Documents
-
గవర్నర్ కుటుంబ సభ్యుల వివరాలను సేకరించిన అధికారులు
-
9న సీఎం చేతుల మీదుగా ఉపాధ్యాయ నియామక పత్రాలు
హైదరాబాద్: ఈనెల 9 తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సీఎం ఎ.రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామ క పత్రాలను అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ఆదివారం సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, దాదాపు పదివేలకు పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను జారీచేస్తున్నట్టు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సంబంధించి సరి్టఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారని, సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యా కమిషనర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తారని తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరూ తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలలోపే ఎల్.బి.స్టేడియానికి చేరేలా తగు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వారిని హైదరాబాద్కు చేరవేయడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్, సమన్వయ అధికారిని నియమించాలని సూచించారు. -
‘డీఎస్సీ’కి నకిలీల బెడద!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత ప్రక్రియ గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వం ప్రకటించినట్లు ఈ నెల 9న నియామక పత్రాలు అందిస్తారో లేక వాయిదా వేస్తారోననే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది అభ్యర్థులు నకిలీ స్థానికత పత్రాలు సమర్పిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో వాటిని పరిశీలించాకే నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా న్యాయ సమస్యలు వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.అడ్డదారిలో సర్టిఫికెట్లు..: టీచర్ పోస్టును ఎలాగైనా చేజిక్కించుకోవడానికి అన్ని జిల్లాల్లోనూ అభ్యర్థులు నకిలీ స్థానికతతో సర్టిఫికెట్లు తెస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున రాష్ట్ర అధికారులు మెరిట్ లిస్ట్ను జిల్లాలకు పంపగా అందులో ఎవరి లోపాలు ఏమిటని అభ్యర్థులు పరస్పరం కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరికొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు అభ్యర్థి నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికతగా పరిగణిస్తారు. గతంలో నాలుగు నుంచి పదో తరగతి వరకు నాలుగేళ్లు పరిగణనలోకి తీసుకొనేవాళ్లు. ఉన్నత క్లాసులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వద్ద ఆ రికార్డు తప్పకుండా లభించే వీలుండేది. కానీ ఇప్పుడు ఒకటి నుంచి ఏడో తరగతి నిబంధన ఉండటంతో ఏదో ఒక స్కూల్ నుంచి అభ్యర్థులు ధ్రువీకరణ తెస్తున్నారు. దీన్ని పరిశీలించేందుకు విద్యాశాఖ వద్ద సరైన రికార్డులు కూడా ఉండటం లేదు. కరోనా వ్యాప్తి అనంతరం చాలా వరకు ప్రైవేటు ప్రాథమిక స్కూళ్లు మూతపడటం వల్ల వాటిల్లో చదివిన విద్యార్థుల రికార్డులు ప్రభుత్వం వద్ద పక్కాగా లేవు. దీన్ని అవకాశంగా తీసుకున్న అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు తెస్తున్నారని అధికారులకు అందుతున్న ఫిర్యాదులనుబట్టి తెలుస్తోంది. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాలోనూ నకిలీ సర్టిఫికెట్లు వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. సాధారణంగా ఇవి అధికారికంగా వచ్చే ధ్రువపత్రాలు కావడంతో పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు భావించగా చాలాచోట్ల అనర్హులు ఈ పత్రాలు తీసుకురావడం గందరగోళానికి దారితీస్తోంది.మోసాల్లో మచ్చుకు కొన్ని ..∙ఆదిలాబాద్ జిల్లాలో ఓ అభ్యర్థి ఎస్జీటీ కేటగిరీలో ర్యాంకు సాధించాడు. ఉట్నూర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసినట్లు స్థానికత సర్టిఫికెట్ జత చేశాడు. అయితే ఆ సర్టిఫికెట్తో బోనఫైడ్, ఇతర సర్టిఫికెట్లను అధికారులు పోల్చి చూడగా అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీ, తండ్రిపేరు తప్పుగా ఉన్నాయి. దీన్ని నిలదీసిన అధికారులకు తన దగ్గరున్న మరో స్థానికత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాడు. దీనిపై ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు.ఆదిలాబాద్ పట్టణంలో మరాఠీ మీడియంలో ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన ఓ మహిళా అభ్యర్థి స్థానికంగానే చ దువు పూర్తిచేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించింది. అయితే అవి నకిలీవని, ఆమె మహారాష్ట్రలో చదివిందంటూ మరో అభ్యర్థి ఫిర్యాదు చేశారు. దీంతో డీఈవో నుంచి రిజిస్టర్ తెప్పించి అధికారులు పరిశీలించగా అభ్యర్థి ఇంటిపేరు, తండ్రిపేరు కొట్టేసి ఉన్నట్లు గుర్తించారు.వరంగల్ జిల్లాలో ఓ అభ్యర్థి స్థానికంగా చదివినట్లు ఇచ్చిన సర్టిఫికెట్పై కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. అయితే ఆ పాఠశాల రికార్డులు తెప్పించాలని అధికారులు ప్రయత్నించగా అది ఎప్పుడో మూతపడటంతో రికార్డులు దొరకలేదు.మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలానికి చెందిన భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ శాఖలోనే ఉద్యోగం చేస్తున్నారు. భార్యకు డీఎస్సీలో ర్యాంకు రావడంతో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ధ్రువీకరణ పత్రం సమర్పించింది. ఇద్దరి వార్షికాదాయం రూ. లక్షల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎలా వెనుకబడి ఉన్నారని ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ అభ్యర్థి సర్టిఫికెట్ల పరిశీలనను అధికారులు ఆపేశారు.కోల్చారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ర్యాంకు వచ్చింది. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. దీంతో ఆమె తన తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించింది. నిబంధనల ప్రకారం భర్త ఆదాయం ప్రకారం సర్టిఫికెట్ ఉండాలనేది ఇతర అభ్యర్థుల అభ్యంతరం. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. -
Supreme Court: ఇంత కాఠిన్యమా?
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ (పీఎంఎల్ఏ) కేసుల దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అవసరానికి మించిన కాఠిన్యం చూపుతోందంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితుల నుంచి జప్తు చేసే డాక్యుమెంట్లను వారికిచ్చేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ తలంటింది. ‘‘కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ డాక్యుమెంట్లను నిరాకరించడం సబబా? ఇది జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించడం కాదా?’’ అంటూ అక్షింతలు వేసింది. పీఎంఎల్ఏకు సంబంధించిన ఒక కేసును న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఎ.అమానుల్లా, జస్టిస్ఏజీ మసీతో ధర్మాసనం బుధవారం విచారించింది. ‘‘నిందితునికి సంబంధించిన వేలాది డాక్యుమెంట్లు మీరు జప్తు చేయొచ్చు. అతనికి అవన్నీ గుర్తుండాలని లేదు కదా! అడిగితే ఇవ్వడానికి ఇబ్బందేమిటి? వేలాది పేజీల డాక్యుమెంట్లనైనా నిమిషాల్లో స్కాన్ చేసిన అందుబాటులోకి తేవచ్చు. దర్యాప్తు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడలేరా?’’ అని ప్రశ్నించింది. ‘‘క్లిష్టతరమైన విచారణ ప్రక్రియను ఎదుర్కొంటున్న నిందితునికి సొంత డాక్యుమెంట్లే ఇవ్వకపోవడం న్యాయమా? అత్యంత హీనం, అమానుషమని భావించిన కేసుల్లోనూ నిందితులను బెయిల్ దొరికిన సందర్భాలు బోలెడు! కానీ ఈ రోజుల్లో అమాంబాపతు కేసుల్లో కూడా బెయిల్ రావడం గగనంగా మారుతోంది. కాలం మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి కేసుల్లో మేం (ధర్మాసనం) కఠినంగా ఉండొచ్చా? అది భావ్యమేనా?’’ అంటూ ఈడీని జస్టిస్ ఓకా నిలదీశారు. బెయిల్ కోసం, లేదా కేసే తప్పుడుదని నిరూపించేందుకు డాక్యుమెంట్లపైనే ఆధారపడే పరిస్థితుల్లో వాటిని పొందే హక్కు నిందితునికి ఉంటుందని స్పష్టం చేశారు. -
పోలవరం డాక్యుమెంట్ల వెనక చంద్రబాబు కుట్ర..!
-
అసంపూర్తిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ల క్రమబదీ్ధకరణ) దరఖాస్తుల్లో అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయనివారు 75శాతం మంది దాకా ఉన్నారు. అధికారులు దరఖాస్తులు పరిశీలించే క్రమంలో ఈ విషయం వెలుగుచూసింది. 2020 ఆగస్టు 26కు ముందు ఉన్న అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరించుకునేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చి ంది. రూ.1,000 ఫీజుగా చెల్లించి దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి.అయితే వివిధ కారణాల వల్ల ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అప్పట్లో అర్ధాంతరంగా నిలిచిపోయింది. కాగా గత డిసెంబర్లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం 2020 నాటి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటన చేయడంతో జనవరి నుంచి దరఖాస్తుల పరిశీలన మొదలైంది. అరకొరగానే అప్లోడ్ దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్కు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్పట్లో అప్లోడ్ చేయలేదు. మొత్తంగా 75 శాతం అసంపూర్తి దరఖాస్తులే అందజేశారు. ప్లాట్ల రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లు, లే అవుట్ కాపీలు, ఇతర పత్రాలు అప్లోడ్ చేయకుండా వచ్చి న దరఖాస్తులను పక్కనబెడుతూ అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రారంభించారు. ఇప్పటి వరకు 4,28,832 దరఖాస్తులను పరిశీలించగా, వాటిలో కేవలం 60,213 దరఖాస్తులు మాత్రమే ఆమోదించినట్టు పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు. తద్వారా రూ.96.60 కోట్లు ఫీజు రూపంలో వసూలైనట్టు చెప్పారు. పరిశీలించిన దరఖాస్తుల్లో 75 శాతం పూర్తిస్థాయి డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల వాటిని ఆమోదించడం లేదని దరఖాస్తుదారులకు చెప్పారు. షార్ట్ఫాల్స్ వివరాలను కూడా దరఖాస్తుదారులకు తెలియజేశారు.మరోసారి అవకాశం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడానికి పురపాలకశాఖ మరో చాన్స్ ఇచ్చి ంది. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయడానికి, మున్సిపాలిటీ/కార్పొరేషన్/నగరాభివృద్ధి సంస్థల నుంచి అధికారిక షార్ట్ ఫాల్స్ లెటర్ కోసం వేచిచూడకుండా పూర్తిస్థాయి డాక్యుమెంట్లను ఎల్ఆర్ఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సేల్డీడ్, ఈసీ, మార్కెట్ వ్యాల్యూ సర్టీ ఫికెట్, లేఅవుట్ కాపీ వంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవచ్చు. దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్, చిరునామా లేదా ఇతర దరఖాస్తు వివరాలను మొబైల్ నంబర్ ఓటీపీని వినియోగించుకొని ఈ పోర్టల్ ద్వారా సవరించుకోవచ్చునని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు.ఇందుకోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్్కలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఏవైనా సందేహాలుంటే తీర్చుకోవడానికి లేదా వివరాల కోసం ఈ హెల్ప్డెస్క్లను సందర్శించవచ్చునని తెలిపారు. -
ఒకే రోజు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు వెలుగు చూశాయి. ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళుతూ.. వెళుతూ పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒకే రోజు ఏకంగా సుమారు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. ఒక్కరోజే ఈ స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఈ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే.తనిఖీలు రాత్రంతా జరిగాయి. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో కార్యాలయంలోని ఓ అధికారి రూ.96 వేల నగదును కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరేయడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఏసీబీ.. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 64 డాక్యుమెంట్లను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు..!ఏసీబీ అదుపులోకి తీసుకున్న అధికారులిద్దరూ ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. పటాన్చెరు ప్రాంతంలో రూ.వందల కోట్లు విలువ చేసే భూములను ఈ అధికారులు రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. జిల్లా ఏసీబీ అధికారులకు తెలియకుండా..ఈ తనిఖీలు నిర్వహించేందుకు హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయం నుంచి ఏసీబీ అధికారులు రావడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ కార్యాలయం ఉంటుంది. అయితే ఈ కార్యాలయం అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్ర కార్యాలయంలోని సీఐయూ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. -
మీ దస్తావేజులు మీకే ఇస్తారు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో మాట్లాడేందుకు ‘పచ్చ’ముఠాకు ఏమీలేక భూముల పేరు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ చంద్రబాబు తనకు ఉచ్ఛనీచాలు లేవని చాటుకుంటున్నాడు. ప్రజలు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, తాను మాత్రం ఎన్నికల్లో లబ్దిపొందాలనే ఏకైక లక్ష్యంతో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి భయంకరమైన కుట్రకు తెరలేపాడు. మీ భూములు పోతాయని, దస్తావేజులు ఇవ్వరని, భూ యజమానులను జైల్లో పెడతారంటూ దారుణమైన అపోహల్ని సృష్టించాడు. వాటిని తాను స్వయంగా చెప్పడంతోపాటు ఏకంగా పత్రికల్లో ఫుల్పేజీ ప్రకటనలు జారీచేశాడు. ప్రజలను భయపెట్టేందుకు ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చిన మొట్టమొదటి నేతగా చంద్రబాబు చరిత్ర సృష్టించాడు. భూములపై దు్రష్పచారాలను తొలుత ఎల్లో మీడియాతో చేయించి ఆ తర్వాత తానే ఆ విషయాలను చెబుతూ వికృత తాండవం చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆ దుష్ప్రచారాన్ని పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా మరీ చేస్తుండడం చంద్రబాబు బరితెగింపునకు పరాకాష్ట. ఈ దు్రష్పచారాలపై వాస్తవాలివే.. పచ్చి అబద్ధం.. స్థిరాస్తుల రిజి్రస్టేషన్లు జరిగాక యజమానులకు దస్తావేజులు ఇవ్వరనేది టీడీపీ సృష్టించిన భయంకరమైన అపోహ. ఏడాదిగా 9,58,296 స్థిరాస్తుల రిజి్రస్టేషన్లుగా జరగ్గా సంబంధిత రైతులకు ఒరిజినల్ దస్తావేజులే ఇచ్చారు.15,91,814 ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లను ఇళ్ల యజమానులకు ఎప్పటిలాగే ఇచ్చారు. 1.75 లక్షల మందికి టిడ్కో ఇళ్లను రిజి్రస్టేషన్ చేసి ఒరిజినల్ పత్రాలు ఇచ్చారు. ఈ–స్టాంపింగ్ పైనా ఎడతెగని దు్రష్పచారం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రక్రియ 2016లోనే మొదలైంది. 2016 నుంచి 2019 వరకు 2,27,492 డాక్యుమెంట్లను ఈ–స్టాంపింగ్ ద్వారా జారీచేశారు. 2019 నుంచి ఇప్పటివరకు 60,66,490 డాక్యుమెంట్స్ జారీచేశారు. ఇవన్నీ ఒరిజినల్సే. ఏవి జిరాక్స్ కాపీలు కాదు. మీ వారసులను నిర్ణయించేది మీరే.. సమస్య వస్తే కోర్టులకూ వెళ్లొచ్చు.. మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారనేది మరో దారుణమైన వక్రీకరణ. భూ యజమానులు తమ వారసులను తామే నిర్ణయించుకోవచ్చు. ఇంకా అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ చట్టం సెక్షన్ 25 (3) ప్రకారమైనా.. టైటిల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ వారసత్వాన్ని నిర్థారణలో ఏదైనా వివాదం ఉందని భావిస్తే సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) చట్ట ప్రకారం వారసత్వ నిర్ధారణలో వివాదం ఉంటే భూ యజమానులే కోర్టుకు వెళ్లాల్సి వుంటుంది. మీ ఆస్తి మీది కాదని టైట్లింగ్ ఆఫీసర్ చెప్పలేరు.. రీ సర్వే ప్రకారం రికార్డుల్లో ఒకసారి రైతు పేరు చేరితే ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం వారు ఎటువంటి రికార్డు సమర్పించాల్సిన అవసరంలేదు. ఆ డేటాపై ఆ గ్రామంలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 90 రోజుల వరకు అభ్యంతరాలు సమర్పించవచ్చు. ఆ తర్వాత వారి పేర్లు టైటిల్ రిజిస్టర్లో నమోదవుతాయి. ఈ రిజిస్టర్లోని పేర్లపై రెండేళ్లలోగా ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే అప్పుడు కన్క్లూజివ్ టైటిల్ నిర్ధారణ అవుతుంది. టైటిల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ (టీఆర్ఓ) ఇచి్చన ఈ నిర్ధారణ ఆర్డర్పై అభ్యంతరం ఉంటే ల్యాండ్ టైట్లింగ్ అప్పిలేట్ ఆఫీసర్కి (ఎల్టీఏఓ)కి అప్పీలు చేసుకోవచ్చు. దానిపైనా సంతృప్తి చెందకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. భూ యజమానులను జైల్లో ఎందుకు పెడతారు? సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెడతారని, తాతల నాటి భూములైనా నేతల దయ ఉండాల్సిందేనని, జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చంటూ చంద్రబాబుకు మతి చెడిపోయి పత్రికల్లో పిచ్చి ప్రకటన ఇచ్చాడు. ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఇవన్నీ వక్రభాష్యాలే. సరైన పత్రాల్లేవని యజమానులను జైల్లో పెట్టే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజల్లో భయానక స్థితిని కల్పించేందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్, వాయిస్ రికార్డింగ్స్ ద్వారా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుండడంతో ఎలక్షన్ కమిషన్ చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరుగుతోంది. అయినా, రాజకీయ లబ్దికోసం చంద్రబాబు బట్టలు విప్పేసుకుని మరీ దుష్ప్రచారానికి తెగబడుతూనే ఉన్నాడు. ఈ ప్రచారాన్ని ప్రింట్ మీడియాలో చేస్తే ఈసీ అనుమతి అవసరంలేదనే లొసుగును అడ్డంపెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నాడు. మూడుసార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న వృద్ధ నేత చేసే పనేనా ఇది? సిగ్గు విడిచి, ప్రజల ప్రయోజనాలు గాలికొదిలేసి తన కోసం చేస్తున్న కుతంత్రం ఇది. చట్టం ఇంకా అమల్లోకి రాలేదు.. ఈ చట్టానికి సంబంధించి ఇంకా నిబంధనలు రూపుదిద్దుకోలేదు. దీని పరిధినీ నిర్ధారించలేదు. ఈ చట్టంలో డిజిగ్నేట్ చేయబడిన అధికారులనూ నియమించనేలేదు. ప్రజల నుంచి సలహాలు, సూచనలను తీసుకున్నాక మార్పులు, చేర్పులకు ప్రభుత్వం సిద్ధమంది. నిబంధనలు తయారుచేసి, కాంపిటెంట్ అథారిటీ అనుమతి వచ్చాకే చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ చట్టానికి టీడీపీ మద్దతిచ్చింది.. నిజానికి.. ల్యాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో పెట్టినప్పుడు టీడీపీ దానికి పూర్తి మద్దతిచ్చింది. అంతేకాదు.. సుదీర్ఘ అధ్యయనం, ఎంతో కసరత్తు తర్వాత ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. లీగల్ అడ్వైజర్గా నల్సార్ యూనివర్సిటీని నియమించుకుని ముసాయిదా బిల్లును రూపొందించింది. 2011 నుండి 2019 వరకు తయారుచేసిన వివిధ మోడల్ చట్టాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ చట్టాన్ని రూపొందించారు. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లును 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ జరిగింది. దీనికి అప్పుడు టీడీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, లా డిపార్ట్మెంట్ , ఐటీ, హోమ్, సోషల్ వెల్ఫేర్ వంటి డిపార్ట్మెంట్లన్నీ మూడేళ్లపాటు జాగ్రత్తగా పరీక్షించి పలు సూచనలు చేశారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసి తిరిగి మళ్లీ అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఏ కేంద్ర చట్టాలకీ వ్యతిరేకంగా ఈ చట్టంలేదని నిర్ధారించిన తర్వాతే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. బాబు బినామీ ఆస్తులు బయటకు వస్తాయనే దుష్ప్రచారం.. వాస్తవానికి.. రీ సర్వే పూర్తయ్యాకే ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తుంది. అది జరిగితే అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో చంద్రబాబు ఆయన ముఠా బలవంతంగా లాక్కుని బినామీ పేర్లపై పెట్టిన ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయోననే భయంతో సాధారణ జనంతో దీనికి ముడిపెట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారు. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేకరకాల చట్టాలు చేస్తుంటాయి. వాటివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందని భావిస్తే సవరణలు తెస్తారు. కానీ, ఒక చట్టాన్ని రద్దుచేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు ఇప్పుడు ఆ పని కూడా చేసి తన విలువల స్థాయి ఏంటో ప్రదర్శించుకున్నారు. మేనిఫెస్టోలో అమలుచేయలేని అనేక హామీలిచ్చి నా ఈ ఒక్క దానిపైనే ఇంత దృష్టిపెట్టి గందరగోళం సృష్టించడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? వారు దోచుకున్న, ఆక్రమించిన బినామీ భూములు, ఆస్తులు ఎక్కడ బయట పడతాయోననే భయంతోనే ఇదంతా చేస్తున్నారు. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల్లో ఎవరైనా ఇది మంచిది కాదని ఒక్క మాటైనా చెప్పారా? రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రధాని, కేంద్ర హోంమంత్రి అనేకమంది బీజేపీ ముఖ్యనేతలు తమ ప్రసంగాల్లో ఈ చట్టం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? ఈ చట్టం మంచిది కాదని బీజేపీ నాయకులతో చంద్రబాబు చెప్పించగలరా? కేవలం తమ బినామీ ఆస్తులను రక్షించుకునేందుకే ఎల్లోగ్యాంగ్ చేస్తున్న గందరగోళమే ఇదంతా? -
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియా చేసే దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్ అయింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. ఫైల్స్ తగలబెట్టారంటూ చేసిన ప్రచారాన్ని సీఐడీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘డాక్యుమెంట్లు కాల్చారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. కొన్ని ఛానళ్లలో బాధ్యత రహితంగా ప్రచారం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా 5 కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశాం. ప్రతి ఛార్జ్ షీట్కు 8 వేల నుండి 10 వేల కాపీలతో రూపొందించాం. ప్రతి కేసు ఛార్జ్ షీట్ కాపీలను ప్రతి కేసులో ఉన్న నిందితులకు అందించాం. హెరిటేజ్కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వ్యక్తుల ఐటీ రిటర్న్స్ వివరాలు కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వారికి కూడా ఆ డాక్యుమెంట్లు అందించాం’ అని సీఐడీ ప్రకటనతో పేర్కొంది. -
జూన్లో జాబ్ల జాతర
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్, పోస్టింగ్లు ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పార్ల మెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే జాబ్ల జాతరకు లైన్క్లియర్ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9వేల ఉద్యో గాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేటగిరీలో దాదాపు 2వేలకు పైబడి ఉద్యోగాలున్నాయి. వీటికి కూడా జీఆర్ఎల్ విడుదల చేశారు. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య ఇలా పలు విభాగాల్లో దాదాపు 5వేల ఉద్యోగాలకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టర్ జాబితాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను సైతం టీఎస్పీఎస్సీ తెప్పించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా ఒక్కో కేటగిరీలో జిల్లాస్థాయిలో 1:2 నిష్పత్తి, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీల్లో 1:3 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాలను సైతం రూపొందిస్తోంది. ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ జూన్ రెండోవారంకల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఆలోపు పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి సైతం తొలగిపోనుంది. దీంతో టీఎస్పీఎస్సీ తుది జాబితాలను బహిర్గతం చేసిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. జూన్ మూడోవారం నుంచి నియామక పత్రాల పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గురుకుల పోస్టుల్లో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన దాదాపు 1500 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. పార్లమెంట్ కోడ్ ముగియగానే జూన్ మొదటివారం తర్వాత వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఫిబ్రవరి నుంచే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నియామక పత్రాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా పోలీస్శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలో స్టాఫ్ నర్సులు, గురుకుల విద్యాసంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీల్లో దాదాపు 33వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్ఈఐఆర్బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా భర్తీ చేసినవే. మూడు బోర్డుల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ఎత్తయితే... టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈ మూడు బోర్డుల పరిధిలోని ఉద్యోగాల సంఖ్యతో దాదాపు సమానంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పలు కేటగిరీల్లో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తోంది. -
General Election 2024: మీ ఓటు ఉందా? లేదా? ఇలా చెక్ చేసుకోండి..
కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎట్టకేలకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఢిల్లీలో విజ్ఞాన్భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ 'రాజీవ్ కుమార్' ఎన్నికల షెడ్యూల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుందని సీఈసీ ప్రకటించారు. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్, ఏప్రిల్ 26న రెండో దశ, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20వ తేదీన ఐదో దశ పోలింగ్, మే 25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్ ఉంటుందని సీఈసీ తెలిపారు. అయితే ఈ రోజు నుంచి జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండనుందని తెలిపారు. పోలింగ్ సీజన్కు ముందు.. ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి, ఓటర్ల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలి, పోలింగ్ బూత్ కనుక్కోవడం ఎలా? అనే మరిన్ని వివరాలు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వ్యక్తి ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. అయితే ఓటు వేయడానికి వెళ్లే ముందు ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలంటే.. ఓటర్ ఐడీ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఆధార్ కార్డు పాన్ కార్డ్ MNREGA జాబ్ కార్డ్ NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డ్ స్టేట్ బ్యాంక్ లేదా పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్ కేంద్ర/రాష్ట్రం ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన ఐడీ కార్డు ఎలక్టోరల్ రోల్లో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలంటే.. అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి స్టేట్ ఎంటర్ చేసి, భాషను ఎంచుకోవాలి పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు ఫిల్ చేయాలి జిల్లా & అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, సర్చ్ మీద క్లిక్ చేయాలి పోలింగ్ బూత్ను ఎలా కనుక్కోవాలంటే.. అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత పోలింగ్ బూత్ని తెలుసుకోవడానికి రాష్ట్రం, భాషను ఎంచుకోవాలి. పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు ఫిల్ చేయాలి జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, సెర్చ్ మీద క్లిక్ చేయాలి EPIC/ఓటర్ ఐడీ కార్డ్ ద్వారా సెర్చ్ చేయడం భాషను ఎంచుకోవాలి EPIC నంబర్/ఓటర్ ID కార్డ్ వివరాలను ఫిల్ చేయాలి రాష్ట్రాన్ని ఎంచుకోవాలి క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి, సెర్చ్ మీద క్లిక్ చేయాలి -
స్థిరాస్తులు.. డాక్యుమెంట్లు-1: అన్నీ పక్కాగా ఉంటేనే..
ఏ వ్యవహారమైనా కాగితాలు ముఖ్యం. వ్యవహారాన్ని మొదలుపెట్టిన దగ్గర్నుంచి పూర్తి చేసే వరకు ప్రతి స్థాయిలో, ప్రతి దశలో, ప్రతి అంశానికి సంబంధించిన కాగితాలు.. అవేనండి.. డాక్యుమెంట్లు అవసరం. అవేమిటో కొన్ని చూద్దాం.. కొనే ముందు డాక్యుమెంట్లు.. స్థిరాస్తి డాక్యుమెంట్లలో అతి ముఖ్యమైనవి అమ్మకానికి సంబంధించిన దస్తావేజులు. అమ్మే వ్యక్తి ఆ ఆస్తిని ఎలా కొన్నారు? తను కొన్నట్లు ధృవీకరించే దస్తావేజులు. అమ్మకం ద్వారా లేదా మరే ఇతర మార్గంలో హక్కు ఏర్పడ్డా, దానికి సంబంధించిన కాగితాలు. ఉదాహరణకు, వీలునామా లేదా గిఫ్ట్ డీడ్. ఈ రెండింటినీ టైటిల్ డీడ్స్ అంటారు. వీటి ద్వారానే మీకు ఆస్తి అమ్మే వ్యక్తికి అమ్మే హక్కు సంక్రమించినట్లు తెలుస్తుంది. ఆస్తి తనదా కాదా అని తెలుస్తుంది. ఇవి ఒరిజినల్ అయి ఉండాలి. లింకు డాక్యుమెంట్లు చూడాలి. మీకు అమ్మే వ్యక్తి, సదరు అసెట్ను కొనుక్కోవడానికి ముందు ఓనర్ ఎవరు? ఆ ఓనర్కి ఆస్తి ఎలా సంక్రమించింది? ఇది చాలా ముఖ్యం. సబ్ రిజిస్ట్రార్ లేదా పంచాయతీ/గ్రామ వ్యవస్థలో ఉండే రికార్డులు .. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఉంటాయి. పహాణీ/ఖాతా.. సర్వే నంబర్లు, ఉప సర్వే నంబర్లు, సరిహద్దులు మొదలైనవి ఉంటాయి. మ్యుటేషన్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డుల్లో స్థిరాస్తిలో పేరు మార్పిడి, టైటిల్ మార్పునకు సంబంధించిన పత్రాలు, ప్రస్తుతం మీకు అమ్మే వ్యక్తి పేరు మ్యుటేషన్ పత్రంలో ఉండాలి. ఫ్లాట్ అయితే జాయింటు డెవలప్మెంటు అగ్రిమెంటు కాపీలు ఉండాలి. ఈ అగ్రిమెంటు ద్వారా హక్కుల సంక్రమణ జరుగుతుంది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఒక్కొక్కప్పుడు ఓనరు ఒకరు కాగా, అమ్మకానికి హక్కులు వేరే వ్యక్తికి ఇస్తారు. పవర్ ఉన్న వాళ్లు అమ్మాలి. బిల్డింగ్ ప్లాను. అనుమతి పొందిన ప్లాను. సంబంధిత అధికారులు జారీ చేసినది. సంబంధిత అధికారులు జారీ చేసిన ఎన్వోసీ. అలాగే విద్యుత్ శాఖ, నీటి శాఖ మొదలైన శాఖలు ఇచ్చినవి. ఒరిజినల్ అగ్రిమెంటుకు జరిగిన మార్పులు, చేర్పులు, కూర్పులకు సంబంధించిన సప్లిమెంటరీ అగ్రిమెంటు లేదా వాటిని ఒప్పుకుంటున్నట్లు ఒప్పందం. అలాట్మెంట్ లెటర్. కట్టడానికి రాసుకున్న అగ్రిమెంటు, బిల్డర్ ఫ్లాటును అప్పగించినట్లు పత్రం, వీలుంటే అమ్మే వ్యక్తి తను కొన్నప్పుడు చేసిన చెల్లింపుల కాగితాలు, రశీదులు. మీరు కొంటున్న స్థిరాస్తిని ఆ ఓనరు బ్యాంకు నుండి అప్పు తీసుకుని కొని ఉంటే తత్సంబంధ కాగితాలు. మున్సిపల్ పన్నులు, కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, ఇతర పెనాల్టీలు, చెల్లింపులు, ఆఖ కాగితాలు, చెల్లింపుల రశీదులు, సొసైటీ మెంబర్షిప్ కాగితాలు, వారిచ్చే ధృవీకరణ పత్రాలు. సబ్–రిజిస్ట్రార్ నుండి ఒరిజినల్ ఉఇ. వీలున్నంతవరకు ఎన్ని సంవత్సరాల దాకానైనా వెళ్లండి. అలాగే 2001 ఏప్రిల్ 1 నాటి మార్కెట్ వేల్యు సర్టిఫికెట్టు, దానితో పాటు తాజాది అంటే మీరు కొనే నాటికి స్థిరాస్తి మార్కెట్ వేల్యుయేషన్ సర్టిఫికెట్ చూసుకోండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్కు పంపించగలరు. -
రెండో దశ భూ హక్కు పత్రాల పంపిణీ
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే పూర్తయిన రెండో దశలోని 2 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాల పంపిణీని రెవెన్యూ శాఖ ప్రారంభించింది. మొదటి దశ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో 7.50 లక్షలకుపైగా భూ హక్కు పత్రాలను ఇప్పటికే రైతులకు అందించారు. ఇప్పుడు రెండో దశలోని 2 వేల గ్రామాల్లో సర్వే చివరి దశకు చేరుకోవడంతో ఆ గ్రామాల్లోని రైతులకు విడతల వారీగా భూ హక్కు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 26 జిల్లాల్లో 8.68 లక్షల భూ హక్కు పత్రాలు పంపిణీ చేయాల్సివుండగా ఇప్పటికే 5.12 లక్షల పత్రాలను ముద్రించి ఆయా జిల్లాలకు పంపారు. ఇందులో 2.48 లక్షల పత్రాలు ఈ–కేవైసీ పూర్తి చేసి పంపిణీ కూడా చేశారు. మిగిలిన పత్రాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లో పంపిణీ దాదాపు పూర్తయింది. గుంటూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఇంకా 5 శాతం లోపు పంపిణీ చేయాల్సి ఉంది. బాపట్ల, వైఎస్సార్, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో ఇంకా 30 శాతం వరకు పూర్తి చేయాల్సివుంది. పశ్చిమగోదావరి, కర్నూలు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 90 శాతం పెండింగ్ ఉండటంతో అక్కడ భూ హక్కు పత్రాల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరో నెల రోజుల్లో పంపిణీ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. -
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–4 జవాబు పత్రాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–4 పరీక్షల ప్రాథమిక ‘కీ’లను తన వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా గ్రూప్–4 పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబుపత్రాల స్కానింగ్ కాపీలను సైతం అభ్యర్థుల కోసం వెబ్సైట్లో ఉంచింది. వీటిని వచ్చే నెల 27వ తేదీ వరకు వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చు. ఈ జవాబు పత్రాలు నిర్ణిత గడువు తర్వాత వెబ్సైట్లో తెరుచుకోవని కమిషన్ స్పష్టం చేసింది. దాదాపు 9 వేల గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీ జూలై 1న ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్–4 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో పేపర్–1కు 7,63,835 మంది అభ్యర్థులు హాజరు కాగా, పేపర్–2 పరీక్షకు 7,61,026 మంది హాజరయ్యారు. కమిషన్ వెబ్సైట్లో ప్రాథమిక కీలు పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబు పత్రాలను స్కానింగ్ చేసిన కమిషన్... వాటిని అభ్యర్థుల లాగిన్లో అందుబాటులో ఉంచింది. నెల రోజుల పాటు వీటిని వెబ్సైట్ తెరిచి పరిశీలించుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్–4 పరీక్షల ప్రాథమిక కీలు సోమవారం నుంచి కమిషన్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాథమిక కీల పైన ఏవేనీ అభ్యంతరాలుంటే ఈనెల 30వ తేదీనుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు నిర్దేశిత లింకు ద్వారా ఆన్లైన్ పద్ధతిలో తగిన ఆధారాలతో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను కేవలం ఇంగ్లీషులో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశించిన గడువు తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని, ఈమెయిల్, పోసు ద్వారా వచ్చే వినతులను సైతం పరిగణించమని, మరిన్ని వివరాలను వెబ్సైట్ తెరిచి చూసుకోవాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
అమెరికా నుంచి తెలుగు విద్యార్థులు వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ఇమి గ్రేషన్/భద్రతా అధికారులు ఎయిర్పోర్టు నుంచే తిప్పిపంపేశారు. ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. బలవంతంగా విమానం ఎక్కించి వెనక్కి పంపారు. ఇలా అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలిసింది. దాదాపు వారం రోజుల నుంచి ఇలా ఒకరిద్దరిని పంపేస్తున్నా.. ఇప్పుడు ఒక్కరోజే 20 మందికిపైగా విద్యార్థులను వెనక్కి పంపడంతో విషయం బయటికి వచ్చిందని అమెరికాలోని తెలుగు సంఘాలు చెప్తున్నాయి. అయితే పత్రాలు, వివరాలన్నీ పరిశీలించాకే అమెరికా వీసా ఇస్తారని, అలాంటప్పుడు ఈ సమస్య ఎందుకొచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సదరు విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు.పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నా..: అమెరికాలో ఆగస్టులో విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే భారత విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అక్కడి వీసా నిబంధనలకు అనుగుణంగా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటారు. ముందే టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు రాస్తారు. వాటి మార్కుల ఆధారంగానే అక్కడి యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి. తర్వాత అమెరికాలో చదువుకున్నన్ని రోజులు జీవించడానికి అవసరమయ్యే మేర సొమ్మును బ్యాంకు బ్యాలెన్స్గా చూపిస్తారు. ఇందుకోసం విద్యార్థులు కన్సల్టెన్సీల సహకారం తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా అనుభవం సర్టిఫికెట్లు కూడా సమర్పిస్తున్నారు. ఈ వ్యవహారంలోనే మన విద్యార్థులు ఇబ్బందుల్లో పడుతున్నారని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు చెప్తున్నాయి. డాక్యుమెంట్లపై అనుమానాలు.. సోషల్ మీడియా ఖాతాలు అమెరికాలో ‘సాక్షి’ ప్రతినిధికి అందిన సమాచారం ప్రకారం.. పలువురు తెలుగు విద్యార్థులు బ్యాంక్ ఖాతాలో సొమ్మును చూపిన అంశంపై అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఖాతాలో ఒకేసారి భారీగా డబ్బులు పడటం, లావాదేవీలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించి, తిప్పి పంపారు. అమెరికాలో ఆటా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికాలో ఎన్నారై వ్యవహారాల సలహాదారు డాక్టర్ వాసుదేవరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా పరిశీలిస్తోంది. వీసాకు అనుమతించిన మరుక్షణమే నిఘా పెడుతోంది. అందులో అమెరికా నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు, సమాచారం, వ్యాఖ్యలు ఉంటే వాటి ఆధారంగా ఎయిర్పోర్టులోనే ఆపేస్తున్నారు. ఉదాహరణకు భారత విద్యార్థి అమెరికా వస్తూ.. ఇక్కడి స్నేహితులతో అమెరికాలో చదువుకునే రోజుల్లో ఉండే పార్ట్టైం ఉద్యోగాల గురించి వాకబు చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా పరిగణించి వెనక్కి పంపేశారు. నాటా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా మన విద్యార్థులను తిప్పి పంపడానికి కారణాలను కేవలం భారత కాన్సులేట్కు మాత్రమే చెబుతుంది. దీనితో ఆ వివరాలు తెలుసుకునేందుకు అమెరికాలో తెలుగు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయి. -
డిజిటల్ లోన్ గురించి తెలుసా? ఈ డాక్యుమెంట్లుంటే సులువుగా రుణం!
పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల చుట్టూ తిరగాలి. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే అధికారులు ఆమోదించి లోన్ మంజూరు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో ఆన్లైన్లో పర్సనల్ లోన్ పొందవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.. డిజిటల్ ప్లాట్ఫామ్లో లేదా యాప్లో లభించే వ్యక్తిగత రుణాన్ని డిజిటల్ లోన్ అంటారు. దీన్నే ఆన్లైన్ పర్సనల్ లోన్ అని కూడా పిలుస్తారు. సాధారణ పర్సనల్ లోన్తో పోలిస్తే డిజిటల్ లోన్ చాలా తక్కువ సమయంలో మంజూరవుతుంది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ విజయవంతం అయినప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అందువల్ల సరైన డాక్యుమెంటేషన్ ఇక్కడ కీలకం. బ్యాంకు ఉద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు! అర్హత సాధారణ పర్సనల్ లోన్ పొందడానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్ పర్సనల్ లోన్కి కూడా అర్హులు. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, కనీస ఆదాయం లేదా టర్నోవర్ కలిగిన స్వయం ఉపాధి పొందుతున్నవారు ఈ లోన్ పొందవచ్చు. ఆన్లైన్ పర్సనల్ లోన్కు అర్హత దరఖాస్తుదారు క్రెడిట్ స్కోర్పై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ అందుబాటులో లేనప్పుడు ఆ వ్యక్తి సమర్పించే అదనపు డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో దరఖాస్తుదారుల వయస్సు, ఉపాధి, వృత్తిపరమైన అనుభవం వంటి సమాచారం కూడా అవసరమవుతుంది. డాక్యుమెంట్లు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచడం వలన అనవసరమైన జాప్యాలు, తిరస్కరణలు, అభ్యర్థనలు లేకుండా లోన్ అప్రూవల్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. డిజిటల్ లోన్ దరఖాస్తు ప్రక్రియ సాఫీగా జరగడానికి అవసరమైన కొన్ని డాక్యుమెంట్లు ఏవో ఇక్కడ ఇస్తున్నాం.. ఐడెంటిటీ ప్రూఫ్ లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, రుణగ్రహీతలు తమ గుర్తింపును నిర్ధారించేందుకు చెల్లుబాటు అయ్యే ఐడెంటిటీ ప్రూఫ్ను అందించాలి. వీటిలో ముఖ్యమైనవి పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్. అడ్రెస్ ప్రూఫ్ లోన్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి ఐడెంటిటీ ప్రూఫ్తో పాటు చెల్లుబాటు అయ్యే అడ్రెస్ ప్రూఫ్ కూడా అవసరం. పాస్పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటివి కొన్ని చెల్లుబాటు అయ్యే అడ్రెస్ ప్రూఫ్లు. ఇన్కమ్ ప్రూఫ్ రుణగ్రహీతలు తమ ఆదాయాన్ని చూపించే ఏదైనా డాక్యుమెంట్ను కలిగి ఉండాలి. ఇందు కోసం లేటెస్ట్ శాలరీ స్లిప్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ వంటివి సమర్పించవచ్చు. ఈ డాక్యుమెంట్లు దరఖాస్తుదారు ఆర్థిక స్థిరత్వాన్ని, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ధ్రువీకరిస్తాయి. సంతకం ప్రూఫ్ దరఖాస్తుదారు, రుణ సంస్థ మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని రూపొందించడానికి ఈ-సైన్ అని పిలిచే డిజిటల్ సంతకం అవసరం. ఇది పరస్పర అంగీకారం, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. -
AP: ఇక దస్తావేజులతో పని లేదు.. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఈ–స్టాంపులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు వంటి వాటి కోసం దస్తావేజులు (నాన్–జ్యుడిషియల్ స్టాంపులు) వినియోగించాల్సిన అవసరం లేదు. ఈ–స్టాంపుల ద్వారా ఈ పనులన్నింటినీ చేసుకునే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే రూ.100, రూ.50 ఇతర నాన్–జ్యుడిషియల్ స్టాంపులను స్టాంప్ వెండర్ల వద్ద కొనక్కర్లేదు. ప్రభుత్వం అనుమతించిన కామన్ సర్విస్ సెంటర్లలో ఎంత డినామినేషన్ కావాలంటే అంతకి ఈ–స్టాంపులను సులభంగా పొందొచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ–స్టాంపింగ్ విధానం పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఈ–స్టాంపుల ద్వారా ట్యాంపరింగ్కు, అవకతవకలకు ఆస్కారం ఉండదు. 1,200 కామన్ సర్విస్ సెంటర్లకు అనుమతి మొదట్లో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల (అగ్రిమెంట్లు వంటివి) కోసం ఈ–స్టాంపింగ్ను అనుమతించారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లకు సైతం ఈ–స్టాంపింగ్ను ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం 1,200 కామన్ సర్విస్ సెంటర్లు (ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లు (ఏసీసీ)–మీ సేవా కేంద్రాలు వంటివి), 200 మంది స్టాంప్ వెండర్లకు ఈ–స్టాంపింగ్ చేసేందుకు లైసెన్సులు ఇచ్చింది. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఈ–స్టాంపింగ్కి సంబంధించి ఒక కౌంటర్ను ప్రారంభిస్తోంది. ఏసీసీ సెంటర్లు అందుబాటులో లేనివారు, వాటి గురించి తెలియని వారు నేరుగా ఆ కేంద్రాల వద్ద కెళ్లి ఈ–స్టాంపులు పొందొచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఈ–స్టాంపింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి దశలో మండల కేంద్రాల్లో ఉన్న సచివాలయాల్లో తేవడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 30 శాతం రిజిస్ట్రేషన్లు ఈ–స్టాంపింగ్ ద్వారానే.. ఇప్పటికే నెల నుంచి ఈ–స్టాంపింగ్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ సగటున 10 వేల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే అందులో 30 శాతం ఈ–స్టాంపుల ద్వారానే జరుగుతున్నట్లు ఈ విధానాన్ని పర్యవేక్షిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గుంటూరు డీఐజీ శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెల రోజుల్లో 70 శాతానికిపైగా రిజిస్ట్రేషన్లు ఈ–స్టాంపింగ్ ద్వారానే జరిగేలా చూసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దస్తావేజుల కంటే ఎక్కువ భద్రత నాన్–జ్యుడిషియల్ స్టాంపు పేపర్ల కంటే ఈ–స్టాంపులకు ఎక్కువ భద్రత ఉంటుంది. వీటిని ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం. పాత తేదీల మీద స్టాంపులు విక్రయించే అవకాశం ఉండదు. దస్తావేజుల వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఉండేది కాదు. కానీ ఈ–స్టాంపింగ్ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ ఆదీనంలోనే ఉంటుంది. ప్రజలు మోసపోవడానికి ఆస్కారం ఉండదు. గతంలో మాదిరిగా దస్తావేజులను అధిక ధరలకు కొనే బాధ కూడా తప్పుతుంది. ఏసీసీ సెంటర్కి వెళితే అక్కడ ఒక దరఖాస్తు పూర్తి చేస్తే చాలు.. ఈ–స్టాంపు ఇస్తారు. నాన్–జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల మాదిరిగా రూ.100, రూ.50, రూ.20, రూ.10 ఎంత డినామినేషన్ అయినా ఈ–స్టాంపుల ద్వారా పొందొచ్చు. సుమారు రూ.రెండు లక్షల డినామినేషన్ వరకు ఈ–స్టాంపులు జారీ చేసే అవకాశాన్ని కల్పించారు. పలు బ్యాంకులు సైతం ఈ–స్టాంపింగ్కి అనుమతి తీసుకుంటున్నాయి. వినియోగదారులు ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్టాంప్ డ్యూటీ, ఇతర చార్జీలను కూడా ఇకపై బ్యాంకుల్లో చలానాలుగా కాకుండా ఈ ఏసీసీ కేంద్రాల్లోనే చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ–స్టాంపింగ్ విధానాన్ని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ అమలు చేస్తోంది. ఈ–స్టాంపులతో ఎంతో మేలు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ–స్టాంపుల విధానాన్ని ప్రవేశపెట్టాం. దస్తావేజుల స్థానంలో ప్రజలు వీటిని వినియోగించుకోవచ్చు. నాన్–జ్యుడిషియల్ స్టాంపుల కంటే వీటికే భద్రత ఎక్కువగా ఉంటుంది. ఏసీసీ కేంద్రాలు అందుబాటులో లేని వారు తమకు సమీపంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి ఈ–స్టాంపింగ్ అవకాశాన్ని పొందొచ్చు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఈ విధానం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. – వి.రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ -
గుడ్న్యూస్! ఆధార్ ఉచిత అప్డేట్ గుడువు పొడగింపు
ఆధార్లో డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) పొడిగించింది. మరో నెలలు అంటే జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14 వరకు డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్కు సంబంధించి గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ కోసం ఇచ్చిన పత్రాలను సెప్టెంబర్ 14 లోపు ఉచితంగా అప్డేట్, అప్లోడ్ చేసుకోవాలని యూఏడీఏఐ తన వెబ్సైట్లో పేర్కొంది. డాక్యుమెంట్ల అప్డేట్, అప్లోడ్ కోసం జూన్ 14 వరకే గడువు ఉండేది. ఇప్పుడు దాన్ని యూఏడీఏఐ పొడిగించింది. ఈ అప్డేట్ సౌకర్యం https://myaadhaar.uidai.gov.in వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్లను స్వయంగా అప్డేట్, అప్లోడ్ చేసుకోవచ్చు. అదే ఆధార్ సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) కేంద్రంలో అప్డేట్ చేయించుకుంటే రూ.25 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. -
డిజీలాకర్ అంటే? డైనమిక్ కేవైసీతో లాభాలేంటి?
భారత ఫిన్టెక్ను ఐదు విభాగాలుగా వేరు చూసి చూడొచ్చు. క్యూఆర్ కోడ్ తదితర చెల్లింపులు, బిల్లుల చెల్లింపులు, ఇతర అగ్రిగేటర్ సేవలు, బై నౌ, పే లేటర్ సహా రుణ సదుపాయం, రుణాలిచ్చే ప్లాట్ఫామ్లు, డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్లు, ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్లు, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు. ఈ ప్లాట్ఫామ్లకు సంబంధించి సేవలు పొందాలంటే ప్రజలు గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి (కేవైసీ) ఉంటుంది. గత కొన్నేళ్ల కాలంలో కేవైసీ ప్రక్రియను ఫిన్టెక్ సంస్థలు ఎంతో సులభతరం చేశాయి. ఫిన్టెక్ సంస్థలు డిజీలాకర్లో ఉన్న డాక్యుమెంట్లను పొందే అవకాశం కల్పిస్తామని 2023-24 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం నిజంగా ఒక పెద్ద మార్పు వంటిదే. డిజిటల్ ఇండియా మిషన్కు అనుగుణంగా భారత ప్రభుత్వం దేశంలో ఫిన్టెక్ పరిశ్రమ వృద్ధికి ఎన్నో సదుపాయాలు కల్పించింది. ఆధార్, పీఎం జన్ ధన్ యోజన, వీడియో కేవైసీ, యూపీఐ వంటివి ఎన్నో చేపట్టింది. ఫలితంగా భారత ఫిన్టెక్ పరిశ్రమ 2025 నాటికి 1.3 ట్రిలియ్ డాలర్ల స్థాయికి చేరుకోనుంది. డిజీలాకర్ ప్రస్తుతం డిజీలాకర్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్ల డిజిటల్ కాపీలు స్టోర్ చేసుకునేందుకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయం ఇతర డాక్యుమెంట్లను సైతం డిజీలాకర్లో స్టోర్ చేసుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. వెబ్బ్రౌజర్, మొబైల్ యాప్ రూపంలో అందుబాటులో ఉన్న డిజీలాకర్ను డిజీయాత్ర యాప్పై ఐడెండిటీ వెరిఫికేషన్కు అనుమతిస్తున్నారు. దీంతో దేశీ విమానాశ్రయాల్లో కాంటాక్ట్లెస్ చెకిన్కు వీలు లభిస్తోంది. డైనమిక్ కేవైసీ డిజీలాకర్ సాయంతో కేవేసీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంతో కేవైసీ ప్రక్రియ క్రియాశీలంగా మారుతుంది. ఆధార్, పాన్ డేటా ఆధారంగా రిస్క్ సమీక్ష సాధ్యపడుతుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశంలో మరింత విస్తరిస్తుంది. రుణాల లభ్యతను పెంచుతుంది. భారత ఫిన్టెక్ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి బడ్జెట్ ఎంతో ముందడుగు వేసింది సాంకేతిక, విజ్ఞాన ఆధారిత వృద్ధి ప్రాధాన్యతను బడ్జెట్ గుర్తించింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణసంస్థలు కలిగి ఉండే పౌరుల డేటా విషయంలో ఏకీకృత పరిష్కారంపై దృష్టి సారించింది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ సహా ఇతర చర్యలు ఫిన్టెక్ పరిశ్రమ వృద్ధికి ఎంతో లబ్ధి కలిగిస్తాయి. క్రెడిట్ కార్డులు యూపీఐతో లింక్ చేయడానికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా ఆహ్వానించతగినది. -
వ్యాపారం చేయాలనుకునేవారికి శుభవార్త.. ఇకపై అది ఒక్కటి చాలు!
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం చర్యలు ప్రతిపాదించింది. వీటి ప్రకారం ఇకపై ప్రభుత్వ ఏజెన్సీల పరిధిలోని వివిధ డిజిటల్ వ్యవస్థలతో లావాదేవీల్లో వ్యాపార సంస్థలు తమ గుర్తింపు ధ్రువీకరణ కోసం పర్మనెంట్ అకౌంటు నంబరు (పాన్) కార్డు ఒక్కటే సమర్పించినా సరిపోనుంది. ప్రస్తుతం వ్యాపారాలకి అనుమతులు తీసుకునేందుకు జీఎస్టీఎన్, టిన్, ఈఎస్ఐసీ వంటి రకరకాల ఐడీలు అవసరమవుతున్నాయి. దేశీయంగా వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు ఇది తోడ్పడగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు, వాణిజ్య వివాదాల పరిష్కారం కోసం వివాద్ సే విశ్వాస్–2 (వీఎస్వీ–2) స్కీమును ప్రవేశపెడుతున్నట్లు ఆమె తెలిపారు. అసెస్మెంటుకు సంబంధించి పన్నులు, వడ్డీలు, జరిమానాలు వంటి అంశాల్లో వివాదాల పరిష్కారానికి ఇది ఉపయోగపడనుంది. పన్ను వివాదాల తగ్గింపుపై దృష్టి .. పన్నుపరమైన వివాదాలను తగ్గించేందుకు కూడా ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు చేశారు. ఒకే తరహా లీగల్ వివాదాలపై అప్పీళ్లు చేసేందుకు బోలెడంత సమయం, వనరులు వృధా అవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్దిష్ట చట్టాన్ని సవాలు చేసే కేసు ఏదైనా న్యాయస్థానంలో పెండింగ్లో ఉంటే.. ఐటీ శాఖ మళ్లీ అదే తరహా కేసు మరొకటి దాఖలు చేయకుండా వాయిదా వేసేలా కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండాలని ఆమె ప్రతిపాదించారు. రీక్లెయిమింగ్ సులభతరానికి ఐఈపీఎఫ్ షేర్లు, డివిడెండ్ల రీక్లెయిమింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు సమీకృత ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్, ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్)ను ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ చెప్పారు. ఇక, ఫీల్డ్ ఆఫీసుల్లో దాఖలయ్యే వివిధ రకాల ఫారంలను కేంద్రీకృతంగా హ్యాండిల్ చేసేందుకు కంపెనీల చట్టం కింద సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా కార్పొరేట్లకు మరింత వేగవంతంగా సమాచారం/స్పందన లభించగలదని ఆమె పేర్కొన్నారు. కేవైసీ.. ఈజీ.. కస్టమర్ల వివరాల సేకరణకు సంబంధించిన నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను సరళతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా అందరికీ ఒకే తరహా ప్రక్రియ పాటించడం కాకుండా ’రిస్క్ ఆధారిత’ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణ సంస్థలు, నియంత్రిత సంస్థల దగ్గర ఉండే వ్యక్తుల గుర్తింపు, చిరునామాలను ఒకే చోట అప్డేట్ చేసేలా నిర్దిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆమె ప్రతిపాదించారు. ఇందుకోసం డిజిలాకర్ సర్వీసును, ఆధార్ను ఉపయోగించనున్నారు. అలాగే, ఒకే సమాచారాన్ని వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు వేర్వేరుగా సమర్పించాల్సిన అగత్యం తప్పించేలా ఏకీకృత ఫైలింగ్ ప్రక్రియ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. చదవండి: సరైన సమయం కాదు.. అందుకే రూ. 20,000 కోట్ల ఎఫ్పీవోను వెనక్కి ఇస్తున్నాం: అదానీ గ్రూప్ -
ఆధార్ కార్డ్లో మీ వివరాలు అప్డేట్ చేయాలా? ఇలా సింపుల్గా చేయండి!
ఆధార్ కార్డ్(Aadhaar Card).. ప్రస్తుతం ఈ పేరు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆధార్ అనేది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాకుండా సంక్షేమ పథకాలు విషయంలో, ఆర్థిక వ్యవహరాల్లో కీలకంగా మారింది. దీంతో కొందరు ఆధార్ కార్డ్ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు.ఈ క్రమంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ ఈ కార్డ్ విషయంలో అక్రమాలను అరికట్టేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల 10 ఏళ్లకోసారి ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలన్న వార్తలు బలంగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆధార్ కార్డ్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి కాకపోయినా, చేయడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. ఇటీవల ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ స్కీం లాంటి ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వ అందిస్తున్న సేవలకు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా మారింది. ఇక ఆర్థిక వ్యవహారాల్లోనూ ఆధార్ నెంబర్ కీలక పాత్ర పోషిస్తోంది.ఈ తరుణంలో ఆధార్ కార్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లబ్ధిదారులకు చాలా ముఖ్యమనే విషయాన్ని గమనించాలి. కేవలం అప్డేట్తో పాటు అందులో తప్పులు ఉంటే మార్చుకోవాలి. కార్డులోని పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకునే వెసలుబాటు ఉంది. వీటిని అప్డేట్ చేయడానికి ఆధార్ సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఆన్లైన్లో ఈ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్లో మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీ వివరాలు అప్డేట్ చేసి అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అనంతరం ఈ సేవకు అవసరమయ్యే పేమెంట్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి. ఎంఆధార్ యాప్ ఉన్నవాళ్లు ఆధార్ అప్డేట్ కోసం ఇవే స్టెప్స్ ఫాలో కావచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలు కాకుండా మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, రిలేషన్షిప్ స్టేటస్, ఐరిస్, ఫింగర్ప్రింట్, ఫోటో అప్డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్కు వెళ్లాల్సి ఉంటుంది. అప్డేట్ ఇలా చేసుకోండి - ఆధార్ SUP పోర్టల్ uidai.gov.inని సందర్శించండి, ఆన్లైన్లో అప్డేట్ చిరునామాను ఎంచుకోండి - మీ ఆధార్ నంబర్ లేదా VIDని నమోదు చేయండి - మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు పంపే సెక్యూరిటీ కోడ్ OTP వస్తుంది - మీరు అందుకున్న OTPని నమోదు చేయండి - "చిరునామా" ఎంపికను ఎంచుకుని, సబ్మిట్ చేయండి - మీ అన్ని అడ్రస్ వివరాలను జాగ్రత్తగా నమోదు చేసి, సబ్మిట్ బటన్ను నొక్కి, ఆపై చివరగా నిర్ధారించుకోండి - సపోర్టింగ్ డాక్యుమెంట్ రంగు స్కాన్ చేసిన కాపీని అటాచ్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి - పత్రం సరైనదని నిర్ధారించుకోండి. అన్నీ సరైనవే అయితే ఎస్ బటన్ ఎంచుకోండి - BPOని ఎంచుకుని, సబ్మిట్పై క్లిక్ చేయండి - మీ అప్డేట్ రిక్వెస్ట్ ఇప్పుడు సబ్మిట్ చేయండి - అనంతరం మీ URN నంబర్ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్తో పాటు మీ ఈమెయిల్కి కూడా వస్తుంది. - మీరు మీ URN స్థితిని ఆన్లైన్లో కూడా తనిఖీ చేయవచ్చు -
చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడ్డ ఉదంతం క్రమంగా చినికి చినికి గాలివానగా మారుతోంది. ఆ పత్రాల్లో బ్రిటన్, ఉక్రెయిన్, ఇరాన్లకు సంబంధించిన పలు సున్నితమైన అంశాలున్నట్టు వస్తున్న వార్తలు మరింత దుమారానికి దారి తీస్తున్నాయి. బరాక్ ఒబామా హయాంలో బైడెన్ ఉపాధ్యక్షునిగా ఉన్నప్పటి సదరు పత్రాలు ఆయన పదవి నుంచి తప్పుకున్నాక ఉపయోగించిన ప్రైవేట్ కార్యాలయంలో గత నవంబర్లో బయటపడ్డాయి. ఈ అంశం సోమవారం వెలుగులోకి వచ్చింది. వాటి ఉనికిని కనిపెట్టింది బైడెన్ తరఫు లాయర్లేనని, వెంటనే వారు నేషనల్ ఆర్కైవ్స్కు సమాచారమిచ్చారని ఆయన వర్గం సమర్థించుకున్నా విపక్షాలు ఇప్పటికే దీనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. 2022 ఆగస్టులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలోనూ ఇలాగే భారీ సంఖ్యలో రహస్య పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్ స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఈ విషయమై ట్రంప్పై దర్యాప్తు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నాయి. అదే కోవలో బైడెన్ కూడా విచారణ ఎదుర్కోక తప్పదంటున్నారు. దీనిపై అటార్నీ జనరల్ మెరిక్ గార్లండ్కు ఇప్పటికే ప్రాథమిక నివేదిక అందింది. నేషనల్ ఆర్కైవ్స్, రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని తనకు నివేదించగానే దీనిపై విచారణ బాధ్యతలను షికాగో అటార్నీ జాన్ లాష్చ్ జూనియర్కు గార్లండ్ అప్పగించారు. ఆయన నుంచి ఇప్పటికే అన్ని వివరాలూ తెప్పించుకున్నారు. బైడెన్పై పూర్తిస్థాయి నేర విచారణ ప్రారంభించాలా, వద్దా అన్న కీలక అంశంపై గార్లండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ట్రంప్ రహస్య డాక్యుమెంట్లకు సంబంధించి ఆయన ఫ్లోరిడా ఎస్టేట్లో ఎఫ్బీఐ సోదాలతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది గార్లండే కావడం విశేషం! అధ్యక్షుల నిజాయితీకి అత్యంత ప్రాధాన్యమివ్వడమే గాక వారి ప్రవర్తన విషయంలో అత్యంత పట్టింపుగా ఉండే అమెరికాలో చివరికిది బైడెన్ పదవికి ఎసరు పెడుతుందా అన్నది చూడాలి. ఏం జరిగింది? బైడెన్ వద్ద పలు రహస్య పత్రాలు బయట పడ్డట్టు సోమవారం అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో వైట్హౌస్ దీనిపై అధికారిక ప్రకటన చేసింది. 2022 నవంబర్ 2న వాషింగ్టన్ డీసీలోని పెన్ బైడెన్ సెంటర్లో ఉన్న బైడెన్ ప్రైవేట్ కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న సందర్భంగా అందులో పలు రహస్య పత్రాలను ఆయన లాయర్లు కనుగొన్నట్టు పేర్కొంది. అవన్నీ ఒబామా అధ్యక్షునిగా, బైడెన్ ఉపాధ్యక్షునిగా ఉన్నప్పటివని, అంటే 2013–16 నాటివని చెబుతున్నారు. ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్ పరిధిలోకి వచ్చే పలు పత్రాలు కూడా వీటిలో ఉన్నాయి! అవి రహస్య పత్రాలని తెలియగానే తన లాయర్లు వెంటనే నేషనల్ ఆర్కైవ్స్కు సమాచారమిచ్చి వాటిని అప్పగించారని బైడెన్ చెప్పుకొచ్చారు. ఉపాధ్యక్షునిగా పదవీకాలం ముగిశాక 2017 నుంచి మూడేళ్లపాటు ఆయన ఈ కార్యాలయాన్ని వాడుకున్నారు. ఆ పత్రాల్లో ఏముంది? బైడెన్ ఆఫీసులో దొరికినవి మామూలు రహస్య పత్రాలేనంటూ తొలుత వార్తలు వచ్చాయి. అయితే వాటిలో బ్రిటన్, ఇరాన్, ఉక్రెయిన్లకు సంబంధించి అమెరికా నిఘా వర్గాలు సేకరించిన అత్యంత రహస్య సమాచారం ఉందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ తదితర వార్తా సంస్థలు తాజాగా వెల్లడించడం సంచలనం రేపుతోంది. కావాలనే ఆలస్యంగా బయట పెట్టారా? రహస్య పత్రాలు ప్రైవేట్ కార్యాలయంలో దొరకడం ఒక ఎత్తైతే, దాన్ని ఇంతకాలం దాచి ఉంచడం బైడెన్కు మరింత ఇబ్బందికరంగా మారేలా కన్పిస్తోంది. 2022 నవంబర్ 2న ఈ పత్రాలు వెలుగు చూసినప్పటికి అమెరికాలో కీలకమైన మధ్యంతర ఎన్నికలు మరో వారంలోపే ఉన్నాయి. పత్రాల విషయం అప్పుడే బయటికొస్తే ఆ ఎన్నికల్లో డెమొక్రాట్లకు పెద్ద ఎదురుదెబ్బే తగిలేది. అందుకే దీన్ని దాచి ఉంచినట్టు తేలితే బైడెన్కు మరింత తలనొప్పిగా మారడం ఖాయం. మధ్యంతరంలో ప్రతినిధుల సభలో విపక్ష రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ లభించడం తెలిసిందే. రాజకీయ వేడి బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలు దొరకడం అధికార డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య దుమారానికి దారి తీస్తోంది. ట్రంప్ ఎస్టేట్ మాదిరిగా బైడెన్ ఇల్లు, కార్యాలయాల్లో ఎఫ్బీఐ ఎప్పుడు సోదాలు చేస్తుందంటూ రిపబ్లికన్ నేతలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ట్రంప్ అయితే మరో అడుగు ముందుకేసి, రహస్య పత్రాలను కాపాడలేకపోయినందుకు వైట్హౌస్లో కూడా ఎఫ్బీఐ సోదాలు చేయాలన్నారు! ప్రతినిధుల సభలో రహస్య పత్రాల వ్యవహారాలను చూసే శక్తిమంతమైన ఓవర్సైట్ కమిటీ సారథి అయిన రిపబ్లికన్ సభ్యుడు జేమ్స్ కోమర్ ఇప్పటికే దీనిపై పూర్తి సమాచారమివ్వాలంటూ నేషనల్ ఆర్కైవ్స్కు, వైట్హౌస్ కౌన్సెల్ కార్యాలయానికి లేఖలు రాశారు. ట్రంప్ పత్రాల గొడవ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా తప్పుకున్నాక పలు రహస్య పత్రాలను వైట్హౌస్ నుంచి తన ఫ్లోరిడా ఎస్టేట్కు తీసుకెళ్లారన్న వార్తలు సంచలనం సృష్టించాయి. 2022 ఆగస్టులో ఆయన ఎస్టేట్లో ఎఫ్బీఐ సోదాల్లో వందలాది డాక్యుమెంట్లు దొరికాయి. తనకేమీ తెలియదని, ఇదంతా రాజకీయ కుట్ర సాధింపని ట్రంప్ ఎదురు దాడికి దిగారు. దొరికినవన్నీ తన వ్యక్తిగత పత్రాలేనంటూ బుకాయించారు. దీనిపై ఇప్పటికే ఆయనపై సివిల్, క్రిమినల్ విచారణలు జరుగుతున్నాయి. మొత్తం 3,000కు పైగా డాక్యుమెంట్లను వైట్హౌస్ నుంచి తరలించినట్టు టంప్ర్పై అభియోగాలు నమోదయ్యాయి. నాకు తెలియదు: బైడెన్ వాషింగ్టన్: తన కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడ్డట్టు తెలిసి ఆశ్చర్యపోయానని బైడెన్ అన్నారు. ‘ఆ పత్రాల గురించి, ఉపాధ్యక్షునిగా నేను తప్పుకున్న తర్వాత నా కార్యాలయంలోకి అవెలా వచ్చాయో నాకు తెలియదు. వాటిల్లో ఏముందో కూడా తెలియదు. వీటిపై జరుగుతున్న విచారణకు పూర్తిగా సహకరిస్తున్నా. ఇలాంటి అంశాలను నేనెంత సీరియస్గా తీసుకుంటానో అందరికీ తెలుసు’ అన్నారు. మెక్సికో పర్యటనలో ఉన్న ఆయన మీడియా ప్రశ్నించడంతో ఈ అంశంపై తొలిసారిగా స్పందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కెన్నెడీ హత్య.. మరిన్ని డాక్యుమెంట్లు బహిర్గతం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ హత్యకు సంబంధించి 13 వేల పై చిలుకు డాక్యుమెంట్లను వైట్హౌస్ తాజాగా బయట పెట్టింది. దీంతో ఆ ఉదంతానికి సంబంధించి 97 శాతానికి పైగా సమాచారం జనానికి ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చినట్టేనని ప్రకటించింది. అయితే మరో 515 డాక్యుమెంట్లను పూర్తిగా, 2,545 డాక్యుమెంట్లను పాక్షికంగా గోప్యంగానే ఉంచనుంది! వాటిని 2023 జూన్ దాకా విడుదల చేయబోమని ప్రకటించింది. హత్యకు సంబంధించిన అతి కీలకమైన విషయాలు వాటిలోనే ఉండొచ్చని భావిస్తున్నారు. హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తి 1963 నవంబర్ 22న కెన్నెడీని డాలస్లో కాల్చి చంపడం తెలిసిందే. దీని వెనక పెద్ద కుట్ర ఉందంటారు. హార్వే కొన్నేళ్లపాటు సోవియట్ యూనియన్లో ఉండొచ్చిన వ్యక్తి కావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కెన్నెడీని చంపించి ఉంటుందని, రహస్యాన్ని శాశ్వతంగా సమాధి చేసేందుకు హార్వేను పోలీసులు కాల్చి చంపారని ఊహాగానాలున్నాయి. -
పాన్ కార్డ్ కోసం అప్లై చేస్తున్నారా.. అందుబాటులోకి కొత్త సేవలు వచ్చాయ్!
