D Gukesh
-
గుకేశ్కు చివరి స్థానం
హాంబర్గ్ (జర్మనీ): ఫ్రీస్టయిల్ గ్రాండ్స్లామ్ చెస్ టూర్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ నిరాశ పరిచాడు. శనివారం ముగిసిన ఈ టోర్నీలో గుకేశ్ ఆఖరి స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్లే ఆఫ్ పోరులో గుకేశ్ 0.5–1.5 పాయింట్ల తేడాతో అలిరెజా ఫిరౌజా (ఇరాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో ఓడిన గుకేశ్... ప్లే ఆఫ్ రౌండ్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. తొలి రౌండ్ను ‘డ్రా’చేసుకున్న గుకేశ్... రెండో రౌండ్లో తెల్ల పావులతో ఆడినా సత్తా చాటలేకపోయాడు. 30 ఎత్తుల్లో పరాజయం పాలయ్యాడు. ఓవరాల్గా విన్సెంట్ కైమెర్ (జర్మనీ) అగ్రస్థానం దక్కించుకోగా... ఫాబియా కరువానా (అమెరికా), మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరుసగా జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్; 4వ స్థానం), హికారు నకమురా (అమెరికా; 5వ స్థానం), నొడ్రిబెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్; 6వ స్థానం), అలిరెజా ఫిరౌజా (7వ స్థానం) నిలిచారు. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్లు పాల్గొన్న ఈ టోర్నీలో గుకేశ్ ఎనిమిదో స్థానంతో ముగించాడు. ఈ టోర్నీ మొత్తంలో గుకేశ్ ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయాడు. -
ఫ్రీ స్టయిల్ చెస్ నాకౌట్కు గుకేశ్
హంబర్గ్ (జర్మనీ): భారత యువ గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ఫ్రీస్టయిల్ గ్రాండ్స్లామ్ చెస్ టూర్లో నాకౌట్కు అర్హత సాధించాడు. శనివారం క్వాలిఫయర్స్ చివరి మ్యాచ్లో స్టార్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ గుకేశ్ ముందంజ వేశాడు. ఈ టోర్నీ మొత్తంలో 9 మ్యాచ్లు ఆడిన గుకేశ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించని భారత గ్రాండ్మాస్టర్... ఏడు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని... మరో రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యాడు. ఫలితంగా గుకేశ్ ఖాతాలో 3.5 పాయింట్లు చేరాయి. పది మంది ప్లేయర్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఎనిమిదో స్థానంలో నిలవడం ద్వారా గుకేశ్ నాకౌట్లో అడుగుపెట్టాడు. క్వాలిఫయింగ్ దశ ముగిసే సరికి ఫ్రాన్స్ గ్రాండ్మాస్టర్ అలిరెజా ఫిరౌజా, ఉజ్బేకిస్తాన్కు చెందిన జవోకిర్ సిందరోవ్ చెరో 6.5 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అమెరికా గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరున (6 పాయింట్లు) మూడో స్థానం దక్కించుకోగా... మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), హికారు నకమురా (అమెరికా) చెరో 5.5 పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచారు. జర్మనీకి చెందిన విన్సెంట్ కైమెర్ 4 పాయింట్లతో ఆరో ‘ప్లేస్’ దక్కించుకున్నాడు. ఉజ్బేకిస్తాన్కు చెందిన నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్, గుకేశ్ చెరో 3.5 పాయింట్లతో వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు. -
Tata Steel Chess Masters: ఛాంపియన్గా ప్రజ్ఞానంద
టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్-2025కు ఎండ్ కార్డ్ పడింది. ఈ టోర్నీ విజేతగా భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద(Praggnanandhaa) నిలిచాడు. నెదర్లాండ్స్లోని విక్ ఆన్ జీ వేదికగా జరిగిన టై బ్రేకర్లో వరల్డ్ ఛాంపియన్ డి గుకేశ్పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. కాగా అంతకుముందు చివరి రౌండ్లో గుకేశ్, ప్రజ్ఞానానంద ఇద్దరూ తమ మ్యాచ్లలో ఓటమి చవిచూశారు.జర్మన్ గ్రాండ్ మాస్టర్ జీఎమ్ విన్సెంట్ ప్రగ్నందందాను ఓడించగా.. గుకేష్ను అర్జున్ ఎరిగైసి ఖంగుతిన్పించాడు. దీంతో 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న గుకేశ్, ప్రజ్ఞానంద.. టైటిల్ కోసం టైబ్రేకర్లో తలపడ్డారు. టైబ్రేకర్లో తొలి గేమ్లో గుకేష్ విజయం సాధించగా, రెండో గేమ్లో ప్రజ్ఞానంద గెలుపొందాడు.ఫలితంగా విజేతను తేల్చేందుకు సడన్ డెత్ నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో ప్రజ్ఞానంద విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీ చివరి రౌండ్(13వ రౌండ్)లో ప్రజ్ఞానంద 2741 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలవగా.. దొమ్మరాజు గుకేశ్(2777) రెండో స్ధానంలో నిలిచాడు.చదవండి: టీ20 వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే? -
ఒంటరిగా ఆధిక్యంలో గుకేశ్
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో పదో రౌండ్ తర్వాత భారత గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్(D Gukesh ) 7.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు. మాక్స్ వార్మెర్డామ్ (నెదర్లాండ్స్)తో బుధవారం జరిగిన పదో రౌండ్ గేమ్లో గుకేశ్ 34 ఎత్తుల్లో గెలిచాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన తర్వాత గుకేశ్కు ఇదే మొదటి టోర్నమెంట్ కావడం గమనార్హం. మరోవైపు ఉజ్బెకిస్తాన్ గ్రాండ్మాస్టర్ నోడిర్బెక్ అబ్దుసత్తోరోవ్ 7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. రష్యాకు చెందిన అలెక్సీ సరానాను నోడిర్బెక్ ఓడించాడు. ఇక భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద 6.5 పాయింట్లతో మూడో స్థానంలో, ఇరిగేశి అర్జున్ 3 పాయింట్లతో 13వ స్థానంలో ఉన్నారు. 14 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది.చదవండి: జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే? -
సంయుక్త ఆధిక్యంలో గుకేశ్
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఎనిమిదో రౌండ్ తర్వాత భారత గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ 5.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్త ఆధిక్యంలో ఉన్నాడు. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందతో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్ను గుకేశ్ 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. నొదిక్బెక్ (ఉజ్బెకిస్తాన్), ప్రజ్ఞానంద కూడా 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. పెంటేల హరికృష్ణ (భారత్)ృఅనీశ్ గిరి (నెదర్లాండ్స్) మధ్య గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అలెక్సీ సరానా (సెర్బియా), ఇరిగేశి అర్జున్ (భారత్) మధ్య గేమ్ 23 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. మొత్తం 14 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. -
భారత నంబర్వన్గా గుకేశ్
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) క్లాసికల్ ఫార్మాట్ లైవ్ ర్యాంకింగ్స్లో భారత గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. గురువారం లైవ్ ర్యాంకింగ్స్లో గుకేశ్ 2784 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకొని భారత నంబర్వన్గా అవతరించాడు. కొన్నాళ్లుగా నాలుగో ర్యాంక్లో నిలిచి, భారత నంబర్వన్గా ఉన్న తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ 2779.5 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలో గుకేశ్, అర్జున్, ప్రజ్ఞానంద పోటీపడుతున్నారు. ఐదో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 3.5 పాయింట్లతో గుకేశ్ రెండో స్థానంలో ఉన్నాడు. 14 మంది గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో అర్జున్ ఒక పాయింట్తో 13వ స్థానంలో ఉన్నాడు. -
ఖేల్ రత్న అవార్డులు అందుకున్న గుకేశ్, హర్మన్ప్రీత్ సింగ్, మనూ బాకర్, ప్రవీణ్ కుమార్
భారత దేశపు అత్యున్నత క్రీడా పురస్కారం అయిన "మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు" గతేడాది (2024) నలుగురిని వరించింది. చెస్లో డి గుకేశ్, పురుషుల హాకీలో హర్మన్ప్రీత్ సింగ్, మహిళల షూటింగ్లో మనూ బాకర్, పారా-అథ్లెట్ (హై జంప్) ప్రవీణ్ కుమార్ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ నలుగురు ఇవాళ (జనవరి 17) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరిగింది.A historic moment for 🇮🇳 Indian chess! 🏆Congratulations to 🇮🇳 GM Gukesh on receiving the prestigious Major Dhyan Chand Khel Ratna Award from Hon’ble President Droupadi Murmu👏Your hard work and passion continue to inspire us all—onward and upward 🥳👏@DGukesh📹Doordarshan pic.twitter.com/4AMZ8ClZD9— Chess.com - India (@chesscom_in) January 17, 2025గుకేశ్ అతి చిన్న వయసులో (18) ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన రెండవ భారతీయుడు గుకేష్. గుకేశ్ గత నెలలో చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ను ఓడించి వరల్డ్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నాడు.హర్మన్ప్రీత్ సింగ్ భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్. హర్మన్ సారథ్యంలో భారత్ గతేడాది ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారత్ పతకం సాధించడంలో హర్మన్ కీలకపాత్ర పోషించాడు.మనూ భాకర్ .. ఒకే ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా రికార్డు నెలకొల్పింది. మనూ బాకర్ గతేడాది ఆగస్టులో జరిగిన విశ్వక్రీడల్లో రెండు కాంస్య పతకాలు (10మీ ఎయిర్ పిస్తోల్, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ టీం ఈవెంట్లలో) గెలుచుకుంది.ప్రవీణ్ కుమార్.. గతేడాది జరిగిన పారాలింపిక్స్లో పురుషుల హై జంప్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.పై నలుగురు భారత క్రీడా రంగంలో చేసిన విశేష కృషికి గాను ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు. -
అదానీతో గుకేశ్ భేటీ
న్యూఢిల్లీ: టీనేజ్లోనే ప్రపంచ క్లాసికల్ చెస్ చాంపియన్గా నిలిచిన భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ గురువారం ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో భేటీ అయ్యాడు. తల్లిదండ్రులు పద్మావతి, డాక్టర్ రజనీకాంత్లతో కలిసి గుకేశ్ అహ్మదాబాద్లో అదానీని కలిశాడు. ‘ప్రపంచ చెస్ చాంపియన్ను ఇలా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అతని విజయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. అలాంటి వారితో నాకు ఈ భేటీ చాలా ప్రత్యేకమైంది. 18 ఏళ్ల భారత కుర్రాడు ప్రపంచ చెస్లో సత్తా చాటుకున్నాడు. మన యువతరానికి ప్రేరణగా నిలిచాడు. దశాబ్దాలపాటు చెస్లో భారత ఆధిపత్యం కొనసాగేందుకు గట్టి పునాది వేశాడు. అతని ఆత్మవిశ్వాసం, విజయం అద్భుతం. జై హింద్’ అని ‘ఎక్స్’లో గౌతమ్ అదానీ పోస్ట్ చేశారు. సింగపూర్లో ఇటీవల జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్షి ప్ మ్యాచ్లో గుకేశ్... చైనాకు చెందిన డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించాడు. అప్పుడు సోషల్ మీడియా వేదికగా గుకేశ్ను అదానీ ప్రశంసించారు. అదానీకి చెందిన స్పోర్ట్స్ ఫౌండేషన్ భారత గ్రాండ్మాస్టర్స్ ప్రజ్ఞానంద, అతని సోదరి వైశాలిలను స్పాన్సర్ చేస్తోంది. 1985లో 22 ఏళ్ల వయసులో ప్రపంచ చాంపియన్గా నిలిచిన గ్యారీ కాస్పరోవ్ రికార్డును తాజాగా గుకేశ్ చెరిపేశాడు. చెస్ ఒలింపియాడ్లోనూ భారత్ స్వర్ణం గెలిచేందుకు కీలకపాత్ర పోషించిన అతని ప్రదర్శనను గుర్తించిన భారత ప్రభుత్వం ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న’ అవార్డుకు ఎంపిక చేసింది. -
నలుగురు ‘ఖేల్ రత్న’లు
సాక్షి, న్యూఢిల్లీ: విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన మేటి క్రీడాకారులకు ‘ఖేల్ రత్న’ అవార్డు వరించింది. పారిస్ ఒలింపిక్స్లో రెండు పతకాలతో మెరిసిన మహిళా షూటర్ మనూ భాకర్... పిన్న వయసులో చెస్ ప్రపంచ చాంపియన్గా అవతరించిన తమిళనాడు గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్... భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్... పారాథ్లెట్ ప్రవీణ్ కుమార్... 2024 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న’ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరితోపాటు మరో 32 మంది ప్లేయర్లకు ‘అర్జున అవార్డు’ దక్కింది. ఇందులో 17 మంది పారాథ్లెట్లు కూడా ఉండటం విశేషం. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం అవార్డుకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేసింది. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్లో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు ఈ పురస్కారాలు అందుకోనున్నారు. » స్వతంత్ర భారత దేశంలో ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి ప్లేయర్గా మనూ రికార్డు నెలకొల్పింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో హరియాణాకు చెందిన 22 ఏళ్ల మనూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో, 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్యాలు నెగ్గింది. కొన్ని రోజుల క్రితం ఈ అవార్డు కోసం మనూ భాకర్ దరఖాస్తు చేసుకోలేదనే వార్తలు వచి్చనా... చివరకు ‘పారిస్’లోని ఆమె ప్రదర్శనకు అవార్డు దక్కింది. » గత ఏడాది చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల జట్టుకు స్వర్ణ పతకం దక్కడంలో కీలకపాత్ర పోషించిన గుకేశ్ ఆ తర్వాత సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించి జగజ్జేత అయ్యాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత (1991–1992లో) ‘ఖేల్ రత్న’ అవార్డు పొందనున్న రెండో చెస్ ప్లేయర్ గుకేశే కావడం విశేషం. » 2024 పారిస్ ఒలింపిక్స్లో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్ప్రీత్ సింగ్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. మూడుసార్లు అతను అంతర్జాతీయ హాకీ సమాఖ్య అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. » పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ‘ఖేల్రత్న’ కోసం సిఫారసు చేసింది. పారిస్ పారాలింపిక్స్ హైజంప్ (టి64 క్లాస్)లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. »‘ఖేల్ రత్న’ అవార్డు గ్రహీతలకు అవార్డుతో పాటు రూ. 25 లక్షల నగదు ప్రోత్సాహకం, అర్జున అవార్డీలకు రూ. 15 లక్షల నగదు బహుమతి లభించనుంది. జ్యోతి, దీప్తిలకు ‘అర్జున’ ఆంధ్రప్రదేశ్ వర్ధమాన అథ్లెట్ జ్యోతి యర్రాజీ...తెలంగాణ పారాథ్లెట్ దీప్తి జివాంజిలకు ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున అవార్డు’ లభించింది. వైజాగ్కు చెందిన 25 ఏళ్ల జ్యోతి పారిస్ ఒలింపిక్స్లో 100 మీటర్ల హర్డిల్స్లో పోటీపడింది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచింది. 2023 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం, 200 మీటర్లలో రజతం సాధించింది. 2023, 2024లలో జరిగిన ఆసియా ఇండోర్ చాంపియన్షిప్లో జ్యోతి 60 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ, రజతాలు గెలిచింది. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల దీప్తి 2024 పారిస్ పారాలింపిక్స్లో 400 మీటర్ల టి20 కేటగిరీలో కాంస్యం... 2024 ప్రపంచ పారాథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది. 2023 హాంగ్జౌ పారా ఆసియా క్రీడల్లో దీప్తి బంగారు పతకం గెలిచింది. దీప్తికి భారత స్పోర్ట్స్ అథారిటీ కోచ్ నాగపురి రమేశ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు.అవార్డీల వివరాలు‘ధ్యాన్చంద్ ఖేల్రత్న’: దొమ్మరాజు గుకేశ్ (చెస్), హర్మన్ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా–అథ్లెటిక్స్), మనూ భాకర్ (షూటింగ్). అర్జున అవార్డు (రెగ్యులర్): జ్యోతి యర్రాజీ, అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు, స్వీటీ బూరా (బాక్సింగ్), వంతిక అగర్వాల్ (చెస్), సలీమా టెటె, అభిషేక్, సంజయ్, జర్మన్ప్రీత్, సుఖ్జీత్ సింగ్ (హాకీ), రాకేశ్ కుమార్ (పారా ఆర్చరీ), దీప్తి జివాంజి, ప్రీతి పాల్, అజీత్ సింగ్, సచిన్ ఖిలారి, ధరమ్వీర్, ప్రణవ్ సూర్మ, హొకాటో సీమ, సిమ్రన్, నవ్దీప్ (పారా అథ్లెటిక్స్), నితీశ్, తులసిమతి, నిత్యశ్రీ, మనీషా (పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్ (పారా జూడో), మోనా అగర్వాల్, రుబీనా (పారా షూటింగ్), స్వప్నిల్ కుసాలే, సరబ్జోత్ (షూటింగ్), అభయ్ సింగ్ (స్క్వాష్), సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్), అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్). అర్జున అవార్డు (లైఫ్టైమ్): సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ పేట్కర్ (పారా స్విమ్మింగ్). ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్): సుభాశ్ రాణా (పారా షూటింగ్), దీపాలి దేశ్పాండే (షూటింగ్), సందీప్ సాంగ్వాన్ (హాకీ). ద్రోణాచార్య అవార్డు (లైఫ్టైమ్): మురళీధరన్ (బ్యాడ్మింటన్), అర్మాండో అనెలో కొలాకో (ఫుట్బాల్). -
ఖేల్రత్న, అర్జున అవార్డు గ్రహీతలకు వైఎస్ జగన్ అభినందనలు
