ్రగ్ తీసుకున్నట్లు ఆర్యన్ అంగీకరించాడు: ఎన్సీబీ
మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్కు క్లీన్చిట్ లభించిన సంగతి తెలిసిందే. ఆర్యన్కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పేర్కొంది. దాంతో అతనిపై అభియోగాలు నమోదు చేయలేదని కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఎన్సీబీ శుక్రవారం ముంబై కోర్టుకు 6 వేల పేజీల చార్జిషీట్ సమర్పించింది. ఈ అభియోగ పత్రంలో ఆర్యన్కు ఖాన్కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను ఎన్సీబీ పొందుపరిచింది. చదవండి: ముందుగా రాబోతున్న ‘విరాట పర్వం’?, కొత్త రిలీజ్ డేట్ ఇదే! అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లో నిద్ర సమస్యల కారణంగా గంజాయి తీసుకోవడం ప్రారంభించినట్లు ఆర్యన్ ఖాన్ తమ విచారణలో తెలిపాడని ఎన్సీబీ పేర్కొంది. కాగా ఈ కేసులో అరెస్టు చేసిన 20 మంది 14 మందిపై ఎన్సీబీ శుక్రవారం ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన విషయం విధితమే. 2018లో అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు గంజాయి తాగడం ప్రారంభించానని ఆర్యన్ ఎన్సీబీకి ముందు అంగీకరించినట్లు అభియోగపత్రం వెల్లడిస్తోంది. చదవండి: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన హీరో ఈ చార్జిషీట్లో ఏం చెబుతుంటే.. ‘ఆ సమయంలో తాను నిద్ర సమస్యలతో బాధపడ్డానని, గంజాయి తాగితే ఉపశమనం కలుగుతుందని ఇంటర్నెట్లో పలు కథనాలు చదివినట్లు వాంగ్ములమిచ్చాడు. సరదా కోసం మారిజునానూ కూడా తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. తన ఫోన్లో దొరికిన గంజాయి వాట్సప్ డ్రగ్ చాట్ తానే చేశానని, దోఖా అనే కోడ్వర్డ్తో గంజాయి కొనుగోలు కోసం ఆచిత్తో(ఈ కేసులో మరో నిందితుడు) చాట్ చేశానని ఆర్యన్ ఒప్పుకున్నాడు. అయితే తన ఫోన్ను అధికారికంగా స్వాధినం చేసుకోలేదని, ఆ ఫోన్ నుంచి సేకరించిన చాటింగ్ వివరాలేవి ప్రస్తుత కేసుతో అతనికి సంబంధం ఉన్నట్లు నిరూపించలేదని ఎన్సీబీ తమ అభియోగపత్రంలో వెల్లడించింది. -
నిషేధిత హారన్ కొడితే చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: చిత్ర విచిత్రమైన ధ్వనులతో హారన్ కొడుతూ.. రోడ్లపై దూసుకుపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త! జూన్ 1 నుంచి నిషేధిత హారన్లు మోగించే డ్రైవర్, ఆ వాహన యజమానిపై ట్రాఫిక్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. ఎయిర్, ప్రెషర్, మల్టీటోన్డ్ వంటి నిషేధిత హారన్ వినియోగిస్తూ ధ్వని కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై నగర ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. నిషేధిత హారన్లు వినియోగించేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్డు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 10 నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 3,320కిపైగా వాహనాలకు ఉన్న నిషేధిత హారన్లను తొలగించారు. ఆయా వాహనదారులకు ఎంవీ యాక్ట్ 190 (2) సెక్షన్ ప్రకారం రూ.1,000 జరిమానా విధించినట్లు నగర ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం (సీఎంవీఆర్)–1988 సెక్షన్ 52 ప్రకారం తయారీదారుల నుంచి వచ్చిన వాహన హారన్లో ఎలాంటి మార్పులు చేయకూడదు. ప్రతి వాహనానికీ ఎలక్ట్రిక్ హారన్ మాత్రమే ఉండాలి. -
అందుకే ఒవైసీపై దాడి చేశారట!
ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల కేసులో ఇద్దరిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు యూపీ పోలీసుల ఛార్జీషీట్లో ఆసక్తికర విషయాల్ని పొందుపరిచారు. లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల కేసులో సచిన్, శుభమ్ అనే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ కాపీని ఓ జాతీయ మీడియా సంస్థ సంపాదించింది. అందులో ఆసక్తికరమైన విషయాలు ఉన్నట్లు వెల్లడించింది. ఒవైసీపై దాడిని అంగీకరించిన ఇద్దరు నిందితులు.. వారి దాడి వెనుక ఉద్దేశ్యం ఏమిటో వివరించారు. మరొక వర్గానికి చెందిన ఒక పెద్ద రాజకీయ నాయకుడిని చంపడం ద్వారా ‘హిందుత్వ నేతలు’గా పేరు సంపాదించుకోవాలనే, ఎదగాలనే ఉద్దేశంతోనే ఆ పని చేశారట!. ‘‘పూర్తి సన్నద్ధతతో గౌరవ ఎంపీని లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నం చేశారు. దాడిలో ఎవరైనా గాయపడినా.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి ఉండేవి. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు పరిస్థితిని మరింత దిగజార్చేవి’’ అని ఛార్జిషీట్లో పోలీసులు పొందుపరిచారు. ఆధారాలు సమర్పణ యూపీ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ఛార్జ్షీట్లో ఆధారంగా పేర్కొన్నారు. కారు ఫోరెన్సిక్ పరీక్షల ఫలితంతో పాటు ఇద్దరు నిందితుల స్టేట్మెంట్, వాళ్లకు ఆయుధాలు సరఫరా చేసిన వాళ్ల స్టేట్మెంట్లను సైతం పొందుపరిచారు. ఒవైసీతో పాటు మొత్తం 61 మంది నుంచి తీసుకున్న స్టేట్మెంట్ను పొందుపరిచారట. ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన.. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి పయనమైన ఆయన వాహనంపై.. హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్ప్లాజా సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. చదవండి: దయచేసి జడ్ కేటగిరిని అంగీకరించండి: అమిత్ షా -
చిన్నమ్మ మెడకు ‘లగ్జరీ’ ఉచ్చు
సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తిచేసినా చిన్నమ్మ శశికళను కారాగారం నీడ వెంటాడుతూనే ఉంది. బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో ఉన్న సమయంలో లగ్జరీ జీవితం కోసం రూ.2 కోట్లు లంచం ఎరవేసిన వ్యవహారం రుజువై చిన్నమ్మ మెడకు బిగుసుకుంటోంది. వివరాలు.. తమిళనాడులో 1991–96 మధ్యకాలంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండగా అప్పటి సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. నలుగురికీ నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ జయ మరణం తరువాత 2017 ఫిబ్రవరి 15వ తేదీన తుదితీర్పు వెలువడింది. దీంతో శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షాకాలాన్ని పూర్తిచేసుకుని విడులయ్యారు. బెంగళూరు జైల్లో శశికళ సాధారణ ఖైదీలాగ కాకుండా లగ్జరీ వసతులతో కూడిన జీవితాన్ని అనుభవించడం, ఇళవరసితో కలిసి బెంగళూరులో షాపింగ్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వారికి ఈ వెసులుబాటు కల్పించిన జైలు ఉన్నతాధికారులకు శశికళ రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు అప్పటి జైళ్లశాఖ డీఐజీ రూప ఆరోపించారు. దీంతో రిటైర్డు ఐఏఎస్ అధికారి వినయ్కుమార్ నేతృత్వంలో విచారణ కూడా జరిగింది. డీఐజీ రూప చేసిన ఈ ఆరోపణలు విచారణలో నిర్ధారణ అయ్యాయి. కాగా చెన్నై ఆళ్వార్పేటకు చెందిన గీత అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన కేసుపై కర్ణాటక హైకోర్టులో గత ఏడాది ఆగష్ట్ 25న తొలివిడత చార్జిషీటు దాఖలైంది. ఈ కేసు కర్ణాటక హైకోర్టులో బుధవారం మరోసారి విచారణ వచ్చింది. ప్రభుత్వ తరపు న్యాయవాది మన్మోహన్ హాజరై జైలు అధికారులకు లంచం ఇచ్చిన కేసులో శశికళ, ఇళవరసికి వ్యతిరేకంగా తుది చార్జిషీటు దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద సంబంధిత వ్యక్తులపై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. అవినీతి కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఈకేసుపై త్వరలో విచారణ ప్రారంభించనున్నట్లు సమాచారం. -
మెగా హీరోను వదలని యాక్సిడెంట్ కేసు.. త్వరలోనే ఛార్జ్షీట్
Sai Dharam Tej Bike Accident Case: CP To File Chargesheet Over His Rash Driving: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా సాయితేజ్పై ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. సైబరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో కమిషనర్ స్టీఫెన్ రవింద్ర మాట్లాడుతూ.. 'హీరో సాయిధరమ్ తేజ్కు జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి, అతడు కోలుకున్నాక 91 CRPC కింద నోటీసులు ఇచ్చాం. లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ వివరాలు ఇవ్వాలని కోరాం. కానీ అతడి నుంచి ఎలాంటి వివరణ రాలేదు. దీంతో త్వరలోనే సాయితేజ్పై ఛార్జ్షీట్ దాఖలు చేస్తాం' అని సీపీ వెల్లడించారు. కాగా కేబుల్ బ్రిడ్జి సమీపంలో సెప్టెంబర్10న సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇటీవలె ప్రమాదం నుంచి కోలుకున్న తేజ్ ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టాడు. -
పాక్ కేంద్రంగానే ‘దర్భంగ’ పేలుడు.. కుట్ర పన్నింది ఇలా...