పాన్ కార్డు పొందాలని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో మాదిరిగా డాక్యుమెంట్లు సమర్పించి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఈజీగా అప్లై చేసుకుని, అంతే ఈజీగా పొందవచ్చు. ఎలా అంటారా? కేవలం ఆధార్ కార్డు (Aadhaar Card) ఉంటే చాలు, కొన్ని గంటల వ్యవధిలోనే మీరు పాన్ కార్డు పొందచ్చు. ఫినో పేమెంట్స్.. కొత్త సేవలు ఫినో పేమెంట్స్ బ్యాంక్ కొత్త సేవలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వినియోగదారులు కొన్ని గంటల్లో ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ ద్వారా కొత్త పాన్ కార్డ్ల డిజిటల్ వెర్షన్లను పొందవచ్చు. ఇందుకోసం ఫినో పేమెంట్స్ బ్యాంక్ ప్రోటీన్ ఇగౌవ్ టెక్నాలజీస్ (ఎన్ఎస్డీఎల్ ఇగవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు పాన్ కార్డ్ జారీ సేవలను విస్తరించనున్నాయి. ఈ భాగస్వామ్య ఫలితంగా పేపర్లెస్ పాన్ కార్డ్ జారీ చేసే సేవలను ప్రారంభించిన మొదటి పేమెంట్స్ బ్యాంక్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. ఫినో పేమెంట్స్ బ్యాంక్కు దేశవ్యాప్తంగా 12.2 లక్షలకు పైగా మర్చంట్ పాయింట్లు ఉన్నాయి. ఇక ఈ పాయింట్లు అన్నింటిలో పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. వినియోగదారులు ఎటువంటి పత్రాలను సమర్పించకుండా లేదా అప్లోడ్ చేయకుండా ఆధార్ ఆధారిత ధృవీకరణను ఉపయోగించి పాన్ కార్డ్ పొందవచ్చు. ఇందుకోసం ఫినో బ్యాంక్ పాయింట్లలో పాన్ కార్డ్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాన్ కార్డు సేవను ఎంచుకున్న వారికి కొన్ని గంటల వ్యవధిలో ఇపాన్ కార్డు మెయిల్ వస్తుంది. అదే ఫిజికల్ పాన్ కార్డు ఎంచుకుంటే 4 నుంచి 5 రోజుల్లో ఇంటికి వచ్చేస్తుంది. ఈ-పాన్ చట్టబద్ధమైన పాన్ కార్డ్గా అంగీకరించబడుతుంది. చదవండి: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్టీవీ! -
ఫోర్జరీ కేసులో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు అరెస్ట్
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్లోని ఖరీదైన అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లను ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసేందుకు యత్నించిన టీ–టీడీపీ జనరల్ సెక్రటరీ గాజుల విజయ జ్ఞానేశ్వర్నాయుడు అలియాస్ జీవీజీ నాయుడును జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 70లోని జర్నలిస్టు కాలనీ–ప్రశాసన్నగర్ సమీపంలో ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రోనక్ కొటేచాకు జ్యోతి సిగ్నేచర్ అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. రోనక్ కొటేచా ఎక్కువగా ముంబైలో ఉండటాన్ని గమనించిన జీవీజీ నాయుడు ఇళ్ల కబ్జాకు స్కెచ్ వేశాడు. 2013లో ఈ రెండు ఫ్లాట్లను తాను కొంటున్నట్లుగా ఫోర్జరీ పత్రాలు తయారు చేసి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ జరిగినట్లుగా సృష్టించాడు. వీటితో పాటు కొన్ని ఫోర్జరీ సంతకాలతో కూడిన క్యాష్ రిసిప్ట్లను కూడా తయారు చేశారు. 2020లో సిటీ సివిల్ కోర్టులో స్పెషల్ పర్ఫార్మాన్స్ ఫర్ రిజిస్ట్రేషన్ పిటిషన్ను దాఖలు చేస్తూ తాను మొత్తం డబ్బులు చెల్లించినా రోనక్ కొటేచా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న రోనక్ కొటేచా జూలైలో హైదరాబాద్కు వచ్చి ఫోర్జరీ పత్రాలతో తన ఫ్లాట్ను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న జీవీజీ నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టులో జీవీజీ నాయుడు సమర్పించిన పత్రాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా వాటిల్లో రోనక్ కొటేచా సంతకాలన్నీ ఫోర్జరీ అంటూ ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇచ్చింది. దీంతో పోలీసులు జీవీజీ నాయుడుతో పాటు బల్విందర్ సింగ్, మరికొంత మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు తనను అరెస్ట్ చేయకుండా నాయుడు ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలని విఫలయత్నం చేయగా కోర్టు మూడు వారాల పాటు అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలచ్చింది. కోర్టు గడువు గత నెల 20న ముగియడంతో అప్పటి నుంచి పోలీసులు నాయుడును అరెస్ట్ చేసేందుకు యత్నించారు. నిందితుడు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతుండగా ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉండగా పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
ఎడ్యుకేషన్లోన్ కావాలా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
విదేశాల్లో చదువుకుని, కెరీర్ను గ్రాండ్గా మొదలు పెట్టాలన్నది చైతన్య (24) డ్రీమ్. బీటెక్ చేసిన తర్వాత రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేశాడు. ఫ్రాన్స్లోని మాంట్పెల్లియర్ బిజినెస్ స్కూల్లో ఎంఎస్సీ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నాడు. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోర్సుకు పాక్షికంగా స్కాలర్ షిప్ రావడంతో అతడు ఎంతో సంతోషించాడు. కానీ, అప్పుడే అసలు సవాలు ఎదురైంది. వచ్చిన స్కాలర్షిప్ కొద్ది మొత్తమే, మిగిలిన మొత్తాన్ని రుణం ద్వారా సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. విద్యా రుణం సులభంగా లభిస్తుందని అనుకోవచ్చు. కానీ, ఆచరణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. నెల రోజుల పాటు ప్రశాంతత కోల్పోయి అతడు చేసిన ప్రయత్నం ఫలించింది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో సీటు కావడంతో బ్యాంకు విద్యా రుణానికి ఓకే చెప్పింది. అందుకే, విద్యా రుణం పొందడం అనుకున్నంత సులభం కాదు. రుణం ఇచ్చే సంస్థ అన్ని విషయాలను స్పృశిస్తుంది. ఎలా వ్యవహరిస్తే సులభంగా రుణం లభిస్తుంది? ఈ విషయంలో ఉన్న సవాళ్లు, వాటిని అధిగమించడంపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఏటా వేలాది మంది భారత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు. విదేశాంగ శాఖ వద్దనున్న తాజా సమాచారం మేరకు.. కరోనా తర్వాత కూడా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. 2021లో 11 లక్షల మంది భారత విద్యార్థులు విదేశీ చదువుల కోసం వెళ్లారు. 2024లో భారత్ నుంచి సుమారు 18 లక్షల మంది విదేశాల్లో ఉన్నత విద్యను ఎంపిక చేసుకోవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్సీర్ అంచనా. వారు చేసే ఖర్చు వార్షికంగా 80 బిలియన్ డాలర్లు (రూ.6.16 లక్షల కోట్లు) ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది. విద్యా రుణాన్ని నమ్ముకుని విదేశీ విద్యకు ప్లాన్ చేసుకునే వారు ముందుగానే ఇందుకు సంబంధించి వాస్తవ అంశాలను, పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా విచారించుకోవాలి. ‘‘ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం విద్యా రుణాలను పరిమితంగానే మంజూరు చేస్తోంది. వచ్చిన ప్రతి దరఖాస్తుకు ఆమోదం చెప్పడం లేదు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థల పూర్తి జాబితానే చాలా బ్యాంకుల వద్ద లేదంటే విద్యా రుణాల విషయంలో వాటికి ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు’’అని లాంచ్మైకెరీర్ అనే కెరీర్ కౌన్సెలింగ్ ప్లాట్ఫామ్ గ్లోబల్ లీడర్ సుష్మాశర్మ తెలిపారు. బ్యాంకును గుర్తించడం.. విద్యా సంస్థలు, దేశాలకు సంబంధించి పరిమితులు ఉన్నాయి. తమ ముందుకు వచ్చే ప్రతి విదేశీ విద్యా రుణ దరఖాస్తును బ్యాంకులు ఆమోదించవు. పైగా ఒక బ్యాంకుకు సంబంధించి కూడా అన్ని శాఖలు ఈ వ్యాపారం చూడడం లేదు. చైతన్య ముందుగా ఎన్బీఎఫ్సీ నుంచి రుణం తీసుకుందామని అనుకున్నాడు. సులభంగా, వేగంగా వస్తుందని అనుకుని కొన్ని ఎన్బీఎఫ్సీలను సంప్రదించాడు. కానీ, ఒక్కటంటే ఒక్కటీ చైతన్య సీటు సంపాదించిన యూనివర్సిటీ కోర్సులకు రుణాలను ఆఫర్ చేయడం లేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. చివరికి ఎస్బీఐని సంప్రదించగా అతడి ప్రయత్నం ఫలించింది. అదీ మెయిన్ బ్రాంచ్కు వెళ్లాల్సి వచ్చింది. కావాల్సినంత రుణం.. విదేశీ విద్యా కోర్సు అంటే ఫీజులకే బోలెడు ఖర్చు అవుతుంది. ఇదే పెద్ద సవాలు. విదేశీ విద్యా సంస్థల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకునే ముందే ట్యూషన్ పీజులతోపాటు అక్కడ నివసించేందుకు అయ్యే వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుష్మాశర్మ సూచించారు. ఇక కావాల్సినంత రుణం లభించక, తాము సొం తంగా సమకూర్చుకోలేని సందర్భాల్లో విద్యార్థులు రాజీమార్గాలను అనుసరించడాన్ని గమనించొచ్చు. కావాల్సి నంత రుణం/నిధులు సమకూరని సందర్భంలో అవసరమైతే కోర్సును లేదంటే విద్యా సంస్థను మార్చే వారు కూడా ఉన్నట్టు ఫ్లై మాస్టర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఎండీ రాజేష్ వర్మ తెలిపారు. ఉద్యోగ అవకాశాలు.. రుణం ఇచ్చే ముందు ఏ బ్యాంకు అయినా, మరో సంస్థ అయినా ఏం చూస్తుంది..? రుణం తీసుకున్న వ్యక్తికి తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా..? అనే కదా.. అలాగే, విద్యా రుణం విషయంలో బ్యాంకులు అభ్యర్థి చేస్తున్న కోర్సు, ఉద్యోగ మార్కెట్లో ఆ కోర్సుకు ఉన్న డిమాండ్ను పరిశీలిస్తాయి. ఇందులో భాగంగా విద్యార్థి చదవబోయే విద్యాసంస్థకు ఉన్న పేరు, గుర్తింపు, అందులో చదివిన వారికి ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ‘‘విద్యార్థి కేంబ్రిడ్జ్ లేదా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వంటి విద్యా సంస్థలకు వెళ్లొచ్చు. కానీ, ఈ తరహా ప్రతిష్టాత్మక, పేరొందిన ఇనిస్టిట్యూషన్స్కు నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి బదులు విద్యార్థులు ఏజెన్సీలను ఆశ్రయిస్తుంటారు. దాంతో చివరికి పెద్దగా తెలియని యూనివర్సిటీలో అడ్మిషన్తో వారు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అటువంటప్పుడు విద్యా రుణం కష్టంగా మారుతుంది’’ అని విద్యా రుణాల మార్కెట్ప్లేస్ అయిన విమేక్స్కాలర్స్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ ఆర్ కృష్ణ తెలిపారు. పేపర్ వర్క్ కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం ముఖ్యమైన కార్యక్రమం. డాక్యుమెంట్ ప్రక్రియ ఎంత క్లిష్టమో ఇప్పటికే రుణం తీసుకుని విదేశీ విద్యా కోర్సు చేస్తున్న వారిని అడిగితేనే తెలుస్తుంది. విభా షణ్ముఖ్ (33) యూఎస్లోని రైస్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్నారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఎంత క్లిష్టతరమో తన అనుభవాన్ని వెల్లడించారు. డల్లాస్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివేందుకు 2013లో ఆయన ఓ ప్రభుత్వ రంగ బ్యాం కులో రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. ‘‘బ్యాంకు అడిగిన అన్ని పత్రాలను తీసుకెళ్లి ఇచ్చాను. అయినా కానీ, కోర్సుకు అయ్యే ఖర్చు, ఇతర వ్యయాలకు సంబంధించి యూనివర్సిటీ నుంచి ధ్రువీకరణ పత్రం కావాలని బ్యాంకు అడిగింది. కానీ యూనివర్సిటీల నుంచి ఈ తరహా పత్రాలు పొందడం అదిపెద్ద సవాలు’’అని షణ్ముఖ్ తెలిపారు. తాకట్టు.. దేశీ యూనివర్సిటీల్లో కోర్సుల కోసం రుణాలు తీసుకునేట్టు అయితే బ్యాంకులు తనఖా కోరవు. కానీ, విదేశీ వర్సిటీల్లో విద్య కోసం తీసుకునే రుణాలకు సంబంధించి తనఖా పెట్టాలని బ్యాంకులు అడుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు తనఖా కోరుతున్నాయి. తనఖా కింద స్తిరాస్థి, ప్రావిడెంట్ ఫండ్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ ఇస్తే సరిపోతుంది. చాలా ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు తనఖా అడగడం లేదు. మాస్టర్స్ కోర్సులకు తనఖా లేకుండానే ఇవి రుణాలు ఇస్తున్నాయి. వివరాలు సమగ్రంగా తెలుసుకుని ముందడుగు వేయాలి. అధిక వ్యయాలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణానికి డాక్యుమెంట్లు సమర్పణ, ఆమోదం ప్రక్రియ కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అదే ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకుల నుంచి విద్యా రుణం సులభంగానే లభిస్తుంది. కాకపోతే ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే వీటిల్లో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ చార్జీలు ఎక్కువగా ఉంటుంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణాలపై రేట్లు 6.9 శాతం నుంచి 12.5 శాతం మధ్య ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో 10.5 శాతం నుంచి 13 శాతం మధ్య ఉన్నాయి. ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు (ఎక్కువ శాతం) ఇచ్చే విద్యా రుణాలకు మారటోరియం ఉండడం లేదు. దీంతో రుణం మంజూరు చేసిన మరుసటి నెల నుంచే చెల్లింపులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. మారటోరియం అంటే.. కోర్సు కాల వ్యవధికి ముగిసిన తర్వాత ఆరు నెలల వరకు రుణానికి చెల్లింపులు చేయక్కర్లేదు. కోర్సు అనంతరం ఉద్యోగం పొందేందుకు వీలుగా ఆరు నెలల వ్యవధి ఉంటుంది. దీనివల్ల విద్యార్థి కుటుంబానికి ఎంతో ఉపశమనం ఉంటుంది. అందుకుని రుణానికి వెంటనే చెల్లింపులు చేయలేని వారు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మారటోరియంతో కూడిన విద్యా రుణానికే ప్రయత్నించాలి. రుణానికి ముందే ప్రణాళిక ఉండాలి.. సాధారణంగా విద్యార్థులు తమ బడ్జెట్ కోణం నుంచి విదేశాల్లో ప్రవేశాలకు ప్రయత్నిస్తుంటారు. అంటే తక్కువ వ్యయాలు అయ్యే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుంటారు. దీనివల్ల అంతగా ప్రాచుర్యం లేని దేశం లేదా విద్యా సంస్థలో చేరాల్సి వస్తుంది. అందుబాటు ధరలు ఏ దేశంలో ఉన్నాయో విచారించుకుని అక్కడ విద్యాసంస్థను ఎంపిక చేసుకుంటున్నారు. ‘‘ఉదాహరణకు ఒక విద్యార్థి రూ.20లక్షలు ఖర్చు చేయగలనని అనుకుంటే ఆమె లేదా అతడు జర్మనీలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు. అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టుకోగలిగితే యూఎస్ లేదా యూకేలో ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. విద్యా రుణం పొందే విషయంలో పేరున్న యూనివర్సిటీయే కాకుండా, దేశానికీ ప్రాధాన్యం ఉంటుంది’’అని కృష్ణ వివరించారు. విద్యా సంస్థలు పేరున్నవి, ప్రతిష్టాత్మకమైనవి అయితే బ్యాంకులు తనఖా కోరడం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకులు అయితే యూనివర్సిటీలు, కోర్సులతో జాబితాను నిర్వహిస్తున్నాయి. ఏఏ వర్సిటీలు, ఏ కోర్సులకు తక్కువ వడ్డీ రేటు రుణాలు, తక్కువ తనఖాతో మంజూరు చేయాలో ఈ జాబితానే వాటికి ప్రామాణికంగా ఉంటోంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతోపాటు ప్రొడిగీ ఫైనాన్స్, ఎంపవర్ ఫైనాన్సింగ్ తదితర అంతర్జాతీయ సంస్థలు సైతం విద్యా రుణాలు ఇస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు విద్యారుణాల పరంగా సాయాన్ని అందిస్తున్నాయి. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నవారు, సరైన పత్రాలను అందించలేని వారికి విద్యా రుణం పరంగా ప్రైవేటు బ్యాంకులు సౌకర్యం’’అని కృష్ణ తెలిపారు. స్కాలర్షిప్ ‘‘విదేశీ విద్య కోసం వెళ్లే వారిలో కోర్సుకు అయ్యే వ్యయం మేర పూర్తి స్కాలర్షిప్ పొందే అవకాశం 2–3 శాతం మందికే ఉంటుంది. కానీ, పాక్షిక స్కాలర్షిప్ను అందించే విద్యా మండళ్లు, ఇనిస్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి’’అని కృష్ణ తెలిపారు. దరఖాస్తు సమయంలోనే స్కాలర్షిప్ కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఎన్నో పథకాలు అవకాశాలున్నట్టు చెప్పారు. సున్నా వడ్డీ రుణాలు, విరాళాలు కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. టాటా ఫౌండేషన్, అగాఖాన్ ఫౌండేషన్ తదితర సంస్థలు సాయం అందిస్తున్నాయి. స్కాలర్షిప్ పొందడంలో సాయపడే జ్ఞాన్ధన్, విమేక్ సొల్యూషన్స్ తదితర సంస్థలు కూడా ఉన్నాయి. క్రెడిట్ స్కోరు విద్యా రుణం విషయంలోనూ మంచి క్రెడిట్ స్కోరు సాయపడుతుంది. దరఖాస్తు ఆమోదానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలనుకునే వారు మంచి క్రెడిట్ స్కోరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాలేజీకి వచ్చిన పిల్లలు ‘బై నౌ పే లేటర్’ సదుపాయాలను విచ్చలవిడిగా ఉపయోగించుకుని చెల్లించకుండా వదిలేస్తున్నారు. ఈ తరహా చర్యలు రుణాలకు అడ్డంకిగా మారతాయి. విదేశ విద్య ప్రణాళిక ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ హిస్టరీలో మచ్చ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులూ ఈ విషయంలో పిల్లల వ్యయాల పట్ల శ్రద్ధ చూపాలి. డాక్యుమెంట్లు విద్యా రుణానికి కేవైసీ డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం చేసుకోవాలి. కేవైసీ అంటే గుర్తింపు, వయసు, చిరునామాను ధ్రువీకరించేవి. వీటితోపాటు గ్రాడ్యుయేషన్ మార్కుల మెమో షీటు, సెకండరీ స్కూల్, హైస్కూల్ ఇలా విద్యకు సంబంధించి అన్ని మెమో పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. తల్లిదండ్రులు లేదంటే సంరక్షకుల ఆదాయ రుజువు సర్టిఫికెట్ అవసరం. తనఖా కోసం ఉంచతగిన ఇల్లు, పొలం, ప్లాట్, ఫిక్స్డ్ డిపాజిట్ లేదంటే పీపీఎఫ్ ఖాతా పాస్ బుక్, యూనివర్సిటీలో ప్రవేశాన్ని ధ్రువీకరిస్తూ మంజూరు చేసే లేఖ, కోర్సు ఫీజుల చెల్లింపుల షెడ్యూల్, స్కాలర్షిప్ లెటర్, రుణ గ్రహీత బ్యాంకు స్టేట్మెంట్ (చివరి ఆరు నెలలు), తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు, తల్లిదండ్రుల ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు సిద్ధం చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు రుణ దరఖాస్తుదారుడి వాటా కింద చెల్లించే మొత్తానికి మూలాన్ని అడుగుతాయి. అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు చూడాలి రుణం సాయంతో విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారు చూడాల్సిన ముఖ్యమైన వాటిల్లో.. కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు ఒకటి. దీనివల్ల తీసుకునే రుణాన్ని తిరిగి తీర్చివేసే సామర్థ్యాలపై స్పష్టత తెచ్చుకోవచ్చు. విద్యా రుణాల్లో పెరుగుతున్న ఎగవేతలు ఈ విషయంలో ముందు జాగ్రత్త అవసరమని తెలియజేస్తన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చిన విద్యా రుణాల్లో 9.55 శాతం నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏలు) 2020లో వర్గీకరించినట్టు 2021 పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం స్వయంగా తెలిపింది. కోర్సు అనంతరం అక్కడే కొంతకాలంపాటు ఉండి ఉపాధి అవకాశాన్ని సొంతం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘గతంలో అయితే కొన్ని దేశాలు కోర్సు అనంతరం కేవలం కొన్ని నెలల పాటే ఉపాధి అవకాశాల అన్వేషణకు వీలుగా ఉండనిచ్చేవి. కానీ, ఇప్పుడు బ్రిటన్ సహా చాలా దేశాలు గ్రాడ్యుయేట్ రూట్ ప్రోగ్రామ్లను ప్రవేశపెట్టాయి. వీటి కింద ఉన్నతవిద్య అనంతరం అక్కడే కొన్నేళ్లపాటు ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు’’అని ఓ కన్సల్టెన్సీ అధినేత తెలిపారు. -
ట్రంప్ రోజూ రూ. 7లక్షల జరిమానా కట్టాలటా! ఎందుకో తెలుసా?
Trumpobeys a subpoena and surrenders documents relating to his business: అమెరికా మాజీ అధ్యక్షుడు, వివాదాస్పద నాయకుడుగా తరచు వార్తలో నిలిచే డోనాల్డ్ ట్రంప్కి యూఎస్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ట్రంప్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పత్రాలను న్యూయార్క్ అటార్నీ జనరల్ కార్యాలయానికి సమర్పించే వరకు ప్రతి రోజు సుమారు రూ. 7లక్షల వరకు జరిమాన కట్టాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎంగోరోన్ మాట్లాడుతూ...2019 విచారణలో ట్రంప్ తన ఆర్థిక ప్రయోజనాల కోసం తన ఆస్తుల విలువను తప్పుగా చూపించడమే కాకుండా అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమవ్వడంతోనే జరిమాన విధించినట్లు స్పష్టం చేశారు. అందువల్ల ట్రంప్ మంగళవారం నుంచే రోజువారి జరిమాన చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను దిక్కరించినట్లు తెలిపారు. గోల్ఫ్ క్లబ్లు, పెంట్హౌస్ అపార్ట్మెంట్తో సహా ఆస్తుల విలువలను దర్యాప్తులో తప్పుగా పేర్కొన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆస్తులుపై మంచి రుణాలు పొందడం కోసం వాటి విలువను అధికంగా చూపించారని, మరికొన్ని సందర్భాల్లో పన్ను ప్రయోజనాలను పొందడం కోసం వాటి విలువనే తక్కువగా కూడా చూపించారని పేర్కొన్నారు. వాస్తవానికి ట్రంప్ గతంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఆ ఆస్తులకు సంబంధించిన పత్రాలు సమర్పించడంలో విఫలమయ్యారు. కానీ ఆయన తరుపున న్యాయవాదులు అభ్యర్థన మేరకు కోర్టు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. అయితే ట్రంప్ తరుపు న్యాయవాది అలీనా హబ్బా విచారణ అనంతరం ఈ విషయమై అప్పీలు చేస్తానని చెప్పాడం గమనార్హం. (చదవండి: పుతిన్కు నా తడాఖా చూపించేవాడిని.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!) -
ఆధారాల చోరీ ఘటనలో ఇద్దరు అదుపులోకి!?
నెల్లూరు (క్రైమ్): నెల్లూరు కోర్టులో ఆధారాల అపహరణ కేసుకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కోర్టులో చోరీ జరగడం, అదీ ఓ కీలక కేసుకు సంబంధించిన ఆధారాలు దొం గిలించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రాజకీయరంగు పులుముకున్న ఈ కేసును ఛేదించేం దుకు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో కేసును విచారిస్తున్నారు. కోర్టు ప్రాంగణాన్ని శుక్రవారం పరిశీలించి కీలకపత్రాలు ఎక్కడున్నాయి? ఎక్కడ నుంచి దొంగిలించారు? తదితర వివరాలను ఆరా తీశారు. వివరాలివీ.. 2016 డిసెంబర్లో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వైఎస్సార్సీపీ నేత, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డితోపాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నెల్లూరు 4వ అదనపు ఫస్ట్క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ సాగింది. అనంతరం విజయవాడలో ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టులో సాగుతోంది. అయితే, కేసు కు సంబంధించిన కీలక ఆధారాలు ల్యాప్టాప్, ట్యాబ్, సెల్ఫోన్లు, నకిలీపత్రాలు, రబ్బర్స్టాంపులు తదితరాలన్నీ నెల్లూరు కోర్టులోనే ఉన్నాయి. తాళాలు పగులగొట్టి దొంగతనం బుధవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కోర్టు ప్రాంగణంలోకి వెళ్లి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. బీరువాలో ఉంచిన కీలక ఆధారాలున్న బ్యాగ్ను తస్కరించారు. బ్యాగ్తోపాటు కాగితాలను కోర్టు బయటపడేసి అందులో ఉన్న ట్యాబ్, ల్యాప్ టాప్, నాలుగు సెల్ఫోన్లు, నకిలీ పత్రాలు, రబ్బర్ స్టాంప్లను అపహరించుకు వెళ్లారు. దీంతో కోర్టు బెంచ్క్లర్క్ వి.నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. నగర ఇన్చార్జ్ డీఎస్పీ వై. హరినా«థ్రెడ్డి నేతృత్వంలో చిన్నబజారు ఇన్స్పెక్టర్ వీరేంద్రబాబు దర్యాప్తు ప్రా రంభించారు. కోర్టు ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తు క్లిష్టతరంగా మారింది. దీంతో కోర్టుకు వచ్చే రహదారులన్నింటిలోని సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో.. గురువారం తెల్లవారుజామున రెండుగంటల ప్రాం తంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్లడాన్ని గుర్తించారు. వారు ఖుద్దూస్నగర్కు చెందిన పాత నేరస్తుడు, పొర్లుకట్టకు చెందిన అతని స్నేహితుడని తేలడంతో వారిద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారించి..చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రెండునెలల కిందట ఓ వృద్ధురాలిని కట్టేసి నగలు దొంగలించిన ఘటనలో పోలీసులు వీరిని అరెస్టు చేశారనీ, పదిరోజుల కిందటే వారు బయటకు వచ్చారని సమాచారం. -
Pandora Papers: అంతా పెద్దలే!
కళ్ళ ముందున్నా... కనిపించకుండా దాచిన నిజాలు బయటపడ్డప్పుడు కొందరికి కష్టం కలగచ్చు. మరికొందరికి కోపం రావచ్చు. అత్యధికులకు ఆ నిజాలతో ఆశ్చర్యం తప్పదు. ఆర్థిక లావాదేవీల రహస్యపత్రాల్ని ‘పండోరా పేపర్స్’ పేరిట ఆదివారం బయటపెట్టినప్పుడూ అంతే. ప్రపంచ వ్యాప్తంగా వందలాది కోటీశ్వరులు అపరిమిత ఆదాయాన్ని పన్ను బెడద లేని పనామా, దుబాయ్ లాంటి దేశాల్లో ఆఫ్షోర్ కంపెనీలు, ట్రస్టులకు గుట్టుగా దోచిపెట్టి, దాచిపెట్టిన నిజం ఇప్పుడు మరోసారి సంచలనమైంది. రాజకీయాలు, వినోదం, వ్యాపారం, ఆటలు, ఆధ్యాత్మికత దాకా వివిధ రంగాల ‘పెద్ద మనుషుల’ పేర్లు డొల్ల కంపెనీల్లో లక్షల కోట్ల డాలర్లు దాచినవారి జాబితాలో బయట పడ్డాయి. దేశాల నేతల సహా 130 మంది బిలియనీర్లు ఈ బాపతువారేనన్నది కళ్ళు తిరిగే నిజం. పరిశోధనే ప్రాణంగా గడిపే జర్నలిస్టుల కృషితో ‘ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్’ (ఐసీఐజే) అయిదేళ్ళ క్రితం 2016లో ‘పనామా పేపర్స్’ను బయటపెట్టి తేనెతుట్టెను కదిలించింది. ఇప్పుడు ‘పండోరా పేపర్స్’తో మరో బాంబు పేల్చింది. అమెరికాలోని ‘వాషింగ్టన్ పోస్ట్’ మొదలు భారత్లోని ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ దాకా 117 దేశాల్లోని 150 మీడియా సంస్థలకు చెందిన 600 మంది దాకా జర్నలిస్టులు చేసిన పరిశోధన ఇది. మన దేశం నుంచి పలువురు ఐసీఐజే డేగకళ్ళకు చిక్కారు. దాంతో పన్నులెగవేస్తూ, ఆదాయాన్ని అక్రమంగా విదేశాల్లో దాచిపెడుతున్నట్టు పేర్లు బయటకొచ్చిన భారతీయులపై నిజనిర్ధారణ కోసం దర్యాప్తు జరపాలని కేంద్రం సోమవారం ఆదేశించాల్సి వచ్చింది. కేంద్ర ప్రత్యక్షపన్నుల బోర్డు సారథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక గూఢచర్య విభాగం (ఎఫ్ఐయు)తో కూడిన బృందం ఈ దర్యాప్తు సాగించనుంది. మునుపటి ‘పనామా పేపర్స్’ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడీ ‘పండోరా పేపర్స్’ ఆ స్థాయిలో కాకపోయినా, రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో సంచలనం రేపుతోంది. అనిల్ అంబానీ, సచిన్ టెండూల్కర్, జాకీష్రాఫ్, నీరా రాడియా లాంటి ప్రసిద్ధుల పేర్లు బయటకొచ్చాయి. పాతికేళ్ళ పైచిలుకుగా ఇలాంటి ‘పెద్దలు’ ఇంద్రభవనాలు, సముద్రతీర నివాసాలు, విలాసవంతమైన నౌకలు లాంటి ఆస్తిపాస్తుల రూపంలో తమ సంపదను దాచేస్తున్నారని కథనం. ప్రపంచం నలుమూలల్లోని 14 వేర్వేరు న్యాయ, ఆర్థికసేవల సంస్థల నుంచి సేకరించిన కోటీ 20 లక్షల రహస్యఫైళ్ళను తిరగేస్తే, తేలిన విషయమిది. ఇలా రహస్యంగా సంపదను పోగేసుకున్న వారిలో జోర్డాన్ రాజు, చెక్ ప్రధాని సహా రష్యా అధ్యక్షుడు పుతిన్ – పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ల సన్నిహితులూ ఉన్నారు. దేశ ఆర్థిక మంత్రి సహా అనేకులు ఆ జాబితాలో ఉండడం ఇమ్రాన్కు మింగుడుపడడం లేదు. ఎందుకంటే, ఆయన తన రాజకీయ బద్ధవిరోధి, మాజీ పీఎం నవాజ్ షరీఫ్ను ప్రభుత్వ పీఠంపై లేకుండా చేసింది అప్పట్లో బయటపడ్డ ‘పనామా పేపర్స్’ సాయంతోనే! ఇప్పుడీ ‘పండోరా పేపర్స్’ తన పీకలకు చుట్టుకుంటుందేమోనని దర్యాప్తుకు ఆదేశించారు. విచారణను ఎదుర్కొంటున్నవారు అధికార హోదాల్లో ఉంటే గనక, ఆ దర్యాప్తు ఆశించిన ఫలితాలివ్వదన్నది ఆ రోజుల నుంచి ఇమ్రాన్ వాదన. ఆ వాదనకు కట్టుబడి ఇప్పుడీ సన్నిహిత సహచరులను కూడా దర్యాప్తు పూర్తయ్యే వరకు పదవి నుంచి వైదొలగమని ఆయన ఆదేశిస్తారా? ప్రధాని హోదాలో ఇమ్రాన్కు ఇది అగ్నిపరీక్షే. ఆర్థిక సలహాదార్ల పక్కావ్యూహంతో కొందరు ధనికులు ప్రభుత్వాల కన్నుగప్పి తమ సంపదను వేర్వేరు దేశాల్లో పెట్టడం చాలాకాలంగా ఉన్నదే. అయితే, విదేశీ ఖాతాలు, ఆఫ్షోర్ రిజిస్టర్డ్ ట్రస్టు లన్నింటిలోనూ దొంగ డబ్బే ఉందనలేం. వాటిలో అన్నీ కాకున్నా, కొన్నయితే అక్రమమే. ‘పండోరా’ లాంటి వెల్లడింపుల వల్ల అలాంటి బడా బాబుల జాతకాలు కట్టగట్టుకు బయటకొస్తాయి. ఆ సమాచారం ఆధారంగా వారి వివరాల కూపీ లాగి, అక్రమాలకు పాల్పడినట్టుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నిజానికి, మన దేశీయులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల డాలర్ల మేర విదేశాలకు పంపే వీలుంది. అదే ప్రవాస భారతీయులకైతే ఆ పరిమితి అనేక రెట్లు ఎక్కువ. ప్రపంచమొక కుగ్రామమైన వేళ విదేశీ వ్యాపార ఒప్పందాలు, ఆదాయాలు మామూలయ్యాయి. అందుకే, అక్రమాలకు పాల్పడినట్టు తేలేంత వరకు ఈ సంపన్నులందరూ చట్టరీత్యా నిర్దోషులే. వేధింపులు లేకుండా, వేగంగా దర్యాప్తు జరపడం అవసరం. నిజానికి, మనదేశంలో పన్ను భారం అమితంగా పెరిగేసరికి, సంపన్నులు పక్కచూపులు చూడడమూ పెరుగుతోంది. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల నుంచి వెనక్కి వెళ్ళలేని వర్తమానంలో మన ప్రభుత్వాలు ఒక పని చేయవచ్చు. దేశంలో నుంచి భారీమొత్తంలో బయటకు ధనం తీసుకువెళ్ళే సంపన్నులకు ప్రోత్సాహ కాలు తగ్గించవచ్చు. మన పన్నుల విధానాన్ని అలా మార్చుకోవచ్చు. అదే సమయంలో శరవేగంతో దూసుకుపోతూ, అధిక రాబడినిచ్చే విపణిగా మన దేశపు ఆకర్షణ కొనసాగేలానూ జాగ్రత్తపడాలి. అసలీ బెడద పోవాలంటే, బ్రిటన్లో లాగా ప్రతి ట్రస్టు, సంస్థ తాలూకు అసలైన ప్రయోజనం పొందే యజమాని ఎవరో తెలిసే పద్ధతి ప్రపంచమంతా ఉండాలి. విదేశీ మదుపరులకు కనిష్ఠమైన పన్నుతో ఆకర్షిస్తున్న ‘స్వర్గధామ’ దేశాలు తమ గడ్డ మీది సంస్థల చట్టబద్ధమైన యజమానులెవరో బయటపెట్టాలి. అలా వెల్లడించడానికి ‘జీ–20’ దేశాలు తుది గడువు పెట్టాలి. ప్రపంచవ్యాప్త కనిష్ఠ పన్ను 15 శాతం ఉండేలా చూస్తే, అసలీ దేశాల్లో దాచే అవసరమూ రాకపోవచ్చు. అలాంటివి లేనంత వరకు పనామా, పండోరా – ఇలా పెద్దల గుట్టు విప్పే పరిశోధనలు మరెన్నో రాక తప్పదు. -
హోమ్ లోన్ దరఖాస్తుకు కావాల్సిన ధ్రువ పత్రాలు ఇవే..!
మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని పేదవారు చాలా మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడానికి ఎంతో ఆరాట పడుతుంటారు. ఇలాంటి కలల గృహం చాలా కష్ట పడుతారు. అయితే, వారి దగ్గర ఉన్న సొమ్ముతో మరికొంత సొమ్మును వడ్డీకి తీసుకొని వచ్చి కట్టుకుంటారు. అయితే, అలాంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశంలోని అతిపెద్ద రుణదాత 6.70 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తోంది. ఎస్బీఐ ఇటీవలి ప్రకటనలో, ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాదారులు గృహ రుణం పొందడానికి అవసరమైన పత్రాల జాబితాను విడుదల చేసింది. ఎస్బీఐ గృహ రుణాన్ని పొందడానికి అవసరమైన ముఖ్యమైన పత్రాలు క్రింది విధంగా ఉన్నాయి.(చదవండి: దేశంలో 'ఈ' కార్ల అమ్మకాలు బంద్!) ఉద్యోగి గుర్తింపు కార్డు లోన్-అప్లికేషన్: పూర్తిగా నింపిన రుణ దరఖాస్తు ఫారం మీద మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు అతికించాలి. గుర్తింపు రుజువు (ఏదైనా ఒకటి): పాన్ /డ్రైవర్ లైసెన్స్/ పాస్ పోర్ట్/ఓటర్ ఐడి కార్డు నివాస రుజువు లేదా చిరునామా(ఏదైనా ఒకటి): ఇటీవల విద్యుత్ బిల్లు/టెలిఫోన్ బిల్లు/ వాటర్ బిల్లు/ పైప్డ్ గ్యాస్ బిల్లు లేదా పాస్ పోర్ట్/ఆధార్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్ కాపీ ప్రాపర్టీ పేపర్లు: నిర్మాణానికి అనుమతి (వర్తించే చోట) అమ్మకానికి నమోదు చేసుకున్న ఒప్పందం (మహారాష్ట్రకు మాత్రమే)/అమ్మకానికి స్టాంప్డ్ ఒప్పందం/కేటాయింపు లేఖ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్(ఆస్తిని బదిలీ చేయడానికి సిద్ధంగా ఉంటే) మెయింటెనెన్స్ బిల్లు, విద్యుత్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు ఆమోదించబడ్డ ప్లాన్ కాపీ(జిరాక్స్ బ్లూప్రింట్), బిల్డర్ రిజిస్టర్డ్ డెవలప్ మెంట్ అగ్రిమెంట్, కన్వేయన్స్ డీడ్(కొత్త ఆస్తి కోసం) చెల్లింపు రసీదులు లేదా బిల్డర్ లేదా విక్రేతకు చేసిన అన్ని చెల్లింపులను చూపించే బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్ బ్యాంక్ ఖాతా వివరాలు దరఖాస్తుదారుడు కలిగి ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలకు సంబంధించి గత ఆరు నెలల బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్లు ఒకవేళ ఇతర బ్యాంకులు నుంచి రుణం తీసుకుంటే, గత సంవత్సరం రుణ ఖాతా స్టేట్ మెంట్ వేతన దరఖాస్తుదారుడు శాలరీ స్లిప్ లేదా గత మూడు నెలల వేతన సర్టిఫికేట్ గత రెండు సంవత్సరాలుగా ఫారం 16 కాపీ లేదా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐటి రిటర్న్ల కాపీ వేతనేతర దరఖాస్తుదారుడు బిజినెస్ చిరునామా రుజువు గత మూడు సంవత్సరాల ఐటి రిటర్న్స్ గత మూడు సంవత్సరాలుగా బ్యాలెన్స్ షీట్, లాభం మరియు నష్టం ఖాతా బిజినెస్ లైసెన్స్ వివరాలు(లేదా సమానమైనవి) టీడీఎస్ సర్టిఫికేట్ (ఫారం 16ఏ - ఒకవేళ వర్తిస్తే) అర్హత సర్టిఫికేట్(సి.ఏ/డాక్టర్ లేదా ఇతర ప్రొఫెషనల్స్ కోసం) -
డిజిలాకర్: ఆధార్ను ఆన్లైన్లోనే దాచుకొవచ్చు!
సాక్షి,హైదరాబాద్: ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితులు ‘డిజిటల్ సర్వీసెస్’ను ఫోకస్లోకి తీసుకొచ్చాయి. ఏడాది కాలంగా చోటుచేసుకున్న పరిణామాలతో గతంలో డిజిటల్ టెక్నాలజీలను అంతగా అందిపుచ్చుకోని సంప్రదాయ వ్యాపారసంస్థలు, విద్యాసంస్థలు కూడా ఇప్పుడు ఆన్లైన్ కార్యకలాపాలకు షిప్ట్ అయిపోయాయి. గతంలో ఈ సంస్థల లావాదేవీలు, రోజువారీ విధులు, కార్యక్రమాల్లో ఎక్కువగా డాక్యుమెంట్ల రూపంలో కాగితంతో కూడిన ‘ఫిజికల్ డాక్యుమెంట్ అథెంటికేషన్’కున్న ప్రాధాన్యత నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ప్రణాళికలో భాగంగా ‘డిజిలాకర్’ ఇప్పుడు ముఖ్య భూమికను పోషిస్తోంది. ఎడ్యుకేషన్, బర్త్ సర్టిఫికెట్లు, ఐటీ చెల్లింపు పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ముఖ్యపత్రాలను డిజిలాకర్లో దాచుకునే సౌలభ్యం ఏర్పడింది. దీనిద్వారా దేశపౌరులు తమ జనన ధ్రువీకరణపత్రాలు మొదలు విద్యార్హతల సర్టిఫికెట్లు, బిజినెస్ డాక్యుమెంట్లు, ఆదాయపు పన్ను చెల్లింపు పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు ఇలా అనేక రకాల డాక్యుమెంట్లను ఆన్లైన్ డిజిటల్ ఫార్మాట్లో జాగ్రత్తగా దాచుకునే వీలు ఏర్పడింది. ఈ ఏడాది చివరకల్లా యూజర్ల సంఖ్య 8 కోట్లకు... 2015–16లోనే ప్రారంభమైన ఈ వినూత్న ఆలోచన ద్వారా అన్నిరకాల డాక్యుమెంట్లను ఓ ‘సెంట్రల్ రిపోసిటరీ’లో పదిలపరుచుకుని అవసరం పడినపుడు రిజిష్టర్డ్ సొంతదారు వాటిని డిజిటల్ రూపంలో చూపించుకునే సౌలభ్యం చిక్కింది. దీనిని ప్రారంభించిన నాటి నుంచి ఉపయోగించుకునే వారి సంఖ్య క్రమంగా పెరిగినా గతేడాది జూన్–ఆగస్టు మధ్యకాలంలో దేశవ్యాప్తంగా యూజర్స్ రిజిస్ట్రేషన్లు 4 కోట్ల లోపు నుంచి నాలుగున్నర కోట్లకు పెరిగాయి. గతేడాది మార్చి–ఏప్రిల్ నెలల్లో రోజుకు 20 వేల మంది కొత్తయూజర్లు వచ్చి చేరుతుండగా ఇప్పుడు వారి సంఖ్య లక్షకు చేరుకున్నట్టుగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ పరిధిలోని నేషనల్ ఈ–గవర్నెన్స్ డివిజన్ తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది చివరకల్లా దీని రిజిష్టర్డ్ యూజర్ల సంఖ్య 8 కోట్లకు చేరచ్చునని అంచనా వేస్తున్నారు. ఏపీఐ కీలకం... అన్ని రకాల డాక్యుమెంట్లను అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ)–లెవల్ ఇంటిగ్రేషన్ ద్వారా డిజిలాకర్ అనుమతిస్తుంది. ఏపీఐ ద్వారా ఒక సాఫ్ట్వేర్ నుంచి మరొక సాఫ్ట్వేర్కు డేటాను బదిలీ చేసే వీలు ఏర్పడుతుంది. ప్రభుత్వపరంగా ఓపెన్ ఏపీఐ పాలసీ అమల్లో ఉండడంతో డేటా సొంతదారుల నుంచి ప్రభుత్వ ఏజెన్సీల (ఇంటర్ అండ్ ఇంట్రా గవర్నమెంటల్ ఏజెన్సీస్) మధ్య సమర్థవంతంగా ‘డేటా షేర్’చేసుకోడానికి దోహదపడుతోంది. తెలంగాణ విషయానికొస్తే... రాష్ట్రంలో డిజిలాకర్ విధానాన్ని వర్తింపజేస్తూ 2020 నవంబర్ 4న ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఉత్తర్వులు జారీచేసింది. పౌరులకు డిజిటల్ సాధికారతను అందించడంలో భాగంగా డిజిటల్ ఫార్మాట్లో సంబంధిత విభాగాల నుంచి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల యాక్సెస్ చేసేందుకు డాక్యుమెంట్ వ్యాలెట్ ఉపయోగపడుతోంది. పేపర్లెస్ గవర్నెన్స్లో భాగంగా ఆయా విభాగాలు, రంగాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. అవి... ► వివిధ ప్రభుత్వశాఖలు, పీఎస్యూలు, స్వయం ప్రతిపత్తిగల సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థల్లో డిజిలాకర్ సిస్టమ్ను అడాప్ట్ చేసుకున్నాయి. ► శాఖలు లేదా ఏజెన్సీలు డిజిలాకర్ ప్లాట్ఫామ్పై రిజిష్టర్ చేసుకోవాలి. వారి సాఫ్ట్వేర్/సిస్టమ్ (వెబ్, మొబైల్ అప్లికేషన్లు) ఈ ప్లాట్ఫామ్లో అనుసంధానించుకోవాలి. ప్రత్యక్షంగా హార్డ్కాపీ సర్టిఫికెట్/డాక్యుమెంట్తో సమానంగా దీనిని పరిగణలోకి తీసుకుంటారు. డిజిలాకర్ ద్వారా ఏయే డాక్యుమెంట్లు పరిగణనలోకి... ప్రత్యక్షంగా పేపర్తో కూడిన ఆధీకృత డాక్యుమెంట్ను చూపడానికి బదులు డిజిలాకర్ ద్వారా దాదాపు 492 ముఖ్యమైన డాక్యుమెంట్లను డిజిటల్ ఫార్మాట్లో పరిగణలోకి తీసుకుంటారు. ఉదా: ఆధార్, పాన్కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఆర్సీలు, క్లాస్ 10,12 సర్టిఫికెట్లు, ఇన్సురెన్స్పాలసీ డాక్యుమెంట్లు, స్కిల్ సర్టిఫికెట్, లీగల్ హేర్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ సర్టిఫికెట్, ప్రాపర్టీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు తదితరాలు... ఏ విధంగా ప్రయోజనం... ►గతేడాది ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల సందర్భంగా కరోనా కారణంగా విద్యార్థులు కాలేజీకి వచ్చి మార్కుషీట్లు సమర్పించే పరిస్థితి లేదు. నేషనల్ ఈ–గవర్నెన్స్ డివిజన్ ఏపీఐ–లెవల్ వెరిఫికేషన్కు అనుమతివ్వడంతో దాదాపు లక్షమంది విద్యార్థులు వ్యక్తిగతంగా వచ్చి సర్టిఫికెట్లను సమర్పించకుండానే అడ్మిషన్లు పొందారు. ► కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కోసం కర్ణాటక పోలీస్ శాఖ అభ్యర్థుల 10,12 తరగతుల సర్టిఫికెట్లను డిజిలాకర్ ద్వారా పరిశీలించింది. లక్షలాది మంది దరఖాస్తు చేసుకోవడంతో వాటిని వ్యక్తిగతంగా పరిశీలనకు ఆరునెలలకు పైగా సమయం పట్టి ఉండేది. దీంతో రిక్రూట్మెంట్ ప్రక్రియ 7,8 నెలలు ఆలస్యం కాకుం డా డిజిటల్ వెరిఫికేషన్ దోహదపడింది. ► డిజిలాకర్ ద్వారా డిజిటల్ ఇన్సూరెన్స్ పాలసీలను జారీచేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్ని బీమా కంపెనీలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. ► నేషనల్ అకడెమిక్ డిపొసిటరీ (ఎన్ఏడీ)డిజిలాకర్ను ఏకైక రిపొసిటరీగా చేసుకుంది. ► నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కూడా డిజిలాకర్ను ఉపయోగిస్తోంది. డిజిలాకర్ నమోదు ఎలా ? డిజిలాకర్ యాప్ను మొబైల్ (యాపిల్, ఆండ్రాయిడ్) ఫోన్లలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://digilocker.gov.in/ లేదా https://accounts.digitallocker.gov.in/వెబ్సైట్ల ద్వారా నమోదు చేసుకోవచ్చు. కావాల్సినవి... ►పేరు, పుట్టినతేదీ, మొబైల్ ఫోన్, ఆధార్ నంబర్ ►మొబైల్ ఫోన్ను ఆధార్ నంబర్ను అథెంటికేట్ చేస్తూ వన్టైమ్పాస్ వర్డ్ వస్తుంది. ►ఆ తర్వాత ఆథెంటికేషన్ కోసం సెక్యూరిటీ పిన్ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 80 లక్షల దాకా డిజి యూజర్స్... ‘ఎక్కువగా మీ–సేవా ద్వారా సర్టిఫికెట్ల జారీ, ఇతర కార్యకలాపాలు సాగుతున్నాయి. వివిధ శాఖలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల దాకా డిజిలాకర్ రిజిష్టర్ యూజర్స్ ఉన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని మరింత ఉపయోగించుకునేందుకు ముందుకు రావాలి. తమ మొబైల్, ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసుకోవాలి. తదనుగుణంగా డిజిలాకర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. విద్యార్థుల సర్టిఫికెట్లకు సంబంధించి యూనివర్సిటీలు, వాహన లైసెన్స్లు, ఆర్సీలు తదితర డాక్యుమెంట్ల కోసం రవాణాశాఖ తదితరాలు మరింతగా భాగస్వామ్యమైతే ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ విషయమై వర్సిటీలకు లెటర్స్ పంపించాం. –శ్రీనివాస్ పెండ్యాల, రాష్ట్ర నోడల్ ఆఫీసర్, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ కోవిడ్తో కొంత మేర అంతరాయం... రాష్ట్రంలో ఇప్పటికే మీ–సేవా కేంద్రాల ద్వారా ఆదాయ ధ్రువీకరణపత్రాలు, ఇతర డాక్యుమెంట్లు అప్లోడ్ అవుతున్నాయి. డిజిలాకర్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. పీడీఎస్, రేషన్కార్డులు కూడా చేయబోతున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం ద్వారా డిజిలాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని యూనివర్సిటీలకు కూడా రాశాం. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా కొంత అంతరాయం ఏర్పడుతోంది. విద్యాశాఖ కూడా ఈ దిశలో చర్యలు చేపడుతోంది. తద్వారా ఎంసెట్, ఇతర కోర్సుల్లో కౌన్సెలింగ్ అపుడు సులభమౌతుంది. రవాణాశాఖకు సంబంధించి ‘ఎం వ్యాలెట్’ను డిజిలాకర్తో అనుసంధానించాల్సి ఉంది. ఇది ప్రభుత్వం వెరిఫై చేయాల్సిన పత్రాలకు సంబంధించినది అయినందున, హార్డ్కాపీలు వెంట తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. వివిధ కార్యకలాపాల నిమిత్తం లబ్ధిదారులు లేదా అభ్యర్థుల నుంచి డాక్యుమెంట్లు కోరుతున్న వివిధ ప్రభుత్వ శాఖలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సి ఉంది. డిజిలాకర్ సౌకర్యాన్ని వినియోగించుకునేలా పౌరుల్లో మరింత అవగాహన, ప్రచారం కల్పించాల్సి ఉంది. ఈ విధానంలో పూర్తి భద్రత ఉంది. – గునవలన్, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఈ–గవర్నెన్స్ ప్రతినిధి -
నాన్న మృతదేహం నాకొద్దు.. వాటిని మాత్రం నాకు పంపండి
మైసూరు: కరోనా రక్కసి అనుబంధాలను తుడిచేస్తోంది. మరణించిన తండ్రి మృతదేహం తనకు వద్దని, మీరే తగులబెట్టుకోండి, అతని వద్ద ఉన్న రూ.6 లక్షల విలువైన డబ్బులు, డాక్యుమెంట్లను తెచ్చి ఇవ్వండంటూ ఒక కుమారుడు చాలా పరుషంగా మాట్లాడాడు. మైసూరు హెబ్బాళలో ఉన్న సూర్య బేకరి వద్ద ఒక ఇంట్లో వృద్ధుడు కరోనాతో మరణించాడు. అతని కొడుకు కువెంపు నగర శాంతి సాగర్ కాంప్లెక్స్ వద్ద నివసిస్తుంటాడు. కుమారుడు స్థానిక కార్పొరేటర్ కేవీ శ్రీధర్కు ఫోన్ చేసి తన తండ్రి అంత్యక్రియలను మీరే పూర్తి చేసి, అతని వద్ద ఉన్న రూ. 6 లక్షల డబ్బులు, ఆస్తి పత్రాలను మాత్రం తనకు తెచ్చి ఇవ్వాలని చెప్పాడు. కొడుకు వైఖరికి విస్తుపోయిన కార్పొరేటర్ పాలికె సిబ్బందితో అంత్యక్రియలు చేయించారు. చదవండి: Lockdown: వందలాది మంది ఒక్కచోట చేరి -
మీ డాక్యుమెంట్లు భద్రమేనా...