అర్జున అవార్డుకు ఎంపికైన జ్యోతి యర్రాజీకి వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో రాష్ట్రానికీ, దేశానికీ పేరు తెచ్చిన ఈ అథ్లెట్ను అభినందించారు. కఠిన శ్రమ, అంకితభావం, నిబద్ధత వల్లే జ్యోతి ఈస్థాయికి చేరుకుందని ప్రశంసలు కురిపించారు.జాతీయ స్థాయిలో రికార్డులుట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు, 400 మీటర్ల హార్డిల్స్ విభాగంలో సరికొత్త బెంచ్ మార్కులు సృష్టిస్తున్న జ్యోతి యర్రాజీ క్రీడా నైపుణ్యాలను వైఎస్ జగన్ ఈ సందర్భంగా కొనియాడారు. విశాఖపట్నంలోని సాధారణ కుటుంబంలో జన్మించి.. జాతీయ స్థాయిలో రికార్డులు సాధించిన జ్యోతి దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.అదే విధంగా.. జ్యోతి యర్రాజీ భవిష్యత్తులోనూ తన విజయపరంపరను కొనసాగించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ప్రపంచ వేదికపై సత్తా చాటి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని జ్యోతిని విష్ చేశారు.మొదటి భారత అథ్లెట్గా జ్యోతి రికార్డుకాగా విశాఖ వాసి జ్యోతి యర్రాజీని ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడామంత్రిత్వ శాఖ గురువారం ఇందుకు సంబంధించి గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా అథ్లెటిక్స్ విభాగంలో జ్యోతి కి అర్జున అవార్డు వచ్చింది. ఈ నెల 17 వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా జ్యోతి పురస్కారం అందుకోనుంది.ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఒక పతకం, జాతీయ పోటీల్లో పది పతకాలను జ్యోతి యర్రాజీ సొంతం చేసుకుంది. వరల్డ్ ర్యాంకింగ్స్ కోటాలో ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న ఆమె..100 మీటర్ల హర్డిల్స్లో బరిలోకి దిగింది. ఒలింపిక్స్లో 100 మీటర్ల హర్డిల్స్లో పోటీపడిన మొదటి భారత అథ్లెట్గా ఆమె రికార్డులకెక్కింది.దీప్తి జీవాంజికి వైఎస్ జగన్ అభినందనలుజ్యోతి యర్రాజీతో పాటు అర్జున అవార్డు గెలుచుకున్న తెలంగాణ పారా అథ్లెట్, వరంగల్కు చెందిన దీప్తి జీవాంజికి కూడా వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.ఖేల్రత్న అవార్డులకు ఎంపికైన వారికి శుభాకాంక్షలుఅదే విధంగా.. ఖేల్రత్న అవార్డులకు ఎంపికైన దొమ్మరాజు గుకేశ్(చెస్), మనూ భాకర్(షూటింగ్), హర్మన్ప్రీత్ సింగ్(హాకీ), ప్రవీణ్ కుమార్(పారా అథ్లెట్)లను కూడా వైఎస్ జగన్ ఈ సందర్భంగా అభినందించారు. అసాధారణ విజయాలతో వీరంతా దేశం గర్వించేలా చేశారని... రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు, అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. భారతీయ క్రీడలను మరింత ఎత్తుకు తీసుకుని వెళ్లటంలో వీరి కృషి అభినందనీయమని వైఎస్ జగన్ ప్రశంసించారు.చదవండి: జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటన -
Rewind 2024: విండీస్లో ‘విన్’.. మనూ సూపర్... చెస్లో పసిడి కాంతులు
ఏడాది గడిచింది. క్రీడల్లో గెలుపోటములు సహజం. కానీ సమానమంటే మాత్రం కానేకాదు. ఎందుకంటే కప్, రన్నరప్... విజేత, పరాజిత... స్వర్ణం, రజతం... ఒకటి కావు. ఒక రంగులో ఉండవు. ఒక రూపం ఉండదు. అదెప్పటికీ ప్రత్యేకం... అపురూపం!చాంపియన్కు, టైటిల్కు, ట్రోఫీకి ఉండే విలువే వేరు. నేటితో గడిచిపోయే ఈ యేడాది స్పోర్ట్స్ డైరీలో మరుపురాని విజయాలెన్నో, చిరస్మరణీయ క్షణాలెన్నో ఉన్నాయి. ఓ ప్రపంచకప్ విజయం. ‘పారిస్’లో పతకాల ప్రతాపం. పారాలింపిక్స్లో అయితే పతకాల తోరణం!చెస్లో ప్రపంచ చాంపియన్లు, ఒలింపియాడ్లో స్వర్ణాలు. ఇవన్నీ కూడా సొంతగడ్డపై కాదు... విదేశాల్లోనే విజయకేతనం! ఇది కదా భారత క్రీడారంగానికి శుభ వసంతం... ఏడాది ఆసాంతం! పట్టుదలకు పట్టం, ప్రతిభకు నిదర్శనం... మన క్రీడాకారుల విజయగర్జన. కొత్తేడాదికి సరికొత్త ప్రేరణ. విండీస్లో ‘విన్ ఇండియా’ కపిల్దేవ్ సారథ్యంలో 1983లో తొలి వన్డే వరల్డ్కప్ గెలిచిన చాలా ఏళ్లకు మళ్లీ ధోనీ బృందం 2011లో భారత్కు రెండో వన్డే ప్రపంచకప్ ముచ్చట తీర్చింది. అంతకంటే ముందు ఆరంభ టీ20 ప్రపంచకప్ (2007)ను ధోని సారథ్యంలోని యువసేన గెలుచుకొస్తే... 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ సేన ఈ ఏడాది(T20 World Cup 2024) కరీబియన్ గడ్డపై రెండో టీ20 కప్ను అందించింది.ప్రతీ మ్యాచ్లో భారత్ గర్జనకు ప్రత్యర్థులు తలవంచారు. అయితే దక్షిణాఫ్రికాతో ఫైనల్ మాత్రం కాస్త భిన్నంగా జరిగింది. కోహ్లి ఫైనల్లో రాణించడంతో భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యం కఠినమైందో, క్లిష్టమైందో కాకపోవడం .. క్లాసెన్ అప్పటికే ఐపీఎల్తో దంచికొట్టిన ఫామ్లో ఉండటంతో మ్యాచ్ను సఫారీ చేతుల్లోకి తెచ్చాడు.దాదాపు బంతులు, పరుగులు సమంగా ఉన్న దశలో క్లాసెన్ను హార్దిక్ అవుట్ చేశాడు. నిప్పులు చెరిగే బౌలింగ్తో బుమ్రా, యువ పేసర్ అర్ష్దీప్ పరుగుల్ని ఆపేశారు. సూర్యకుమార్ చరిత్రలో నిలిచే క్యాచ్... ఇలా ప్రతిఒక్కరు కడదాకా పట్టుబిగించడంతో భారత్ ప్రపంచకప్ను సొంతం చేసుకుంది.మను భాకర్... సూపర్పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. అరడజను పతకాలైతే పట్టారు. కానీ స్వర్ణమే లోటు! బహుశా వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) (100 గ్రాముల అధిక బరువు) అనర్హతకు గురి కాకుంటే రెజ్లింగ్లో పసిడి పట్టేదేమో! షూటర్ మను భాకర్(Manu Bhaker) టోక్యోలో ఎదురైన నిరాశను అధిగమించేలా పారిస్ ఒలింపిక్స్ను చిరస్మరణీయం చేసుకుంది.ఒకే ఒలింపిక్స్లో ‘హ్యట్రిక్’ పతకం, అరుదైన ఘనత చేజారినా... ఆమె రెండు కాంస్య పతకాలు సాధించింది. మళ్లీ స్వర్ణం తెస్తాడని గంపెడాశలు పెట్టుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టాడు. స్వప్నిల్ కుసాలే (షూటింగ్), అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్) కాంస్యాలు నెగ్గారు.హాకీ ఆటకు ఒలింపిక్స్లో పునర్వైభవం మొదలైనట్లుంది. వరుస ఒలింపిక్స్లో మన పురుషుల జట్టు కాంస్యం సాధించింది. షట్లర్ లక్ష్యసేన్, లిఫ్టర్ మీరాబాయి చాను, షూటర్ అర్జున్ బబుతా త్రుటిలో ఒలింపిక్ పతకాన్ని (కాంస్యం) కోల్పోయారు. ఓవరాల్గా 206 మందితో కూడిన భారత బృందం ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో సంతృప్తికరంగా ఈవెంట్ను ముగించింది. ‘పారా’లో ఔరా అనేలా మన ప్రదర్శన పారాలింపియన్ల పట్టుదలకు వైకల్యం ఓడిపోయింది. 84 మందితో పారిస్కు వెళ్లిన మన బృందం 29 పతకాలతో కొత్త చరిత్ర లిఖించింది. పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచిన భారత్ మునుపెన్నడు గెలవనన్నీ పతకాల్ని చేజిక్కించుకుంది. ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్యాలు గెలుచుకుంది.అవని లెఖరా, సుమిత్ అంటిల్, మరియప్పన్ తంగవేలు, శీతల్ దేవి, నితీశ్ కుమార్, ప్రవీణ్ కుమార్, నవ్దీప్ సింగ్, హర్విందర్ సింగ్, ధరంవీర్ తదితరులు పతకాల పంట పండించారు. చదరంగంలో ‘పసిడి ఎత్తులు’భారత్లో చెస్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విశ్వనాథన్ ఆనంద్! ఆ తర్వాత మరెంతో మంది గ్రాండ్మాస్టర్లు వచ్చారు. కానీ అతనిలా భారత చదరంగంలో నిలిచిపోలేదు. అయితే ఈ ఏడాది మాత్రం చదరంగంలో స్వర్ణ చరిత్రను ఆవిష్కరించింది.చెస్ ఒలింపియాడ్, క్యాండిడేట్స్ టోర్నీ (ప్రపంచ చాంపియన్తో తలపడే ప్రత్యర్థిని ఖరారు చేసే ఈవెంట్), ప్రపంచ చాంపియన్షిప్, ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్షిప్ వీటన్నింటా మనదే జేగంట! ఓ రకంగా 2024 భారత చెస్ గడిల్లో తీపిగీతలెన్నో గీసింది. బుడాపెస్ట్లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో దొమ్మరాజు గుకేశ్, అర్జున్ ఇరిగేశి, విదిత్ గుజరాతి, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ... ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్ముఖ్, వంతిక అగర్వాల్, వైశాలి, తానియా సచ్దేవ్లతో కూడిన భారత బృందం విజయంతో పుటలకెక్కింది.క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన దొమ్మరాజు గుకేశ్(D Gukesh) ఇటీవల క్లాసికల్ ఫార్మాట్లో సరికొత్త ప్రపంచ చాంపియన్గా ఆవిర్భవించాడు. అనుభవజ్ఞుడు, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) ఎత్తుల్ని చిత్తుచేసి అతిపిన్న వయసులో జగజ్జేతగా గుకేశ్ కొత్త రాత రాశాడు. న్యూయార్క్లో తెలుగుతేజం, వెటరన్ ప్లేయర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్షిప్లో రెండోసారి విజేతగా నిలిచింది. –సాక్షి క్రీడా విభాగం -
గుకేశ్ను సన్మానించిన రజనీకాంత్, శివకార్తికేయన్ (ఫోటోలు)
-
గుకేశ్కు రజనీకాంత్ సన్మానం.. గిఫ్ట్ ఇచ్చిన శివకార్తికేయన్
వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన డి గుకేశ్ (D Gukesh)కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అతడిని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan) అభినందించారు. రజనీ.. గుకేశ్కు శాలువా కప్పడంతో పాటు పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ యోగి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు. పిలిచి మరీ తనకు సమయం కేటాయించినందుకు రజీకాంత్కు గుకేశ్ ధన్యవాదాలు తెలిపాడు.గిఫ్ట్ ఇచ్చిన హీరోఅటు శివకార్తికేయన్.. చెస్ ఛాంపియన్తో కేక్ కట్ చేయించి వాచ్ను గిఫ్ట్ ఇచ్చాడు. అంతేకాదు, స్వయంగా తనే అతడి చేతికి వాచీ ధరింపజేయడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలను గుకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శివకార్తికేయన్ సర్ ఎంత మంచివారో.. తన బిజీ షెడ్యూల్లోనూ నాతో పాటు నా కుటుంబంతో ఉండేందుకు సమయం కేటాయించారు అని ఎక్స్ (ట్విటర్)లో తన సంతోషాన్ని పంచుకున్నాడు.జగజ్జేతగా గుకేశ్కాగా సింగపూర్ సిటీలో జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ను ఓడించి ప్రపంచ ఛాంపియన్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి చదరంగం రారాజుగా అవతరించాడు. Thanks Superstar @rajinikanth sir for your warm wishes and inviting ,spending time and sharing your wisdom with us 🙏 pic.twitter.com/l53dBCVVJH— Gukesh D (@DGukesh) December 26, 2024 Had a great time with @Siva_Kartikeyan sir and he was kind enough to spend time with me and my family despite his busy schedule and enjoyed a lot! pic.twitter.com/GnnGx3wDs4— Gukesh D (@DGukesh) December 26, 2024చదవండి: సీఎంతో సినీ పెద్దల భేటి.. దిల్ రాజు ప్లాన్ బెడిసికొట్టిందా? -
‘వాళ్లకు ఇచ్చినట్లే.. గుకేశ్కూ పన్ను మినహాయింపు కావాలి’
ప్రపంచ చెస్ చాంపియన్గా అవతరించిన భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్కు భారీ ప్రైజ్మనీ లభించిన విషయం విదితమే. చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ను ఓడించి చాంపియన్ కిరీటాన్ని అందుకున్న ఈ పద్దెమినిదేళ్ల కుర్రాడికి రూ. 11.45 కోట్లు లభించాయి.అయితే, ఈ భారీ మొత్తంలో దాదాపు రూ. 4. 8 కోట్ల మేర గుకేశ్ టాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చెస్లో గుకేశ్ గెలిస్తే.. ఆర్థిక చదరంగంలో మాత్రం భారత ప్రభుత్వం, మంత్రి నిర్మలా సీతారామన్దే పైచేయి అంటూ నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి.మినహాయింపు ఇవ్వాలిఈ నేపథ్యంలో తమిళనాడు ఎంపీ ఆర్. సుధ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఓ లేఖ రాశారు. దేశాన్ని గర్వపడేలా చేసిన గుకేశ్కు ఆదాయ పన్ను చెల్లింపులో మినహాయింపు ఇవ్వాలని కోరారు. ‘ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయం’’ అన్న కేటగిరీలో ప్రైజ్మనీని చేర్చారన్న సుధ.. జాతిని గర్వించేలా చేసిన వారికైనా పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.వాళ్లకు ఇచ్చినట్లేతద్వారా క్రీడాకారుల్లో నూతనోత్సాహం నిండుతుందని.. క్రీడా రంగ అభివృద్దికి ఇది ఎంతగానో దోహదం చేస్తుందని సుధ తన లేఖలో పేర్కొన్నారు. భారత క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, రవిశాస్త్రిలకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం టాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చిన విషయాన్ని సుధ ఈ సందర్భంగా ప్రస్తావించారు.అంతేకాదు.. తమిళనాడు ప్రభుత్వం మాదిరి కేంద్రం కూడా గుకేశ్కు క్యాష్ రివార్డు ప్రకటించాలని ఎంపీ సుధ డిమాండ్ చేశారు. అదే విధంగా.. ఈ వరల్డ్ చాంపియన్కు జాతీయ అవార్డు కూడా ప్రదానం చేయాలని కోరారు. అత్యంత చిన్న వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్ అయిన గుకేశ్ను అభినందిస్తూ లోక్సభలో తీర్మానం పెట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ నుంచి ఎంపీగాకాగా తమిళనాడులోని మయిలదుతురై నియోజకవర్గం నుంచి ఆర్ సుధ లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి సభలో అడుగుపెట్టారు. కాగా డాన్ బ్రాడ్మన్ సెంచరీల రికార్డు(29)ను సచిన్ టెండుల్కర్ సమం చేసిన సమయంలో నాటి స్పాన్సర్ ఫియట్ కంపెనీ.. అతడికి 75 లక్షల ఫెరారీ కారును బహుమతి ఇచ్చింది. అయితే, దానికోసం కోటికిపైగా టాక్స్ కట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వానికి సచిన్ అర్జీ పెట్టగా పన్ను నుంచి మినహాయింపు లభించినట్లు సమాచారం.భారీ నజరానా అందజేతఇదిలా ఉంటే.. దొమ్మరాజు గుకేశ్ను తమిళనాడు ప్రభుత్వం మంగళవారం ఘనంగా సత్కరించింది. అతడికి రూ. 5 కోట్లు నగదు పురస్కారాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి అందజేశారు. అంతకుముందు చెన్నై వీధులలో ఓపెన్ టాప్ వాహనంలో తాను సాధించిన ట్రోఫీతో గుకేశ్ ప్రయాణించాడు.అనంతరం జరిగిన వేడుకలో తల్లిదండ్రుల సమక్షంలో గుకేశ్ను సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి సత్కరించారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ నిలిచిన విశ్వనాథన్ ఆనంద్, క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ జె.మేఘనాథరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గుకేశ్ను సత్కరించిన సీఎం స్టాలిన్ రూ. 5 కోట్ల చెక్ను అందజేశారు.చదవండి: కోటీశ్వరుడిగా గుకేశ్.. ప్రైజ్మనీపై స్పందించిన వరల్డ్ చాంపియన్ -
కోటీశ్వరుడిగా గుకేశ్.. ప్రైజ్మనీపై స్పందించిన వరల్డ్ చాంపియన్
కఠిన శ్రమ, అంకిత భావం ఉంటే ఎన్ని సవాళ్లు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని దొమ్మరాజు గుకేశ్ నిరూపించాడు. పద్దెమినిదేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్గా అవతరించి నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, గుకేశ్ ఈ ఘనత సాధించడంతో అతడి తల్లిదండ్రులు రజనీకాంత్, పద్మాకుమారిలది కీలక పాత్ర.కోటీశ్వరుడిగా గుకేశ్ఇక వరల్డ్ చాంపియన్గా గుకేశ్ రూ. 11.45 కోట్ల ప్రైజ్మనీ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. తన విజయంతో జాతి మొత్తాన్ని గర్వపడేలా చేసిన ఈ గ్రాండ్ మాస్టర్కు తమిళనాడు ప్రభుత్వం ఏకంగా రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గుకేశ్ కోటీశ్వరుడైపోయాడు.నా తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.. ఇకపైఈ విషయం గురించి గుకేశ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రైజ్మనీ నాకు ఎంత ముఖ్యమైనదో మాటల్లో చెప్పలేను. అయితే, డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు. నిజానికి నేను చెస్ ఆడటం మొదలుపెట్టినపుడు మా కుటుంబం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. నన్ను ఈ స్థాయికి చేర్చడానికి... నా తల్లిదండ్రులు ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు.అయితే, ఇప్పుడు కాస్త మేము సౌకర్యవంతంగా జీవించగలుగుతాం. ఇకపై వాళ్లు దేనికీ పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. అంతేకాదు.. తనకు తెలిసింది కొంతేనని.. ఇంకా నేర్చుకోవాల్సి ఎంతో ఉందంటూ గుకేశ్.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటానని చెప్పకనే చెప్పాడు.అప్పుడే మా అమ్మకు సంతోషంఇక తన తల్లి తనకు గొప్ప చదరంగ ఆటగాడిగా కంటే.. గొప్ప మనిషిగా గుర్తింపు వచ్చినపుడే ఎక్కువ సంతోషిస్తానని చెప్పిందని ఈ సందర్భంగా గుకేశ్ వెల్లడించాడు. కాగా ప్రపంచ చెస్ చాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న నాలుగు రోజుల తర్వాత గుకేశ్ స్వదేశంలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సింగపూర్ సిటీ నుంచి అతడు సోమవారం చెన్నైకి చేరుకున్నాడు.పుట్టి పెరిగి ఆటలో ఓనమాలు చేర్చుకున్న గడ్డపై విశ్వ విజేత హోదాలో గుకేశ్కు సోమవారం భారీ స్థాయిలో ఘన స్వాగతం లభించింది. అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ప్రతినిధులు, తమిళనాడు రాష్ట్ర అధికారులతో పాటు అతను చదువుకున్న వేలమ్మాల్ స్కూల్ విద్యార్థులు, వర్ధమాన చెస్ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో విమానాశ్రయంలో గుకేశ్కు వెల్కమ్ చెప్పారు. అతని ఫోటోలు, ఇతర చెస్ చిత్రాలతో అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనంలో ఈ యువ చాంపియన్ విమానాశ్రయం నుంచి ముందుగా తన ఇంటికి వెళ్లాడు. ఆపై వేలమ్మాల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. తల్లిదండ్రులు రజనీకాంత్, పద్మాకుమారి అతని వెంట ఉన్నారు. ఇక మంగళవారం గుకేశ్కు స్థానిక కలైవానర్ ఆరంగం ఆడిటోరియంలో ప్రత్యేక సన్మానం జరిగే అవకాశం ఉంది. ఇదే కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొని ఇప్పటికే ప్రకటించిన రూ.5 కోట్ల బహుమతి పురస్కారాన్ని గుకేశ్కు అందించనున్నారు.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకారం వల్లే‘నాకు మద్దతు పలికిన అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి సహకారం నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వరల్డ్ చాంపియన్గా నిలవడం చాలా గొప్పగా ఉంది. భారత ఆటగాడు మరోసారి విశ్వ విజేత కాగలిగాడు. నా ఈ విజయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా ఎంతో ఉంది. గత ఏడాది గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నీ నిర్వహించి నాకు స్పాన్సర్షిప్ అందించడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు.అక్కడ గెలవడంతో క్యాండిడేట్స్ విజయానికి పునాది పడింది. ఇలాంటి సహకారం ఉంటే రాష్ట్రం నుంచి మరెంతో మంది ఆటగాళ్లు పైస్థాయికి చేరతారు. ఈ రోజు లభించిన స్వాగతాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. రాబోయే కొన్ని రోజులు కలిసి సంబరాలు చేసుకుందాం’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు.ఆయన సహకారం మరువలేనిదితన చాంపియన్షిప్ విజయంపై స్కూల్ విద్యార్థులు అడిగిన ప్రశ్నకు సమాధానిస్తూ... ‘చెస్లో విజయం అంటే బాగా ఆడితేనే సరిపోదు. ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుంది. దానిని అధిగమించాలి. అందుకే మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ సహకారం తీసుకున్నాను. ఆయనతో కలిసి పని చేయడం నాకు కలిసొచ్చింది’ అని వెల్లడించాడు. కాగా ఈఎన్టీ స్పెషలిస్ట్ అయిన గుకేశ్ తండ్రి కుమారుడి ప్రయాణంలో తోడుండేందుకు తన వృత్తిని త్యాగం చేయగా.. తల్లి పద్మాకుమారి ఉద్యోగం(మైక్రోబయాలజిస్ట్) చేస్తూ కుటుంబాన్ని పోషించారు. చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
గుకేశ్ ప్రైజ్మనీలో చెల్లించాల్సిన ట్యాక్స్ ఎంతంటే?
అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన డీ గుకేశ్కు దేశ ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్, టెక్ సీఈఓ సుందర్ పిచాయ్ శుభాకాంక్షలు తెలిపారు. 58 ఎత్తుల్లోప్రత్యర్థి ఆటకు చెక్ పెట్టిన గుకేశ్ ప్రైజ్ మనీ కింద సుమారు రూ.11 కోట్లు పొందనున్నారు. అయితే ఇందులో ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది? చివరగా చేతికి వచ్చేది ఎంత అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.వరల్డ్ చెస్ పెడరెషన్ (ఫిడే) ప్రకారం.. చెస్ ఛాంపియన్షిప్ మొత్తం ప్రైజ్ మనీ రూ.20.75 కోట్లు. ఒక గేమ్ గెలిచిన వారికి రూ.1.68 కోట్లు ఇస్తారు. ఇలా గుకేష్ మూడు గేమ్స్ గెలిచాడు. ఈ లెక్కన మొత్తం రూ.5.04 కోట్లు గుకేష్ సొంతమయ్యాయి. రెండు గేమ్స్ గెలిచిన డింగ్కు రూ. 3.36 కోట్లు దక్కాయి. అంటే మొత్తం ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీతో ఇద్దరు ఆటగాళ్లు రూ.8.40 కోట్లు కైవసం చేసుకోగా.. మిగిలిన రూ.12.35 కోట్లను ఇద్దరికీ సమానంగా పంచుతారు. ఇలా గుకేశ్కు రూ.11 కోట్ల కంటే ఎక్కువ ప్రైజ్ మనీ అందుతుంది.గుకేశ్కు వచ్చిన ప్రైజ్ మనీతో 30 శాతం లేదా రూ.4.67 కోట్లు ట్యాక్స్ కింద కట్ చేస్తారు. ఈ లెక్కన మొత్తం పన్నులు చెల్లించిన తరువాత గుకేష్ చేతికి అంతేది రూ.6.33 కోట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గెలిచింది గుకేష్ కాదు, ఆర్ధిక శాఖ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.ఇది టీడీఎస్.. అంటే ట్యాక్స్ డిటెక్టెడ్ బై సీతారామన్ అని మరికొందరు చెబుతున్నారు. ఆట ఆడకుండానే.. ఆదాయపన్ను శాఖ గెలిచిందని ఇంకొకరు అన్నారు. ఆటగాళ్లపై విధించే ట్యాక్స్లను తగ్గించాలని చాలామంది నెటిజన్లు చెబుతున్నారు.ఐపీఎల్ వేలంలో కూడా..ఇటీవల జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా క్రికెటర్ 'రిషబ్ పంత్' ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్.. 27 కోట్ల రూపాయలకు పలికినప్పటికీ, పన్నులు వంటివి పోగా అతని చేతికి వచ్చే డబ్బు చాలా తగ్గుతుంది. పంత్ ఐపీఎల్ వేతనంలో కొంత శాతం ట్యాక్స్ రూపంలో పోతుంది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.8.1 కోట్లు చేరుతుంది. అంటే పంత్ చేతికి వచ్చే డబ్బు రూ. 18.9 కోట్లన్నమాట. -
చెన్నైకి చేరుకున్న గుకేశ్.. వరల్డ్ చాంపియన్ భావోద్వేగం
ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. చదరంగ రారాజు హోదాలో తొలిసారి భారత్లో అడగుపెట్టాడు. ఈ వరల్డ్ చాంపియన్ సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాడు.నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారుఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ అధికారులు, జాతీయ చెస్ సమాఖ్య ముఖ్యులు, అభిమానులు గుకేశ్కు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా... గుకేశ్ మాట్లాడుతూ.. ‘‘సొంతగడ్డ మీద తిరిగి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. మీ అభిమానం, మద్దతు చూసిన తర్వాత.. భారత్కు ఈ విజయం ఎంతటి గొప్ప అనుభూతిచ్చిందో నాకు మరింతగా అర్థమైంది. మీరంతా అత్యద్భుతం. నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా భారత్ తరఫున వరల్డ్ చెస్ చాంపియన్గా నిలిచిన రెండో ఆటగాడిగా పద్దెమినిదేళ్ల గుకేశ్ చరిత్రకెక్కాడు. చెన్నైకే చెందిన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసులోనే ప్రపంచ చాంపియన్ అయిన చెస్ ప్లేయర్గానూ రికార్డు సాధించాడు. సింగపూర్ సిటీలో ఇటీవల జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో గుకేశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ను ఓడించిడిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ను ఓడించి చాంపియన్ కిరీటాన్ని అందుకున్నాడు. 32 ఏళ్ల లిరెన్తో జరిగిన 14 గేమ్ల పోరులో 7.5–6.5 పాయింట్ల తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి విజేతగా అవతరించాడుభారీ నజరానాఈ నేపథ్యంలో దొమ్మరాజు గుకేశ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక వరల్డ్ చాంపియన్గా ట్రోఫీతో పాటు గుకేశ్ 13 లక్షల 50 వేల డాలర్ల(రూ.11.45 కోట్లు) ప్రైజ్మనీ పొందాడు. ఇక తమ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకువచ్చిన గుకేశ్ను కొనియాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానా ప్రకటించారు. గుకేశ్కు రూ. ఐదు కోట్ల క్యాష్ రివార్డు అందచేస్తామని తెలిపారు. చదవండి: WPL 2025 Auction: ఆశ్చర్యం.. అనూహ్యం.. వారిపై కోట్ల వర్షం! వీరికి మొండిచేయి#WATCH | Chennai, Tamil Nadu: World Chess Champion #GukeshD says, "I am very glad to be here. I could see the support that and what it means to India...You guys are amazing. You gave me so much energy..." pic.twitter.com/iuFXDiLcjx— ANI (@ANI) December 16, 2024 -
అందుకే అంతగా ఏడ్చాను!
సింగపూర్ సిటీ: వరల్డ్ చెస్ చాంపియన్గా ఖాయమైన తర్వాత దొమ్మరాజు గుకేశ్ ఎంతో భావోద్వేగానికి లోనైన వీడియోను అభిమానులంతా చూశారు. విజయానంతరం అతను కన్నీళ్లపర్యంతమయ్యాడు. దీనిపై ‘ఫిడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుకేశ్ మాట్లాడాడు. అందుకు కారణాన్ని వివరించాడు. ‘నేను ఈ పోరులో మొదటినుంచి ఆధిక్యం కనబర్చలేదు. కొన్ని గేమ్లలో విజయానికి దగ్గరగా వచ్చి కూడా ఆ అవకాశం ఉపయోగించుకోలేకపోయాను. అంతా సాఫీగా, ఏకపక్షంగా పోరు జరిగి నా గెలుపు కాస్త ముందే ఖాయమై ఉంటే నేనూ మామూలుగానే కనిపించేవాడినేమో. కానీ చివర్లో గెలిచిన తీరుతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. అప్పటి వరకు గేమ్ డ్రా అవుతుందని, టైబ్రేక్కు వెళితే ఎలా సిద్ధం కావాలనే విషయం గురించి కూడా ఆలోచనలు మెదులుతున్నాయి. కానీ అద్భుతం జరిగి గెలిచేశాను. పైగా ఎనిమిదేళ్ల వయసులో చెస్ నేర్చుకున్న రోజులు కూడా ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. అందుకే ఆ కన్నీళ్లు’ అంటూ గుకేశ్ వివరించాడు. తాను ప్రపంచ చాంపియన్గా నిలిచినా...ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, అయితే ప్రతీ సవాల్కు తాను సిద్ధమేనని గుకేశ్ వ్యాఖ్యానించాడు. పైగా చదరంగంలాంటి ఆటలో ఎవరూ వంద శాతం పర్ఫెక్ట్గా ఉండరని అతను అన్నాడు. ‘ఇప్పటి వరకు చెస్ను శాసించిన గొప్ప గొప్ప ఆటగాళ్లకు కూడా పరాజయాలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. ఆటలో నేర్చుకునేందుకు ఇంకా అవకాశం ఉంటుంది. నా వయసు కూడా అందుకు సహకరిస్తుంది. ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని గుకేశ్ చెప్పాడు. చాంపియన్షిప్ సమయంలో తనకు సరిగ్గా ఇంటి భోజనం తరహాలో దక్షిణాది వంటకాలు అందించిన చెఫ్కు అతను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. -
'వరల్డ్ టైటిల్స్ సర్కస్.. గుకేశ్తో పోటీ పడే ఆలోచనే లేదు'
ప్రతిష్ఠాత్మక చెస్ ప్రపంచ చాంపియన్షిప్లో టైటిల్ విజేతగా భారత గ్రాండ్ మాస్టర్ డి గుకేశ్ నిలిచిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్పై 7.5 - 6.5 పాయింట్ల తేడాతో విజయం సాధించిన గుకేశ్.. కేవలం 18ఏళ్ల వయస్సులోనే విశ్వవిజేతగా నిలిచాడు.తద్వారా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్న అతి పిన్న వయష్కుడిగా గుకేశ్ నిలిచాడు. కాగా చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్తో వరల్డ్ చాంపియన్షిప్ మ్యాచ్లో తలపడాలని అనుకుంటున్న గుకేశ్ కోరిక ఇప్పట్లో నెరవేరకపోవచ్చు.విశ్వ విజేతగా నిలిచిన తర్వాత గుకేశ్ తన మనసులో మాటను వెల్లడించాడు. కార్ల్సన్తో పోరు అన్నింటికంటే పెద్ద సవాల్ అని... అతడిని ఓడిస్తే అసలైన చాంపియన్ అవుతారని గుకేశ్ వ్యాఖ్యానించాడు. అయితే కార్ల్సన్ పరోక్షంగా దీనిపై స్పందించాడు. నేరుగా గుకేశ్ పేరు చెప్పకపోయినా తనకు ఆసక్తి లేదని వెల్లడించాడు. వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించనంటూ గతంలో స్వచ్ఛందంగా కిరీటాన్ని వదిలేసుకున్న కార్ల్సన్... "వరల్డ్ ఛాంపియన్ షిప్లో గుకేశ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. గుకేశ్ హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగాడు. కానీ ఈ చెస్ గేమ్లో గెలవడం అంత ఈజీ కాదు. గుకేశ్ విజేతగా నిలిచేందుకు తీవ్రంగా శ్రమించాడు.గేమ్పై తన పట్టుకోల్పోకుండా గుకేశ్ మంచి పోరాటపటిమ చూపించాడు. డింగ్ లిరెన్ కూడా బాగా ఆడాడు. కానీ చివరికి గుకేశ్ ఛాంపియన్గా నిలిచాడు. అయితే వచ్చే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో పాల్గొనడంపై అందరూ అడుగుతున్నారు. గుకేశ్తో పోటీ పడే ఆలోచనే లేదు.ఈ వరల్డ్ టైటిల్స్ సర్కస్లో నేను ఇకపై ఎక్కడా భాగం కాబోను" అని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. అని తాజాగా వ్యాఖ్యానించాడు. దాంతో మున్ముందు గుకేశ్, కార్ల్సన్ మధ్య పోరు దాదాపు అసాధ్యం కావచ్చు! -
కావాలనే ఓడిపోయాడా?.. అంతర్జాతీయ చెస్ సమాఖ్య స్పందన ఇదే
క్రీడల్లో ఆటగాళ్లు పొరపాటు చేయడం సహజమని అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడు అర్కాడీ వొర్కొవిచ్ తెలిపారు. అంత మాత్రాన ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో పోటీతత్వం, తీవ్రత లేవనే విమర్శలు అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. సింగపూర్ సిటీ వేదికగా గురువారం ముగిసిన వరల్డ్ చెస్ చాంపియన్షిప్లో దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.చెస్ ఆట అంతమైందంటూభారత్కు చెందిన ఈ 18 ఏళ్ల టీనేజ్ గ్రాండ్మాస్టర్ పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే, ఈ టోర్నీ పోటీలపై మాజీ ప్రపంచ చాంపియన్, రష్యా గ్రాండ్మాస్టర్ వ్లాదిమిర్ క్రామ్నిక్ స్పందిస్తూ చెస్ ఆట అంతమైందని తీవ్ర పదజాలాన్ని వాడాడు. చెస్లో 14 రౌండ్ల పాటు జరిగిన గేముల్లో పోటాపోటీ కొరవడిందని, గట్టి పోటీ కనిపించనే లేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.అతడివి పిల్లచేష్టలు.. ఏ ఆటలోనైనా సహజమేఅంతేకాదు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగిన చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ వేసిన ఎత్తులు పిల్లచేష్టలుగా అభివర్ణించాడు. దీనిపై రష్యాకే చెందిన వొర్కొవిచ్ స్పందిస్తూ ‘క్రీడల్లో పొరపాట్లు చాలా సహజం. ఈ పొరపాట్లనేవి జరగకపోతే ఫుట్బాల్లో గోల్సే కావు. ప్రతీ ఆటగాడు పొరపాట్లు చేస్తాడు. ఆ తప్పుల కోసమే ప్రత్యర్థి కాచుకొని ఉంటాడు. సరైన అవకాశం రాగానే అందిపుచ్చుకుంటాడు. ఇదంతా ఏ ఆటలోనైనా సహజమే. ప్రపంచ చెస్ టైటిల్ కోసం తలపడిన లిరెన్, గుకేశ్లకు అభినందనలు, టైటిల్ గెలిచిన గుకేశ్కు కంగ్రాట్స్’ అని అన్నారు.ఇక వరుసగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన మాగ్నస్ కార్ల్సన్ కూడా కొన్ని రౌండ్లు చూస్తే ప్రపంచ చెస్ టైటిల్ కోసం జరిగినట్లుగా తనకు అనిపించలేదని... ఏదో ఓపెన్ టోర్నీలోని గేములుగా కనిపించాయని అన్నారు. పట్టించుకోవాల్సిన అవసరం లేదుకానీ భారత సూపర్ గ్రాండ్మాస్టర్, ఐదుసార్లు చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ అంతా అయ్యాక ఇలాంటి విమర్శలు రావడం ఎక్కడైనా జరుగుతాయని, వీటిని గుకేశ్ పట్టించుకోవాల్సిన అవసరం లేనేలేదని కొత్త చాంపియన్కు సూచించాడు. భారత యువ గ్రాండ్మాస్టర్ కొత్త చరిత్ర లిఖించాడని హర్షం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఫిడే అధ్యక్షుడు అర్కాడీ వొర్కొవిచ్ సైతం వ్లాదిమిర్ క్రామ్నిక్, కార్ల్సన్ విమర్శలను కొట్టిపడేస్తూ గుకేశ్కు అండగా నిలవడం విశేషం.చదవండి: గుకేశ్కు భారీ నజరానా ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం -
చదరంగ కీర్తి.. గుకేశ్ స్ఫూర్తి
సరదాగా స్నేహితులతో కలిసి సినిమాలు, షికార్లు చేసే వయస్సులో చెస్లో జగజ్జేతగా నిలిచాడు. 18 సంవత్సరాల అతి పిన్న వయస్సులో కలలో కూడా ఊహించని చరిత్రను తిరగరాశాడు. భారత ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తి చేశాడు. కుర్రాడిగా పావులు కదుపుతూ సీనియర్ క్రీడాకారుడిని ఖంగుతినిపించి ప్రపంచ మేధావుల దృష్టిని ఆకర్శించాడు. అతనెవరో కాదు దొమ్మరాజు గుకేశ్. ఇప్పుడు ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా.. చెస్లో ప్రపంచ చాంపియన్గా నిలిచిన గుకేశ్ గురించే చర్చ. ఈ నేపథ్యంలో గుకేశ్ ఆటలో ఎత్తుగడలు, విజయం సాధించిన తీరు, తదితర అంశాలపై ఉమ్మడి జిల్లా చెస్ క్రీడాకారులు, క్రీడాభిమానుల మనోగతం ‘సాక్షి’ పాఠకుల కోసం. ఆరేళ్లకు ఎలో రేటింగ్రెండు సంవత్సరాలుగా చెస్ నేర్చుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో నిర్వహించిన చెస్ టోర్నీలో ర్యాపిడో విభాగంలో దేశవ్యాప్తంగా 1,485వ ఎలో రేటింగ్ వచ్చింది. మా అమ్మనాన్న చాలా సంతోషపడ్డారు. ఈ రోజు పేపర్లలో గుకేశ్ ఫొటోలు చూపించి, అతని గురించి వివరిస్తుంటే.. నేను కూడా ప్రపంచ విజేత కావాలనే ఆకాంక్ష పెరిగింది. రాంనగర్లోని మాంటిస్సోరి స్కూల్లో 1వ తరగతి చదువుతున్న దేవాన్ష్ రెడ్డి, ఆరేళ్ల వయస్సులోనే జాతీయ స్థాయి రేటింగ్ రావడం విశేషం.–దేవాన్ష్ రెడ్డి, రాంనగర్గుకేశ్ ఆటతీరు నచ్చిందిపదేళ్లుగా చెస్లో శిక్షణ పొందుతున్నాను. చాలా మంది గ్రాండ్ మాస్టర్ల ఆటను చూసేవాడిని. విశ్వనాథ్ ఆనంద్, కోనేరు హంపి, ఇరిగేసి అర్జున్ టోర్నమెంట్లను చూశాను. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్, గుకేశ్ స్టైల్ కళ్లు తిప్పుకోకుండా చేసింది. ఆయన ఆడిన టోర్నమెంట్ వీడియోలు చూసూ్తనే ఉన్నాను. ఆయన స్ఫూర్తితో ఉన్నతస్థాయి టోర్నమెంట్లలో విజేతగా నిలిచేందుకు శ్రమిస్తా.– బి.విశ్వజిత్సాయి, హనుమకొండనేనే ఆడినట్లుగా టెన్షన్ పడ్డానుప్రపంచ స్థాయి వేదికగా గుకేశ్ ఆడుతుంటే నేనే అక్కడ కూర్చుని ఆడినట్లుగా టెన్షన్ పడ్డాను. ఆటముగిసే వరకు మా స్నేహితులం ప్రతిక్షణం ఆసక్తిగా వీక్షించాం. నాలుగు గంటలకు పైగా సాగిన ఆ ఆటలో గుకేశ్ విజయం సాధించడం నేను ఎన్నటికీ మరిచిపోలేను. గుకేశ్ ఆట తీరు, ఆయన ఆత్మవిశ్వాసం నాకెంతో స్ఫూర్తిని అందించాయి.– సూర్యప్రతాప్కోటి, 8వ తరగతి, వరంగల్అద్భుత విజయంఅతి చిన్న వయస్సులో గుకేశ్ ప్రపంచ విజేతగా నిలవడం అసాధారణ విషయం. మాలాంటి క్రీడాకారులకు స్ఫూర్తిని అందించాడు. విశ్వవిజేతగా విశ్వనాథన్ ఆనంద్ తర్వాత గుకేశ్ సాధించిన విజయం మాటల్లో చెప్పలేని అద్భుతం. గుకేశ్ ఆట తీరును చాలా సార్లు దగ్గరి నుంచి చూశాను. ప్రపంచ రికార్డు సమయంలో ఆడిన ఆట అందుకు భిన్నంగా ఉంది. వేసే ప్రతి అడుగు ప్రత్యర్థిని ఇరుకున పెట్టేలా ఉంది. గుకేశ్ ఆత్మవిశ్వాసం, ఆట తీరు నాలో మరిన్ని విజయాలు సాధించాలన్న పట్టుదలను నింపాయి.– వేల్పుల సరయు, మొండ్రాయి, వరంగల్, అంతర్జాతీయ క్రీడాకారిణి -