సాక్షి, హైదరాబాద్: బిహార్లోని దర్భంగ రైల్వేస్టేషన్లో ఈ ఏడాది జూన్ 17న జరిగిన ఐఈడీ పేలుడుకు పాకిస్తాన్ కేంద్రంగానే కుట్ర సాగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. లష్కరే తోయిబా ప్రోద్బలంతో యూ పీవాసి ఇక్బాల్ ఖానా (ప్ర స్తుతం లాహోర్లో ఉంటున్నాడు) ఈ కుట్రను అమలు చేసినట్లు నిర్ధారించింది. ఈ మేరకు గురువారం పట్నాలోని ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరు హైదరాబాదీలతో పాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేసింది. పేలుడుకు కుట్ర పన్నింది ఇలా... ► ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లా ఖైరాన ప్రాంతానికి చెందిన మహ్మద్ నాసిర్ ఖాన్ హై దరాబాద్ మల్లేపల్లిలోని భారత్ గ్రౌండ్స్ సమీపంలో ఉండేవాడు. అతని సోదరుడు ఇమ్రాన్ మాలిక్ స్వస్థలంలో ఉండేవాడు. ► ఖైరాన ప్రాంతానికే చెందిన మహ్మద్ ఇక్బాల్ ఖానా 1993 నుంచి నకిలీ నోట్ల చెలామణి చేస్తున్నాడు. అతనిపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో పాక్కు పారిపోయి లాహోర్లో ఉంటున్నాడు. ► అక్కడి నుంచే ఐఎస్ఐ సహకారంతో నకిలీ నోట్ల చెలామణితోపాటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. లష్కరే తోయిబాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ► ఇక్బాలే కొన్నాళ్ల క్రితం ఆన్లైన్ ద్వారా ఇమ్రాన్ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. స్థానిక పదార్థాలతో పేలుళ్లు జరపడం ఎలా? అని ఆన్లైన్లో శిక్షణ ఇస్తూ యూ ట్యూబ్లోని కొన్ని వీడియోలు పంపాడు. ► గతంలో పాక్కు వెళ్లిన నాసిర్ అక్కడ ఉగ్రవాద శిక్షణ పూర్తి చేసి వచ్చాడు. బాంబుల తయారీ నుంచి గూఢచర్యం వరకు వివిధ అంశాల్లో అతను శిక్షణ పొందాడు. ► వేగంగా వెళ్లే రైళ్లలో అగ్నిప్రమాదాలు సృష్టించి భారీ ప్రాణనష్టం సృష్టించాలని ఇక్బాల్ చెప్పడంతో ఈ ఏడాది మేలో సిటీకి వచ్చిన ఇమ్రాన్ తన సోదరుడు నాసిర్ వద్ద ఆశ్రయం పొందాడు. చదవండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రాష్ట్రాలకు, కేంద్రం కీలక ఆదేశాలు సొంతంగా బాంబు తయారీ... దర్భంగా ఎక్స్ప్రెస్ను తగలబెట్టాలని నిర్ణయించుకొని చిక్కడపల్లి, హబీబ్నగర్లలోని దుకాణాల్లో కొన్న సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, పంచదార వినియోగించి మంటలు సృష్టించే బాంబు తయారు చేశారు. ► గాజు సీసాలోకి ఈ పదార్థాలను ఇంజెక్షన్ సిరంజిల ద్వారా నింపి 16 గంటల్లో పేలి జరిగి మంటలు చెలరేగేలా కుట్రపన్నారు. ► ఈ ఏడాది జూన్ 15న రెడీమేడ్ వస్త్రాల పార్శిల్లో ఈ సీసాను ఉంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి దర్భంగ వెళ్లే దర్భంగ ఎక్స్ప్రెస్లో దీన్ని బుక్ చేశారు. అయితే అదృష్టవశాత్తూ ఈ పేలుడు ఆలస్యమైంది. 17న దర్భంగ స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫామ్పై రైలు ఆగి పార్సిల్ను అన్లోడ్ చేశాక స్వల్ప పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. చదవండి: మిత్రుడితో తరుచూ ఫోన్లు.. ఇంటినుంచి పారిపోయే ప్రయత్నంలో.. ► దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ... ఇక్బాల్ ఖానా, నాసిర్, ఇమ్రాన్లతోపాటు వారికి పరోక్షంగా సహకరించిన యూపీవాసులు హాజీ సలీం, ఖఫీల్ అహ్మద్లను అరెస్టు చేసింది. ► సికింద్రాబాద్ పార్శిల్ ఆఫీస్లో ఈ అన్నదమ్ములు మహ్మద్ సూఫియాన్ పేరు తో ఇచ్చిన పాన్ కార్డు కాపీనీ ఇక్బాలే వాట్సాప్ ద్వారా పంపాడని ఎన్ఐఏ గుర్తించింది. -
అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్
యశవంతపుర: శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ అందాల యాంకర్, నటి అనుశ్రీ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. మంగళూరు సీసీబీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఆమె పేరును పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో శాండల్వుడ్ డ్రగ్స్ రాకెట్ బయటపడగా, అప్పట్లో ఆమెను విచారించిన సంగతి తెలిసిందే. ముఖ్య సమాచారాన్ని చార్జిషీట్లో ప్రస్తావించారు. అనుశ్రీ డ్రగ్స్ను అమ్మడంతో పాటు రూంకు తెచ్చేవారని ఆమె స్నేహితుడు కిశోర్ అమన్ శెట్టి చెప్పినట్లు తెలిపారు. తరుణ్, అనుశ్రీలు డ్రగ్స్ పార్టీలకు వెళ్లడంతో పాటు రూంకు తీసుకొచ్చేవారు. అనుశ్రీ బెంగళూరులో నృత్య సాధన చేస్తున్న సమయంలో డ్రగ్స్ సేవిస్తే ఖుషీగా డ్యాన్స్ చేయవచ్చని తోటివారితో చెప్పేది. అనుశ్రీ రియాలిటీ షోలో గెలిచిన సమయంలో తరుణ్ డ్రగ్స్ పార్టీ ఇచ్చాడు. నేను అలా చెప్పలేదే: అమన్శెట్టి.. అనుశ్రీ డ్రగ్స్ తీసుకొంటుందని తాను పోలీసుల విచారణలో చెప్పలేదని తాజాగా కిశోర్ అమన్శెట్టి ప్రకటించాడు. ఆయన మంగళూరులో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఆమెతో నాకు పరిచయం లేదు, 2009లో కుణియోణ బారా కన్నడ డ్యాన్స్ షోలో కలిశాను. తరువాత ఆమెను ఎప్పుడూ ఎక్కడా కలవలేదన్నారు. చార్జీషీట్లో పొందుపరిచిన ఆరోపణలను ఖండించారు. అనుశ్రీపై ఎలాంటి విరుద్ధ వ్యాఖ్యలు చేయలేదన్నారు. మత్తు పార్టీలు ఆగలేదు: ఇంద్రజిత్.. డ్రగ్స్ కేసులో నిందితుల మూత్రం, రక్తం పరీక్షిస్తే చాలదు. తల వెంట్రుకలను కూడా పరీక్షించాలని నిర్మాత, పాత్రికేయుడు ఇంద్రజిత్ లంకేశ్ డిమాండ్ చేశారు. ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలున్నవారందరూ మళ్లీ డ్రగ్స్ పార్టీలకు వెళ్తున్నారు. డ్రగ్స్ కేసు కర్ణాటకలో పెద్ద కుంభకోణం. అన్ని రంగాల ప్రముఖులు ఈ దందాలో ఉన్నారు. బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి అని ఆయన ఆరోపించారు. విశ్రాంత ఐపీఎస్ జోక్యం: సంబరగి.. ఒక రిటైర్డు ఐపీస్ అధికారి ప్రభావంతో డ్రగ్స్ కేసు దారి తప్పినట్లు సామాజిక కార్యకర్త ప్రశాంత సంబరగి బెంగళూరులో ఆరోపించారు. తరుణ్ అనే వ్యక్తిని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు, చార్జీషీట్లో అతని పేరును ఎందుకు పేర్కొనలేదు? అని ప్రశ్నించారు. బెంగళూరుకంటే మంగళూరులో డ్రగ్స్ మాత్రలు ఎక్కువగా దొరుకుతాయని కిశోర్ అమన్శెట్టి చెప్పాడన్నారు. అనుశ్రీ ఏమన్నారంటే.. తను ఏ తప్పు చేయలేదంటూ అనుశ్రీ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను బెంగళూరుకు 14 ఏళ్ల క్రితం బస్సులో వచ్చి చేరుకున్నా. సుమారు 12 ఏళ్ల కాలం పాటు హాస్టల్లో ఉన్నాను. ఆ తర్వాత నాటక రంగంలో ఆఫర్లు వచ్చాయి. నేను మంచిగా ఉన్నాను, కనుకనే ఇంత పెద్ద స్థాయికి ఎదిగాను. అయితే డ్రగ్స్ కేసులో విచారించడం బాధకు గురి చేసింది అన్నారు. ఇవీ చదవండి: ఆర్జీవీతో అశు బోల్డ్ ఇంటర్వ్యూ చూసిన ఆమె తల్లి రియాక్షన్ చూశారా! నానిలోనాకు బాగా నచ్చిన విషయం అదే : రీతూ వర్మ -
అంబానీ బాంబు బెదిరింపు కేసులో కీలక పరిణామం
ముంబై: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో నిండిన వాహనం లభించిన కేసుతో పాటు వాణిజ్యవేత్త మన్సుఖ్ హిరాన్ హత్య కేసులో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ)అభియోగాలను నమోదు చేసింది. మాజీ పోలీసు అధికారులు సచిన్ వాజే, ప్రదీప్ శర్మ, మరో ఎనిమిదిమందిపై అభియోగాలు నమోదు చేసిన పత్రాలను ప్రత్యేక కోర్టుకు శుక్రవారం సమర్పించింది. ఈ చార్జీషీటులో సచిన్ వేజ్, ప్రదీప్ శర్మ, వినాయక్ షిండే, నరేష్ గోర్, రియాజుద్దీన్ కాజీ, సునీల్ మానె, ఆనంద్ జాదవ్, సతీశ్ మోతుకూరి, మనీష్ సోని, సంతోష్ షెలార్ పేర్లు ఉన్నాయి. మరో కేసులో కూడా నిందితుడైన వినాయక్ షిండే పోలీసు శాఖ నుంచి సస్పెండ్ కాగా, కాజీ, మానెలను అరెస్ట్ చేసినప్పుడు వారు పోలీసు శాఖలోనే విధులు నిర్వహిస్తున్నారు. అరెస్టయిన వారంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. -
రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో ఛార్జ్ షీట్ దాఖలు
-
లాయర్ దంపతుల హత్య: విచారణ పూర్తి.. చార్జ్షీట్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద దంపతులైన గట్టు వామనరావు,నాగమణి హత్యలపై విచారణ వివరాలను తెలపాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా, తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తయిందని హైకోర్టుకు విన్నవించారు. అయితే, ఛార్జీషీట్ ఫైల్ చేసారా అన్న ప్రశ్నకు.. గత నెల 19న విచారణను పూర్తి చేసి మంథని లోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ ముందు చార్జ్షీట్ దాఖలు చేశామని ఏజీ తెలిపారు. ఈ అభియోగపత్రం (చార్జిషీట్)పై విచారణ ఈనెల 10 నుంచి మంథని కోర్ట్లో జరుగుతుందని ఏజీ పేర్కొన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యకేసును న్యాయస్థానం సుమోటోగా తీసుకుని విచారిస్తున్నసంగతి తెలిసిందే. చదవండి: ఏడాదిన్నరగా భార్యను, కూతుళ్లను ఇంట్లోనే నిర్భందించాడు! -
ఓటుకు కోట్లు కేసు..ఈడీ చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నాంపల్లి ఈడీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డిని ప్రధాన నిందితుడిగా, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ క్రిస్టియన్ సెల్ నేత హ్యారీ సెబాస్టియన్, రేవంత్ అనుచరుడు రుద్రశివకుమార్ ఉదయసింహ, జెరుసలేం మత్తయ్యతోపాటు వేం కృష్ణకీర్తన్లను నిందితులుగా పేర్కొంది. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డికి ఓటేయాలని, రూ.5 కోట్లు ఇస్తామని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టి.. రూ.50 లక్షలు అడ్వాన్స్గా ఇస్తూ రేవంత్, ఇతర నిందితులు ఏసీబీకి పట్టుబడ్డారని తమ దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. ఈ కేసులో వేం నరేందర్రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్ పాత్ర కూడా ఉన్నట్టు తేలడంతో ఆయన పేరునూ చార్జిషీటులో చేర్చినట్టు తెలిపింది. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఈడీ ప్రకటించింది. ఈ చార్జి షీటులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేరును కూడా పలుచోట్ల ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇంతకుముందే చార్జిషీట్లు దాఖలు చేసిన ఏసీబీ కూడా చంద్రబాబు పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూ చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియోలు వెలుగులోకి రావడం, ఆ గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కూడా ధ్రువీకరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఈడీ చార్జిషీటు దాఖలు చేయడం మరింత ఉత్కంఠగా మారింది. మహానాడు వేదికగా కుట్ర 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకున్నా కూడా.. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తమ పార్టీ తరఫున వేం నరేందర్రెడ్డిని పోటీలో పెట్టారు. ఎలాగైనా గెలవాలని, పలువురు ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపెట్టి ఓటు వేయించుకోవాలని కుట్రపన్నారు. అప్పట్లో టీడీపీ కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్రెడ్డికి కొనుగోళ్ల బాధ్యత అప్పగించారు. ఇందులోభాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు గాలం వేయాలని నిర్ణయించారు. టీడీపీ మైనార్టీ సెల్ నేత హ్యారీ సెబాస్టియన్, తెలుగు యువత నేత జిమ్మిబాబుల సాయంతో జేరుసలేం మత్తయ్యను కలిసి విషయం చెప్పారు. తర్వాత హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో జరిగిన టీడీపీ మహానాడుకు మత్తయ్యను తీసుకెళ్లారు. అక్కడ వేదిక వెనకాల ఉన్న గదిలో.. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డిలతో మత్తయ్య సమావేశమయ్యారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఒప్పిస్తే.. రూ.50లక్షలు ఇస్తామని మత్తయ్యను ప్రలోభపెట్టారు. స్టీఫెన్సన్ ఓటింగ్కు గైర్హాజరైతే రూ.3 కోట్లు, అనుకూలంగా ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామని బేరం పెట్టారు. రూ.50 లక్షలు కమీషన్ వస్తుందని ఆశపడ్డ మత్తయ్య.. ఈ విషయాన్ని స్టీఫెన్సన్కు చెప్పారు. (మత్తయ్య ఈ మొత్తం వ్యవహారాన్ని వాంగ్మూలం రూపంలో ఇటీవల ఈడీకి లిఖితపూర్వకంగా రాసిచ్చారు). ఇదంతా భారీ కుట్ర అని గుర్తించిన స్టీఫెన్సన్ వెంటనే ఏసీబీకి సమాచారం ఇచ్చారు. రేవంత్, ఆయన అనుచరులు 2015 మే 31న స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు అడ్వాన్స్గా ఇస్తుండగా ఏసీబీ రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. దీనిపై తొలుత టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. కానీ ఈ కుట్ర తాలూకు బాగోతం మొత్తం వీడియోలు, స్టీఫెన్సన్తో ‘మన వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూ చంద్రబాబు మాట్లాడిన ఆడియోలు వెలుగు చూడటం దేశవ్యాప్తంగా సంచనలనం సృష్టించింది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. పెద్ద మొత్తంలో డబ్బుల ఒప్పందాలు, సొమ్ము చేతులు మారడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా.. ప్రీవెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ 2002 కింద కేసు నమోదు చేసింది. 2019 ఫిబ్రవరి, మార్చి నెలల్లో రేవంత్రెడ్డి, ఉదయసింహా, వేం నరేందర్రెడ్డి, సెబాస్టియన్, స్టీఫెన్సన్ల వాంగ్మూలాలను నమోదు చేసింది. అడ్వాన్స్గా తెచి్చన రూ.50 లక్షలు ఎలా వచ్చాయి, మిగతా రూ.4.5 కోట్లు ఎక్కడ ఉంచారు, విదేశాల నుంచి డబ్బులు వచ్చాయా? అన్న అంశాలపై దర్యాప్తు చేసింది. ఏపీకి వెళ్లిపో.. ఏమీ కాదంటూ లోకేశ్ భరోసా! ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో పాత్రధారి అయిన జేరుసలేం మత్తయ్య.. ఈ కుట్రకు సంబంధించి ఇటీవలే ఈడీ అధికారులకు రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చారు. తనను ఎవరెవరు కలిశారు, ఎవరు డబ్బులు ఎర వేశారు, మొత్తం వ్యవహారం ఎలా జరిగిందన్నది వివరంగా వెల్లడించారు. మొత్తం కుట్రలో చంద్రబాబుదే మాస్టర్ మైండ్ అని.. అప్పట్లో తాను విజయవాడకు పారిపోవడానికి చంద్రబాబు కుమారుడు లోకేశ్ సూచనలే కారణమని బయటపెట్టారు. మత్తయ్య వాంగ్మూలంలో చెప్పిన ప్రకారం.. రేవంత్ అరెస్టు విషయం తెలియగానే జిమ్మిబాబు సాయంతో మత్తయ్య ఎన్టీఆర్ భవన్కి వెళ్లారు. అక్కడ చంద్రబాబు కుమారుడు లోకేశ్ను కలిశారు. నీకేమీ కాదని, వెంటనే విజయవాడ వెళ్లిపోవాలని మత్తయ్యకు లోకేశ్ అభయమిచ్చారు. అక్కడ టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, విజయవాడలో భద్రంగా ఉండొచ్చని చెప్పారు. ఈ సూచనల మేరకే మత్తయ్య విజయవాడ వెళ్లారు. అదే మహానాడు సమయంలో.. 2015 మహానాడు వేదికగానే ‘ఓటుకు కోట్లు’ కుట్ర జరిగింది. దీనికి సూత్రధారి చంద్రబాబేనని బయటపడటం సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూడా టీడీపీ మహానాడు వేడుకలు (ఆన్లైన్)లో జరుగుతుండగా.. ఈ వ్యవహారంలో ఈడీ చార్జిషీటు నమోదవడం ఆసక్తిగా మారింది. -
డ్రగ్స్ కేసు: 12 వేల పేజీల చార్జిషీట్
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్సీబీ) రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. డ్రగ్స్కు, బాలీవుడ్కు ఏమైనా లింకులున్నాయా? అన్న కోణంలో ఎన్సీబీ ప్రత్యేక విచారణ చేపట్టింది. ఈ క్రమంలో డ్రగ్స్ కేసు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. కొన్ని నెలలుగా విచారణ ముమ్మరం చేసిన ఎన్సీబీ శుక్రవారంనాడు ముంబైలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ చార్జిషీటులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్తో పాటు 33 మంది నిందితుల పేర్లను ప్రస్తావించింది. 200 మంది సాక్ష్యుల నుంచి సేకరించిన సమాచారాన్ని జత చేస్తూ 12 వేల పేజీలకు పైగా ఉన్న చార్జిషీటును కోర్టుకు సమర్పించింది. కాగా గతేడాది జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడగా సెప్టెంబర్ 8న ఎన్సీబీ అధికారులు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ను అరెస్ట్ చేశారు. తర్వాతి నెలలోనే వీళ్లిద్దరూ బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ తర్వాత ఈ డ్రగ్స్ కేసుకు బీటౌన్లో లింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సెలబ్రిటీలు దీపిక పదుకునే, శ్రద్దా కపూర్, ఫిరోజ్ నదియావాలా సహా పలువురి పేర్లు తెర మీదకు రావడం అప్పట్లో సంచలనంగా మారింది. చదవండి: సుశాంత్ వదిలేసుకున్న బ్లాక్బస్టర్ సినిమాలు! భావోద్వేగం: సుశాంత్ రాసుకున్న లేఖ వైరల్ -
ఢిల్లీ అల్లర్లు : చార్జిషీట్లో పలువురు ప్రముఖులు
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలతో అట్టుడికిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోసుకుంది. ఈ కేసులో సహ కుట్రదారులుగా పలువురు ప్రముఖులును చేర్చడం తాజాగా సంచలనం రేపింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రఖ్యాత ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ , డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రాయ్ పేర్లను సప్లిమెంటరీ చార్జిషీట్లో ఢిల్లీ పోలీసులు చేర్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరో రెండు రోజుల్లో (సెప్టెంబరు,14న) ప్రారంభం కానున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం జాఫ్రాబాద్ ఘర్షణలో జేఎన్యు విద్యార్థులు దేవంగన కాలిత, నటాషా నార్వాల్, జామియా మిలియా ఇస్లామియాకు చెందిన గుల్ ఫిషా ఫాతిమా వాంగ్మూలం ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చారు. వీరితోపాటు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్ ముస్లిం సమాజానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్ వంటి కొందరు నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు చార్జిషీట్ పేర్కొంది. ఢిల్లీలో అల్లర్లు రేపేందుకు కొందరు కుట్ర పన్నారని ఫాతిమా తెలిపారనీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని తనతో చెప్పారని ఫాతిమా అంగీకరించారని తెలిపింది. ఇందులో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ పాత్ర ఉందని, ఆయనే అల్లర్లకు పథకం రూపొందించారన్న ఫాతిమా మాటలను ఉటంకిస్తూ ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ పొందుపర్చారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన హింసలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. -
నిధుల్లేక పురపాలికలు నిర్వీర్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనపై బీజేపీ చార్జ్షీట్ విడుదల చేసింది. ఆరేళ్లలో టీఆర్ఎస్ పాలనలో పురపాలికలు నిధులు లేక పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఆరోపించింది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ మాయమాటలు నమ్మి ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లు వేశారని, ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తూ బీజేపీ ముందుకు వెళ్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కనీసం ఈ ఎన్నికల్లోనైనా మోసపోకుండా ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నామన్నారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ వైఫల్యాలపై 52 అంశాలతో రూపొందించిన చార్జ్షీట్ను బీజేపీ రాష్ట్ర కార్యాయంలో గురువారం లక్ష్మణ్ విడుదల చేశారు. అలాగే పార్టీ పాటల సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం టీఆర్ఎస్ అండతోనే ఇప్పుడు భైంసా వరకు వెళ్లిందని, ఎంఐఎం అజెండాను అమలు చేస్తున్న టీఆర్ఎస్కు ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయవద్దన్నారు. ఎంఐఎంతో లాలూచీ లేకపోతే భైంసాలో టీఆర్ఎస్ అభ్యర్థు«లను ఎందుకు పోటీ లో ఉంచలేదని, ఒవైసీకి కేసీఆర్ లొంగిపోయారా? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే సమస్య లేదని, కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేయాలన్నారు. పట్టణాలను డల్లాస్లా తయారు చేస్తామని, హుస్సేన్సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా చేస్తామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని లక్ష్మణ్ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులే పట్టణాలను ఆదుకుంటున్నది వాస్తవమా.. కాదా.. అన్నది కేటీఆర్ చెప్పాలన్నారు. -
పీఎంసీ స్కాం, భారీ చార్జిషీట్
సాక్షి, ముంబై: సంచలనం రేపిన పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణంలో చార్జిషీటు దాఖలైంది. సుమారు రూ.6,700 కోట్ల కుంభకోణంలో ఐదుగురిపై 32వేల పేజీల చార్జిషీట్ను ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం శుక్రవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించింది. మోసం, మోసం, సాక్ష్యాలను నాశనం చేయడం, తప్పుడు ప్రచారంతో మభ్యపెట్టడం వంటి ఆరోపణలతో నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. చార్జిషీట్లో బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ థామస్, మాజీ చైర్మన్ వర్యమ్ సింగ్, బ్యాంక్ మాజీ డైరెక్టర్ సుర్జిత్ సింగ్ అరోరాతో పాటు హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్డిఐఎల్) ప్రమోటర్లు రాకేశ్ వాధవన్, ఆయన కుమారుడు సారంగ్ వాధవన్ కూడా ఉన్నారు. బ్యాంకులో ఖాతాదారులతో సహా 340 మంది సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 కింద పోలీసులు కీలకమైన నలుగురు సాక్షుల వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లో పీఎంసీ బ్యాంక్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు, ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఐదుగురితో పాటు, పోలీసులు మరో ఏడుగురు బ్యాంకు అధికారులను కూడా అరెస్టు చేశారు. అయితే వీరిపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. పీఎంసీ బ్యాంకు ఇచ్చిన మొత్తం రుణాల్లో 75 శాతం దివాలా తీసిన రియల్ ఎస్టేట్ సంస్థ హెచ్డీఐఎల్ కే వెళ్లాయి. హెచ్డీఐల్ ప్రమోటర్లు, తప్పుడు పత్రాలతో 21 వేల ఫేక్ ఖాతాల ద్వారా పీఎంసీ నుంచి రుణాలను పొందారన్నది ప్రధాన ఆరోపణ. బ్యాంకు వార్షిక నివేదికల్లో సైతం హెచ్డీఐఎల్కు ఇచ్చిన రుణాల వివరాలను పొందుపరచలేదు. అలాగే దివాలా తీసిన తరువాత కూడా ఆ సంస్థకు పీఎంసీ రుణాలను మంజూరు చేస్తూ పోయింది. -
సమతపై అత్యాచారం, హత్య: చార్జిషీట్ దాఖలు
సాక్షి, ఆసిఫాబాద్: సమతను అత్యాచారం చేశాక గొంతుకోసి చంపారని పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు. అలాగే నిందితుల వీర్యానికి సంబంధించిన డీఎన్ఏ నివేదిక కోర్టుకు సమర్పించారు. శనివారం కుమురం భీం జిల్లా పోలీసులు ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 44 మంది సాక్షులను గుర్తించగా, ఏ1గా షేక్బాబా, ఏ2 షేక్ షాబొద్దీన్, ఏ3 షేక్ ముఖ్దూమ్గా పేర్కొన్నారు. ఇక కేసు విచారణ సోమవారం నుంచి రోజువారీగా కొనసాగనుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ని ఓ గ్రామానికి చెందిన దళిత మహిళ గత నెల 24న కుమురం భీం జిల్లా లింగాపూర్ మండ లం ఎల్లాపటార్లో అత్యాచారం, హత్యకు గురై న విషయం తెలిసిందే. 27న నిందితులను అరె స్టు చేశారు. దిశ ఘటనకు మూడు రోజుల ముం దు ఈ దారుణం జరిగింది. అయితే దిశ తరహా లో మొదట ప్రాధాన్యత దక్కకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తర్వాత ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. -
మోహన్లాల్కు భారీ షాక్