ఒకప్పటితో పోలిస్తే నేటి జీవనంలో ఆర్థిక లావాదేవీల పాత్ర మరింత ఎక్కువైందనే చెప్పుకోవాలి. వ్యక్తుల ఆర్జనా శక్తి పెరిగినందున.. అవసరాలు, ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. ప్రాపర్టీలు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు, బీమా పాలసీలు, బ్యాంకు ఖాతాలు.. లిస్ట్ పెద్దగానే ఉంటుంది. కానీ, వీటికి సంబంధించి డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకుంటున్నామా? తప్పకుండా ఉంచుకోవాలి. వీటికి సంబంధించిన డిజిటల్ ఆధారాలను ఎక్కడ నిల్వ చేస్తున్నారు? సాధారణంగా ఈ డిజిటల్ డాక్యుమెంట్లు మెయిల్ బాక్స్లకు వస్తుంటాయి. స్టాక్స్లో లావాదేవీలకు సంబంధించిన కాంట్రాక్టులు కూడా ఏ రోజుకారోజు మెయిల్ బాక్స్కు వస్తుంటాయి. బీమా కంపెనీలు అయితే ప్రస్తుతం ఈ పాలసీ పత్రాలను రిజిస్టర్డ్ ఈ మెయిల్ అడ్రస్లకు పంపిస్తున్నాయి. పాలసీ ప్రీమియం సర్టిఫికెట్లను కూడా మెయిల్కు పంపిస్తున్నాయి. ఇలా భారీగా వచ్చే డిజిటల్ డాక్యుమెంట్లను ‘డిలీట్’ కొట్టేసేవారూ ఉన్నారు. కానీ, వేటి అవసరం ఎంత మేరకు అన్నది తెలుసుకోకుండా డిలీట్ చేయవద్దు. ప్రతీ డాక్యుమెంట్ను ఎంత కాలం పాటు ఉంచుకోవాలన్నది తెలిస్తే.. అప్పుడు వాటి నిర్వహణ సులువవుతుంది. ఐటీ... ఏటా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడంతో పని అయిపోయిందని భావిస్తే అది తప్పే అవుతుంది. ఆదాయపన్ను రిటర్నుల్లో పేర్కొన్న ఆదాయం, పెట్టుబడులు, ఇతరత్రా వనరుల సమాచారానికి సంబంధించిన ఆధారాలు కూడా మీ వద్ద భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ‘‘పన్ను చెల్లింపుదారు తన పన్ను వివరాలను, ఇందుకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్లు, ఆధారాలను కనీసం ఏడేళ్లపాటు ఉంచుకోవాలి. ఏడేళ్ల వరకు ఏదేనీ ఆసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను తిరిగి విచారించే అధికారం ఆదాయపన్ను శాఖా అధికారులకు ఉంటుంది’’అని ఎన్ఏ షా అసోసియేట్స్ పార్ట్నర్ గోపాల్ బోహ్రా తెలిపారు. ఒకవేళ గత కాలానికి సంబంధించి రిటర్నుల విషయమై ఏదైనా వివాదం ఆదాయపన్ను శాఖతో నెలకొని ఉంటే.. అది పరిష్కారం అయ్యే వరకు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను తప్పకుండా ఉంచుకోవాలని సూచించారు. ‘‘పన్ను చెల్లింపుదారుల ప్రాంగణాల్లో ఆదాయపన్ను శాఖా సోదాలు నిర్వహించినట్టయితే.. ఆ సందర్భంగా రూ.50 లక్షలకు మించి ఆస్తి లేదా ఆదాయాన్ని అసెసింగ్ అధికారి గుర్తించితే, అప్పుడు 10 ఏళ్ల నాటి పాత రికార్డులను కూడా తిరిగి విచారించే అధికారం కలిగి ఉంటారు’’ అని బోహ్రా వివరించారు. విదేశీ మార్గంలో ఆదాయాన్ని కలిగి ఉంటే లేదా విదేశీ ఆస్తి కలిగి ఉంటే సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటి నుంచి 17 ఏళ్ల పాటు ఆయా ఆధారాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆదాయాన్ని దాచిపెట్టినట్టు పన్ను అధికారులు భావిస్తే.. సంబంధిత అసెస్మెంట్ను తిరిగి తెరిచేందుకు చట్ట ప్రకారం వారికి 17 ఏళ్ల పాటు అధికారం ఉంటుంది. ► బ్యాంకు పత్రాలు రుణాలు తీసుకుని, చెల్లింపులు పూర్తయిన తర్వాత అందుకు సంబంధించిన ఆధారాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ‘‘రుణాన్ని పూర్తిగా చెల్లించేసినప్పటి నుంచి కనీసం ఎనిమిదేళ్ల పాటు డాక్యుమెంట్లను అలాగే ఉంచుకోవాలి. ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కరించుకునేందుకు ఆధారంగా ఇంతకాలం పాటు వాటిని భద్రపరుచుకుంటే సరిపోతుంది’’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్శెట్టి సూచించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కూడా బ్యాంకులు ఐదు నుంచి ఎనిమిదేళ్ల పాటు పత్రాలను నిల్వ చేయాల్సి ఉంటుంది. కనుక ఇంత కాలం పాటు రుణాన్ని తీర్చివేసిన ఆధారాలను ఉంచుకుంటే సరిపోతుంది. భద్రత ఎక్కడ..? డాక్యుమెంట్లను నిల్వ చేసుకునేందుకు పలు మార్గాలున్నాయి. మీ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లో పదిలపరుచుకోవచ్చు. లేదంటే పెన్డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్లు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో క్లౌడ్ స్టోరేజీ సదుపాయాలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ముఖ్యమైన పత్రాలను తమ ఈ మెయిల్ బాక్స్లోనే ఉంచేస్తుంటారు. ‘‘ఈ మెయిల్లో నిల్వ చేయడం అన్నది భద్రతా పరంగా సురక్షితమైనది కాదు. ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవడంతోపాటు పాస్వర్డ్తో వాటికి రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. బిట్లాకర్ను ఇందుకు వినియోగించుకోవచ్చు’’ అని ఇన్ఫ్రాసాఫ్ట్ టెక్ ప్రొడక్ట్, ఇన్నోవేషన్ హెడ్ మనోజ్ చోప్రా తెలిపారు. బిట్లాకర్లో ఎన్క్రిప్షన్ సదుపాయం ఉంటుంది. దీంతో ఇందులో నిల్వ చేసుకునే డాక్యుమెంట్లకు రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా క్లౌడ్ రూపంలోనూ డాక్యుమెంట్లను భద్రపరచుకునే అవకాశం ఉంది. గూగుల్ డాక్యుమెంట్స్, ఐక్లౌడ్, డ్రాప్బాక్స్ ఇటువంటివే. స్కాన్ చేసిన డాక్యుమెంట్లను వీటిల్లో స్టోర్ చేసుకుని ఎక్కడి నుంచి అయినా తిరిగి పొందొచ్చు. ముఖ్యమైన, అవసరమైన డాక్యుమెంట్లను లోకల్గా (కంప్యూటర్లు, డిస్క్లు) స్టోర్ చేసుకోవడంతోపాటు.. వాటి బ్యాకప్ తీసుకుని కనీసం రెండు క్లౌడ్ వేదికల్లో అయినా పదిలం చేసుకోవాలని చోప్రా సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజీ లాకర్ కూడా ఇందుకు చక్కని వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ బీమా పాలసీ డాక్యుమెంట్తోపాటు, కట్టిన ప్రీమియం రసీదులను కూడా భద్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. దీనివల్ల భవిష్యత్తులో క్లెయిమ్ పరంగా ఎటువంటి సమస్యలు ఎదురైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ‘‘పన్ను మినహాయింపులు పొందాలని భావిస్తే అందుకు ప్రీమియం చెల్లింపుల రసీదులను సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో అవసరమైతే రిటర్నులతోపాటు జత చేయడానికి వీలుంటుంది’’ అని పాలసీఎక్స్ డాట్ కామ్ సీఈవో నావల్ గోయల్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరి, అందుకు అయ్యే చికిత్సా ఖర్చులను తిరిగి పొందినట్టయితే అందుకు సంబంధించిన పత్రాలను, కారు మరమ్మతులకు చేసుకునే బీమా క్లెయిమ్ ఆధారాలను కూడా దీర్ఘకాలం పాటు భద్రంగా ఉంచుకోవడం అవసరమని గోయల్ సూచించారు. పోర్టబిలిటీ సమయంలో ఇవి ఉపయోగపడతాయన్నారు. బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్న ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ‘‘మీ కుటుంబం, మీకు సంబంధించిన బీమా పత్రాలను ఇందులో భద్రంగా నిల్వ చేసుకోవచ్చు’’ అని చెప్పారు. ► మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీస్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్లలో మీకున్న పెట్టుబడుల వివరాలన్నింటినీ ఒకే నివేదిక రూపంలో క్రోడీకరించి ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ సంస్థలు కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ (సీఏఎస్) పేరుతో ప్రతీ త్రైమాసికానికి ఇస్తుంటాయి. వీటిని కుటుంబ సభ్యుల్లో ఒకరితో పంచుకునేందుకు గాను ఆటో ఫార్వార్డ్ను ఎంచుకోవాలి. ఒక్క మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి అయితే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (క్యామ్స్) నుంచి ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ను తీసుకుంటే చాలు. వేతన జీవులు అయితే తమ స్టాక్, మ్యూచువల్ ఫండ్ ఖాతాల స్టేట్మెంట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్వయం ఉపాధిలో ఉన్న వారు అయితే వీటిని కనీసం ఆరేళ్ల వరకు పదిలంగా ఉంచుకోవడం అవసరం. ► ఇవి చాలా కీలకం ఆస్తుల కొనుగోలు, అమ్మకాల పత్రాలను లావాదేవీ జరిగిన నాటి నుంచి కనీసం ఏడేళ్ల వరకు అయినా ఉంచుకోవడమే మంచిది. ఎందుకంటే ఆదాయపన్ను శాఖ ఏడేళ్లలోపు ఎప్పుడైనా తిరిగి పరిశీలించే చర్య తీసుకోవచ్చు. ‘‘పన్ను చెల్లింపుదారులు తప్పకుండా డాక్యుమెంట్లను అట్టిపెట్టుకోవాల్సిందే. ఆభరణాల కొనుగోళ్ల రసీదులు, అలాగే పెయింటింగ్, ఇళ్ల మరమ్మతులు, నవీకరణకు చేసే ఖర్చులకు సంబంధించిన ఆధారాలను కూడా ఉంచుకోవాలి. దీంతో ఆయా ఆస్తుల విక్రయం తర్వాత పన్ను తగ్గింపులను ఆదాయపన్ను శాఖ తిరస్కరించదు’’ అని బోహ్రా తెలియజేశారు. ► డిజీలాకర్ ఉచితంగా మీ డాక్యుమెంట్లను స్టోర్ చేసుకునే వేదిక ఇది. దీంతో భౌతికంగా పత్రాలను ఉంచుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఇందులో స్టోర్ చేసే డేటా, డాక్యుమెంట్లు అంతా క్లౌడ్ రూపంలోనే ఉంటాయి కనుక ఎక్కుడి నుంచి అయిన వాటిని పొందే వెసులుబాటు ఉంటుంది. పీడీఎఫ్, జేపీఈజీ, పీఎన్జీ రూపాల్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లపై ఈసైన్(ఎలక్ట్రానిక్ రూపంలో సంతకం) చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఇవి సెల్ఫ్ అటెస్టేషన్ కాపీలుగా పనికి వస్తాయి. డిజిలాకర్లో అకౌంట్ కోసం మొబైల్ నంబర్ అవసరం ఉంటుంది. ఆధార్ డేటా బేస్లో నమోదైన మొబైల్ నంబర్ను కూడా వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలను జ్టి్టpట://ఛీజీజజీ ౌఛిజ్ఛుట.జౌఠి.జీn/ వెబ్ సైట్ను సందర్శించి తెలుసుకోవచ్చు. -
మాల్యా కేసు : సంచలన ట్విస్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు, వ్యాపారవేత్త విజయ్ మాల్యా కేసులో కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాను, తిరిగి స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ముమ్మరంగా ప్రయత్నిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టులో కొన్ని ముఖ్యమైన పత్రాలు మాయం కావడం సంచలనంగా మారింది. జూలై 14, 2017 నాటి తీర్పుకు వ్యతిరేకంగా మాల్యా దాఖలు చేసిన సమీక్ష పిటిషన్ పై సుప్రీంలో విచారణ సందర్భంగా ఈ ఉదంతం వెలుగు చూసింది. దీంతో ఈ కేసు విచారణను న్యాయమూర్తులు లలిత్, అశోక్ భూషణ్ ఆగస్టు 20 కి వాయిదా వేశారు. (ఆఖరి అస్త్రం : మాల్యా బంపర్ ఆఫర్ ) తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయింపులో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఆయనపై లోగడ కోర్టు ధిక్కార కేసు నమోదైంది. తనను దోషిగా పేర్కొంటూ.. 2017 లో కోర్టు తీర్పును రివ్యూ చేయవలసిందిగా మాల్యా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు లలిత్, అశోక్ భూషణ్ లతో కూడిన బెంచ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ఈ విచారణ సందర్భంగా కీలక పత్రాలు మాయం కావడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత మూడేళ్లుగా మాల్యా రివ్యూ పిటిషన్ని సంబంధిత కోర్టులో ఎందుకు లిస్ట్ చేయలేదో వివరించాల్సిందిగా రిజిస్ట్రీని జస్టిస్ లలిత్, భూషణ్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ మూడు సంవత్సరాల్లో ఈ రివ్యూ పిటిషన్ కి సంబంధించిన ఫైల్ను ఏయే అధికారులు డీల్ చేశారో వారి పేర్లతో సహా అన్ని వివరాలను సమర్పించాలని వారు సూచించారు. కాగా ప్రభుత్వ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఎగవేసి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా.. తన పిల్లల పేరిట 40 మిలియన్ డాలర్లను బదలాయించారని, ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అని ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఆపద్బాంధవుడు కానిస్టేబుల్ సదాశివ
కర్ణాటక, బొమ్మనహళ్లి : ఉద్యోగం కోసం కశ్మీర్ నుంచి బెంగళూరు వచ్చిన ఓ యువతి నగరంలో తన విద్యకు సంబంధించిన డాక్యుమెంట్లు పోగొట్టుకున్న సమయంలో వాటిని తిరిగి అందజేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. కశ్మీర్కు చెందిన మరియా అనే యువతి నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చింది. వారం రోజుల క్రితం మాన్యత టెక్పార్కులో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లే క్రమంలో తన విద్యకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు పోగొట్టుకుంది. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సదాశివకు అక్కడ ఒక బ్యాగ్ కనిపించడంతో స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. యువతికి సంబంధించిన ఫోన్నెంబర్లు లేకపోవడంతో అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఇదే క్రమంలో బాధిత యువతి మరియా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యువతి ఫోన్ నెంబర్ ద్వారా పోలీస్ స్టేషన్కు పిలిపించి వాటిని కానిస్టేబుల్ సదాశివ ద్వారా ఇప్పించారు. దీంతో మరియా సంగిగెహళ్లి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. వారి వల్లనే తనకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. -
గొగోయ్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
గువాహటి: సమాచార హక్కు కార్యకర్త అఖిల్ గొగోయ్ ఇంట్లో గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. తనిఖీల సందర్భంగా ల్యాప్టాప్తో పాటు వివిధ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. డిసెంబర్ 12న ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో నిరసనల నేపథ్యంలో అనేక రైతు సంఘాలకు సలహాదారుగా ఉన్న గొగోయ్ను ప్రభుత్వం అరెస్టు చేసింది. గువాహటిలోని నిజరపరా ప్రాంతంలోని గొగోయ్ నివాసంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. అతని పాన్ కార్డు, ఎస్బీఐ డెబిట్ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్బుక్ కాపీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన తనిఖీలు మూడు గంటలపాటు జరిగాయి. తనిఖీలు ముగిసిన అనంతరం గొగోయ్ భార్య గీతాశ్రీ తములీ స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాను విలేకరులకు చూపించారు. కజిరంగలోని కేఎంఎస్ఎస్ ఆర్చిడ్ ఎన్విరాన్మెంట్ పార్కుకు సంబంధించిన పత్రాలను కూడా ఎన్ఐఏ బృందం కోరిందనీ, అయితే దానికి సంబంధించిన సమాచారం ఏమీ తన దగ్గర లేదని ఆమె వారికి చెప్పింది. కాగా, గొగోయ్ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం ఆదేశించింది. -
ఆలో‘చించే’ పడేశారా?
సాక్షి, హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకు విలువైన కాగితాలేనని భద్రంగా దాచిపెట్టుకున్న కాగితాలను ఇప్పుడు ముక్కలుముక్కలుగా చించేసి పడేశారు. ఇది కూల్చివేతకు సిద్ధ మవుతున్న రాష్ట్ర సచివాలయ భవనాల్లోని దృశ్యం. సామాన్య ప్రజలతో పాటు వివిధ వర్గాల నుంచి వందలు, వేల సంఖ్యలో వచ్చిన అర్జీలను ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టిన సచివాలయ అధికారులు.. చివరకు సచివాలయ కార్యాలయాల తరలింపును సాకుగా చూపుతూ ఇలా వదిలించుకుని చేతులు దులుపుకుంటున్నారనే అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలతో పాటు పాత జీవోల కాపీలు, సర్క్యులర్లు, ప్రభుత్వ శాఖల మధ్య అంతర్గత వ్యవహారాలకు సంబంధిం చిన పాత లేఖలు, ప్రభుత్వ సమావేశాలకు సంబంధించిన కాగితాలను ముక్కలు ముక్కలుగా చించి చిందరవందరగా పడేస్తు న్నారు. పాత సచివాలయ భవనమంతా కుప్పలుతెప్పలుగా పడేసిన కాగితాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఏ రోజైనా తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అర్జీలు పెట్టుకున్న వ్యక్తులు ఓ వైపు నిరీక్షిస్తుంటే.. వారికి తెలియకుండానే వీటన్నింటినీ బుట్టదాఖలు చేసేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చించిపడేసిన కాగితాల్లో వివిధ సమస్యలపై సామాన్య ప్రజల నుంచి వచ్చిన అర్జీలే ఎక్కువగా ఉండడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. రోజూ సచివాలయానికి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని అర్జీలు పెట్టుకుంటూ ఉంటారని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతస్థాయి వ్యక్తుల సిఫారసులు ఉన్న కొన్నింటికి మాత్రమే పరిష్కార యోగం లభిస్తుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాదాసీదా వ్యక్తుల అర్జీలు ఏళ్ల తరబడి సంబంధిత సెక్షన్ల అధికారుల వద్దే పెండింగ్లో ఉంటాయని, ఇలా నిర్లక్ష్యానికి గురైన ఫైళ్లను అవసరమైనప్పుడు వెతికినా దొరకని విధంగా వాటిని ఎక్కడో పడేస్తారని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇలా అదృశ్యమైన తమ ఫైళ్లను వెతుక్కుంటూ వచ్చే వారు ఎందరో ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం సచివాలయం ఖాళీ చేస్తున్న తరుణంలో ఇలాంటి ఫైళ్లు, అర్జీలు బయటపడితే వాటిని అక్కడికక్కడే చించిపారేస్తున్నారన్నారు. ఇలా మొత్తం సచివాలయం ఖాళీ చేసేసరికి టన్నుల కొద్దీ కాగితాలు, పాత ఫైళ్లు బుట్టదాఖలు కావడం ఖాయమని సచివాలయ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్కే భవన్కు ఫైళ్లు ప్రస్తుత సచివాలయంలోని భవనాలన్నింటినీ కూల్చివేసి అక్కడే ఆధునిక సదుపాయాలతో కొత్త సచివాలయ భవన సముదాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత సచివాలయ భవనాలను ఖాళీ చేసే క్రమంలో.. ఇక్కడి కార్యాలయాలను తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్కు తరలిస్తోంది. గత సోమవారం ప్రారంభమైన సచివాలయం శాఖల కార్యాలయాల తరలింపు వేగవంతమైంది. సాధారణ పరిపాలన శాఖ సూచనల మేరకు ఫైళ్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రికి సంబంధించిన జాబితాలను అన్ని శాఖలు తయారు చేసుకున్నారు. తరలింపు సమయంలో ఫైళ్లు, ఇతర సామగ్రి గల్లంతు కాకుండా ఈ జాబితాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రజల నుంచి వచ్చిన అర్జీల ఫైళ్లను ‘ప్రాధాన్యత లేనివి’గా పరిగణించి వాటిని తాత్కాలిక సచివాలయానికి తరలించకుండా ఇక్కడే వదిలించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సచివాలయం డీ–బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లోని సంక్షేమ శాఖలు, కమర్షియల్ ట్యాక్సుల శాఖలు, పై అంతస్తుల్లోని రెవెన్యూ, సీ–బ్లాక్ తొలి అంతస్తులో జీఏడీ కార్యాలయాల వద్ద ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా చించిపడేసిన కాగితాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా సంక్షేమ శాఖలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల లబ్ధిదారుల నుంచి వచ్చిన అర్జీలను ఏళ్ల తరబడి అపరిష్కృతంగా పెట్టి ఇప్పుడు బుట్టదాఖలు చేశారనే విమర్శలొస్తున్నాయి. తక్షణమే సచివాలయ తరలింపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించడం కూడా ప్రాధాన్యత లేని ఫైళ్లు, కాగితాలపై ఆలోచించకుండానే పడేస్తున్నారన్న చర్చమొదలైంది. -
రైతుబీమాతో కుటుంబాలకు ధీమా
సాక్షి, మెదక్: రైతుబీమా పథకం అన్నదాత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. జిల్లాలోని వేలాది మంది రైతులకు మేలు జరుగనుంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఏడాది మరికొందరు కొత్తగా ఈ బీమాపథకంలో చేరే అవకాశం ఉంది. ఆ దిశగా వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులు ప్రమాదవశాత్తు లేక ఏదైనా కారణంతో చనిపోతే వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల తరఫున ఎల్ఐసీకీ బీమా ప్రీమియం చెల్లించి రూ. 5 లక్షల బీమా మొత్తాన్ని తక్షణం అందించేలా ఈ పథకాన్ని గత ఏడాది ప్రవేశపెట్టింది. రైతు కుటుంబంలో భరోసా పెంచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని మరో ఏడాదిపాటు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీమియం పెరిగిన ప్రభుత్వం పథకం అమలును కొనసాగిస్తుంది. గతేడాదికి సంబంధించి బీమా గడువు ఈనెల 14తో ముగిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2019 ఆగస్టు 14 నుంచి 2020 ఆగస్టు 14వ తేదీ కాలపరిమితికి ప్రీమియం రూపంలో ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.3457 చొప్పున ప్రీమియం చెల్లిస్తోంది. భూములు కలిగిన వారికి ఈ నెల 14 నుంచి 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు రైతుల పేర్లను నమోదు చేస్తున్నారు. ఇది నిరంతర పక్రియగా కొనసాగనుంది. 615 మంది రైతు కుటుంబాలకు పరిహారం జిల్లాలో మొత్తం 2.20 లక్షల మంది రైతులు ఉండగా వారిలో బీమా పథకానికి అర్హులైన వారు 1.8 లక్షల మందిరైతులు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో 675 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా వారిలో 615 మంది రైతులకు రూ.30.7 కోట్లు పరిహారం చెల్లించారు. ఇంకా 60 మంది రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. యువరైతుల నమోదు ఇలా... రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకునే వారు 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల లోపు ఉండాలి. 18 ఏళ్లు నిండిన యువరైతుల పేర్లు నమోదు చేస్తారు. వీరు స్థానిక వ్యవసాయ అధికారులను కలిసి రైతుపట్టాపాస్బుక్ జిరాక్స్తో పాటు ఆధార్ కార్డు ఇస్తే సంబంధిత అధికారులు రైతుబీమాలో నమోదు చేసుకోవాలి.ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ పథకం ఒక్క ఏడాదితో ఆగేదికాదు గతేడాది ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ఏడు సైతం దాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఇది నిరంతర పక్రియగా కొనసాగుతోంది. 18 ఏళ్లు నిండిన రైతులు వారి పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం నాయక్ -
ఎవరు.. ఏ ఫారం దాఖలు చేయాలి..
ఒక వ్యక్తి ఏయే ఫారంల ద్వారా రిటర్నులు దాఖలు చెయ్యాలో ఈ వారం తెలుసుకుందాం. గతంలో వేతన జీవులకొక ఫారం, ఇతరులకొక ఫారం అంటూ రెండే ఉండేవి. కాలక్రమంలో ఎన్నో మార్పు.. ఎన్నో ఫారాలు.. మొత్తం వాడుకలో ఉన్న ఏడు ఫారాలలో నాలుగు ఫారాలు వ్యక్తులకు వర్తిస్తాయి. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ప్రీఫిల్డ్ ఫారాలు అమల్లో ఉన్నాయి. ఐటీ సైట్లోకి వెళ్లి my account ఆప్షన్లోకి వెడితే.. Prefilled XML ఉంటుంది. ఫారం 26 అలోని వివరాలు కనిపిస్తాయి. జీతం, పెన్షన్, వడ్డీ.. తదితరసమాచారం ఇందులో ఉంటుంది. ఐటీ ట్యాక్స్ వివరాలు ఉంటాయి. ఐటీఆర్1 వ్యక్తులు.. రెసిడెంట్ అయి ఉండి, నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటని వారు ఈ ఫారం వేయాల్సి ఉంటుంది. విదేశీ ఆదాయం ఉండకూడదు. ఏదేని సంస్థలో డైరెక్టర్ అయి ఉండకూడదు. వ్యాపారం, క్యాపిటల్ గెయిన్స్ ఉండకూడదు. ఏ వనరు ద్వారా కూడా నష్టం ఉండకూడదు. ఒక ఇంటి నుంచే ఆదాయం ఉండాలి. మరో విధంగా చెప్పాలంటే.. కేవలం జీతం, వడ్డీ, ఒక ఇంటి మీద ఆదాయం (నష్టం కాదు) ఉన్న వారు ఈ ఫారం దాఖలు చేయాలి. వ్యవసాయం మీద ఆదాయం, డివిడెండ్లు రూ. 5,000 దాటకపోతే కూడా వేయొచ్చు. ఐటీఆర్ 2 వ్యక్తులు మరియు ఉమ్మడి కుటుంబాలు ఈ ఫారం దాఖలు చేయొచ్చు. జీతం, ఇంటి మీద ఆదాయం (నష్టం ఉన్నా ఫర్వాలేదు), ఇతర ఆదాయాలు, క్యాపిటల్ గెయిన్స్ ఉన్న వారు మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చు. నాన్ రెసిడెంట్లు కూడా ఈ ఫారం వేయొచ్చు. అయితే, వారు తమ ట్యాక్స్ ఐడెంటిటీ నంబరు ఇవ్వాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటిన వారు దీన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తుల వివరాలు, షేర్లు, బంగారం, ఆభరణాలు, వాహనాలు, పెయింటింగ్, కళాత్మక వస్తువులు, బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, రావల్సిన అప్పులు, నగదు మొదలైన వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఆస్తులను కొన్న ధర చూపాలే తప్ప ప్రస్తుత మార్కెట్ విలువ కాదు. నష్టం, సర్దుబాటు చూపొచ్చు. ఐటీఆర్ 3 ట్యాక్స్ క్రెడిట్ పరిధిలోకి రానివారు, పలు వనరుల నుంచి ఆదాయం ఉన్నవారు.. అంటే జీతం, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్, ఇతరత్రా వ్యాపారం.. వృత్తిగత ఆదాయాలు ఉన్నవారు దీన్ని దాఖలు చేయొచ్చు. ఇది పెద్ద ఫారం. చాలా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నాన్ రెసిడెంట్లు, వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు దీన్ని వేయొచ్చు. ఆస్తులు.. అప్పుల పట్టీ, స్థూల ఆదాయం, ఖర్చుల వివరాలు, నగదు, బ్యాంకు నిల్వల వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఐటీఆర్ 4 ఇది రెసిడెంట్లు మాత్రమే ఉపయోగించగలిగే ఫారం. వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు దీన్ని దాఖలు చేయొచ్చు. వ్యాపారం మీద స్థూల ఆదాయం/టర్నోవరు రూ. 2 కోట్లు దాటకూడదు. వృత్తి నిపుణుల స్థూల ఆదాయం రూ. 50,00,000 దాటకూడదు. ఒక ఇంటి మీద మాత్రమే ఆదాయం ఉండాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటకూడదు. ఊహాజనిత ఆదాయాలున్న వారు దీన్ని వేయొచ్చు. ఈ ఫారాన్ని ఒకసారి వేస్తే.. వరుసగా అయిదేళ్ల పాటు ఇదే ఫారం దాఖలు చేయడం కొనసాగించాల్సి ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఫారం 3 వేస్తే రాబోయే అయిదు సంవత్సరాలు కూడా ఫారం 3 మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఇంకా సందేహాలు ఉంటే వృత్తి నిపుణులను సంప్రతించండి. ఐటీ రిటర్నులను మీరే స్వయంగా దాఖలు చేసుకోవచ్చు. అయితే, ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తప్పులు చేయొద్దు. ఆదాయాన్ని చూపించడం మానొద్దు. లేకపోతే 50–200% దాకా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. -
కాంట్రాక్టుల పేరుతో ఘరానా మోసం
భవానీపురం(విజయవాడ పశ్చిమ): తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఉద్యోగాలు, కాంట్రాక్ట్లు ఇప్పిసానంటూ పెద్ద మొత్తంలో నగదు వసూలుచేసిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్ డీసీపీ–2 అప్పలనాయుడు సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. భవానీపురం నూరి మసీదు వీధికి చెందిన సలాది రామ్గోపాల్ కొంతకాలంగా నెట్ సెంటర్ నడుపుతున్నాడు. తరచూ అక్కడికి వెళ్లే భవానీపురం హెచ్బీ కాలనీవాసి బూసా సత్యసూర్యకిరణ్తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తాను గవర్న్Ðమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (న్యూఢిల్లీ) విభాగంలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నట్లు చెప్పుకొన్నాడు. తాను పనిచేస్తున్న ఆఫీస్లో స్వచ్ఛ భారత్ కింద జిల్లాలవారీగా మ్యాన్పవర్ సప్లై కాంట్రాక్ట్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగావకాశాలు ఉన్నట్లు చెప్పి సత్యసూర్యకిరణ్ని కాంట్రాక్ట్ కోసం టెండర్ వేయాలని సూచించాడు. లక్షల్లో వసూలు అతని మాయమాటలు నమ్మిన సత్యసూర్యకిరణ్ తన స్నేహితులు 15 మందితో కలిసి మొత్తం రూ.52,50,000ను, అతనికి తెలిసిన చిన్న వెంకటేశ్వరరావు వద్ద రూ.29 లక్షలు (స్టేట్ వైడ్ మెడికల్ సప్లై కాంట్రాక్ట్ కోసం), చిన వెంకటేశ్వరరావుకు తెలిసిన కండెపు లక్ష్మీపెరుమాళ్లు వద్ద నుంచి రూ.17లక్షలు (జిల్లావారీగా మ్యాన్పవర్ సప్లై కాంట్రాక్ట్ కోసం), సంపతి రాజగోపాల్ వద్ద రూ.28 లక్షలు (స్టేట్ వైడ్ మ్యాన్పవర్ సప్లై కాంటాక్ట్ కోసం), శ్రీకాంత్ దగ్గర రూ.2.50 లక్షలు (అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం కోసం) మొత్తం సుమారు కోటి రూపాయల వరకు వసూలు చేశాడు. తప్పుడు ధ్రువపత్రాలు, నకిలీ స్టాంప్లు చూపించడంతో వారందరూ నమ్మి మోసపోయారు. ఈ నగదు వసూళ్లలో నిందితుడి భార్య సలాది రేవతి, బావమరిది దొడ్డి కిరణ్, డ్రైవర్ యాళ్ల రాము సహకరించారు. బాధితులందరూ కలిసి నిందితుడ్ని నిలదీయడంతో న్యూ ఢిల్లీలోని నిర్మల్ భవన్లో ఇంటర్వ్యూలు ఉన్నాయని చెప్పి గతేడాది అక్టోబర్ 24వ తేదీన తీసుకెళ్లాడు. తర్వాత ఇంటర్వ్యూలు రద్దయ్యాయని, ఆర్డర్స్ మీ వద్దకే వస్తాయని నమ్మబలికాడు. ఈ క్రమంలో నవంబర్ 29వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో నిందితుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన బాధితులను చూసి రామ్గోపాల్ పరారయ్యాడు. ఈ మేరకు బాధితులు భవానీపురం పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేసి నిందితుడికి సహకరించిన సలాది రేవతి, దొడ్డి కిరణ్, యాళ్ల రాములను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కొంత బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రధాన నిందితుడు రామ్గోపాల్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న నేపథ్యంలో సోమవారం వన్టౌన్ శివాలయం వీధిలో తిరుగుతుండగా అరెస్ట్చేశారు. విచారణలో తేలిందేంటంటే.. 2006లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వెంకటనారాయణ అనే వ్యక్తిని నమ్మి మోసపోయిన రామ్గోపాల్.. తాను కూడా అలాగే ప్రజలను మోసం చేశాడు. విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, విజయనగరం జిల్లాల్లో మకాంలు మారుస్తూ కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. అతనిపై ఆయా ప్రాంతాల్లో 22 కేసులు నమోదయ్యాయి. విజయవాడ భవానీపురం, సత్యనారాయణపురం, పెనమలూరు, పటమట, కృష్ణలంక, తదితర పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితుని వద్ద నుంచి 272 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు, కారు, బైక్, ల్యాప్టాప్, నాలుగు సెల్ఫోన్లు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, నకిలీ స్టాంపులు, ధ్రువపత్రాలు, అగ్రిమెంట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో వెస్ట్ ఏసీపీ సుధాకర్, భవానీపురం సీఐ డీకెఎన్ మోహన్రెడ్డి, ఎస్ఐ చినస్వామి పాల్గొన్నారు. -
‘రఫేల్ ఒప్పంద పత్రాలు భద్రం’
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పంద పత్రాలు గల్లంతు వ్యవహారం కలకలం రేపడంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. రఫేల్ ఒప్పంద పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురికాలేదని, వాటి నకళ్లను మాత్రమే పిటిషనర్లు తమ దరఖాస్తుల్లో వాడారని మాత్రమే తాను సుప్రీం కోర్టు ఎదుట పేర్కొన్నానని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వివరణ ఇచ్చారు. రఫేల్ యుద్ధ విమాన ఒప్పంద పత్రాలు చోరీ అయ్యాయని బుధవారం సర్వోన్నత న్యాయస్ధానంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సున్నితమైన సమాచారం కలిగిన ఈ పత్రాలు మాయం కావడంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రఫేల్ పత్రాలు చోరీకి గురయ్యాయని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని కేకే వేణుగోపాల్ పేర్కొన్నారు. రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్లు తమ దరఖాస్తులో అనుబంధంగా ఒరిజినల్ పత్రాల ఫోటోకాపీలను వాడారని వేణుగోపాల్ పేర్కొన్నారు. కాగా అటార్నీ జనరల్ చోరీ అనే పదాన్ని వాడకుండా ఉండాల్సిందని అధికార వర్గాలు సైతం వ్యాఖ్యానించాయి. మరోవైపు ఈ పత్రాల ఆధారంగా కథనాలను ప్రచురించినందుకు అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేస్తామని ప్రభుత్వం ది హిందూ వార్తాపత్రికను హెచ్చరించింది. -
జిల్లాల్లోనూ జోరు
29.03% పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం.. గతేడాదితో పోలిస్తే పెరిగిన డాక్యుమెంట్లు 2.7 లక్షల పైమాటే.. ఎన్నికల ఏడాదిలోనూ ఏమాత్రం తగ్గని రాబడి.. రిజిస్ట్రేషన్ల విభాగానికి 955 కోట్ల అధిక ఆదాయం గతేడాదితో పోలిస్తే 62 శాతం ఆదాయ వృద్ధితో టాప్లో మెదక్ (సాక్షి, నెట్వర్క్) : రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణ జిల్లాల్లో జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. ఎన్నికల ఏడాదిలోనూ ఏమాత్రం మందగమనం లేకుండా ఆదాయం పెరిగింది. గడిచిన ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రిజిస్ట్రేషన్ల విభాగం ఆదాయం ఏకంగా 29.03 శాతం ఎగబాకింది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెరుగుదలే దీనికి కారణం. కరువు జిల్లాగా పేరొందిన మెదక్ జిల్లాలో ఆదాయం 62 శాతం పెరుగుదల నమోదు కాగా, 49.78 శాతంతో మహబూబ్నగర్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కాగా అతితక్కువ పెరుగుదల హైదరాబాద్ జిల్లాలో నమోదైంది. 2017 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్లో ఆదాయం 3,292 కోట్లు రాగా.. 2018, ఏప్రిల్–డిసెంబర్లో ఆదాయం 4,247 కోట్లకు ఎగబాకింది. అంటే దాదాపు రూ.955 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. నోట్ల రద్దు తరువాత రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని భావించినా, ప్రజలు తమ నగదును బ్యాంకులో డిపాజిట్ చేయకుండా భూములు, ప్లాట్లు, ఫ్లాట్లపైనే పెట్టుబడి పెడుతున్నారు. అలాగే ఎన్ఆర్ఐలు సైతం స్థిరాస్తి కొనుగోళ్లపై ఆసక్తి కనపరుస్తుండటంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వం భూమి ధరలను పెంచకపోయినా.. ప్రజలు స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడమే ఆదాయం పెంపునకు కారణమని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేస్తుండటంతో.. ఆయా ప్రాంతాల్లో భూముల రేట్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అనుమతి లేని వెంచర్లలోనూ ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. పట్టణాభివృద్ధి సంస్థలు లేదా డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) అనుమతించిన లే–అవుట్లలోనే ప్లాట్లు కొనుగోలు చేయడం మంచిదని ప్రచారం చేసినా.. అక్రమ వెంచర్లలోనూ ప్లాట్ల విక్రయాలు సాగుతున్నాయి. ప్రధానంగా ఇలాంటి వెంచర్లు గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కువగా ఉన్నాయి. కాగా గత సంవత్సరం కంటే ఈ ఏడాది 2.72 లక్షల మేర అదనపు రిజిస్ట్రేషన్లు జరిగాయి. -
‘కొడనాడు’ దోపిడీ వెనుక పళనిస్వామి!