గుకేశ్పై విమర్శలు: కొన్నిసార్లు పేలవంగా ఆడాను.. నిజమే.. కానీ
తన గెలుపును విమర్శిస్తున్న వారికి ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘ఇలాంటి వ్యాఖ్యలు నన్నేమీ బాధపెట్టలేదు. కొన్ని గేమ్లు ఆశించిన స్థాయిలో దూకుడుగా సాగలేదనేది వాస్తవమే. అయితే చెస్ బోర్డుపై ఆటలో వేసే ఎత్తులు మాత్రం వరల్డ్ చాంపియన్ను నిర్ణయించవు. పట్టుదల, పోరాటతత్వం ఉండటంతో పాటు మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తే గెలుస్తాడు.కొన్నిసార్లు పేలవంగా ఆడాను.. నిజమే.. కానీవీటిన్నింటిని నేను చూపించానని నమ్ముతున్నా. ఆట విషయానికి వస్తే ఇది అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కాకపోవచ్చు. ఎందుకంటే నేను తొలిసారి ఆడుతున్నాను. ఇతరులతో పోలిస్తే నాపై ఒత్తిడి కూడా భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు నేను పేలవంగా ఆడాననేది కూడా నిజం. అయితే కీలక సమయాల్లో నేను సత్తా చాటి స్థాయిని ప్రదర్శించగలిగాను. దాని పట్ల నేను సంతోషంగా ఉన్నా’ అని గుకేశ్ వివరించాడు. చదరంగం చచ్చిపోయింది అంటూ విమర్శలుకాగా.. ‘గుకేశ్, లిరెన్ మధ్య గేమ్లు చూస్తే అసలు వరల్డ్ చాంపియన్షిప్లా లేదు... చదరంగం చచ్చిపోయింది... ఒక చిన్న తప్పు వరల్డ్ చాంపియన్ను నిర్ణయించడం ఏమిటి?’... గురువారం గుకేశ్ గెలుపు అనంతరం వచ్చిన విమర్శలివి! స్టార్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్తో పాటు మాజీ ఆటగాడు క్రామ్నిక్ తదితరులు గుకేశ్ ఘనతకు గౌరవం ఇవ్వకుండా ఆ విజయం స్థాయిని తక్కువగా చేసి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గుకేశ్ పైవిధంగా స్పందించాడు. వరల్డ్ చాంపియన్షిప్ విజయానికి ఆటతో పాటు మరెన్నో కారణాలు ఉంటాయని అతను అభిప్రాయపడ్డాడు.విమర్శలను పట్టించుకోవద్దు: ఆనంద్ వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాత గుకేశ్ ఆటపై వస్తున్న కొన్ని విమర్శలను భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తిప్పి కొట్టాడు. ఎవరో ఒకరు ఇలాంటి మాటలు అంటూనే ఉంటారని, వాటిని పట్టించుకోవద్దని అతను గుకేశ్కు సూచించాడు. ‘గుకేశ్ చరిత్ర సృష్టించడం నేను కళ్లారా చూశాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. విమర్శలు ప్రతీ మ్యాచ్కు వస్తూనే ఉంటాయి.విజయాలు సాధించినప్పుడు ఇలాంటివి సహజం. వరల్డ్ చాంపియన్ అయ్యాక ఎవరో అనే ఇలాంటి మాటలను లెక్క చేయవద్దు. లిరెన్ క్షణం పాటు ఉదాసీనత ప్రదర్శించాడు. ఇలాంటి క్షణాలు వరల్డ్ చాంపియన్షిప్లో దాదాపు ప్రతీ మ్యాచ్లో వస్తాయి. గుకేశ్ దానిని బాగా వాడుకున్న తీరును ప్రశంసించాలి’ అని ఆనంద్ పేర్కొన్నాడు. ఎన్నో త్యాగాలు చేశాడు ‘‘గుకేశ్ విశ్వ విజేతగా నిలిచిన క్షణం మా జీవితంలోనే అత్యుత్తమమైనది. ఇన్నేళ్ల తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో చాలా సంతోషంగా ఉంది. గుకేశ్ ప్రపంచ చాంపియన్ అయ్యాడనే వార్త విని నేను నమ్మలేకపోయా. పది నిమిషాల పాటు ఏడ్చేశా. చిన్నప్పటి నుంచి గుకేశ్ ఎంతో క్రమశిక్షణతో చాలా కష్టపడ్డాడు. తానూ ఎన్నో త్యాగాలు చేశాడు. ఈ టైటిల్తో ఆ కష్టమంతా సంతోషంగా మారిపోయింది’’ అని గుకేశ్ తల్లి పద్మాకుమారి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. చదవండి: గుకేశ్కు భారీ నజరానా ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం -
జాతికి గర్వకారణం
పది, పన్నెండేళ్ళుగా కంటున్న కలను నెరవేరిన తరుణం ఇది. చిన్నప్పుడు ఆడడం మొదలుపెడు తూనే మనసులో నాటిన లక్ష్యాన్ని సాధించిన చేరుకున్న దిగ్విజయ క్షణాలివి. అత్యంత పిన్నవయ స్కుడైన ప్రపంచ చదరంగ ఛాంపియన్గా నిలవడంతో పద్ధెనిమిదేళ్ళ దొమ్మరాజు గుకేశ్కు చిర కాలపు స్వప్నం సాకారమైంది. చరిత్రలో నిన్నటి వరకు గుకేశ్ కేవలం పిన్నవయస్కుడైన మూడో గ్రాండ్ మాస్టర్. కానీ, సింగపూర్లో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో గురువారం సాయంకాలపు విజయంతో ఈ టీనేజ్ కుర్రాడు చదరంగ చరిత్రలో కొత్త అధ్యాయం రచించాడు. సుదీర్ఘ కాలం తరువాత మనవాడు ఒకడు ఇలా భారత ఘనవారసత్వ సంప్రదాయ ప్రాచీనక్రీడ చదరంగంలో జగజ్జేతగా నిలిచి, జాతికి గర్వకారణమయ్యాడు.చైనాకు చెందిన ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్పై చిరస్మరణీయ విజయంతో, అంచనాల్ని అధిగమించి, కాస్పరోవ్, మ్యాగ్నస్ కార్ల్సెన్ సరసన తన పేరు లిఖించాడు. గతంలో కాస్పరోవ్ పేరిట ఉన్న అత్యంత పిన్నవయస్కుడైన ప్రపంచ ఛాంపియన్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇది ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే క్షణం. మన చదరంగ క్రీడాలోకంలోనే కాదు... క్రీడాకారులందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తించే సందర్భం. నిజానికి, ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో కొన్నిసార్లు గుకేశ్ తడబడకపోలేదు. మొత్తం 14 గేమ్ల ఈ ఛాంపియన్షిప్లో గుకేశ్ ప్రస్థానం అతని పట్టుదల, వ్యూహచతురతకు నిదర్శనం. మొదట్లో తడబడి, ఓపెనింగ్ రౌండ్లో ఓటమి పాలయ్యాడు. కానీ, కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో విజృంభించాడు. విమర్శలను విజయసోపానాలుగా మలుచుకున్నాడు. పట్టువదలని విక్రమార్కు డిలా ఆటలో పైచేయి సాధించాడు. మొదటి నుంచి గుకేశ్ బృందం వేసుకున్న వ్యూహం ఒకటే. గుకేశ్ తన లాగా తాను ఆడాలి. అంతే! పక్కా ప్రణాళికతో ఈ యువ ఆటగాడు, అతని క్రీడాశిక్షకుడు, మిగతా బృందం పడ్డ శ్రమ ఫలించింది. కొన్నిసార్లు ఆట ఆరంభపుటెత్తులను ఆఖరి నిమిషంలో నిర్ణయిస్తే, మరికొన్నిసార్లు వాటి మీద వారాల తరబడి కసరత్తు చేస్తూ వచ్చారు. ఆ సాధన ఉపకరించింది. డింగ్తో ప్రతి గేమ్లోనూ తన ఓపెనింగ్స్ ద్వారా ప్రత్యర్థిని గుకేశ్ ఆశ్చర్యపరిచాడు. 14 గేమ్ల మ్యాచ్లో 13 గేమ్లు ముగిసినా, చెరి రెండు విజయాలతో టై నెలకొంది. ఆ పరిస్థితుల్లో గురువారం నాటి 14వ గేమ్ ఒక దశలో డ్రా దిశగా వెళుతున్నట్టు అనిపించినా, ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్ అనూహ్యంగా దిద్దుకోలేని తప్పు చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకొని, గుకేశ్ తన ప్రత్యర్థి ఆట కట్టించాడు. 2.5 మిలియన్ డాలర్ల బహుమతి నిధిలో సింహభాగాన్నిసంపాదించాడు. గతంలో ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన విశ్వనాథన్ ఆనందన్ తర్వాత మళ్ళీ ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడు అయ్యాడు.ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఈ చెన్నై చిన్నోడు ఈ విజయంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టిన క్షణాలు, బయటకు వస్తూనే తండ్రిని గాఢంగా హత్తుకొని మాటల కందని భావా లను మనసుతో పంచుకున్న దృశ్యాలు ఇప్పుడిప్పుడే ఎవరికీ మరపునకు రావు. గుకేశ్ ఇప్పుడు చద రంగ ప్రపంచానికి సరికొత్త రారాజు. లెక్కల్లో చూస్తే, ప్రపంచ చదరంగానికి 18వ చక్రవర్తి. చదరంగంలో గుకేశ్ ప్రస్థానం ఇప్పుడొక పూర్తి ఆవృత్తం పూర్తి చేసుకుందనుకోవచ్చు. 2013లో 7 ఏళ్ళ గుకేశ్ చెన్నైలో ప్రేక్షకుల మధ్య కూర్చొని, విశ్వనాథన్ ఆనంద్కూ, మ్యాగ్నస్ కార్ల్సెన్కూ మధ్య జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూశాడు. ఆ మ్యాచ్లో గెలిచిన కార్ల్సెన్ అప్పటి నుంచి గత ఏడాది వరకు ప్రపంచ ఛాంపియన్గా పట్టు కొనసాగించారు. నిరుడు డింగ్ ఆ పట్టం గెలిచారు. చిన్న నాటి నుంచి అలా సౌండ్ప్రూఫ్ గ్లాస్ బూత్లో కూర్చొని, ఆటలో గెలవాలని కలలు గన్న గుకేశ్ ఎట్టకే లకు ఆ స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు. అయితే, ఇంత త్వరగా తన ఆకాంక్ష నెరవేరుతుందని అతనూ ఊహించలేదు. కార్ల్సెన్ నంబర్ 1 ర్యాంకులో ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ తాను ప్రపంచ అత్యుత్తమ ఆటగాణ్ణి కాదని వినయం ప్రదర్శిస్తున్నాడు. ఏదో ఒక రోజున కార్ల్సెన్లా చెస్ ప్రపంచాన్ని ఏలాలని తమిళనాట పెరిగిన ఈ తెలుగు మూలాల టీనేజ్ కుర్రాడు ఆశిస్తున్నాడు. గతంలో 22 ఏళ్ళ వయసుకే గ్యారీ కాస్పరోవ్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్ సాధించారు. అప్పట్లో ఆయన అనటోలీ కార్పోవ్ను ఓడించి, ఆ టైటిల్ సాధించి, అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించారు. కేవలం పన్నెండేళ్ళ ఏడు నెలల వయసుకే గ్రాండ్ మాస్టరైన గుకేశ్ ఇప్పుడు 18వ ఏట ఆ ఘనత సాధించడం ఎలా చూసినా విశేషమే. గుకేశ్ బాటలోనే మన దేశ కీర్తిపతాకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగల సత్తా ఉన్న ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇటీవల బుడాపెస్ట్లో జరిగిన ఒలింపియాడ్లో ఓపెన్ గోల్డ్, ఉమెన్స్ గోల్డ్... రెంటినీ భారత చదరంగ జట్లు విజయవంతంగా గెలిచాయి. ప్రస్తుతం దాదాపు 85 మందికి పైగా గ్రాండ్ మాస్టర్లు భారత్లో ఉన్నారనేది ఆశ్చర్యపరిచే గణాంకం. పైగా, వారిలో చాలామంది ఇప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రానంతటి పిన్న వయస్కులు. అంటే ఈ విశ్వక్రీడలో భారత్కు ఎంతటి బంగారు భవిష్యత్తు ఉందో అర్థం చేసుకోవచ్చు. రాగల రోజుల్లో ప్రజ్ఞానంద లాంటి పలువురు ప్రపంచ ఛాంపియన్లుగా ఎదగగల సత్తా పుష్కలంగా ఉన్నవారు. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ శిష్యరికంలో ఈ స్థాయికి ఎదిగిన గుకేశ్ ఇప్పుడు అలాంటి ఎందరికో సరికొత్త ప్రేరణ. సుదీర్ఘ క్రీడా జీవితం ముందున్న ఈ టీనేజర్ భవిష్యత్ ప్రయాణంలో ఈ కొత్త ప్రపంచ కిరీటం ఓ మైలురాయి మాత్రమే. రానున్న రోజుల్లో ఇలాంటివి అనేకం కైవసం చేసుకొని, మరింత మంది గుకేశ్ల రూపకల్పనకు ఈ కుర్రాడు స్ఫూర్తి కిరణంగా భాసించడం ఖాయం. -
Gukesh: ‘ట్రోఫీ చాలా బాగుంది.. కానీ అప్పుడే దానిని ముట్టుకుంటా’
సింగపూర్ సిటీ: ‘ట్రోఫీ చూడటానికి చాలా బాగుంది. కానీ నేను ఇప్పుడు దీనిని ముట్టుకోను. బహుమతి ప్రదానోత్సవ సమయంలోనే అందుకుంటాను’... విశ్వ విజేతగా నిలిచిన తర్వాతి రోజు కొత్త ఉత్సాహంతో కనిపిస్తూ గుకేశ్ చెప్పిన మాట ఇది. ముగింపు కార్యక్రమానికి కొద్దిసేపు ముందు జరిగిన ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో ఇది చోటు చేసుకుంది. వరల్డ్ చాంపియన్షిప్ ట్రోఫీని ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి అంటూ గుకేశ్ తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ఫొటో షూట్ సమయంలోనూ అతను దానిని ముట్టుకోలేదు. ప్రపంచ చాంపియన్ హోదాలో శుక్రవారం గుకేశ్ బిజీబిజీగా గడిపాడు. ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు, ఇంటర్వ్యూలతో పాటు పెద్ద సంఖ్యలో చెస్ అభిమానులకు అతను ఆటోగ్రాఫ్లు ఇచ్చాడు. వీరిలో భారత అభిమానులతో పాటు సింగపూర్కు చెందిన చదరంగ ఔత్సాహికులు కూడా ఉన్నారు. తాము వెంట తెచ్చుకున్న చెస్ బోర్డులపై వారు వరల్డ్ చాంపియన్ ఆటోగ్రాఫ్ను తీసుకున్నారు. ఆటోగ్రాఫ్ కోసం నిలబడిన వారి సంఖ్య అనంతంగా సాగింది. ఆ తర్వాత గుకేశ్ ఎంతగానో ఎదురు చూసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ‘ఫిడే’ అధ్యక్షుడు అర్కాడీ వొర్కొవిచ్ జగజ్జేత గుకేశ్కు ట్రోఫీతో పాటు బంగారు పతకాన్ని, ప్రైజ్మనీని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన భారత గ్రాండ్మాస్టర్పై ప్రశంసల వర్షం కురిపించారు. అద్భుతమైన ఆట, చిరకాలం గుర్తుండిపోయే ప్రదర్శనగా గుకేశ్ విజయాన్ని ఆయన అభివర్ణించారు. తన విజయానందాన్ని సోషల్ మీడియాలో ప్రకటిస్తూ...‘18వ ఏట 18వ చాంపియన్’ అంటూ గుకేశ్ ట్వీట్ చేశాడు. నా ప్రయాణం ఒక కలలా సాగిందిఇలాంటి క్షణం కోసం ఇంతకాలం ఎదురు చూశాను. ఇలాంటి రోజు కోసమే ప్రతీ రోజూ నిద్ర లేచేవాడిని. ఇప్పుడు ఈ ట్రోఫీని నా చేతుల్లో తీసుకున్న ఆనందంతో పోలిస్తే నా జీవితంలో ఏదీ సాటి రాదు. నా ప్రయాణం ఒక కలలా సాగింది. ఈ క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు, సవాళ్లు ఎదురయ్యాయి. కానీ నా చుట్టూ ఉన్నవారి అండతో అన్నింటినీ అధిగమించగలిగాను. కష్టాల్లో ఉన్న సమయంలో పరిష్కారం లభించనప్పుడు దేవుడే నాకు తగిన దారి చూపించాడు. –ట్రోఫీని అందుకున్న తర్వాత గుకేశ్ స్పందన -
గుకేశ్కు భారీ నజరానా