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్కు అటవీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. తన ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతపు కళాఖండాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఎర్నాకుళంలోని కోర్టులో అతనిపై చార్జిషీట్ దాఖలు చేసింది. పెరుంబవూరులోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం అటవీ శాఖ ఈ చార్జ్షీటు నమోదు చేసింది. కోదనాడ్ రేంజ్లోని మేకప్పల ఫారెస్ట్ స్టేషన్లో మోహన్లాల్పై 2012లో క్రిమినల్ కేసు నమోదైన ఏడు సంవత్సరాల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. కేసు నమోదైన అనంతరం ఈ కళాఖండాలను కలిగి వుండేందుకు ధృవీకరణ పొందినట్టు కోర్టుకు తెలిపారు. కె కృష్ణన్ అయ్యర్ అనే వ్యక్తినుంచి 65వేల రూపాయలకు కొనుగోలు చేశానని మోహన్లాల్ వివరణ ఇచ్చారు. అయితే అతనికి ఈ అనుమతి ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ ఎర్నాకుళంకు చెందిన పౌలోస్ అనే పిటిషనర్ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం దంతపు కళాఖండాలను ఉంచుకునేందుకు మోహన్లాల్కు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్లైఫ్) ఎటువంటి అనుమతి ఇవ్వలేదని కేరళ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో కోర్టుకు తెలిపింది. దీంతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3) తో మోహన్లాల్పై అభియోగాలు మోపవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు. కాగా 2012లో ఆయన ఇంట్లో సోదాలు జరిపిన ఐటీ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మోహన్లాల్తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ను పెరుంబవూర్లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట దాఖలు చేశారు. భారతీయ వన్య ప్రాణి చట్టంలోని సెషన్ 44(6) కింద కేసు నమోదు చేసి, మోహన్లాల్ను ప్రధాన నిందితుడుగా చేర్చిన సంగతి తెలిసిందే. -
ఆన్లైన్లో క్రిమినల్ జాబితా
సాక్షి, కరీంనగర్: జ్యుడీషియరీలో ఈ–కోర్టు ఆన్లైన్ ద్వారా ఇప్పటికే రోజువారి కేసుల పట్టిక, కేసుల వివరాలు, తీర్పులు అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి పోలీసులు నమోదు చేసే కేసుల పూర్తి జాబితా కోర్టులకు అందుబాటులోకి తెస్తూ ఈ–పైలట్ ప్రాజెక్టును తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించనున్నారు. పోలీస్స్టేషన్లో వారు నమోదు చేసే క్రిమినల్ కేసులకు సంబంధించి మొదట ఎఫ్ఐఆర్, ఇతర పత్రాలు, చార్జిషీట్ను ఐసీజేఎస్ (ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం) ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేస్తారు. ఇలా ఎంటర్ చేసిన డాటా ఈ కోర్ట్సుకు రాగా సీఐఎస్( కేసు ఇన్ఫర్మేషన్ సిస్టం) నుంచి కోర్టువారు వారికి సంబంధించిన పోలీస్స్టేషన్ల వారీగా డౌన్లోడ్ చేసుకుంటారు. ప్రస్తుతం ఈ పద్ధతిలో పోలీసు వారు ఎఫ్ఐఆర్, చార్జీషీట్ వివరాలు మాత్రమే పొందుపరిచే వీలు ఉంది. కాగా వాటి ధ్రువపత్రాలను కోర్టులో పాత పద్ధతిలో దాఖలు చేయాల్సి ఉంటుంది. అలా కోర్టులో దాఖలు చేసిన పలు కేసు పత్రాలను ఆన్లైన్లో పంపిన వివరాలతో పోల్చి చూసుకుని సరిగ్గా ఉంటే మొదట ఎఫ్ఆర్ఐ నెంబర్ అనంతరం సీసీ నెంబర్ వస్తుంది. దీంతో సమయం వృథా కాకుండా ఎప్పటికపుడు తెలుస్తుంది. దేశంలోనే మొదటిసారిగా ఐసీజేఎస్ ప్రాజెక్టు అమలుకు తెలంగాణను ఎంచుకోగా అందులో మొదటగా వరంగల్ జిల్లాను ఎంపిక చేసి 2018 డిసెంబర్లో ప్రారంభించారు. మొదట ఒక పోలీస్స్టేషన్ను ఎంచుకొని ప్రారంభించగా 9వ నెలలో 42 పోలీస్స్టేషన్లకు విస్తరించారు. అక్కడ క్రిమినల్ కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ చార్జిషీట్లను మాత్రమే పొందుపర్చడం కోర్టులు వాటిని తీసుకోవడం మాత్రమే జరుగుతోంది. దేశంలో రెండో పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ చార్జిషీట్తోపాటు సమన్లు, వారంట్ నమోదు నుంచి అమలు విధానంను ఎన్ఎస్టీఈపీ (నేషనల్ సర్వీస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్) ద్వారా ప్రవేశపెట్టనున్నారు. దీంతో సమన్లు, వారంట్లు జారీ నుంచి అమలు వరకు ఎప్పటికపుడు ఆన్లైన్ ట్రాకింగ్ ద్వారా సమాచారం తెలుసుకునే వీలు ఉంటుంది. ఈ క్రిమినల్ కేసుల వివరాలు ఆన్లైన్ విధానం ప్రస్తుతం పోలీసులకు కోర్టులకు మాత్రమే పరిమితం కాకుండా త్వరలో వీటికి అనుసంధానమైన జైళ్లు, ఫోరెన్సిక్, ప్రాసిక్యూషన్, ఫింగర్ ప్రింట్, వుమెన్అండ్ చైల్డ్ శాఖలకు విస్తరించనున్నారు. ఆన్లైన్లో కేసుల వివరాలు మాత్రమే పొందుపర్చనుండగా త్వరలో వాటికి సంబంధించిన పత్రాలను పొదుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని పోలీసు లు, కోర్టు వారు మాత్రమే ప్రస్తుతం చేసుకునే వీలు ఉండ గా కొద్దిరోజుల్లో అందరికీ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. నేడు ప్రాజెక్టు ప్రారంభం.. సోమవారం ఉదయం 9.45 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ వీడియో కాన్షరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. జిల్లా కోర్టులో జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి, ఐసీజేఎస్ మాస్టర్ ట్రైనర్ హుజూరాబాద్ జూనియర్ సివిల్ జడ్జి రాధిక, సీపీ కమలాసన్రెడ్డి ఎంపిక చేసిన కరీంనగర్ త్రీటౌన్ పోలీస్స్టేషన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో అందుబాటులో ఉండనున్నారు. ఐసీజేఎస్ గురించి మొదట మాస్టర్ ట్రైనర్ రాధిక వివరించనుండగా, చార్జిషీట్ను సీపీ కమలాసన్రెడ్డి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత దానిని చీఫ్ జస్టిస్ స్వీకరించి ప్రారంభించనున్నారు. -
‘హాజీపూర్’ కేసులో చార్జ్షీట్ దాఖలు
సాక్షి, బొమ్మలరామారం(యాదాద్రి) : పెనుసంచలనం సృష్టించిన హాజీపూర్ ముగ్గురు బాలికల వరుస హత్యల కేసు నిందితుడు సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్రెడ్డి పై పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ఈ మేరకు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఏసీపీ, కేసు విచారణ అధికారి భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. సంచలన్మాకమైన ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసులలో 90 రోజుల నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేసినట్లు డీసీపీ నారాయణరెడ్డి విలేకరులకు తెలిపారు. ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న మర్రి శ్రీనివాస్రెడ్డిని శిక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. 90 రోజుల తరువాత తెరపైకి హత్యల కేసులు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలను కిరాతకుడు మర్రి శ్రీనివాస్రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన సంఘటనలు వెలుగు చూసిన విషయం విధితమే. ఏప్రిల్ నెలలో మర్రి శ్రీనివాస్రెడ్డి చేతిలో పాములు శ్రావణి హత్యకు గురైన తర్వాత తెట్టె బావిలో ఆమె శవాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్రెడ్డిని అదుపులో తీసుకొని విచారించారు. ఈ ఘటన అనంతరం తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనల హత్యలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణి అత్యాచారం, హత్య కేసులోనే పోలీస్ కస్టడీలో ఉన్న శ్రీనివాస్రెడ్డిని కోర్టుకు రిమాండ్ చేశారు. మరో రెండు దారుణాలు వెలుగులోకి రావడంతో ఇద్దరు బాలికల అత్యాచారం, ఆపై హత్య ఘటనలపై యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉ న్న శ్రీనివాస్రెడ్డిపై బుధవారం నాటికి దర్యాప్తు పూర్తి చేసి చార్జ్షీట్ను దాఖలు చేశారు. ఉరి శిక్షపడేనా ముగ్గురు బాలికలపై దారుణాలకు ఒడిగట్టిన సైకో మర్రి శ్రీనివాస్రెడ్డికి ఉరి శిక్షపడితేనే నేరాలకు పాల్పడే వ్యక్తులకు తగిన గుణపాఠం కలుగుతుందని గ్రామస్తుల ప్రధాన డిమాండ్. ఈ మేరకు అమరణ నిరాహార దీక్షలు, ఆందోళనలు సైతం చేశారు. బాలికల హత్య కేసులలో దర్యాప్తు పూర్తయిందని నిందితుడికి ఎలాంటి శిక్ష పడుతుందోనని హాజీపూర్ గ్రామంతోపాటు మండలంలో తీవ్ర చర్చ జరుగుతోంది. -
బీజేపీ బాటలోనే కాంగ్రెస్ సర్కార్!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్లోని ఆల్వార్లో గోరక్షకుల దాడిలో మరణించిన పెహ్లూ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులపైనే పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఖండించిన విషయం తెల్సిందే. గోరక్షకుల పేరిట దేశంలో ఎక్కడా మూక దాడులు, హత్యలు జరిగినా తాము తీవ్రంగా ఖండిస్తామని, అలాంటి దాడులకు తమ పార్టీ పూర్తి విరుద్ధమని కూడా గెహ్లాట్ చెప్పారు. పెహ్లూ ఖాన్ విషయంలో ఆయన చెప్పిందీ పూర్తిగా అబద్ధం. 2017, ఏప్రిల్లో గోమాంసం ఫ్రిజ్లో దాచుకున్నారన్న కారణంగా పెహ్లూఖాన్ ఇంటిపై గోరక్షకులు దాడిచేసి ఆయన్ని తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బల కారణంగా రెండు రోజుల తర్వాత పెహ్లూఖాన్ మతిచెందారు. అప్పుడు స్థానిక పోలీసులు ఆయనపై ‘రాజస్థాన్ బొవైన్ యానిమల్స్ (ప్రొహిబిషన్ స్లాటర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ టెంపరరీ మైగ్రేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్) యాక్ట్–1995’ పెహ్లూఖాన్, ఆయన ఇద్దరి కుమారులపై కేసు పెట్టారు. హంతకులను వదిలిపెట్టి బాధితులపై కేసు దాఖలు చేయడం ఏమిటంటూ పత్రికల్లో, సోషల్ మీడియాలో గోల రేగడంతో రెండు రోజుల అనంతరం, అంటే ఏప్రిల్ ఐదవ తేదీన పెహ్లూఖాన్ మరణ వాంగ్మూలంలో పేర్కొన్న ఆరుగురు వ్యక్తులపై పోలీసులు హత్య కేసు దాఖలు చేశారు. వారిని అరెస్ట్ చేశారు. వారంతా బజరంగ్దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అవడంతో వెంటనే బెయిల్పై విడుదలయ్యారు. ఇప్పటికీ స్వేచ్ఛగానే తిరుగుతున్నారు. పెహ్లూ ఖాన్పై దాడిని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ 2018, డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతనే పోలీసులు పెహ్లూఖాన్, ఇద్దరు కుమారులపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ఇదే విషయమై ఇటీవల పత్రికల్లో వార్తలు రావడంతో అశోక్ గెహ్లాట్ ఖండించారు. ఇదే విషయమై అక్కడి స్థానిక పోలీసులను వాకబు చేయగా, చార్జిషీటు దాఖలు చేసేనాటికి పెహ్లూ ఖాన్ పేరు అందులో ఉండిందని, చనిపోయిన వ్యక్తి పేరును పెట్టడం భావ్యం కాదనే ఉద్దేశంతో తొలగించామని చెప్పారు. అయితే ఆయన ఇద్దరి కుమారుల పేర్లు ఇప్పటికీ ఉన్నాయని వారు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి జిల్లాకో గోరక్షణ శాలను ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక కూడా నాటి బీజేపీ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ పార్టీ వ్యవరిస్తున్నట్లు కనిపిస్తోంది. -
జకీర్ నాయక్కు మరో భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. 2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఉగ్రదాడికి ప్రేరేపించాడన్న ఆరోపణలతో చార్జ్ షీట్ నమోదు చేసింది. అలాగే అతనిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశామని ముంబై కోర్టులో దాఖలు చేసిన ఫైలింగ్లో ఈడీ వెల్లడించింది. 22మందికి మృతికి కారణమైన జకీర్కు సంబంధించి మొత్తం రూ.193 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్టు ఈడీ తెలిపింది. అతని కుటుంబ సభ్యులనుంచి నుంచి రూ .73.12 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్ చేసినట్టు కోర్టుకు తెలిపింది. ఇప్పటికే రూ .50.46 కోట్ల ఆస్తులను ఎటాచ్ చేసిన ఈడీ చార్జిషీట్ను నమోదు చేసినట్టు తెలిపింది. దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీ పెట్టుబడులు పెట్టాడని ఈడీ ఆరోపించింది. అలాగే దుబాయ్లోనని ముఖ్యమైన ప్రదేశంలోఒక పెద్ద భవనాన్ని నిర్మించతలపెట్టాడని పేర్కొంది. దీంతో పాటు చెన్నైలోని ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్, ముంబై, పూణెలలో అతి ఖరీదైన ఫ్లాట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆస్తులను కలిగి వున్నాడని ఈడీ తెలిపింది. కాగా ఉగ్రవాదులతో సంబంధాలు, మనీలాండరింగ్ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న జకీర్ నాయక్పై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది. ఇటీవల శ్రీలంలో రాజధాని కొలంబో వరుస పేలుళ్ల ఘటనలో జకీర్ నాయక్ ప్రమేయం అంశాన్ని ఎన్ఐఏ పరిశీలిస్తోంది. మరోవైపు దుబాయ్ కేంద్రంగా ప్రసారాలు జరుగుతున్న జకీర్ నాయక్కు చెందిన పీస్ టీవీలో తన బోధనల ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పీస్ టీవీని శ్రీలంకలో నిషేధించారు. ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్లు ఈ ఛానెల్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
నీరవ్ మోదీకి త్వరలోనే అరెస్ట్ వారెంట్ ?