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ దోపిడీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎస్టేట్లోని కీలక పత్రాలు, వీడియోల కోసమే ఈ దోపిడీ, హత్యలు జరిగాయని తెహల్కా పత్రిక మాజీ సంపాదకుడు మాథ్యూస్ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక తమిళనాడు సీఎం పళనిస్వామి ఉన్నారని బాంబు పేల్చారు. జయలలిత విశ్రాంతి కోసం తరచూ ఈ ఎస్టేట్కు వచ్చేవారు. అలాంటి సందర్భాల్లో కొడనాడు ఎస్టేట్ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేవారు. అయితే జయలలిత చనిపోయాక 2017 ఏప్రిల్ 24న ఇక్కడ దోపిడీ జరిగింది. ఈ ఘటనలో వాచ్మెన్ ఓం బహదూర్ దారుణ హత్యకు గురికాగా, కృష్ణబహదూర్ అనే మరో వాచ్మెన్ గాయాలతో బయటపడ్డాడు. అప్పట్లో నగల కోసమే దొంగతనం జరిగిందని వార్తలొచ్చాయి. క్షమాపణ చెప్పే వీడియోలు.. అన్నాడీఎంకే వర్గాలను తన గుప్పెట్లో ఉంచుకునే రీతిలో జయలలిత కొన్ని కీలక రికార్డులను ఆ ఎస్టేట్లో దాచి ఉంచారని, తప్పు చేసిన పార్టీ నేతలు జయలలిత కాళ్లపై పడి క్షమించమని వేడుకునే వీడియోలు ఎస్టేట్లో ఉండేవని మాథ్యూస్ తెలిపారు. ఈ వీడియోలతో పాటు మరికొన్ని రికార్డుల కోసమే దోపిడీ జరిగిందని ఈ కేసులో నిందితుడు షయాన్ చెప్పాడు. జయలలిత ఆసుపత్రిలో ఉండగానే దోపిడీకి ప్రణాళిక రచించామనీ, పళనిస్వామి సీఎం అయ్యాక అది వీలైందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే నాటకం: సీఎం జయ పేరుకు కళంకం తీసుకురావడమే కాకుండా తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొత్త నాటకం మొదలైందని సీఎం ఆరోపించారు. ఈ విషయాన్ని ఇన్నిరోజులు నిందితులు కోర్టుకు ఎందుకు చెప్పలేదని పళనిస్వామి ప్రశ్నించారు. -
నామినేషన్ వేయాలంటే..
క్రిమినల్ కేసులుంటే.. అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉంటే వివరాలను అఫిడవిట్లో పొందు పర్చాలి. వాటి వివరాలను అభ్యర్థులు డిసెంబర్ 5వ తేదీలోగా స్థానిక దినపత్రికల్లో మూడు మార్లు ప్రచురితం చేయాలి. చానళ్లలోనూ మూడుమార్లు ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. దినపత్రికలు, చానళ్లలో ఇచ్చిన ప్రకటనల ఖర్చుల రశీదులను జిల్లా ఎన్నికల సంఘానికి సమర్పించాలి. ఫారం–ఏ.. ఫారం– బీ సమర్పించాలి రాజకీయ పార్టీల తరపున పోటీచేసే ఫారం–ఏ, ఫారం–బీను నవంబర్ 19వ తేదీ 3గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అతడిని∙స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు బ్యాలెట్ పేపరుపై పేరు ఎలా ఉండాఅభ్యర్థులు లనేది ముందుగానే రాసి ఇవ్వాలి. దానికి అనుసరించే బ్యాలెట్లో పేర్లు చేరుస్తారు. ముందుగా జాతీయ గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన అభ్యర్థులు, ఆ తర్వాత రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల పేర్లను, ఆ తర్వాత గుర్తింపులేని, స్వతంత్రంగా పోటీచేసే అభ్యర్థుల పేర్లను చేరుస్తారు. గడువు వరకు దాఖలైన నామినేషన్లను నవంబర్ 20 రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పరిశీలిస్తారు. 22న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. డిసెంబర్ 7న ఉదయం 7 నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. నారాయణఖేడ్: వచ్చే నెల 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 12న విడుదల కానుంది. ఆ రోజు నుంచి 19వ తేదీవరకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శాసన సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు వారి కార్యాలయాల్లో కార్యాలయాల్లో స్వీకరిస్తారు. అభ్యర్థులు నామినేషన్తోపాటు అఫిడవిట్ (ఫారం– 26)ను తప్పనిసరిగా సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు జారీ చేసింది. నామినేషన్ వేసేందుకు ఫారం 2బీ ఉచితంగా సంబందిత రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందజేస్తారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించేటప్పుడు అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే కార్యాలయం లోనికి అనుమతిస్తారు. నామినేషన్ వేసే జనరల్ అభ్యర్థులు రూ.10వేలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వారు రూ.5వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకే డిపాజిట్పై అభ్యర్థులు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంటుంది. స్వతంత్రులకు 10 మంది ప్రతిపాదన.. నామినేషన్ పత్రాలు సమర్పించే అభ్యర్థులు గుర్తింపు పొందిన పార్టీల వారైతే ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. గుర్తింపు లేని పార్టీలకు చెందిన వారు, స్వతంత్రంగా పోటీచేసే వాళ్లను 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రంలోని (ఫారం–2బీ, పార్ట్–3లోని(సీ) కాలం ఎదురుగా కేటాయించవలసిన గుర్తులను (ఎన్నికల కమీషన్ పంపిన ఫ్రీ సింబల్స్ నుంచి) మూడింటిని ప్రాధాన్యతా క్రమంలో రాయాల్సి ఉంటుంది. ప్రతీ కాలం నింపాల్సిందే.. అభ్యర్థి నామినేషన్ పత్రంలోని ప్రతీ కాలం తప్పనిసరిగా నింపాల్సి ఉంటుంది. ఆ కాలంలో నింపవలసింది లేనట్లయితే లేదు, వర్తించదు అని రాయాలి. అంతే కానీ డ్యాష్ (–) వంటి సింబల్స్ రాయకూడదు. ఏ కాలం కూడా ఖాళీగా వదిలివేయరాదు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారం–26 నో టరైజ్డ్ ఆఫిడవిట్లో అన్ని కాలాలను నిం పాలి. ఏదేని కాలంలో నింపవలసిం ది లేనట్లయితే లేదు, వర్తించదు అని రాయాలి. అంతే కాని డ్యా ష్ వంటివి రాయకూడదు. వివరాలు సరిగా లేకుంటే తిరస్కరణ మెదక్ అర్బన్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమకు సంబంధించిన అన్ని వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న చోట నింపాల్సి ఉంటుంది. అభ్యర్థికి సంబంధించిన అప్పులు, స్థిరచరాస్తులు, ఏమైనా కేసులు ఉన్నాయా తదితర వివరాలు నమోదు చేయాలి. అభ్యర్థులచే ప్రతిజ్ఞ చేయిస్తాం. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు కావల్సిన అన్ని వివరాలను అభ్యర్థులు తప్పకుండా అందించాల్సిందే. లేక పోతే నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. అభ్యర్థులు సంబంధిత అధికారులు, సిబ్బందికి సహకరించాలి. –నగేష్, జాయింట్ కలెక్టర్, మెదక్ ప్రభుత్వానికి బకాయిలు ఉండొద్దు.. ఎన్పీడీసీఎల్ నుంచి విద్యుత్కు సంబంధించిన, మున్సిపాల్టీ, లేదా గ్రామ పంచాయతీ నుంచి నీటికి సంబంధించి, ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్లో ఉన్నట్లయితే గత పదేళ్లుగా ఎలాంటి బకాయిలు లేనట్లు ధృవీకరణ పత్రం సమర్పించాలి. నామినేషన్ సమయంలో రిటర్నింగ్ అధికారి ముందు భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. ప్రతిజ్ఞను తనకు నచ్చిన దేవుడి పేరు మీద గానీ, మనస్సాక్షి మీదగానీ చేయవచ్చు. బ్యాలెట్ పేపర్పై పేరును ఎలా రాయాలో తెలుపుతూ తెలుగులో రాసి ఇవ్వాలి. రాష్ట్రంలో ఏదో ఒక చోట ఓటు హక్కు తప్పనిసరి.. పోటీ చేసే అభ్యర్థి రాష్ట్రంలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండాలి. ఓటు హక్కు కలిగి ఉన్న నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి నుంచి ఓటరు జాబితా సర్టిఫైడ్ ప్రతిని తీసుకు వచ్చి నామినేషన్ వెంట సమర్పించాలి. ప్రతిపాదకులు మాత్రం అభ్యర్థి పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటర్లై ఉండాలి. ప్రతిపాదకులు నిరక్షరాస్యులు అయి నామినేషన్ పేపర్లో వేలిముద్ర వేసినట్లయితే తిరిగి రిటర్నింగ్ అధికారి ముందు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఇటీవల దిగిన నాలుగు కలర్ పాస్పోర్టు సైజు ఫోటోలను ఒక స్టాంపు సైజు ఫోటోను సమర్పించాల్సి ఉంటుంది. ఫొటో వెనుకాల అభ్యర్థి సంతకం చేయాలి. నామినేషన్ వేసేందుకు 48గంటల ముందు అభ్యర్థి తన పేరున కొత్త బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు తెరచిన బ్యాంకు ఖాతాలు అనుమతించబడవు. రిటర్నింగ్ అధికారి నుంచి పొందేవి.. రిటర్నింగ్ అధికారి నుంచి చెల్లించిన డిపాజిట్ మొత్తానికి రవీదును పొందాలి. స్క్రూటినీకి హాజరయ్యేందుకు నోటీసు, ఎన్నికల వ్యయాలను నమోదు చేసే రిజిస్టర్ పొందాలి. కరపత్రం, పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇతరసామాగ్రి ముద్రించేందుకు ప్రజా ప్రాతినిద్య చట్టంలోని సెక్షన్ 127–ఏ సూచనలు. ప్రతిజ్ఞ, శపథం చేసినట్లు ధ్రువీకరణ పత్రం, నామినేషన్ పత్రంలోని లోపాలు, ఇంకనూ జతపర్చవలసిన చెక్ మెమో. ముఖ్యమైన తేదీలు ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 12 (నామినేషన్ల స్వీకరణ ప్రారంభం) నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ 19 నామినేషన్ల పరిశీలన 20 ఉపసంహరణకు చివరి తేదీ 22 -
మహిళా పారిశ్రామిక వేత్తలకు రుణ పత్రాలు
సాక్షి, హైదరాబాద్: వి–హబ్ ఆధ్వర్యంలో పలువురు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణ పత్రాలను ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అందించారు. శుక్రవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానంతరం బ్యాంకు అధికారులు, వి–హబ్ ప్రతినిధుల సమక్షంలో రుణాల అందజేత కార్యక్రమం జరిగింది. తమ వ్యాపారాల కోసం అవసరమైన నిధుల సమీకరణకు వి–హబ్ మహిళా పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులను కోరగా, 245 మంది మహిళా పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు అందాయి. అందులో సుమారు 16 స్టార్టప్ కంపెనీలను ఎంపిక చేసుకుని వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకుల నుంచి వి–హబ్ రుణ సౌకర్యాన్ని కల్పించింది. ముద్ర లోన్లు, స్టాండప్ ఇండియా వంటి పథకాల్లో భాగంగా ఈ లబ్ధిదారులకు రుణాలు లభించాయి. ఆర్థిక సహకారం అందించడానికి చేపట్టిన ఈ కార్యక్రమంపై కేటీఆర్ వి–హబ్ బృందానికి అభినందనలు తెలిపారు. సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్తో పాటు వి–హబ్ సీఈవో దీప్తి రావు పలువురు బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఫోర్జరీతో ఉద్యోగ నియామక పత్రాలు
భీమారం వరంగల్ : ఫోర్జరీ సంతకాలతో ఉద్యోగ నియామక పత్రాలు సృష్టించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కారెపల్లి మండలం గొల్లబజార్కు చెందిన మడిపల్లి శ్రీకాంత్ అదే జిల్లాలో డిగ్రీ చదువుతు మాధ్యలోనే మానివేశా డు. అనంతరం బీసీ విద్యార్థి సమాఖ్య పేరుతో 2015లో సంస్థను రిజిస్ట్రేషన్ చేసుకుని, హైదరా బాద్లోని బషీర్బాగ్ నుంచి కార్యకలాపాలు ప్రా రంభించాడు. రెండేళ్ల క్రితం శ్రీకాంత్ వరంగల్కు వచ్చి తన మిత్రుడైన రాజేష్ ద్వారా గడ్డం రణధీర్తో పరిచయం పెంచుకున్నాడు. ఐఏఎస్, మంత్రులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని శ్రీ కాంత్ మాయమాటలు చెబుతూ వచ్చాడు. హాస్ట ల్ వేల్ఫెర్ ఉద్యోగాలు అయితే తనచేతిలో పనినం టూ నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన రణ« దీర్ హాస్టల్ వేల్పెçర్ ఉద్యోగానికి రూ.6 లక్షలు ఇ చ్చాడు. అదేవిధంగా ఎల్కతుర్తి మండలం దామెరకు చెందిన గోశాల శరత్ రూ.4.50 లక్షలు, జఫ ర్గడ్కు చెందిన నల్లబెట్ల రాజు రూ.10 లక్షలు, సుబేదారికి చెందిన మమ్మెజీ వంశీ కృష్ణ రూ.3 లక్షలు, వేములవాడకు చెందిన కిరణ్ రూ. 2 లక్షలు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన నిరుద్యోగ యువకులు ఏడాది పాటు వేచి చూశారు. ఉద్యోగం ఇప్పుడు వస్తుందని అడిగితే శ్రీకాంత్ సమాధానం చెబు తూ దాట వేసే ప్రయత్నాలు చేశాడు. డబ్బులు ఇస్తావా ఉద్యోగం ఇప్పిస్తావా అంటూ శ్రీకాంత్పై ఒత్తిడి తీసుకు వచ్చారు. స్నేహితుడి ఇంటర్నెట్ సెంటర్ నుంచి.. బాధితుల ఒత్తిడి మేరకు శ్రీకాంత్ ఫోర్జరీ సంతకాలతో ఉద్యోగ నియామక పత్రాలు సృష్టించాడు. ఖమ్మంలోని తన స్నేహితుడు వేముల సతీష్ ఇంటర్నెట్ సెంటర్ నుంచి ఫోర్జరీ ఉద్యోగ నియామక పత్రాన్ని తయారు చేశారు. దానిపై కుందూ రు కిశోర్కుమార్రెడ్డితో బీసీ కమిషనర్ హైదరాబాద్ పేరుతో ఫోర్జరీ సంతకం చేయించారు. ఆ ఉద్యోగనియామక పత్రాన్ని గడ్డం రణధీర్కు అం దజేశాడు. అతడితోపాటు మరో నలుగురిలో కొం దరికి నేరుగా, మరికొందరికి మెయిల్ ద్వారా ఉద్యోగం వచ్చినట్లు నియామక పత్రాలు పంపిం చినట్లు డీసీపీ వెంకట్రెడ్డి తెలిపారు. దీని ప్రతులు కలెక్టర్, హాస్టల్ వెల్ఫేర్ కమిషనర్ పంపించా డని చెప్పారు. బాధితుడికి షాక్.. ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకున్న రణధీర్ నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి విచారించా రు. అయితే తమకు ఎలాంటి ఆర్డర్ పత్రాలు రాలేదని అధికారులు సమాధానం ఇవ్వడంతో షాక్కు గురయ్యాడు. ఈ విషయమై శ్రీకాంత్ను ప్రశ్నిస్తే కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో బాధితుడు రణధీర్ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులు శ్రీకాంత్, అతడికి సహకరించిన వేముల సతీష్, కిశోర్కుమార్రెడ్డిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెంకట్రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి కారు, ల్యాప్టాప్, కంప్యూటర్ సీపీయూ, మానిటర్తో పాటు రూ.45 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. వీరిపై ఇప్పటీకే ఆయా పోలీస్స్టేషన్ల కేసులు నమోదైనట్లు వివరించారు. సమావేశంలో సీఐ గట్ల మహేందర్రెడ్డి, ఎస్సైలు భీమేష్, ప్రవీణ్, ఏఎస్సై భీమారెడ్డి పాల్గొన్నారు. దళారులను నమ్మొద్దు.. ఉద్యోగాలు ఇప్పిస్తానని వచ్చే వారిని నమ్మొద్దని డీసీపీ వెంకట్రెడ్డి సూచించారు. ఉద్యోగాలను పూర్తిగా టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకి కోసం నోటిఫికేషన్ విడుదలైందని, తనకు పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ, ఎస్పీలు తెలుసని కొంతమంది వ్యక్తులు దళారులుగా అవతారమెత్తే అవకాశం ఉందన్నారు. -
ఏసీబీ గాలానికి చిక్కిన ఇంజనీర్..
సాక్షి, గుంటూరు : పట్టణంలో మరో అవినీతి అధికారి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు ఏసీబీ అధికారులు. ఏఓగా పనిచేస్తున్న మధవరావు అక్రమాస్తుల చిట్టా ఒక్కక్కటిగా విప్పారు. ఏసీబీ అధికారుల తనిఖీల్లో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం ఇతనికి ఇరవై విలువైన ఇళ్ల స్థలాలు, నాలుగు నివాస గృహాలకు సంబంధించిన రికార్డులను గుర్తించారు. అంతేకాక ఏడు లక్షల రుపాయల నగదు, పెద్దఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్ లెక్కల ప్రకారం దాదాపు ఆరు కోట్ల రుపాయలు. ఏకకాలంలో ఇతని బంధువుల ఇంటిపై కూడా అధికారులు దాడి చేశారు. పొన్నూరు మండలం మాచవరంలో ఇతని బినామీ చిట్టిబాబు ఇంట్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. -
‘భగత్సింగ్ భారత్-పాక్ల హీరో’
లాహోర్, పాకిస్తాన్ : భారత జాతి బానిస సంకెళ్లు తెంచేందుకు బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరిగి పిన్నవయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్. ఆయనను ఉరి తీసి 87 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆ మహా వీరుడ్ని స్మరించుకుంటూ.. పాక్ ప్రభుత్వం అతనికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రదర్శనకు ఉంచింది. సోమవారం లాహోర్లోని అనార్కలీ స్మారక కేంద్రం వద్ద ఉన్న పంజాబ్ రాష్ట్ర ఆర్కైవ్స్ విభాగంలో డాక్యుమెంట్లను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో భగత్ సింగ్కు ఉరి శిక్ష విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వు కాపీ, ఆయన చదివిన పుస్తకాలు, జైల్లో ఉన్నప్పుడు వార్తపత్రికల కోసం భగత్ సింగ్ పెట్టుకున్న దరఖాస్తులు, కుమారుడి ఉరిశిక్షను రద్దు చేయాలంటూ భగత్ సింగ్ తండ్రి కోర్టులో దాఖలు చేసిన పిటీషన్, ఉరి శిక్షను అమలు చేసినట్లు లాహోర్ జైలు సూపరింటెండెంట్ సంతకంతో ఉన్న పత్రం(భగత్ సింగ్ను మార్చి 23, 1931లో బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది). జైలు నుంచి భగత్సింగ్ తన తండ్రికి రాసిన లేఖలు, కళాశాలలో భగత్ సింగ్ అడ్మిషన్ పొందిన రికార్డులు మొదలైనవి ప్రదర్శనకు ఉంచారు. అయితే, ఈ ప్రదర్శనను నిర్వహించాలని పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సులో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాహిద్ సయీద్ అధ్యక్షతన జరిగింది. భగత్ సింగ్ భారత్-పాక్ రెండు దేశాలకు చెందిన హీరో అని, బ్రిటీష్ ప్రభుత్వంపై ఆ వీరుడు సాగించిన పోరాటాలు ఇరు దేశాల ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రదర్శనకు ఉంచినట్టు పాకిస్తాన్ అధికారులు తెలిపారు. -
లా‘డెన్’లో దాగిన రహస్యం
సాక్షి నాలెడ్జ్ సెంటర్: కరడుగట్టిన ఉగ్రవాది, అల్కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆసక్తులు, అభిరుచులు, అబోటాబాద్లో అజ్ఞాతంలో ఉన్నపుడు అతని కార్యకలాపాలు సహా పలు వివరాలను అమెరికా నిఘా సంస్థ సీఐఏ బుధవారం బయటపెట్టింది. పాకిస్తాన్లో అబోటాబాద్లోని రహస్య స్థావరంపై అమెరికా 2011 మే 2న మెరుపుదాడి చేసి ఈ మోస్ట్వాంటెడ్ ఉగ్రవాదిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా నావికాదళానికి చెందిన సీల్స్ అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్న ఒక కంప్యూటర్లోని 321 గిగాబైట్ల సమాచారాన్ని సీఐఏ ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. 18,000 పత్రాలు, 79,000 వేల ఆడియో ఫైల్స్, ఫోటోలు, 10 వేలకు పైగా వీడియోలు, లాడెన్ అరబిక్లో రాసుకున్న ఓ డైరీ ఇందులో ఉన్నట్లు సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో వెల్లడించారు. కశ్మీర్ పరిణామాలపై ఆసక్తి... అబోటాబాద్లోని నివాసంలో లాడెన్ ఫోన్, ఇంటర్నెట్లను వాడలేదు. అయినా అతని కంప్యూటర్లో వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రికల క్లిప్పింగులు ఉన్నాయి. వీటిని ఎవరో సేకరించి లాడెన్కు చేరవేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్ పరిణామాలను లాడెన్ నిశితంగా గమనించేవాడని అతని కంప్యూటర్లో దొరికిన పత్రికల క్లిప్పింగులు స్పష్టం చేస్తున్నాయి. 2008 ముంబై దాడుల కుట్రలో పాత్రధారి అయిన డేవిడ్ హెడ్లీ విచారణకు సంబంధించిన వార్తలను లాడెన్ క్రమం తప్పకుండా చదివేవాడు. హెడ్లీకి ఆదేశాలిచ్చిన పాకిస్తానీ ఇలియాస్ కశ్మీరీకి సంబంధించిన వార్తా క్లిప్పింగులు, అల్కాయిదా, తాలిబన్ల వార్తలను సేకరించేవాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్, పీటీఐ వార్తా సంస్థ కశ్మీర్పై ప్రచురించిన వార్తల క్లిప్పింగులనూ భద్రపరిచాడు. ఇరాన్ను చిక్కుల్లో పెట్టేందుకేనా? లాడెన్ కంప్యూటర్లో కొన్ని నీలిచిత్రాలు, డాక్యుమెంటరీలు కూడా లభ్యమయ్యాయి. తనపై ప్రసారమైన మూడు డాక్యుమెంటరీలను లాడెన్ కంప్యూటర్లో దాచుకున్నాడు. ఈ ప్రపంచంలో లాడెన్ ఎక్కడ? అనే డాక్యుమెంటరీ కూడా అందులో ఉంది. అలాగే భారతదేశ చరిత్రపై బీబీసీ ప్రసారం చేసిన ‘స్టోరీ ఆఫ్ ఇండియా’, కుంగ్ ఫూ కిల్లర్స్, వరల్డ్స్ వరస్ట్ వెనమ్... అనే డాక్యుమెంటరీలు కూడా అతని వద్ద ఉన్నాయి. యానిమేటెడ్ చిత్రాలు, కార్టూన్ షోలతో పాటు టామ్ అండ్ జెర్రీ లాంటి కార్టూన్ షోల వీడియోలు, బుట్టల అల్లికలకు సంబంధించిన వీడియో పాఠాలూ ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయడానికి కలిసి పనిచేయాలని ఇరాన్, అల్కాయిదాలు అవగాహనకు వచ్చినట్లు ఓ ఫైల్లో ఉంది. ఇరాన్ ఉగ్రవాదులకు సాయం చేస్తోందని చూపేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాసమాచారాన్ని విడుదల చేయించారని పరిశీలకులు భావిస్తున్నారు. – -
భూమి రికార్డులు ప్రాణాధారం
విశ్లేషణ భూ దస్తావేజుల డిజిటలైజేషన్ గురించి పదే పదే వింటున్నాం. ఇప్పుడున్న తప్పుల తడక పత్రాలను యథాతథంగా స్కాన్ చేసి కంప్యూటర్లోకి ఎక్కించడమే డిజిట లైజేషన్ అయితే, అల్మరాలో రికార్డులను కంప్యూటర్లోకి పంపడమే అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రెవెన్యూ అధి కారులతో ‘‘ఒక్క ఊరి భూమి రికార్డయినా బాగుందా, నిరూపించండి, నాకు చూపించండి’’ అని సవాలు విసిరారు. ఆంధ్ర ప్రదేశ్లో రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి సమాచార దినం నిర్వహించి కలెక్టరేట్, 3 రెవెన్యూ డివిజన్లు, 56 తహసీల్దార్ కార్యా లయాలలో అడిగిన వారికి అక్కడిక్కడే సమాచారం ఇచ్చి ఆశ్చర్యపరిచారు. కొందరికి వెంటనే ఇవ్వలేకపో యినా వందలాది మందికి భూమి రికార్డుల సమా చారం ఇవ్వడం ఒక అద్భుతం. కాపీ చార్జీలు ఇస్తేనే కాగి తాలు ఇస్తామనకుండా, పాలనలో సమాచారం చెప్పడం ఒక బాధ్యత అని నిరూపించారు. పదిరూపాయలు ఇచ్చి నెలరోజులపాటు ఎదురుచూసినా ఇవ్వకపోతే అప్పీలు చేయాలని సమాచార హక్కు చట్టం నిర్దేశిస్తు న్నది. ప్రభాకరరెడ్డిలాగా సమాచారం ఇస్తే సమాచార చట్టంతో పనే లేదు. భూమి రికార్డులు మూడో వ్యక్తి సమాచారమనీ, వ్యక్తిగత సమాచారమనీ నిరాకరించే రోజులివి. భూమి రికార్డులు గ్రామీణ వ్యావసాయిక ఆర్థిక వ్యవస్థకు జీవనాధారాలు. మానవ జీవన పరిణామానికి సాక్ష్యాలు. ఎవరు యజమాని ఎంత భూమి అనే వివ రాలే కాకుండా సమాజం ఏవిధంగా జీవించిందో వివ రిస్తాయి. వ్యవసాయంలో వచ్చిన మార్పులు, రాజకీ యాల పరిణామాలు ప్రతిఫలించే భూమి రికార్డులపైనే ఆదాయవనరులు, సంక్షేమ పథకాలు లాభోక్తల ఎంపిక ఆధారపడి ఉంటాయి. సార్వభౌమాధికారం కూడా భూమిపైనే. రికార్డులు యజమానికి చట్టబద్ధమైన అధి కారాన్నిస్తాయి. తన భూమిలో తన స్వాధీనంలోనే, పట్టా చేతిలో, రెవెన్యూ రికార్డులో ఆ యజమాని పేరే ఉండడం అత్యవసరం. ఈ మూడింటిలో ఏదో ఒకటి లేకుండా 50 నుంచి 80 శాతం వ్యవసాయ భూముల సొంతదార్లు తెలంగాణలో బాధపడుతున్నారు. విచిత్ర మేమిటంటే తమ రికార్డులో లోపాలున్నాయని, తమకు సమస్య ఉందని కూడా చాలామందికి తెలియదు. చెప్పే వారు లేరు, తెలుసుకునే మార్గమూ లేదు. భూమి సొంతమే కానీ దానిపైన చట్టపరమైన హక్కులు లేవని తేలితే భూములూ దక్కవు, జీవనోపాధీ మిగలదు. భూమి రికార్డులలో లోపాలు వాటంతట అవేరావు. ప్రజలకు తెలియని, వారికి అందుబాటులో లేని కాగి తాల్లో తప్పులుంటే బాధ్యులెవరు? వారసుల పేర్లను రికార్డులకెక్కించడానికి లంచాలు అడుగుతారు. ఇవ్వక పోతే పాత వారసులే రికార్డులలో కొనసాగుతారు. దశా బ్దాల కింద మరణించిన వారి పేర్లే రికార్డుల్లో ఉంటాయి. వారి అన్నదమ్ములు, వారి పిల్లలు తగాదాల్లో తలము నకలైతే అధికారులు అటూ ఇటూ కానుకలు పొందుతూ ఉంటారు. రెవెన్యూ కోర్టుల్లో న్యాయస్థానాల్లో లక్షలాది కేసులు: లంచాలు లాయర్ల ఫీజులకోసం పేదలు కూడా అప్పులు చేసి ఖర్చుచేస్తారు. కోర్టుల్లో కేసులు తెమలవని సెటిల్మెంట్ ముఠాలను ఆశ్రయిస్తారు, ఉన్న డబ్బు కూడా కోల్పోతారు. దక్‡్ష అనే ఎన్జీవో ఇటీవల కోర్టు కేసుల భారం పైన ఒక సర్వే జరిపారు. వారి అంచనా ప్రకారం భూమి తగా దాల్లో జనం ఏటా 58 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇదివరకు ఈ ఖర్చు 12 వేల కోట్ల రూపా యలనుకున్నారు. దీని పైన ప్రభుత్వాలు చేసే వ్యయం కొన్ని వేల కోట్ల రూపాయలు వేరే. కోర్టుల్లో ఈనాడు మూలుగుతున్న 3 కోట్ల కేసులలో 66 శాతం భూమి తగాదాలకు సంబంధించినవే. దేశ ఆర్థిక ప్రగతి కూడా ఈ తగాదాలవల్ల దెబ్బతింటున్నది. దీనంతటికీ కార ణం, రికార్డుల్లో యజమానులు వేరు, భూమ్మీద యజ మానులు వేరు. స్వాధీనం ఉన్న రైతులు ఒకరయితే రికార్డులో మరొకరి పేరు ఉంటుంది. హద్దులు నేలమీద ఒకటైతే దస్తావేజుల్లో మరేవో ఉంటాయి. ఉత్తరం దక్షి ణం పశ్చిమం తూర్పు తేడా లేకుండా ప్రతిదిశలోనూ భూమి విస్తారం మీద అంకెలు మారుతూ ఉంటాయి. కొట్టుకునే జనాలే అధికారులకు లంచాల నజరానాలు ఇచ్చే బాధితులు. ఈ కష్టాలకూ సమస్యలకన్నింటికీ ఒకే పరిష్కార మార్గం.. దస్తావేజుల్లో లోపాలు సరిదిద్దడం. తప్పులు దిద్దడం సామాన్యమైన విషయం కాదు. ముందు తప్పు లేమిటో తెలుసుకోవడానికి ప్రజలకు అవకాశం ఇవ్వాలి. ఉన్న రికార్డులను జనంలోకి తేవాలి. పంచాయతీ ఆఫీసు గోడమీద రాయాలి. తప్పులు ఎత్తిచూపే అవకాశం ఇవ్వాలి. ప్రతి గ్రామంలో జనం సూచనల మేరకు సర్వే చేసి ఇరుగుపొరుగు అభ్యంతరాలు విని సర్వే, దర్యాప్తు చేయాలి. ఆ తరువాత దస్తావేజులు నవీకరించి జనులకు అందుబాటులోకి తేవాలి. అప్పుడు గానీ భూమి రికా ర్డుల పని పూర్తి కాదు. పనివేళలు, జీతాలు, ఉత్పాదకత అన్నీ జనం ఈ కోర్టు వివాదాల్లో కోల్పోతారు. ఈ నష్టాల అంచనా రూ. 30 వేల కోట్లు. కేవలం రికార్డు లను సంస్కరిస్తే మూడింట రెండొంతుల కోర్టు కేసులను నివారించవచ్చు. పెండింగ్ భారాలకు వేరే పథకాలే అవ సరం లేదు. ప్రతి ప్రభుత్వం భూసంస్కరణలు చేస్తామ నడం మనం వింటూనే ఉన్నాం. కానీ రికార్డులు సంస్క రించకుండా భూసంస్కరణలపై మాట్లాడడం వృథా. డిజిటలైజేషన్: భూ దస్తావేజుల డిజిటలైజేషన్ గురించి పదే పదే వింటున్నాం. ఇప్పుడున్న తప్పుల తడక పత్రాలను యథాతథంగా స్కాన్ చేసి కంప్యూ టర్లోకి ఎక్కించడమే డిజిటలైజేషన్ అయితే సమస్యలు తీరవు. అది ఆల్మరాలో రికార్డులను కంప్యూటర్లోకి పంప డం మాత్రమే. మార్పు ఏమంటే రెవెన్యూ ఉద్యోగుల బదులు కంప్యూటర్ ఆపరేటర్లు రైతులను వేధిస్తుం టారు. తప్పులూ తగాదాలూ లేని రికార్డులను రూపొం దించడమే కావలసిన పని. నవీకరించిన తరువాత ఎవరూ మార్చకుండా తగిన రక్షణ ఉండాలి. భూమి రికార్డుల సవరణ సంస్కరణ పేరుతో ఎన్నో పథకాలు వచ్చాయి. రెండు దశాబ్దాలనుంచి నవీకరిస్తున్నారు. ఈ పథకాన్ని సమీక్షించి, పేరు మార్చారు. ప్రతి రాష్ట్రానికి నూరు శాతం నిధులు ఇవ్వాలని రికార్డులన్నీ సంస్క రించాలని కేంద్రం కేటాయించిన 11 వేల కోట్లు సక్ర మంగా ఖర్చు చేస్తే ఏటేటా వేల కోట్ల రూపాయల ఆదా సాధ్యమే. కంప్యూటర్ తెలియని పల్లెజనం డిజిటల్ రికార్డు లేంచేసుకుంటారు? విద్యుచ్ఛక్తిలేక, అంతర్జాలం తెర వలేక చేయగలిగేదేమిటి? శూన్యనినాదాలు శుష్క ప్రియాలు. గందరగోళంగా ఉన్న మన రికార్డులే మన సుపాలన. తప్పుడు రికార్డులతో దాయాదులను కోర్టుల కీడ్చే వ్యవస్థ మన నిర్వహణా సమర్థత. రికార్డులు మార్చకుండా భూసంస్కరణలని నినాదాలిస్తే మన నిబ ద్ధత. రికార్డులు అందుబాటులో తేకుండా సాధికారికత గురించి ప్రసంగించడం మన నాగరికత. (కేంద్ర రాష్ట్ర సమాచార కమిషనర్ల సమావేశంలో భూరికార్డులు– సమాచార హక్కు అంశంపై జూలై 15న సమర్పించిన పత్రం ఆధారంగా). వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
నకి‘లీలలు’
► పరిహారం అర్జీలలో కొత్త కోణం ► ముంపు వాసులకు దొంగ పత్రాలు ఇస్తూ దోచుకుంటున్న సిబ్బంది ► విచారణలో బయట పడుతున్న దొంగ పెళ్లి పత్రికలు ► పాఠశాలల్లో పేర్లు లేకపోయినా ఉన్నట్లుగా పత్రాలు సృష్టి ► ఒక్కో పత్రానికి రూ.5 వేలకు పైగానే వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎర్రగుంట్ల: గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్థిక సామాజిక విచారణ సర్వేలో అధికారులకు వింత అనుభవం ఎదురైంది. ముంపు వాసులు పెట్టుకున్న అర్జీలలో కొన్ని నకిలీ పత్రాలు.. వారికి చుక్కలు చూపెడుతున్నాయి. పరిహారం కోసం స్థానిక ప్రభుత్వ సిబ్బందే అడ్డదారులు తొక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు గ్రామస్తుల చేత వివాహం అయినట్టుగా పెళ్లి పత్రికలు కొట్టించి, అందులో తేదీలను, సంవత్సరాన్ని, ముహూర్తం సమయాన్ని మార్చి నకిలీ పత్రాలను సృష్టించి అర్జీలు పెట్టించిన విషయం తాజాగా వెలుగు చూసింది. ఈ అక్రమ వ్యవహారం వెనుక కొందరు అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు గురువారం ఎర్రగుంట్ల రెవెన్యూ కార్యలయంలో తహసీల్దార్ సమక్షంలో వీఆర్ఓలు విచారణ చేపట్టారు. కొండాపురంలోని అధికారులు కొందరి వద్ద నజరానాలు తీసుకుని నకిలీ పత్రాలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఒక్కొక్క నకిలీ పత్రానికి రూ.5 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. వెలుగుచూస్తున్న వాస్తవాలు గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామమైన కొండాపురం మండలంలోని చౌటిపల్లికి చెందిన ముంపు వాసులకు.. ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు ఆధారాలు సమర్పించాలని అధికారులు తెలిపారు. అంటే 2007 జనవరి 1 నుంచి విచారణ చేసే మధ్య కాలంలో కనీసం నాలుగేళ్లు ఆ గ్రామంలో నివాసమున్నట్లు.. అప్పటి రేషన్కార్డు, ఓటరు కార్డు, ఆధార్కార్డు, ఉపాధి హమీ జాబ్కార్డు, పెన్షన్ కార్డు పుస్తకం, బ్యాంకు పాసుబుక్, పోస్టల్ పుస్తకం, గ్యాస్ కనెక్షన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టులు తదితర ఆధారాలు సమర్పించాలని కోరారు. అలాగే 2007 జనవరి 1కి ముందే వివాహం అయిన వారు అర్హులు కారని తెలిపారు. 2007 జనవరి 1 తర్వాత వివాహం అయిన వారు మ్యారేజ్ సర్టిఫికెట్, లేదా పెళ్లి ఆధారాలు అందజేయాలని పేర్కొన్నారు. 160 అర్జీలకు ఆధారాలు లేవు ఇలా చౌటిపల్లి నుంచి వచ్చిన 160 అర్జీలకు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. తర్వాత కొన్ని అర్జీలకు ఆధారాలు జోడించి ముంపు వాసులు ఇచ్చారని వారు పేర్కొన్నారు. వీటిలో పెళ్లి అయినట్టుగా 15 అర్జీలు, పాఠశాలలో చదివినట్టుగా 60 అర్జీలు వచ్చాయి. విచారణ చేపట్టగా వీటిలో పెళ్లి పత్రికలు నకిలీవిగా గుర్తించినట్లు తహసీల్దార్ మహేశ్వరరెడ్డి తెలిపారు. పెళ్లి పత్రికలలో తేదీలు, సంవత్సరాలు.. వారి వయసు మధ్య చాలా వ్యత్యాసం ఉందని, అంతేకాక కల్యాణ మండపాలకు పోయి విచారణ చేస్తే అక్కడ ఈ తేదీలలో ఏ పెళ్లి జరగలేదని రికార్డుల్లో ఉందన్నారు. అలాగే ఆయా పాఠశాలలో విచారణ చేస్తే అక్కడ కూడా వారి పేర్లు లేవని, అదే విధంగా కొన్ని స్కూల్స్ కూడా లేవని విచారణలో తేలిందన్నారు. విచారణ పక్కగా చేస్తున్నాం ముంపువాసులు నుంచి వచ్చిన అర్జీలపై విచారణను కచ్చితంగా చేస్తున్నాం. పెళ్లి అయినట్టుగా 15 అర్జీలు రాగా, అవన్నీ నకిలీవని తేలిపోయింది. అలాగే పాఠశాలల్లో చదివిన సర్టిఫికెట్లపై విచారణ చేస్తే వారి పేర్లు లేవు. ప్రభుత్వ నిబంధనల మేరకు విచారణను సాంకేతిక పద్ధతిలో చేస్తున్నాం. –బీ మహేశ్వరరెడ్డి, తహసీల్దార్, ఎర్రగుంట్ల -