పిన్న వయస్సులోనే చదరంగ రారాజుగా అవతరించిన దొమ్మరాజు గుకేశ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పద్దెనిమిదేళ్ల వయసులో ఈ కుర్రాడు సాధించిన విజయం పట్ల యావత్ భారతావని పులకరించిపోతోంది. ‘‘సరిలేరు నీకెవ్వరు’’ అంటూ ఈ ప్రపంచ చాంపియన్కు క్రీడాలోకం నీరాజనాలు పలుకుతోంది.ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం గుకేశ్కు భారీ నజరానా ప్రకటించింది. చెన్నైకి చెందిన ఈ చెస్ ప్లేయర్కు ఏకంగా రూ. 5 కోట్ల రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.రూ. 5 కోట్ల నజరానా‘‘చిన్న వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్గా దొమ్మరాజు గుకేశ్ అవతరించిన ఈ చారిత్రక సందర్భంలో రూ. 5 కోట్ల నజరానా అందిస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది.గుకేశ్ చారిత్రాత్మక విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసింది. అతడు భవిష్యత్తులోనూ ఇలాంటి గొప్ప విజయాలెన్నో మరిన్ని సాధించాలని కోరుకుంటున్నా. ఇలాంటి యువ తారలను తీర్చిదిద్దడంలో శక్తి వంచన లేకుండా తమ మద్దతు అందిస్తున్న తమిళనాడు క్రీడా శాఖ, ఉదయనిధి స్టాలిన్కు అభినందనలు’’ అని స్టాలిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.డిఫెండింగ్ చాంపియన్ను ఓడించి.. రూ. 11 కోట్ల ప్రైజ్మనీసింగపూర్ సిటీ వేదికగా జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ను ఓడించి గుకేశ్ వరల్డ్ చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. లిరెన్తో జరిగిన 14 గేమ్ల పోరులో గుకేశ్ 7.5–6.5 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. 58 ఎత్తుల్లో 32 ఏళ్ల లిరెన్ ఆటకు చెక్ పెట్టి అత్యుత్తమ ప్రదర్శనతో చదరంగ రారాజుగా అవతరించాడు. తద్వారా విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక వరల్డ్ చాంపియన్గా ట్రోఫీతో పాటు గుకేశ్కు 13 లక్షల 50 వేల డాలర్లు (రూ.11.45 కోట్ల ప్రైజ్మనీ) లభించింది. అంతేకాకుండా మూడు గేమ్లు గెలిచినందుకు అదనంగా రూ.5.07 కోట్లు గుకేశ్కు అందాయి.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
గుకేశ్పై అక్కసు.. ప్రత్యర్థి కావాలనే ఓడిపోయాడంటూ
సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన 14 గేమ్ల పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్న్ ఓడించి గుకేశ్ విశ్వవిజేతగా నిలిచాడు. 13 గేమ్లు ముగిసేసరికి ఇద్దరూ 6.5–6.5 పాయింట్లతో సమంగా ఉండగా.. నిర్ణయాత్మకమైన ఆఖరి పోరులో గుకేశ్ తన స్కిల్స్ను ప్రదర్శించాడు.అయితే ఆఖరి గేమ్ కూడా ఇద్దరి మధ్య నువ్వానేనా అన్నట్టు సాగింది. కానీ గేమ్ డ్రా దిశగా సాగుతున్న సమయంలో 32 ఏళ్ల లిరెన్ భారీ తప్పదం చేశాడు. 55వ ఎత్తుగడలో రూక్(ఏనుగు)ను ఎఫ్2 గడిలోకి పంపించాడు. అతడి పేలవమైన మూవ్ చూసిన గుకేశ్ ఆశ్చర్యపోయాడు. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకున్నాడు. వెంటనే ఆ ఎనుగును తన ర్యాక్తో గుకేశ్ చెక్ పెట్టాడు. ఆ తర్వాత ప్రత్యర్ధికి గుకేశ్ ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. తన 58వ ఎత్తులో కింగ్ను ఇ5 గడిలోకి పంపి తన విజయాన్ని గుకేశ్ లాంఛనం చేశాడు. అయితే గుకేశ్ విజయాన్ని యావత్తు భారత్ సెలబ్రేట్ చేసుకుంటుండగా.. రష్యా చెస్ ఫెడరేషన్ మాత్రం సంచలన ఆరోపణలు చేసింది. చైనా గ్రాండ్ మాస్టర్ లిరెన్ కావాలనే ఓడిపోయాడని వ్యాఖ్యానించింది."గుకేశ్, లిరెన్న్ మధ్య జరిగిన చివరి గేమ్ ఫలితం నిపుణులు, చదరంగం అభిమానులను ఆశ్చర్యపరిచింది. నిర్ణయాత్మక గేమ్లో చైనీస్ చెస్ ఆటగాడి చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. లిరెన్ ఉన్న స్థితిలో అతడు ఓడిపోతాడని ఎవరూ ఊహించలేదు.అతడు ఓటమి చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. దీనిపై అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఫిడే) ప్రత్యేకంగా విచారణ జరపాలి" రష్యా చెస్ ఫెడరేషన్ చీఫ్ ఆండ్రీ ఫిలాటోవ్ పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో అతడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. కావాలనే ఆండ్రీ భారత్పై విషం చిమ్ముతున్నాడని నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
చదరంగంలో కొత్త రారాజు.. వరల్డ్ ఛాంపియన్గా గుకేష్ (ఫోటోలు)
-
18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్.. కన్నీరు పెట్టుకున్న గుకేశ్! వీడియో
ప్రపంచ చదరంగంలో భారత గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ కొత్త అధ్యయనాన్ని లిఖించాడు. సింగ్పూర్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చైనా గ్రాండ్ మాస్టర్ను ఓడించి గుకేశ్ టైటిల్ను గెలుచుకున్నాడు. తద్వారా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన అతిపిన్న వయస్సు ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.కేవలం 18 ఏళ్ల వయస్సులోనే వరల్డ్ ఛాంపియన్గా నిలిచి విశ్వవేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. అద్బుతమైన చెక్మెట్లతో డిఫెండింగ్ ఛాంపియన్నే ఈ యువ గ్రాండ్ మాస్టర్ ఓడించాడు. ఈ క్రమంలో 140 కోట్ల మంది భారతీయులు గుకేశ్ విజయాన్ని కొనియాడుతున్నారు.కన్నీరు పెట్టుకున్న గుకేశ్..ఆఖరి గేమ్లో విజయం ఖాయమైన అనంతరం గుకేశ్ భావోద్వేగానికి లోనయ్యాడు. చదరంగం బోర్డుపై పావులను సరిచేస్తూ గుకేశ్ కన్నీరు పెట్టుకున్నాడు. అయితే గెలిచిన వెంటనే పక్కన వున్నవారు చప్పట్లు కొట్టి అభినందిచండంతో గుకేశ్ నవ్వుతూ కన్పించాడు.ఆ తర్వాత తన సీట్ నుంచి లేచి విన్నింగ్ సెలబ్రేషన్స్ను అతడు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చెస్.కామ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.🥹🎉 @photochess pic.twitter.com/BOnIsfKtIw— Chess.com (@chesscom) December 12, 2024గుకేశ్ తండ్రి టెన్షన్ టెన్షన్..మరోవైపు లోపల ఫైనల్ గేమ్ జరుగుతుండగా గుకేశ్ తండ్రి రజనీకాంత్ సైతం తెగ టెన్షన్ పడ్డారు. గది బయట ఫోన్ చూసుకుంటూ అతడు ఆందోళనతో అటు ఇటు తిరుగుతూ కన్పించాడు. అయితే గుకేశ్ గెలిచిన వెంటనే రజనీకాంత్ అనందానికి అవధలు లేకుండా పోయాయి.తన కొడుకుని ఆలింగనం చేసుకుంటూ గెలుపు సంబరాలు జరుపునకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది. అదే విధంగా గుకేశ్ తన ఫ్యామిలీతో డ్యాన్స్ చేస్తున్న ఓ పాత వీడియోను ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్లో షేర్ చేశాడు. "ఇప్పుడు యావత్ భారత్ మొత్తం మీతో కలిసి డ్యాన్స్ చేస్తుందని" ఆయన ఎక్స్లో రాసుకొచ్చాడు. ♥️ Gukesh's dad after he realized that his son had won the World Championship 👇#GukeshDing #DingGukesh pic.twitter.com/0WCwRbmzmd— Chess.com - India (@chesscom_in) December 12, 2024 All of India is dancing with you at this very moment @DGukesh ! #GukeshDing pic.twitter.com/dEzYkCRaEz— anand mahindra (@anandmahindra) December 12, 2024 -
గుకేశ్ ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే?
18 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన గ్రాండ్ మాస్టర్ డి గుకేశ్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి నుంచి సామన్య ప్రజల వరకు గుకేశ్ విజయాన్ని కొనియాడుతున్నారు. సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో 14వ రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించి గుకేశ్ టైటిల్ను ముద్దాడాడు. గేమ్ చివరి క్షణాల్లో అద్బుతమైన ఎత్తుగడలతో చైనా గ్రాండ్ మాస్టర్ను గుకేశ్ చిత్తు చేశాడు. తద్వారా వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో జగజ్జేతగా నిలిచిన గుకేశ్కు ఎంత ప్రైజ్ మనీ లభించిందో ఓ లుక్కేద్దాం.ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ నెగ్గిన దొమ్మరాజు గుకేశ్కు ట్రోఫీతో పాటు 13 లక్షల 50 వేల డాలర్లు (రూ.11.45 కోట్ల ప్రైజ్మనీ లభించింది. అంతేకాకుండా మూడు గేమ్లు గెలిచినందుకు అదనంగా రూ.5.07 కోట్లు గుకేశ్ అందుకున్నాడు. మొత్తంగా అతడికి రూ.16.52 కోట్ల ప్రైజ్మనీ లభిచింది. అదే విధంగా రన్నరప్ డింగ్ లిరెన్ 11 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 75 లక్షలు) నగదు బహుమతి అందుకున్నాడు. రెండు గేమ్లు గెలిచిన లిరెన్కు రూ.3.38 కోట్లు దక్కాయి. మొత్తంగా చైనా గ్రాండ్ మాస్టర్ ఖాతాలో రూ.13.12 కోట్లు చేరాయి. కాగా మొత్తం ఛాంపియన్షిప్ ప్రైజ్మనీ రూ.21.75 కోట్లు కావడం గమనార్హం.చదవండి: Chess World Championship: గుకేష్ విజయం వెనక వారిద్దరూ.. -
ప్రపంచ చెస్ ఛాపింయన్ గా అవతరించిన తెలుగు తేజం
-
గుకేశ్ బృందమిదే...
వరల్డ్ ఛాంపియన్ షిప్ లాంటి మెగా ఈవెంట్లో పాల్గొనే ఆటగాడి సన్నాహాలు అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. ఈ క్రమంలో అతను కేవలం తన బుర్రకు మాత్రమే పదును పెడితే సరిపోదు. వ్యూహ ప్రతివ్యూహాల విషయంలో అనేక మంది సహాయం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ట్రెయినర్లు, సెకండ్లు, ట్రెయినింగ్ పార్ట్నర్లు కూడా అతని విజయంలో భాగస్వాములే. గుకేశ్ టీమ్లో ఐదుగురు గ్రాండ్మాస్టర్లు (జీఎం), ఒక ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) ఉన్నారు. భారత ఆటగాడు, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ ఇందులో కీలక సభ్యుడు. పోలాండ్కు చెందిన నలుగురు గ్రాండ్మాస్టర్లు గ్రెగొర్జ్ గజేస్కీ, రడొస్లావ్ వొజాసెక్, జాన్ క్రిస్టాఫ్ డ్యూడాలతో పాటు పోలాండ్కే చెందిన ఐఎం జాన్ క్లిమ్కోవ్స్కీ వీరిలో ఉన్నారు. జర్మన్ గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కీపర్ కూడా గుకేశ్ టీమ్లో సభ్యుడే. వీరితో పాటు మానసికంగా దృఢంగా ఉండేందుకు మెంటల్ ట్రెయినర్ ప్యాడీ ఆప్టన్తో కూడా గుకేశ్ కలిసి పని చేయడం విశేషం. ప్యాడీ ఆప్టన్ 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుతో... 2024 పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుతో కలిసి పనిచేశారు. -
నా కల నిజమైంది: గుకేశ్
‘లిరెన్ 55వ ఎత్తు తర్వాత నేను ఏం వేయాలో అప్పటికే సిద్ధమైపోయా. ఇక ఎత్తు వేయడమే తరువాయి. అయితే ఒక్కసారిగా అతని అడుగు నన్ను ఆశ్చర్యపరిచింది. దానిని వెంటనే నమ్మలేకపోయా. కానీ నా జీవితంలో అత్యుత్తమ క్షణం వచ్చేసిందని అప్పుడే అర్థమైపోయింది. ఆరేళ్ల వయసులో చెస్ మొదలు పెట్టాను. గత పదేళ్లుగా ఇదే కల నన్ను నడిపించింది. ప్రతీ ఆటగాడు ఇలాంటి స్థాయిని అందుకోవాలని ఆశిస్తాడు. కానీ కొందరికే అవకాశం దక్కుతుంది. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. 2013లో ఆనంద్, కార్ల్సన్ మధ్య పోరును చెన్నైలోని ఆడిటోరియంలో కూర్చొని చూసేందుకు చోటు దొరకలేదు. దాంతో గాజు తెర బయట నిలబడ్డా. ఇప్పుడు అలాంటి తరహాలో భారత జెండా పక్కన పెట్టుకొని పోటీ పడటం గర్వంగా అనిపించింది. కార్ల్సన్ టైటిల్ సాధించిన సమయంలో దానిని మళ్లీ భారత్కు అందించే ఆటగాడిని నేనే కావాలని కోరుకున్నా. అధికారికంగా నా టీమ్లో ఆనంద్ సర్ భాగస్వామి కాకపోయినా ఆయన అన్ని విధాలా నాకు సహకరించారు. నా శిక్షణ శిబిరానికి కూడా వచ్చారు. నాకు దేవుడిపై నమ్మకం ఉంది. గత ఏడాది నేను క్యాండిడేట్స్కు అర్హత కూడా సాధించలేకపోయినా ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. టైటిల్ గెలవగానే అమ్మకు ఫోన్ చేశాను. ఇద్దరమూ ఏడుస్తున్నాం తప్ప ఏమీ మాట్లాడుకోలేకపోయాం. నా తల్లిదండ్రులు నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. చెస్ను ఆస్వాదిస్తుంటే చాలు ఏదో ఒక రోజు లక్ష్యం చేరవచ్చు. 12 గేమ్ల వరకు కూడా సరిగ్గా నిద్రపోలేదు. కానీ ప్యాడీ ఆప్టన్ సూచనలు నన్ను ప్రశాంతంగా మార్చాయి. హాయిగా పడుకోగలిగాను. అందుకే తర్వాతి రెండు గేమ్లలో ఉత్సాహంగా ఉన్నాను. ఇది గెలవగానే నేను ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిని అయిపోలేదు. కార్ల్సన్ ఎలాగూ ఉన్నాడు. అతనితో తలపడాలని నాకూ ఉంది. చెస్లో అదే అత్యంత పెద్ద సవాల్. అయితే అది అతని ఇష్టంపై ఆధారపడి ఉంది. అతడిని స్ఫూర్తిగా తీసుకొనే అతని స్థాయిని అందుకోవాలనుకుంటున్నా’ అని విజయనంతరం మీడియా సమావేశంలో గుకేశ్ పేర్కొన్నాడు -
గుకేశ్... శభాష్...
న్యూఢిల్లీ: పిన్న వయస్సులోనే చదరంగంలో విశ్వవిజేతగా నిలిచిన గుకేశ్పై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి, ప్రధాని మొదలు పలువురు గుకేశ్ విజయాన్ని కొనియాడారు. అతిపిన్న వయస్సులోనే ప్రపంచ చెస్ చాంపియన్షిప్ సాధించిన గుకేశ్కు హృదయపూర్వక అభినందనలు. నిన్ను చూసి యావత్ జాతి గర్వపడుతోంది. ప్రపంచ చెస్లో భారత్ కూడా ప్రచండ శక్తి అని నీ విజయం చాటింది. భారతీయులందరి తరఫున నీకు శుభాకాంక్షలు. భవిష్యత్తులోనూ నీవు ఇలాగే రాణించాలి. –రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఅభినందనలు గుకేశ్. కెరీర్ తొలినాళ్లలోనే సంచలన విజయం సాధించావు. ఆటలో నీ ప్రతిభ, చేసిన కఠోర కృషి, కనబరిచిన అంకితభావం అసాధారణం. ఈ విజయం భారత చెస్ పుటల్లో కేవలం నీ పేరును లిఖించడమే కాదు... కలల్ని సాకారం చేసుకోవాలనుకునే లక్షల మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. భవిష్యత్లో మరెన్నో ఘనతలు, ఘనవిజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. –ప్రధాని నరేంద్ర మోదీప్రపంచ చాంపియన్షిప్ గెలిచిన గుకేశ్కు శుభాభినందనలు. నీవు సాధించిన టైటిల్ చెస్కే గర్వకారణం. భారత్ ఉప్పొంగిపోయే విజయం నీది. వెస్ట్బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీ (వాకా) గరి్వంచే క్షణాలివి. మాజీ చాంపియన్ అయిన నాకూ ప్రత్యేక క్షణాలను మిగిల్చావు. ప్రతి రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ మెరుగ్గా ఆడినా... నీవు ఎదుర్కొన్న తీరు మాత్రం అద్భుతం. –విశ్వనాథన్ ఆనంద్, ప్రపంచ మాజీ చాంపియన్ప్రపంచ చాంపియన్గా ఆవిర్భవించిన గుకేశ్కు కంగ్రాట్స్. ఒత్తిడిని జయించిన తీరు... ప్రతీ రౌండ్లోనూ కనబరిచిన నీ ఆటతీరుకు హ్యాట్సాఫ్! నీ దృఢ సంకల్పంతో యావత్ దేశాన్ని గర్వించేలా చేశావ్. నీవు సాధించింది ఓ టైటిల్ మాత్రమే కాదు... యువతరం ప్రేరణ పొందే విజయగాథ నీది. ఇంకెన్నో విజయాలు, మరెన్నో సాఫల్యాలు నీ ముందుంటాయి. –బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా ‘గుకేశ్... 64 గడుల్లో హద్దులెరుగని అవకాశాల్ని సృష్టించావు. ఆనంద్ అడుగు జాడల్లో భారత కొత్త చెస్ కెరటంగా అవతరించావు. –సచిన్ టెండూల్కర్మా ఆటలో మరో కొత్త ప్రపంచ చాంపియన్ అవతరించాడు. గుకేశ్... కంగ్రాట్స్. –ప్రపంచ చెస్ సమాఖ్య -
గుకేష్ విజయం వెనక వారిద్దరూ..