సాక్షి,ముంబై: పీఎన్బీ కుంభకోణంలో కీలక నిందితుడు, ఆర్థిక నేరగాడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజా ఛార్జ్షీట్ను దాఖలుచేసింది. లండన్లో స్వేచ్ఛగా చక్కర్లు కొడుతున్న మోదీ వీడియో రేపిన సంచలనం నేపథ్యంలో ఈడీ మరో చార్జి షీటును దాఖలు చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద అనుబంధ చార్జిషీట్గా నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా నీరవ్ భార్య అమి మోదీను ఇందులో చేర్చారు. ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం దీన్ని దాఖలు చేసింది. దాంతోపాటు అదనపు ఆధారాలను కూడా సమర్పించినట్లు అధికారులు ఈడీ అధికారులు వెల్లడించారు. అంతేకాదు సీబీఐ, ఈడీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం త్వరలోనే లండన్ బయలు దేరనుందని తెలుస్తోంది. అలాగే మోదీని దేశానికి తిరిగి రప్పించడానికి సంబందించిన నోటిషికేషన్ను వెస్ట్మినిస్టర్ మాజిస్ట్రేట్ కోర్టుకు పంపినట్టు బ్రిటన్ హోం శాఖ అధికారులు ధృవీకరించారు. దీని పరిశీలన అనతరం అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని తెలిపారు. కాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)కు సుమవారు 14వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ లండన్కు పారిపోయాడు. లండన్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న మోదీ అక్కడ వజ్రాల వ్యాపారం కూడా చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం బ్రిటిష్ మీడియా విడుదల చేసిన వీడియో ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
అవకాశం రాగానే దాడి చేశాడు...
-
జగన్ను చంపడమే శ్రీనివాసరావు లక్ష్యం
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను చంపాలన్న ఉద్దేశంతోనే ఆయనపై శ్రీనివాసరావు అలియాస్ చంటి కత్తితో దాడికి పాల్పడ్డారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తేల్చింది. జగన్ను అంతమొందించాలనే మెడపై పొడిచేందుకు శ్రీనివాసరావు ప్రయత్నించాడని, ఈ ప్రక్రియలో జగన్కు తన ఎడమ చేయి పై భాగంలో గాయమైందని స్పష్టం చేసింది. విశాఖపట్నం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్లోకి వెళ్లేందుకు సాధారణ ప్రజానీకానికి అనుమతి ఉండదని, అందువల్ల నిందితుడు సెల్ఫీ పేరుతో లోనికి ప్రవేశించాడని తెలిపింది. జగన్పై దాడి చేసేందుకు శ్రీనివాసరావు సరైన సమయం కోసం ఎదురు చూశాడని వివరించింది. ముందస్తు పథకంలో భాగంగానే 2018 జనవరిలో కోడి పందేల సందర్భంగా తన ఊరికి సమీపంలో కత్తిని సంపాదించాడని పేర్కొంది. ఈ విషయాలన్నింటినీ జనవరి 12 నుంచి 18 వరకు తాము చేపట్టిన విచారణలో శ్రీనివాసరావు స్వయంగా వెల్లడించాడని ప్రత్యేక కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. శ్రీనివాసరావు చర్యలు పౌర విమానయాన చట్టంలోని సెక్షన్ 3ఏ(1)(ఏ) కింద చట్ట వ్యతిరేక కార్యకలాపాల పరిధిలోకి వస్తాయంది. అంతేకాక జగన్పై హత్యాయత్నానికి పాల్పడం ద్వారా ఐపీసీ సెక్షన్ 307 కింద కూడా నేరానికి పాల్పడ్డారంది. ఈ నేరాలను విచారణ నిమిత్తం స్వీకరించాలని కోర్టును కోరింది. పౌర విమానయాన చట్టం కింద శ్రీనివాసరావును ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేశామని తెలిపింది. అనుమతి రాగానే ఆ విషయాన్ని కోర్టుకు నివేదిస్తామంది. జగన్ను చంపాలన్న కుట్ర ఎవరిది? ఎవరి ప్రేరణతో శ్రీనివాసరావు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు? తదితర అంశాలపై సీఆర్పీసీ సెక్షన్ 173(8) కింద దర్యాప్తును కొనసాగిస్తామని కోర్టుకు నివేదించింది. ఇలా అన్ని అంశాలను క్రోడీకరిస్తూ జనవరి 23న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ కేసు ప్రధాన దర్యాప్తు అధికారి మహ్మద్ సాజిద్ ఖాన్ చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షుల వివరాలు, సేకరించిన డాక్యుమెంట్లను జత చేశారు. ఈ చార్జిషీట్కు ప్రత్యేక కోర్టు ప్రొవిజినల్ క్రిమినల్ నెంబర్(పీఆర్సీ) కేటాయించాల్సి ఉంది. అనుబంధాలను మినహాయిస్తే, ఈ చార్జిషీట్ 9 పేజీలుంది. జగన్ రాకపోకలపై కన్ను... శ్రీనివాసరావు విమానాశ్రయంలో తిరిగేందుకు ఫ్యూజన్ ఫుడ్స్ యాజమాన్యం ఎయిర్పోర్ట్ అధికారులకు దరఖాస్తు చేసింది. ఎంట్రీ పాస్ను అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. ఈ పాస్ కోసం దరఖాస్తు చేసినప్పుడు శ్రీనివాసరావు అనేక కీలక విషయాలను దాచి పెట్టాడు. తనపై కేసు విషయాన్నీ మరుగునపెట్టాడు. దీని గురించి అధికారులూ విచారణ చేయలేదు. మరోవైపు ఉత్తరాంధ్రలో జగన్ చేసిన పాదయాత్రను శ్రీనివాసరావు చాలా జాగ్రత్తగా గమనిస్తూ వచ్చాడు. అలాగే విశాఖ విమానాశ్రయం నుంచి ఆయన రాకపోకలను కూడా పరిశీలించాడు. ప్రతివారం హైదరాబాద్ వెళ్లేందుకు జగన్ విశాఖ విమానాశ్రయానికి వచ్చేవారు. ఈ సమయంలోనే జగన్పై దాడి చేయాలని శ్రీనివాసరావు ప్రణాళికలు రచించారు. కోడి పందేలకు ఉపయోగించే కత్తిని ఇందుకోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. తన ఈ ప్రణాళికను అమలు చేసేందుకు వైఎస్సార్ సీపీ వారితో మాట్లాడి జగన్తో తనకు సెల్ఫీ తీసుకునే అవకాశం ఇప్పించేలా చేయాలని ఫ్యూజన్ ఫుడ్స్లో క్యాషియర్గా పనిచేస్తున్న యువతిని అడిగాడు. అక్టోబర్ 25న జగన్ విశాఖ విమానాశ్రయం వస్తున్నారని, ఆ రోజున సెల్ఫీ తీసుకోవచ్చునని ఆ యువతి శ్రీనివాసరావుకు చెప్పింది. ఆరోజున విమానాశ్రయం చేరుకున్న జగన్ నేరుగా వీఐపీ లాంజ్లోకి వెళ్లారు. ఆయన వెంట పీఏతో పాటు పార్టీ నేతలు కూడా ఉన్నారు. కొద్దిసేపటి తరువాత ఫ్యూజన్ ఫుడ్స్ సిబ్బంది జగన్, ఇతర నేతలకు కాఫీ, టీ అందించారు. అవకాశం రాగానే దాడి చేశాడు... శ్రీనివాసరావు ఫ్యూజన్ ఫుడ్స్ యూనిఫాం ధరించి, వీఐపీ లాంజ్లోకి అడుగుపెట్టే సమయంలో కత్తిని గుర్తించకుండా ఉండేందుకు చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్లాడు. జగన్కు ఎడమ వైపు నిల్చున్నాడు. సమయం రాగానే చంపేందుకు ఆయన మెడపై కత్తితో దాడికి ప్రయత్నించారు. ఈ ప్రక్రియలో జగన్ ఎడమ చేయికి గాయమైంది. ఆ వెంటనే ప్రొటోకాల్ అధికారులు, స్థానిక పోలీసులు, సీఐఎస్ఎఫ్ అధికారులు లాంజ్లోకి వచ్చి శ్రీనివాసరావును పట్టుకుని విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ సెక్యూరిటీ హోల్డ్ ఏరియా(ఎస్హెచ్ఏ) వైపు తీసుకెళ్లారు. ఈ విషయాలన్నింటినీ శ్రీనివాసరావు మా ఇంటరాగేషన్లో వెల్లడించారు. 3.5 సెంటీమీటర్ల లోతుగా గాయం... దాడి తరువాత జగన్ విమానాశ్రయంలో ఉన్న అపోలో హెల్త్ డెస్క్ డాక్టర్ వద్ద చికిత్స తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడికి చేరుకోగానే జగన్ నేరుగా సిటీ న్యూరో సెంటర్కు వెళ్లారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్సను అందించారు. 3.5 సెంటీమీటర్ల లోతుగా గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఆ మేర చికిత్స అందించి, 26వ తేదీ మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు. శ్రీనివాసరావు తన చర్యల ద్వారా పౌర విమానయాన చట్టం కింద నిర్ధేశించిన నేరాలకు పాల్పడ్డారని చార్జీషీట్లో ఎన్ఐఏ పేర్కొంది జగన్పై హత్యాయత్నం కేసు 8కి వాయిదా విజయవాడ లీగల్: జగన్పై హత్యాయత్నం కేసు విచారణను ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం పూర్తి అదనపు ఇన్చార్జి జడ్జి అచ్యుత పార్థసారథి ఈ నెల 8కి వాయిదా వేశారు. నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెమోలపై కౌంటర్ అండ్ వాదనల నిమిత్తం న్యాయమూర్తి వాయిదా వేశారు. -
కన్నయ్య కుమార్పై 1200 పేజీల ఛార్జ్షీట్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ (జేఎన్యూ) విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్పై ఛార్జ్షీట్ నమోదైంది. దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు 1200 పేజీలతో కూడిన అభియోగ పత్రాన్ని సోమవారం దాఖలు చేశారు. కన్నయ్య కుమార్తో పాటు విద్యార్థి సంఘం నాయకులు ఉమర్ ఖలీద్, అనీర్బన్ బట్టాచార్య పేర్లు కూడా ఛార్జ్షీట్లో ఉన్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ వెల్లడించారు. దేశద్రోహం(124ఎ), క్రిమినల్ కుట్ర(120బీ), అలర్లకు ప్రేరేపణ(147), అనుమతి లేకుండా సమావేశం కావడం(143) వంటి సెక్షన్ల ద్వారా వారిపై అభియోగాలు నయోదు చేశారు. పాటియాల హౌస్ కోర్టు దీనిపై మంగళవారం విచారణ చేపట్టనుంది. పార్లమెంట్పై దాడి ఘటనలో సూత్రధారి అప్జల్ గురుకు ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ 2016 ఫిబ్రవరి 9న కన్నయ్యతో పలువురు విద్యార్థి నాయకులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్యిన వారికి మద్దతుగా జేఎన్యూ సహా, దేశ రాజధానిలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్పై కన్నయ్య కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తనపై మోదీ ప్రభుత్వం కక్ష్యసారింపుగా అభియోగాలు నమోదు చేసిందని విమర్శించారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు. కాగా ఘటన జరిగిన మూడేళ్ల తరువాత అభియోగాలు దాఖలు చేయడం గమనార్హం. -
హూడా, వోరాలపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: భూ కేటాయింపు కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్సింగ్ హూడా, కాంగ్రెస్ నేత మోతీలాల్ వోరాలపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. పంచకులలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు కేటాయించిన స్థలం విషయంలో అవకతవకలు జరిగాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. పంచకులలోని స్థలం మోతీలాల్ వోరా చైర్మన్గా ఉన్న ఏజేఎల్కు కేటాయించిన విషయంలో ఖజానాకు రూ.67 లక్షలు నష్టం వాటిల్లిందని ప్రత్యేక కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఏజేఎల్ గాంధీ కుటుంబ సభ్యులు, ఇతర కాంగ్రెస్ పెద్దల అధీనంలో నడుపబడుతున్న సంస్థ. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏజేఎల్ ఆధ్వర్యంలో వెలువడుతున్న విషయం విదితమే. -
కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చార్జీషీటు
-
కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్పై దాడి కేసులో పోలీసులు మంగళవారం కోర్టులో చార్జిషీట్ను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 25న న్యాయస్ధానం ఎదుట హాజరుకావాలని పటియాలా హౌస్ కోర్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కోరింది. అన్షు ప్రకాష్పై దాడికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలు బాధ్యులని పోలీసులు చార్జిషీట్లో పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విధులను అడ్డుకోవడం, గాయపరచడం, బెదిరింపులకు గురిచేయడం వంటి కుట్రకు సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు కుట్రపూరితంగా వ్యవహరించారని 3000 పేజీల చార్జిషీట్లో పోలీసులు ఆరోపించారు. వీరు చట్టవిరుద్ధంగా గుమికూడటం,ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అవమానించారని చార్జిషీట్ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు తనపై దాడికి తెగబడ్డారని అన్షు ప్రకాష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పోలీసుల చార్జిషీట్లో పేర్కొన్న ఆరోపణలను చవకబారు ఆరోపణలని ఆప్ ప్రభుత్వం తోసిపుచ్చింది. మోదీ ప్రభుత్వం ఎంత నైరాశ్యంలో ఉందో ఇది వెల్లడిస్తోందని వ్యాఖ్యానించింది. -