మాస్టర్‘ప్లాన్’ వేశారు
- రూ.లక్షలు నొక్కేసి.. ఇష్టానుసారం పట్టాలు ఇచ్చేశారు - చేతులు మార్చి అవే స్థలాలను నొక్కేసిన బినామీలు - నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు - సుప్రీంకోర్టు ఆదేశాలూ బేఖాతరు - అధికార పార్టీ నేతల అండతో కాకినాడలో దందా రోడ్డుకు అడ్డు వస్తున్నాయనే సాకుతో అనేక ప్రాంతాల్లో నిరుపేదల ఇళ్లను అధికారులు తొలగించేసినా కిమ్మనని అధికార పార్టీ ‘పెద్దలు’.. లక్షల రూపాయలు కొల్లగొట్టేందుకు మాస్టర్ ‘ప్లాన్’ వేశారు. నిబంధనలను, సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి.. కొందరు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి.. మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్డును ఆనుకుని ఉన్న విలువైన స్థలంలో ఇష్టారాజ్యంగా ఇళ్ల పట్టాలు ఇచ్చేశారు. ముందే వేసిన పథకం ప్రకారం అవే పట్టాలను కొందరు బినామీలు చేజిక్కించుకున్నారు. కలెక్టర్ సహా జిల్లా అధికార యంత్రాంగమంతా కొలువుదీరిన కాకినాడ స్మార్ట్ సిటీయే ఈ దందాకు వేదికగా మారింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : నగరంలోని 35వ డివిజన్ అది. అక్కడి బాలాజీనగర్ ఎర్రమట్టి రోడ్డును తాజాగా రూపొందించిన మాస్టర్ప్లాన్లో 60 అడుగులుగా ప్రతిపాదించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆ రోడ్డును విస్తరించాలనే ప్రణాళిక ఉంది. ఆ రోడ్డును ఆనుకుని ఉన్న స్థలం కాకినాడ నగరపాలక సంస్థ ఆధీనంలో ఉంది. ఒకప్పుడు మెయిన్ రోడ్డు విస్తరణ కోసం స్థలం ఇచ్చిన తపాలా శాఖకు ప్రత్యామ్నాయంగా ఈ స్థలాన్ని ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా పెండింగ్లో ఉంది. అయితే నగరంలోని ఓ అధికార పార్టీ ముఖ్య నేత ఒత్తిళ్లతో ఈ ప్రతిపాదనను బుట్టదాఖలు చేశారు. రోడ్డును ఆనుకుని 50 గజాల వంతున నచ్చినవారికి నచ్చినట్టు అడ్డగోలుగా పట్టాలు ఇచ్చేశారు. ఆ ప్రాంతంలో గజం స్థలం రూ.20 వేలకు పైనే పలుకుతోంది. దీని ప్రకారం ఒక్కొక్కరికి ఇచ్చిన స్థలం విలువ రూ.10 లక్షల పైనే ఉంది. ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల ఆమ్యామ్యాలు తీసుకుని కార్పొరేషన్ స్థలాన్ని ఇష్టానుసారం బేరం పెట్టేశారు. పైగా ఆ స్థలాన్ని ఆనుకుని ఉన్న ఇంటి ప్రహరీని చేర్చి పట్టాలు ఇవ్వడంతో ఆ ఇంటి దారిని సైతం మూసివేసి నిర్మాణాలు ప్రారంభించేశారు. మరోపక్క పట్టాలు ఇచ్చిన స్థలానికి పొరుగున ఉన్న ఇళ్ళను రహదారి కోసం తొలగించాలని అధికారులు ఇటీవల నోటీసులు కూడా ఇచ్చారు. అటువంటప్పుడు ఆ పక్కనే పట్టాలు ఎలా ఇచ్చారో అర్థం కాని పరిస్థితి. వాస్తవానికి రోడ్డు మార్జిన్లలో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని 2002లో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా సామాజిక స్థలాలపై ఆయా స్థానిక సంస్థలకే సర్వాధికారాలూ ఉంటాయి. కానీ, మాస్టర్ప్లాన్లో ప్రతిపాదించిన రోడ్డు మార్జిన్లోని స్థలంలో ఇళ్ల పట్టాలు ఎలా ఇచ్చారో జారీ చేసిన అధికారులకే తెలియాలి. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. అడ్డగోలుగా మాస్టర్ప్లాన్లో పేర్కొన్న రోడ్డులో పట్టాలు ఇవ్వడమే ఒక తప్పయితే పట్టాలు పొందినవారు కాకుండా, వారినుంచి కొనుగోలు చేసిన బినామీలు ఇప్పుడు అక్కడ నిర్మాణాలు ప్రారంభించడం గమనార్హం. జగన్నాథపురంలోనూ అంతే.. జగన్నాథపురం 22వ డివిజన్ పరిధిలోని ధోబీçఘాట్ను ఆనుకుని గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు ప్రయత్నించారు. కానీ నిబంధనల ప్రకారం అలా ఇవ్వడం కుదరదని అప్పటి నగరపాలక సంస్థ కమిషనర్ అడ్డు చెప్పారు. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం నగర టీడీపీ నేతలు ముఖ్యనేతకు సిఫారసు చేయడంతో రూ.లక్షలు దిగమింగేసి, కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి, అదేచోట ఇళ్ల పట్టాలు కట్టబెట్టేశారు. ఇక్కడ సుమారు 30 వరకూ స్థలాలను ఇళ్ల పట్టాలుగా అమ్మేసుకున్నారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం సత్తి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ స్థలాల వివరాలు కోరగా, ఆ రోడ్లు మాస్టర్ప్లాన్లోనే ఉన్నాయని నగరపాలక సంస్థ పేర్కొంది. అటువంటప్పుడు కార్పొరేషన్కు తెలియకుండా రెవెన్యూ అధికారులు అక్కడ ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే.. అది రెండేళ్ల క్రితం జరిగిందంటూ కార్పొరేషన్ అధికారులు తప్పించుకుంటున్నారు. పట్టాలున్నాయో లేవో పరిశీలిస్తున్నాం బాలాజీనగర్ ఎర్రమట్టి రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు వచ్చింది. ఆ ప్రాంతాన్ని 60 అడుగుల మాస్టర్ప్లాన్లో ప్రతిపాదించడం వాస్తవమే. అందువల్ల నిర్మాణాలను నిలుపు చేస్తున్నాం. పట్టాలు ఉన్నాయా? లేవా? అనే అంశంపై విచారణ జరుపుతున్నాం. - కాలేషా, సిటీప్లానర్, కాకినాడ నగరపాలక సంస్థ అడ్డగోలుగా పట్టాల పంపిణీ మాస్టర్ప్లాన్ రోడ్లలో సైతం ఇష్టం వచ్చినట్టుగా పట్టాలు పంపిణీ చేసేస్తున్నారు. ఎర్రమట్టి రోడ్డు స్థలం నగరపాలక సంస్థకు చెందినదని గతంలోనే స్పష్టం చేశారు. ఆ స్థలంలో కోర్టు నిర్ణయాలను సైతం పక్కన పెట్టి పట్టాలు ఇవ్వడం వెనుక ఉన్న రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. - చిట్నీడి మూర్తి, మాజీ కౌన్సిలర్, కాకినాడ -
హవ్వ...నవ్విపోదురుగాక
► హైస్కూల్ తరగతుల్లో ► సమ్మెటివ్ అసెస్మెంట్ ప్రశ్నపత్రాల లీక్ ► మార్కులకోసం ప్రైవేటు విద్యాసంస్థల కుటిలయత్నాలు ► చిరువయసులోనే తప్పుడు ఆలోచనలకు బీజం ► పరీక్షకు రెండు రోజు ముందే బయటకు వస్తున్న ప్రశ్నపత్రాలు ► మండలస్థాయి విచారణలో బయటపడని దోషులు సాలూరు : ఉన్నత పాఠశాల స్థాయిలో ఒకే విధమైన పరీక్ష విధానం అమలు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమ్మెటివ్ అసెస్మెంట్ పేరున నిర్వహిస్తున్న పరీక్షలు అపహాస్యమవుతున్నాయి. అడ్డదారిలో ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ప్రైవేటు విద్యాసంస్థలు కొన్ని ప్రశ్న పత్రాలను లీక్చేస్తూ... పాఠశాల స్థాయిలోనే విద్యార్థులను తప్పుదారి పట్టించడాన్ని అలవాటు చేస్తున్నాయి. దీనివల్ల నిజంగా తెలివైన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అడ్డదారిలో మార్కులకోసం... ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే రకమైన ప్రశ్న పత్రాలు అం దించి పరీక్షలు నిర్వహించేందుకు 2016–17 విద్యాసంవత్సరం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత పరీక్షల విధానంలో మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆరోతరగతి నుంచి తొమ్మిదో తరగతివరకూ సమ్మెటివ్ అసెస్మెంట్ విధానంలోనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు పదోతరగతిలో ప్రత్యేకంగా తరగతికి ఐదు వంతున గ్రేస్మార్కులు కలుపుతారు. అందుకోసం ఆరో తరగతినుంచే అత్యధిక మార్కులు సాధించేలా విద్యార్థులను చదివించాల్సింది పోయి అడ్డదారిలో మార్కులు సంపాదించేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. పరీక్షలకు ఒకటి, రెండు రోజుల ముందే ఈ ప్రశ్నపత్రాలు సంబంధిత పాఠశాలలకు చేరుతాయి. పాఠశాలల యాజమాన్యాలు అందులోంచి ఒక ప్రశ్న పత్రాన్ని తీసేసి రహస్యంగా జెరాక్స్ తీయించి పిల్లలకు అందించి వారిచేత బట్టీ పట్టించి పరీక్షలకు హాజరుపరుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలే దీనికి మూలమా? ఇప్పటివరకూ బట్టీ విధానంలో ప్రైవేటు విద్యాసంస్థలు తమ విద్యార్థులచేత అధిక మార్కులు సాధిస్తుండేవి. ఈ విధానం వల్ల అలాంటి ఫలితాలకు దూరమవుతాయేమోనన్న ఆందోళనతో తమకు ముందుగానే చేరిన ప్రశ్నపత్రాల నుంచి ఒకటిరెండు బయటకు తీసి, జెరాక్స్ తీసిన అనంతరం మరలా యథాతథంగా ప్రభుత్వం అందించిన ప్రశ్నపత్రాలలో చేరుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనివల్లనే పలుప్రైవేటు పాఠశాలల విద్యార్థులతోపాటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వద్ద కూడా ప్రశ్నపత్రాల జెరాక్స్ కాపీలు ఒకటి రెండు రోజుల ముందే కనిపిస్తున్నాయి. విచారణ జరిపాం: ఎంఈఓ ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారి బి.గణపతి వద్ద సాక్షి ప్రస్తావించగా... ప్రశ్నపత్రాల లీకేజీ విషయమై తనకు ఇప్పటికే సమాచారం అందిందన్నారు. ఆరోపణలు వస్తున్న స్థానిక ప్రైవేటు పాఠశాలకు శనివారం వెళ్లి విచారణ జరిపామని, కానీ అక్కడ ప్రశ్నపత్రాలు సరిపోయాయన్నారు. -
ఇంకా స్తబ్ధతే!
► కుదుట పడని రియల్ రంగం ► పది శాతం పడిపోయిన పురోగతి ► ఆదాయంలో రూ.కోట్లలో వెనకంజ ► కొత్త జిల్లాల్లో పెరగని దస్తావేజులు ► నోట్ల రద్దు, నగదు పరిమితే కారణం సాక్షి, నిర్మల్ : పెద్ద నోట్ల రద్దు కారణంగా గతేడాది నవంబర్ నుంచి రియల్ రంగం పై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే కొత్త నోట్ల రాక, మార్కెట్లో వాటి చలామణి సాధారణ స్థాయికి వస్తున్నప్పటికీ రియల్ రంగంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా రూ.2 లక్షలకు పైబడిన వ్యవహారాల్లో నగదుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాల్సిన పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుండడంతో రియల్ రంగం కుదుటపడటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొనుగోలుదారులు అంతకుమించిన నగదు వ్యవహారాలు సాగిస్తే దానికి సంబంధించి పక్క ఆధారాలు చూపించాల్సి పరిస్థితి ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ముందడుగు పడటం లేదని, తద్వారా దస్తావేజులు, ఆదాయం పరంగా రిజిస్ట్రేషన్ల శాఖకు తిరోగమనం కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పురోగతిలో తిరోగమనం ఉమ్మడి జిల్లాలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, బోథ్, మంచిర్యాల, నిర్మల్, ఖానాపూర్, లక్సెట్టిపేటలలో ఉన్నాయి. 2015 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరంగా మొత్తంగా 41,495 దస్తావేజులు కాగా, రూ.65.68 కోట్ల ఆదాయం లభించింది. అదే 2016లో ఆ 12 నెలల కాలంలో 40,861 దస్తావేజులు కాగా, రూ.59.99 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రెండేళ్ల పరంగా పురోగతిని చూస్తే 2015 కంటే 2016లో పురోగతి 10 శాతం తిరోగమనంలో ఉండగా ఆదాయం పరంగా రూ.5.69 కోట్ల వెనకంజలో ఉంది. సాధారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ పరంగా వార్షిక ఆదాయం ప్రతీ ఏడాది ఏప్రిల్ నుంచి మొదలై మార్చితో ముగుస్తుంది. అయితే ఈ సంవత్సరంలో మరో నెల మార్చి మిగిలి ఉండగా వార్షిక ఆదాయం పరంగా సుమారు రూ.15 కోట్ల వెనకంజలో ఉంది. ఈ ఆదాయాన్ని ఈ ఒక్క నెలలో అందుకోవడం గగనంగానే కనిపిస్తోంది. జనవరి నెలలో ఉమ్మడి జిల్లా మొత్తంగా రూ.2.70 కోట్ల ఆదాయం లభించింది. మార్చిలో మరో మూడు కోట్ల ఆదాయం వస్తుందని అనుకున్న వార్షిక లక్ష్యాన్ని అందుకోవడం నష్టంగానే కనిపిస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పడినా... కొత్త జిల్లా ఏర్పడక ముందు మంచిర్యాల, నిర్మల్ ప్రాంతాల్లో రియల్ రంగం జోరుగా సాగింది. మంచిర్యాల ప్రాంతంలో ప్రతీ రోజు 60 దస్తావేజులు, నిర్మల్ ప్రాంతంలో 40 దస్తావేజుల వరకు జరిగేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంచిర్యాల జిల్లా ఏర్పాటు జరుగడం ఖాయంగా ఉండడం, ఆ ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు, జైపూర్ పవర్ప్లాంట్ కింద భూ నిర్వాసితులకు ముంపు కింద భారీగా పరిహారం రావడం అక్కడ గత మూడు, నాలుగేళ్లుగా రియల్ రంగం జోరుగా సాగింది. అయితే కొత్త జిల్లా ఏర్పాటు తరువాత క్రమంగా ఇక్కడ దస్తావేజుల సంఖ్య తగ్గుతూ రోజుకు 40 వరకు వచ్చింది. నోట్ల రద్దు తరువాత ఈ సంఖ్య మరింత తగ్గింది. గత సెప్టెంబర్ ముందు నుంచి నిర్మల్ జిల్లా ఏర్పాటు మీద ఉద్యమం సాగగా, అక్టోబర్లో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా నిర్మల్ జిల్లాను కూడా ప్రకటించారు. ఆ సమయంలో నిర్మల్ జిల్లాలో భూముల రేటు విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా క్రయవిక్రయాలు సంఖ్య పెరిగి దస్తావేజులు రోజుకు 40 వరకు జరిగాయి. అయితే ఇక్కడ భూముల రేట్లను రెండు, మూడు ఇంతలు, అంతకంటే ఎక్కువ పెంచడంతో ఆ తరువాత క్రమంలో కొనుగోలులో స్తబ్ధత నెలకొంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజుకు 15కు పడిపోయింది. ఆదిలాబాద్ నాలుగేళ్లుగా రియల్ పరంగా సబ్ధత నెలకొంది. ఒక్కప్పుడు రోజుకు 40 దస్తావేజులు కాగా ప్రస్తుతం 20 నుంచి 30 వరకు అవుతున్నాయి. ఆసిఫాబాద్లో పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఇదిలా ఉంటే మరో ఏడాది వరకు రియల్ రంగంలో పురోగతి ఉండకపోవచ్చునని అధికారులతో పాటు పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో నోట్ల చెలామణిపై పరిమితుల నేపథ్యంలో మునపటి పరిస్థితిని అందుకోవడం ఆశామాషీకాదని పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడేళ్లలో దస్తావేజులు, ఆదాయం వివరాలు సంవత్సరం దస్తావేజుల ఆదాయం (ఏప్రిల్–మార్చి) సంఖ్య రూ.కోట్లలో) 2014–15 30,104 55.71 2015–16 45,870 60.42 2016–17(జనవరి వరకు) 31,527 45.43 -
పన్ను పత్రాల దాఖలుకు సిద్ధమా..
నూతన సంవత్సరం వేడుకల హడావుడి ఇంకా పూర్తి కాలేదు. కొత్త సంవత్సరంలో సాధిద్దామనుకుంటున్న లక్ష్యాల ఊహలు చాలానే ఉండొచ్చు. అయితే వీటి నుంచి కాస్త వాస్తవ ప్రపంచంలోకి తక్షణం రాకతప్పదు. ఎందుకంటే...ఊహలెలా ఉన్నా ఆదాయ పన్ను లెక్కలు సరి చూసుకోవాల్సిన సమయమిది. పన్ను పోటును తగ్గించుకునే దిశగా అవసరమైన పత్రాలు సమర్పించాల్సిన తరుణమిది. మీరు వేతన జీవులైనా లేకపోతే స్వంతంగా బిజినెస్ చేసుకుంటున్న వారైనా.. ఎవరైనా సరే వీటిని సమర్పించాల్సిందే. పన్ను పోటు తగ్గించే పెట్టుబడులు, మినహాయింపులిచ్చే ఇతరత్రా పత్రాలు మొదలైన వాటి గురించి తెలియజేసేది ఈ కథనం. సెక్షన్ 80సీ పెట్టుబడులు ట్యాక్స్ ప్లానింగ్లో సెక్షన్ 80సీ పెట్టుబడులు కీలకపాత్ర పోషిస్తాయి. ఇది ఆదాయ పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించగలదు. కాబట్టి.. ఈ సెక్షన్ కింద పేర్కొనతగిన కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. ♦ ఎల్ఐసీ ప్రీమియం రసీదులు ♦ ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్స్ (మ్యూచువల్ ఫండ్)పెట్టుబడుల వివరాలు ♦ ప్రావిడెంట్ ఫండ్కి కట్టిన చందాలు ♦ రిటైర్మెంట్ ప్లాన్ల కోసం చెల్లించిన ప్రీమియంల రసీదులు ♦ పిల్లల స్కూలు ఫీజు చెల్లింపు రసీదులు ♦ గృహ రుణం తీసుకున్న పక్షంలో అసలు మొత్తం చెల్లించిన రసీదు ♦ ఎన్ ఎస్సీ బాండ్లేమైనా కొనిఉంటే ఆ పత్రాలు ♦ పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఆ తరహా డిపాజిట్ల వివరాలు ♦ పింఛను ఖాతా, నేషనల్ పెన్షన్ స్కీముకు కట్టిన చందాలు ఇతర సెక్షన్ల కింద పెట్టుబడులు 80సీ కాకుండా ఇతరత్రా సెక్షన్ల కింద కూడా కొన్నింటికి పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఈ కింద పేర్కొన్నవి ఆ జాబితాలోకి వస్తాయి. ♦ తనకు లభించే హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) కన్నా అధికంగా చెల్లించిన అద్దె పత్రాలు. ♦ ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలు ♦ స్వంతానికి, కుటుంబానికి, తల్లిదండ్రులకి తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలకు కట్టే ప్రీమియంలు ♦ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై రూ. 10,000కు మించని వడ్డీ వివరాలు ♦ గృహ రుణంపై చెల్లించే వడ్డీ రసీదు ♦ స్వంతానికి, కుటుంబానికి, తల్లిదండ్రులకు అయ్యే వైద్య చికిత్స వ్యయాలు ♦ సెక్షన్ 80జీ కింద ప్రధానమంత్రి సహాయ నిధి లాంటి వాటికి ఇచ్చే విరాళాలు ♦ రాజకీయ పార్టీలకి ఇచ్చే చందా రసీదులు ♦ పేటెంట్లు,రాయల్టీల రూపంలో లభించే ఆదాయ రసీదులు ♦ విద్యా రుణంపై వడ్డీ పత్రాలు ♦ క్యాపిటల్ గెయిన్స్ కి సంబంధించి స్టాక్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్లు పత్రాలు సిద్ధంగా ఉండాలి పన్ను మినహాయింపులనిచ్చే పెట్టుబడులు, వ్యయాలకు సంబంధించి ఈ జాబితాల్లో ఇచ్చినవే కాకుండా ఇతరత్రా కూడా చాలా పత్రాలే ఉన్నాయి. అయితే సింహభాగం ఇందులో పేర్కొన్నవే ఉంటాయి. జనవరి ఆఖర్లోగా.. మీ ఆఫీస్లో కోరిన ఫార్మాట్లో తక్షణం అందించేందుకు ఒరిజినల్స్ అన్నింటినీ దగ్గరపెట్టుకోవడం శ్రేయస్కరం. లేకపోతే మీ శాలరీ నుంచి మరింత ఎక్కువ టీడీఎస్ కట్ చేసేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్లీ దాన్ని రాబట్టుకునేందుకు క్లెయిమ్లు గట్రా దాఖలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుత ప్రక్రియ కాస్త కష్టంగా అనిపించినా అవసరమైన పత్రాలన్నీ తక్షణం అందజేసేందుకు సిద్ధంగా ఉంచుకుంటే.. తర్వాత బోలెడంత సమయం ఆదా అవుతుంది. శ్రమా తప్పుతుంది. అంతేకాకుండా ఒక కీలకమైన పనిని సకాలంలో పూర్తి చేశామన్న సంతృప్తీ మిగులుతుంది. కాబట్టి.. నెలాఖరులోగా అందజేయాల్సిన పత్రాల జాబితా తయారు చేసుకుని, రసీదులు.. ఒరిజినల్స్ అన్నీ సిద్ధం చేసుకోండి. ప్రతీసారి కొత్త సంవత్సరం వేళ చేసుకునే తీర్మానాలను నెల గడవకముందే బుట్టదాఖలా చేసినట్లు కాకుండా.. ఈసారి పట్టు తప్పకుండా ఆర్థిక ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలని గట్టిగా తీర్మానించుకోండి. ఆచరించి ప్రయోజనాలు పొందండి. -
ఆ స్థలం మాదే
అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి ప్రభుత్వ సేకరణకు మేము ఇవ్వలేదు వారు ఇచ్చిన అవార్డుతో సంబంధంలేదు నగరపాలక సంస్థ అడగలేదు.. పన్ను కట్టలేదు సర్వే నం.370తో కందుల కుటుంబానికి సంబంధంలేదు హోలీఏజెంల్స్ స్కూల్ స్థలం మాదే.. విలేకర్లతో సత్యవోలు శేషగిరిరావు డాక్యుమెంట్లు చూపించని వైనం ఆదెమ్మదిబ్బ స్థలంపై కొనసాగుతున్న సందిగ్ధత సాక్షి, రాజమహేంద్రవరం : ఆదెమ్మదిబ్బ స్థలం తమదేనని సత్యవోలు శేషగిరిరావు అనే వ్యక్తి అంటున్నారు. తమ తండ్రి సత్యవోలు పాపారావుకు నలుగురు అన్నదమ్ములమని, తాను రెండోవాడినని చెబుతున్నారు. సోమవారం స్థానిక ప్రెస్క్లబ్లో విలేకర్ల సమావేశంలో సత్యవోలు శేషగిరిరావు పేరుతో ఉన్న వ్యక్తి మాట్లాడారు. తాను సత్యవోలు శేషగిరిరావునంటూ 2008లో తీసుకున్న ఓటర్ గుర్తింపు కార్డును చూపారు. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగిగా విద్యుత్ శాఖలో పని చేసి పదవీ విరమణ చేశానని చెప్పారు. తన తండ్రి సత్యవోలు పాపారావు 2008లో మరణించారని, చట్టపరమైన హక్కులకు తమ వద్ద ఆధారాలున్నాయంటున్నారు. తమకు నగరంలో అనేక స్థలాలు ఉన్నాయని, వాటిలో చాలా వరకు ఎక్కడ ఉన్నాయో తెలియదని చెప్పారు. ఆదెమ్మదిబ్బ ప్రాంతంలో సర్వే నంబర్ 730లో తమ కుటుంబానికి 4.19 ఎకరాలు ఉందని చెప్పారు. తన తండ్రి సత్యవోలు పాపారావు, ఆయన తమ్ముడు లింగమూర్తి 2.23, 1.96 ఎకరాల చొప్పున పంచుకున్నామన్నారు. సత్యవోలు పాపారావు రెండో కుమారుడైన తాను ఈ స్థలం అభివృద్ధి చేయాలని, అక్కడ ఆక్రమణదారులను ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తమ స్థలం 3 ఎకరాల 30,222 చదరపు అడుగులు సేకరించినా అందుకు సంబంధించిన అవార్డు తమకు అందలేదన్నారు. 1984లో ప్రభుత్వం వద్ద నగదు లేక కోర్టులో చెల్లించలేదని చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి కోర్టులో ప్రభుత్వం అవార్డు చెల్లించినట్లు పత్రాలున్నా వాటితో మాకు సంబంధంలేదని చెబుతున్నారు. మా అనుమతి తీసుకోకుండానే ప్రభుత్వం స్థలం తీసుకుని అవార్డు ప్రకటించిందని చెప్పారు. మరోసారి ప్రభుత్వం తమ పినతండ్రికి చెందిన 1.96 ఎకరాలు సేకరించిన దాంట్లో తమది లేదన్నారు. ప్రభుత్వం అవార్డును ఉపసంహరించుకుందని చెబుతున్నారు. తమ స్థలానికి సంబంధించిన సరిహద్దులు, ఎవరిపేరుపై రిజిస్ట్రేష¯ŒS జరిందన్న వివరాలతో కూడిన డాక్యుమెంట్లు ఉన్నాయంటున్నారు. బ్రహ్మణలు ఉన్న స్థలం తమదేనని, తన పినతండ్రికి కుమారులకు సంబంధం లేదన్నారు. ఈ స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఇస్తామని చెప్పారు. ఈ స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, సబ్కలెక్టర్ విజయ్కృష్ణన్, తహసీల్దార్ కె.పోసయ్యSకు చూపించామంటున్నారు. పన్ను కట్టమని అడగలేదు.. నగరపాకల సంస్థ నోటీసులు ఇవ్వలేదు కాబట్టే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఖాళీ స్థలం పన్ను కట్టలేదని చెబుతున్నారు. ప్రభుత్వం అడగందే ఎలా చెల్లిస్తామని ప్రశ్నిం చారు. హోలీ ఏంజెల్స్ స్కూల్ ఉన్న స్థలం కూడా తమదేనని, నకిలీ సర్వే నంబర్తో దాన్ని ఆక్రమించారన్నారు. కందుల కుటుంబానికి సర్వే నంబర్ 730లో ఎలాంటి స్థలం లేదన్నారు. అక్కడ పేదలకు గుర్తింపుకార్డులు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంపై నగరపాకల సంస్థ కమిషనర్కు మూడు నెలల కిందట నోటీసులు ఇచ్చామని తెలిపారు. విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ, డీఈ, ఏఈలకు వినతిపత్రాలు ఇచ్చామని చెప్పారు. 370 సర్వే నంబర్లో ఇళ్లు కట్టుకుని సర్వే నంబర్ 725/3ఏ పేరుతో కొంతమంది రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్నారని, దీనిపై తాజాగా సర్వే చేయిస్తున్నామని చెప్పారు. కాగా, స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, అవి విలేకర్లందరికీ ఇస్తామని చెప్పిన సత్యవోలు శేషగిరిరా వు చివరకు అవి ఏమీ ఇవ్వకుండానే సమావేశం ముగించా రు. దీంతో ఆ స్థలంపై సందిగ్ధత కొనసాగుతోంది. -
ఆ స్థలం ఎవరిది?
ఆదెమ్మదిబ్బ స్థలంS వ్యవహారంలో మరో మెలిక ఆ స్థలం కందుల వీరరాఘవ స్వామిదంటూ ప్రచారం వారసుల వద్ద డాక్యుమెంట్లు ∙ కోర్టుల్లో నడుస్తున్న కేసులు సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశానని చెబుతున్న అక్రమణదారులు స్థలాన్ని పరిశీలించిన నగరపాలక సంస్థ అధికారులు సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నడిబొడ్డన రూ.100 కోట్ల విలువైన 3.54 ఎకరాల ఆదెమ్మ దిబ్బ స్థలం వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ స్థలం రాజ మహేంద్రవరం మాజీ మున్సిపల్ చైర్మ¯ŒS కందుల వీరరాఘవ స్వామిదని (కేవీఆర్ స్వామి) నగరంలో ప్రచారం జరుగుతోంది. ఆయన వారసులు ప్రస్తుతం దివా¯ŒS చెరువులో నివాసముంటున్నారని సమాచారం. కందుల వీర రాఘవ స్వామి రాజమహేంద్రవరం నగరం, చుట్టుపక్కల అనేక ఎకరాల పొలాలు, విలువైన స్థలాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆదెమ్మ దిబ్బ స్థలం. మద్రాసు ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా, రాజమహేంద్రవరం మాజీ మున్సిపల్ చైర్మ¯ŒSగా పని చేసిన కేవీఆర్ స్వామి గొప్ప దాత, సంఘ సంస్కర్తగా పేరుంది. మహాత్మాగాంధీతో లండ¯ŒSలో బారిస్టర్ చదివిన కేవీఆర్ స్వామి తన ఆస్తులలో చాలా భాగం ప్రభుత్వ అవసరాలకు, పేదలకు పంచిపెట్టారు. అందులో భాగంగా ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలోని 3.54 ఎకరాలను అప్పట్లో మున్సిపల్ పాఠశాల, ఇతర ప్రభుత్వ అవసరాలకు ఇచ్చినట్లుగా సమాచారం. ప్రభుత్వం ఆ స్థలంలోని కొంత భాగంలో వాంబే గృహాలు, నగరపాలక సంస్థ పాఠశాలను నిర్మించింది. మిగతా స్థలం ఖాళీగా ఉండడంతో అప్పట్లో ఇళ్లులేని పేదలు గుడిసెలు వేసుకుని నివíసిస్తున్నారు. ఓ వైపు కొంత మంది పక్కా భవనాలు నిర్మించుకున్నారు.. ప్రభుత్వ అవసరాలకు స్థలాన్ని వినియోగించకపోవడంతో ఆ స్థలాన్ని అప్పగించాలని కేవీఆర్ స్వామి ముని మనవడు, రాజానగరం మాజీ జెడ్పీటీసీ కందుల పద్మావతి తనయుడు కందుల బాబూరాయుడు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఐదేళ్ల క్రితం రాజమహేంద్రవరం సబ్కలెక్టర్ కార్యాలయం అధికారులు చర్యలు కూడా చేపట్టారని తెలిసింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ వ్యవహారం మరుగున పడింది. సత్యవోలు శేషగిరిరావు ఎవరు? రాజమహేంద్రవరం నగరంలో అనేక విలువైన స్థలాలు సత్యవోలు పాపారావుకు చెందినవిగా ప్రచారం జరుగుతోంది. ఆదెమ్మ దిబ్బ ప్రాంతానికి 40 ఏళ్ల క్రితం వరకు అప్పుడప్పడు పాపారావు వచ్చినట్లుగా అక్కడ పేదలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ స్థలం సత్యవోలు శేషగిరిరావు వద్ద తాను కొనుగోలు చేసినట్లు కొలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు స్థల పరిశీలనకు వచ్చిన రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులకు చెబుతున్నారు. ఎప్పటి నుంచో ఉంటున్న పేదలపై దౌర్జన్యం చేస్తున్న కబ్జాదారుల అగడాలను ‘సాక్షి’ గత రెండు రోజులుగా వెలుగులోకి తేవడంతో ఇటు రెవెన్యూ, అటు కార్పొరేషన్ అధికారుల్లో కదలిక వచ్చింది. ఓ వైపు అధికారులు పరిశీలిస్తున్నా కబ్జాదారులు తమ పని కానిచ్చేస్తుండడం గమనార్హం. మంగళవారం కూడా 36వ డివిజ¯ŒS పరిధిలోని ఇళ్లను యథేచ్ఛగా తొలగించారు. స్థలాన్ని పరిశీలించిన నగరపాలక సంస్థ అధికారులు... వివాదాస్పద ఆదెమ్మ దిబ్బ స్థలాన్ని నగరపాలక సంస్థ రెవెన్యూ, అర్బ¯ŒS రెవెన్యూ అధికారులు మంగళవారం పరిశీలించారు. సోమవారం స్థలాన్ని పరిశీలించిన అర్బ¯ŒS తహసీల్దార్ పోశయ్య ఈ స్థల సర్వే నంబర్ రెవెన్యూ పరిధిలోకి రాదని, టౌ¯ŒS సర్వే నంబర్ పరిధిలోకి వస్తుందని చెప్పడంతో నగర పాలక సంస్థ అధికారులు, రెవెన్యూ అధికారుల బృందం అక్కడకి వచ్చింది. జరుగుతున్న పనులను పరిశీలించిన అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లన్నారు. రికార్డులు పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామని సర్వేయర్ ప్రభాకర్రావు తెలిపారు. బృందంలో టీపీఎస్ చంద్రశేఖర్, అర్బ¯ŒS సర్వేయర్ లక్ష్మి, వీఆర్వో వాసు తదితరులున్నారు. వాంబే గృహాలు కట్టిస్తామని స్లిప్పులు ఆదెమ్మదిబ్బ స్థలంలో10 బ్లాకుల్లో వాంబే గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లబ్థిదారులను ఎంపిక చేసింది. దశలవారీగా ఏ నుంచి హెచ్ వరకు తొమ్మిది బ్లాకులను నిర్మించింది. తమకు కేటాయించిన గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడే గుడిసెలు వేసుకుని ఉంటున్న పేదలు అందులో చేరారు. ప్రస్తుతం ’ఐ’ బ్లాకు నిర్మించాల్సి ఉంది. ఐ బ్లాక్లో గృహాలు పొందని వారికి అధికారుల సంతకాలతో కూడిన స్లిప్పులు ఇచ్చారు. ప్రస్తుతం అవి వారి దగ్గర భద్రంగా ఉన్నాయి. తమకు ఇళ్లు ఇస్తామని స్లిప్పులు కూడా ఇచ్చారని, అవి వచ్చే వరకు ఇక్కడే ఉంటున్నామని నీలం రమణమ్మ తెలిపింది. ప్రస్తుతం గుడిసెలు ఖాళీ చేయాలంటున్నారని ఏం చేయాలో తెలియడంలేదని వాపోతోంది. -
అడవి బిడ్డల ఎదురు చూపులు!