‘కొడుకు కోరికను తండ్రి తీరిస్తే ఇద్దరూ నవ్వుకుంటారు... అదే తండ్రి కోరికను కొడుకు తీరిస్తే ఇద్దరూ ఏడుస్తారు’... ఈ హీబ్రూ వ్యాఖ్యను వివరించేందుకు గురువారం కనిపించిన దృశ్యం ఒకటి చాలు! వరల్డ్ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ చివరి గేమ్ సాగుతున్న సమయంలో అతని తండ్రి రజనీకాంత్ లాబీలో తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. గెలుపు గురించి తెలిసిన క్షణాన తెలిసిన కొందరు అభినందిస్తుండగా తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఆయనకు మాటలు కూడా రాలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే గుకేశ్ బయటకు వచ్చాడు. కొడుకును హత్తుకున్న ఆయన భావోద్వేగంతో కన్నీళ్లపర్యంతమయ్యారు. తన అబ్బాయి సాధించిన ఘనత విలువేమిటో ఆయనకు తెలుసు. ఈ విజయం వెనక అతని కష్టం, సాధన ఎలాంటిదో కూడా బాగా తెలుసు.గుకేశ్ ఆటగాడిగా ఎదిగే క్రమంలో అన్ని సౌకర్యాలు, శిక్షణ అందించడంతో పాటు టోర్నీల కోసం ప్రయాణించేందుకు చాలాసార్లు వైద్యవృత్తిని పక్కన పెట్టి సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. ‘త్యాగం అనే పదం నాకు నచ్చదు. పిల్లల కోసం కష్టపడటం తల్లిదండ్రుల బాధ్యత. గుకేశ్లో చెస్ ప్రతిభను గుర్తించిన తర్వాత ప్రోత్సహించేందుకు సిద్ధమైపోయాం’ అని ఈఎన్టీ స్పెషలిస్ట్ అయిన రజనీకాంత్ గతంలో చెప్పారు. మైక్రోబయాలజిస్ట్ అయిన అమ్మ పద్మాకుమారి కూడా అన్ని వేళలా కొడుకుకు అండగా నిలిచింది. ఓటమి ఎదురైనప్పుడల్లా అతను తల్లితోనే మాట్లాడేవాడు. స్ఫూర్తిదాయక మాటలు, గాథలతో గుకేశ్ మళ్లీ కొత్త సమరోత్సాహంతో బరిలోకి దిగేందుకు అమ్మ మాటలే ఉపకరించేవి. చెన్నైలో చెస్ చాంపియన్ల అడ్డా అయిన వేలమ్మాల్ స్కూల్లో గుకేశ్ ఆట మొదలైంది. అండర్–11 జాతీయ చాంపియన్గా అతనికి మొదటిసారి గుర్తింపు లభించింది. ఆ సమయంలో అతనికి ఎలాంటి ఐఎం, జీఎం నార్మ్లు లేవు. కానీ తర్వాతి 16 నెలల వయసులో అద్భుత ఆటతో మూడు ఐఎం నార్మ్లు, మూడు జీఎం నార్మ్లు సాధించడంతో పాటు 2500 రేటింగ్ను దాటి గుకేశ్ సత్తా చాటాడు.12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్మాస్టర్గా నిలిచిన అతను పిన్న వయసులో జీఎంగా మారిన ప్రపంచ రికార్డును 17 రోజుల తేడాతో కోల్పోయాడు. అయితే ‘ఇవి నాకు పెద్ద లెక్క కాదు. ఇలాంటివేమీ లేని కార్ల్సన్ ఎక్కడికి వెళ్లాడో తెలుసు కదా. నేను అలాంటి పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నాను’ అనడం అతని ఆత్మవిశ్వాసాన్ని అప్పుడే చూపించింది. ఆ తర్వాత ఆసియా యూత్, వరల్డ్ యూత్, ఆసియా క్రీడలు, ఒలింపియాడ్ సహా పలు పెద్ద టోర్నీల్లో వరుస విజయాలు, రికార్డులు అతని ఖాతాలో వరుసగా వచ్చి చేరాయి. ఇటీవల సెప్టెంబరులో భారత జట్టు చెస్ ఒలింపియాడ్లో స్వర్ణం సాధించడంలో గుకేశ్ కూడా కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అతను 2783 ‘ఫిడే’ రేటింగ్తో కొనసాగుతున్నాడు. క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన తర్వాత కూడా వరల్డ్ చాంపియన్షిప్లో అతని గెలుపుపై ఏదో మూల సందేహం ఉంది. 2800 రేటింగ్ దాటడంతో పాటు ఒకదశలో వరుసగా 100 గేమ్లలో ఓటమి ఎరుగని డింగ్ లిరెన్ను నిలువరించగలడా అనే అనుమానాలను గుకేశ్ పటాపంచలు చేశాడు.18 ఏళ్ల వయస్సులో విశ్వవిజేతగా నిలిచి చరిత్రకెక్కాడు.చదవండి: తెలుగు టైటాన్స్ పరాజయం -
జగజ్జేత మన గుకేశ్
అద్భుతం జరగడంలో కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు... కానీ అసలు సమయంలో అలాంటి అద్భుతాన్ని ఎవరూ ఆపలేరు! ఒకటి కాదు... రెండు కాదు... కనీసం మూడుసార్లు దొమ్మరాజు గుకేశ్కు విజయావకాశాలు వచ్చాయి... కానీ దురదృష్టవశాత్తూ త్రుటిలో అతను వాటిని చేజార్చుకున్నాడు. మరోవైపు ప్రత్యర్థి కూడా మూడుసార్లు పైచేయి సాధించి గెలుపుపై కన్నేసినా... బలంగా నిలబడ్డాడు. అన్నింటికి మించి యుద్ధ వ్యూహాల్లో ‘సంధి’ కూడా ఒక భాగమే అన్నట్లుగా ఒక అడుగు వెనక్కి తగ్గుతూ అవసరమైనప్పుడు ‘డ్రా’లకు అంగీకరించాడు. కానీ పోరు ఆఖరి ఘట్టానికి చేరేసరికి ఇక సంధి దశకు సమయం మించిపోయింది. దాడి చేయడం మినహా మరో మార్గం లేదు. ఇక్కడ వెనుకంజ వేస్తే ఇక కోలుకునేందుకు ఎలాంటి అవకాశమూ ఉండదు. అందుకే ఆ సమయంలో తనలోని అసలైన అస్త్రశ్రస్తాలకు పదును పెట్టాడు.అతను పన్నిన ఉచ్చులో డింగ్ లిరెన్ చిక్కాడు. 55వ ఎత్తు వద్ద అతను సరిదిద్దుకోలేని తప్పిదం చేశాడు. అంతే...మరో మూడు ఎత్తుల్లోనే గుకేశ్ చైనా కింగ్ ఆట కట్టించాడు... అద్భుత ప్రదర్శనతో కొత్త చరిత్రను సృష్టిస్తూ అరవై నాలుగు గళ్ల ప్రపంచంలో రారాజుగా కిరీటధారణ చేశాడు. ఆట ముగిశాక సాంప్రదాయం ప్రకారం గుకేశ్ చెస్ బోర్డుపై మళ్లీ పావులను పేరుస్తున్నాడు... ఒక్కో గడిలో వాటిని పెడుతున్న సమయంలో అతని కన్నీళ్లు ఆగడం లేదు... ఏడుస్తూనే అభినందనలు అందుకుంటున్నాడు... ఆ భావోద్వేగాలను నియంత్రించడం సాధ్యం కావడం లేదు. అతను చేతులు జోడించి పదే పదే బోర్డుకు మొక్కుతున్న తీరు చూస్తే గుకేశ్ దృష్టిలో అది అరవై నాలుగు గళ్ల ఆట వస్తువు మాత్రమే కాదనిపిస్తోంది... అదో దేవాలయంలా, తానో భక్తుడిలా కనిపిస్తున్నాడు. 11 ఏళ్ల చిన్నారిగా ఉన్న సమయంలో ఏదో ఒక రోజు ప్రపంచ చాంపియన్ను అవుతానని చెప్పుకున్న ఆ కుర్రాడు టీనేజర్గానే ఆ లక్ష్యాన్ని చేరుకున్న క్షణాన తన ఇన్నేళ్ల కష్టం, సాధన, త్యాగాలను గుర్తు చేసుకుంటున్నట్లుగా అనిపించింది... ఆటలో తొలి ఎత్తు వేసిన నాటి నుంచే అసాధారణ ప్రదర్శనలకు చిరునామాగా మారిన గుకేశ్ నలుపు తెలుపుల గళ్లలోనే తన రంగుల ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. అతి పిన్న వయసులో గ్రాండ్మాస్టర్గా రికార్డు సృష్టించే అవకాశాన్ని 17 రోజుల తేడాతో కోల్పోయిన ఈ చెన్నై చిన్నోడు ఇప్పుడు 18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ చాంపియన్గా తన జెండా పాతాడు. –సాక్షి క్రీడా విభాగంసింగపూర్ సిటీ: భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చెస్ చాంపియన్గా ఆవిర్భవించాడు. 18 ఏళ్ల వయసులోనే విశ్వ విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయసు్కడిగా నిలిచాడు. క్లాసికల్ ఫార్మాట్లో డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్తో జరిగిన 14 గేమ్ల పోరులో గుకేశ్ 7.5–6.5 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. 13 గేమ్లు ముగిసేసరికి ఇద్దరూ 6.5–6.5 పాయింట్లతో సమంగా ఉండగా నిర్ణాయక చివరి పోరులో గుకేశ్ తన సత్తాను ప్రదర్శించాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి విజయనాదం చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్లో క్యాండిడేట్స్ టోర్నీ గెలుచుకొని వరల్డ్ చాంపియన్కు సవాల్ విసిరేందుకు సిద్ధమైన రోజు నుంచి గుకేశ్పై అంచనాలు పెరిగాయి. నవంబర్ 25 నుంచి మొదలైన ఈ సమరంలో 9 గేమ్లు ‘డ్రా’గానే ముగిశాయి. గురువారం చివరి గేమ్కు ముందు చెరో రెండు గేమ్లు గెలిచిన ఇద్దరూ సమంగా ఉన్నారు. ఈ గేమ్ కూడా ‘డ్రా’ అయితే ‘టైబ్రేక్’ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చేది. కానీ గుకేశ్ ఆ అవకాశం ఇవ్వలేదు. తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించి లిరెన్ను పడగొట్టాడు. తద్వారా క్లాసికల్ విభాగంలో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ (2012) తర్వాత వరల్డ్ చాంపియన్గా నిలిచిన భారత ప్లేయర్గా గుకేశ్ నిలిచాడు. చివరి పోరు సాగిందిలా... తెల్లపావులతో ఆడిన 32 ఏళ్ల లిరెన్ కింగ్స్ ఇండియన్ అటాక్ ఓపెనింగ్తో ఆటను మొదలు పెట్టగా... గ్రన్ఫీల్డ్ వేరియేషన్తో గుకేశ్ బదులిచ్చాడు. ఈ గేమ్ కూడా ‘డ్రా’ అయితే తన బలమైన ర్యాపిడ్లో గుకేశ్ ఆట కట్టించవచ్చని భావించిన లిరెన్ ఈసారి కూడా దూకుడు ప్రదర్శించకుండా రక్షణాత్మకంగా నే ఆడాడు. ఇక మరో ‘డ్రా’ ఖాయం అనిపించింది. ఈ దశలో లిరెన్ చేసిన భారీ తప్పిదం తన టైటిల్ కోల్పోయేలా చేసింది. తన 55వ ఎత్తులో అతను రూక్ను ఎఫ్2 గడిలోకి పంపించాడు. ఆశ్చర్యంతో గుకేశ్ కళ్లు ఒక్కసారిగా మెరిశాయి! కాస్త మంచినీళ్లు తాగిన అనంతరం గుకేశ్ తన ప్రత్యర్థి ఆట కట్టించేందుకు ఎన్ని ఎత్తులు అవసరమో ప్రశాంతంగా ఆలోచించుకున్నాడు. ఆపై ఎంతో సమయం పట్టలేదు. తన 58వ ఎత్తులో కింగ్ను ఇ5 గడిలోకి పంపడంతో లిరెన్కు ఓటమిని అంగీకరించడం మినహా మరో మార్గం లేకపోయింది. 39 ఏళ్ల రికార్డు బద్దలు రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ పేరిట 39 ఏళ్లుగా ఉన్న రికార్డును భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్ బద్దలు కొట్టాడు. క్లాసికల్ చెస్లో ప్రపంచ చాంపియన్గా నిలిచిన పిన్న వయసు్కడిగా ఇప్పటి వరకు కాస్పరోవ్ (22 ఏళ్ల 6 నెలల 27 రోజులు; 1985లో కార్పోవ్పై విజయం) పేరిట రికార్డు ఉంది. అయితే గురువారం ఈ రికార్డును గుకేశ్ (18 ఏళ్ల 8 నెలల 14 రోజులు) తిరగరాశాడు. విశ్వవిజేతగా నిలిచిన గుకేశ్కు 13 లక్షల 50 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 45 లక్షలు), రన్నరప్ డింగ్ లిరెన్కు 11 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 75 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. ‘డ్రా’లను దాటి... ‘గుకేశ్, లిరెన్ మధ్య గేమ్లు చూస్తుంటే వరల్డ్ చాంపియన్షిప్ పోరులాగా అస్సలు అనిపించడం లేదు. ఇద్దరిలో ఎవరూ పైచేయి సాధించేందుకు ఇష్టపడటం లేదు’... నార్వే చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ వ్యాఖ్య ఇది. ‘ఈ గేమ్లు ఇలాగే సాగితే చదరంగంపై ఇప్పటికి మిగిలిన ఉన్న ఆ కాస్త ఆసక్తి కూడా పోతుంది’... పలువురు మాజీలు, విశ్లేషకుల అభిప్రాయం ఇది. గుకేశ్, లిరెన్ మధ్య సాగిన పోరు చూస్తే ఇది వాస్తవమే అనిపిస్తుంది. మొదటి గేమ్లో లిరెన్ గెలుపుతో చాంపియన్షిప్ సమరం ఉత్సాహంగా మొదలైంది. రెండో గేమ్ ‘డ్రా’ కాగా... మూడో గేమ్లో గుకేశ్ విజయం సాధించి లెక్క సమం చేశాడు. ఆ తర్వాత వరుసగా ఏడు గేమ్లు ‘డ్రా’గా ముగిశాయి. దాంతో సగటు చెస్ అభిమానులు కూడా ఇదేం ఆట అన్నట్లుగా నిట్టూర్పు విడిచారు. ముఖ్యంగా ఇద్దరు ఆటగాళ్లు చెరో మూడుసార్లు గెలిచే అవకాశం వచ్చినా... వాటిని చేజార్చుకోవడం, దూకుడుగా ఆడి పైచేయి సాధించే ప్రయత్నం చేయకపోవడం కూడా ఆశ్చర్యం కలిగించింది. 10 గేమ్ల తర్వాత గుకేశ్ గెలుపుపై స్వయంగా కార్ల్సన్ కూడా సందేహం వ్యక్తం చేశాడు. లిరెన్ కూడా జాగ్రత్తగా ఆడి ర్యాపిడ్ పోరువైపు తీసుకెళ్లే ఆలోచనతో ఉన్నట్లే కనిపించింది. కానీ 11వ గేమ్లో గుకేశ్ గెలుపు ఒక్కసారిగా చలనం తీసుకొచ్చింది. ఆ వెంటనే లిరెన్ కూడా విజయంతో సమాధానమివ్వడంతో మరింత ఆసక్తి పెరిగింది. అయితే 13వ గేమ్ కూడా ‘డ్రా’ అయింది. దాంతో అందరి దృష్టి చివరి పోరుపై నిలిచింది. కానీ విశ్వనాథన్ ఆనంద్ కూడా ఫలితంపై సందేహంతోనే ఉన్నాడు. దాదాపు సగం ఆట ముగిశాక ఈ మ్యాచ్లో ఎవరైనా గెలిచే అవకాశాలు ఒక శాతం కూడా లేవని అతను అభిప్రాయపడ్డాడు. అయితే లిరెన్ చేసిన తప్పు ప్రపంచ చాంపియన్షిప్ను అనూహ్యంగా ముగించింది. అంది వచ్చిన అవకాశాన్ని సమర్థంగా వాడుకున్న మన గుకేశ్ ఈ మెగా ఈవెంట్ను భారతీయుల దృష్టిలో చిరస్మరణీయం చేశాడు. చిత్తూరు జిల్లా మూలాలు... వరదయ్యపాళెం: గుకేశ్ది చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబం. వారిది తిరుపతి జిల్లాకు చెందిన గ్రామీణ నేపథ్యం. గుకేశ్ తండ్రి రజనీకాంత్ స్వస్థలం సత్యవేడు సమీపంలోని పిచ్చాటూరు మండలం చెంచురాజుకండ్ర. ఆయన తన వైద్యవృత్తి కోసం చెన్నైకి తరలి వెళ్లగా, అక్కడే అబ్బాయి పుట్టాడు. గుకేశ్ తాత శంకరరాజు సొంత ఊరు చెంచురాజుకండ్రలోనే ప్రస్తుతం స్థిరపడ్డారు. గుకేశ్కు వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: పిన్న వయస్సులో ప్రపంచ చెస్ చాంపియన్గా అవతరించిన తెలుగు తేజంగుకేశ్ దొమ్మరాజు చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. గుకేశ్కు అభినందనలు తెలుపుతూ గురువారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. గుకేశ్ తెలుగు వాడైనందుకు గర్విస్తున్నామన్నారు. గుకేశ్ దేశంలోని యువతకు, విద్యార్థులకు ప్రేరణగా నిలవనున్నారని పేర్కొన్నారు. ఒక తెలుగు యువ కుడు ఈ రికార్డు సాధించడం అందరికీ ఆదర్శనీయమన్నారు. భవిష్యత్తులో గుకేశ్ మరిన్ని విజయాలు సాధించాలని జగన్ ఆకాంక్షించారు. -
ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గుకేష్కు ఎక్స్ వేదికగా విషెస్ చెప్పారు. ‘‘18 ఏళ్ల వయసులోనే గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్గా చరిత్రకెక్కారు. గుకేష్ తెలుగు రాష్ట్రానికి చెందినవాడు కావటం మనందరికీ గర్వకారణం. ఎంతోమంది యువకులకు ఆయన స్ఫుర్తిగా నిలిచారు. భవిష్యత్తులో కూడా గుకేష్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Gukesh Dommaraju carved his name into history as the youngest-ever World Chess Champion at the age of 18.We are proud of this 🇮🇳 boy from the Telugu state, a true inspiration to countless talented youngsters. I wish @DGukesh all the best in his continued journey of remarkable… pic.twitter.com/58JSdgNZeR— YS Jagan Mohan Reddy (@ysjagan) December 12, 2024వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించాడు. 14వ గేమ్లో గుకేశ్ ప్రస్తుత ఛాంపియన్, చైనాకు చెందిన డింగ్ లిరెన్ను ఓడించాడు. గుకేశ్ 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.విశ్వనాథన్ ఆనంద్ తర్వాత (2012) వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు. గుకేశ్ అత్యంత చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం పోటీ పడిన అతి పిన్న వయస్కుడిగానూ గుకేశ్ రికార్డు నెలకొల్పాడు. -
ప్రపంచ చెస్ ఛాంపియన్గా భారతీయుడు
సింగపూర్ సిటీ: వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించాడు. 14వ గేమ్లో గుకేశ్ ప్రస్తుత ఛాంపియన్, చైనాకు చెందిన డింగ్ లిరెన్ను ఓడించాడు. గుకేశ్ 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.THE EMOTIONS...!!! 🥹❤️- 18 Year Old Gukesh Dommaraju creating history by becoming the youngest ever champion. 🇮🇳 pic.twitter.com/LVkA8JMKM1— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2024విశ్వనాథన్ ఆనంద్ తర్వాత (2012) వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు. గుకేశ్ అత్యంత చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం పోటీ పడిన అతి పిన్న వయస్కుడిగానూ గుకేశ్ రికార్డు నెలకొల్పాడు. గుకేశ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా. THE PRECIOUS MOMENT. 🥹- Gukesh hugging his father aftee creating history. ❤️pic.twitter.com/iLs5aNFIEW— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2024 -
గుకేశ్, డింగ్ లిరెన్ 13వ గేమ్ ‘డ్రా’... నేడు చివరిదైన 14వ గేమ్
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్లో తొమ్మిదో ‘డ్రా’ నమోదైంది. భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్, చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య బుధవారం జరిగిన 13వ గేమ్ 68 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. తెల్ల పావులతో ఆడిన గుకేశ్ ‘కింగ్ పాన్’ ఓపెనింగ్ తో గేమ్ను ప్రారంభించగా... ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లిరెన్ ఫ్రెంచ్ డిఫెన్స్తో జవాబు ఇచ్చాడు. గుకేశ్ కొత్త వ్యూహాలతో చైనా ప్లేయర్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. 68 ఎత్తులు ముగిశాక ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. నిర్ణీత 14 గేముల్లో 13 గేమ్లు ముగిశాక ఇద్దరూ 6.5–6.5తో సమఉజ్జీగా ఉన్నారు. నేడు చివరిదైన 14వ గేమ్ జరుగుతుంది. ఒకవేళ చివరిదైన 14వ గేమ్ కూడా ‘డ్రా’ అయితే ఇద్దరూ 7–7తో సమంగా నిలుస్తారు. శుక్రవారం టైబ్రేక్ గేమ్లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. -