కేజ్రీవాల్పై ఢిల్లీ పోలీసుల చార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్పై దాడి కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఢిల్లీ పోలీసులు సోమవారం తీస్ హజారి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వీరిలో కేజ్రీవాల్, సిసోడియా, మరో 9 మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేశారు. మరో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలపై చీఫ్ సెక్రటరీని కొట్టారనే అభియోగాలు మోపారు. ఫిబ్రవరి 19న చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాష్పై కేజ్రీవాల్ అధికార నివాసంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాడి జరిగిన సమయంలో కేజ్రీవాల్ అక్కడే ఉన్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కేజ్రీవాల్ సహా దాడి సమయంలో అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు. దాడి కేసుకు సంబంధించి ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు అమనతుల్లా ఖాన్, ప్రకాష్ జర్వాల్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఢిల్లీ ప్రభుత్వం, ఐఏఎస్ అధికారుల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. ఇక ఆప్ ఎమ్మెల్యేలకు, బ్యూరోక్రాట్లకు మధ్య సాగుతున్న వివాదం తాజా చార్జిషీట్తో మరింత ముదిరింది. -
ఆ ‘నకిలీ నోట్ల’ వెనుక భారీ కుట్ర
సాక్షి, సిటీబ్యూరో: విశాఖపట్నం రైల్వే స్టేషన్లో దాదాపు మూడేళ్ల క్రితం చిక్కిన హైక్వాలిటీ నకిలీ కరెన్సీ నోట్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం సప్లిమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేశారు. దీని ద్వారా హైదరాబాద్లోని ప్రత్యేక న్యాయస్థానం దృష్టికి అనేక కీలకాంశాలు తీసుకువెళ్లారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రుస్తుం, సద్దాం హోసేన్పై అభియోగాలు మోపిన ఎన్ఐఏ.. వీరి ఏజెంట్ల వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలిపింది. ఈ నకిలీ నోట్ల సరఫరా వెనుక భారీ కుట్ర ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంలో భాగమని పేర్కొంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు 2015లో విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఈ గ్యాంగ్ గుట్టును రట్టు చేశారు. రూ.5.01 లక్షల కరెన్సీతో వెళ్తున్న సద్దాం హోసేన్ను పట్టుకున్నారు. ఈ కేసు డీఆర్ఐ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకు (ఎన్ఐఏ) వచ్చింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న కీలక నిందితుడు రుస్తుంను రెండున్నరేళ్ల పాటు వేటాడిన ఎన్ఐఏ హైదరాబాద్ యూనిట్ ఎట్టకేలకు గత ఏప్రిల్లో పట్టుకుంది. రుస్తుం డీమానిటైజేషన్కు ముందు వరకు బంగ్లాదేశ్ మీదుగా భారత్లోకి వచ్చిపడిన నకిలీ కరెన్సీని చాలా కాలం వరకు పశ్చిమ బెంగాల్లోని మాల్దా సహా అనేక జిల్లాలకు చెందిన ముఠాలు ఆయా ప్రాంతాల కేంద్రంగా రిసీవ్ చేసుకుని దేశ వ్యాప్తంగా సరఫరా చేస్తుండే వాడు. ఆ సరిహద్దుపై నిఘా ముమ్మరం కావడం, సరిహద్దు భద్రతా దళం చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో 2015 నుంచి అంతర్జాతీయ ముఠాలు తమ పంథాను మార్చాయి. బంగ్లాదేశ్తో ఉమ్మడి సరిహద్దులు కలిగి ఉన్న మరో రాష్ట్రమైన అసోం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో నిఘా ముమ్మరం చేయడంతోనే సద్దాం హోసేన్ వ్యవహారంపై ఉప్పంది 2015 సెప్టెంబర్లో విశాఖపట్నంలో అరెస్టు చేశారు. అసోంలోని మణిక్పూర్కు చెందిన హోసేన్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఇతడికి అదే రాష్ట్రంలోని దుబ్రీ జిల్లాకు చెందిన రుస్తుంతో పరిచయమైంది. ఒక్కోసారి ఒక్కో ఫోన్ నెంబర్ వినియోగించి హోసేన్తో సంప్రదింపులు జరిపిన రుస్తుం చివరకు తాను అందించే ఓ ప్యాకెట్ను బెంగళూరుకు చేరిస్తే రూ.10 వేల కమీషన్ ఇస్తానంటూ వల వేశాడు. డబ్బుకు ఆశపడిన హోసేన్ అందుకు అంగీకరిచడంతో న్యూ ఫరాఖా రైల్వేస్టేషన్లో అమ్రుల్ ద్వారా ఓ ప్యాకెట్ అందించాడు. అందులో నకిలీ కరెన్సీ ఉన్నాయని, గౌహతి–బెంగళూరు ఎక్స్ప్రెస్లో బెంగళూరు వెళ్లాలని ఆదేశించాడు. అక్కడికి చేరుకున్నాక తనకు ఫోన్ చేస్తే, ఎక్కడ, ఎవరికి ఇవ్వాలనేది చెప్తానంటూ రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చాడు. రైలులో బెంగళూరు బయలుదేరిన హోసేన్ విశాఖపట్నంలో డీఆర్ఐ అధికారులకు చిక్కాడు. ఇతడి నుంచి డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న 803 కరెన్సీ నోట్ల విలువ రూ.5.01 లక్షలుగా తేల్చారు. రుస్తుం అసోంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతను ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుని భారీ ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు డీఆర్ఐ ఆధారాలు సేకరించింది. ఈ రాకెట్ను ఛేదించాలంటే రుస్తుంను పట్టుకోవడం అనివార్యం కావడంతో ప్రత్యేక బృందాలను రంగంలోకిదింపింది. అయితే కేసుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా కేంద్ర హోంశాఖ దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేసింది. రంగంలోకి దిగిన హైదరాబాద్ యూనిట్ ముమ్మరంగా గాలింపు చేపట్టి గత ఏప్రిల్లో అతడిని పట్టుకున్నారు. వీరిద్దరి వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించడంతో వారిపై దృష్టిపెట్టారు. ఈ విషయాలను ఎన్ఐఏ అధికారులు మంగళవారం దాఖలు చేసిన చార్జ్షీట్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. -
మెహుల్ చోక్సీపై ఈడీ చార్జిషీటు
సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి మరో కీలక పరిణామం చోసుకుంది. ఈ కుంభకోణంలో కీలక నిందితుడు నీరవ్ మోదీ సమీప బంధువు, మరో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చార్జిషీటు దాఖలు చేసింది. పీఎన్బీ స్కాంలో మెహల్ చోక్సీ సహా మరో 13 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ చట్టం (పిఎంఎల్ఏ) సెక్షన్ 4 కింద దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్లో 5 కంపెనీలు ఉన్నాయి. ముంబైలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టుకు ముందు ఈడీ దీన్ని దాఖలు చేసింది. మెహల్ చోక్సి కి చెందిన గీతజాలి జెమ్స్ లిమిటెడ్, గిల్లి ఇండియా, నక్షత్ర బ్రాండ్లు లిమిటెడ్కు చెందిన మూడు కంపెనీలు ఇందులో ఉన్నాయి. వీటికి అక్రమ పద్దతుల్లో రూ. 3011.39 ఎల్ఓయూలు జారీ అయినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఇది ఇలావుంటే అనారోగ్య కారణాలరీత్యా తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయాలని చోక్సీ కోరారు. తన న్యాయవాది ద్వారా బుధవారం, ముంబై ప్రత్యేక సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో తాను ఎక్కడున్నదీ బహిర్గతం చేయలేననీ, వైద్య కారణాల వలన ప్రయాణం చేయలేనని చోక్సీ పేర్కొన్నాడు. అందుకే తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
మాల్యాకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
సాక్షి, ముంబై: భారీ రుణ ఎగవేతదారుడు,లిక్కర్ కింగ్ విజయ్మాల్యాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ నేపథ్యంలో ముంబై ప్రత్యేక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నగదు బదిలీ కేసులో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంఎస్ ఆజ్మి ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అనంతరం ఈ కేసు విచారణను జులై 30వ తేదీకి వాయిదా వేశారు. మనీ లాండరింగ్ చట్టం కింద 6వేల కోట్ల రూపాయల బ్యాంకు మోసం కేసులో విజయ్ మాల్యా సంస్థలైన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ (కెఎఫ్ఎ), యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యుహూహెచ్ఎల్)పై ఈడీ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఈ సంస్థలకు కూడా సమన్లు జారీ చేసింది. రూ.6,000 కోట్ల మేర బ్యాంకుల కన్సార్షియంను మోసగించారంటూ విజయ్ మాల్యాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరో చార్జిషీటు వేసిన సంగతి విదితమే. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ముంబైలోని ప్రత్యేక కోర్టులో ఈడీ ఇది దాఖలు చేసింది. 2005-10 మధ్య కాలంలో రుణ వాయిదాల చెల్లింపులు జరపకపోవడం వల్ల రూ.6,027 కోట్ల మేర నష్టపోయిన కేసుకు సంబంధించి ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం చేసిన ఫిర్యాదు మేరకు ఈడీ తాజాగా చార్జి షీటు దాఖలు చేసింది. కాగా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 900 కోట్ల ఎగవేత కేసుకు సంబంధించి మాల్యాపై ఈడీ గతేడాది తొలి చార్జిషీటు వేసింది. ఈ కేసులో ఇప్పటిదాకా రూ. 9,890 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. అటు ఉద్దేశ పూర్వక ఎగవేతదారుడుగా భావిస్తున్న మాల్యా దేశం విడిచి లండన్కు పారిపోయిన సంగతి తెలిసిందే. -
విజయ్మాల్యాపై ఈడీ మరో చార్జి షీటు
ముంబై: రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరో చార్జి షీటు వేసింది. రూ.6,000 కోట్ల మేర బ్యాంకుల కన్సార్షియంను మోసగించారంటూ మాల్యా, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, యునైటెడ్ బ్రూవరీస్, మరికొందరిపై దీన్లో అభియోగాలు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాసిక్యూషన్ ఫిర్యాదు కింద పరిగణించి... ఈ చార్జి షీటును మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ముంబైలోని ప్రత్యేక కోర్టులో ఈడీ దాఖలు చేసింది. 2005–10 మధ్య కాలంలో రుణ వాయిదాల చెల్లింపులు జరపకపోవడం వల్ల రూ.6,027 కోట్ల మేర నష్టపోయిన కేసుకు సంబంధించి ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం చేసిన ఫిర్యాదు మేరకు ఈడీ తాజా చార్జి షీటు దాఖలు చేసింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 900 కోట్ల ఎగవేత కేసుకు సంబంధించి మాల్యాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతేడాది తొలి చార్జిషీటు వేసింది. ఈ కేసులో ఇప్పటిదాకా రూ. 9,890 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. దేశం విడిచి వెళ్లిపోయిన మాల్యా ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు. -
కార్తీ చిదంబరానికి ఎదురు దెబ్బ?