పట్టాలు పంపిణీ చేయాల్సిన మండలాలు: 8 ఎకరాలు: 8,871 కుటుంబాలు: 3,436 ►అటవీసాగు హక్కు పత్రాల పంపిణీకి గ్రహణం ► రెండో విడత పంపిణీ జరగని వైనం ►ఎదురు చూస్తున్న 3,500గిరిజన కుటుంబాలు అడవి బిడ్డలు అటవీసాగు హక్కు పత్రాల (పట్టాలు) కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. 2006వ సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కు చట్టాన్ని తెచ్చింది. 2005 డిసెంబర్ 13వ తేదీకి ముందు సాగులో ఉన్నవారికి పట్టాలివ్వాలని అధికారులు నిర్ణరుుంచారు. దీంతో జిల్లాలోని కొంతమంది గిరిజనులకు 2008లో హక్కు పత్రాలను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. రెండో విడత పంపిణీ గురించి కనీసం పట్టించుకోకపోవడంతో వేలాది గిరిజన కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారుు. సీతంపేట: గిరిజనులకు పోడు వ్యవసాయమే జీవనాధారం. అరుుతే అటవీ అధికారులు ఒక్కోసారి వారి పనులకు అడ్డుతగులుతుండేవారు. దీంతో సాగు హక్కు పట్టాలివ్వాలని ఉద్యమించడంతో దిగివచ్చిన పాలకులు అటవీ హక్కు చట్టాన్ని చేసింది. అరుుతే ఈ చట్టానికి జిల్లా అధికారులు తూట్లు పొడిచారనే విమర్శలు వస్తున్నారుు. కేవలం 2008లో కొద్దిమంది గిరిజనులకు హక్కు పత్రాలను ఇచ్చి..మిగిలిన వారిని పట్టించుకోవడం మానేశారు. రెండో విడతలోనైనా అందుతాయని ఎదురు చూస్తే నిరాశే మిగిలింది. దీంతో వేలాది గిరిజన కుటుంబాలు ఆందోళన చెందుతున్నారుు. పక్క జిల్లాల్లో పంపిణీ విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, పార్వతీపురం పరిధిలోని గిరిజనులకు సాగు హక్కు పత్రాలను అక్కడి అధికారులు రెండోవిడతలో పంపిణీ చేశారు. ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. ఈ విషయం తెలిసి ఎప్పుడు పంపిణీ జరుగుతుందోనని గిరిపుత్రులు ఎదురు చూస్తున్నారు. ప్రతీ సోమవారం సీతంపేట ఐటీడీఏలో జరిగే గిరిజన దర్బార్కు వచ్చి సాగు హక్కు పట్టాలు ఇవ్వడం లేదంటూ అధికారులకు వినతులు అందిస్తూనే ఉన్నారు. అధికారుల సర్వే ప్రకారం 3,436 కుటుంబాలకు పంపిణీ చేయాల్సి ఉంది. వీరంతా భామిని, కొత్తూరు, పాలకొండ, పాతపట్నం, హిరమండలం, మెళియాపుట్టి, మందస, పాతపట్నం మండలాల్లో ఉన్నారు. గత ఏడాది గిరిజనోత్సవాలకు వచ్చిన గిరిజనశాఖ మంత్రి చేతుల మీదుగా కొంతమంది పట్టాలు ఇవ్వడానికి ఐటీడీఏ యంత్రాం గం ఏర్పాట్లు చేసినప్పటికీ అటవీ శాఖ అధికారులతో సమన్వయం లేకపోవడంతో అప్పట్లో సాధ్యం కాలేదు. 8 వేల ఎకరాలపైనే... పాలకొండ, టెక్కలి రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 3,436 గిరిజన కుటుంబాలకు సంబంధించి 8,881.74 ఎకరాల్లో పట్టాలు ఇవ్వడానికి నిర్ణరుుంచారు. ఈ మేరకు గతంలోనే గ్రామస్థారుులో అటవీహక్కుల కమిటీ, డివిజన్, జిల్లా స్థారుు కమిటీలు తీర్మానం సైతం చేశారుు. కమిటీల తీర్మానం చేసినప్పటికీ అటవీశాఖ మాత్రం అంగీకరించలేదు. దీంతో ఈ ప్రక్రియ నిలిచిపోరుుంది. పరిస్థితి ఇలా.. పాలకొండ డివిజన్లోని సీతంపేట మండలంలో 1420 కుటుంబాలకు సంబంధించి 4164.39 ఎకరాలకు, భామినిలో 463 కుటుంబాలకు గాను 1501.98, కొత్తూరులో 145 కుటుంబాలకు 322.86, పాలకొండలో 19 కుటుంబాలకు 56.8, పాతపట్నంలో 332 కుటుంబాలకు 465.69, వీరఘట్టంలో 162 కుటుంబాలకు 596.3, హిరమండలంలో 202 కుటుంబాలకు గాను 659.64, మెళియాపుట్టిలో 580 కుటుంబాలకు 896.18, మందసలో 113 కుటుంబాలకు 218.72 ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రయోజనం.. గిరిజనులకు సాగుహక్కు పత్రాలు ఇస్తే భూమిపై పూర్తి హక్కులు కలుగుతారుు. అలాగే పంట రుణాలను బ్యాంకర్లు ఇస్తారు. అటవీ ఫలసాయాలపై పూర్తి హక్కులు గిరిజనులకు ఉంటారుు. పట్టాల పంపిణీ చాలా ముఖ్యం గిరిజనులకు అటవీ సాగు హక్కు పట్టాల పంపిణీ చాలా ముఖ్యమైంది. పాడేరులో చాలా ఎక్కువ పట్టాలు పంపిణీ చేశాం. ఇక్కడ ఎంతమందికి పట్టాలు ఇవ్వాలి, ఎందుకు పంపిణీలో జాప్యం జరిగిందనే విషయమై పరిశీలించాల్సి ఉంది. జిల్లా కలెక్టర్తో చర్చించి పంపిణీకి చర్యలు తీసుకుంటాం.- ఎల్.శివశంకర్, ఐటీడీఏ పీవో ఆధారాలు చూపకపోవడం వల్లే.. గిరిజనులు తగిన ఆధారాలు చూపిస్తే పట్టాలు ఇస్తాం. అరుుతే ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నామనే ఆధారాలేవీ మాకు చూపించలేదు. పోడు పట్టాలకు సంబంధించిన గిరిజనులు సరైన ఆధారాలు చూపించకపోవడంతో సాగుహక్కు పట్టాల పంపిణీలో జాప్యం జరుగుతుంది. - జి.జగదీశ్వరరావు, ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రభుత్వ వైఫల్యమే గిరిజనులకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు గిరిజనులకు పట్టాలు పంపిణీ జరిగింది. ఇప్పుడు పంపిణీకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు తప్పితే పంపిణీకి మాత్రం చర్యల్లేవు. - విశ్వాసరారుు కళావతి, పాలకొండ ఎమ్మెల్యే లిఖిత పూర్వకంగా ఇవ్వాలి గిరిజనులకు సాగు హక్కు పత్రాలు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదో లిఖితపూర్వకంగా చెప్పాలని అడుగుతున్నాం. దీనిలో అటవీశాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. పట్టాలు ఇవ్వాలని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా గిరిజనులు అన్యాయానికి గురౌతున్నారు. - బి.సంజీవరావు,ఎస్టీ సబ్ప్లాన్ నిధుల సాధన సమితి అధ్యక్షుడు -
తప్పుడు పత్రాలతో రుణం
సెంటు వ్యవసాయ భూమి లేకున్నా రెండెకరాలు కాగితాల్లో కట్టబెట్టి రెవెన్యూ అధికారులు సదరు అధికార పార్టీ నేతపై అభిమానాన్ని చాటుకున్నారు. తొండంగి మండల టీడీపీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి పార్టీ నేతల అండదండలతో తప్పుడు పాట్టాదారు పాసుపుస్తకంతో ఆ¯ŒSలైన్లో రెవెన్యూ వ¯ŒSబీ అడంగళ్ పత్రాలు సృష్టించి వాటితో సొసైటీ ద్వారా రూ.3.60 లక్షల రుణం పొందారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో గుట్టుచప్పుడు కాకుండా కప్పిపుచ్చేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. – తొండంగి ఇదీ సంగతి తొండంగికి చెందిన మురాలశెట్టి సత్యనారాయణ అలియాస్(సత్తిబాబు)కు తొండంగి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 809లో రెండు ఎకరాలు ఉన్నట్టు 309187 (పాసుపుస్తకం నంబరు) ఖాతా నంబర్ 3239 పట్టాదారు పాసుపుస్తకం సృష్టించారు. దీని ఆధారంగా గ్రామ రెవెన్యూ అధికారి వ¯ŒSబీ, అండంగళ్ పత్రాలను కూడా మంజూరు చేసి తహసీల్దార్కు ప్రతిపాదించగా మంజూరుకావడంతో కంప్యూటర్ సిబ్బంది ఆ¯ŒSలైన్లో ఎక్కించారు. తహసీల్దార్ సంతకాలతో ఈ పత్రాలను అన్నవరం మీసేవా ద్వారా 2015లో నవంబర్ 14న ఆ¯ŒSలై¯ŒS ద్వారా 97630621(సర్టిఫికెట్ నంబర్), వ¯ŒSబీ నమూన, 97630653(సర్టిఫికెట్ నంబర్) అడంగళ్ ధ్రువపత్రాలు పొందిన సదరు టీడీపీ నేత తొండంగి సొసైటీలో అధికారులను బరుడి కొట్టించి అదే ఏడాది డిసెంబర్లో తొండంగి పీఏసీఎస్లో రూ.3.60 లక్షలు రుణం పొందాడు. మొదటి దఫాలో రూ.1.60 లక్షలు, రెండో దఫాలో రూ.రెండు లక్షలు భూమిని అభివృద్ధి చేసుకోవడం కోసం ఎల్టీలోనూ పొందాడు. ఈ నేపథ్యంలో రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేవని తొండంగి గ్రామస్తులు కొందరు సొసైటీ అధికారులకు తెలపడంతో రికార్డులు తనిఖీ చేసుకున్నారు. అయితే అప్పటికే ఈ సంగతి రెవెన్యూ అధికారులకు తెలియడంతో ఆ¯ŒSలైన్లో సదరు నేత రికార్డులు తొలగించారు. సొసైటీ అధికారుల తనిఖీలో ఆ¯ŒSలైన్లో రికార్డులు లేకపోవడంతో అవాక్కయ్యారు. సదరు వ్యక్తి నుంచి పొందిన రుణాన్ని తిరిగి కట్టించి, అధికారులను తప్పుదారిపట్టించిన సదరు అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడతాయని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో తొండంగి రెవెన్యూ కార్యాలయంలో నకిలీ పాసుపుస్తకాలు వ్యవహారం జరిగినప్పుడు ప్రస్తుత అధికార పార్టీ నేతలు, అప్పటి ప్రతిపక్ష నేతలుగా ఉండి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కానీ ఇప్పుడు అదే నాయకులు అధికార మదంతో తప్పుడు పాసుపుస్తకాలతో పత్రాలు సృష్టించి రుణం పొందడం చర్చనీయాంశమైంది. క్రిమినల్ చర్యలు తప్పవు రెవెన్యూ రికార్డుల ఆధారంగానే సదరు వ్యక్తికి రుణమిచ్చాం. రికార్డులు సరిౖయెనవి కాదని నిర్ధారణ అయితే అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకుని రుణం సొమ్ము కట్టిస్తాం. – వెల్నాటి ఏసుబాబు, సీఈవో, తొండంగి పీఏసీఎస్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి తప్పుడు ధ్రువపత్రాలతో రుణాలు పొందడానికి కారకులపైనా, సహకరించిన రెవెన్యూ అధికారులపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – వనపర్తి సూర్యనాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు, తొండంగి పీఏసీఎస్ -
ఆపరేషన్ బ్లూ స్టార్ పై రాజుకున్న రగడ
లండన్: ఆపరేషన్ బ్లూ స్టార్ లో బ్రిటీష్ ఆర్మీ భాగస్వామ్యంపై బ్రిటన్ రాజకీయాలు వేడుక్కుతున్నాయి. వచ్చే ఆదివారం మూడు రోజుల పర్యటనకు బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే భారత్ కు రానుండటంతో బ్లూ స్టార్ మచ్చను పర్యటనకు ముందే తొలగించుకోవాలని బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ డిమాండ్ చేస్తోంది. బంగారు ఆలయంపై మిలటరీ దళాలు చేసిన ఆపరేషన్ లో బ్రిటీష్ సైన్యం పాత్ర కూడా ఉందని బ్రిటీష్ సిక్కు కమ్యూనిటీ ఆరోపించింది. ఈ విషయంపై స్పందించిన లేబర్ పార్టీ డిప్యూటీ లీడర్ టామ్ వాట్సన్ బ్రిటీష్ సిక్కులకు నిజాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్ లో బ్రిటీష్ సైన్యం పాత్రపై యూకే విదేశీ కార్యాలయంలో ఉన్న పత్రాలు మాయమయ్యాయని కూడా అక్కడి బ్రిటీష్ సిక్కు మతస్తులు ఆరోపించారు. ఆపరేషన్ బ్లూ స్టార్ లో ఇండియాకు మార్గరెట్ థాట్చర్ పాలకవర్గం సహకరించిందని వాట్సన్ అన్నారు. బ్రిటీష్ ఆర్మీకు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీసుకు చెందిన సోల్జర్స్ ఆపరేషన్ బ్లూస్టార్ లో పాల్గొన్నారు. కాగా ఇందుకు సంబంధించిన పత్రాలను విదేశీ కార్యాలయం నుంచి దురుద్దేశంతోనే తొలగించారని ఆరోపించారు. వాట్సన్ ఆరోపణలపై స్పందించిన విదేశీ కార్యాలయం పత్రాలను తొలగించడంలో ఎలాంటి దురుద్దేశం లేదని వ్యాఖ్యానించింది. ప్రతిగా పత్రాలు ఉంటే కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చని బదులిచ్చింది. దీంతో మారణహోమంపై బ్రిటిష్ రాజకీయాలు వేడి పుట్టింది. డేవిడ్ కామెరాన్ నాయకత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం కూడా ఆపరేషన్ బ్లూ స్టార్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడంలో విఫలం చెందింది. ఈ నరమేథంపై అప్పటి బ్రిటన్ విదేశాంగ శాఖ సెక్రటరీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని.. ఆ విషయం బయటకు పొక్కకుండా బ్లూ స్టార్ కు సంబంధించిన పత్రాలను బ్రిటన్ మంత్రులు తొలగించారని అంటున్నారు. -
జియో సిమ్ కావాలంటే ఇలా చేయండి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 4జీ సేవలు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వాయిస్ కాలింగ్ను పూర్తిగా ఉచితంగా అందించడంతోపాటు అత్యంత చౌక రేట్లకు డేటా ప్లాన్లను ప్రకటించడంతో జియో సిమ్ కార్డుల కోసం వినియోగదారులు పోటీ పడుతున్నారు. ప్రివ్యూ సేవల్లో భాగంగా డిసెంబర్ 31 వరకూ జియో వాయిస్, డేటా, యాప్స్ ఇతరత్రా సేవలన్నీ పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. దీంతో రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ ముందు జనం బారులు తీరి కన్పిస్తున్నారు. జియో సిమ్ కార్డు కావాలంటే ఈ డాక్యుమెంట్లు కావాలి. జియో సిమ్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, మల్టీ బ్రాండ్ అవుట్లెట్లు, మొబైల్ ఫోన్ షాప్లలో లభిస్తాయి. అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ తీసుకెళ్లాలి ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ పట్టుకెళ్లాలి ఒకవేళ ఆధార్ కార్డు తీసుకున్న రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో దరఖాస్తు చేస్తే యాక్టివేషన్ కు ఎక్కువ సమయం పడుతుంది రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు తప్పనిసరి మై జియో యాప్ నుంచి ఆఫర్ కోడ్ ను తీసుకెళ్లడం మర్చిపోవద్దు జియో పోస్ట్ పెయిడ్ సిమ్ కావాలంటే ప్రస్తుతం వాడుతున్న మొబైల్ బిల్లు సమర్పించాలి అయితే పోస్ట్ పెయిడ్ బిల్లు మూడు నెలలలోపుది అయ్యుండాలి. బిల్లుపై వినియోగదారుడి అడ్రస్ స్పష్టంగా కనబడేట్టు ఉండాలి -
విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేత
కోదాడఅర్బన్: కోదాడ పట్టణానికి చెందిన రిషి డ్యాన్స్ అకాడమీకి చెందిన పలువురు విద్యార్థులు గత నెల 29న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో పలు విభాగాల్లో నృత్యాలను ప్రదర్శించారు. రిషి డ్యాన్స్ అకాడమీ డైరక్టర్ నాగేశ్వరరావును ప్రభుత్వం కళాసరస్వతి బిరుదుతో సన్మానించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలొ వారు నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు అందజేసిన ప్రశంసాపత్రాలను శుక్రవారం కోదాడ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులి అనిత అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు నృత్యరంగంలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమలో వైస్ చైర్మన్ తెప్పని శ్రీనివాస్, నాయకులు కంభంపాటి శ్రీను, వేలాద్రి, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధన పత్రాలకు ఆహ్వానం
ఒంగోలు కల్చరల్: బహుజన రచయితల వేదిక ఆధ్వర్యంలో స్థానిక సీవీఎన్ రీడింగ్ రూంలో ఈనెల 24వ తేదీన ‘తెలుగు ముస్లిం అస్తిత్వ సాహిత్య’ రాష్ర్టస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు కన్వీనర్ నబి కె ఖాన్, సమన్వయకర్త డాక్టర్ నూకతోటి రవికుమార్ శుక్రవారం తెలిపారు. పరిశోధకుల నుంచి పరిశోధన వ్యాసాలను కూడా ఆహ్వానిస్తున్నామన్నారు. సదస్సులో పలు పుస్తకాల ఆవిష్కరణతోపాటు సాహిత్య ఉపన్యాసాలుకూడా జరుగుతాయని సాహిత్యాభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వివరాలకు 98481 87416 నెంబరును సంప్రదించాలని తెలిపారు. -
ఒప్పంద పత్రాలు మాయం!
మిర్యాలగూడ : మిర్యాలగూడలోని ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ లీజు దారులతో అధికారులు కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలు మాయమయ్యూయి. అందువల్లే గడువు ముగి సినా లీజుదారుల షాపులను ఖాళీ చేయించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్లతరబడి అద్దె పెంచకపోవడంతో మున్సిపల్ ఆదాయూనికి గండిపడుతోంది. పదేళ్ల నుంచి అదే కిరాయి... ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్లో 90 దుకాణాలు ఉన్నాయి. మున్సిపాలిటీ స్టోర్ రూంల కోసం రెండు దుకాణాలు ఉండగా...అద్దెకు ఇచ్చారు. 2001లో ఆరు షాపులు, 2002లో 60 షాపులు, 2004లో 22 షాపులకు ఓపెన్ టెండర్లు నిర్వహించి అద్దె నిర్ణయించారు. ఒక్కొక్క షాపునకు రూ. 2,400 నుంచి రూ. 4,000గా అద్దె నిర్ణయించారు. నాటి నుంచి ఇప్పటివరకూ అదే అద్దె వసూలు చేస్తుండడంతో మున్సిపాలిటీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. ఏళ్ల తరబడిగా మున్సిపల్ షాపుల్లో వ్యాపారాలు సాగిస్తున్నా.. అద్దె మాత్రం పెంచడం లేదు. మాయం కావడం వల్లేనా.. మున్సిపల్ కాంప్లెక్స్లో షాపుల లీజుల కోసం ఒప్పందం కుదుర్చుకున్న మున్సిపాలిటీ వారు పత్రాలను భద్రపరచడంలో విఫలమైనట్లు సమాచారం. మొదట్లో టెండర్ ద్వారా షాపులను అద్దెకు తీసుకున్న లీజు దారులు ఐదేళ్లు, మూడేళ్ల వరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత గడువు ముగిసినా.. అద్దె పెంచలేదు. ఈ క్రమంలో లీజుదారులు రీ టెండర్ నిర్వహించకుండా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో మున్సిపాలిటీ వారు ఏమీ చేయలేక నామమాత్రపు అద్దె వసూలు చేస్తున్నారు. అయితే గడువు ముగిసిన వారిని కూడా ఖాళీ చేయించక పోవడం, రీ టెండర్ నిర్వహించక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీజు దారులతో ఒప్పంద పత్రాలు మాయం కావడం వల్లే ఖాళీ చేయించలేకపోతున్నారని పలువురు అనుమానిన్నారు. నోటీసులతోనే సరి ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్లో లీజు దారులు ఉండకుండా సబ్ లీజులకు ఇచ్చి డబ్బులు దండుకుంటున్నారని పట్టణానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త లోకాయుక్తకు 2013లో ఫిర్యాదు చేశారు. లోకాయుక్త ఆదేశాల మేరకు అప్పటి మున్సిపల్ కమిషనర్ రాంబాబు విచారణ జరిపి 60 మంది దుకాణదారులకు ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాగా లీజు దారులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే తొలగింపుపై మున్సిపల్ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో లీజుదారులు దుకాణాలను ఇప్పటివరకూ ఖాళీ చేయలేదు. మూడేళ్ల పాటు దుకాణాలు లీజుకు తీసుకున్న వారి గడువు ముగిసినా.. ఖాళీ చేయడం లేదు. సబ్ లీజులకు ఇచ్చి.. మున్సిపల్ కాంప్లెక్స్లో షాపులను లీజుకు తీసుకున్న రాజకీయ నాయకులు, ఇతరులు సబ్ లీజులకు ఇచ్చారు. ఈ విధంగా వారు వేలాది రూపాయల ఆదాయం పొందుతున్నారు. నామమాత్రపు అద్దెతో లీజుకు తీసుకున్న వ్యాపారులు ఒక్కొక్క షాపునకు రూ. 6 వేల నుంచి రూ. 10 వేల వరకు సబ్ లీజుకు ఇచ్చి అద్దె వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా.. ముందస్తుగా ఒక్కో షాపు నుంచి లక్ష రూపాయల అడ్వాన్స్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓపెన్ టెండర్లు నిర్వహిస్తే మున్సిపాలిటీకి ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది. అఖిలపక్షంతో సాధ్యమయ్యేనా.. గడువు ముగిసినా.. కోర్టు స్టేతో కాంప్లెక్స్లో యథావిధిగా వ్యాపారాలు సాగిస్తున్న వారిని ఖాళీ చేయించడానికి అఖిలపక్షం ఏర్పాటైంది. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్తోపాటు ఒక్కొక్క పార్టీకి ఒకరి చొప్పున నలుగురు కౌన్సిలర్లను మొత్తం ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యుల సూచన మేరకు కాంప్లెక్స్లో గడువు ముగిసిన లీజు షాపులను ఖాళీ చేయించి రీ టెండర్ నిర్వహించాలని భావిస్తున్నారు. కానీ.. కోర్డు వివాదంలో ఉండడం వల్ల సాధ్యాసాధ్యాలపై చర్చలు కొనసాగుతున్నాయి. కాంప్లెక్స్లోని షాపులు కబ్జాకు గురి కాకుండా అఖిలపక్ష కమిటీకి సాధ్యమవుతుందా.. లేదా.. వేచి చూడాలి. -
దస్తావేజు నకళ్లు కనిపిస్తున్నాయి!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్(ఐజీఆర్ఎస్)లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు గురువారం మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. సర్కారీ పెద్దలు బినామీ పేర్లతో సాగించిన ‘రాజధాని దురాక్రమణ’ను ‘సాక్షి’ బుధవారం సాక్ష్యాధారాలతోసహా బట్టబయలు చేయడం, ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం తక్షణమే స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ అధికారిక వెబ్సైట్ ఐజీఆర్ఎస్లో డాక్యుమెంట్లు(దస్తావేజు నకళ్లు) కనిపించకుండా బ్లాక్ చేయించడం తెలిసిందే. తన డెరైక్షన్లో తన కుమారుడు లోకేశ్, మంత్రివర్గ సహచరులు సూత్రధారులుగా వారి బినామీలు పాత్రధారులుగా సాగించిన అతి భారీ కుంభకోణానికి సమాధానం చెప్పుకోలేకపోయిన ఏపీ సీఎం చంద్రబాబు డాక్యుమెంట్లు ఎలా బయటికొచ్చాయంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో దస్తావేజు నకళ్లు కనిపించకుండా అధికారులు బ్లాక్ చేశారు. దీంతో బుధవారం ఉదయం 11 గంటల నుంచి ఈ వెబ్సైట్లో ఏ డాక్యుమెంటు నంబరు ఎంటర్ చేసినా ‘మీరు కోరిన దస్తావేజు నకళ్లు అందుబాటులో లేవు.. తర్వాత ప్రయత్నించండి...’ అనే సమాచారమే ప్రత్యక్షమైంది. ఈ వైనాన్ని ‘సర్కారు వెబ్సైట్లో డాక్యుమెంట్లు ఢమాల్’ శీర్షికతో సాక్షి వెల్లడించింది. ఈ నేపథ్యంలో తీవ్ర తర్జనభర్జనలు పడిన అధికారులు నష్ట నివారణ చర్యల్లో భాగంగా వెబ్సైట్లో దస్తావేజు నకళ్లు కనిపించేలా సర్వీసును గురువారం పునరుద్ధరించారు. పునరుద్ధరణ వెనుక పెద్ద కథ.. వెబ్సైట్లో డాక్యుమెంట్లను బ్లాక్లో పెట్టడం.. తదుపరి పునరుద్ధరించడం వెనుక పెద్దకథే నడిచింది. దీనిపై కొందరు అధికారులు న్యాయ నిపుణులతోనూ మాట్లాడారు. ‘వెబ్సైట్లో డాక్యుమెంట్లు కనపడటంవల్ల కలిగే నష్టం పెద్దగా ఉండదు. పెపైచ్చు బినామీ పేర్లతో లావాదేవీలైనందున ఇబ్బందే లేదు. అలాగాక వెబ్సైట్ను బ్లాక్ చేయడంవల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. పబ్లిక్ డాక్యుమెంట్లను బ్లాక్ చేశారనే అపప్రద ప్రభుత్వంపై పడుతుంది. పెపైచ్చు ఎవరైనా కోర్టుకెళ్లినా తర్వాత మళ్లీ దస్తావేజు నకళ్లను వెబ్సైట్లో అందుబాటులోకి తేవాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టే ప్రయత్నం చేసిందనే చెడ్డపేరు వస్తుంది. కాబట్టి ఏదో పొరపాటున తప్పు చేశాం. ఒక్కరోజే బ్లాక్చేసినందున సాంకేతిక లోపమని చెప్పి తప్పును కప్పిపుచ్చుకోవచ్చు’ అని న్యాయకోవిదులు సలహాఇచ్చారు. దీంతో అధికారులు ఐజీఆర్ఎస్లో దస్తావేజు నకళ్ల వెబ్సైట్ను పునరుద్ధరించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. -
నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయనున్న మోదీ
న్యూ ఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన రహస్య ఫైళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిర్గతం చేయనున్నారు. జనవరి 23న బోస్ జయంతి సందర్భంగా ప్రధాని ఈ రహాస్య ఫైళ్లను వెల్లడించనున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ గురువారం ప్రకటించారు. నేతాజీ కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది నేతల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. గత అక్టోబర్లో నేతాజీ కుటుంబ సభ్యులను కలిసిన సందర్భంగా నేతాజీ రహస్య ఫైళ్లను వెల్లడిస్తామని ప్రధాని వారికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మమతా బెనర్జి నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల నేతాజీకి సంబంధించిన 64 రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. అయితే ప్రధాని బహిర్గతం చేయనున్న సమాచారంలో నేతాజీ అదృష్యానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
తొలిసారి ఇల్లు కొంటున్నారా?
తొలిసారి!! దీనికుండే ప్రాధాన్యం మామూలుది కాదు. ఈ ‘తొలిసారి’... అనేది దేనికైనా వర్తిస్తుంది. ఆఖరికి అది ఇల్లు కొనేవారి విషయంలోనైనా!! ఎందుకంటే ఒక పని తొలిసారి చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోసారి చేయాలనుకుంటే అవన్నీ మనకు తెలిసిపోతాయి కాబట్టి అంత భయం ఉండదు. ఇంటి విషయంలో కూడా అంతే. మన అవసరాలకు అనువైన ఇంటినే కొనుగోలు చేయాలి. అలాగే కొనుగోలు చేసే ఇంటికి సంబంధించిన అంశాలను సమగ్రంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇల్లు కొనటమనేది ఖరీదైన విషయం. ఒకసారి ఇల్లు కొన్నాక దాన్ని మళ్లీ విక్రయించడం, వేరే ఇంటికి మారడం చాలా కష్టసాధ్యం. అందుకే ఈ అంశాలను ఒకసారి గమనించండి. అవసరాలకు అనువుగా... ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఎందుకంటే ఇల్లు కట్టడం, కొనడం రెండూ చాలా కష్టమైన పనులే. అందుకే తొలిసారి ఇంటిని కొనేటపుడు... ఏ రకమైన ప్రాపర్టీని కొనాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి. అంటే మీరు కొన బోయే ఇల్లు మీ కుటుంబానికి అనువుగా ఉంటుందా! లేదా? ఏ బడ్జెట్లో, ఏ రకంగా ఇంటిని కొనాలని భావిస్తున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలి. వీటితోపాటు కొనాలని భావించే ఇంటిని ఒకటికి రెండు సార్లు చూడండి. పైపు లైన్స్, డ్రైనేజ్, వెంటిలేషన్ తదితరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. సరైన ప్రదేశమూ ముఖ్యమే మీ అవసరాలు తెలుసుకున్నాక వాటికి అనువైన ప్రదేశాన్ని గుర్తించి, అక్కడ ఇంటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మీరు దీర్ఘకాలం నివాసం ఉండటానికి ఇంటిని కొనుగోలు చేస్తున్నారా? లే క ఇతరత్రా అవసరాలకు ప్రాపర్టీని కొంటున్నారా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటిని కొనుగోలు చేసే ప్రదేశానికి హస్పిటల్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్ దగ్గరలో ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. అలాగే ఇల్లు మీ ఆఫీసుకు ఎంత దూరంలో ఉంటుందో పరిగణనలోకి తీసుకోవాలి. పేరున్న రియల్టర్లను సంప్రదించండి రియల్టర్ అవసరం లేకుండా డెరైక్ట్గా బిల్డర్ దగ్గరి నుంచే ఇంటిని కొనుగోలు చేస్తే, కమీషన్ చెల్లించే అవసరం ఉండదు కాబట్టి కాస్త డబ్బులు ఆదా చేయొచ్చు. అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్పై సరైన అవగాహన లేకపోతే మాత్రం డెరైక్ట్గా కాకుండా రియల్టర్ ద్వారా ఇంటిని కొనుగోలు చేయడమే ఉత్తమం. తొలిసారి ఇంటిని కొనే సమయంలో రియల్టర్ సాయం తీసుకోవడమే మంచిది. అలాగే రియల్టీ రంగ నిపుణుల సలహాలను కూడా తీసుకోవచ్చు. బడ్జెట్పై కన్నేయండి ఇంటిని కొనాలని భావించినప్పుడు దానికి ఎంత బడ్జెట్ కేటాయించారనేది చూసుకోవాలి. మీ బడ్జెట్ పరిమితిలోపే మంచి ఇంటిని వెతుక్కోవడం మంచిది. ఒకసారి ఇంటిని కొనాలి అని నిర్ణయం తీసుకున్నాక... అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. ఆర్థిక సమస్యలు లేవని భావించినపుడు మాత్రమే ఇంటిని కొనాలి అనే ఆలోచన చేయడం మంచిది. డాక్యుమెంట్లను రెడీగా ఉంచుకోండి ఇంటి ని కొనడానికి, ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలను పొందడానికి అవసరమైన పత్రాలను మీ వద్ద రెడీగా ఉంచుకోండి. ఈ విధంగా చేయడం వల్ల డాక్యుమెంట్ల సమర్పణలో ఎలాంటి సమయం వృథా కాదు. ఇంటి కొనుగోలుతో సంబంధం ఉన్న అన్ని లీగల్ అంశాలపై జాగ్రత్త వహించండి. మంచి ఫైనాన్స్ కంపెనీని ఎంచుకోండి ఇంటిని కొనేటప్పుడు అన్నింటి కన్నా ముఖ్యమైన అంశం ఫైనాన్సింగ్. మీ ఆర్థిక సంబంధ వ్యయాల్లో ఇంటి ఫైనాన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే సరైన ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ను ఎంపిక చేసుకోవాలి. ఒక్కో ప్రొవైడర్ ఒక్కోరకమైన వడ్డీ రేట్లకు ఇంటి రుణాలను అందిస్తుంటారు. బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ 9.85 శాతం వడ్డీరే టుకే ఇంటి రుణాలను ఆఫర్ ఇస్తోంది. -
విదేశీ పర్యటనలో బీమా ధీమా..!
రాము చాలా సంతోషంగా ఉన్నాడు. తండ్రితో కలిసి స్విట్జర్లాండ్కి వెళ్తుండడమే కారణం. తల్లి బట్టలు సర్దే పనిలో బిజీగా ఉంది. ప్రత్యేకించి స్విట్జర్లాండ్ చలి వాతావరణాన్ని తట్టుకుని ఉండడానికి కావాల్సిన మందపాటి ఉన్ని స్వెటర్ల ప్యాకింగ్పై ఆమె నిమగ్నమైంది. తండ్రి ఇప్పటికే టిక్కెట్లు సైతం బుక్చేసి, వీసాకోసం దరఖాస్తు పెట్టుకున్నారు. రేపోమాపో వీసా కూడా వచ్చే తరుణమది. అయితే అప్పుడే రాము తండ్రికి కలవరపెట్టే విషయమొకటి తెలిసింది. స్విట్జర్లాండ్సహా, షెంజన్ ఒప్పందం కింద సంతకాలు చేసిన 26 దేశాల యూరోపియన్ గ్రూప్లో ఏ ఒక్కదేశంలో పర్యటించాలన్నా... పర్యాటక బీమా తప్పదన్నదే దీని సారాంశం. ట్రావెల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు సమర్పించనిదే.. వీసా ఆమోద ప్రక్రియ ముందుకు జరగదని తెలుసుకున్న రాము తండ్రి ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు. ఇందుకు కావాల్సిన పర్యాటక బీమా వివరాలను తెలుసుకోడానికి హుటాహుటిన తాను వీసా దరఖాస్తు చేసిన కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లాడు. స్విట్జర్లాండ్ అధికారులు నిర్దేశిస్తున్న పర్యటన బీమా అవసరాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఇంటర్నెట్ ద్వారా లభ్యమవుతున్న ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేయడానికి వెంటనే నెట్ సర్ఫింగ్ ప్రారంభించాడు. షెంజెన్ దేశాల్లో పర్యటనకు వీసా దరఖాస్తుకు ముందస్తుగానే పర్యటన బీమా తప్పనిసరన్న అంశం... మొత్తంగా రాము కుటుంబం విదేశీ పర్యటన షెడ్యూల్ను గందరగోళంలో, అనిశ్చితిలో పడేసింది. ఆ 26 దేశాల పర్యటనకు... షెంజన్ దేశాల్లో పర్యటనకు వీసాకు దరఖాస్తు చేసే ముందు కనీసం 30,000 యూరోలు లేదా సరిసమానమైన కరెన్సీని వైద్య వ్యయాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి. షెంజన్ ఏరియాలో పర్యటన సమయంలో పర్యాటకుడు ఏదైనా జబ్బు పడితే, తీసుకున్న పాలసీ మొత్తం పరిధికి లోబడి సంబంధిత పర్యాటకుడు ఆరోగ్య బీమా ప్రయోజనాన్ని పొందగలుగుతాడు. ఏ దేశమేగినా... నిజానికి అమెరికా, కెనడాలాంటి కొన్ని దేశాల్లో పర్యటనకు ముందు పర్యటన బీమా చేయించుకోవడం తప్పనిసరి కాదు. అయితే ఆయా దేశాల్లో పర్యటన సందర్భంగా ఏదైనా జబ్బు పడితే వైద్య ఖర్చులు తడిచిమోపెడవుతాయి. ఆయా దేశాల్లో ఆరోగ్య వ్యయం భారత్కన్నా అత్యధికం కావడం ఇక్కడ మరో కీలకాంశం. ఇలాంటి పరిస్థితి దేశం కాని దేశంలో ప్రాణాల మీదకు కూడా తెస్తుంది. ఈ అనుకోని ఇబ్బందులను ఎదుర్కొనాలంటే ఏ దేశంలో పర్యటనకైనా ముందు పర్యటన బీమా తప్పనిసరిగా చేయించుకోవడం ఎంతో ప్రయోజనం. పలు ప్రొడక్టులు... భారత్లోని పలు బీమా కంపెనీలు ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా పలు రకాలు పర్యటన బీమా పథకాలను విక్రయిస్తున్నాయి. పర్యటనకు సంబంధించి ఆయా దేశాల్లో పరిస్థితుల అవసరాలకు అనుగుణమైన అంశాలు పొందుపరచిన బీమా పథకాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఒక్క వైద్యమే కాకుండా, ఇతర అవసరాలకు తగిన బీమా పథకాలను సైతం కంపెనీలు విక్రయిస్తున్నాయి. విదేశీ పర్యటనలో ‘ముందు జాగ్రత్త’ అపరిమిత ప్రయోజనాలను చేకూర్చుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. మీ విదేశీయానంలో దురదృష్టవశాత్తూ... అనుకోకుండా వచ్చే వ్యయ ప్రయాసలకు కొండత ధీమా... పర్యటన బీమా... బెస్ట్ ఆఫ్ లక్..! -
డాక్యుమెంట్ల దొంగలకు నెలవారీ వేతనం
న్యూఢిల్లీ: కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలో పత్రాలను లీక్ చేసిన వారికి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ భారీ మొత్తాన్ని నెలవారీ వేతనం కింద చెల్లించేవారని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. డాక్యుమెంట్ల లీకు కేసుకు సంబంధించిన చార్జిషీట్ను సోమవారం ఇక్కడి ఒక కోర్టుకు సమర్పించారు. లల్తా ప్రసాద్, రాకేష్ కుమార్ అనే నిందితులు నెలవారీ మొత్తం రూ. 2.5 లక్షలు తీసుకునేవారి చార్జిషీట్లో పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని ఆర్ఐఎల్కు చెందిన శైలేష్ సక్సేనా, ఎస్సార్కు చెందిన వినయ్ కుమార్, కెయిర్న్స్ ఇండియా నుంచి కేకే నాయక్, జుబిలంట్ ఎనర్జీ నుంచి సుభాష్ చంద్ర, అడాగ్కు చెందిన రిషి ఆనంద్తో పాటు ఎనర్జీ కన్సల్టెంట్ ప్రయాస్ జైన్, జర్నలిస్ట్ శంతను సైకియా చెల్లించేవారని పోలీసులు పేర్కొన్నారు. తమ వ్యాపార లావాదేవీల కోసం ఆ నిందితులకు నెలవారీగా చెల్లింపులు చేసేవారమని ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. -
భారీ ఆక్రమణకు చెక్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలో అత్యంత విలువైన స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు అని తేడా లేకుండా అక్రమార్కులు జెండాలు పాతేస్తున్నారు. అందుకు కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తున్నారు. అందులో భాగంగా మొన్న ఇస్కాన్ సిటీ పరిధిలో కార్పొరేషన్కు కేటాయించిన స్థలాన్ని ఆక్రయించుకున్న సంఘటన మరువకముందే మాగుంట లేవుట్లో అదే తరహా ఆక్రమణకు తెరతీశారు. అధికారుల కళ్లుగప్పి విక్రయించేందుకు నలుగురు వ్యక్తులు రంగం సిద్ధం చేశారు. ఏకంగా రూ.100 కోట్లకు బేరంపెట్టారు. అయితే స్థానికులు పసిగట్టడంతో గురువారం ఆక్రమణ బాగోతం వెలుగుచూసింది. అప్రమత్తమైన అధికారులు స్థలంలో బోర్డునాటి ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అధికారుల సమాచారం మేరకు... నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇందులో 151 ఎకరాల్లో కొందరు స్థానికులు 1995లో 8 డివిజన్లుగా చేసి లేవుట్లు వేశారు. నిబంధనల ప్రకారం కార్పొరేషన్కు 10శాతం చొప్పున 15 ఎకరాలకుపైగా అప్పగించారు. అప్పట్లో కార్పొరేషన్ అధికారులు కంచెవేసి బోర్డు కూడా నాటారు. విలువైన స్థలం పై కన్నుపడిన కొందరు 5.27 ఎకరాల ను ఆక్రమించేందుకు రంగం సిద్ధం చేశారు. కొందరు అధికారుల సహకారంతో లింకు డాక్యుమెంట్లు సృష్టించా రు. అందులో ఎటువంటి ప్లాట్లు వేయకుండానే 18మందికి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. సాజద్, భాను, అంజి ల్, రెహమున్సీ సా, మున్నా, ఆరీఫ్, జమీర్, హమీమున్నీసాతో పాటు మరికొందరు ఉన్నారు. అంకనం రూ.3 లక్షల చొప్పున మొత్తం 3వేల అంకనాలను రూ.100 కోట్లకు టెండర్ వేశారు. బయటపడిందిలా... క్రయ విక్రయాలు జరుపుతున్న తరుణంలో మాగుంట లేవుట్కు చెందిన కొందరికి విషయం తెలిసింది. ఇంతపెద్ద భూకబ్జా విషయాన్ని వెంటనే కార్పొరేషన్ అధికారులకు చేరవేశారు. స్పందించిన అధికారులు హుటాహుటిన మాగుంట లేవుట్కు చేరుకున్నారు. స్థలాన్ని పరిశీలించి బోర్డుపెట్టారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఆక్రమణల బాగోతంపై పూర్తి నివేదిక సమర్పించాలని కమిషనర్ చక్రధర్బాబు టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. చర్యలు తీసుకుంటున్నాం - కమిషనర్ చక్రధర్బాబు మాగుంట లేవుట్ ప్రాంతంలో కార్పొరేషన్ స్థలం ఉంది. దీన్ని కొందరు ఆక్రమించుకుని విక్రయాలు జరుపుతున్నారని తెలిసింది. మా వారిని పంపి కార్పొరేషన్ స్థలంలో గతంలోనే బోర్డులు నాటించాం. అయినా కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. -
పట్టాలిచ్చి ఆరేళ్లు... భూమి ఇవ్వక కన్నీళ్లు !