గుకేశ్, డింగ్ లిరెన్ కీలక పోరు నేడు
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్షిప్ కీలకదశకు చేరుకుంది. భారత గ్రాండ్మాస్టర్ c చైనాగ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోరులో నేడు 13వ గేమ్ జరగనుంది. వీరిద్దరి మధ్య మొత్తం 14 గేమ్లను నిర్వహించనుండగా... ఇప్పటికి 12 గేమ్లు ముగిశాయి.గుకేశ్, లిరెన్ చెరో రెండు గేముల్లో గెలిచారు. మిగతా ఎనిమిది గేమ్లు ‘డ్రా’గా ముగిశాయి. వీరిద్దరు 6–6 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. నేడు జరిగే 13వ గేమ్లో గుకేశ్ తెల్ల పావులతో ఆడతాడు. ఈ నేపథ్యంలో గుకేశ్ ఓపెనింగ్కు డిఫెండింగ్ చాంప్ లిరెన్ ఏ విధంగా జవాబు ఇస్తాడో చూడాలి. ఇప్పటికే ఒకసారి ప్రపంచ చాంపియన్ అయిన లిరెన్కు గత అనుభవం కలిసొచ్చే అవకాశముంది. 13వ గేమ్లో గుకేశ్ గెలిస్తే, చివరిదైన 14వ గేమ్లో లిరెన్ తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఒకవేళ గేమ్ ‘డ్రా’ అయినా, గుకేశ్ ఓడినా... చివరి గేమ్లో తెల్ల పావులతో ఆడనున్న లిరెన్కు పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటుంది. -
గుకేశ్కు రెండో విజయం... డింగ్ లిరెన్పై 6–5తో ఆధిక్యం
సింగపూర్ సిటీ: పిన్న వయస్సులోనే ప్రపంచ చెస్ చాంపియన్షిప్ టైటిల్ సాధించే దిశగా భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అడుగు ముందుకు వేశాడు. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో ఆదివారం జరిగిన 11వ రౌండ్ గేమ్లో 18 ఏళ్ల గుకేశ్ కేవలం 29 ఎత్తుల్లో అద్భుత విజయం సాధించాడు. వరుసగా ఏడు ‘డ్రా’ల తర్వాత ఫలితం రావడం విశేషం. ఈ గెలుపుతో గుకేశ్ 6–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మిగిలిన మూడు గేమ్లను గుకేశ్ ‘డ్రా’ చేసుకుంటే విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ అయిన రెండో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. 11వ గేమ్లో తెల్ల పావులతో ఆడిన గుకేశ్ అశ్వంతో తొలి ఎత్తును వేయగా... లిరెన్ తొలి ఎత్తు నుంచే తప్పిదాలు చేసి చివరకు 29వ ఎత్తు వద్ద తన ఓటమిని అంగీకరించాడు. నేడు జరిగే 12వ గేమ్లో లిరెన్ తెల్లపావులతో ఆడతాడు. -
వరల్డ్ చెస్ చాంపియన్షిప్లో మరో ‘డ్రా’
భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ మధ్య జరుగుతున్న వరల్డ్ చెస్ చాంపియన్షిప్ పోరులో ‘డ్రా’ల పరంపర ఆగడం లేదు. శనివారం జరిగిన పదో గేమ్ కూడా సమంగానే ముగిసింది. తొలి గేమ్లో లిరెన్, మూడో గేమ్లో గుకేశ్ గెలవగా...ఆ తర్వాత ఇది వరుసగా ఏడో ‘డ్రా’ కావడం గమనార్హం. నల్ల పావులతో ఆడిన గుకేశ్, లిరెన్ కూడా ఎలాంటి దూకుడైన ఎత్తులకు ప్రయతి్నంచలేదు. ఇద్దరూ డిఫెన్స్కే ప్రాధాన్యతనివ్వడంతో 36 ఎత్తుల తర్వాత ‘డ్రా’ ఖాయమైంది. పది గేమ్లు ముగిసిన తర్వాత గుకేశ్, లిరెన్ చెరో 5 పాయింట్లతో సమంగా కొనసాగుతున్నారు. ఈ 14 గేమ్ల పోరులో ముందుగా 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు. మిగిలిన 4 గేమ్ల ద్వారా మరో 2.5 పాయింట్లు ఎవరు సాధిస్తారనేది ఆసక్తికరం. నల్లపావులతో ఆడి గేమ్ను ‘డ్రా’గా ముగించడం సంతృప్తిగా ఉందన్న గుకేశ్... రాబోయే నాలుగు గేమ్లు ఉత్కంఠభరితంగా సాగుతాయని ఆశిస్తున్నానన్నాడు. -
గుకేశ్, డింగ్ లిరెన్ తొమ్మిదో గేమ్ కూడా ‘డ్రా’
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్లో వరుసగా ఆరో ‘డ్రా’ నమోదైంది. భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) మధ్య గురువారం జరిగిన తొమ్మిదో గేమ్ 54 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఇద్దరి మధ్య మొత్తం 14 గేమ్లు జరుగుతాయి. ఇప్పటికి తొమ్మిది గేమ్లు పూర్తయ్యాయి. మరో ఐదు గేమ్లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఇద్దరూ 4.5 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. మొదట 7.5 పాయింట్లు సాధించిన ప్లేయర్ విశ్వవిజేతగా నిలుస్తాడు. 32 ఏళ్ల డింగ్ లిరెన్ తొలి గేమ్లో గెలుపొందగా... చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్ మూడో గేమ్లో నెగ్గాడు. మిగతా ఏడు గేమ్లు ‘డ్రా’గా ముగిశాయి. నేడు విశ్రాంతి దినం. శనివారం పదో గేమ్ జరుగుతుంది. -
ఎనిమిదో గేమ్ కూడా ‘డ్రా’
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్లో మరో ‘డ్రా’ నమోదైంది. భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) మధ్య జరిగిన ఎనిమిదో గేమ్ 51 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఇద్దరి మధ్య మొత్తం 14 గేమ్లు జరుగుతాయి. ఇప్పటికి ఎనిమిది గేమ్లు పూర్తయ్యాయి.ఇద్దరూ 4 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. మొదట 7.5 పాయింట్లు సాధించిన ప్లేయర్ విశ్వవిజేతగా నిలుస్తాడు. 32 ఏళ్ల డింగ్ లిరెన్ తొలి గేమ్లో గెలుపొందగా... చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్ మూడో గేమ్లో నెగ్గాడు. మిగతా ఆరు గేమ్లు ‘డ్రా’గా ముగిశాయి. నేడు తొమ్మిదో రౌండ్ గేమ్ జరుగుతుంది. -
గుకేశ్ చేజారిన అవకాశం... లిరెన్తో ఏడో గేమ్ కూడా ‘డ్రా’
సింగపూర్ సిటీ: దొమ్మరాజు గుకేశ్ (భారత్), డింగ్ లిరెన్ (చైనా) మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్లో ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య మంగళవారం జరిగిన ఏడో గేమ్ కూడా ‘డ్రా’గా ముగిసింది. చాంపియన్షిప్ సమరంలో ఇది వరుసగా నాలుగో ‘డ్రా’ కావడం విశేషం. 5 గంటల 22 నిమిషాల పాటు సాగిన గేమ్లో 72 ఎత్తుల తర్వాత ఆటను ముగించేందుకు గుకేశ్, లిరెన్ అంగీకరించారు. అయితే కీలక దశలో గెలిచే స్థితిలో నిలిచిన గుకేశ్ దానిని వథా చేసుకోవడం అతడిని నిరాశపరిచే అంశం. తెల్ల పావులతో ఆడిన గుకేశ్ ఓపెనింగ్ నుంచే దూకుడుగా ఆడి ప్రత్యరి్థపై ఒత్తిడి పెంచాడు. గుకేశ్ 44వ ఎత్తు తర్వాత లిరెన్ ఓటమికి బాట పడినట్లుగా కనిపించింది. అయితే ఈ గెలుపు అవకాశాన్ని వాడుకోలేక గుకేశ్ వేసిన 45వ ఎత్తు లిరెన్ మళ్లీ కోలుకునేలా చేసింది. ఏడు గేమ్ల తర్వాత ఇద్దరూ చెరో 3.5 పాయింట్లతో ఉన్నారు. -
సమంగా ముగిసిన ఐదో గేమ్
భారత ఆటగాడు దొమ్మరాజు గుకేశ్, చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్షిప్ సమరంలో మరో పోరు సమంగా ముగిసింది. సింగపూర్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ ఐదో గేమ్ 40 ఎత్తుల తర్వాత ‘డ్రా’ అయింది. ఈ ఫలితం అనంతరం గుకేశ్, డిఫెండింగ్ చాంపియన్ లిరెన్ చెరో 2.5 పాయింట్లతో సమంగా కొనసాగుతున్నారు.విజేతగా నిలవాలంటే మిగిలిన 9 గేమ్లలో మరో 5 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. నల్ల పావులతో ఆడిన లిరెన్ తొలి గేమ్ తరహాలోనే ఫ్రెంచ్ డిఫెన్స్తో మొదలు పెట్టాడు. ఆ గేమ్లో ఓటమిపాలైన గుకేశ్ ఈ సారి జాగ్రత్త పడ్డాడు. అయితే 23వ ఎత్తు వద్ద గుకేశ్ తప్పుడు ఎత్తు వేసి ఓటమికి ఆస్కారం కల్పించగా...లిరెన్ దానిని గుర్తించలేకపోయాడు. దాంతో గుకేశ్ డ్రాతో గట్టెక్కాడు. ‘నేను చాలా పెద్ద తప్పు చేశానని తర్వాత అర్థమైంది. కానీ అదృష్టవశాత్తూ తప్పించుకున్నాను. ఇంకా ఈ సమరం సగం కూడా కాలేదు. కాబట్టి నాకూ మంచి అవకాశాలున్నాయని నమ్ముతున్నా’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు. ఇద్దరి మధ్య ఆరో గేమ్ నేడు జరుగుతుంది. -
గుకేశ్, లిరెన్ నాలుగో గేమ్ ‘డ్రా’
సింగపూర్ సిటీ: భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్... డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్కు ప్రతీ రౌండ్లోనూ గట్టి పోటీనే ఇస్తున్నాడు. ప్రపంచ చెస్ చాంపియన్షిప్ సమరంలో భాగంగా శుక్రవారం భారత్, చైనా ప్రత్యర్థుల మధ్య పోటాపోటీగా సాగిన నాలుగో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. నల్లపావులతో బరిలోకి దిగిన భారత టీనేజ్ గ్రాండ్మాస్టర్ గుకేశ్ ఎత్తులకు డిఫెండింగ్ చాంపియన్ తడబడ్డాడు. 32 ఏళ్ల లిరెన్ పైఎత్తులకు దీటైన సమాధానం ఇవ్వడంతో చివరకు 42 ఎత్తుల తర్వాత ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో ఇద్దరు ‘డ్రా’కు అంగీకరించారు. తొలి గేమ్లో ఓడిన గుకేశ్ రెండో గేమ్ను ‘డ్రా’ చేసుకున్నాడు. తిరిగి మూడో రౌండ్లో సత్తా చాటుకున్న 18 ఏళ్ల ఈ భారత ఆటగాడు... చైనా గ్రాండ్మాస్టర్ను ఓడించాడు. తాజాగా నాలుగో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగియడంతో ఇద్దరు 2–2 పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచారు. ఇంకా 10 గేమ్లు మిగిలిఉన్న ఈ చాంపియన్షిప్లో ముందుగా ఎవరైతే 7.5 పాయింట్లు సాధిస్తారో వారే విజేతగా నిలుస్తారు. -
మూడో గేమ్లో గుకేశ్ గెలుపు
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్లో భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అద్భుతంగా పుంజుకున్నాడు. మూడో గేమ్లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో బుధవారం జరిగిన మూడో గేమ్లో తెల్ల పావులతో ఆడిన 18 ఏళ్ల గుకేశ్ 37 ఎత్తుల్లో విజయం సాధించాడు. నిబంధనల ప్రకారం తొలి 40 ఎత్తులను 120 నిమిషాల్లో పూర్తి చేయాలి. అయితే డింగ్ లిరెన్ 37 ఎత్తులే వేయగలిగాడు. దాంతో సమయాభావం కారణంగా డింగ్ లిరెన్కు ఓటమి ఖరారైంది. ‘తొలి విజయం దక్కినందుకు ఆనందంగా ఉంది. తొలి గేమ్లో కాస్త ఒత్తిడికి లోనయ్యా. రెండో గేమ్ నుంచి కోలుకున్నాను’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ కోసం ఇద్దరి మధ్య మొత్తం 14 గేమ్లు జరగనున్నాయి. తొలి గేమ్లో డింగ్ లిరెన్ నెగ్గగా... రెండో గేమ్ ‘డ్రా’గా ముగిసింది. మూడు గేమ్ల తర్వాత ఇద్దరూ 1.5–1.5 పాయింట్లతో సమంగా ఉన్నారు. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం నాలుగో గేమ్ జరుగుతుంది. -
డింగ్ లిరెన్తో గుకేశ్ రెండో గేమ్ ‘డ్రా’
సింగపూర్ సిటీ: తొలి గేమ్లో ఎదురైన పరాజయం నుంచి భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తేరుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్లో రెండో గేమ్ను గుకేశ్ ‘డ్రా’ చేసుకున్నాడు.23 ఎత్తుల తర్వాత ఫలితం తేలే అవకాశాలు కనిపించకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. తొలి గేమ్లో డింగ్ లిరెన్ గెలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మొత్తం 14 గేమ్లు జరుగుతాయి. రెండు గేమ్ల తర్వాత డింగ్ లిరెన్ 1.5–0.5తో గుకేశ్పై ఆధిక్యంలో ఉన్నాడు. నేడు జరిగే మూడో గేమ్లో గుకేశ్ తెల్ల పావులతో ఆడతాడు. -
ఎత్తుకు పైఎత్తు...
క్లాసికల్ చెస్ ఫార్మాట్లో భారత్ నుంచి ఇప్పటి వరకు ఒక్కరే విశ్వవిజేతగా నిలిచారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ చివరిసారి 2013లో విశ్వకిరీటాన్ని అధిరోహించాడు. ఆ తర్వాత నార్వే సూపర్స్టార్ మాగ్నస్ కార్ల్సన్ దశాబ్దంపాటు చదరంగ విశ్వాన్ని ఏలాడు. అదే సమయంలో భారత్ నుంచి మరో ప్లేయర్ ఆనంద్ ఘనతలకు చేరువగా రాలేకపోయారు. కానీ గత కొన్నాళ్లుగా భారత చెస్ ముఖచిత్రం మారిపోయింది. ఒక్కసారిగా నలుగురైదుగురు తెరపైకి వచ్చి సంచలన విజయాలు సాధిస్తున్నారు. దొమ్మరాజు గుకేశ్ అందరి అంచనాలను తారుమారు చేసి ఏకంగా ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించాడు. సరైన పోటీ లేకపోవడంతో కార్ల్సన్ స్వచ్ఛందంగా ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు దూరమవ్వడంతో ... గత ఏడాది చైనా ప్లేయర్ డింగ్ లిరెన్ కొత్త ప్రపంచ చాంపియన్గా అవతరించాడు. అంతా అనుకున్నట్లు జరిగితే 11 ఏళ్ల తర్వాత భారత్ నుంచి గుకేశ్ రూపంలో మరో విశ్వవిజేత కనిపిస్తాడు. సింగపూర్ సిటీ: చదరంగ చరిత్రలోనే ఇద్దరు ఆసియా గ్రాండ్మాస్టర్ల మధ్య మరో ఆసియా వేదికపై ప్రపంచ చెస్ చాంపియన్ టైటిల్ వేటకు నేడు జేగంట మోగనుంది. దాదాపు 45 ఏళ్ల తర్వాత ఆగ్నేయాసియా దేశంలో ప్రపంచ చదరంగ విజేత పోటీలు జరుగుతున్నాయి. 1979లో ఫిలిప్పీన్స్లోని బగూవోలో జరిగితే ఇప్పుడు సింగపూర్ కొత్త చాంపియన్కు తివాచీ పరిచే అవకాశముంది. చైనాకు చెందిన డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్తో భారత గ్రాండ్మాస్టర్, 18 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్ అమీతుమీకి సిద్ధమయ్యాడు. సూపర్ గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత మళ్లీ భారత్కు ప్రపంచ చెస్ కిరీటాన్ని తెచ్చేందుకు చైనీస్ గ్రాండ్మాస్టర్పై ఎత్తుకు పైఎత్తులు వేసేందుకు ఈ తమిళనాడు టీనేజర్ ‘సై’ అంటున్నాడు. గుకేశ్ అవుతాడా మరో ఆనంద్? భారత స్టార్ గుకేశ్ ర్యాంక్ 5. గతేడాది నుంచి నిలకడైన విజయాలు సాధిస్తున్నాడు. తన ఎత్తులతో ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తున్న అతను గతేడాది ఆగస్టులో విశ్వనాథన్ ఆనంద్ లైవ్ రేటింగ్స్ను అధిగమించాడు. 1986, జూలైలో ప్రవీణ్ థిప్సే తర్వాత ఆనంద్ను దాటిన తొలి భారత ప్లేయర్గా ఘనత వహించి ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్లోకి దూసుకొచ్చాడు. ‘ఫిడే’ సర్క్యూట్లో క్యాండిడేట్స్ టోర్నీ సహా చెస్ ఒలింపియాడ్ తదితర ఈవెంట్లలో ఘనవిజయాలు సాధించడంతో రెండేళ్ల క్రితం 2600 ఎలో రేటింగ్లో ఉన్న తను ఇప్పుడు 2783 రేటింగ్కు ఎగబాకాడు. చెస్ ఒలింపియాడ్లో భారత్ చారిత్రక విజయంలో గుకేశ్ది కీలకపాత్ర! మొదటి బోర్డులో గరిష్ట పది పాయింట్లకుగాను 9 పాయింట్లు సాధించడంతో అప్పటి లైవ్ రేటింగ్లో ఏకంగా 3056 రేటింగ్స్కు చేరుకున్నాడు. మరోవైపు ప్రపంచ చాంపియన్ 32 ఏళ్ల డింగ్ ఇటీవల తడబడుతున్నాడు. మానసిక అనారోగ్యం చాంపియన్ ఆటతీరుపై పెను ప్రభావమే చూపింది. కొన్ని నెలలపాటు అసలు ఏ స్థాయి టోర్నీలోనూ బరిలోకే దిగలేని పరిస్థితి వచి్చంది. తర్వాత చెస్ సర్క్యూట్లో ఆడినా... అంతంత మాత్రం ఫలితాలతో 2788 ఎలో రేటింగ్ నుంచి 2728కు పడిపోయాడు. దీంతో ప్రపంచ ర్యాంకింగ్స్లో 23వ స్థానానికి దిగజారాడు. అయితే రేటింగ్స్ను, ముందరి ఫామ్ను పరిగణించి తక్కువ అంచనా వేస్తే తప్పులో కాలేసినట్లే! టైబ్రేక్స్లో, కీలకమైన ఎత్తులపుడు పైఎత్తులు వేయడంలో డింగ్ దిట్ట. ముఖాముఖి పోరులో ఇప్పుడు ప్రపంచ కిరీటం కోసం పోటీపడుతున్న వీరిద్దరు గతంలో మూడుసార్లు ముఖాముఖిగా తలపడ్డారు. అయితే ఇందులో ప్రపంచ చాంపియన్దే పైచేయి. క్లాసికల్ ఈవెంట్లో నల్లపావులతో రెండు సార్లు డింగ్ గెలుపొందగా... చివరగా సింక్విఫీల్డ్ కప్లో ఇద్దరి మధ్య జరిగిన పోటీ ‘డ్రా’గా ముగిసింది. అంటే మూడింట ఒక్కసారి కూడా డింగ్ ఓడిపోలేదు. గుకేశ్ 0–2తో వెనుకబడి ఉన్నాడు. అర్హత సాధించారిలా... గతేడాది జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో రష్యా గ్రాండ్మాస్టర్ ఇయాన్ నిపోమ్నిషిని ఓడించి డింగ్ తొలిసారి చాంపియన్గా ఆవిర్భవించాడు. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్ హోదాతో చైనా గ్రాండ్మాస్టర్కు నేరుగా టైటిల్ నిలబెట్టుకునే అవకాశముంటుంది. భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్ ఈ మెగా టోర్నీలో ఆడేందుకు పెద్ద పోరాటమే చేశాడు. ఈ ఏడాది టోరంటోలో జరిగిన క్యాండిడేట్స్ టోర్నమెంట్లో విజేతగా నిలువడం ద్వారా తాజా చాంపియన్షిప్కు అర్హత సాధించాడు. క్యాండిడేట్స్ టోర్నీ ఆడి, గెలిచిన పిన్న వయసు్కడిగా గుకేశ్ గుర్తింపు పొందాడు. షెడ్యూల్... ఫార్మాట్ అధికారికంగా టోర్నీ ప్రారం¿ోత్సవం 23నే జరిగింది. అయితే తొలి రౌండ్ నేడు మొదలవుతుంది. వచ్చే నెల 15 వరకు మొత్తం 14 రౌండ్ల పాటు గేమ్లు జరుగుతాయి. గెలిస్తే ఒక పాయింట్... ‘డ్రా’ చేసుకుంటే అర పాయింట్ లభిస్తాయి. ఎవరైతే ముందుగా 7.5 పాయింట్లు సాధిస్తారో వారే ప్రపంచ చాంపియన్. క్లాసికల్ గేమ్లో తొలి 40 ఎత్తుల వరకు ఒక్కో ఆటగాడికి 120 నిమిషాలు సమయం ఉంటుంది. 41వ ఎత్తు నుంచి మిగతా గేమ్ మొత్తానికి 30 నిమిషాల సమయమిస్తారు. 14 గేమ్ల తర్వాత స్కోరు సమమైతే... ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో టైబ్రేక్ పోటీలు నిర్వహించి విజేతను తేల్చుతారు. ప్రైజ్మనీ రూ. 21.10 కోట్లు టోర్నీ మొత్తం ప్రైజ్మనీ 2.5 మిలియన్ డాలర్లు (రూ. 21.10 కోట్లు). ఒక్కో గేమ్ విజేతకు 2 లక్షల డాలర్లు (రూ. కోటి 68 లక్షలు) లభిస్తాయి. ఇలా 14 రౌండ్ల తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇద్దరు ప్లేయర్లకు సమానంగా అందజేస్తారు. టైబ్రేకర్లో విజేతగా నిలిచిన ప్రపంచ చాంపియన్కు 13 లక్షల డాలర్లు (రూ.10.97 కోట్లు ), రన్నరప్నకు 12 లక్షల డాలర్లు (రూ.10.13 కోట్లు) ప్రదానం చేస్తారు.లైవ్గా చూడొచ్చా?ఎంచక్కా చూడొచ్చు. టీవీ చానెల్స్లో అందుబాటులో లేకపోయినా... మన భారత గ్రాండ్మాస్టర్ తలపడుతున్న ఈ ప్రపంచ చాంపియన్షిప్ గేమ్లపై మనం ఓ కన్నేయొచ్చు. ‘ఫిడే’కు చెందిన యూట్యూబ్, ట్విట్చ్ చానెల్స్లో అలాగే... ఈఎస్పీఎన్ ఇండియా లైవ్ బ్లాగ్లోనూ పోటీలను వీక్షించవచ్చు. -