-
నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైఎస్సార్సీపీ చార్జిషీట్
-
బాబు సాధించింది సున్నా
హైదరాబాద్/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. బాబు హయాంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఆయన అన్ని రంగాల్లో దారుణంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైఎస్సార్సీపీ రూపొందించిన చార్జిషీట్ను శుక్రవారం హైదరాబాద్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసన మండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, జంకె వెంకటరెడ్డి, విజయవాడలోని పార్టీ కార్యాలయంలో తమ్మినేని సీతారాం, జోగి రమేష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, లేళ్ల అప్పిరెడ్డి, టీజేఆర్ సుధాకర్బాబు తదితరులు విడుదల చేశారు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో అభివృద్ధి సున్నా అని ధ్వజమెత్తారు. అనినీతి, అరాచకాలు ఆకాశాన్నంటాయని అన్నారు. అందుకే చంద్రబాబు పాలనా వైఫల్యాలను చార్జిషీట్లో పొందుపరిచామని తెలిపారు. ఉమ్మారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన చంద్రబాబు చతికిలపడ్డారు. వైఎస్సార్సీపీ చార్జ్షీట్, టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు సరిచూసుకోవాలి. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాను ముఖ్యమంత్రి పెంచి పోషిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చంద్రబాబు పెట్టిన మొదటి ఐదు సంతకాలకు ఇప్పటికీ మోక్షం కలగలేదు. మొదటి సంతకాలకు ఉన్న ప్రాధాన్యతను చంద్రబాబు తగ్గించారు. రుణాలను మాఫీ చేయకుండా రైతాంగానికి వెన్నుపోటు పొడిచారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు సిగ్గుపడాలి. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ఒక్క పంటకైనా మద్దతు ధర ఇచ్చారా? మద్యం బెల్టు దుకాణాలు మూసి వేస్తామని చెప్పిన చంద్రబాబు ఒక్కటైనా మూసివేయించారా? రూ.2కే 20 లీటర్ల మంచినీరు ఇస్తామని సంతకం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఒక్క చోటైనా నీరు ఇచ్చారా? గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం రాజధాని నిర్మాణాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు బ్రహ్మాండమైన గ్రాఫిక్ చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారు. మూడు పంటలు పండే పొలాలను రాజధాని కోసం బలవంతంగా తీసుకున్నారు. అమరావతిలో ఇంతవరకు ఒక్క శాశ్వత భవన నిర్మాణం కూడా నిర్మించలేదు. 13 జిల్లాలకు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారు. అందులో కనీసం 10 శాతమైనా అమలు చేసినట్లు చూపిస్తే చంద్రబాబుకు సెల్యూట్ చేస్తాం. అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని ఉమ్మారెడ్డి తేల్చిచెప్పారు. బాబు నాలుగేళ్ల సినిమా అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాలుగేళ్ల సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, ప్రమోషన్లతో కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి దుయ్యబట్టారు. మళ్లీ అవకాశం ఇవ్వండి అంటూ కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పదవి కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని అన్నారు. రాజ్యంగబద్ధంగా గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు హీనంగా చూస్తున్నారని ఎమ్మెల్యే జంకె వెంకట్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ పాలనలో అరాచకాలు, భూ కబ్జాలు, కమీషన్ల వ్యాపారం రాజ్యమేలుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు వాసిరెడ్డి పద్మ, నారమల్లి పద్మజ, చల్లా మధుసూదన్రెడ్డి, ఎ.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వానికి మరణమే శరణ్యం: తమ్మినేని సీతారాం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన సీఎం చంద్రబాబు నవనిర్మాణ దీక్షల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నాలుగేళ్లుగా ఐసీయూలో ఉందని, దీనికి మరణమే శరణ్యమని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన తొలి సంతకం ఇప్పటికీ చివరి సంతకంగానే మిగిలిపోయిందన్నారు. రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేయలేదని ఆరోపించారు. అన్ని హామీలకు తూట్లు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలనూ దగా చేశారని విమర్శించారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేశారని చెప్పారు. దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఓ సంస్థ వెల్లడించిందని గుర్తుచేశారు. అంతేకాకుండా అవినీతిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉందని మరో సంస్థ ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రాలు విడుదల చేయాలని తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. అవినీతిపై విచారణ జరిపించాలి పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని చంద్రబాబు పాలనపై విడుదల చేసిన చార్జిషీట్లో వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. రాజధాని ప్రకటనకు ముందే బాబు తన బినామీలతో అక్కడ భూములు కొనిపించారని, తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అందులో పేర్కొన్నారు. అమరావతి భూ కేటాయింపుల్లో మూడేళ్లుగా రూ.వేల కోట్లు చేతులు మారాయని, ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబం సాగించిన విదేశీ లావాదేవీలు, కాల్మనీ, సెక్స్రాకెట్, ఓటుకు కోట్లు కేసు, ఐఎంజీ భారత్ స్కాం, అగ్రిగోల్డ్ స్కాం, చంద్రబాబు కుటుంబ ఆస్తులు, హెరిటేజ్ ఆస్తులు, మంత్రి నారా లోకేశ్ సంపాదన, తిరుమలలో అరాచకాలు, సింగపూర్ కంపెనీలకు రాజధాని భూముల అప్పగింత, నీరు–చెట్టు, భూ సేకరణ, భూ సమీకరణ పేరుతో చేసిన అరాచకాలపై తక్షణం విచారణ చేపట్టాలని చార్జిషీట్లో డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి దక్కిన కిరీటాలు ‘‘చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, మహిళల అక్రమ రవాణాలో నెంబర్ 2, దళితులపై దాడుల్లో నెంబర్ 4, రైతుల అప్పుల్లో నెంబర్ 1, దొంగతనాలు, దోపిడీల్లో నెంబర్ 6, ప్రమాదాల్లో నెంబర్ 7, హెచ్ఐవీ కేసుల్లో నెంబర్ 1. ఇలా రాష్ట్రానికి ఎన్నో కిరీటాలు దక్కాయి. ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట వారికి కాదని టీడీపీ నేతలకు కట్టబెడుతూ ఏకంగా జీవోలు జారీ చేశారు’’ అని చార్జిషీట్లో పేర్కొన్నారు. -
చంద్రబాబు పాలనపై కాంగ్రెస్ చార్జ్షీట్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనపై కాంగ్రెస్ పార్టీ చార్జ్షీట్ విడుదల చేసింది. పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, పీసీసీ నేతలు శుక్రవారం చార్జ్షీట్ను విడుదల చేశారు. అనంతరం పల్లంరాజు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదన్నారు. ఎన్డీఏలో ఉండి రాష్ల్రం కోసం చంద్రబాబు ఏమీ చేయలేదని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుకను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోందన్నారు. విభజన చట్టం హామీలను సాధించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని, ఈరోజు నుంచి వారం పాటు ప్రజావంచన వారంగా నిరసనలు తెలుపుతున్నట్టు ఆయన ప్రకటించారు. చర్చకు చంద్రబాబు సిద్ధమా? విభజన హామీల్లో ఉన్నవాటి కంటే ఎక్కువ చేస్తామని ఆనాడు బీజేపీ, టీడీపీలు హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశాయని పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ఆరోపించారు. నాలుగేళ్ల పాలనపై కాంగ్రెస్ విడుదల చేసిన చార్జ్షీట్లోని ప్రధానాంశాలపై చర్చకు చంద్రబాబు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. డ్వాక్వా మహిళకు రూ. 30 వేలు మాఫీ చేయాలి కానీ రూ. 4 వేలే చేశారన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు లేదు.. పైగా కొత్త ఇళ్లు మంజూరు చేయలేదన్నారు. కాపులకు ఇచ్చిన హామీలేమయ్యాయని రఘువీరా ప్రశ్నించారు. పోలవరంపై కమీషన్లకు కక్కుర్తిపడి ఆలస్యం చేస్తున్నారన్నారు. దుగరాజుపట్నం పోర్టు, రైల్వే జోన్ ఏమయ్యాయి.. నాలుగేళ్లలో అన్నీ శాఖల్లో అభివృద్ధి శూన్యం..ఇందులోనే చంద్రబాబు పాలన నంబర్వన్ స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. -
గౌరీ లంకేశ్ హత్య కేసులో కీలక పరిణామం
సాక్షి, బెంగళూరు: సంచలనం సృష్టించిన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు కేటీ నవీన్ కుమార్ స్టేట్మెంట్ను నమోదు చేసిన పోలీసులు, కోర్టులో దాఖలు చేసింది. ఇక ఛార్జీషీట్లో ఆమె హత్యకు గల కారణంపై సిట్ బృందం స్పష్టత ఇచ్చేసింది. ‘గౌరీ లంకేశ్ హిందూ వ్యతిరేకి.. ఆమెకు బతికే అర్హత లేదు’ అని ప్రధాన నిందితుడు తనతో చెప్పినట్లు నిందితుడు నవీన్ పేర్కొన్నట్లు ఛార్జీషీట్లో పొందుపరిచారు. అంతేకాదు ఆ ప్రధాన నిందితుడికి బుల్లెట్లు కూడా తానే సరఫరా నవీన్ ఒప్పుకున్నాడు. ఈ మేరకు మొత్తం 131 పాయింట్లతో 12 పేజీల ఛార్జీ షీట్ను రూపొందించిన సిట్ బృందం, మే 30న మెజిస్ట్రేట్కు సమర్పించింది. ఛార్జీషీట్లో వివరాలు... డిగ్రీ మధ్యలోనే ఆపేసిన కేటీ నవీన్ కుమార్.. హిందూ అతివాద సంఘాల పట్ల ఆకర్షితుడు అయ్యాడు. 2014లో హిందూ యువ సేనే అనే సంస్థను తానే సొంతంగా స్థాపించాడు. మంగళూర్ పబ్ దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కున్న శ్రీరామ్ సేనే స్థాపకుడు ప్రమోద్ ముతాలిక్తో నవీన్ తరచూ భేటీ అయ్యేవాడు. మరోపక్క అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తాడన్న ఆరోపణలు నవీన్పై గతంలో వినిపించేవి. ఈ క్రమంలో ఓ సదస్సుకు హాజరైన నవీన్కు ప్రవీణ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. నిందితుడు నవీన్ కుమార్ బుల్లెట్ల కోసం... ఆ తర్వాత నవీన్తో సత్సంబంధాలు కొనసాగించిన ప్రవీణ్.. ఓ రోజు ఏకంగా ఇంటి వెళ్లి బుల్లెట్ల కోసం ఆరా తీశాడు. తొలుత నవీన్ అతనికి రెండు బుల్లెట్లు ఇవ్వగా.. ప్రవీణ్ మాత్రం నాణ్యమైనవి కావాలంటూ కోరాడు. ‘గౌరీ లంకేశ్ హిందూ వ్యతిరేకి. ఆమెను చంపేందుకే ఈ బుల్లెట్లు’ అంటూ తనతో చెప్పినట్లు స్టేట్మెంట్లో నవీన్ పేర్కొన్నాడు. బెంగళూరు, బెలగామ్లో హత్యకు ప్రణాళిక రచించారని, హత్యకు ముందు ఆమె ఇంటి వద్ద పలు మార్లు హంతకులు రెక్కీ నిర్వహించారని నవీన్ పేర్కొన్నాడు. ఫ్లాన్ ప్రకారం చివరకు సెప్టెంబర్ 5వ తేదీన ఆమెను హత్య చేసినట్లు నవీన్ వివరించాడు. అయితే ఆమె హత్యకు గురైందన్న వార్త మరుసటి రోజు పేపర్లో చూసేదాకా తనకూ తెలీదని నవీన్ చెబుతున్నాడు. మరో హత్యకు కుట్ర... సాహితీవేత్త, హేతువాది కేఎస్ భగవాన్ హత్యకు కూడా కుట్ర పన్నినట్లు నవీన్ అంగీకరించాడు. ఫోన్ కాల్స్లో సంభాషణల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి రాగా, విచారణలో నిందితుడు ఒప్పకున్నాడు. కాగా, ప్రముఖ రచయిత కుల్బర్గి హత్య(2015) తర్వాత.. భగవాన్కు పోలీసులు భద్రత పెంచిన విషయం తెలిసిందే. రచయిత ఎంఎం కుల్బర్గి ఒకే తుపాకీ... రెండేళ్ల క్రితం రచయిత ఎంఎం కుల్బర్గి(77) హత్య కోసం ఉపయోగించిన తుపాకీ, గౌరీ లంకేశ్ హత్య కోసం వాడిన తుపాకీ ఒక్కటేనని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు పోలీసులు మెజిస్ట్రేట్కు సమర్పించిన ఛార్జీషీట్లో ఈ విషయాన్ని పొందుపరిచారు. గతేడాది సెప్టెంబర్ 5వ తేదీన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లౌకికవాదిగా, కన్నడ వార పత్రిక ‘లంకేశ్ పత్రికే’ ఎడిటర్గా ప్రసిద్ధి చెందిన గౌరీ హత్యకు గురికావడంతో అన్ని వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. మాండ్యా జిల్లాకు చెందిన కేటీ నవీన్ కుమార్ ఈ ఏడాది మార్చిలో తన దగ్గర ఉన్న తుపాకీని ఓ వ్యక్తికి అమ్మేందుకు యత్నించాడు. అయితే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్.. అతనికి సహకరించిన వారు ఎవరన్నది తేలాల్సి ఉంది. -