యడ్లపాడు : వారంతా విధి వంచితులు. కుష్ఠువ్యాధిగ్రస్తులు. ఏ పనీ చేసుకోలే రని జాలిపడిన ప్రభుత్వం ఆరేళ్ల కిందట సాగుభూమి పట్టాలు పంపిణీ చేసింది. అయితే నేటికీ ఆ భూములు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ ఆదేశించినా వారి భూములు అప్పగించిందీ లేదు సాగు చేపట్టిందీ లేదు. మండలంలోని సంగంగోపాలపురం- చెంఘీజ్ఖాన్పేట గ్రామాల మధ్య కొండపక్కన బున్నీనగర్లో 65 కుటుంబాలు. సుమారు 100 మంది జనాభా ఉంటున్నారు. చిన్ని చిన్ని గుడిసెల్లో బతుకుతున్నారు. వారంతా కుష్ఠువ్యాధిగ్రస్తులు. తమకు నివేశన స్థలాలు కావాలని 2009లో అప్పటి కలెక్టర్ను కలసి విన్నవించుకున్నారు. స్పందించిన కలెక్టర్ జయేష్ రంజన్ అదే ఏడాది జూన్ 27న ఒక్కో కుటుంబానికి సెంటుంబాతిక నివేశన స్థలం, అరెకరం సాగుభూమి వంతున ఇస్తూ బీ ఫారాలను పంపిణీ చేశారు. దాంతో వారంతా ఇందిరమ్మ పథకంలో ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. సాగు భూమి మాత్రం చేతికి రాక అప్పటి నుంచి ఇప్పటివరకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. స్వయంగా కలెక్టర్ ఆదేశించినా .... అప్పటి కలెక్టర్ జయేష్రంజన్ కేవలం నివేశన స్థలాలు ఇవ్వడమే కాకుండా వారికి ఇళ్లకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఆ భూమిని సాగుకు యోగ్యంగా మార్చాల్సిన బాధ్యతను అధికారులకు అప్పగించారు. ఆ తరువాత జరిగిన మార్పుల్లో కలెక్టర్ ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. ఇక వీరిగోడు పట్టించుకున్న అధికారి లేడు. ఇప్పటికీ ఆరుగురు తహశీల్దారులు మారినా వారికి సాగు భూమి చూపించలేదు. మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్నారు... గతనెల 19న గోపాలపురంలో ‘నీరు-చెట్టు’ కార్యక్రమం ప్రారంభానికి వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్ను వారంతా అడ్డుకుని తమ సమస్యను వివరించారు. అధికారులతో మాట్లాడతానంటూ మంత్రి చెప్పి వెళ్లారు. అయినా నేటికీ ఏ అధికారి వారి వద్దకు రాలేదు. ఆ భూములను పెద్దలు ఆక్రమించుకొని ఉండటంతో కుష్ఠు వ్యాధిగ్రస్తులకు న్యాయం చేసేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారని సమాచారం. -
రుణాల పేరుతో ఘరానా మోసం!
- నిలువుదోపిడీ చేస్తున్న దళారులు - అవసరాలు.. అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ.. - పట్టణంలోనే 19 మంది బాధితులు సంగారెడ్డి మున్సిపాలిటీ: ‘మీకు అప్పు కావాలా..?, మేమడిగిన డాక్యుమెంట్లు చూపండి’ అంటూ పేపర్లలో ప్రకటన లు ఇస్తారు.. ఎవరో కొందరు అమాయకులు ఆ వలలో చిక్కగానే సర్వీస్ చారీ్జలు, డాక్యుమెంట్ చార్జీల పేరుతో కొంత డబ్బు మా బ్యాంకు అకౌంట్లో వేయండని వారిని బుట్టలో పడేస్తారు. ఇంకేముంది ఆ మాయగాళ్లు మళ్లీ కనబడితే ఒట్టు.. ఇలా ఎందరో అమాయకులు బలైపోతున్నారు. మోసపోయి చెప్పుకునే వారు అందులో కొంతమందే... వ్యక్తిగత, ల్యాండ్ మార్టిగేషన్, వ్యాపార రుణాలిస్తామని కొంద రు వ్యక్తులు పలు పత్రికల్లో ప్రకటన లు జారీ చేస్తున్నారు. వీటిని పరిశీ లించిన స్థానికులు మొబైల్ ఫోన్ ద్వారా వారిని సంప్రదిస్తున్నారు. ముందుగా ఏ రుణం కావాలి..?, ఏం చేస్తారు..?, ఎంత కావాలి? అనే వాటి వివరాలు సేకరిస్తారు. ‘అందుకు మీ ఐడీకార్డు, బ్యాంక్ పాస్బుక్, కరెంట్ బిల్లులను మెయిల్ చేయాలని వారికి సూచి స్తారు. అనంతరం మీ డాక్యుమెంట్లు చూశాం.. రుణం మంజూరు చేస్తాం అందుకోసం మీకు ఇచ్చే రుణంలో 50 శాతం కమీషన్ చెల్లిం చాల్సి ఉంటుంది’ అని నిర్వాహకులు అర్జీదారులకు తెలుపుతారు. వాటితో పాటు డాక్యుమెంట్ చార్జి రూ.2,350, జనరల్ ఇన్సూరెన్స్, ప్రాజెక్టు రిపోర్టు తయా రు చేయడానికి ముందుగా డబ్బులు చెల్లించాలంటారు. వాటిని శ్రీ దత్తసాయి ఎంటర్ప్రైజెస్ ఖాతా లో జమచేయాలని తర్వాత రెండు రోజుల్లో రుణం మంజూరవుతుందని తెలియజేస్తారు. కానీ వారమైనా నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం రాదు. ‘అర్జీదారులు ఫోన్చేస్తే మీకు అర్జెంటుగా రుణం కావాలంటే అదనంగా 2 శాతం కమీషన్ చెల్లించాలి. అలా అయితే వెంటనే చెక్కు జారీ చేస్తాం’ అని చెబుతారు. అసలు డాక్యుమెంట్లు పరిశీలించి వారం రోజుల్లో రుణం అందజేస్తామంటారు. వారు నెలరోజులైనా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఫోన్చేస్తే మరికొంత కమీషన్ చెల్లించాలంటూ అడుగుతున్నారని బాధితులు తెలిపారు. ఇలా పట్టణంలోనే 19 మంది తమ అవసరాల కోసం దరఖాస్తు చేసుకొని ఆ సంస్థ పేరున రూ.19,600 చొప్పున రూ.3,72,400 ను 863720110000472 ఖాతాలో జమచేశారు. మోసపోయా: శ్యాముల్ రాజు పత్రికల్లో రుణం ఇస్తామనే ప్రకటనలు చూసి ఆ సంస్థను సంప్రదించా. నేను రూ.19,600 చెల్లించాను.. -
టీడీపీలో స్థల రాజకీయం
- ప్రభుత్వ స్థలాన్ని విక్రయించారని మాజీ ఎమ్మెల్యే గద్దే బంధువుపై ఫిర్యాదు - టీడీపీలోని ప్రత్యర్థుల తెరవెనుక ప్రోద్బలంతోనే ఈ ఆరోపణలు ? - పక్కా డాక్యుమెంట్లతో విక్రయించామని గద్దే వాదన - విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని తహశీల్దార్కు ఆదేశాలు విజయనగరం : ఈ చిత్రంలో కనిపిస్తున్న భవనం, ఖాళీ స్థలం చీపురుపల్లిలోని జి.అగ్రహారంలో ఉంది. సర్వే నంబర్.124లో ఉన్న ఈ భూమి సర్కార్ పోరంబోకుగా రెవెన్యూ రికార్డులో నమోదై ఉంది. పదేళ్ల క్రితమే ఆ స్థలంలో కొంతమేర సర్వశిక్షా అభియాన్ నిధులతో పాఠశాల భవనాన్ని నిర్మించారు. కానీ దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. ఇప్పుడా స్థలం, భవనం ఖాళీగా ఉన్నాయి. మైనపు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆ స్థలాన్ని విసినిగిరి శ్రీనివాసరావుకు గత సంవత్సరం నవంబర్ 26న దస్తావేజు ద్వారా విక్రయించారు. ఇప్పుడిది వివాదంగా మారింది. టీడీపీలోని అంతర్గపోరు నేపథ్యంలో ఇది బయటికొచ్చింది. అధికారులకు ఫిర్యాదు అందడంతో వారు రంగంలోకి దిగారు. చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య అంతర్గత పోరు సాగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, గతంలో నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేసిన కె.త్రిమూర్తులరాజు మధ్య అభిప్రాయ బేధాలున్నాయి. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు బంధువైన మైనపు వెంకటేశ్వరరావు వ్యవహారాన్ని ఆయన ప్రత్యర్థి వర్గీయులు బయటకు లాగేందుకు ఉపక్రమించారు. అందులో భాగంగా దండు వినాయకరాజు అనే వ్యక్తి తెరమీదకొచ్చారు. ప్రభుత్వ భూమిని విక్రయించి, దస్తావేజు ద్వారా రిజిస్ట్రేషన్ చేసేశారని తెరపైకి తీసుకొచ్చి గద్దే బంధువులపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులకు వచ్చిన ఫిర్యాదు సారాంశం జెడ్పీ అధికారులకు చీపురుపల్లికి చెందిన వినాయకరాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. ఠాణా బిల్డింగ్ అనే పేరు గల స్థలం చీపురుపల్లి గ్రామానికి చెందిన అల్లూరి బాపిరాజు పేరున ఉండేదని, వారి ద్వారా తన పూర్వీకులైన పెనుమత్స రాజేశ్వరమ్మ పొందారని, వీరి నుంచి వీలునామా ద్వారా నాకు లభించిందని వినాయరాజు పేర్కొన్నారు. అయితే రాజకీయపలుకుబడిని ఉపయోగించి మెనపు వెంకటేశ్వరరావు సుమారు 1578 చదరపు గజాల్లో ఆర్సీసీ శ్లాబు డాబా ఇంటి క్రయ దస్తావేజు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, తరువాత ఆ స్థలాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆ స్థలాన్ని వెంకటేశ్వరరావు మళ్లీ తనకు తానుగా రీవెకేషన్ ఆఫ్ గిప్ట్ పేరుతో స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇది చట్ట సమ్మతం కాదని, ఒకసారి ప్రభుత్వానికి అందజేసినప్పుడు మళ్లీ ప్రభుత్వమే ఇతనికి దస్తావేజు మూలంగా దఖలు పర్చాలని చెప్పారు. కానీ వెంకటేశ్వరరావు ఆస్తిని స్వాధీ నం చేసుకుని, విసినిగిరి శ్రీనివాసరావుకు అన్యాక్రాంతం చేశారని తెలిపారు. స్థలాన్ని విక్రయించిన వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ స్థలాని అసలు అనుభవ దారుడినైన తనకు ఇప్పించాలని దండు వినాయకరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై జిల్లా పరిషత్ సీఈఓ రాజకుమారి జోక్యం చేసుకుని చీపురుపల్లి తహశీల్దార్కు లేఖ రాశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయి... ఇదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తమ బంధువులు 1985లో ఆ స్థలాన్ని కొనుగోలు చేశారని, విద్యాభివృద్ధి కోసం 1989లో మండల పరిషత్కు ఇచ్చామని, కాకపోతే దాన్ని వినియోగించకపోవడంతో వెనక్కి తీసుకున్నారని, తమ బంధువుల పేరున రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని, తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. దాన్నిప్పుడు మా బంధువులు విక్రయించారని చెప్పారు. వినాయకరాజుకు ఇదే విషయాన్ని చెప్పానని,ఆ ఫిర్యాదులో తన పేరు ప్రస్తావిస్తే మాత్రం తగు చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు. మొత్తానికి టీడీపీలో నెలకున్న అంతర్గత పోరు నేపథ్యంలో ఈ విషయం వెలుగు చూసింది. అయితే, ఇందులో ఎంత వాస్తవం ఉందో అధికారులే తేల్చాలి. వాస్తవానికైతే ఎవరైనా ప్రభుత్వానికి స్థలం దానం ఇచ్చినప్పుడు సంబంధిత శాఖ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు. సదరు స్థలాన్ని వినియోగించుకోకపోతే దాత కోరిన పక్షంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి మళ్లీదాత పేరుమీద రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ అందుకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ జరిగిందని గద్దే వ్యతిరేక వర్గీయులు వాదిస్తున్నారు. కాగా, ఇదే విషయమై చీపురుపల్లి తహశీల్దార్ డి.పెంటయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా సీఈఓ నుంచి తనకు విచారణ ఉత్తర్వులొచ్చానని, పూర్తి స్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇస్తామని చెప్పగా, వీఆర్ఓ రమణమూర్తి మాత్రం అది ప్రభుత్వ స్థలంగా రికార్డులో నమోదై ఉందని తెలిపారు. -
చిన్నబోతున్న కల్యాణలక్ష్మి
కరీంనగర్కు చెందిన దళితయువతి రజిత(19)కు ఈనెల 31న పెళ్లి కుదిరింది. నెలరోజుల ముందే కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంది. తీరాచూస్తే పెళ్లికొడుకు కుల, నివాస, ఆదాయ వివరాలు, ఆధార్ నెంబర్ లేవనే కారణంతో దరఖాస్తును పక్కనపెట్టినట్లు తెలిసింది. పెళ్లికొడుకు కుటుంబసభ్యులను కలిసి ఆ వివరాలివ్వాలని అడిగితే ‘పెళ్లికి ముందు ఇస్తే మాకేం లాభం? వచ్చిన డబ్బులు మీరే ఖర్చు చేస్తారు. పెళ్లయ్యాక ఇస్తే కోడలు మా ఇంటికే వస్తుంది. అప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఆ డబ్బులు మాకే వస్తాయి’ అని కరాఖండిగా చెప్పారు. పెళ్లికి ముందు డబ్బులొస్తే కొంత ఆర్థిక భారం తగ్గుతుందని ఆశపడ్డ రజిత తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. బయట అప్పుజేసి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. మంథని డివిజన్కు చెందిన గిరిజన యువతి శ్రీలక్ష్మి(21)కి అక్టోబర్లో పెళ్లయింది. ఆన్లైన్లో కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం అందించే రూ.51వేల నగదు ఆమెకు ఇప్పటికీ అందలేదు. అధికారులను కలిసి అడిగితే ‘మీకు ఇదే మొదటి పెళ్లి అని రుజువు చేసేలా సర్టిఫికెట్ ఇవ్వలేదు. మ్యారేజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదా గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని జతచేస్తేనే పరిశీలనకు వస్తాం’ అని చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని రజిత, ఆమె కుటుంబసభ్యులు మిగిలిన పత్రాన్ని తెచ్చే పనిలో పడ్డారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద లబ్ది పొందాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. ఈ పథకాల ద్వారా లబ్ది పొందాలంటే సవాలక్ష పత్రాలు సమర్పించాల్సి రావడం, వెరిఫికేషన్ పేరిట పుణ్యకాలం గడిపోతుండటంతో నెలలు గడుస్తున్నా వధువు బ్యాంకు ఖాతాలో డబ్బు జమకావడం లేదు. వాస్తవానికి ఈ పథకాల విషయంలో ప్రభుత్వ ఆలోచన వేరు. నిరుపేద దళిత, గిరిజన, మైనారిటీ కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఆయా సామాజికవర్గాల ఆడపిల్లలకు పెళ్లి నాటికే ప్రభుత్వం తరపున రూ.51వేల నగదును అందజేయాలనే భావనతో ప్రవేశపెట్టిన ఈ పథకం పెళ్లికి ముందు కాదు కదా... పెళ్లయి నెలలు గడుస్తున్నా లబ్దిదారులను గుర్తించే పరిస్థితి లేకపోవడం గమనార్హం. 10 శాతానికి మించని దరఖాస్తులు కరీంనగర్ జిల్లా విషయానికొస్తే... దళిత, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ది పొందాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు 563 మంది దరఖాస్తు చేసుకున్నారు. సామాజికవర్గాల వారీగా చూస్తే ఎస్సీలు 365, ఎస్టీలు 27, మైనారిటీలు 171 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవనికి గడిచిన నాలుగు నెలల కాలానికి జిల్లాలో ఆయా సామాజికవర్గాలకు సంబంధించి ఆరువేల పైచిలుకు పెళ్లిళ్లు జరిగినట్లు అధికారుల అంచనా. అందులో నూటికి తొంభై శాతం కుటుంబాలకు తెల్లకార్డులున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంవత్సరాదాయం రూ.రెండు లక్షలోపు కలిగి ఉన్న కుటుంబాలు తెల్లకార్డులకు అర్హులే కాబట్టి వీరంతా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు అర్హులుగానే పరిగణించవచ్చు. అయినప్పటికీ అందులో పది శాతం కూడా దరఖాస్తులు రాకపోవడం విశేషం. దరఖాస్తు దారులు ముప్పుతిప్పలు ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ రూ.51వేల నగదు ప్రోత్సహకాన్ని అందించారా అంటే అదీలేదు. 563 దరఖాస్తులకు 101 మంది ఖాతాల్లోకే నగదు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన వాటిలో కొన్ని పరిశీలన దశలో, మరికొన్ని అన్ని పత్రాలు లేవనే కారణంతో పెండింగ్లో పెట్టినట్లు పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిస్థితి మరీ దారుణం. ఇప్పటివరకు 27 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా, అందులో ఒకరిని మాత్రమే అర్హురాలిగా గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా పత్రాన్ని అందజేశారు. ఇంతవరకు సదరు అర్హురాలి బ్యాంక్ ఖాతాలో డబ్బు జమకాలేదని తెలుస్తోంది. సవాలక్ష పత్రాలు సమర్పిస్తేనే...! కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటేనే చుక్కలు కన్పిస్తున్నాయి. మీ సేవ లేదా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి రావడం, ఆ సమయంలోనే దాదాపు ఇరవైకిపైగా పత్రాలు సమర్పించాల్సి వస్తోంది. వధువు తెలంగాణ రాష్ట్ర నివాసితురాలిగా ఉండాలని, వధూవరుల నివాస, కుల, ఆదాయ, వయసు, ఆధార్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ప్రతులతోపాటు ఇదే మొదటి వివాహమని రుజువు చేసే పత్రాలను, విద్యార్హతల పత్రాలను సమర్పించాలి. వధూవరుల పెళ్లి తేదీ ఖరారును ధ్రువీకరిస్తూ వీఆర్ఓ లేదా పంచాయతీకార్యదర్శి ధ్రువీకరణపత్రం తప్పనిసరి. చాలా మందికి ఈ పథకాల పట్ల అవగాహన లేకపోవడం ఒక ఎత్తయితే అవగాహన ఉన్నవారికి సైతం పైన పేర్కొన్న పత్రాలన్నీ సమర్పించాల్సి రావడం కష్టతరమవుతోంది. మరోవైపు సంబంధిత పత్రాలను జారీ చేసే అధికారుల వద్దరకు వెళితే సమయానికి ఉండకపోవడం, ఒకవేళ ఉన్నా రేపు, మాపంటూ పదేపదే తిప్పుతుండటం, కొందరైతే ఁఅమ్యామ్యా*లిస్తేనే ధ్రువీకరణ పత్రాలిస్తామంటూ ఇబ్బంది పెడుతుండటం వంటి అనేక కారణాలవల్ల ఆయా పత్రాలను సకాలంలో సమర్పించడం తలకుమించిన భారమవుతోంది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.మూడు కోట్లు విడుదల చేసినప్పటికీ, రూ.అరకోటికి మించి ఖర్చు కాలేదని తెలుస్తోంది. మైనారిటీ శాఖ విషయానికొస్తే జిల్లాలో 1078 మందికి షాదీ ముబారక్ పథకాన్ని వర్తింపజేసేందుకు నిధులు మంజూరయ్యాయని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ప్రకటించారు. పథకం ల క్ష్యాలు ఘనంగా ఉన్నా, నిధులు దండిగా ఉన్నా ఆచరణలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. నిబంధనలను సరళతరం చేస్తేనే లబ్దిదారులకు తొందరగా న్యాయం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ప్రగతి ఇలా 1. ఎస్సీలకు సంబంధించి..... వచ్చిన దరఖాస్తులు -365 పరిశీలనలో ఉన్నవి -243 మంజూరైనవి -122 ట్రెజరీ శాఖకు వెళ్లినవి -102 లబ్దిదారుల ఖాతాల్లో జమ అయినవి : 50 (మంజూరైన వాటన్నింటికీ సంబంధించిన నగదును ఈ నెలాఖరులోగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు) 2. ఎస్టీలకు సంబంధించి.... వచ్చిన దరఖాస్తులు -27 పరిశీలనలో ఉన్నవి -18 మంజూరైనవి -1 లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్లినవి -0 3. మైనారిటీలకు సంబంధించి... వచ్చిన దరఖాస్తులు -171 పరిశీలనలో ఉన్నవి -98 మంజూరైనవి -73 లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్లినవి -50 -
రుణ మాయ ఫేజ్ టూ!
-
నేడు ‘సత్యం’ కేసులో తీర్పు
216 మంది సాక్షులను విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు 3,038 డాక్యుమెంట్ల పరిశీలన సెబీ కేసులో ‘ఆర్థిక నేరాల’ కోర్టుకు హాజరైన నిందితులు ఈడీ కేసులో శిక్షను నిలిపివేసిన మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా సంచలనం సష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. 2009 జనవరి 7న సత్యం కంప్యూటర్స్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ ఆయన వాటా దారులకు లేఖలు కూడా రాశారు. దీంతో రామలింగరాజు తనను మోసం చేశాడంటూ హైదరాబాద్కు చెందిన షేర్ హోల్డర్ లీలామంగత్ చేసిన ఫిర్యాదు మేరకు ఆ ఏడాది జనవరి 9న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత దీనిని సీబీఐకి బదలాయించారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ... ఈ వ్యవహారంలో 14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా పేర్కొంది. రామలింగరాజు సహా ఇతర నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120(బి) (నేరపూరిత కుట్ర), 409 (నమ్మకద్రోహం), 419, 420 (మోసం), 467 (నకిలీ పత్రాలను సష్టించడం), 468 (ఫోర్జరీ), 471 (తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం), 477 (ఏ) (అకౌంట్లను తారుమారు చేయడం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) కింద అభియోగాలు మోపింది. నిందితులుగా బైర్రాజు రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, వడ్లమాని శ్రీనివాస్, ఎస్.గోపాలకష్ణన్, తళ్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణ రాజు, రామకృష్ణ, వీఎస్.ప్రభాకర్గుప్తా, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, సీహెచ్.శ్రీశైలం ఉన్నారు. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు... 216 మంది సాక్షులను విచారించి, సీబీఐ సమర్పించిన 3,038 డాక్యుమెంట్లను పరిశీలించింది. విచారణ పూర్తికావడంతో మంగళవారం తీర్పు వెలువరించనుంది. కాగా.. ఇదే కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును కూడా ఇదే కోర్టు విచారిస్తోంది. సెబీ కేసులో కోర్టుకు హాజరు.. మదుపుదారులను మోసం చేశారంటూ సెబీ దాఖలు చేసిన కేసులో సత్యం రామలింగరాజు సోమవారం ఈడీ కోర్టు ముందు హాజరయ్యారు. అనంతరం న్యాయమూర్తి లక్ష్మణ్.. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేశారు. కాగా ‘సత్యం’ మాజీ డెరైక్టర్లకు ఈడీ కేసులో ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు ఇటీవల విధించిన ఆరు నెలల జైలు శిక్షను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్జే) తాత్కాలికంగా నిలుపుదల చేశారు. -
సిరిసిల్లలో ఇల్లు కట్టుకుంటా: కేటీఆర్
సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఇంటి నిర్మాణానికి 26 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు. శుక్రవారం ఆయన స్వయంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వీవీ.నాయుడు, జిల్లా రిజిస్ట్రార్ కె.రమణారావు, సబ్ రిజిస్ట్రార్ డి.అశోక్ మంత్రితో డాక్యుమెంట్లపై సంతకాలు చేయించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఇందుకోసం రూ.24,024 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. సిరిసిల్లలో కేటీఆర్ తొలిసారి 2009లో పోటీ చేసినపుడు స్థానికంగానే నివాసం ఉంటానని హామీ ఇచ్చారు. కానీ 2014 ఎన్నికల తర్వాత తన హామీని నెరవేర్చుకుంటున్నారు. -
పింఛన్ల పంచాయితీ!
* పింఛన్లు రావేమోనని దరఖాస్తుదారుల ఆందోళన * దస్తావేజులు తగలబెట్టి అధికారుల నిర్భందం * బండ్లగూడ పంచాయితీ పరిధిలో ఘటన హైదరాబాద్: తవుకు పింఛన్లు రావేమోనని ఆందోళన చెందిన దరఖాస్తుదారులు అధికారులను నిర్భందించారు.. దస్తావేజులు తగలబెట్టారు..ప్రభుత్వకార్యాలయూనికి తాళం వేసి రచ్చ చేశారు. నగర పరిధిలోని బండ్లగూడ గ్రావు పంచాయుతీ పరిధిలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రావుపరిధిలో వద్ధాప్య, వితంతు, వికలాంగులకు సంబంధించి 276 మంది పింఛన్దారులున్నారు. గతంలోనే సర్వే చేసి వీరికి పింఛన్లు అందిస్తున్నారు. అరుుతే తెలంగాణ ప్రభుత్వంలో అందరూ తిరిగి పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించడంతో గ్రావూనికి చెందిన 622 మంది దరఖాస్తు చేసుకున్నారు. శనివారం వీరి దరఖాస్తులను ఇంటింటికి వెళ్లి అధికారులు పరిశీలించారు. ఈ సవుయుంలో అర్హులైన తమకు పింఛన్లు రద్దు చేస్తున్నారంటూ గ్రావుస్తులకు తెలియుడంతో ఒక్కసారిగా వారంతా పంచాయతీ కార్యాలయూన్ని చుట్టువుుట్టారు. దరఖాస్తు పత్రాలను తగలబెట్టి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశీ లనఅధికారి భిక్షపతితో సహా వురో ఇద్దరు సిబ్బందిని కార్యాలయంలో ఉంచి తాళం వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అధికారులను అక్కడి నుంచి తరలించారు. కొద్దిసేపటికి రాజేంద్రనగర్ ఆర్డీవో సురే శ్, ఎమ్మార్వో చంద్రశేఖర్, ఎంపీడీవో సుభాషిణి పంచాయతీ కార్యాలయానికి వచ్చి సిబ్బందిని నిర్భందించిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన అధికారి భిక్షపతి ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా దస్తావేజులను కాల్చివేయుడం సరైందికాదని రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు. తవు వద్ద 622 దరఖాస్తుదారుల పూర్తి సమాచారం ఉందని, వాటి ఆధారంగా రెండురోజుల్లో ఇంటింటికీ తిరిగి అర్హులకు పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటావుని తెలిపారు. -
కరప్షన్ కేరాఫ్ రిజిస్ట్రేషన్
నెల్లూరు(హరనాథపురం) : రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సేవల కోసం వచ్చేవారు దళారులను ఆశ్రయించవద్దు...నేరుగా కార్యాలయానికి వచ్చి సేవలు పొందవచ్చు.. దళారీ వ్యవస్థ రద్దు చేయబడింది.... ఇలా పెద్దపెద్ద అక్షరాలతో రాసిన బోర్డులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో దర్శనమిస్తుంటాయి. ఇది నిజమని పొరపాటు పడ్డారో అంతే.. మీ పనికి సంబంధించిన ఫైలు ఎట్టి పరిస్థితుల్లోను ముందుకు కదలదు. కార్యాలయ సమీపంలో తిరిగే దళారులను ఆశ్రయిస్తేనే మీకు సేవలు అందుతాయి. లేదంటే రకరకాల కొర్రీ లతో ఫైలు వెనక్కు వస్తుంది. కార్యాలయ ఉద్యోగుల అండదండల తో దళారులు దందా చేస్తూ ప్రజలను పీడిస్తున్నారు. మనకు పని కావాలే...పోతేపోనీ అంటూ జనం కూడా రాజీపడుతున్నారు. దస్తావేజుల్లో సాంకేతిక అంశాలుండడంతో భవిష్యత్లో ఏమై నా ఇబ్బందులు వస్తాయేమోనని దళారులుగా వ్యవహరిస్తున్న కొందరు డాక్యుమెంటరీ రైటర్లను ఆశ్రయిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయి. ఏ పని కావాలన్నా అడిగినంత ఇవ్వాల్సిందే... ఒక్కో పనికి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేశారు. ఆ మొత్తం చెల్లించకుంటే కొర్రీలు చూపి ఫైలును పక్కన పడేస్తారు. ఇటీవల కాలంలో నెల్లూరు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు, అపార్ట్మెంట్లలో ప్లాట్ల వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఒక్కో పనికి ఒక్కో ధర నిర్ణయించిన రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులకు రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్లాట్లకు సంబంధించి కొందరు డాక్యుమెంటు రైటర్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఇద్దరుముగ్గురికి కూడా రిజిస్ట్రేషన్ చేయించి వివాదాలకు కారణమవుతున్నారు. ఇటువంటి వ్యవహారాల్లో పెద్ద మొత్తంలో చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. అక్రమ రిజిస్ట్రేషన్లు, అవినీతి దందాలో ఎక్కువ మంది డాక్యుమెంటు రైటర్లే మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు, సిబ్బందికి దోచిపెడుతున్నారు. తామూ లబ్ధి పొందుతున్నారు. భూములు, ప్లాట్ల్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఖజానాకు జమ చేసే చలానా మొత్తంతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయ ఖర్చులు కూడా దళారులకే ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు నెలలుగా పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.100 కోట్లకు పైగా భూములు క్రయవిక్రయాలు జరిగాయి. ఇందుకు రూ.10 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది జేబుల్లో చేరినట్లు తెలుస్తోంది. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల్లోనూ ఇదే పరిస్థితి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ నెల్లూరు, గూడూరు డివిజన్లుగా విభజించారు. మొత్తం 19 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. నెల్లూరు నగరంలోని స్టోన్హౌస్ పేట, బుజబుజ నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. వేరే ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయించాల్సిన పనులను కూడా ఆన్లైన్ ద్వారా ఇక్కడే చేయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. బుజబుజ నెల్లూరు శివారు ప్రాంతం కావడం, గూడూరులోని జిల్లా రిజిస్ట్రార్ పర్యవేక్షణలో ఉండడంతో ఆక్రమ రిజిస్ట్రేషన్కు ఈ కార్యాలయం అడ్డాగా మారిందనే ఆరోపణలున్నాయి. బుజబుజ నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ బోర్డును మూలనపడవేసి ఒక ఇంట్లో కార్యకలాపాలను నిర్వహిస్తుండడం గమనార్హం. కార్యాలయానికి వచ్చే వారికి ఏ స్థిరాస్తికి ఏ దస్తావేజులు, ప్రతులు సమర్పించాలో సూచించే బోర్డు కార్యాలయంలో లేదు. దీంతో సేవలకోసం వచ్చేవారు దళారులను ఆశ్రయిస్తున్నారు. రూ.500తో పూర్తి అయ్యే పనికి రూ.7వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుందని మధ్యవర్తులు చెబుతారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలకు పాల్పడినట్లు మా దృష్టికి వస్తే చర్యలను తీసుకుంటాం. రిజిస్ట్రేషన్ల సేవల కోసం వచ్చే వారు దళారులను ఆశ్రయించ వద్దు. అక్రమాలను అరికట్టేందుకు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాం. డాక్యుమెంటరీ రైటర్ల వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. దస్తావేజులను ఎవరితో అయినా రాయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్లలో అసౌకర్యం కలిగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. సత్యనారాయణరావు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ -
విద్యుత్ కనెక్షన్ పొందండి ఇలా
ప్రయోజనం కర్నూలు (రాజ్విహార్): విద్యుత్ కనెక్షన్ పొందేందుకు ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏఏ డాక్యూమెంట్లు తీసుకెళ్లాలి అనే అనుమానాలు చాలామందిలో వ్యక్తమవుతుంటాయి. కొత్త ఇల్లు నిర్మించుకున్నా, ఏదైన షాపునకు కరెంటు కనెక్షన్ కావాలన్నా, వ్యవసాయ, పరిశ్రమ, ఇతర అవసరాల కోసం విద్యుత్ కనెక్షన్ల పొందేందుకు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా సమీపంలోని సబ్ డివిజన్ కేంద్రంలో ఉన్న కస్టమర్ సర్వీస్ సెంటర్లో సంప్రదించాలి. జిలాల్లో మొత్తం 15 కస్టమర్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ) ఉన్నాయి. ఏయే డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి విద్యుత్ కనెక్షన్ పొందేందుకు ఇల్లు, షాపు, పరిశ్రమ ఏదైనా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు లేదా ఇటీవలే చెల్లించిన పన్ను రసీదు పత్రం, లేదా ఆస్తి పట్టా జిరాక్స్ కాపీలను గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించి తీసుకెళ్లాలి. వీటితోపాటు ఫొటో ఐడెంటిటీ, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, వైరింగ్ సర్టిఫికేట్ (మన వినియోగం ఏ మేరకు ఉంటుందో చెబితే అక్కడే ఇప్పిస్తారు.) ►డాక్యుమెంట్ లేదా పన్ను రసీదులో ఉన్న వ్యక్తి పేరుతోనే విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. ►ఆ వ్యక్తే స్వయంగా అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ►అక్కడ ఇచ్చే దరఖాస్తులో ఫొటోలు, సంతకాలు పెట్టాలి. దీంతో పాటు వెబ్ కెమెరా ద్వారా ఫొటోలు దిగాలి. ►ఆయన స్వయంగా రాని పక్షంలో తాను ఏ కారణంగా రాలేనో వివరిస్తూ రాతపూర్వకంగా అర్జి రాసి, అందులోనే అర్జీ తీసుకెళ్లే వ్యక్తి పేరు, అడ్రస్ సూచించాలి. ఆ వ్యక్తి ఫొటో, ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాలి. నగరం బయట ఉంటే ఆ అర్జీని కొరియర్ ద్వారా పంపాలి. ►డాక్యుమెంట్లలో పేరు ఉన్న వ్యక్తి మరిణించి ఉంటే తన వారసులు డెత్ సర్టిఫికెట్, లీగల్ ఏర్సర్టిఫికెట్ తీసుకెళ్లడంతో పాటు మిగిలిన వారసుల చేత నో అబ్జెక్షన్ అఫిడవిట్ సమర్పించాలి. ►డాక్యుమెంట్లు తీసుకెళ్లి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నిర్ణీత మొత్తాన్ని అక్కడే ఉన్న ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ (ఈఆర్ఓ)లో చెల్లించాలి. ►కేవలం సీఎస్సీల దరఖాస్తు ఫీజు ఇంటికి రూ.25, షాపులకు రూ.50, పరిశ్రమలకు రూ.100 వసూలు చెల్లించాల్సి ఉంటుంది. ►డబ్బు చెల్లించిన తర్వాత రసీదు ఇస్తారు. స్తంభం ఏర్పాటు అవసరం లేకుంటే నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న ►నగరవాసులకు మూడు రోజుల్లో, గ్రామీణవాసులకు వారం రోజుల్లో మీటర్ మంజూరు చేస్తారు. స్తంభం ఏర్పాటు అవసరమైతే అందుకు సంబంధించి ఎస్టిమేట్ వేసి మంజూరైన పనులు పూర్తయ్యాక కనెక్షన్ ఇస్తారు. ఈ ప్రక్రియ ప్రారంభం నుంచి మీటర్ అమర్చే వరకు సమాచారాన్ని సెల్కు మెసేజ్ రూపంలో అందిస్తారు. ► స్తంభం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా తీసుకునే కనెక్షన్లకు డీడీల రూపంలో చెల్లించాల్సిన మొత్తం: ► ఎల్టీ కేటగిరి-1 కింద 240వాట్స్లోపు ఇంటి కనెక్షన్ కోసం డెవలప్మెంట్ చార్జీలు రూ.600, సెక్యూరిటీ డిపాజిట్ రూ.100 దరఖాస్తు ఫీజు మొత్తం రూ.25 చొప్పున మొత్తం రూ.725 చెల్లించాలి. ►ఎల్టీ-1 కింద 1కిలో వాట్స్లోపు తీసుకునే ఇంటి కనెక్షన్ కోసం డెవెలప్మెంట్ చార్జీలు రూ. 1200, సెక్యూరిటీ డిపాజిట్ రూ.300(గ్రామాల్లో), రూ.200(పట్టణాల్లో), దరఖాస్తు ఫీజు మొత్తం రూ.25 చొప్పున మొత్తం కలిపి చెల్లించాలి. ►ఎల్టీ-1 కింద ఇంటికి త్రీఫేజ్ కనెక్షన్ తీసుకుంటే డెవలప్మెంట్ చార్జీలు రూ.3600 (1కేవీ), సెక్యూరిటీ డిపాజిట్ రూ.900 (గ్రామాలు), రూ.600 (పట్టణాలు), దరఖాస్తు ఫీజు మొత్తం రూ.25 చొప్పున మొత్తం కలిపి చెల్లించాలి. ►ఎల్టీ-2 (1కేవీకి) కింద వ్యాపార దుకాణాలకు కనెక్షన్ తీసుకుంటే డెవలప్మెంట్ చార్జీలు రూ.2050, సెక్యూరిటీ డిపాజిట్ రూ.800(పట్టణాలకు), రూ.1200 (గ్రామాలకు) దరఖాస్తు ఫీజు మొత్తం రూ.50 చొప్పున మొత్తం కలిపి చెల్లించాలి. ►ఎల్టీ-2 (5కేవీకి) కింద వ్యాపార దుకాణాలకు కనెక్షన్ తీసుకుంటే డెవెలప్మెంట్ చార్జీలు రూ.6వేలు, సెక్యూటిటీ డిపాజిట్ రూ.4వేలు (పట్టణాలకు), గ్రామాల్లో రూ.6వేలు, దరఖాస్తు ఫీజు మొత్తం రూ.50 చొప్పున మొత్తం కలిపి చెల్లించాలి. ►ఎల్టీ-5 కింద వ్యవసాయ కనెక్షన్ కోసం డెవలప్మెంట్ చార్జీలు రూ.1200(1హెచ్పీ), సెక్యూరిటీ డిపాజిట్ రూ.60(1హెచ్పీ), 5హెచ్పీ మోటరుకు డెవెలప్మెంట్ చార్జీ రూ. 4800, సెక్యూరిటీ డిపాజిట్ రూ.300, దరఖాస్తు ఫీజు మొత్తం రూ.25 చొప్పున మొత్తం కలిపి చెల్లించాలి.