చదరంగం ఎత్తులే కాదు, డ్యాన్స్ స్టెప్పుల్లోనూ మనోడు తోపు, వైరల్ వీడియో
చెన్నైకి చెందిన ఇండియన్ చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ స్టార్ ఆఫ్ ది సోషల్ మీడియాగా హల్ చల్ చేస్తున్నాడు. 17 ఏళ్ల వయసులోనే ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచి అత్యంత పిన్న వయసులోనే వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాలెంజర్ గా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యామస్ తమిళ సినిమా పాట స్టెప్పులతో అదర గొట్టాడు. మనసులాయో అంటూ దీనికి సంబంధించిన వీడియోను గుకేశ్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. చదరంగంలో ప్రత్యర్థులు తోకముడిచే స్టెప్పులే కాదు,అదిరే స్టెప్పులతో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేశాడు అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు ‘‘యుద్ధంలో రాణి (చెస్లో క్వీన్ పాత్ర)ని ముందు పెట్టి ఎలా నెగ్గాలో తెలిసినవాడు, మొత్తానికి గుకేశ్ రెండో కోణాన్ని ఆవిష్కరించాడు’ అంటూ పలువురు వ్యాఖ్యానించారు. మరి మన ఆటగాడి స్టెప్పులేంటో మీరూ చూసేయండి. Manasilayo...with my family friends!Idhu epdi irukku 😎 pic.twitter.com/r2hkDWYiJE— Gukesh D (@DGukesh) September 29, 2024 -
ఇక ప్రపంచ చాంపియన్షిప్పై దృష్టి
చెన్నై: చెస్ ఒలింపియాడ్ స్ఫూర్తితో ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్పై దృష్టి కేంద్రీకరిస్తానని భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ చెప్పాడు. నవంబర్లో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతానని తెలిపాడు. డిఫెండింగ్ చాంపియన్, చైనీస్ గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్తో భారత ఆటగాడు ప్రపంచ చాంపియన్గుకేశ్ ప్ టైటిల్ కోసం తలపడతాడు. ఈ టోరీ్నకి ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో ఫామ్ను కాపాడుకునేందుకు... ఎత్తుల్లో ప్రావీణ్యం సంపాదించేందుకు కావాల్సినంత సమయం లభించిందని చెప్పాడు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 వరకు సింగపూర్లో గుకేశ్, లిరెన్ల మధ్య ప్రపంచ పోరు జరుగుతుంది. ఏప్రిల్లో క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలుపొందడం ద్వారా ఈ మెగా టోరీ్నకి గుకేశ్ అర్హత సంపాదించాడు. 18 ఏళ్ల ప్రపంచ చాంపియన్షిప్ చాలెంజర్ హంగేరిలో ముగిసిన చెస్ ఒలింపియాడ్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా పురుషుల టీమ్ విభాగంలో సహచరులు వెనుకబడిన ప్రతి సందర్భంలో కీలక విజయాలతో జట్టును అజేయంగా నిలపడంలో గుకేశ్ పాత్ర ఎంతో ఉంది. ఒలింపియాడ్పై మాట్లాడుతూ ‘ఈ టోర్నీని నేను ఒక వ్యక్తిగత ఈవెంట్గా భావించాను. కాబట్టే ప్రతి గేమ్లో ఇతరుల ఫలితాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఒలింపియాడ్లో నా ప్రదర్శన నాకెంతో సంతృప్తినిచ్చింది. జట్టు ప్రదర్శన కూడా బాగుంది’ అని అన్నాడు. తాజా ఫలితం తమ సానుకూల దృక్పథానికి నిదర్శనమని అన్నాడు. భారత ఆటగాళ్లంతా సరైన దిశలో సాగుతున్నారని చెప్పుకొచ్చాడు. ఘనస్వాగతం అంతకుముందు బుడాపెస్ట్ నుంచి చెస్ ఒలింపియాడ్ విజేతలు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన గుకేశ్, ప్రజ్ఞానంద, వైశాలి, పురుషుల జట్టు కెప్టెన్ శ్రీనాథ్ నారాయణ్లకు చెన్నైలో చెస్ సంఘం అధికారులు, అభిమానులు, కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. పూల బోకేలతో స్వాగతం పలికిన అభిమానులు పలువురు గ్రాండ్మాస్టర్లతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. చెస్ ఒలింపియాడ్లో గతంలో ఉన్న కాంస్యం రంగు మార్చి బంగారు మయం చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రజ్ఞానంద అన్నాడు. అతని సోదరి వైశాలి మాట్లాడుతూ సొంతగడ్డపై జరిగిన గత ఈవెంట్లో కాంస్యంతో సరిపెట్టుకున్న తమ పసిడి కల తాజాగా హంగేరిలో సాకారమైందని హర్షం వ్యక్తం చేసింది. వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్లకు ఢిల్లీ చెస్ సంఘం అధికారులు, హైదరాబాద్లో ద్రోణవల్లి హారికకు భారత స్పోర్ట్స్ అథారిటీ అధికారులు స్వాగతం పలికి సన్మానం చేశారు. -
చరిత్రలో తొలిసారి..!
చరిత్రలో తొలిసారి ఇద్దరు భారత గ్రాండ్ మాస్టర్లు లైవ్ చెస్ ర్యాంకింగ్స్లో టాప్-5లో చోటు దక్కించుకున్నారు. చెస్ ఒలింపియాడ్లో తాజా ప్రదర్శనల అనంతరం అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్ లైవ్ ర్యాంకింగ్స్లో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. అర్జున్ ఖాతాలో 2788.1 పాయింట్లు ఉండగా.. గుకేశ్ ఖాతాలో 2775.2 పాయింట్లు ఉన్నాయి. 2832.3 పాయింట్లతో మాగ్నస్ కార్ల్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లైవ్ ర్యాంకింగ్స్ అనేవి రియల్ టైమ్లో అప్డేట్ అయ్యే రేటింగ్స్. ఫిడే నెలాఖర్లో ప్రచురించే రేటింగ్స్కు వీటికి వ్యత్యాసం ఉంటుంది.కాగా, బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో పాల్గొంటున్న భారత చెస్ ప్లేయర్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ టోర్నీలో భారత పురుషులు, మహిళల జట్లు వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేశాయి. సోమవారం జరిగిన మ్యాచ్లో భారత పురుషుల జట్టు 3-1తో ఆతిథ్య హంగేరిని ఓడించింది. ఈ టోర్నీలో అర్జున్ ఎరిగైసి వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేయగా.. రిచర్డ్తో జరిగిన గేమ్ను గుకేశ్ డ్రాగా ముగించాడు. మహిళల జట్టు 2.5-1.5 తేడాతో అర్మేనియాపై విజయం సాధించింది.చదవండి: కొరియాను చిత్తు చేసిన భారత్.. ఆరోసారి ఫైనల్లో -
గుకేశ్ ఖాతాలో ఏడో ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్ఫీల్డ్ కప్ అంతర్జాతీయ క్లాసికల్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద వరుసగా ఏడో ‘డ్రా’ నమోదు చేశారు. టాప్ సీడ్, ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన గేమ్ను గుకేశ్ 60 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఇయాన్ నిపోమ్నిషి (రష్యా)తో జరిగిన గేమ్ను ప్రజ్ఞానంద 19 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) ఐదు పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలో ఉన్నాడు. నాలుగు పాయింట్లతో కరువానా రెండో స్థానంలో నిలిచాడు. 3.5 పాయింట్లతో గుకేశ్, మాక్సిమి లాచెర్ (ఫ్రాన్స్), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్), వెస్లీ సో (అమెరికా), ప్రజ్ఞానంద సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. -
డింగ్ లిరెన్తో గుకేశ్ గేమ్ ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్ను భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ‘డ్రా’తో ప్రారంభించాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో జరిగిన తొలి రౌండ్ గేమ్ను గుకేశ్ 28 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. డింగ్ లిరెన్, గుకేశ్ మధ్య ఈ ఏడాది నవంబర్లో సింగపూర్ వేదికగా ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు తలపడటం ఆసక్తిని కలిగించింది.భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద కూడా తన తొలి గేమ్ను ‘డ్రా’ చేసుకున్నాడు. నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన గేమ్ను ప్రజ్ఞానంద 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. మొత్తం పది మంది మేటి గ్రాండ్మాస్టర్లు ఫాబియానో కరువానా (అమెరికా), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్), వెస్లీ సో (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), డింగ్ లిరెన్ (చైనా), ఇయాన్ నెపోమ్నిషి (రష్యా), మాక్సిమి వాచెర్ లెగ్రావ్ (ఫ్రాన్స్), నొదిర్బెక్ మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. -
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఫిడే రేటింగ్ లిస్ట్లో (ర్యాంకింగ్స్) తొలిసారి ముగ్గురు భారత గ్రాండ్మాస్టర్లు టాప్-10లో నిలిచారు.2024 జులై నెల ర్యాంకింగ్స్లో అర్జున్ ఎరిగైసి నాలుగో స్థానంలో, డి గుకేశ్ ఏడులో, ఆర్ ప్రజ్ఞానానంద ఎనిమిదో స్థానంలో నిలిచారు. భారతీయ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో నిలిచాడు. అరవింద్ చితంబరం ఏకంగా 18.5 ఎలో రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని 44వ స్థానం నుంచి 29 స్థానానికి ఎగబాకాడు. జులై నెల పురుషుల రేటింగ్ లిస్ట్ టాప్ 100 జాబితాలో ఏకంగా పది మంది భారతీయులు (అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్, ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతీ, అరవింద్ చితంబరం, హరికృష్ణ పెంటల, నిహాల్ సరిన్, ఎస్ ఎల్ నారాయణన్, సద్వాని రౌనక్) ఉండటం గమనార్హం.మహిళల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. జులై నెల రేటింగ్ లిస్ట్ టాప్-14లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ద్రోణవల్లి హారిక రెండో స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ఇటీవలే బాలికల జూనియర్ వరల్డ్ టైటిల్ను గెలిచిన దివ్య దేశ్ముఖ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానం నుండి 20వ స్థానానికి ఎగబాకింది. -
TePe Sigeman Chess Tournament: రన్నరప్ అర్జున్
మాల్మో (స్వీడన్): టెపె సెజెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ రన్నరప్గా నిలిచాడు. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో పీటర్ స్విద్లెర్ (రష్యా), అర్జున్, నొదిర్బెక్ అబ్దుసత్తొరోవ్ (ఉజ్బెకిస్తాన్) 4.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు.విజేతను నిర్ణయించడానికి ఈ ముగ్గురి మధ్య బ్లిట్జ్ గేమ్ టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్లో అర్జున్, నొదిర్బెక్ చేతిలో స్విద్లెర్ ఓడిపోయాడు. దాంతో అర్జున్, నొదిర్బెక్ టైటిల్ కోసం తలపడ్డారు. అర్జున్, నొదిర్బెక్ మధ్య రెండు గేమ్లు నిర్వహించగా... తొలి గేమ్ను అర్జున్ ‘డ్రా’ చేసుకొని, రెండో గేమ్లో ఓడిపోవడంతో నొదిర్బెక్ చాంపియన్గా అవతరించాడు.ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ .. ఆరో ర్యాంకులో గుకేశ్ చెన్నై: గత నెలలో క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్మాస్టర్, తమిళనాడు టీనేజర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్లో పురోగతి సాధించాడు. గత నెలలో 16వ స్థానంలో ఉన్న గుకేశ్ తాజా ర్యాంకింగ్స్లో ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్కు చేరుకున్నాడు. క్యాండిడేట్స్ టోర్నీ ప్రదర్శనతో గుకేశ్ 21 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం గుకేశ్ ఖాతాలో 2764 రేటింగ్ పాయింట్లున్నాయి. తెలంగాణకు చెందిన గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 2761 రేటింగ్ పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్లో నిలిచాడు. భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 2751 రేటింగ్ పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. భారత ఇతర గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద 14వ ర్యాంక్లో, విదిత్ 28వ ర్యాంక్లో, పెంటేల హరికృష్ణ 37వ ర్యాంక్లో ఉన్నారు. మహిళల చెస్ ర్యాంకింగ్స్లో భారత గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి 5వ ర్యాంక్లో, ద్రోణవల్లి హారిక 11వ ర్యాంక్లో, వైశాలి 13వ ర్యాంక్లో ఉన్నారు. -
భారత చెస్ జట్ల గెలుపు.. హంపి, హారిక, వంతిక, వైశాలి అద్భుతంగా ఆడి..
Asian Games 2023- Chess: ఆసియా క్రీడల టీమ్ చెస్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు మూడో రౌండ్లో గెలుపొందాయి. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత జట్టు 3–1తో కజకిస్తాన్ను ఓడించింది. మరోవైపు... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వంతిక అగర్వాల్, వైశాలిలతో కూడిన భారత జట్టు 3.5–0.5తో ఇండోనేసియాపై గెలిచింది. మూడో రౌండ్ తర్వాత భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్లో... ఐదు పాయింట్లతో భారత పురుషుల జట్టు రెండో ర్యాంక్లో ఉన్నాయి. భారత్, కొరియా మ్యాచ్ ‘డ్రా’ ఆసియా క్రీడల మహిళల హాకీ ఈవెంట్లో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆదివారం దక్షిణ కొరియాతో జరిగిన పూల్ ‘ఎ’ మూడో లీగ్ మ్యాచ్ను భారత్ 1–1 గోల్తో ‘డ్రా’ చేసుకుంది. కొరియా తరఫున చో హైజిన్ (12వ ని.లో), భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం మూడు మ్యాచ్ల తర్వాత భారత్, కొరియా ఏడు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరం కారణంగా భారత్ టాప్ ర్యాంక్లో, కొరియా రెండో ర్యాంక్లో ఉంది. లీగ్ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ను హాంకాంగ్తో మంగళవారం ఆడుతుంది. -
విశ్వనాథన్ ఆనంద్ను వెనక్కి నెట్టి.. నంబర్ 1గా యువ సంచలనం
D Gukesh Replaces Viswanathan Anand: యువ గ్రాండ్మాస్టర్ డి గుకేశ్ సంచలనం సృష్టించాడు. గత మూడు దశాబ్దాలుగా భారత చెస్ ప్రపంచాన్ని ఏలుతున్న దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బ్రేక్ చేశాడు. 1986 జూలై నుంచి ఇండియా నంబర్ 1గా కొనసాగుతున్న ఆనంద్ను గుకేశ్ అధిగమించాడు. ఈ విషయాన్ని ఫిడే శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. తాజా ఫిడే ర్యాంకింగ్స్(సెప్టెంబరు 1 నుంచి)లో 17 ఏళ్ల ఈ చెన్నై గ్రాండ్ మాస్టర్ ఎనిమిదో ర్యాంకు సాధించాడు. తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుని.. ఆనంద్ కంటే ముందు వరుసలో నిలిచాడు. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ ప్రస్తుతం తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. 37 ఏళ్ల రికార్డు బద్దలు ఈ నేపథ్యంలో తన మెంటార్ ఆనంద్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి గుకేశ్ భారత్ తరఫున నెంబర్ 1 ర్యాంకర్గా అవతరించాడు. ఆగష్టు 1 నుంచి రేటింగ్ మెరుగుపరచుకుంటూ మూడు స్థానాలు ఎగబాకిన గుకేశ్ ప్రస్తుతం 2758 పాయింట్లు కలిగి ఉండగా.. ఆనంద్ స్కోరు 2754. ఇదిలా ఉంటే.. ఫిడే వరల్డ్కప్-2023 రన్నరప్గా నిలిచిన ఆర్ ప్రజ్ఞానంద 2727 పాయింట్లతో 19వ ర్యాంకు సాధించి.. భారత్ తరఫున టాప్-3లో నిలిచాడు. ఇక వీరి ముగ్గురితో పాటు విదిత్ సంతోష్ గుజరాతి(27వ ర్యాంకు), అర్జున్ ఇరిగేసి(తెలంగాణ- 29వ ర్యాంకు) టాప్-30లో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పి. హరికృష్ణ 31వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా డి గుకేశ్ ఇటీవల ముగిసిన ఫిడే వరల్డ్కప్ టోర్నీలో క్వార్టర్ఫైనల్స్ చేరిన విషయం విదితమే. చదవండి: పాకిస్తాన్తో అంత ఈజీ కాదు.. విధ్వంసకర ఆటగాళ్లు వీరే! అయినా టీమిండియాదే It's official! Gukesh is India's #1 in the #FIDErating list! 🔥 The 17-year-old prodigy makes history by overtaking the five-time World Champion Vishy Anand and terminating his uninterrupted 37-year reign as India's top-rated player! 📷 Stev Bonhage pic.twitter.com/paDli9hslX — International Chess Federation (@FIDE_chess) September 1, 2023