సునంద మృతి కేసు: శశిథరూర్కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ నేత, ఆమె భర్త శశిథరూర్కు షాక్. ఢిల్లీ పోలీసులు ఆయన పేరును ఛార్జ్షీట్లో చేర్చారు. థరూరే సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని అందులో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పటియాలా కోర్టులో ఛార్జ్షీట్ను పోలీసులు దాఖలు చేశారు. అనంతరం కేసును మే 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. జనవరి 17, 2014లో ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్ ఆమె అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే సునంద విష ప్రభావం వల్లే మృతిచెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించటంతో ఈ కేసులో అనుమానాలు మరింత పెరిగిపోయాయి. మానసిక ఆందోళన నుంచి ఉపశమనం కోసం వాడే అల్ప్రాక్స్ మత్తు పదార్థం ఆమె శరీరంలో మోతాదుకు మించిన ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే సునందే వీటిని తీసుకున్నారా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఆమెకు అతిగా ట్యాబ్లెట్లు ఇచ్చారా? మత్తు పదార్థాన్ని ఇంజక్షన్ ద్వారా ఎక్కించారా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. -
ఇందిరమ్మ ఇళ్ల స్కాంపై ఛార్జ్ షీట్
సాక్షి, హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల స్కాంలో జరిగిన అవకతవకలపై సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడెప్పుడు నిర్మించారన్న దానిపై స్పష్టత కోరుతూ విజిలెన్స్ అధికారులకు ఓ లేఖ రాసింది. 9 జిల్లాల్లో 36 గ్రామాల్లో 3 వేల ఇళ్ల నిర్మాణాల్లో భారీగా గోల్మాల్ జరిగినట్లు గుర్తించిన సీఐడీ అధికారులు విజిలెన్స్ నివేదిక రాగానే ఛార్జీషీట్ దాఖలు చేయనున్నారు. మూడు వేల ఇళ్ల నిర్మాణాల్లో దాదాపు 11 కోట్ల రూపాయల నిధులు పక్కదోవ పట్టినట్లు సీఐడీ అధికారులు తేల్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
కథువా కేసు.. విస్మయపరిచే కోణం
శ్రీనగర్: సంచలనం సృష్టించిన కథువా హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సాంజి రామ్ ఎట్టకేలకు నోరు మెదిపాడు. విచారణలో పోలీసులకు అతను దిగ్భ్రాంతికి గురి చేసే విషయాలను వెల్లడించాడు. కుమారుడిని రక్షించుకునేందుకు ఆ బాలికను చంపినట్లు సాంజి రామ్ తెలిపాడు. హిందూ ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతం నుంచి నోమాదిక్ గుజ్జర్, బకర్వాల్ తెగలను తరిమికొట్టాలన్న ఉద్దేశంతోనే తాము ఈ ఘటనకు పాల్పడినట్లు సాంజి రామ్ వివరించాడు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... జనవరి 7వ తేదీ నుంచే బాలిక కిడ్నాప్ కోసం సాంజి రామ్ ప్రణాళిక అమలు చేశాడు. జనవరి 10న మత్తుమందు ఇచ్చి బాలికను అపహరించి ఆలయానికి తరలించారు. అదే రోజు సాంజిరామ్ మేనల్లుడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే లైంగిక దాడి జరిగిన విషయం 13వ తేదీన తనకు తెలిసిందని సాంజిరామ్ వివరించాడు. తన కుమారుడితోపాటు అల్లుడు కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని.. వారిని రక్షించుకునేందుకే ఆ బాలికను చంపేసినట్లు సాంజి రామ్ దర్యాప్తు బృందానికి చెప్పారు. జనవరి 13 అర్ధరాత్రి విశాల్(సాంజిరామ్ కొడుకు), అతని స్నేహితుడు పర్వేశ్ కుమార్(మన్ను).. ఆలయం నుంచి బాలికను బయటకు తీసుకొచ్చారు. చంపేముందు మరోసారి అత్యాచారం చేస్తానని పోలీసాధికారి దీపక్ ఖజూరియా నిందితులతో చెప్పాడు. కానీ, పరిస్థితులు సహకరించకపోవటంతో బాలికను తిరిగి ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజు అంటే.. జనవరి 14న బాలికను రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. తర్వాత బాలిక మృతదేహాన్ని హీరానగర్ కాలువ వద్ద పడేయాలని పథకం రచించారు. విశాల్, ఖజూరియా, పర్వేశ్ కుమార్, మైనర్ బాలుడు అంతా కలిసి బాలిక మృతదేహాన్ని ఆలయం నుంచి బయటకు తీసుకురాగా.. రామ్ బయట కాపలాకాశాడు. చివరకు కారు దొరక్కపోవటంతో జనవరి 15వ తేదీ మధ్యాహ్నం విశాల్, సాంజిరామ్ మేనల్లుడు కలిసి సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలిక మృత దేహాన్ని పడేసి వచ్చారు. అయితే సాంజిరామ్ స్టేట్మెంట్పై స్పందించేందుకు అతని తరపు న్యాయవాది నిరాకరించారు. ఛార్జీ షీట్ వివరాలు... మైనర్ బాలుడితోపాటు, సాంజిరామ్, అతని తనయుడు విశాల్, సాంజిరామ్ అల్లుడు, పోలీస్ అధికారులు ఖజూరియా, సురేందర్ వర్మ, పర్వేశ్ కుమార్ పేర్లతో ఛార్జీషీట్ దాఖలు చేశారు. సాంజిరామ్పై హత్య, అపహరణ, ఆధారాలను మాయం చేయటం.. పర్వేశ్ కుమార్(మన్ను)పై అపహరణ కింద కేసు నమోదు చేశారు. సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు తీసుకుని ఆధారాలు మాయం చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దత్తాల పేర్లను కూడా ఛార్జ్షీట్లో చేర్చారు. జనవరి 17న బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు జనవరి 23న కేసును క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేయగా.. సిట్ను ఏర్పాటు చేసింది. ఆ టీమ్ 8 మందిని అరెస్ట్ చేసింది. సుప్రీం కోర్టు జోక్యంతో ఏప్రిల్ 16న కేసులో విచారణ ప్రారంభం.. తదుపరి విచారణ ఏప్రిల్ 28కి వాయిదా. ఈ కేసు విచారణ జమ్ము కశ్మీర్ కోర్టులో చేయవద్దని.. ఛండీగఢ్ కోర్టుకు బదిలీ చేయాలని బాధితురాలి తండ్రి సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ కేసును విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని దిగువ న్యాయస్థానాలకు ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల కేసు.. ఉచ్చు బిగుస్తోందా?
సాక్షి, కొచ్చి : మళయాళ నటి భావనపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో స్టార్ నటుడు దిలీప్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. ఇందులో మొత్తం 12 మంది నిందితుల పేర్లను పోలీసులు ప్రస్తావించారు. ఇక ఛార్జ్ షీట్ను అంగీకరించటంతోపాటు దిలీప్తోపాటు నిందితులందరికీ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే మొదటి ఛార్జీ షీట్ లో తొలుత ప్రధాన నిందితుడిగా దిలీప్ పేరును ప్రస్తావించిన పోలీసులు సరైన సాక్ష్యాలు లభింకపోవటంతో ఆయన పేరును 8వ నిందితుడిగా మార్చారు. ఆ ఛార్జ్షీట్ను నవంబర్ 22న అంగమళి మెజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించారు. మొత్తం 650 పేజీల ఛార్జ్షీట్.. 50 మంది సాక్ష్యులు, 12 మంది నిందితుల పేర్లను ఇందులో ప్రస్తావించారు. దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ పేరును ప్రధాన సాక్షిగా పేర్కొనటం విశేషం. ఆమె నుంచి కీలక సమాచారం విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 17న కోయంబత్తూరులో నటి భావనపై లైంగిక దాడి చోటు చేసుకోగా.. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పల్సర్ సునీ, మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చివరకు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దిలీప్ను జూలైలో అరెస్ట్ చేశారు. సుమారు 3 నెలలపాటు జైలు శిక్ష అనుభవించిన ఈ స్టార్ హీరో అక్టోబర్ 3న ఎట్టకేలకు బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చాడు. -
భావన లైంగికదాడి కేసు.. ఇంకో ట్విస్ట్
సాక్షి, తిరువనంతపురం : నటి భావన లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కున్న నటుడు దిలీప్ పేరును దర్యాప్తు బృందం మార్చేసింది. తాజాగా కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో దిలీప్ను 8వ నిందితుడిగా పేర్కొనటం విశేషం. ఫిబ్రవరి 17న కొయంబత్తూరులో భావనపై లైంగిక దాడి జరిగిన అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పల్సర్ సునీ, మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చివరకు వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నటుడు దిలీప్ను జూలై 10న అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. ఆ సమయంలో దిలీప్ను ప్రథమ నిందితుడిగా పేర్కొంటూ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. దాదాపు 80 రోజుల తర్వాత అక్టోబర్ 3న బెయిల్పై బయటకు వచ్చిన దిలీప్ షరతులపై సడలింపు కోరుతూ కేరళ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే దర్యాప్తులో ఈ స్టార్ హీరోకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలేవీ లభించకపోవటంతో ఆయన పేరును 8వ నిందితుడిగా ఇప్పుడు మార్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దిలీప్ పాత్రపై ప్రాధాన్యం తగ్గుతున్న వేళ నెమ్మదిగా కేసు నుంచి తప్పించుకున్నా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని భావన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. దిలీప్కు అదే పెద్ద సమస్య... నిందితులు పల్సర్ సునీ, విజీశ్లు దిలీప్ పాత్ర గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా.. ఛార్లీ మాత్రం దిలీప్ ప్రధాన సూత్రధారి అని ఆరోపిస్తుండటంతో పోలీసులు దిలీప్ పేరును ఇప్పట్లో ఛార్జ్ షీట్ నుంచి తొలగించే ఆస్కారం లేకుండా పోయింది. కాగా, ఛార్లీ ఘటన తర్వాత సునీ, విజీశ్లకు ఆశ్రయం కల్పించాడు. అంతేకాదు భావనపై జరిపిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను నిందితులు తనకు చూపించారంటూ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.